news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Jul 22,2015
మూడు రోజులకో కొత్త వాహనం
ముంబయి: దేశంలో అత్యధికంగా వాణిజ్య వాహనాలను తయారు చేసే అతిపెద్ద సంస్థ టాటా మోటార్స్ ఇక మార్కెట్లో మరింత విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారుల అవసరాల మేరకు ఆయా విభాగాల్లో ఈ ఏడాది దాదాపు కొత్తగా 100 వాహనాలను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. గత అక్టోబరు నుంచి వాణిజ్య వాహనాల అమ్మకాలలో వృద్ధి పుంజుకున్నప్పటికీ ఇంకా నిజమైన వృద్ధి మొదలవలేదని సంస్థ అభిప్రాయపడింది. ఈ పరిస్థితులలో మార్కెట్లో కీలక వాటాను అందిపుచ్చుకొనేందుకు గాను సంస్థ విస్తృతంగా వాహనాలను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఏస్-జిప్ వాహనంతో మొదలుకొని 49 టన్నుల ట్రక్కులు బస్సుల వరకు దాదాపు 100 ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నట్లుగా సంస్థ వాణిజ్య వాహనాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర పిశరోడి తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 228 Views
ముంబై : కింగ్ ఫిషర్స్ యజమాని మాల్యా ఏప్రిల్ రెండవ తేదీ విచారణకు హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఇడి మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలో మాల్యాపై కేసులు నమోదుచేసింది. ఐడిబిఐ రుణ కుంభకోణం కేసుకు సంబంధించి ఈ విచారణకు హాజరుకావాలని నిర్దేశించింది. యుబిగ్రైప్ ఛైర్మన్ గురువారం మరికొంత వ్యవధి కావాలని కోరడంతో ఇడి ఈ వ్యవధినిస్తూ కొత్త తేదీలు ప్రకటించింది. ఇందుకోసమే మాల్యా ఏప్రిల్ 2వ తేదీ వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని ఏజెన్సీ అధికారులు తెలిపారు. ఇమెయిల్ద్వారా విచారణ అధికారికి ఈ అంశాన్ని స్పష్టంచేసినట్లు తెలిసింది. ప్రస్తుత వ్యవధి సరిపోదని మరికొంత వ్యవధికావాలని వచ్చేనెలలో ఏర్పాటుచేయాలని ఇమెయిల్ సమాచారం. మనీలాండరింగ్ నిరోధక చట్టంపరిధిలో తాజా సమన్లు జారీ చేశారు. అంతేకాకుండా మాల్యాకుఉన్న ఆస్తులు, పన్నులు చెల్లించిన వివరాలు, దాఖలు చేసిన రిటర్నులు మొత్తం అందచేయాలని కోరింది. గడచిన ఐదేళ్లు రిటర్నులు, పాస్పోర్టుతో సహా అన్నీ అందచేయాలని కోరింది. ఇడి డైరెక్టర్ కర్నాల్సింగ్ ఇందుకోసమే ముంబైలో మకాం వేసి ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటి ముఖ్య మంత్రి చగన్ భుజబల్ కేసుతోపాటు మాల్యాకేసు విచారణను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. సిబిఐ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మాల్యాపై ఇడి తాజాకేసు నమోదుచేసింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు సంబంధించిన మొత్తం ఆర్ధిక నిర్మాణక్రమంపై కూడా దర్యాప్తుచేస్తోంది. అలాగే రుణాలు పొందేందుకు ఎవరికైనా కిక్బ్యాక్స్ ఇచ్చారా అన్న అంశంపై కూడా దర్యాప్తు సాగుతోంది. సిబిఐ మాల్యాతోపాటు ఆయన మాజీ సిఎఫొ ఎరఘునాథన్, ఐడిబిఐ బ్యాంకు అధికారులు మరికొందరిపై కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఇడి ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంకురుణంలో కొంత మొత్తం విదేశాలకు మళ్లించారన్న అభియోగంపై దర్యాప్తుచేస్తోంది. ఇడి 17 బ్యాంకుల కన్సార్టియంకు లేఖ కూడా రాస్తూ మొత్తం రుణాల రికవరీ, డిఆర్టి కేసు వివరాలు మొత్తం అంద చేయాలని ఆదేశించింది. వీటితోపాటే ఈ కేంద్ర సంస్థ దేశీయంగాను, విదేశాల్లో ఉన్న ఆస్తులు వాటి వివరాలను అందచేయాలని కోరింది. ఇప్పటికే ఇద్దరు సీనియర్ అధికారులను సిబిఐఊ విచారణ చేసిన సంగతి తెలిసిందే. | 1entertainment
|
కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించిన అమిత్ షా కుమారుడు
sourav ganguly
ముంబయి:భారత క్రికెట్లో దాదాగిరి ప్రారంభమైంది. తన నాయకత్వంలో టీమిండియాను ఉన్నత శిఖరాలకు చేర్చిన సౌరవ్ గంగూలీ… బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన క్రికెటర్లలో రెండో వ్యక్తిగా గంగూలీ ఘనత సాధించారు. ఇంతకు ముందు విజయనగరం మహారాజా బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అరుణ్ ధుమాల్ ట్రెజరర్ గా బాధ్యతలను చేపట్టారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిన్న సోదరుడే అరుణ్ ధుమాల్. గంగూలీతో పాటు వీరిద్దరూ కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/ | 2sports
|
Vaani Pushpa 117 Views cricket , PAINE , SMITH
PAINE
మెల్బోర్న్: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో గతేడాది నిషేధానికి గురైన ఆసీస్ క్రికెటర్ స్టీవ్స్మిత్ కొన్ని నెలల క్రితం పునరాగమనం చేశాడు. 12 నెలల పాటు నిషేధం ఎదుర్కొన్న స్మిత్…ఆపై క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కెప్టెన్సీ పదవికి మాత్రం దూరమయ్యాడు. అయితే యాషెస్ సిరీస్లో విశేషంగా రాణించిన తర్వాత స్మిత్కు మళ్లీ కెప్టెన్సీ అప్పజెప్పాలనే వాదన తెరపైకి వచ్చింది. ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిస్ లాంగర్… స్మిత్ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించాడు. స్మిత్ ఒక తెలివైన కెప్టెన్ అంటూ కొనియాడాడు. దాంతో స్మిత్కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం ఖాయమంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆసీస్ టెస్టు కెప్టెన్ ఉన్న టిమ్ పైన్…ఇక దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి అనివార్యం కానుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. దీనిపై తాజాగా స్పందించిన పైన్…ప్రస్తుత సమయంలో ఆసీస్ కెప్టెన్సీ పదవిని ఎంజా§్ు చేస్తున్నా. ఏదొక రోజు స్మిత్ మళ్లీ పగ్గాలు అందుకుంటాడనే ఆశిస్తున్నా. స్మిత్ను కెప్టెన్గా తిరిగి నియమిస్తే నాకు అభ్యంతరం ఏమీ లేదు. నేను స్మిత్ కెప్టెన్సీకి సహకరిస్తానని పేర్కొన్నాడు. అయితే కెప్టెన్సీ కోసం బిబిఎల్ను వదిలేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం పైన్ ప్రకటించిన సంగతి సంగతి తెలిసిందే.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/ | 2sports
|
Hyderabad, First Published 18, Aug 2018, 5:12 PM IST
Highlights
'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది
'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆమెకు మరిన్ని అవకాశాలు తీసుకొచ్చింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన 'గీత గోవిందం' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. గీత పాత్రలో రష్మిక నటనను కొనియాడుతున్నారు.
నటిగా ఆమె నటించింది ఐదు చిత్రాల్లోనే.. ఆ ఐదు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. తన సినిమాల్లో నటించే హీరోలు తనకు ఎన్నో సలహాలు, సూచనలు అందించారని రష్మిక వెల్లడించింది. ''రక్షిత్ శెట్టి, పునీత్ రాజ్ కుమార్, గణేష్, నాగశౌర్య, విజయ్ దేవరకొండలతో ఇప్పటివరకు కలిసి పని చేశాను. తదుపరి సినిమాలో నానితో జతకడుతున్నాను. ఈ ఐదుగురులో నాకు నచ్చిన హీరో ఎవరంటే చెప్పడం మాత్రం చాలా కష్టం.
నాకు ప్రతీ ఒక్కరితో మంచి బంధం ఉంది. వారి నుండి చాలా నేర్చుకున్నాను. వీరిలో ఇష్టమైన ఒకరి పేరు మాత్రం చెప్పలేను. ఎందుకంటే నా కెరీర్ ఇలా ఉండడానికి వారి సహకారం చాలా ఉంది'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక రష్మికకు మేకప్ వేసుకోవడం పెద్దగా నచ్చదట. లక్కీగా తన తదుపరి సినిమా 'డియర్ కామ్రేడ్' లో మేకప్ లేకుండా నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి.. | 0business
|
తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,40,683
తలసరి ఆదాయం రూ.1,40,683
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గతఏడాది 1,40,683 రూపాయల నుంచి ప్రస్తుత ఆర్థికసంవత్సరానికి 1,58,360 రూపాయలకు పెరిగింది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారంచూస్తే 6,54,294 కోట్ల రూపాయలుగా అంచనావేసారు. అంతకు ముందు సంవతంలో ఉన్న 5,75,631 రూపాయలకంటే ఈ ఏడాది పెరిగింది. వృద్ధిరేటు 13.7శాతంగా ఉంది. ఆర్థిక మంత్రి ఈటెలరాజేందర్ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ తలసరి ఆదాయ వివరాలను వెల్లడించారు. తలసరి ఆదా యం స్థిరంగా వృద్ధిచెందుతోందని, జాతీ య సగటుకంటే తక్కువ ఉన్న తలసరి రాబడులు గణనీయంగా పెరిగాయన్నారు. ప్రస్తుతవృద్ధి జాతీయ సగటు 1,03,818 రూపాయలకంటే ఎక్కువగా ఉందని ఆయ న అన్నారు. జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 11.5శాతం నుంచి 10.2శాతా నికి క్షీణిస్తే తెలంగాణ రాష్ట్రం మాత్రం 11.2శాతం నుంచి 12.6శాతానికి పెరిగిందని ఆయన అన్నారు.
రాష్ట్రం ఆవిర్భవించిన మూడేళ్ల తక్కువ వ్యవధిలోనే తమ ప్రభుత్వం అంచనాలకు అనుగుణంగా పనిచేస్తోందని, వివిధరంగాల్లో దూసుకువెళుతున్నదన్నారు. కరువుపీడిత వ్యవ సాయ రంగాన్ని ప్రగతిపథంవైపు నడిపించింద న్నారు. ఇక ప్రభుత్వరుణం బకాయిలు 1,40,523 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. బడ్జెట్ అంచనాల్లో చూపినవిధంగా 18.51శాతం వాటాతో ఉన్నాయి. ఓపెన్ మార్కెట్ రుణాలు 1,15,243.87 కోట్లుగా ఉన్నాయి. మరో 9331.46 కోట్లు కేంద్ర ప్రభుత్వ రుణాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల నుంచి 3867 కోట్ల రూపంలో మరికొన్ని రుణాలున్నట్లు వెల్లడించారు. ఇక చిన్నమొత్తాల పొదుపు స్పెషల్ సెక్యూరిటీస్, పిఎప్ పరంగా 12,081 కోట్ల రుణ బకాయిలున్నట్లు వివరించారు. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 16.18శాతం వాటాతో ఉన్నాయన్నారు. మొత్తం 93,115కోట్ల రూపాయల రుణం ఉన్నట్లు ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఇప్పటివరకూ తెలంగాణ అప్పు 1,14,813కోట్లకు చేరిందని కొత్త ఆర్థికసంవత్సరంలోఇతర మార్గాల ద్వారా 26,400 కోట్లను రుణ పరపతిని సాధించగలమని అంచ నా వేసారు. కేంద్రంనుంచి రుణం రూపంలో రూ.1000 కోట్లు ఉన్న ట్లు తేలింది. అమ్మకపం పన్ను గత ఏడాది 42,074 కోట్లుకాగా వసూళ్లు 37,439 కోట్లు మాత్ర మే వచ్చింది. ఎక్సైజ్ ఆదాయం కూడా 5083 కోట్లుగా అంచనా వేసారు.ఈఏడాదిఆదాయం అంచ నాలు 8999కోట్లుగా ఉంటుందని ఆర్థికశాఖ అంచనావేసింది. రిజిస్ట్రే షన్ల ఆదాయ లక్ష్యంరూపేణా 4291కోట్లుకాగా రూ.4041కోట్లు మాత్రమే వచ్చింది. ఈరిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యం రూ.3వేలకోట్లకు తగ్గింపుగా ఉందనిఅంచనా. వాహ నాలపన్ను రూపంలో మూడువేల కోట్లు ఆదాయం వస్తుందని, ఇతర మార్గాల్లో మరో 36,237 కోట్లు రాబడులు రావచ్చని ఆర్థికశాఖ అంచనా వేసింది. | 1entertainment
|
Bathukamma Song: మంగ్లీ బత...
అభిమానులు తమకు ఇష్టమైన హీరోలపై ప్రేమను రకరకాలుగా చాటుకుంటారు. సినిమా విడుదలైనప్పుడు పాలాభిషేకాలు చేయడం.. ఫ్లెక్సీలు కట్టడం.. కొందరు ఒకడుగు ముందుకేసి తమ పిల్లలకు పేర్లు కూడా పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా రకరకాలుగా తమకు తోచినట్లు అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా నందమూరి హీరో బాలయ్యపై కర్ణాటకకు చెందిన శ్రీనివాసులు తన అభిమానాన్ని వినూత్నంగా చూపించాడు.
శ్రీనివాసులు ఏకంగా తన కుమారుడి పెళ్లి పత్రికపై బాలయ్య ఫోటోలతో ముద్రించాడు. నందమూరి అభిమానులందరూ.. తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వానం పలికాడు. మే 13న తన కుమారుడి పెళ్లికి బాలయ్య, నందమూరి అభిమానులు హాజరై.. తన కుమారుడికి ఆశీస్సులు అందించాలని కోరాడు. ఈ దంపతులకు బాలయ్య బాబు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి...మా ఆరాధ్య దైవం బాలయ్య బాబు అంటూ పత్రికపై ముద్రించాడు. | 0business
|
Tigor
టాటామోటార్స్ నుంచి ‘టిగార్ ‘ విడుదల
ముంబై: టాటామోటార్స్ నుంచి చిన్న సెడాన్ టిగార్ మార్కెట్లకు విడుదలయింది. నాలుగుమీటర్ల విభాగంలో సెడాన్ చిన్నకారు కంపెనీ పోర్టుఫోలియోలోనికి వచ్చింది. టియాగో హ్యాచ్బ్యాక్ ప్లాట్ఫామ్పైనే వీటిని రూపొం దించారు. టియాగోకు ఉన్న ఫీచర్లే ఇంటీరియర్ డిజైన్లపరంగా కనిపిస్తున్నాయి. 1.2లీటర్ పెట్రో లు, 1.05 లీటర్ మూడు సిలిండర్ల డీజిల్ ఇంజ న్లు ఉన్నాయి. టిగార్ మారుతిసుజుకి డిజైర్, హోండా ఎమేజ్, ఫోర్డ్ ఆస్పైర్, వోక్స్వాగన్ అమియో, హుండై యాక్సెంట్కు పోటీగా వస్తుందని అంచనా. ఢిల్లీ ఎక్స్షోరూంధరలుగా ఎక్స్ పెట్రోలు 4.70 లక్షలు, డీజిల్ 5.60 లక్షలు, ఎక్స్టి వేరియంట్పెట్రోలు వెర్షన్ 5.41 లక్షలు,డీజిల్ 6.31లక్షలు, ఎక్స్జడ్ రూ.5.90 లక్షలు, డీజిల్ఖవెర్షన్ 6.80 లక్షలు, ఎక్స్జడ్ (ఒ)పరంగా పెట్రోలు వెర్షన్ 6.19 లక్షలు, డీజిల్ పరంగా 7.09 లక్షలు చొప్పున ధరలున్నాయి. టిగార్టాటా గ్రూప్ ఆటోమొబైల్ వాహనాల్లో మొట్టమొదటిస్టైలిష్ చిన్నకారుగా చెపుతున్నారు.
===== | 1entertainment
|
Sep 07,2015
షాపో విస్తరణకు రూ.665 కోట్లు
అంకార : ఈకామర్స్ దిగ్గజం స్నాప్డీల్ గ్రూపునకు చెందిన షాపో విస్తరణ కోసం 665 కోట్ల రూపాయల పెట్టు బడును పెడుతుంది. దీని ద్వారా వినియోగదారుల సేవలను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. దీంతో పది లక్షల మంది కస్టమర్లను ఆకట్టుకోగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఈకామర్స్ సంస్థలు దృష్టి పెట్టని మధ్య శ్రేణి వ్యాపారంలోకి అడుగుపెట్టాలని స్నాప్డీల్ భావిస్తోందని స్నాప్డీల్ సహవ్యవస్థాపకుడు, సిఇఒ కునాల్ చెప్పారు. వినియోగదారుడు నుంచి వినియోగదారుకి నేరుగా సేవలు అనే ఉద్దేశంతో షాపో ఆవిర్భవించిందన్నారు. అలిబాబా గ్రూపునకు చెందిన టవోబవోను స్పూర్తిగా తీసుకొని షాపో ప్రారంభించామన్నారు. దీని ప్రకటన ద్వారా ఆదాయాన్ని పొందగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. షాపో బ్రాండ్ను అభివృద్ధి చేయటానికి వచ్చే రెండేళ్లలో మరిన్ని పెట్టుబడులను పెడుతామని చెప్పారు. వ్యాపారస్తులు, వ్యక్తులు దీని ద్వార లాభపడతారన్నారు. కేకు నుంచి కారు వరకు దీని ద్వార అమ్మవచ్చు, కొనవచ్చని తెలిపారు. కాగా అలిబాబా కంపెనీ స్నాప్డీల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Also Read: సాయి తేజ్ సింగిల్స్ డే విషెస్.. పేలుతున్న జోకులు
మనోజ్ బాజ్పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఈ ఏడాది సెప్టెంబర్లో అమెజాన్ ప్రైమ్లో ప్రసారమైంది. మొత్తం 10 ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాపులర్ హిందీ వెబ్ సిరీస్కు ఇప్పుడు సీక్వెల్ను తీస్తున్నారు. అదే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. దీనిలో సమంత పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఆమె పోషించేది టెర్రరిస్ట్ పాత్ర కావడంతో ఆసక్తి మరింత పెరుగుతోంది. మొదటి సిరీస్కు మించి ఈ రెండో సిరీస్ పాపులర్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
Also Read: డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిన మహేష్ గారాలపట్టి సితార
ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలోనే సమంత షూటింగ్లో పాల్గొంటారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో ఈ వెబ్ సిరీస్ ప్రసారమవుతుంది. మరోవైపు, సమంత ‘96’ తెలుగు రీమేక్లో నటిస్తున్నారు. శర్వానంద్ హీరో. తమిళంలో దర్శకత్వం వహించిన సి. ప్రేమ్ కుమార్ తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తు్న్నారు.
See Photo Story: బ్లాక్ డ్రెస్సులో హాట్ బ్యూటీ.. బ్లాక్ బస్టర్ కోసమేనా ఏంటీ!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Hyd Internet 102 Views Ajinkya Rahane
Ajinkya Rahane
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్లో ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా బ్యాట్స్మన్ అజింక్యా రహానె కాసేపు మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీలంక టీమ్ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదని అన్నారు. లంకను వారి సొంతగడ్డపైనే 9-0తో క్లీన్ స్విప్ చేసిన భారత్.. టాప్ ర్యాంక్ను మరింతగా పటిష్టం చేసుకోవడంపైనే దృష్టిసారించిందని, శ్రీలంకలో ఆడిన దానికి.. ఇప్పుడు జరగబోయే సిరీస్కు ఎంతో తేడా ఉందని అన్నాడు. ‘టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగాలనేదే మా ధ్యేయం. ఈ నేపథ్యంలో ప్రతి సిరీస్నూ నెగ్గడం ఎంతో ముఖ్యమని తెలిపాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో భారత్.. లంకతో సిరీస్లో అన్ని విభాగాలను సిద్ధం చేసుకోవాలని చూస్తోంది. ‘సఫారీ టూర్ ముందు ప్రతి మ్యాచ్, ప్రతి సిరీస్ ముఖ్యమే. అయితే దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడు అప్పటి పరిస్థితులు ఆలోచిస్తాం. ప్రస్తుతం మా దృష్టంతా లంకతో సిరీస్పైనేన’ని రహానె తెలిపారు. | 2sports
|
Hyderabad, First Published 10, Aug 2019, 5:14 PM IST
Highlights
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని కళ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. బాహుబలి 2 సినిమా తర్వాత ప్యాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ చిత్రం సాహో...ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.
భారీ బడ్జెట్తో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ తరహాలో తెరకెక్కుతున్న 'సాహో' ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రమోషన్పై దృష్టి పెట్టింది.
తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పుడీ ట్రైలర్ ట్రెండింగ్ గా మారింది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఇంత వరకూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించలేదంటే...అతిశయోక్తి కాదు.
''ముంబై లో రెండు వేల కోట్ల రాబరీ జరిగింది.. అది చేసిందెవరో.. మనకి తెలియదంటూ'' పోలీసులు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తరువాత ''ఈ కేసుని ఒక అండర్ కవర్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తాడంటూ'' డైలాగ్ చెప్పగానే ప్రభాస్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు.
హీరోయిన్ శ్రద్ధాకపూర్.. అమృతానాయర్ అనే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా కనిపించనుంది. ట్రైలర్ చివరిలో ''గల్లీలో సిక్స్ ఎవడైనా.. కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది..'' అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
Last Updated 10, Aug 2019, 5:14 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
'జాగ్వార్' ఆడియోకి చీఫ్ గెస్ట్గా మంత్రి కేటీఆర్
జాగ్వార్ సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాదులోని నోవాటెల్ లో ఆదివారం గ్రాండ్ గా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు...
TNN | Updated:
Sep 18, 2016, 09:05PM IST
మాజీ పీఎం దేవెగౌడ మనుమడు, కర్ణాటక మాజీ సీఎం హెచ్. డి. కుమారస్వామి తనయుడు అయిన నిఖిల్ కుమార్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ 'జాగ్వార్' అనే టైటిల్ తో, రూ. 75 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాదులోని నోవాటెల్ లో ఆదివారం గ్రాండ్ గా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. దేవెగౌడ,హెచ్. డి. కుమారస్వామి లతో పాటు పీవీ సింధు, జగపతి బాబు, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
బాహుబలి, భజరంగీ భాయిజాన్ చిత్రాల తర్వాత సెన్సేషనల్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ జాగ్వార్ సినిమాకు కథను అందిస్తున్నారు. ఎ. మహదేవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా దీప్తి సతి నటిస్తుంది. ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ లాంటి విలక్షణ నటులు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్. ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంతటి ఘనమైన విశేషాలు ఉన్న ఈ సినిమా హైఓల్టేజ్ పవర్ ప్యాక్ గా తెరకెక్కుతుంది. | 0business
|
సాహో టీమ్ ప్రెస్ మీట్ (ఫోటోలు)
First Published 11, Aug 2019, 6:46 PM IST
సాహో టీమ్ ప్రెస్ మీట్ (ఫోటోలు)
బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం సాహో ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ 20 రోజుల ముందే ప్రమోషన్ డోస్ పెంచేసింది. రీసెంట్ గా ముంబై మీడియాతో మాట్లాడిన ప్రభాస్ - శ్రద్దా కపూర్ ఆదివారం టాలీవుడ్ మీడియా ముందుకు వచ్చారు
బాహుబలి 1 కంటే ముందే ఈ కథ నేను విన్నాను. కానీ బాహుబలి 2 తరువాత సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. యాక్షన్ విజువల్స్ పరంగా కొన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది
ఈ సందర్బంగా శ్రద్దా కపూర్ మాట్లాడుతూ.. ఇదే నా మొదటి సినిమా కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఇంత పెద్ద సినిమా కావడం వెరీ స్పెషల్ అని చెప్పవచ్చు. అందుకు నిర్మాతలకు దర్శకుడికి చాలా థ్యాంక్స్.
ప్రభాస్ తో నటించడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. దాదాపు రెండు రెండేళ్లు సినిమాతో ట్రావెల్ చేశాను. హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్ అయ్యింది.
ప్రభాస్ తో రొమాన్స్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ లో నటించగా అందులో ఏ సీన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేశారని యాంకర్ అడగ్గా.. అందుకు శ్రద్దా మాట్లాడుతూ.. ఒక్కటి అని చెప్పలేను. అది చాలా కష్టం. రెండు యాంగిల్స్ లో ఎంజాయ్ చేస్తూ నటించమని ఆమె వివరణ ఇచ్చారు.
టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ డోస్ పెంచింది. ఆదివారం సాయంత్రం టాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్ సినిమాకు సంబందించిన అనేక విషయాలపై సమాధానం ఇచ్చారు
ట్రైలర్ రిలీజ్ కాగానే చాలా మంది కాల్ చేశారు. బాలీవుడ్ లో కొంత మంది స్టార్ హీరోలు కూడా మెస్సేజ్ చేశారు. నా స్నేహితులు అలాగే రాజమౌళి కూడా కాల్ చేసి బావుందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే చిరంజీవి గారు నాకు మెస్సేజ్ చేయగానే షాక్ అయ్యాను
ఇది పాన్ ఇండియా ఫిల్మ్ అన్నారు నిర్మాత ప్రమోద్ ఉప్పలపాటి. రేపటి నుంచి రిలీజ్కు సంబంధించిన పనులు మొదలుపెడతామని, ఆగస్టు 30న గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రమోద్ తెలిపారు
Recent Stories | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
టీమిండియాకు తప్పని వైట్వాష్
ఆస్ట్రేలియాతో సిరీస్లో టీమిండియా ఉమెన్స్ టీమ్కు వైట్వాష్ తప్పలేదు. సొంతగడ్డపై ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినా వన్డే సిరీస్లో ఓటమే ఎదురయ్యింది. ఆల్రౌండ్ ప్రతిభతో మూడో వన్డేలోనూ ఆసీస్ 97 పరుగులతో విజయం సాధించి... ఆసీస్ 3-0తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది.
Samayam Telugu | Updated:
Mar 18, 2018, 05:31PM IST
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టీమిండియా ఉమెన్స్‌ టీమ్‌కు వైట్‌వాష్ తప్పలేదు. సొంతగడ్డపై ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినా వన్డే సిరీస్‌లో ఓటమే ఎదురయ్యింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో మూడో వన్డేలోనూ ఆసీస్ 97 పరుగులతో విజయం సాధించి... ఆసీస్ 3-0తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 333 రన్స్ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 44.4 ఓవర్లలో 235కు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలింగ్ దెబ్బకు వరసుగా వికెట్లు పడిపోయాయి. టీమ్‌లో స్మృతి మంధాన (52), జెమీమా (42) మినహా ఎవరూ చెప్పుకోదగ్గగా ఆడలేదు. ఆసీస్ బౌలర్లలో గార్డనర్ 3, మెగాన్, పెర్రీ చెరో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు ఆస్ట్రేలియా 332 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ హేలీ 115 బాల్స్‌లో 133 రన్స్ చేసింది. హేలీ టీమిండియా బౌలర్లపై దూకుడుగా ఆడింది. బౌండరీలతో విరుచుకుపడింది. మిగతా బ్యాట్స్‌ ఉమన్‌లలో...హేనెస్(43), గార్డ్‌నర్(35), బెత్ మూనీ(34 నాటౌట్) రన్స్ చేశారు. అయితే హేలీకి వన్డే కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ. భారత బౌలర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు వికెట్లు తీసింది. మిగిలిన బౌలర్లు అంతగా రాణించలేదు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘నిన్ను రోడ్డు మీద’ రీమేక్ సాంగ్ ట్రైలర్.. నిధి అగర్వాల్ ఇరగదీసింది!
ఈ రీమేక్ పాటలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తన స్టెప్పులతో అదరగొట్టింది. నాగచైతన్య కూడా బాగానే ప్రయత్నించాడు.
Samayam Telugu | Updated:
Oct 31, 2018, 11:18AM IST
‘నిన్ను రోడ్డు మీద’ రీమేక్ సాంగ్ ట్రైలర్.. నిధి అగర్వాల్ ఇరగదీసింది!
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అల్లరి అల్లుడు’లో ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు’ అనే ఐటమ్ సాంగ్ అప్పట్లో పెద్ద హిట్. ఈ పాటలో నాగార్జునతో పాటు రమ్యకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ ఈ పాటంటే చాలా మందికి ఇష్టం. అందుకే ‘సవ్యసాచి’ సినిమాలో ఈ సూపర్ హిట్ సాంగ్ను రీమేక్ చేశారు. హీరోహీరోయిన్లు నాగాచైతన్య, నిధి అగర్వాల్ మధ్య డ్యూయెట్గా ఈ పాటను తెరకెక్కించారు. తాజాగా ఈ పాట ట్రైలర్ను విడుదల చేశారు.
ఈ రీమేక్ పాటలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తన స్టెప్పులతో అదరగొట్టింది. నాగచైతన్య కూడా బాగానే ప్రయత్నించాడు. గతంలో తాను స్వరపరిచిన పాటనే ఎం.ఎం.కీరవాణి ‘సవ్యసాచి’లో రీమేక్ చేశారు. చాలా కొత్తగా, యువతకు నచ్చేలా ఈ పాట ఉంది. దివంగత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి అందించిన సాహిత్యంలో రామజోగయ్య శాస్త్రి కొద్దిపాటి మార్పులు చేసి ఈ పాటను రచించారు. పృథ్వీ చంద్ర, మౌనిమ ఆలపించారు. కాగా, మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వినూత్న కథాంశంతో వస్తోన్న ఈ చిత్రంలో మాధవన్, భూమిక ముఖ్య పాత్రలు పోషించారు.
Savyasachi: ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు’ రీమేక్ సాంగ్
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రియో ఒలింపిక్స్: భారత మహిళల హాకీ జట్టు ఓటమి
రియో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడిపోయింది.
BCCL | Updated:
Aug 9, 2016, 05:11AM IST
రియో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్ బరిలోకి దిగిన మన టీమ్ తన సత్తా చాటేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూల్-బిలో భాగంగా బ్రిటన్ తో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఒక్క గోల్ కూడా చేయకుండా నిష్ర్కమించాల్సి వచ్చింది. ఫస్ట్ క్వార్టర్ లో భారత్, గ్రేట్ బ్రిటన్ లు 0-0 స్కోరుతో సమానంగా నిలిచాయి. అయితే రెండో క్వార్టర్ లో బ్రిటన్ కు రెండు పెనాల్టీ షూటౌట్స్ రావడంతో గ్రేట్ బ్రిటన్ టీమ్ క్షణాల వ్యవధిలో రెండు గోల్స్ చేసింది. దీంతో స్కోర్ 0- 2 నమోదైంది. ఇక మూడో క్వార్టర్ లోనూ బ్రిటన్ మరో గోల్ చేయడంతో వారు మొత్తం మూడు గోల్స్ కు చేరుకుని ఆధిక్యంలో నిలిచారు. చివరి క్వార్టర్ లో మనవాళ్లకు ఓ పెనాల్టీ షూటౌట్ అవకాశం వచ్చింది. అయితే దాన్ని గోల్ చేయడంలో విఫలం అయ్యారు. దీంతో నాలుగో క్వార్టర్ లో ఎవరూ ఎలాంటి గోల్స్ చేయకున్నా విజయం మాత్రం బ్రిటన్ సొంతమైంది. గ్రేట్ బ్రిటన్ క్రీడాకారిణిలు నికోలా వైట్, గిసెల్లీ, అలెగ్జాండ్ర డన్సన్ రాణింపుతో విజయం వారి వైపు నిలిచింది. రియో ఒలింపిక్స్ లో పూల్-బిలో భాగంగా జరిగిన ఫస్ట్ మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు జపాన్ పై తన శాయశక్తుల పోరాడి 2-2తో డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్రిటన్ తో ఇలా చిత్తుగా ఓడిపోవడం బాధాకరం. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నువ్వా నేనా అన్నట్లు తలపడిన భారత్ జపాన్ హకీ టీమ్స్
రియో ఒలింపిక్స్లో ఫస్ట్ మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు జపాన్ పై తన శాయశక్తుల పోరాడింది.
TNN | Updated:
Aug 7, 2016, 11:25PM IST
రియో ఒలింపిక్స్లో ఫస్ట్ మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు జపాన్ పై తన శాయశక్తుల పోరాడింది. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్ బరిలోకి దిగిన మన టీమ్ తన సత్తా చాటేందుక అహర్నిశలు ప్రయత్నించింది. భారత్ పూల్-బిలో భాగంగా జపాన్తో జరిగిన తొలి మ్యాచ్ను 2-2తో డ్రాగా ముగించింది. మొదట్లో జపాన్ టీమ్ 2 గోల్స్ చేయగా మన టీమ్ మాత్రం ఒక్కటి కూడా చేయలేకపోయింది. ఆ తర్వాత భారత్ టీమ్ చెలరేగింది. పెనాల్టీ కార్నర్ అవకాశాలను అందిపుచ్చుకొని రెండు గోల్స్ చేసింది. భారత్ గోల్ పోస్ట్ పై జపాన్ బృందం మూకుమ్మడి దాడులను గోల్ కీపర్ సవిత సమర్థంగా అడ్డుకుంది. జపాన్ క్రీడాకారులు ఎమి నిషికోరి 15వ నిమిషంలో ఒక గోల్ చేయగా, మీ నకషిమా 28వ నిమిషంలో మరో గోల్ చేశారు. అయితే భారత్ టీమ్ చెందిన ఫార్వర్డ్ రాణి రాంపాల్ 31వ నిమిషంలో ఒక గోల్ చేసింది. మరో ప్లేయర్ మిడ్ఫీల్డర్ లిలిమ మింజ్ 40వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లను గోల్స్ గా మలచడంతో మూడో క్వార్టర్ ముగిసేసరికి రెండు జట్ల స్కోరు 2-2తో సమానమైంది. ఆఖరి క్వార్టర్ లో రెండు జట్ల ప్లేయర్స్ గోల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ రెండు జట్ల గోల్ కీపర్లు సమర్థంగా అడ్డుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొత్తానికి చాలా కాలం తర్వాత ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ జట్టు తన పోరాట పటిమను ప్రదర్శించింది. | 2sports
|
Suresh 76 Views hero
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆటో రంగ బ్లూచిప్ సంస్థ హీరోమోటో కార్ప్ లిమిటెడ్ నికర లాభం 38శాతం పెరిగి రూ.1257 కోట్లకు చేరింది. అయితే నిర్వహణ లాభం 16 శాతం తగ్గి రూ.1158కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం కూడా 9 శాతం నీరసించి రూ.8030 కోట్లకు చేరుకుంది. ఇబిటా మార్జిన్లు 15.6శాతం నుంచి 14.4శాతానికి బలహీనపడ్డా యి. తాజా క్వార్టర్ లో రూ.738కోట్ల మేర అనుకోని లాభం పొందినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఇలో 4.6శాతం పెరిగి రూ.2355వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ.2370వరకూ పుంజుకుం ది. అయితే మొదట రూ.2226దిగువన 52 వారాల కని ష్టానికి చేరింది. క్వెస్ కార్ప్ లిమిటెడ్ కూడా ప్రస్తుతం ఎన్ఎస్ఇలో ఈ షేరు దాదాపు 6శాతం ర్యాలీతీసి రూ.423 వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.427ను దాటింది. ఈ షేరు గత నెలరోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 72వేల షేర్లు కాగా, ఇప్పటివరకూ 22వేల షేర్లు చేతులు మారాయి. టివిఎస్ మోటార్ కంపెనీ కూడా ప్రస్తుతం ఎన్ఎస్ఇలో 5.3శాతం పెరిగి రూ.363వద్ద కదులుతోంది. అయితే మొదట ఒకదశలో రూ.338వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 84వేల షేర్లు కాగా, ఇప్పటివరకూ 71వేల షేర్లు చేతులు మారాయి. జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా ప్రస్తుతం ఎన్ఎస్ఇలో ఈ షేరు దాదాపు 6 శాతం పెరిగి రూ.21 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు గత నెలరోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3.71లక్షల షేర్లు కాగా, ఇప్పటి వరకూ 1.74 లక్షల షేర్లు చేతులు మారాయి.
====== | 1entertainment
|
మసకబారుతున్న బులియన్ మార్కెట్!
ముంబయి, మే 9: బంగారంధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఔన్స్ ఒక్కింటికి శుక్రవారం 1221 డాలర్లుగా నడిచాయి. రెండునెలల కనిష్టస్థాయికి చేరడం ఇన్వెస్టర్లను విస్మయపరుస్తోంది వెండి ధరల పరంగాకూడా ఔన్స్ ఒక్కింటికి 16.3 డాలర్లుగా నడించింది. బంగారం 2.7శాతం దిగజారితే వెండిధరలు 10.8శాతం క్షీణించాయి. బంగారంధరలు ఈనెలలో 3.3శాతం వరకూ దిగజారి పది గ్రాములు 28,905రూపాయలకు చేరాయి. వెండిధరలు కూడా పదిశాతం క్షీణించి కిలోఒక్కింటికి 38,625 రూపా యలుగా చేరాయి. ఇక సోమవారం బంగారం ఔన్స్ ఒక్కింటికి 1231డాలర్లు, వెండి 16.44డాలర్లుగా నడిచిం ది. బంగారం ఒకదశలో ఔన్స్ ఒక్కింటికి 1220-1226 డాలర్ల వద్ద అంచనాలకు మించి అమ్ముడయిందని నిగమ్ ఆరోరా అనే నిపుణులు వెల్లడించారు. ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచడం కూడా ఒకింతబంగారం మార్కెట్ను ప్రభా వితంచేసిందని బులియన్ నిపుణుని అంచనా. ఎంసిఎక్స్ పరంగాచూస్తే 5959లాట్ల నుంచి చూస్తే నవంబరు లాట్ల నుంచి తగ్గాయి. ప్రస్తుత కేలండర్ సంవత్సరంలోనే 2069వరకూ తగ్గిందని అంచనా. కోటక్బ్యాంకు ప్రతి నిధి శేఖర్ భండారి మాట్లాడుతూ అమెరికా వడ్డీరేట్లు, పన్నుల సంస్కరణల మౌలికవనరులరంగం ఆధా రంగా ధరలు నడుస్తాయని అన్నారు. కొంతమేరభౌగోళిక ఉద్రిక్తతలు కారణంఅవుతాయన్నారు. ప్రస్తుతానికి పెట్టుబడులకు స్వర్గంగా భావించే పసిడిపై పెట్టుబడులు తగ్గుతున్నట్లుగానే భావించాలని ఆయన అన్నారు. | 1entertainment
|
మళ్లీ పైసల్లోనే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయ్
Samayam Telugu| Jun 4, 2018, 09.43 AM IST
కర్ణాటక ఎన్నికలు ముగిశాక వరుసగా 16 రోజులు పెరగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరలు మెల్లగా దిగి వస్తున్నాయి. గత ఆరు రోజులుగా పైసల చొప్పున తగ్గుతూ వచ్చిన పెట్రోల్ ధరలు.. సోమవారం కూడా 15 పైసలు తగ్గాయి. ఈ ఏడు రోజులు కలిపి కూడా పెట్రోల్ ధర అర్ధ రూపాయి కంటే తక్కువగా (రూ. 47 పైసలు) తగ్గడం వాహనదారులను అసంతృప్తికి గురి చేస్తోంది. సోమవారం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.96 పైసలుగా ఉంది. ముంబైలో రూ.85.77 పైసలుగా ఉందని ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ తెలిపింది.
నిన్నటితో పోలిస్తే సోమవారం డీజిల్ ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఢిల్లీలో రూ.69.11 పైసలు ఉన్న డీజిల్ ధర నేడు 14 పైసలు తగ్గి రూ.68.97 పైసలుగా నమోదైంది. హైదరాబాద్లో సోమవారం నాటి ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర రూ.82.59 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.74.97 పైసలుగా ఉంది.
మే నెలలో 16 రోజుల్లోనే పెట్రోల్ ధర లీటర్కి రూ.3.80 పైసలు పెరగ్గా, డీజిల్ ధర రూ.3.38 పైసలు పెరగడం వాహనదారుల ఆగ్రహానికి కారణమైంది. కాగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతోనే పెరిగాయని చమురు సంస్థలు చెబుతున్నాయి. దీర్ఘకాలంలో పెట్రోల్ ధరలను తగ్గించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రెండేళ్లు ఆడాలని ఉంది.. కానీ: ఆశిష్ నెహ్రా
భారత్ తరఫున మరో రెండేళ్లు క్రికెట్ ఆడాలని తాను కోరుకుంటున్నట్లు వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు
TNN | Updated:
Oct 6, 2017, 01:51PM IST
భారత్ తరఫున మరో రెండేళ్లు క్రికెట్ ఆడాలని తాను కోరుకుంటున్నట్లు వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో శనివారం నుంచి జరగనున్న మూడు టీ20 సిరీస్‌కి సెలక్టర్లు 38 ఏళ్ల నెహ్రాని భారత జట్టులోకి ఇటీవల ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో తొలి టీ20కి ఆతిథ్యమివ్వనున్న రాంచీకి చేరుకున్న నెహ్రా మీడియాతో మాట్లాడాడు. ఇప్పటికే కెరీర్‌లో చాలా సార్లు గాయాలబారిన పడ్డానని.. అయితే మళ్లీ ఫిటెనెస్‌ కోసం తాను పట్టుదలతో శ్రమించినట్లు చెప్పుకొచ్చాడు.
‘నేను మరో రెండేళ్లు క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నా. కానీ.. అది అంత సులభం కాదు. ఎందుకంటే 38-39 ఏళ్ల బౌలర్‌ శరీరం వేగంగా బంతులు విసిరేందుకు అంతగా సహకరించకపోవచ్చు. అయితే నా శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నిస్తా. గత ఏడెనిమిదేళ్లుగా భారత్ జట్టుకి దూరమైనప్పుడు నేను ఆటని చాలా మిస్ అయ్యాను. అందుకే పట్టుదలతో ఫిటెనెస్ సాధించి మళ్లీ జట్టులో చోటు సంపాదించగలిగాను. నా శరీరం సహకరించే వరకూ క్రికెట్ ఆడతా’ అని నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్‌ ఆడిన నెహ్రా.. అనంతరం గాయంతో గత ఎనిమిది నెలలుగా భారత్ జట్టుకి దూరంగా ఉన్నాడు. | 2sports
|
Suresh 95 Views gst
GST
న్యూఢిల్లీ: జిఎస్టి అమలై రెండేళ్లవు తున్నా, ఇంకా పన్నులవ్యవస్థలోని లోపాలను సవరించుకోలేకపోతున్నదని కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తన నివేదికలో ప్రస్తావించింది. ఇన్పుట్టాక్స్క్రెడిట్ వినియోగం లో అనేక లోపాలు ఇప్పటికీ ఉన్నాయని, పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ఇ-టాక్స్ వ్యవస్థ ఇప్పటికీ అరకొరస్థాయిలోనే నడుస్తున్నట్లు వెల్లడించింది. 2017-18 జిఎస్టీ నివేదికపై పార్ల మెంటులో మంగళవారం ఉంచిన కాగ్ పన్ను రాబడులు జిఎస్టీ మొదటి సంవత్సరం అమలు లో మందగమనంగా ఉన్నాయన్నారు. పరోక్ష పన్నుల రాబడుల్లో ఆసంవత్సరంలో 5.80శాతం తగ్గుదల నమోదయింది. 21.33శాతం 2016 -17లో తగ్గిందని వెల్లడించింది. జిఎస్టీ అమలు తర్వాత కూడా కేంద్ర రాబడులు జిఎస్టీపరంగా పదిశాతం దిగజారినట్లు అంచనావేసింది. మొత్తం పరోక్షపన్నులన్నింటినీ మిళితంచేసి ఒకే పన్ను వ్యవస్థ అమలయిన తర్వాత కూడా బాలారిష్టాలు ఎదుర్కొంటున్నట్లు కాగ్ అభిప్రాయపడింది. కేంద్ర పరోక్షపన్నులు కస్టమ్స్ సంస్థ, జిఎస్టీ నెట్వర్క్ రెండు సంస్థలు కూడా జిఎస్టి వ్యవస్థను తగినంతగా పటిష్టంచేయడంలో కొంత వెనుకబడే ఉన్నట్లు వెల్లడించింది. రిటర్నుల దాఖలులో సంక్లిష్టత, సాంకేతిక సమస్యలు ఇన్వాయిస్ మ్యాచింగ్లోను, ఇన్పుట్ట్టాక్స్ క్రెడిట్స్మోసాలు అరికట్టడంలో విపలం అవుతున్నాయని వెల్లడిం చింది. ఇక ఇన్వాయిస్ మాచింగ్లేకుండానే రీఫండ్లు ఆటోమేటిక్గా రావడం జిఎస్టి పన్ను వ్యవస్థ కొంతమేర అడ్డంకులనే ఎదుర్కొన్నదని వెల్లడించింది. 2017-18లో కేంద్రజిఎస్టి రాబడి అంచనాలు 2,21,400 కోట్లు అయితే 2,03,461 కోట్లుగాను, 2018-19లో 5,03,900 కోట్లు అయితేవాస్తంగా 4,57,535 కోట్లుగాను ఉన్నాయి. ఇక సమీకృత జిఎస్టి రాబడులు బడ్జెట్ అంచనాలు 1,61,900 కోట్లు అయితే వాస్తవంగా 1,76,688 కోట్లుగా ఉన్నా యి. 2018-19లో 50వేల కోట్లు అయితే వచ్చింది 28,947 కోట్లు మాత్రమేనని కాగ్ ఎత్తిచూపించింది. ఇక సెస్రూపంలో 2017-18లో లక్ష్యం 61,331కోట్లు అయితే 62,612 కోట్లు వసూలయి పర్వాలేదనిపించింది. 2018-19లో 90వేల కోట్లు లక్ష్యం అయితే లక్ష్యానికి మించి 95,081కోట్లు వసూలు కావడం గమనార్హం. ఇక నెలావారీ జిఎస్టఇఆర్వన్ రిటర్నులు జిఎస్టీర్3బి రిటర్నులతో పోలిస్తే కొంత తక్కువగానే ఉన్నాయి. జిఎస్టీఆర్బి రిటర్నులు ఐటిసి క్లెయింలకోసం దాఖలుచేస్తున్నవి జిఎస్టిఆర్-1తోసరిపోల్చి చూడటంలేదని కాగ్ వెల్లడించింది. అలాగే కేంద్ర రాష్ట్రాలమధ్య ఐజిఎస్టి పరిష్కారాలు కూడా కొంత సంక్లిష్టం అవుతున్నది. పన్నురాబడులు పెరగాలంటే పన్నురిటర్నులు, ఇన్వాయిస్లను సరిపోల్చి చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే సాంకేతిక సమస్యలు ఇందుకు అడ్డంకి అవుతున్న ట్లు కాగ్ అభిప్రాయపడింది. ఈ మ్యాచింగ్ వ్యవస్థ ఇప్పటికీ మెరుగుపడలేదని కాగ్ ఎత్తి చూపించింది. జిఎస్టిఆర్ 3బి కేవలం సమ్మరీ మాత్రమే ఉంటుంది. జిఎస్టిఆర్-1 రిటర్నుల్లో మొత్తం సమాచారం ఉంటున్నప్పటికీ పూర్తిస్థాయి ఇన్వాయిస్లను సరఫరాదారులు దాఖలు చేయడంలేదని తేలింది. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Kodi Ramakrishna Movies: గురువుకు తగ్గ శిష్యుడు కోడి రామకృష్ణ
దాసరి నారాయణరావు శిష్యుడిగా టాలీవుడ్కి పరిచయం అయ్యారు కోడి రామకృష్ణ. ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘స్వర్గం నరకం’, ‘మనుషుల్లో దేవుడు’ అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్గా తీసుకున్నారు దాసరి. అనంతరం
Samayam Telugu | Updated:
Feb 22, 2019, 04:28PM IST
తెలుగు సినీ పరిశ్రమ లెజెండరీ దర్శకుడ్ని కోల్పోయింది. 120కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ శుక్రవారం సాయత్రం అనారోగ్యంతో మరణించారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు.
కోడి రామకృష్ణ సినీ ప్రస్థానం
దాసరి నారాయణరావు శిష్యుడిగా టాలీవుడ్కి పరిచయం అయ్యారు కోడి రామకృష్ణ. ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘స్వర్గం నరకం’, ‘మనుషుల్లో దేవుడు’ అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్గా తీసుకున్నారు దాసరి. అనంతరం ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య సినిమాతో దర్శకుడిగా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయంచేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా తొలి అవకాశం ఇచ్చారు. అక్కడ నుండి చివరి సినిమా నాగభరణం వరకూ వెనక్కి తిరిగి చూడలేదు కోడి రామకృష్ణ.
కోడి రామకృష్ణ సినిమాలు..
అంకుశం (దర్శకుడు)
అంజి (దర్శకుడు)
అత్త మెచ్చిన అల్లుడు (దర్శకుడు)
అదిగో అల్లదిగో (దర్శకుడు) | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
చెర్రీ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?
రాంచరణ్,శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమాకి టైటిల్ కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తోంది.
| Updated:
Aug 28, 2015, 07:23PM IST
రాంచరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమాకి టైటిల్ కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తోంది. గతంలో ఈ సినిమాకి మెరుపు , విజేత అని ఎవేవో పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్గా వాటన్నింటినీ పక్కనబెడుతూ మొదట్లో అనుకున్న బ్రూస్లీ అనే టైటిల్నే ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ కింద ది ఫైటర్ అనే ట్యాగ్ లైన్ కూడా వుండటం సినిమాపై అంచనాలని రెట్టింపు చేసేందుకు దోహదపడుతుందంటున్నాయి ట్రేడ్ సర్కిల్స్. శ్రీను వైట్ల ఆఫీస్ వద్ద చరణ్ స్టిల్తో కూడిన కొన్ని పోస్టర్లలో ఈ టైటిల్ కనిపించడంతో అదే నిజమయ్యుంటుందనే అంచనాకు వస్తున్నాయి సినీవర్గాలు. దసరాకి రిలీజ్ కానున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చకచకా జరిగిపోతున్నాయి. | 0business
|
Suresh 162 Views
నా పదవీకాలం అద్భుతం
ముంబై: రిజర్వుబ్యాంకు గవర్నర్గా తాను పనిచేసిన కాలం అత్యద్భుతంగా నడిచిందని గవర్నర్ రఘురామ రాజన్ అన్నారు. కొందరు విమవర్వకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే తాను పనిచేసిన కాలంలో చేపట్టాన కార్యాచరణకు వచ్చే ఐదారేళ్లలో ఫలితాలు కన్పిస్తాయని రాజన్ పేర్కొన్నారు. | 1entertainment
|
మకాపు ఓపెన్ను నుంచి వైదొలగిన సైనా
న్యూఢిల్లీ: భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ మకాపు నుంచి వైదొలగింది. కాగా క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి జాంగ్ యిమాన్తో తలపడిన సైనా ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపో యింది. దీంతో 21-12 తో తొలిసెట్ను జాంగ్ సునాయాసంగా గెలిచింది.కాగా రెండవ నెట్లో కొంత మెరుగ్గా ఆడినట్లు కని పించిన సైనా ఒకానొక సమయంలో ఆధిక్యంలోకి దూసు కెళ్లింది. తరువాత జాంగ్ బాగాపోరాడి సైనాకు విజ యాన్ని దూరంచేసింది.కేవలం 35 నిముషాలపాటు జరిగిన మ్యాచ్లో రెండు వరుస గేముల్లో 12-21,17-21 తేడాతో సైనా ఓడిపో యింది. తాజా ప్రపంచబ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో సైనా పదవస్థానంలో నిలిచినసంగతి తెలిసిందే. రియో ఒలింపిక్పతకవిజేత సింధు తనర్యాంకును మెరుగుపర్చుకుని ఏడవ ర్యాంకులో కొనసాగుతుంది. | 2sports
|
Virat Kohli reveals why Hardik Pandy
ధోనీకి బదులుగా హార్దిక్ పాండ్య రావచ్చా..?
. పాకిస్థాన్తో మ్యాచ్లో ధోనీకి బదులుగా ఆ స్థానంలో హార్దిక్ పాండ్యని పంపాలని చివరి నిమిషంలో
TNN | Updated:
Jun 5, 2017, 02:42PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి భారత్ ఘనంగా టైటిల్ రేసును ఆరంభించింది. చాలా రోజుల తర్వాత వన్డే‌లు ఆడినా.. ఈ ఫార్మాట్‌లో తమకు తిరుగులేదని టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలతో నిరూపించారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ నిలకడగా ఆడి జట్టుకు మెరుగైన ఆరంభమివ్వగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్ భారీ స్కోరు దిశగా భారత్‌ని నడిపించారు. కానీ.. ఆదివారం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణ‌గా నిలిచింది మాత్రం హార్దిక్ పాండ్య ఇన్నింగ్సే. స్పిన్నర్ ఇమాద్ వసీమ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో తొలి మూడు బంతుల్ని సిక్స్‌లుగా స్టాండ్స్‌లోకి తరలించిన హార్దిక్ పాండ్య కేవలం 6 బంతుల్లోనే 20 పరుగులతో అజేయంగా నిలిచాడు.
సాధారణంగా భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్ధానంలో ధోనీ వస్తుంటాడు. కానీ.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ధోనీకి బదులుగా ఆ స్థానంలో హార్దిక్ పాండ్య‌ని పంపాలని చివరి నిమిషంలో నిర్ణయించారట. ‘చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్య ఊహకందని రీతిలో హిట్టింగ్ చేశాడు. ధోనీ స్థానంలో హార్దిక్‌ని బ్యాటింగ్‌కు పంపమా..? అని ఆఖరి నిమిషంలో జట్టు మేనేజ్‌మెంట్ నుంచి కబురు వచ్చింది. ఈ నిర్ణయాన్ని జట్టులోని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. హార్దిక్ చక్కగా స్ట్రైక్ రొటేట్ చేయగలడు. మ్యాచ్‌లో అతను బాదిన హ్యాట్రిక్ సిక్సర్లతోనే భారత్‌కి మెరుగైన ముగింపు లభించింది’ అని కెప్టెన్ విరాట్ కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బాలకృష్ణ ఫ్యాన్స్ స్పెషల్ క్యాలండర్
మహనీయుల స్పూర్తిని గుర్తుకు తెచ్చేలా బాలయ్య బాబు కేలండర్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచినా ఎన్ బీ కే హెల్పింగ్ హ్యాండ్స్ వారు 2016 తెలుగు క్యాలండర్ ను రూపొందించారు.
TNN | Updated:
Jan 6, 2016, 02:37PM IST
బాలకృష్ణ అభిమానుల వెరైటీ క్యాలండర్
మహనీయుల స్పూర్తిని గుర్తుకు తెచ్చేలా బాలయ్య బాబు కేలండర్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచినా ఎన్ బీ కే హెల్పింగ్ హ్యాండ్స్ వారు 2016 తెలుగు క్యాలండర్ ను రూపొందించారు. ఇందుకు గాను బాలకృష్ణ సినిమా ఫోటో లను కాకుండా , అయన హావ భావాలతో కూడిన ఫోటోలను సెలెక్ట్ చేశారు. వీటినీ మల్టీకలర్ పెయింటింగ్ తో డిజిటల్ క్రియేషన్ చేయించారు. | 0business
|
Vaani Pushpa 47 Views ganguly , indian team , My contribution
sourav ganguly
ముంబయి: తాను కోహ్లీకి అన్నివిధాలుగా సహకరిస్తానని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. బుధవారం ఆయన బిసిసిఐ అక్ష్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం శుభపరిణామమని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా రాణిస్తున్నదని, మంచి టీం ఉందని, విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నారని గంగూళీ కొనియాడారు. భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోనీది ప్రత్యేక స్థానమని గంగూలీ మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/telangana/ | 2sports
|
Heritage , Bank of Baroda
హెరిటేజ్ఫుడ్స్తో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పందం
హైదరాబాద్, డిసెంబరు 29: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రైవేటురంగంలోని డైయిరీ ంస్థ హెరిటేజ్ఫుడ్స్తో ఒప్పందంచేసుకుంది. హెరిటేజ్పరిధిలో ఉన్న రైతులకు రుణాలు అం దించేందుకు ఈ ఒప్పందం సానుకూలం చేసిం ది. బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలున్న ప్రాంతాల్లో హెరిటేజ్ఫుడ్స్ రైతులకు ఈరుణాలందుతాయి. పబ్లిక్ లిమిటెడ్కంపెనీగా ఉన్న హెరిటేజ్ఫుడ్స్ పాలు, పాల ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ లలో అగ్రగామి సంస్థగా నిలిచింది. హెరిటేజ్ ఫుడ్స్ జోనల్ హెడ్ సిహెచ్ సత్యన్నారాయణ, రూరల్ బ్యాంక్ హెడ్ జిబి భూయాన్లు ఒప్పం దాలపై సంతకాలుచేశారు. హెరిటేజ్ఫుడ్స్తో కలిసి సంయుక్తంగా డెయిరీ రైతులకు రుణాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు భూయాన్ వివరించారు. ఈ డెయిరీ సంస్థతో ఈ ఒప్పందం వల్ల పాడిరైతుల్లో మరింత ఉత్పాదకత ను పెంచుకునేందుకు దోహదం చేస్తుంది. | 1entertainment
|
యాపిల్ కొత్త ఐఫోన్లు అదుర్స్!
- వినూత్న ఫీచర్లతో ఆవిష్కరణ
- పూర్వవైభవమే లక్ష్యంగా కొత్త ఉత్పత్తులు
- అంగరంగ వైభవంగా లాంచింగ్ వేడుక
- రేపటి నుంచే బుకింగ్లు ప్రారంభం
- ప్రారంభ ధర 649 డాలర్లు
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ప్రియుల ఉత్కంఠతకు తెర దించుతూ యాపిల్ కొత్త ఐఫోన్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. భారత కాలమాన ప్రకారం గురువారం ఉదయం ఇక్కడ వేడుకగా జరిగిన కార్యక్రమంలో యాపిల్ ఐఫోన ్7, ఐఫోన్ 7ప్లస్, యాపిల్ వాచ్ సిరీస్-2ను సంస్థ ప్రతినిధుల ఆవిష్కరించారు. మార్కెట్లో దిగ్గజ స్థానాన్ని కోల్పోతున్నట్లు గమనించిన సంస్థ వ్యూహాత్మకంగా వినూత్న పీచర్లతో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. ఐఫోన్ 7లో అత్యాధునిక కెమేరాను, ఐఫోన్ 7 ప్లస్లో 12 ఎంపీ సామర్థ్యం రెండు మెయిన్ కెమేరాలతో అందుబాటులోకి తెచ్చింది. నీట మునిగినా పాడవకుండా పూర్తిగా డస్ట్, వాటర్ రెసిస్టెంట్గా వీటిని సంస్థ రూపొందించింది. కొత్త ఫోన్లలో సంప్రదాయకంగా వస్తున్న ఇయర్ఫోన్ జాక్ వ్యవస్థకు స్వస్తి పలికారు. అప్గ్రేడెడ్ రెటీనా డిస్ప్లే, డబుల్ స్టీరియో స్పీకర్లు, కొత్తగా ఎయిర్ పాడ్ హెడ్సెట్, హెడ్ఫోన్లనకు లైటెనింగ్ కనెక్టర్ను అమర్చారు. ఏ-10 ఫ్యూజన్ ఫోర్కోర్ ప్రాసెసర్, తక్కువ బ్యాటరీతో దీని పనితీరును మరింతగా పెంచుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎస్ 6 కంటే కూడా రెండు గంటలు అధికంగా పని చేసేలా మేటి బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. అయిదు విభిన్న రంగులలో దీనిని మార్కెట్లోకి తెచ్చారు. 32, 128, 256 జీబీ అంతర్గత నిల్వ సామర్థ్యంతో వీటిని మార్కెట్లోకి ఆవిష్కరించారు. వైర్ అవసరం లేకుండానే పని చేసే ఎయిర్పాడ్ హెడ్సెట్లను ఈ సందర్భంగా ఆవిష్కరిచారు. కొత్త ఫోన్లకు రేపటి నుంచి (9వ తేదీ) ముందస్తు ఆర్డర్లు ప్రారంభిస్తామని.. ఈ నెల 16 నుంచి షిప్పింగ్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఐఫోన్ 7 (32 జీబీ) ప్రారంభ ధరను ఎస్6 మాదిరిగానే 649 డాలర్లుగా (రూ.43,000) నిర్ణయించారు. ఐఫోన్ 7 ప్లస్ ధరను 769 డాలర్లుగా (రూ.51,000) ముందుగా 28 దేశాలలో దీనిని విడుదల చేస్తారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నాని 'మజ్ను' మూవీ రిలీజ్ డేట్
నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మజ్ను మూవీ రిలీజ్కి రెడీ అవుతోంది.
| Updated:
Sep 22, 2016, 03:05PM IST
నేచురల్ స్టార్ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్, గోళ్ళ గీత అందిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'మజ్ను'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ పొందింది. సెప్టెంబర్ 23న వరల్డ్వైడ్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఏషియన్ ఎంటర్ప్రైజెస్ సునీల్ నారంగ్ చాలా గ్రాండ్గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని, ఇమ్మాన్యుయెల్, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్ ముదిరాజ్, కేవశదీప్, అనుపమ, మనీషా తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. | 0business
|
ఎన్టీఆర్ తో విబేధాలున్నట్లు చెప్పకనే చెప్పిన బాలయ్య
Highlights
గత కొంత కాలంగా బాబాయ్ అబ్బాయ్ మధ్య గ్యా...ప్
ఎన్టీఆర్ తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న బాలయ్య
ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ పై ప్రశ్నలు
ఎన్టీఆర్ గురించి స్పందించకుండా దాటేసిన బాలకృష్ణ
నందమూరి తారకరామారావు వారసులైన నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ మనువడు జూనియర్ ఎన్టీఆర్ ఎంత సన్నిహితంగా ఉండేవాళ్లో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తారక్ సినిమాల వేడుకలకు బాలయ్య.. బాలయ్య సినిమాల వేడుకలకు తారక్ వచ్చేవాళ్లు. కానీ గత నాలుగైదేళ్లుగా ఇద్దరికీ అంత మంచి సంబంధాలేమీ ఉన్నట్లు కనిపించట్లేదు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. మీడియా వాళ్లు బాలయ్య గురించి అడిగితే ఎన్టీఆర్ తమ మధ్య ఏమీ లేదని రెండు ముక్కల్లో తేల్చేస్తున్నాడు కానీ.. బాలయ్య మాత్రం తన అన్న కొడుకు గురించి మాట్లాడేందుకు అసలేమాత్రం ఇష్టపడట్లేదు. మీడియా వాళ్లు అడిగినా దాట వేసే ప్రయత్నం చేస్తున్నాడు.
తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య అభిమానులతో చిట్ చాట్ చేసినపుడు ఆయనకు ఎన్టీఆర్ గురించి బోలెడు ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ వేటికీ ఆయన స్పందించట్లేదు. తరచుగా ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నా ఆయన పట్టించుకోలేదు. సినిమాలు.. రాజకీయాలు.. వ్యక్తిగత జీవితం.. ఇలా చాలా అంశాల గురించి మాట్లాడిన బాలయ్య.. ఎన్టీఆర్ ఊసెత్తడానికి మాత్రం ఇష్టపడలేదు. ‘‘మీకు ఎదురవుతున్న ప్రశ్నల్లో 90 శాతం ఎన్టీఆర్ గురించే ఉన్నాయి. అయినా మీరు స్పందించరేంటి’’ అంటూ ఓ అభిమాని రెట్టించి అడిగినా.. కొందరు బాలయ్యను కవ్వించే ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్లిపోయాడు. దీన్ని బట్టి బాబాయ్-అబ్బాయ్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
Last Updated 25, Mar 2018, 11:38 PM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
24 kisses: ‘24 కిస్సెస్’ మేకింగ్ వీడియో: పెదాల సయ్యాటతో హెబ్బా పటేల్ అరాచకం
3:24 నిమిషాల నిడివితో కిస్సెస్ మేకింగ్ వీడియో అంటూ ఓ హాట్ వీడియో వదిలింది. ఇందులో ముద్దులు తప్ప ఇంకేమీ లేవు. ముద్దు అంటే ఏదో ఇంతకు ముందు మన తెలుగు సినిమాల్లో చూసిన లిప్లాక్లు కాదు. ఇది అంతకు మించి.. అందర్నీ దాటి. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి చిత్రాల్లో ముద్దు సన్నివేశాలు ఈ చిత్రం ముందు దిగదుడుపు అంటే అతిశయోక్తి కాదు.
Samayam Telugu | Updated:
Nov 17, 2018, 05:03PM IST
‘కుమారి 21F’ చిత్రంతో సెన్సేషన్ హిట్ కొట్టిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్.. ముద్దుల ఉత్సవానికి తెరతీసింది. హెబ్బా పటేల్ , అరుణ్ అదిత్ జంటగా నటించిన ‘24 కిస్సెస్’ మూవీ రిలీజ్ డేట్ను కన్ఫామ్ చేసుకోవడంతో ప్రమోషన్స్ని వేగవంతం చేస్తూ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. దీన్ని మేకింగ్ వీడియో అనేకంటే.. ముద్దుల వీడియో అంటేనే బెటర్. అందుకే 3:24 నిమిషాల నిడివితో కిస్సెస్ మేకింగ్ వీడియో అంటూ ఓ హాట్ వీడియో వదిలింది. ఇందులో ముద్దులు తప్ప ఇంకేమీ లేవు. ముద్దు అంటే ఏదో ఇంతకు ముందు మన తెలుగు సినిమాల్లో చూసిన లిప్లాక్లు కాదు. ఇది అంతకు మించి.. అందర్నీ దాటి. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి చిత్రాల్లో ముద్దు సన్నివేశాలు ఈ చిత్రం ముందు దిగదుడుపు అంటే అతిశయోక్తి కాదు. కాకపోతే ఆ చిత్రాల్లో ముద్దులతో పాటు కంటెంట్ ఉంది. ఇందులో కేవలం ముద్దే హద్దులు దాటుతుంది.
హెబ్బా పటేల్ ‘24 కిస్సెస్’ మేకింగ్ వీడియో లిప్ లాక్ సన్నివేశాలు చూస్తే.. ఓ చిన్న స్థాయి నీలి చిత్రంలాగే ఉంది. ఎలాగూ ఏ సర్టిఫికేట్ ఇవ్వనే ఇచ్చారు. ఇక అడ్డేం ఉంది అనుకున్నారో ఏమో కాని.. విచ్చలవిడి శృంగార సన్నివేశాలకు తెరతీశారు. ఇంటా బయట అని చూడకుండా కింద మీద పడి మరీ తన్మయంలో తేలిపోతూ గాఢ చుంబనంతో రసికానందం పొందుతున్నారు. ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్న మూవీ క్యాప్షన్కి తగ్గట్టుగానే హెబ్బా పటేల్, అరుణ్ అదిత్లు ఒకే టీషర్ట్లో దూరి మరీ ముద్దుల్లో పోటీ పడుతున్నారు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం కష్టం కాని.. ఈ మేకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి. అన్నట్లు ఈ ముద్దుల వర్షాన్ని రూపొందించింది. ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి. నవంబర్ 23న ‘24 కిస్సెస్’తో హెబ్బా పటేల్ చుమ్మాల సౌండ్స్ థియేటర్స్లో రీసౌండ్స్ రప్పించేందుకు రెడీ అయ్యింది.
X | 0business
|
Mar 08,2017
వచ్చే ఏడాది మార్కెట్లోకి తేలికపాటి స్విఫ్ట్
జెనీవా: సుజుకీ మోటార్ కార్ప్ ఆధునీకరించిన సరికొత్త స్విఫ్ట్ను వచ్చే ఏడాది భారత్ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ మూడో తరం కొత్త స్విఫ్ట్ కారును 'హర్ట్టెక్ట్' ప్లాట్ఫామ్పై రూపొందించారు. సుజుకీ సంస్థ ఈ కారును జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది. ఈ కొత్త స్విఫ్ట్ కారును అత్యాధునిక ఫ్లాట్ఫాంపై రూపొందించినందున అంతకు ముందు వర్షన్తో పోలిస్తే 120 కిలోల మేర బరువు తక్కువగా ఉండనుందని సంస్థ తెలిపింది. కేవలం 840 కిలోల బరువులోనే కొత్త స్విఫ్ట్ రోడ్లపై పరుగులు తీయనుంది. దీంతో ఇది మరింత మెరుగైన మైలేజీని అందిస్తుందని సంస్థ వెల్లడించింది. లేజర్ సెన్సార్స్, అత్యాధునిక రక్షణ చర్యలు, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హైబీమ్ అసిస్ట్తో పాటు మోనోక్యులర్ కెమేరాతో ఈ కారు అందుబాటులోకి రానుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
kannada powerstar worried about telugu powerstar pawan kalyan
కాటమరాయుడు దెబ్బ.. కన్నడ స్టార్ అబ్బా..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు.
TNN | Updated:
Mar 18, 2017, 07:24PM IST
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు. అయితే కన్నడ ప్రజలకు మాత్రం పవర్ స్టార్ అంటే లెజండరీ యాక్టర్ రాజ్ కుమార్ చిన్న కొడుకు పునీత్ రాజ్ కుమార్ . పునీత్‌ను అక్కడ ముద్దుగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు.
హీరోగా ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే పునీత్ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ప్రస్తుతం తను నటించిన కొత్త సినిమా ' రాజకుమార ' భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. కానీ ఇప్పుడు ఈ హీరోకి పవన్ కల్యాణ్ భయం పట్టుకుందట.
నిజానికి రాజకుమార సినిమాను ఈ నెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు పవన్ కల్యాణ్ ' కాటమరాయుడు ' కూడా విడుదలవుతోంది. తెలుగు చిత్రాలకు కన్నడలో ఎలాంటి ఆదరణ ఉంటుందో.. అందరికీ తెలిసిందే. అందులోనూ పవన్ సినిమా అంటే అక్కడ కూడా క్రేజ్ బాగానే ఉంది. బెంగుళూరులోనిక్రేజ్ ఉన్న థియేటర్లలో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ నేపధ్యంలో రాజకుమార సినిమాకు పవన్ క్రేజ్ కారణంగా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని కంగారు పడుతోంది చిత్ర బృందం. మరి ధైర్యం చేసి సినిమాను రిలీజ్ చేస్తారో.. లేక ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గుతారేమో చూడాలి! | 0business
|
Visit Site
Recommended byColombia
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన నోటా నిరాశపరచగా టాక్సీవాలా సోసోగా ఆడింది. భారీ అంచనాల మధ్య వచ్చిన డియర్ కామ్రేడ్ కూడా ఫ్లాప్ అవ్వటంతో విజయ్ దేవరకొండ స్టామినా మీద అనుమానాలు ఏర్పాడ్డాయి. దీంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్లో బిజీగా ఉన్న విజయ్, ఓ ప్రముఖ మేగజైన్లో దర్శనమించ్చాడు.
Also Read: Sye Raa: స్టడీగా సైరా.. ఎనిమిదో రోజు కలెక్షన్స్ కెవ్వు కేక
ప్రముఖ ఫిలిం మేగజైన వోగ్ కోసం విజయ్ దేవరకొండ చేసిన ఫోటోషూట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలతో పాటు ఫిలిం జర్నీ, లైఫ్ స్టైల్ లాంటి విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ షోటో షూట్లో స్టైలిష్ లుక్స్తో తనదైన రౌడీ యాటిట్యూడ్తో ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే యూత్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఈ స్టిల్స్తో వారికి మరింతగా అలరిస్తున్నాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు విజయ్. రాశీ ఖన్నా, కేథరిన్ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్, ఇసా బెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
Also Read: Rakul: హ్యాపీ బర్త్డే గార్జియస్ బ్యూటీ రకుల్
ఇప్పటికే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు విజయ్ దేవరకొండ. హీరో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్గా నటిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రస్తుతం పక్కన పెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ రెండు సినిమాలతో పాటు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాను ప్రకటించాడు. ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
విజయ్ దేవరకొండ
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Suresh 95 Views tata
టాటామోటార్స్కు పిషరోడీ టాటా!
ముంబయి, జూన్ 7: టాటామోటార్స్ భారీ వాణిజ్య వాహనాల డివిజన్ అధిపతి రవీంద్ర పిషరోడి వ్యక్తిగత కారణాలపై రాజీనామా చేసారు. ప్రస్తుతం చీఫ్ ఆప రేటింగ్ అధికారిగా సతీష్ బోర్వాంకర్ బాధ్యతలు తీసుకు న్నారు. పిషరోడి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా 2012 జూన్ 21నుంచి పనిచేస్తున్నారు. కంపెనీలోనే 2007లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసారు. కంపెనీ డైరెక్టర్గా పనిచేసారు. టాటామోటార్స్ అమ్మకాలు పడిపోతుండటం దేశీయ మార్కెట్లలో మందగమనం కూడా పిషరోడీ రాజీనామాకు ఒక కారణంగా చెపుతున్నారు. కంపెనీ వాణిజ్యవాహనాలు మాత్రం 0.45శాతం పెరిగి 3,05,620 యూనిట్లకు చేరాయి మేనెలలో కంపెనీ వాణిజ్యవాహనాల విక్రయాలు దేశీయ మార్కెట్లలో 23,60-6కు చేరాయి. గత ఏడాది మేనెల విక్రయాలకంటే 13శాతం తగ్గాయి. టాటామోటార్స్లో చేరక ముందు పిషరోడి క్యాస్ట్రాల్ఇండియాలో పనిచేసారు. ఫిలిప్స్ఇండియాలో కూడా వివిధస్థాయిల్లో పనిచేసారు. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కళ్లు లేకపోయినా కలల్లో చూద్దాం- కాబిల్ సాంగ్
మన ఇద్దరం కనే కలన్నీ కంటి వెనక దాచిపెట్టి తాళం వేసి ఉన్నాయి. దాని తాళంచెవి కోసం వెతికితే చందమామలో ఉంది. ఇప్పుడు మళ్ళీ దానిని కలలోనే చూపించాలా? నిజం చెప్పాలి... అదేంటంటే...
TNN | Updated:
Dec 7, 2016, 01:11PM IST
కళ్లు లేకపోయినా కలల్లో చూద్దాం- కాబిల్ సాంగ్
మన ఇద్దరం కనే కలన్నీ కంటి వెనక దాచిపెట్టి తాళం వేసి ఉన్నాయి. దాని తాళంచెవి కోసం వెతికితే చందమామలో ఉంది. ఇప్పుడు మళ్ళీ దానిని కలలోనే చూపించాలా? నిజం చెప్పాలి... అదేంటంటే నేను నీకు సరిపోతానా? లేదా?... అనే భావంతో 'మే తేరే కాబిల్ హూ యా? కాబిల్ నహీ?.. అంటూ హృతిక్ మరియు యామి గౌతమ్ మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ 'కాబిల్' చిత్రం లోనిది. ప్రేమకథాచిత్రాలకు మంచి రాగాలను అందించే రాజేష్ రోషన్ ఈ పాటను కంపోజ్ చేశారు.
చూపు లేని పాత్రలలో హృతిక్ రోషన్ , యామి గౌతమ్ జంటగా నటిస్తోన్న బాలీవుడ్ చిత్రం 'కాబిల్'. ఈ సినిమా తెలుగులో 'బలం' పేరుతో విడుదలవుతోంది. సూపర్ హిట్ చిత్రాల హృతిక్ రోషన్- రాకేశ్ రోషన్ కాంబినేషన్లో సంజయ్ గుప్తా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. జనవరి 25, 2017న ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఆ అమ్మాయికి, అబ్బాయికి ఇద్దరికీ చూపులేదు. వారి చూపులు కలవకపోయినా, ఇద్దరి మనసులు కలిశాయి. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ తాము అందరిలాగే ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తూ ఎన్నో ఆశలతో తమ జీవితంలో కూడా వెలుగు ఉందని చెప్తూ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయికి కళ్లు లేకపోవటాన్ని ఆమె బలహీనతగా భావించి కొంతమంది ఆమెపై అఘాయిత్యానికి పాల్పడతారు చేస్తారు. తనపై ఎవరు అఘాయిత్యం చేస్తున్నారో కూడా చూడలేని స్థితిలో ఆ అమ్మాయి. అదే స్థితిలో ఆమె ప్రియుడు కూడా ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఆ జంట తమకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంటుంది? చూపు లేనిది వారికా? లేక ఈ సమాజానికా? అసలు వారి 'బలం' ఏంటి..? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Mein tere Kaabil hoon yaa.. Kaabil nahi.. A romantic title song from Kaabil movie of the Rakesh Roshan production is playing now. The song is composed by Rajesh Roshan who is known for creating melodies for love stories. With 'Kaabil', the Rakesh-Rajesh combo promises to move the audience with more of their characteristic refreshing tunes.
Kaabil is the story of a man who lived, laughed and loved just like everyone in this world. Until one day, a terrible tragedy struck. Driven by the fire of vengeance, nothing will stop him. Not even the fact that he has been blind since birth. This Film is Releasing in Telugu with title as "BALAM'.
Starring Hrithik Roshan and Yami Gautam ,"Kaabil" is directed by Sanjay Gupta and produced by Rakesh Roshan with music by Rajesh Roshan. A small film with a big heart, it releases in theaters on 25th of January 2017
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Highlights
దునియా విజయ్ హీరోగా నటించిన 'మాస్తిగుడి' సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సందర్బంగా జరిగిన
దునియా విజయ్ హీరోగా నటించిన 'మాస్తిగుడి' సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సందర్బంగా జరిగిన దుర్ఘటనలో ఇద్దరు విలన్లు జలసమాధి అయిన సంగతి తెలిసిందే. నాగరహోళే, దాండేలి తదితర ప్రాంతాల్లో మాస్తిగుడి సినిమా షూటింగ్ చేశారు.
అయితే సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ కోసం దాదాపు నెల రోజుల పాటు వేచి చూశారు. చివరికి తిప్పగుండనహళ్ళి దగ్గర క్లైమాక్స్ తీయాలని నిర్ణయించారు.ఆ సమయంలోనే సినిమాలో విలన్లుగా నటించిన అనీల్, ఉదయ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషయంలో మాస్తిగుడి నిర్మాత సుందర పి.గౌడను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు హీరో విజయ్.
దీంతో ఆయన్ను అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు పోలీసులు. దీంతో దునియా విజయ్ పరారీ అయ్యాడు. ఆయన్ను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేకంగా పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఇది ఇలా ఉండగా.. నిర్మాతకు కొన్ని షరతులతో కోర్టు జామీన్ మంజూరు చేసింది.
Last Updated 5, Jun 2018, 11:28 AM IST | 0business
|
రివ్యూ: బ్రాండ్ బాబు
Highlights
దర్శకుడు మారుతి సినిమాలు సరికొత్తగా వైవిధ్యంతో కూడి ఉంటాయి. ఆయన డైరెక్ట్ చేయలేని కొన్ని కథలను తన దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ల సహాయంతో రూపొందించిన సందర్భాలు ఉన్నాయి.
నటీనటులు: సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర
మ్యూజిక్: జేబి
నిర్మాత: ఎస్. శైలేంద్ర
డైరెక్టర్: ప్రభాకర్.పి
దర్శకుడు మారుతి సినిమాలు సరికొత్తగా వైవిధ్యంతో కూడి ఉంటాయి. ఆయన డైరెక్ట్ చేయలేని కొన్ని కథలను తన దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ల సహాయంతో రూపొందించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మారుతి అందించిన కథతో దర్శకుడు ప్రభాకర్ ఓ సినిమాను రూపొందించారు. అదే 'బ్రాండ్ బాబు'. సినిమా ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ముందే తెలుసుకుందాం!
కథ:
రత్నంబాబు(మురళీశర్మ) సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడు వాడే కర్చీఫ్ నుండి కాలికి వేసే షూ వరకు అన్ని బ్రాండే ఉండాలి. తన ఇంట్లో వాళ్లు కూడా అలా ఉండాల్సిందే. ఆఖరికి ఇంట్లో పని చేసే వాళ్లకి కూడా బ్రాండ్ బట్టలే వేసుకోవాలని అంటాడు. తన కొడుకు డైమండ్ బాబు(సుమంత్ శైలేంద్ర)ని కూడా అలానే పెంచుతాడు. ఇలా బ్రాండ్ బ్రాండ్ అనే ఫ్యామిలీ తమ ఇంటికి వచ్చే కోడలు కూడా పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి అయి ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో డైమండ్ బాబు హోం మినిష్టర్ అమ్మాయి అనుకొని వాళ్ల ఇంట్లో పనిమనిషి రాధ(ఈషా రెబ్బ)ని ప్రేమిస్తాడు. కానీ ఈ విషయం అతడికి తెలిసేలోపు నిశ్చితార్ధం కూడా చేసుకోవాలని అనుకుంటారు. తను ప్రేమించిన అమ్మాయి హోం మినిష్టర్ కూతురు కాదని తెలిసిన తరువాత డైమండ్ బాబు ఏం చేశాడు..? తన ఇంటికి ఒక పనమ్మాయి కోడలిగా రావడాన్ని రత్నంబాబు యాక్సెప్ట్ చేస్తాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
నేటికాలంలో డబ్బుకి ప్రాధాన్యతనిస్తూ బ్రాండ్ కి ఇచ్చే విలువ సాటి మనిషికి ఇవ్వడం లేదు. ఇదే పాయింట్ ను తన స్టైల్ లో ఎంటర్టైనింగ్ గా రాసుకున్నాడు మారుతి. ఒక రిచ్ ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా. గతంలో సంపన్న కుటుంబమైనా.. కొడుకు ప్రేమించిన అమ్మాయి కోసం దిగి వచ్చి అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకున్న కథలు చూశాం. కానీ ఈ సినిమా మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. హీరో అతడి ఫ్యామిలీ సన్నివేశాలు మంచి కామెడీను పుట్టిస్తాయి. ముఖ్యంగా మురళీశర్మ పాత్ర ఎప్పుడూ బ్రాండ్ బ్రాండ్ అంటూ తిరగడం ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్. హీరో తన ఇద్దరు అసిస్టెంట్స్ తో కలిసి తను ప్రేమించిన అమ్మాయిని పడేయడం కోసం పడే ఇబ్బందులు తెరపై నవ్వులు పూయించాయి.
బ్రాండ్ లేకపోతే ఏది ముట్టుకోని హీరో తన ప్రేమ ఐస్ క్రీమ్ బండి నడుపుతుండడం, ఇదంతా చూసి తననే ప్రేమిస్తున్నాడనుకొని మినిష్టర్ ఇంట్లో పనిమనిషి అతడిని ప్రేమించడం.. ఈ అంశాలన్నీ కూడా కామెడీతో నింపేశాడు మారుతి. దాన్ని అంతే ఎంటర్టైనింగ్ గా రూపొందించాడు దర్శకుడు ప్రభాకర్. మూడు క్యారెక్టర్ల చుట్టూ కన్ఫ్యూజన్ క్రియేట్ ఆడియన్స్ ను కాస్త తికమక పెట్టాడు. అప్పటివరకు రెండు పాటలు, కొంత కామెడీ అని నడిచిన కథలో ఇంటర్వెల్ టైమ్ కి వచ్చేసరికి ట్విస్ట్ రివీల్ అవుతుంది. తను ప్రేమించింది పని మనిషినని హీరోకి ఎప్పుడైతే తెలుస్తుందో.. సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందోననే ఆసక్తి క్రియేట్ అవుతుంది. కానీ ఫస్ట్ హాఫ్ తీసినంత ఎంటర్టైనింగ్ గా సెకండ్ హాఫ్ నడిపించలేకపోయారు.
అప్పటివరకు కామెడీగా నడిచిన కథలో కొత్తగా ఎంటర్ అయ్యే క్యారెక్టర్లు, మధ్యలో మీడియాను తీసుకురావడం ప్రేక్షకులకు బోర్ కలిగించే అంశాలు. క్లైమాక్స్ రొటీన్ గా ఉండకూడదని దాన్ని సాగదీస్తూ మరింత రొటీన్ గా తీశారు. సెకండ్ హాఫ్ లో ఈ సీన్ బాగుందని చెప్పుకునేలా ఒక్కటి కూడా అనిపించదు. హీరోగా సుమంత్ శైలేంద్రకు మొదటి సినిమా. మరీ ఎక్స్ ట్రాడినరీ అని చెప్పుకునేలా లేకపోయినా.. ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు. కానీ తనకున్న ఫీచర్స్ వచ్చిన నటనతో ఇండస్ట్రీలో ఎంతకాలం హీరోగా రాణించగలడో సందేహమే. కాస్ట్లీ బ్రాండ్ బట్టలు, లగ్జరీ కార్ లలో కనిపించినా ఆ రిచ్ లుక్ అనేది హీరోకి రాలేదు. ఈషా పనిమనిషి పాత్రలో సరిగ్గా సూట్ అయింది. ఆమె వేసుకునే బట్టలు, మేకప్ పాత్రకు తగ్గట్లుగా ఉన్నా.. హీరోయిన్ క్యారెక్టర్ ను పనిమనిషిగా రెండున్నర గంటలు స్క్రీన్ మీద చూడడం కష్టమే. తన నటనతో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పూజిత పొన్నాడను సినిమాలో అందంగా చూపించారు.
ఈ సినిమాకు మెయిన్ అసెట్ మురళీశర్మ నటన. సినిమాలో అతడి పాత్ర మాత్రమే ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్ లో తన హావభావాలతో మెప్పించాడు మురళీశర్మ. రాజా రవీంద్ర నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఓకే అనిపించాడు. ఇక దాదాపు సీరియల్లో కనిపించే ఆర్టిస్టులనే సినిమాలో తీసుకున్నాడు ప్రభాకర్. టెక్నీకల్ గా ఈ సినిమాను క్వాలిటీతో రూపొందించారు. కానీ తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా సినిమాను పూర్తి చేసేశారు. సినిమాలో ఎక్కువ లొకేషన్స్ కూడా కనిపించవు. పాటలు ఆకట్టుకుంటాయి. నేపధ్య సంగీతం కూడా బాగుంది. ఫొటోగ్రఫీ కథకు తగ్గట్లుగా ఉంది. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. దర్శకుడిగా ప్రభాకర్ పనితనం కొంతవరకు మెప్పిస్తుంది. బ్రాండ్ లను కాకుండా మనుషులను ప్రేమిస్తూ, బంధాలకు-బాంధవ్యాలు ఎక్కువ ప్రాముఖ్యనివ్వాలని చెప్పే ఈ కథ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ కొద్దిసేపు నవ్వుకోవడానికి మాత్రం ఒకసారి ఈ సినిమాను చూడొచ్చు.
రేటింగ్: 2/5 | 0business
|
వీడని ఫెడ్ భయాలు..
-సెన్సెక్స్ 108 పాయింట్లు పతనం
ముంబయి : అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనుందన్న ఊహాగానాల కారణంగా వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. మరోవైపు పలు కంపెనీల ద్వితీయ త్రైమాసిక ఫలితాలు మార్కెట్లను మురిపించలేకపోవడం, గురువారం నాటికి అక్టోబర్ మాసం డెరివేటివ్స్ గడవు ముగింపు దగ్గరపడుతుండటంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో కాపిటల్ గూడ్స్, లోహ షేర్లు అధిక ఒత్తిడికి గురై మంగళవారం బిఎస్ఇ సెన్సెక్స్ 108.52 పాయింట్లు లేదా 0.40 శాతం క్షీణించి 27,253కు దిగజారింది. ఇంతక్రితం సెషన్లో సెన్సెక్స్ ఇదే స్థాయిలో నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 27.65 పాయింట్లు లేదా 0.33 శాతం పతనమై 8,232.90 వద్ద ముగిసింది. నిఫ్టీ-50లో మారుతి సుజుకి, సన్ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, బిపిసిఎల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు 1.35 శాతం నుంచి 3.05 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు లూపిన్, ఒఎన్జిసి, గెయిల్, హెచ్డిఎఫ్సి, బ్యాంకు ఆఫ్ బరోడా షేర్లు 2.10 శాతం నుంచి 5.45 శాతం వరకు కృంగాయి.
బిఎస్ఇలో ఎఫ్ఎంసిజి 0.1 శాతం, ఆటో 0.38 శాతం చొప్పున పెరిగ్గా, మిగితా రంగాల సూచీలు అన్ని నష్టాల పాలయ్యాయి. కన్సూమర్ డ్యూరెబుల్స్, కాపిటల్ గూడ్స్ సూచీలు 1.43 శాతం, 0.7 శాతం చొప్పున తగ్గాయి. మౌలిక వసతుల సూచీ 0.77 శాతం, పిఎస్యు 0.66 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్-30లో మారుతి 2.44 శాతం, సన్ఫార్మా 1.88 శాతం, విప్రో 1.04 శాతం, హెచ్డిఎఫ్సి బ్యాంకు 0.88 శాతం, బజాజ్ ఆటో 0.57 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
మరోవైపు లూపిన్ 5.25 శాతం, ఒఎన్జిసి 3.07 శాతం, హెచ్డిఎఫ్సి 2.87 శాతం, గెయిల్ 2.24 శాతం, భెల్ 1.42 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. యూరోపియన్ స్టాక్స్ నష్టాలు చవి చూడగా, ఆసియన్ స్టాక్స్ యథాతథంగా నమోదయ్యాయి.
బిఎస్ఇలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.2 శాతం చొప్పున క్షీణించాయి. మొత్తంగా మదుపర్ల మద్దతు కరువై 1,446 స్టాక్స్ నష్టాలు చవి చూడగా, మరోవైపు 1,265 స్టాక్స్ లాభాల్లో నమోదయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ యథాతథంగా 64.96 వద్ద ముగిసింది. ఆర్ధిక లోటుపై భయపడాల్సిందేమీ లేదని, ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నప్పటికీ మార్కెట్లకు మద్దతు లభించలేకపోయింది. రుణ మార్కెట్లపై రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంకు నూతన విధానాలను ప్రవేశపెట్టనుందన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమెరికా ఫెడ్ రెండు రోజుల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో వడ్డీ రేట్ల పెంపుపై సమీక్ష జరుగనుంది. ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఒత్తిడిలో కొనసాగతున్న నేపధ్యంలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు జోలికి పోకపోవచ్చని మరో వర్గం నిపుణులు అంచనా వేస్తున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Oct 26,2019
మోటో నుంచి జి8 ప్లస్
ముంబయి : ప్రముఖ మొబైల్ తయారీదారు మోటరోలా జి సిరీస్లో కొత్త జి8 ప్లస్ను విడుదల చేసింది. దీని ధరను రూ. 13,999గా నిర్ణయించింది. 6.3 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఐప ఎస్ ఎల్సిడి డిస్ప్లే, క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్, 25 ఎంపి సెల్ఫీ కెమెరా, 48, 16, 5 ఎంపి కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలుగా ఉన్నాయి. అక్టోబర్ 29 నుంచి దీన్ని విక్రయించనున్నట్టు పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
sumalatha 172 Views 27-banks , merger , Nirmala Sitharaman
nirmala-sitharaman
న్యూఢిల్లీ: కేంద్రం మరోసారి ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం చేపట్టింది.10 ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసింది. ఈ విలీనం తర్వాత నాలుగు అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకులు ఏర్పడతాయి. దీని మొత్తం వ్యాపారం రూ .55.81 లక్షల కోట్లు. శుక్రవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2017లో దేశంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా, విలీనంతో ఇప్పుడు అవి 12కు తగ్గాయి. ఆర్థిక మంత్రి మాట్లాడుతూ జ గత సంవత్సరం ఎస్బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాల బ్యాంకుల విలీనం లాభపడిందని, రిటైల్ రుణ వృద్ధిలో 25 శాతం పురోగతి నమోదైందని తెలిపారు.
సీతారామన్ తాజా ప్రకటన ప్రకారం, మరో ఆరు బ్యాంకులు పిఎన్బి, కెనరా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులలో విలీనమవుతాయి. నాలుగు ప్రధాన ప్రభుత్వ బ్యాంకులుగా అవతరిస్తాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ పిఎన్బిలో కలుస్తాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్లు యూనియన్ బ్యాంక్లో విలీనం అవుతాయి. కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ కలిస్తే, ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ విలీనం అవుతుంది. దేశంలో ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు 12కు చేరతాయి. ఎస్బిఐ తర్వాత పిఎన్బి అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది. ఈ విలీనం వల్ల రుణ వ్యయం తగ్గుతుందని, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికి బలోపేతం అవుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇకపై రూ.250 కోట్లకు పైగా ఉన్న ప్రతి రుణాన్ని పర్యవేక్షించనున్నామని, మొండి బకాయిలు రూ.8.65 లక్షల కోట్ల నుంచి రూ.7.90 లక్షల కోట్లకు తగ్గాయని ఆర్థికమంత్రి తెలిపారు.
తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/ | 1entertainment
|
Hyderabad, First Published 11, Apr 2019, 4:35 PM IST
Highlights
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద జనాల తాకిడి ఎక్కువగా ఉంది. సామాన్యుల నుండి సినీ ప్రముఖుల వరకూ ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే ఆయన క్యూలో నిలబడి ఓటు వేయలేదని ప్రముఖ ఛానెల్ కి చెందిన ఓ రిపోర్టర్ సంచలనం సృష్టించే ప్రయత్నం చేశారు. పవన్ క్యూలో ఉన్న జనాలను ఇబ్బందికి గురి చేస్తూ.. నేరుగా వెళ్లి ఓటేశారని అక్కడ ఉన్న ఓటర్లతో పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు.
దీంతో సదరు ఛానెల్ కి, రిపోర్టర్ కి దర్శకుడు మారుతి కౌంటర్ ఇచ్చాడు. దయచేసి ఇలాంటి విషయాలను సంచలనం చేయకండని సూచించారు. పవన్ లాంటి వ్యక్తి క్యూలో నిలబడే పరిస్థితి ఉంటుందా..? అని మారుతి ప్రశ్నించాడు. అలా చేస్తే మరిన్ని సెక్యురిటీ సమస్యలు వస్తాయని అన్నారు.
పవన్ క్యూలో నిలబడి ఓటేస్తే అక్కడ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతుందని కాబట్టే ఆయన ఓటు వేసి వెళ్లిపోయారని మారుతి చెప్పారు. ఇదే విషయాన్ని పోలింగ్ కేంద్రం వద్ద ఓ యువకుడు చెబుతుంటే సదరు మీడియా ప్రతినిధి అతడి వాయిస్ ని మధ్యలో కట్ చేసింది. అలా ఎందుకు చేశారని కూడా మారుతి ప్రశ్నించారు.
Mam pls don't try to "sensationalize" things. If surrounded situation is like that can @PawanKalyan garu create more ruckus by standing at que? At least LISTEN PROPERLY what the red shirt person at the location (in Que) saying. Why U cut down his voice in middle? @CNNnews18 pic.twitter.com/HM98ddCFvQ
— Maruthi director (@DirectorMaruthi) April 11, 2019
Last Updated 11, Apr 2019, 4:35 PM IST | 0business
|
పైసా వసూల్ ఆడియో సక్సెస్ పార్టీలో బాలయ్య..ఫోటోలు వైరల్
Highlights
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పైసా వసూల్ సెప్టెంబర్ 1న విడుదల
పైసా వసూల్ ఆడియో సక్సెస్ పార్టీలో బాలకృష్ణ
పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పైసా వసూల్
పూరి జగన్నాథ్ అండ్ బ్యాచ్ తమ సినిమా షూటింగులు ఉన్నంత కాలం అలుపు లేకుండా కష్టపడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి తర్వాత పార్టీల్లో రిలాక్స్ అవుతూ ఉంటారు. ‘పైసా వసూల్' విషయంలోనూ అలాంటి పార్టీనే ఇటీవల జరిగింది.
'పైసా వసూల్' అనుకున్న సమయం కంటే సినిమాను 5 వారాల ముందే రిలీజ్ చేస్తుండటం, దాంతో పాటు ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ ఓ రేంజిలో వచ్చేసింది. సినిమా సూపర్ హిట్ అనే టాక్ రాటంతో... సంతోషంలో పూరి టీం మాంచి మాస్ మసాలా పార్టీ చేసుకున్నారు.
‘పైసా వసూల్' ఆడియో సక్సెస్ మీట్ ఇటీవల ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి పూరి అండ్ బ్యాచ్ చిన్న పార్టీ చేసుకున్నారు. లేట్ నైట్ వరకు సాగిన ఈ పార్టీలో పూరి జగన్నాథ్, చార్మి, సినిమాలోని హీరోయిన్లు పాల్గొన్నారు. సాధారణంగా ఇలాంటి పార్టీలకు దూరంగా ఉండే బాలయ్య కూడా ఈ పార్టీలో జాయిన్ కావడం విశేషం.
పార్టీలో బాలకృష్ణ పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫుల్ గ్లామరస్ గా తయరై పార్టీకి హాజరైన బాలయ్య మొదట్లో సూపర్ గా కనిపించినా... చివరకు ఓ ఫోటోలో విగ్గు లేకుండా కనిపించారు. దీంతో పార్టీ ఏ రేంజ్ లో సాగిందో కదా అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది.
పైసా వసూల్ చిత్రం భవ్య క్రియేషన్స్ బానర్పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'పైసా వసూల్'. శ్రియ, కైరా, ముస్కాన్ హీరోయిన్లు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘పైసా వసూల్' చిత్రానికి సెన్సార్ నుండి యూ/ఎ రేటింగ్ వచ్చింది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా సెన్సార్ రేటింగ్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. పూరీ కెరీర్ లో పోకిరి తరహాలో పైసా వసూల్ పెద్ద హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.
Last Updated 25, Mar 2018, 11:54 PM IST | 0business
|
Hyderabad, First Published 9, Sep 2019, 6:36 PM IST
Highlights
భరతమాత గడ్డపై అనన్య ధైర్య సాహసాలని ప్రదర్శించిన గొప్ప మహారాజులు, చక్రవర్తులు ఎందరో ఉన్నారు. వారిలో చక్రవర్తి పృథ్వి రాజ్ చౌహన్ కు కూడా గొప్ప చరిత్ర ఉంది. చాహమాన వంశస్థులలో పృథ్వి రాజ్ చౌహాన్ ఘానా కీర్తిని సొంతం చేసుకున్నారు.
విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్. సోమవారం అక్షయ్ కుమార్ 52వ జన్మదినం. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసక్తికర ప్రకటన చేశాడు. తన తదుపరి చిత్రం గురించి అద్భుత విషయాన్ని తెలిపాడు. 12వ శతాబ్దానికి చెందిన అపరపరాక్రమవంతుడు చక్రవర్తి పృథ్వి రాజ్ చౌహన్ పాత్రలో నటించబోతున్నాడు అక్షయ్ తెలిపాడు.
తాజాగా ఆ చిత్ర టైటిల్ పృథ్విరాజ్ అని ప్రకటించాడు. పృథ్విరాజ్ క్రీ.శ. 1166లో జన్మించారు. 1192లో మహమ్మద్ ఘోరీ సైన్యం భారత దేశంపై దండెత్తింది. పృథ్వి రాజ్ చౌహన్ వారికి ఎదురునిలిచి ఎంతో ధైర్య సాహసాలని ప్రదర్శించాడు.
ఆయన పాత్రలో నటించనుండడం తనకు దక్కిన గౌరవం అని అక్షయ్ తెలిపాడు. తన కెరీర్ లోనే ఏఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోందని తెలిపాడు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2020 దీపావళికి పృథ్విరాజ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
Elated to share about my 1st historical film on my birthday!Humbled to have the opportunity to play a hero I look up to for his valor & values- Samrat Prithviraj Chauhan in one of my biggest films #Prithviraj .
— Akshay Kumar (@akshaykumar) September 9, 2019
Last Updated 9, Sep 2019, 6:36 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
2.0 ట్రైలర్ ఈవెంట్: రాజమౌళికి నేను పెద్ద అభిమానిని.. శంకర్ స్క్రీన్పై జక్కన్న
2.0 ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు శంకర్ను అనుకోని అతిథి పలకరించారు. ఆయన మరెవరో కాదు మన జక్కన్న రాజమౌళి. ఆయన గురించి శంకర్ ఏమన్నారో చూడండి.
Samayam Telugu | Updated:
Nov 3, 2018, 07:19PM IST
2.0 ట్రైలర్ ఈవెంట్: రాజమౌళికి నేను పెద్ద అభిమానిని.. శంకర్ స్క్రీన్పై జక్కన్న
2.0 ట్రైలర్ మెగా ఈవెంట్ చెన్నైలోని సత్యం థియేటర్లో జరుగుతోంది. మరికొద్ది సేపటిలో ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు శంకర్కు ప్రముఖ దర్శకులు, నటులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ముఖ్యంగా ‘బాహుబలి’ సీరిస్లతో దక్షిణాది సినిమా సత్తా చాటిన రాజమౌళి కూడా ప్రత్యేకంగా విష్ చేశారు.
రాజమౌళి ప్రత్యేక వీడియో ద్వారా శంకర్ను అభినందించారు. ఈ వీడియోను వేదికపై ఉన్న స్క్రీన్పై ప్రదర్శించారు. రాజమౌళి మాట్టాడుతూ.. యావత్ భారత దేశం గర్వపడేలా.. ఇంతటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రూ.500 కోట్ల బడ్జెట్తో సినిమా అంటే మాటలు కాదని, అంత ఒత్తిడి తట్టుకుని ఈ సినిమా ఎలా నిర్మించగలిగారని అడిగారు. అలాగే, ‘రోబో’ సినిమా తర్వాత రజనీకాంత్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారని.. అది బడ్జెట్ కంటే మరింత భారమైనదని, దాన్నీ మీరు ఎలా రీచ్ అవుతారనేది ఆసక్తికలిగిస్తోందన్నారు. రాజమౌళి సందేశంపై శంకర్ స్పందిస్తూ.. రాజమౌళికి తాను పెద్ద అభిమానినని తెలిపారు. ఒత్తిడిని ఎదుర్కోడానికి ఏకైక పరిష్కారం.. ఎక్కువగా పనిచేయడం మాత్రమేనని, ఈ విషయంలో తాను అన్నీ సరిగానే చేశానని భావిస్తున్నానని తెలిపారు. ‘రోబో’లో చిట్టిలా కనిపించిన రజనీకాంత్ ‘2.0’లో జెయింట్ చిట్టిగా కనిపిస్తారని, అంతేగాక ఇంకా ఎన్నో సర్ప్రైజ్లు ఈ సినిమాలో ఉన్నాయని, తప్పకుండా ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు.
Watch Trailer here: శంకర్ అద్భుత సృష్టి ‘2.0’ ట్రైలర్ ఇదిగో.. +
5 ఫోర్స్ అంటే ఇదే..: ఈ సినిమాలో ఐదో ఫోర్స్ చూపిస్తున్నానని శంకర్ తెలిపారు. సాధారణంగా సైన్స్లో నాలుగే ఫోర్స్లు ఉంటాయన్నారు. ‘‘గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రో ఫోర్స్, వీక్ న్యూ్క్లియర్, స్ట్రాంగ్ న్యూక్లియర్ మాత్రమే ఉంటాయని, వీటన్నికంటే బలమైనదే 5వ ఫోర్స్ (ఫిఫ్త్ ఫోర్స్). ఇది నెగటివ్ ఎనర్జీ. దీన్ని కనిపెట్టడం చాలా కష్టం’’ అని తెలిపారు. 3.0 సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు శంకర్ స్పందిస్తూ.. తనకు చిన్ని చిన్న ఐడియాలు ఉన్నాయని, తప్పకుండా పరిశీలిస్తానని తెలిపారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Bigg Boss 3 Buzz: యాంకర్గానూ తనీష్ అట్టర్ ఫ్లాప్.. డిస్ లైక్స్ మోత
యాంకర్ అవతారం ఎత్తిన బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ తనీష్ను ఆటాడుకుంటున్న నెటిజన్లు. ఇతను ఏం చెప్తున్నాడో.. మాకైతే అర్ధం కావడం లేదు.. కనీసం మీకైనా అర్ధమౌతోందా? అంటూ డిస్ లైక్స్ మోత మోగిస్తున్నారు.
Samayam Telugu | Updated:
Aug 27, 2019, 09:50PM IST
Bigg Boss 3 Buzz: యాంకర్గానూ తనీష్ అట్టర్ ఫ్లాప్.. డిస్ లైక్స్ మోత
చైల్డ్ ఆర్టిస్ట్ తనీష్ .. హీరో తనీష్.. బిగ్ బాస్ తనీష్.. రీసెంట్గా యాంకర్ తనీష్.. పేరు ముందు ఏది యాడ్ చేసినా మనోడి ఫేట్ మాత్రం మారడం లేదు. ఇండస్ట్రీలో చిన్నచితకా పాతికపైగా చిత్రాల్లో నటించిన తనీష్కి హీరోగా స్టార్ డమ్ మాత్రం రాలేదు.
ఇక బిగ్ బాస్ రెండో సీజన్లో హోస్ట్ నాని రికమండేషన్పై కంటెస్టెంట్గా అడుగుపెట్టి.. ఫైనలిస్ట్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు కాని.. టైటిల్ మాత్రం కౌశల్ ఎగరేసుకుపోయాడు.
అయినప్పటికీ బిగ్ బాస్తో ఉన్న అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సీజన్కి యాంకర్ అవతారం ఎత్తారు. ‘బిగ్ బాస్ బజ్’ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్తో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడు. ‘తెలుసుకోవాల్సింది చాలా ఉంది’.. కంటెస్టెంట్స్ నుండి హౌస్ గుట్టును బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నాడు కాని.. మనోడి యాంకరింగ్పై పెదవి విరుపులు ఎక్కువయ్యాయి.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. యాంకర్ని మార్చండ్రా బాబాయ్.. తనీష్ని చూడలేకపోతున్నామ్ అంటూ ఈ ప్రోమోకి డిస్లైక్ల మోత మోగిస్తున్నారు.
ఈ వీడియోకి యూట్యూబ్లో 22k వ్యూస్ రాగా.. అందులో 237 డిస్ లైక్స్ వచ్చాయి. కేవలం 192 మంది మాత్రమే లైక్ కొట్టారు. ఇక కామెంట్స్ అయితే తనీష్ యాంకరింగ్పైనే ఉన్నాయి. తనీష్ కంటే నవదీప్ అయితే బెటర్.. అతను ఏం చెప్తున్నాడో నాకైతే అర్ధం కావడం లేదు.. కనీసం మీకైనా అర్ధమైందా? అంటూ జోక్లు పేల్చుతున్నారు. మరి మీకేమైనా అర్ధమైందేమో ఈ ప్రోమోలో చూడండి.
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
internet vaartha 111 Views
ముంబై : ఎల్అండ్టి ఇన్ఫోటెక్ ఐపిఒ నాలుగురెట్లు కొనుగోళ్లు పెరిగాయి. మొత్తం 12.25 మిలియన్ల వాటాల విక్రయానికి 43 మిలియన్ బిడ్లు అందాయి. సంస్థాగత అర్హులైన కొనుగోలుదారులు ఐదురెట్లు ఎక్కువ బిడ్లు దాఖలుచేశారు. మొత్తం ఐపిఒద్వారా 1236 కోట్లు రాబట్టాలని చూసిన ఎల్అండ్టి 12.25 మిలియన్ల షేర్లను అమ్మకానికి సిద్ధంచేస్తే 43మిలియన్ల వరకూ బిడ్లు దాఖల య్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లు, క్యూఐబి నుంచి ఎక్కువ బిడ్లు అందాయి. రిటైల్ కేటగిరీలో నాలుగురెట్లు ఎక్కువ రాగా, క్యూఐబి సెగ్మెంట్లో ఐదురెట్లు ఎక్కువ బిడ్లు అందాయి. హైనెట్వర్త్ ఇండివిడ్యుయల్ కేగిరీలో 60శాతం కొను గోళ్లు ఉన్నాయి. ఐపిఒకు సుమారు 5 లక్షల అప్లికేషన్లు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అందాయి. బుధవారం ఇష్యూ ముగిసింది. ఇటీ వలి కాలంలోని ఐపిఒలతో పోలిస్తే మంచి ఫలితాలిచ్చింది. సాధా రణంగా చివరిరోజే ఎక్కువ బిడ్లు దాఖలవుతాయి. ఎల్అండ్టి ఐపిఒలో కూడా అదే జరిగింది. రిటైల్ ఇన్వెస్టర్లు మొదటిరోజే దాఖలుచేసారు. క్వెస్కార్ప్, మహానగర్గ్యాస్ వంటివాటిలో కూడా మొదటి, రెండురోజుల్లోనే బిడ్లు ఎక్కువ దాఖలయ్యాయి. క్యూఐబి కేటగిరీలో మొత్తం 13.83 మిలి యన్ల బిడ్లు రాగా 3.50మిలియన్ల షేర్లు కేటాయించారు. 5.38రెట్లు అధికంగా అందాయి. ఇక సంప న్నుల కేటగిరీకి సంబంధించి 2.62 మిలియన్ షేర్లకుగాను 1.65మిలియన్ల బిడ్లు దాలయితే 0.63 శాతం పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లపరంగా 6.12మిలియన్ల షేర్లకుగాను 23.32 మిలియన్ల బిడ్లు అందా యి. 3.81రెట్లు అధికంగా దాఖలయ్యాయి. మొత్తంగాచూస్తే 12.25 మిలియన్ల షేర్లకుగాను 43.80 మిలియన్ల బిడ్లుదాఖలయ్యాయి. 3.58రెట్లు అధికస్పందన లభించినట్లు ఎల్అండ్టి ఇన్ఫోటెక్ భావిస్తోంది. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అది పొగరు.. ఇలాంటి ప్రెసిడెంట్ని ఇప్పటి వరకు చూడలేదు: నరేష్పై సమీర్ ఫైర్
‘మా’ వివాదంపై సోమవారం సాయంత్రం అధ్యక్షుడు నరేష్ మీడియాలో మాట్లాడిన విషయం తెలిసిందే. నరేష్కు కౌంటర్గా ‘మా’ జనరల్ సెక్రటరీ జీవిత, వైస్ ప్రెసిడెంట్ హేమ, ఈసీ మెంబర్స్ సమీర్, జయలక్ష్మి మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu | Updated:
Oct 23, 2019, 05:43PM IST
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు గుట్టుగా కొట్టుకున్న వీళ్లు ఇప్పుడు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆదివారం జరిగిన ‘మా’ సమావేశం తరవాత అసోసియేషన్ గురించి మీడియాలో పలు రకాల వార్తలు వచ్చాయి. అధ్యక్షుడు నరేష్కు జనరల్ సెక్రటరీ జీవితకు పడటం లేదని.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రెండు వర్గాలుగా విడిపోయారని అన్నారు. దీనికి తోడు ఆదివారం నాటి మీటింగ్కు అధ్యక్షుడు నరేష్ హాజరుకాకపోవడంతో మీడియా మరింత హైలైట్ చేసింది.
డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ‘మా’పై రకరకాల వార్తలు రావడంతో సోమవారం జీవిత స్పందించారు. మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామో చెప్పారు. అదేరోజు సాయంత్రం అధ్యక్షుడు నరేష్ కూడా మీడియా ముందుకు వచ్చారు. అసలు అధ్యక్షుడితో సంబంధంలేకుండా పెట్టిన మీటింగ్కు తానెందుకు వెళ్తానని నరేష్ అన్నారు. అలాగే, 26 ఏళ్ల చరిత్ర కలిగిన ‘మా’ రాజ్యాంగాన్ని వీళ్లు మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది ‘మా’కు పెద్ద డ్యామేజీ అని కూడా వ్యాఖ్యానించారు. నరేష్ వ్యాఖ్యలపై ‘మా’ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొంత మంది స్పందించారు.
Also Read: చిరంజీవి నేతృత్వంలో మొదలైన గొప్ప సంస్థ ‘మా’.. డ్యామేజ్ చేశారు: నరేష్ కౌంటర్
జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ స్నేహ, ఈసీ మెంబర్లు సమీర్, జయలక్ష్మి కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నరేష్పై సమీర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ మెంబర్స్ మధ్య విభేదాలు ఉండటం వాస్తవం అన్నారు. అయితే, దీన్ని బట్టబయలు చేసింది, పెద్దది చేసింది ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ‘మా’లో తామంతా చాలా సఖ్యతగా ఉన్నామని, కలుపుగోలుతనంగా ఉన్నామని అంటున్న మాటలన్నీ పచ్చి అబద్ధాలని సమీర్ అన్నారు. ఇక్కడ ఏదీ సఖ్యతగా జరగట్లేదన్నారు.
‘‘ఎవ్వరూ ఎవ్వరినీ కలుపుకొని పోవట్లేదు. నేను కలుపుకుపోతాను అని నరేష్ గారు చెప్పినదానికి మంచి ఉదాహరణ ఏంటంటే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి వైస్ ప్రెసిడెంట్గా గెలిచిన హేమగారి చేతులో నుంచి గెలిచిన మరుసటి రోజు జరిగిన ఫంక్షన్లో లైవ్లో మైక్ లాక్కున్నారు. దాన్ని కలుపుగోలుతనం అనరు. దాన్ని పొగరు అంటారు. ఇగో అంటారు. నా ‘మా’కి ఇబ్బంది కలిగితే నేను ఒప్పుకోను.. నా ‘మా’ని ఎవరైనా కించపరిస్తే నేను ఒప్పకోను అంటారు. నా ‘మా’ ఏంటి సార్. మేమందరం ఎక్కడి నుంచి గెలిచాం.. నడిగర్ సంఘం నుంచా..?’’ అని సమీర్ ఫైర్ అయ్యారు.
‘‘రాజ్యాంగంలో సవరణలు చేయడానికి వీళ్లెవరు.. పెద్దపెద్ద వాళ్లు రాసుకున్న రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారు అని నరేష్ గారు అడుగుతున్నారు. వెయ్యి రూపాయల నోటు మోదీ గారు మార్చేశారు. మహానుభావులు అందరూ వాడిన నోటు అది.. దాన్నెలా మారుస్తారు అని ఆయన మీద మీరు కేసు పెట్టండి’’ అని సమీర్ వ్యంగ్యంగా నరేష్కు చురకలు అంటించారు. నిజంగా నరేష్ చేసేది కరెక్ట్ అని ఆయన అనుకుంటే తామెవ్వరం రామని, ఒక్క బెజనర్జీతో మాట్లాడితే సరిపోతుందని సమీర్ సూచించారు. ఆయన ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వస్తారని భరోసా ఇచ్చారు.
ఆదివారం నిర్వహించిన సమావేశాన్ని పనికిమాలిన మీటింగ్ అంటున్నారని.. కానీ, అది ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్(ఈజీఎం) నిర్వహణపై నిర్ణయం తీసుకోవడానికి పెట్టిన సమావేశమని సమీర్ అన్నారు. ‘‘26 ఏళ్లుగా ఈజీఎం జరగలేదు.. చరిత్రలో లేదు అని నరేష్ అంటున్నారు. ఇన్నేళ్లుగా ఇలాంటి ప్రెసిడెంట్ను ‘మా’ చూడలేదు. అందుకే ఈసారి ఈజీఎం పెట్టాల్సి వస్తుంది’’ అని సమీర్ ముగించారు. | 0business
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
Read Also: ఓటింగ్లో టాప్ బాబా, శ్రీముఖి.. ఆ ముగ్గురికీ అప్పడం!
తాజాగా ప్రోమోలో.. వరుణ్, బాబా భాస్కర్లు సరదాగా మాట్లాడుకుంటున్న మాటలను ప్లే చేసి చూపించిన నాగార్జున.. బాబా భాస్కర్ని టార్గెట్ చేశారు. ఈరోజు గడిస్తే.. మరో వారం మాత్రమే ఇక మిగిలి ఉందని వరుణ్.. బాబా భాస్కర్తో అంటుండగా.. బాబా భాస్కర్ ‘దీన్ని నేను కేర్ చేయను.. ఐ యామ్ ఫైనల్ టికెట్ కంటెస్టెంట్స్ .. నో టెన్షన్, నో నత్తింగ్’ అని అంటున్నారు.
మరి ఇందులో నాగార్జునకి తప్పేం కనిపించిందో ఏమో కాని.. బాబా భాస్కర్ని పిలిచి ‘నీ టికెట్ టు ఫినాలే ఎక్కడ ఉంది.. ఇలా తీసుకురా అని.. అది ఫేక్ టికెట్ టు ఫినాలే, నువ్ కూడా నామినేషన్స్లో ఉన్నావు అందరితో పాటు’ అంటూ సీరియస్ అవుతున్నారు.
అయితే ఇదంతా ఎపిసోడ్కి హైప్ తీసుకువచ్చేందుకు ఇచ్చే బిల్డప్ మాత్రమే అని.. నాగార్జున సపోర్ట్ బాబాకి లేకపోయినా ప్రేక్షకుల మద్దతు ఉందని, ఖచ్చితంగా బాబా ఫైనల్కి వెళ్తారని ఈ ప్రోమోపై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. నాగార్జున ప్రతిసారి చిన్న విషయాన్ని పెద్దది చేసి బాబా భాస్కర్కి క్లాస్ పీకడం కామనే.. ఈసారి ఆయన్ని నెగిటివ్గా చూపించేందుకు మరో స్కెచ్ వేశారు అంటూ నాగార్జునపై మండిపడుతున్నారు. ఈ ప్రోమోకి వస్తున్న కామెంట్స్లో అందరూ నాగార్జునను తిడుతున్నవారే తప్ప.. కరెక్ట్ అంటున్నవారు లేకపోవడం విశేషం. అందరూ బాబా భాస్కర్కి జై కొడుతున్నారు. మరి ఈ డ్రామా ఏంటో నేటి రాత్రి ఎపిసోడ్లో చూడాలి.
X | 0business
|
Hyd Internet 89 Views Ray -Ban sun glasses
Ray -Ban sun glasses
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆధునిక కళ్లజోళ్ల తయారీ సంస్థగా ప్రసిద్ధిచెం దిన రేబాన్ ఇప్పుడు 21వ శతాబ్ద యువత కోసం ది జనరల్ పేరుతో కొత్త సిరీస్ కళ్లజోళ్ల ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. మన్నిక, యుటి లిటి ఫీల్ దీని ప్రధాన విశిష్టత. అంతేకాకుండా స్టైలిష్ లుక్ను అందించి అందరి దృష్టిని ఆకర్షిం చేలా చేసి అందరూ కోరుకునే లాగా చేస్తాయని కంపెనీ ఒక ప్రకటలో తెలిపింది. ది జనరల్ సన్ పేరు తో లభ్యమయ్యే ఈ చలవ కళ్లజోళ్లు బలమైన బ్రాంజ్ ఫేమ్లతో, వివిధ రంగులలో లభ్యమవుతాయి. | 1entertainment
|
Mar 03,2019
రూ.1099 లకే దేశీయ విమానయానం
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో విమానయానం అందించే గోఎయిర్ విమాన యాన సంస్థ మరోమారు ఆకర్షణీయమైన విమా యాన పథాకాన్ని ప్రకటిం చింది. జాతీయ, అంతర్జాతీ య మార్గాల్లో విమాన టికెట్లను తగ్గింపు ధరల్లో ఆఫర్ చేస్తున్నట్టుగా సంస్థ ప్రకటించించింది. దేశీయ మార్గాల్లో రూ.1099 (అన్నిచార్జీలు కలుపుకొని), అంతర్జాతీయ మర్గాల్లో రూ.4999 (అన్నిచార్జీలు కలుపుకొని) లిమిటెడ్ ఆఫర్తో టిక్కెట్లను ఆఫర్ చేస్తున్నట్టుగా సంస్థ తెలిపింది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్గా తీసుకొచ్చిన పథకం మార్చి4వ తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద టెక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆయా మార్గాల్లో సెప్టెంబరు 1వతేదీ దాకా ప్రయాణాలు చేయవచ్చు. పూర్తి వివరాలను గో ఎయిర్ వెబ్సైట్లో పొందుపర్చినట్టుగా సంస్థ తెలిపింది. విమాయన ఇంధన ధరలు పెరిగి విమాన టిక్కెట్ల ధరలను పెంచాలని పోటీ సంస్థలు యోచిస్తున్న వేళ గో ఎయిర్ ఆకర్షణీయ పథకాన్ని ప్రకటించడం విశేషం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
తీన్మార్ దరువుకు రాహుల్ స్...
అడివి శేషు, అదా శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్షణం మూవీ ట్రైలర్ బుధవారం మహేష్ బాబు , సమంత చేతులమీదుగా లాంచ్ అయింది. పీవీపీ సినిమా బ్యానర్పై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని మార్చి 4వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు తెలిపారు. ప్రముఖ యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.
క్షణం మూవీ ట్రైలర్ లాంచింగ్లో మహేష్ బాబు, సమంత
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Visit Site
Recommended byColombia
182 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతా విజయానికి ఆఖరి 18 బంతుల్లో 53 పరుగులు అవసరంకాగా.. ఉప్పెనలా విరుచుకుపడిన రసెల్.. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన సిద్ధార్థ కౌల్ బౌలింగ్లో తొలి రెండు బంతుల్నీ వరుసగా 6, 6గా మలిచిన రసెల్.. ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించి మొత్తం 19 పరుగులు రాబట్టాడు. దీంతో.. సమీకరణం 12 బంతుల్లో 34 పరుగులుగా మారిపోయింది.
ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసేందుకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్రాగా.. అతడ్నీ రసెల్ వదల్లేదు. వరుసగా 4, 6, 4, 0, 6, 1 బాదేసి 21 పరుగులు పిండుకున్నాడు. దీంతో.. చివరి ఓవర్కి సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారిపోయింది. దీంతో.. 20వ ఓవర్ వేసేందుకు షకీబ్రాగా.. తొలి బంతికి రసెల్ సింగిల్ తీయగా.. శుభమన్ గిల్ (18 నాటౌట్: 10 బంతుల్లో 2x6) రెండు, నాలుగో బంతిని సిక్స్గా తరలించి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. 17వ ఓవర్ వరకూ హైదరాబాద్ చేతుల్లో ఉన్న మ్యాచ్ను పవర్ హిట్టింగ్తో రసెల్ లాగేసుకున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
sunil narine placed in windies squad for first two t20is against india
Ind Vs WI T20: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మిస్టరీ స్పిన్నర్ నరైన్కు విండీస్ బోర్డు పిలుపు
India vs West Indies T20Is | విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్కు రెండేళ్ల అనంతరం సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. త్వరలో భారత్తో జరగనున్న టీ20 సిరీస్లో అతడికి చోటు దక్కింది.
Samayam Telugu | Updated:
Jul 24, 2019, 01:41PM IST
హైలైట్స్
భారత్తో తొలి 2 టీ20లకు జట్టును ప్రకటించిన వెస్టిండీస్ సెలెక్టర్లు
స్పిన్నర్ నరైన్, ఆల్ రౌండర్ రస్సెల్, పోలార్డ్లకు బోర్డు నుంచి పిలుపు
దాదాపు రెండేళ్ల అనంతరం టీ20 మ్యాచ్ ఆడనున్న మిస్టరీ స్పిన్నర్ నరైన్
2020లో జరిగే టీ20 వరల్డ్ కప్ను నిలబెట్టుకోవాలని విండీస్ తాపత్రయం
స్వదేశంలో భారత్తో జరగనున్న ట్వంటీ20 సిరీస్లో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్, ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్లకు వెస్టిండీస్ సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. ఆండ్రీ రస్సెల్కు సైతం బోర్డు నుంచి ఆహ్వానం అందింది. భారత్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్ల కోసం నరైన్, పొలార్డ్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 3, 4 తేదీల్లో తొలి 2 టీ20 మ్యాచ్లు నిర్వహిస్తారు. కెనడాలో టీ20 లీగ్తో ఒప్పందం ఉందని, తాను అందుబాటులో ఉండనని సెలెక్టర్లకు తెలపడంతో డాషింగ్ క్రికెటర్ క్రిస్ గేల్ స్థానంలో జాన్ క్యాంప్బెల్ను ఎంపిక చేశారు.
విండీస్ తరఫున నరైన్ రెండేళ్ల క్రితం చివరి టి20 ఆడటం గమనార్హం. మొత్తం 14 మంది సభ్యుల జట్టులో వికెట్ కీపర్ ఆంథోని బ్రాంబెల్ ఒక్కడే అరంగేట్ర ఆటగాడు. కార్లోస్ బ్రాత్వైట్ ఈ పొట్టి ఫార్మాట్లో విండీస్కు సారథ్యం వహిస్తాడు. వచ్చే ఏడాది జరుగనున్న ట్వంటీ20 వరల్డ్ కప్ను మళ్లీ నిలబెట్టుకునే ప్రక్రియలో భాగంగా నరైన్, రస్సెల్, పోలార్డ్ లాంటి ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు వెస్టిండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ రాబర్ట్ హేన్స్ తెలిపారు. తొలి రెండు టీ20లు ఫ్లోరిడా (అమెరికా)లోని లాడర్హిల్లో, మూడో మ్యాచ్ ఆగస్ట్ 6న గయానాలో నిర్వహించనున్నారు. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఏ+ కేటగిరీ ఏర్పాటు.. కోహ్లి, ధోనీల సూచన మేరకే!
భారత క్రికెటర్లకు బీసీసీఐ ఇటీవలే వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. ఈ ఏడాది కొత్తగా ఏ+ కేటగిరీని ఏర్పాటు చేసింది.
TNN | Updated:
Mar 18, 2018, 02:39PM IST
ఏ+ కేటగిరీ ఏర్పాటు.. కోహ్లి, ధోనీల సూచన మేరకే!
బీసీసీఐ ఇటీవలే భారత క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. కొత్తగా ఈ ఏడాది ఏ+ కేటగీరిని ఏర్పాటు చేశారు. అందులో కోహ్లి, ధావన్ సహా ఐదుగురు ఆటగాళ్లకే చోటు కల్పించారు. ధోనీని కేటగిరీ-ఏలో (category A) ఉంచారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే మహేంద్ర సింగ్ ధోనీని ఏ+ కేటగిరీలో చేర్చలేదని అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతూ.. టాప్-10లో నిలిచిన ఆటగాళ్లనే టాప్ కేటగిరీలో చేర్చామని బీసీసీఐ తెలిపింది. ధోనీ టెస్టులు ఆడటం లేదని అందుకే కేటగిరీ-ఏలో చేర్చామని స్పష్టం చేసింది. | 2sports
|
Visit Site
Recommended byColombia
బంధువులు లేదా స్నేహితులను అడిగి అప్పు తీసుకుందామంటే.. వారికి కూడా అవసరాలు ఉండొచ్చు. మరి ఏం చేయాలి. మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. క్షణాల్లో మీ వాలెట్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ మీరు బజాజ్ ఫిన్సర్వ్ కస్టమర్ అయ్యి ఉండాలి. బజాజ్ ఈఎంఐ కార్డు ఉంటే ఈ ప్రయోజనం పొందొచ్చు.
బజాజ్ ఈఎంఐ కార్డు ఉన్న వారు గూగుల్ ప్లేస్టోర్ నుంచి బజాజ్ ఫిన్సర్వ్ వాలెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. బజాజ్ ఫిన్సర్వ్ మొబిక్విక్ యాప్ భాగస్వామ్యంతో ఈ యాప్ను అందిస్తోంది. ఇందులో ఈఎంఐ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ బజాజ్ ఈఎంఐ కార్డు వివరాలను ధ్రువీకరించాలి.
Also Read: రూ.2,000 నోట్లు బ్యాన్! మార్కెట్లోకి కొత్త రూ.1,000 నోట్లు?
తర్వాత యాడ్ మనీ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి రూ.10,000 వరకు డబ్బుల్ని వాలెట్కు యాడ్ చేసుకోవచ్చు. వాలెట్ డబ్బులతో ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. యుటిలిటీ బిల్లులు చెల్లించొచ్చు. అంతేకాకుండా ఆఫ్లైన్ రిటైలర్ల వద్ద కూడా మొబిక్విక్ వాలెట్తో డబ్బులు చెల్లించి నచ్చిన ప్రొడక్టును కొనుగోలు చేయవచ్చు.
Also Read: పీఎఫ్ ఖాతాదారులకు పండుగ బొనాంజా.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే నష్టపోవాల్సిందే!
బజాజ్ ఈఎంఐ కార్డులోని డబ్బులు వాలెట్కు వస్తాయి. ఈవిధంగా పొందిన డబ్బులను ఈఎంఐ రూపంలో సులభంగానే తిరిగి చెల్లించొచ్చు. ఇకపోతే కార్డు ద్వారా వాలెట్లోకి వచ్చిన డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్కు పంపించుకోవడం కుదరదు. అలాగే ఇతర వాలెట్లకు కూడా సెండ్ చేయలేం.
Also Read: హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో కోటీశ్వరులయ్యే ఛాన్స్.. కేవలం రూ.2 లక్షలతో రూ.1.12 కోట్లు!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Suresh 67 Views india vs srilanka 3rd test
india vs srilanka 3rd test
పల్లెకెలె : ఓవర్నైట్ స్కోరు 329 పరుగుల తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది.
విశ్వ ఫెర్నాండో బౌలింగ్లో వృద్ధిమాన్ సాహా(16) దిల్రువాన్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో పాండ్యా(21),
కుల్దీప్ యాదవ్(11) ఉన్నారు. 100ఓవర్లు ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Tim Paine: పెర్త్లో మళ్లీ గొడవపడిన కోహ్లీ, టిమ్పైన్..!
విరాట్ కోహ్లీ, టిమ్పైన్ ఒకరినొకరు కవ్వించే తరహాలో ఢీకొనేందుకు ప్రయత్నించడంతో ఫీల్డ్ అంపైర్ ఆఖరికి కలగజేసుకోవాల్సి వచ్చింది.
Samayam Telugu | Updated:
Dec 17, 2018, 01:33PM IST
Tim Paine: పెర్త్లో మళ్లీ గొడవపడిన కోహ్లీ, టిమ్పైన్..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆటగాళ్ల కవ్వింపులతో రసవత్తరంగా మారిపోయింది. ముఖ్యంగా.. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్పైన్ మధ్య మాటల యుద్ధం వరుసగా రెండో రోజూ కూడా కొనసాగింది. నిన్న ఆఖరి సెషన్లో బ్యాటింగ్ చేస్తున్న టిమ్పైన్.. అతిగా డిఫెన్స్ చేస్తుండంతో.. ఇలా అయితే.. భారత్ 2-0తో గెలుస్తుందని కోహ్లీ కవ్వించగా.. మీ వరకూ బ్యాటింగ్ వస్తే కదా..? అంటూ టిమ్పైన్ బదులివ్వడం స్టంప్ మైక్లో స్పష్టంగా రికార్డైంది. ఈరోజు మళ్లీ ఈజోడీ మైదానంలో కాలు దువ్వుకుంది.
Virat Kohli and Tim Paine are back at it! The two have locked horns again as tension builds on the 4th day of the… https://t.co/mDHTPnI4u5
— Fox Cricket (@FoxCricket) 1545020724000
ఆటలో నాలుగోరోజైన సోమవారం ఓవర్నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 174/4తో నిలిచిన దశలో.. పరుగు కోసం నాన్స్ట్రైక్ ఎండ్వైపు వచ్చిన టిమ్పైన్.. కోహ్లీని దాదాపు ఢీకొట్టేలా కనిపించాడు. అతని ప్రయత్నాన్ని ముందే పసిగట్టిన కోహ్లీ కదలకుండా అలానే నిల్చోగా.. టిమ్పైన్ కూడా అతనికి చాలా దగ్గరగా వెళ్లిపోయాడు. ఇద్దరు ఆటగాళ్లు అలా ఒకరినొకరు కవ్వించే తరహాలో తాకేలా ప్రయత్నించడంతో ఫీల్డ్ అంపైర్ ఆఖరికి కలగజేసుకోవాల్సి వచ్చింది. అంపైర్కి వివరణ ఇచ్చే సమయంలోనూ కోహ్లీ కోపంగానే కనిపించాడు. నిన్న ఆట ముగిసిన తర్వాత పెవిలియన్కి వెళ్తున్న సమయంలోనూ ఈ ఇద్దరు క్రికెటర్లు మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే.
A quick recap of an epic day's play between the skippers at the close of play. Bring on day four! #AUSvIND https://t.co/TIRY2eaYTS
— cricket.com.au (@cricketcomau) 1544954240000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Dec 19,2017
నవంబర్లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: గత నవంబర్ జీఎస్టీ వసూళ్లు 10శాతం మేర తగ్గి రూ.85,931 కోట్లకు పరిమితమయ్యా యని మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు. అక్టోబర్లోని రూ.95,132 కోట్ల వసూళ్ల తో పోల్చితే గత నెలలో పది శాతం పన్ను రాబడి పడిపోయిందని పేర్కొ న్నారు. సెప్టెంబర్, ఆగస్టులో ఈ వసూళ్లు రూ.93వేల కోట్లకు అటు, ఇటుగా ఉన్నాయి. డిసెంబర్ 11 వరకు జీఎస్టీ ఎన్లో 64.12 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిజిస్టర్ అయ్యారని అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
డేటా లీక్లపై స్పందించిన వాట్సాప్
ఫేస్బుక్కు చెందిన వాట్సాప్ డేటా లీకేజీల వివాదంపై స్పందించింది. మెసేజ్లను ట్రాక్ చేస్తున్నట్టు వస్తున్న రిపోర్టులను వాట్సాప్ కొట్టిపారేసింది.
Samayam Telugu | Updated:
Apr 7, 2018, 03:09PM IST
డేటా లీక్లపై స్పందించిన వాట్సాప్
ఫేస్బుక్కు చెందిన వాట్సాప్ డేటా లీకేజీల వివాదంపై స్పందించింది. మెసేజ్లను ట్రాక్ చేస్తున్నట్టు వస్తున్న రిపోర్టులను వాట్సాప్ కొట్టిపారేసింది. చాలా తక్కువ మొత్తంలో డేటాను మాత్రమే కలెక్ట్ చేశామని, కానీ ప్రతి మెసేజ్ ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్గా వాట్సాప్ పేర్కొంది. భారత్లో 200 మిలియన్ యాక్టివ్ యూజర్లు కలిగి ఉన్న ఈ వాట్సాప్ సెక్యూర్ కాదంటూ పలువురు విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేశారు. యూజర్ ఒప్పందాలపై కొన్ని నియమాలపై ప్రశ్నలు సంధించారు. అయితే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపే మెసేజ్లను తాము ట్రాక్ చేయడం లేదని, చాలా తక్కువ మొత్తంలో డేటాను మాత్రమే తాము సేకరించామని, కానీ ప్రతి మెసేజ్ ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్గా వాట్సాప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
యూజర్ల గోప్యత, భద్రత తమకెంతో ముఖ్యమని చెప్పారు. ఇటీవల ఫేస్బుక్ డేటా, కేంబ్రిడ్జ్ అనలిటికాకు లీక్ అయ్యిందనే ఆరోపణలతో వాట్సాప్ యూజర్ల డేటా లీక్పై కూడా పలు రిపోర్టులు వచ్చాయి. కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ అనంతరం విమర్శకుల నుంచి వాట్సాప్ కూడా పలు విమర్శలు పొందింది. దీనికి గల ప్రధాన కారణం ఈ పాపులర్ మెసేజింగ్ ప్లాట్పామ్ను 2014లో ఫేస్బుక్ సొంతం చేసుకోవడమే. ఫేస్బుక్లో పోస్టు చేసే పోస్టింగ్స్ కంటే కూడా వాట్సాప్లోని గ్రూప్ చాట్ ఫీచరే యూజర్లకు అతిపెద్ద ముప్పు అని టాప్ అమెరికన్ టెక్నాలజీ ఎంటర్ప్రిన్యూర్ వివేక్ వాద్వా కూడా వాదిస్తున్నారు. గ్రూప్ చాట్ ఫీచర్ ద్వారా వాట్సాప్ ఫోన్ నెంబర్లు బయటికి వస్తాయన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Apr 08,2018
మూడేండ్లలో మార్కెట్లోకి ఏయిరిండియా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని విమానయాన సంస్థ ఎయిరిండి యాలో కీలక వాటాను కొనుగోలు చేయనున్న సంస్థకు సర్కారు కొత్త ట్విస్ట్ ఇవ్వనుంది. సంస్థలో కీలక వాటాను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థ.. యాజమాన్యాన్ని చేజిక్కించుకున్న కేవలం మూడేండ్లలోపే ఎయిరిండియాను మార్కెట్లలో లిస్ట్ చేయాలంటూ నిబంధనను విధించింది. సంస్థను బలోపేతం చేస్తూనే దానికి ఆర్థిక పరిపుష్టత కల్పించే క్రమంలో భాగంగానే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారి ఒకరు తెలిపారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లలో దాదాపు 76 శాతం వాటా, ఏఐఎస్ఏటీఎస్, గ్రౌండ్ హ్లాడింగ్స్ జాయింట్ వెంచర్ సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ సర్వీసెస్లలో (సాట్స్) 50 శాతం వాటా విక్రయానికి గాను సర్కారు గత వారం 'ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండం'ను విడుదల చేసిన సంగతి తెలిసింది. ఎయిరిండియాను ఏదైనా కొత్త సంస్థ కొనుగోలు చేస్తే సర్కారుకు ఆ సంస్థలో కేవలం 24% వాటా మాత్రమే మిగులనుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
గోపీచంద్ ఆక్సిజన్ అందించేందుకు రెడీ
గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్" షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటోంది.
TNN | Updated:
Feb 2, 2017, 08:27PM IST
గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్" షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటోంది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోగా.. అతి త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. "ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా "ఆక్సిజన్" చిత్రాన్ని రూపొందించాం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన "ఆక్సిజన్" ఆడియో మన తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక జ్యోతికృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ విషయం సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. త్వరలోనే ఆడియోను విడుదల చేసి అనంతరం సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం" అన్నారు. | 0business
|
bse
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై, నవంబరు 28: బెంచ్మార్క్ స్టాక్ సూచీలు ఆరంభంలోని నష్టాలను కుదించుకని స్వల్పంగా లాభాలు ఆర్జించాయి. బ్యాంకింగ్ సెక్టార్రంగ స్టాక్స్ ఆర్బిఐ తాజా సిఆర్ఆర్ మార్గదర్శకాలు ప్రతికూలం అయ్యాయి. ఎస్అండ్పి బిఎస్ఇ సెన్సెక్స్ 26,350పాయింట్లవద్ద స్థిరపడింది. 34పాయింట్లు గరిష్టం గా లాభపడితే నిఫ్టీ 50సూచీ 13పాయింట్ల ఎగువన 8128 పాయింట్లవద్ద స్థిరపడింది. మార్కెట్లలో మిడ్క్యాప్ సూచి 1శాతం, స్మాల్క్యాప్సూచీ 0.6 శాతం లాభపడ్డాయి.మార్కెట్లపరంగా మొత్తం 1660 కంపెనీలు లాభాల్లో ముగిస్తే 931 కంపెనీల షేర్లు స్వల్పనష్టాలు చవిచూసాయి. మొత్తం 174 కంపెనీ లు స్థిరంగా ట్రేడింగ్ ముగించాయి. పార్లమెంటులో ఆర్థికమంత్రి ఆదాయపు పన్నుచట్టానికి సవరణలు ప్రతిపాదించారు. లెక్కలుతేలని నల్లధనం పట్టుబడితే 30శాతం పన్ను, పదిశాతం జరిమానా, 33శాతం సర్ఛార్జి ఉంటుందని ప్రకటించారు. ఇక వివిధ సెక్టార్లు, సూచీలపరంగాచూస్తే బిఎస్ఇ టెలికాం సూచి ఈరంగంలో భారీగా పెరిగింది. నాలుగుశాతం వృద్ధిని నమోదుచేసింది. భారతి ఎయిర్టెల్ ఐదుశాతం పెరిగింది. ఇతరత్రా బిఎస్ఇ రియాల్టీ 1.91శాతం, బిఎస్ఇ విద్యుత్ 174శాతం, బిఎస్ఇ యుటిలిటీస్ 1.41శాతంపెరిగాయి. ఇక మెటల్, మైనింగ్ రంగషేర్లు జిందాల్ స్టీల్, వేదాంత, జెఎస్డబ్ల్యుస్టీల్; హిందూస్థాన్ జింక్, ఏడుశాతంవరకూ పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో రాగిధరలు పెరగడమే ఇందుకుకీలకం. ఇక మద్యంకంపెనీల షేర్లు కూడా ఊపందుకున్నాయి. జిఎం బ్రూవరీస్, పయనీర్ డిస్టిలరీస్, రవికుమార్ డిస్టిలరీస్, ఎంపీ డిస్టిలరీస్, గ్లోబస్ స్పిరిట్స్ వంటివి 20శాతం ఎగువన ముగిసాయి. కౌంటర్లలో బయ్యర్ల సంఖ్య కొనుగోలు పరిమాణం కూడా భారీగా పెరిగింది. ఇక బ్యాంకింగ్ రంగ పరంగా కొంత మందగమనం స్తబ్దత చోటుచేసున్నాయి. ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంకులు ఎక్కువ నష్టపోయాయి. ఆర్బిఐ బ్యాంకులు ఇంక్రిమెంటల్ సిఆర్ ఆర్ కొనసాగించాలన్న ఉత్తర్వులు బ్యాంకింగ్షేర్లను దిగ జార్చాయి. అనువర్తన విధానంలో సిఆర్ఆర్ అమలుకావాలని సూచించింది. ఇక ముడిచమురుధరలు రెండుశాతం తగ్గా యి. బ్యారెల్కు ముడిచమురుధరలు 46.89డాలర్లుగా నడిచాయి.
అమెరికా వెస్ట్టెక్సాస్ ఇంటర్మీడియేట్ ముడి చమురు ఫ్యూచర్లు 38సెంట్ల దిగువన ముగిసాయి. బ్యారెల్కు 45.70 డాలర్లుగా నడిచాయి. యూరోపియన్ మార్కెట్లు దిగువస్థాయిలోనే ముగిసాయి. ఇటలీలోని అనిశ్చితి, ఒపెక్ సమావేశం వివరాలపై ఒత్తిడిపెరిగింది. యూరోపియన్ స్టాక్స్ 600 0.2శాతం దిగజారాయి. ఆసియా మార్కెట్లలో చైనా షాంఘై కాంపోజిట్ 0.46శాతం, హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ 0.47శాతం, జపాన్ నిక్కీ 0.13శాతంపెరిగాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు మాత్రం 0.2శాతం దిగ జారాయి. అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ ఆర్థిక వినిమయ విధివిధానాలు, స్వదేశీయ కంపెనీల శ్రేయస్సు పరిరక్షణకు ఇచ్చే ప్రాధాన్యం వంటివి అమెరికా లో ద్రవ్యోల్బణం పెంచుతాయని అంచనాలున్నాయి. అయితే కార్పొరేట్లకు లబ్ధిచేకూరుతుందన్న వాదనలు అమెరికా స్టాక్స్ను దిగజార్చాయి. | 1entertainment
|
సినిమా ఫ్లాప్.. అయినా మంచే జరిగింది!
Highlights
అల్లు శిరీష్ థ్రిల్లర్ జోనర్ లో నటించిన చిత్రం 'ఒక్క క్షణం'. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది
అల్లు శిరీష్ థ్రిల్లర్ జోనర్ లో నటించిన చిత్రం 'ఒక్క క్షణం'. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అనుకున్న రేంజ్ లో సినిమా ఆడలేదనే చెప్పాలి. అయినా ఈ సినిమా తన కెరీర్ కు మేలే చేసిందని అంటున్నాడు అల్లు శిరీష్. అదెలా అంటే.. శిరీష్ నటించిన 'ఒక్క క్షణం' సినిమా కారణంగానే తనకు స్టార్ హీరో సూర్య సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.
దర్శకుడు కెవి ఆనంద్ ఓ యంగ్ హీరో కోసం చూస్తున్నప్పుడు శిరీష్ స్నేహితుడు ఒకరు ఆయన గురించి సిఫార్సు చేశారట. శిరీష్ నటించిన సినిమాలు తను చూడలేదని దర్శకుడు చెప్పగానే 'ఒక్క క్షణం' సినిమా డివిడి పంపించారట. ఆ సినిమా చూసే కెవి ఆనంద్ తన సినిమాలో శిరీష్ కు ఛాన్స్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారని కూడా అన్నారు.
సూర్య, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ జూలై 1నుండి మొదలుకానుంది. సెప్టెంబర్ నెలలో శిరీష్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
Last Updated 30, May 2018, 11:12 AM IST | 0business
|
internet vaartha 180 Views
న్యూఢిల్లీ : టీమిండియా స్పిన్నర్ జడేజాకి గుర్రాలంటే మహా ఇష్టం.ఇప్పటికే తన ఫామ్హౌస్లో మేలుజాతి గుర్రాలను ప్రత్యేకంగా పెంచుకుంటున్న జడేజా తీరిక సమయాల్లో వాటితో సరదాగా గడిపేందుకు అమితాసక్తి చూపిస్తుంటాడు.కాగా తాజాగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు కోహ్లీ నేతృత్వంలో టీమిండియా వెస్టిండీస్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ టీమిండియా బస చేసిన హోటల్ సమీపంలోని బీచ్లో జడేజా సేద తీరుతుండగా అటువైపు వచ్చిన ఒక గుర్రాన్ని మచ్చిక చేసుకున్నాడు.కాగా ఈ విషయంలో తాను విజయవంతమైనట్లు సామాజిక మాద్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. | 2sports
|
gautham menon’s film crew goes into troubles in turkey
టర్కీలో చిక్కుల్లో పడిన గౌతమ్ మీనన్ అండ్ టీమ్
దక్షిణాది చిత్రాల ఆడియెన్స్కి పరిచయం అక్కర్లేని పేరు దర్శకుడు గౌతమ్ మీనన్ది. ప్రస్తుతం విక్రమ్, రితు వర్మ, ఐశ్వర్య రాజేష్...
TNN | Updated:
Sep 10, 2017, 07:11PM IST
దక్షిణాది చిత్రాల ఆడియెన్స్‌కి పరిచయం అక్కర్లేని పేరు దర్శకుడు గౌతమ్ మీనన్‌ది. ప్రస్తుతం విక్రమ్, రితు వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో 'ధృవ నక్షత్రం' అనే సినిమా సెట్స్‌పై వుంది. ఈ సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లిన యూనిట్ సభ్యులు అనుకోకుండా చిక్కుల్లో పడ్డారు.
(1)My film crew,stuck at Turkey border.On the road.More than 24 hours now.Officials not letting us in with equipment inspite of legit papers
— Gauthamvasudevmenon (@menongautham) September 9, 2017
జార్జియా నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇస్తాంబుల్ వెళ్తున్న తమని టర్కీ సరిహద్దుల్లో ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు నిలిపేశారని వాపోయాడు గౌతమ్ మీనన్. ఇప్పటికే 24 గంటలు గడిచిపోయిందని, తమకి అన్నిరకాల ఇమ్మిగ్రేషన్ అనుమతి పేపర్లు వున్నాయని చెప్పినా వాళ్లు తమ మాట వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేసిన గౌతమ్ మీనన్ తమని ఎవరైనా ఆదుకోవాల్సిందిగా ట్వీట్ చేశాడు.
(2)crew traveling from Georgia to Istanbul by road. Carrying camera and costumes.Stuck now!At the border.Unable to meet officials demands.
— Gauthamvasudevmenon (@menongautham) September 9, 2017
(3)Turkey,We are looking forward to film in your beautiful country.If anybody that matters is reading this, please HELP. Worried for my crew
— Gauthamvasudevmenon (@menongautham) September 9, 2017
టర్కీ లాంటి అందమైన దేశంలో తమ సినిమా షూట్ చేయడానికే ఇక్కడికి వచ్చాం అని ట్విటర్‌లోనే విన్నవించుకున్న గౌతమ్ మీనన్.. ఈ విషయం తెలిసిన వాళ్లు ఎవరైనా తమకి సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
30 లక్షల డెబిట్ కార్డులపై సైబర్ ఎటాక్?
వివిధ బ్యాంకులకు చెందిన 30 లక్షల డెబిట్ కార్డుల వివరాలు ప్రమాదంలో పడ్డాయి.
TNN | Updated:
Oct 20, 2016, 03:34PM IST
దేశంలో ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన 30 లక్షల డెబిట్ కార్డుల వివరాలు ప్రమాదంలో పడ్డాయి. ఆ వివరాలు ఏటీఎంల ద్వారా మాల్వేర్‌కు చేరినట్టు బ్యాంకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ బీఐ బ్యాంకు తమ వినియోగదారుల్లో ఆరు లక్షల మందికి కొత్త కార్డులు ఇష్యూ చేయడానికి నిర్ణయించింది. ఇక మిగతా బ్యాంకులు వెంటనే పిన్ నెంబరును మార్చమని వినియోగదారులను కోరుతున్నాయి. అంతేకాదు పలు బ్యాంకులు పిన్ నెంబరు అవసరం లేకుండా ఆన్ లైన్‌లో చేసే అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను నిలిపివేశాయి. మొత్తం 30 లక్షల డెబిట్ కార్డుల్లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యస్ బ్యాంకులకు చెందినవే ఎక్కువ ఉన్నాయి.
యస్ బ్యాంకుకు చెందిన ఏటీఎం మిషన్లతోనే సమస్య మొదలైనట్టు తెలుస్తోంది. యస్ బ్యాంకు డెబిట్ కార్డులు తక్కువగా ఉంటాయి. ఆ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో ఇతర బ్యాంకులకు చెందిన కార్డులను కూడా పెట్టి డబ్బులు విత్ డ్రా చేసుకుంటారు. ఆ యస్ బ్యాంకు ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్కే వైరస్ సోకిందని గత జులైలో గుర్తించారు. యస్ బ్యాంకు ప్రస్తుతం తమ ఏటీఎంలో వేటికి వైరస్ సోకిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో డెబిట్ కార్డు ఏ బ్యాంకుకు చెందిందో... అదే బ్యాంకు ఏటీఎలో లావాదేవీలు జరపడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. | 1entertainment
|
Idea, Vodafone
రుణభారం తగ్గించుకునేందుకు 20% ఈక్విటీ విక్రయం!
న్యూఢిల్లీ: వొడాఫోన్ఇండియా, ఐడియా సెల్యులర్ కంపెనీల జాయింట్ వెంచర్లో 15-20 శాతం వాటాలను ప్రైవేటు ఈక్విటీ సంస్థలకు విక్రయించే ఆలోచనలో ఉంది. ఈమొత్తం తమ రుణభారం తగ్గించుకునేందుకు వినియోగిస్తుందని అంచనా. రెండు కంపెనీలు 51శాతం వాటాతో ఉం టాయి. మెజార్టీ నియంత్రణ తమపరిధిలోనే ఉంచుకుంటాయని, సంయుక్తంగా ఏర్పడే సంస్థకు లక్షకోట్ల వరకూ రుణం ఉంటుం దని అంచనావేసింది. సిఎన్బిసి టివి18 అంచనాలను చూస్తే ఈరుణభారం తగ్గిం చుకునేందుకు కంపెనీ 20శాతం వరకూ ఈక్విటీని ప్రైవేటుసంస్థలకు విక్రయించే అవకాశంఉందని చెపుతోంది.
ఐడియా సెల్యులర్ షేర్లు ఈ వార్తతో ర్యాలీతీసాయి. 3.83శాతంపెరిగి 112.45కు చేరాయి. రోజుమొత్తం గరిష్టస్థానంలో 114.1 రూపాయలకు చేరాయి. ఈనెల్లోనే భారత్ లోని రెండో అతిపెద్ద టెలికా సంస్థ వొడాఫోన్ అన్ని వాటాల విలీనం ప్రతిపాదనను ముందుకుతెచ్చింది. చైడియా సెల్యులర్తో చర్చలు ఫలంప్రదం అవుతు న్నట్లు ప్రకటించింది. రిలయన్స్జియో అందిస్తున్న ఉచిత సేవల ఆఫర్లను తట్టుకునేందుకు వీలుగా ఈ విలీనాలు జరుగుతున్నట్లు అంచనా. వొడాఫోన్, ఐడియా సంస్థ భారతి ఎయిర్టెల్ను సైతం అది గమిస్తుంది. మొత్తం 39 కోట్ల మంది చందాదారు లు ఉంటారు. రిలయన్స్జియోకు 7.2కోట్ల మంది ఇపుడు తాజాగా పదికోట్ల మందికి పెరిగారు. జాయింట్ సంస్థ 43శాతం మార్కెట్ వాటా తో ఉంటుంది. మొత్తం చందాదారుల్లో 40శాతం మంది ఉంటారని అంచనా. అంతేకాకకుండా వొడాఫోన్, ఐడియా సంయుక్త స్పెక్ట్రమ్ ఆరువేల కోట్ల వరకూ ఉన్న స్పెక్ట్రమ్ను రద్దు చేసుకుంటాయని కొన్ని అంతర్జాతీయ సంస్థలు సైతం అంచనా వేసాయి. వీటికితోడు ఆర్జియో సరికొత్తప్లాన్లు ప్రకటించడంతో టెలికాం రంగంలోని ఇతర కంపెనీలకు భారీ పోటీ అనివార్యం అవుతోంది. | 1entertainment
|
ms dhoni doing absolutely fine, why are people pointing him out: virat kohli
ఒక్క మ్యాచ్లో విఫలమైతే ధోనీ వెంటపడతారేం?: కోహ్లి
ఒక్క మ్యాచ్లో ఫెయిల్ అయినంత మాత్రాన ధోనీని టార్గెట్ చేస్తారెందుకు..? ఎప్పుడు రిటైర్ కావాలో మహీ భాయ్కు బాగా తెలుసు.
TNN | Updated:
Nov 8, 2017, 01:04PM IST
రాజ్‌కోట్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో ధోనీపై చాలా మంది విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ మ్యాచ్‌లో ధోనీ 49 పరుగులు చేసినప్పటికీ.. తొలుత కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. ఓవర్‌కు 13 పరుగులు సాధించాల్సిన తరుణంలో ధోనీ సింగిల్స్ తీయడం వల్ల కోహ్లిపై ఒత్తిడి పెరిగి అవుటయ్యాడు. ఇది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని, ధాటిగా ఆడలేకపోతున్నప్పుడు ధోనీ టీ20ల నుంచి నిష్క్రమించాలని అగార్కర్, లక్ష్మణ్ లాంటి మాజీలు సూచించారు.
ధోనీ రిటైర్ కావాలన్న వ్యాఖ్యలపై కెప్టెన్ విరాట్ కోహ్లి మండి పడ్డాడు. మిస్టర్ కూల్‌ను వెనుకేసుకొచ్చాడు. ‘‘ ధోనీ ఢిల్లీలో ధోనీ సిక్సర్ బాదాడు. దాన్ని పదే పదే టీవీల్లో చూపించారు. అప్పుడు అందరూ హ్యాపీ. కానీ ఒక మ్యాచ్‌లో విఫలమైతే రిటైర్ కావాలని అంటున్నారు. అదే మ్యాచ్‌లో పాండ్య కూడా సరిగా ఆడలేదు. నేను వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో సరిగా ఆడకపోతే నన్నెవరూ ఏమనరు. ఎందుకంటే నా వయసు 35 ఏళ్లు కాదు కదా. వయసు పై బడిందనే కారణంతో ధోనీ వెంటపడటం సరికాదు. ఎప్పుడు రిటైర్ కావాలో ధోనీకే బాగా తెలుసు. అతడికి వయసు అనేది ఓ నంబర్ మాత్రమే. ఇప్పటికీ అతడెంతో ఫిట్‌గా ఉన్నాడు. రిటైర్ అవుతాడని ఎవరూ ఊహించని టైంలోనే మూడేళ్ల క్రితమే టెస్టులకు గుడ్ బై చెప్పాడు. అటు బ్యాట్‌తో, ఇటు వ్యూహాల పరంగా జట్టు విజయంలో ధోనీ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. | 2sports
|
Hyderabad, First Published 13, May 2019, 9:19 AM IST
Highlights
టాక్ కాస్త అటూ ఇటూ గా ఉన్నా ‘మహర్షి’భాక్సాఫీస్ వద్ద భారీగానే డబ్బులు దండుకుంటున్నాడు.
టాక్ కాస్త అటూ ఇటూ గా ఉన్నా ‘మహర్షి’భాక్సాఫీస్ వద్ద భారీగానే డబ్బులు దండుకుంటున్నాడు. ఈ సినిమాకు పోటీగా భాక్సాఫీస్ దగ్గర మరో సినిమా పోటీ లేకపోవటం కూడా కలిసి వస్తోంది. దాంతో వీకెండ్ లలో పట్టు వదలకుండా స్టడీగానే ఉన్నాడు. తొలి రోజు కలెక్షన్స్ అంత కాకపోయినా రెండు, మూడో రోజు చెప్పుకోదగ్గ వసూళ్లనే తెచ్చుకున్నాడు. మూడో రోజు సైతం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 8.8 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చాడు. ఈ నేపధ్యంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో పరిస్దితి ఏమిటో చూద్దాం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాలలోనూ మూడు రోజుల్లోనూ దాదాపు నలభై కోట్లు వరకూ మహర్షి కలెక్ట్ చేసాడు. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా బాగా స్ట్రాంగ్ గా ఉండటం కలిసివచ్చే అంశం.
సినిమాకు ప్లాఫ్ టాక్ రాకపోవటం, వేసవి శెలవులు ఈ సినిమా కలెక్షన్స్ కు బాగా బూస్ట్ గా పనిచేస్తున్నాయి. టాక్ అంత గొప్పగా లేకపోయినా ఈ స్దాయి కలెక్షన్స్ తేవటం అంటే మామూలు విషయం కాదు. దానికి తోడు దిల్ రాజు టీమ్ ..ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తోంది. మొత్తం లెక్కలు తేలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ యాభై కోట్లు షేర్ వచ్చి ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.
మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మే 9న వరల్డ్ వైడ్ గా విడుదలయింది. రైతుల సమస్యల ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్, జగపతి బాబు, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
Last Updated 13, May 2019, 9:19 AM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
చైతు సరసన మళ్లీ ఆ బ్యూటీ నటించనుందా?
అక్కినేని హీరో నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ రెండు చిత్రాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
TNN | Updated:
Aug 8, 2016, 06:50AM IST
అక్కినేని హీరో నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ రెండు చిత్రాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల తరువాత చైతు, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మొదట సినిమాలో హీరోయిన్ గా సమంతను అనుకున్నారు. కానీ చైతు, సమంతలపై వస్తోన్న ప్రేమ వార్తల కారణంగా సమంతను తప్పించి ఆ స్థానంలోకి మరో హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బాగా వినిపించింది. కానీ ఈ విషయాన్ని దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఖండించాడు. సినిమా టైటిల్ అందరూ అనుకుంటున్నట్లుగా 'కళ్యాణం' కాదని కూడా స్పష్టం చేశాడు. అయితే చైతు సరసన హీరోయిన్ గా ఎవరబ్బా..? అని ఆలోచనలు మొదలయ్యాయి. చైతుతో 100% లవ్, తడాఖా వంటి చిత్రాల్లో మెరిసిన తమన్నా అయితే బావుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ప్రస్తుతం తమన్నా వరుస బాలీవుడ్ ఆఫర్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో మరి చైతుకి ఓకే చెప్తుందో లేదో చూడాలి. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఐపీఎల్ ఫైనల్లో ఈరోజు ‘హెలికాప్టర్స్’ పోటీ..!
వాంఖడే వేదికగా ఇటీవల జరిగిన లీగ్ మ్యాచ్లో ధోనీ ముందే హెలికాప్టర్ సిక్స్ కొట్టిన హార్దిక్ పాండ్య.. అనంతరం డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి మరీ ‘ధోనీ భాయ్ నా హెలికాప్టర్ షాట్ ఎలా ఉంది’ అని అడగ్గా.. ‘చాలా బాగుంది’ అని అతను సమాధానమిచ్చినట్లు తెలిపాడు.
Samayam Telugu | Updated:
May 12, 2019, 04:26PM IST
ఐపీఎల్ ఫైనల్లో ఈరోజు ‘హెలికాప్టర్స్’ పోటీ..!
హైలైట్స్
ఉప్పల్ వేదికగా ఈరోజు రాత్రి ముంబయి, చెన్నై మధ్య ఫైనల్
సీజన్ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్లోనూ హెలికాప్టర్ షాట్ ఆడుతున్న హార్దిక్
ఈరోజు ధోనీ ముందు మరోసారి హెలికాప్టర్ షాట్ ఆడే అవకాశం
ఫైనల్లో ఏ జట్టు గెలిచినా.. అరుదైన ఘనత
ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ఉప్పల్లో ఈరోజు రాత్రి జరగబోతున్న ఫైనల్ మ్యాచ్లో మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య.. హెలికాప్టర్ షాట్లతో పోటీపడబోతున్నారు. సీజన్ ఆరంభం నుంచి ధోనీతో పోటాపోటీగా హెలికాప్టర్ షాట్స్ ఆడుతున్న హార్దిక్ పాండ్య.. ఈరోజు మరోసారి తన గురువు ముందు బ్యాటింగ్ స్టామినాని ప్రదర్శించనున్నాడు. ఇప్పటికే మూడేసి సార్లు టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు.. ఈరోజు ఫైనల్లో గెలిచి నాలుగో టైటిల్ గెలిచిన తొలి జట్టుగా రికార్డుల్లో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
తాజా సీజన్లో 14 మ్యాచ్లాడిన ధోనీ 137.54 స్ట్రైక్రేట్తో 414 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉండగా.. 22 ఫోర్లు, 23 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు 15 మ్యాచ్లాడిన హార్దిక్ పాండ్య.. 193.00 స్ట్రైక్రేట్తో 386 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధశతకమే ఉన్నా.. 27 ఫోర్లు, 28 సిక్సర్లు ఉండటం కొసమెరుపు.
వాంఖడే వేదికగా ఇటీవల జరిగిన లీగ్ మ్యాచ్లో ధోనీ ముందే హెలికాప్టర్ సిక్స్ కొట్టిన హార్దిక్ పాండ్య.. అనంతరం డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి మరీ ‘ధోనీ భాయ్ నా హెలికాప్టర్ షాట్ ఎలా ఉంది’ అని అడగ్గా.. ‘చాలా బాగుంది’ అని అతను సమాధానమిచ్చినట్లు తెలిపాడు. ఈరోజు ఫైనల్లోనూ ఈ ఇద్దరు క్రికెటర్లు హెలికాప్టర్ షాట్లతో అభిమానుల్ని అలరించే అవకాశం ఉంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
ఇకపై సినిమాల్లో నో సిగరెట్, నో మందు.. హద్దు దాటితే ఏ సర్టిఫికెట్
Highlights
ఇకపై సినిమాల్లో మందు, సిగరెట్ బంద్
బాటిల్ చూపడం తప్పనిసరి అంటే ఏ సర్టిఫికెట్ ఇస్తామంటున్న సీబీఎఫ్సీ
కారణం లేకుండా మందు, పొగ బెడితే కట్ చేస్తామంటున్న సెన్సార్ బోర్డు
మన హీరోలు స్టైలిష్ గా దమ్ము కొట్టి... దుమ్మురేపుతుంటే.. మన జనం క్లాప్స్ కొట్టి కిక్కు పొందుతుంటారు. ఒక హీరో దమ్ముగానీ కొట్టాడంటే... హీరోయిజం మరో లెవెల్ కు పోతుంది. అసలు సినిమాల్లో ఒక్క పబ్ సీనో, బార్ సీనో, కనీసం ఓ సిగరెట్ తాగే సీనో లేకుండా మనం సినిమా చూసి వుండం. మన హీరోహీరోయిన్లు చాలా మంది ఇలా సిగరెట్టో, మందో, మరోటో తీసుకుంటూ.. స్క్రీన్ పై మనల్ని అలరించినవారే.
కానీ ఇకపై అది జరగదు. అప్పుడెప్పుడో తీసిన దేవదాస్ సినిమా రీమేక్ చేయాలన్నా... మందో, సిగరెట్టో తాగే సీన్స్ వాటిలో వుండవు. ఎందుకంటే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి) తాజాగా నిషేధం విధించింది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో లిక్కర్ బాటిల్ వాడాల్సి వచ్చినా దాన్ని బ్లర్ చేసి వాడాలి తప్ప నేరుగా చూపేందుకు వీల్లేదు.
కొన్ని లక్షల మంది అభిమానులుండే నటీనటులు మద్యం తాగటం, సిగరెట్ లాంటివి తాగడం కుదరదని సెన్సార్ బోర్డు సభ్యుడొకరు తేల్చి చెప్పారు. ఒకవేళ తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చినా దానికి సరైన కారణం కనిపించకుంటే సెన్సార్ బోర్డు కత్తెరకు పని చెప్తుంది. ఒకవేళ అల్కహాల్ తో కూడిన సీన్స్ పెట్టాలనుకుంటే ఏ సర్టిఫికెట్ తో సినిమాకు సర్టిఫికెట్ తీసుకోవాల్సి వుంటుంది.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST | 0business
|
Midhali
రల్డ్ కప్ క్వాలిఫయర్స్ మహిళల జట్టు కెప్టెన్గా మిథాలీ రాజ్
న్యూఢిల్లీ: ఐసిసి వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో భారత మహిళల జట్టు కెప్టెన్గా మిథాలీరాజ్ వ్యవహరిం చనుంది.జూన్ 24న ఇంగ్లండ్ లో మొదలుకా నున్న వన్డే వరల్డ్ కప్కు అర్హత సాధించేందుకు ఫిబ్రవరిలో శ్రీలంక రాజధాని కొలంబోలో అర్హత టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో భాగంగా 7 నుంచి 21వరకుమ్యాచ్లు జరగనున్నాయి. భారత్, పాకిస్థాన్,దక్షిణాఫ్రికా,శ్రీలంకత పాటు టోర్నీలో మొత్తం 10 జట్టు పాల్గొంటున్నాయి.ఈ టోర్నీలో భారత మహిళల జట్టు మిథాలీ రాజ్ సారథ్యంలో బరిలో దిగనుంది.జూన్లో జరిగే మహిళల వరల్డ్ కప్కు ఈ టోర్నీ నుంచి నాలుగు జట్టు అర్హత సాధించనున్నాయి.గత సంవత్సరం నవంబర్లో జరిగిన మహిళల చాంపియన్షిప్స్లో టాప్-4లో నిలిచిన ఆస్ట్రేలియా,ఇంగ్లండ్,న్యూజిలాండ్, వెస్టిం డీస్జట్లుఇప్పటికే వరల్డ్కప్కు అర్హత సాధించాయి. టీమిండియా జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్),ఏక్లా బిష్త్,రాజేశ్వరీ గయాక్వాడ్, జులన్ గోస్వామి, హర్మాన్ప్రీత్కౌర్, వేద కృష్ణమూర్తి, మోనా మిష్రమ్,శిఖపాండే, సుకన్యా పాండే,దీప్తి శర్మ,ఎండి తిరుక్షమిని,దేవికా వైద్య,సుష్మా వర్మ, పునమ్యాదవ్. నలుగురు మహిళా అంపైర్లు: మిథాలీ రాజ్ సారథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు పిబ్రవరి 7 నుంచి శ్రీలంకలో జరుగబోయే ప్రపంచ కప్ అర్హత టోర్నీ పాల్గొననుంది.ఈ టోర్నీలో నలు గురు మహిళలు అంపైర్లుగా బాధ్యతలు నిర్వ హించనున్నారు.భవిష్యత్తులో మహిళా క్రికెట్కు మరింత ప్రోత్సాహం లభించేందుకు తమ బాధ్య తగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐసిసి నిర్వా హకులు తెలిపారు. న్యూజిలాండ్కు చెందిన క్యాథలీన్ క్రాస్ సార థ్యంలో ఇంగ్లండ్కు చెందిన సూ రెడ్పిర్న్,ఆస్ట్రేలి యాకు చెందిన క్లేరి పాలోసక్,వెస్టిం డీస్కు చెందిన జాక్వలీన్ విలియమ్స్ అంపైరింగ్ చేయనున్నారు. భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, షవువా న్యూగి నియా, పాకిస్థాన్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, థా§్ులాండ్, జింబాబ్వే జట్ల్లు అర్హత మ్యాచ్లు ఆడనున్నాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు జూన్ 24న ఇంగ్లండ్లో ఆరంభ మయ్యే వన్డే ప్రపంచ కప్కు అర్హత సాధిస్తాయి. మొత్తం 9మంది అంపైరింగ్ బాధ్యతలు నిర్వహి స్తుండగా అందులో నలుగురు మహిళలు.గ్రేమ్ లూబ్రూయ మ్యాచ్ రిఫరీగా ఉన్నారు. | 2sports
|
ప్లేబాయ్గా మారనున్న అఖిల్!
Highlights
అక్కినేని వారసుడు అఖిల్ త్వరలోనే ప్లేబాయ్గా కనిపించబోతున్నాడు.
అక్కినేని వారసుడు అఖిల్ త్వరలోనే ప్లేబాయ్గా కనిపించబోతున్నాడు. అఖిల్, హలో సినిమాలతో తెలుగు ప్రేక్షకులను నిరాశ పరచిన అఖిల్ ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి ప్రేక్షకులను మెప్పించేలా మూడో సినిమాకు సిద్ధమైపోయాడు. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది.
ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్యన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంగీతాన్ని తమన్ అందించనున్నారు. ఇదొక ప్రేమ కథా చిత్రం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి యూకేలో షూటింగ్ ప్రారంభమైంది.
శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్పై వస్తున్న ఈ 25వ సినిమాలో నటిచండం తనకెంతో ఆనందంగా ఉందని అఖిల్ చెప్పారు. ఈ చిత్రంలో అఖిల్ ప్లేబాయ్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ని హైదరాబాద్లో షూట్ చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువాలని భావిస్తున్నారు.
Last Updated 22, Jun 2018, 10:43 AM IST | 0business
|
Suresh 74 Views india vs srilanka 3rd test
india vs srilalanka 3rd test
పల్లెకలె: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రెండో రోజు హార్థిక్ పాండ్యా శతకం(108)
సాధించడంతో కోహ్లీ సేన 122.3 ఓవర్లలో 487 పరుగులకు ఆలౌటయ్యింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన
ఆతిథ్య శ్రీలంక జట్టు టీ విరామ సమయానికి 14ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 61పరుగులు సాధించింది. | 2sports
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
Thu 25 Aug 03:33:39.290585 2016
న్యూఢిల్లీ
మాకు విలీనపు 'ఐడియా' లేదు!
Thu 25 Aug 03:33:44.822907 2016
ముంబయి : వొడాఫోన్తో విలీనం అయ్యే యోచన ఏదీ లేదని ఐడియా సెల్యూలర్ ప్రకటించింది. విలీన వార్తలను ఆ సంస్థ ఖండించింది. దీంతో మార్కెట్లో ఐడియా షేర్లు ఒక
Thu 25 Aug 03:33:51.233076 2016
పుణె
స్టాక్ మార్కెట్లలో అదే స్తబ్ధత!
Thu 25 Aug 03:33:58.802138 2016
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం తీవ్ర ఒడుదొడుకులు నమోదయ్యాయి. అమెరికా వడ్డీ రేట్లను పెంచే విషయమై నిర్ణయాన్ని వెల్లడించనుండడం, డెరివెటివ
Wed 24 Aug 02:23:56.589398 2016
వాణిజ్య విభాగం
శాంసంగ్ నుంచి చౌక 4జీ ఫోన్
Wed 24 Aug 02:24:01.289548 2016
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్ ఇండియా మంగళవారం భారత మార్కెట్లోకి చౌక 4జీ ఫోన్ను విడుదల చేసింది. దేశంలో 4జీ విప్లవానికి రంగం సిద
మార్కెట్లోకి కొత్త హ్యుందారు ఎలంత్రా
Wed 24 Aug 02:24:08.015186 2016
న్యూఢిల్లీ:హ్యుందారు మోటార్ ఇండియా (హెచ్ఎంఐ) భారత మార్కెట్లోకి సరి కొత్త ఎలంత్రా కారును విడుదల చేసింది. ఎలంత్రా ఆరో ఎడిషన్గా ఈ సెడాన్ కార్లను మార్కెట్
Wed 24 Aug 02:24:16.278301 2016
ముంబై
బలహీన పడ్డ రూపాయి
Tue 23 Aug 04:06:36.899199 2016
ముంబయి: రూపాయి విలువ పతనమైంది. డాలర్తో పోలిస్తే 14 పైసలు తగ్గి రూ.67.19తో నెల కనిష్టానికి చేరింది. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్కు డిమాండ్ ఏర్పడటం, ఈక్విటీ
ఎంపిక అందుకే : డీబీఎస్
Tue 23 Aug 04:03:37.196086 2016
సింగపూర్ : భారత రిజర్వ్ బ్యాంకు తదుపరి గవర్నర్గా కేంద్రప్రభుత్వం ఉర్జిత్ పటేల్ను నియమించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సానుకూలత వ్యక్తమవుతోంది. దేశ ఆర్థ
4% పెరిగిన ఎన్టీపీసీ లాభాలు
Tue 23 Aug 04:06:45.199999 2016
న్యూడిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ జూన్తో ముగిసిన త్రైమాసికానికి మెప్పించే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో సంస్థ ని
మళ్లీ పడిపోయిన వెండి ధర
Tue 23 Aug 04:06:49.730436 2016
ఢిల్లీ :బంగారం, వెండి ఆభరణాల ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడి ఉంటాయి. పండుగలు, పెండ్లిళ్లలో ఈ ఆభరణాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆఫర్లు పెట్టినప్పుడు కూడా ఈ
రెనో క్విడ్ 1.0 వచ్చేసింది
Tue 23 Aug 04:06:54.733277 2016
ఢిల్లీ : రెనో సంస్థ నుంచి విడుదలైన కార్లలో ఇటీవల బాగా పాపులర్ అయిన క్విడ్ మోడల్లో మరో వెర్షన్ విడుదలైంది. రెనో క్విడ్ 1.0 పేరుతో విడుదల చేసిన ఈ వెర్షన్ ధర రూ.3.83 ల
పనితీరు బాగా లేకపోతే..ఎవరైనా ఒక్కటే
Tue 23 Aug 04:07:02.579599 2016
బెంగళూరు: ఫ్లిప్కార్ట్లో ప్రతి ఉద్యోగిని ఒకేలా చూస్తారని, పనితీరు బాగా లేకపోతే వారు ఎంతటివారైనా సరే విధుల నుంచి తొలగిస్తారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ అన్నార
డీలర్ల వేటలో హోండా ...
Tue 23 Aug 04:06:31.052674 2016
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన టూ వీలర్స్ కంపెనీహోండా మోటార్ సైకిల్ అంఢ్ స్కూటర్ టండియా (హెచ్ఎవ్ంఎస్ఐ) ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తుంది. ఈ ఏ
మూడు లక్షలు దాటితే...అంతే
Tue 23 Aug 03:58:38.39619 2016
న్యూఢిల్లీ : నల్లధనానికి చెక్ పెట్టే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బందం (
ఇతర కంపెనీల కనెక్షన్లు వాడకండి!
Tue 23 Aug 03:57:54.449972 2016
న్యూఢిల్లీ: సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరూ ఇతర టెలికాం సంస్థల మొబైల్ కనెక్షన్లను వాడడం నిలిపివేసి.. జియో సేవలకు మారాలని రిలయన్స్ ఇండిస్టీస్ తన ఉద్యోగులకు
ఇక జనవరినాటికే బడ్జెట్!
Mon 22 Aug 03:08:04.857953 2016
న్యూఢిల్లీ: దేశ ప్రస్తుత ఆర్థిక విధానాలలో సమూల మార్పులు తీసుకువచ్చే ప్రక్రయను వేగవంతం చేసిన సర్కారు తాజాగా బడ్జెట్ విషయంలో నూతన విధానాన్ని అవలంభించాలని
సొంతింటి కల నెరవేర్చేలా కొత్త పథకం
Mon 22 Aug 03:08:10.911849 2016
న్యూఢిల్లీ: సగటు ఉద్యోగి సొంతింటి కలను నెరవేర్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుందని కేంద్ర కార్మికశ
విస్తార ప్రచారకర్తగా దీపిక
Mon 22 Aug 03:08:16.139239 2016
ముంబయి: దేశీయ విమానయాన సంస్థ 'విస్తారా ఎయిర్లైన్స్' తమ సంస్థ ప్రచారకర్తగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను నియమించింది. టాటా సన్స్ (51 శాతం),
సరైన సమయంలో ఐపీఓకు: గోఎయిర్
Mon 22 Aug 03:08:21.493912 2016
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగ విమానయాన సంస్థ 'గోఎయిర్' తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా దాదాపు 500 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. దీనికి సంబంధించిన ప్రణ
పీవీ గొప్ప ఆర్థిక సంస్కర్తేమీ కాదు!
Sun 21 Aug 06:49:35.336413 2016
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పండిట్ నెహ్రూ, పీవీ నరసింహారావులపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందరూ అనుకుంటున్నట్లుగా మాజీ
ఉర్జిత్కే ఆర్బీఐ 'రాజ' కంకణం
Sun 21 Aug 06:49:42.467204 2016
న్యూఢిల్లీ: 'భారతీయ రిజర్వు బ్యాంక్' (ఆర్బీఐ) నూతన గవర్నగ్ నియామకంపై ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా కొనసాగుతున్న ఉర్జిత్ పటేల్ను శనివారం
రూ.8 లక్షల కోట్లకు ఎస్బీఐ ఆస్తులు
Sun 21 Aug 06:49:47.861887 2016
ముంబయి: అనుబంధ బ్యాంకుల విలీనం మూలంగా 'భారతీయ స్టేట్ బ్యాంక్' (ఎస్బీఐ) ఆస్తులు భారీగా పెరగనున్నాయి. విలీన ప్రతిపాదన అమలులోకి వస్తే ఎస్బీఐ ఆస్తులు మరో రూ.8 లక్షల
విదేశీ మార్కెట్లపై గోద్రేజ్ దృష్టి
Sun 21 Aug 06:49:54.133977 2016
కోల్కతా: ప్రముఖ ఎఫ్ఎంసీజీ, గృహోపక రణాల ఉత్పత్తుల తయారీ కంపెనీ గోద్రేజ్ దేశీయంగా విస్తరించడంతో పాటు విదేశీ మార్కె ట్లలోనూ పాగా వేయ డానికి ప్రణాళికలను రూపొంది స్తోంది.
రిలయన్స్ నుంచి 'జియో ఫై'
Sun 21 Aug 06:49:59.981031 2016
హైదరాబాద్: రిలయన్స్ జియో సరికొత్త 4జీ వైఫై పరికరం 'జియో ఫై'ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.2899గా నిర్ణయించింది. ఈ హాట్స్పాట్ సాధనంతో ఏక కాలంలో 10 నుంచి
స్థిరాస్తి రంగంలో 7.5 కోట్ల మందికి ఉపాధి
Sat 20 Aug 07:49:47.216276 2016
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో దేశ ఆర్థికాభివృద్ధిలో స్థిరాస్తి, నిర్మాణ రంగాలు కీలక పాత్ర పోషించనున్నట్లుగా కేపీఎంజీ ఒక నివేదికలో పేర్కొంది. 2022 నాటికి ఈ రం
చేతులెత్తేసిన ఆన్లైన్ పోర్టల్ 'ఆస్క్మీ'!
Sat 20 Aug 07:49:53.747917 2016
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా నిధుల సమస్యను ఎదుర్కొంటున్న వినియోగదారు సేవల ఆధారిత సెర్చ్ ఇంజిన్ 'ఆస్క్మీ' ఊహించినట్లుగానే శుక్రవారం చేతులెత్తేసింది. త
'తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్' సందడి
Sat 20 Aug 07:49:59.13623 2016
ముంబయి: విలీన ప్రతిపాదన నేపథ్యంలో 'తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్', 'ఇండియన్ హోటల్స్ కంపెనీ'ల షేర్లు శుక్రవారం మార్కెట్లో సందడి చేశాయి. టాటా గ
లీకో నుంచి కంటెట్ ఆధారిత టీవీలు
Sat 20 Aug 07:50:05.585028 2016
నవతెలంగాణ,వాణిజ్య విభాగం: టెలివిజన్ల (టీవీల) చరిత్రలో విప్లవాత్మక మార్పులకు తెర తీస్తూ ప్రముఖ ఇంటర్నెట్, టెక్నాలజీ దిగ్గజ సంస్థ లీకో భారత మార్కెట్
స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
Sat 20 Aug 07:50:10.940675 2016
ముంబయి: ప్రపంచ వృద్ధిరేటులో స్తబ్ధత చోటు చేసుకుందన్న అమెరికా ఫెడరల్ రిజర్వు అధికారుల అంచనాలకు తోడు ఐరోపా సమాజంలోని పరిణామాలతో దేశీయ స్టాక్
కొత్తగా 2,600 పెట్రోల్ బంకులు: ఎస్సార్
Sat 20 Aug 07:50:16.926685 2016
ముంబయి: రానున్న ఏడాది, ఏడాదిన్నర కాలంలో కొత్తగా 2,600 పెట్రోలు బంకులను (ఫిల్లింగ్ స్టేషన్లను) ఏర్పాటు చేయనున్నట్లుగా ఎస్సార్ ఆయిల్ వెల్లడించింది. ప
ఆర్బీఎల్ ఇష్యూకు స్పందన భేష్!
Sat 20 Aug 07:15:29.428667 2016
న్యూఢిల్లీ: ఆర్బీఎల్ బ్యాంకు పబ్లిక్ ఇష్యూ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు 66 శాతం మేర సబ్స్క్రిప్షన్ లభించింది. మొత్తం ఆఫర్ కింద 3.79 కోట్ల షే
మరో ముందడుగు!
Fri 19 Aug 07:05:48.977495 2016
న్యూఢిల్లీ: బ్యాంకుల ఏకీకరణ విషయమై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదరువుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఈ దిశగా చర్యలను ముమ్మరం చేస్తూనే ఉన్నారు. 'భారతీయ స్టేట్
సుల్తాన్పూర్లో భారీ ప్లాస్టిక్ పార్క్: కేటీఆర్
Fri 19 Aug 07:05:55.012634 2016
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలంగాణ రాష్ట్రాన్ని 2020 నాటికి ఐటీ, ఎలక్ట్రానిక్, ఫార్మా, ఏరోస్పేస్ తదితర వ్యాపార, వాణిజ్య రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్ల
ఎస్బీహెచ్ విలీనానికి తెలంగాణ వ్యతిరేకం
Fri 19 Aug 07:06:00.253752 2016
హైదరాబాద్: 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్'ను (ఎస్బీహెచ్) మాతృ సంస్థ 'భారతీయ స్టేట్ బ్యాంక్'లో (ఎస్బీఐలో) విలీనం చేసే ప్రతిపాదనకు తెలంగాణ వ్యతిరేకమని రాష్ట్ర ఆర్థ
రిలయన్స్కు సర్కారు మరో షాక్!
Fri 19 Aug 07:06:06.837615 2016
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ (రిల్)పై ప్రభుత్వం మరో 380 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2550 కోట్లు) జరిమానాను విధించింది. కేజీ-డి6 క్షేత్రంలో సహజ గ్యాస్ ఉత్
ఇండియా సిమెంట్ లాభాల్లో 16% వృద్ధి
Fri 19 Aug 07:06:11.854059 2016
న్యూఢిల్లీ: జూన్తో ముగిసిన త్రైమాసికానికి ఇండియా సిమెంట్స్ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఇండియా సిమెంట్స్ లిమి
2న బ్యాంకు ఉద్యోగుల సమ్మెబాట!
Fri 19 Aug 07:06:18.499753 2016
న్యూఢిల్లీ: ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలు, చేటు చేసే కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 2న నిర్వహించనున్న 'అఖిల భారత సాధారణ సమ్మె'లో బ్యాంకు ఉద్యోగులు కూడా
ఎయిర్టెల్లో వాటా కొన్న సింగ్టెల్
Fri 19 Aug 03:17:39.570537 2016
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్లో 7.39 శాతం వాటాను సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ సంస్థ సింగ్టెల్ కొనుగోలు చేసింది. దాదాపు 659.5 మిలియన్ డాలర్ల | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
టీసీఎస్ తాత్కాలిక ఛైర్మన్గా ఇషాత్ హుస్సేన్
కొన్ని రోజుల క్రితం టాటా గ్రూప్ సంస్థ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే.
TNN | Updated:
Nov 10, 2016, 03:36PM IST
కొన్ని రోజుల క్రితం టాటా గ్రూప్ సంస్థ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో తాత్కాలిక ఛైర్మన్ రతన్ టాటా నియమితులయ్యారు. టాటా గ్రూప్ కు చెందిన అది పెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టన్సీ సర్వీసెస్. టీసీఎస్‌కు కూడా గురువారం తాత్కాలిక ఛైర్మన్‌ను నియమిస్తున్నట్టు టాటా సన్స్ ప్రకటించారు. టీసీఎస్ బోర్డు డైరెక్టర్లలో ఒకరైన ఇషాత్ హుస్సేన్‌ను తాత్కాలిక ఛైర్మన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 24న టాటా సన్స్ మిస్త్రీని ఛైర్మన్ పదవి నుంచి తొలగించాయి. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'అర్జున్ రెడ్డి' డైరెక్టర్కి బంపర్ ఆఫర్ ?
అర్జున్ రెడ్డి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్గా అతడికి మొదటి...
TNN | Updated:
Oct 31, 2017, 10:43PM IST
అర్జున్ రెడ్డి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్‌గా అతడికి మొదటి సినిమానే అయినప్పటికీ.. ఎంతో అనుభవం వున్న దర్శకుడిగా ఆ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అతడిని సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకునేలా చేసింది. తెలుగునాట సూపర్ హిట్ అయిన ఈ సినిమాపై ఇతర సినీ ప్రముఖుల కన్ను పడటం, ఆల్రెడీ తమిళంలో స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తమిళ రీమేక్ చేయడానికి చకచకా ఏర్పాట్లు సైతం జరిగిపోతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా వినిపిస్తున్న బాలీవుడ్ టాక్ ఏంటంటే.. అర్జున్ రెడ్డి సినిమాపై మనసు పారేసుకున్న పలువురు బాలీవుడ్ ఫిలింమేకర్స్ ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగతో కాంట్రాక్ట్ సైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. అంతేకాకుండా అర్జున్ రెడ్డి సినిమాను తెలుగుకన్నా హిందీలో మరింత బోల్డ్‌గా తెరకెక్కించే స్వేచ్ఛ సైతం వుంటుందని సూచించారట సదరు నిర్మాతలు.
ఒకవేళ ఈ ఆఫర్‌కి సందీప్ రెడ్డి వంగ కానీ ఒప్పుకుంటే, మొట్టమొదటి సినిమాతో హిట్ కొట్టి రెండో సినిమాకే బాలీవుడ్‌లో అడుగుపెట్టే బంపర్ ఆఫర్‌ని దక్కించుకున్న డైరెక్టర్ అవడం ఖాయం. | 0business
|
ఆన్లైన్లో రూ.25,000 కోట్ల వ్యాపారం
- వచ్చే పండుగ సీజన్లో అంచనా : అసోచామ్ సర్వే
న్యూఢిల్లీ : త్వరలో ప్రారంభం కానున్న పండుగ సీజన్లో ఆన్లైన్ వ్యాపారం 25 శాతం పైగా పెరిగి రూ.25,000 కోట్లకు చేరనుందని ప్రముఖ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ అసోచామ్ ఒక సర్వేలో అంచనా వేసింది. పండుగల నేపథ్యంలో కంపెనీలు సరికొత్త ఆఫర్లతో కొనుగోలుదారుడే లక్ష్యంగా ప్రకటించే ఆఫర్లు తమ వ్యాపార వృద్ధికి దోహదం చేయనున్నాయని పేర్కొంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.20,000 కోట్ల వ్యాపారం జరిగిందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రవత్ పేర్కొన్నారు. దీంతో పోల్చితే ప్రస్తుత పండుగ సీజన్లో మరో 25 శాతం అమ్మకాలు పెరుగనున్నాయని అంచనా వేశారు. ఇక శనివారంతో ప్రారంభం కానున్న నవరాత్రి సందర్భంగా రికార్డు స్థాయిలో కొనుగోలు నమోదు అంచనాలు ఉన్నప్పటికీ..'పితృపక్ష' కారణంగా చాలా మంది కొనుగోలు ప్రణాళికలు వాయిదా వేసుకోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడినట్టు అసోచామ్ పేర్కొంది. ప్రముఖ నగరాల్లోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న 25-40 వయస్సున్న 2,500 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ సర్వేలో పాల్గొన్నట్టు అసోచామ్ వెల్లడించింది. ఈ సర్వే ముంబయి, ఆహ్మాదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ(ఎన్సీిఆర్), హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కొల్కత్తా, లక్నో నగరాల్లో చేసినట్టు వివరించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 60శాతం మంది గంటల కొద్ది లైన్లో నిలబడి షాపింగ్ చేసేదాని కంటే ఆన్లైన్ షాపింగ్కు మొగ్గుచూపుతుండగా..మిగిలిన వారు నేరుగా ఔట్లెట్స్కి వెళ్లానున్నట్టు ఈ రిపోర్టు నివేదించింది. ఈ-కామర్స్ సంస్థల్లో లభించే బట్టల దగ్గర నుంచి కాస్మాటిక్స్, జ్యువెలరీ, మొబైల్స్, ల్యాప్టాప్, టెలివిజన్ వస్తువులపై లభ్యమయ్యే డిస్కౌంట్స్ను బట్టి వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇకపోతే ముఖ్యంగా పేమెంట్స్ పద్ధతి, డెలివరీ, మంచి ఆఫర్ల లాంటి పలు అంశాలు కీలకం కానున్నట్టు ఈ సర్వేలో తెలింది. ఈ విశ్లేషణలో భాగంగా అసోచామ్ వివిధ రంగాల నిపుణలతో పాటు ఆధునిక పరిశోధన, అనాలటిక్స్, డిజిటల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Nov 25,2016
స్థిరాస్తి ధరలు 30% దిగిరావచ్చు!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో గృహాల ధరలు 30 శాతం మేర దిగిరావచ్చని 'ప్రాప్ ఈక్విటీ' ఒక నివేదికలో అంచనా కట్టింది. దేశంలోని ప్రధానమైన 42 పట్టణాల్లో వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో స్థిరాస్తుల ధరలు తగ్గనున్నాయని పేర్కొంది. దీంతో స్థిరాస్తి మార్కెట్ సుమారు రూ.8 లక్షల కోట్ల విలువను కోల్పోనుందని పేర్కొంది. 2008 నుంచి విక్రయించిన, విక్రయించని ఆస్తులపై ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. దేశంలోని 42 పట్టణాల్లోని 22,202 డెవలపర్లు 83,650 ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా సర్వే చేశాఖ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లుగా తెలిపింది. రానున్న కాలంలో ఇప్పటి వరకు విక్రయించని ఆస్తుల విలువ 30 శాతం మేర పడిపోనుందని ఈ పరిశోధనలో తెలిందని వివరించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 49,42,637 ఇండ్లు నిర్మించి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 17, Oct 2018, 9:32 AM IST
Highlights
మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన కౌశల్ ఇప్పుడు బుల్లితెరకే పరిమితమయ్యారు. బిగ్ బాస్ షో విజేతగా నిలిచి తనకంటూ ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.
మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన కౌశల్ ఇప్పుడు బుల్లితెరకే పరిమితమయ్యారు. బిగ్ బాస్ షో విజేతగా నిలిచి తనకంటూ ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.
అతడు హౌస్ లో ఉండగా అతడి కోసం ఏర్పాటైన కౌశల్ ఆర్మీ ర్యాలీలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు వంటి పనులు చేశారు. టైటిల్ గెలిచిన తరువాత కౌశల్ వచ్చిన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్స్ కోసం వినియోగిస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పుడు తనకున్న ఫ్యాన్స్ బేస్ తో నటుడిగా రాణించాలని భావిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ... ''మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా తరువాత సినిమాలు చేయడం మానేశాను.
కానీ ఇప్పుడు సినిమాలో లీడ్ రోల్స్ కోసం చూస్తున్నా.. ఆ విధంగా నా టాలెంట్ నిరూపించుకునే అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. విలన్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి.. | 0business
|
పసిడి అంతర్జాతీయ డిమాండ్ 2% మాత్రమే!
న్యూఢిల్లీ,: అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 2016వ సంవత్సరం లో రెండుశాతంపెరిగి 4309 టన్నులకు చేరింది. పసిడి ఆధారిత ఎక్ఛేంజి ట్రేడెడ్ ఫండ్స్, కడ్డీలు, నాణేలపరంగా చైనాలోను గిరాకీపెరగడమే ఇందుకు కారణమని ప్రపంచ పసిడి మండలి వెల్లడించింది. ప్రపంచ పసిడిమండలి గణాంకాల ప్రకారంచూస్తే 2015లో బంగారం డిమాండ్ 4216 టన్నులుగా ఉంది. 2013 తర్వాత గత ఏడాదే డిమాండ్ కొంత మేర పెరిగిందని మండలి అంచనా. పసిడిపై నిర్వ హిస్తున్న ఇటిఎఫ్లలోకి పెట్టుబడులు ఎక్కువ రావ డమే ఇందుకు కీలకమని మొత్తం 532 టన్నుల వరకూ ఇటిఎఫ్ కొనసాగినట్లు అంచనా. ఇన్వెస్టర్లు కూడా భవిష్యత్తు ద్రవ్యవిధాన సమీక్షలపై సందే హాలు వ్యక్తంచేయడం, భౌగోళిక అనిశ్చితిపరిస్థితులు ప్రతికూల వడ్డీరేట్లు కారణంగా ఎక్కువ బంగారం పైనే పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపించారు. ఇక చైనావిషయానికి వస్తే కడ్డీలు, నాణేలకు మంచి డిమాండ్ ఏర్పడింది. నాలుగోత్రైమాసికంలో మరిం తగా ఉన్నట్లు అంచనా. నవంబరులో కరెన్సీ సంక్షో భం కూడా కొంత పెట్టుబడుల డిమాండ్ను పెంచిం ది. దీనితో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 70శాతానికి పెరిగింది. నాలుగేళ్ల గరిష్టస్థాయికి అంటే 1561 టన్నులకు చేరిందని ప్రపంచ పసిడిమండలి ఎండి సోమసుందరం పిఆర్ వెల్లడించారు. బ్రెగ్జిట్, అమె రికా అధ్యక్ష ఎన్నికలు, ఇతర రాజకీయ భౌగోళిక పరిస్థితులవల్ల కూడా పెట్టుబడులడిమాండ్ పెరిగిం దని, అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ పరిస్థితులు కొంత తోడయ్యాయిన ఆయన అన్నారు. ఇక పసిడి రంగంపై మొత్తం పెట్టుబడుల డిమాండ్ వేగవంతం అయింది. ఆభరణాలు వంటి వాటితో సమన్వయం ఉంది. జ్యుయెలరీపరంగా 15శాతంతగ్గింది. 2016 లో 2042టన్నులకు చేరింది. కేంద్రబ్యాంకు కూడా పసిడి కొనుగోళ్లు జరుపుతోంది. కేంద్ర బ్యాంకువద్ద కూడా గత ఏడాది మొత్తంగాచూస్తే 384 టన్నుల నిల్వలున్నట్లు అంచనా. ప్రపంచంలోని రెండు అగ్ర గామి పసిడి మార్కెట్లు భారత్, చైనాలు కూడా కొనుగోళ్లు మందగించడంతో డిమాండ్ కూడా తగ్గిం ది. 21శాతం, ఏడుశాతంగా ఉన్నాయి. చైనాలో ఆభరణాల డిమాండ్ కొంత దెబ్బతిన్నది. ఏడాది మొత్తంగా ధరలు ఎక్కువ కొనసాగడమే ఇందుకు కీలకం. వీటికితోడు కరెన్సీసంక్షోభం కూడా భారత్, చైనాలో కూడా వెంటాడింది. భారత్లో కూడా 2016 ఆసాంతం సవాళ్లతోనే కొన సాగింది. ఆకస్మికంగా ప్రకటించిన నోట్లరద్దు పసిడి డిమాండ్, ఆభరణాల కొనుగోళ్లు, రిటైల్ పెట్టుబ డులరంగంపై తీవ్రప్రభావం చూపించినట్లు ప్రపంచ పసిడిమండలి తననివేదికలో ఉటంకించింది. భారత్ లో పెద్దనోట్ల రద్దు పసిడి డిమాండ్ను 15శాతం దిగజార్చింది. 2016 కేలండర్ సంవత్సరంలో 27.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాది 32 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాది మొత్తంగా పసిడి డిమాండ్ అంతకుముందు ఏడాది 857.2టన్నులతో పోలిస్తే 675.5 టన్నులకు చేరింది. డాలర్ విలువల్లో చూస్తే 21.2శాతం తగ్గింది. భారత్ పసిడి డిమాండ్ మొత్తంగాచూస్తే 27.2బిలియన్ డాలర్లకు పడిపోయిందని తెలు స్తోంది. కెవైసి నిబంధనలు పాటించాలని, రెండు లక్షల కొనుగోళ్లపై పాన్నంబరు తప్పనిసరి అన్న విధానాలతో డిమాండ్పూర్తిగా పడిపోయింది. అలాగే నగదు లావాదేవీలను మూడులక్షలకు మించి చేస్తే డిజిటల్ రూపంలో ఉండాలన్న నిబంధనలు కూడా పసిడిరంగంపై ఎక్కువప్రభావం చూపి స్తాయనడంలో సందేహంలేదు. ఆభరణాల డిమాండ్ 662.3 టన్నుల నుంచి 514 టన్నులకు పడిపోతే పెట్టుబడులపరంగా డిమాండ్ 17శాతం తగ్గింది. 194.9 టన్నుల నుంచి 161.5 టన్నుల కు పడిపోయిందని పసిడిమండలి అంచనావేసింది. | 1entertainment
|
నమీబియాకు జాక్పాట్
టీ20 ప్రపంచకప్కు అర్హత
దుబాయి: నమీబియా జట్టుకు జాక్పాట్ కొట్టింది. బుధవారం ఆతిథ్య యుఏఇ జట్టు పరాజయాన్ని చవిచూడడంతో నమీబియా జట్టు టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించిన చివరిజట్టుగా నిలిచింది. స్కాట్లాండ్-యుఏఇ జట్ల మధ్య నేడు జరిగిన పోరులో ఆతిథ్య జట్టు 90 పరుగుల తేడాతో స్కాట్లాండ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. స్కాట్లాండ్ తొలుత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీస్కోర్ను నమోదు చేయగా... ఆ లక్ష్యాన్ని ఛేదించలేక యుఏఇ 18.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో యుఏఇ జట్టు గెలిస్తే నేరుగా సెమీస్కు చేరుకోవడంతోపాటు టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించేది. కానీ ఆ జట్టు భారీ తేడాతో ఓటమిపాలవ్వడంతో మెరుగైన రన్రేట్ ప్రాతిపదికపై నమీబియా జట్టు ప్రపంచకప్కు క్వాలిఫై అయ్యింది.
ప్రపంచకప్ క్వాలిఫయింగ్ సెమీఫైనల్స్
నవంబర్ 1(శుక్ర)
పపువా న్యుగేనియా × నమీబియా
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
sumalatha 147 Views
Mohammed Shami
కోల్కత్తా: భారత క్రికెట్ జట్టు ప్రధాన పేస్ బౌలర్ మొహమ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. అతని భార్య హసీన్ జహాన్ దాఖలు చేసిన గృహ హింస ఫిర్యాదుపై, అలీపూర్ కోర్టు న్యాయమూర్తి షమీతో పాటు అతని సోదరుడు హసీద్ అహ్మద్ పైనా వారెంట్ ఇష్యూ చేశారు. వీరిద్దరూ 15 రోజుల్లోగా కోర్టు ముందు హాజరుకావాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అంతే గడువు ఇస్తున్నట్టు తెలిపారు.
కాగా, గత సంవత్సరం తన భర్త షమీ వేధిస్తున్నాడని హసీన్ జహాన్, కోల్ కతా పోలీసులకు కంప్లయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 498ఏ కింద షమీతోపాటు అతని సోదరుడిపైనా విచారణ చేపట్టారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో షమీ ఆడుతుండగా, చార్జ్ షీట్ ను పూర్తిగా పరిశీలించిన తరువాతే షమీపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/business/ | 2sports
|
telugu heroine eesha rebba latest photo shoot spread the hotness over the web
ఈషా రెబ్బా.. ఈ తెలుగు అందం అదిరిందబ్బా..!
Web Title:telugu heroine eesha rebba latest photo shoot spread the hotness over the web
( Telugu News from Samayam Telugu , TIL Network)
1/15
ఈషా రెబ్బా.. ఈ తెలుగు అందం అదిరిందబ్బా..!
మీ కామెంట్ రాయండి
'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది తెలుగు భామ ఈషా రెబ్బా. 'బందిపోటు, అమీతుమీ' లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది. అందంతో పాటు బాగా అభినయించే కెపాసిటీ ఉన్నా ఆమెకు సరైన సినిమా రాలేదు. ఇకనుంచైనా ఈ తెలుగు సోయగానికి తగిన గుర్తింపునిచ్చే పాత్రలొచ్చి.. ప్రత్యేక గుర్తింపు రావాలని ఆకాంక్షిద్దాం.
సమయం తెలుగు న్యూస్ అలెర్ట్కు సబ్స్క్రైబ్ అవ్వండి
సమయం తెలుగు నుంచి బ్రేకింగ్ న్యూస్, టాప్ స్టోరీల నోటిఫికేషన్లను తక్షణమే పొందండి
ఇప్పుడు వద్దు | 0business
|
- జీఎస్టీ మొదలు..ఎఫ్ఆర్డీఐ వరకు అదే తీరు
- సింగిల్ ట్యాక్స్ వ్యాపారుల పాలిట పజిల్
- జనాల గుండెల్లో గుబుల్..
- కార్పొరేట్లకు మాత్రం రెడ్కార్పెట్
- కొత్త పన్నుతో ఎగిసిన ధరలు, కుంగిన ఉత్పత్తి
- ఏడాదంతా గందరగోళ వాతావరణమే
- అన్ని రంగాలను ఆవహించిన భయాలు
సందేహాలు, భయాల నడుమ కొత్త ఆశలకు చోటు లేని వాతావరణంలో 2017కు గుడ్బై చెప్పే సమయం దగ్గరపడుతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ముందు గతానుభవాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. గతేడాదిలో బడ్జెట్ తేది మార్పుతో మొదలైన మోడీ సర్కారు చర్యలు ఏడాది చివరకు కొనసాగాయి. వివిధ సంస్కరణలతో దేశ ఆర్థిక రంగాన్ని ప్రభుత్వం సర్కస్ ఫీట్లు చేయించింది. దీంట్లో ప్రథమంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ). కేంద్రంలోని మోడీ సర్కారు దృష్టిలో జీఎస్టీ అంటే.. గూడ్స్ సింపిల్ ట్యాక్స్. కానీ దేశ ప్రజలకు మాత్రం 'అమ్మో' జీఎస్టీ అనిపించేలా చేసింది. ఇక వ్యాపారులకు లేని భయాలను సృష్టించింది. కార్పొరేట్లకు పుల్ జోష్ ఇచ్చింది. మరోవైపు జీఎస్టీ అమలుపై పలువురు ఆర్థిక విశ్లేషకులు ప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించారు. అయినా సర్కారు మొండివైఖరితో ముందుకు వెళ్లింది. ఏడాది ముగుస్తున్న జీఎస్టీతో మేలు జరిగింది శూన్యమే. అలాగే ఇప్పటి వరకు నోట్ల రద్దుతో చితికిపోయిన చిన్న తరహా పరిశ్రమలు, జీఎస్టీతో మూసుకునే పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ ఏడాది జీఎస్టీ మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. మరోప్రక్క బ్యాంకింగ్ వ్యవస్థ వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మొండిబకాయిల (ఏన్పీఏల) తయారయ్యాయి. ఇక విలీనాల పేరిట ప్రభుత్వ రంగ బ్యాంకులను కుదించే దిశగా సర్కారు చర్యలను ముమ్మరం చేసింది. దీనికితోడు కొత్తగా ఎఫ్ఆర్డీఐ బిల్లు పేరిట సామాన్య డిపాజిట్దారుల జేబుకు చిల్లుపెట్టేందుకు ప్రణాళికలు చేస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ప్రభుత్వం అలాంటిదేమీ లేదంటున్న ఆ మాటలపై ప్రజల్లో మాత్రం నమ్మకం కన్పించడం లేదు. ఇవేకాకుండా 2017లో పలు ఆర్థికాంశాలు సామాన్యుడి నుంచి బడాబాబుల వరకు తీవ్ర కలవరానికి గురిచేశాయి. అయితే 2017 సంవత్సరం క్యాలెండర్లో తీపి జ్ఞాపకాల కన్నా చేదు నిజాలకే స్థానం దక్కింది..
కార్పొరేట్లవే 77శాతం మొండిబకాయిలు!
ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల్లో (ఎన్పీఏలు) సూమరు 77శాతం మొండిబాకాయిలు కార్పొరేట్ కంపెనీలవేనని ఆర్బీఐ గణాంకాల ద్వారా వెల్లడైంది. ప్రసుత్త ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండి బకాయిలు రూ.7.34 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంట్లో ఎక్కువ కార్పొరేట్ ఎగవేతదారులవే ఉన్నట్టుగా ఆర్బీఐ పేర్కొంది. దీంతో పాటు ప్రయివేటు బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రూ.1.03 లక్షల కోట్లకు చేరువయ్యాయి. ''2017 సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు రూ.7,33,974 కోట్లకు చేరుకోగా.. ప్రయివేటు రంగ బ్యాంకుల ఆస్తులు రూ.1,02,808 కోట్లకు చేరాయి' అని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పన్ను శ్లాబుల విలీనం దిశగా...
దే శామంతా ఒకే పన్ను విధానంతో 2017 జులై 1 నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను మోడీ సర్కారు అమల్లోకి తెచ్చింది. ఇందులో 5%, 12%, 18%, 28% మేర నాలుగు పన్ను శ్లాబులను నిర్ణయించింది. అంతకుముందు దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న 10 పరోక్ష పన్నుల స్థానంలో సర్కారు జీఎస్టీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ జీఎస్టీపై వ్యాపార వర్గాల్లో ఇప్పటికీ భారీ అనుమానాలు, సందేహాలు ఉండటం గమనార్హం. జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులకు దారితీయకుండా..వ్యవస్థను భారీ కుదుపులకు గురిచేసింది. జీఎస్టీ అమలుతో ప్రజలు, వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు వర్ణనాతీతం. జీఎస్టీతో వ్యాపారం సులువు అయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే ప్రజలు, వ్యాపారస్తుల నుంచి తీవ్ర అసంతృప్తి ఎందుకు వ్యక్తమవుతున్నది. అందుకేనేమో సర్కారు జీఎస్టీని ప్రవేశపెట్టిన కొద్ది నెలల్లోనే శ్లాబ్ల విలీనం దిశగా అడుగులు వేసింది. పలు రకాల వస్తువులను తక్కువ శాతం కలిగిన 5శాతంలోకి చేర్చింది. మరోవైపు జీఎస్టీతో వస్తువుల ధరలు తగ్గి పేదలు, మధ్యతరగతికి మేలు జరుగుతుందని సర్కారు పలుమార్లు చెప్పింది. ఇందుకు భిన్నంగా గత కొన్ని నెలలుగా ధరలు ఎగిసిపడుతున్నాయి. 2017 నవంబర్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) 3.93 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 నవంబర్ ఉన్న టోకు బాస్కెట్ ధరతో పోల్చితే 2017 నవంబర్లో టోకు బాస్కెట్ ధర 3.93 శాతం పెరిగిందన్నమాట. ఈ స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం పెరగడం ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి. అక్టోబర్లో టోకు ద్రవ్యోల్బణం 3.59 శాతం కాగా, గతేడాది నవంబర్లో 1.82 శాతంగా ఉంది. కాగా ఇటీవలే విడుదలైన నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయిలో 4.88 శాతంగా నమోదై ఆందోళనకు గురి చేసిన సంగతి విదితమే. జీఎస్టీ అమలు వల్ల పన్ను రాబడిలోనూ భారీగా కుంగుదల చోటు చేసుకుంది. దీంతో ప్రభుత్వం పలు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరో కనువిప్పు కలిగించే అంశమేటంటే..జీఎస్టీ పాలసీ 31 మంది సభ్యుల్లో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకపోవడం గమనార్హం.
అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ
దేశ ఆర్థిక వ్యవస్థ పయనం పతనం దిశగా సాగుతోంది. మరోవైపు ఆర్థిక సంస్కరణల కారణంగా దేశంలోని అన్ని వర్గాల నుంచి ప్రభుత్వం పలు త్రైమాసికాలుగా విమర్శలను ఎదుర్కొంటున్నది. అయినప్పటికీ భారత్లోని కుబేరుల సంపద మాత్రం బేపికర్గా కొనసాగుతోంది. ఇదే సమయంలో నోట్ల రద్దు, కొత్త పన్ను విధానం జీఎస్టీతో దేశంలోని అన్ని వ్యాపారాలు అంతకంతకు పడిపోతున్నాయి. కానీ ఈ ఏడాది భారత్లోని 100 మంది అత్యంత సంపన్నుల మొత్తం సంపద విలువ 26శాతం వృద్థితో 374 బిలియన్ డాలర్ల నుంచి 479 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం విశేషం. ఈ నేపథ్యంలో పోర్బ్స్ ఇండియా 100 విడుదల చేసిన వార్షిక జాబితాలో దాదాపు రూ.2.5లక్షల కోట్లు (38 బిలియన్ డాలర్ల) సంపదతో ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గత పదేండ్లుగా వరుసగా ముఖేశ్ మొదటి స్థానంలో నిలుస్తున్నారు. 19 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో విప్రో చైర్మెన్ అజీమ్ ప్రేమ్జీ నిలిచారు.
ఆధార్ అనుసంధానం..
వ్యక్తిగత విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్ను పేదవాడిపై రుద్దే ప్రయత్నాలను సర్కారు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాదాపు ఆరు ప్రధాన సేవలకు ఆధార్ అనుస ంధానాన్ని తప్పనిసరి చేస్తూ ఇప్పటికే ఉత్తర్వూలు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు, మ్యూచువల్ ఫండ్స్, బీమా, పోస్టాఫీస్ ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ను అనుసంధానం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది ప్రజలకు దీనిపై అవగాహన లేక అనుసం ధానం దిశగా ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఆధార్ అనుసంధానించడానికి కేంద్రం గడువు తేదిని మార్చి 31 వరకు పొడగించింది.
బిట్కాయిన్ నిలిచేనా..!
ఈ ఏడాది గత కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో వర్చువల్ కర్సెన్సీ బిట్కాయిన్ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం బిట్కాయిన్ విలువ 19,850 వేల డాలర్ల మార్క్కు చేరింది. మన కరెన్సీలో దీని విలువ 13లక్షలుపైగా పలుకుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ నుంచి కూడా బిట్కాయిన్కు చట్టబద్ద అనుమతి లేకపోయినప్పటికీ దీని కొనుగోలుకు ఆసక్తి చూపడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందులో నల్లడబ్బు కలిగిన వారే పెట్టుబడులుగా పెడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. స్టాక్, రుణ, కమోడిటీ తదితర సంప్రదాయ పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని ఇన్వెస్టర్లు ఎంచుకుంటున్నారు. మరోవైపు ఈ డిజిటల్ కరెన్సీలతో అప్రమత్తంగా లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అంత సేఫ్ కాదని వారు చెబుతున్నారు. దీనిపై ఇటీవల రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా హెచ్చరించింది. ఈ తరహా డిజిటల్ కరెన్సీపై అంతర్జాతీయంగా చైనా, దక్షిణ కొరియా ప్రభుత్వాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి ఒక రకం మోసపూరిత లావాదేవీలు అని ప్రముఖ అంతర్జాతీయ విత్త సేవల సంస్థ జెపి మోర్గాన్ హెచ్చరించింది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బిట్కాయిన్ అర్థం కానిది సామ్యానులకు మాత్రమేనన్నది విస్మరించరాదు..
ఎఫ్ఆర్డీఐతో డిపాజిట్లకు రక్షణ కరువు!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివాదాస్పద ఫైనాన్షియల్ రిజుల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు (ఎఫ్ఆర్డీఐ) బిల్లు అత్యంత వివాదస్పదమైంది. ఈ బిల్లు వల్ల ఖాతాదారుల డిపాజిట్లకు భద్రత లేకపోవడంతో దేశ వ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. ఇందులోని ''బెయిల్-ఇన్'' అంటే దివాలా తీసే పరిస్థితిలో ఉన్న బ్యాంకుకు కొంత ఊరట కల్పించడానికి సెక్షన్ 52(1) నిబంధనలపై అనేక అందోళనలు రేపింది. బిల్లులో ఈ కార్పొరేషన్కు తిరుగులేని అధికారాలు కట్టబెట్టే అవకాశం ఉందని, దివాలా తీసిన బ్యాంకు అప్పులన్నింటినీ ఈ కార్పొరేషన్ రద్దు చేయడంతోపాటు, ఖాతాదారుల సొమ్మును రద్దు చేసేయవచ్చనీ, దీంతో ఖాతాదారుల డబ్బును కూడా బ్యాంకులు తిరిగి ఇవ్వక్కర్లేదనేది ఇందులో కీలకాంశం. డిపాజిటర్ల సొమ్ముకు తమది హామీ అని ప్రధానీ మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పదే పదే చెబుతున్నప్పటికీ ఈ 'బెయిల్ ఇన్'ను మాత్రం తొలగిస్తామని చెప్పకపోవడం గమనార్హం.
పరపతి పెంపు..
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుగుణంగా చేపడుతున్న సంస్కరణలను అమెరికా రేటింగ్స్ సంస్థ మూడీస్ ప్రశంసించింది. భారత సౌర్వభౌమ రేటింగ్ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచింది. కాగా మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్అండ్పీ) మాత్రం భారత్కు ఇస్తున్న రేటు 'బీబీబీ మైనస్' స్టేబుల్ అవుట్లుక్తోనే కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచ బ్యాంకు రూపొందించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచీలో 190 దేశాలున్న ఈ జాబితాలో ఇండియా 30 స్థానాలు ఎగబాకి టాప్ -100లో చోటు దక్కించుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్-2018 జాబితాలో భారత్ 100వ స్థానానికి ఎగిసింది. ఇది వరకు 130వ స్థానంలో ఉంది. అయితే ఈవోడీబీలో ర్యాంకింగ్ మెరుగైన మాత్రన దేశంలోకి పెట్టుబడులు, పరిశ్రమలు ఏర్పాటు జరగలేదన్నది వాస్తవం.
బ్యాంకు దివాళా చట్టానికి మార్పులు..
రుణ ఎగవేతదారులు, మోసపూరిత చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో మార్పులు తీసుకొచ్చింది. దేశ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) నానాటికీ పెరిగిపోతుండడంతో ఆయా కేసుల త్వరితగతిన పరిష్కారం కోసం ఈ బ్యాంకు దివాలా చట్టాన్ని రూపొందించారు. దీని అమలులో పారదర్శకత లేదని, రుణ ఎగవేతదారులను ప్రభుత్వమే వెనుక వేసుకొస్తుందనే విమర్శలు ఉన్నాయి. మొండి బాకీల విక్రయంలో రుణ ఎగవేత చరిత్ర ఉన్న ప్రమోటర్లు, మోసపూరిత చరిత్ర కలిగిన ప్రమోటర్లు సొంతం చేసుకోకుండా నిరోధించడమే ఆర్డినెన్స్ ప్రధాన ఉద్దేశ్యం.
రూ.2000 నోటు వెనక్కి..!
కేంద్రంలోని మోడీ సర్కారు గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను అనుహ్యాంగా రద్దు చేసింది. మొత్తం కరెన్సీ సర్య్కూలేషన్లో వీటి విలువ 86-87 శాతం ఉంటుంది. దీంతో దేశ ఆర్ధిక వ్యవస్థలో తీవ్ర నగదు కొరత ఏర్పడింది. నగదును మార్చుకోవడానికి ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. అనంతరం వీటి స్థానంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త రూ.500, రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.2000 పెద్ద నోటు ప్రమాదమేనని గతంలో పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం వీటిని ఎప్పటికైనా రద్దు చేస్తుందని వారు విశ్లేషించారు.
ప్రస్తుతం ప్రభుత్వం తీరు చూస్తుంటే వారు చెప్పిందే నిజమయ్యేలా ఉంది ఇటీవల వచ్చిన ఒక నివేదిక అంచనా ప్రకారం.. ఆర్బీఐ పెద్ద నోటు రూ.2,000ను తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ఇటీవల ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టులో పేర్కొంది. లేదా వీటి ముద్రణను నిలిపివేయవచ్చని తెలిపింది.
పెరిగిన ద్రవ్యలోటు
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలానికి బడ్జెట్ అంచనాల్లో ద్రవ్య లోటు 96.1 శాతానికి చేరుకుంది. కాగా నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో వల్ల ఆదాయం తక్కువగా రావడం, వ్యయం పెరగడం వల్ల ద్రవ్యలోటు ఎగిసింది. తొలి ఏడు నెలల్లో రూ.5.25 లక్షల కోట్లకు చేరింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 96.1 శాతానికి సమానం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ద్రవ్యలోటు రూ.4.2 లక్షలు కోట్లుగా ఉంది.
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు
ప్రస్తుత ఏడాదిలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు మూడుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) తాజా పరపతి సమీక్షలో 25 బేసిస్పాయింట్లు వడ్డీ రేటును వడ్డించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 1.25-1.5 శాతానికి చేరాయి. ఈ నిర్ణయంతో అమెరికాలో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. తక్కువ పన్నులతో వినియోగదారుల వ్యయం, వ్యాపార పెట్టుబడుల పెరుగుదలతో వచ్చే ఏడాదికి 2.5 శాతం వద్ధిని అంచనా వేసింది. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ మరో రేటు పెంపునకు తగినంత బలంగా ఉందని ఫెడ్ చైర్పర్శన్ జానెట్ యెలెన్ పేర్కొన్నారు. దీంతో మరోమారు వడ్డీ రేట్ల పెంపునకు ఆమె సంకేతాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు పలు దేశాలతో పాటు భారత్ మార్కెట్లపై ఈ ప్రభావం పడింది. ఇక జీఎస్టీతో పాటు వడ్డీ రేట్ల కారణంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారీగా తరలిపోవడానికి దోహదం చేశాయి.
వృద్ధికి సంస్కరణల పోటు ..
నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారనుందని పలువురు ఆర్థిక వేత్తలు హెచ్చరించారు. ఆ విధంగానే ఫలితాలు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వద్ధి రేటు 4 ఏండ్ల కనిష్టానికి పడిపోనుందని 30 మంది ఆర్ధికవేత్తలో ఓ సర్వేలో అంచనా వేశారు. 2017-18లో వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కానుందని అంచనా. నోట్ల రద్దు, కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ కారణంగా వ్యాపార కార్యకలాపాలు, వినియోగదారుల డిమాండ్ భారీగా క్షీణించనుందని రాయిటర్స్ పోల్లో వెల్లడైంది. నోట్ల రద్దు వల్ల రూ.2 లక్షల కోట్ల నష్టం జరిగిందని మరో రిపోర్టులో వెల్లడయ్యింది. ఈ చర్య వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి 13 త్రైమాసికాల కనిష్ట స్థాయి అయినా 5.7 శాతానికి పడిపోయింది. వద్ధిరేటు ఒక శాతం తగ్గడం ద్వారా రూ.1.30 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పరమైన ప్రతికూల అంశాల నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా భారత వద్ధి అంచనాలు తగ్గిస్తున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం
ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో మార్కెట్ శక్తులకు వాటాలను అప్పగి ంచడంలో కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తుంది. 2017-18లో పీఎస్యూల్లో రూ.72,500 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా క్రితం ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో రూ.50,500 కోట్ల విలువ చేసే పీఎస్యూల వాటాలను ప్రయివేటుకు కట్టబెట్టింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ind vs Aus 2nd T20: శతకంతో మ్యాక్స్వెల్ విధ్వంసం.. ఆసీస్దే టీ20 సిరీస్
బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయం సాధించింది. ఈ విజయంతో 2-0 తేడాతో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. శతకం బాదిన మ్యాక్స్వెల్ ఆసీస్కు సిరీస్ను అందించాడు.
Samayam Telugu | Updated:
Feb 27, 2019, 10:38PM IST
Ind vs Aus 2nd T20: శతకంతో మ్యాక్స్వెల్ విధ్వంసం.. ఆసీస్దే టీ20 సిరీస్
హైలైట్స్
బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయం సాధించింది.
ఈ విజయంతో 2-0 తేడాతో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది.
శతకం బాదిన మ్యాక్స్వెల్ ఆసీస్కు సిరీస్ను అందించాడు.
బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయం సాధించింది. ఈ విజయంతో 2-0 తేడాతో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. భారత గడ్డపై ఆసీస్కు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం విశేషం. 191 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ షార్ట్ (40), మ్యాక్స్వెల్ (55 బంతుల్లో 113 నాటౌట్) ఆ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు 73 పరుగులు జోడించారు. షార్ట్ ఔటైనా మ్యాక్స్వెల్ దూకుడు తగ్గలేదు. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన మ్యాక్సీ.. 50 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మెరుపు శతకం బాదిన మ్యాక్స్వెల్ ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
9 సిక్స్లు, 7 ఫోర్లతో చెలరేగిన మ్యాక్స్వెల్ ఒంటి చేత్తో భారత్కు మ్యాచ్ను దూరం చేశాడు. బుమ్రా స్లో డెలివరీలను కూడా మ్యాక్సీ బౌండరీలుగా మలిచాడు. సొంత గడ్డ మీద చివరిగా 2015లో దక్షిణాఫ్రికాకు టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. మ్యాక్స్వెల్ దూకుడుతో మళ్లీ ఇన్నాళ్లకు స్వదేశంలో టెస్టు సిరీస్ను కోల్పోయింది.
అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆరంభంలో లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 47) దూకుడుగా ఆడగా.. కెప్టెన్ కోహ్లి (38 బంతుల్లో 72 నాటౌట్), ధోనీ (23 బంతుల్లో 40) సిక్స్ల మోత మోగించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఒకరితో మరొకరు పోటీ పడి సిక్స్లు బాదిన ధోనీ, కోహ్లి.. చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ 13 సిక్స్లు బాదారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర
అంతర్జాతీయ బలహీన సంకేతాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర దిగొచ్చింది. వెండికూడా బంగారం బాటలోనే పయనించింది.
Samayam Telugu | Updated:
Oct 22, 2018, 06:16PM IST
Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర
సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్లో రూ.50 తగ్గిన 10 గ్రాముల బంగారం (99.9 %) ధర రూ.32,220 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల బంగారం (99.5 %) ధర రూ.32,070 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ బలహీన సంకేతాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర దిగొచ్చింది. వెండికూడా బంగారం బాటలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కిలో బంగారం ధర రూ.100 తగ్గింది. ప్రస్తుతం కిలో బంగారం ధర రూ.32,220 వద్ద కొనసాగుతోంది. | 1entertainment
|
Sep 18,2018
చేతులు మారిన 'టైమ్' మ్యాగజైన్ !
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ చేతులు మారింది. ప్రకటనల ఆదాయం తగ్గి తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొం టున్న మెరెడిత్ కార్పొరేషన్కు చెందిన టైమ్ మ్యాగజైన్ను 190 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు రూ. 1378.92 కోట్లు) విక్రయించినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ప్రముఖ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సేల్స్ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ బెనియాఫ్ దంపతులు టైమ్ మ్యాగజైన్ను కొనుగోలు చేశారని పేర్కొంది. అయితే మార్క్ బెనియాఫ్ వ్యక్తిగతంగానే దీన్ని కొనుగోలు చేశారని, సేల్స్ఫోర్స్కు దీనితో ఎలాంటి సంబంధం లేదని మెరిడెత్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక.. మ్యాగజైన్ రోజువారీ కార్యకలాపాల్లో బెనియాఫ్ ఎలాంటి జోక్యం చేసుకోబోరని, ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్ బృందమే నిర్ణయాలు తీసుకుంటుందని సంస్థ పేర్కొంది. యాలే యూనివర్శిటీకి చెందిన హెన్నీ లూస్, బ్రటన్ హాడెన్ ఈ టైమ్ మ్యాగజైన్ను ప్రారంభించారు. మొదటి పత్రిక 1923 మార్చిలో వెలువడింది. టైమ్ మ్యాగజైన్తో పాటు ఫార్చ్యూన్, మనీ, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ పబ్లికేషన్లను మెరిడెత్ ఈ ఏడాది మార్చిలో అమ్మకానికి పెట్టింది. తాజాగా టైమ్ను అమ్మివేయగా.. మిగతా మూడింటి విక్రయానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు మెరిడెత్ వెల్లడించింది. పత్రికల్లో ప్రకటనలు తగ్గిపోవడంతో టైమ్ సహా చాలా మ్యాగజైన్లకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆయా సంస్థలు విక్రయాల బాట పడుతున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Aug 23,2018
ఆప్ట్రానిక్స్ 29 స్టోర్లకు విస్తరణ
హైదరాబాద్ : భారత్లో యాపిల్కు అతి పెద్ద భాగస్వామిగా ఉన్న రిటైల్ స్టోర్స్, సర్వీసు సెంటర్లు కలిగిన ఆప్ట్రానిక్స్ మొత్తంగా 29 స్టోర్లు, 10 సర్వీసు సెంటర్లకు విస్తరించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మరో మూడు కొత్త స్టోర్లును తెరిచినట్టు అప్ట్రానిక్స్ వ్యవస్థాపకులు, ఎండి సుతీందర్ సింగ్ పేర్కొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
BOAPANNA
చరిత్ర సృష్టించిన బోపన్న
ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్్డ్ డబుల్స్ టైటిల్ను భారత టెన్నిస్ స్టార్ బోపన్న జోడీ కైవసం చేసుకుంది. దీంతో బోపన్న తన కెరీర్లో నూతన అధ్యాయాన్ని లిఖించాడు. ఫ్రెంచ్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్లో టైటిల్ను సాధించడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించాడు. ఏడో సీడ్ రోహన్ బోపన్న కెనడాకు చెందిన గాబ్రియేల్ దాబ్రోవ్స్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ విజేతగా నిలిచారు. గురువారం జరిగిన ఫైనల్లో అన్సీడెడ్ జోడీ కొలంబియాకి చెందిన రాబర్ట్ ఫరా, జర్మనీకి చెందిన గ్రోన్ ఫెల్డ్పై 2-6, 6-2, 12-10తేడాతో బోపన్న జోడీ విజయం సాధించింది. రోహన్న బోపన్నకు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. లియాండ్ పేస్, మహేష్ భూపతి, సానియా మీర్జాల తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలిచిన నాలుగో భారత టెన్నిస్ ఆటగాడిగా బోపన్న రికార్డులకెక్కాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత బోపన్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఫైనల్కు చేరాడు. 2010లోనూ యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్కు చేరినప్పటికీ టైటిల్ సాధించడంలో విఫలమయ్యాడు.
యూఎస్ ఓపెన్లో పాక్ ఆటగాడు అసమ్ ఉల్ హక్ ఖురేషీతో జట్టుకట్టిన బోపన్న ఫైనల్కు చేరాడు గానీ టైటిల్ను గెలువ లేకపోయాడు. హోరా హోరీగా జరిగిన పోరు ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్లో బోపన్న జంట మూడో ర్యాంకు క్రీడాకారులు ప్రాన్కు చెందిన రోజర్ వాస్లిన్, చెక్ రిపబ్లిక్కు హ్లావకోవాల జంటపై 7-5, 6-3తో వరుస సెట్లలో సునాయాస విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ఫైనల్లో విజయ కేతం ఎగురవేశారు. హోరా హోరీగా జరిగిన పోరులో అత్యంత ఆత్మ విశ్వాసం కనబరిచిన బోపన్న-దబౌస్కీ జోడీ కడవరకూ పోరాటి టైటిల్ను సాధించారు.
తొలిసెట్ను 2-6తో కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత రెండు సెట్లలో ఈజోడీ చెలరేగి ఆడింది. రెండో సెట్ను సునాయాసంగా 6-2తో గెలుచుకున్నారు. ప్రధానంగా చివరి సెట్ మాత్రం నువ్వా-నేనా అన్న రీతిలో ఉత్కంఠభరితంగా సాగింది. అయితే ఒత్తిడిని అధిగమించిన బోపన్న జోడీ మూడో సెట్లో బోపన్న-డబ్రోస్కీ జోడీ రెండు సార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని 12-10తో విజేతగా నిలిచింది. తాజా టైటిల:తొ భారత దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో బోపన్న చేరిపోయాడు. బోపన్న విజయంపై భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శుభాకాంక్షాలు తెలిపింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని సాధించావని ట్విట్టర్లో పేర్కొంది. | 2sports
|
mustafizur
ముస్తాఫిజూర్కు దక్కని స్థానం
ఢాకా: భుజం గాయం నుంచి కోలుకున్నప్పటికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేని కారణంగా బంగ్లాదేశ్ సంచలన పేస్ బౌలర్ ముస్తాఫిజూర్ రహమాన్ భారత్తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం ఎంపిక చేయలేదు.ఈనెల 9నుంచి 13 వరకు హైదరా బాద్లో జరిగే ఈ టెస్టు మ్యాచ్లో పాల్గొనే 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. ఐపిఎల్లో హైదరాబాద్ సన్ రైజర్స్కు ప్రాతి నిధ్యం వహిస్తున్న ముస్తాఫిజూర్కు గత ఆగస్టులో భుజానికి శస్త్ర చికిత్స జరిగింది.నాలుగు నెలల విరామం తరువాత ఇటీవలే న్యూజిలాండ్ పర్య టనలో ముస్తాఫిజూర్ పునరాగమనం చేశాడు. ముస్తాఫిజూర్కు ఫిట్నెస్ సమస్య లేకపోయినా వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే పూర్తి స్థాయి సిరీస్కు అతని సేవలు అవసరమవుతాయి. ముం దు జాగ్రత్తగానే అతడిని భారత్తో జరిగే టెస్టు కోసం ఎంపిక చేయలేదు అని బంగ్లాదేశ్ చీఫ్ సెలక్టర్ మిన్హాజుల్ అబెదిన్ వివరించారు. ఈనెల 9న ఉప్పల్ స్టేడియంలో టీమిండియాతో బం గ్లాదేశ్ ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. బంగ్లాదేశ్ టెస్టు జట్టు ముష్పికర్ రహీమ్(కెప్టెన్),తమీమ్ ఇక్బాల్,సౌమ్యా సర్కార్,మోహ్మాదుల్లా రియాద్,ఇమ్రుల్ కైస్,షకీల్ హల్ హసన్,మోహదీ హసన్ మిరాజ్, మోహి నుల్ హక్,షబ్బీర్ రెహమాన్,లిటన్ దాస్,తస్కీన్ అహ్మాద్,శుభాసిస్ రా§్ు,తైజుల్ ఇస్లామ్,కమ్రుల్ ఇస్లామ్ రబ్బీ,షఫీయుల్ ఇస్లామ్. | 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.