news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Chandimal hints at going back to 'four-bowler' strategy
నోరు జారిన శ్రీలంక కెప్టెన్.. భారత్కి హింట్
భారత్తో టెస్టు సిరీస్ కోసం శ్రీలంక మేనేజ్మెంట్ ఆలోచించిన వ్యూహాన్ని ఆ జట్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్ మీడియా సమావేశంలో గురువారం
TNN | Updated:
Nov 9, 2017, 06:24PM IST
భారత్‌తో టెస్టు సిరీస్‌ కోసం శ్రీలంక మేనేజ్‌మెంట్ ఆలోచించిన వ్యూహాన్ని ఆ జట్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్ మీడియా సమావేశంలో గురువారం చెప్పేశాడు. సుదీర్ఘ సిరీస్‌ కోసం బుధవారం కోల్‌కతాకి చేరుకున్న ఆ జట్టు ప్రాక్టీస్‌తో బిజీగా గడుపుతోంది. నవంబరు 16న తొలి టెస్టు ప్రారంభంకానుండగా.. అంతకంటే ముందు భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో శ్రీలంక రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ని ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చండిమాల్ మాట్లాడాడు.
‘పాకిస్థాన్‌తో యూఏఈ వేదికగా ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో ఆరు మంది బ్యాట్స్‌మెన్, ఐదుగురు బౌలర్లతో తుది జట్టుని ఎంచుకున్నాం. ఈ ఎంపిక మంచి ఫలితాన్నిచ్చింది. యూఏఈ వేడి వాతావరణాన్ని తట్టుకుని నలుగురు బౌలర్లతో టెస్టు మ్యాచ్‌లో నెగ్గడం కష్టమని మేము ముందే భావించాం. కానీ.. భారత్ జట్టులో ప్రస్తుతం మంచి నైపుణ్యమున్న బౌలర్లున్నారు. కాబట్టి.. తొలి టెస్టు తుది జట్టు ఎంపికపై పునరాలోచించాం. ఐదో బౌలర్‌గా ఆల్‌రౌండర్‌ కంటే.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ ఒకరిని తుది జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే తొలి టెస్టులో నలుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతాం’ అని చండిమాల్ వెల్లడించాడు. ఐదు రోజుల పాటు సాగే టెస్టు మ్యాచ్‌లో తుది జట్టు ఎంపికని సాధారణంగా టాస్ ముందు వరకు బహిర్గతం చేయరు. కానీ.. శ్రీలంక కెప్టెన్ చండిమాల్.. వారం రోజుల ముందే గేమ్ ప్లాన్ చెప్పడం విశేషం. గత నాలుగు నెలల కాలంలో.. శ్రీలంక జట్టుకి దాదాపు ఏడుగురు కెప్టెన్లు మారారు. | 2sports
|
కష్టపడేది ఎందుకు?
- ఒలింపిక్స్ ట్రయల్స్పై నిఖత్
హైదరాబాద్ : దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం ఇవ్వనప్పుడు, ఇన్నేండ్లుగా కఠోరంగా సాధన చేయటం ఎందుకు? అని యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రశ్నించింది. 2019 ఆసియా చాంపియన్షిప్స్లో కాంస్య పతకం సాధించిన నిఖత్ జరీన్ ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ వివక్షపూరిత విధానంపై క్రీడా మంత్రి కిరణ్ రిజుజుకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ కోసం మేరీకోమ్ 51 కేజీల విభాగంలో పోటీపడుతోంది. ప్రపంచ స్వర్ణ పతక విజేతలకు ట్రయల్స్ ఉండవు అని బాక్సింగ్ ఫెడరేషన్ నిర్ణయించటంతో.. ఇటీవల రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో మేరీకోమ్ నేరుగా ప్రాతినిథ్యం వహించింది. ప్రపంచ చాంపియన్షిప్స్లో స్వర్ణాలు సాధించిన బాక్సర్లకు ఒలింపిక్స్ ట్రయల్స్ ఉండవు అని గతంలో బాక్సింగ్ ఫెడరేషన్ నిబంధన. తాజాగా మేరీకోమ్ కోసం ఆ నిబంధనను కాంస్య పతకానికి మార్పు చేశారు. దీంతో సెలక్షన్ వివక్షపై నిఖత్ జరీన్ లేఖ రాసింది. ఈ విషయాన్ని బాక్సింగ్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లానని, వారు ఓ నిర్ణయం తీసుకుంటారని మంత్రి రిజుజు ట్విట్టర్ వేదికగా నిఖత్కు హామీ ఇచ్చారు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా సైతం నిఖత్కు అవకాశం ఇవ్వాలని మద్దతు పలికారు. ' సమాన అవకాశం కల్పించేందుకు బాక్సింగ్ ఫెడరేషన్తో మాట్లాడతానని మంత్రి చెప్పారు. అభినవ్ బింద్రా మద్దతుగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. మేరీకోమ్ అంటే ఎనలేని గౌరవం. బాక్సింగ్లో ఆమె ఎప్పటికీ దిగ్గజమే. ఆమె స్ఫూర్తితోనే బాక్సింగ్లోకి వచ్చాను. ఆమెలో ఎదిగేందుకు మాకూ అవకాశం దక్కాలని కోరుకోవటంలో తప్పు లేదు. ఒలింపిక్స్కు ట్రయల్స్ నిర్వహించేలా బాక్సింగ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను' అని నిఖత్ జరీన్ తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 2sports
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
Cognizant ఉద్యోగులకు భారీ షాక్.. ఏకంగా 13,000 మందిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం!
దిగ్గజ టెక్నాలజీ కంపెనీ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఏకంగా 13 వేల మందిని తొలగించేందుకు రెడీ అవుతోంది. దీంతో వేల మంది ఉద్యోగులు రోడ్డుమీద పడనున్నారు.
Samayam Telugu | Updated:
Oct 31, 2019, 11:50AM IST
Cognizant ఉద్యోగులకు భారీ షాక్.. ఏకంగా 13,000 మందిని ఇంటికి పంపేందుకు రంగం సిద్...
హైలైట్స్
ఉద్యోగులకు షాకిచ్చిన కాగ్నిజెంట్
వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు రెడీ
వచ్చే కొన్ని త్రైమాసికాల్లో పింక్ స్లిప్లు
కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుంచి వైదొలుగుతున్న కంపెనీ
న్యూజెర్సీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఏకంగా 13 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందకు రంగం సిద్ధం చేసుకుంటోంది. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో వీరందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనుంది.
కాగ్నిజెంట్ ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత అనలిస్ట్లతో సమావేశం నిర్వహించింది. ప్రస్తుత సిబ్బంది నుంచి 13,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇప్పటికే 7,000 మందిని కంపెనీ నుంచి వెళ్లిపోవాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే కాగ్నిజెంట్ కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుంచి వైదొలగాలని భావిస్తోంది. దీంతో మరో రూ.6,000 మందిపై ప్రభావం పడనుంది. | 1entertainment
|
FINANCE1
సరైన ప్రణాళికతోనే ఆర్థిక స్వాతంత్య్రం
న్యూఢిల్లీ,సెప్టెంబరు 8: కొంత కాలం తరువాత ఎక్కు వ డబ్బు మీ దగ్గర ఉండాలంటే మొదట చేయా ల్సింది పొదుపు. ఆ తరువాత పెట్టుబడులు పెట్టాలి. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా విజయవంతం కావాలంటే ఇదే మార్గం. ఈ దశకు చేరుకునే ముందు ఆర్థికంగా టార్గెట్ సాధించేందుకు ప్రతి ఒక్కరు కొన్ని దశలు దాటాల్సి ఉంటుంది. వాటిని గమనిద్దాం. అవగాహన ముఖం మీ అవసరాలకు ఎంత డబ్బు అవసరమో తెలియడం ఎంతైనా ముఖ్యం. అయితే ఏ పరిస్థితిలోనైనా క్రమంగా ఆర్థికంగా మెరుగయ్యేందుకు క్రమ మైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. అందుకోసం ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితిని విశ్లేషించి ఎక్కడ మెరుగుపడాలో ఖచ్చి తంగా ఆ తెలిసి ఉండాలి. ఇందుకోసం టార్గెట్ ఏర్పరచుకుని కష్టపడాలి. వెంటనే దృష్టి సారిం చాల్సి అంశాలేమిటో తెలుసు కుని మొదట వాటి మీద పట్టు పెంచుకోవాలి. ఇలా ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్లాలి. నియంత్రణ… ఇప్పుడు మొదట టార్గెట్ ఏమిటో తెలిసిపోతే ఇక వాటిని సాధించే దిశగా ఏం పనులు చేయాలో వాటని నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తు ఉండాలి. కొంత సొమ్మును అప్పులు కట్టేందుకు కేటాయిం చడం, మరికొంత నెలవారీ పొదుపు కోసం పక్కన పెట్టడం చేయాలి.
ఈ దశలో ఏ విధంగానైనా అన వసర ఖర్చులను నియంత్రణ చేయాల్సిందే. క్రమ శిక్షణ, పట్టుదలతో మీ పొదుపు విలువ పెరుగు తుంది. తద్వారా మీఆర్థిక స్థితి మెరుగవుతుంది. మీరు వెళ్తుతున్న దారిలో ఆటంకాలు ఎదురైనా మళ్లీ మీరు అనుకున్న టార్గెట్ సాధించేందుకు గాడిలో పడేందుకు కృషి చేయాలి. ఇక ఆర్థిక రక్షణ మీ కోసం ఆర్థిక భద్రత ఏర్పరచుకునే విధంగా పని చేయండి. ఇదేవిధంగా మీపైన ఆధారపడిన కుటుంబసభ్యుల ఆర్థికరక్షణ కోసం ఏర్పాట్లు చేయండి, రోజువారి, నెలవారీ ఖర్చులపై పట్టు వచ్చిన తరువాత ఆర్థిక భద్రతలపై దృష్టి పెట్టాలని ఆర్థికనిపుణులు సూచిస్తుంటారు. దీర్ఘకాలంలో ఎక్కువ సంపద పొగుపడేం దుకు సరైన పెట్టుబడులు పెట్టడమే ఆర్థిక భద్రతకు సోపానం.అదే విధంగా మీకు అత్యవసరం ఉన్పప్పుడు కొంత డబ్బు ఖర్చు లకు అందుబాటులో ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇందుకోసం లిక్విడ్ ఫండ్లను ఆశ్రయించవచ్చు.
దీన్ని అత్యవసర విధిలాగా కూడా పరిగణించవచ్చు. ఆర్థిక స్వాతం త్యం. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఆర్థిక స్థితి ఆధారంగా రోజువారి నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక స్వాతంత్రం అదంట అదే వస్తుంది. ఇందుకోసం రెండు రకాల మార్గాలు ఉంటాయి. ఎవరికైనా అప్పు ఉందంటే కొంత కంగారే. ఆర్థిక స్వాతంత్రం సాధించే ముందు ఇది వరకే ఉన్న అప్పులు తీర్చడం తెలివైన నిర్ణయం. అది సొమ్ము అయినా మొదట అప్పు తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. పెట్టుబడి అప్పు చేసి పెట్టుబడి పెట్టకూడదని చాలా మంది చెబుతారు. దీర్ఘకాలంలో సంపన్నుడవ్వా లంటే పెట్టుబడులు పెట్టక తప్పదు. ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించడంలో ఇది ఒక సూచీలా ఉంటుంది. పెట్టుబడులు అనగానే ఖచ్చితంగా డబ్బును అధిక రాబడుల నిచ్చే వాటిలో ఉండాల నేమీలేదు. మీ ఆర్థిక స్థితి, నష్ట భయాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడులను నిర్ణయించుకోండి. | 1entertainment
|
sumalatha 158 Views Bullion , Gold , silver
gold
న్యూఢిల్లీ: గత శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ సుంకం పెంచడంతో రికార్డు స్థాయిలోదూసుకెళ్లిన బంగారం ధర ఈరోజు దిగొచ్చింది. నాటి మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 600 తగ్గి రూ. 34,870కి పడిపోయింది. అటు వెండి కూడా నేడు స్వల్పంగా దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ. 48 తగ్గి రూ. 38,900 పలికింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/ | 1entertainment
|
SRK on Salman: Yeh bandhan toh pyaar ka bandhan hai
సల్మాన్తో టైమ్పాస్ హ్యాపీగా వుంటుంది-షారుఖ్
చాన్నాళ్లకి సల్మాన్తో కలిసి ఓ టీవీ షో కోసం మళ్లీ షూటింగ్లో పాల్గొన్న షారుఖ్... సల్మాన్తో తనకున్న అనుభవాల్ని గుర్తుచేసుకుని ఆనందం వ్యక్తంచేశాడు.
TNN | Updated:
Dec 12, 2015, 09:43PM IST
1995లో వచ్చిన కరణ్ అర్జున్ సినిమా అప్పట్లో బాలీవుడ్లో ఓ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ అయిన సల్మాన్, షారుఖ్లు కలిసి నటించిన ఈ సినిమా ఆ ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్కి ఓ మరిచిపోలేని ఆనందాన్నిచ్చింది. అయితే, చాన్నాళ్లకి సల్మాన్తో కలిసి ఓ టీవీ షో కోసం మళ్లీ షూటింగ్లో పాల్గొన్న షారుఖ్... సల్మాన్తో తనకున్న అనుభవాల్ని గుర్తుచేసుకుని ఆనందం వ్యక్తంచేశాడు. సల్మాన్తో వుంటే హ్యాపీగా వుంటుంది. చాన్నాళ్ల తర్వాత సల్మాన్తో షూటింగ్ ఎంజాయ్ చేశా. చిన్న ప్రోమో కోసం జరిగిన షూటింగ్ వద్దే మేమిద్దరం దాదాపు మూడ్నాలుగు గంటలపాటు మా పర్సనల్ మేటర్స్ చర్చించుకుంటూ గడిపేశాం అని చెప్పుకుంటూ తనలో తానే '' యే బంధన్ తో ప్యార్ కా బంధన్ హై "... అంటూ కరణ్ అర్జున్ సినిమాలోని ఏ ఫేమస్ పాటని హమ్మింగ్ చేసుకున్నాడు షారుఖ్. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అఖిల్ ‘మిస్టర్ మజ్ను’.. అక్కినేని ఫ్యాన్స్కి భలే కిక్
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి జనవరిలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
Samayam Telugu | Updated:
Nov 7, 2018, 02:14PM IST
అఖిల్ ‘మిస్టర్ మజ్ను’.. అక్కినేని ఫ్యాన్స్కి భలే కిక్
అక్కినేని సినీ వారసుడిగా వెండి తెరకు పరిచయమైన అఖిల్ ఇంకా కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేదు. తొలి సినిమా ‘అఖిల్’ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక రెండో సినిమా ‘హలో’ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టి అభిమానులకు పండుగ తీసుకురావాలని అఖిల్ చూస్తున్నాడు. వరుణ్ తేజ్తో ‘తొలిప్రేమ’ లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమాలో అఖిల్ నటిస్తున్నాడు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి జనవరిలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, నేడు దీపావళి పర్వదినం సందర్భంగా ‘మిస్టర్ మజ్ను’ సినిమాలోని అఖిల్ కొత్త స్టిల్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్పై జనవరిలో సినిమా థియేటర్లలోకి వస్తుందని పేర్కొన్నారు. అఖిల్ కొత్త లుక్ అభిమానులకు కిక్ ఇచ్చేలా ఉంది.
ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
ఇదే తొలిసారి కాదు
- జీడీపీ పతనంపై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : జీడీపీ వృద్ధి రేటు 5.7 శాతానికి దిగజారడం ఇదే తొలిసారి కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ''ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా'' స్వర్ణోత్సవాల కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధి రేటు మందగించిందని వస్తున్న విమర్శలపై ఆయన స్పందిం చారు. దేశ ఆర్థిక వ్యవస్ధ నిలదొక్కుకుందన్నారు. ప్రస్తుత ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్కు హాని కలిగించబోమన్నారు. తమ ప్రభుత్వం సంస్కరణలను కొనసాగిస్తోందన్నారు. ప్రముఖ ఆర్థిక వేత్తలుగా పేరు పొందిన మన్మోహన్ సింగ్, చిదంబరం ఆర్థిక మంత్రులుగా ఉన్నప్పుడు వృద్ధి రేటు మందగించిన సందర్భాలున్నా యన్నారు. ఆర్థిక వృద్ధి రేటు 0.2, 1.5 శాతాలకు తక్కువగా నమోదైన పరిస్థితులను దేశం చూసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో 8 సందర్భాలలో జీడీపీ రేటు 5.7 శాతానికి తక్కువగా నమోదయ్యిం దన్నారు. ఎన్డీయే హయాంలో కేవలం ఒక్క త్రైమాసికంలోనే వృద్ధిరేటు నమోదైందని చెప్పారు. ఏదో ఒక త్రైమాసికంలో వృద్ధి రేటు తగ్గడం సమస్యే కాదన్నారు. వృద్ధిరేటు దిగజారిన విషయం ప్రభుత్వానికి అవగాహన ఉందని, దానిని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీఎస్టీతో వ్యాపార రంగంలో ఏర్పడిన ఇబ్బందులను ప్రస్తావిస్తూ , వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిం చాలని జీఎస్టీ మండలికి సూచించినట్టు చెప్పారు. చిన్న వర్తకులకు సహాయపడేలా సవరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆయన సమర్ధించుకున్నారు. నల్లధనాన్ని అంతమొందిం చేందుకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడిందన్నారు. కార్పొరేట్ రంగంలో మీ సలహాలు పెద్ద మార్పును తీసుకు రాగలనవి, ప్రజలకు సరైన మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత మీదేనంటూ కంపెనీ సెక్రెటరీలనుద్దేశించి అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 338 Views
ముంబై : యుటిలిటి వాహనాల తయారీ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర తాజాగా ఇంపీరియో ప్రీమియం పికప్ వాహనాన్ని విడుదల చేసింది. ముంబై ఎక్స్ షోరూం ధరలుగా 6.25 లక్షల రూపాయలుగా ఉంది. కొత్త ఎంఅండ్ఎం వాహనం టాటా గెనాన్, ఇసుజు డిమాక్స్ పికప్స్కు పోటీ ఇస్తుందని నిపుణుల అంచనా. ఇంపీరియో ప్రస్తుత జీనియో పికప్ స్థానంలో మంచి మార్కెట్ సాధిస్తుందని అంచనా. మొత్తం 1240 కిలోల పేలోడ్ కెపాసిటీతో వస్తోంది. 75హెచ్పి పీక్ పవర్తోపాటు మైలేజి 13.55 కిలోమీటర్లు ఇస్తుంది. కంపెనీ ఆటోమోటివ్ విబాగం ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రవీణ్షా వాణిజ్య వాహనాల కొనుగోళ్లలో వస్తున్న మార్పులు, ధోరణులు, అభిరుచులకు అనుగుణంగా ఇంపీరియోను తీర్చిదిద్దినట్లు తెలిపారు. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న 'సంజూ'
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంజూ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లలో కొత్త రికార్డులు కొల్లగొడుతోంది. రాజ్కుమార్ హిరానీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ.73.35 కోట్లు వసూలు చేయడం విశేషం.
Samayam Telugu | Updated:
Jul 1, 2018, 07:29PM IST
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంజూ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లలో కొత్త రికార్డులు కొల్లగొడుతోంది. రాజ్కుమార్ హిరానీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ.73.35 కోట్లు వసూలు చేయడం విశేషం. 2018లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన సంజూ.. తాజాగా పద్మావత్, రేస్ 3 రికార్డులను బీట్ చేసింది. రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే రేస్3కి రూ.38.14 కోట్లు, పద్మావత్కు రూ.32 కోట్లు రాగా.. సంజూ మాత్రం రూ.38.6 కోట్లతో ఆ రికార్డును బద్ధలు కొట్టింది.
అత్యంత భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5,300 స్క్రీన్లపై ప్రదర్శితమైంది. వీటిల్లో 4000 స్క్రీన్లు ఇండియాలోకి కాగా, మిగతావి విదేశాల్లోనివి. ఈ రకంగా చూస్తే ఇదొక రికార్డే. ఒకే భాషలో విడుదలైన సినిమా ఇన్ని స్క్రీన్ల మీద ప్రదర్శితం కావడం ఇండియా వరకూ రికార్డే. రాజ్కుమార్ హిరానీ సినిమాలకు ఉన్న క్రేజ్తోపాటు.. సినిమా ట్రైలర్కే అంచనాలకు మించి రెస్పాన్స్ రావడంతో సంజూ ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. చాలా వరకు సినిమాకు పాజిటివ్ రీవ్యూలు రావడం కూడా కలెక్షన్లకు కలిసొచ్చింది. సంజయ్ దత్ క్యారక్టర్లో రణ్బీర్ జీవించేశాడు. అతని నటనకి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. | 0business
|
Hyderabad, First Published 28, Oct 2018, 3:29 PM IST
Highlights
బయోపిక్ అంటే తెరపై వీలైనంత వరకు నిజాల్ని చూపించాలి. గతాన్ని ఎవరు మళ్ళి చూడలేరు. కానీ అనుభవాలను గుర్తు చేసుకొని ప్రేక్షకుడి ముందే ఆ కథ నడుస్తున్నట్లు చూపించాలి.
బయోపిక్ అంటే తెరపై వీలైనంత వరకు నిజాల్ని చూపించాలి. గతాన్ని ఎవరు మళ్ళి చూడలేరు. కానీ అనుభవాలను గుర్తు చేసుకొని ప్రేక్షకుడి ముందే ఆ కథ నడుస్తున్నట్లు చూపించాలి. ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరక్కిస్తున్న చిత్ర యూనిట్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
వారు చూపించేవి ఎంతవరకు నిజాలో తెలియదు గాని రామారావు గారి కెరీర్ మొదట్లో జరిగిన పరిణామాలను కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు ట్రై చేస్తున్నారట. రీసెంట్ గా ఎన్టీఆర్ ప్రేమ కథకు సంబందించిన సన్నివేశాలతో పాటు బసవతారకమ్మను ఆయన ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్న విధానం. ఇలా రామారావు జీవితంలో కీలక అంశాలను దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో ప్రజెంట్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా వస్తోన్న ఈ సినిమా మొదటి పార్ట్ కి కథానాయకుడు అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా సినిమాను ముగించి బాలకృష్ణ రాజకీయాల్లో బిజీ అవ్వాలని అనుకుంటున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదలకానున్న సంగతి తెలిసిందే.
Last Updated 28, Oct 2018, 3:29 PM IST | 0business
|
Hyderabad, First Published 1, Oct 2019, 9:13 AM IST
Highlights
భారత బ్యాంకర్ల సంఘం సూచనల మేరకు మూడు రకాల పనివేళలు రూపొందించారు. 1.ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలు,2. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటలు, 3. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటలు. ఈ మూడు రకాల పనివేళ్లల్లో ఒకటి ఎంపిక చేసుకోవాలి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళల్లో అక్టోబర్ 1 నుంచి మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళల్లో ఒకటి ఎంపిక చేసుకొని అమలు చేస్తారు. దేశంలోని 400 జిల్లాల్లో ఖాతాదారులకు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఈ నెల 3నుంచి 7 దాకా ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర బ్యాంకర్ల సమితి( ఎస్ఎల్బీసీ) కన్వీనర్ కేవీ నాంచారయ్య తెలిపారు.
భారత బ్యాంకర్ల సంఘం సూచనల మేరకు మూడు రకాల పనివేళలు రూపొందించారు. 1.ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలు,2. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటలు, 3. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటలు. ఈ మూడు రకాల పనివేళ్లల్లో ఒకటి ఎంపిక చేసుకోవాలి. జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి సంప్రదింపుల సమితిలో చర్చించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి పంపిస్తారు. వారి ఆమోదంతో ఈ పనివేళలు అమలు చేస్తారు.
పక్కాగా పత్రాలు ఉంటే అక్కడికక్కడే రుణాలు ఇస్తామని బ్యాంకులు ప్రకటించాయి. జిల్లాల వారీగా ఏర్పాటు చేసే సదస్సులో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తాయి. వ్యక్తిగత, వాహన, విద్య, గృహ, చిన్న పరిశ్రమలు, పంటలు తదితర రుణ అవసరాలు తెలుసుకుంటాయి. ఖాతాదారులు తమ ఆదాయపన్ను దాఖలు పత్రాలు, గుర్తింపు ధ్రువీకరణలు, కేవైసీ పత్రాలు చూపించాలి. అన్నీ సక్రమంగా ఉంటే పరిమితుల మేరకు అక్కడికక్కడే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
Last Updated 1, Oct 2019, 11:07 AM IST | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
కాకినాడలో ‘రణరంగం’.. అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణ!
Ranarangam | ‘రణరంగం’ ప్రీ రిలీజ్ వేడుకకు టైమ్, స్పాట్ ఫిక్స్ అయ్యాయి. కాకినాడలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఇక చీఫ్ గెస్ట్గా బన్నీ హాజరుకాబోతున్నారు.
Samayam Telugu | Updated:
Jul 28, 2019, 07:48PM IST
కాకినాడలో ‘రణరంగం’.. అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణ!
శర్వానంద్ హీరోగా నటించిన ‘రణరంగం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్గా నటించారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే, చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి, సినిమాపై అంచాలను పెంచడానికి ప్రీ రిలీజ్ వేడుకను త్వరలోనే నిర్వహిస్తున్నారు. తాజా ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ‘రణరంగం’ ప్రీ రిలీజ్ వేడుకను ఆగస్టు 4న కాకినాడలో నిర్వహిస్తారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.
‘రణరంగం’ సినిమాను అత్యధిక భాగం కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే తెరకెక్కించారు. దీంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను అక్కడే నిర్వహించాలని నిర్ణయించారట. ఈ వేడుకకు చీఫ్ గెస్టులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే కాకినాడలో ఆగస్టు 4న పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.
కాగా, ‘కేశవ’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలోని ‘పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్’ అనే పాటను సోమవారం విడుదల చేస్తున్నారు. ఈ పాటలో కాజల్ చాలా హాట్గా కనిపించనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
KOHLI
గెలవాలనే కసిని పెంచాయి: కోహ్లీ
మొహాలీ: ఇంగ్లండ్తో జరిగిన మూడవ టెస్టులో ప్రత్యర్థి టాస్ వరించడం,మంచి పిచ్పై మొదట బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడం తమలో గెలువాలనే కసిని పెంచాయని టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ పేర్కొన్నాడు.కాగా ఏ పిచ్లు స్పిన్కు అతిగా స్పందించలేది సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించిన తరువాత వివరించాడు.టాస్ గెలిచిన తరువాత ఇంగ్లండ్ స్పందన ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.కాగా మేం నాణ్యమైన క్రికెట్ ఆడాం,అంతకంతకూ ఆత్మ విశ్వాసం పెంచు కున్నాం, టాస్ ఓడినా వారిని 280కు కుప్ప కూల్చాం, వారు టాస్ గెలువగానే వచ్చిన స్పందన మాలో కసిని రగిలించిందని కోహ్లీ పేర్కొన్నాడు. ఇంక ఆటను మైదానంలో ఆడి గెలువాల్సి ఉంది కాదా, దీంతో మేం స్ఫూర్తి పొందాం అని కోహ్లీ వివరించాడు.బాటా ఆడిన లోయర్ బ్యాట్స్మెన్ అశ్విన్,జయంత్,జడేజాపై ప్రశంసల వర్షం కురిపించాడు.కాగా సంవత్సరం క్రితం వరకు అతిగా స్పందించే, వివాదా స్పద, బాగాలేని పిచ్లపై ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నలు వినిపించేవి, సంవత్సర కాలంలోనే ఆ ప్రశ్నలు టర్న్ అయ్యాయి.కాగా తాము నాణ్య మైన క్రికెట్పై దృష్టి పెట్టామని,జట్లు సెషన్ల వారీగ ఆధిపత్యం సాధించడం నేర్చుకుంద న్నాడు. ఇప్పుడు పిచ్ల గురించి మాట్లాడాల్సిన అవరసం లేదని, అయితే అప్పటి ప్రశ్నలను మాత్రము మర్చిపోలేమన్నాడు.మొహాలీ టెస్టులో 42,67 పరుగులతో నాటౌట్గా నిలిచిన కీపర్ పార్ధీవ్ పటేల్ ప్రదర్శన కోహ్లీని ఆకట్టుకుంది. కాగా రెండవ వికెట్ కీపర్గా కాకుండా బ్యాకప్ ఓపెనర్గా పార్థీవ్కు జట్టులో చొటిచ్చే అవకాశం లేకపోలేదన్నాడు.అతడు సీమర్లపై దాడికి దిగిన తీరు బాగుందన్నాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్ను ఎక్కువగా ఆడిన అనుభవం పార్ధీవ్లో కనిపించిందని కోహ్లీ పేర్కొన్నాడు. | 2sports
|
పాపం.. ఆ హీరోయిన్ కి వాల్యూ లేదా..?
Highlights
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఓ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది ఆ హీరోయిన్. తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో ఆమెకు అవకాశాలు మాత్రం రాలేదు
సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ ఉండి, డిమాండ్ ఉన్న వారికే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. లేదంటే ఎంతోకొంత చేతిలో పెట్టి సరిపెట్టేస్తారు. కాస్త గుర్తింపు ఉన్న తారలు సైతం పారితోషికం డిమాండ్ చేసే రోజులివి. కానీ ఓ హీరోయిన్ మాత్రం రెమ్యునరేషన్ అడగలేక తనలో తనే ఇబ్బంది పడుతుందని సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఓ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది ఆ హీరోయిన్.
తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో ఆమెకు అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో అవార్డు ఫంక్షన్లు, స్టేజ్ షోలకు మాత్రమే పరిమితమైంది. రీసెంట్ గా ఆమెకు ఓ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఈమెతో పాటు సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుంది. ఆమెకు స్టార్ వాల్యూ ఉండడంతో దాదాపు కోటి రూపాయల రెమ్యునరేషన్ అందించారు. ఇక ఈ హీరోయిన్ కు మాత్రం రెమ్యునరేషన్ అందలేదని తెలుస్తోంది.
ప్రయాణ ఖర్చుల కోసం చేతిలో ఐదు లక్షలు పెట్టి ఊరుకున్నారట నిర్మాత. పైగా ఆ విషయాన్ని నలుగురికి చెప్పకొని గొప్పగా ఫీల్ అవుతున్నాడట. నిజానికి ఈ హీరోయిన్ ఫిలిం ఛాంబర్ లో తనకు రెమ్యునరేషన్ అందలేదంటూ సినిమా రిలీజ్ కు ముందు ఫిర్యాదు చేయొచ్చు. కానీ అలా చేస్తే అవకాశాలు రావేమోనని తనలో తనే బాధ పడుతుందని ఇసైడ్ వర్గాల సమాచారం.
Last Updated 2, Aug 2018, 3:06 PM IST | 0business
|
Hyderabad, First Published 30, Sep 2018, 9:46 PM IST
Highlights
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం నాడు ఎంతో ఎమోషనల్ గా సాగింది. తనీష్, గీతామాధురి, సామ్రాట్, దీప్తి నల్లమోతు, కౌశల్ లు ఫైనల్ కి చేరుకోవడంతో టైటిల్ పోరు రసవత్తరంగా సాగింది.
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం నాడు ఎంతో ఎమోషనల్ గా సాగింది. తనీష్, గీతామాధురి, సామ్రాట్, దీప్తి
నల్లమోతు, కౌశల్ లు ఫైనల్ కి చేరుకోవడంతో టైటిల్ పోరు రసవత్తరంగా సాగింది. నాని కెరీర్ లో సూపర్ హిట్ మెడ్లీ పాటలకి డాన్స్ చేశాడు నాని. షోని 113 రోజులుగా అధ్బుతంగా ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాని.
ఆ తరువాత షో చూడడానికి వచ్చిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ తో మాట్లాడాడు నాని. ముందుగా గీతామాధురి తల్లితో మాట్లాడాడు. తరువాత సామ్రాట్ తల్లి తండ్రులతో మాట్లాడుతూ.. సామ్రాట్ ని ఈ హౌస్ లో చూడటం ఎలా ఉందని అడగగా.. సంతోషంగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు సామ్రాట్ తండ్రి. అనంతరం తనీష్ తల్లితో మాట్లాడారు నాని. ఆ సమయంలో ఆమె ఎమోషనల్ అయ్యారు.
''తనీష్ ఫాథర్ చనిపోయిన ఏడాదికి బిగ్ బాస్ హౌస్ నుండి ఫోన్ వచ్చిందని వెళ్లనా.. అమ్మ అని తనీష్ అడిగాడు'' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తరువాత కౌశల్ భార్య
నీలిమతో మాట్లాడగా.. ఆమె ''బిగ్ బాస్ షో వల్ల కౌశల్ ఏంటో జనానికి తెలిసిందని'' అన్నారు. హౌస్ లో ఉన్న ఐదుగురు సభ్యులని వారి కుటుంబ సభ్యులని చూపించి ఎమోషనల్ టచ్ ఇచ్చారు.
అనంతరం ఎలిమినేషన్ మొదలుపెట్టిన నాని... ముందుగా సామ్రాట్ ని హౌస్ నుండి బయటకి రమ్మని చెప్పారు. ముందుగానే ఊహించిన సామ్రాట్ నవ్వుతూనే బయటకి వచ్చేశాడు. స్టేజ్ పైకి వచ్చిన సామ్రాట్.. నానితో కాసేపు మాట్లాడి అతడితో సెల్ఫీ దిగి తన తల్లితండ్రులని హత్తుకున్నాడు. సామ్రాట్ ఎలిమినేట్ అయిన తరువాత నందిని, తేజస్వి, దీప్తి సునైనా, శ్యామలలు డాన్స్ చేసి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు.
ఆ తరువాత హౌస్ లో ఉన్న నలుగురి సభ్యుల్లో దీప్తి ఎలిమినేట్ అయినట్లు నాని ప్రకటించారు. ఆమె ఎలిమినేట్ అయిన కొద్దిసేపటికే ఓ చిన్న గేమ్ ఆడించి తనీష్ ఎలిమినేట్
అయినట్లు తెలిపారు. ఇక హౌస్ లో మిగిలిన కౌశల్, గీతామాధురిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగింది. ఫైనల్స్ కి చేరుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ కౌశల్, గీతాల కోసం హౌస్ లోకి వెళ్లారు నాని.
హౌస్ మొత్తం తిరుగుతూ.. వాళ్ల ఫీలింగ్స్ ని అడిగి తెలుసుకున్నారు. బిగ్ బాస్ హౌస్లో పడుకున్నప్పుడు కుక్కలు మొరిగినది మళ్లీ వినాలని ఉందంటూ గీతా మాధురి కోరడంతో నానితో పాటు కౌశల్, గీతలు పడుకున్నట్టు నటించారు. దీంతో కుక్కలు మొరిగాయి. అనంతరం బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఇద్దరు ఫైనలిస్ట్లను హౌస్ నుండి బయటకు తీసుకుని స్టేజ్ మీదికి వచ్చారు నాని.
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ విజేతని ప్రకటించడానికి స్టేజ్ పైకి వచ్చారు విక్టరీ వెంకటేష్. ఇక బిగ్ బాస్ విన్నర్ ప్రకటించేద్దామా అని నాని అనడంతో కంగారు వద్దమ్మా అని తనదైన శైలి డైలాగ్ డెలివరీతో నాని హోస్ట్గా బిగ్ బాస్ జర్నీని వీడియో ప్లే చేయాల్సిందిగా ఆదేశించారు నాని. 5 నిమిషాల పాటు సాగిన ఈ వీడియోలో నాని హోస్ట్గా బిగ్ బాస్ హౌస్లో గడిపిన ఫన్నీ మూమెంట్స్ను ప్లే చేశారు. ఆ తరువాత అందరూ ఊహించినట్లుగానే నాని టీవీ ద్వారా బిగ్ బాస్ విజేత కౌశల్ అంటూ ప్రకటించారు.
సంబంధిత వార్తలు | 0business
|
పవన్, బాలయ్య అభిమానులను టెన్షన్ పెడుతున్న నాని
Highlights
సంక్రాంతి రేసులో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ
ఇద్దరి మధ్యలో సంక్రాంతి బరిలో దిగేందుకు ట్రై చేస్తున్న నాని
హలోతో నానికి పోటీ లేకుండా చూడాలని దిల్ రాజుపై నాగార్జున ఒత్తిడి
నాని ఎం.సి.ఎ చిత్రాన్ని సంక్రాంతికి ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
డిసెంబర్ మూడవ వారంలో విడుదల కావలసి ఉన్న నాని ‘ఎంసిఏ’ విడుదలను సంక్రాంతికి వాయిదా వేసి ఈమూవీని పవన్,బాలకృష్ణల సినిమాల మధ్య నిలబెడితే ఎలా ఉంటుంది అని నిర్మాత దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు పై నాగార్జున తన ‘హలో’ కి సంబంధించి చేస్తున్న ఒత్తిడి అని అంటున్నారు. నాగార్జునకు సెంటిమెంట్ గా కలిసి వచ్చే డిసెంబర్ నెలను అఖిల్ కు కూడ కలిసి వచ్చేలా ‘హలో’ మూవీని డిసెంబర్ 23న విడుదల చేయడానికి నాగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు.
అయితే దిల్ రాజు తన ‘ఎంసిఏ’ ని కూడా అదే డేట్స్ కు విడుదల చేయడం నాగార్జునకు ఏమాత్రం రుచించడంలేదు. దీంతో నాని సినిమా విడుదల డేట్ ను మార్చమని నాగ్ దిల్ రాజ్ పై వ్యూహాత్మకంగా ఒత్తిడి చేస్తున్నాడని తెలుస్తోంది. దీనితో తన ‘ఎంసిఏ’ ను వింటర్ రేస్ కు బదులు సంక్రాంతి రేస్ కు తీసుకు వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన దిల్ రాజ్ కు వచ్చినట్లు తెలుస్తోంది.
దీనికితోడు ఈసంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి బడా హీరోల సినిమాల మధ్య దిల్ రాజు శర్వానంద్ నటించిన ‘శతమానం భవతి’ ని విడుదల చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అయితే నాగార్జున ఒత్తిడి తప్పించుకోవడమే కాకుండా సంక్రాంతి సీజన్ కలెక్షన్స్ లో తన ‘ఎంసిఏ’ కూడ షేర్ క్రియేట్ చేయొచ్చన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు కు నైజాం ఏరియాలో పట్టు ఉండటంతో పాటు ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొన్ని జిల్లాలలో.. కూడ దిల్ రాజు సన్నిహితులకు థియేటర్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈనేపథ్యంలో నానీని పవన్ బాలయ్యల వార్ మధ్య నిలిపితే నానీకి కొనసాగుతున్న అదృష్టం రీత్యా మరో సంచలనం క్రియేట్ చేసినట్లు అవుతుందని దిల్ రాజ్ ఎత్తుగడ అని అంటున్నారు. అయితే తమ హీరో సినిమా వచ్చిన సమయంలో నాని సినిమా రావటం సరికాదని ఇటు పవన్, అటు బాలయ్యల అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కలెక్షన్స్ తగ్గిపోవటానికి తప్ప మరేంలేదని అంటున్నారు.
Last Updated 25, Mar 2018, 11:57 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
సైమా అవార్డ్స్.. ‘రంగస్థలం’కు అత్యధిక నామినేషన్లు
సైమా అవార్డ్స్ 2019 సందడి మొదలైపోయింది. వచ్చే నెల 15, 16 తేదీల్లో ఖతార్లో ఈ అవార్డుల వేడుక జరగనుంది. మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో చిత్రాలకు అవార్డుల ప్రకటించనున్నారు.
Samayam Telugu | Updated:
Jul 21, 2019, 08:37PM IST
ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగస్ట్ 15, 16 తేదీల్లో ఖతార్లో జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన వివరాలను శనివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, శ్రియా శరన్, విబ్రి మీడియా ఎండీ విష్ణు ఇందూరి, పాంటలూన్స్ మార్కెటింగ్, ఈకామర్స్ హెడ్ ర్యాన్ ఫెర్నాండెజ్, శాన్వి శ్రీవాస్తవ, అస్మిత నర్వాల్, నిధి అగర్వాల్, మాన్వితా కామత్, రుహాని శర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల సినిమాలకు వచ్చిన నామినేషన్ల గురించి వెల్లడించారు.
2018లో ఈ నాలుగు భాషల్లో విడుదలైన అత్యుత్తమ చిత్రాలతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ విలన్, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ హాస్యనటుడు తదితర విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. తెలుగులో ‘రంగస్థలం’ సినిమా అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఆ తరవాత ‘మహానటి’ 9 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ‘గీత గోవిందం’ 8, ‘అరవింద సమేత’ 6 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. వీటిలో ఏ చిత్రానికి ఎక్కవ అవార్డులు దక్కుతాయో చూడాలి. భాషల వారీగా అత్యధిక విభాగాల్లో నామినేషన్లు పొందిన చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి..
తెలుగు | 0business
|
నానుంచి మరీ అంత ఆశించకండి.. సమంత
Highlights
అయితే ఈ పోస్టర్ను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ..‘ ‘సీమరాజా’లో సమంత సుతంత్ర దేవి అనే సిలంబం టీచర్ పాత్రలో నటిస్తున్నారు. ఇందుకోసం ఆమె మూడునెలల పాటు సిలంబంలో శిక్షణ తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.
నా నుంచి మరీ అంత ఆశించకండి అంటున్నారు స్టార్ హీరోయిన్ సమంత. ఇంతకీ ఏ విషయంలో సమంత ఇలా కామెంట్ చేసింది అనుకుంటున్నారా.. విషయం ఏమిటంటే.. సమంత రెండు తమిళ సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ప్రముఖ తమిళ నటుడు శివ కార్తికేయకు జోడీగా ఆమె ‘సీమరాజా’ చిత్రంలో నటించారు. మరోపక్క ‘యూ టర్న్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘సీమరాజా’ చిత్రం కోసం సమంత సిలంబం అనే మార్షల్ ఆర్ట్స్ను నేర్చుకున్నారు. ఇందులో ఆమె సిలంబం నేర్పించే టీచర్ పాత్రలో నటించారు.
దాంతో ఈ సినిమాపై సమంత అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇటీవల ‘సీమరాజా’ చిత్రంలోని సమంత పోస్టర్ ఒకటి బయటికి వచ్చింది. చక్కగా లంగావోణీలో పావురాన్ని చూస్తున్నట్లుగా ఉన్న ఆ పోస్టర్ నెటిజన్లను చాలా ఆకట్టుకుంటోంది. అయితే ఈ పోస్టర్ను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ..‘ ‘సీమరాజా’లో సమంత సుతంత్ర దేవి అనే సిలంబం టీచర్ పాత్రలో నటిస్తున్నారు. ఇందుకోసం ఆమె మూడునెలల పాటు సిలంబంలో శిక్షణ తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.
దీనికి సమంత సమాధానమిస్తూ..‘ఓ మై గాడ్. నేను సిలంబం నేర్చుకోవడానికి కేవలం 15 రోజులు మాత్రమే శిక్షణా తరగతులకు వెళ్లాను. నా నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించొద్దు.’ అని పేర్కొన్నారు. ఇందుకు మళ్లీ ఆ నెటిజన్ సమాధానం ఇస్తూ..‘మీరు మూడు నెలలు శిక్షణ తీసుకున్నారని దర్శకుడు పొన్రాం చెప్పారు. అందుకే మీ పాత్ర నుంచి కాస్త ఎక్కువే ఆశిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. ఇందుకు సమంత ప్రతి స్పందిస్తూ..‘వద్దు’ అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పుణెరిపై పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
సీజన్ లీగ్ దశ మ్యాచ్లు ఈనెల 11 వరకూ జరగనుండగా.. ఇప్పటికే ఐదు జట్లు ప్లేఆఫ్ బెర్తుల్ని ఖాయం చేసుకున్నాయి. ఇందులో దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్, హర్యానా స్టీలర్స్, యు ముంబా, బెంగళూరు బుల్స్ టాప్-5లో ఉండగా.. మిగిలిన ఒక బెర్తు కోసం యూపీ యోధా, జైపూర్ పింక్ పాంథర్స్ పోటీలో ముందున్నాయి.
Samayam Telugu | Updated:
Oct 3, 2019, 11:02PM IST
హైలైట్స్
పుణెరి చేతిలో మూడు పాయింట్ల తేడాతో ఓడిన తెలుగు టైటాన్స్
ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి టైటాన్స్ నిష్క్రమణ
ఐదు జట్లకి ప్లేఆఫ్ బెర్తులు ఖరారు. ఇక మిగిలింది ఒక్క స్థానమే
ఈనెల 11న ముగియనున్న లీగ్ దశ మ్యాచ్లు
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ తొలిసారి ఆల్రౌండర్ ప్రదర్శన కనబర్చింది. పుణెరి పల్టాన్తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో 50పైచిలుకు పాయింట్లు సాధించిన తెలుగు టైటాన్స్ .. ఆఖర్లో చిన్న తప్పిదాల కారణంగా 50-53 తేడాతో ఓడిపోయింది. టోర్నీ లీగ్ దశలో ఇప్పటికే 19 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్కి ఇది 11వ ఓటమికాగా.. 21వ మ్యాచ్ ఆడిన పుణెరి పల్టాన్కి ఇది 11వ గెలుపు.
మ్యాచ్లో తెలుగు టైటాన్స్ స్టార్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ విఫలమవగా.. యువ రైడర్ రాకేశ్ గౌడ్ 16 పాయింట్లతో సత్తాచాటాడు. 17 సార్లు రైడ్కి వెళ్లిన రాకేశ్.. జట్టుని గెలిపించేందుకు ప్రయత్నించాడు. కానీ.. డిఫెన్స్ తప్పిదాలు జట్టుకి గెలుపుని దూరం చేశాయి. డిఫెండర్ ఆకాశ్ ఐదు పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Love In World cup: ప్రేమ ‘విజయం’.. భారత్-పాక్ మ్యాచ్లో పెళ్లి ప్రపోజల్, వీడియో వైరల్!
ఇండియా - పాక్ మ్యాచ్లో ఓ యువకుడు తన గర్ల్ఫ్రెండ్కు పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరూ చూడండి మరి.
Samayam Telugu | Updated:
Jun 22, 2019, 08:55PM IST
ఇటీవల జరిగిన ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. క్రికెట్ మైదానంలో ఇండియా.. పాకిస్థాన్పై విజయం సాధించిన వేళ.. ప్రేక్షకుల గ్యాలరీలో ఓ యువకుడు పెళ్లి ప్రపోజల్ చేసి తన ప్రియురాలి హృదయాన్ని గెలుచుకున్నాడు. ఆమె చేతికి రింగు తొడిగి తన ‘మ్యాచ్’ సెట్ చేసుకున్నాడు.
ఇటీవల మంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫార్డ్ క్రికెట్ మైదానంలో ఇండియా-పాక్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించి భారత అభిమానుల్లో ఆనందం నింపింది. ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో ప్రేక్షకుల గ్యాలరీలో కుర్చున్న విక్కీ అనే యువకుడు తన ప్రియురాలి అన్వితాకు ఉంగరాన్ని చూపించి ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’ అని అడిగాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె అతడికి ‘ఒకే’ చెప్పడమే కాదు. గట్టిగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. అక్కడే ఉన్న వారి స్నేహితులు ‘వెల్ డన్ విక్కీ’ అంటూ వారిని మరింత ఉత్సాహపరిచారు.
So this happened #INDvPAK #INDvsPAK #CricketWorldCup #Proposal https://t.co/8lg8AcJvKv
— Anvita (@BebuJ) 1561111874000
ఈ వీడియోను అన్వితానే స్వయంగా ట్విట్టర్లో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది. ఇప్పటివరకు దీన్ని 2,300 మంది రిట్వీట్ చేసుకోగా.. 8,117 మంది లైక్ చేశారు. 24 గంటల వ్యవధిలో లక్ష మందికి పైగా నెటిజనులు ఈ వీడియోను వీక్షించారు. వరల్డ్ కప్లో.. అదీ ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్లో ప్రపోజ్ చేయడం కంటే మంచి సందర్భం ఏముంటుంది చెప్పండి. ఆ మధుర క్షణాలు వారికి జీవితాంతం గుర్తిండిపోతాయి కదూ. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి అక్కడ ఫీల్డర్లని ఉంచు: ధోని
మిడ్ వికెట్, స్కైర్ లెగ్ దిశగా 2-3 ఫీల్డర్లని ఉంచాలంటూ సూచనలు చేయడం మైక్లో రికార్డయ్యింది. అంతేకాకుండా.. కేదార్ జాదవ్ బౌలింగ్ చేస్తుంటే.
TNN | Updated:
Oct 26, 2017, 01:55PM IST
‘జట్టుకి ఒక్కసారి కెప్టెన్ అయితే.. అతను ఎప్పటికీ కెప్టెనే’ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి చెప్పిన మాట ఇది. నిజమే.. వన్డే, టీ20 పగ్గాలు వదులుకున్నా.. ధోనీ మాత్రం ఇప్పటికీ కెప్టెన్‌‌లానే మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేస్తూ.. బౌలర్లకి సూచనలు చేస్తుంటాడు. బుధవారం పుణె వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్‌ని ఔట్ చేసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లికి, బౌలర్లకి ధోనీ సూచనలిస్తున్న మాటలు కొన్ని స్టంప్‌ మైక్‌లో రికార్డు అయ్యాయి.
గత ఆదివారం జరిగిన వాంఖడే వన్డేలో స్వీప్, రివర్స్ స్వీప్‌లతో శతకం సాధించి కివీస్‌ని గెలిపించిన టామ్ లాథమ్‌ని పుణె వన్డేలో ఔట్ చేసేందుకు ధోనీ వ్యూహం రచించాడు. ఇందులో భాగంగా విరాట్ కోహ్లిని.. మిడ్ వికెట్, స్కైర్ లెగ్ దిశగా 2-3 ఫీల్డర్లని ఉంచాలంటూ సూచనలు చేయడం మైక్‌లో రికార్డయ్యింది. అంతేకాకుండా.. కేదార్ జాదవ్ బౌలింగ్ చేస్తుంటే.. టామ్‌ లాథమ్‌కి ఎలాంటి బంతులు వేయాలో కూడా హిందీలో అతనికి చెప్పడం వీడియోలో కనిపించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లకి అర్థం కాకుండా ధోనీ హిందీలో సూచనలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడో వన్డే ఆదివారం కాన్పూర్‌లో జరగనుంది. | 2sports
|
Patanjali Ramdev Baba
డెయిరీ మార్కెట్లోకి పతంజలి
కర్నాల్(హర్యానా), సెప్టెంబరు 25:యోగాగురు రామ్ దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి గ్రూప్ తాజాగా డెయిరీ ఉత్పత్తుల విభాగంలోనికి ప్రవేశించింది. 2022 నాటికి తమ బిజినెస్ మొత్తం ఐదులక్షల కోట్లకు చేరాలన్న లక్ష్యంతో ఉన్నట్లు యోగాగురు రామ్దేవ్ వెల్లడించారు. ఈ ఏడాది మూడు డెయిరీ ప్లాంట్లలో పను లు ప్రారంభిస్తామని, మహా రాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదే శ్ రాష్ట్రాల్లో ఈ మూడు ప్లాంట్లు ఉంటాయన్నారు. కర్నాల్లోని జాతీయ పాడి పరిశ్రమ పరిశోధక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సదస్సు లో ఆయన మాట్లాడుతూ ఈ అంశాలు వెల్లడించారు. భారత్ పాడి రంగం, ఆహారవిభాగం భవిష్యత్ సవాళ్లు అన్న అంశంపై ఈ సదస్సును నిర్వహించారు. రామ్దేవ్ మాట్లాడుతూ తమ ఉత్పత్తులు స్వదేశీ తయారీగా ఉంటాయని, అమూల్బ్రాండ్ను ఆయన ఎంతో అభినందించినట్లు ఎన్డిఆర్ఐ ప్రకటనలో వివరిం చింది. ప్రస్తుతం డెయిరీ వ్యాపారం మూడు లక్షల కోట్లకు ఉందని, 2022నాటికి ఐదు లక్షలకోట్లకు చేరుతుందన్నారు.
స్వదేశంలో ఉన్న పాడి పశువు లను సంరక్షించడంలో ఎన్డిఆర్ఐ కృషిని అభినం దించారు. సంస్థతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధ మేనన్నారు. ఎన్డిఆర్ కేంద్రాలను అనంతరం ఆయనసందర్శించి పాలలో కల్తీ ఎలా జరుగుతు న్నది, కల్తీనిఎలా కని పెట్టవచ్చన్న అంశాలపై నిర్వహించిన ప్రద ర్శనను ఆయన తిలకించారు. ఇందుకు సంబంధిం చి ఎన్డిఆర్ఐ రూపొందించిన కిట్లను పరిశీలిం చారు. ఎన్డిఆర్ఐ డైరెక్టర్ ఎకెశ్రీవాస్తవ మాట్లాడు తూ సంస్థ పాడిఉత్పత్తి, శుద్ధిచేయడంలో సాధించి న ప్రగతిని వివరించారు. ఎన్డిఆర్ఐ ప్రస్తుతం క్లోనిం గ్పై పరిశోధనలు చేస్తోందన్నారు. లైవ్స్టాక్ రంగం గ్రామీణ జీవనోపాధిలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. | 1entertainment
|
senior actress, producer bv radha dies in bengaluru
నటి బి.వి.రాధ కన్నుమూత.. అవయవాలు దానం
సీనియర్ నటి, నిర్మాత బి.వి.రాధ బెంగళూరులో కన్నుమూశారు. ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో రాధ గుండెపోటుకు గురయ్యారు.
TNN | Updated:
Sep 10, 2017, 02:13PM IST
సీనియర్ నటి, నిర్మాత బి.వి.రాధ బెంగళూరులో కన్నుమూశారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన రాధను కుటుంబ సభ్యులు కళ్యాణి నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆదివారం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 70 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాధ.. బెంగళూరులోని ఆమె కుమార్తె ధనలక్ష్మి ఇంట్లో ఉంటున్నారు.
కన్నడలో సినీ రంగ ప్రవేశం చేసిన రాధ దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, తులు భాషల్లో అగ్రహీరోల సినిమాల్లో ఆమె నటించారు. 1964లో వచ్చిన కన్నడ చిత్రం ‘నవకోటి నారాయణ’లో తొలిసారి రాధ చిన్న పాత్ర పోషించారు. ఆ తరవాత అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో మంచి నటిగా నిలిచిపోయారు. ప్రముఖ కన్నడ దర్శకుడు కె.ఎస్.ఎల్.స్వామిని రాధ పెళ్లాడారు. దక్షిణాదిలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్, ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ తదితరులతో కలిసి నటించిన రాధ.. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. | 0business
|
Jul 13,2018
ఏడు లక్షల కోట్లకు రిలయన్స్ సామ్రాజ్యం!
ముంబయి: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ (రిల్) మార్కెట్ విలువ దాదాపు 11 యేండ్ల తరువాత 100 బిలియన్ డాలర్లకు (దాదాపుగా రూ.7 లక్షల కోట్ల) చేరువైంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ ఇండిస్టీస్ స్టాక్ దూసుపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్ల(రూ.6,85,550 కోట్లకు పైగా) మార్కును దాటేసింది. అంటే రూ.7 లక్షల కోట్లకు చేరువలోకి వచ్చింది. కంపెనీ షేర్లు రూ.1,091 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడంతో రిలయన్స్ ఇండిస్టీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఈ మేర పెరిగింది. రిలయన్స్ ఇండిస్టీస్ షేర్లు ఈ మేర దూసుకుపోవడం వరుసగా ఇది ఐదోరోజు. జూన్ క్వార్టర్ ఫలితాలకు ముందు కంపెనీ ఏజీఎంలో దూకుడు వ్యాపార ప్రణాళికను ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్ షేర్లు ఈ మేర లాభాలను ఆర్జిస్తున్నాయి. గురువారం ఈ కంపెనీ షేర్లు రూ.1,043.15 వద్ద ప్రారంభమయ్యాయి. అనంతరం రూ.1,091 వద్ద వెంటనే 52 వారాల గరిష్టాలను తాకాయి. 5.02 శాతం జంప్ చేసి, రూ.1,091 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. డాలర్ విలువతో పోల్చితే రిల్ షేర్ 2007 అక్టోబర్ 18 నాటి గరిష్ట స్థాయికి చేరింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Nov 01,2018
నాలుగు నెలల కనిష్టానికి 'మౌలికం'
న్యూఢిల్లీ: మౌలికంలోని ఎనిమిది కీలక రంగాలు వృద్ధి నాలుగు నెలల కనిష్టానికని చేరుకుంది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో ఈ రంగాల ఉత్పత్తి 4.3 శాతానికి పడిపోయి.. నాలుగు మాసాల కనిష్టానికి దిగజారింది. ముఖ్యంగా చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో తగ్గుదల చోటు చేసుకుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. 2018 ఇదే సెప్టెంబర్లో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్ట్సు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు 4.7 శాతం వృద్ధిని సాధించాయి. క్రితం మేలో ఈ రంగాలు 4.1 శాతం పెరుగుదలతో సరిపెట్టుకున్నాయి. గత సెప్టెంబర్లో ముడి చమురు, సహజ వాయువుల ఉత్పత్తి వరుసగా 4.2 శాతం, 1.8 శాతానికి పడిపోయాయి. ఎరువులు, సిమెంట్, విద్యుత్ రంగాల ఉత్పత్తిలో వరుసగా 2.5 శాతం, 11.8 శాతం, 8.2 శాతం చొప్పున పెరుగుదల నమోదయ్యింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఆసియా, అమెరికా మార్కెట్ల మద్దతు
వడ్డీరేట్ల ఆశలతో బ్యాంకింగ్ ర్యాలీ
ముంబై : ఈక్విటీ మార్కెట్లు స్వల్పలాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 86 పాయింట్ల ఎగువన ముగిస్తే నిఫ్టీ 50సూచి 7539 పాయింట్లవద్ద నిలి చింది. బ్లూచిప్ కంపెనీల్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచడమే ఇందుకు కారణ మని తెలుస్తోంది. ఆసియా మార్కెట్లలో పటిష్టమైన ధోరణులు కనిపించాయి. అమెరికా మార్కెట్లలో వారాంతపు లాభాలు సమీక్షించుకుంటూ ఎగువ ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడంతో భారత్ మార్కెట్లు కూడా ఆదిశగా కొనసాగాయి. సెన్సెక్స్ 82.69 పాయింట్ల ఎగువన 24,804.26 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 28.55 పాయింట్ల ఎగువన 7538.75పాయింట్లవద్ద స్థిరపడింది. 50షేర్ సూచి ఐసిఐసిఐబ్యాంకు, టాటా మోటార్స్, కెయిర్న్ ఇండియా, టెక్ మహీంద్ర, వేదాంత వంటి సంస్థలు 1.88శాతం, 3.38శాతంగా లాభపడాయి. ఇతరత్రా కోటక్మహీంద్ర బ్యాంకు, మహీంద్ర అండ్ మహీం ద్ర, ఐడియాసెల్యులర్, సన్ఫార్మా, టిసిఎస్ వంటివి 0.80 శాతంగాను 1.46శాతంగాను ఉన్నాయి. బిఎస్ఇ మెటల్సూచి 2.04శాతం దిగజారింది. రియాల్టీ సూచి 0.32శాతం క్షీణిం చింది. వినియోగరంగ ఉత్పత్తి కంపెనీల సూచి 0.23శాతం క్షీణించింది. మిగిలిన ఇతర అన్ని విభాగాల సూచీలు కూడా బిఎస్ఇలో ప్రకాశించాయి. రిటైల్ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా విడుదలకానుండటంతో చివరినిమిషంలో కొంత అప్ర మత్తంగా కొనుగోలుదారులు వ్యవహరించారు. అయితే ఆర్బిఐ గవర్నర్ రఘురామ్రాజన్ మాత్రం వడ్డీరేట్ల సవరణల సంకే తాలు పంపించడంతో మార్కెట్లు స్వల్పలాభాలతో ముగి సాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ స్మాల్క్యాప్ సూచీలు 0.3శాతం, 0.4శాతం చొప్పున పెరిగాయి. బ్యాంకింగ్ సూచి బిఎస్ఇ ఎఫ్ఎంసిజి, ఆటో సూచీలు 0.81శాతం నుంచి 0.69శాతంగాను, 0.60శాతంగాను ఉన్నాయి. సాస్కెన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్పరంగా షేర్లు ఎగువప్రాంతంలో నిలి చాయి. సంస్థ స్ప్రెడ్ట్రమ్ కమ్యూనికేషన్స్ ఇంక్తో ఒప్పందానికి రావడమే ఇందుకుకీలకం. బీజింగ్యూనిస్ప్రెడ్ట్రమ్ టెక్నాలజీ అనధికారిక విక్రయాల కారణంగా సాస్కెన్స్ ప్రొటోకాల్ స్టాక్ ఐపిపరంగా స్ప్రెడ్ట్రమ్ సాస్కెన్కు 45 మిలియన్డాలర్లు నష్టంగా చెల్లిస్తుంది. ఈ చెల్లింపుతో సమస్యను పరిష్కరించు కుంటున్నట్లు తేలడంతో కంపెనీ షేర్లు 20శాతం పెరిగి 379.40 రూపా యలుగా నిలిచాయి. మార్కెట్లపరంగా మొత్తం1321 కంపెనీలు నష్టాల్లోను, 1331 కంపెనీలు లాభాల్లోను ముగిస్తే 167 కంపెనీల షేర్లు స్థిరంగా ఉన్నా యి. ప్రపంచంలోని మూడు అగ్రదేశాల్లో రెండుదేశాల సెంట్రల్బ్యాంకులు ఈవారం లో సమీక్ష నిర్వహించనున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రతికూల వడ్టీరేట్ల విధానం అవలంభించింది. ఫెడ్ఱిజర్వు సమావేశం బుధవారం ముగియనున్నది. చైనా మార్కెట్లు రెండుశాతంపెరిగాయి. చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమీషన్ ఛైర్మన్ సంక్షోభం నివారణకు ఇప్పటినుంచే ఉద్దీపనలని ఊహించుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇతర మార్కెట్లపరంగా జపాన్ నిక్కీ, హ్యాంగ్సెంగ్ లాభాల్లోనే ముగిసాయి. టాటామోటార్స్ మూడుశాతంపెరిగింది. వార్షిక విక్రయాలపరంగా 17శాతం పెకరిగినట్లు ప్రకటించింది. కోల్ ఇండియా ఏడుశాతం దిగజారింది. కంపెనీ ఎక్స్డివిడెండ్ 27.40 రూపాయలుగా ప్రక టించింది. ఇతరత్రా చూస్తే జిందాల్ స్టీల్ 4.9శాతంతగ్గితే సెయిల్ 0.8శాతం పెరిగాయి. ఇక ఎన్ఎండిసి రెండుశాతం పెరిగింది. భారత్లోని అతిపెద్ద ముడిఇనుము గనుల సంస్థ ధరలను టన్నుకు 70 నుంచి 150 రూపాయలు పెంచడమే ఇందుకుకీలకం. ఇక బ్యాంకింగ్ రంగ పరంగా వడ్డీరేట్ల సవరణల ఆశలతో కొంతపెరిగాయి. ఐసిఐసిఐబ్యాంకు 4శాతం, యాక్సిస్బ్యాంకు, ఎస్బిఐ 0.8శాతం, 1.2శాతం చొప్పున పెరిగాయి. ద్వారికేష్ చక్కెర పరిశ్రమ లు 9.5శాతంగా నిలిచాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా దీర్ఘకాలికంగా ఎల్ఒసిపై రేటింగ్ పెంచింది. స్థిరమైన రేటింగ్స్ నుంచి సానుకూల రేటింగ్ ఇచ్చింది. | 1entertainment
|
Mar 16,2017
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
ముంబయి : అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనుందన్న సంకేతాలతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 44.52 పాయింట్లు లేదా 0.15 శాతం తగ్గి 29,398కు కోల్పోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2.2 పాయింట్లు తగ్గి 9,084.80 వద్ద ముగిసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన ఉత్సాహంలో ఇంతక్రితం సెషన్లో నిఫ్టీ 9,122.75కు చేరింది. బీఎస్ఈలో రంగాల వారిగా ఐటీ సూచీ 1.81 శాతం, టెక్ 1.2 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.03 శాతం చొప్పున తగ్గాయి. మరోవైపు రియాల్టీ 0.72 శాతం, ఆటో 0.71 శాతం, మౌలిక వసతులు 0.46 శాతం, కన్సూమర్ డ్యూరెబుల్స్ 0.45 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్-30లో టాటా స్టీల్ 1.24 శాతం, హీరో మోటో కార్ప్ 1.24 శాతం, రిలయన్స్ 1.16 శాతం, ఎస్బీఐ 0.98 శాతం, టాటా మోటార్స్ 0.79 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
భువీ నకుల్ బంతికి సఫారీలు భయపడ్డారు..!
దక్షిణాఫ్రికాతో గత ఆదివారం జరిగిన తొలి టీ20లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్కి తాను ముగ్ధుడైనట్లు భారత మాజీ కెప్టెన్ క్రిస్
TNN | Updated:
Feb 21, 2018, 12:43PM IST
దక్షిణాఫ్రికాతో గత ఆదివారం జరిగిన తొలి టీ20లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌కి తాను ముగ్ధుడైనట్లు భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ వెల్లడించారు. బుధవారం రాత్రి 9.30కి రెండో టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సఫారీ బ్యాట్స్‌మెన్‌‌ని కట్టడి చేసేందుకు నకుల్ బంతి అస్త్రాన్ని భువీ ప్రయోగించడం అభినందనీయమన్నారు. తొలి టీ20లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో గెలుపొందగా.. జట్టులో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసింది భువీనే కావడం విశేషం.
‘పవర్‌ప్లే, డెత్ ఓవర్ల సమయంలో బ్యాట్స్‌మెన్ ఎక్కువగా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడం చాలా కష్టం. కానీ.. భువనేశ్వర్ కుమార్ తొలి టీ20లో ఈ రెండు సందర్భాల్లోనూ బౌలింగ్ చేసి భారత్ జట్టుకి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేసేందుకు అతను ప్రయోగించిన అస్త్రం నకుల్ బాల్. రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగల నైపుణ్యం ఉన్న భువీకి.. ఈ నకుల్ బాల్ అదనపు బలాన్ని ఇచ్చింది. మ్యాచ్‌లో స్కోరు బోర్డుని పరిశీలిస్తే.. అందరి బౌలర్లంటే తక్కువ పరుగులిచ్చింది భువీనే.. అంటే.. సఫారీ బ్యాట్స్‌మెన్ భువీ నకుల్ బంతికి భయపడి జాగ్రత్తగా ఆడుతూ.. మిగతా బౌలర్లపై బ్యాట్ ఝళిపించారు. ఇంకా నకుల్ బంతి‌కి సీమ్‌ని జోడిస్తూ ఎలా విసరాలో ప్రాక్టీస్ చేస్తే.. అది భువీకి మరింత ఉపయోగపడుతుంది’ అని క్రిస్ శ్రీకాంత్ సూచించారు. | 2sports
|
Hyderabad, First Published 17, Apr 2019, 3:37 PM IST
Highlights
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన న్యూఏజ్ గవర్నెన్స్ ‘ఉమాంగ్’ యాప్ దేశ పౌరులకు అనేక రకాలైన సేవలను అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన న్యూఏజ్ గవర్నెన్స్ ‘ఉమాంగ్’ యాప్ దేశ పౌరులకు అనేక రకాలైన సేవలను అందిస్తోంది. ప్రస్తుతం మనం పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్) వివరాలను ఈ ఉమాంగ్ యాప్ ద్వారా ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.
పాన్ అనేది ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే ప్రతీ ఒక్కరికీ అవసరమే. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో గానీ, ఆదాయపుపన్ను రిటర్న్(ఐటీఆర్) ఫైలింగ్ చేసే సమయంలో గానీ పాన్ కార్డు తప్పనిసరి.
ఉమాంగ్ యాప్ పాన్ కార్డ్ సంబంధించిన పలు సేవలను కూడా అందిస్తోంది. దగ్గర్లో ఉన్న పాన్ కార్డు కేంద్రాలు, పాన్ కార్డ్ పేమెంట్ లాంటి సేవలను అందిస్తోంది.
ఉమాంగ్ యాప్ ద్వారా పాన్ కార్డ్ వివరాలు అప్డేట్ చేయడం ఎలాగంటే.?
1. మొదట ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
2. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. అనంతరం ‘మై పాన్’పై క్లిక్ చేయండి.
3. వెంటనే మీరు పాన్ కార్డ్ సేవల పేజీలోకి వెళ్లిపోతారు. "Correction/Change in PAN card CSF"పై క్లిక్ చేయండి. సీఎస్ఎఫ్ అనేది పాన్ కార్డ్ కరెక్షన్ ఫాం, ఇందులో తప్పుగా ఉన్న వాటిని సరిచేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
4. ఆ తర్వాత Application for correction (CSF)' అనే కొత్త పేజీ చూపిస్తుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ రాసి nextపై క్లిక్ చేయండి.
5. ఫాంలో ఉన్న మీ వివరాలు నింపండి. సరిచేయాల్సిన వివరాలు నింపండి. ఆ తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి.
6. ఈ పేజీలో పేమెంట్, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
7. ఫాంతోపాటు నేషనల్ సెక్యూరిటీస్ డిపాసిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) TIN(టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్) ఫెసిలిటేషన్ సెంటర్ లేదా పాన్ సెంటర్లో సబ్మిట్ చేయండి.
ఒక్కసారి మీ వివరాలు సరిచూసుకున్న తర్వాత మీ నివాసానికి కొత్త పాన్, అప్డేట్ చేసిన వివరాలతో అందుతుంది. మై పాన్లోని పాన్ క్వారీలో ట్రాక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా అయితే పాన్ క్వారీలో కరెక్షన్ ఫాం డౌన్లోడ్ చేసుకుని, దగ్గర్లోని పాన్ సెంటర్లో అవసరమైన డాక్యుమెంట్లతోపాటు సబ్మిట్ చేయాలి. | 1entertainment
|
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
First Published 12, Aug 2017, 6:01 PM IST
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
తాప్సీ ఆనందోబ్రహ్మ మూవీ వర్కింగ్ స్టిల్స్
Recent Stories | 0business
|
యువరాజ్, రైనాల వల్లే కాలేదు.. యో - యో టెస్టులో పాసైన గంభీర్ కూతురు... ప్రశంసల జల్లు
Highlights
కఠినతరమైన యో యో టెస్టులో గౌతమ్ గంభీర్ గారాలపట్టి సులభంగా ఉత్తీర్ణత సాధించింది. చిన్న చిన్న ఫిట్నెస్ టెస్టులు చేస్తున్న తన పెద్ద కూతురు అజీన్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు
టీమిండియాలో చోటు కావాలంటే ఎవరైనా యో యో టెస్ట్ పాసవ్వాల్సిందేనంటూ ఇటీవల బీసీసీఐ షరతు పెట్టిన సంగతి తెలిసిందే. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, అశ్విన్, అంబటి రాయుడు లాంటి స్టార్లు కూడా ఈ టెస్టులో పాసవ్వలేక జట్టులో స్థానం కోల్పోయారు.
మరోసారి అవకాశం ఇవ్వడంతో రెండో సారి ఉత్తీర్ణత సాధించారు. ప్రతిభకు ఇలాంటి పరీక్షలు కొలమానం కాదని.. దీనిని తొలగించాలంటూ అనేక మంది సీనియర్లు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతటి కఠినతరమైన టెస్టులో గౌతమ్ గంభీర్ గారాలపట్టి సులభంగా ఉత్తీర్ణత సాధించింది. చిన్న చిన్న ఫిట్నెస్ టెస్టులు చేస్తున్న తన పెద్ద కూతురు అజీన్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు.
‘‘ నా పెద్ద కూతురు యో- యో టెస్ట్ పాసైనట్లుగా ఉంది కదూ.. మీకేమనిపిస్తోంది యువరాజ్, హర్భజన్, సచిన్ అంటూ వాళ్లకు ట్యాగ్ చేశారు.. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. చాలా బాగా చేశావని.. లిటిట్ సూపర్స్టార్ అంటూ ప్రశంసిస్తున్నారు.
Last Updated 23, Jul 2018, 7:20 PM IST | 2sports
|
స్పైడర్ మూవీ వర్కింగ్ స్టిల్స్
First Published 29, Aug 2017, 5:08 PM IST
స్పైడర్ మూవీ వర్కింగ్ స్టిల్స్
స్పైడర్ మూవీ వర్కింగ్ స్టిల్స్
స్పైడర్ మూవీ వర్కింగ్ స్టిల్స్
స్పైడర్ మూవీ వర్కింగ్ స్టిల్స్
స్పైడర్ మూవీ వర్కింగ్ స్టిల్స్
స్పైడర్ మూవీ వర్కింగ్ స్టిల్స్
స్పైడర్ మూవీ వర్కింగ్ స్టిల్స్
స్పైడర్ మూవీ వర్కింగ్ స్టిల్స్
Recent Stories | 0business
|
Hyderabad, First Published 21, Mar 2019, 12:22 PM IST
Highlights
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'పీఎం నరేంద్రమోదీ'. దర్శకుడు ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సందీప్ ఎస్ సింగ్ నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'పీఎం నరేంద్రమోదీ'. దర్శకుడు ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సందీప్ ఎస్ సింగ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఇందులో మోదీ బాల్యంతో పాటు రాజకీయ ప్రవేశం, గోద్రా అల్లర్లను చూపించారు. మోదీ ప్రధాని అయిన తరువాత పాకీస్థానీయులు భారత్ పై చేస్తున్న దాడులను చూసి భరించలేక.. 'ఇంకోసారి హిందుస్థాన్ పై చెయ్ వేస్తే.. నరికేస్తా.. ఇదే పాకిస్థాన్ కి నా హెచ్చరిక' అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషలతో కలిపి మొత్తం 23 భాషలలో విడుదల చేస్తున్నారు. ఇందులో భాజపా అధ్యక్షుడు అమిత్ షా పాత్రలో సినీ నటుడు మనోజ్ జోషి నటిస్తుండగా.. దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహబ్, సేన్గుప్తాలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. | 0business
|
Nov 07,2015
వీడని 'బీహార్' భయాలు
ముంబయి: బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కూటమికి ఎదురుదెబ్బ తగలనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీనికి తోడు అమెరికాలో ఉపాధి రేటు వృద్ధిపై అనుమానాలు వర్థమాన దేశాల మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈ సన్సెక్స్ 39 పాయింట్లు కోల్పోయి 26,265 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ ఒక్క పాయింట్ తగ్గి 7,954 వద్ద నమోదయ్యింది. బీఎస్ఇలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు వరుసగా 0.4-0.6 శాతం తగ్గాయి. మొత్తంగా మదుపర్ల మద్దతు కరువై 1,621 స్టాక్స్ నష్టాలు చవి చూడగా, మరోవైపు 1043 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఆదివారం బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నితీష్ వైపు మొగ్గు చూపడం, మోడీకి వ్యతిరేకంగా రావడంతో మదుపర్లు విశ్వాసం కోల్పోయారు. మరోవైపు శుక్రవారం ఆర్ధరాత్రి అమెరికా ఉపాధి రేటును ప్రకటించనున్న పరిణామం కూడా మార్కెట్పై ప్రభావం చూపింది. దీనికి తోడు ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందన్న భయాలు మార్కెట్లను వెంటాడాయి. రంగాల వారిగా బీఎస్ఈలో వైద్య సూచీ అత్యధికంగా 2.8 శాతం విలువ కోల్పోయింది. విద్యుత్, లోహ, ఆటో సూచీలు ఒక్క శాతం చొప్పున తగ్గాయి. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ 14.55 శాతం, బాష్ 3.09 శాతం, టాటా స్టీల్ 2.75 శాతం, టాటా మోటార్స్ 2.44 శాతం, వేదాంత 1.91 శాతం చొప్పున నష్టాలను చవి చూశాయి. మరోవైపు బ్యాంకు ఆఫ్ బరోడా 5.80 శాతం, ఎస్బీఐ 4.28 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు 2.47 శాతం, కోటక్ బ్యాంకు 2.21 శాతం, కోల్ ఇండియా 1.75 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఆస్ట్రేలియా ఓపెన్ ప్రి క్వార్టర్స్లో ఆండీ ముర్రే
మెల్బోర్న్: ప్రపంచ నంబర్ 1ఆండీముర్రే ఆస్ట్రే లియా ఓపెన్లో ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. పురుషల సింగిల్స్లో సామ్ కెర్లీ(అమెరికా, కాలిఫోర్నియా)పై వరుస సెట్లలో గెలిచి నాలుగవ రౌండ్లో అడుగుపెట్టాడు.మెల్బోర్న్ పార్క్లో జరుగుతున్న సింగిల్స్ ఈవెంట్ మూడవ రౌండ్ లో బ్రిటన్స్టార్ ముర్రే 6-4,6-2,6-4తో కెర్రీపై గెలుపొందాడు.మ్యాచ్ మొత్తంలో ప్రత్యర్థి కెర్రీకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా తన ఆధిప త్యాన్ని కొనసాగించాడు. మొదట రెండు సెట్లలో ఒక్కసారి కూడా ముర్రే తన సర్వీస్ను కోల్పోక పోవడం విశేషం.క్వార్టర్ పైనల్లో బెర్త్ కోసం జర్మనీకి చెందిన మిశ్చా జ్వెరేవ్తో ప్రిక్వార్టర్లో ముర్రే తలపడనున్నాడు.ఆస్ట్రేలియా ఓపెన్లో ఇప్పటి వరకు అయిదు సార్లు రన్నరప్గానే ముర్రే వెనుదిరిగాడు.ఈసారి ఎలాగైనా ఆస్ట్రేలియా ఓపెన్ లో తొలి టైటిల్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో దూకుడుగా ఆడుతున్నాడు. | 2sports
|
- సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు కుదేల్
- తమిళనాడులో 50వేల కంపెనీలు మూత
- సూరత్లో 40శాతం చేనేత వ్యాపారులకు నష్టం
- దేశవ్యాప్తంగా ఇదే దుస్థితి
- బడాపారిశ్రామికవేత్తలకు బహుళ ప్రయోజనాలు
జీఎస్టీ...వస్తు సేవల పన్ను...ఇప్పటికీ సామాన్యుడికి అర్ధంకాని ఓ బ్రహ్మపదార్ధం. దీన్ని అమల్లోకి తెచ్చాక దేశంలో వృద్ధిరేటు బహుబాగా పెరిగిందంటూ కేంద్రప్రభుత్వం బాకా ఊదుకుంటోంది. కానీ వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జీఎస్టీ అమలు వల్ల వేలకోట్లు పెట్టుబడులు పెట్టగలిగే బడా పారిశ్రామికవేత్తలకు సామాన్య ప్రజానీకాన్ని ఆర్ధికంగా మరింత దోపిడీకి గురిచేసే అవకాశాన్ని కేంద్రప్రభుత్వం కల్పించినట్టైంది. అదే సమయంలో సాంప్రదాయంగా వస్తున్న చేతివృత్తులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దాదాపు దివాలా దిశగా పయనిస్తున్నాయి. రాష్ట్రాల వారీగా గణాంకాల్ని వెలికితీస్తే ఈ వాస్తవాలు భీతిగొల్పుతున్నాయి.
న్యూఢిల్లీ: జీఎస్టీ...వస్తు సేవల పన్ను...ఇప్పటికీ సామాన్యుడికి అర్ధంకాని ఓ బ్రహ్మపదార్ధం. దీన్ని అమల్లోకి తెచ్చాక దేశంలో వృద్ధిరేటు బహుబాగా పెరిగిందంటూ కేంద్రప్రభుత్వం బాకా ఊదుకుంటోంది. కానీ వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జీఎస్టీ అమలు వల్ల వేలకోట్లు పెట్టుబడులు పెట్టగలిగే బడా పారిశ్రామికవేత్తలకు సామాన్య ప్రజానీకాన్ని ఆర్ధికంగా మరింత దోపీడీకి గురిచేసే అవకాశాన్ని కేంద్రప్రభుత్వం కల్పించినట్టైంది. అదే సమయంలో సాంప్రదాయంగా వస్తున్న చేతివృత్తులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దాదాపు దివాలా దిశగా పయనిస్తున్నాయి. రాష్ట్రాల వారీగా గణాంకాల్ని వెలికితీస్తే ఈ వాస్తవాలు భీతిగొల్పుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో ఎమ్ఎస్ఎమ్ఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య) యాజమాన్య సంఘాలను కదిలించినా వ్యాపారాలు గతంకంటే భారీగా కుదైలైనట్టు చెప్తున్నారు. అదే సమయంలో బడా పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా గళాన్నీ ఎత్తలేకపోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఎమ్ఎస్ఎమ్ఈ రంగంలోని పరిశ్రమలన్నీ బహుళజాతి, బడా పారిశ్రమల ఆర్డర్లపై ఆధారపడి ఉత్పత్తుల్ని చేపట్టాల్సిందే. వారికి వ్యతిరేకంగా గొంతువిప్పితే ఎక్కడ ఆర్డర్లు నిలిచిపోతాయో అనే భయం వారిలో లేకపోలేదు. నోట్లరద్దు, జీఎస్టీ దెబ్బకు పూర్తిగా కునారిల్లిన ఎమ్ఎస్ఎమ్ఈ సెక్టార్ ప్రతినిధులు కొందరు మాత్రం గొంతువిప్పి, కేంద్రప్రభుత్వ నిర్ణయాల్ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. గౌహతిలోని హ్యాండిక్రాఫ్ట్ తయారీదారులు, సూరత్ తిరుపూర్లోని టెక్స్టైల్ ఉత్పత్తిదారులు, ముంబయిలోని పేపర్ గూడ్సు తయారీదారులు, బనారస్ నేతకార్మికులు, హోసూర్లోని చిన్న చిన్న ఇంజనీరింగ్ యూనిట్ యజమానుల ప్రభుత్వవైఖరిపై విరుచుకుపడుతున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక తమ వ్యాపారాలు, జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. తమిళనాడులోని హోసూర్ ఇండిస్టీస్ అసోసియేషన్(అశోక్ లేలాండ్, టైటాన్, వెంకటేశ్వర హాషరీస్లకు చెందినవారు ఇందులో సభ్యులు) మాజీ అధ్యక్షుడు ఎల్కెఎం ఆది జీఎస్టీ గురించి మాట్లాడుతూ..చిన్న చిన్న సమస్యలు మినహా జీఎస్టీతో ఉత్పత్తి రంగం సానుకూలంగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. కాగా, అదే హోసూర్లోని చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల అసోసియేషన్(పెద్ద కంపెనీలకు సరఫరాదారులు ప్రధానంగా ఇందులో సభ్యులుగా ఉన్నారు) అధ్యక్షుడు వి జ్ఞానశేఖరన్ గతేడాది మాట్లాడుతూ.. జీఎస్టీ తమకు ప్రతికూలమేనని అన్నారు. ఆటో కాంపోనెంట్లను 28శాతం శ్లాబులోకి తీసుకోవడం పెద్ద దెబ్బ అని అభిప్రాయపడ్డారు. కాగా, తాజాగా ఆయన మాట్లాడుతూ..తమ ఉత్పత్తులకు దాదాపు 90 రోజుల తర్వాత డబ్బులు అందుతాయని, కానీ ఆ ఉత్పత్తులకు ముందుగానే పన్ను చెల్లించాల్సి వస్తుందని అన్నారు. దీంతో పెట్టుబడి భారం 20శాతం పెరుగుతుందని చెప్పారు. కాగా, తమ అసోసియేషన్ సభ్యులు కొందరు కొన్ని నెలలుగా పన్ను కట్టలేకపోతున్నారని ఆయన వెల్లడించారు. దీంతో వారి జీఎస్టీ లైసెన్స్ రద్దవుతుందేమోనని భయపడుతున్నారని అన్నారు. ఈ ఏడాది కాలంలో దాదాపు 50వేల ఎంఎస్ఎంఈ యూనిట్లు మూసివేతకు గురయ్యాయని ఆ అసోసియేషన్ ట్రెజరర్ తెలిపారు. అంతేకాకుండా మరో 20శాతం నుంచి 30శాతం యూనిట్లు ఏ క్షణానైనా మూతపడే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. హోసూర్లోని పెద్ద పరిశ్రమలు, చిన్న పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుల అభిప్రాయాలు జీఎస్టీ ఏ తరహా పరిశ్రమలకు సానుకూలంగా ఉన్నదో స్పష్టం చేస్తోంది.
గతేడాదివరకు అసోం హస్తకళాకారుల ఉత్పత్తులకు ఎలాంటి వ్యాట్(వాల్యూ యాడెడ్ టాక్స్)లు ఉండేవి కావు. కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చాక ముడి బాంబూ, కేన్లపై పన్ను పడుతోంది. ముడి బాంబూ, కేన్లపై 5శాతం పన్నుతోపాటు వీటితో తయారైన ఉత్పత్తిపై 12శాతం నుంచి 28శాతం జీఎస్టీ పడుతోంది. జీఎస్టీ పడటంతో ఉత్పత్తి ధర పెరుగుతోందని, దీంతో అమ్మకాల్లో 60శాతం లోటు ఏర్పడిందని ఓ యూనిట్ యజమాని నవీన్ సూద్ తెలిపారు.
గుజరాత్లోని సూరత్ చేనేత వస్త్రాల తయారీకి పేరెన్నికగన్నది. కాగా, ఇక్కడి చిన్న పరిశ్రమలు నూలు లేదా దారంపై 18శాతం జీఎస్టీ, సమయానికి కట్టకపోతే పెనాల్టీలను భరించగలమా అని గతేడాదే భయాందోళనకు గురయ్యారు. తాజాగా సూరత్లోని ఆర్డీఐ టెక్స్ అనే చిన్న పరిశ్రమ యజమాని పవన్.. ప్రతినెలా మూడు సార్లు జీఎస్టీ రిటన్స్ కట్టాలి, ఈ పనికోసం ఓ వ్యక్తిని నియమించే పరిస్థితి తమకు లేదని అన్నారు.
పెద్ద కంపెనీలు తమ వద్ద కాకుండా మరో పెద్ద సరఫరాదారు నుంచి టెక్స్టైల్స్ కొనుక్కుంటే వారికి లాభదాయకంగా ఉంటుందని, పెద్ద సరఫరాదారు జీఎస్టీ నెట్వర్క్లో పన్ను కడతాడు కాబట్టి పెద్ద కంపెనీలకు లబ్ధి చేకూరుతుంది. తమ దగ్గర తీసుకుంటున్నప్పుడు ఆ పన్నునూ తమపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేత పరిశ్రమల వ్యాపారం 30నుంచి 40శాతం పడిపోయిందని మరొకరు తెలిపారు. ఉత్పత్తి రోజుకు 4కోట్ల మీటర్లనుంచి 2.5కోట్ల మీటర్లకు పడిపోయిందని చెప్పారు.
ప్రధాని నియోజకవర్గం వారణాసిలోనూ జీఎస్టీ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. జీఎస్టీ వల్ల కనీసం 20శాతం పెట్టుబడి స్తబ్దతకు లోనవుతోందని వారణాసిలోని చీరల హోల్సేల్ వ్యాపారి తెలిపారు. ముడిసరుకుల సరఫరాదారు నుంచి నేతకారులు, నేతకారుల నుంచి హోల్సేలర్లు, హోల్సేలర్లనుంచి రిటైలర్లు ఉత్పత్తులను ఉద్దెరలోనే తీసుకుంటారని, ఆ ఉత్పత్తులు అమ్ముడయ్యాక మాత్రమే సొమ్ము చెల్లిస్తారని తెలిపారు. కానీ జీఎస్టీ వల్ల ఉత్పత్తి అమ్ముడుపోకముందే పన్ను కట్టాల్సి వస్తోందని, దీంతో కనీసం 20శాతం పెట్టుబడి భారంగా మారుతోందని అన్నారు. అలాగే ఒక్కసారి రిటైలర్లు కొన్న ఉత్పత్తులు అమ్ముడుపోకపోతే రిటర్న్ చేయాల్సి వస్తే జీఎస్టీ విధానంలో పేపర్ వర్క్ అధికంగా ఉంటుందని, దాన్ని భరించలేకే రిటైలర్లు ఆర్డర్లు సగానికి తగ్గిస్తున్నారని వాపోయారు.
జీఎస్టీతో ముంబయిలోని ప్రింటింగ్, పేపర్ ఉత్పత్తి రంగంలో నగదు ప్రవాహం తగ్గిపోయింది. దీంతో వ్యాపారమూ తగ్గిపోయిందని వారు వాపోతున్నారు. కొందరు తమ వ్యాపారం దాదాపు 30శాతం దిగజారిపోయిందని తెలిపారు. తాము ప్రతినెలా 20న జీఎస్టీ కట్టాల్సిందేనని లేదంటే రోజుకు రూ.100 చొప్పున ఫైన్ పడుతోందని ఓ ప్రింట్ యజమాని తెలిపారు. కానీ తమ క్లయింట్లకు ఇలాంటి నిబంధనలేవీ లేకపోవడంతో దాన్ని తామే భరించాల్సి వస్తోందని అన్నారు. తయారీ అయిన ఎన్వలప్కు 100రూపాయలుండేదని ఇప్పుడు జీఎస్టీ వల్ల రూ. 118 అయిందని ఓ ఎన్వలప్ మేకింగ్ పరిశ్రమ యజమాని తెలిపారు. దీంతో 2016లో రూ. 18 లక్షల టర్నోవర్గా ఉన్న తన వ్యాపారం ఈ ఏడాది రూ. 8లక్షలకు పడిపోయిందని చెప్పారు.
జీఎస్టీ విజయం జనందేే: మోడీ
జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని ప్రధాని మోడీ అన్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టి ఏడాదైన సందర్భంగా ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యమ్రంలో.. ఆయన మాట్లాడుతూ.. సహకార సమాఖ్యకు, టీమిండియా స్ఫూర్తికి ఇది నిదర్శనమన్నారు.. భారత ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ ఎన్నో సానుకూల మార్పులు తీసుకువచ్చింది. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది. సులభతర వాణిజ్యానికి ఊపిరి పోసిందని తెలిపారు. ్ల జీఎస్టీ మంచిది కాదని, దేశ ఆర్థిక ప్రగతికి అడ్డు పడుతుందని, నోట్ల రద్దు నేరమని సహించని వాళ్లు అంటున్నారని చెప్పారు.
మిల్క్,మెర్సిడెస్పై ఒకేపన్ను అసాధ్యం
అన్ని వస్తువుల మీద ఒకే రకమైన పన్ను వేయడం సాధ్యం కాదని, పాల మీద, కార్ల మీద ఒకే రేటు ఎలా నిర్ణయిస్తామని కాంగ్రెస్ వాదనలను తిరస్కరించారు. అన్నింటి మీద 18 శాతం పన్ను రేటు వేయడం వల్ల ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింగ్ జీఎస్టీపై మాట్లాడుతూ భవిష్యతులో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 12, Jul 2019, 3:21 PM IST
Highlights
టాలీవుడ్ లో రొటీన్ కథలతో వచ్చే సినిమాలకు లైఫ్ ఉండడం లేదు. అందుకే స్టార్ హీరోలు సైతం కమర్షియల్ కథలు కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎన్నుకుంటున్నారు.
టాలీవుడ్ లో రొటీన్ కథలతో వచ్చే సినిమాలకు లైఫ్ ఉండడం లేదు. అందుకే స్టార్ హీరోలు సైతం కమర్షియల్ కథలు కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎన్నుకుంటున్నారు. కుర్ర హీరో సందీప్ కిషన్ కూడా ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన 'నిను వీడని నీడను నేనే' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం కాకుండా మరెవరో కనిపిస్తే.. వినడానికి థ్రిల్లింగ్ గా ఉన్న ఈ పాయింట్ తో తెరకెక్కిన సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనుకున్న సందీప్ కిషన్ ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అయిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
కొత్తగా పెళ్లైన జంట రిషి, దియా(సందీప్ కిషన్, అన్యాసింగ్)లు కార్ లో వెళ్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంటుంది. అక్కడ నుండి బయటపడి ఇంటికి చేరుకున్న తరువాత వీరిద్దరి జీవితాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇద్దరూ అద్దంలో చూసుకున్నప్పుడు వారి ముఖాలు కాకుండా మరెవరి ముఖాలో కనిపిస్తుంటాయి. దీంతో రిషి అసలు వారి జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక అసలు కారణాలు తెలుసుకోవాలని అనుకుంటాడు.
దీంతో ఓ మానసిక వైద్యుడు(మురళీశర్మ)ని కలవడానికి వెళ్తాడు. తన భార్య దియాని చర్చ్ ఫాదర్ ని కలవమని సలహా ఇస్తాడు. మానసిక వైద్యుడు రిషీని ఓ ఆత్మ వెంటాడుతుందని గుర్తిస్తాడు. మరోపక్క చర్చి ఫాదర్ దియాకి 400 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనతో సంబంధం ఉందని గ్రహిస్తాడు. అసలు రిషి, దియాల జీవితాల్లో జరుగుతున్న అసహజ సంఘటనలకు గల కారణాలేంటి..? రిషిని వెంటాడుతోన్న ఆ ఆత్మ ఎవరిది..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ :
దర్శకుడు కార్తిక్ రాజు ఓ కొత్త కథను ఈ సినిమాతో పరిచయం చేశాడు. 2035వ సంవత్సరంలో కథను మొదలుపెట్టి ఆ తరువాత 2013కి తీసుకొస్తాడు. ఆసక్తికర పాయింట్ తో కథను మొదలుపెట్టిన దర్శకుడు సినిమా మొదటిభాగాన్ని అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. చనిపోయిన ఒక జంట మరొక జంట శరీరాల్లోకి ప్రవేశించడంమనేది కొత్తగా అనిపిస్తుంది. సినిమా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ లు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.
ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆశించిన మలుపులు సెకండ్ హాఫ్ లో కనిపించవు. సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. ప్రీక్లైమాక్స్ తేలిపోయినట్లనిపిస్తుంది. క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ ఇచ్చి సినిమాను ఎండ్ చేసేశారు. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ తక్కువగా, సూపర్ నేచురల్ పవర్స్ ఎక్కువగా చూపించడం కూడా సినిమాకి ప్లస్ అయింది. ఊహించని మలుపులు, ఆసక్తిరేపే సన్నివేశాలతో సినిమా ఆద్యంతం ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది.
ఎవరెలా చేశారంటే..?
హీరోగా సందీప్ కిషన్ కి చక్కగా నటించారు. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో అవలీలగా నటించాడు. ఎమోషనల్ గా ఏడిపించడంతో పాటు కామెడీ చేస్తూ నవ్వించాడు కూడా.. రొమాంటిక్ సన్నివేశాల్లో జీవించేశాడు. హీరోయిన్ అన్యాసింగ్ కి మొదటి సినిమానే అయినప్పటికీ బాగా నటించింది. లుక్స్ పరంగా ఏవరేజ్ గా ఉన్నప్పటికీ నటన పరంగా
మెప్పించింది. లిప్ లాక్ సన్నివేశాల్లో ఎలాంటి మొహమాటాలు లేకుండా నటించింది. నటుడు వెన్నెల కిషోర్ కి ఈ సినిమా మంచి ప్రాధాన్యత దక్కింది. హీరోతో పాటు సినిమా మొత్తం ఈ క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంటుంది. తనదైన కామెడీతో నవ్వించాడు. మురళీశర్మపై నడిచే సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచారు. పోసాని కృష్ణమురళి తన నటనతో బాగా
నవ్వించారు.
టెక్నికల్ గా..
దర్శకుడిగా కార్తిక్ రాజు మంచి కథ ఎన్నుకున్నప్పటికీ సినిమాలో కీలకమైన మిస్టరీ సన్నివేశాలు తెరపై ఆవిష్కరించడంలో ఆయన పూర్తిగా విజయం సాధించలేదనిపిస్తుంది. అలానే అవసరం లేని చోట కూడా కామెడీ పెట్టి కాస్త విసిగించాడు. తమన్ అందించిన నేపధ్య సంగీతం సినిమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్లైమాక్స్ లో వచ్చే మదర్
సెంటిమెంట్ సాంగ్ తప్ప మిగిలిన పాటలేవీ పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఇలాంటి సినిమాలకు కెమెరా వర్క్ చాలా ముఖ్యం. సినిమాటోగ్రాఫర్ పికె వర్మ తన కెమెరా వర్క్ తో ఆకట్టుకున్నారు. ఎడిటింగ్ వర్క్ పై మరింత శ్రద్ధ చూపించాల్సివుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
మొత్తానికి..
ఓవరాల్ గా చూసుకుంటే రొటీన్ కథలకు భిన్నంగా ఓ కొత్త కథను తెరపై చూశామనే అనుభూతి మాత్రం కలుగుతుంది. హారర్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5 | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
స్టార్ డైరెక్టర్పై భార్య బంధువులు దాడి
మాయ మాటలతో వయసు దాచి తన కూతురుని విజయ్ కుమార్ పెళ్లి చేసుకున్నట్లు ప్రసూన తల్లి
TNN | Updated:
Mar 8, 2017, 02:26PM IST
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌పై అతడి భార్య బంధువులు దాడి చేసిన ఘటన తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ కుమార్‌ కొండ ఇటీవల ప్రసూనను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని ప్రసూన కుటుంబ సభ్యులు, బంధువులు అతనిపై దాడికి దిగారు. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ విజయ్ కుమార్, ప్రసూన.. సంజీవ్‌రెడ్డి నగర్ పోలీసులను ఆశ్రయించారు.
ఇరు వర్గాల కుటుంబ సభ్యులను స్టేషన్‌కి పిలిపించిన పోలీసులు వారితో చర్చలు జరిపిన అనంతరం కొన్ని సూచనలు చేసి బయటికి పంపించారు. అయితే స్టేషన్ బయటే మళ్లీ ప్రసూన కుటుంబ సభ్యులు విజయ్ కుమార్‌పై భౌతిక దాడికి దిగడంతో పోలీసులు కలగజేసుకుని దంపతులను కారులో పంపించేశారు. మాయ మాటలతో వయసు దాచి తన కూతురుని విజయ్ కుమార్ పెళ్లి చేసుకున్నట్లు ప్రసూన తల్లి స్వరూప ఆరోపించారు. | 0business
|
సిండికేట్ బ్యాంకు లాభాలు రూ.417 కోట్లు
- మార్చి త్రైమాసికంలో స్వల్ప వృద్ధి
బెంగళూరు : మణిపాల్ కేంద్రంగా పని చేస్తోన్న సిండికేట్ బ్యాంకు క్రితం ఆర్ధిక సంవత్సరం (2014-15) జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(క్యూ4)లో రూ.417 కోట్ల నికర లాభాలు సాధించింది. 2013-14 ఇదే క్యూ4లో రూ.409 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. దీంతో పోల్చితే గత క్యూ4 లాభాల్లో స్వల్పంగా 2 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. బ్యాంకు మొత్తం ఆదాయం 23.2 శాతం పెరిగి రూ.6,599 కోట్లకు చేరింది. 2014 మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం రూ.5,357 కోట్లుగా ఉంది.
నికర వడ్డీపై ఆదాయం, రుణాల పునరుద్దరణ ఎక్కువగా ఉండటంతో లాభాల్లో పెద్ద మెరుగుదల చోటు చేసుకోలేదని సిండికేట్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టికె శ్రీవాస్తవ అన్నారు. గత క్యూ4లో బ్యాంకు నికర వడ్డీపై ఆదాయం 1 శాతం తగ్గి 1,423 కోట్లకు పడిపోయింది. 2014-15 ఇదే క్యూ4లో రూ.1,433 కోట్ల ఎన్ఐఐ నమోదయ్యింది.
గత క్యూ4లో బ్యాంకు గ్లోబల్ అడ్వాన్స్లు 17 శాతం పెరిగి రూ.2,05,804 కోట్లకు చేరింది. ఇదే సమయంలో డిపాజిట్లు 20 శాతం పెరిగి రూ.2,55,388 కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ కరెంట్ ఎకౌంట్ అండ్ సేవింగ్ ఎకౌంట్ (కాసా) 14 శాతం పెరిగి రూ.63,671 కోట్లుగా నమోదయ్యాయి. 2015 మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు స్థూల, నికర నిరర్థక ఆస్తులు వరుసగా 3.13 శాతం, 1.90 శాతానికి ఎగిశాయి. గతేడాది ఇదే కాలం నాటికి జిఎన్పిఎ, నికర ఎన్పిఎ వరుసగా 2.62 శాతం, 1.56 శాతంగా నమోదయ్యాయి. తాజాగా రూ.820 కోట్ల మొండి బాకీలు పోగయ్యాయి. గత నాలుగో త్రైమాసికంలో ప్రధానంగా పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అధిక నిరర్ధక ఆస్తులు నమోదయ్యాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు. మొత్తం ఆర్ధిక సంవత్సరంలో రూ.2500 కోట్ల మొండి బాకీలు నమోదయ్యాయన్నారు. ఆర్ధిక వ్యవస్థ స్తబ్దత నేపధ్యం కూడా మొండి బాకీలకు ఆజ్యం పోసిందన్నారు. 2014-15గాను బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతి షేర్పై 47 శాతం డివిడెండ్ను ప్రతిపాదించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
నేను మోసపోయాను.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్!
Highlights
తాజాగా ఆమె నటించిన 'వైఫ్ ఆఫ్ రామ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచి లక్ష్మీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ఇండస్ట్రీలో చాలా మంది మోసం చేశారంటూ లక్ష్మీ మంచు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకు పరిచయమైన మంచు లక్ష్మీ సినిమాల్లో నటిస్తూ పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. కెరీర్ లో ముందుకు సాగుతోంది. తాజాగా ఆమె నటించిన 'వైఫ్ ఆఫ్ రామ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచి లక్ష్మీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ఇండస్ట్రీలో చాలా మంది మోసం చేశారంటూ లక్ష్మీ మంచు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇండస్ట్రీలో కొంతమంది వద్ద నుండి తనకు డబ్బులు రావాల్సివుందని ఆమె ఆరోపణలు చేసింది. మోహన్ బాబు కూతురైన ఆమెను ఎవరు మోసం చేస్తారులే అని అంతా అనుకుంటారని కానీ తాను మాత్రం మోసపోవడం నిజమని వెల్లడించింది. సినిమాల కారణంగా చాలా డబ్బు కోల్పోయినట్లు.. 'గుండెల్లో గోదారి' సినిమా అప్పులను ఇప్పటికీ తాను తీరుస్తున్నట్లు స్పష్టం చేసింది. తను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఆపలేదని, తన దగ్గర అప్పు ఎగ్గొట్టిన వ్యక్తి మారు పేరుతో సినిమాలు తీస్తున్నట్లు ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
అయితే ఆమె ఆరోపణలును బట్టి ఆ వ్యక్తి బెల్లంకొండ సురేష్ అయి ఉంటాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి మధ్య కొన్ని వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. లక్ష్మీ మంచుకి సంబంధించిన ఓ సినిమా సెట్ లో షూటింగ్ చేసుకొని బెల్లంకొండ ఆమెకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో అప్పట్లో చాలా గొడవ జరిగింది. మరి లక్ష్మీ ఆయన్ను ఉద్దేశించే కామెంట్స్ చేసిందా..? అనేది తెలియాల్సివుంది.
Last Updated 21, Jul 2018, 1:14 PM IST | 0business
|
Hyderabad, First Published 29, Oct 2018, 10:05 AM IST
Highlights
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటుంటారు. సినిమాలలో అతడి మాటలకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అయితే తనను మాటల మాంత్రికుడు అని పిలవడంపై త్రివిక్రమ్ కొత్తగా స్పందించాడు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటుంటారు. సినిమాలలో అతడి మాటలకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అయితే తనను మాటల మాంత్రికుడు అని పిలవడంపై త్రివిక్రమ్ కొత్తగా స్పందించాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ''పంచ్ ని కనిపెట్టినోడు.. నువ్ మాటల మాంత్రికుడు అని పిలిచినోళ్ళు.. ఆ ఇద్దరూ నా శత్రువులు.. 'నువ్వే కావాలి' సినిమాతోనే నేను ప్రాస ఆపేశాను. చాలా మంది ప్రాసలు ప్రారంభించడంతో నేను నా ఆలోచన చెప్పడం మొదలుపెట్టాను.
ఆలోచనని ఎవరూ కాపీ కొట్టలేరు కదా.. పంచ్ కావాలని రాయను.. అది నా స్పాంటేనియస్ రియాక్షన్. రాసుకోవాల్సిన డైలాగులన్నీ మూడు, నాలుగు రోజుల్లో రాసుకుంటాను. పంచ్ అంటే ఏంటో అర్ధం కాదు.. విచిత్రంగా ఉంటుంది. ఎవరు కనిపెట్టాడో తెలియదు'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇటీవల త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అరవింద సమేత' సినిమా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అతడు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Last Updated 29, Oct 2018, 10:19 AM IST | 0business
|
రేపు బంగారపు దుకాణాల బంద్!
- పాన్కార్డ్ నిబంధనకు వ్యతిరేకంగా నిరసన: జేజీఎఫ్
కోల్కతా: రూ.2 లక్షలకు మించి బంగారం, ఆభరణాల కొనుగోళ్లు జరిపే వారు విధిగా పాన్కార్డు గానీ లేదా డిక్లరేషన్ను గానీ సమర్పించాలన్న సర్కారు నిబంధనపై పసిడి వర్తకులు కన్నెర్రజేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం (10న) ఒక్క రోజు సమ్మె బాట పట్టాలని నిర్ణయించినట్లు 'ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ ట్రేడ్ ఫెడరేషన్' (జేజీఎఫ్) సోమవారం తెలిపింది. ఇందులో భాగంగా తమ నిరసనను తెలియజేశేలా దేశ వ్యప్తంగా ఉన్న దాదాపు లక్ష బంగారం దుకాణాలను 10న మూసి ఉంచనున్నట్లు సంఘం సభ్యులు తెలియజేశారు. జనవరి నుంచి అమలులోకి వచ్చిన పాన్ నిబంధన పట్ల వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందనీ.. ఫలితంగా తమ వ్యాపారం బాగా దెబ్బతింటోన్నట్లు సంఘం వివరించింది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాలలో తాము ఈ సమస్య ఎందుర్కొంటున్నట్లు సంఘం తెలిపింది. ఈ నిబంధన కారణంగా మూడోవంతు వ్యాపారం దెబ్బతిన్నట్లు జీజేఎఫ్ ఈస్ట్జోన్ ఛైర్మన్ శంకర్ సేన్ తెలిపారు. చాలా మంది గ్రామీణ మహిళలకు పాన్కార్డులు లేవనీ.. డిక్లరేషన్పై సంతకం చేయమని కోరితే వారు నిరాకరించి వెళ్లిపోతున్నట్లు ఆయన వాపోయారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Sep 16,2015
ఫెడ్ భయాలతో నష్టాల్లోకి..
ముంబయి: చైనా ప్రభుత్వం అనుకున్న స్థాయిలో సంస్కరణలకు ముందుకు రాకపోవడం, అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక వడ్డీ రేట్లను పెంచనుందన్న ఊహాగానాలు మంగళవారం మార్కెట్లను నష్టాల్లోకి తోశాయి. దీనికి తోడు ఉదయం ప్రారంభమైన ప్రపంచ మార్కెట్ల తిరోగమన పయనం మదుపరి సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లు ఉదయం లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ చివరకు స్టాక్ మార్కెట్లు నష్టాలలోనే ముగిశాయి. ద్రవ్యోల్బణం సూచీ రికార్డు స్థాయిలో దిగివచ్చినప్పటికీ మార్కెట్లకు మద్దతు లభించలేదు. ఫలితంగా మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 150.77 పాయింట్లు జారి 25,705.93 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజీ సూచీ నిఫ్టీ 43.15 పాయింట్లు తగ్గి 7,829.10 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ సూచీలు మినహా అన్ని స్టాక్లు నష్టాల్లో ముగిశాయి. లోహ సూచీ అత్యధికంగా 2.34 శాతం నష్టపోయింది. కాపిటల్ గూడ్స్ (2.11 శాతం), ఆటో (1.66 శాతం), కన్సూమర్ డ్యూరెబుల్స్ (1.55 శాతం) కుంగాయి. మరోవైపు ఎఫ్ఎంసీజీ రంగ సూచీ 0.8 శాతం, ఐటీి రంగ సూచీ 0.03 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్లో హెచ్యుఎల్ 1.15 శాతం, సన్ఫార్మా 1.11 శాతం, ఐటీసీ 1.09 శాతం, ఎన్టీపీసీ 0.68 శాతం, రిలయన్స్ 0.52 శాతం ముందుకు సాగి అత్యధిక లాభాలు సాధించి స్టాక్స్ జాబితాలో నిలిచాయి. మరోవైపు టాటా స్టీల్ 5.08 శాతం, వీఈడీిఎల్ 4.06 శాతం, టాటా మోటర్స్ 3.69 శాతం, హిందాల్కో 3.05 శాతం, ఎల్అండ్టీి 2.92 శాతం చొప్పున అధిక నష్టా లను చవి చూశాయి, బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 1 శా తం చొప్పున తగ్గాయి. మొత్తంగా మదుపర్ల మద్దతు కరువై 1,523 స్టాక్స్ నష్టా లలో నడవగా, మరోవైపు 1,096 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అందగత్తెలంతా ఓవైపున్నా.. పవన్నే ఎంచుకుంటా: వర్మ
వివాదాలకు మారుపేరైన రామ్గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని విమర్శిస్తాడో, పొగడ్తలతో ముంచెత్తుతాడో ఆయనకే అర్థంకాదు.
TNN | Updated:
Dec 31, 2017, 05:32PM IST
వివాదాలకు మారుపేరైన రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని విమర్శిస్తాడో, పొగడ్తలతో ముంచెత్తుతాడో ఆయనకే అర్థంకాదు. గతంలో పవన్ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేసి అభిమానుల ఆగ్రహానికి వర్మ గురయ్యారు. పవన్ విషయంలో గత కొంత కాలంగా వర్మ పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా జనసేనానిపై మరోసారి ఫేస్‌బుక్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. పవన్ ముందు పుట్టాడా? ఎమోషన్ ముందు పుట్టిందా? అనేది చెట్టు ముందా?, కోడి ముందా? గుడ్డు ముందా? అనే ప్రశ్నలకు సమాధానం చెబుతానని పేర్కొన్నాడు. పవన్ కల్యాణ్ ముందు పుట్టి ఇప్పుడు మనందరికీ ఎమోషన్స్ నేర్పుతున్నాడని, ‘హ్యాట్సాప్ పీకే’ అని పోస్ట్ చేశాడు.
గత జన్మలో కూడా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని తాను చూడలేదని, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్‌లు కూడా పవన్ ముందు దిగదిడుపేనని పేర్కొన్నారు. బ్రూస్‌లీకి పవన్ మొగుడులా ఉన్నాడని వ్యాఖ్యానించారు. తాను స్వలింగ సంపర్కుడిని కాదనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని, ప్రపంచంలోని అమ్మాయిలందరినీ ఒకవైపు పెట్టి, అజ్ఞాతవాసి సినిమా పోస్టర్‌లో ఉన్న పవన్‌ను మరో పక్కన పెడితే తాను పవన్‌నే ఎంపిక చేసుకుంటానని రాశాడు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మహ్మద్ షమీకి వివాహేతర సంబంధాలు.. గుట్టు బయటపెట్టిన భార్య!
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడా..? అతడి భార్య ఫేస్బుక్లో చేసిన పోస్టులు షమీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి.
TNN | Updated:
Mar 7, 2018, 11:54AM IST
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ అక్రమ సంబంధం వివాదాల్లో చిక్కుకున్నాడు. వేరే మహిళలతో షమీ చేసిన చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను అతడి భార్య హసీన్ జహన్ బయటపెట్టింది. మహిళలతో షమీ సాగించిన చాటింగ్ వివరాలను ఫోన్ నంబర్లతో సహా స్క్రీన్ షాట్లు తీసిన జాహన్ వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. ఓ న్యూస్ ఛానల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. షమీకి ఢిల్లీ డేర్‌డెవిల్స్ 2014లో ఓ ఫోన్‌ను బహుకరించింది. కార్లో లభ్యమైన ఆ ఫోన్లో షమీ వేరే మహిళలతో చాటింగ్ చేసిన వివరాలు ఉండటాన్ని జాహన్ గుర్తించింది. | 2sports
|
india vs new zealand: munro century helps kiwis to score 196/2 in second t20i
మున్రో మెరుపు సెంచరీ, న్యూజిలాండ్ భారీ స్కోర్
ఓపెనర్ మున్రో మెరుపు సెంచరీ సాధించడంతో కివీస్ జట్టు భారత్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
TNN | Updated:
Nov 4, 2017, 08:41PM IST
రాజ్‌కోట్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ మున్రో మెరుపు శతకం సాధించడంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. 7 సిక్సర్లు, 7 ఫోర్లు బాదిన కాలిన్ మున్రో 54 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మున్రో (58 బంతుల్లో 109 నాటౌట్), గుప్టిల్ (44 బంతుల్లో 45, 4x3, 6x3) తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. భారత జట్టుపై కివీస్‌కు టీ20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
చాహల్ బౌలింగ్‌లో పాండ్యకు క్యాచ్ ఇచ్చిన గుప్టిల్ వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ మున్రో మాత్రం దూకుడు కొనసాగించాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఫీల్డర్ల తప్పిదాలు అతడికి కలిసి వచ్చాయి. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ తేలికైన క్యాచ్‌ను జారవిడవంతో మున్రోకి లైఫ్ లభించింది. దీంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లోనూ చాహల్ తేలికైన క్యాచ్ వదిలేయడంతో మున్రోకు మరోసారి జీవదానం లభించింది.
ఈ మ్యాచ్‌తోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ధారాళంగా పరుగులిచ్చాడు. మూడో ఓవర్ రెండో బంతికి కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపి అంతర్జాతీయ క్రికెట్లో తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్నర్లు చాహల్, అక్షర్ పటేల్ అధికంగా పరుగులు ఇచ్చినప్పటికీ.. బుమ్రా, భువీ ఫర్వాలేదనిపించారు. పొదుపుగా బౌలింగ్ చేసిన బుమ్రా 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇవ్వడంతో కివీస్ 200 పరుగుల మార్క్ చేరలేకపోయింది.
మున్రో రికార్డులు:
* టీ20ల్లో భారత్‌పై శతకం సాధించిన తొలి కివీస్ ఆటగాడు మున్రో. ఇప్పటి వరకూ మెక్ కల్లమ్ చేసిన 91 పరుగులే భారత్‌పై కివీస్ బ్యాట్స్‌‌మెన్‌కు అత్యధిక వ్యక్తిగత స్కోరు.
* పొట్టి ఫార్మాట్లో మున్రోకి ఇది రెండో సెంచరీ. దీంతో టీ20ల్లో రెండు శతకాలు సాధించిన క్రిస్ గేల్, బ్రెండన్ మెక్ కల్లమ్, ఈవిన్ లూయిస్‌ల సరసన మున్రో చేరాడు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సెర్బియా చెస్ ప్లేయర్ను పెళ్లాడిన హరికృష్ణ
భారత గ్రాండ్ మాస్టర్ పెంటెల హరికృష్ణ వివాహం శనివారం ఘనంగా జరిగింది. సెర్బియాకు చెందిన చెస్ క్రీడాకారిణి నడ్జా స్టోయినోవిచ్ను హరికృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నాడు.
TNN | Updated:
Mar 3, 2018, 09:04PM IST
భారత గ్రాండ్ మాస్టర్ పెంటెల హరికృష్ణ వివాహం శనివారం ఘనంగా జరిగింది. సెర్బియాకు చెందిన చెస్ క్రీడాకారిణి నడ్జా స్టోయినోవిచ్‌ను హరికృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. చాలా ఏళ్ల క్రితమే చెస్ టోర్నీలకు వెళ్లినప్పుడు హరికి నడ్జాతో పరిచయమైంది. కొన్నాళ్ల స్నేహం తర్వాత వీరు క్రమంగా ప్రేమలో పడ్డారు. తొలుత వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. కానీ ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమను చూసి చివరకు ఓకే చెప్పారు.
నడ్జాకు తెలుగు రాకపోయినప్పటికీ.. సెర్బియాతోపాటు మన సంస్కృతులను కూడా తను గౌరవిస్తుందని హరికృష్ణ తెలిపాడు. కొద్ది రోజులు తన తల్లిదండ్రులతో కలిసిపోతే.. తను తేలిగ్గా తెలుగు నేర్చుకుంటుందని ఆయన నమ్మకంగా చెప్పాడు.
విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితో చెస్ ఆడటం ప్రారంభించిన హరికృష్ణ అనతి కాలంలోనే అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగాడు. గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ అతిపిన్న వయసులో గ్రాండ్ మాస్టర్‌గా హోదా సాధించిన భారతీయుడిగా రికార్డ్ నెలకొల్పాడు.
చూడండి: హరికృష్ణ వివాహ ఆహ్వాన పత్రిక
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyderabad, First Published 14, Apr 2019, 6:52 PM IST
Highlights
ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేసేటప్పుడు అక్కడ ఎవరు ఫామ్ లో ఉన్నారో వారిని తీసుకుని రీమేక్ చేస్తూంటారు. ఇప్పుడు తమిళంలో తమన్నాకు టైమ్ నడుస్తోంది. దాంతో తెలుగులో హిట్టైన ఆనందో బ్రహ్మ చిత్రం రీమేక్ లో ఆమెను తాప్సీ పాత్రకు గాను తీసుకున్నారని సమాచారం.
ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేసేటప్పుడు అక్కడ ఎవరు ఫామ్ లో ఉన్నారో వారిని తీసుకుని రీమేక్ చేస్తూంటారు. ఇప్పుడు తమిళంలో తమన్నాకు టైమ్ నడుస్తోంది. దాంతో తెలుగులో హిట్టైన ఆనందో బ్రహ్మ చిత్రం రీమేక్ లో ఆమెను తాప్సీ పాత్రకు గాను తీసుకున్నారని సమాచారం.
తెలుగులో చిన్న కామెడీ హారర్ చిత్రంగా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఆనందోబ్రహ్మ. ఈ చిత్రానికి దర్శకుడు మహి వీ.రాఘవ్. తాప్సీ తో మరి నలుగురు కమిడియన్స్ ని ప్రధాన పాత్రలుగా తీసుకుని ఈ సినిమా ని రూపొందించారు. ఆ సినిమాలో తాప్సీ దెయ్యంగా కనిపించింది. ఇప్పుడు తమన్నా కూడా తమిళంలో దెయ్యంగా కనిపించబోతోందన్నమాట. ఈ చిత్రాన్ని తమిళంలో స్వయంగా అదే దర్శకుడు డైరక్ట్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
తమన్నా ప్రస్తుతం విశాల్తో సుందర్.సీ దర్శకత్వంలో చిత్రం చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. ఈ సినిమా తరువాత మరో చిత్రంలోనూ విశాల్తో రొమాన్స్ చేయడానికి తమన్నా ఓకే చెప్పింది. తెలుగులో మాత్రం కొత్తగా ఏ చిత్రాలు కమిటవ్వలేదు.
Last Updated 14, Apr 2019, 6:52 PM IST | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
India Post Payments: ‘పోస్టల్’ బ్యాంకు ఎలా పనిచేస్తుంది? ప్రయోజనాలేమిటీ?
ఐపీపీబీ అంటే ఏమిటీ? దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటీ? ఇందులో ఎలాంటి ఖాతాలు తెరవచ్చు? వడ్డీ ఎంత? తదితర వివరాలను ఇక్కడ చూడండి.
Samayam Telugu | Updated:
Sep 1, 2018, 09:22PM IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఐపీపీబీ అనేది ప్రభుత్వరంగ సంస్థ. ఇది పోస్టల్, కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖల ఆధీనంలో పనిచేయనుంది. ఇందులో నూరు శాతం వాటా కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకే చెందుతుంది.
ఎలా పనిచేస్తుంది?: మొత్తం 1.55 లక్షల పోస్ట్ ఆఫీసు శాఖల అనుసంధానంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు బ్యాంకింగ్, ఆర్థిక సేవలను విస్తృతం చేయనుంది. అంటే, ప్రస్తుతం ఉన్న బ్యాంకుల నెట్వర్క్ కంటే 2.5 రెట్లు అధికంగా ఐపీపీబీ శాఖలు ఉండబోతున్నాయి. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న సుమారు 11,000 పోస్ట్మేన్లు బ్యాకింగ్ సేవలను ఇంటి వద్దకు చేర్చనున్నారు. ఐపీపీబీ ఆరంభంతో.. ఇండియాలోనే అతిపెద్ద బ్యాంకింగ్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తోంది.
• పోస్ట్మాన్ ద్వారా కొత్తతరం బ్యాంకింగ్, చెల్లింపు పద్ధతులను గ్రామీణులకు అందజేయనుంది.
• సుమారు 17 కోట్ల పోస్టల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లు ఐపీపీబీ ఆధీనంలోకి రానున్నాయి.
• బ్యాంకుకు సంబంధించిన అన్ని రకాలు సేవలు ఐపీపీబీ అందిస్తుంది. అయితే, రుణాలు మాత్రం ఇవ్వలేదు.
• ఈ మేరకు థర్డ్పార్టీ సేవలు కింద మ్యూచువల్ ఫండ్, రుణాలు ఇచ్చేందుకు బజాజ్ అలియంజ్, పీఎన్బీతో ఒప్పందాలు జరిగాయి.
• పింఛను, సబ్సిడీ, ఎమ్ఎన్ఆర్ఈజీఏ నగదు బదిలీ కూడా ఐపీపీబీ ద్వారా చేయవచ్చు.
మూడు రకాల సేవింగ్ అకౌంట్లు: ఐపీపీబీ రెగ్యులర్, డిజిటల్, బేసిక్ సేవింగ్ అకౌంట్లను అందుబాటులోకి తేనుంది. ఈ మూడు సేవింగ్ అకౌంట్లకు 4 శాతం వడ్డి లభించనుంది. వ్యక్తులు, చిన్న వ్యాపారుల నుంచి సుమారు రూ.లక్ష వరకు డిపాజిట్లను ఐపీపీబీ స్వీకరిస్తుంది.
• పొదుపు ఖాతాలతోపాటు కరెంట్ ఖాతాలు, నగదు బదిలీలు, ప్రత్యక్ష నగదు బదిలీ, బిల్లు, యుటిలిటీ చెల్లింపులు, వ్యాపార చెల్లింపులు సైతం అందుబాటులో ఉంటాయి.
• నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్లో ఉన్న.. ఫోన్లు, డీటీహెచ్ వంటి సుమారు 100 సంస్థలకు బిల్లులు చెల్లించే సదుపాయం ఉంది.
• ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఎస్ఎమ్ఎస్, ఐవీఆర్, మైక్రో ఏటీఎమ్ విధానాల్లోనూ సేవలు అందించనుంది.
• వీటితో పాటు ఖాతాదారుడికి క్యూఆర్ కార్డును కూడా అందించనున్నారు. వీటికి బయోమెట్రిక్ను అనుసంధానిస్తారు. దీనివల్ల కార్డు ఎవరికైనా చిక్కినా వారు దాన్ని ఉపయోగించలేరు.
• ఐపీపీబీ 650 శాఖలతోపాటు 3,200 యాక్సెస్ పాయింట్లను కూడా అందుబాటులోకి తేనుంది. ఐపీపీబీకి సురేష్ సేథీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. | 1entertainment
|
అనసూయ కథనం మూవీ స్టిల్స్
First Published 6, Mar 2019, 8:54 PM IST
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్
Recent Stories | 0business
|
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
First Published 14, Apr 2017, 1:50 PM IST
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
టీచర్ అవతారమెత్తిన రకుల్... ఆర్ ఫర్ రకుల్ అనాలట..గ్యాలరీ
Recent Stories | 0business
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
15 ఏళ్లుగా బాధపడుతున్నా : ఇలియానా
Highlights
15 ఏళ్లుగా (బీడీడీ) తో బాధపడుతున్నా
15 ఏళ్లుగా ‘బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ (బీడీడీ)’తో బాధపడుతున్నానని చెప్పింది హీరోయిన్ ఇలియానా. తన అనారోగ్య పరిస్థితి గురించి చెప్పేందుకు తనకు అభ్యంతరం లేదంది. కానీ, తనను అలాంటి ఓ అనారోగ్య స్థితిలో జనాలు చూస్తే అదే ఎక్కువగా బాధిస్తుందని తెలిపింది. ఏదైనా ఓ విషయం గురించి మనం సిగ్గుపడితే దాన్ని బయటకు చెప్పడం చాలా కష్టమవుతుందని అభిప్రాయపడింది.
మరోవైపు తన వ్యక్తిగత జీవితం చాలా పవిత్రమైందని.. అందులో చాలా కోణాలు ఉన్నాయని వెల్లడించింది. వాటి గురించి మాట్లాడితే అందులో వక్రీకరించబడిన విషయాల గురించి మాత్రమే జనాలు మాట్లాడుకుని మిగిలిన మంచి విషయాలను వదిలేస్తారని వాపోయింది. మీడియాలో తన పర్సనల్ లైఫ్ గాసిప్లపాలు కావడం తనకు అస్సలు ఇష్టం ఉండదని తెలిపింది ఇలియానా.
Last Updated 31, Mar 2018, 4:41 PM IST | 0business
|
మొబైల్ వాయిస్, డేెటా నాణ్యత సేవలపై సంప్రదింపులు
- ప్రక్రియ ప్రారంభించనున్న ట్రాయ్
న్యూఢిల్లీ : వాయిస్, డేటా సేవల 'నాణ్యత ప్రమాణాల'పై టెలికం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ట్రారు) సంప్రదింపుల ప్రక్రియను పక్షం రోజులలో ప్రారంభించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ మార్కెట్ వున్న మన దేశంలో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. నాణ్యత సేవలలో భాగంగా వాయిస్, డేటా అంశాలను పరిష్కరించేందుకు సంప్రదింపుల ప్రక్రియ ఉపయోగపడుతుందని తెలిపింది. తరుచుగా కాల్డ్రాప్స్ పరీక్షలలో అత్యధిక టెలికాం ఆపరేటర్లు సేవ నాణ్యత ప్రమాణాలకు చేరుకోవడంలో విఫలమయ్యారని ట్రారు అభ్రిపాయపడింది. ప్రసుత్తం ఒక త్రైమాసికంలో 2శాతం కాల్డ్రాప్స్ అయితే 98శాతం కాల్స్ నెట్వర్క్పై అటోమెటిక్ డిస్కనెక్ట్ కాకుండా పూర్తి చేయాలి. అలాగే నెట్వర్క్ పని విధానంలో ట్రారు పరీక్షలు సరైన అంచనాలు అందుకోలేదని టెలికాం ఆపరేటర్లు భావనలో వున్నట్టు సమాచారం. అయితే టవర్ స్థాయి పనులలో ఉండే పర్యవేక్షణ నెట్వర్క్ను పరిశీలించే వ్యవస్థ పనిచేస్తూ ఉందని ఇటీవలే ట్రారు చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. టెలికాం సంస్థలు వినియోగదారులకు వాస్తవ స్పీడును కనుగొనేందుకు గాను ఒక రియల్ టైమ్ యాప్ను ట్రారు రూపొందించిన సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Vaani Pushpa 121 Views Ex Showroom Price , maruti baleno , Price Reduced
maruti baleno
న్యూఢిల్లీ: మారుతిసుజుకి బాలెనో ఆర్ఎస్ ఎక్స్షోరూం ధరలను లక్ష రూపాయల వరకూ తగ్గించింది. మోడల్ ధరలు ఇకపై ఢిల్లీ ఎక్సషోరూం వద్ద 7,88,913 రూపాయలతోప్రారంభం అవుతాయి. కంపెనీ ఎంపికచేసిన మోడల్స్పై ఎక్స్షోరూంధరల్లో రూ.5వేలనుంచి తగ్గించింది. ఆల్టో 800, ఆల్టో కె10, స్విఫ్ట్ డీజిల్, సెలేరియో, బాలెనో డీజిల్, ఇగ్నిస్, డిజైర్ డీజిల్, టూర్ఎస్ డీజిల్, విటారాబ్రెజ్జా, ఎస్క్రాస్ వేరియంట్లపై తగ్గిస్తున్నట్లు మారుతి వెల్లడించింది. ఈ మోడళ్ల ధరలు రూ.2.93 లక్షలనుంచి రూ.11.49 లక్షలవరకూ ఉన్నాయి. స్టాక్ ఎక్ఛేంజిలకు ఇచ్చిన దనివేదికలోకంపెనీ ఈ తగ్గింపునుసైతం ప్రకటించింది. మారుతిసుజుకి ఇండియా బాలెనో ఆర్ఎస్ను అత్యంత పనితీరు ధృఢత్వం ఉన్న వాహనంగా చెపుతోంది. 1.0 లీటర్ బూస్టర్జెట్ పెట్రోల్ ఇంజన్తో 20శాతం మరింత ఇంధనం మైలేజి ఇస్తుందని, 1.2 లీటర్పెట్రోల్ ఇంజన్కంటే మంచి పనితీరుచూపిస్తోందని వెల్లడించింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
Nithin and Trivikram’s 'A…Aa' Teaser Comes On 13th April
నితిన్, త్రివిక్రమ్ల 'అ...ఆ' టీజర్ డేట్!
మాటల మాంత్రికుడు తివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అ...ఆ మూవీ టీజర్ రిలీజ్కి రెడీ అయ్యింది.
| Updated:
Apr 11, 2016, 11:20PM IST
మాటల మాంత్రికుడు తివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అ...ఆ మూవీ టీజర్ రిలీజ్కి రెడీ అయ్యింది. ఈ నెల 13న టీజర్ని రిలీజ్ చేయనున్నట్టు తాజాగా యూనిట్ ప్రకటించింది. టీజర్ తోపాటే ఆడియో రిలీజ్ డేట్ ఎప్పుడనే వివరాలు కూడా అందులోనే ప్రకటించనున్నట్టు యూనిట్ స్పష్టంచేసింది. నితిన్ , సమంత , అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని సూర్యదేవర రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు. మే నెలాఖర్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో నదియ మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. | 0business
|
ఏ ఇండియన్ సినిమాకు దక్కని రికార్డ్ 'సరైనోడు' సొంతం!
Highlights
భారతీయ చిత్రాల్లో ఇటువంటి ఘనత సాధించిన తొలి సినిమా 'సరైనోడు' కావడం విశేషం. హిందీ వెర్షన్ యూట్యూబ్ హక్కులను గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది
భారతీయ సినిమా చరిత్రలో ఓ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది 'సరైనోడు' సినిమా. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించింది. ప్రపంచవ్యాపంథాగా ఈ సినిమా రూ.127 కోట్లు వసూలు చేసిన బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.
రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించిన ఇందులో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. యూట్యూబ్ లో రెండు కోట్ల మంది ఈ సినిమాను వీక్షించడం విశేషం.
భారతీయ చిత్రాల్లో ఇటువంటి ఘనత సాధించిన తొలి సినిమా 'సరైనోడు' కావడం విశేషం. హిందీ వెర్షన్ యూట్యూబ్ హక్కులను గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే రెండు కోట్ల వ్యూస్ క్రాస్ చేసిన ఈ సినిమాకు ఆరు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
Last Updated 16, Jul 2018, 6:55 PM IST | 0business
|
అపోలో షుగర్ సిఇఒ గగన్ భల్లా
వైద్యఆరోగ్యరంగానికి కేటాయింపులు పెంచాలి
-అపోలో షుగర్ సిఇఒ గగన్భల్లా
హైదరాబాద్, జనవరి 27: మరో నాలుగు రోజుల్లో వస్తున్నకేంద్ర బడ్జెట్లో హెల్త్కేర్ రంగానికి ఎక్కువ కేటాయిం పులు అవసరమని అన్నారు. డిజిటల్ కరెన్సీ, తక్కువ పన్నులు, రెరా ఇతర కీలక కార్యాచరణ లుప్రభుత్వ పరంగా ఉంటాయని భావిస్తున్నట్లు అపోలో షుగర్ సిఇఒ గగన్ భల్లా వెల్లడించారు. అలాగే హెల్త్కేర్ రంగానికి కూడా సమృద్ధిగా నిధులు అవసరం అవుతాయన్నారు. అత్య వసరమందులు, అంతర్జాతీయ యోగడే వంటి కార్యకలా పాలతో వైద్యానికి ప్రాముఖ్యతేర్పడిందన్నారు. భారత్ జిడిపి వృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం అవసరమని అంటువ్యాధులు వ్యాప్తి కారణంగా భారత్కు 2030 నాటికి 6.2లక్షల కోట్ల డాలర్లు అవసరం అవుతాయన్న అధ్యయ నాల మేరకు ప్రభుత్వం బడ్జెట్లో సముచిత కేటాయిం పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పర్యా వరణ కాలుష్యం పరంగా భారత్ మధుమేహానికి హబ్గా మారుతోందని, చైనా తర్వాత మధుమేహంలో రెండో స్థానంలో భారత్ ఉందని అందువల్లనే ఆసుపత్రి వైద్యం తప్పనిసరి అవుతున్నదని అన్నారు. బడ్జెట్పన్నులపరంగా సెక్షన్ 80డిపరిమితులను పెంచాలని, ఏడాదికి పన్ను పరిమితులు మినహాయింపులు కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యఆరోగ్యరంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగ స్వామ్య వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని గగన్భల్లా వివరించారు. | 1entertainment
|
కోరుకున్న చోటే మౌలిక వసతులు
- ఇక అన్ని జిల్లాలకు పరిశ్రమలు
- పెట్టుబడుల వికేంద్రీకరణ జరగాలి
- ఫలితంగా సమ అభివృద్ధి, స్థానికులకు ఉపాధి
- పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి
- టీఎస్ -ఐపాస్లో మూడో విడుత అనుమతులు
- కొత్తగా మరో 16 కంపెనీలకు లైసెన్సులు జారీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పరిశ్రమల స్థాపన కార్యక్రమం విస్తరించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం సాయంత్రం సచివాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టీఎస్ ఐ-పాస్ ద్వారా అనుమతులు మంజూరైన మరో 16 కంపెనీలకు లైసెన్స్లను అందజేశారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా చుట్టు పక్కల ప్రాంతాలలోనే పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పెట్టుబడులు విస్తరించాల్సి అవశ్యకత ఎంతై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని వివరించారు.
ఇలా చేయడం వల్ల రాష్ట్రం సమంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు అన్ని జిల్లాలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఏ జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే అక్కడ మౌలిక వసతులను అభివృద్ధిచేేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఐపాస్ విధానానికి అనుకున్న దానికంటే అద్భుత స్పందన వస్తోందని మంత్రి తెలిపారు. చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు. ఐపాస్ విధానాన్ని పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలతో పాటు బహుళ జాతి సంస్థల వారు కూడా మెచ్చుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు రానున్నట్లు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.
అనుమతి పొందిన సంస్థలు ఇవే..
- మహీంద్రా సీఐఈ అటోమోటీవ్స్
- హిందుస్థాన్ కోకాకోలా బ్రూవరీస్
- హెటీరో లాబ్స్్ (యూనిట్-3)
- అరబిందో ఫార్మా ( యూనిట్-16)
- ఏసీఈ టైర్స్ శ టోటల్ ఆయిల్ ఇండియా
- రాణే మద్రాస్
- శ్రీ రామచంద్ర ఎనర్జీ ఇన్ఫ్రా
- కేజేఎస్ ఇండియా
- అరబిందో ఫార్మా (యూనిట్-4)
- ప్రగతి గ్రూప్ | 1entertainment
|
శర్వానంద్ "రణరంగం" పబ్లిక్ టాక్ (వీడియో)
15, Aug 2019, 1:37 PM IST
శర్వానంద్ హీరోగా వస్తోన్న యాక్షన్ డ్రామా 'రణరంగం'. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణిప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో పబ్లిక్ టాక్ వనండి. | 0business
|
Everybody Wants India-England Final: Kohli
ఇంగ్లాండ్తో ఫైనల్లో భారత్ ఢీకొంటే..?
సెమీ ఫైనల్లో ఎవరితో ఆడుతున్నామనేది ముఖ్యం కాదు. టోర్నీలో అన్ని మ్యాచ్లు ఆసక్తికరంగానే సాగుతున్నాయి.
TNN | Updated:
Jun 13, 2017, 03:58PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ,ఇంగ్లాండ్ ఢీకొంటే పోరు రసవత్తరంగా ఉంటుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ఇంగ్లాండ్ మెరుగ్గా ఆడుతోందని.. అలాంటి జట్టుతో భారత్ ఢీకొట్టాలని అభిమానులు కోరుకుంటున్నట్లు కోహ్లి వివరించాడు. బుధవారం జరగనున్న తొలి సెమీ ఫైనల్లో పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ తలపడనుండగా.. గురువారం రెండో సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ అమితుమీ తేల్చుకోనుంది. టోర్నీ ఫైనల్ ఆదివారం జరగనుంది.
‘సెమీ ఫైనల్లో ఎవరితో ఆడుతున్నామనేది ముఖ్యం కాదు. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. ఫైనల్ చేరాలంటే భారత్ ఇక ఒక మ్యాచ్ గెలవాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ భారత్ -ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ జరగాలని కోరుకుంటున్నారు. రెండు జట్లు టోర్నీలో ఇప్పటి వరకు చాలా బాగా ఆడాయి. అభిమానులు కోరుకుంటున్నట్లు ఫైనల్ జరిగితే బాగుంటుంది’ అని కోహ్లి ఆశాభావం వ్యక్తం చేశాడు. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
BOPANNA
సెలక్షన్ తీరు ఆశ్చర్యానికి గురి చేసింది: బోపన్న
న్యూఢిల్లీ: తనను భారత డేవిస్ కప్ జట్టు నుంచి తప్పించడంపై టెన్నిస్ ఆటగాడు బోపన్నత ఆగ్రహం వ్యక్తం చేశాడు.అసలు భారత డేవిస్ కప్ జట్టు నుంచి ఎందుకు తప్పించారో వివరణ ఇవ్వాలంటూ ప్రశ్నించాడు.డేవిస్ కప్కు అఃల భారత టెన్నిస్ సంఘం(ఎఐటిఎస్) సెలక్షన్ తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని బోపన్న ర్యాంకుల ప్రాతిపదికన ఆటగాళ్లను ఎంపిక చేయకపో వడాన్ని తప్పబట్టాడు.ఐటాకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని ఎంపిక చేసి మిగతావారిపై వేటువేయడం ఎంతవరకు సమం జసమని నిలదీశాడు.అయితే దీనిపై భారత డేవిస్ కప్ కోచ్,సెలక్షన్ కమిటీ సభ్యుడు జీషన్ అలీ మాత్రం ఇందులో ఎటువంటి తప్పిదం జరగలేదన్నారు.ప్రతిసారీ సెలక్టర్లు ర్యాంకుల ఆధారంగా ఆటగాళ్ల ఎంపిక చేయాల్సిన అవరసం లేదంటూ సర్దుకునే యత్నం చేశారు.
న్యూజిలాండ్తో పోరుకు ఎవరైతే ఖచ్చితంగా కుదురుతారో వారినే ఎంపిక చేసిసట్లు జీషన్ పేర్కొన్నాడు.అయిదుగురు సభ్యులతో కూడిన భారత డేవిస్ కప్ జట్టులో బోపన్నకు స్థానం దక్కలేదు. ఇందులో లియాండర్ పేస్,సాకేత్ మేనేని,రామ్ నాథన్ రామ్ కుమార్ ప్రజ్ఞేష్ గున్నేశ్వరన్,యుకీ బాంబ్రీలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లతో పాటు ఇద్దరు డబుల్స్ స్పెషలిస్టు లను ఎఐటిఎ ఎంపిక చేసింది.ఇక్కడ వ్యక్తిగత డబుల్స్ ర్యాంకింగ్స్లో లియాండర్ 59వ ర్యాంకులో ఉండగా,బోపన్న 28వ ర్యాంకులో ఉన్నాడు. డేవిస్ కప్ అర్హతలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పుణేలో జరిగే ఆసియా ఓసియానియా టోర్నీ న్యూజి లాండ్తో అమీతుమీ తేల్చు కోనుంది. | 2sports
|
Virak kohli in world's best t20 team
వరల్డ్స్ బెస్ట్ టి20 టీములో కోహ్లీ
విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు
TNN | Updated:
Jun 18, 2016, 08:23PM IST
భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఏర్చికూర్చిన ప్రపంచపు ఉత్తమ 20-20 జట్టులో కోహ్లీకి స్థానం లభించింది. కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్ కూడా ఈ గౌరవం పొందడం విశేషం. ట్వంటీ ట్వంటీ మ్యాచుల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన ఆయా దేశీయ జట్లకు చెందిన క్రికెటర్లతో ఈ జట్టు రూపొందింది. ఆండ్రూ రసెల్ , డారెన్ బ్రావో, మిషెల్ స్టార్క్, సునీల్ నరైన్, షేన్ వాట్సన్ లాంటి క్రికెటర్లు ఈ జాబితాలో స్థానం పొందారు. ఇదిలా ఉండగా క్రిస్ గేల్, బ్రెండన్ మెక్ కలంలు ఉత్తమ ఓపెనింగ్ జోడీగా వార్న్ పేర్కొన్నాడు. | 2sports
|
ఆదాయపు పన్నుపరిమితి పెంపుతో
సగటుజీవికి ఊరట
న్యూఢిల్లీ, డిసెంబరు 20: పెద్దనోట్ల చెలామణి రద్దుతో ఎదురవుతున్న అప వాదులను అధిగమించడంతోపాటు ఆర్థికవృద్ధిపరంగా దేశం ముందుకు వెళు తున్నందున ఈసారి బడ్జెట్లో పన్నుపరిమితులను కూడా సడలించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి వచ్చే ఏడాది బడ్జెట్లో కేంద్రం ఆదాయపు పన్ను పరిమితులను పెంచనున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ విశ్లేషణ సంస్థ సిఎల్ఎస్ఎ విశ్లేషించింది. ప్రస్తుతం 2.5 లక్షలవరకూ ఉన్న పరిమితిని ఇకపై నాలుగు లక్షల రూపాయలకు పెంచు తారని రూ.4నుండి రూ.10 లక్షల వరకూ ఉన్న పరి మితిలో పన్ను పదిశాతం, 10-15 లక్షల రూపా యల శ్లాబ్లో 15శాతం, 15-20 లక్షల పరిధిలో 20శాతం పన్నులు చెల్లిస్తారు. 20 లక్షల రూపాయలకుపైబడిన వర్గాల పన్నులు 30శాతంగా ఉంటాయని సిఎల్ఎస్ఎ ఆర్థికవేత్త రాజీవ్ మాలిక్ వెల్లడించారు. వ్యక్తిగత ఆదాయపరిమితి ని కూడా పెంచింది. గ్రామీణ భారత్కు ఈసారి బడ్జెట్లో మంచి ప్రోత్సాహకాలు ఉండవచ్చని అంచనా. సమీపభవిష్యత్తులో ఈ కరెన్సీరీకాల్ మొత్తం ఇప్పటివరకూ ఉన్న ప్రతికూల భావనను తుడిచివేస్తుందని, కార్పొరేట్ల డిసెంబరు ఆర్థిక ఫలితాలు మరికొంత వాస్తవ స్థితిని తెలియజేస్తాయని మాలిక్ వెల్లడించారు. రెండు త్రైమాసికాలపాటు పెద్దనోట్ల రద్దుప్రభావం కొనసాగుతుందని, జిడిపి వృద్ధి అంచనా 2017 ఆర్థికసంవత్సరానికి 1.2 పర్సంటేజి పాయింట్లు తగ్గి 6.5శాతంగా ఉండవచ్చని సిఎల్ఎస్ఎ రాజీవ్ మాలిక్ వెల్లడించారు. ప్రస్తుతం నోట్లరద్దుతో నెలకొన్న అస్తవ్యస్థ స్థితి 2018 ఆర్థిక సంవత్సరానికి కూడా కొంత ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం నరేంద్రమోడీ ప్రభుత్వం బేస్ ఆదాయపు పన్నుపరిమితిని పెంచాలని చూస్తోందన్నారు. కొత్త పన్ను ప్రతిపాదనలు అమలయితే పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఊరట లభిస్తుందని అంచనా. అయితే ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫ్రాంక్ నూరాన్హా ఈ నివేదికను తిరస్కరించారు. కొత్త ఆదాయపు పన్ను శ్లాబులేవీ ఉండ బోదన్నారు. ఇవి ఊహాజనిత వార్తలని, నిరాధారమైనవని కొట్టిపారేశారు. అయితే ఈ నెల 14వ తేదీ కేంద్ర ఆర్థికమంత్రి మాత్రం ఈసారి బడ్జెట్ లో సగటుజీవికి కొంత ఊరట లభి స్తుందన్న సంకేతాలిచ్చారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రేట్లపరంగా కొంత సానుకూలత ఉంటుందని వివరించారు. కొత్తగా వచ్చిపడిన పెద్దనోట్ల రద్దుతో పన్ను పరిధి కూడా పెరిగింది. ఆర్బిఐ ఇప్పటికీ కొత్త నోట్ల జారీకి సంబంధించిన ప్రణాళికను పర్యవేక్షస్తోంది. రానున్న మూడువారాల్లో కొత్తనోట్ల చెలామణి పెరుగుతుందని అంచనా. నగదుపై ఆధారపడకుండా డిజిటల్వైపు అవగాహనపెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందుకు పలు ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. డిజిటల్లోనికి వస్తే వెనువెంటనే పన్ను చట్రంలోనికి వస్తారన్నది ప్రభుత్వ వ్యూహంగా ఉంది. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చిన బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్.. బంతిని లాప్ట్ షాట్‌తో బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఆఫ్ స్టంప్‌కి దూరంగా పడిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని.. అతనికి అందకుండా వెనక్కి వెళ్లిపోయింది. క్షణాల వ్యవధిలో దాన్ని అందుకున్న వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వికెట్లని గీరాటేశాడు. దీంతో దాస్ నిరాశగా పెవిలియన్ బాట పట్టక తప్పలేదు.
అనంతరం నాలుగో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన సుందర్ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్ స్వీప్ షాట్‌కి ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. టర్న్ అవుతుందేమోనని భ్రమించి.. స్లాగ్‌లో బంతిని తరలించేందుకు స్వీప్ షాట్ ఆడగా.. అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లిన బంతిని లెగ్‌ స్టంప్‌ని గీరాటేసింది. స్ట్రైట్ డెలివరీని ఆడలేని తన అసమర్థతని తిట్టుకుంటూ.. సౌమ్య సర్కార్ క్రీజు విడిచాడు.
తర్వాత.. ఆరో ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్.. తమీమ్ ఇక్బాల్‌ని ఔట్ చేసిన విధానం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆఫ్‌ వికెట్‌పైకి వెళ్లి.. తమీమ్ స్వీప్ షాట్ కోసం ప్రయత్నించగా.. లెగ్‌స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని సుందర్ బంతిని విసిరాడు. దీంతో ప్రమాదాన్ని పసిగట్టి.. కొద్దిగా వెనక్కి జరిగినా.. అప్పటికే బంతి తమీమ్ శరీరానికి అత్యంత సమీపం నుంచి వెళ్లి లెగ్‌ స్టంప్‌ బెయిల్‌ని పడగొట్టింది. బంతి వెళ్లిన తీరుతో.. తమీమ్‌కి కాసేపు దిమ్మ తిరిగిపోయింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Sep 18,2017
నేడు గూగుల్ పేమెంట్స్ యాప్ ఆవిష్కరణ..
న్యూఢిల్లీ : ఇంటర్నెట్ దిగ్గజ సంస్థ గూగుల్ డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి ప్రవేశించనుంది. తేజ్ పేరుతో ఆ సంస్థ రూపకల్పన చేసిన పేమెంట్స్ యాప్ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆవిష్కరించనున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత చెల్లింపుల సేవల్ని కూడా ఈ యాప్ ద్వారా గూగుల్ అందించనుంది. త్వరలో వాట్సప్ కూడా డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి ప్రవేశించనుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 3, Jul 2019, 12:04 PM IST
Highlights
సర్వీస్ టాక్స్ చెల్లించని కేసుకు సంబంధించి నటుడు విశాల్ మంగళవారం ఎగ్మూర్ ఆదాయ నేరాల విచారణ న్యాయస్థానంకి హాజరయ్యారు.
సర్వీస్ టాక్స్ చెల్లించని కేసుకు సంబంధించి నటుడు విశాల్ మంగళవారం ఎగ్మూర్ ఆదాయ నేరాల విచారణ న్యాయస్థానంకి హాజరయ్యారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కేసు విచారణను ఆగస్ట్ 1వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నటుడు విశాల్ కోటి రూపాయల వరకు సర్వీస్ టక్స్ చెల్లించలేదని ఆదాయపన్ను శాఖ 2016 నుండి 2018 వరకు ఐదుసార్లు సమన్లు జారీ చేసింది. అయినా విశాల్ ఒక్కసారి కూడా నేరుగా హాజరు కాలేదు. ఆయన తరఫున ఆడిటర్ మాత్రమే హాజరయ్యారు. ఇందువల్ల ఆదాయపుపన్ను శాఖ విచారణకు నేరుగా హాజరు కావాలని చెన్నై ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలు చేసింది.
ఈ కేసు విచారణ కోసం విశాల్ గతేడాదిఅక్టోబర్ నెలలో కోర్టుకి హాజరయ్యారు. ఆ సమయంలో న్యాయమూర్తి ఆదాయపన్ను శాఖ సమన్లు జారీ చేసినా ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించగా.. కొన్ని అనివార్య కారణాల వలన హాజరుకాలేకపోయానని న్యాయమూర్తి వద్ద విశాల్ తెలిపారు.
చేసిన తప్పు ఒప్పుకుంటారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తాను ఏ తప్పు చేయలేదని, కోర్టులో నిరూపించుకుంటానని తెలపడంతో జూలై 2వ తేదీకి వాయిదా వేశారు. ఈ క్రమంలో మంగళవారం నాడు కేసు విచారణకు హాజరై తన వాదనలు వినిపించాడు విశాల్. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఆగస్ట్ 1వ తేదీకి కేసును వాయిదా వేశారు.
Last Updated 3, Jul 2019, 12:04 PM IST | 0business
|
Sep 16,2018
బీఎండబ్ల్యూ నుంచి సెల్ఫ్డ్రైవ్ బైక్!
న్యూఢిల్లీ: జర్మ నీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బివేరియన్ మోటర్్ వర్క్స్ (బీఎండబ్ల్యూ) స్వయం చలిత ద్విచక్ర వాహనాన్ని (సెల్ఫ్ డ్రైవింగ్ బైక్) తయారు చేసింది. దాదాపు రెండేళ్లపాటు శ్రమించి 'ఆర్1200 జీఎస్' పేరిట ఈ బైక్ను సంస్థ తయారు చేసింది. ఈ ప్రోటోటైప్ మోడల్కు సంబంధించిన వీడియోను కంపెనీ శనివారం నాడు విడుదల చేసింది. మానవ ప్రయత్నం లేకుండానే ఈ బైక్ తానంతటన తనే స్టార్ట్ అవుతుంది. యాక్సిలేటర్ ద్వారా వేగాన్ని పెంచుకుంటుంది. ఆ తర్వాత వేగాన్ని తగ్గించుకొని తానంతట తానే బ్రేక్ వేసుకుంటుంది. స్టాండ్ కూడా వేసుకొని ఆగిపోతుంది. వీడియోలో కంపెనీ సేఫ్టీ ఇంజనీరు స్టీఫన్ హాన్స్ మాట్లాడుతూ మానవులు నడిపే బైకుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన మరిన్ని భద్రతా చర్యల గురించి తెలసుకోవడానికే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రోటోటైప్ మోడల్ను విడుదల చేశామని చెప్పారు. శాస్త్ర పరిశోధనల కోసం, వాణిజ్య అవసరాల కోసం ఈ బైక్ను రూపొందించినప్పటికీ ఇప్పట్లో ఈ బైకులు మార్కెట్లోకి రాకపోవచ్చని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రోటోటైప్ బైక్ ద్వారా బైకులు నడిపేటప్పుడు మానవులు చేసే తప్పిదాలు ఏమిటో తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కూడా ఇప్పటికీ ప్రయోగాల దశలోనే ఉన్న విషయం తెల్సిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Suresh 96 Views BANKOFINDIA
BANKOFINDIA
ముంబయి: బ్యాంక్ ఆఫ్ ఇండియా నికరలాభం రూ.87.71 కోట్లుగా నిలిచింది. జూన్30వ తేదీతో ముగిసిన
తొలిత్రైమాసికంలో కంపెనీ నికరలాభం నష్టాలనుంచి కోలుకుని లాభాల్లోనికి వచ్చింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో
రూ.741కోట్లుగా ఉంది. మార్కెట్నిపుణులు వాస్తవానికి 15.38 కోట్లు నష్టం వస్తుందని అంచనావేసారు. వారి అంచనాలు
తల్లకిందులయ్యాయి. బ్యాంకు స్థూల రానిబాకీలు మొత్తం అడ్వాన్సుల్లో చూస్తే 13.05శాతంగా ఉన్నాయి. అంతకుముందు
మార్చి త్రైమాసికంలో 13.22 శాతం, గత ఏడాది ఇదే కాలంలోని 13.38శాతంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఐదుశాతం పెరిగాయి. త్రైమాసిక ఫలితాల ప్రకటనతర్వాత ట్రేడింగ్ చురుకుగా జరిగింది. | 1entertainment
|
అయిదు బ్యాంకులకు ఆసరా!
- కష్టాల్లో ఉన్న బ్యాంకులకు మూలధన సాయం
- ఆంధ్రా బ్యాంకు 2,019 కోట్లు
- పరుగులు పెట్టిన పీఎస్బీల స్టాక్లు
ముంబయి: నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) బెడదకు ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకొనేందుకు గాను సర్కారు ముందుకు వచ్చింది. అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) దాదాపు రూ.11,336 కోట్ల మేర మూలధనం సాయం అందించడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్లు కూడా ఉన్నాయి. పీఎస్బీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి మూలధన కేటాయింపులు. ఈ కేటాయింపుల్లో నీరవ్ మోడీ మోసంతో అత్యధికంగా నష్టపోయిన పీఎన్బీ గరిష్టంగా రూ.2,816 కోట్లు, అలహాబాద్ బ్యాంకుకు రూ.1,790 కోట్లు, ఆంధ్రా బ్యాంకుకు రూ.2,019 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ.2,157 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.2,555 కోట్ల చొప్పున మూలధన సాయాన్ని సర్కారు సమకూర్చనుందని సమాచారం. ఈ బ్యాంకులు ప్రస్తుతం టైయర్-1 (ఏటీ-1) బాండు హోల్డర్లకు వడ్డీలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నాయి. తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్న బ్యాంకులకు తొలుత మూలధనం అందించాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పీఎస్బీలు మార్కెట్ల నుంచి రూ.50,000 కోట్లు సమీకరించడానికి ప్రణాళికలు రూపొందించుకున్న సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్లో స్టాక్స్ సందడి..
పీఎస్బీలకు కేంద్రం మూలధనం సమకూర్చనుందన్న అంచనాల్లో మంగళవారం పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాలు నమోదు చేశాయి. బ్యాంకు స్టాక్స్ 11 శాతం వరకు ర్యాలీ చేశాయి. కార్పొరేషన్ బ్యాంకు 10.88 శాతం, అలహాబాద్ బ్యాంకు 7.23 శాతం, పీఎన్బీ 6.57 శాతం, బీఓబీ6.38 శాతం, బీవోఐ 5.87 శాతం, కెనరా బ్యాంకు 5.71 శాతం, ఇండియన్ బ్యాంకు 5.04 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆంధ్రా బ్యాంకు 4.91 శాతం, దెనా బ్యాంకు 3.58 శాతం, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా 3.10 శాతం, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర 2.27 శాతం, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు 1.35 శాతం చొప్పున ర్యాలీని నమోదు చేశాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఆంధ్రా పాలిటిక్స్ లో కాలు పెడతానుంటున్న వాణివిశ్వనాథ్..రోజాపై సై
Highlights
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై వాణి విశ్వనాథ్ ఆసక్తి
చంద్రబాబు నాయుడు అంటే తనకు ఎంతో గౌరవం అంటున్న వాణి
నగరి నియోజకవర్గం నుంచి రోజాపై పోటీకి దిగేందుకు రెడీ అంటున్న వాణి
నైంటీస్ లో తెలుగు సినీ ప్రేక్షకులను ఊపేసిన హీరోయిన్ వాణి విశ్వనాథ్. తాజాగా సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వాణి.. రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి తనకు ఉందని, అయితే రాజకీయాల్లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటోంది. రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకొంటే మాత్రం టిడిపిలోనే చేరుతానని ఈ మళయాళ ముద్దుగుమ్మ అంటోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని చూపుతోంది. అయితే ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తుందనే విషయమై మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు.
జయజానకినాయకతో సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వాణీ విశ్వనాథ్ రాజకీయాలపై తనకున్న ఆసక్తిని వివరించారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉంది. కానీ, ఇప్పటి వరకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని గట్టిగా నిర్ణయం తీసుకొంటే మాత్రం తెలుగుదేశం పార్టీలోనే చేరతానని వాణీ విశ్వనాథ్ చెప్పారు. టీడీపీ సిద్ధాంతాలు, నాయకత్వం నచ్చాయని, అందుకే ఆ పార్టీలో చేరాలనుకుంటున్నానని వాణీవిశ్వనాథ్ ప్రకటించారు.
ఇప్పటికే కొంత మంది టిడిపి నాయకులు వచ్చి తనతో మాట్లాడారని.. సినిమా మేనేజర్ నగరి చలపతితో పాటు చాలామంది ఆ నియోజకవర్గ నాయకులు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇంకా రాజకీయాల్లో చేరికపై నిర్ణయం తీసుకోలేదని వాణీ విశ్వనాథ్ ప్రకటించారు. ఇక చంద్రబాబు నా అభిమాన నాయకుడు. ఒకసారి ఖచ్చితంగా ఆయన్ను కలుస్తాను. వాణి వల్ల పార్టీకి మేలు జరుగుతుందని ఆయన భావించి అవకాశం ఇస్తే కాదనను. ఒకవేళ ఇవ్వకున్నా బాధపడనని చెప్తోంది వాణీ విశ్వనాథ్.
మళయాళీ అయినా నన్ను ఆదరించింది తెలుగువారేనని.. అందుకే నాకు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం అని అంటోంది వాణి. అంతేకాదు, ఇండియాలో నాకు నచ్చిన గొప్ప నాయకుడు చంద్రబాబేనని, ఆయన నాయకత్వంలోనే పనిచేయాలనుకుంటున్నానని, అందుకే టిడిపిలో చేరాలనే ఆసక్తిని చూపుతున్నానని వాణీ విశ్వనాథ్ చెప్తోంది.
ఇదిలా వుంటే... చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టిడిపి అభ్యర్థిగా వాణీ విశ్వనాథ్ను బరిలోకి దింపుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే టిడిపిలో చేరిన తర్వాత ప్రత్యర్థి ఎవరైనా ఒక్కటేనని వాణీ విశ్వనాథ్ చెప్పారు. ఇంట్లో కానీ, జీవితంలో కానీ, రాజకీయాల్లో కానీ సరైన ప్రత్యర్థి లేకపోతే థ్రిల్ ఉండదన్నారు వాణీ విశ్వనాథ్. అంటే రోజాపై పోటీకి సై అంటోందనే కదా అర్థం. చూద్దాం. రోజా ముందు ఈమె ఏ మేరకు నిలబడుతుందో. రంగంలోకి దిగితేనే కదా తెలిసేది.
Last Updated 25, Mar 2018, 11:39 PM IST | 0business
|
Read Also: రికార్డ్ చేరువలో ఊహించని మరణం.. షాక్లో నాగార్జున
అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. ‘శివప్రసాద్ రెడ్డి నాకు ‘ముఠామేస్త్రి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని ఇచ్చారు. మంచి నిర్మాతగా, వ్యక్తిగా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. సాత్వికుడు, నాకు మంచి మిత్రుడైన ఆయన లేకపోవడం తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అన్నారు.
అంతకుముందు ట్విట్టర్లో అక్కినేని నాగార్జున శివప్రసాద్ రెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ని షేర్ చేశారు. అక్కినేని ఫ్యామిలీతో శివప్రసాద్ రెడ్డి మంచి అనుబంధం ఉంది. నాగార్జునతో 11 చిత్రాలను కామాక్షి మూవీస్లో నిర్మించారు శివప్రసాద్ రెడ్డి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘నా 33 సంవత్సరాల సినీ కెరియర్లో భాగమైన నా స్నేహితుడు, నిర్మాత డి శివ ప్రసాద్ రెడ్డిని కోల్పోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా అంటూ ట్వీట్ చేశారు నాగార్జున.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
ఎల్.టి.టి.ఇ. ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్
Highlights
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `ఒక్కడు మిగిలాడు`. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్కు ఆడియెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత మనోజ్ ఎల్.టి.టి.ఇ. నాయకుడు ప్రభాకరన్గా పవర్ఫుల్ పాత్రలో కనపడబోతున్నాడు.
మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని అజయ్ అండ్ర్యూస్ నౌతాక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్లు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ మాట్లాడుతూ `ఒక్కడు మిగిలాడు` చిత్రంలో వేలుపిళ్ళై ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్ ఫస్ట్లుక్ను విడుదల చేశాం. ఈ చిత్రం శ్రీలంకలోని 15 లక్షల మంది శరణార్థులు కోసం 1990లో జరిగిన యుద్ధ నేపథ్యంలో సాగుతుంది. మంచు మనోజ్గారు చాలా బాగా కో ఆపరేట్ చేశారు. ప్రభాకరన్ గెటప్కోసం వెయిట్ కూడా పెరిగాడు. వైజాగ్ దగ్గరలోని పరవాడ ప్రాంతంలో యుద్ధ సన్నివేశాలను 25 రోజుల పాటు చిత్రీకరించాం. మనోజ్ ఇనెటన్స్తో కూడిన యాక్షన్, డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమా మనోజ్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుంది` అన్నారు.
బ్యానర్ః ఎస్.ఎన్.ఆర్.ఫిలింస్ ఇండియా ప్రై.లి., న్యూ ఎంపైర్ సెల్యూలాయిడ్స్, ఆర్ట్ః పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రఫీః వి.కె.రామరాజు, ఎడిటర్ః కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లేః గోపీ మోహన్, మ్యూజిక్ః శివ నందిగామ, నిర్మాతః ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్, దర్శకత్వం-అజయ్ అండ్ర్యూస్ నౌతక్కి.
Last Updated 26, Mar 2018, 12:03 AM IST | 0business
|
Feb 01,2018
విస్తరణ బాటలో ఫ్యూజన్ హ్యుందాయ్
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: హ్యుందారు మోటార్ ఇండియా ఫ్యూజన్ హ్యుందారు రెండో షోరూంను ప్రారంభించింది. దీనిని మేడ్చల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నూతన షోరూంను హ్యుందారు ఇండియా ప్రాంతీయ సేల్స్ మేనేజర్ సలీమ్ అమీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక కార్ల కొనుగోలుదారుల కోసం హ్యుందారు ఇండియా పోర్ట్ఫోలియోలోని అన్ని సెగ్మెంట్ల కార్లను ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు. హ్యుందారు కార్లను ఇప్పటికే వినియోగిస్తున్న యాజమానులకు వాటి సేవలకు ఈ షోరూం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాగా ఈ కొత్త షోరూం తమ నెట్వర్క్ను భౌగోళికంగా మరింత బలోపేతం చేయనుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పార్ట్స్ అండ్ సర్వీస్ మేనేజర్ అమర్నాథ్¸, ఫ్యూజన్ హ్యుందారు మేనేజింగ్ డైరెక్టర్ రత్న ప్రభు పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
- ఏప్రిల్-అక్టోబరులో తగ్గిన వాహన విక్రయాలు.. కనిపించని పండుగ ప్రభావం
విక్రయాల్లో భారీ తగ్గుదలను నమోదు చేసిన వోక్స్వేగన్, రెనో, నిస్సాన్, స్కోడా కంపెనీలు
- ముడిచమురు ధరలు, వడ్డీ రేట్లు, అధిక ఇన్సురెన్స్, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులే కారణం
- వ్యాపార విస్తరణే లక్ష్యంగా చేతులు కలుపుతున్న దిగ్గజ సంస్థలు
- ఎస్యూవీల కోసం ఫోర్డ్-మహీంద్రా జట్టు.. ఉత్పత్తి సామర్థ్యం కోసం టయోటా - సుజుకీ ఒప్పందం
గతేడాది ఏప్రిల్ - అక్టోబరు నెలలతో పోలిస్తే, ఈ సంవత్సరం దేశంలోని 17 దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీల్లో తొమ్మిది వాహన తయారీ సంస్థల వాహన విక్రయాల్లో భారీ తగ్గుదల నమోదైనట్టు ఎస్ఐఏఎం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వోక్స్వేగన్, రెనో, నిస్సాన్, స్కోడా సంస్థలు తమ అమ్మకాల్లో క్షీణతను నమోదు చేయడం గమనార్హం. ఈ ఏడు నెలల కాలంలో వోక్స్వేగన్ విక్రయాలు 24.28శాతం తగ్గగా (విక్రయం - 21,367 యూనిట్లు), రెనో ఇండియా 26.17శాతం(విక్రయం - 47,064 యూనిట్లు), నిస్సాన్ మోటార్స్ 26.81శాతం (విక్రయం - 22,905 యూనిట్లు), స్కోడా ఇండియా 1.48 శాతం(విక్రయం - 9,919యూనిట్లు), ఇసుజీ మోటార్స్ 18.32శాతం (విక్రయం - 1,248యూనిట్లు), ఫియాట్ ఇండియా విక్రయాలు ఏకంగా 69.9శాతం (481 యూని ట్లు) క్షీణతను నమోదు చేశారు. కాగా, దసరా - దీపావళి సీజన్లో రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందనుకున్న దేశీయ వాహనరంగం కేవలం 1.55శాతం(అక్టోబర్ మాసం) వృద్ధితో ఉసూరుమనిపించింది. ఐతే, గత ఏడాది దసరా, దీపావళి పండుగల సందర్భంగా కొనుగోళ్ల ఆసక్తి తోడవడంతో దేశీయ ఆటోరంగం రెండంకెల వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే!
కారణాలెన్నో !
ముడిచమురు ధరలు పెరగడం, వడ్డీ రేట్లు, అధిక ఇన్సూరెన్స్ పాలసీలు, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, పలు చోట్ల లోటు వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు, సెంటిమెంట్ తదితర కారణాలు దేశీయ వాహన విక్రయాలపై ప్రభావం చూపినట్టు సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఈ కారణం చేతనే ప్రముఖ వాహన తయారీ సంస్థలు సైతం ఒక్క అంకె వృద్ధిరేటు లేదా నెగెటివ్ వృద్ధిరేటును నమోదు చేసే పరిస్థితులు వచ్చాయని వాళ్ళు పేర్కొంటున్నారు. గత రెండు దశాబ్దాలుగా భారత విపణిలో అమ్మకాలు సాగిస్తున్న అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (జీఎం) అమ్మకాల్లో ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేక గత సంవత్సరమే తన విక్రయాలను నిలిపివేయడం తెలిసిందే! ఇక, భారత్ సహా ఇతర విపణుల్లో వాహనాల విక్రయాలను పెంచు కొనుటకు ప్రముఖ దిగ్గజాలు చేతులు కలపడం విశేషం. వినూత్న స్పోర్ట్ యుటిలిటీ వాహనాల(ఎస్యూవీ) తయా రీలో మరింత ముందుకు వెళ్ళడానికి ఫోర్డ్, మహీంద్రాలు ఒప్పందం చేసుకోగా.. వ్యాపార విస్తరణ, కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా బెంగళూరు నగర శివారులోని టయోటా ప్లాంట్ లో సుజుకీ సంస్థ 10 లక్షల అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం గమనార్హం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
చివరి రెండు వన్డేలు.. కివీస్ జట్టులోకి డేంజరస్ ఆల్రౌండర్
ఇప్పటికే 0-3 తేడాతో భారత్కు సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ తుది రెండు వన్డేలకు రెండు మార్పులు చేసింది. లంకపై సత్తా చాటిన నీషామ్తోపాటు టాడ్ ఆస్ట్లేకు చోటు కల్పించింది.
Samayam Telugu | Updated:
Jan 28, 2019, 06:46PM IST
వన్డే సిరీస్ను ఇప్పటికే భారత్కు సమర్పించుకున్న న్యూజిలాండ్ .. చివరి రెండు వన్డేలకు జట్టులో రెండు మార్పులు చేసింది. ఇష్ సోధీ, బ్రాస్వెల్ను జట్టు నుంచి తప్పించిన కివీస్.. వారి స్థానంలో జేమ్స్ నీషామ్ , టాడ్ ఆస్ట్లేలకు అవకాశం కల్పించింది. గాయం కారణంగా వీరిద్దరూ తొలి మూడు వన్డేలకు దూరమయ్యారు. వరుసగా మూడు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడి సిరీస్ కోల్పోయిన కివీస్.. చివరి రెండు వన్డేల్లోనైనా గెలుపొంది పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
ఏడాదిన్నర విరామం తర్వాత క్రికెట్లోకి అడుగుపెట్టిన నీషామ్.. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో సత్తా చాటాడు. ఆఖరి ఓవర్లలో బ్యాట్తో చెలరేగి న్యూజిలాండ్కు మెరుపు వేగంతో భారీ స్కోరు అందించాడు. లంకపై మూడు వన్డేల్లో 47*, 64, 12* చొప్పున పరుగులు చేసిన ఈ ఆల్రౌండర్ ఆరు వికెట్లు కూడా పడగొట్టాడు. | 2sports
|
Hyderabad, First Published 14, Aug 2018, 12:37 PM IST
Highlights
అయితే ఈ ఒక్క సీన్ మాత్రమే కాకుండా.. క్లైమాక్స్ లో హీరోయిన్.. హీరోని ముద్దాడే సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సన్నివేసాలు లీక్ అవ్వడంతో యూత్ లో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి
విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుండి కూడా ఈ సినిమా లవ్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అంటూ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఈ సినిమా నుండి లీక్ అయిన కొన్ని సన్నివేశాలు మాత్రం ఆశ్చర్యానికి గురి చేశాయి. 'అర్జున్ రెడ్డి' సినిమాలో మాదిరి ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్స్ లో నటించాడు.
బస్ లో ప్రయాణించే సమయంలో హీరో, హీరోయిన్ మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంటుందట. దానికి సంబంధించిన సీన్ లీక్ అయింది. అయితే ఈ ఒక్క సీన్ మాత్రమే కాకుండా.. క్లైమాక్స్ లో హీరోయిన్.. హీరోని ముద్దాడే సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సన్నివేసాలు లీక్ అవ్వడంతో యూత్ లో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఇవి డిలీటెడ్ సీన్స్ అని, సినిమాలో మాత్రం ఈ సీన్స్ కనిపించవని అంటున్నారు.
కొందరేమో ఈ లిప్ కిస్ సీన్ తో సినిమాకు ఎండ్ కార్డు పడుతుందని అంటున్నారు. ఏదేమైనా.. ఈ సినిమాలో యూత్ ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయనే విషయం క్లియర్. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి! | 0business
|
sandhya 399 Views AUS vs BAN , usman khawaja , warner
usman khawaja
నాటింగ్హామ్: ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెడుతుంది. డేవిడ్ వార్నర్ 166 పరుగులు చేసి ,సౌమ్య సర్కార్ బౌలింగ్లో రూబెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 45 ఓవర్లలో ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా(85), గ్లెన్ మాక్స్వెల్(13)లు ఉన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/ | 2sports
|
Suresh 96 Views NARAYANA MURTHY
NARAYANA MURTHY
బెంగళూరు, ఆగస్టు 3: సాఫ్ట్వేర్రంగంలో రెండో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్లోమరోసారి
అంతర్గత యుద్ధం ప్రారంభం అయింది. ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులకు, సంస్థ వ్యవస్థాపకులకు మధ్య లుకలుకలు
పెరిగిపోయాయి. పనాయా కొనుగోలుకు సంబంధించిన విచారణ నివేదికను బహిర్గతంచేయాలంటే వ్యవస్థాపకులు
ఎన్ఆర్ నారాయణమూర్తి ఇటీవల బోర్డు సభ్యులకు రాసిన లేఖతో మళ్లీ వివాదాలకు నాందిపలికింది.
200 మిలియన్ డాలర్లతో కొనుగోలుచేసిన పనాయా పరంగా అక్రమాలు చోటుచేసుకున్నాయని మార్కెట్ నియంత్రణ
సంస్థ సెబీ ఆరోపించింది. సెబీ ఆరోపణలపైనా,మాజీ సిఎఫ్ఒ రాజీవ్ బన్సాల్ సీవరేన్స్ ప్యాకేజి పరంగాతలెత్తిన
వివాదం విషయంలో ప్రస్తుత సిఇఒకు అత్యధిక వ్యయాల ఆరోపణల విషయంలోనూ కంపెనీ అంతర్గతంగా
విచారణచేపట్టింది. జూన్లోనే వీటిపై తుది నివేదికను ప్రచురించింది. పనాయా కేసు, సిఇఒ వ్యయాలువంటి
విషయాల్లో వచ్చినారోపణల్లో ఎలాంటి నిర్ధారణ లేదని గిబ్సన్డన్ అండ్క్రుచర్ అనే న్యాయసంస్థ కూడా ఉటంకించింది.
కానీ మొత్తం నివేదికలను బహిర్గతం చేయాలని నారాయణమూర్తి డిమాండ్చేస్తున్నారు. కంపెనీ పారదర్శకత,
జవాబుదారీతనంకోసం ఈనివేదికను అందించాలని ఆయనకోరుతున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు.
అయితే ఈనివేదికనుప్రజలముందుకు తెచ్చేందుకు కంపెనీ సుతరాము అంగీకరించడంలేదు. ఈ నివేదికబహిర్గతంచేస్తే
పనాయా ఇన్వెస్టర్లకు, అందులోనిరిమిత భాగస్వాములకు మధ్య ఉన్న క్లయింట్ రహస్యమైన ఒప్పందాలను
ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. ఇప్పటివరకూ ఇన్ఫోసిస్ కొనుగోలుచేసిన వాటిలోపనాయా
అతిపెద్ద డీల్గా అభివర్ణిఇంచారు. దీనితో మరోసారి కార్పొరేట్ సుపరిపాలన పరంగా ఇన్ఫోసిస్ బోర్డుసభ్యులకు,
వ్యవస్థాపకులకు మధ్య మరో వివాదం తలెత్తినట్లు స్పష్టం అవుతోంది. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కబాలి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసిందా ?
ఇటీవలే రిలీజైన కబాలి మూవీ టీజర్ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసింది. దీంతో ఈ సినిమాపై అటు..
TNN | Updated:
May 13, 2016, 07:02PM IST
ఇటీవలే రిలీజైన కబాలి మూవీ టీజర్ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసింది. దీంతో ఈ సినిమాపై అటు ఆడియెన్స్లో ఇటు మార్కెట్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. గతంలో ఈ సినిమాని జూన్ నెలలోనే రిలీజ్ చేయాలని భావించారు ఈ సినిమా దర్శకుడు పా రంజిత్ , నిర్మాత కలైపులి ఎస్ థాను . కానీ అది కుదరకపోవడంతో జులై 7న సినిమా విడుదలకి ముహుర్తం సెట్ చేసుకోవాలని అనుకున్నారు. అయితే, అదే సమయంలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా విడుదల కానున్నందున తమ సినిమాని ఓ వారం రోజుల ముందే రిలీజ్ చేయాలని తాజాగా మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అంటే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం జులై1నే కబాలి ఆడియెన్స్ ముందుకు వస్తాడన్నమాట.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో వున్న ఈ సినిమాలో తైవానీస్ నటుడు విన్స్టన్ చావో కూడా నటించాడు. తన పార్ట్ డబ్బింగ్ చెప్పడం కోసం బుధవారమే విన్స్టన్ చెన్నైకి వచ్చాడు. | 0business
|
Hyd Internet 111 Views stock markets ended with loses
stock-loss
ముంబాయి: ఉత్తరకొరియా చేపడుతున్న వరుస క్షిపణి దాడులు, అణు పరీక్షల ప్రభావం, రోజురోజు పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో
స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తుంది. దీని ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై కూడా అధికంగానే ఉంది. ఈ క్రమంలో బుధవారం
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 148 పాయింట్లు నష్టపోయి 31,662 వద్ద, నిఫ్టీ 36పాయింట్లు నష్టపోయి 9,916కు చేరింది.
మరోవైపు అగస్టు 16తర్వాత అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రూ.64.26కు పడిపోయింది. | 1entertainment
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
గంగూలీ సీఎం కావాలేమో..?: పాక్ మాజీ క్రికెటర్
పుల్వామా దాడి తర్వాత భారత్ వ్యవహరిస్తున్న తీరుపై మాకేమీ చింతలేదు. పాకిస్థాన్ ఎప్పుడూ భారత్తో శాంతిపూర్వక సంబంధాల కోసం ప్రయత్నిస్తోంది. కానీ.. ప్రతిసారి భారత్ నెగటివ్గానే స్పందిస్తోంది. - పాకిస్థాన్ మాజీ బ్యాట్స్మెన్ జావెద్ మియాందాద్
Samayam Telugu | Updated:
Feb 23, 2019, 12:18PM IST
గంగూలీ సీఎం కావాలేమో..?: పాక్ మాజీ క్రికెటర్
హైలైట్స్
పాక్తో అన్ని క్రీడల్ని బహిష్కరించాలని భారత్కి సూచించిన గంగూలీ
ఎన్నికల్లో పోటీ చేయాలని గంగూలీ ఆశిస్తున్నాడంటూ మియాందాద్ వ్యాఖ్య
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలు
జూన్ 16న భారత్, పాకిస్థాన్ ఢీ
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ‘మ్యాచ్ బహిష్కరణ’ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ఘాటుగా స్పందించాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రపంచకప్లో పాక్తో మ్యాచ్ను బహిష్కరించాలని సూచించిన గంగూలీ.. ఒక్క క్రికెట్ అనే కాదు.. హాకీ, ఫుట్బాల్ తదితర గేమ్స్ దాయాది దేశంతో భారత్ ఆడకూడదని సూచించాడు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16 భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. | 2sports
|
internet vaartha 165 Views
ముంబై : భారతీయ రూపాయి మారకం విలువలు డాలరుతో పోలిస్తే 68 రూపాయలకు దాటాయి. రూపాయి మరో 28 పైసలు క్షీణించి 68.26 రూపాయలుగా చెలామణీ అవుతోంది. వరుసగా మూడోరోజు కూడా పతనం అవుతోంది. ఇంటర్బ్యాంకు ఫారిన్ ఎక్ఛేంజి రేట్లను పరిశీలిస్తే రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు అమెరికన్ యూనిట్లనుంచి డాలర్కు డిమాండ్ రావడం, దిగుమతిదారులు, బ్యాంకులు కూడా డాలర్లకు డిమాండ్ పెంచడంతో రూపాయి విలువలు మరింతగా క్షీణించాయి. వీటికితోడు ఈక్విటీ మార్కెట్లనుంచి మూలధన నిధులు వెనక్కు తరలడం కూడా డాలర్ రూపంలో ఒత్తిడిని పెంచింది. అయితే కొంత ఇతరదేశాల్లో డాలర్ క్షీణత రూపాయి మారకం విలువలను కట్టడిచేసింది. ముందురోజు ట్రేడింగ్లో డాలరు రూపాయి మారకం విలువల్లో రూపాయి విలువలు 14పైసలు క్షీణించి 67.98 పాయింట్లుగా ఉంది. రిజర్వు బ్యాంకు తన కీలకవడ్డీరేట్లను స్థిరంగా ఉంచడం కూడా కరెన్సీ మార్కెట్పఐ కొంత ప్రభావం చూపించింది. ఇదిలా ఉండగా బిఎస్ఇ సెన్సెక్స్కూడా ప్రారంభంలో కొంతమేర నష్టాలనే ఎదుర్కొన్నది. | 1entertainment
|
శ్రీరెడ్డిని అంత ఈజీగా వదలడేమో..!
Highlights
నాని విషయంలో శ్రీరెడ్డి చేసిన ఆరోపణల సంగతి తనముందు ప్రస్తావనకు వచ్చినప్పుడే విశాల్.. శ్రీరెడ్డిపై సీరియస్ అయ్యాడు. ఎలాంటి అధరాలు లేకుండా నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడతారు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు
కాస్టింగ్ కౌచ్ పై పోరాటమంటూ వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి తనను చాలా మంది మోసం చేశారంటూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో చాలా మంది హీరోలు, దర్శకులపై నోటికొచ్చినట్లు కామెంట్లు చేసింది. ఒక స్టేజ్ వరకు ఆమెను భరించిన టాలీవుడ్ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో తన ఉనికిని కాపాడుకోవడం కోసం కోలీవుడ్ తారలు కూడా తనను మోసం చేశారంటూ కొత్త కథ ప్రారంభించింది.
ఈ క్రమంలో డైరెక్టర్ సుందర్ సి, రాఘవ లారెన్స్, శ్రీకాంత్, మురుగదాస్ వంటి తారల పేర్లు చెప్పింది. వీరంతా తనకు అవకాశాలు ఇప్పిస్తానని వాడుకున్నట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పడం స్టార్ట్ చేసింది. టాలీవుడ్ లైట్ తీసుకున్నప్పటికీ కోలీవుడ్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. నాని విషయంలో శ్రీరెడ్డి చేసిన ఆరోపణల సంగతి తనముందు ప్రస్తావనకు వచ్చినప్పుడే విశాల్.. శ్రీరెడ్డిపై సీరియస్ అయ్యాడు.
ఎలాంటి అధరాలు లేకుండా నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడతారు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అలాంటిది ఈసారి ఏకంగా కోలీవుడ్ ఇండస్ట్రీనే టార్గెట్ చేసిన శ్రీరెడ్డిని విశాల్ ఎలా ఎదుర్కోబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తిగ మారింది. ఇప్పటికే విశాల్ ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే దానిపై చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. నడిగర్ సంఘం తరఫున విశాల్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!
Last Updated 17, Jul 2018, 3:47 PM IST | 0business
|
రియాలీటీ షో లో మైనర్ బాలికను కిస్ చేస్తు దొరికిన సింగర్ (వీడియో)
Highlights
రియాలీటీ షో లో మైనర్ బాలికను కిస్ చేస్తు దొరికిన సింగర్
అస్సామీ సింగర్ అంగరాగ్ పపన్ మహంత ఓ మ్యూజిక్ రియాల్టీ షో లో ప్రవర్తించి తీరు వివాదం కొనితెచ్చుకున్నాడు. ఈ షో లో ఇతగాడు ఓ జూనియర్ కంటెస్టెంట్ కి కిస్ ఇచ్చిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది.తన ఫేస్ బుక్ పేజ్ లో పపన్ ఈ వీడియోను పోస్ట్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ది వాయిస్ ఆఫ్ ఇండియా కిడ్స్ సీజన్-2 లో జ్యూరీ మెంబర్ గా పాల్గొన్న పపన్.. మైనర్ బాలిక పట్ల ప్రవర్తించిన తీరు అసభ్యంగా ఉందంటూ సుప్రీంకోర్టు లాయర్ రూనా భుయాన్ జాతీయ బాలల హక్కుల కమిషన్ కు లేఖ రాశారు.
Last Updated 25, Mar 2018, 11:57 PM IST | 0business
|
Suresh 92 Views
లియాండర్ పేస్పై నాదల్ ప్రశంస
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్పై స్పెయిన్ బుల్ రపెల్ నాదల్ ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా పురుషుల డబుల్స్ టెన్నిస్లో లియాండర్ పేస్ ఒక గొప్ప ఆటగాడని కొనియాడాడు.టెన్నిస్ చరిత్రలో ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న లియాండర్ పేస్తో తలపడటం తాను అరుదైన గౌరవంగా భావిస్తున్నానని నాదల్ పేర్కొన్నాడు.డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్లో జరిగిన డబుల్స్ మ్యాచ్లో నాదల్-మార్క్ లోపెజ్ జంట 4-6,7-6(7 2),6-4,6-4తో లియాండర్ పేస్-సాకేత్ మైనేనీ జోడీపై విజయం సాధించింది.కాగా మూడు గంటలకు పైగా సాగిన ఈ పోరులో భారత జంట పోరాడి ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్ అనంతరం పేస్ను నాదల్ ప్రత్యేకంగా అభినందించాడు. లియాండర్ పేస్ గొప్ప మ్యాచ్ ఆడాడు,మ్యాచ్ బాగా జరిగింది,ఈ మ్యాచ్ చాలా కఠినమైన మ్యాచ్. లియాండర్ పేస్ జంట చాలా బాగా ఆడింది లియాండర్ పేస్ దేశంలో అతనితో కలిసి ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా,డబుల్స్ విభాగంలో అతి పెద్ద స్లార్లలో పేస్ ఒకడు.టెన్నిస్ చరిత్రలో లియాండర్ ఎంతో మెరుగైన ఆటగాడని నాదల్ ప్రశంసించాడు. | 2sports
|
internet vaartha 129 Views
ఎన్ఎస్ఇ, బిఎస్ఇల్లో మంచి రిటర్నులు
ముంబై : బాంబేస్టాక్ ఎక్ఛేంజిలోని మిడ్క్యాప్ సూచి 26శాతం వరకూ పెరిగింది. పార్లమెంటులో గత ఫిబ్రవరి నెలలో ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ అనంతరం అద్వితీయంగా పెరుగుదల నమోదయినట్లు నిపుణుల అంచనా. బిఎస్ఇ మిడ్క్యాప్, ఎన్ఎస్ఇ మిడ్క్యాప్ 100 సూచీలు జీవితకాల గరిష్ట స్థాయికి చేరాయి. సోమవారం ఇంట్రాడే డీల్స్లో మరింతపెరిగాయి. మార్కెట్ మొత్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా కనిపించింది. బిఎస్ఇ మిడ్క్యాప్ సూచీ మార్కెట్లలో ర్యాలీతీసి 26శాతానికి పెరిగింది. నిఫ్టీ 50 సూచీ కూడా 20శాతంగా ఉంది. ఎస్అండ్పి బిఎస్ఇ సెన్సె క్స్ 20శాతం, నిఫ్టీ21శాతం పెరిగినట్లు అంచనా. బిఎస్ఇ మిడ్క్యాప్ సూచి 159 పాయింట్లు బలపడి 1.3శాతం పెరిగింది. 12,039 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడే డీల్స్లో 470 పాయింట్ల వరకూ పెరిగింది. వ్యక్తిగత కంపెనీలపరంగాచూస్తే బజాజ్ ఫైనాన్స్, బెర్జర్ పెయింట్స్, జెఎస్డబ్ల్యుస్టీల్, మహీంద్ర అండ్ మహీంద్ర, కన్సా§్ు నెరొలాక్, శ్రీసిమెంట్లు భారీ ర్యాలీతీసాయి. ఇక నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీపరంగాచూస్తే జీవితకాగరిష్టస్థాయిని చేరి నట్లు నిపుణులు అంచనా. ఇటీవలి పతనం నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు మళ్లీ మార్కెట్లకు రావడంతో కొంత ఉపశమనం కలిగింది. ఆగస్టులో రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. దీని నుంచి మిడ్క్యాప్ విభాగం కంపెనీలకు ఎక్కువశాతం లాభం ఉంటుందని అంచనా. అయితే క్లయింట్లు కంపెనీ ప్రతిష్ట, చరిత్ర ఆధారంగా కొనుగోళ్లు చేయాలని బ్రోకరేజి సంస్థలు చెపుతున్నాయి. కాన్ఫిన్హోమ్స్, మన్పసంద్ బేవరేజెస్, జెన్సార్ టెక్నాలజీస్, ఎస్కార్ట్స్ వంటి స్టాక్స్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఆకర్షిస్తున్నాయి. వడ్డీరేట్లలో కోత ఉంటుందన్న ఆశలతో మార్కెట్లలో ర్యాలీ కనిపిస్తున్నది. అంతేకాకుండా జిఎస్టి బిల్లుకు వచ్చే వర్షా కాల పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం లభి స్తుందన్న అంచనాలున్నాయి. ఇక రానున్న త్రైమా సిక ఆర్థిక ఫలితాలు కూడా ఇన్వెస్టర్లకు మరికొంత ఊతం ఇస్తాయని, రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంత పెట్టుబడి వ్యయం పెరిగి మార్కెట్లకు కొంత ఊతం లభిస్తుందన్నది నిపుణుల అంచనాగా ఉంది. ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో మంచి పెరుగుదల ఉంందని, కార్పొరేట్ రాబడులు కూడా మెరుగుపరడతాయని అంచనా. ఐడిబిఐ కేపిటల్ రీసెర్చి హెడ్ ఎకె ప్రభాకర్ మిడ్క్యాప్స్లో ర్యాలీ మరింత పెరుగు తుందని 15 నుంచి 20శాతానికి చేరుతుందని ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ ర్యాలీ కనిపించిందన్నారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, సైయింట్, ఎన్బిసిసి, హిమత్సింగ్కా సీడ్, అర వింద్, సెంచరీ ప్లై, సుందర్ ఫాస్టనర్స్, సిటీయూనియన్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకులు వంటివి ఆకర్షణీయంగా మారినట్లు ఆయన పేర్కొన్నారు. | 1entertainment
|
Sep 20,2017
రూ.32వేల కోట్ల పెట్టుబడులు: ఎయిర్టెల్
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు టెల్కో భారతీ ఎయిర్టెల్ వచ్చే రెండేండ్లలో రూ.32,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొంది. తమ నెట్వర్క్ను విస్తరించుకోవడానికి ఈ వ్యయం చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా రెవెన్యూ మార్కెట్ వాటాలో మరో 3-4 శాతం పాయింట్లను పెంచుకోవాలని నిర్దేశించుకుంది. మార్కెట్లో ఇప్పటికే తీవ్ర పోటీని సృష్టించిన రిలయన్స్ జియోకు దీటుగా వివిధ టెల్కోలు కొత్త ప్రణాళికలు వేస్తున్నాయి. ఎయిర్టెల్ ప్రస్తుతం పెడుతున్న పెట్టుబడులతో డేటా నెట్వర్క్ను భారీగా విస్తరించనుంది. అంతేకాక వీటిని స్పెక్ట్రమ్ కొనుగోలుకు వెచ్చించనుంది. ఈ ఏడాది రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు మూలధనం ఖర్చు చేయనున్నట్టు ఆ కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. వచ్చే రెండేండ్లలో కూడా అంతేమొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
తేజ్ ఐలవ్ యూ.. ట్విట్టర్ రివ్యూ
Highlights
మరోసారి ప్రేమకథతో వచ్చిన కరుణాకరన్
తేజ్ ఖాతాలో మరో ప్లాప్..?
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సాయిథరమ్ తేజ్ ఒకరు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నాడు. మొదట్లో వరస హిట్లు కొట్టిన ఈ హీరో.. సరైన కథలను ఎంచుకోవడంలో విఫలమై.. వరస ప్లాపులను మూట గట్టుకున్నాడు. ఆ ప్లాప్ ఇమేజ్ ని తొలగించుకోవడానికి ఈసారి స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే తేజ్ ఐ లవ్ యూ.
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై కె.ఎస్.రామారావు నిర్మించిన.. కరుణాకరన్ డైరెక్టర్ చేసిన ‘తేజ్’ క్లీన్ యూ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ట్రైలర్, పాటలు కూడా.. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీపై అంచనాలు పెంచేశాయి. అనుపమ పరమేశ్వరన్.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పటికే పలువురు వీక్షించేశారు. వారి అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.
ప్రేక్షకుల ట్వీట్ల ప్రకారం.. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా.. తేజ్ ఐ లవ్యూ ప్రీమియర్ షోలను అమెరికాలో ఇప్పటికే ప్రదర్శించారు. అక్కడ సినిమా చూసిన వారు ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ను వినిపిస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు మొదలయ్యాయి. కొంతమంది మూవీ బావుందంటే.. కొందరు మాత్రం తేజ్ కాస్త నిరాశపరిచాడంటున్నారు.
హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించినప్పటికీ.. సినిమా మాత్రం నిరాశపరించిందనే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కరుణాకరన్.. రోటీన్ గా పాత కథనే మరోసారి చూపించే ప్రయత్నం చేశాడని వారి ట్వీట్ల ప్రకారం తెలుస్తోంది. పూర్తి రివ్యూ రావాలంటే మాత్రం మరికొద్ది సేపు ఆగాల్సిందే.
Last Updated 6, Jul 2018, 9:55 AM IST | 0business
|
మహానటుడితో జతకట్టనున్న మహానటి.?
Highlights
మహానటుడితో జతకట్టనున్న మహానటి.?
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఫస్ట్ లుక్ తోనే ఎనలేని క్రేజ్ తీసుకొచ్చేశాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ సినిమాపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా అని అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్-రామ్ చరణ్తో రాజమౌళి చిత్రమైతే ఖాయమే కానీ ఇప్పటి వరకూ ఒక్క అధికారిక ప్రకటన కూడా లేదు. కానీ ఈ చిత్రంపై ఇప్పటికే బోలెడన్ని ఊహాగానాలు. సినిమా అలా ఉంటుంది.. ఇలా ఉంటుందని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఒక హీరోయిన్ ఖరారైందని వార్తలు వస్తు్న్నాయి.
‘మహానటి’తో స్టార్ డమ్ సంపాదించిన నటి కీర్తి సురేష్. పవన్ కళ్యాణ్తో ‘అజ్ఞాతవాసి’లో నటించినప్పుడే ఈ అమ్మాయి స్థానం పెరిగిపోయింది. ఇప్పుడు ‘మహానటి’ హిట్తో తెలుగింటి అమ్మాయి అయిపోయింది. అయితే రాజమౌళి మల్టీస్టారర్లో కీర్తి సురేష్ నటిస్తోందన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఇందులో తారక్ కు జోడీగా ఆమెని తీసుకుంటున్నట్టు సమాచారం. అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఆమె పాత్ర ఫైనల్ అంటున్నారు.
Last Updated 27, Jun 2018, 10:18 AM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఆసీస్పై శతకంతో శివాలెత్తిపోయిన కౌర్..!
క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన హర్మన్ప్రీత్.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. తొలుత 64
TNN | Updated:
Jul 20, 2017, 09:40PM IST
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకి భారత్ గట్టి సవాల్ విసిరింది. మిడిలార్డర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (175 నాటౌట్: 116 బంతుల్లో 21x4, 7x6) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ వర్షం కారణంగా కుదించిన 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు, కెప్టెన్ మిథాలీ విఫలమవడంతో ఒకానొక దశలో భారత్ కనీసం 200 పరుగుల మార్కు కూడా చేరుకోలేదేమో అనిపించింది. కానీ.. హర్మన్‌ప్రీత్ కౌర్ భీకర హిట్టింగ్.. భారత్ చివరి 11 ఓవర్లలో ఏకంగా 139 పరుగులు రాబట్టి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఊహించని షాకిచ్చింది.
ఓపెనర్లు మంధానా (6), పూనమ్ రౌత్ (14) ఆదిలోనే పెవిలియన్ చేరిపోగా.. కెప్టెన్ మిథాలీ రాజ్ (36: 61 బంతుల్లో 2x4) క్రీజులో నిలిచినా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించలేకపోయింది. దీంతో భారత్ 25 ఓవర్లు ముగిసే సమయానికి 101/3తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఈ దశలో దీప్తి శర్మ (25: 35 బంతుల్లో 1x4)తో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన హర్మన్‌ప్రీత్.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. తొలుత 64 బంతుల్లో 50 పరుగులు చేసిన కౌర్.. అనంతరం 43 బంతుల్లోనే ఏకంగా 100 పరుగులు రాబట్టడం ఆమె హిట్టింగ్‌కి అద్దం పడుతోంది. ఈ క్రమంలోనే కెరీర్‌లో మూడో శతకం పూర్తి చేసుకున్న కౌర్ చివరి వరకూ అజేయంగా నిలిచింది. | 2sports
|
- 3 త్రైమాసికాల తరువాత మురిపెం..
- గతేడాదితో పోలిస్తే 69 శాతం క్షీణత
- 2.06 లక్షల కోట్లకు చేరువైన ఎన్పీఏలు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) దాదాపు తొమ్మిది నెలల తరువాత తిరిగి లాభాలను నమోదు చేసింది. మెరుగైన వడ్డీ ఆదాయంతో పాటు మేటి అసెట్ క్వాలిటీ నేపథ్యంలో సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఎస్బీఐ రూ.576 కోట్ల ఏకీకృత నికర లాభాలను నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే లాభంలో 69% క్షీణత నమోదు అయింది. అంతకు ముందు త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో) ఈ బ్యాంకింగ్ సంస్థ రూ.4,875.85 కోట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. స్టాండెలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర ఆదాయం 40 శాతం మేర కుంగి రూ.944.9 కోట్లుగా నమోదు అయింది. ఇతర ఆదాయాల్లో తగ్గుదల, నిరర్ధక ఆస్తుల సమస్యవల్ల నికర ఆదాయం తగ్గిందని సోమవారంనాడు ఎస్బీఐ వెల్లడించింది. ఇతర ఆదాయాల్లో ముఖ్యమైన కోర్ ఫీజు ఆదాయం 26.14శాతం తగ్గింది. గతేడాది ఈ ఆదాయం రూ. 10,579.91కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ. 7,814.50 కోట్లకు పడిపోయింది. కాగా, నిరర్ధక ఆస్తులు గతేడాదితో పోల్చితే 10.61శాతం పెరిగాయి. గతేడాది రెండో త్రైమాసికంలో ఎన్పీఏలు రూ. 1.86లక్షల కోట్లుగా ఉండగా, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రూ. 2.06లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ప్రొవిజన్లు రూ. 19,137.43 కోట్లుండగా, ఈ ఏడాది 36.81శాతం తగ్గి రూ.12, 092.17 కోట్లకు చేరాయి. రూ.868 కోట్ల పన్ను భారం కూడా బ్యాంకింగ్ ఆదాయంపై ప్రభావం చూపించది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 155 Views
న్యూఢిల్లీ : టి20 వరల్డ్ కప్పై ధోనీ సేన ఆశలు రేపుతుందని భారత క్రికెటర్ యూనుస్ పఠాన్ పేర్కొన్నాడు. కోహ్లీ, రోహిత్శర్మ దూకుడు మీద ఉండటం,ధోనీ సేనపై ఆశలు కలుగుతున్నా యన్నాడు.కాగా మరోసారి పొట్టి కప్పును ధోనీ సేన కైవసం చేసుకొని చరిత్ర తిరగరాస్తుందన్నాడు.2007లో టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో ఈ ఆల్రౌండర్ కూడా సభ్యుడి గా ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా ధోనీ సేన ఫామ్, యువత, అనుభవజ్ఞులత జట్టు మంచి సమతూకంలో ఉందని, దీనికి తోడు స్వదేశంలో వరల్డ్ కప్ ఆడుతుంటడం టీమిండియాకు కలిసి వచ్చే విషయమని యూనుస్ ఫఠాన్ విశ్లేషిం చాడు. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్లలో, ఆసియా కప్లో భారత్ బాగా ఆడిందని కొనియాడాడు.ప్రస్తుత టి20 వరల్డ్ కప్లో నిస్సందేహంగా ఇండియానే ఫేవరెట్ జట్టు అని,ఈ మెగా టోర్నమెంట్ల డాషింగ్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ భారత జట్టుకు స్టార్ ఫర్ఫార్మెర్లుగా నిలువనున్నారన్నాడు. | 2sports
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
Nov 04,2018
61శాతం పెరిగిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై- ఆగస్టు మధ్య కాలంలో సంస్థ నికర లాభం 61 శాతం మేర పెరిగింది. సెప్టెంబరు త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.8265 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో సంస్థ మొత్తంగా రూ.5131 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. రూపాయి మారకపు విలువ పతనం సంస్థకు బాగా కలిసి వచ్చింది. సెప్టెంబరు త్రైమా సికంలో ఓఎన్జీసీ సంస్థ ఆదాయం 47.6 శాతం పెరిగి రూ.27,989 కోట్లకు చేరింది. అయితే సెప్టెంబరు త్రైమాసికంలో సంస్థ చమురు ఉత్పత్తి ఏడు శాతం మేర తగ్గడం విశేషం. ఇదే సమయంలో గ్యాస్ ఉత్పత్తి 3 శాతం మేర పెరిగి 6.1 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరింది. పశ్చిమ తీరంలోని కాంట్రాక్టర్ సకాలంలో లక్ష్యం మేరకు ఉత్పత్తిని ఇవ్వని కారణంగానే చమురు ఉత్పత్తి తగ్గినట్టుగా సంస్థ తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Suresh 231 Views 5 Payment Banks Closed
Payment Banks
ముంబయి: రిజర్వుబ్యాంకు అనుమతులు మంజూరుచేసిన 11 పేమెంట్ బ్యాంకుల్లో ఐదు బ్యాంకులు ఇప్పటికే బోర్డు తిప్పేశాయి. పేమెంట్బ్యాంకులకు తొలినాళ్ల లో వచ్చినంత ప్రాచుర్యం రానురాను అడుగంటిపోయింది. డిపాజిట్లు మందగించడం, రుణపరపతి కల్పించే అవకాశం లేకపోవడమే ఈ బ్యాంకుల మనుగడకు ముప్పు వాటిల్లి నట్లు చెపతున్నారు. ఆర్బిఐ నాలుగేళ్లక్రితం 11 పేమెంట్ బ్యాంకులకు లైసెన్సులు మంజూరుచేసింది. ఆర్థికచేకూర్పు ను మారుమూల గ్రామాలకుసైతం విస్తరించడం, తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్చెల్లింపుల వ్యవస్థ ను అమలుకు తీసుకురావడంద్వారా మరింతగా ఆర్థిక లావాదేవీలను పెంచడం అనేది ముఖ్యోద్దేశ్యం. వాస్తవానికి 11 మంది బ్యాంకర్లలో ఇపుడు కేవలం ఆరు మాత్రమే పనిచేస్తున్నాయి.
మరికొన్ని కొన్ని నెలలకే మానుకున్నాయి. ఎయిర్ టెల్ పేమెంట్స్బ్యాంకు, ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్బ్యాంకు, ఫినో పేమెంట్స్బ్యాంకు, ఇండియా పోస్ట్ పేమెంట్స్బ్యాంకు, జియో పేమెంట్స్బ్యాంకు, ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్బ్యాంకు, పేటిఎం పేమెంట్స్ బ్యాంకులు ఏడు మాత్రమే ఇప్పటివరకూ కొనసాగుతున్నా యి. ఆదిత్యబిర్లా పేమెంట్స్బ్యాంకు తాజాగా తన కార్య కలాపాలను నిలిపివేస్తున్నట్లు జులైలోనే వెల్లడించింది. దీనితో మొత్తం సంఖ్య ఆరుకు తగ్గిపోయింది. వీటిలో మూడు కంపెనీలు క్రియాశీలకంగా కొనసాగుతున్నాయి. మొబైల్ నెఫ్ట్ లావాదేవీలపరంగా ఆర్బిఐ వెల్లడించిన గణాంకాలకు అనుగు ణంగా ఈ మూడుసంస్థ లున్నాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు, ఫినోపేమెంట్స్ బ్యాంకు, పేటిఎం పేమెంట్స్బ్యాంకులు చురుకుగా ఉన్నా యి. ఇండియా పోస్ట్ పేమెంట్స్బ్యాంకు కూడా ఇపుడు చిన్నస్థాయి బ్యాంకుగా మారేందుకు కృషిచేస్తోంది.
పరిమితవనరులే ఆదాయం కావడం, బిజినెస్మోడల్ సవాళ్ల కు దారితీస్తుండటంతో మార్జిన్లు కూడా తగ్గిపోతున్నాయి. దీనితో పేమెంట్స్ బ్యాంకులు గిట్టుబాటైన రీతిలో కొనసాగ లేకపోతున్నాయి. 2017-18 భారత్లో బ్యాంకింగ్ ధోరణు లు చూస్తే 2017లో 242 కోట్లు నష్టాలు 516 కోట్లకు 2018 చివరి నాటికి పెరిగిపోయాయి. ఎక్కువగా నిర్వహణ ఖర్చులు పెరిగిపోతుండటం, రాబడులు నీరసించడమే నష్టా లకు కారణమవుతున్నాయి. ఇక ఖాతాల్లో డిపాజిట్లు తొమ్మి ది శాతంగా మాత్రమే ఉన్నాయి. 2018-19లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు 338 కోట్ల నష్టం చవిచూసింది. అంతకు ముందు ఏడాది 272 కోట్ల కంటే పెరిగింది. ఆదాయవనరులపరంగా చూస్తే 254 కోట్లు ఆర్జించింది. అయితే ఖర్చులు కూడా 593 కోట్లకు పెరిగా యి. డిపాజిట్లు 270కోట్లకు పడిపోయాయి. అంతకుముం దు ఏడాది 290 కోట్లుగా ఉన్నవల్లా తగ్గాయి. 2018-19 సంవత్సరంలో మాత్రం 19 కోట్ల రూపాయలమేర లాభాలు చవిచూసింది.
భారత్లో మొట్టమొదటి పేమెంట్ బ్యాంకు లాభాలు గడించిందని తెలుస్తోంది. ఇక ఈ బ్యాంకులకు సంబంధించి ఆర్బిఐ మార్గదర్శకాలు కూడా కొన్ని సవాల్ చేస్తున్నాయి. బ్యాంకులు కేవలం లక్ష రూపాయల వరకూ మాత్రమే డిపాజిట్లు సేకరించాలి. 75శాతం డిపాజిట్లను ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాలి. కనీసం ఏడాదిపాటు కొనసాగించాలి. మిగిలిన 25శాతం వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్చేయాలి. ఇటీవల 3-4ఏళ్లుగా ఏడాది కాలం ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులు 7-8శాతానికి పెరిగాయి. గడచిన కొన్ని నెలలుగా చూస్తే ఏడాదికాలం ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే జిసెక్స్ గణనీయంగా రాబ డులు పడిపోయాయి. ప్రస్తుతం 5.6శాతంగా ఉన్నాయి.
దీనివల్లనే పేమెంట్స్ బ్యాంకుల రాబడులు, లాభదాయకత కూడా సన్నగిల్లింది. ఇతర వాణిజ్యబ్యాంకుల తరహాలో పోటీని తట్టుకోవాలంటే పేమెంట్స్బ్యాంకులు ఆకర్షణీయ మైన వడ్డీరేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ బ్యాంకులు తక్కువ విలువలున్న డిపాజిట్లుపై 3.5శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 25-50 లక్షల వరకూ ఉన్న డిపాజిట్లకు ఇదే రేటు వర్తిస్తోంది ప్రైవేటు బ్యాంకులు ఎస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకులు 4-5శాతం వడ్డీ ఇస్తోంది. లక్ష నుంచి ఆపైబడిన డిపాజిట్లకు వర్తింప చేస్తోంది. ఎక్కువ మొత్తం డిపాజిట్లు కోటి రూపాయల వరకూ ఉన్నవాటికి 5.5నుంచి ఆరుశాతంగా వడ్డీనిస్తోంది.
కొన్ని చిన్న ఫైనాన్స్బ్యాంకులు డిపాజిట్లపై 5-6శాతం వడ్డీనిసైతం ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు నాలుగు శాతానికి పైబడి వడ్డీలిస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఎయిర్టెల్ పేమెంట్స్ 7.25శాతం వడ్డీని ఇస్తామని వెల్లడించింది. ప్రతి డిపాజిట్పైనా ఈ వడ్డీశాతంతో నష్టం ఎదురవుతోంది. పేటిఎం పేమెంట్స్ బ్యాంకుపరంగా నాలుగుశాతం వడ్డీని అందిస్తోంది. ఇక ఫినో పేమెంట్స్ సంస్థ కూడా 6.25శాతం లక్ష వరకూ అందిస్తున్నది. ఆపైబడిన డిపాజిట్లకు 7.25శాతంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే పేమెంట్స్ బ్యాంకులకు వడ్డీ తక్కువ కావడం ఒకటి. డిపాజిట్లు మందగమనంతో ఉండటంతో పాటు నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలబాటపట్టి మూసివేత దిశగా ఉన్నాయి. | 1entertainment
|
internet vaartha 230 Views
భూమ్రా, హార్థిక్ పాండ్యాలపై ప్రశంస
మిర్పూర్ : వరల్డ్ టి20 ప్రపంచ కప్ను సాధించేందుకు సిద్దంగా ఉన్నామని టీమిండియా వన్డే, టి20 కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆసియా కప్ను సాధించిన అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడాడు. టాపార్డర్ బ్యాట్స్మెన్ చాలా వరకు పని ముందే చేసి పెట్టేస్తున్నారని,ఇక లోయర్ ఆర్డర్ వాళ్లు వెళ్లి కావాల్సింది పూర్తి చేసుకుంటే సరిపోతుందన్నాడు. బ్యాటింగ్ లైనప్ చాలా బాగుందని, టి20 ప్రపంచ కఫ్ కోసం తాము అన్ని విధాల సిద్దంగా ఉన్నామన్నాడు. యువ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా,ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యాలపై ప్రశంసల జల్లు కురిపించాడు.బూమ్రా యార్కర్లు బాగా వేస్తాడని,అవి లేకపోతే ఇంకా చాలా రకం బంతులను ప్రయత్నించాల్సి ఉంటుందని,బుమ్రా కొద్దిగా యాక్షన్ మార్చుకుంటే ఇంకా చాలా ఉపయోగపడుతుందని ధోనీ పేర్కొన్నాడు.హార్థిక్ పాండ్యా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడని, అతడి బ్యాటింగ్,ఫీల్డింగ్ నైపుణ్యంతో కలిసి మంచి ఆల్రౌండర్ అయ్యాడన్నాడు.యువరాజ్ను నాలుగవ స్థానంలో బ్యాటింగ్కు పంపడం ప్రస్తుత పరిస్థితిలో కష్టమనీ,కానీ తన స్థానంలో యువరాజ్ చాలా బాగా నిలదొక్కుకున్నాడని,టీమ్లో 13-14 మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ప్రతి ఒక్కళ్లూ గేమ్ ఫినిష్ చేయడానికి బాధ్యత తీసుకుంటారన్నాడు. కాంబినేషన్లు సెట్ కావడం చాలా ముఖ్యమని అది తమకు కుదిరిందన్నాడు. | 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.