news
stringlengths
299
12.4k
class
class label
3 classes
internet vaartha 185 Views ఆట డెస్క్‌ : తన జీవితంపై సినిమా తీస్తే అందులో బాలీవుడ్‌ నటి దీపికాపడుకొనే నటించాలని భారత బాడ్మింటన్‌ చాంపియన్‌ సైనా పేర్కొంది. ఢిల్లీలో బుధవారం జరిగిన ఒక అవార్డుల వేడుకలోఆమె పాల్గొంది. ఈసందర్భంగా మాట్లాడుతూ, తనపాత్రకు దీపిక సరిగ్గా సరిపోతుందని చెప్పింది.  తామిద్దరూ కలిసి ఎన్నోసార్లు బ్యాడ్మింటన్‌ ఆడామని తెలిపింది.దీనికి దీపిక స్పందిస్తూ అవకాశం వస్తే సైనా పాత్రలో నటించటానికి తాను సిద్ధమే అని పేర్కొంది.
2sports
Chandigarh, First Published 24, Sep 2018, 3:53 PM IST Highlights భారత ప్రభుత్వం ప్రకటించిన క్రీడా పురస్కారాలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే తమకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రాకపోవడంతో రెజ్లర్ భజరంగ్ పూనియా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇతడు ఏకంగా క్రీడా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశాడు. ఇపుడు మరో అవార్డుపై వివాదం రేగుతోంది. ద్రోణాచార్య అవార్డు రాకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ ఆర్చరీ కోచ్ రాజీనామా చేశాడు.  భారత ప్రభుత్వం ప్రకటించిన క్రీడా పురస్కారాలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే తమకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రాకపోవడంతో రెజ్లర్ భజరంగ్ పూనియా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇతడు ఏకంగా క్రీడా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశాడు. ఇపుడు మరో అవార్డుపై వివాదం రేగుతోంది. ద్రోణాచార్య అవార్డు రాకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ ఆర్చరీ కోచ్ రాజీనామా చేశాడు.  భారత ఆర్చరీ కాంపౌండ్ విభాగం జట్టు కోచ్ గా వ్యవహరిస్తున్న జీవన్ జ్యోత్ సింగ్ తేజ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన ఆసియ క్రీడల ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో మహిళా, పురుషుల టీమ్ రెండూ రజత పతకాలతో అదరగొట్టాయి. ఈ ఇరు జట్లకు జీవన్ జ్యోత్ కోచ్ గా ఉన్నారు. దీంతో ఈసారి ఇతడికి ద్రోణాచార్య అవార్డు ఖాయమని అందరూ భావించారు. అయితే హటాత్తుగా అతడి పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అవార్డుల నామినీల లిస్టులోంచి తొలగించడం వివాదానికి కారణంగా మారింది. మొదట ఇతడి పేరును అవార్డుల సెలక్షన్ కమిటీ నామినీల జాబితాలో చేర్చింది. అయితే గతంలో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ క్రీడల సందర్భంగా ఇతడు  క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. అందువల్ల ఇతడి పేరును అత్యుత్తమ కోచ్ లకు అందించే ద్రోణాచార్య అవార్డు నామినీల లిస్టు నుండి తొలగించింది.  ఈ వ్యవహారంలో తన పాత్ర లేదని విచారణలో తేలినా క్రీడా శాఖ తన పేరును కావాలనే నామినీల లిస్టు నుండి తొలగించిందని జీవన్ జ్యోత్ సింగ్ ఆవేధన వ్యక్తం చేశాడు. ద్రోణాచార్య అవార్డు రాకపోవడంతో భారత ఆర్చరీ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జీవన్ జ్యోత్ ప్రకటించాడు.   మరిన్ని వార్తలు
2sports
ఆసీస్‌పై దుమ్మురేపిన కోహ్లీ నిష్క్రమించిన ఆస్ట్రేలియా బౌలింగ్‌, బ్యాటింగ్‌లో టీమిండియా సత్తా మొహాలీ : వరల్డ్‌ టి20లో భాగంగా ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎన్నుకుని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగి టీమిండియా 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాపై టీమిండియా 6 వికెట్లతో ఘన విజయం సాదించింది. కాగా టీమిండియా సెమీఫైనల్లోకి చేరుకుంది.ఆస్ట్రేలియా లీగ్‌ దశలోనే టోర్నీమెంట్‌ నుంచి నిష్క్రమించింది.మ్యాచ్‌ను విజయ పథంలోకి చేర్చేందుకు టీమిండియాకు చెందిన కోహ్లీ దుమ్మరేపాడు.చివరి వరకు ఒంటరిపోరాటం చేసి ఆస్ట్రేలియాపై విజయం సాధించేలా కృషిచేశాడు. టీమిండియా బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌కు కూడా తమ సత్తా చాటింది. కాగా ఆస్ట్రేలియా ఓపెనర్లు శుభారంభం చేశారు.ఆరోన్‌ పించ 34 బంతులు ఆడి 3 బౌండరీలు,3 సిక్సర్లతో 43 పరుగులు చేయగా,ఉస్మాన్‌ ఖవాజా 16 బంతులు ఆడి 6 బౌండరీలతో 26 పరుగులు చేసి దూకుడుగా ముందుకు సాగారు.కాగా ఈ క్రమంలోనే నాలుగవ ఓవర్‌ ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.ఆ తరువాత టీమిండియా బౌలర్లు తమ సత్తా చాటడంతో ఆసీస్‌ వేగం తగ్గింది.డేవిడ్‌ వార్నర్‌ 6 పరుగులు, స్మిత్‌ 2 పరుగుల స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపడంతో ధోనీ సేన శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది.ఇక మాక్స్‌వెల్‌ 28 బంతులు ఆడి 1 బౌండరీ,1 సిక్సర్‌తో 31 పరుగులు, షేన్‌వాట్సన్‌ 18 పరుగులతో ఫర్వాలేదనిపించారు.చివరలో నేవిల్‌ 2 బంతులు ఆడి 1 బౌండరీ,1 సిక్సర్‌తో 10 పరుగులు చేసి నాటౌట్‌గా కొనసాగగా ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది.భారత బౌలర్లలో హార్థిక్‌ పాండ్యాకు రెండు వికెట్లు, బూమ్రా, నెహ్రా, అశ్విన్‌, యువరాజ్‌లకు ఒక్కొక్కరికి ఒక వికెట్‌ లభించింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ అనంతరం టీమిండియా బ్యాటింగ్‌కు దిగి 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. కాగా ఓపెనర్‌్‌ రోహిత్‌ శర్మ 17 బంతులు ఆడి 1 బౌండరీతో 12 పరుగులు చేసి వాట్సన్‌ బౌలింగ్‌లో ఔట్‌కాగా మరో ఓపెనర్‌ ధావన్‌ 12 బంతులు ఆడి 1 బౌండరీ,1 సిక్సర్‌తో 13 పరుగులు చేసి కొల్టర్‌ నైల్‌ బౌలింగ్‌లో ఖవాజాకు క్యాచ్‌ ఇవ్వడంతో ఔటయ్యాడు.కోహ్లీ 51బంతులు ఆడి 9 బౌండరీలు, 2 సిక్సర్‌తో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.కాగా సురేష్‌ రైనా 7 బంతులు ఆడి 10 పరుగులు చేసి వాట్సన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు వెళ్లిపోగా యువరాజ్‌  18 బంతులు ఆడి 1 బౌండరీ,1 సిక్సర్‌తో 21 పరుగులు చేసి పాల్కనర్‌  బౌలింగ్‌లో వాట్సన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వెనుదిరిగాడు. ధోనీ 10 బంతులు ఆడి 3 బౌండరీలతో 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.దీంతో టీమిండియా 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది.
2sports
petrol price hits 4-yr high, diesel at highest level ఏపీలో రూ.80కి చేరిన పెట్రోల్ ధర, డీజిల్ రూ.70 పైనే పెట్రోల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరాయి, డీజిల్ అయితే ఆల్ టైం హై స్థాయికి చేరుకుంది. Samayam Telugu | Updated: Apr 1, 2018, 02:04PM IST పెట్రోల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.73 పైసలకి చేరగా.. డీజిల్ ధరలు రూ. 64.58 పైసలకు చేరింది. ఇంతకు మునుపెన్నడూ డిజీల్ ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. 2014 సెప్టెంబర్ తర్వాత పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 78 పలకగా.. విశాఖలో రూ. 79 దాటింది. చిత్తూరు, నెల్లూరులో రూ.80 మార్క్‌ను చేరుకుంది. డిజిల్ ధరలు హైదరాబాద్‌లో రూ.69.74 పైసలు, వైజాగ్‌లో రూ.70.66 పైసలకు చేరడం గమనార్హం. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో.. పెట్రోల్, డీజిల్‌‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ గతంలో సూచించింది. కానీ ఆర్థిక మంత్రి ఆ సూచనల్ని పట్టించుకోకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారు.
1entertainment
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
Hyderabad, First Published 12, Aug 2018, 1:13 PM IST Highlights ఆ తరువాత దిల్ రాజు కూడా మాస్ హీరోతో ఈ కథ చేయించాలంటే కొన్ని విషయాల్లో రాజీపడాలని నితిన్ ని హీరోగా ఫైనల్ చేసుకున్నాడట. నిజానికి దిల్ రాజు.. ఎన్టీఆర్ తరువాత రామ్ చరణ్ తో చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడట 'శతమానంభవతి' సినిమా సక్సెస్ అయిన తరువాత దర్శకుడు సతీష్ వేగ్నేశతో తన బ్యానర్ లో మరో సినిమా చేయాలనుకున్నాడు దిల్ రాజు. స్టార్ హీరోతో సినిమా చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ఇందులో భాగంగా ముందుగా ఎన్టీఆర్ ని కలిసి కథ వినిపించాడు. ఆ కథ మరేదో కాదు.. నితిన్ నటించిన 'శ్రీనివాస కళ్యాణం'. కథ విన్న తరువాత ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత దిల్ రాజు కూడా మాస్ హీరోతో ఈ కథ చేయించాలంటే కొన్ని విషయాల్లో రాజీపడాలని నితిన్ ని హీరోగా ఫైనల్ చేసుకున్నాడట. నిజానికి దిల్ రాజు.. ఎన్టీఆర్ తరువాత రామ్ చరణ్ తో చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడట. కానీ నితిన్ కి కథ నచ్చి సినిమా చేస్తానని ముందుకు రావడంతో అతడితో సినిమాను రూపొందించారు. వాస్తవానికి స్టార్ హీరోలు యాక్సెప్ట్ చేసే అంశాలు ఈ సినిమాలో లేవు. అయినప్పటికీ దిల్ రాజుని కాదనలేక ఎన్టీఆర్ కథ విన్నాడు. ఇప్పుడు సినిమా రిజల్ట్ ఎలాగో తెలిసిపోయింది. మొదటి షో నుండే నెగెటివ్ టాక్ వస్తున్నప్పటికీ చిత్రబృందం మాత్రం సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంది. మా సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందని కానీ ఇప్పుడు కలెక్షన్లు పుంజుకున్నాయని దిల్ రాజు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ డెబ్భై శాతం బయ్యర్లు లాస్ రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకుల అంచనా! Last Updated 9, Sep 2018, 12:24 PM IST
0business
- చిల్లర కష్టాలతో 60% కుంగిన చికెన్‌ అమ్మకాలు - రోజుకు రూ.100 కోట్లకు పైగానే నష్టం - 10 లక్షల మందికి జీతాలివ్వలేని పరిస్థితి : పరిశ్రమ వర్గాల ఆవేదన నవతెలంగాణ-వాణిజ్య విభాగం కేంద్ర ప్రభుత్వపు పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా దేశ వ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయం వల్ల పౌల్ట్రీ రంగంలో పని చేస్తున్న 10 లక్షల మందికి ఈ నెల జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని పౌల్ట్రీ రైతులు, యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అమ్మకాలు లేక ప్రతి రోజూ రూ.100 కోట్ల పైగా నష్టాలు చవి చూస్తున్నామని పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేసింది. మోడీ ప్రకటన తర్వాత చికెన్‌, గుడ్ల అమ్మకాలు సగానికి పైగా పడిపోయాయని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వక్తం చేస్తున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'ఇండియా పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌ మానుఫ్యాక్చరర్స్‌ ప్రెసిడెంట్‌ హరిష్‌ గర్వారే మాట్లాడుతూ బ్రాయిలర్‌ చికెన్‌ ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానంలో ఉందన్నారు. ప్రతి ఏడాది 65,000 మిలియన్ల గుడ్లు, 38 లక్షల టన్నుల చికెన్‌ ఉత్పత్తి జరుగుతుందని వివరించారు. పౌల్ట్రీ వ్యాపారం సుమారు లక్ష కోట్ల రూపాయలుగా ఉంటుందన్నారు. ప్రభు త్వ నిర్ణయం వల్ల ఈ రంగం తీవ్ర ఒత్తిడిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసి యేషన్‌' (టీపీబీఏ) ప్రెసిడెంట్‌ జి రంజిత్‌ రెడ్డి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ రంగంలో దేశ వ్యాప్తంగా పని చేస్తోన్న 10 లక్షల మందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. సాధారణంగా నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లోనే పౌల్ట్రీకి అధిక లాభాలు వస్తాయని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం వల్ల భారీ నష్టాలను చవి చూస్తున్నామని చెప్పారు. గత పది రోజుల నుంచి అమ్మకాలు 50-60 శాతం వరకు పడిపోయాయని పేర్కొన్నారు. కేంద్రం పౌల్ట్రీని నిత్యావసర ఉత్పత్తులుగా భావించి తమకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. అదే విధంగా తాము చెల్లించాల్సిన రుణాలకు ఏడాది పాటు మరిటోరియం వర్తింపజేయాలన్నారు. టీపీఎఫ్‌ ప్రెసిడెంట్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం పాల్ట్రీ పరిశ్రమ క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చక్ర గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి చక్రధర్‌రావు, దూమల్‌ ఇండిస్టీస్‌ ఛైర్మన్‌ అనీల్‌ దుమల్‌ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి అతిపెద్ద పౌల్ట్రీ ప్రదర్శన.. కోళ్ల పరిశ్రమ రంగంలో వస్తున్న అధునాతన టెక్నాలజీతో పాటు వివిధ రకాల కొత్త పోకడలను పరిచయం చేసేందుకు గాను నవంబరు 23 నుంచి 25 వరకు హైదరాబాద్‌లో అతిపెద్ద పౌల్ట్రీ ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్టుగా నిర్వహకులు తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ పదర్శన అని వివరించారు. ఈ ప్రదర్శనలో 32 దేశాలకు చెందిన పౌల్ట్రీ ప్రతినిధులు 250 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టుగా వివరించారు. ఈ ప్రదర్శనకు 20వేల మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 3, Oct 2019, 12:58 PM IST Highlights అల్లు అర్జున్ మరో కొత్త ఇంటికోసం ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ప్రతి విషయంలో స్టైలిష్ గా ఆలోచించే అల్లు హీరో కాస్ట్లీ ఇల్లు కోసం నేడు భూమి  పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. తన కుటుంబ సభ్యులతో పూజ చేసిన అల్లు అర్జున్ అందుకు సంబందించిన ఒక స్పెషల్ పిక్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త ఇంటికోసం ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ప్రతి విషయంలో స్టైలిష్ గా ఆలోచించే అల్లు హీరో కాస్ట్లీ ఇల్లు కోసం నేడు భూమి  పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. తన కుటుంబ సభ్యులతో పూజ చేసిన అల్లు అర్జున్ అందుకు సంబందించిన ఒక స్పెషల్ పిక్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.  ఇక ఆ కొత్త ఇంటికి బ్లెస్సింగ్ అనే ఒక పేరు కూడా పెట్టాడు. బన్నీ పోస్ట్ చేసిన ఫొటో నిమిషాల్లో వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా అల వైకుంఠపురములో.. షూటింగ్ లో బిజీగా పాల్గొన్న బన్నీ ఫైనల్ గా షెడ్యూల్ కి గ్యాప్ ఇచ్చి కొత్త ఇంటి పనులను మొదలుపెట్టాడు. కోట్లు ఖర్చు పెట్టి ఇంటి కన్స్ట్రక్షన్స్ వర్క్స్ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలిజీ కూడా స్ట్రాంగ్ గా వాడుతున్నట్లు సమాచారం.  ఇక బన్నీ అల వైకుంఠపురములో సినిమా విషయానికి వస్తే.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV రైతుల సంక్షేమ నిధి కోసం శ్రీరెడ్డి హాట్ ఫ్యాషన్ షో శ్రీరెడ్డి తాజాగా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొంది. అందాలు ఆరబోస్తూ ర్యాంప్‌పై హొయలొలికించింది. అయితే, ఆమె అందాలు ఆరబోసింది రైతుల కోసం. రైతుల సంక్షమ నిధి కోసం. Samayam Telugu | Updated: Nov 5, 2019, 11:02PM IST ర్యాంప్‌పై హొయలొలికిస్తోన్న శ్రీరెడ్డి హైదరాబాద్‌లో వివాదాలకు తెరలేపి చెన్నై వెళ్లిపోయింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. అక్కడ కూడా వివాదాల వైపు వెళ్లినా ఎందుకో ఈ మధ్య ఆపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మాత్రమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటోంది. అయితే, శ్రీరెడ్డి తాజాగా చెన్నై నగరంలో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో పాల్గొంది. రైతుల సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు ప్రవోలియన్ సంస్థ చెన్నైలో ప్రవోలియన్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహించింది. నవంబర్ 3వ తేదీ రాత్రి జరిగిన ఆఖరి రోజు ఫ్యాషన్ షోలో శ్రీరెడ్డి పాల్గొంది. ఈమెతో పాటు సినీ తారలు సాక్షి అగర్వాల్, హుమా ఖురేషి, సంచితాశెట్టి ర్యాంప్‌పై హొయలొలికించారు. See Photos: శ్రీరెడ్డి హాట్ ఫ్యాషన్ షో అయితే, వీరందరి కంటే శ్రీరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి కారణం ఆమె ధరించిన దుస్తులు. ఆల్ట్రా మోడరన్‌గా ఉంది ఆమె డ్రెస్. అందాలు ఆరబోస్తూ ర్యాంప్‌పై హొయలొలికించింది శ్రీరెడ్డి. ఈ ఫొటోలను తాజాగా ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసి ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు, మోడలింగ్‌లో తాము హాలీవుడ్ స్టార్స్ నికీ మినాజ్, కార్డీ బిలకు గట్టి పోటీనివ్వగలం అని కూడా శ్రీరెడ్డి పేర్కొంది. కాగా, ఈ ఫ్యాషన్ వీక్‌లో నటుడు, మోడల్ గణేష్ వెంకట్రామన్ - నిషా దంపతులు కూడా పాల్గొన్నారు. అలాగే, మాజీ క్రికెటర్, నటుడు శ్రీశాంత్‌తో పాటు పలువురు మోడళ్లు ర్యాంప్‌పై నడిచారు. ఈ షోలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు రిను అలుంకల్, రూపా పాటిల్, హీనా కౌశర్, సౌరవ్ మజుందర్, రేష్మా కున్హి, హరి ఆనంద్ రూపొందించిన దుస్తులను మోడళ్లు ప్రదర్శించారు. సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ సమీర్ ఖాన్ పర్యవేక్షణలో ఫ్యాషన్ షో జరిగింది. కాగా, శ్రీరెడ్డి దుస్తులను రిను అలుంకల్ డిజైన్ చేశారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 2, Sep 2019, 10:51 AM IST Highlights తాజాగా వినాయకచవితి సందర్భంగా చిత్రనిర్మాత రామ్ చరణ్ 'సై రా' సినిమా పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో చిరంజీవి లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు   మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను ప్రారంభించిన మూవీ యూనిట్ ఇటీవల మేకింగ్ వీడియో, సినిమా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా వినాయకచవితి సందర్భంగా చిత్రనిర్మాత రామ్ చరణ్ సినిమా పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో చిరంజీవి లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కాగా స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.
0business
Sep 26,2017 డోల్ల కంపెనీల్లోకి 6వేల కోట్ల మళ్లింపు.. న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామి కవేత్త లిక్కర్‌ డాన్‌ విజరు మాల్యా చుట్టు ఉచ్చు బిగుస్తుంది. దేశంలోని వివిధ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగొట్టి మాల్యా విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూకేలో తలదాచుకున్న ఆయనను భారత్‌కు తీసుకురావడం సులభం కానుందని తెలుస్తోంది. కింగ్‌ఫిషర్‌ పేరిట బ్యాంకుల నుంచి రూ.6,027 కోట్ల రుణాలను విజరు మాల్యా పొందారు. ఇందులో భారీ మొత్తంలోని నిధులను డోల్ల కంపెనీలకు తరలించినట్టు దర్యాప్తు సంస్థల విచారణలో బహిర్గతం అయింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లు ఆయనపై ఛార్జ్‌షీటు ఫైల్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ నిధులను అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌ వంటి ఏడు దేశాల్లోని డోల్ల కంపెనీలకు మళ్లించినట్టుగా అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన బ్యాంకు అకౌంట్‌ వివరాలతో పాటు పలు సమాచారం సేకరించినట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఐడీబీఐ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల నుంచి మాల్యా మొత్తం రూ.9000 కోట్ల రుణాలను తీసుకున్నారు. ఈ క్రమంలో రుణాలను తిరిగి చెల్లించకుండా వాటిని ఎగ్గొటేందుకు గానూ ఆయన దేశం విడిచి పారిపోయారు. ఇక డిసెంబర్‌లో మాల్యా అప్పగింతపై తుది విచారణ జరుగనుంది. ఈ విచారణ కంటే ముందస్తుగానే ఈ ఛార్జ్‌షీటును యూకేకు పంపించనున్నట్టు తెలుస్తోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అంపైర్‌కి ‘డెడ్‌ బాల్’ పాఠం చెప్పిన భువీ..! ఇన్నింగ్స్ 9వ ఓవర్‌ బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్.. ఓ బంతిని ఏమరపాటులో వికెట్ల వెనుక ఉన్న అంపైర్ పక్క నుంచే విసిరాడు. సాధారణంగా.. బౌలర్.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని క్రీజు‌లోకి వచ్చే బంతిని విసురుతుంటారు. కానీ.. ? Samayam Telugu | Updated: Jan 18, 2019, 01:12PM IST అంపైర్‌కి ‘డెడ్‌ బాల్’ పాఠం చెప్పిన భువీ..! భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మైదానంలో చాలా హుందాగా వ్యవహరిస్తుంటాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కవ్వించినా.. అతను ఎప్పుడూ సహనం కోల్పోలేదు. అలానే వికెట్ పడగొట్టినప్పుడు మితిమీరి సంబరాలు చేసుకోవడం కూడా చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ.. ఈరోజు ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో అతను ఏకంగా ఫీల్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తి చేసి.. అతనికే అంపైరింగ్ పాఠాలు చెప్పే ప్రయత్నం చేశాడు. This one was called a dead ball... #AUSvIND https://t.co/8V7ElRzZd9 — cricket.com.au (@cricketcomau) 1547782605000 అసలు ఏం జరిగిందంటే..? ఇన్నింగ్స్ 9వ ఓవర్‌ బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్.. ఓ బంతిని ఏమరపాటులో వికెట్ల వెనుక ఉన్న అంపైర్ పక్క నుంచే విసిరాడు. సాధారణంగా.. బౌలర్.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని క్రీజు‌లోకి వచ్చే బంతిని విసురుతుంటారు. కానీ.. ఈరోజు భువనేశ్వర్ బంతిని క్రీజుకి చాలా దూరం నుంచే విసరడంతో.. బ్యాట్స్‌మెన్ అరోన్ ఫించ్‌ ఆ బంతిని ఆడకుండా వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో.. అంపైర్.. ఆ బంతిని ‘డెడ్‌ బాల్’ ప్రకటించాడు. This one was called lbw... #AUSvIND https://t.co/Kno6FrQvm6 — cricket.com.au (@cricketcomau) 1547782719000 అంపైర్ నిర్ణయంపై భువీ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఆ బంతి ఎలా డెడ్‌ బాల్ అవుతుంది..? అని అంపైర్‌ను ప్రశ్నించి.. అతని సమాధానం వినకుండానే బౌలింగ్‌ చేసేందుకు వెళ్లిపోయాడు. అనూహ్యంగా.. తర్వాత బంతికే అరోన్ ఫించ్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో మూడుసార్లూ ఫించ్‌ని భువీనే ఔట్ చేయడం కొసమెరుపు..!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సొంతగడ్డపై టెస్టు సిరీస్: నేడే మొదటి మ్యాచ్ సొంతగడ్డపై రెండేళ్ల తరువాత టెస్టు సిరీస్ ఆడబోతోంది టీం ఇండియా TNN | Updated: Nov 5, 2015, 09:24AM IST సొంతగడ్డపై రెండేళ్ల తరువాత టెస్టు సిరీస్ ఆడబోతోంది టీం ఇండియా . టీ20, వన్డే సిరీస్ ను పువ్వుల్లో పెట్టి మరీ దక్షిణాఫ్రికాకు అప్పజెప్పేసిన మన ఆటగాళ్లు మరి టెస్టు సిరీస్ ఎలా ఆడతారు? దేశమంతా క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడిదే చర్చ. గురువారం ఉదయం 9.30 మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభమవ్వబోతోంది. గాంధీ-మండేలా పేరును ఈ సిరీస్‌కు పెట్టారు. ఇక కోహ్లికి స్వదేశంలో కెప్టెన్‌గా ఇదే మొదటి టెస్ట్. అయితే ఈ టెస్టు మ్యాచులో భారత్ హాట్ ఫేవరెట్ గా చెప్పుకునే పరిస్థితి కాదు. ఇప్పటికే దక్షిణాఫ్రికా టీ20, వన్టే మ్యాచుల్లో చితక్కొట్టేసింది. అందులోనూ ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుల్లో సఫారీ జట్టు కూడా ఒకటి. కనుక ఈ టెస్టు సిరీస్ కోహ్లీ సేనకు కఠిన పరీక్ష అనే చెప్పాలి. ఈ సిరీస్ అయినా గెలిస్తే పరువు దక్కినట్టు అవుతుంది. కోహ్లీ వ్యూహాలు ఫలిస్తాయా? ధోనీ... ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. దీంతో నాలుగు టెస్టుల ఆ సిరీస్ లో కోహ్లీ మొదటి, చివరి టెస్టులకు నాయకత్వం వహించాడు. అప్పుడు అతను వేసిన వ్యూహాలు, తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. ఇప్పుడు కూడా అతని కీలక సమయాల్లో కోహ్లీ నిర్ణయాలు, అతని ఫామ్ మ్యాచ్ కీలకం అవుతుందనే అనిపిస్తుంది. ఆమ్లాతో ప్రమాదమేనా... దక్షిణాఫ్రికా జట్టులో ఉన్న ఆటగాళ్లందరిలో టెస్టుల్లో విజయవంతమైన వ్యక్తిగా హషీమ్ ఆమ్లాకి మంచి రికార్డుదంది. 2010లో చివరిగా సఫారీలు ఇండియాతో భారత్ లోనే టెస్టు సిరీస్ ఆడారు. అందులో కేవలం రెండే మ్యాచుల్లో ఆడిన ఆమ్లా 490 పరుగులు చేశాడు. ఒక మ్యాచులో 253 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా, మరో మ్యాచులో 114 బంతుకే 123 పరుగులు చేశాడు. ఈసారి అతను విజృంభిస్తే టీం ఇండియాకు కష్టాలే. అయితే మొన్న జరిగిన టీ20, వన్డే సిరీస్ లో మాత్రం ఆయన అంతగా అశ్వినే కీలకం... భారత్ జట్టులో స్పిన్నర్ అశ్విన్ ఇప్పుడు కీలకమైన బౌలర్ గా మారాడు. సఫారీ జట్టును నిలువరించడానికి అశ్విన్ నే కోహ్లీ ఆయుధంలా ప్రయోగిస్తాడన్నది అందరికీ తెలిసిందే. పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని క్యురేటర్లు చెబుతున్నారు. అంతేకాదు శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల మ్యాచులో 21 వికెట్లు తీసి అశ్విన్ మంచి రికార్డును కలిగి ఉన్నాడు. భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మొత్తం టెస్టు మ్యాచుల్లో సౌతాఫ్రికా 13 నెగ్గితే, భారత్ 7 మ్యాచ్‌లు గెలుపొందింది. రెండు జట్లు చివరిసారిగా దక్షిణాఫ్రికాలో 2013-14లో టెస్టు సిరస్లో తలపడ్డాయి. ఆ సిరీస్ ను ఆతిధ్య జట్టయిన సౌత్ ఆఫ్రికా గెలుచుకుంది.
2sports
ప్రణత సుభాష్ ఫోటో గ్యాలరీ First Published 14, May 2017, 12:03 PM IST ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ ప్రణతీ సుభాష్ ఫోటో గ్యాలరీ Recent Stories
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV వీడియో: లిప్‌లాక్, బికినీతో రెచ్చిపోయిన తాప్సీ ‘ఆనందోబ్రహ్మ’ మూవీతో తెలుగుప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన తాప్సీ బాలీవుడ్‌లో తన జర్నీ కొనసాగిస్తూనే ఉంది. TNN | Updated: Aug 21, 2017, 07:21PM IST Judwaa 2 Official Trailer ‘ఆనందోబ్రహ్మ’ మూవీతో తెలుగుప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన తాప్సీ బాలీవుడ్‌లో తన జర్నీ కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ‘జూడ్వా 2’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్, జాక్విలైన్, తాప్సీ కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ ‘జుడ్వా2’ రిలీజ్‌కు రెడీ కావడంతో ప్రమోషన్స్‌లో దూసుకుపోతుంది చిత్రయూనిట్. ఈసందర్బంగా ‘జూడ్వా 2’ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మూడు నిమిషాల నిడివిగల ట్రైలర్‌‌లో యాక్షన్, లవ్, రొమాన్స్, సెంటిమెంట్ అన్నీ ఉండేలా జూడ్వా 2 ట్రైలర్‌ను కట్ చేశారు డైరెక్టర్ డేవిడ్ ధావన్. 1997లో సల్మాన్ ఖాన్-కరిష్మాకపూర్ కాంబినేషన్‌లో వచ్చి జూడ్వా మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా జుడ్వా 2ను తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ధావన్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. ఇదిలాఉంటే తాజా ట్రైలర్‌లో శ్రీలంక బ్యూటీ జాక్విలైన్ తనదైన స్టైల్‌లో అందాలు ఆరబోస్తుంటే.. ఆమెతో పోటీ పడుతూ రెచ్చిపోయి ఎక్స్‌పోజింగ్ చేసింది తాప్సీ. బికినీతో కైపెక్కించే ఫోజులు ఇస్తూ హీరోకి లిప్ లాక్ కూడా ఇచ్చేసింది తాప్సీ. 3 నిమిషాల నివిడిగల ట్రైలర్‌ మొత్తంలో ఈ తరహా లిప్ లాక్‌లు చాలానే ఉండటంతో సినిమా మొత్తంలో ఈ ముద్దుగుమ్మలు రచ్చ ఏం రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 29న థియేటర్స్‌లో సందడి చేయనుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
sumalatha 189 Views air india , promotions Air India న్యూఢిల్లీ: ఎయిరిండియాను ప్రవేటు పరం చేసే ప్రతిపాదన చర్చల దశలోఉండగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో లార్జ్‌ స్కేల్‌ ప్రమోషన్లు, అపాయింట్మెంట్‌లను నిలిపివేయాలని యాజమాన్యానికి సూచించినట్లు తెలుస్తోంది. కొత్త విమానాలను కూడా అత్యవసరమైతేనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ(దీపం) నుంచి ఈ మార్గదర్శకాలు జారీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఎయిరిండియా అధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు. ఈ ఆదేశాలు వారానికి ముందే వచ్చాయని తెలిపారు. ప్రైవేటీకరణ అసంపూర్తిగా ఉండటంతో..ఎయిరిండియాకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదనేది యాజామన్యం ఉద్దేశమట. అందుకే అపాయింట్మెంట్లు, ప్రమోషన్లను నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/
1entertainment
internet vaartha 294 Views హైదరాబాద్‌ : ప్రీమియం గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ వివో తన అప్‌గ్రేడెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వై31 ఎల్‌ను భారత్‌లో విడుదల చేసింది. నలుపు తెలుపు రంగుల్లో లభిస్తున్న ఈ ఫోన్‌ ధర 9450 రూపాయలే. 4.7 అంగుళాల డిస్‌ప్లే, 4జిఎల్‌టిఇ నెట్‌ వర్క్‌, స్నాప్‌డ్రాగన్‌ 410 క్వాడ్‌కోర్‌, వన్‌జిబిరామ్‌, 16జిబిరామ్‌, 128 జిబివరకూ విస్తరించే అవకాశం. 8 ఎంపి వెనుక కెమేరా, 5ఎంపి ముందు కెమేరాలున్నాయి. 2200ఎంఎహెచ్‌ బ్యాటరీ శక్తివంతంగా పనిచేస్తోంది. వివో ఇండియా సిఇఒ అలెక్స్‌ఫెంగ్‌ వైఎల్‌31 ఎల్‌ను విడుదల చేయడంతో భారత్‌లో మంచి మార్కెట్‌ వాటా సాధించగలమని వెల్లడించారు. ఆండ్రాయిడ్‌ 5.1 లాలిపాప్‌ ఆధారితఫన్‌టచ్‌ ఒఎస్‌ 2.1పై పనిచేస్తోంది. వన్‌జిబి రామ్‌, 16జిబి రామ్‌ అనుసంధానం చేసింది. ఈడార్క్‌ స్క్రీన్‌పై సులభంగా ఎఫ్‌అని స్వైప్‌చేస్తే ఫేస్‌బుక్‌కు తీసుకువెళుతుంది. ఎంఅని బ్రౌజ్‌ చేస్తే ప్లేమ్యూజిక్‌కు తీసుకెళుతుంది. ప్రస్తుతం 200కుపైగా నగరాల్లో వివో ఫోన్లు తమ ఉనికిని పెంచుకుంటున్నాయి. ప్రపంచం లోని అత్యుత్తమ పది స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లలో ఒకటిగా వివో గుర్తింపు తెచ్చుకుందని సిఇఒ వెల్లడించారు.
1entertainment
Hyderabad, First Published 15, Oct 2018, 5:56 PM IST Highlights టాలీవుడ్ లో యాక్షన్ హీరోలు స్మార్ట్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా మహేష్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పాలి. అటు మాస్ మరియు క్లాస్ ఆడియెన్స్ ని సమానంగా మెప్పించగలిగే ఈ హ్యాడ్సమ్ హీరోను చూసి తోటి హీరోలే ఫ్యాన్స్ గా మారిపోతారు.  టాలీవుడ్ లో యాక్షన్ హీరోలు స్మార్ట్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా మహేష్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పాలి. అటు మాస్ మరియు క్లాస్ ఆడియెన్స్ ని సమానంగా మెప్పించగలిగే ఈ హ్యాడ్సమ్ హీరోను చూసి తోటి హీరోలే ఫ్యాన్స్ గా మారిపోతారు. ఆయనకు సంబందించిన ఫొటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.  నమ్రత మహేష్ పోటోలను ఎక్కువగా అభిమానుల కోసం షేర్ చేస్తుంటారని అందరికి తెలిసిందే. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫొటో కూడా అందరిని తెగ ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు ప్రస్తుత వయసు 43. అది నిజమని నమ్మడానికి ఆయన ఫొటోలు అనుమానాల్ని కలిగిస్తాయి. ఎదురుగా ఉన్నా కూడా ప్రిన్స్ వయసు పాతికేళ్లన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  పైన కనిపిస్తోన్న ఫొటోను చూస్తుంటే అప్పుడే కాలేజ్ లో జాయినైన కుర్రాడిలా నైట్ లో ఒక సెల్ఫీ దిగినట్లు మహేష్ కనిపిస్తున్నాడు. అసలు వయసులో ఇంతలా మోసం చేసే వ్యక్తి ఎవరు ఉండరని నెటిజన్స్ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఇది మోసమే అని మరికొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ మహేష్ ఆల్వేస్ హ్యాడ్సమ్ అని ట్యాగ్స్ ఇస్తున్నారు.   Last Updated 15, Oct 2018, 5:56 PM IST
0business
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV రెమ్యునరేషన్ పెంచేసిన బాలకృష్ణ.. స్పందించిన నిర్మాత నిర్మాత సి.కళ్యాణ్‌ను బాలకృష్ణ బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారని, భారీగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై సి.కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. Samayam Telugu | Updated: Oct 31, 2019, 11:35AM IST నటిసింహా నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేశారని, ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘రూలర్’ సినిమాకు భారీగా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. గతేడాది వచ్చిన ‘జైసింహా’ సినిమాకు రూ.6 కోట్లు తీసుకున్న బాలయ్య.. ఇప్పుడు ‘రూలర్’ సినిమాకు రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఈ రెండు సినిమాలకు సి.కళ్యాణే నిర్మాత. దీంతో ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపించింది. బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేయడంతో బడ్జెన్‌ను సరిచేసుకోవడానికి మిగిలిన డిపార్ట్‌మెంట్లలో పనిచేసేవారికి సి.కళ్యాణ్ కోత విధిస్తున్నారని కూడా రూమర్ వచ్చింది. Visit Site Recommended byColombia అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత సి.కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. బాలయ్య పారితోషికం కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టే మనిషి కాదని కళ్యాణ్ అన్నారు. ‘‘బాలకృష్ణతో గతంలో పనిచేశాను. ఆయన చాలా మంచివారు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. ఎప్పుడూ ఏదీ డిమాండ్ చేయలేదు. రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతున్నారనే వార్తల్లో నిజం లేదు. మా మధ్యన రెమ్యునరేషన్ గురించి అసలు చర్చే జరగలేదు. సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది’’ అని కళ్యాణ్ చెప్పుకొచ్చారు. Also Read: అలనాటి మేటి నటి గీతాంజలి గుండెపోటుతో కన్నుమూత కాగా, ఈ సినిమాకు సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తు్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తాజాగా విడుదలైన పోలీస్ అధికారి లుక్ అయితే అభిమానులను కట్టి పడేసింది. బాలయ్య కాస్త బరువు తగ్గి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌లా పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV తెలుగులో హాలీవుడ్ హర్రర్ మూవీ ‘ఇట్’ ప్రముఖ అమెరికన్ రచయిత స్టీఫెన్ కింగ్ నవల ‘ఇట్’ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన హాలీవుడ్ హర్రర్ సినిమా తెలుగులో వస్తోంది. TNN | Updated: Aug 18, 2017, 11:36AM IST ప్రముఖ అమెరికన్ రచయిత స్టీఫెన్ కింగ్ నవల ‘ఇట్’ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన హాలీవుడ్ హర్రర్ సినిమా తెలుగులో వస్తోంది. ఆండీ మస్చెట్టి తెరకెక్కించిన ‘ఇట్’ సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అనువాదం చేసి ఒకేసారి విడుదల చేస్తున్నారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. 2013లో వచ్చిన హిట్ మూవీ ‘మామ’ తరవాత ఆండీ మస్చెట్టి దర్శకత్వంలో వస్తున్న హర్రర్ సినిమా కావడంతో ‘ఇట్’పై భారీ అంచనాలున్నాయి. కాగా, ఈ చిత్రం గురించి రచయిత స్టీఫెన్ కింగ్ మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా అద్భుతమైన చిత్రం. మీకో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇది కేవలం హర్రర్ మూవీనే కాదు, ఇదొక ప్రతిధ్వని’ అని చెప్పారు. ‘ఇట్’ నవలను స్టీఫెన్ 1980ల్లో రచించారు. ‘ఒంటరిగా ఉండే చిన్న పిల్లలంటే భూతాలకి చాలా ఇష్టం’ అంటూ సాగే తెలుగు ట్రైలర్‌ను ఇప్పటికే వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ విడుదల చేసింది. వచ్చే నెల 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
0business
Sep 17,2017 గడువు పొడిగించేది లేదు: ఆదియా బెంగళూరు: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రిటర్నుల దాఖలునకు మరింత గడువు పొడిగించే ప్రతిపాదనేది తమ వద్ద లేదని ప్రభుత్వం శనివారం తేల్చి చెప్పింది. పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్నులకు ఇచ్చిన గడువు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా వీలైనంత తొందరగా పన్ను రిటర్నులను దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్‌ ఆదియా కోరారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత కూడా పన్ను రిటర్నుల దాఖలునకు సర్కారు దాదాపు ఆరు నెలల పాటు సమయమిస్తూ వచ్చిందని అన్నారు. రిటర్నుల దాఖలునకు ఇప్పటికే తాము చాలా సదీర్ఘమైన గుడువు కాలాన్ని ఇచ్చినట్టుగా తెలిపారు. ఇకపై దీనిని మరింత పొడిగించే అవకాశమే లేదని వివరించారు. ఈ దిశగా వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు దాదాపు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ఫారమ్‌గా ఉండే జీఎస్టీఆర్‌-3బీ దాఖలునకు సర్కారు డిసెంబరు వరుకు గడువునిచ్చింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 93 Views ROHITH SHARMA Rohith Sharma పల్లెకలె: ఐదు వన్డేలో సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతోన్న మూడో వన్డేలో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ (100; 118 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌) శతకం సాధించారు. చమీరా వేసిన 34.6 బంతికి సింగిల్‌ తీసి సెంచరీ చేశారు. ప్రస్తుతం 44 ఓవర్లు ముగిసే సరికి టీమిండిమా నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. మరో బ్యాట్స్‌మెన్‌ ధోనీ (33, 52 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజుల్లో ఉన్నాడు. వీరిద్దరూ 100 పరుగులు (118 బంతుల్లో) భాగస్వామ్యం నెలకొల్పారు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సన్నీ లియోన్‌కు ధోని షాక్.. ఆమె కన్నా ఈయనే డేంజరట..! Sunny Leone | డబ్బులు ఊరికే రావు.. కష్టపడి సంపాదించాల్సిందే. అలాగే డబ్బులను ఊరికనే పోగొట్టుకోకూడదు. ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Samayam Telugu | Updated: Oct 23, 2019, 02:47PM IST హైలైట్స్ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు మాయం కావొచ్చు టాప్ 10 డేంజరస్ సెలబ్రెటి లిస్ట్ విడుదల చేసిన మెకాఫ్ ఇందులో టాప్‌లో ఎంఎస్ ధోనీ తర్వాతి స్థానంలో సచిన్.. సన్నీ లియోన్, పీవీ సింధుకు కూడా చోటు సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ మొత్తానికి ఆమె గురించి బాగా తెలుసు. ధోని, సచిన్ వంటి దిగ్గజాల గురించి కూడా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఎందుకని వీళ్ల ప్రస్తావన వచ్చిందంటే.. ధోని, సచిన్‌లు సన్నీ లియోన్‌ కన్నా చాలా డేంజరస్. ఈ మాట అంటున్నది నేను కాదు. మెకాఫ్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ. మెకాఫ్ తాజాగా మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ లిస్ట్ 2019ను విడుదల చేసింది. ఇందులో ఎంఎస్ ధోని టాప్‌లో ఉన్నారు. ఈయన తర్వాతి స్థానంలో సచిన్ టెండూలర్క్ నిలిచారు. ఇక నాలుగో స్థానంలో సన్నీ లియోన్ ఉన్నారు. మూడో స్థానంలో గౌతమ్ గులాటి నిలిచారు. Also Read: శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే? Most Dangerous Celebrity List 2019 టాప్ 10లో బాద్‌షా, రాధిక ఆప్టే, శ్రద్ధా కపూర్, హర్మన్‌ప్రీత్ కౌర్, పీవీ సింధు, క్రిస్టియానో రొనాల్డో వంటి వారు ఉన్నారు. మీరు ధోని, సచిన్, సన్నీ లియోన్ వంటి టాప్ 10లో ఉన్న వారి పేర్లను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే మీ ఆర్థిక సమాచారం ప్రమాదంలో పడిపోయే అవకాశముందని మెకాఫ్ తెలిపింది. Also Read: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? మీకోసం అదిరిపోయే దీపావళి ఆఫర్లు.. రూ.15,000 క్యాష్‌బ్యాక్! జాబితాలోని వారి పేర్లతో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినప్పుడు మోసపూరిత వెబ్‌సైట్లు, వైరస్‌ల బారినపడే అవకాశముందని మెకాఫ్ హెచ్చరిస్తోంది. సైబర్ క్రిమినల్స్ కన్సూమర్లను ఆకర్షించేందుకు ఈ సెలబ్రిటీలకు సంబంధించిన కంటెంట్‌తో మోసపూరిత వెబ్‌సైట్లను, లింక్‌లను క్రియేట్ చేస్తుంటారని, వీటిల్లోకి ఎంటర్ అయినప్పుడు మాల్వేర్ సాయంతో వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరిస్తారని వివరించింది. Also Read: ఎస్‌బీఐలో డబ్బులు పెడితే.. ఏడాదిలోనే అదిరిపోయే లాభం..! వెబ్‌సైట్స్ లేదా లింక్‌లపై క్లిక్ చేయడంతో ఐడెంటిటీ థెఫ్ట్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, స్కిమ్మింగ్ మాల్వేర్ ఇన్‌స్టాలేషన్, ట్రాకింగ్, మానిటరింగ్ సాఫ్ట్‌వేర్, రాన్‌సమ్‌వేర్ ఇన్‌స్టాలేషన్, ట్రోజన్స్ వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని మెకాఫ్ హెచ్చరించింది. యూజర్ వివరాలు దొంగలించడంతో హ్యాకర్లు బ్యాంకింగ్ వివరాలను పొందే ప్రమాదముందని తెలిపింది. దీంతో డిపాజిట్లు, ఇతర ఫైనాన్సియల్ ఆస్తులకు రిస్క్ కలగొచ్చని పేర్కొంది.
1entertainment
2018 common wealth games india hope sakshi malik FOLLOW US ON 101 Views | 2018 కామన్ వెల్త్ క్రీడల్లో భారత ఆశాకిరణం సాక్షి మాలిక్ మహిళా‌ రెజ్లింగ్‌ విభాగంలో ఒలంపిక్ పథకం అందుకున్న మొట్ట మొదటి భారతీయురాలు సాక్షి మాలిక్. ఇప్పుడు ఈ మల్లయోధురాలు రెండో సారి కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొంటోంది. ఈమె పై మన వాళ్లకు గంపెడు ఆశలున్నాయి. Press CTRL+C to copyX <iframe src="//tvid.in/1x1m3xcgok/lang?autoplay=false" style="height: 100%; width: 100%; max-height: 100%; max-width: 100%; visibility: visible;" border="0" frameborder="0" seamless="" scrolling="no" allowfullscreen="true" mozallowfullscreen="true" allowtransparency="true"></iframe> Facebook
2sports
- ప్రయివేటు డెయిరీల్లో గుబులు - పాల సేకరణదారులపైనా ప్రభావం నవతెలంగాణ, సిటీబ్యూరో               ఇప్పటికే గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటె డ్‌ (జిసిఎంఎంఎఫ్‌) నుంచి అమూల్‌ పాలు రాష్ట్ర మార్కెట్లో సృష్టిస్తున్న ప్రకంపనలు చల్లారక ముందే ఇప్పుడు కొత్తగా కర్ణాటక నుంచి కూడా పాల తాకిడి సోకనుంది. దీంతో రాష్ట్రంలో పాల సేకరణ ధరలు, అమ్మకపు ధరలు పడిపోయే అవకాశముంది. ఈ విషయం ప్రయివేటు డెయిరీల్లో గుబులు రేపుతోంది. దీంతో పాల సేకరణదారుల పైనా ప్రభావం పడే అవకాశముంది.రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 20 లక్షల లీటర్ల పాలు సరఫరా అవుతున్నాయి. అందులో విజయ డెయిరీ వాటా 4.5 లక్షల లీటర్లు. మిగతావి ప్రయివేటు డెయిరీలు సరఫరా చేస్తున్నాయి. పాల ద్వారా వివిధ ఉత్పత్తులను తయారు చేస్తూ మార్కెట్‌లో విక్రయాలు జరుపుతున్నాయి. విజయ డెయిరీ ప్రభుత్వ సంస్థ కాగా, మదర్‌ డెయిరీ రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటైంది. హెరిటేజ్‌, జెర్సీ, తిరుమల, మస్కతి తదితర ప్రయివేటు డెయిరీల ఆధిపత్యం రాష్ట్రంలో పెరిగింది. దాంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. విజయ డెయిరీకి పాలు పోసే రైతులు తగ్గిపోవడంతో లక్షన్నర లీటర్లను కర్ణాటక సహా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్‌ సంస్థ అమూల్‌ బ్రాండ్‌ రాష్ట్రంలో అడుగుపెట్టింది. నాచారం సమీపంలోని మల్లాపూర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. గుజరాత్‌ నుంచి ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చిన పాలను ప్యాకింగ్‌ చేసేందుకు నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్‌ (నార్మాక్‌)తో జిసిఎంఎంఎఫ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రకారం హయత్‌నగర్‌లోని యూనిట్‌లో ప్యాకింగ్‌ చేసి వినియోగదారులకు సరఫరా చేస్తోంది. 'నందిని' పాలను ప్రత్యేక పద్ధతుల ద్వారా ఇక్కడకు తీసుకురానున్నారు. 'నందిని' పాల సంస్థ కూడా నార్మాక్స్‌తోనే ఒప్పందం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్యాకింగ్‌ విషయం తేలాల్సి ఉంది. తగ్గనున్న పాల ధరలు           ఇప్పటి వరకు రాష్ట్రంలోని విజయ డెయిరీకి పాలు సరఫరా చేసిన కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ హైదరాబాద్‌ మార్కెట్‌పైనే దృష్టిసారించింది. త్వరలో 'నందిని' ఆవు పాలను మన మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఆ రాష్ట్రంలో నందిని బ్రాండ్‌ కింద ఫెడరేషన్‌ నిత్యం 32 లక్షల లీటర్ల పాలు విక్రయిస్తోంది. పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. నందిని ప్రస్తుతం కర్ణాటకలో కేవలం రూ. 29కే లీటరు పాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో లీటర్‌ పాల ధర రూ.44. నందిని పాల రాకతో రాష్ట్రంలో పాల ధరల్లో మార్పులు చేసుకోనున్నాయి. కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు పాలు తీసుకురావడానికి రవాణా ఖర్చుతో కలిపి లీటర్‌కు రూ.35 వరకు నిర్ణయించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గుజరాత్‌ నుంచి పాలు తీసుకొస్తున్న జిసిఎంఎంఎఫ్‌కు లీటర్‌కు రూ.3.50పైసల వరకు ఖర్చు చేస్తూ ప్యాకింగ్‌ జరిపి, ఇక్కడ లీటర్‌కు రూ.44 మేరకు విక్రయిస్తోంది. ఇప్పుడు కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థ నుంచి వస్తున్న నందిని బ్రాండ్‌ పాలు కూడా విపణిలోకి వస్తే ఆ ప్రభావం రాష్ట్ర మార్కెట్‌పై బాగానే పడే అవకాశం ఉంది. పాలసేకరణదారులపై ప్రభావం             అమూల్‌, నందిని పాలు ఇక్కడ నేరుగా విక్రయాలు జరపడం వల్ల సన్న, చిన్నకారు రైతులు ఉత్పత్తి చేసే పాలకు గిరాకీ లేకుండా పోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గుజరాత్‌కు చెందిన అమూల్‌ (జిసిఎంఎంఎఫ్‌) నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్‌ (నార్మాక్‌)తో ఒప్పందం చేసుకున్న సందర్భంలో నగరంలోని పాల సేకరణదారులు ఆందోళన చేశారు. నగరంలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న పాల సేకరణదారుల పొట్టగొట్టడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.           ఇతర రాష్ట్రాల సంస్థలు అక్కడి పాలను ఇక్కడకు తరలించి నేరుగా పాల విక్రయాలు జరపడం వల్ల రాష్ట్ర పాడిపరిశ్రమ దెబ్బతినే అవకాశాలున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రాష్ట్ర రైతాంగం పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Gangooly కుంబ్లే-కోహ్లీ వివాదంపై తొలిసారి స్పందించిన గంగూలీ న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో సంక్షోభం సృష్టించిన అనిల్‌ కుంబ్లే-విరాట్‌ కోహ్లీల విభేదాలపై టీమిండియా మాజా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తొలిసారి స్పందించారు. ఈవ్యవహారంలో బిసిసిఐ కొంత పరిణితి తో వ్యవహరించి ఉంటే బాగుటండేదనే అభిప్రాయాన్ని గంగూలీ వ్యక్తం చేశాడు. టీమిండియా కొత్త కోచ్‌లను ఎంపిక చేసేందుకు ఏర్పాటైన క్రికెట్‌ సలహా కమిటీలో గంగూలీ కూడా ఓ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కుంబ్లే-కోహ్లీ వివాదంపై తొలిసారి స్పందించిన గం గూలీ ఈ వ్యవహారాన్ని బిసిసిఐ సరిగా హ్యాండిల్‌ చేయలేదని చెప్పాడు. కుంబ్లే- కోహ్లీ మధ్య జరిగిన వ్యవహా రాన్ని మెరుగ్గా పరిష్కరిస్తే బాగుండేదన్నారు. ఈవ్యవ హారంలో బిసిసిఐ సరిగ్గా వ్యవహరించలేదన్నారు. కోచ్‌ రేసులోకి వచ్చిన రవిశాస్త్రి గురించి గంగూలీ స్పందిస్తూ ఎవరైనా కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరిపాలన మండలిలో లేనట్లయితే నేను కూడా దరఖాస్తు చేసుకొని ఉండేవాడినన్నారు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రషీద్‌కి 30 ఏళ్ల అనుభవం వచ్చేసింది..! అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్ రషీద్ ఖాన్ వయసు 19ఏళ్లే కానీ.. అతనికి ఇప్పటికే 30 ఏళ్ల వ్యక్తికి ఉండే అనుభవం వచ్చేసిందని ఆ జట్టు కోచ్ ఫిల్ సిమన్స్ Samayam Telugu | Updated: Jun 2, 2018, 02:19PM IST రషీద్‌కి 30 ఏళ్ల అనుభవం వచ్చేసింది..! అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్ రషీద్ ఖాన్ వయసు 19ఏళ్లే కానీ.. అతనికి ఇప్పటికే 30 ఏళ్ల వ్యక్తికి ఉండే అనుభవం వచ్చేసిందని ఆ జట్టు కోచ్ ఫిల్ సిమన్స్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన రషీద్ ఖాన్.. మొత్తం 17 మ్యాచ్‌లాడి 21 వికెట్లు పడగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌, బ్యాటింగ్, ఫీల్డింగ్‌కి ప్రపంచ వ్యాప్తంగా మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. అతని ఆటకి ఫిదా అయిన భారత క్రికెట్ అభిమానులు రషీద్‌కి భారత పౌరసత్వం ఇవ్వాలంటూ ట్విటర్‌లో ప్రభుత్వాన్ని కోరగా.. ఆ ట్వీట్స్‌కి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు సైతం స్పందించారు. బెంగళూరు వేదికగా జూన్ 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టుతో అఫ్గానిస్థాన్ ఢీకొననున్న నేపథ్యంలో.. ఫిల్ సిమన్స్ మీడియాతో మాట్లాడాడు. ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్‌కి ఇదే తొలి టెస్టు మ్యాచ్. ‘రషీద్ ఖాన్ వయసు ఇప్పుడు 19 ఏళ్లే. కానీ.. అతను ఇప్పటికే 30 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిలా కనబడుతున్నాడు. జట్టు తన నుంచి ఏం ఆశిస్తుందో..? అతనికి బాగా తెలుసు. అతని సహచర స్పిన్నర్ ముజీబ్ వయసు 17 ఏళ్లే. అతను ఇంకా యువకుడు.. నేర్చుకోవాల్సి ఉంది. భారత్‌పై తొలి టెస్టులో వారిపై పెట్టుకున్న ఆశలకి వారు ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాలి..!’ అని కోచ్ ఫిల్ సిమన్స్ వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
SMITH స్మిత్‌ను ఢీకొన్న బెన్‌ స్టోక్స్‌ న్యూఢిల్లీ: ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి షాకిచ్చింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనం తరం 156 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన పుణే 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులతో కోల్‌కతాపై నెగ్గింది.అయితే ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఓ షాకింగ్‌ ఘటన జరిగింది. బౌండరీ వద్ద కెప్టెన్‌ స్మిత్‌,అల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ఢీకొన్నారు. దీంతో స్మిత్‌ కొద్దిసేపు విలవిల్లాడి పోయాడు. మైదానంలో అంతకు ముందులాగా కదల్లేక పోయాడు. మ్యాట్‌ తీసుకురావాలని బెన్‌ స్టోక్స్‌ ఫిజియోను పిలిచినా కష్టమ్మీద స్మిత్‌ నడుచు కుంటూ వెళ్లిపోయాడు.ఈ సంఘట పుణే బౌలర్‌ జయదేవ్‌ ఉనాద్కత్‌ వేసిన 19వ ఓవర్‌లో చోటు చేసుకుంది.19వ ఓవర్‌కు చెందిన 5వ బంతిని కోల్‌కతా ఆటగాడు కోల్టర్‌ నైల్‌ భారీ షాట్‌ ఆడాడు.బౌలర్‌ అవతలపడే బంతిని ఎలాగైనా ఆపాలని, వీలైతే క్యాచ్‌ పట్టాలని స్మిత్‌ ప్రయత్నించాడు.అదే సమయంలో బెన్‌స్టోక్స్‌ కూడా బంతిని ఆపాలని పరుగెత్తుకుంటూ బౌండరీ లైన్‌ వద్దకు వచ్చాడు. ముందుగా స్టోక్స్‌ తన చేతిలో పడిన బంతిన గాల్లోకి విసురుతూ బౌండరీ లైన్‌ దాటాడు. అయితే ఈ క్రమంలో స్టోక్స్‌ గట్టిగా తగలడంతో బౌండరీ లైన్‌ అవతల ఉన్న సైన్‌ బోర్డుకు స్టీవ్‌ స్మిత్‌ తల గుద్దుకుంది.వెంటనే స్టోక్స్‌ ఫిజియోని రమ్మని పిలిచాడు.ఇంతలో స్మిత్‌ కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు.ఫిజియో వచ్చినా స్మిత్‌ ఎవరి సాయం లేకుండా నొప్పి ఉన్నా అలాగే నడుచుకుంటూ వెళ్లిపోయాడు.ఆ తరువాత బ్యాటింగ్‌లో కొంత ఇబ్బంది పడినట్లు కనిపించాడు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV మెల్‌బోర్న్ టెస్టులో రెండో రోజు ముగిసిన ఆట ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్‌నైట్ స్కోరు 215/2తో తొలి ఇన్నింగ్స్‌‌ని కొనసాగించిన భారత్ జట్టులో చతేశ్వర్ పుజారా (106: 319 బంతుల్లో 10x4), విరాట్ కోహ్లి (82: 204 బంతుల్లో 9x4), రోహిత్ శర్మ (63 నాటౌట్: 114 బంతుల్లో 5x4) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు Samayam Telugu | Updated: Dec 27, 2018, 02:51PM IST మెల్‌బోర్న్ టెస్టులో రెండో రోజు ముగిసిన ఆట ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని గురువారం 443/7 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు ఈరోజు ఆట ముగిసే సమయానికి 8/0తో నిలిచింది. క్రీజులో ఓపెనర్లు అరోన్ ఫించ్ (3 బ్యాటింగ్: 23 బంతుల్లో), హారిస్ (5 బ్యాటింగ్: 13 బంతుల్లో) ఉన్నారు. ఆట ఇంకా మూడు రోజులు మిగిలి ఉండగా.. పిచ్ క్రమంగా బౌలర్లకి అనుకూలంగా మారుతోంది. ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్‌నైట్ స్కోరు 215/2తో తొలి ఇన్నింగ్స్‌‌ని కొనసాగించిన భారత్ జట్టులో చతేశ్వర్ పుజారా (106: 319 బంతుల్లో 10x4), విరాట్ కోహ్లి (82: 204 బంతుల్లో 9x4), రోహిత్ శర్మ (63 నాటౌట్: 114 బంతుల్లో 5x4) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. మిడిల్ ఓవర్లలో అజింక్య రహానె (34: 76 బంతుల్లో 2x4), రిషబ్ పంత్ (39: 76 బంతుల్లో) కాసేపు రోహిత్ శర్మకి అండగా క్రీజులో నిలిచినా.. మెరుగైన స్కోరు చేయలేకపోయారు. దీంతో.. జట్టు స్కోరు 443 వద్ద రవీంద్ర జడేజా (4: 3 బంతుల్లో 1x4) ఔటవగానే భారత్ ఇన్నింగ్స్‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కేసీఆర్ రాలేదు, పవన్ కళ్యాణ్ రాలేదు 'జాగ్వార్' ఆడియో లాంఛ్ వేడుక కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు సినీ నటుడు, జనసేన అధినేత ఒకే వేదిక పైకి వస్తున్నారు అంటూ మీడియాలో కొద్ది రోజులుగా హాడావిడి జరిగింది. పవర్‌ఫుల్‌గా మాట్లాడే కేసీఆర్, పవన్ ఇద్దరూ ఒకే వేదికపైకి వస్తే... TNN | Updated: Sep 19, 2016, 02:17PM IST కేసీఆర్ రాలేదు, పవన్ కళ్యాణ్ రాలేదు ' జాగ్వార్ ' ఆడియో లాంఛ్ వేడుక కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు సినీ నటుడు, జనసేన అధినేత ఒకే వేదిక పైకి వస్తున్నారు అంటూ మీడియాలో కొద్ది రోజులుగా హాడావిడి జరిగింది. పవర్‌ఫుల్‌గా మాట్లాడే కేసీఆర్, పవన్ ఇద్దరూ ఒకే వేదికపైకి వస్తే ఎలా ఉంటుంది? ఇద్దరూ ఏం మాట్లాడతారు? అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఆ క్షణం కోసం అందరూ ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే అలాంటిదేమి జరగలేదు. 'జాగ్వార్' ఆడియో విడుదల వేడుక ఆదివారం హైదరాబాదులో జరిగింది. ​ అయితే తప్పకుండా వస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్, రాకుండా హ్యాండ్ ఇచ్చారు. మరోవైపు సీఎం కేసీఆర్ తనకు బదులుగా తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ను పంపారు. నిజానికి ఇంతకు ముందే కుమారస్వామి వీరిద్దరినీ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న తన కుమారుడి సినిమా ఆడియో లాంఛింగ్‌కు హాజరు కావాలని పవన్ కళ్యాణ్‌ని ఇంటికెళ్లి కలిశారు. గత 8 ఏళ్లుగా తమ మధ్య అనుబంధం వుందని.. పవన్ కళ్యాణ్ తనకి సోదరుడి లాంటి వాడు మాత్రమే కాకుండా తాను సైతం పవన్‌కి వీరాభిమానిని ఆ సందర్భంగా కుమారస్వామి అన్నారు.
0business
Jan 12,2017 అప్పుల భారం పెరుగుతోంది: ఉర్జిత్‌ గాంధీనగర్‌: దేశ రుణ భారం అంతకంతకు పెరిగిపోతుండడం పట్ల 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ) గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించేందుకు సర్కారు చర్యలను ముమ్మరం చేయాలని ఆయన కోరారు. 'వైబ్రెంట్‌ గుజరాత్‌ సమిట్‌'లో పాల్గొన్న ఉర్జిత్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల స్వీకరణను తగ్గించుకొనేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న దానికంటే అధిక అప్పుల పెరగడం కారణంగా దేశ సావరిన్‌ రేటింగ్‌కు ముప్పు నెలకొందని అన్నారు. 2016-17కు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలను కలుపుకొని జీడీపీలో దేశ ద్రవ్యలోటు 6.4 శాతంగా నిర్దేశించుకున్నట్టుగా తెలిపారు. ఇది మిగతా జీ20 దేశాలన్నింటి కంటే కూడా ఎక్కువని ఆయన అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి గణాంకాలను ఉటంకిస్తూ ఊర్జిత్‌ ఈ ప్రకటన చేయడం విశేషం. జీ20 దేశాలతో పోలిక వల్ల వాస్తవాలు అవగతం అవుతాయని అన్నారు. ఆర్థిక ఒడుదుడుకులను నియంత్రించుకొనేందుకు కూడా ఉపకరిస్తుందన్నారు. వ్యవస్థలో రుణ వితరణ పెరిగే దిశగా బ్యాంకులపై ఆర్‌బీఐ ఒత్తిడి ఇకపై కూడా కొనసాగుతుందని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్‌కు కొన్ని వారాల ముందుగా ఆర్‌బీఐ గవర్నరే స్వయంగా రుణ భారంపై ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయమైంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
జాతీయ జూనియర్‌ ఖోఖో పోటీలకు తెలంగాణ బాలబాలికల జట్లు   ఫతేమైదాన్‌,నవంబర్‌ 7 ప్రభాతవార్త: ఉత్తరప్రదేశ్‌లోని అజాంఘాడ్‌ పట్టణంలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరుగునున్న 36వ జాతీయ జూనియర్‌ ఖోఖోపోటీలలో తెలంగాణ బాలబాలికల జట్లు పాల్గొననున్నావి. జాతీయ పోటీలకు ఎంకైనా తెలంగాణ ఖోఖో క్రీడా కారులకు సోమవారం ఎల్బీస్టేడియంలో శాట్స్‌చైర్మన్‌ అలిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, క్రీడాకారులకు తన ఛాంబర్‌లో కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఖోఖో పోటీలలో ఖోఖో క్రీడాకారులు అత్యు త్తమ ప్రతిభకనబర్చి తెలంగాణ రాష్ట్రానికి పతకాలు సాధించి తీసుకు రావాలని ఆయన అన్నారు. క్రీడాకారులు రాష్ట్ర ప్రభుత్వం అనేక సదుపా యాలు కల్పిస్తుంది కాబట్టి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రతిభగల క్రీడాకారులకు రాష్ట్రంలో మంచి ప్రోత్సహం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస్‌ రావు, రంగారెడ్డి ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి కె.రామక్రిష్ణ, తెలంగాణ ఖోఖో సంఘం సలహాదారుడు, మాజీ శాప్‌ డిప్యూటీ డైరెక్టర్‌ హరిశ్‌ మొలే తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఖోఖో పోటీలకు ఎంపికైన క్రీడాకారుల బాలుర జట్టు: బి.మహేష్‌ (క్యాప్టెన్‌), బి.తరణ్‌కుమార్‌, ఎం.శ్రీకాంత్‌, వి.సుభాష్‌, ఎం.శ్రీకాంత్‌, కె.అన్వేశ్‌, వి.సోమ్‌రాజ్‌, వి.నందులాల్‌, వి.నరేష్‌, పి.నవీణ్‌, శశికుమార్‌, పి.బాబు రావు, కోచ్‌ : వి.తిరుమల్‌, మేనేజర్‌ : శ్రీకాంత్‌. బాలికల జట్టు : టి.నందిని (క్యెప్టెన్‌) ఎం.రేనుక, ఏ.రమా, పి.మాధవి, సిహెచ్‌.రవళి, ఎస్‌.అపర్ణ, బి.ప్రవీణా, కె.అనూష, ఎం.కార్తీక, వి.కీర్తి, కోచ్‌ : వి.నవీణ్‌కుమార్‌, మేనేజర్‌ ఇ.సౌజన్య.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Bigg Boss Episode 42 Highlights: బిగ్ బాస్ టుడే: కింగ్ ప్లేస్‌లో క్వీన్.. హోస్టింగ్ Ramya Krishna Bigg Boss Host: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 41 ఎపిసోడ్‌లను పూర్తి చేసి శనివారం నాటితో 42 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. Samayam Telugu | Updated: Sep 1, 2019, 06:22PM IST Bigg Boss Episode 42 Highlights: బిగ్ బాస్ టుడే: కింగ్ ప్లేస్‌లో క్వీన్.. హోస్ట... ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగ్గాయెత్తు’ అనే నాగార్జున, రమ్యకృష్ణ ఎవర్ గ్రీన్‌ సాంగ్‌తో బిగ్ బాస్ నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సాంగ్ వేయడం వెనుక బలమైన కారణమే ఉందనేది హౌస్ మేట్స్.. తరువాత తెలుసుకోగా ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఇక ఎంట్రీలోనే హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి.. స్పెషల్ వీడియో ద్వారా ప్రేక్షకులతో ముచ్చటించారు. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్లానని.. అందుకే బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి కాకుండా స్పెయిన్ నుండి వీడియో ద్వారా మాట్లాడుతున్నా అన్నారు. ఇక తన ప్లేస్‌లో ఈవారం హోస్ట్‌గా కింగ్ ప్లేస్‌లో క్వీన్ రమ్యకృష్ణ వస్తుందని పరిచయం చేశారు. Read Also: బిగ్‌ బాస్‌లో యాంకర్ శిల్పా చక్రవర్తి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ! నా మాటే శాసనం.. శివగామి అనంతరం శివగామిగా బ్యూటిఫుల్ లేడీ రమ్యకృష్ణ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ‘నా మాటే శాసనం’ రెడ్ కలర్ శారీలో షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చీరావడంతో తన హాటెస్ట్ హీరో నాగార్జున బర్త్ డే విషెష్ చెప్పి హౌస్‌లో కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో ‘మన’ టీవీ ద్వారా చూపించారు. బంగార్రాజు (నాగార్జున) గుండెల్లో గిత్తలు పరిగెట్టించిన క్వీన్ రమ్యకృష్ణ బిగ్ బాస్ హౌస్‌లో షాకింగ్ ఎంట్రీ చూసి అవాక్కయ్యారు కంటెస్టెంట్స్. తను ఎందుకు బిగ్ బాస్ హౌస్‌కి వచ్చానో వివరిస్తూ ఈ రెండు రోజులూ ఈ కింగ్ ప్లేస్‌లో ఈ క్వీన్ హోస్ట్‌గా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చింది రమ్యకృష్ణ. Read Also: ‘నా మాటే శాసనం’.. ప్చ్!! ఎలిమినేషన్ లేదట! నాగార్జున స్పెషల్ ఎంట్రీ.. అనంతరం నాగార్జున స్పెయిన్ నుండి ప్రత్యేకమైన వీడియోతో రమ్యకృష్ణ, బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ముచ్చటించారు. నేను బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్లడం వల్ల ఈ రెండు రోజులు బిగ్ బాస్ హౌస్‌కి రాలేకపోయానని అందుకే ఈ కింగ్ ప్లేస్‌లో క్వీన్ రమ్య వచ్చిందని చెప్పారు. అనంతరం నాగార్జునకు బర్త్ డే విషెష్ అందించారు కంటెస్టెంట్స్. అనంతరం బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌తో సరదా సరదా టాస్క్ ఆడించారు. ఇద్దరు కంటెస్టెంట్స్‌ను పిలిచి వాళ్లలో మీకు నచ్చింది.. నచ్చనిది ఏంటి అంటూ వెంట వెంటనే చెప్పాలని టాస్క్ ఇచ్చారు. అనంతరం కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరుగా వచ్చి ఒకవైపు పొగుడుతూనే.. మరోవైపు వాళ్లపై ఉన్న కంప్లైంట్స్ చెప్పారు. Read Also: రమ్యకృష్ణ కోసం ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ నాగార్జునకు రిక్వెస్ట్ రాహుల్ సాంగ్ అదుర్స్.. నాగ్‌కి బర్త్ డే గిఫ్ట్ నాగార్జున బర్త్ డే సందర్భంగా సింగర్ రాహుల్ అదరగొట్టే సాంగ్‌ను కంపోజ్ చేశారు. లిరిక్స్‌లో బాబా భాస్కర్, వరుణ్‌లు సాయం చేయగా.. ఆ పాటను అద్భుతంగా ఆలపించారు రాహుల్. ఆయనే దరువు వేస్తూ పాటపాడుతుండగా.. హౌస్ మేట్స్ అందరూ ట్యూన్‌కి లిరిక్స్‌కి తగ్గట్టుగా అదిరిపోయే స్టెప్పులను వేశారు. ఈ సాంగ్‌కు రమ్యకృష్ణతో పాటు ప్రేక్షకులు కూడా ఇంప్రెస్ అయ్యారు. హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఎలా చేసిందంటే.. అయితే నేటి ఎపిసోడ్‌లో హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ హోస్ట్‌గా ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడినా మెల్లగా పుంజుకుంది. నాగార్జునతో ఫోన్ సంభాషణలో బంగార్రాజూ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. రమ్య నిన్ను చూస్తుంటే గుండెల్లో గిత్తలు పరిగెడుతున్నాయ్ అని నాగ్ అంటే రమ్యకృష్ణ తెగ సిగ్గుపడింది. అయితే స్క్రిప్ట్ ప్రకారం చదువుతున్నట్టుగానే ఉంది తప్ప నేచురల్‌గా అనిపించలేదు. నా మాటే శాసనం అని అదిరిపోయే ఎంట్రీ ఇచ్చినా శివగామికి హోస్ట్‌గా మంచి మార్కులే పడ్డాయి కాని.. మరో రెండు వారాలు చేస్తే.. నాగ్‌ని మించిపోగలదు అన్నట్టుగానే అనిపించింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
internet vaartha 289 Views ఆట డెస్క్‌ :  2వ వన్డేలో భారత మహిళలు ఆసీస్‌పై విజయకేతనం ఎగురవేశారు. వర్షంకారణంగా మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించారు. 66 పరుగులు టార్గెట్‌గా నిర్ణయించారు.  ఈస్కోర్‌ను ఇంకా 5 బాల్స్‌ మిగిలి ఉండగానే  భారత్‌ తన లక్ష్యాన్ని సాధించింది.  కెప్టెన్‌ మిథాలీరాజ్‌ 37, మందానా 22 పరగులతో నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ధారిత 18 ఓవర్లలో ఎమినిది వికెట్ల నష్టానికి 125 పరుగులుచేసింది.  ఆ తర్వాత భాతర్‌ 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది.  అయితే ఎనిమిదో ఓవర్‌లో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కల్గింది. దీంతో 10 ఓవర్లకు  కుదించారు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పవన్‌కు వెంకయ్య చురకలు ప్రత్యేక ప్యాకేజీపై అర్ధరాత్రి ఎందుకు ప్రకటన చేశారన్న పవన్ వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు కౌంటరిచ్చారు. TNN | Updated: Jan 30, 2017, 09:53PM IST ప్రత్యేక ప్యాకేజీపై అర్ధరాత్రి ఎందుకు ప్రకటన చేశారన్న పవన్ వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు కౌంటరిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాంతాలను విడగొట్టి దక్షణాది, ఉత్తరాది అని అనటం సమంజసం కాదని, ఇది రాజకీయ సంకుచిత మనస్తత్వమే అని, తాత్కాలిక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల్ని పొందటానికి చేసే ప్రయత్నమే.. దేశం అంతా ఒకటే అని గ్రహించాలంటూ పవన్&zwnj;కి పరోక్షంగా చురకలంటించారు. అసలు ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన ఎప్పుడు చేస్తే ఏంటని . . కొంతమంది అనవసరంగా వితండవాదం చేస్తున్నారని ప్రజలు నిద్రపోయినా 24 గంటలు ప్రభుత్వం మేలుకొని పాలన కొనసాగిస్తోందని, పరిపాలన నిరంతర ప్రక్రియ అని అవి నిద్రపోవని, ఆరోజు అర్థరాత్రి వరకూ సుదీర్ఘ చర్చల అనంతరమే నిర్ణయం తీసుకున్నాంఅని, పోలవరానికి వంద శాతం నిధులివ్వడం, ప్రాజెక్టులకు సంబంధించిన బడ్జట్&zwnj;పై సీఎం చంద్రబాబుతో చర్చించామని, ఆ తర్వాత ఆయన కొత్త సూచనలు చేశారని తెలిపారు. ప్యాకేజీపై ఆర్థిక మంత్రితో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ప్రకటించామని వివరించారు.
0business
Hyderabad, First Published 21, Aug 2018, 2:30 PM IST Highlights అప్పటివరకు బాలీవుడ్ సీరియల్స్ లో, అలానే పంజాబీలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ 'RX100' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అప్పటివరకు బాలీవుడ్ సీరియల్స్ లో, అలానే పంజాబీలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ 'RX100' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో యూత్ ని ఆకట్టుకుంది. దీంతో ఆమెకి సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అమ్మడు మాత్రం సెలెక్టెడ్ కథలను మాత్రమే ఎన్నుకుంటుంది. ఈ క్రమంలో తేజ-బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ని తిరస్కరించింది. అఖిల్-వెంకీ అట్లూరి సినిమాలో చిన్న రోల్ లో నటించమని అడిగితే నో చెప్పింది. దీన్నిబట్టి అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో లీడ్ హీరోయిన్ పాత్రలు కోరుకుంటుందని తెలుస్తోంది. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు నో చెప్పి వార్తల్లో నిలిచింది. బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో ఐటెం సాంగ్ లో నటించమని పాయల్ ని సంప్రదించగా ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. కాజల్, శృతిహాసన్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ లో నటిస్తుంటే పాయల్ మాత్రం దానికి అంగీకరించడం లేదు. ఇలాంటి పాత్రలే కావాలని పట్టుబట్టి కూర్చుంటే మాత్రం పాయల్ కి టాలీవుడ్ లో అవకాశాలు కష్టమనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి పాయల్ చేతిలో నిర్మాత సి.కళ్యాణ్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది.  Last Updated 9, Sep 2018, 12:33 PM IST
0business
ప్రియుడితో మైమరచి జాహ్నవి డ్యాన్స్..మీరే చూడండి Highlights ఓ ప్రైవేట్ పార్టీలో శ్రీదేవి కూతురు జాహ్నవి హల్ చల్ ప్రియుడు శిఖర్ తో కలిసి మైమరచి నృత్యాలు చేసిన జాహ్నవి జాహ్నవి స్టెప్పుల వీడిను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన మనీష్ మల్హోత్రా అలనాటి అందాత తార శ్రీదేవి కూతురు జాహ్నవి తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి ఓ పార్టీలో చేసిన డ్యాన్స్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. జాహ్నవి కపూర్ ఇంకా వెండితెరపై ఎంట్రీ ఇవ్వకముందే సంచలనాలు రేపుతోంది. జాహ్నవి, పహారియాలు డాన్స్ చేస్తున్న వీడియోను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. వీడియోకు వైరల్ గా మారుతోంది.   A post shared by Manish Malhotra (@manishmalhotra05) on Feb 17, 2017 at 2:25pm PST 19 ఏండ్ల జాహ్నవి డ్యాన్స్ ఫ్లోర్‌పై రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియుడు శిఖర్ పహారియాతో పార్టీకి హాజరైన జాహ్నవి తుమ్కాలు ఇస్తూ డ్యాన్స్ చేస్తుండగా ప్రియుడు లయబద్ధంగా జోష్ పెంచడం విపరీతంగా ఆకట్టుకొంటోంది. గత కొద్దికాలంగా బహిరంగంగానే వీరద్దరూ కనిపించడం ముంబైకి మీడియాకు పండగగా మారింది. జాహ్నవి, పహారియా ప్రేమకు శ్రీదేవి దంపతుల మద్దతు కూడా ఉందనే వాదన వినిపిస్తున్నది. మరోవైపు జాహ్నవి కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్‌ రూపొందించే ఓ చిత్రంలో జాహ్నవి నటించనున్నట్టు శ్రీదేవి భర్త బోనీకపూర్ సూచనప్రాయంగా వెల్లడించారు.  మరాఠీలో సంచలన విజయం సాధించిన సైరత్ రీమేక్‌లో జాహ్నవి కపూర్, షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్‌ జంటగా నటించనున్నారనే వార్త బాలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే  'జాహ్నవి, ఇషాన్ తెరపైన సరైన జంటగా అనిపించరని, వారిని వేర్వేరు చిత్రాల్లో నటింపజేస్తానని కరణ్ స్పష్టంచేశారు. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
అమ్మ లేని ఫస్ట్ బర్త్ డే... లేఖ రాసిన జాహ్నవి Highlights శ్రీదేవి మృతితో  ఇంకా తేరుకోలేకపోతున్న కపూర్ కుటుంబం విషాదం జరిగి పక్షం గడవక ముందే జాహ్నవి పుట్టినరోజు మార్చి 7 న 21 వ  వసంతంలోకి శ్రీదేవి కూతురు జాహ్నవి  శ్రీదేవి మరణ విషాదం నుంచి కపూర్ కుటుంబమే కాదు.. అభిమానులు, సన్నిహితులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఇంతటి విషాదంలో శ్రీదేవి కూతురు జాహ్నవి జన్మదినం వచ్చేసింది. మంగళవారం జాహ్నవి కపూర్ 21 పడిలోకి ప్రవేశించింది. తల్లి లేకుండా తొలి పుట్టిన రోజును జరుపుకోవడం అనేది జాహ్నవికి మింగుడు పడని విషయమనే చెప్పవచ్చు. ఇలాంటి విషాద క్షణాల నుంచి జాహ్నవి బయటపడి మానసికంగా తాను బలవంతురాలినని ఎలా ప్రూవ్ చేసుకొంటుందో వేచి చూడాల్సిందే.జాహ్నవి బర్త్‌డే సందర్భంగా తన సోదరి సోనమ్ కపూర్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మానసిక ఒత్తిడిని ఎదిరించే ధైర్యవంతులైన అమ్మాయిల్లో జాహ్నవి ఒకరు అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.జాహ్నవి 21 ఏట అడుగుపెట్టింది.   నాకు తెలుసు మానసికంగా బలవంతురాలైన అమ్మాయిల్లో ఒకరైన జాహ్నవి ఈ రోజు యువతిగా మారారు. హ్యాపీ బర్త్‌డే జానూ అని సోనమ్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో జాహ్నవికి బర్త్‌డే విషెస్‌ను అందించారు. ఈ మేరకు నవ్వుతూ ఉన్న జాహ్నవి ఫోటోను షేర్ చేశారు.జాహ్నవికి జన్మదిన శుభాకాంక్షలు అందించిన వారిలో ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా ఉన్నారు. హ్యాపీ బర్త్‌డే మై డియర్ జాహ్నవి కపూర్. సంతోషాన్ని, ప్రేమను, శాంతిని, ఇంకా అన్నీ నీకు అందించాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని తన సందేశంలో పేర్కొన్నారు. సందేశంతోపాటు దడక్ షూటింగ్‌లో శ్రీదేవి, జాహ్నవితో కలిసి తీసుకొన్న ఫొటోను మనీష్ మల్హోత్రా షేర్ చేశారు.   తన తల్లి మరణం విషాదం నుంచి కాస్త కుదుటపడిన జాహ్నవి.. శ్రీదేవిని గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. నా పుట్టిన రోజున మిమ్మల్ని నేను ఏమీ అడుగను. మీ తల్లిదండ్రులను ప్రేమించమని కోరుతాను. తల్లిదండ్రులను ప్రేమలో ముంచెత్తే విధంగా వారి పట్ల అంకితభావం ప్రదర్శించండి అని సూచించారు.అలాగే తల్లిదండ్రులకు అమితమైన ప్రేమను పంచండి. వారు మీకు అందమైన జీవితాన్ని ప్రసాదించారు. అలాగే నా తల్లిని కూడా గుర్తుంచుకోండి. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థించండి అని జాహ్నవి తన లేఖలో పేర్కొన్నారు.తల్లి మరణం నేపథ్యంలో జాహ్నవి రాసిన లేఖ అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. నా హృదయాన్ని ఓ శూన్యం ఆవిరించింది. ఆ శూన్యం నుంచి బయటపడి ఎలా జీవించాలో నాకు తెలుసు. ఈ శూన్యంలో కూడా నీ ప్రేమను తలచుకొంటాను. నీ ప్రేమ మాటున నీవు లేని బాధను, విషాదాన్ని దిగమింగుతాను.గత జన్మదినం రోజున జాహ్నవికి శ్రీదేవి తెలిపిన శుభాకాంక్షలు చూస్తే గుండె ద్రవించకమానదు. హ్యాపీ బర్త్ డే మై ఏంజెల్. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది నువ్వే. విష్ యూ బెస్ట్ బర్త్‌డే మై బేబీ. లవ్ యూ అని ఓ ఫోటోను శ్రీదేవి షేర్ చేశారు Last Updated 25, Mar 2018, 11:40 PM IST
0business
Jan 11,2018 మార్కెట్లోకి హ్యుందారు 'నెక్ట్స్‌ జెన్‌ వెర్నా' న్యూఢిల్లీ: హ్యుందారు మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) మిడ్‌సైజు ప్రీమియమ్‌ సెడాన్‌ వెర్నాలో రెండు కొత్త వేరియంట్స్‌ను బుధవారం మార్కెట్లోకి ఆవిష్కరించింది. 1.4 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.7,79,000 నుంచి రూ.9,09,000 లక్షలు (ఎక్స్‌ షోరూం ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. వెర్నా నెక్ట్స్‌ జెన్‌లో 1.4 లీటరు కప్పా డ్యూయల్‌ వీటీవీటీ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఈ కొత్త వేరియంట్లు 100పీఎస్‌ పవర్‌ అవుట్‌పుట్‌, 19.1 కేఎంపీఎల్‌ ఇంధన సామర్థ్యంతో లభిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ను ఈ మోడల్స్‌లో ఆఫర్‌ చేయనున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV గౌతమ్ నంద ట్రైలర్: వీడు మరో ట్రంప్ గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా సంపత్ నంది డైరెక్షన్2లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘గౌతమ్ నంద’ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. TNN | Updated: Jul 17, 2017, 12:39PM IST &lsquo;196 దేశాలు.. 730 కోట్ల జనాభా.. 4200 మతాలు.. 6500 భాషలు ఇంత మందిలో ఎవరితో ఎవరికీ పరిచయం లేదు. కాని అందరికీ కామన్&zwnj;గా పరిచయం ఉన్నది ఒక్కటే అదే డబ్బు.. ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్&zwnj;లు మారినా సెకండ్ హ్యాండ్ కానిది డబ్బు ఒక్కటే&rsquo;అంటూ గౌతమ్ నందా ట్రైలర్&zwnj;తో ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. సంపత్ సంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ మూవీలో గోపీచంద్ సరసన హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల గోపీచంద్ బర్త్&zwnj;డే సందర్భంగా విడుదలైన టీజర్&zwnj;లో &lsquo;ధనం మూలం ఇదం జగత్&rsquo;అంటూ ఆకట్టుకున్న గోపీచంద్ లేటెస్ట్ ట్రైలర్&zwnj;లో మాస్ అండ్ క్లాస్ లుక్&zwnj;లో గోపీచంద్ అదరగొట్టేస్తున్నాడు. 'ఏ జర్నీ ఇన్ టు ద సెల్ఫ్' అనే ట్యాగ్&zwnj;లైన్&zwnj;తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్&zwnj;లకు రెస్పాన్స్ బాగుండటంతో ట్రైలర్&zwnj;ను కూడా అదే రేంజ్&zwnj;లో పవర్&zwnj;ఫుల్ యాక్షన్ ఎంటర్&zwnj;టైనర్&zwnj;గా తీర్చిదిద్దాడు దర్శకుడు సంపత్ నంది. &lsquo;వీడు ట్రంప్ లాంటోడే.. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు&rsquo; అంటూ హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో ట్రైలర్&zwnj;లో రివీల్ చేసేసింది హీరోయిన్ హన్సిక. తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తు ఈ మూవీకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో స్విస్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. TNN | Updated: Jul 4, 2016, 08:31PM IST వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో స్విస్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. స్టీవ్ జాన్సన్‌ను 6-2, 6-3, 7-5 తేడాతో ఓడించిన ఫెదరర్ ఎనిమిదోసారి వింబుల్డన్ గెలించేందుకు మరో అడుగు ముందుకేశాడు. జకోవిచ్‌ను ఇంటి ముఖం పట్టించిన జాన్సన్ ఫెదరర్ ముందు మాత్రం తేలిపోయాడు. ఫెదరర్ చివరిసారిగా 2012లో ఇక్కడ గ్రాండ్‌స్లమ్ టైటిల్ నెగ్గాడు. గతేడాది ఫైనల్లో జకోవిచ్ చేతిలో ఓడాడు. 2014 అమెరికన ఓపెన్ నెగ్గిన సిలిక్‌తో క్వార్టర్ ఫైనల్లో రోజర్ తలపడనున్నాడు. ఇప్పటికే జకోవిచ్ వైదొలగడంతో ఈసారి టైటిల్ కోసం బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే, ఫెదరర్ తలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV బాల్ ట్యాంపరింగ్.. బాంబు పేల్చిన హెన్రిక్యూస్! బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా క్రికెటర్ హెన్రిక్యూస్ బాంబు పేల్చాడు. మీడియాతో స్మిత్ చెప్పిందంతా కట్టుకథేనని చెప్పాడు. Samayam Telugu | Updated: Mar 26, 2018, 05:27PM IST బాల్ ట్యాంపరింగ్ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయంలో బాల్ ట్యాంపరింగ్ చేయాలని సీనియర్ క్రికెటర్లతో చర్చించామని స్మిత్ చెప్పగా.. అలాంటిదేం లేదని ఆసీస్ క్రికెటర్ మోసిస్ హెన్రిక్యూస్ ట్వీట్ చేశాడు. బాల్ ట్యాంపరింగ్ చేసే విషయమై డ్రెస్సింగ్ రూంలో ఎప్పుడూ చర్చించలేదని హెన్రిక్యూస్ తెలిపాడు. బాన్‌క్రాఫ్ట్‌ను రక్షించడం కోసమే స్మిత్ ఇదంతా చేశాడని ఈ ఆసీస్ క్రికెటర్ చెప్పాడు. మీడియా ముందు అప్పటికప్పుడు స్మిత్ కథ అల్లాడని హెన్రిక్యూస్ చెప్పుకొచ్చాడు. బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నంలో కెమెరాలకు చిక్కిన బాన్‌క్రాఫ్ట్ అనంతరం మాట్లాడుతూ.. బాల్ ట్యాంపరింగ్ గురించి చర్చిస్తోన్న సమయంలో నేను దగ్గర్లో ఉన్నానని.. అందుకే ఈ ఎపిసోడ్‌‌లో భాగం కావాల్సి వచ్చిందని చెప్పాడు. In my uneducated opinion, I dare say there was never a senior players meeting to discuss cheating - Smith made that… https://t.co/v0kkfpSSZd &mdash; Moises Henriques (@Mozzie21) 1522049547000
2sports
Hyderabad, First Published 14, Mar 2019, 3:44 PM IST Highlights భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.  భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడి అలరించిన గంగూలీ.. చాలా కాలం తర్వాత  మళ్లీ ఐపీఎల్ లో అడుగుపెడుతున్నాడు. ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి సలహాదారుడిగా గంగూలీ వ్యవహరించనున్నాడు. గంగూలీని తమ జట్టు సలహాదారుడిగా నియమించుకున్నట్లు ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ ప్రకటించింది. ఇప్పటికే టీమ్ హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్న విషయం తెలిసిందే.  ‘సౌరవ్ గంగూలీ‌కి క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉంది. అతని దూకుడు, వెన్నుచూపని ధైర్యం, తెగింపు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోనూ నింపాలని ఆశిస్తున్నాం’ అని ఢిల్లీ ఫ్రాంఛైజీ వెల్లడించింది. ఈ నియామకంపై గంగూలీ కూడా స్పందించాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బోర్డులో చేరడం ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరును ఢిల్లీ క్యాపిటల్స్ కి పేరు మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. కొన్నాళ్లు క్రికెట్ వ్యవహారాలకి దూరంగా ఉన్న గంగూలీ.. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.  Last Updated 14, Mar 2019, 3:44 PM IST
2sports
Hyderabad, First Published 1, Jul 2019, 11:53 AM IST Highlights రెజీనాతో గత కొంత కాలంగా ఒక కుర్రహీరో ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆ హీరో ఎవరో కాదు యువ హీరో సందీప్ కిషన్ అని పలు వెబ్ సైట్లలో కథనాలు వెలువడ్డాయి.  రెజీనాతో గత కొంత కాలంగా ఒక కుర్రహీరో ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆ హీరో ఎవరో కాదు యువ హీరో సందీప్ కిషన్ అని పలు వెబ్ సైట్లలో కథనాలు వెలువడ్డాయి. రొటీన్ లవ్ స్టోరీ సినిమాలో ఈ ఇద్దరు మొదటిసారి కలిశారు. అనంతరం రారా కృష్ణయ్య - నగరం - నక్షత్రం సినిమాల్లో కూడా కనిపించారు. అప్పటి నుంచి వీరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అయ్యిందని టాక్ వచ్చింది.  అయితే రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా నిన్నటివరకు హీరో హీరోయిన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎట్టకేలకు రూమర్స్ కు సందీప్ కిషన్ బ్రేక్ వేశాడు. ఈ రూమర్ పై ప్రశ్నలు ఎదురవ్వగానే గట్టిగా నవ్వేసిన  సందీప్ కిషన్ ఆమె తనకు మంచి ఫ్రెండ్ అని సున్నితంగా చెప్పేశాడు.  అదే విధంగా గత రెండేళ్ల క్రితం వరకు ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పిన సందీప్ ఆ అమ్మయికి బ్రేకప్ చెప్పినట్లు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను సింగిల్ అంటూ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలిపాడు. సందీప్ నటించిన హారర్ థ్రిల్లర్ 'నిను వీడని నీడను నేనే' సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  Last Updated 1, Jul 2019, 11:56 AM IST
0business
baahubali 2 first show.. where? ఏంటీ.. బాహుబలి2 బొమ్మ వేసేశారా!! ఎక్కడబ్బా? బాహుబలి.. బాహుబలి.. బాహుబలి ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో మారుమ్రోగుతున్న పేరు బాహుబలి. TNN | Updated: Apr 25, 2017, 04:08PM IST బాహుబలి.. బాహుబలి.. బాహుబలి ఇప్పుడు టాలీవుడ్&zwnj;తో పాటు అన్ని ఇండస్ట్రీలలో మారుమ్రోగుతున్న పేరు బాహుబలి. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదలౌతున్న ఈ మూవీ గురించి ప్రేక్షకుడు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి ది బిగినింగ్ సాధించిన ప్రభంజనంతో బాహుబలి2పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమా బాహుబలి పార్ట్1 కంటే పెద్ద హిట్ పక్కా అనే ప్రోపగండ క్రియేట్ కావడంతో ఈ సినిమా చూడటం కోసం ప్రేక్షకులు ఇప్పటికే థియేటర్స్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇదిలాఉంటే బాహుబలి యూనిట్ చెప్పిన సమాచారం ప్రకారం గురువారం ( ఏప్రిల్ 27) సాయంత్రం ఓవర్ సీస్ ప్రీమియర్ షోలతో బాహుబలి 2 రిలీజ్ కానుంది. అంతకంటే ముందుగా అంటే ఏప్రిల్ 27 ఉదయం మీడియా కోసం ప్రత్యేక షోను ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ అవకాశం కేవలం బాలీవుడ్&zwnj; మీడియాకు మాత్రమే కల్పించింది బాహుబలి చిత్ర యూనిట్.
0business
Visit Site Recommended byColombia అయితే తాప్పికి తన సోదరి షగున్ వల్లే ప్రియుడు దొరికాడట. షగున్ వల్లే అతన్ని కలుసుకోగలిగానని తెలిపారు. అయితే తాప్సి ఇంతకుముందు డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో ఉండేవారు. అయితే తాప్సి చెబుతున్న వ్యక్తి, మథియాస్ ఒక్కరేనా అన్న విషయంపై ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం తన జీవితంలో ఉన్న వ్యక్తి తప్ప అంతకుముందు డేటింగ్ చేసినవారంతా విచిత్రంగా ఉండేవారని తాప్సి సోదరి షగున్ కామెంట్ చేశారు. ఇందుకు తాప్సి స్పందిస్తూ.. ‘ఎందరో కప్పల్లాంటి వ్యక్తులను ముద్దుపెట్టుకున్న తర్వాతే నాకు నా రాజకుమారుడు దొరికాడు’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. READ ALSO: అందుకే ఆ కులం ట్వీట్ డిలీట్ చేశానంటున్న లావణ్య త్రిపాఠి అయితే మరి ఇప్పుడు డేటింగ్ చేస్తున్న వ్యక్తిని ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని అడిగిన ప్రశ్నకు తాప్సి సమాధానం ఇస్తూ.. ‘నాకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కాకుండా మాత్రం పిల్లల్ని కనను. అలాగని నా పెళ్లి ఆడంబరాలతో ఉండకూడదు. ఒకరోజంతా నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా జరిగిపోవాలి. మూడు రోజుల పాటు జరిగే పెళ్లిళ్లు చాలా ఒత్తిడిగా ఉంటాయి’ అని వెల్లడించారు తాప్సి. ఇటీవల విడుదలైన ‘మిషన్ మంగళ్’ సినిమాతో తాప్సి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం తాప్సి చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ‘సాండ్ కీ ఆంఖ్’ అనే బయోపిక్ సెప్టెంబర్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క ‘థప్పడ్’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 2.0 సినిమా ఆడియో లాంచ్‌కి వేదిక సిద్ధం! భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు శంకర్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో తెరకెక్కిన మరో భారీ బడ్జెట్.. TNN | Updated: Oct 24, 2017, 04:22PM IST భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు శంకర్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో తెరకెక్కిన మరో భారీ బడ్జెట్ మూవీ 2.0 ఆడియో వేడుకకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కోలీవుడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఏ.ఆర్. రెహ్మాన్ కంపోజిషన్&zwnj;లో రూపొందిన 2.0 సినిమా ఆడియోను అక్టోబర్ 27న నిర్వహించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అది కూడా ఇక్కడ చెన్నైలోనో లేక హైదరాబాద్&zwnj;లోనో కాదట! ఏకంగా దుబాయ్&zwnj;లోని బుర్జ్ పార్క్&zwnj;లో భారీ ఎత్తున ఈవెంట్ ఏర్పాటు చేసి ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కాకపోతే ఆ రోజుకి ఇంకెంతో గ్యాప్ లేదు కనుక చడీచప్పుడు లేకుండా ఇంత సడెన్&zwnj;గా దుబాయ్&zwnj;లో ఈవెంట్&zwnj;ని ఎలా నిర్వహిస్తారనే అనుమానాలూ కలుగుతున్నాయి. భారీ చిత్రాలని తమిళ, తెలుగు ఆడియెన్స్&zwnj;కి అందించిన లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్&zwnj;లో వున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన అమీజాక్సన్ హీరోయిన్&zwnj;గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్&zwnj;కుమార్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. అక్షయ్ కుమార్ ఓ సౌతిండియన్ మూవీలో నటించడం ఇదే మొదటిసారి. అందులోనూ అతడు హీరోగా కాకుండా విలన్ వేషానికి సైన్ చేయడాన్ని బట్టి చూస్తే, ఆ పాత్రపై, డైరెక్టర్ శంకర్&zwnj;పై అతడికి వున్న నమ్మకం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే 2.0 సినిమాపై అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి.
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV గ్రామీణ డాక్ సేవ‌క్‌ల వేత‌నం పెంపు ఏళ్లుగా ఎదురుచూస్తున్న త‌పాలా శాఖ ఉద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. తపాలశాఖలో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌)ల సమ్మెతో కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. Samayam Telugu | Updated: Jun 8, 2018, 05:04PM IST ఏళ్లుగా ప‌నిచేస్తున్న త‌పాలా శాఖ ఉద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. తపాలశాఖలో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌)ల సమ్మెతో కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. వారి మూలవేతనాన్ని పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. గ్రామీణ డాక్ సేవక్‌ల‌కు సంబంధించి ఇప్ప‌టిదాకా రూ.2295 వేత‌నం పొందుతున్న వారు ఇక‌పై నెల‌కు రూ.10 వేల చొప్పున రూ.2775 పొందుతున్న వారు ఇక‌మీద‌ట రూ.12,500, రూ.4115 పొందుతున్న వారు ఇక‌పై నెల‌కు రూ.14,500 వ‌ర‌కూ అందుకుంటార‌ని మ‌నోజ్ సిన్హా తెలిపారు. సవరించిన భత్యం ప్రకారం.. 2016, జనవరి 1 నుంచి అమలు అయ్యే తేదీ వరకు బకాయిపడ్డ మొత్తాన్ని ఉద్యోగులు ఒకే విడతలో పొందనున్నారు. ఏడో వేతన కమిషన్‌ సిఫారసుల ప్రకారం మూలవేతనం పై ఏడుశాతం కరువు భత్యం కూడా వారికి లభించనుంది. మంత్రివర్గ సమావేశానంతరం ఈ విషయాన్ని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్‌సిన్హా వెల్లడించారు. కొన్నేళ్లుగా చాలీచాలని భత్యాలతో జీడీఎస్‌లు వారి జీవితాన్ని అతికష్టంగా నెట్టుకొస్తున్నారు. అయితే, తమ వేతనాలు పెంచాలంటూ డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా 1.3 లక్షల గ్రామాల్లో పనిచేస్తున్న 2.6 లక్షల మంది డాక్‌ సేవక్‌లు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో జీడీఎస్‌ల నిరీక్షణకు, వారు చేస్తున్న సమ్మెకు ఫలితం లభించినట్టయ్యింది.
1entertainment
New Delhi, First Published 9, Sep 2018, 1:05 PM IST Highlights  ఐడియా-వొడాఫోన్‌ కంపెనీల విలీనం పూర్తి కావడంతో  దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. రిలయన్స్ జియో ప్రభావంతో తమ కస్టమర్లను కాపాడుకునేందుకు సతమతమవుతున్న టెల్కో సంస్థలు సంఘటితం అవుతున్నాయి.  న్యూఢిల్లీ: ఐడియా-వొడాఫోన్‌ కంపెనీల విలీనం పూర్తి కావడంతో  దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. రిలయన్స్ జియో ప్రభావంతో తమ కస్టమర్లను కాపాడుకునేందుకు సతమతమవుతున్న టెల్కో సంస్థలు సంఘటితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విలీనమైన ఐడియా-వొడాఫోన్‌ ఉమ్మడి యాజమాన్యం ప్రారంభంలోనే పొదుపు దిశగా చర్యలు చేపడుతోంది. తద్వారా రూ.72,105 కోట్లు పొదుపు చేసుకోవాలని కలలు కంటోంది.  అందుకోసం తమ తమ ఉద్యోగుల సంఖ్యను 15 వేలకు కుదించాలని రెండు సంస్థలు విడివిడిగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల్లో 17,500 నుంచి 18 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే వీరిలో 2500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసేయాలని ఐడియా-వొడాఫోన్‌లు నిర్ణయించాయి. ఇందుకోసం రెండు నెలల సమయాన్ని నిర్దేశిత గడువుగా పెట్టుకున్నాయి. అయితే వొడాఫోన్ - ఆదిత్యబిర్లా గ్రూప్ సంస్థలు కొందరిని తమ సొంత సంస్థల్లో ఇతర భాగాల్లో   కొంతమంది ఉద్యోగులను పేరెంట్‌ కంపెనీలు వొడాఫోన్‌ గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌లోకి తీసుకుని, మిగతా కొంతమందిపై వేటు వేయాలని ఈ విలీన సంస్థ ప్రణాళిక రూపొందించింది. అంతేకాక ఉద్యోగులకు ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను కూడా ప్ర​స్తుతం పక్కన పెట్టింది. ఉద్యోగుల వేటు వేస్తారని చక్కర్లు కొడుతున్న వార్తలు ఊహాగానాలేనని వొడాఫోన్‌-ఇండియా కొట్టిపారేసింది.  ‘కొంతవరకు హేతుబద్దీకరణ ఉంటుంది. అది సర్వసాధారణం. కంపెనీ వచ్చే కొన్ని నెలల్లో ఉద్యోగుల సంఖ్యను 2000 నుంచి 2500 మందిని తగ్గించుకోవాలనుకుంటుంది’ అని ఈ విషయం తెలిసిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. ఉద్యోగుల సంక్షేమాన్ని కంపెనీ పట్టించుకుంటుందని, సెవరెన్స్‌ ప్యాకేజీలను అందిస్తుందని, పేరెంట్‌ గ్రూప్‌ ఆదిత్యా బిర్లా గ్రూప్‌లో ఇంటర్నల్‌ ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని చెబుతున్నారు. అయితే టెలికాం కంపెనీల్లో ఉద్యోగుల కోత ఇదేమీ కొత్త కాదు. రిలయన్స్‌ జియో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, టెలికాం రంగం అస్తవ్యస్తమైంది. ఇక అప్పటి నుంచి టెలికాం కంపెనీలు పోటీని తట్టుకోలేక, వ్యయాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులకు వేటు వేయడం ప్రారంభించాయి. వొడాఫోన్‌ ఇండియా కూడా వాలంటరీ అట్రిక్షన్‌ను ఆఫర్‌చేస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఉద్యోగుల సంఖ్య తగ్గించేస్తుంది. వొడాఫోన్‌ ఇండియా ఉద్యోగులను, ఐడియా సెల్యులార్‌ ఉద్యోగులను విలీన సంస్థ సమానంగా చూస్తోంది. ఉద్యోగులందరిన్నీ ఎంతో గౌరవంగా చూస్తున్నట్టు వొడాఫోన్‌ ఐడియా హెచ్‌ఆర్‌ హెడ్‌ చెప్పారు. కానీ ఉద్యోగుల తొలగింపు విషయమై వచ్చే పుకార్లపై స్పందించబోమని వొడాఫోన్-ఐడియా వ్యాఖ్యానించింది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పవన్ గురించి మాట్లాడొద్దంటే ఎలా?: రేణూదేశాయ్ విడాకులు తీసుకుని విడిపోయినంత మాత్రాన తాను పవన్ కల్యాణ్ గురించి మాట్లాడకూడదా? అని పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూదేశాయ్ ప్రశ్నించారు TNN | Updated: Sep 14, 2016, 07:41PM IST విడాకులు తీసుకుని విడిపోయినంత మాత్రాన తాను పవన్ కల్యాణ్ గురించి మాట్లాడకూడదా? అని పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూదేశాయ్ ప్రశ్నించారు. అంతేకాదు, ప్రజలంతా పవన్ గురించి మాట్లాడొచ్చు కానీ, తాను మాత్రం మాట్లాడకూడదంటే ఎలా అని ఆమె ఆవేదనచెందారు. ట్విట్టర్ ద్వారా రేణూ అడపాదడపా పవన్ కల్యాణ్ గురించి ట్వీట్లు పెడుతుంటారనే సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో పవన్ తో సంబంధమున్న ఫోటోలు, సెల్ఫీలను ఆమె షేర్ చేస్తుంటారు. దీన్ని కొందరు అభిమానులు జీర్ణించుకోలేక, ట్విట్టర్లో తనను ప్రశ్నిస్తున్న తీరు ఆవేదన కలిగిస్తోందని రేణు ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వివాహమైన తరువాత తాను పదకొండేళ్లు పవన్ తో కాపురం చేసి పిల్లలకు జన్మనిచ్చానని కొన్ని కారణాల వల్ల ఇద్దరమూ పరస్పర అంగీకారంతో విడిపోయామనే విషయాన్ని గుర్తుచేశారు. విడాకులు తీసుకున్నప్పటికీ తాము పిల్లలకోసం అప్పుడప్పుడు కలుస్తుంటామన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను పవన్ అనుమతితోనే ట్విట్టర్లో షేర్ చేస్తుంటానని స్పష్టం చేశారు. తామిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమేనని తెలిపారు.
0business
MUKESH AMBANI ఆర్‌జియోలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు ముంబై, జనవరి 16: భారత కుబేరుడు రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తన మానసపుత్రికగా ప్రారంభించిన రిలయన్స్‌ జియోపై మరింతగా పెట్టుబడులు పెడుతున్నారు. 25 బిలియన్‌ డాలర్ల కుపైగా ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన అంబాని మరింతగా పెట్టుబడులు పెట్టి పోటీలేని సంస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నారు. తాజాగా 300 బిలియన్‌ రూపాయలు అంటే 4.4 బిలియన్‌ డాలర్లుగా చెపుతున్నారు. అంటే రూపాయల్లో 30వేల కోట్లుగా ఉంది. ఇందుకు సంబంధించి నెట్‌వర్క్‌ సామర్ధ్యం పెంచేందుకుగాను ఈ నిధులు వినియోగిస్తామని చెపుతున్నారు. ఎక్ఛేం జిలకు సైతం ఈ నివేదికలు ఇచ్చాయి. జియో తాజా గణాంకాల ప్రకారం రోజుకు ఆరులక్షల మందికిపైగా కొత్త కస్టమర్లు వచ్చిచేరుతున్నట్లు ప్రకటించింది. నాలుగునెలల్లో 72.4 మిలియన్ల చందాదారులు ఉన్నారని జియో వివరించింది. తాజాగా రైట్స్‌ ఇష్యూద్వారా సమీకరించే నిధులు కేవలం నెట్‌వర్క్‌ పటిష్టతకు వినియోగిస్తామని వివ రించారు. ఇక ఉచిత ఆఫర్లపై దాఖలైన ఫిర్యాదు లకు ఫిబ్రవరి ఒకటవ తేదీన ట్రిబ్యునల్‌ విచారణ చేపట్టనున్నది. రిలయన్స్‌యో టెలికాం నెట్‌వర్క్‌ పరంగా చిన్నసంస్థగా కొనసాగేందుకు సుతరాము అంగీకరించడంలేదు. దేశంలోనే నంబవర్‌వన్‌గా కొనసాగే లక్ష్యంతో ఉంది. ఇందుకోసం ఎంతైనా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నది. చము రు, పెట్రోకెమికల్స్‌ నుంచి టెలికాం రంగానికి ప్రవే శించడం ద్వారా విభిన్నరంగాలకు విస్తరించాలన్న లక్ష్యం కనిపిస్తోంది. జియో ఇప్పటికే ఆరుబిలియన్‌ లకుపైబడిన తొమ్మిదిశాతం నాన్‌కుమ్యులేటివ్‌ బదాలయింపుకు వీలైన ఈక్విటీ షేర్లను పదిరూపా యల ముఖవిలువ ఉన్నవాటిని 40 రూపాయల ప్రీమియంతో ఇష్యూచేస్తోంది. భారతి ఎయిర్‌టెల్‌ ఇతర పెద్ద సంస్థలు సైతం జియో ధాటికి 66శాతం వరకూ ట్యారిఫ్‌లను కట్‌చేశాయి. కస్టమర్లు చేజారి పోకుండా డేటా పరిమితులు కూడా పెంచాయి. అంతేకాకుండా ప్రత్యేకించిఎయిర్‌టెల్‌ జియో ఉచిత ఆఫర్‌పై టిడిశాట్‌లో అప్పీలుచేసింది. చైనా తర్వా త భారత్‌లోనే ఉన్న ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ను అందిపుచ్చుకుని ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన డిజిటల్‌ ఇండియాకార్యాచరణకు సంపూర్ణ మద్దతు నిస్తున్నట్లు ప్రకటించింది. పెద్దనోట్లు రద్దుతర్వాత దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలు 43శాతం పెరిగాయి. 958 మిలియన్ల లావాదేవీలు ఒక్కనెల రోజుల్లోనే జరిగినట్లు అంచనా. భారత్‌ డిజిటల్‌ ఆర్థికవ్యవస్థ లక్షకోట్ల డాలర్లకు వచ్చే మూడు, నాలుగేళ్లలో వృద్ధి చెందుతుందని టెక్నాలజీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ వెల్లడించారు. ప్రపంచం లోనే ఒక స్టార్టప్‌ సంస్థలో ఇంత భారీ ఎత్తున నిధులు కుమ్మరించడం ఇదే మొదటిసారి అని ఈక్విటీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘నోటా’లో హీరోయిన్‌గా అసలెందుకు చేసిందో! నోటా ద్విభాష సినిమా. కాబట్టి ఈ సినిమా హిట్ అయితే మెహ్రీన్ కెరీర్ తెలుగులోనూ, తమిళంలోనూ పుంజుకుంటుందని అంతా అనుకున్నారు. తీరా ఆ సినిమ రానే వచ్చింది, నెగిటివ్ టాక్ పొందింది. Samayam Telugu | Updated: Oct 6, 2018, 03:14PM IST ‘నోటా’లో హీరోయిన్‌గా అసలెందుకు చేసిందో! ‘నోటా’ సినిమా విడుదలకు ముందు ఇది మెహ్రీన్‌కు ప్లస్ పాయింట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఈ భామ నటించిన ఇటీవలి సినిమాలన్నీ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. వరస ఫ్లాపుల మధ్యన ఉన్న ఈ హీరోయిన్‌కు నోటా ఊరటనిస్తుందని అంతా అనుకున్నారు. ఈ సినిమా గనుక హిట్ అయితే మెహ్రీన్‌కి తెలుగులోనూ, తమిళంలోనూ ప్లస్ అవుతుందని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే.. నోటా ద్విభాష సినిమా. కాబట్టి ఈ సినిమా హిట్ అయితే మెహ్రీన్ కెరీర్ తెలుగులోనూ, తమిళంలోనూ పుంజుకుంటుందని అంతా అనుకున్నారు. తీరా ఆ సినిమ రానే వచ్చింది, నెగిటివ్ టాక్ పొందింది. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. వినోదాత్మకంగా లేదని రివ్యూయర్లు తేల్చేశారు. ఈ నేపథ్యంలో మెహ్రీన్‌కు మరో ఫ్లాప్ ఎదురయినట్టే. అంతకు మించిన విషయం ఏమిటంటే.. ఈ సినిమా హీరోయిన్ మెహ్రీన్ పాత్రకు అస్సలు ఏ మాత్రం ప్రాధాన్యత లేకపోవడం. చాలా సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉండదు. ఇందులో ప్రాధాన్యత లేకపోవడమే కాదు... ఉన్నదే ఐదారు సీన్లు. సినిమా మొత్తంగా మెహ్రీన్‌కు దక్కింది ఐదారు సీన్లే. మరీ ఇంత పరిమితమైన పాత్రకు మెహ్రీన్ ఎందుకు ఓకే చెప్పిందో అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బహుశా క్రేజీ హీరో సినిమా అని ఓకే చెప్పినట్టుగా ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ఇక చేసింది చిన్న పాత్ర, ప్రాధాన్యత లేని పాత్రే అయినా ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం మెహ్రీన్ యాక్టివ్‌గా పాల్గొంటోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
అమీర్‌కు అఫ్రిది ప్రశంసలు కోల్‌కతా: స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో అయిదేళ్ల నిషేధం ఎదుర్కొని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసినఫాస్ట్‌బౌలర్‌ హ్మద్‌ అమీర్‌పై పాక్‌ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు. అతను ఉత్తమ బౌలర్‌ అని, టాప ఆంతర్జాతీయ ఫేసర్లలో అతను ఇప్పటికే చోటుసంపాదించుకున్నాడని పేర్కొన్నాడు. అమీర్‌ను పెద్దగా పట్టించుకోవద్దని ఇటీవల భారత్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌శర్మ వాఖ్యానించిన సంగతి తెలిసిందే.. కాగా రోహిత్‌ వ్యాఖ్యల గురించి అతన్నేఅడగాలని , తమకు మాత్రం అమీర్‌ బెస్ట్‌ బౌలర్‌ అని అఫ్రిది పేర్కొన్నారు.
2sports
ram gopal varma blames rajinikanth over bhairava geetha censor రజినీకాంత్ వల్లే ‘భైరవగీత’ సెన్సార్‌ ఆపేశారు: వర్మ ‘భైరవగీత’ సకాలంలో సెన్సార్ పూర్తిచేసుకోకపోవడానికి కూడా వర్మ కారణం చెప్పారు. బుధవారం సాయంత్రం ఏఎంబీ సినిమాస్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన వర్మ.. ‘భైరవగీత’ గురించి మాట్లాడారు. Samayam Telugu | Updated: Dec 13, 2018, 10:33AM IST వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో వస్తోన్న చిత్రం ‘భైరవగీత’. సిద్ధార్థ్ తాతోలు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాయలసీమ నేపథ్యంలో వస్తోన్న ప్రేమకథా చిత్రం ఇది. ఈ సినిమా ప్రచారం కోసం గతంలో రజినీకాంత్ ‘2.0’ను వర్మ వాడేసుకున్న సంగతి తెలిసిందే. ‘2.0’కు పోటీగా ‘భైరవగీత’ వస్తుందని.. ‘2.0’ చిన్న పిల్లల సినిమా అయితే ‘భైరవగీత’ పెద్దల సినిమా అని.. ఇలా చాలా రకాలుగా ‘2.0’ కంటే మా చిత్రమే గొప్ప అన్న రీతిలో వర్మ ప్రచారం చేశారు. అయితే సమయానికి సెన్సార్ పూర్తికాకపోవడంతో ‘2.0’తో పాటు ‘భైరవగీత’ విడుదల కాలేదు. ఇదిలా ఉంటే, ‘భైరవగీత’ సకాలంలో సెన్సార్ పూర్తిచేసుకోకపోవడానికి కూడా వర్మ కారణం చెప్పారు. బుధవారం సాయంత్రం ఏఎంబీ సినిమాస్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన వర్మ.. ‘భైరవగీత’ గురించి మాట్లాడారు. ఈ సినిమా సెన్సార్ ఆగిపోవడానికి కారణం రజినీకాంత్ అంటూ వ్యాఖ్యానించారు. ‘రజినీకాంత్ ఒక కిరణం పంపి మా సెన్సార్ అవ్వకుండా చేశారు. ‘2.0’లో ఆయన చేసిన మ్యాజిక్ కారణంగా సెన్సార్ వాళ్లు భయపడి మా సినిమాను ఆపేశారు. అందుకే విడుదల ఆలస్యమైంది’ అని చాలా వెటకారంగా చెప్పారు. ‘ఎ’ సర్టిఫికెట్ సినిమా.. పిల్లలు రారు.. ‘భైరవగీత’ పెద్దవాళ్ల సినిమా అని గతంలో చెప్పారని.. మరి పిల్లలు చూడొచ్చా అని ఓ మీడియా ప్రతినిధి వర్మను ప్రశ్నించారు. దీనికి వర్మ సమాధానం ఇస్తూ.. ‘ఎలాగూ ఎ సర్టిఫికెట్ సినిమా పిల్లలు రారు’ అని చెప్పారు. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానేనా అనే ప్రశ్నకు దర్శకుడు సిద్ధార్థ్ మైక్ అందుకుని.. ‘మెర్చ్యూరిటీ ఉంటే చూడొచ్చు’ అని టక్కున సమాధానం చెప్పారు. సినిమాలో బూతు ఏమైనా ఉందా? అన్న మరో ప్రశ్నకు వర్మ సమాధానం ఇస్తూ.. ‘లేదు. సెన్సార్ వాళ్లకు నచ్చి కట్‌చేసి పట్టుకుపోయారు. మీకు ఇష్టమా’ అంటూ వ్యాఖ్యానించారు.
0business
ఫిలిమ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు పి.కిరణ్ కు చిరంజీవి అభినందనలు Highlights జెమిని కిరణ్ గా మీడియాకి సినీవర్గాలకి సుపరిచితుడైన పర్వతనేని కిరణ్ "తెలుగు ఫిల్మ్ ఛాంబర్" అధ్యక్షులుగా ఎన్నిక ఎన్నికైన సందర్భంగా అభినందించిన మెగాస్టార్ చిరంజీవి   జెమిని కిరణ్ గా మీడియాకి సినీవర్గాలకి సుపరిచితుడైన పర్వతనేని కిరణ్ గారు "తెలుగు ఫిల్మ్ ఛాంబర్" అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిగారు ఆయన్ని పూల బొకేతో సత్కరించారు. పరిశ్రమ మంచి చెడులపై పూర్తి అవగాహన ఉన్న పి.కిరణ్ వంటి వ్యక్తి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిలో ఉండడం పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుందని చిరంజీవి ఆకాంక్షించారు. Last Updated 25, Mar 2018, 11:40 PM IST
0business
రూ.34,000 దిగువకు పసిడి! - రెండు రోజుల్లో రూ.570 తగ్గిన బంగారం ధర - భవిష్యత్తులో మరింతగా తగ్గే అవకాశం!. న్యూఢిల్లీ: డిమాండ్‌ లేక వన్నె తగ్గుతున్న పసిడి ధర శనివారం మరింత వెలవెలబోయింది. బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర. రూ. 350లు క్షీణించింది. దీంతో గత రెండు రోజులుగా పసిడి ధరలు 570 రూపాయిలు తగ్గింది. స్థానికంగా పూర్తి స్వచ్ఛత గత పది గ్రా. బంగారం ధర రూ.33,770కు చేరింది. దీంతో బంగారం ధర మళ్లీ రూ.34 వేల రూపాయల దిగువకు చేరినట్టయింది. స్థానిక బంగారు వర్తకందారుల నుంచి డిమాండ్‌ తగ్గడం, అంతర్జాతీయంగా బల హీన సంకేతాలతో పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలు కీలక మద్దతు స్థాయికి దిగజారడంతో రానున్న రోజుల్లో పుత్తడి ధర మరింత దిగి వచ్చే అవ కాశం ఉందని బులియన్‌ వర్గాల విశ్లేషిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల పుత్తడి రూ.310 నష్టపోయింది. అంతర్జాతీయంగా 1.52 శాతం పతనమై ఔన్స్‌ బంగారం ధర 1293 వద్ద 1300 డాలర్ల దిగువకు చేరింది. బంగారానికి తోడుగా అనట్టు తాజాగా వెండి ధరలు కూడా పడిపోయాయి. కిలోవెండి ధర కూడా రూ. 40వేల రూపాయల దిగువకు పడిపోయింది. దేశీయ మార్కెట్లో వెండి ధర ఏకంగా రూ.730 క్షీణించి రూ.39,950లకు పడిపోయింది. మరో విలువైన మెటల్‌ వెండి కూడా 2.47 శాతం పతనమైంది. అటు ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో కూడా పది గ్రాముల పసిడి ధర రూ.324 పతనమై రూ. 32,657 వద్ద నిలిచింది. వెండి 758 రూపాయలు క్షీణించి రూ.38,376 వద్ద కొనసాగుతోంది. దీంతో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింతగా దిగి రానున్నాయన్న విశ్లేషణలకు బలం చేకూరుతోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 134 Views ఫతేమైదాన్‌ : తెలంగాణ అథ్లెటిక్స్‌సంఘం ఆధ్వర్యంలో నేటినుంచి జూలై 2వ తేదీ వరకు 56వ జాతీయ సీనియర్‌అథ్లెటిక్స్‌పోటీలు గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో ప్రారంభంకానున్నావి. ఇప్పటికే ఈ పోటీలలో పాల్గొనే  వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ పురుషుల, మహిళల  క్రీడాకారులు గచ్చిబౌలి స్టేడియంకు చేరుకున్నారు. వీరందరికి గచ్చిబౌలిలోని సమీపంలోని వివిధ హోటళ్లలో వసతి సౌకర్యాలు కల్పించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్‌సంఘం ప్రధాన కార్యదర్శి రంగారావు తెలిపారు. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు మంచి అర్హుత సాధిస్తే రియా ఒలింపిక్స్‌కు భారత దేశం నుంచి ఎంపిక చేయనున్నారు. ఈ పోటీలలో అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరు అథ్లెటిక్స్‌పోటీలలో సత్తా చాటే అవకాశం ఉంది. ఇందులో అనేక రాష్ట్రాలకు చెందిన అత్యుత్తమ క్రీడా కారులు ఈ  పోటీలలో పాల్గొనడం విశేషం మంగళవారం నాడు సాయంత్రం బాలయోగి స్టేడియంలో పాల్గొనే జాతీయ అథ్లెటిక్స్‌పోటీలను తెలంగాణ  రాష్ట్ర ఎక్సైజ్‌,క్రీడల శాఖ మంత్రి పద్మారావు గౌడ్‌ ప్రారంభింస్తారని రంగారావు తెలిపారు. తెలంగాణ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌పోటీలలో  పాల్గొనే క్రీడాకారుల వివరాలు పురుషుల విభాగంలో అబ్ధూల్‌ నయూబ్‌, కె.ప్రేమ్‌కుమార్‌, సి.హెచ్‌. సేధాకర్‌, పాండే, రాజేంద్రన్‌సింగ్‌, వి.పర్వేశ్‌, కె.తిరుపతి,కె.రాములు, మహిళా క్రీడాకారులు జి.నీతా, జి.హారికా దేవి,వై.జ్యోతి, ఎస్‌.సుజాత, వి.విశాలలక్ష్మి, పి.కావ్య, వి.జ్యోతి, బాను చంద్రిక, కోచ్‌లు: ఎండి గౌస్‌, ఎం.శ్రీనివాస్‌లు ఉన్నారు.
2sports
రాాజ్ పుత్ కత్తికెంత పదునుందో గాజుకూ అంతే వుంది-25న పద్మావత్ Highlights వివాదాల అనంతరం సెన్సార్ క్లియరెన్స్ పొందిన పద్మావతి చిత్రం టైటిల్ పద్మావత్ గా మార్పు, మరికొన్ని సీన్స్ కట్ జనవరి 25న రిలీజ్ కు రెడీ అయిన పద్మావత్ బాలీవుడ్ దిగ్గజ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పద్మావతి ఆది నుంచే వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పద్మావతి చిత్రం తమ ఆరాధ్య దైవం లాంటి రాజ్ పుత్ రాణి పద్మావతి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారని, ఈ చిత్రంలో పద్మావతి మహారాణిని తప్పుగా చూపించేందుకు దర్శకుడు భన్సాలీ ప్రయత్నిస్తున్నారని రాజ్ పుత్ కర్ణి సేన పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో గత డిసెంబర్ మొదటి వారం విడుదల కావాల్సిన పద్మావతి చిత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అయితే అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం కేంద్ర సర్కారు పద్మావతి చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వటంతో జనవరి 25న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు పద్మావతి రెడీ అయింది.   రాజ్ పుత్ వంశీయుల ఆందోళనల నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రంలో కొన్ని సీన్లకు కోతలు విధించింది. అంతేకాక సినిమాలోని కొన్ని సీన్స్ పైనే కాక టైటిల్స్ లాంటి ఇతర అంశాల్లోనూ మార్పులు చేయాలని బోర్డు దర్శక నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సినిమా పేరును కూడా 'పద్మావత్' గా మార్చారు. మార్పుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేశారు. కొన్ని సీన్ల కత్తిరింపు తప్ప పెద్దగా మార్పులు ఏమీ లేకున్నా టైటిల్ మార్పు చేసి ‘పద్మావత్'గా మార్చారని తెలుస్తోంది.   ఆందోళనలు రేకెత్తడంతో సెన్సార్ బోర్డ్ అననుమతులిచ్చే అంశంపై చ‌రిత్ర‌కారుల స‌హాయం తీసుకుంది. వారి స‌ల‌హా మేర‌కు ఓ ఐదు మార్పుల‌ను సూచించింది. ఇది చారిత్రక సంబంధం లేని కల్పిత కథగా సినిమా ప్రారంభంలో ప్రకటించాలని, సినిమా పేరును పద్మావతి బదులు పద్మావత్‌గా మార్చాలని, సినిమాలోని ఘూమర్‌ పాటలో మార్పు చేయాలని, తప్పుగా చూపించిన చారిత్రక ప్రదేశాల చిత్రీకరణలను కూడా సరిచేయాలనే సెన్సార్ బోర్డు సూచనలకు దర్శక నిర్మాతలు అంగీకరించడంతో సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది.   సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపిక పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ ఈ చిత్రాన్ని 3డితో పాటు ఐమాక్స్ 3డి ఫార్మాట్లో విడుదల చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ సినిమాల్లో ఇదో గొప్ప చిత్రం అవుతుందని భావిస్తున్నారు.   రాణి పద్మావతి పాలిస్తున్న చిత్తోర్ గడ్ కోటను 1303 సంవత్సరంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ ముట్టడించాడు. ఆ యుద్ధం ఎపిసోడ్ ను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ‘పద్మావత్' చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహ్మదీయరాజు అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు. ‘పద్మావతి'గా టైటిల్ రోల్ చేస్తున్న దీపిక పదుకోన్ ఎంతో బ్యూటిఫుల్‌గా సినిమాలో కనిపించింది. ఆమె కెరీర్లో ఈ చిత్రం ది బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. భన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపిక పదుకోనె కలిసి నటించడం ఇది మూడో సారి. గతంలో రామ్-లీలా, బాజీరావు మస్తానీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘పద్మావత్' పై భారీ అంచనాలున్నాయి. ఎట్టకేలకు పద్మావత్ చిత్రం జనవరి 25న రిలీజ్ కానుంది. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
Hyderabad, First Published 4, Aug 2019, 10:43 PM IST Highlights బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రెండవ వారం కూడా ముగిసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 3లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటుండగా తొలి వారం హేమ ఎలిమినేట్ అయింది. దీనితో హేమ స్థానంలో ట్రాన్స్ జెండర్ తమన్నా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది.  బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రెండవ వారం కూడా ముగిసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 3లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటుండగా తొలి వారం హేమ ఎలిమినేట్ అయింది. దీనితో హేమ స్థానంలో ట్రాన్స్ జెండర్ తమన్నా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది.  ఆదివారం రోజు రెండవ ఎలిమిలేషన్ కూడా జరిగిపోయింది. ఈ వారం మొత్తం 8మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో నలుగురు సేవ్ అవుతున్నట్లు నాగ్ శనివారం ప్రకటించారు. హిమజ, మహేష్, శ్రీముఖి, రాహుల్ శనివారం సేవ్ అయ్యారు. ఇక మిగిలిన జాఫర్, వరుణ్, వితిక, పునర్నవి లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ జాఫర్ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఆదివారం నాగార్జున పునర్నవి సేవ్ అవుతున్నట్లు తొలుత ప్రకటించారు.  ఆ తర్వాత వితిక, వరుణ్ దంపతులని నాగ్ కాసేపు టెన్షన్ పెట్టాడు. మీరు ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావలసి వస్తే ఎవరు ఉండాలని కోరుకుంటారు.. ఎవరు ఎలిమినేట్ కావాలని కోరుకుంటారు ప్రశ్నించాడు. తాను ఎలిమినేట్ అయి వితికని సేవ్ చేస్తానని వరుణ్ తెలిపాడు. వితిక మాత్రం తానే సేవ్ కావాలని కోరుకుంటానని తెలిపింది.  అదే సమయంలో బిగ్ బాస్ స్టేజిపైకి ఇస్మార్ట్ శంకర్ జంట రామ్, నిధి అగర్వాల్ గెస్ట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. కాసేపు ఇంటి సభ్యులతో రామ్, నిధి ముచ్చటించారు. నాగార్జునతో కలసి ఇస్మార్ట్ సాంగ్ కు స్టెప్పులేశారు కూడా. వరుణ్, వితిక, జాఫర్ లలో సేవ్ అయ్యే ఒకరి పేరు ప్రకటించాలని నాగార్జున రామ్ ని కోరాడు.  వరుణ్ సందేశ్ సేవ్ అవుతున్నట్లు రామ్ ప్రకటించాడు. దీనితో వితికలో టెన్షన్ పెరిగిపోయింది. జాఫర్ మాత్రం కూల్ గానే ఉన్నాడు. చివర్లో నాగార్జున ఇంటి సభ్యుల అభిప్రాయాన్ని అడగగా 7గురు జాఫర్ కు మద్దతు తెలిపారు. 6 గురు వితికని సపోర్ట్ చేశారు. కానీ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం జాఫర్ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు. జాఫర్ ఇంటి నుంచి వెళుతూ కన్నీరు పెట్టుకున్నాడు.
0business
sumalatha 93 Views banks , Strike Banks న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో వరుసగా నాలుగు రోజుల పాటు జాతీయ బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు బ్యాంకులు పనిచేయవని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. 26, 27 తేదీలలో దాదాపు నాలుగు లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా సమ్మె చేయనున్నారు. నాలుగవ శనివారం అయినందున 28వ తేదీ బ్యాంకులకు సెలవు. అదే విధంగా మరుసటి రోజు 29వ తేదీని ఆదివారం నాడు కూడా బ్యాంకులు పనిచేయవు. తిరిగి సోమవారం సెప్టెంబర్ 30వ తేదీనే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ నాలుగు రోజుల పాటు చెక్ క్లియరెన్సులు, ఎటిఎం సర్వీసులకు విఘాతం ఏర్పడే అవకాశం ఉంది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అమ్మాయిగా సెక్స్ మార్పిడి చేయించుకున్నా: ‘జబర్దస్త్’ సాయి తేజ ‘‘నేను ఇప్పుడు పూర్తిగా అమ్మాయిలా మారిపోయా.. అంతేకాదు, చావు వరకు వెళ్లి వచ్చా. ఈ విషయం అమ్మా నాన్నలకు తెలీదు. మొదటిసారిగా ఈ విషయాన్ని బయటకు చెబుతున్నా’’ అంటూ జబర్దస్త్ సాయి తేజ షాకింగ్ నిజాలను వెల్లడించాడు. Samayam Telugu | Updated: Nov 1, 2018, 03:36PM IST అమ్మాయిగా సెక్స్ మార్పిడి చేయించుకున్నా: ‘జబర్దస్త్’ సాయి తేజ ప్రముఖ టీవీ చానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వారంలో రెండుసార్లు ప్రేక్షకులకు నవ్వులు పూయించే ఈ షో తెలుగు ప్రజల ఆదరాభిమానులు పొందుతోంది. అయితే, ఈ షోలో అమ్మాయిల గెటప్‌లో కనిపించిన అబ్బాయిలను చూస్తే.. వారు నిజంగానే అమ్మాయిలా అని ఆశ్చర్యం కలగక మానదు. సాయి తేజ కూడా అమ్మాయి గెటప్‌లోనే ‘జబర్దస్త్’ ద్వారా ప్రేక్షకులకు పరిచమయ్యాడు. అయితే, గత కొద్ది నెలలుగా సాయితేజ ‘జబర్దస్త్’ షోలో కనిపించడం లేదు. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌లో ప్రత్యక్షమైన సాయితేజ.. కొన్ని షాకింగ్ నిజాలను ప్రేక్షకులకు వెల్లడించాడు. తాను ఇక అబ్బాయిని కాదని, పూర్తిగా అమ్మాయిగా మారిపోయానని తెలిపాడు. ఆరు నెలల కిందట తాను సర్జరీతో లింగ మార్పిడి చేయించుకున్నానని తెలిపాడు. అయితే, ఇప్పటివరకు ఈ విషయం తన తల్లిదండ్రులకు బంధువులకు తెలియదని, మొదటిసారిగా ఈ షో ద్వారా బయట పెడుతున్నానని వెల్లడించాడు. అబ్బాయి నుంచి పూర్తిగా అమ్మాయిలా మారిపోయిన సాయి తేజ ఇంకా ఏం చెప్పిందంటే.. ‘‘లేడీ గెటప్‌లో ఉంటే డబ్బులు వస్తాయని నేను పూర్తిగా అమ్మాయిలా మారిపోయాను అనుకోవడం పొరపాటు. అబ్బాయిగా ఉండి కూడా లేడీ గెటప్‌లు వేస్తూ సంపాదించవచ్చు. కానీ, నాకు చిన్నప్పటి నుంచే నాలో అమ్మాయిల లక్షణాలు ఉండేవి. ఐదేళ్ల వయస్సులో నా అక్క దుస్తులు వేసుకునేవాడిని, అద్దం ముందుకు వెళ్లి మేకప్ వేసుకునేవాడిని. అయితే, మా ఊర్లో మా నాన్న పరువు పోతుందనే ఉద్దేశంతో ఈ విషయం నా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఈ విషయాన్ని మనసులో దాచుకుని 365 రోజులు ఏడుస్తూనే ఉండేవాడిని. జబర్దస్త్‌లో అమ్మాయిగా గెటప్ వేస్తున్నప్పుడు చాలా సంతోషం కలిగేది. నేను సెక్స్ మార్పిడి చేయించుకున్న విషయం నా కుటుంబ సభ్యులకు తెలియదు. ఈ విషయం ఏదో ఒక రోజు తెలియాల్సిందే. అందుకే తొలిసారిగా ఇంటర్వ్యూలో బయటపెడుతున్నా. భవిష్యత్తులో అబ్బాయిగా పెళ్లి చేసుకున్నా.. భార్యను పక్కోడి దగ్గరకు పంపే పరిస్థితి వస్తుందని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది’’ అని తెలిపింది. చావుకు దగ్గరగా వెళ్లాను...: ‘‘అమ్మాయిలా మారినా ఏదో బాధ లోపల ఉంది. ధైర్యంగా బయటకు వెళ్లలేకపోతున్నా. ఈ నాలుగు నెలల్లో చావు దగ్గరగా వెళ్లి.. బతికి బయటపడ్డాను. జెండర్ చేంజ్ సర్జరీ తర్వాత నాకు అర్థరైటిస్ వచ్చింది. పెద్ద హాస్పిటల్‌లకు వేలకు వేలు ఖర్చుపెట్టా. ఆ క్షణంలో నా స్నేహితులు నన్ను రక్షించారు. బెడ్ మీద నుంచి కూడా లేవలేని పరిస్థితిలో ఉన్న నాకు ఎంతో సాయం చేశారు. అందుకే.. నేను ఇన్ని రోజులు ‘జబర్దస్త్’ షోలో కనిపించలేదు. నేను పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ షోలో కనిపిస్తాను’’ అని సాయితేజ తెలిపింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
internet vaartha 129 Views న్యూఢిల్లీ : ఆభరణాల విక్రయ సంస్థ త్రిభువన్‌దాస్‌ భీమ్‌జీ ఝవేరి (టిబిజడ్‌) ఫ్లిప్‌కార్ట్‌పై ప్రత్యేక వజ్రాభరణాలను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థతో ఒప్పందం చేసుకుంది. చెవిరింగులు, వేలి ఉంగరాలు, పెండెంట్లు, బ్రాస్‌లెట్లు, బంగారునాణేలను కూడా ఫ్లిప్‌కార్ట్‌పై విక్రయించనున్నట్లు ప్రకటించింది. అందుబాటుధరల్లో ఫ్లిప్‌కార్ట్‌పై అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే టిబిజెడ్‌ స్నాప్‌డీల్‌తో కూడా ఇదేవిధమైన ఒప్పందం చేసుకుంది. కంపెనీ దేశవ్యాప్తంగా పదిరాష్ట్రాల్లోని 23 నగరాల్లో 30 స్టోర్లు కలిగి ఉంది. విస్తరణప్రణాళికను మొత్తంఫ్రాంచైజీ రూటులో చేపట్టాలని నిర్ణయించింది. 75శాతంఫ్రాంచైజీ, 25శాతం కొత్తగా సొంత స్టోర్లు ప్రారంభించడం ద్వారా విస్తరించాలని టిబిజడ్‌ నిర్ణయించింది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ బాహుబలికి ముందు టాలీవుడ్ స్టార్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇమేజ్ వున్న ప్రభాస్ 'బాహుబలి 2' లాంటి బ్లాక్‌బస్టర్... TNN | Updated: Aug 13, 2017, 08:09PM IST బాహుబలికి ముందు టాలీవుడ్ స్టార్&zwnj;గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇమేజ్ వున్న ప్రభాస్ 'బాహుబలి 2' లాంటి బ్లాక్&zwnj;బస్టర్ తర్వాత నేషనల్ వైడ్ స్టార్ అయ్యాడు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడాలేకుండా అన్నిచోట్లా ప్రభాస్&zwnj;కి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రభాస్ ఎక్కడికెళ్లినా అక్కడ సెంటరాఫ్ ఎట్రాక్షన్&zwnj;గా నిలుస్తూ క్రౌడ్ పుల్లర్ అయిపోయాడు. దీంతో ఈ బాహుబలి స్టార్&zwnj;నే నమ్ముకుని తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవాలని భావించే ఫిలింమేకర్స్ లేకపోలేదు. ఆగస్టు 18న రిలీజ్ కానున్న ఆనందో బ్రహ్మ మూవీ కూడా ఆ కోవలోకే వస్తుంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇదివరకే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ లాంచ్ చేసి ఆ సినిమాకు మంచి ప్రమోషన్ కల్పించిన ప్రభాస్ రేపు జరగనున్న ఆనందో బ్రహ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్&zwnj;కి సైతం ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు సమాచారం. మహీ వీ రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, శకలక శంకర్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ కీలకపాత్రలో నటించింది.
0business
Hyderabad, First Published 1, Aug 2019, 10:12 AM IST Highlights దర్శకుడు బాలా శిష్యుడు నందన్ సుబ్బరాయన్ తొలిసారిగా తెరకెక్కించిన చిత్రం 'మయూరాన్'. ఇందులో అముదవానన్ హీరోగా నటించగా.. మిస్ ఇండియా ఫెమినా కిరీటాన్ని గెలుచుకున్న ఆశ్మిత హీరోయిన్ గా నటించింది.  కోటీశ్వరురాలైన తన కూతురిని చిత్ర కథానాయకుడు అముదవానన్ ప్రేమ పేరుతో టార్చర్ చేస్తున్నాడని కంప్లైంట్ చేసింది హీరోయిన్ తల్లి.   తన కూతురిని ప్రేమ పేరుతో టార్చర్ చేస్తున్నాడని సినీ నటి తల్లి ఓ హీరోపై ఫిర్యాదు చేయడం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు బాలా శిష్యుడు నందన్ సుబ్బరాయన్ తొలిసారిగా తెరకెక్కించిన చిత్రం 'మయూరాన్'. ఇందులో అముదవానన్ హీరోగా నటించగా.. మిస్ ఇండియా ఫెమినా కిరీటాన్ని గెలుచుకున్న అశ్మిత హీరోయిన్ గా నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం నాడు రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కి హీరో, హీరోయిన్ ఇద్దరూ హాజరు కాలేదు. హీరో వస్తే తన కూతురు రాదని ఆమె తల్లి నిర్మాతలకు చెప్పింది. కారణం కోటీశ్వరురాలైన తన కూతురిని చిత్ర కథానాయకుడు అముదవానన్ ప్రేమ పేరుతో టార్చర్ చేస్తున్నాడని కంప్లైంట్ చేసింది. ఇది ఇలా ఉండగా.. సినిమా ప్రమోషన్స్ కి హీరోయిన్ రాకపోతే తానెందుకు రావాలని హీరో వాదిస్తున్నాడని దర్శకనిర్మాతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో జ్యోతిక నటించిన 'జాక్ పాట్', అలానే 'కళుగు 2' అనే పెద్ద సినిమాల మధ్య తమ సినిమా విడుదల కాబోతుందని, ఇలాంటి సమయంలో సినిమాకి ప్రచారం లేకపోవడం బాధగా ఉందని దర్శకనిర్మాతలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు రాకపోవడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్ధంకావడం లేదని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.  Last Updated 1, Aug 2019, 10:12 AM IST
0business
Hyd Internet 75 Views eden garden kolkata eden garden kolkata కోల్‌కతా: ప్ర‌తికూల వాతావ‌ర‌ణంతో వరుసగా రెండో రోజూ టీమిండియా ప్రాక్టీస్ ర‌ద్దైంది. మ‌రోవైపు ఆస్ట్రేలియా జ‌ట్టు ఇండోర్‌కే పరిమితమైంది. గురువారం నిర్వహించే భారత్‌-ఆస్ట్రేలియా రెండో వన్డే కోసం రెండు రోజుల‌ క్రితమే కోల్‌కతా చేరుకున్న ఇరు జ‌ట్లు వెలుతురు లేమి, మైదానంలో కవర్లు కప్పి ఉంచడంతో మంగళవారం సాధన చేసుకోవడం కుదర్లేదు. ఈ రోజు కూడా అదే ప‌రిస్థితి ఉంది. దీంతో రేప‌టి మ్యాచ్‌పై ఉత్కంఠ నెల‌కొంది.
2sports
ఏప్రిల్‌ వరకు గడువివ్వండి! - ఈడీని అభ్యర్థించిన విజరుమాల్యా న్యూఢిల్లీ: 'ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌' (ఈడీ) విచారణకు తాను వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు గాను ఏప్రిల్‌ వరకు గడువును ఇవ్వాల్సింది లిక్కర్‌ డాన్‌ విజరు మాల్యా విచారణ ఏజెన్సీని కోరారు. ఐడీబీఐ బ్యాంక్‌కు నుంచి అక్రమంగా తీసుకున్న రూ.900 కోట్ల రుణం ఎగవేత విషయమై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈడీ ఇప్పటికే జారీ చేసిన సమన్లలో మాల్యా శుక్రవారం (18న) జరగాల్సిన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సమన్లకు స్పందించిన మాల్యా తాను విచారణకు హజరయ్యేందుకు ఏప్రిల్‌ వరకు గడువు ఇవ్వాల్సిందిగా విచారణ అధికారిని వేడుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. విజరు మాల్యా ఎలాంటి కారణాలను చూపుతూ వ్యక్తిగత హాజరుకు గడువుకోరారు, ఇతర ప్రత్యామ్నాయ అంశాలు ఏమిటీ అనే విషయమై అధికారులు అధ్యయనం జరుపుతన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగా మాల్యా అభ్యర్థనను మన్నించేది లేనిది ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సీఎఫ్‌ఓ రఘునాథన్‌ను ఈడీ విచారణ జరిపిన రోజునే మాల్యాకు ఈ సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. 'ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌' (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ ఐడీబీఐతో సహా విజరు మాల్యా అధ్వర్యంలోని కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆరుగురు అధికారులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ అధికారులందరూ గత అయిదేళ్లకు సంబంధించిన తమ ఆర్థిక లావాదేవాలతో సహా ఆదాయపు పన్ను చెల్లింపు ధ్రువపత్రాలతో హాజరు కావాల్సిందిగా ఈడీ సమన్లలో కోరింది. రఘునాథన్‌తో సహా ఐడీబీఐ బ్యాంక్‌నకు చెందిన మాజీ ఛైరన్‌, ఎండీ యోగేష్‌ అగర్వాల్‌లకు ఈడీ సమన్లను జారీ చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyd Internet 86 Views WIPRO WIPRO ముంబయి: దేశీయ ఐటి దిగ్గజం విప్రో షేరు గురువారం బిఎస్‌ఇ ట్రేడింగ్‌లో సుమారు 5 శాతం నష్టపోయింది.కాగా సెప్టెంబరు 15 నుంచి విప్రో సంస్థకు చెందిన 34.37 కోట్ల పుల్లీ పెయిడ్‌ ఆఫ్‌ ఈక్విటీ షేర్ల (ప్రతి షేరు ముఖ విలువ 2 రూపాయలు)ను 320 రూపాయల చొప్పుల టెండర్‌-ఆఫర్‌ విధానంలో కొనుగోలుకు ఉంచనుంది.ఈ టెండర్‌ ఆఫర్‌ విధాన ప్రభావంతో తాజా ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి విప్రో షేరు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుంది.బిఎస్‌ఇ ఇంట్రాడేలో 5 శాతం నష్టపోయి 281.60 రూపాయల కనిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుతం షేరు ధర ఇటీవలి ముగింపు 296.05తో పోలిస్తే 4.45 శాతం నష్టపోయి 282.85 వద్ద ట్రేడ్‌ అవుతుంది. కాగా షేరు సంవత్సరం కనిష్ట,గరిష్ట ధరలు వరుసగా 252.10,515రూపాయలుగా ఉన్నాయి. ఈ బైబ్యాక్‌కు గతంలోనే కంపెనీ బోర్డు ఆమోదం తెలిపి సెప్టెంబరు 15ను రికార్డు డేట్‌గా ప్రకటించింది.
1entertainment
Hyderabad, First Published 11, Sep 2019, 2:05 PM IST Highlights .ఓ దుర్మార్గుడైన  రౌడీ షీటర్ లో ఓ సినీ దర్శకుడి వల్ల మార్పు వస్తుంది. వాల్మికి కథ కూడా అంతే.  ఒక దొంగ‌లోని ప‌రివ‌ర్త‌న అన్న‌ది వాల్మీకి క‌థ‌. అందుకే వాల్మికిని గుర్తు చేసేందుకు ఈ కథ కు ఈ టైటిల్ పెట్టారు. సాధారణంగా మెగా హీరోల సినిమాల్లో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేస్తూంటారు. అయితే వరణ్ తేజ తాజా చిత్రం వాల్మీకి లో మాత్రం శోభన్ బాబు సూపర్ హిట్ సాంగ్ వెల్లువచ్చి గోదారమ్మ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారు. అయితే అందుకు ప్రత్యేకమైన కారణం ఉందిట.  ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వరుణ్ తేజ ప్రేయసిగా పూజా హెగ్డే నటిస్తోంది.  ఇందులో వరణ్ తేజ పేరు 'గద్దలకొండ గణేష్' .   ఆ ప్లాష్ బ్యాక్ 1982 కాలం నాటి కథతో జరుగుతుందిట. అప్పట్లో  పూజా హెగ్డే శోభన్ బాబుకి వీరాభిమానిట. దాంతో పూజా హెగ్డేను ఇంప్రెస్ చేయడానికి గణేష్ ..శోభన్ బాబు సాంగ్ ఎత్తుకుంటాడట.  అందుకోసం 1982లో వచ్చిన సూపర్ హిట్ సినిమా దేవత సినిమాలో వెల్లువచ్చి గోదారమ్మ సాంగ్ ను రీమిక్స్ చేసినట్టు చెప్తున్నారు. ఈ పాట ఎంతో సూపర్ హిట్ అయింది. వేటూరి, ఆత్రేయ రాసిన ఈ పాటకు చక్రవర్తి సంగీతం అందించారు. బాలు, సుశీల ఆలపించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.    ఈ సినిమాలో కథ ప్రకారం ...ఓ దుర్మార్గుడైన  రౌడీ షీటర్ లో ఓ సినీ దర్శకుడి వల్ల మార్పు వస్తుంది. వాల్మికి కథ కూడా అంతే.  ఒక దొంగ‌లోని ప‌రివ‌ర్త‌న అన్న‌ది వాల్మీకి క‌థ‌. అందుకే వాల్మికిని గుర్తు చేసేందుకు ఈ కథ కు ఈ టైటిల్ పెట్టారు.    ఈ చిత్రానికి  సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్‌, కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌, స్క్రీన్‌ప్లే: మధు, చైతన్య, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.  Last Updated 11, Sep 2019, 2:11 PM IST
0business
శతకం బాది.. తొడగొట్టిన శిఖర్ ధావన్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం ధావన్ తన స్టైల్‌లో అభివాదం చేస్తూ.. మైదానంలోనే TNN | Updated: Jun 8, 2017, 06:12PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ భీకర ఫామ్&zwnj;ని కొనసాగిస్తున్నాడు. శ్రీలంకతో గురువారం జరుగుతున్న మ్యాచ్&zwnj;లో ధావన్ (101 నాటౌట్: 112 బంతుల్లో 12x4) శతకం బాది టోర్నీలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ ఆరంభం నుంచి లంక బౌలర్లని సమర్థంగా ఎదుర్కొంటూ వచ్చిన ఈ ఓపెనర్.. ముఖ్యంగా తన ఫేవరెట్ బౌలర్ యార్కర్ల మలింగని లక్ష్యంగా చేసుకుని ఎక్కువ బౌండరీలు బాదేశాడు. ఇన్నింగ్స్ 40వ ఓవర్&zwnj; వేసిన ప్రదీప్ బౌలింగ్&zwnj;లో నాలుగో బంతిని పాయింట్ దిశగా బౌండరీకి తరలించిన ధావన్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ధావన్&zwnj;కి ఇది మూడో శతకం కాగా.. ఇప్పటి వరకు ఈ అరుదైన మూడు శతకాల ఘనతను అందుకున్న క్రికెటర్ల జాబితాలో గిబ్స్, గంగూలీ, క్రిస్&zwnj;గేల్ మాత్రమే ఉన్నారు.
2sports
Dubai - United Arab Emirates, First Published 17, Sep 2018, 11:29 AM IST Highlights ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ వీరోచిత సెంచరీతో పాటు మరో ఆటగాడి ఒంటిచేతి పోరాటంను అందరూ అభినందిస్తూన్నారు.  ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ వీరోచిత సెంచరీతో పాటు మరో ఆటగాడి ఒంటిచేతి పోరాటంను అందరూ అభినందిస్తూన్నారు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ఒంటిచేత్తో బ్యాటింగ్‌ చేసి ఔరా అనిపించాడు. లంక బౌలర్‌ లక్మల్‌ వేసిన రెండో ఓవర్‌లో ఇక్బాల్‌ ఎడమ చేతి మణికట్టుకి బంతి బలంగా తాకడంతో తీవ్ర గాయమైంది. దీంతో అతను రెండో ఓవర్‌లోనే రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఓవైపు ముష్ఫికర్‌ రహీమ్‌ పోరాడుతున్నా మరోవైపు నుంచి సహాకారం లేక వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బంగ్లా తొమ్మిదో టికెట్‌ను కోల్పోయింది. రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగిన ఇక్బాల్‌ ఇబ్బందుల్లో ఉన్న జట్టు కోసం గాయంతోనే పదో వికెట్‌గా క్రీజ్‌లోకి వచ్చి ఒంటిచేత్తో బ్యాటింగ్‌ చేశాడు. గాయం కారణంగా బాధపడుతునే ఒంటిచేత్తో బ్యాటింగ్‌ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్‌ ప్రేమికులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశం కోసం గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఒంటిచేత్తో బ్యాటింగ్‌ చేయడం గ్రేట్‌.. నీ ధైర్యానికి సెల్యూట్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్‌ 137 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా తరువాత జరిగే మ్యాచ్‌కు తమీమ్‌ అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలవాల్సి ఉంది. Last Updated 19, Sep 2018, 9:27 AM IST
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కి పేల‌వమైన‌ ఆరంభం ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన బ్రోకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ నష్టాలతో త‌న ప్ర‌స్థానం ప్రారంభించింది. Samayam Telugu | Updated: Apr 4, 2018, 01:00PM IST ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కి పేల‌వమైన‌ ఆరంభం ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన బ్రోకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ నష్టాలతో త‌న ప్ర‌స్థానం ప్రారంభించింది. ఇష్యూ ధర రూ. 520కాగా.. బీఎస్‌ఈలో రూ. 431 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది 17 శాతం(రూ. 89) నష్టంకాగా.. ప్రస్తుతం 13 శాతం తక్కువగా రూ. 453 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఇష్యూకి 78 శాతమే సబ్‌స్క్రిప్షన్ లభించింది. యాంకర్‌ విభాగంతో కలుపుకుంటే ఇష్యూ 88 శాతం సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. యాంకర్‌ పోర్షన్‌తో కలిపి ఇష్యూ ద్వారా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ రూ. 3500 కోట్లను సమీకరించింది. వెరసి ఇష్యూ పరిణామాన్ని రూ. 4017 కోట్ల నుంచి రూ. 3500కు తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. బిడ్లు వ‌చ్చింది ఇలా.. స్పంద‌న అలా...
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Murali Vijjay తమిళనాడు రంజీ జట్టులోకి మురళీ చెన్నై: శ్రీలంకతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన ఓపెనర్‌ మురళీ విజ§్‌ు తమిళనాడు తరుపున రంజీ మ్యాచ్‌లు ఆడనున్నారు. తాజాగా తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించిన 27మంది రంజీ జట్టు ప్రాబబుల్స్‌ జాబితాలో మురళీ విజ§్‌ు పేరు కూడా ఉంది. అయితే…సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు. ప్రస్తుతం అశ్విన్‌ ఇంగ్లాండ్‌లో కంట్రీ క్రికెట్‌ ఆడుతుండటంతో రంజీ మ్యాచ్‌లకి అతను అందుబాటులో ఉండ డనే ఉద్ధేశ్యంతో పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాబబుల్స్‌ జట్టు సెప్టెంబర్‌ 18న డెహ్ర డూన్‌లోని ట్రైనింగ్‌ క్యాంపైన్‌కి వెళ్లి…శిక్షణ అనంతరం అక్టోబర్‌ 3న చెన్నైకి తిరిగిరానుంది. అక్టోబర్‌ 6న చెపాక్‌ స్టేడియంలో ఆంధ్రా జట్టుతో తమిళనాడు జట్టు తొలిమ్యాచ్‌లో ఢీకొననుంది.గాయం కారణంగా ఈఏడాది ఐపి ఎల్‌కి కూడా దూరమైన మురళీ విజ§్‌ు… దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌కి తొలుత ఓపెనర్‌గా అతడ్ని ఎంపిక చేసినా చివరి నిమిషంలో గాయపడటంతో అతని స్థానంలో శిఖర్‌ ధావన్‌ సెలక్టర్లు ఆ సిరీస్‌ కోసం పంపించారు. తొలి టెస్టులోనే భారీ శతకం బాదేసిన ధావన్‌….సిరీస్‌ సొంతం ఫామ్‌ చాటాడు. దీంతో ఇప్పుడు టీమిండియాలో మురళీ విజ§్‌ు స్థానం సంక్షోభంలో పడింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న మురళీ విజ§్‌ు మళ్లీ పునరాగమనం చేయాలంటే ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ని ఉంది. అందుకే రంజీల్లో ఆడేందుకు విజ§్‌ు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ===
2sports
internet vaartha 221 Views హైదరాబాద్‌ : వోల్వో ఐషర్‌ కమర్షియల్‌ వాహనాల అనుబంధ విభాగం ఐషర్‌ ట్రక్స్‌, బస్సుల సంస్థ కొత్తగా ఐషర్‌ప్రో 6000,ఐషర్‌ప్రొ 8000 ట్రక్కులను స్కూళ్లకు, ఇంటర్‌సిటీ ట్రావెల్‌కు అనుగుణంగా కొత్త బస్సులను విడుదలచేసింది. ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించిన వీ వాహనా లను భారత విపణిలోనికి ప్రవేశపెట్టింది. ట్రక్‌ డ్రైవింగ్‌ లో ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్‌, ఇంధన వినియోగం, నిర్వహణ, రియల్‌టైమ్‌ డేట్‌ అనలిటిక్స్‌ సేవలు కూడా పొందే అవకాశం ఉందన్నారు ఐషర్‌ సంస్థ ఆటో ఎక్స్‌పోలో ఏడు వాహనాలు విడుదల చేసింది. ఐషర్‌ప్రొ 8049, ఐషర్‌ప్రొ6025టి, హెచ్‌డి టిప్పర్‌, ఐషర్‌ప్రొ 3016 ఐషర్‌ప్రొ 1049 వాహనాలు కూడా ప్రవేశపెట్టాల్సి ఉంది. కంపెనీ సిఇఒ వినోద్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ హైబ్రిడ్‌ స్కూల్‌ బస్‌ పబ్లిక్‌ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్‌ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గించే అవకాశం ఉదన్నారు. స్మార్ట్‌సిటీల్లో వాటికి చక్కటి ఆదరణ ఉంటుందన్నారు. స్కైలైన్‌ ప్రొస్కూల్‌ బస్‌, వెహికల్‌ ట్రాకింగ్‌, జియోఫెన్సింగ్‌, కెమేరా రికార్డింగ్‌; స్టూడెంట్‌రైడర్‌షిప్‌ స్టేటస్‌ వంటి అధునాతన సదుపాయాలున్నాయి.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్న కేదార్..! శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత ఫీల్డర్ కేదార్ జాదవ్ కళ్లు చెదిరే రీతిలో TNN | Updated: Aug 20, 2017, 06:25PM IST శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత ఫీల్డర్ కేదార్ జాదవ్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్&zwnj; 35వ ఓవర్ వేసిన అక్షర్&zwnj; పటేల్ బౌలింగ్&zwnj;లో శ్రీలంక బ్యాట్స్&zwnj;మెన్ హసరంగ (2) భారీ షాట్ ఆడాడు. బంతి లాంగాన్&zwnj;లో చాలా ఎత్తుకి లేచింది. అందరూ.. అది సిక్స్&zwnj;గా వెళ్తోందని ఊహించారు. కానీ.. బంతి లాంగాన్&zwnj;లోని బౌండరీ లైన్&zwnj;కి లోపలే కిందకి పడుతుండటంతో.. మిడాన్&zwnj;లో ఫీల్డింగ్ చేస్తున్న కేదార్ జాదవ్ స్పందించాడు. మిడాన్ నుంచి వేగంగా బంతిని చూస్తూ అలానే వెనక్కి వెళ్లిన జాదవ్.. ఏ మాత్రం తడబడకుండా చివరి క్షణంలో డైవ్ చేస్తూ బంతిని క్యాచ్&zwnj;గా అందుకున్నాడు. సాధారణంగా ఫీల్డర్ మైదానంలో ఎంత దూరమైనా.. ముందుకు వెళ్లి అలవోకగా క్యాచ్ అందుకోగలడు. కానీ.. వెనక్కి వెళ్తూ.. అదీ ఎక్కువ ఎత్తు నుంచి వస్తున్న బంతి గమనాన్ని పరిశీలిస్తూ అందుకోవడం అంత సులువు కాదు. క్యాచ్ అందుకున్న తర్వాత.. పట్టుతప్పి కేదార్ వెనక్కి అలానే పడిపోయాడు. కానీ.. బంతిని వదల్లేదు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రూ.2,299 ధరకే పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌! బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు పేరెన్నికగన్న 'ట్యాగ్' సంస్థ... తన నూతన ఆవిష్కరణగా... 'ట్యాగ్ లూప్' పేరుతో 'పోర్టబుల్ వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్‌'ను విడుదల చేసింది. మ్యూజిక్ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఈ స్పీకర్‌ను తయారు చేసినట్లు సంస్థ వెల్లడించింది. TNN | Updated: Mar 27, 2018, 12:50PM IST బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు పేరెన్నికగన్న 'ట్యాగ్' సంస్థ... తన నూతన ఆవిష్కరణగా... ' ట్యాగ్ లూప్ ' పేరుతో 'పోర్టబుల్ వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్‌ 'ను విడుదల చేసింది. మ్యూజిక్ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఈ స్పీకర్‌ను తయారు చేసినట్లు సంస్థ వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న బ్లూటూత్ ద్వారా ఈ స్పీకర్ కనెక్ట్ అవుతుంది. ఫోన్‌ను ఈ స్పీకర్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే... నేరుగా ఈ స్పీకర్ ద్వారా ఫోన్‌లో ఉన్న మ్యూజిక్ వినవచ్చు. దీనికి మైక్ ఉండటం వల్ల... ఫోన్ కాల్స్ కూడా ఆన్సర్ చేయవచ్చు. కేవలం అరకిలో బరువు ఉండే... ఈ పోర్టబుల్ పరికరాన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. రూ.2,299 ధరకు ఈ స్పీకర్ అమెజాన్ సైట్ ద్వారా ప్రత్యేకంగా యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ బ్లూటూత్ స్పీకర్‌‌లో... 8 వాట్ల సామర్థ్యంతో పనిచేసే రెండు స్పీకర్లు ఉన్నాయి. ఇక ఈ స్పీకర్ బ్లూటూత్ 4.0 టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 2400 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీన్ని ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 5 గంటల వరకు స్పీకర్‌ను వాడుకోవచ్చు.
1entertainment
రంగస్థలం టీజర్ రివ్యూ: చిట్టిబాబు కుమ్మి అవతల పడేశాడు.. Highlights చిట్టిబాబు కుమ్మి అవతల పడేశాడు రంగస్థలం టీజర్ అదుర్స్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రంగస్థలం చిత్రం టీజర్ అధికారికంగా విడుదలైంది. సినీ ప్రేక్షకులు, అభిమానుల్లో ఈ టీజర్ అంచనాలు పెంచింది. మాస్ ఎలిమెంట్స్‌తోపాటు, కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి.   నా పేరు చిట్టిబాబండీ నా పేరు చిట్టిబాబు అండి.. మా ఊరికి నేనే ఇంజనీర్నండి..నాకు సౌండ్ వినిపించదు. కనిపిస్తుందండీ అంటూ 80 దశకంలో వాడిన పంపుసెట్టు స్టార్ట్ చేస్తూ రాంచరణ్ కనిపించాడు.    గూబలు గుయ్‌మనేలా ఏదో అన్నావురా.. పెదాలు మెదిలాయి అని కమెడియన్ సత్యను గుబలు గూయ్ అనేలా కొట్టాడు. అందుకే నన్ను అందరూ ఇంజినీర్ అంటారు అని ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు.    కత్తి పట్టుకొని రాంచరణ్ మా ఊరు రంగ.. రంగ.. రంగస్థలం అంటూ వచ్చే బ్యాక్ స్కోర్ వస్తుండగా రాంచరణ్ కత్తి పట్టుకొని ఆవేశంగా రావడంతో రంగస్థలం టీజర్ ముగిసింది.    వేటాడే సింహాంలా టీజర్ మొదట్లో దట్టంగా గడ్డి మొలిచిన చేన్లో దేన్నో వేటాడే సింహంలా రాంచరణ్ కనిసిస్తాడు. పగ, ప్రతీకారం నేపథ్యంగా ఈ సినిమా ఉంటుందనే అభిప్రాయాన్ని కలిగింది. 80వ దశకం నాటి గ్రామీణ వాతావరణం 80వ దశకం నాటి పరిస్థితులు, గ్రామీణ వాతావరణం కళ్లకు కట్టినట్టుగా కనిపించాయి. వాస్తవంగా ఈ టీజర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఉంది. Last Updated 25, Mar 2018, 11:37 PM IST
0business
Oct 06,2017 విప్రో చేతికి అమెరికా కంపెనీ బెంగళూరు: విప్రో అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న డిజైన్‌ అండ్‌ బిజినెస్‌ కన్సల్టెన్సీ సంస్థ కూపర్‌ను చేజిక్కించుకుంది. కూపర్‌ను రూ.56 కోట్ల (8.5 మిలియన్‌ డాలర్లు)కు కొనుగోలు చేసింది. కూపర్‌ సంస్థ గూగుల్‌, స్టార్‌బక్స్‌ సంస్థలకు డిజిటల్‌ సేవలను అందిస్తోంది. కూపర్స్‌ వ్యవస్థాపకులు స్యూ కూపర్‌, అలాన్‌ కూపర్‌ విప్రోలో చేరనున్నారు. అనంతరం వీరు కంపెనీ డిజిటల్‌ సేవలను మరింత విస్తరించేందుకుగానూ వారు విప్రోతో కలిసి పనిచేయనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
భువనేశ్వర్‌,ఇషాంత్‌లకు దక్కని చోటు ఐసిసి టి20, ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ఎంపిక న్యూఢిల్లీ : ఐసిసి వరల్డ్‌ టి20,ఆసియా కప్‌ టోర్నమెంట్‌లకు భారత జట్టును శుక్రవారం బిసిసిఐ ప్రకటించింది. కాగా సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. రెండు సిరీస్‌లకు ధోనీనే నాయకత్వం వహించనున్నట్లు చీఫ్‌ సెలెక్టర్‌ సందీప్‌ పాటిల్‌, బిసిసిఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటించారు. కాగా 2007,2010,2012,2014లలో జరిగిన వరల్డ్‌ టీ20 టోర్నమెంట్‌లకు కెప్టెన్‌గా ధోనీనే వ్యవహరించాడు. భారత్‌లో జరుగనున్న 6వ వరల్డ్‌ టి20 ఎడిషన్‌కు భారత జట్టు కెప్టెన్‌గా ధోనీ వ్యవహరించనున్నారు.వరల్డ్‌ టి20 టోర్నమెంట్‌కు తొలిసారి భారత్‌ ఆతిథ్యం ఇస్తుంది. కాగా మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఈ వరల్డ్‌ టి20 టోర్నమెంట్‌ జరుగనుంది.రెండు సిరీస్‌లకు ఒకే జట్టును ఎంపిక చేసిన సెలక్షన్‌ కమిటీ,ఆయా సిరీస్‌లకు ఈ జాబితా నుంచే ఆటగాళ్లను ఖరారు చేయనుంది.వరల్డ్‌ టి20 జట్టులో టీమిండియా పేసర్లు భువనేశ్వర్‌కుమార్‌,ఇషాంత్‌శర్మలకు చోటు దక్కలేదు.కాగా 2007 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టి20 టోర్నమెంట్‌లోని ధోనీ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్‌గా అవతరించింది.2014లో జరిగిన టోర్నీలో ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో భారత్‌ పరాజయం పాలైంది.ఇప్పటి వరకు 28 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.అందులో భారత జట్టు 18 మ్యాచ్‌లు గెలుపొందగా,9 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు.కాగా ఈ టోర్నమెంట్‌ భారత్‌లో జరుగుతుండటంతో  టైటిల్‌ బరిలో భారత్‌ జట్టు పేవరేట్‌గా ఉంది.ధర్మశాలలో మార్చి 19న భారత్‌,పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి.కాగా ఈ టోర్నీని మొత్తం 3 దశలుగా విభజించారు.టోర్నలో మొత్తం 16 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి.వరల్డ్‌ టి20 టోర్నమెంట్‌ను భారత్‌లోని ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు. ఎంపికైన జట్టు ధోనీ (కెప్టెన్‌,వికెట్‌ కీపర్‌)     విరాట్‌ కోహ్లీ రోహిత్‌ శర్మ                      శిఖర్‌ ధావన్‌ అజింక్యా రహానే                సురేష్‌ రైనా యువరాజ్‌                       హార్ధిక్‌ పాండ్యా జడేజా                             అశ్విన్‌ జస్‌ప్రిత్‌ బుమ్రా                అశిష్‌ నెహ్రా హర్భజన్‌సింగ్‌                 పవన్‌ నగీ మహమ్మద్‌ సమీ.
2sports
Warne నిజమైన వార్న్‌ వ్యాఖ్యలు పుణే: భారత పర్యటన ఆసీస్‌కు కఠిన సవాలేనని ఆ జట్టు సారథి స్టీవ్‌ స్మిత్‌,కోచ్‌ డారెన్‌ లీమన్‌తో పాటు మాజీ క్రికెటర్లు సైతం సిరీస్‌ ఆరంభానికి ముందు తమని తాము తక్కువగా అంచనా వేసుకున్నారు.తాము ఎవ్వరినికవ్వించే ప్రయత్నం చేయమని కూడా వారు పేర్కొన్నారు. కానీ వీరందకికి భిన్నంగా ఆ దేశ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ చేసిన వ్యాఖ్యలు మాత్రం నిజ మయ్యాయి. ఆస్ట్రేలియా విషయంలో టీమిం డియా జాగ్రత్తగా ఉండాలని ఆ జట్టును తేలిగ్గా తీసుకోరాదని సిరీస్‌ ఆరంభానికి ముందే హెచ్చరించారు.గత కొంత కాలంగా సొంతగడ్డపై తిరుగు లేని ప్రదర్శన చేస్తూ వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకుంటున్న కోహ్లీ సేనకు గట్టిపోటీ ఉంటుందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టులో అద్భుతంగా కనిపిస్తుంది.సిరీస్‌ జరుగుతున్న కొద్ది మీకే అర్థమవుతుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న వార్న్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌,బ్యాటింగ్‌ను పరిశీలిస్తే సిరీస్‌ ఆరంభం ఎలా ఉందో తెలుస్తుంది.కేవలం 11 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లను తీసి భారత్‌ను భారీ నష్టాన్ని కలిగించింది.ఆసీస్‌ స్పిన్నర్‌ ఒకీపె ఒక్కడే ఆరు వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియాను ఆధిక్యంలో నిలిపాడు.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 105 పరుగులకే ఆలౌటైంది.మరోవైపు రెండవ ఇన్నింగ్స్‌లోను సత్తా చాటింది.
2sports
Hyderabad, First Published 4, Mar 2019, 4:16 PM IST Highlights టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలియని నార్త్ సెలబ్రెటీలు ఉండరు. బన్నీ స్టామినా ఏంటో దాదాపు ఇండియన్ సెలబ్రెటీలందరికి తెలుసు. ఇండియన్ మోస్ట్ స్టైలిష్ స్పీడ్ డ్యాన్సర్ల హీరోల లిస్ట్ లో మనోడు కూడా ఉన్నాడు. ఇకపోతే ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు టెక్నీషియన్స్ బన్నీ అంటే చాలా ఇష్టమని చెప్పారు.  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలియని నార్త్ సెలబ్రెటీలు ఉండరు. బన్నీ స్టామినా ఏంటో దాదాపు ఇండియన్ సెలబ్రెటీలందరికి తెలుసు. ఇండియన్ మోస్ట్ స్టైలిష్ స్పీడ్ డ్యాన్సర్ల హీరోల లిస్ట్ లో మనోడు కూడా ఉన్నాడు. ఇకపోతే ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు టెక్నీషియన్స్ బన్నీ అంటే చాలా ఇష్టమని చెప్పారు.  రీసెంట్ గా స్టార్ సింగర్ అర్మన్‌ మాలిక్‌ కూడా అల్లు అర్జున్ స్టయిల్ కి ఫిదా అయిపోతా అని వివరించాడు. ఆయన తన ఫెవరెట్ హీరో అంటూ ప్రతి సినిమాను చూస్తాను అని తెలిపాడు. నా పేరు సూర్య సినిమాలో బ్యూటీ ఫుల్ లవ్ అనే పాట పాడే అవకాశం రావడంతో అప్పుడు ఆయన్ను కలిశాను. బన్నీ  సిగ్నేచర్‌ అంటే నాకు పిచ్చి అంటూ హైదరాబాద్ తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని ఇంటర్వ్యూలో చెప్పాడు.  తన బంధువులు చాలామంది హైదరాబాద్ లోనే ఉన్నారంటూ నైట్ లాంగ్ డ్రైవ్ లకి హెల్మెంట్ పెట్టుకొని ఫ్రెండ్స్ తో వెళ్తానని చెప్పాడు. ఇక బిర్యానీ గోంగూర ఇతర సౌత్ వంటకాలను ఇష్టంగా తింటాను అని అర్మన్ తెలిపాడు. రీసెంట్ గా ఉప్పల్ లో జరిగిన ఇండియా - ఆస్ట్రేలియా మ్యాక్ కోసం వచ్చిన ఈ యువ సంగీత కెరటం ఈ విధంగా తన ఇష్టాలను ఇంటర్వ్యూలో తెలియజేశాడు.   Last Updated 4, Mar 2019, 4:16 PM IST
0business
ఎన్టీఆర్ ను,నన్ను అవమానిస్తున్నారు,అడ్డుకుంటా-లక్ష్మీపార్వతి Highlights లక్ష్మీస్ వీరగ్రంథంపై లక్ష్మీపార్వతి ఆగ్రహం ఎన్టీఆర్ ఘాట్ వద్ద పాలాభిషేకం చేసిన లక్ష్మిపార్వతి అవమానిస్తే ఊరుకునేది లేదని కేతిరెడ్డికి హెచ్చరిక తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన దివంగత ముఖ్యమంత్రి అన్న నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా సినిమాలు తెరకెక్కించేందుకు పలువురు దర్శకనిర్మాతలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగానే.. ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కే బయోపిక్స్ వ్యవహారం రోజుకో సంచలనానికి తెరతీస్తోంది.   లక్ష్మీపార్వతి ప్రధాన పాత్రగా కేతిరెడ్డి జగదీశ్వర్ అనే దర్శకనిర్మాత తలపెట్టిన 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత ముఖ్యమంత్రి, అన్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా తీయడం ముమ్మాటికీ ఎన్టీఆర్‌ను అవమానించడమేనని మండిపడ్డారు.   కావాలనే తనను అవమానించాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నారని, ఎన్టీఆర్‌ను అగౌరపరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన అనుమతి లేకుండా తన పేరు వాడుకొని సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించారు. అంతేకాక అసలు మహనీయుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా.. తనకు, ఎన్టీఆర్ కు నచ్చని పేరును తన పక్కన చేర్చి సినిమా టైటిల్ పెడితే.. చూస్తూ ఊరుకునేది లేదని, న్యాయపోరాటం చేస్తామని అవసరమైతే రోడ్ల మీదికి రావటానికి కూడా సిద్ధంగా వున్నామని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.   ఈ ఉదయం(మంగళవారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ సమాధికి పాలాభిషేకం చేశారు. తనను, ఎన్టీఆర్‌ను అవమానించేలా, చరిత్రను వక్రీకరించి సినిమా తీయాలనుకుంటే అడ్డుకుంటామని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. కేతిరెడ్డి తోపాటు కొంతమంది పాపులు ఎన్టీఆర్ ఘాట్‌ను అపవిత్రం చేశారని ఆరోపించిన ఆమె అందుకే పాలాభిషేకంతో శుద్ధి చేశామని చెప్పారు.   ‘లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా ముహూర్తపు షాట్‌ను ఎన్టీఆర్ ఘాట్ వద్ద తీసేందుకు కేతిరెడ్డి ప్రయత్నించగా.. లక్ష్మీపార్వతి బంజారాహిల్స్‌ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షూటింగ్ అడ్డుకున్నారు.   అసలు ఎన్టీఆర్ కు అన్యాయం జరిగిందనే అంశంపై ఏళ్లతరబడి  పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి ఆయన భార్యనైన లక్ష్మిపార్వతినే అన్నారామె. ఎన్టీఆర్ ను రెండడో పెళ్లి చేసుకోవడమే తప్పంటే.. ఆయన కుటుంబంలో కూడా అలా జరుగుతున్నాయని, అసలు లోకంమీద రెండో పెళ్లిళ్లకు చోటులేదనే ధైర్యం వీళ్లకుందా అని ప్రశ్నించారామె. అసలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద సినిమా షూటింగ్ చేయడం ఆయన ఆత్మకు ఘోష కలిగించటమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు లక్ష్మీపార్వతి. Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఈ ఏడాది రెండు సినిమాలు పక్కా: నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమాలో నితిన్ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే దీనితో పాటు మరో సినిమా చేస్తున్నట్లు నితిన్ స్పష్టం చేశారు. Samayam Telugu | Updated: Mar 6, 2019, 12:29PM IST ‘జయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నితిన్.. ‘దిల్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలినాళ్లలోనే వరుస హిట్లతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమాతో తన ఇమేజ్‌ను పెంచుకున్న నితిన్.. ఆ తరవాత వెనకబడిపోయారు. సుమారు ఆరేళ్ల పాటు ఒక్క విజయాన్ని కూడా నితిన్ అందుకోలేకపోయారు. అయితే 2012లో ‘ఇష్క్’ సినిమాతో దర్శకుడు విక్రమ్ కె.కుమార్.. నితిన్‌కు బ్రేక్ ఇచ్చారు. అప్పటి నుంచి నితిన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్టయింది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’, ‘చిన్నదాన నీకోసం’, ‘అ ఆ’ సినిమాలతో నితిన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు. అయితే, గడిచిన రెండేళ్లలో వచ్చిన మూడు సినిమాలు.. ‘లై’, ‘ఛల్ మోహన్‌రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో నితిన్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. కానీ, నితిన్ అభిమానులు మాత్రం తమ హీరో సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమాలో నితిన్ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే దీనితో పాటు మరో సినిమా చేస్తున్నట్లు నితిన్ స్పష్టం చేశారు. సినిమాల వివరాలైతే తెలియజేయలేదు కానీ ఈ ఏడాది రెండు సినిమాలు పక్కా అని మాత్రం స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘నా తరవాత సినిమా కోసం అడుగుతున్న వాళ్లందరికోసం.. ఈనెలాఖరుకల్లా నా భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి అప్‌డేట్ ఉంటుంది. పక్కా ప్రామిస్. షూటింగ్ కూడా త్వరలో ప్రారంభమవుతుంది!! ప్రాజెక్టులు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఆలస్యమైనందుకు క్షమించాలి. మీ ఓపికకు నా కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్’ అని నితిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కిందటేడాది కూడా నితిన్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రేక్షకాదరణ పొందకపోవడంతో నితిన్ కాస్త నిరాశకు గురయ్యారు. For all those asking..wil update about my future projects by the end of this month..PAKKA PROMISE..shoot wil also s… https://t.co/U6WAHigpa8 &mdash; nithiin (@actor_nithiin) 1551847096000
0business
Hyderabad, First Published 9, Aug 2019, 7:52 PM IST Highlights నాగ్ నటించిన కొత్త చిత్రం మన్మధుడు 2 ఈ రోజు రిలీజైంది. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది.  అయితే సినిమాలు, హిట్ అవటం, ప్లాఫ్ అవటం అనేది ఈ ఫీల్డ్ లో సహజం కాబట్టి ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కానీ సోషల్ మీడియా జనం మాత్రం ఈ సినిమాలో ఓ సీన్ ని టార్గెట్ చేస్తూ రకుల్ ని, చిన్మయి ని ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.  నాగ్ నటించిన కొత్త చిత్రం మన్మధుడు 2 ఈ రోజు రిలీజైంది. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది.  అయితే సినిమాలు, హిట్ అవటం, ప్లాఫ్ అవటం అనేది ఈ ఫీల్డ్ లో సహజం కాబట్టి ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కానీ సోషల్ మీడియా జనం మాత్రం ఈ సినిమాలో ఓ సీన్ ని టార్గెట్ చేస్తూ రకుల్ ని, చిన్మయి ని ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.    ఇంతకీ ఆ సీన్ ఏమిటంటే... రకుల్ ప్రీతి సింగ్ ..ఓ సన్నివేశంలో యాంకర్ ఝాన్సిని ముద్దు పెట్టుకుంటుంది. అదీ మామూలుగా కాదు లిప్ టు లిప్. అయితే కథలో భాగంగా అదేమీ పెద్ద ఇష్యూగా అనిపించదు. కానీ విడిగా చూస్తే వల్గర్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ వీడియోని, ఆ ఫొటోని తీసి కొందరు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.  ఓ ఆర్టిస్ట్ మరో ఆర్టిస్ట్ ని సన్నివేశపరంగా ముద్దెట్టుకుంటే తప్పేమిటి అదేమన్నా పెద్ద క్రైమా అని కొందరు అడుగుతున్నారు. రకుల్ ని సపోర్ట్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఎంత కథలో భాగమైతే మాత్రం ఫ్యామిలీలతో కలిసి వెళ్లే సినిమాకు ఇలాంటి వల్గర్ సీన్స్ పెడితే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది అంటున్నారు.    అక్కడితో ఆగితే ఫర్వాలేదు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సైతం ఈ విషయంలో ట్రోలింగ్ కు గురి అవుతోంది. ఆమెకు సంభందం లేకపోయినా మీ భర్త ఇలాంటి సినిమా చేస్తూంటే అడ్డుకోలేకపోయావా అని నిలదీస్తున్నారు. అక్కడితో ఆగకుండా మీ మామగారు ఇలాంటి బి గ్రేడ్ సినిమా తీస్తూంటే నువ్వు ఆపలేదేం అని సమంతని అడుగుతున్నారు.  మరి రకుల్, చిన్మయి, సమంత ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.   Last Updated 9, Aug 2019, 7:52 PM IST
0business
Hyd Internet 92 Views infosys infosys న్యూఢిల్లీ: జిఎస్‌టి చట్టం అమలుకు అవసరమైన సాంకేతిక వనరులను సమకూర్చేందుకు ఏర్పాటుచేసిన జిఎస్‌టిఎన్‌ నెట్‌వర్క్‌ మొరాయిస్తోంది. వర్తకులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో విసుగెత్తి పోయిన ట్రేడర్ల బాడీ సిఎఐటి, ఇన్ఫోసిస్‌కి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోతే, ఇక తమ దగ్గర ఎలాంటి ఆప్షన్‌ ఉండదని, కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించింది. కంపెనీ అందించిన జిఎస్‌టి పోర్టల్‌ వర్తకులను బాగా వేధిస్తోందని, ఇది విజయవంతం అవడానికి అవాంతరాలు సృష్టిస్తోందని తెలిపింది. రూ.1400కోట్లలో కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఇన్ఫోసిస్‌, ఇతర కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదని తెలిపింది. జిఎస్‌టిఎన్‌ నెట్‌వర్క్‌లో అవాంతరాలు ఎదురవుతున్నాయనే ఆరోపణలను ఇన్ఫోసిస్‌ ఖండిస్తోంది. పూర్తిగా ఇవి అవాస్తమని తెలుపుతోంది. ఇన్ఫోసిస్‌ వ్యతిరేకంగా వెంటనే చర్యలు తీసుకోకపోతే, తమ దగ్గర ఇక ఎలాంటి ఆప్షన్‌ లేదని, దీనిలో కోర్టులో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. ప్రజా సంపదను దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదని తెలిపింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన జిఎస్‌టి ప్రాజెక్టులో తాము భాస్వామ్యం కావడం ఎంతో గర్వకారణమని ఐటి దిగ్గజం ఈ నెల మొదట్లో ఓ ప్రకటన చేసింది. కానీ ఇటీవల జిఎస్‌టిఎన్‌ నెట్‌వర్క్‌లో సమస్యలు ఎదురవుతున్నాయని ట్రేడర్లు వాపోతున్నారు. ఈ నెట్‌వర్క్‌ మొరాయిస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు.
1entertainment
Hyderabad, First Published 1, Nov 2018, 9:33 AM IST Highlights సినిమా కథ అనుకుంటున్నప్పుడే ఫలానా వాళ్లు అయితే బాగుంటారు అని ఫిక్స్ అవుతూంటారు. వారి కోసం ప్రయత్నించటం ..కుదరకపోతే వేరే వారిని అనుకుని...కథ వారికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేయటం జరిగింది. అలాగే సినిమాలో వచ్చే ఐటం సాంగ్స్ విషయంలోనూ ఎవరి చేత చేయించాలి  సినిమా కథ అనుకుంటున్నప్పుడే ఫలానా వాళ్లు అయితే బాగుంటారు అని ఫిక్స్ అవుతూంటారు. వారి కోసం ప్రయత్నించటం ..కుదరకపోతే వేరే వారిని అనుకుని...కథ వారికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేయటం జరిగింది. అలాగే సినిమాలో వచ్చే ఐటం సాంగ్స్ విషయంలోనూ ఎవరి చేత చేయించాలి అనేది ఎప్పుడు పెద్ద సినిమాలకు ఎదురయ్యే ప్రశ్నే. ఎందుకంటే క్రేజ్ ఉన్నవాళ్లతో చేయిస్తేనే ఆ లుక్ వస్తుంది. ఈ మధ్యన హీరోయిన్స్ తో ఐటం సాంగ్స్ చేయచటం అనే ట్రెండ్ మొదలైంది. అఫ్ కోర్స్ దాన్ని స్పెషల్ సాంగ్ అంటున్నారు.  అలాంటి సాంగ్ నే చైతూ సినిమా ‘సవ్యసాచి’లో అనుకున్నారు. ఆ పాటలో తమన్నా అయితే బాగుందనుకున్నారు. అదే వార్తలు సైతం బయిట వచ్చాయి.  అయితే తమన్నా కాకుండా హీరోయిన్ తోనే దాన్ని లాగించేసేరు. దాంతో అందరూ తమన్నా అడిగినంత ఇవ్వటం కష్టమని ,బడ్జెట్ కంట్రోలు కోసం హీరోయిన్ తోనే చేయించేసారు అనుకున్నారు. మీడియా కూడా అలాంటి ప్రచారమే చేసింది. అయితే అందులో నిజం లేదని, అసలు జరిగింది  ఇదే అంటూ నిర్మాతలు చెప్పుకొచ్చారు. అదేమిటో చూద్దాం. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రానికి  చందూ మొండేటి  దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అలనాటి పాట ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు’ను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట కోసం స్పెషల్ గా తమన్నను తీసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. నిన్న రిలీజ్ చేసిన వీడియోలో తమన్నా లేకుండానే ఆ సాంగ్ పిక్చరైజ్ చేశారని అర్దమైంది.  బడ్జెట్ పెరిగిపోతుందనే కారణంతోనే తమన్ను తప్పించి,   ఆ పాట తీశారంటూ అప్పట్లో వచ్చిన రూమర్స్ కు ఇది బలం చేకూర్చినట్లైంది. ఈ విషయమై నిర్మాతను అడగటం జరిగింది.సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, మోహన్, రవి. తమన్నను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరంగా చెప్పుకొచ్చారు. స్వయంగా "సవ్యసాచి" నిర్మాతలు స్పందిస్తూ.... "మీరంతా భావిస్తున్నట్లు తమన్నా విషయంలో రాజీ పడలేదు. మొదట తమన్నతో డిస్కషన్లు పూర్తయ్యాయి. అంతా ఓకే అన్నాం. అయితే కథలో ఆ పాట వచ్చే సిచ్యుయేషన్ లో బయట నుంచి ఓ అమ్మాయి వచ్చి డాన్స్  చేస్తే బాగుండదు అనిపించింది.  కథ ప్రకారం వచ్చే ఆ రీమిక్స్ పాటలో మరో హీరోయిన్ ను తెస్తే ఫిట్ అవ్వదని డైరక్టర్ చెప్పడంతో తమన్నాను తీసుకోలేదు." అలాగే "సవ్యసాచి" సినిమా కథ కాలేజ్ లో ఓపెన్ అవుతుందని, స్టూడెంట్స్ మధ్య ఆ రీమిక్స్ పాట వస్తుందని ఆ సిట్యువేషన్ లో సడెన్ గా మరో హీరోయిన్ కనిపిస్తే బాగుండదని అంతా ఫీలయ్యామని అంటున్నారు. ఇక ఈ  ఒరిజినల్‌ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడారు. రీమిక్స్ వెర్షన్ పాటను పృథ్వీ చంద్ర, మౌనిమ ఆలపించారు. ‘సవ్యసాచి’ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, రవి, మోహన్‌ చెరుకూరి నిర్మించారు. మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం మన ముందుకు రాబోతోంది.  Last Updated 1, Nov 2018, 9:33 AM IST
0business
ఒకే ఒక్క వ్యక్తి పన్నుబకాయి రూ.21,870 కోట్లు!   న్యూఢిల్లీ, జనవరి 24: భారత్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మొత్తం వసూళ్లలో 11శాతం ఒకే ఒక్క పన్ను చెల్లింపుదారుడు బకాయిపడ్డాడంటే ఆశ్చర్యమే. పేరు వెల్లడించని ఈ బకాయిదారుని మొత్తం పన్ను బకాయి 21,870 కోట్లుగా ఉంది. 2014-15 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సంబం ధించి ఈ మొత్తం చెల్లించాలి. అంటే మొత్తం వ్యక్తిగత ఆదాయపు పన్ను రాబ డుల్లో 11శాతం ఈ ఒక్క బకాయిదారుడే చెల్లించాల్సిఉంది. మరో ముగ్గురు పన్ను చెల్లింపుదారులు తమతమ బిజినెస్‌ ఆదావయనరులు రూ.500 కోట్లకు పైబడి ఉన్నట్లు ప్రకటిస్తే మరో ఇద్దరు దీర్ఘకాలిక మూలధన లబ్ధి 500 కోట్ల పైనా 2014-15 సంవత్సరానికి 2013 -14 సంవత్సరానికి ప్రకటించారు. అయితే వీరి పేర్లను మాత్రం పన్నులశాఖ అధికారులు బైటపెట్టడంలేదు. ఇప్పటికే ఆక్స్‌ఫామ్‌ అనే విదేశీ సర్వేసంస్థ భార తీయ కుబేరుల్లో ఒకటిశాతం మంది వద్దనే భారత్‌ లోని సంపద మొత్తంలో 58శాతం కేంద్రీకృతం అయి ఉందని, 57 మంది బిలియనీర్లు 70శాతం సంపదతో ఉన్నట్లు తేలిందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా ప్రకటించింది. మొత్తం 388మంది పౌరుల సంపద ప్రపంచ పేదల జనాభా 2010 ప్రామాణికంగా తీసుకుంటే వారిలో సగంమంది సంపదతో సమాన మని ఆక్స్‌ఫామ్‌ అంచనా. అయితే ఈ సంఖ్య 2015 నాటికి 62కు చేరింది. భారత్‌లో 36.5 మిలియన్ల వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులున్నారు. వారి పన్నుచెల్లించే ఆదాయవనరులు 16.5 లక్షల కోట్లుగా ఉంది. వారంతా కలిసి 1.91 లక్షలకోట్ల పన్నులు చెల్లిస్తున్నట్లు తేలింది. ఇక 2014-15లో 36 మిలియన్ల మంది భారతీయులు వేతన ఆదా యవనరులు 9.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంటే 144 బిలియన్‌డాలర్లు. స్థూల జాతీయ ఆదా యంలో ఏడుశాతంగా ఉంటుంది. 2015-16లో స్థూల జాతీయ ఆదాయం 134.2 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా. బిజినెస్‌ ఆదాయవనరులు కూడా 5.6 లక్షల కోట్లుగా ఉంది. ఇతరవనరులద్వారా వచ్చిన ఆదాయం 2.4 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా. గరిష్టంగా పన్ను చెల్లింపు 43,964 కోట్లుగా ఉంది. సాలీనా కనిష్టంగా 1.50 లక్షలు పన్ను వసూలు జరుగుతుంది. 5,50 లక్షనుంచి 9.50లక్షల పన్ను శ్లాబ్‌లో వచ్చే పన్ను వసూళ్లు 17,926 కోట్లుగా ఉంది. ఇక హిందూ అవిభాజ్య కుటుంబాలు, కంపెనీలు, ఇతర సంస్థలు 2014-15 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి వచ్చే ఆదాయం 4,46,719 కోట్లుగా ఉంది. అంతకుముందుసంవత్సరంతో పోలిస్తే 13శాతం పెరిగింది. దేశంలో మొత్తం 64మంది పన్ను చెల్లింపుదారుల పన్ను బకాయి 500 కోట్లుకుపైబడి ఉంది. మొత్తం పన్ను చెల్లింపులు 1,13,068 కోట్లు కాగా వీరి బకాయి 500 కోట్లుపై మాటే. మొత్తం పన్ను లు 4,46,719 కోట్లలో 25శాతంగా నిపుణుల అంచనా. సెక్యూరిటీ లావాదేవీ పన్నుతో కలుపుకుని ఆదాయపు పన్ను వసూళ్లు తొమ్మిది రెట్లు పెరిగి 2.9 లక్షల కోట్లకు పెరిగాయి. 2000 -01లో 31,764 కోట్లు ఉంటే 2015-16లో 2.9 లక్షల కోట్లకు చేరింది. రెండు రాష్ట్రాల మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలవాటా మొత్తం ప్రత్యక్ష పన్నుల్లో 53శాతం వాటాతో ఉన్నట్లు అంచనా.
1entertainment
sonakshi breakup ​ఫుల్ గా తాగి... అసలు విషయాన్ని చెప్పిన సోనాక్షి? ఈ బాధలో ఈమె ఫుల్ గా తాగేస్తోందా.. అంటే ఔను అని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. TNN | Updated: Mar 18, 2017, 03:27PM IST అలనాటి సూపర్ స్టార్ శత్రుఘ్నసిన్హా కూతురు, బాలీవుడ్ నటీమణి సోనాక్షి సిన్హా బ్రేకప్ తో బాధపడుతోందా? తన బాయ్ ఫ్రెండ్ బంటీ సచ్ దేవ్ కు ఆమె దూరం అయ్యిందా? ఈ బాధలో ఈమె ఫుల్ గా తాగేస్తోందా.. అంటే ఔను అని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఈ విషయాలన్నీ ఆమె నోటి నుంచినే బయటకు వచ్చాయని కూడా బాలీవుడ్ పత్రికలు పేర్కొంటుండటం విశేషం. మరి అసలు కథ ఏమిటి? అని ఆరాతీస్తే.. ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. చాలామంది క్రికెటర్లకు, బాలీవుడ్ సెలబ్రిటీలకు యాడ్ మేనేజర్ గా వ్యహరించే బంటీ సచ్ దేవ్, సోనాక్షి ప్రేమలో పడ్డారని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సోనాక్షి ఆ విషయం గుట్టు విప్పలేదు. అతడితో తరచూ బయట అయితే కనిపించేది కానీ, ప్రేమను మాత్రం ధ్రువీకరించలేదు. ఆమె సైలెంట్ గా ఉండటంతో రూమర్లకు మరింత ఊపు వచ్చింది. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయానికి బలం చేకూరింది. అయితే తొలి సారి సోనాక్షి ఈ విషయం గురించి నోరు విప్పిందట.. అది కూడా ఫుల్ గా తాగి. &lsquo;బద్రీనాథ్ కా దుల్హానియా&rsquo; సినిమా షూటింగ్ లో సోనాక్షి బాగా తాగేసిందని, తాగిన తర్వాత ఆమె తన ప్రేమ కథ గురించి చెప్పుకొచ్చిందని ఆ విజయోత్సవానికి హాజరైన వారు చెబుతున్నారు. తను సింగిల్ అని, బంటీతో తెగదెంపులు చేసుకున్నాను అని.. సోనాక్షి అందట. దీంతో బంటీ, సోనాక్షిలు విడిపోయారనే ప్రచారం బాలీవుడ్ లో ఊపందుకుంది. మరి ప్రేమ వ్యవహారాన్ని ధ్రువీకరించని సోనాక్షి బ్రేకప్ ను అయినా ధ్రువీకరిస్తుందా?
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV వన్డే సిరీస్ నుంచి కివీస్ స్పిన్నర్ ఔట్ భారత్‌తో కీలకమైన వన్డే సిరీస్‌కి ముందే న్యూజిలాండ్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ టాడ్ ఆస్లే గాయంతో TNN | Updated: Oct 19, 2017, 02:30PM IST భారత్&zwnj;తో కీలకమైన వన్డే సిరీస్&zwnj;కి ముందే న్యూజిలాండ్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ టాడ్ ఆస్లే గాయంతో జట్టుకి దూరమయ్యాడు. భారత్ బోర్డు ప్రెసిడెంట్స్&zwnj; ఎలెవన్&zwnj;తో జరిగిన ప్రాక్టీస్ వన్డేలో అస్లే గాయపడ్డాడని.. అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ ఇస్&zwnj; సోధీని జట్టులోకి తీసుకుంటున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. &lsquo;ఆస్లే ఇటీవల న్యూజిలాండ్-ఎ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన చేశాడు. వన్డేల్లో భారత్ బ్యాట్స్&zwnj;మెన్&zwnj;కి అతను సవాల్ విసురుతాడని ఆశించాము. కానీ.. గాయంతో అతను పక్కకి తప్పుకోవడంతో జట్టులోని క్రికెటర్లందరూ నిరాశ వ్యక్తం చేశారు&rsquo; అని న్యూజిలాండ్ కోచ్ మైక్ హసన్ వెల్లడించాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య వాంఖడే వేదికగా ఆదివారం తొలి వన్డే జరగనుంది.
2sports
Dec 28,2015 మార్కెట్లలో ఒడిదుడుకులే..!    ముంబయి : డిసెంబర్‌ 28తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్ట్సు గడువు దగ్గరపడుతుండటంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా తగ్గుతోన్న ముడి చమురు ధరలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. ఆటోమొబైల్‌ కంపెనీలు డిసెంబర్‌ మాసంలో చేసిన అమ్మకాలను ప్రకటించనున్న నేపధ్యంలో ఆ రంగం షేర్లలోనూ ఒడిదుడుకులు ఎదురు కానున్నాయి. అంతర్జాతీయంగా గురువారం చైనా తయారీ రంగం గణంకాల సూచీని వెల్లడించనుంది. ప్రపంచ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువను మదుపర్లు కీలకంగా తీసుకోనున్నారు. గత వారం 1.3 శాతం పెరిగిన సూచీలు    డిసెంబర్‌ 24తో ముగిసిన వారంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు 1.3 శాతం పెరిగాయి. సెన్సెక్స్‌ 319 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్లు చొప్పున పెరిగి వరుసగా 25,838.71, 7,861 వద్ద ముగిశాయి. ఈ వారంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.33 పైసలు కోల్పోయి 66.20కు చేరింది. డిసెంబర్‌ 18తో ముగిసిన వారంలో 66.42 వద్ద నమోదయ్యింది. బిఎస్‌ఇలో కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌ సూచీ ఒక్కటి మాత్రం 1 శాతం విలువ కోల్పోయింది. మరోవైపు లోహ సూచీ 3.10 శాతం, విద్యుత్‌ 2.73 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 2.57 శాతం, రియాల్టీ 2.07 శాతం, కాపిటల్‌ గూడ్స్‌ 1.52 శాతం చొప్పున రాణించాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV భారత్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఇటీవల జరిగిన 17 మ్యాచ్‌ల్లో ఏకంగా 16 మ్యాచ్‌ల్లో విజయాలను అందుకుని ప్రస్తుతం ఫుల్ జోష్‌లో TNN | Updated: Jun 24, 2017, 03:08PM IST ఐసీసీ మహిళల ప్రపంచకప్&zwnj;లో భాగంగా భారత్&zwnj;తో జరుగుతున్న తొలి మ్యాచ్&zwnj;లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఒక ప్రపంచకప్&zwnj; కూడా చేజిక్కించుకోలేకపోయిన మహిళా జట్టు ఈ టోర్నీని విజయంతో ఆరంభించాలని ఆశిస్తోంది. ఇటీవల జరిగిన 17 మ్యాచ్&zwnj;ల్లో ఏకంగా 16 మ్యాచ్&zwnj;ల్లో విజయాలను అందుకుని ప్రస్తుతం ఫుల్ జోష్&zwnj;లో భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే మూడు సార్లు ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మరోసారి టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో 8 జట్లు పోటీపడుతున్నాయి. జులై 31న టోర్నీ ఫైనల్ జరగనుంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆసీస్‌పై గెలవాలంటే.. డైవ్‌ క్యాచ్‌లు పట్టాల్సిందే ఆస్ట్రేలియాతో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న కఠినమైన వన్డే సిరీస్‌ కోసం టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. TNN | Updated: Sep 16, 2017, 01:46PM IST ఆస్ట్రేలియాతో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న కఠినమైన వన్డే సిరీస్‌ కోసం టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. కంగారూలకు బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ దీటుగా బదులివ్వాలనే తలంపుతో ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ శనివారం ఆటగాళ్లకి ప్రత్యేక సెషన్ నిర్వహించాడు. తొలి పవర్‌ప్లే సమయంలో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు.. 30 అడుగుల సర్కిల్‌లో ఫీల్డింగ్ చేసే క్రికెటర్లకి డైవ్‌ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేయించాడు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌ తన భార్యకి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో తొలి మూడు వన్డేలకి దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో తుది జట్టులోకి అజింక్య రహానె రానున్నాడు. అతను డైవ్‌ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన వీడియోని బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ‘ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ బ్యాట్‌ నుంచి వచ్చిన బంతిని నాలుగు సెకన్ల వ్యవధిలోనే మెరుపు వేగంతో అజింక్య రహానె అందుకున్నాడు’ అంటూ బీసీసీఐ రాసుకొచ్చింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి తొలి వన్డే జరగనుంది.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV బొమ్మళీని సైడేసిన చిరు? ఏమైందబ్బా! మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో హీరోయిన్ కోసం భారీ ఎత్తున అన్వేషించారు. TNN | Updated: May 11, 2017, 07:49PM IST మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో హీరోయిన్ కోసం భారీ ఎత్తున అన్వేషించారు. నయనతార, అనుష్కలలో ఎవరితో అయినా నటించాలని చిరు అనుకున్నాడు. కానీ అప్పటికే నయన్ తెలుగు సినిమాలను లైట్ తీసుకోవడంతో ఆమెను పక్కన పెట్టారు. అనుష్కను కన్ఫర్మ్ చేసుకుందామనుకుంటే ఆమె నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో కాజల్&zwnj;ను ఎంపిక చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ చిరు 151 కోసం కథానాయికల వేట కొనసాగుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం బాలీవుడ్ హీరోయిన్లు విద్యాబాలన్, ఐశ్వర్యారాయ్&zwnj;ల పేర్లు పరిశీలించినప్పటికీ వారు దక్షిణాది సినిమాలకు ఓకే చెబుతారా అనేది అనుమానమే. దీంతో చిత్రబృందం అనుష్క కాల్షీట్స్ కోసం సంప్రదించాలనుకున్నారు. ఉయ్యాలవాడ కథను హిందీలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. బాహుబలి సినిమాతో అనుష్క అన్ని భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. చిరు సినిమాలో ఆమెను హీరోయిన్&zwnj;గా తీసుకోవడం సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. కానీ చిరంజీవి మాత్రం దానికి నో అంటున్నాడట. కావాలంటే సమయం తీసుకొని బాలీవుడ్ హీరోయిన్&zwnj;ను తీసుకుందాం గానీ స్వీటీ అయితే వద్దని చెప్పేస్తున్నారట. చారిత్రక నేపధ్యం గల సినిమాలు చేయడంలో అనుష్క చేయి తిరిగిన హీరోయిన్ అనడంలో నో డౌట్. పైగా చిరు ఏజ్&zwnj;కి క్రేజ్&zwnj;కు అనుష్క అయితేనే పక్కా పర్ఫెక్ట్ అని దేవసేన ఫ్యాన్స్ నోటమాట. అయితే స్వీటీని సైడేసి ఏ బ్యూటీని చిరు సెట్ చేస్తారన్నది హాట్ టాపిక్&zwnj;గా మారింది.
0business
Hyderabad, First Published 8, Mar 2019, 1:40 PM IST Highlights సూపర్ స్టార్ మహేష్ బాబు 'కెజిఎఫ్' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయబోతున్నాడనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 'కెజిఎఫ్' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయబోతున్నాడనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. 'కెజిఎఫ్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ ప్రస్తుతం తన దృష్టి మొత్తం 'కెజిఎఫ్' చాప్టర్ 2 పైనే పెట్టాడు. ఈ సినిమాను 2020 సమ్మర్ లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ప్రశాంత్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తోన్న కొందరు నిర్మాతలు అతడిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ప్రశాంత్ మాత్రం 'కెజిఎఫ్' చాప్టర్ 2 పూర్తయిన తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాడు. ఇటీవల నమ్రతని కలిసి ఓ స్టోరీ లైన్ కూడా వినిపించారట. ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ప్రశాంత్ పూర్తి కథను సిద్ధం చేయలేదు. అంతా సిద్ధమైన తరువాత ఒకసారి మహేష్ ని కలిసి పూర్తి కథను వివరించనున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను మహేష్ బాబు తన సొంత బ్యానర్ లో నిర్మించే అవకాశాలు ఉన్నాయి.   Last Updated 8, Mar 2019, 1:40 PM IST
0business
sumalatha 147 Views Australia , STEVE SMITH Steve Smith మాంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ పరుగుల సునామీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు సెంచరీలు బాదేసిన స్మిత్ తాజాగా నాలుగో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. స్మిత్ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరును నమోదు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 126 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన స్మిత్ తన ఖాతాలో డబుల్ సెంచరీని జమ చేసుకున్నాడు. కెప్టెన్ పైన్ అండతో స్మిత్ కదం తొక్కాడు. ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించిన స్మిత్ పరుగుల వరద పారించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్మిత్ తొలుత లబుస్‌చంగెతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో కెప్టెన్ పైన్ అండతో స్మిత్ తన పోరాటాన్ని కొనసాగించాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ఆస్ట్రేలియాకు భారీ స్కోరును సాధించి పెట్టాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 319 బంతుల్లో 24 ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 211 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పైన్ 8 బౌండరీలతో 58 పరుగులు సాధించాడు. చివర్లో మిఛెల్ స్టార్క్ మెరుపులు మెరిపించాడు. ధాటిగా ఆడిన స్టార్క్ ఏడు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లియాన్ కూడా అజేయంగా 26 పరుగులు చేయడంతో దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరును సాధించింది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/
2sports
Suresh 144 Views మనసు మార్చుకున్న బిసిసిఐ అజహర్‌కు 500వ టెస్టు ఆహ్వానం న్యూఢిల్లీ: టీమిండియా 500వ టెస్టుకు భారత మాజీ కెప్టెన్‌ మహ మ్మద్‌ అజహరుద్దీను బిసిసిఐ ఆహ్వానించింది.కాగా ఈ చారిత్రక టెస్టు వేడుకల్లో భాగంగా మాజీ కెప్టెన్‌ సన్మానించాలని భావిస్తున్న బోర్డు తొలుత అజర్‌ను చారిత్రక టెస్టుకు ఆహ్వానించకూడదని భావించింది. అయితే తన నిర్ణయాన్ని మార్చుకొని అజర్‌కు కూడా ఆహ్వానం పంపింది.ఆ ఆహ్వానాన్ని అజర్‌ అంగీకారం తెలిపాడు. కాగా 2000వ సం వత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరో పణలతో బోర్డు అజర్‌పై జీవిత కాల నిషేదం విధిం చింది. అయితే కోర్టు నిర్దోషిగా ప్రకటించినా అధికారిక కార్యక్రమాలకు బోర్డు ఆయనను ఆహ్వానించడం లేదు. కాగా మిగతా అందరు మాజీల మాదిరిగానే ఇప్పుడు అజర్‌ టెస్టు కోసంఆహ్వానించినట్లు బోర్డు సీనియర్‌ అధికారి రాజీవ్‌ శుక్లా తెలిపారు.అజర్‌తో పాటు మాజీ సారథులు సచిన్‌,వెంగ్‌సర్కార్‌,శ్రీకాంత్‌ బోర్డు ఆహ్వానానికి సమ్మతించి గ్రీన్‌ పార్క్‌ స్టేడియంలో జరిగే సన్మాన సభకు హాజరవుతామని చెప్పారని శుక్లా తెలిపారు.అనారోగ్య కారణాలతో ఈ వేడుక కు రాలేనని అజివ్‌ వాడేకర్‌ వెల్లడించారని శుక్లా పేర్కొన్నాడు.కాగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 22న మొదలయ్యే తొలి టెస్టు టీమిం డియాకు 500 మ్యాచ్‌ కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెండినాణాన్ని టాస్‌గా ఉపయోగించనున్నారు.
2sports
న్యూజిలాండ్‌ 180 / 5 (20 ఓవర్లు) పాకిస్థాన 158 / 5 (20 ఓవర్లు) 80 పరుగులతో గుప్తిల్‌ దూకుడు మొహాలీ : వరల్డ్‌ టి20 మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌పై న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్‌ 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.న్యూజిలాండ్‌ తరువాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు సాధించింది.దీంతో పాకిస్థాన్‌పై న్యూజిలాండ్‌ 22 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా ఇది న్యూజిలాండ్‌కు హాట్రిక్‌ విజయం కావడంతో సెమీస్‌కు సుమారుగా బెర్త్‌ను ఖరారు చేసుకుంది.న్యూజిలాండ్‌కు చెందిన గుప్తిల్‌ 48 బంతుల్లో 10 బౌండరీలు,3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్‌కు మంచి ప్రారంభం లభించింది.అతనికి విలియమ్సన్‌ 17 పరుగులతో అండగా నిలువడంతో న్యూజిలాండ్‌ తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.అనంతరం కోరీ అండర్సన్‌ 14 బంతుల్లో 3 బౌండరీలతో 21 పరుగులు, రాస్‌ టేలర్‌ 23 బంతుల్లో 2 బౌండరీలు,1 సిక్సర్‌తో 36 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడటంతో న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది.కాగా పాకిస్థాన్‌ బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది.ఓపెనర్‌ షార్జిల్‌ఖాన్‌ 25 బంతుల్లో 9 బౌండరీలు,1 సిక్సర్‌తో 47 పరుగులు సాధించగా,ఆహ్మద్‌ షెహజాద్‌ 32 బంతుల్లో 3 బౌండరీలతో 30 పరుగులు చేసి మంచి ప్రారంభాన్నివ్వడంతో ఆ జట్టు గెలుపు దిశగా పయనించినట్లు కనబడింది. కాగా ఈ జోడీ 5.3 ఓవర్లలో 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్థాన్‌ శిబిరంలో ఆనందం నింపారు.అయితే ఆ తరువాత పాకిస్థాన్‌ కష్టాల్లోకి వెళ్లిపో యింది. పాకిస్థాన్‌ టాపార్డర్‌ ఆటగాళ్లలో ఖలీద్‌ లతిఫ్‌ 3 పరుగులు,షాహిద్‌ అప్రిది 19 పరుగులు,ఉమర్‌ అక్మల్‌ 24 పరుగులతో నిరాశపరిచారు. ఇక చివర్లో షోయబ్‌ మాలిక్‌ 15 పరుగులతో నాటౌట్‌గా నిలువగా సర్పరాజ్‌ ఆహ్మద్‌ 11 పరు గులతో నాటౌట్‌గా నిలిచాడు. గెలుపు కోసం చేసిన వీరి ప్రయత్నాలు ఫలించలేదు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సాంట్నూర్‌, మిల్సేలు రెండేసి వికెట్లు సాధించారు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పెట్టుబ‌డిదారులు ఇప్పుడు ఏం చేయాలి? ఉప ఎన్నికల్లో బిజేపీకి తీవ్ర పరాభావం ఎదురుకావడంతో పాటు కేంద్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం ఎత్తుగడలు కొనసాగుతుండ‌టంతో ప్రతికూలత కొనసాగుతుంది TNN | Updated: Mar 26, 2018, 03:30PM IST దేశీయ, అంతర్జాతీయ పరిణామాల మధ్య గత రెండు నెలలుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఉప ఎన్నికల్లో బిజేపీకి తీవ్ర పరాభావం ఎదురుకావడంతో పాటు కేంద్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం ఎత్తుగడలు కొనసాగుతుండ‌టంతో ప్రతికూలత కొనసాగుతుంది. అదే విధంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు నీరవ్‌ మోడీ వేల కోట్లలో మోసం చేయడం బ్యాంకింగ్‌తో పాటు ఇతర సూచీలను భారీ నష్టాలకు గురి చేసింది. ఈ వారం కూడా వీటితో పాటు ఇతర పరిణామాలు మార్కెట్ల దిశ, దశను ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఈ రోజు మార్కెట్లు 400 పాయింట్ల‌కు పైగా లాభ‌ప‌డ్డాయి. మార్చి 26తో ప్రారంభమయ్యే వారంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. వివిధ ప్రతికూల అంశాలు పొంచి ఉన్నందున మార్కెట్లు ఒడిదుడుకులకు గురైయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏయే అంశాల కార‌ణం గా మ‌దుపర్లు అప్ర‌మ‌త్త‌త వ‌హించాలో ఈ కింద తెలుసుకుందాం. వాణిజ్య యుద్దం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య యుద్దానికి తెరతీశారు. ఈ పరిణామం వల్ల ఇప్పటికే ప్రపంచ మార్కెట్లతో పాటు భారత సూచీలు నష్టాలపాల‌య్యాయి. 1930 సంక్షోభం కాలంలో అంటే దాదాపుగా 80 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న వాణిజ్య యుద్దం మళ్లీ మొదలైంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంపు విదేశీ దిగుమతులపై భారీగా సుంకాలను విధించాలని నిర్ణయించడం, ముఖ్యంగా చైనా ఉత్పత్తులపై ఆంక్షలు పెట్టినంత పని చేయడంతో వాణిజ్య యుద్ధానికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఈ పరిణామం ఈ వారం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని బ్రోకర్లు పేర్కొంటున్నారు. చమురు ధరలు..
1entertainment