news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
తెలుగు ‘బిల్లా’ను కలిసిన తమిళ్ ‘బిల్లా’
ప్రభాస్, అజిత్కు ఓ కామన్ పాయింట్ ఉంది. అందేంటి అంటారా?. మీకు ‘బిల్లా’ సినిమా గుర్తిందిగా. ఆ సినిమా తమిళంలో అజిత్ నటిస్తే.. తెలుగులో ప్రభాస్ నటించారు.
Samayam Telugu | Updated:
Feb 22, 2019, 01:03PM IST
హైలైట్స్
‘బాహుబలి’ ప్రభాస్ను తమిళ అగ్రనటుడు అజిత్ కలిశారంట.
రామోజీ ఫిల్మ్సిటీలో ఇద్దరి సినిమాలు షూటింగ్ జరుగుతుండటంతో విరామ సమయంలో ప్రభాస్కు అజిత్ షాకిచ్చారట.
ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని ఫోటోలు తీసుకున్నారట.
‘బాహుబలి’తో వరల్డ్ ఫేమస్ అయిపోయాడు ప్రభాస్ . ప్రస్తుతం ‘సాహో’ చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. తమిళంలో రజినీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న అజిత్ .. తాజాగా ప్రభాస్ను కలిశాడంట.
అజిత్ ప్రస్తుతం బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ తమిళ రీమేక్లో నటిస్తున్నాడు. హిందీలో అమితాబ్ పోషించిన కీలక పాత్రలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతోంది. దీంతో షూటింగ్ విరామంలో అజిత్ ‘సాహో’ సెట్కి వచ్చి అందరికీ సర్ప్రైజ్ చేశాడంట. అజిత్ రాక తెలుసుకున్న ప్రభాస్ ఆయనకు ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారట. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుని ఫోటోలు కూడా తీసుకున్నారట. సాహో యూనిట్ కూడా అజిత్తో సెల్ఫీలు తీసుకుందట. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ఎక్కడా బయటికి రాలేదు.
ప్రభాస్, అజిత్కు ఓ కామన్ పాయింట్ ఉంది. అందేంటి అంటారా?. మీకు ‘బిల్లా’ సినిమా గుర్తిందిగా. ఆ సినిమా తమిళంలో అజిత్ నటిస్తే.. తెలుగులో ప్రభాస్ నటించారు. రెండు సినిమాలు విజయం సాధించడంతో పాటు ఇద్దరికీ మంచిపేరు తీసుకొచ్చాయి. దీంతో తమిళ ‘బిల్లా’, తెలుగు ‘బిల్లా’ కలుసుకుని ఏం మాట్లాడుకున్నారబ్బా అంటూ ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారట. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి లాంటి ఆటగాడ్ని ఏబీ చూడలేదట..!
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లాంటి క్రికెటర్ని తానెక్కడా చూడలేదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్
TNN | Updated:
Aug 30, 2017, 02:27PM IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లాంటి క్రికెటర్‌ని తానెక్కడా చూడలేదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఆటలో ఎవరినీ అనుసరించకుండా తనకంటూ ప్రత్యేక శైలి‌ని కోహ్లి సృష్టించుకున్నాడ‌ని.. అతను ఈ తరానికి బెస్ట్ క్రికెటర్ అంటూ డివిలియర్స్ ప్రశసించాడు. గత వారంలో దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకున్న డివిలియర్స్ తాజాగా మీడియాతో సుదీర్ఘంగా మాట్టాడాడు.
‘వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న క్షణం నుంచీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ నిర్ణయంతో నేను మళ్లీ రీఫ్రెష్ అయిన భావన కలుగుతోంది. నా జీవితం క్రికెట్‌తో మమేకమైపోయింది. అందుకే.. కెరీర్ చివరాంకంలో ఆటని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కెప్టెన్సీని వదులుకున్నా. నా కెరీర్ ఇంకో రెండు లేదా.. గరిష్టంగా మరో ఏడేళ్లు ఉండొచ్చేమో నాకు తెలీదు. ఇక వచ్చే ఏడాది భారత్ జట్టు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ కోసం వస్తోంది. రెండేళ్ల క్రితం మేము భారత్ గడ్డపై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. కానీ.. ఈ సిరీస్‌లో మాత్రం వారికి గట్టిపోటీనిస్తాం. కెప్టెన్ విరాట్ కోహ్లి తనకంటూ ప్రత్యేక శైలి సృష్టించుకున్నాడు. నా గురించి కోహ్లి ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. కానీ.. అతనే ఈ తరానికి అత్యుత్తమ ఆటగాడు. ఇద్దరం చాలా సరదాగా, ఆటపై అంకితభావంతో గౌరవంగా ఉంటాం’ అని డివిలియర్స్ వివరించాడు. | 2sports
|
Vaani Pushpa 96 Views Ben stock , Legal fighting
Ben stock
లండన్: తమ గోప్యతకు భంగం కలిగించే అత్యంత సున్నితమైన విషయాలను ప్రచురించిన ‘ది సన్ పత్రికపై ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ న్యాయపోరాటానికి దిగాడు. ఈ విషయంపై స్టోక్స్ తన తల్లితో పాటు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తమ ఆమోదం లేకుండా తమ కుటుంబానికి సంబంధించి అత్యంత బాధకరమైన, సున్నితమైన వ్యక్తిగత విషయాలను ప్రచురించినందుకుగాను చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు విన్నవించుకున్నారు. అసలేం జరిగిందంటే…’స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ అనే పేరుతో సన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
స్టోక్స్ అక్క, అన్నను అతడి తల్లి మాజీ ప్రియుడు చంపేశాడు. స్టోక్స్ పుట్టడానికి మూడేళ్ల ముందు ఇది జరిగిందని సదరు పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్టోక్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత విషయాలు అది కూడా తాను పుట్టక మునుపు జరిగిన విషయాలను ఇప్పుడు ప్రచురించడం ఎంతవరకు సబబు అని? జర్నలిజం పేరుతో దిగజారతారా? అని ఆయన ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్(పిసిఎ) అవార్డుల కార్యక్రమం ముగిశాక ఇంటికి వెళ్లే సమయంలో స్టోక్స్ తన భార్యతో గొడవపెట్టుకున్నాడని ఓ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా స్టోక్స్ భార్య క్లారే అతడి చెంపపై కొట్టినట్టు ఓ ఫోటోను కూడా ప్రచురించింది. దీనిపై స్టోక్స్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ ఫోటోలో క్లారే బెన్స్టోక్స్ను కొట్టనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానా ఆ సదరు మీడియా మాత్రం స్టోక్స్ను క్లారే కొట్టినట్లు ప్రచురించింది. ప్రపంచకప్ను ఇంగ్లాండ్కు అందించి సంబరాలు చేసుకుంటున్న తరుణంలో మీడియాలో ఇలా తనకు వ్యతిరేకంగా వరుస కథనాలు రావడం పట్ల స్టోక్స్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అయితే అతడికి ఇంగ్లాండ్ క్రికెటర్లు మద్ధతుగా నిలుస్తున్నారు. స్టోక్స్కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికలపై వారు కూడా విమర్శిస్తున్నారు.
తాజా క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/ | 2sports
|
internet vaartha 228 Views
న్యూఢిల్లీ : టీమిండియాకు చెందిన బౌలర్ భువనేశ్వర్కుమార్కు గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లకు దూరమయ్యాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగే టి20 మ్యాచ్ల సిరీస్లో స్థానం లభించింది. దీంతో భువనేశ్వర్ స్థానంలో ఆల్రౌండర్ రిషి ధావన్కు స్థానం దక్కింది.కాగా గాయపడ్డ మరో బ్యాట్స్మెన్ అజింక్యా రహానే స్థానంలో ప్రత్యామ్నాయంగా గుర్కీరత్ సింగ్ జట్టుతో పాటు కొనసాగుతున్నాడు. | 2sports
|
Hyderabad, First Published 18, Oct 2018, 11:50 AM IST
Highlights
సిబ్బంది తప్పుడు కారణాలు చెప్పి గంటల తరబడి విమానాశ్రయంలో ఎదురుచూసేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాపై మండిపడ్డారు. సిబ్బంది తప్పుడు కారణాలు చెప్పి గంటల తరబడి విమానాశ్రయంలో ఎదురుచూసేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు.
‘మరికొంత సేపట్లో విమానం బయలుదేరుతుందని అబద్ధాలు చెబుతూ ప్రియమైన ఎయిర్ ఇండియా దాదాపు 4 గంటలు విమానాశ్రయంలో ఎదురుచూసేలా చేసింది. తొలుత ఉదయం 12.15 గంటలకు బయలుదేరుతుందని చెప్పి ఇప్పుడు మరో రెండు గంటలు ఎదురుచూడమంటున్నావు. అధికారి సరిగ్గా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆహారం లేదు, నీరు లేదు, సమాచారం లేదు. ఇలా పుణెలో వదిలేశారు’.
‘తర్వాత హైదరాబాద్లోని సిబ్బందికి ఫోన్ చేసి.. విమానం ఏమైందో పూణె సిబ్బందిని అడిగి తెలుసుకోమని కోరాను. వాతావరణం బాగోలేదని, సాంకేతిక లోపం కారణంగా విమానాల్ని మార్చామని అబద్ధాలు చెప్పారు. ప్రయాణికుల్ని దాదాపు 4 గంటలపాటు ఇలా చీకటిలో ఉంచడంలో ఎయిరిండియాకు అంత సంతోషం ఏంటో?’ అంటూ మంచు లక్ష్మీ తన ఆవేదనను తెలియజేశారు.
Last Updated 18, Oct 2018, 11:51 AM IST | 0business
|
internet vaartha 180 Views
ముంబై : జ్యుయెలరీ కొనుగోళ్లపై ఒకటి శాతం ఎక్సైజ్ సుంకం విధింపును వెంటనే విరమించుకోవాలని కోరుతూ 25 రోజులకుపైబడి సమ్మెచేస్తున్న జ్యుయెలరీ వ్యాపారులకు ప్రభుత్వపరంగా స్పష్టమైన హామీ ఇప్పటికీ లభించలేదు. పైగా చిన్న వ్యాపారులపై ఎటువంటి వేధింపులు ఉండవని, కేవలం 12కోట్ల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలపై మాత్రమే పన్ను ఉంటుందని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ స్పష్టంచేసినా ఆభరణాల వ్యాపారులు ప్రభుత్వంపై కినుకవహిస్తున్నారు. దీనివల్ల మార్చి త్రైమాసికంలో జ్యుయెలరీ కంపెనీల షేర్లు, లాభాలు కూడా ప్రభావితం అవుతాయన్నది అంచనా. టైటాన్, పిసి జ్యుయెలర్స్, త్రిభవన్దాస్భీమ్జీ ఝవేరి వంటిసంస్థలు వీరిలో ఉన్నా రు. వాస్తవంగా రాబడులపరంగా చూస్తే వివిధ అంశాల ఆధారంగా ప్రభావితం అయ్యాయి. సమ్మెకాలంలో అనేక షాపులు మూతపడ్డాయి. షాపిన్షాప్స్టోర్లు మాత్రం తెరిచే ఉన్నాయి. దక్షిణాదిలో జ్యుయెలరీ సంస్థలు మాత్రం వెనుకంజవేసాయి. మొత్తం మీద ఆభర ణాల సంస్థలకు 40రోజులపాటు రాబడుల్లో ప్రభా వం ఎక్కువగా ఉంది. దీనివల్లనే వీటి ఆర్ధిక లాభ నష్టాలు కూడా తీవ్రస్థాయి ఒత్తిడికిలోనవుతాయి. దివ్యేష్షా టిబిజడ్కు చెందిన బిజినెస్హెడ్ మాట్లాడుతూ సమ్మె ప్రభావం తీవ్రస్థాయిలోనే ఉం టుందని, వినియోగదారులపై ఒకటిశాతం ఎక్సైజ్ సుంకం భారం నెట్టివేసినప్పటికీ రాబడులపరంగా ఎటువంటిమార్జిన్ ఉండదని అన్నారు. ఇప్పటి వరకూ 27రోజులపాటు సమ్మెజరిగింది. 93రోజుల త్రైమాసికంలో 27 రోజుల రాబడులు కంపెనీలు కోల్పోయాయి. టైటాన్ 665 కోట్ల రూపాయల రాబడులు మార్చిత్రైమాసికంలో కోల్పోయే అవకాశం ఉందని తేలింది. జ్యుయెలరీ సంసథలు 80శాం రాబడుల్లో ప్రభావం ఉంటుంది. వాచ్లు ఇతర సెగ్మెంట్లపైనే ఆధారపడతాయి. టిబిజడ్కు 135 కోట్లు, పిసిజ్యూయెలర్స్కు 371 కోట్లుగా మార్చినెల రిటైల్ బిజినెస్లో తీవ్ర ప్రభావం ఉంటుం దని అంచనా. పిసిజెకు 70శాం రాబడులు దేశీయ రిటైల్స ఎగ్మెంట్ నుంచే వస్తుంది. మిగిలిన రాబడులు ఎగుమతులద్వారా సమకూరుతుంది. పిసిజెకు షాప్ఇన్షాప్ వ్యాపారాలు లేవు. దేశీయంగా అన్ని సొంతగా రిటైల్స్టోర్లనే ఏర్పాటుచేసింది. టైటాన్, పిసిజె సంస్థలు ఈ రాబడుల ఫలితాలపై వ్యాఖ్యాపించేందుకు నిరాకరిం చాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కంపెనీల షేర్లు బడ్జెట్ నుంచి పెరిగాయి. ఫిబ్రవరిలో మాత్రం 16-27శాతం దిగజారాయి. షేర్ల పతనం కంటే లాభాలు తక్కువగానే ఉన్నట్లు అంచనా. మార్చినెల ఫలితాలు వెల్లడికాగానే షేర్లధరలు లాభాలా నష్టాలా అన్నది తేలుతుంది. గుడి పాద్వా ఇతర పండుగలు ఏప్రిల్లో రానున్నందున కొంతమేర రాబడులు పెరుగుతాయన్నది అంచనా. | 1entertainment
|
India vs Australia: Series to be Played as Per Old ICC Rules
భారత్ x ఆస్ట్రేలియా సిరీస్కి పాత రూల్స్..!
క్రికెటర్లలో క్రమశిక్షణ, ఆటలో నాణ్యత పెంచేందుకు ఐసీసీ క్రికెట్లోకి కొత్త రూల్స్ని ఈ నెలలోనే ప్రవేశపెట్టనుంది.
TNN | Updated:
Sep 7, 2017, 02:04PM IST
క్రికెటర్లలో క్రమశిక్షణ, ఆటలో నాణ్యత పెంచేందుకు ఐసీసీ క్రికెట్‌లోకి కొత్త రూల్స్‌ని ఈ నెలలోనే ప్రవేశపెట్టనుంది. అయితే.. సెప్టెంబరు 17 నుంచి జరగనున్న భారత్ , ఆస్ట్రేలియా సిరీస్‌కి మాత్రం ఈ రూల్స్‌ నుంచి మినహాయింపు లభించింది. మైదానంలో దురుసుగా ప్రవర్తించిన క్రికెటర్‌‌పై తక్షణమే అంపైర్లు చర్యలు తీసుకోవడం, బ్యాట్ పరిమాణం‌లో ఆంక్షలు, డీఆర్‌ఎస్‌లో మార్పులు తదితర రూల్స్ ఇందులో ఉన్నాయి. సెప్టెంబరు 28 నుంచి ఈ రూల్స్‌ అమలులోకి రానున్నట్లు ఐసీసీ ప్రకటించగా.. అక్టోబరు 13 వరకు జరగనున్న భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌కి మాత్రం ఇవి వర్తించవని తాజాగా వెల్లడించింది.
‘సెప్టెంబరు 28 నుంచి జరగనున్న శ్రీలంక- పాకిస్థాన్, బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లకి ఐసీసీ కొత్త రూల్స్ వర్తిస్తాయి. కానీ.. ఈ నెల మధ్యలోనే ఆరంభమయ్యే భారత్- ఆస్ట్రేలియా సిరీస్‌కి మాత్రం ఇవి వర్తించవు. ఈ సిరీస్ అక్టోబరు మధ్య వరకు కొనసాగినా.. ఒకే సిరీస్‌లో రెండు రూల్స్ ఉండకూడదనే ఉద్దేశంతో మినహాయింపు ఇస్తున్నాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త రూల్స్‌లో డీఆర్‌ఎస్‌ని ‘అంపైర్ కాల్‌’‌గా పేరు మారుస్తున్నారు. ఆటగాళ్లు ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే.. ఫుట్‌బాల్ ఆటగాళ్ల తరహాలో అంపైర్లు క్రికెటర్లని మైదానం నుంచి వెలుపలికి పంపించేయచ్చు. క్రీజులోకి బ్యాట్స్‌మెన్ ఒకసారి వచ్చి.. బెయిల్ పడుతున్న సమయంలో బ్యాట్ లేదా పాదం గాల్లో ఉన్నా ఇకపై ఔట్ కాదు. | 2sports
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
sumalatha 119 Views delhi hc , Jet Airways , LOC , naresh goyal
Naresh Goyal
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు ఢిల్లీ న్యాయస్థానంలోచుక్కెదురైంది.. ఆయన దేశం విడిచివెళ్లడానికి ఈరోజు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. అలాగే తన మీద జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను సవాలు చేస్తూ గోయల్ చేసిన అభ్యర్థనపై కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే గోయల్ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి సురేశ్ కెయిత్ తీర్పునిస్తూ..ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని, ఒకవేళ దేశం విడిచి వెళ్లాలంటే రూ.18,000 కోట్లను హామీ కింద డిపాజిట్ చేయాలని కోరారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/ | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
India vs Australia: టీ20 వరల్డ్ రికార్డ్కి సిక్స్ దూరంలో రోహిత్..!
అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాను ఓసారి పరిశీలిస్తే..? న్యూజిలాండ్ హిట్టర్ మార్టిన్ గప్తిల్, వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్గేల్ 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
Samayam Telugu | Updated:
Feb 23, 2019, 08:34AM IST
India vs Australia: టీ20 వరల్డ్ రికార్డ్కి సిక్స్ దూరంలో రోహిత్..!
హైలైట్స్
టీ20 ఫార్మాట్లో అరుదైన రికార్డ్కి అడుగు దూరంలో రోహిత్ శర్మ
ఇప్పటికే 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్న భారత ఓపెనర్
ఆస్ట్రేలియాతో వైజాగ్ వేదికగా ఆదివారం తొలి టీ20
ఆ మ్యాచ్లో రెండు సిక్సర్లు బాదితే రోహిత్ శర్మ టాప్
భారత విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డ్కి అడుగు దూరంలో ఉన్నాడు. విశాఖపట్నం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా రికార్డుల్లో నిలవనున్నాడు. కనీసం ఒక్క సిక్స్ కొట్టినా.. గప్తిల్, గేల్తో సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకోనున్నాడు. | 2sports
|
సూర్య సరసన సాయిపల్లవి ప్రాజెక్ట్ మొదలైంది
Highlights
తెలుగు ప్రేక్షకులను ఫిదా మూవీతో ఫిదా చేసిన సాయిపల్లవి
తన ఫేవరైట్ హీరో ఎవరంటే పలు మార్లు సూర్య పేరు చెప్పిన పల్లవి
తాజాగా సూర్య సరసన సాయిపల్లవి నటించనున్న ప్రాజెక్ట్ ప్రారంభం
‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన హీరోయిన్ సాయిపల్లవి. ప్రస్తుతం ఈ అమ్మాయికున్నంత క్రేజ్ వేరే ఏ హీరోయిన్కి లేదంటే అతిశయోక్తి కాదు. సింపుల్గా ఉంటూనే ప్రేక్షకులను తన నటన, హావభావాలతో కట్టిపడేస్తోంది. ఇటీవల వచ్చిన ‘ఎంసీఏ’ సినిమాలోనూ సాయిపల్లవి ఆకట్టుకుంది. ఇప్పటి వరకు కుర్ర హీరోలతో నటించిన సాయిపల్లవి ఇప్పుడు ఏకంగా సూర్యతో జతకట్టింది. ఈ కొత్త సినిమా షూటింగ్ కూడా నూతన సంవత్సరం సందర్భంగా ప్రారంభమైంది.
‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్. కార్తితో ‘ఖాకి’ చిత్రాన్ని నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అందిస్తోంది. ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్బాబులు నిర్మాతలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. సీనియర్ హీరో శివకుమార్, సూర్య, కార్తి ఈ సినమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది.
హీరో సూర్య మాట్లాడుతూ.. ‘నా గత 35 చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సెల్వ రాఘవన్ చెప్పిన సబ్జెక్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. కమర్షియల్ విలువలతో కూడిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇందులో హీరోయిన్ సాయిపల్లవి పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు. సూర్యలాంటి వెర్సటైల్ హీరోతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు సెల్వ రాఘవన్ చెప్పారు. ఈ కథకు సూర్య ఒక్కరే యాప్ట్ అని సినిమా చూశాక మీకే తెలుస్తుందన్నారు.
నిర్మాతలు ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు మాట్లాడుతూ.. ‘సూర్య, సాయిపల్లవి, సెల్వ రాఘవన్ కాంబినేషన్లో వస్తున్న మంచి సినిమా ఇది. రీసెంట్గా మా బేనర్లో రూపొందిన ‘ఖాకి’ మంచి హిట్ అయింది. సూర్య కెరీర్లో ఓ పెద్ద హిట్ సినిమా అయ్యేలా డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి 18న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి దీపావళికి చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
SEHWAG11
కోహ్లీ సేనకు మద్దతివ్వండి: సెహ్వాగ్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా సుమారు 14 సంవత్సరాల తరువాత భారత గడ్డపై తొలిసారి టెస్టును గెలిచింది.గతంలో ఎంతో మంది మేటి ఆటగాళ్లు భారత్లో పర్యటించినా వారు సాధించలేని ఘనతను ఇప్పుడు సాధించింది.2004 నుంచి ఆ జట్టుకు టెస్టుల్లో విజయాలే లేవు.కానీ అంతగా అనుభవం లేని ఆటగాళ్లలో కలిసి చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది స్మిత్ సేన.తాజాగా మ్యాచ్ జరిగిన తీరు ఆటగాళ్లపై పలువురు క్రికెట్ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను తెలియజేశారు.కష్టతరమైన క్షణాలను కూడా మంచి స్నేహితులు సులభతరం చేస్తారు.ఇది నిరాశపరిచేదే.అయినప్పటికి మీరు ఒక మంచి మిత్రుడిగా ఉంటారా?అయితే మంచి స్నేహి తుడిగాఉండే సమయం వచ్చింది.భారత జట్టుకు మద్దతు కొనసాగించండి.ఆస్ట్రేలియా అద్భత ప్రదర్శన చేసింది.విజయంతో టెస్టు సిరీస్ను ఆరంభించింది.భారత్పై భారీ ఆధిక్యంతో గెలిచినందుకు ఆనందంగా ఉందని ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్జాన్సన్ పేర్కొన్నాడు. ఆతిథ్య భారత జట్టుపై గెలుపొందడంచాలా గర్వంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెన్సే అభిప్రాయం వ్యక్తం చేశాడు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
విశాఖ టెస్ట్: భారీ స్కోరు దిశగా భారత్
విశాఖపట్నంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్మెన్ నిలకడగా ఆడుతున్నారు.
TNN | Updated:
Nov 17, 2016, 06:04PM IST
విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (151 నాటౌట్), ఛటేశ్వర్ పుజారా (119) సెంచరీలతో కదం తొక్కారు.
గౌతం గంభీర్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన లోకేశ్ రాహుల్ (0) నిరాశపరిచాడు. ఖాతా ఏమీ తెరవకుండానే బ్రాడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కొంతసేపటికి మురళీ విజయ్ (20) అండర్సన్ బౌలింగ్‌లో స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న భారత్‌ను పుజారా, కోహ్లి జోడి ఆదుకుంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 226 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. | 2sports
|
Hyderabad, First Published 8, Feb 2019, 2:54 PM IST
Highlights
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు చిన్నారులతో ప్రేమలో పడినట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ లో విజయ్ చేతికి గాయమైంది.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు చిన్నారులతో ప్రేమలో పడినట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ లో విజయ్ చేతికి గాయమైంది. ఆ ఫోటోని అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేశాడు విజయ్.
ఆ ఫోటోని చూసిన ఇద్దరు చిన్నారులు 'విజయ్ కొండకు ఏమైంది..?' అంటూ తమ ముద్దు ముద్దు మాటలతో అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో ఇద్దరు చిన్నారులు 'డాక్టర్ దగ్గరకి వెళ్లు విజయ్ దేవరకొండ' అంటూ సలహా కూడా ఇచ్చారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇద్దరి పిల్లల తండ్రి ''మీకు తగిలిన దెబ్బలు చూసి మా చిన్నారులు బాధపడుతున్నారు'' అంటూ విజయ్ దేవరకొండని ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన విజయ్.. ''వీరితో ప్రేమలో పడ్డా.. విజయ్ దేవరకొండకి డాక్టర్ అవసరం లేదు. కానీ మీ ఇద్దరినీ కలవాలని అనుకుంటున్నాడు. మీకు కుదురుతుందా..? '' అని అడిగాడు.
దీనికి సదరు నెటిజన్ ''తప్పకుండా మిమ్మల్ని కలిస్తే మా పిల్లలు చాలా ఆనందపడతారు. మేం అమెరికా నుండి శనివారం హైదరాబాద్ కి రాబోతున్నాం'' అని చెప్పగా.. అతడి నెంబర్ కావాలని విజయ్ టీం నెటిజన్ ని కోరింది.
I Just fell in ❤
Vijay Konda doesn't need a doctor, but he would love to meet you two. Will you? https://t.co/82jhgz1Drl
— Vijay Deverakonda (@TheDeverakonda) February 7, 2019
Last Updated 8, Feb 2019, 2:54 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘బాహుబలి-2’ ఫస్ట్లుక్, టీజర్ విడుదల
ఒక సినిమా కోసం ఆ హీరో అభిమానులు ఎదురు చూడటం సాధారమైన విషయం. మరి ఆ సినిమా కోసం దేశం మొత్తం కాదుకాదు ప్రపంచం మెత్తం ఎదురు చూస్తే అదే ‘బాహుబలి2’.
TNN | Updated:
Oct 22, 2016, 06:12PM IST
ఒక సినిమా కోసం ఆ హీరో అభిమానులు ఎదురు చూడటం సాధారమైన విషయం. మరి ఆ సినిమా కోసం దేశం మొత్తం కాదుకాదు ప్రపంచం మెత్తం ఎదురు చూస్తే అదే ‘బాహుబలి2’, అలాంటి సినిమా టీజర్ విడుదలవుతుందంటే సినిమా ప్రేమికుల్లో ఎంత ఆత్రుత ఉంటుందో తెలిసిందే. రేపు అంటే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌‌ను దర్శకుడు రాజమౌళి ఈ రోజు విడుదల చేశారు.
— rajamouli ss (@ssrajamouli) October 22, 2016
బాహుబలి2 టీజర్‌ని హైదరాబాద్‌లో కాకుండా ముంబైలో రిలీజ్ చేశారు. అక్కడ జరుగుతున్న ‘మామి’ ఫిల్మ్‌ఫెస్టివ్‌ల్‌లో సాయంత్రం ‘బాహుబలి-2’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌లను విడుదల చేశారు. అందుకోసం నిన్ననే రాజమౌళి, ప్రభాస్‌, రానా, అనుష్కతోపాటు ప్రధాన యూనిట్‌ అంతా ముంబై చేరుకున్నట్టు సమాచారం. అక్టోబర్ 22 సాయంత్రం నాలుగు గంటలకు టీజర్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని ప్రకటించినా సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం అయ్యింది. | 0business
|
MSK Prasad With Dhoni
ధోనీ వైదొలగడం వ్యక్తిగత నిర్ణయం: ఎంఎస్కె ప్రసాద్
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ ఆటగాడు తన కెప్టెన్సీకి స్వస్తి చెప్పడంపై ఎవరి నుంచి ఒత్తిడి ఎదుర్కొన లేదని సీనియర్ సెలక్షన్ప్యానెల్ చైర్మన్ ఎంఎస్కె ప్రసాద్ పేర్కొన్నాడు.గతవారం ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పలువురు ఒత్తిడి కారణంగానే ధోని కెప్టెన్సీ పదవిని వదులుకున్నాడని వ్యాఖ్యానించారు.ఇవన్ని రూమర్లని,వీటిలో ఎంతమాత్రం నిజం లేదని ఒక స్పోర్ట్స్ పత్రికకుఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.రంజీ ట్రోఫీ సెమీ పైనల్లో భాగంగా జార్ఖండ్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోని రాజీనామా విషయాన్ని వెల్లడించాడు.ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని,ఎవరి నుంచి ఒత్తిడి ఎదుర్కొనలేదని ఎంఎస్కె ప్రసాద్ వివరించాడు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసిన పుజారా
బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో 213/4తో నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత్ డీఆర్ఎస్ను ఉపయోగించుకోవాల్సి వచ్చింది.
TNN | Updated:
Mar 7, 2017, 10:13AM IST
బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో 213/4తో నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత్‌ డీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. క్రీజులో పాతుకుపోయిన పుజారా, రహానే వికెట్లను సాధ్యమైనంత త్వరగా తీయడమే లక్ష్యంగా ఆసీస్ స్పిన్నర్లతో దాడికి దిగింది. ఈ క్రమంలో లియాన్ వేసిన బంతి పుజారా ప్యాడ్లను తాకింది. అపీల్ చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో సంతృప్తి చెందని పుజారా రివ్యూకు అపీల్ చేయగా అది నాటౌట్ అని తేలింది. బంతి లెగ్ వికెట్ వెలుపలగా వెళ్తోందని స్పష్టమైంది. పుజారా బ్యాక్ ఫుట్‌పై ఆడుతుండటంతో అంపైర్ పొరబడ్డాడని తేలింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. సోమవారం కోహ్లి వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ నిర్ణయంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
పుజారా రివ్యూ..
— Samayam Telugu (@SamayamTelugu) March 7, 2017
అంపైర్ అవుట్ అని ప్రకటించగానే ఏ మాత్రం సంశయించకుండా పుజారా రివ్యూ కోరడం సత్ఫలితాన్ని ఇచ్చింది. అంతకు ముందు ఒకిఫ్ బౌలింగ్‌లో రహానే ఆడిన బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి ఎగిరింది. అదృష్టవశాత్తు అది స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు దూరంగా వెళ్లింది. ఈ లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న రహానే తర్వాత స్టార్క్ ఓవర్లో బౌండరీ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపికగా ఆడిన రహానే అర్థ శతకం సాధించడానికి 128 బంతులను ఎదుర్కోవడం విశేషం.
A gritty half-century from @ajinkyarahane88 , his 11th in Test cricket #INDvAUS pic.twitter.com/h0UGunsX06
— BCCI (@BCCI) March 7, 2017
ఐదో వికెట్‌కు పుజారా, రహానే వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత జట్టు 81 ఓవర్లు ముగిసే సమయానికి 232/4తో మెరుగైన స్థితిలో నిలిచింది. | 2sports
|
ఆర్థిక వ్యవస్థలో పురోగతి లేదు!
- కావాల్సిన స్థాయిలో ఉద్యోగ సృష్టి జరగడం లేదు..
- రైతుకు రుణ మాఫీ వద్దని ఈసీకి లేఖ రాశా: రాజన్
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మోడీ సర్కారుపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితుఇలో గడిచిన ఐదేండ్ల కాలంలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దేశ అవసరాల మేరకు భారత ఆర్థిక వ్యవస్థ తగినన్ని ఉద్యోగాలను సృష్టించడంతో విఫలమైందని ఆయన అన్నారు. ఇందుకు ఆయన ఉదాహరణనిస్తూ ఇటీవల జరిగిన రైల్వే నియమకాల్లో 90వేల రైల్వే ఉద్యోగాలకు రెండున్నర కోట్ల మంది దరఖాస్తు చేసుకున్న పరిస్థితిని తెలిపారు. ఒక్కో ఉద్యోగానికి 250 మంది పోటీ పడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే దేశంలో ఎంతగా నిరుద్యోగం పేరుకుపోయిందే అర్థమమవుతోందని అన్నారు. భారత్ తక్షణం ద్రవ్య లోటును పూడ్చుకోవడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పైగా నమోదు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.రైతులకు రుణమాఫీ చేస్తామని ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలు ఇస్తుండడాన్ని రాజన్ ఆక్షేపించారు. దేశంలో ఇలాంటి చర్యలు మంచివి కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఆర్థిక వ్యవస్థకు మేలు చేయదని తెలుపుతూ భవిష్యత్తులో ఇలాంటి ఉండకూడదనికేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసినట్లు ఆయన తెలిపారు. 'వ్యవసాయ రంగానికి, రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అంతమాత్రాన రుణమాఫీలు చేయడం, పంట మద్దతు ధర పెంచుతామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం వంటివి చేయడం సరికాదు' అని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలోనూ ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. ఇటువంటి హామీలు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అపారమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఉద్యోగాలొచ్చే రంగాలపై మరింత ప్రభుత్వం ఉద్యోగ సృష్టి ఎక్కువగా ఉన్న రంగాలపై దృష్టి ్ట పెట్టాలని ఇటీవల రాజన్ సూచించిన విషయం తెలిసిందే. వ్యవసాయం, బ్యాంకింగ్, విద్యుత్ వంటి రంగాలపై దృష్టి సారించి.. వాటిని తిరిగి వృద్థి పథంలోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి | 1entertainment
|
Dhoni
28 సంవత్సరాల నిరీక్షణకు సిక్స్తో ముగింపు పలికిన ధోనీ
న్యూఢిల్లీ: సరిగ్గా ఆరు సంవత్సరాల కిందట ఇదే రోజు కోట్లాది అభిమానులు 28 సంవత్సరాలుగా ఎదురు చూసిన నిరీక్షణకు సిక్సర్తో తెరదించాడు ధోని. ఏప్రిల్ 2వ తేదీన శ్రీలంకతో జరిగిన తుది పోరులో విజయం సాధించి 2011 అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ను ధోనీ సేన కైవసం చేసు కుంది.వాంఖడే స్టేడియంలో శ్రీలంక నిర్ధేశించిన 274 పరుగుల టార్గెట్ను టీమిండియా కేవలం నాలుగు వికెట్ల మాత్రమే కోల్పోయి చేధించింది.
జట్టు విజయంలో గంభీర్,ధోని కీలక పాత్ర పోషిం చారు.అంతకు ముందు 1983లో కపిల్ నాయ కత్వంలో ప్రపంచ కప్ను సొంతం చేసుకున్న టీమిండియా తరువాత మళ్లీ 2011లో ధోని సారథ్యంలో సాధించింది.కప్ అందుకుని నేటి తో ఆరు సంవత్సరాలు కావడంతో సామాజిక మాధ్యమం ట్విటర్ వేదికగా సెహ్వాగ్,కైఫ్లు తమ ఆనందాన్నిఅభిమానులతో పంచుకున్నారు.ఆరు సంవత్సరాల కిందట అద్భుతమైన ఫినిషింగ్తో ధోనీ టీమిండియా కలను సాకారం చేశాడు.ఇప్పటి తరానికి జీవితాంతం గుర్తిండిపోయే సంఘటన ఇది అని కప్ను ముద్దాడుతూ ఉన్న ఫోటో ను ట్యాగ్ చేసి సెహ్వాగ్ట్వీట్ చేశాడు.వాంఖడేలో గం భీర్,ధోనిపోరాటం మరచిపోలేం.అద్భుత విజ యంతోస్వదేశంలో ప్రపంచకప్ను గెలుచు కోవడం మధురానుభూతి అంటూ కైఫ్ ట్వీట్ చేశాడు. | 2sports
|
నిజమే..‘రాజా ది గ్రేట్’లో రవితేజ వారసుడు!
TNN| Sep 6, 2017, 11.36 AM IST
రవితేజతో తనయుడు మహాధన్
తెలుగు సినిమా పరిశ్రమలో వారసుల ఎంట్రీలు కొత్తేమీ కాదు. హీరోల నుంచి మొదలు కొని దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు ఇలా అందరూ తమ వారసులను వెండితెరకు పరిచయం చేశారు. ఇప్పుడు ఆ వరసలో మాస్ మహారాజ్ రవితేజ చేరిపోయారు. రవితేజ తనయుడు మహాధన్ త్వరలో వెండితెరపై కనిపించబోతున్నాడంటూ కొద్ది రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అది నిజమే. ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజా ది గ్రేట్’ చిత్రం ద్వారా మహాధన్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ మేరకు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
‘మా ‘రాజా ది గ్రేట్’ ద్వారా మాస్ మహారాజా రవితేజ తనయుణ్ని పరిచయం చేయడం ఆనందంగా ఉంది. అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’ అని అనిల్ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే కొన్ని ఫొటోలను కూడా ట్వీట్ చేశారు.
Happy to introduce Mass Maharaj Ravi Teja's son Mahadhan in our #RajaTheGreat . Wishing him a very bright future. pic.twitter.com/erInEqCfzU
— Anil Ravipudi (@AnilRavipudi) September 6, 2017
‘రాజా ది గ్రేట్’ సినిమాలో చిన్నప్పుడు రవితేజ పాత్రలో ఆయన తనయుడు కనిపించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ఈ సినిమా అక్టోబర్ 12న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మెహరీన్ కౌర్ హీరోయిన్గా నటిస్తోంది. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Women's IPL 2019: స్మృతి మంధాన సెంచరీ మిస్.. సూపర్ నోవాస్ టార్గెట్ 141
47 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నఓపెనర్ స్మృతి మంధాన ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో నిలిచి శతకం మార్క్ని కూడా అందుకునేలా కనిపించింది. కానీ.. రాధ యాదవ్.. తెలివిగా ఓపెనర్ని బోల్తా కొట్టించింది.
Samayam Telugu | Updated:
May 6, 2019, 09:40PM IST
Women's IPL 2019: స్మృతి మంధాన సెంచరీ మిస్.. సూపర్ నోవాస్ టార్గెట్ 141
హైలైట్స్
మహిళల ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే స్మృతి మంధాన శతక సమాన ఇన్నింగ్స్
బౌలింగ్, ఫీల్డింగ్లో తేలిపోయిన సూపర్ నోవాస్ టీమ్
పది ఫోర్లు, మూడు సిక్సర్లు బాది జట్టుకి మెరుగైన స్కోరు అందించిన స్మృతి
జైపూర్ వేదికగా మ్యాచ్లు
(Photo: Twitter / @IPL)
పురుషుల తరహాలోనే మహిళా క్రికెటర్లకి కూడా ఐపీఎల్ని నిర్వహించాలని యోచిస్తున్న బీసీసీఐ.. ప్రయోగాత్మకంగా ‘ఉమెన్స్ టీ20 ఛాలెంజ్’ పేరుతో మ్యాచ్ల్ని నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా జైపూర్ వేదికగా సోమవారం జరుగుతున్న తొలి మ్యాచ్లోనే ట్రైల్బ్లాజర్స్ ఓపెనర్ స్మృతి మంధాన (90: 67 బంతుల్లో 10x4, 3x6) శతక సమాన ఇన్నింగ్స్తో ఆకట్టుకుంది. దీంతో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రైల్బ్లాజర్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగా.. సూపర్ నోవాస్ టీమ్ బౌలర్లు పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
మ్యాచ్లో టాస్ గెలిచిన సూపర్ నోవాస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. ఇన్నింగ్స్ ఆరంభించిన ట్రైల్బ్లాజర్స్ టీమ్.. ఆరంభంలోనే ఓపెనర్ సుజీ బేట్స్ (1: 4 బంతుల్లో) వికెట్ చేజార్చుకున్నా.. మరో ఓపెనర్ స్మృతి మంధాన ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో నిలిచింది. ఈ క్రమంలో 47 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న స్మృతి మంధాన.. శతకం మార్క్ని కూడా అందుకునేలా కనిపించింది. కానీ.. ఆఖరి ఓవర్ వేసిన రాధ యాదవ్.. తెలివిగా స్మృతి మంధానాని ఔట్ చేసేసింది. స్మృతి మంధానాతో పాటు ఆ జట్టులో హర్లీన్ డియోల్ (36: 44 బంతుల్లో 3x4) నిలకడగా ఆడింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Jan 10,2018
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో పెరుగుదల
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 18.2శాతం పెరిగాయి. దీంతో ఈ తొమ్మిది నెలల కాలంలో మొత్తంగా రూ.6.56 లక్షల కోట్లకు ఈ పన్నులు చేరాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీలు చెల్లించే కార్పొరేట్ పన్ను, సంపద పన్నుతో పాటు ఆదాయపు పన్నులు ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి. 2017-18లో మొత్తం బడ్జెట్ అంచనాల్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 67శాతం (రూ.9.8 లక్షల కోట్లు)గా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గత తొమ్మిది నెలల్లో మొత్తంగా రిఫండ్స్ చేయకముందు పన్ను వసూళ్లు 12.6శాతం వృద్ధితో రూ.7.68 లక్షల కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో 1.12లక్షల కోట్లు రిఫండ్లను చెల్లించినట్టు పేర్కొంది. అడ్వాన్సు పన్ను వసూళ్లు 12.7శాతంతో రూ.3.18లక్షల కోట్లకు పెరిగాయి. ఈ అడ్వాన్సు పన్నుల్లో కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు 10.9శాతం వృద్ధి నమోదు కాగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను 21.6శాతంగా నమోదు అయినట్టు తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 24, Oct 2018, 11:01 AM IST
Highlights
తిత్లీ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర అల్లకల్లోలమైంది. శ్రీకాకుళం జిల్లాలోని 165 గ్రామాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఆస్థి నష్టం ఎక్కువగా జరిగింది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నా.. సినీ పరిశ్రమ కూడా బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది
తిత్లీ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర అల్లకల్లోలమైంది. శ్రీకాకుళం జిల్లాలోని 165 గ్రామాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఆస్థి నష్టం ఎక్కువగా జరిగింది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నా.. సినీ పరిశ్రమ కూడా బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది.
ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి తారలు ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాలను అందించారు. తాజాగా జీవితా రాజశేఖర్ దంపతులు కూడా తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం తమ వంతు సాయంగా రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అమరావతిలో ఆయన స్వగృహంలో నేరుగా కలుసుకొని రూ.10 లక్షల చెక్ ను అందించారు.
ఇవి కూడా చదవండి.. | 0business
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
కోహ్లీ కంటే జడేజానే చురుకు: ఫీల్డింగ్ కోచ్
దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ డైవ్ చేసి ఒంటిచేత్తో క్యాచ్ల్ని అందుకున్నాడు. కానీ.. జడేజా క్యాచ్ల్ని అందుకుంటూ పరుగుల్నీ కూడా సేవ్ చేయగలడని ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ కితాబిచ్చాడు.
Samayam Telugu | Updated:
Oct 27, 2019, 03:22PM IST
కోహ్లీ కంటే జడేజానే చురుకు: ఫీల్డింగ్ కోచ్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే రవీంద్ర జడేజానే బెస్ట్ ఫీల్డరని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే తుది జట్టులో అవకాశం దక్కించుకున్న జడేజా ఏకంగా 41 పరుగుల్ని జట్టుకి సేవ్ చేశాడు. ఇందులో 30 యార్డ్ సర్కిల్లో ఫీల్డింగ్ చేస్తూ రక్షించినవే 24 పరుగులు కావడం విశేషం. టోర్నీలో ఏ ఫీల్డర్ కూడా ఇన్ని పరుగుల్ని సేవ్ చేయలేదు. దీంతో.. ఈ దశాబ్దంలోనే భారత్ బెస్ట్ ఫీల్డర్ జడేజా అని ఆర్. శ్రీధర్ కితాబిచ్చాడు. ఇప్పటి వరకూ 146 అంతర్జాతీయ మ్యాచ్ల్లో జడేజా 133 క్యాచ్లు అందుకున్నాడు.
Read More: ధోనీలా మాక్స్వెల్.. బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు
‘మైదానంలో జడేజా చురుకుతనం జట్టులోనూ స్ఫూర్తి నింపుతుంటుంది. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ వికెట్ల మధ్య పరుగు తీసే ముందు పునరాలోచించుకునేలా చేసే ఫీల్డర్లలో అతను ముందుంటాడు. టీమిండియా చరిత్రలో అని చెప్పలేను.. కానీ.. గత పదేళ్లలో జడేజానే భారత అత్యుత్తమ ఫీల్డర్. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం బెస్ట్ ఫీల్డర్లు అంటే..? రవీంద్ర జడేజా , మార్టిన్ గప్తిల్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్. ఈ నలుగుర్ని మైదానంలో ఎక్కడ ఫీల్డింగ్కి ఉంచినా.. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంటారు’ అని శ్రీధర్ వెల్లడించాడు. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
ఈమె .. నా జిమ్ పార్ట్నర్.. (వీడియో)
Highlights
ఈమె .. నా జిమ్ పార్ట్నర్.. (వీడియో)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ మధ్య. తాజా వీడియో దానికి నిదర్శనం. నిజానికి ఇద్దరూ చాలా బిజీ. ఇలాంటి సమయంలోనూ ఒకరి కోసం ఒకరు కాస్త టైమ్ గడపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యే విరాట్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో అనుష్కతో కలిసి వర్కవుట్ చేస్తున్న వీడియో ఉంది. ఈ వీడియోలో అనుష్కను పరిచయం చేస్తూ.. ఈమె నా జిమ్ పార్ట్నర్ అని కోహ్లి అన్నాడు. ఈ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నది. ఇప్పటికే 26 లక్షల మంది వరకు వ్యూస్ వచ్చాయి.
A post shared by Virat Kohli (@virat.kohli) on Jun 6, 2018 at 7:35am PDT
Last Updated 7, Jun 2018, 5:15 PM IST | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కమల్ హాసన్కు వార్నింగ్ ఇచ్చారు!
లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ రెండు రోజుల క్రితం తన ఆఫీస్ మెట్ల మీద నుండి జారి పడడంతో కాలికి ఫ్రాక్చర్ అయింది.
| Updated:
Jul 16, 2016, 07:16PM IST
లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ రెండు రోజుల క్రితం తన ఆఫీస్ మెట్ల మీద నుండి జారి పడడంతో కాలికి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్లో చేరి రెండు రోజులు కావస్తున్నా.. కమల్ ఇంకా డిశ్చార్జ్ కాలేదు. దీంతో అభిమానుల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి తోడు కోలీవుడ్లో కొన్ని మీడియా వర్గాలు కమల్కి కాలితో పాటు తలకి కూడా గాయమయిందని అభిమానుల భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇదే విషయమై కమల్ హాసన్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ ఓ ప్రకటన చేశారు. ''కమల్ గారికి ఇంకా రెండు రోజుల పాటు ట్రీట్మెంట్ జరగనుంది. ఈ విషయాన్ని మేము మైనర్గా భావించట్లేదు. ట్రీట్మెంట్ పూర్తయిన తరువాతే ఆయనను డిశ్చార్జ్ చేస్తాం. కానీ ఆయన షూటింగ్లో పాల్గొనడం కుదరదు. ఈ విషయాన్ని ఆయనకు గట్టిగానే చెప్పాం. ఒకరకంగా వార్నింగ్ ఇచ్చామని'' డాక్టర్స్ పేర్కొన్నారు. కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తోన్న ' సుభాష్ నాయుడు ' సినిమా షూటింగ్కు వెళ్ళొద్దనడం బాధకారమైన విషయమనే చెప్పాలి. | 0business
|
May 31,2015
వడ్డీ రేట్లపైనే ఆశలన్నీ..
ముంబయి: జూన్ 1తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రభావితం చేయనుంది. జూన్2న జరగనున్న ఆర్బిఐ ద్వైమాసిక సమీక్షలో కీలక వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయంపైనే మదుపర్లు, పెట్టుబడిదార్లు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇప్పటికే దేశంలో పారిశ్రామికోత్పత్తి సూచీ పేలవంగా చోటు చేసుకోవడానికి తోడు ద్రవ్యోల్బణం కొంత నియంత్రణలో ఉండటంతో ఈ సారి వడ్డీ రేట్లు తగ్గుతాయని మదుపర్లు అంచనాల్లో ఉన్నారు. మరోవైపు రుతుపవనాల రాక మార్కెట్లను ప్రభావితం చేయనుంది. సాధారణ వర్షపాతం చోటు చేసుకుంటే దలాల్ స్ట్రీట్లో విశ్వాసం నెలకొనే అవకాశాలున్నాయి. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువను మదుపర్లు కీలకంగా తీసుకోనున్నారు.
అదే విధంగా అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక వడ్డీ రేట్ల పెంపు అంశం మార్కెట్లను ఒత్తిడికి గురి చేసే అవకాశాలు లేకపోలేదు. కార్పొరేట్ కంపెనీలు ఆర్ధిక ఫలితాల ప్రభావం కొనసాగవచ్చని బ్రోకర్లు పేర్కొంటున్నారు.
మూడు వారాల ర్యాలీకి బ్రేక్
వరుసగా మూడు వారాల పాటు ర్యాలీ కొనసాగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు జూన్ 29తో ముగిసిన వారంలో నష్టాలు చవి చూశాయి. ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచుతుందన్న సంకేతాలకు తోడు, గ్రీస్ భయాలు, రూపాయి మారకం విలువ మార్కెట్లను నష్టాలకు గురి చేశాయి. ఈ నేపధ్యంలోనే గత వారంలో బిఎస్ఇ సెన్కెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 27.828కు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 25 పాయింట్లు పడిపోయి 8,433 వద్ద నమోదయ్యింది. ప్రధానంగా మే డెరివేటివ్స్ కాలపరిమితి గురువారంతో ముగియడంతో మార్కెట్లు ఆ రోజుక ఎక్కువగా ఒత్తిడికి గురి అయ్యాయి. బిఎస్ఇలో మిడ్క్యాప్ సూచీ 96 పాయింట్లు లేదా 0.9 శాతం, స్మాల్క్యాప్ సూచీ 72 పాయింట్లు లేదా 0.6 శాతం చొప్పున పెరిగాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
అందుకే రజినీకాంత్ సినిమా వద్దన్నాను
నాకు నా పాత్ర, స్క్రిప్ట్ నచ్చకపోతే అది రజినీకాంత్ సినిమా అయినా సరే నటించను అంటున్నాడు ప్రముఖ కమెడియన్...
TNN | Updated:
Dec 20, 2016, 08:02AM IST
నాకు నా పాత్ర, స్క్రిప్ట్ నచ్చకపోతే అది రజినీకాంత్ సినిమా అయినా సరే నటించను అంటున్నాడు ప్రముఖ కమెడియన్ వడివేలు. చాలా గ్యాప్ తర్వాత తాను నటించిన కత్తి శాండై మూవీ (ఒక్కడొచ్చాడు) త్వరలోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వడివేలు... సినీకెరీర్ లో గ్యాప్ రావడానికి గల కారణాలు తెలిపాడు. 2011లో డీఎంకే తరపున ప్రచారం చేసిన వడివేలు ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడం... సినిమాల్లో క్రమక్రమంగా తెరమరుగవడం వెంటవెంటనే జరిగిపోయాయి. దాదాపు నాలుగైదేళ్లు అతడు చేసిన సినిమాలు కూడా పెద్దగా ఏమీ లేవు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన మీడియా.. అందుకు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
అయితే, ఈ ప్రశ్నకు స్పందించిన వడివేలు... 'తనకి ఆఫర్లు లేక సినిమాలకు దూరం కాలేదు కానీ మంచి పాత్రలు రాకే సినిమాలు చేయలేదు' అని వివరించాడు. తాను సినిమాలు చేయని సమయంలోనే దాదాపు ఓ 20 సినిమాలు తిరస్కరించాను. వాటిలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగా సినిమా కూడా ఉంది. అందులో నాక్ ఆఫర్ చేసిన పాత్రకున్న ప్రాధాన్యత నాకు నచ్చలేదు. నా పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అది రజినీకాంత్ సినిమా అయినా చేయదల్చుకోలేదు. అందుకే అలా ఆ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అంటున్న వడివేలు... ప్రస్తుతం రిలీజ్ కానున్న ఒక్కడొచ్చాడు మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ తన కెరీర్ పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తంచేశాడు వడివేలు. | 0business
|
- రూ.7 లక్షల కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు జై!
- 14.2 కోట్ల పనిదినాల కల్పనే ధ్యేయంగా అడుగులు
న్యూఢిల్లీ: దేశీయ మౌలిక రంగంలో నెలకొన్న స్త్తబ్దతను పారదోలి, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వ భారీ బడ్జెట్తో రోడ్ల నిర్మాణపు పనులను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రానున్న అయిదేండ్ల కాలంలో దాదాపు రూ.6.92 కోట్ల భారీ వ్యయంతో దేశంలో 83,677 కి.మీ. పరిధిలో రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. తద్వారా 14.2 కోట్ల పనిదినాలతో కూడా ఉద్యోగావ కాశాలను కల్పించాలని నిర్ణయించింది. 2021-22 నాటికి ఈ భారీ నిర్మాణ పనులను చేపట్టాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకొంది. ఉపాధి కల్పనలో మోడీ సర్కారు విఫలమైందన్న నిందను దూరం చేసుకొనేలా సర్కారు ఈ రోడ్ ప్రాజెక్టుకు తెర తీసినట్టుగా తెలుస్తోంది. రోడ్లు నిర్మాణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.5.35 లక్షల కోట్ల వ్యయంతో దాదాపు 34,800 కి.మీ. మేర చేపట్టనున్న భారత్మాలా రోడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటికే సమ్మతినిచ్చిన విషయం తెలిసిందే. కొత్త రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే నిధులలో రూ.2.09 లక్షల కోట్ల సొమ్మును మార్కెట్ల నుంచి.. రూ.1.06 లక్షల కోట్ల సొమ్మును ప్రయివేట్ పెట్టుబడుల రూపంలోను మరో రూ.2.19 కోట్ల మేర నిధులను సీఆర్ఎఫ్, టీవోటీ, భరత్మాలా ప్రాజెక్టు టోల్ ద్వారా సమీకరించనున్నారు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు అనుసంధానతను పెంపొందించేందుకు గాను రానున్న అయిదేండ్ల కాలంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రూ.88,185 కోట్ల వ్యయంతో 1,09,302 కి.మీ. రహదారులను నిర్మించనున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఇంగ్లాండ్కి చావుదెబ్బ.. పాక్ టార్గెట్ 212
ఓపెనర్ జేసన్ రాయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన బారిస్టో నిలకడగా ఆడినా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్
TNN | Updated:
Jun 14, 2017, 06:43PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి ఎరుగకుండా సెమీస్ చేరిన ఇంగ్లాండ్ జట్టు తొలిసారి తడబడింది. పాకిస్థాన్‌ బౌలర్లు హసన్ అలీ (3/35), జునైద్ ఖాన్ (2/42), రుమాన్ రేస్ (2/44) ధాటికి కార్ఢిప్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 211 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ బారిస్టో( 43: 57 బంతుల్లో 4x4), జో రూట్ (46: 56 బంతుల్లో 2x4), బెన్ స్టోక్స్ (34: 64 బంతుల్లో), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (33: 53 బంతుల్లో 4x4) క్రీజులో ఎక్కువ సేపు నిలిచినా.. కనీసం అర్ధశతకం కూడా సాధించలేకపోయారు. ముఖ్యంగా బెన్‌స్టోక్స్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేస్తూ.. ఇన్నింగ్స్ 48వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచినా కనీసం ఒక ఫోర్ కూడా కొట్టలేకపోవడం కొసమెరుపు.
ఓపెనర్ జేసన్ రాయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన బారిస్టో నిలకడగా ఆడినా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ (13) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయాడు. అనంతరం వచ్చిన జో రూట్‌తో కలిసి బారిస్టో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 80 వద్ద బారిస్టో ఔటవగా.. కెప్టెన్ మెర్గాన్- రూట్ జోడి పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది కానీ.. స్కోరు బోర్డు మాత్రం వేగం అందుకోలేదు. పాక్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచారు. బట్లర్ (4), మొయిన్ అలీ (11), అదిల్ రషీద్ (7), ఫ్లంకెట్ (9), మార్క్ఉడ్ (3) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో 49.5 ఓవర్లలో ఇంగ్లాండ్ 211 పరుగులకు కుప్పకూలిపోయింది. | 2sports
|
internet vaartha 162 Views
ముంబై : అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ భారత యూనిట్ తన విస్తృత ప్రాచుర్యం పొందిన కోరెక్స్ దగ్గు మందు విక్రయాలను నిలిపి వేసినట్లు ప్రకటించింది. ఈ మందు మోతాదుకు మించి సేవిస్తే మానవాళి ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుందని ప్రభుత్వ సంస్థలు హెచ్చరించడమే ఇందుకుకీలకం. కోరెక్స్మందులో క్లోఫెని రమైన్ మాలీట్, కోడైన్ సిరప్ రెండూ కలిసి ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. మత్తుకు ప్రాధాన్యతనిచ్చే మిశ్రమాలుగా వీటిని గుర్తించారు. భారత్లో ఇప్పటి వరకూ 344 ఔషధ మిశ్రమా లను నిషేధించిన వాటిలో కోర్కె కూడా ఒకటి. ఏళ్ల తరబడి ఈ మందులు మార్కెట్లో ఉన్నాయి. రాష్ట్రాలవారీగా వీటికి అనుమతులు రావడంతో కేంద్రంకంటే ఎక్కువ రాష్ట్రాలఅనుమతుల ఆధారం గా వీటి విక్రయాలు జరిగాయి. కోరెక్స్ అమ్మకాల నిలిపివేత వల్ల ఫైజర్ రాబడులు లాభాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సుమారు 176 కోట్ల రూపాయల రాబడులు దెబ్బతిన్నాయి. తొమ్మిది నెలల కాలంలో ఈ నష్టం వచ్చినట్లు కంపెనీ భారత్ యూనిట్ నివేదించింది. 30ఏళ్లుగా ఫైజర్ కంపెనీ ఉత్పత్తిచేస్తున్న కోరెక్స్ అత్యంత సమర్ధ మైన, భద్రతాపూర్వక ఔషధంగా విక్రయిస్తున్నారని వెల్లడించింది. అలాగే మరో అమెరికా సంస్థ ఎబ్బట్ ల్యాబ్స్ కూడా కోడైన్ ఆధారిత దగ్గుమందు బ్రాండ్ ను ఫెన్సిడిల్ పేరిట విక్రయిస్తోంది. భారత దగ్గు మందుల మార్కెట్లో ఫెన్సిడిల్ మూడోవంతు వాటాతో ఉంది. ఎబ్బట్కు భారత్లో 100 కోట్ల రాబడుల్లో ఫెన్సిడిల్ విక్రయాల ద్వారా మూడు శాతం వస్తోంది. కంపెనీ ఇప్పటికిప్పుడు స్పందించకపోయినా నిషేధం ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించింది. రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురిస్తూ భారత చట్ట సంస్థలు స్మగ్లింగ్, ఈ మందులకు బానిసలు కావడాన్ని నిరోధించేందుకు మరింతగా చట్టబద్ధమైన విధానా లు అవలంభించాలని ఒత్తిడితెస్తున్నట్లు ఉటంకిం చింది. మత్తుకలిగించే దగ్గు మందుల విక్రయాలను నిలిపివేసేందుకు అవసరమైన అన్ని చట్టాలను ప్రభుత్వం మందుల కంపెనీలపై ప్రయోగిస్తోంది. | 1entertainment
|
Jan 09,2019
విదేశాల్లో రూ.6వేల కోట్ల అక్రమాస్తులు!
న్యూఢిల్లీ: భారతీయులకు విదేశాల్లో ఉన్న దాదాపు రూ.6000 కోట్ల విలువైన అక్రమాస్తులను తాము గుర్తించినట్టుగా ప్రభుత్వం మంగళవారం తెలిపింది. 2015లో అమలులోకి తెచ్చిన 'విదేశీ నల్లధన చట్టం'లో భాగంగా అక్టోబరు, 2018 నాటికి వీటిని గుర్తించినట్టుగా సర్కారు తెలిపింది. వీటికి సంబంధించి దాదాపు 34 విచారణ ఫిర్యాధులను కూడా నమోదు చేసినట్టుగా ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. ఆదాయపు పన్ను శాఖ వీటి గుర్తింపునకు గాను ప్రత్యేక వ్యవస్థతో విశేషంగా కృషి చేస్తోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ప్రతాప్ శుక్లా రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అక్రమాస్తులను వెల్లడించేందుకు గాను ప్రభుత్వం అప్పట్లోనే దేశ ప్రజలకు అవకాశం ఇచ్చిందని ఆయన అన్నారు. ఈ పథకంలో భాగంగా దాదాపు రూ.4100 కోట్ల విలువైన 648 ఆస్తులను ప్రజలు వెల్లడించినట్టుగా మంత్రి తెలిపారు. వీటికి సంబంధించి ప్రభుత్వం పన్ను, అపరాధ రుసుముల రూపంలో దాదాపు రూ.2470 కోట్ల మేర సొమ్మును వసూలు చేసినట్టుగా తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బిర్లాసన్లైఫ్ నుంచి కొత్త మొబైల్ యాప్
ముంబై, నవంబరు 11: ఆదిత్యబిర్లా లైఫ్ అసెట్ మేనేజ్మంట్ కంపెనీలో భాగమైన ఆదిత్యబిర్లా ఆర్థికసేవల గ్రూప్ కింద పనిచేస్తున్న మ్యూచు వల్ఫండ్, బిఎస్ఎల్ ఎంఎఫ్ యాక్టివ్ అకౌంట్ పేరిట కొత్త మొబైల్ అప్లికేషన్ను ఆవిష్కరిం చింది. కస్టమర్లు తమ అదనపు పొదుపు వివ రాలు పొందవచ్చని సిఇఒ ఎ బాలసుబ్రహ్మణియ న్ వెల్లడించారు. కస్టమర్లకు ఎంతో స్నేహపూర్వ కంగాను, సులువుగా నిర్వహించుకునే విధానంలో రూపొందించామని ఆయన అన్నారు. భారతీయు లు పొదుపు అలవాట్లు మార్చేరీతిలో ఈయాప్ పని చేస్తుందని బిర్లాసన్లైఫ్ సిఇఒ వివరించారు. | 1entertainment
|
May 02,2017
కీలక రంగాల్లో 5శాతం వృద్ధి
న్యూఢిల్లీ: కీలక రంగాలు స్తబ్దత వీడి పరుగులు పెడుతున్నట్టుగా సర్కారు తాజాగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. సోమవారం వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం మార్చిలో కీలక రంగాల ఉత్పత్తిలో 5% వృద్ధి నమోదైంది. గత మూడు నెలలతో పోలిస్తే ఇదే వేగవంతమైనది. కీలక రంగాల వృద్ధికి బోగ్గు, స్టీల్ రంగాలు దన్నుగా నిలిచాయి. ఇంతక్రితం ఫిబ్రవరిలో కీలక రంగాల ఉత్పత్తిలో వృద్ధి ఒక శాతంగా ఉంది. 2016 మార్చిలో ఇవి ఏకంగా 9.3 శాతం వృద్ధిని కనబర్చాయి. ఎనిమిది కీలక రంగాలైన బోగ్గు, ముడిచమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు 2016-17 ఏప్రిల్ నుంచి మార్చి కాలానికి 4.5 శాతం పెరుగుదల నమోదు చేసుకున్నాయని సోమవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. 2015-16లో ఈ రంగాలు 4 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో కీలక రంగాల వాటా 38 శాతంగా ఉంది.గత మార్చిలో బోగ్గు ఉత్పత్తి 10శాతానికి పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలో 2.5శాతంగా ఉంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మట్టిలో మాణిక్యం బాహుబలి 2- కింగ్ ఖాన్
బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలూ పొందుతూ.. హాలీవుడ్ స్థాయిలో టాప్ 3 మూవీగా నిలిచి దేశం మీసం తిప్పిన మూవీ
TNN | Updated:
May 16, 2017, 11:45PM IST
బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలూ పొందుతూ.. హాలీవుడ్ స్థాయిలో టాప్ 3 మూవీగా నిలిచి దేశం మీసం తిప్పిన మూవీ. అయితే ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేకర్స్ మొత్తం అద్భుతం అంటూ కొనియాడుతూ ఉంటే మన పక్కన ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ బడా హీరో బాబులు మాత్రం ఇంత వరకూ నోరు మోదపలేదు కాదు కదా బాలీవుడ్ ఖాన్స్ రికార్డ్స్‌ను తుక్కు తుక్కు చేసిన తెలుగోడి సినిమా రికార్డ్స్‌ను ఎప్పుడు బ్రేక్ చేస్తామా? అంటూ స్కెచ్‌లు రెడీ చేసుకున్నారు.
ఈ సినిమా విడుదలై దాదాపు మూడు వారాలు గడుస్తున్నా ఇంత వరకూ ఖాన్‌లతో సహా బడా హీరోలు స్పందించలేదు. అయితే తాజాగా తొలిసారి 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఇండియన్ సినిమాపై బాలీవుడ్ హీరోలు ఇన్నాళ్లకు నోరు విప్పుతున్నారు.
మొదటిగా అక్షయ్ కుమార్ బాహుబలి సినిమాతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. బాహుబలి మూవీకి ఇంతటి హైప్ రావటానికి ఆ సినిమాకు అర్హత ఉందంటూ ట్వీట్ చేయగా.. తాజాగా బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ బాహుబలిపై ప్రశంసలు కురిపించాడు.
ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. సక్సెస్ అనేది నంబర్‌తో కాదు విజన్‌తో ఉంటుంది. బాహుబలి 2 కి ఇంతటి క్రేజ్ రావటం వెనుక శ్రమ ఉంది. ఈ సినిమాకు ఎలాంటి రికార్డ్స్ అయినా క్రియేట్ చేసే అన్ని అర్హతలు ఉన్నాయి. టెక్నాలజీ లేనప్పుడు కూడా మంచి సినిమాలు తీశాం. ఇలాంటి సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా టెక్నాలజీ అవసరం. రాజమౌళి ఆ టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నాడు.
బాహుబలి 2 లాంటి సినిమాలు ఎప్పుడో ఒక్కటి మాత్రమే వస్తాయి. అవే మట్టిలో మాణిక్యాలు అవుతాయి. రాజమౌళి ప్రతి సినిమాలతో స్ఫూర్తిని పొందొచ్చు. ఇది నాతో పాటు ప్రతీ ఫిలిం మేకర్‌ని ఎంతో ఇన్ స్పైర్ చేసే విషయం' అన్నాడు షారూక్ ఖాన్.
ఇంతవరకూ బాగానే ఉందికాని షారుఖ్ ఖాన్ బాహుబలి పార్ట్ 1 మాత్రమే చూశారట. బాహుబలి2ను ఇంకా చూడకుండానే షారూక్ ఖాన్ ప్రశంసలు కురింపించం ఆశ్చర్యంగానే ఉంది. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అక్షయ్ కుమార్తో మహేష్ బాబు ఫైటింగ్ ?
అక్షయ్ కుమార్తో మహేష్ బాబు ఫైటింగ్ ? చదవడానికే ఈ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా వుంది కదా.. ఇక ఈ సీన్
| Updated:
Jun 4, 2016, 11:37AM IST
అక్షయ్ కుమార్తో మహేష్ బాబు ఫైటింగ్ ? చదవడానికే ఈ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా వుంది కదా.. ఇక ఈ సీన్ చూస్తే ఇంకెలా వుంటుందో ఊహించుకోండి! అవును ఫిలింనగర్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఏ.ఆర్. మురుగదాస్, మహేష్ బాబు ఇద్దరూ ఆ సీన్ ఊహించుకున్నట్టే తెలుస్తోంది. అందుకే అక్షయ్ కుమార్ని తమ సినిమాలో మెయిన్ విలన్ రోల్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం శంకర్ డైరెక్ట్ చేస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ 2.0తో అక్కీ బిజీగా వున్నాడు. సో ఎలాగూ ఓ సౌత్ మూవీకి సైన్ చేశాడు కనుక పనిలోపనిగా తమ సినిమాకి కూడా అక్కీని ఒప్పించుకోగలిగితే బాగుంటుందని మురుగదాస్ భావిస్తున్నాడట. గతంలో ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, తమిళ నటుడు అయిన ఎస్.జే. సూర్యని విలన్గా తీసుకోవాలని అనుకున్నట్టుగా వార్తలొచ్చాయి. కానీ మళ్లీ ఇప్పుడేమో ఇలా ప్లాన్ మార్చినట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా చూస్తోంటే ఈ సినిమా తెలుగు, తమిళ ద్వాభాషా చిత్రమేకాకుండా హిందీ కూడా కలుపుకుని త్రిభాషా చిత్రంగా రిలీజ్ అవుతుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Dinesh Karthik IPL: ఐపీఎల్లో మరో భారత కెప్టెన్ పదవికి ఎసరు..?
తాజా సీజన్లో 11 మ్యాచ్లాడిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు నాల్గింటిలో గెలిచి.. ఏకంగా ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ జట్టు చివరిగా ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ చిత్తుగా ఓడింది.
Samayam Telugu | Updated:
Apr 26, 2019, 05:27PM IST
Dinesh Karthik IPL: ఐపీఎల్లో మరో భారత కెప్టెన్ పదవికి ఎసరు..?
హైలైట్స్
ఐపీఎల్ 2019 సీజన్లో ఇప్పటికే కెప్టెన్ని మార్చిన రాజస్థాన్ రాయల్స్
అదే దిశగా కోల్కతా నైట్రైడర్స్ కూడా అడుగులు..?
వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడిన కోల్కతా
కెప్టెన్గా టీమ్ని నడిపించలేకపోతున్న దినేశ్ కార్తీక్
ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం
ఐపీఎల్ 2019 సీజన్లో మరో భారత క్రికెటర్ తన కెప్టెన్సీని త్వరలోనే చేజార్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల వరుస ఓటముల నేపథ్యంలో.. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ తమ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి అజింక్య రహానెని తప్పించి స్టీవ్స్మిత్ చేతికి పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో.. మూడు మ్యాచ్ల్లో టీమ్ని నడిపించిన స్మిత్.. రెండింటిలో విజయాల్ని అందించాడు. తాజాగా.. ఇదే బాటలో నడిచేందుకు కోల్కతా నైట్రైడర్స్ కూడా సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో దినేశ్ కార్తీక్ని కెప్టెన్సీ నుంచి తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్లో ‘భారీ’ బాకీ తీర్చేసిన దినేశ్ కార్తీక్..!
తాజా సీజన్లో 11 మ్యాచ్లాడిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు నాల్గింటిలో గెలిచి.. ఏకంగా ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ జట్టు చివరిగా ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ చిత్తుగా ఓడింది. సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో కోల్కతా ఈ తరహాలో ఎప్పుడూ తడబడలేదు. దీంతో.. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న ఆ జట్టు కనీసం.. కనీసం ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ తప్పక గెలవాలి.
బ్యాటింగ్లో క్రిస్లిన్, నరైన్, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ మెరుగ్గా ఆడుతున్నా.. బౌలింగ్లో తేలిపోతున్న కోల్కతా వరుస మ్యాచ్ల్ని చేజార్చుకుంటోంది. ముఖ్యంగా.. యువ పేసర్లు ప్రసీద్ని సమర్థంగా వినియోగించుకోవడంలో కెప్టెన్ కార్తీక్ ఫెయిలవుతుండగా.. అగ్రశ్రేణి బౌలర్ కుల్దీప్ యాదవ్ని చివరి రెండు మ్యాచ్ల్లోనూ రిజర్వ్ బెంచ్పై కూర్చోబెట్టి విమర్శలు ఎదుర్కొన్నాడు. మ్యాచ్ వ్యూహాలు, బ్యాటింగ్ ఆర్డర్లో లోపాలు, స్లాగ్ ఓవర్లలో ధారాళంగా పరుగులిచ్చే బలహీనత కోల్కతాని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కెప్టెన్సీ మార్పుతో ఏమైనా ప్రయోజనం ఉంటుందా..? అని కోల్కతా ఫ్రాంఛైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దినేశ్ కార్తీక్ని కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. ఆండ్రీ రసెల్, క్రిస్లిన్, నితీశ్ రాణా రేసులో ఉండనున్నారు.
కెప్టెన్సీ మార్పుపై వస్తున్న వార్తల గురించి దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ ‘మ్యాచ్ ఫలితాలు ఇలా వరుసగా వ్యతిరేకంగా వస్తుంటే.. ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం. నేను పరిస్థితిని అర్థం చేసుకోగలను. కానీ.. ఒక జట్టుగా మేము అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని సమాధానమిచ్చాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Visit Site
Recommended byColombia
పీట‌ర్ ముఖ‌ర్జీ త‌న రాజ‌కీయ ప్రాబ‌ల్యంతో దేశం నుంచి విదేశాల‌కు డ‌బ్బు త‌ర‌లించి మ‌ళ్లీ అక్క‌డ నుంచి న‌ల్ల‌ధ‌నాన్ని వివిధ రూపాల్లో దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. ఇందుకోసం ఆయ‌న త‌న భార్య‌ను ఉప‌యోగించుకున్నారు. భార్య పేరిట కంపెనీల‌ను ప్రారంభించారు. ఆ విధంగా 2014కు ముందు విదేశాల నుంచి డ‌బ్బును త‌న భార్య ఇంద్రాణీ ముఖ‌ర్జీ ద్వారా ర‌ప్పించారు. ఐఎన్ఎక్స్ బ్యాన‌ర్ కింద ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఐపీఎమ్ ఐకాన్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఎన్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వివిధ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేశారు. కేవ‌లం డ‌బ్బును బ‌య‌టి దేశాల నుంచి మ‌న దేశానికి ర‌ప్పించేందుకు ఈ విధంగా చేశార‌నేది వీరిపై ఉన్న ప్ర‌ధాన నేరారోప‌ణ‌.
2012లో ఒకానొక స‌మ‌యంలో ఇంద్రాణీ, పీట‌ర్ ముఖ‌ర్జీలిద్ద‌రూ ఐఎన్ఎక్స్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌లో ఉన్న త‌మ పూర్తి వాటాను అమ్మేశారు. సింగ‌పూర్ ప్ర‌భుత్వానికి చెందిన టీమ్సెక్ సైతం ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబ‌డులు పెట్టింది. ఏప్రిల్ 24, 2012 నాడు షీనా బోరా హ‌త్య జ‌రిగే కొన్ని నెల‌ల ముందు వ‌ర‌కూ ఇంద్రాణీ, పీట‌ర్ ముఖ‌ర్జీలు ఐఎన్ఎక్స్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డిదారులుగా ఉన్నారు. దీనికి సంబంధించి ఎన్నో ఏళ్లు విచార‌ణ జ‌రిగింది. షీనా బోరా మ‌ర్డ‌ర్ కేసుకు సంబంధించి ఇంద్రాణీ, పీట‌ర్ ఇరువురూ కొంత కాలం జైల్లో సైతం ఉండాల్సి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.
2007లో ఐపీఎమ్ ఇన్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌కు నేతృత్వం వ‌హించాల్సిందిగా ఇంద్రాణీని అడిగారు. అందుకు ఆమె అంగీక‌రించింది. అంతే కాకుండా 10 కోట్ల రూపాయ‌ల రుణాన్ని ఆమె ఆ కంపెనీకి ఇచ్చార‌ని ద‌ర్యాప్తు సంస్థ‌లు వెల్ల‌డించాయి. ఆ డ‌బ్బుతో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ‌లో కొన్ని షేర్ల‌ను కొనుగోలు చేయ‌డం జ‌రిగింది.
2009లో ఇంద్రాణీ, పీట‌ర్ ఉమ్మ‌డిగా ఐఎన్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మ‌రో కొత్త కంపెనీని ఒకదాన్ని మొద‌లుపెట్టారు. అదే సంవ‌త్స‌రంలో పీట‌ర్ త‌న భార్య ఇంద్రాణీ, కంపెనీ కోడైరెక్ట‌ర్ల‌కు క‌లిపి రూ.10 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. ఆస‌క్తిక‌రంగా ఆ కంపెనీలో 99.9% వాటా ఇంద్రాణీకి ఉండ‌గగా, కంపెనీ మొత్తం మూల‌ధ‌నం రూ.10 కోట్లుగా ఉంది.
అంతే కాకుండా మ‌రో కంపెనీ ఐఎన్ఎక్స్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌ను సైతం రూ.50 ల‌క్ష‌ల పెయిడ‌ప్ క్యాపిట‌ల్ ఉప‌యోగించి ప్రారంభించారు. ఇందులో సైతం 99.9% వాటా ఇంద్రాణీకి ఉండ‌గా,మిగిలింది పీట‌ర్ చేతిలో ఉంది. ఈ కంపెనీలోకి రూ.69 ల‌క్ష‌ల‌ను చొప్పించారు. కంపెనీ మొత్తం వ్యాపార వ్య‌వ‌హారాల‌ను చూస్తే లావాదేవీలు రోజువారీగా ఏమీ లేవు. కేవ‌లం పీట‌ర్ , ఇంద్రాణీ మ‌ధ్య జ‌రిగిన లావాదేవీల‌ను మాత్ర‌మే చూపారు. | 1entertainment
|
olypic stadium
2020 ఒలింపిక్ విజేతలకు వినూత్న పతకాలు
న్యూఢిల్లీ: 2020ఒలింపిక్స్కు రంగం సిద్దమవు తుంది. టోక్యో వేదికగా జరిగే ఈ మెగా టోర్నమెంట్లో విజేతలుగా నిలిచే వారికి ఇచ్చే పత కాలను వినూత్న రీతిలో రూపొందించాలని ప్లాన్ చేస్తు న్నారు. గత సంవత్సరం వేసవిలో జరిగిన రియో ఒలిం పిక్స్లో 30 శాతం వెండి, కాంస్య పతకాలను రీసైక్లింగ్ మెటీరియల్స్తోనే రూపొం దించినట్లు నిర్వా హకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో పాతబడి వాడు కలో లేకుండా మనం పక్కన పడేసిన మొబైల్ పోన్లను రీసె ౖక్లింగ్ చేసే పతకాలను రూపొందించాలని నిర్వా హకులు నిర్ణయించారు. సంప్రదాయం గా ఒలింపిక్,పారాలింపిక్స్ గేమ్స్లో అం దించే పతకాలను బంగారం, వెండి, కాంస్యంతో తయారు చేసేవారు.కానీ వాడుకలో లేని మొబైల్ పోన్లు,ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తమకు అందించాలని జపనీస్ ప్రజలను నిర్వా హకులు కోరుతు న్నారు. వాటిలో 5000 మెడల్స్ రూపొందిస్తున్నా మని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి స్థానిక ఆఫీ సులు,టెలికాం స్టోర్ల ద్వారా సేకరిస్తున్న బాక్స్లో ఎనిమిది టన్ను ల మెటల్ను సేకరించి నట్లు అంచనా వేసినట్లు నిర్వాహకులు వెల్లడిం చారు. రిసైక్లింగ్ చేసిన మెటీరియల్స్లో ఒలింపిక్ మెడ ల్స్ను రూపొందించడం మొదటి క్రీడల్లో కూడా జరిగిందని జపాన్ ప్రజలు పేర్కొంటున్నారు. | 2sports
|
Hyderabad, First Published 19, Aug 2019, 10:47 AM IST
Highlights
ప్రభాస్ నటించిన సాహో చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించింది. వేల సంఖ్యల అభిమానుల మధ్యలో వేడుక అట్టహాసంగా జరిగింది.
ప్రభాస్ నటించిన సాహో చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించింది. వేల సంఖ్యల అభిమానుల మధ్యలో వేడుక అట్టహాసంగా జరిగింది. ఇక ప్రభాస్ సినిమా వేడుకలో కొంత భావోద్వేగానికి లోనయ్యారు.
రాజమౌళి మాట్లాడుతుండగా ప్రభాస్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.అలాగే పెదనాన్న కృష్ణంరాజు స్పీచ్ కి కూడా ప్రభాస్ కంటతడి పెట్టుకున్నాడు.సైలెంట్ గా నవ్వుకుంటూ కనిపించే ప్రభాస్ ఒక్కసారిగా అలా కనిపించే సరికి టీవీ చూస్తున్న చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. గతంలో బాహుబలి ఆడియో వేడుకలో రాజమౌళి అన్న కీరవాణి పాటకు ఎమోషనల్ అయినట్టు ఇప్పుడు అదే ప్లేస్ లో మళ్ళీ ప్రభాస్ కూడా కొంత ఎమోషనల్ అయ్యాడు.
ఏ తెలుగు హీరో చేయని విధంగా తన సినిమా వరల్డ్ వైడ్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ అవుతుండడం, అలాగే తను ఈ స్థాయికి వచ్చేలా చాలా మంది కష్టపడ్డారని అందుకు ప్రభాస్ ఎమోషనల్ అయ్యారని సన్నిహితుల ద్వారా తెలిసింది. అందుకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Last Updated 19, Aug 2019, 12:06 PM IST | 0business
|
Suresh 86 Views
శాంసంగ్ నుంచి గెలాక్సీ జెసిరీస్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: దక్షిణకొరియా సంస్థ శాంసంగ్ కొత్తగా గెలాక్సీ జె7 ప్రైమ్, గెలాక్సీ జె5ప్రైమ్ను మెటల్ డిజైన్లో విడుదలచేసింది. భారత్ విక్రయాల అధిపతి మనుశర్మ రెండువెర్షన్లను మార్కెట్కు విడుదలచేసారు. ఎస్సెక్యూర్, ఎస్పవర్ప్లానింగ్ డిజైన్లలో ఈ ఫోన్లు అందుబాటులోనికి వచ్చాయ న్నారు. మేక్ ఫర్ ఇండియాకోసం ఈ రెండుఫోన్లు భారత్మార్కెట్కు వచ్చి నట్లు వివరించారు. 2.5డి గొరిల్లా గ్లాస్ ప్రీమియంలుక్తో ఉంటాయి. గెలాక్సీ జె7ప్రైమ్, జె 5ప్రైమ్ 5.5అంగుళాల హెచ్డి, 5అంగుళాల హెచ్డి స్క్రీన్తో వస్తున్నాయి. ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జిబిరామ్, జె5కు క్వాడ్కోర్ ప్రాసెసర్ 2జిబి రామ్ వంటివి ఉంటాయి. 256జిబి వరకూ మెమరీని విస్త రించుకోవచ్చు. 13ఎంపి, 8 ఎంపి కెమేరాలున్నాయి. జె7ప్రైమ్ రూ.18,790లు, జె5ప్రైమ్ 14,790లుగాప్రకటించారు. సెప్టెంబరు 16వ తేదీనుంచి అందు బాటులోనికి వచ్చాయని పసిడి, నలుపురంగుల్లో ఈఫోన్లు అందుబాటులో ఉంటాయి. వొడాఫోన్ నెట్ వర్క్పై జె5ప్రైమ్ అదనంగా 9జిబిడేటా సౌకర్యం ఉంటుంది. ఒకజిబిఛార్జి చేస్తే అదనపు డేటా వస్తుంది. ఈ సదుపాయం మూడు నెలలపాటు మూడు రీఛార్జీలకు అందుబాటులో ఉంటుందని మనుశర్మ వివరించారు. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కివీస్పై బదులు తీర్చుకున్న భారత్
తొలి వన్డే ఓటమికి భారత్ కసితీరా బదులు తీర్చుకుంది. పుణె వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో 231 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్ శిఖర్ ధావన్ (68: 84 బంతుల్లో 5x4, 2x6), దినేశ్ కార్తీక్ (64 నాటౌట్: 92 బంతుల్లో 4x4, ) అర్ధ శతకాలు బాదడంతో
TNN | Updated:
Oct 25, 2017, 09:03PM IST
తొలి వన్డే ఓటమికి భారత్ కసితీరా బదులు తీర్చుకుంది. పుణె వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో 231 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్ శిఖర్ ధావన్ (68: 84 బంతుల్లో 5x4, 2x6), దినేశ్ కార్తీక్ (64 నాటౌట్: 92 బంతుల్లో 4x4, ) అర్ధ శతకాలు బాదడంతో భారత్ 46 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు వన్డేల ఈ సిరీస్‌ 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక చివరి వన్డే కాన్పూర్ వేదికగా ఆదివారం జరగనుంది.
లక్ష్యఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (7) విఫలమైనా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (29: 29 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి శిఖర్ ధావన్ జట్టుకి శుభారంభమిచ్చాడు. అయితే.. జట్టు స్కోరు 79 వద్ద గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి ఔటవడంతో టీమిండియాలో చిన్నపాటి కలవరం మొదలైంది. కానీ.. శిఖర్ ధావన్ బాధ్యతాయుతంగా ఆడి.. దినేశ్ కార్తీక్‌తో కలిసి మూడో వికెట్‌కి అర్ధశతకానికిపైగా భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే 50 పరుగుల మైలురాయిని అందుకున్న ధావన్.. జట్టు స్కోరు 145 వద్ద ఔటైనా.. హార్దిక్ పాండ్య (30: 31 బంతుల్లో 2x4, 1x6) పవర్ హిట్టింగ్‌తో జట్టుని విజయతీరాలకి చేర్చాడు. చివర్లో మహేంద్రసింగ్ ధోనీ (18 నాటౌట్: 21 బంతుల్లో 3x4)తో కలిసి దినేశ్ కార్తీక్ గెలుపు లాంఛనాన్ని 232/4తో పూర్తి చేశాడు. | 2sports
|
Hyderabad, First Published 24, Jun 2019, 2:53 PM IST
Highlights
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యారవేత్త ఉపాసన.. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కొడుకు ఇజాన్ తో సరదాగా గడిపారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యారవేత్త ఉపాసన.. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కొడుకు ఇజాన్ తో సరదాగా గడిపారు. ఇజాన్ తో కలిసి ఉపాసన లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇజాన్ తో కలిసి సరదాగా ఆడుకున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ఈ ఫోటోలలో సానియా మీర్జా, ఆమె సోదరి ఆనం మీర్జా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతోన్న పాకిస్థాన్ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా ఉన్నారు.
అందుకే ఆమె క్రికెట్ మ్యాచ్ లను చూడడానికి గత కొద్దిరోజులుగా ఇంగ్లాండ్ లోనే ఉన్నారు. ఆమెతో పాటు సోదరి ఆనం మీర్జా, ఆమె భర్త కూడా ఉన్నారు. వీరిని కలిసి ఉపాసన.. లండన్ వీధుల్లో వారితో కలిసి సమయం గడిపింది. సానియాకి ఉపాసనకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పుడప్పుడు కలుసుకుంటూ తమ స్నేహాన్ని తెలియజేస్తుంటారు.
— Upasana Konidela (@upasanakonidela) June 24, 2019
Last Updated 24, Jun 2019, 2:53 PM IST | 0business
|
అంచనాలను మించిన రిలయన్స్
- రూ.7,704 కోట్లకు చేరిన లాభాలు
న్యూఢిల్లీ: 'రిలయన్స్ ఇండిస్టీస్' (ఆర్ఐఎల్) రెండో త్రైమాసికానికి అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు మధ్య కాలంలో ఆర్ఐఎల్ 18 శాతం వృద్ధితో రూ.7,704 కోట్ల ఏకీకృత నికర లాభాలను నమోదు చేసినట్లుగా తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6,534 కోట్ల లాభాలు ఆర్జించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.66.198 కోట్ల నుంచి రూ.66,624 కోట్లకు చేరింది. చమురు, గ్యాస్ విభాగం రెవెన్యూ 35.7 శాతం తగ్గి రూ.1,327 కోట్లకు పరిమితమయ్యింది. ద్వితీయ త్రైమాసికంలోనూ అంచనాలు మించి మెరుగైన ఫలితాలు సాధించామని రిలయన్స్ ఇండిస్టీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. గడ్డు కాలంలోనూ పటిష్టమైన రిఫైనరీ వ్యాపారం, పెట్రోకెమికల్స్లో మంచి ప్రగతిని కనబర్చడం ద్వారా మేటి ఫలితాలను సాధించగలిగామని వివరించారు. రెండో త్రైమాసిక కాలంలో రిలయన్స్ రిటైల్ లాభాలు 31 శాతం వృద్ధితో రూ.264 కోట్లకు చేరాయి. ఈ విభాగం రెవెన్యూ 63 శాతం పెరిగి రూ.4,956 కోట్లుగా నమోదయ్యింది. ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్ఈలో ఆర్ఐఎల్ షేర్ ధర 0.15 శాతం పెరిగి రూ.1,088.50 వద్ద ముగిసింది.
అంబానీ ఆస్తి.. ఆ దేశ జీడీపీతో సమానం!
ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తి ఉత్తర యూరోప్లోని ఎస్తోనియా దేశ స్థూల జాతీయోత్పత్తితో సమానమట! ఈ విషయాన్ని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ఫోర్బ్స్ గణంకాల ప్రకారం ముఖేష్ అంబానీ ఆస్తి విలువ 22.7 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండో స్థానంలో ఉన్న సన్ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ ఆస్తి 16.9బిలియన్ డాలర్లుగా, మూడో స్థానంలో ఉన్న హిందుజా కుటుంబానిది 15.2బిలియన్ డాలర్లుగా ఉంది. నాలుగో స్థానంలో అజీమ్ ప్రేమ్జీ ఆస్తి 15బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది మొజాంబిక్ దేశ స్థూల దేశీయోత్పత్తితో సమానం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
spyder audio to release in chennai
‘స్పైడర్’ ఆడియో విడుదల అక్కడే..!
కొన్ని దశాబ్దాల తర్వాత ఒక తెలుగు సినిమా ఆడియో అక్కడ విడుదల అవుతోంది..
TNN | Updated:
Sep 7, 2017, 07:54AM IST
తెలుగు హీరోల సినిమాలు పక్క భాషల్లోకి అనువాదం కావడం, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కావడం కొత్తేమీ కాదు. అయితే మహేశ్ ‘స్పైడర్’ మాత్రం తమిళనాట భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇది వరకూ మహేశ్ సినిమాలు తమిళంలోకి అనువాదమైన ఆకట్టుకున్నాయి. ఇప్పుడు స్పైడర్ కు దర్శకుడు కూడా తమిళుడే కావడంతో... ఈ సినిమాపై అక్కడ ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంది. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఇమేజ్ తో ఈ సినిమా అక్కడ భారీ ఎత్తున విడుదల అవుతోంది.
ఈ సినిమా తమిళ డబ్బింగ్ రైట్స్ కూడా రికార్డు స్థాయి మొత్తం పలికినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదో తేదీన స్పైడర్ ఆడియో విడుదల కానుంది. చెన్నై అందుకు వేదికగా నిలవనుంది. ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. ఈ సినిమా తెలుగు ఆడియోను కూడా చెన్నైలోనే విడుదల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు ఆడియోను కూడా అక్కడే రిలీజ్ చేస్తున్నారు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మెల్బోర్న్లో సెంచరీలు కొడతా: రహానె
ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన రహానె కనీసం ఒక శతకం కూడా సాధించలేకపోయాడు. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపైనా అతను మూడంకెల స్కోరుని అందుకోవడంలో తడబాటుని కొనసాగిస్తున్నాడు.
Samayam Telugu | Updated:
Dec 24, 2018, 03:22PM IST
మెల్బోర్న్లో సెంచరీలు కొడతా: రహానె
ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టు మ్యాచ్లో తాను సెంచరీలు సాధిస్తానని భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానె ధీమా వ్యక్తం చేశాడు. సిరీస్లో ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. రెండు అర్ధశతకాలు బాదిన రహానె.. విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారా తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు.
ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన రహానె కనీసం ఒక శతకం కూడా సాధించలేకపోయాడు. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపైనా అతను మూడంకెల స్కోరుని అందుకోవడంలో తడబాటుని కొనసాగిస్తున్నాడు. మొత్తంగా.. ఈ ఏడాది విదేశీ పర్యటనల్లో 19 ఇన్నింగ్స్ల్లో కలిపి రహానె చేసిన పరుగులు 609కాగా.. ఇందులో ఐదు అర్ధశతకాలు మాత్రమే ఉన్నాయి.
‘మెల్బోర్న్ టెస్టులో కచ్చితంగా సెంచరీ సాధిస్తాను. ఒకటి కాదు.. రెండు శతకాలను అందుకుంటా. అడిలైడ్ (తొలి) టెస్టు నుంచి నా బ్యాటింగ్ మెరుగుపడింది. మెల్బోర్న్లోనూ పరిస్థితుల్ని వేగంగా అర్థం చేసుకుని.. బ్యాటింగ్ చేస్తాను. అయితే.. ఇక్కడ వ్యక్తిగత రికార్డుల కోసం నేను ఆడను. జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం. పెర్త్ టెస్టు తర్వాత వారం రోజులు విశ్రాంతి దొరికింది. కాబట్టి.. నూతనుత్తేజంతో మూడో టెస్టు ఆడతాం’ అని రహానె వెల్లడించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి, ధోనీ.. మీరెందుకు పాక్ రావడం లేదు?
వరల్డ్ ఎలెవన్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ల్లో ధోనీ, కోహ్లి ఆడితే భలే ఉండేది. కానీ వారెందుకు రావడం లేదు?
TNN | Updated:
Sep 12, 2017, 01:46PM IST
పాకిస్థాన్ , ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య లాహోర్లోని గడాఫీ స్టేడియంలో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు ఆడటం కోసం డుప్లెసిస్ నాయకత్వంలోని ఐసీసీ ఎలెవన్ ఇప్పటికే పాక్ చేరుకుంది. ఉగ్రవాద దాడి కారణంగా 8 ఏళ్లుగా పాక్‌లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశమూ ముందుకు రాకపోవడంతో.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత తమ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో పాకిస్థానీ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. కానీ కొందరు మాత్రం ధోనీ, కోహ్లి లాంటి భారత క్రికెటర్లు ఆడితే ఇంకా బావుండేదంటున్నారు.
కోహ్లి లాంటి భారత స్టార్ క్రికెటర్లు ఆడితే పాకిస్థాన్‌కు క్రికెట్ తప్పకుండా తిరిగొస్తుంది. వరల్డ్ ఎలెవన్ తరఫున భారత క్రికెటర్లు ఎందుకు ఆడటం లేదు..? నిన్ను మిస్సవుతున్నాం కోహ్లీ.. అంటూ కొందరు పాక్ క్రికెట్ అభిమానులు ట్వీట్లు చేశారు. కోహ్లి, ధోనీ వరల్డ్ ఎలెవన్ తరఫున తమ బ్యాటింగ్‌తో అలరిస్తే చూడాలని ఉందని పాకిస్థానీయులు ఆరాటపడుతున్నారు. సెప్టెంబర్ 12, 13, 15 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
డీజే పాప ‘టాప్’ లేపేసిందిగా!
అస్మైకయోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం, అంగాంగ తేజ శృంగార భావ సుకమార సుందరం అంటూ డీజేతో కలిసి పూజా హెగ్డే దుమ్ములేపేయడంతో ..
TNN | Updated:
May 30, 2017, 05:41PM IST
నటి పూజా హెగ్డే తెలుగులో నటించిన రెండు చిత్రాల్లోనూ పద్దతిగా కనిపించింది. బాలీవుడ్‌లో కూడా ఆమె అటువంటి పాత్రల్లోనే కనిపించింది. ఇప్పటివరకు వెండితెరపై పూజా గ్లామర్‌ను వాడుకొనే ప్రయత్నం చేయలేదు. అయితే హీరోయిన్‌గా ఎక్కువ కాలం ఉండాలనుకునే వారెవరూ కూడా ట్రడిషనల్ ముద్రతో కొనసాగాలని అనుకోరు. గ్లామర్‌తో ఆకట్టుకోకపోతే ఇండస్ట్రీలో మనుగడ కష్టం
ముఖ్యంగా పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావాలంటే ఖచ్చితంగా ఇమేజ్‌లో మేకోవర్ రావాల్సిందే. దువ్వాడ జగన్నాథం సినిమాలో పూజాకు కూడా అలాంటి మేకోవర్ ఇచ్చినట్లున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. హీరోయిన్‌ను గ్లామరస్‌గా చూపించడంలో హరీష్ శంకర్‌కు ఓ స్పెషాలిటీ ఉంది.
హీరోయిన్స్‌తో ఎక్స్ పోజింగ్ చేయించకుండానే వారిని చాలా అందంగా చూపిస్తాడు. గబ్బర్ సింగ్ సినిమాలో శృతిని అలానే చూపించి తన ఇమేజ్‌ను మార్చేశాడు. ఇప్పుడు పూజా వంతు వచ్చింది. నిన్న విడుదలైన 'గుడిలో బడిలో మదిలో' అనే పాటలో పూజా చాలా కొత్తగా కనిపించింది. ఆమెను చాలా అందంగా చూపించాడు హరీష్ శంకర్.
ఆమె కాస్ట్యూమ్స్, స్టెప్పులు ప్రతిదీ కూడా పూజాను బాగా ఎలివేట్ చేశాయి. ఈ సినిమా ఆమెకు ఖచ్చితంగా ఓ టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఉంది. ఈ సినిమా గనుక సూపర్ హిట్ అయితే పూజాకు టాప్ హీరోయిన్ రేంజ్ రావడం ఖాయం. | 0business
|
Suseel kumar
రెజ్లర్ సుశీల్ కుమార్తో కొలిక్కి రాని చర్చలు
ఓర్లాండో: రెండు ఒలింపిక్ పతకాల విజేత,రెజ్లర్ సుశీల్ కుమార్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్ మెంట ్(డబ్ల్యూడబ్ల్యూఇ)లో చేరడం లేదు.సుశీల్తో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చలేదని డబ్ల్యూడబ్ల్యూఇ ఉపాధ్యక్షుడు కన్యున్ సీమన్పేర్కొన్నాడు.గత అక్టోబరులో డబ్ల్యూడబ్ల్యూఇ ప్రతినిధులు తనను కలి శారని సుశీల్కుమార్ పేర్కొన్న సంగతి తెలిసిందే.భారత్లో గొప్ప పేరు ప్రతిష్టలున్న సుశీల్కు పోటీ తత్వం నెలకొన్న అమెరికాలో తగిన గౌరవం ఖచ్చితంగా లభిస్తుందనిచెప్పలేమని సీమన్ పేర్కొన్నాడు. | 2sports
|
West indies
వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ రికార్డు
గయానా: వెస్టిండీస్ క్రికెట్ జట్టు తన వన్డే చరిత్రలో సరికొత్త మైలురాయిని సాధించింది. తొలిసారి వన్డే క్రికెట్లో మూడువందల పరు గులకు పైగా టార్గెట్ సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 309 పరుగులు టార్గెట్ను సాధించింది. తద్వారా విండీస్ వన్డే క్రికెట్ చరిత్రలో మూడు వందలకు పైగా టార్గెట్ను తొలిసారి ఛేదించినట్లయింది. అంతకు ముందు 44 సంవత్సరాల తన వన్డే క్రికెట్ చరిత్రలో 31 సార్లు మూడు వందలకు పైగా టార్గెట్ను ఛేదించడంలో వెస్టిండీస్ విఫలమైంది.2004లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో విండీస్ టార్గెట్ను ఛేదిస్తూ 300 పరుగులు చేసింది.
అయితే అక్కడ విండీస్కు నిర్ధేశించబడిన టార్గెట్ 298 పరుగులు మాత్రమే. తాజా మ్యాచ్లో పాక్ విసిరిన 309 పరుగులు టార్గెట్ ఛేదనలో వెస్టిండీస్ ఓపెనర్ ఎడ్ లూయిస్ 47 మంచి ఆరంభాన్నివ్వగా, మిడిలార్డర్ ఆటగాడు కీరన్ పావెల్ 61 పరు గులతో హాఫ్ సెంచరీ సాధించాడు.ఆ తరువాత జాసన్ మొహ్మద్ 91 పరుగులతో చెలరేగి ఆడాడు.పాకిస్థాన్ బౌలింగ్ను చీల్చి చెండాడుతూ మెరుపు బ్యాటింగ్ చేశాడు.అతనికి ఆష్లేనర్స్ 34 పరుగులతో చక్కటి సహకారం అందివ్వ డంతో విండీస్ ఇంకా ఓవర్ మిగిలి ఉండగానే ఆరు వికెట్ల నష్టానికి టార్గెట్ చేరుకుంది.దీంతో సరికొత్త రికార్డును లిఖించింది. | 2sports
|
Jul 04,2018
మారుతీ బ్రెజ్జా రికార్డు అమ్మకాలు
ముంబయి: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఎస్యూవీ విక్రయాల్లోనూ తన తస్తా చాటుతోంది.ఎస్యూవీ సెగ్మెంట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం విటారా బ్రెజ్జా 3 లక్షల విక్రయాలను చేరువైంది. ఈ కొత్త వాహనం మార్కెట్లోకి అడుగుపెట్టిన 28 నెలల కాలంలో ఈ హాట్ సేల్ను సాధించినట్టుగా కంపెనీ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ప్రతి నెల ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాప్ 10లో ప్లేస్ సాధించే మారుతీ సుజుకీ ఘనతను బ్రెజ్జా మరింత పెంచడమే కాకుండా.. ఎస్యూవీ వాహనాల రారాజుగా ఉంటూ వస్తోన్న మహీంద్రాను అమ్మకాలను ఇది అధిగమించిదని సంస్థ తెలిపింది. 2018 ఆర్థిక సంవత్సరంలో మారుతీ యూవీ సేల్స్ 53759 యూనిట్లతో 27.53 శాతం వృద్ధిని సాధించిందని.. విక్రయాలు 25.69 శాతం నుంచి 27.53 శాతానికి పెరిగాయని కంపెనీ తెలిపింది. బ్రెజ్జా టాప్వేరియింట్ విక్రయాలు 56శాతం పుంజుకున్నాయని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ ఎస్ కల్సీ వెల్లడించారు. ఈ సెగ్మెంట్లో పలుకొత్త కార్లు వచ్చినప్పటికి మార్చి 2016 లో లాంచ్ అయిన విటారా బ్రెజ్జా ఉత్తమంగా నిలిచిందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నోకియాతో ఎయిర్టెల్ ‘వీవోఎల్టీఈ’ ఒప్పందం
వాయిస్ ఓవర్ ఎల్టీఈ (VoLTE) కాలింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ఎయిర్టెల్ చర్యలు ప్రారంభించింది.
TNN | Updated:
Nov 2, 2016, 03:30PM IST
వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ ( VoLTE ) కాలింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ఎయిర్‌టెల్ చర్యలు ప్రారంభించింది. ఈ వీవోఎల్టీఈని టెక్నాలజీని తీసుకురావడానికి ఫిన్‌లాండ్ దిగ్గజ కంపెనీ నోకియాతో భారతీ ఎయిర్‌టెల్ ఒప్పందం చేసుకుంది. ఈ టెక్నాలజీ కోసం నోకియాకు ఎయిర్‌టెల్ 60 మిలియన్ డాలర్లు (రూ. 402 కోట్లు) చెల్లిస్తోంది. ఎయిర్‌టెల్ వీవోఎల్టీఈ సదుపాయం ఈ ఏడాదే అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
వీవోఎల్టీఈ టెక్నాలజీని ఎయిర్‌టెల్ కొన్ని ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించింది. దీని కోసం నోకియాతో చిన్న ఒప్పందాన్ని కూడా అప్పట్లో కుదుర్చుకుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా తీసుకురావాలని నోకియాతో పూర్తిస్థాయి ఒప్పందం చేసుకుంది.
వీవోఎల్టీఈ ద్వారా ఆపరేటర్ వాయిస్, డాటా సర్వీస్‌లను ఒకేసారి అందజేయడానికి వీలుంటుంది. ఎల్టీఈ డాటాను ఉపయోగించుకుని ఒక యాప్ సహాయంతో వాయిస్ కాల్స్ చేయడం వీలవుతుంది. ప్రస్తుతం రిలయన్స్ జియో కూడా అదే చేస్తోంది. జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకోడానికి ఇప్పుడు ఎయిర్‌టెల్ వీవోఎల్టీఈ టెక్నాలజీలోకి అడుగుపెడుతోంది. అయితే ఇది ఎయిర్‌టెల్‌కే కలుసొచ్చేలా ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఇంటర్ కనెక్షన్ సమస్యతో బాధపడుతున్న జియోకు ఎయిర్‌టెల్ వీవోఎల్టీఈ ప్రారంభమైతే కాల్ ఫెయిల్యూర్ సమస్య మరింత అధికమవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఎయిర్‌టెల్ తరవాత భారత్‌లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న టెలికాం ఆపరేటర్లు ఐడియా, వొడాఫోన్ కూడా త్వరలో వీవోఎల్టీఈ రేస్‌లో పాల్గోనున్నట్లు తెలుస్తోంది. | 1entertainment
|
Suresh 117 Views RAVI SHASTRI
ravi shastri
ముంబాయి: టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కోహ్లీ సేనపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఏ భారత జట్టు
సాధించని విజయాలు కోహ్లీ సేన సాధిస్తుందని, గత రెండు దశాబ్దాల కాలంలో భారత్ తరఫున ఎంతో మంది దిగ్గజాలు
ఆడారని, కాని శ్రీలంకలో టెస్ట్ సిరీస్ మాత్రం గెలుచుకోలేకపోయారని, గత 22ఏళ్ల కాలంలో 2015లో మాత్రమే ఇది
సాధ్యమైందని ఆయన అన్నారు. గతంలో భారత దిగ్గజాలు చేయలేని పనిని ఇప్పుడు కోహ్లీ సేన మరోసారి చేసి చూపిస్తుందని
రవిశాస్త్రి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. | 2sports
|
Hyderabad, First Published 23, Aug 2018, 10:49 AM IST
Highlights
ఈ సీజన్ మొత్తంలో ఎన్నడూ లేని విధంగా గత రెండు రోజులుగా బిగ్ బాస్ షో సాగుతుంది. పెళ్లి టాస్క్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాడు
ఈ సీజన్ మొత్తంలో ఎన్నడూ లేని విధంగా గత రెండు రోజులుగా బిగ్ బాస్ షో సాగుతుంది. పెళ్లి టాస్క్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాడు బిగ్ బాస్. ఈ షో కోసం స్పాన్సర్ చేస్తోన్న ఓ షాపింగ్ మాల్ ని ప్రమోట్ చేయడానికి ఈ టాస్క్ ని ఇచ్చినట్లు అనిపిస్తోంది. 'రాధాకృష్ణ మధులత' అనే రెండు బొమ్మలకు పెళ్లి చేయడం, మెహందీ ఫంక్షన్, పెళ్లి, సంగీత్ ఆఖరికి శోభనం కూడా ఈ టాస్క్ లో భాగమే.
ఈ పెళ్లి నాటకం గత రెండు రోజులుగా సాగుతుంది. కనీసం నిన్నటితో ఎండ్ చేస్తారనుకుంటే ఈరోజు కూడా ఆ టాస్క్ సాగనుంది. బిగ్ బాస్ సీజన్ మొత్తానికి ఇదొక చెత్త ఎపిసోడ్ అనే చెప్పాలి. పైగా ఈ పెళ్లి కోసం కంటెస్టెంట్ లను నటించమంటే వారి అతి నటన ప్రేక్షకులను మరింత విసిగిస్తుంది. అనసూయ లాంటి హాట్ యాంకర్ ఈ టాస్క్ లో పాలు పంచుకున్న పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. పైగా ఈ టాస్క్ లో సామ్రాట్, రోల్ రైడాలను పిలిచి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం కామెడీగా అనిపిస్తుంది. పోనీ ఆ టాస్క్ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉందా..? అంటే అదీ లేదు.
దీంతో రెగ్యులర్ గా ఈ షో ఫాలో అయ్యేవారిని కాస్త ఈ టాస్క్ భయపెట్టిందనే చెప్పాలి. వామ్మో.. ఇంక మా వల్ల కాదు అంటూ తలలు పట్టుకుంటున్నారు. కనీసం ఈరోజైనా టాస్క్ పూర్తయిందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే మంచిది లేదంటే టీఆర్పీ రేటింగులు అమాంతం పడిపోయినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారని జనాలకు ఆసక్తి కలిగిన ఈ వారాన్ని కాస్త బిగ్ బాస్ పెళ్లి అంటూ విరక్తి వచ్చేలా చేసేశాడు. ఇకనైనా బ్రాండింగ్ ని పక్కన పెట్టి షో లో టాస్క్ లపై కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది!
Last Updated 9, Sep 2018, 1:09 PM IST | 0business
|
IND vs BAN 1st Test LIVE Score బోర్డు కోసం క్లిక్ చేయండి..!
భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (243: 330 బంతుల్లో 28x4, 8x6) డబుల్ సెంచరీతో చెలరేగగా.. వైస్ కెప్టెన్ అజింక్య రహానె (86: 172 బంతుల్లో 9x4), రవీంద్ర జడేజా (60 నాటౌట్: 76 బంతుల్లో 6x4, 2x6), చతేశ్వర్ పుజారా (54: 72 బంతుల్లో 9x4) అర్ధశతకాలతో సత్తాచాటారు. దీంతో.. 114 ఓవర్ల పాటు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీమిండియా 493/6తో తిరుగులేని స్థితిలో నిలిచింది.
India Double Centuries: ఔరా టీమిండియా.. వరుసగా 4 టెస్టుల్లో 4 డబుల్ సెంచరీలు
భారత ఫాస్ట్ బౌలర్ల దెబ్బకి తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్ కనీసం రెండో ఇన్నింగ్స్లోనైనా పోటీనివ్వాలని ఆశిస్తోంది. కానీ.. 343 పరుగుల భారీ లోటుతో ఒత్తిడిలో ఈరోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న ఆ జట్టు.. మళ్లీ మ్యాచ్లోకి రావడం కత్తిమీద సామే. తొలి ఇన్నింగ్స్లో ముష్ఫికర్ రహీమ్ (43) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దీనికి తోడు.. టెస్టు రికార్డ్ల్లోనూ ఇప్పటి వరకూ భారత్పై గెలిచిన చరిత్ర బంగ్లాదేశ్కి లేదు. ఈ నేపథ్యంలో.. భారత్ జట్టు విజయం దాదాపు ఖాయమవగా.. ఎంత తేడాతో అనేది తేలాల్సి ఉంది.
Read More: టీమిండియాలోకి ధోనీ రీఎంట్రీ డేట్ ఫిక్స్..!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
virat kohli breaks so many records in 2017
కోహ్లి ఈ ఏడాది బ్రేక్ చేసిన రికార్డులివి!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఏడాది ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడో తెలుసా..? ఇంగ్లాండ్పై సెంచరీతో మొదలు..
TNN | Updated:
Nov 5, 2017, 04:47PM IST
నవంబర్ 5న పుట్టిన రోజు జరుపుకొంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి .. ఈ ఏడాది అనేక రికార్డులను కొల్లగొట్టాడు. 2017 ప్రారంభంలోనే విరాట్ రికార్డుల వేట మొదలైంది. జనవరి 15న ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో కోహ్లి సెంచరీ సాధించాడు. తద్వారా లక్ష్య చేధనలో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా సచిన్‌ను అధిగమించాడు. సచిన్ ఛేజింగ్‌లో 14 సెంచరీలు చేయగా.. కోహ్లి ఆ రికార్డును బద్దలు కొట్టాడు. మరో వారం వ్యవధిలోనే విరాట్ మరో ఘనత సాధించాడు.
అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. తర్వాత హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో.. వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌లలో డబుల్ సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. డాన్ బ్రాడ్‌మాన్, రాహుల్ ద్రవిడ్‌ల రికార్డులను విరాట్ బద్దలు కొట్టాడు.
జూన్ 15న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి మరో ఘనత సాధించాడు. వన్డేల్లో వేగంగా 8 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా విరాట్ నిలిచాడు. కోహ్లి 175 ఇన్నింగ్స్‌ల్లోనే 8 వేల పరుగులు పూర్తి చేసి, డివిలియర్స్ (182 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు.
ఇటీవల శ్రీలకంతో జరిగిన టెస్టు సిరీస్‌‌ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో విదేశీ గడ్డ మీద మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ అరుదైన రికార్డును తన పేరిట లఖించుకున్నాడు. కొలంబొలో జరిగిన ఏకైక టీ20లో ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 15 వేల పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ నిలిచాడు.
అక్టోబర్ 22న న్యూజిలాండ్‌పై 200వ వన్డే ఆడిన కోహ్లి.. 121 పరుగులు చేశాడు. తద్వారా 200వ వన్డేల్లో సెంచరీ సాధించిన రెండో క్రికెటర్‌గా డివిలియర్స్ సరసన నిలిచాడు. వారం వ్యవధిలోనే కివీస్‌పై మూడో వన్డేలో విరాట్ శతకం బాదాడు. 113 పరుగులు చేసిన కోహ్లి.. వన్డేల్లో వేగంగా 9 వేల పరుగుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాకుండా 32 వన్డేల్లో 32 సెంచరీలతో రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కంటే కేవలం సచిన్ మాత్రమే ముందున్నాడు.
టీ20ల్లో ఏడు వేల పరుగులు చేసిన ఆటగాడిగానూ విరాట్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు కోహ్లినే కావడం విశేషం. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో మెక్ కల్లమ్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ విరాట్ రికార్డు నెలకొల్పాడు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వారెవ్వ ఏమి ఫోజు: నగ్నంగా ఇలియానా!
ఇలియానా సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ మామూలుగా లేదు. తరచూ బికినీతో తన అందాలను బహిర్గతం చేస్తూ కాకరేపుతోన్న ఈ బ్యూటీ తాజాగా ఒంటిపై నూలు పోగులేకుండా హాయిగా సేదతీరుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది.
TNN | Updated:
Jan 23, 2017, 04:44PM IST
సన్నని నాజూకు నడుము అందాలతో కుర్రకారుకి ‘కిక్’ ఇచ్చిన ఇలియానా 'దేవదాసు' చిత్రంతో తెరంగ్రేటం చేసి తొలి చిత్రంతోనే ఫిలింఫేర్‌ అవార్డును సొంత చేసుకుంది. పోకిరి సినిమాలో ఈమె పిట్టనడుము నాభీ అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. సినిమాల్లో తన జోరును తగ్గించినప్పటకీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లైనా వన్నెతరగని అందంతో హాట్ హాట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సెగలు పుట్టిస్తోంది.
ఇటీవల స్విమ్మింగ్ పూల్‌లో బికినీ వేసుకుని హొయలొలికిస్తున్న వీడియోలను పోస్ట్ చేసిన ఈ నాభీ సుందరి.. ఆతరువాత తన బాయ్‌ఫ్రెండ్‌తో గాఢ చుంబనంలో సేదతీరుతున్న వీడియోని షేర్ చేసి కుర్రకారుకి హీట్ పెంచేసింది. అయితే అక్కడితో ఆగలేదు తాజాగా.. బాత్ టబ్బులో అమ్మడు నూలు పోగు లేకుండా పడుకుంటే.. వెంటనే దానిని క్లిక్ అనిపించాడట ప్రియుడు ఆండ్రూ నీబోన్. ఇంకేముంది చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అనుకుందో ఏమో వెంటనే దానిని షేర్ చేసేసింది ఇలియానా. | 0business
|
మహానటి "సావిత్రి" పాత్రలో కీర్తి సురేష్
Highlights
మహానచి సావిత్రి బయోపిక్ లో కీర్తి సురేష్
కొంతకాలంగా చాలా మంది పేర్లు వినికిడి
కీర్తి సురేష్ ఓకే అయిందంటున్న ఫిల్మ్ నగర్ వర్గాలు
మహానటి సావిత్రి జీవితకథను సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి క్లాస్ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు, నిర్మాత అశ్వనీదత్కు అల్లుడైన అశ్విన్ చాలారోజుల క్రితమే మహానటి సావిత్రిపై సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. మహానటి సావిత్రి బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై చాలా కాలం అవుతున్నా.. ఇంతవరకు పట్టాలెక్కలేదు. ముఖ్యంగా మహానటి సావిత్రి పాత్ర కోసం నటిని ఎంపిక చేయడమే యూనిట్ సభ్యులకు కష్టమవుతోంది.
ఇప్పటికే మహానటి పాత్రలో నటిస్తున్నట్టుగా చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్, మలయాళీ భామ నిత్యామీనన్‑తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఈ లిస్ట్‑లో మరో పేరు వినిపిస్తోంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన కీర్తీ సురేష్‑ను ఈ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ కీర్తీ పేరునైన యూనిట్ సభ్యులు ప్రకటిస్తారో లేక మరోసారి రూమర్స్ అంటూ కొట్టిపారేస్తారో చూడాలి.
Last Updated 26, Mar 2018, 12:03 AM IST | 0business
|
`నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్` ఆడియో రిలీజ్!
Highlights
`నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్` ఆడియో రిలీజ్!
శ్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రిమ్మలపూడి వీరగంగాధర్ నిర్మిస్తున్న చిత్రం `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్`. రవిచంద్ర కన్నికంటి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అర్జున్ మహి, అశ్విని జంటగా నటిస్తున్నారు. సుమన్ జూపూడి సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రేలంగి నరసింహారావు, వీరశంకర్, దేవిప్రసాద్, సాయివెంకట్, సీడీలను ఆవిష్కరించారు.
``సినిమా టైటిల్ చాలా ట్రెండీగా ఉంది. పాటలు, ట్రైలర్స్ కూడా యువతను ఆకట్టునే విధంగా ఉన్నాయి. దర్శకుడిలోని ప్రతిభ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధించి దర్శక నిర్మాతలతో పాటు యూనిట్ అందరికీ మంచి పేరు రావాలన్నారు.
దర్శకుడు రవిచంద్ర కన్నికంటి మాట్లాడుతూ...``ఇదొక లవ్లీ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. టైటిల్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమన్ జూపూడి గారు అద్భుతమైన పాటలిచ్చారు. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. మా ఆడియోతో పాటు సినిమాను కూడా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా`` అన్నారు.
నిర్మాత వీరగంగాధర్ రిమ్మలపూడి మాట్లాడుతూ...``దర్శకుడు రవిచంద్ర చెప్పిన దానికంటే కూడా సినిమాను చాలా బాగా చిత్రీకరించారు. అర్జున్ మహి, అశ్విని జంట బాగుందంటున్నారు. ఆడియో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మా తొలి ప్రయత్నాన్ని ఆడియన్స్ ఆదరించాలని కోరకుంటున్నా`` అన్నారు.
హీరో హీరోయిన్స్ మాట్లాడుతూ...``ఒక మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సుమన్ జూపూడి గారి పాటలు అందర్నీ అలరిస్తాయన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
థర్టీ ఇయర్స్ పృథ్వీ, జబర్దస్త్ అప్పారావు, కేదార్ శంకర్ .యం, నిర్మల, రింగ్ రమేష్, గంగాధర్, రితిక, రాధ, ఉమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాఃవాసు బొజ్జా, సంగీతంః సుమన్ జూపూడి, కొరియెగ్రఫీఃనరేశ్ ఆనంద్, పాటలుఃధీరేంద్ర, ఈమని, ఎడిటర్ఃరవీంద్రబాబు.కె, నిర్మాతఃవీరగంగాధర్ రిమ్మలపూడి, కథ-కథనం-మాటలు-దర్శకత్వంః రవిచంద్ర కన్నికంటి.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
Shajad
టి20ల్లో కోహ్లీని అధిగమించిన షాజాద్
న్యూఢిల్లీ: అప్ఘనిస్థాన్కు చెందిన ఆటగాడు మహ్మద్ షాజాద్ అరుదైన రికార్డును అందు కున్నాడు. అంతే కాదు,టి20ల్లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ సాధించిన పరుగులను అధిగమించాడు.అప్ఘనిస్థాన్-ఐర్లాండ్ మధ్య టి20 సిరీస్లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్లో అప్ఘాన్కు చెందిన షాజాద్ 62 బంతుల్లో 72 పరుగులు చేశాడు.దీంతో టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగవ ఆటగాడిగా షాజాద్ రికార్డు నెల కొల్పాడు.నాలుగవ స్థానంలో ఉన్న కోహ్లీని షాజాద్ అయిదవ స్థానానికి నెట్టాడు.ప్రస్తుతం కోహ్లీ 1,709 పరుగులతో అయిదవ స్థానంలో ఉన్నాడు.మొత్తం 58 మ్యాచ్ల ద్వారా షాజాద్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.అయితే కోహ్లీ 48 మ్యాచ్ల్లో 44 ఇన్నింగ్స్ల ద్వారా 1,709 పరుగులు సాధించాడు.న్యూజిలాండ్ ఆటగాడు మెక్కెల్లమ్ 2,140 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానాల్లో శ్రీలంకకు చెందిన దిల్షాన్ 1,889 పరుగులు,న్యూజిలాండ్కు చెందిన గుప్టిల్ 1,806 పరుగులతో ఉన్నారు.మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్లో ఐర్లాండ్పై అప్ఘనిస్థాన్ 28 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్ను సాధించింది. | 2sports
|
Sevice1
సేవలరంగం రికవరీ
బెంగళూరు,: భారత్ సేవలరంగం మార్చినెలలో కొంతమేర రికవరీ అయింది. గత ఏడాది నవంబరులో ప్రకటించినపెద్దనోట్ల రద్దు విఘాతం నుంచి కోలుకుంది. బిజినెస్ కార్యకలాపాలు మెరుగుపడ్డాయి. రెండోనెలలో కూడా కొంత మేర రికవరీ కావడంతో ప్రైవేటు బిజినెస్ సర్వే అంచనాలు వెల్లడిస్తున్నాయి. నిక్కీ ఐహెచ్ఎస్ మార్కిట్ సేవల పిఎంఐ సూచి మార్చినెలలో సేవలరంగం 51.5పాయింట్లుగా నిలిచింది. గత ఏడాది అక్టోబరు నుంచి చూస్తే ఇదే గరిష్టస్థాయిగా ఉంది. ఫిబ్రవరినెలలో 50.3పాయింట్లు మాత్రమే ఉంది. 50 పాయింట్లు అధిగమిస్తే వృద్ధి ఉన్నట్లు 50 పాయింట్లుకు దిగజారితే తిరోగమించినట్లు సేవలరంగం సూచీలు అంచనాలువేస్తాయి. దేశీయ, విదేశీ డిమాండ్ల ఆధారంగా కొత్త బిజినెస్ ఉపసూచీ అక్టోబరు నాటి సూచీతో పోలిస్టే గరిష్టస్థాయికి చేరింది. ప్రధానినరేంద్రమోడీ ప్రకటించిన నోట్లరద్దుకు ముందునెల నుంచి చూస్తే మార్చినెలలో కొత్త బిజినెస్ ఉప సూచి కొంతరికవరీ అయింది. ప్రైవేటురరంగ ఆర్థిక వ్యవస్థ కొంతమేర పైకి ఎగబాకింది. ఉత్పత్తిపరంగా డిమాండ్ లభించడమే ఇందుకు కీలకమని ఐహెచ్ఎస్ మార్కిట్ ఆర్ధికవేత్త పాల్లి యాన్నా డీలీమా వెల్లడించారు.
పెద్దనోట్లరద్దు నుంచి శరవేగంగా కోలుకోవడంవల్లనే సేవల రంగం వృద్ధినిసాధించింది. అలాగే ఉపాధి కల్ప న, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం కూడా ఇందుకు కొంత తోడయ్యాయి. ముడివనరులధరలు వరు సగా ఏడోనెలలో కూడా పెరిగాయి. ఫిబ్రవరికంటే పెరిగాయి. అయితే కంపెనీలు మాత్రం ఈ ధరల పెంపును కస్టమర్లపైకి రుద్దలేదు. మార్చినెలలో ఉపాధి కల్పన శరవేగంగా జరిగిందని అంచనావేసింది. రెండేళ్ల తర్వాత వివిధ సంస్థలు తమ సిబ్బంది సంఖ్యను ఫిబ్రవరిలోపెంచుకున్నాయి. ఉపాధికల్పన ఉపసూచి 49.9 పాయింట్లనుంచి 51.2పాయింట్లకు పెరిగింది. ఈ విధానాన్ని చూస్తే సంస్థలు, పరిశ్ర మలు అదనపు ఉద్యోగులను నియమించుకనేందుకు ఆసక్తితో ఉన్నట్లు అర్ధంఅవుతోంది.
12నెలల కాలం లో వృద్ధిని సాధించే అవకాశం ఉందని సంస్థలు అంచనావేస్తున్నాయి. సేవలఅందించే సంస్థలు ఈ ఏడాదిలో మరింతవృద్ధి ఉంటుందని అంచనావేస్తున్నాయి. భారత్ ఆర్థికవృద్ధి అక్టోబరు డిసెంబరుత్రైమా సికంలో 7శాతంగా ఉంది. రాయిటర్స్ వార్తాసంస్థ అంచనాలప్రకారం చూస్తే అంతకుముందున్న 7.4 శాతం నుంచి ఈ సారి 6.4శాతంగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఆర్బిఐ తన విధాన రెపో రేట్లను కూడాస్థిరంగానే కొనసాగించింది. 6.25శాతం వద్దనే కొనసాగించింది. ఆర్బిఐ తన ద్రవ్యోల్బ ణ లక్ష్యం నాలుగుశాతం వద్దకు వచ్చే అవకాశంలేనందున రెపోరేట్లపై తటస్థ వైఖరినే అనుసరించింది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
‘ర్యాలీ ఫర్ రివర్స్’కి సెహ్వాగ్ మద్దతు..!
దేశంలోని నదులను కాపాడేందుకు ఈషా ఫౌండేషన్ అధినేత యోగీ సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆరంభించిన
TNN | Updated:
Sep 3, 2017, 06:09PM IST
దేశంలోని నదులను కాపాడేందుకు ఈషా ఫౌండేషన్ అధినేత యోగీ సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆరంభించిన ‘ర్యాలీ ఫర్ రివర్స్’ కార్యక్రమానికి భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతు తెలిపారు. ఆదివారం వాసుదేవ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెష్ చెప్పిన సెహ్వాగ్.. ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశాడు.
‘ర్యాలీ ఫర్ రివర్స్’కి గత కొద్దిరోజుల నుంచి సెలబ్రిటీల మద్దతు లభిస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ కార్యక్రమానికి మద్దుతిస్తూ మాట్లాడారు. భవిష్యత్ తరాలకి మంచినీరు దొరకని ప్రమాదకర పరిస్థితి నెలకొనకముందే మేల్కొనాలని పిలుపునిచ్చారు.
Blessed to be with @SadhguruJV today on his birthday once again after 4 yrs & extend my support for Rally for Rivers. #Rally4RiversKickOff . pic.twitter.com/jts5mGvMne | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఆఖరి బంతి మ్యాజిక్.. కివీస్పై ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ
ఆఖరి బంతికి ఫోర్ కొడితే టై, సిక్స్ కొడితే విన్. క్రీజ్లో కెప్టెన్ విలియమ్సన్. కానీ అద్భుత బంతితో ఇంగ్లాండ్కు విజయాన్ని అందించిన క్రిస్ వోక్స్.
TNN | Updated:
Mar 3, 2018, 05:30PM IST
ఆఖరి బంతి మ్యాజిక్.. కివీస్పై ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. కెప్టెన్ విలియ్సమన్ ఆఖరి వరకూ పోరాడినప్పటికీ.. కివీస్ విజయం ముందు బోల్తాపడింది. ఇన్నింగ్స్ చివరి బంతికి న్యూజిలాండ్‌కు ఐదు పరుగులు అవసరమైన దశలో.. వికెట్లకు దూరంగా క్రిస్ వోక్స్ విసిరిన యార్కర్‌ను ఆడటంలో విలియమ్సన్ విఫలమయ్యాడు. సెంచరీతో అజేయంగా నిలిచినప్పటికీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటయ్యింది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్ మీద లక్ష్య చేధనకు దిగిన కివీస్ 12 పరుగులకే ఓపెనర్ గప్టిల్ వికెట్‌ను కోల్పోయింది. కానీ మున్రో (49), విలియ్సమన్ (112 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించారు.
మున్రో అవుటయ్యాక మిడిలార్డర్ నిరాశపర్చడంతో.. న్యూజిలాండ్ జట్టు 103 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో విలియమ్సన్ అజేయ సెంచరీతో పోరాడాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. చివర్లో శాంట్నర్ (41) సాయంతో జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ 45.2 ఓవర్లలో విజయానికి 35 పరుగుల దూరంలో శాంట్నర్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు.
కివీస్ విజయానికి ఆఖరి ఓవర్లో 15 రన్స్ అవసరమయ్యాయి. వోక్స్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి విలియమ్సన్ రెండు పరుగులు రాబట్టాడు. మూడో బంతికి సిక్స్ బాది విజయంపై ఆశలు రేపాడు. నాలుగో బంతికి రెండు పరుగులు చేసిన అతడు.. ఐదో బంతికి పరుగులు చేయలేకపోయాడు. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో.. వోక్స్ వికెట్‌కు దూరంగా విసిరిన యార్కర్‌ను ఆడటంలో విలియమ్సన్ విఫలమయ్యాడు. దీంతో నాలుగు పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ సంబరాల్లో మునిగిపోగా.. ఓటమి బాధలో విలియమ్సన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Nov 28,2015
ఎస్బీహెచ్కు మరో ప్రశంస
హైదరాబాద్ : 'ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనా' (పీఎంజేెడీవై) పథకం అమల్లో అత్యంత మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు గాను 'స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్' (ఎస్బిహెచ్) సిద్ధిపేట శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ప్రభుత్వ బ్యాంకుల త్రైమాసిక పరపతి సమీక్ష కార్యక్రమంలో ఈ అవార్డును ఆర్ధిక సేవల మంత్రిత్వ శాఖ అందజేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఎస్బీహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతను ముఖర్జీకి ఈ అవార్డును అందజేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో "బిగ్ బాస్" ను ప్రారంభించనున్న స్టార్ మా
Highlights
మా టీవీలో త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ షోర
ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్
తెలుగు టీవీ చరిత్రలోనే అతిపెద్ద షోగా రూపొందనున్న బిగ్ బాస్
"సరికొత్త ఉత్తేజం" అనే నినాదం తో తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని అందించాలని భావించే ఛానల్ స్టార్ మా. ఈ సంకల్పం తో నే తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో, "బిగ్ బాస్", ను ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తోంది స్టార్ మా. నటన కి స్టార్ ఇమేజ్ మారు పేరు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మొట్ట మొదటి సారి గా బుల్లి తెర మీదకి తీసుకువస్తోంది "బిగ్ బిన్" షో.
ఒక యువ తరం అగ్ర కథానాయకుడు బుల్లి తెర పై ఇంత పెద్ద షో ను హోస్ట్ చేయటం బహుశా దక్షిణ భారతం ఈ మధ్య కాలం లో ఇదే ప్రధమం. ప్రపంచవ్యాప్తం గా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ బిగ్ బాస్ షో ఎండెమోల్ సంస్థ కు చెందిన ది. హిందీ లో సల్మాన్ ఖాన్ తో ఇప్పటికే పది సీజన్ లు విజయవంతం గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందు కు ఈ షో ను ఎన్టీఆర్ తీసుకువస్తారు.
ప్రత్యేకం గా నిర్మించిన ఒక ఇంట్లో, సుమారు డజను మంది సెలబ్రిటీ లను పెట్టి తాళం వేస్తారు. వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తారు. కానీ బయట ప్రపంచం తో కానీ, సెల్ ఫోన్ లు టీవీ లు, పేపర్ లు వంటి మాధ్యమాల తో కానీ వారికి సంబంధం ఉండదు. ఆ ఇల్లే వారి ప్రపంచం. వారి ప్రతి కదలికను కెమెరా లు రికార్డు చేస్తూనే ఉంటాయి. వీరి జీవన శైలి ని ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు. ఒకరి తో ఒకరికి సంబంధం లేని వాళ్ళు బయట ప్రపంచం తో సంబంధం లేని ఒక ఇంట్లో ఎలా ఉండగలుగుతారు అనేది ఆశక్తికరమైన అంశం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, "టీవీ అనేది ఏంతో ప్రాముఖ్యత కలిగిన ఎంటర్టైన్మెంట్ మాధ్యమం. తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో గా రూపొందుతోన్న "బిగ్ బాస్" ను హోస్ట్ చేయమని స్టార్ మా వారు నన్ను సంప్రదించినప్పుడు, చాలా ఆశక్తి కరం గా అనిపించింది. ఈ షో తప్పకుండా ఒక గేమ్ చేంజర్ అవుతుంది" అన్నారు.
స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ, " తెలుగు లో అత్యంత భారీ స్థాయి లో ఈ బిగ్ బాస్ షో ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రారంభించటం మాకు ఎంతో సంతోషం గా ఉంది. తెలుగు టీవీ ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విలువలను, ఎంటర్టైన్మెంట్ ను అందించటమే స్టార్ మా లక్ష్యం. ఇందుకు బిగ్ బాస్ షో ఎంతగానో దోహద పడుతుంది. తెలుగు ప్రజల మనోభావాలను, విలువలను దృష్టి లో ఉంచుకుని, ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండే లా ఈ షో ఉంటుంది. గత కొద్ది కాలం గా స్టార్ మా ప్రోగ్రామింగ్ స్ట్రాటజీ లో చాలా మార్పులు జరుగుతూ వస్తున్నాయి. కొత్త షో లు కొత్త ప్రోగ్రాం ల తో మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అయ్యే దిశ గా స్టార్ మా అడుగులు వేస్తోంది" అని అన్నారు.
స్టార్ టీవీ నెట్వర్క్ లో ఒక భాగం అయిన స్టార్ మా గ్లోబల్ కంపెనీ 21స్ట్ సెంచరీ ఫాక్స్ లో ఒక భాగం. స్టార్ మా , స్టార్ మా HD , మా మ్యూజిక్, మా మూవీస్ మరియు మా గోల్డ్ ఈ స్టార్ మా నెట్వర్క్ లో ఉన్న అయిదు ఛానళ్ళు. | 0business
|
sumalatha 164 Views CBDT , INCOME TAX DEPARTMENT , Itr
Income Tax Department
న్యూఢిల్లీ: ఆదాయపు రిటర్నులు దాఖలుకు గడువు పెంచుతున్నట్లు వచ్చిన వార్తల్ని ఐటీ శాఖ ఖండించింది. అవన్నీ కూడా తప్పుడు వార్తలేనని స్పష్టం చేస్తూ ట్వీట్ చేసింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పణకు గడువు రేపటి వరకే ఉందని స్పష్టం చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్నుల దాఖలు చేసేందుకు మరింత గడువు ఇచ్చిందని.. రిటర్నులు దాఖలు చేసేందుకు మరో నెల రోజులు (సెప్టెంబర్ 30) వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన ఐటీ శాఖ అవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేసింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/ | 1entertainment
|
Flipckart
ఇ-కిరాణా మార్కెట్కు ‘ఫ్లిప్కార్ట్
ముంబై: అమెజాన్ ఇండియా ప్రారంభించిన కిరాణామార్కెట్ వ్యాపారంలోకి దేశీయస్టార్టప్ ఇకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా ప్రవేశించింది. దేశీయంగా వృద్ధిపథంలోకి వస్తున్న ఇ-టైలర్ ఫ్లిప్కార్ట్ ఇ-కిరాణా మార్కెట్కు వస్తోందని సిఇఒ కళ్యాణ్కృష్ణమూర్తి వివరించారు. ఇండియా ఇంటర్నెట్డే సమా వేశంలో పాల్గొన్న మూర్తి మాట్లాడుతూ ఈ కిరాణా వ్యాపారంలో మూడు విధానాలున్నాయ,ఇ, రోజు వారి కొనుగోళ్లు సగటు అమ్మకంధర 300 నుంచి 400లోపు ఉంటుందని, మొదటి బిజినెస్ మోడల్గా ఉంటుందన్నారు. ఆ తర్వాత వారం వారం బిజినెస్ మోడల్ కింద కొంత పెరుగుతుంది. ఇక నెలవారీ విధానం 60నుంచి 70శాతం మార్కెట్వాటాతో ఉం దని అయన అన్నారు.
రెండువేలకుపైబడిన కొను గోళ్లు ఉంటాయని అంచనా. 2016 ఫిబ్రవరిలో ఫ్లిప్ కార్ట్ ఈన కిరాణా డెలివరీ విధానం నిలిపివేసింది. బెంగళూరులో ప్రారంభించిన ఐదునెలలకే ముగిం చింది. వినియోగదారుల నుంచి స్పందన రాకపోవ డం, మార్జిన్లు అంతగా లేకపోవడమే ఇందుకు కీలకం. కంపెనీ 2015 అక్టోబరులో యాప్ను కూడా విడుదల చేసింది.
పోటీసంస్థ అమెజాన్ కూడా 2016లో కిరాణా యాప్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ఎన్సిఆర్, ముంబై, హైదరాబాద్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఇ-టైలర్ కు ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి అవుతుంది. అంతేకాకుండా అమెజాన్ ఇగ్రోసియరీ మార్కె ట్లో 500 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నది. కేవలం ఆహార ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇచ్చింది. అమెజాన్తో పోటీగా ఫ్లిప్కార్ట్ కూడా గ్రోఫర్స్, బిగ్బాస్కెట్ తరహాలో ఇ-కిరాణా ప్రారంభి స్తోంది. ఇ-కిరాణాతో పాటే ఫ్లిప్కార్ట్ కొనుగోళ్లువిలీనాలపై కూడా దృష్టిపెట్టిందని కృష్ణమూర్తి చెప్పారు. | 1entertainment
|
ఒకే వేదికపై 12 మంది హీరోయిన్స్ డాన్స్.. కుర్రాళ్లకు కనులవిందే!
Samayam Telugu| Sep 8, 2019, 07.13 PM IST
ప్రస్తుతం ‘‘సినీ మహోత్సవం.. రథసారథుల రజతోత్సవం’’ పేరుతో టాలీవుడ్లో ఒక ఈవెంట్ జరుగుతోంది. చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా మళ్ళీ ఈ ఈవెంట్ గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏముంది అనే డౌట్ రావడం ఖాయమే. ఆ ఈవెంట్ ప్రత్యేకత ఏంటో తెలిస్తే దాని గురించి ఎందుకు స్పెషల్గా చెప్పుకోవాల్సి వచ్చిందో అర్థమవుతుంది.
ఈరోజు(సెప్టెంబర్ 8న) రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగబోతున్న ఆ బిగ్ ఈవెంట్లో టాలీవుడ్కి చెందిన 12 మంది హీరోయిన్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, రెజీనా లాంటి హీరోయిన్స్ ఆ ఈవెంట్లో పెర్ఫార్మ్ చేస్తున్నారు అంటే దీని రేంజ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ప్రగ్యా జైస్వాల్, ఈషా రెబ్బా, రుక్సార్ ధిల్లాన్ లాంటి క్యూట్ హీరోయిన్స్ కూడా తమ అమేజింగ్ పెర్ఫార్మెన్సెస్తో మురిపించబోతున్నారు.
For the first time ever 12 Beautiful actresses are performing in an event!! Tollywood's Biggest Event… https://t.co/srQEggk6OL
— Shreyas Group (@shreyasgroup) 1567853841000
వీళ్ళతో పాటుగా జీవిత-రాజశేఖర్ల కూతుళ్లు శివాని, శివాత్మిక కూడా ఈ ఈవెంట్లో సందడి చెయ్యబోతున్నారు. అనసూయ, క్యాథరిన్ త్రెసా, నటాషా దోషి, లావణ్య త్రిపాఠి సైతం సిజ్లింగ్ స్టేజ్ షోకి రెడీ అయ్యారు. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎక్సిక్యూటివ్స్ యూనియన్కి సంబంధించిన ఈ ఈవెంట్లో మరో క్యూట్ హీరోయున్ రాశీఖన్నా.. దేవి శ్రీ ప్రసాద్తో కలిసి తన సింగింగ్ టాలెంట్ చూపించబోతుంది.
Also Read: ‘వాల్మీకి’ ట్రైలర్.. హరీష్ ఎందుకంత ఎక్సయిట్మెంట్?
రీసెంట్గా ‘ఎవరు’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న అడివి శేష్ ఈ ఈవెంట్కి హోస్ట్. ఫస్ట్ టైం అతను హోస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. పక్కనే పంచులు వేసి నవ్వించడానికి ప్రియదర్శి కూడా కో-హోస్ట్గా ఉండనే ఉన్నాడు. రామ్ చరణ్, మహేష్ బాబుతో సహా అనేకమంది యంగ్ హీరోస్ అటెండ్ అవుతున్నారు.
Getting ready for #cinemahotsavam My first hosting gig. Co-hosting with @priyadarshi_i In support of the amazing Pr… https://t.co/rqVHu6crC0
— Adivi Sesh (@AdiviSesh) 1567945338000
సినీ, రాజకీయ రంగాలకు చెందిన అనేకమంది ఈ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్లో ఇంత పెద్ద ఈవెంట్ ఈ మధ్య కాలంలో జరగలేదు. పైగా ఒకే వేదికపై 12 మంది హీరోయిన్స్ డాన్స్ అంటే మామూలు విషయం కాదు. సౌత్ ఇండియన్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఈవెంట్ జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతుంది. | 0business
|
Hyderabad, First Published 6, Aug 2019, 11:27 AM IST
Highlights
బిజీ లైఫ్ లో ఒకప్పుడు పని చేసిన తారలను మళ్ళీ కలవడానికి వీలు పడదు. ఒక వేళ కలిస్తే ఆ కిక్కు మాములుగా ఉండదు. స్టార్స్ కె కాకుండా ఆడియెన్స్ కి కూడా మంచి కిక్ ఇస్తుంది. ప్రస్తుతం రెడీ జోడి కూడా అందరిని అలానే ఆకట్టుకుంటోంది.
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చాలా మందికి కొత్త అనుభూతిని నేర్పుతుంది. బిజీ బిజీ లైఫ్ లో ఒకప్పుడు పని చేసిన తారలను మళ్ళీ కలవడానికి వీలు పడదు. ఒక వేళ కలిస్తే ఆ కిక్కు మాములుగా ఉండదు. స్టార్స్ కె కాకుండా ఆడియెన్స్ కి కూడా మంచి కిక్ ఇస్తుంది. ప్రస్తుతం రెడీ జోడి కూడా అందరిని అలానే ఆకట్టుకుంటోంది.
జెనీలియా - రామ్ జంటగా 2008లో వచ్చిన రెడీ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా రిలీజైన 11 ఏళ్ల తరువాత మళ్ళీ రెడీ జోడి ఒక ఫ్రెమ్ లో దర్శనమిచ్చింది. ఇటీవల తన 32వ పుట్టినరోజు సందర్బంగా జెనీలియా రామ్ ని స్పెషల్ గా ఇన్వైట్ చేసింది.
భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి పుట్టినరోజు జారుకుంటుండగా రామ్ కూడా పార్టీలో పాల్గొన్నాడు. సత్యం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా బొమ్మరిల్లు సినిమాతో హాసిని గా అందరికి అలా గుర్తుండి పోయింది. రానాతో నా ఇష్టం సినిమా తరువాత మళ్ళీ కనిపించలేదు. 2012లో రితేష్ ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.
Last Updated 6, Aug 2019, 11:27 AM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
పాక్ క్రికెట్లో కుదుపు.. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన అలీ
అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్లో మరో సంచలనం చోటు చేసుకుంది.
TNN | Updated:
Feb 9, 2017, 06:19PM IST
అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఆ జట్టు వన్డే కెప్టెన్సీ నుంచి అజహర్ అలీ వైదొలగ్గా.. అతడి స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమిస్తూ పీసీబీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ 1-4 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఆ సిరీస్‌లో అజహర్ అలీ చివరి మూడు ఇన్నింగ్స్‌లో వరుసగా 24, 7, 6 పరుగులతో పేలవ ప్రదర్శన చేశాడు. గత 23 మ్యాచ్‌ల్లో అలీ కేవలం ఒక శతకం, రెండు అర్ధ శతకాలు మాత్రమే సాధించగలిగాడు. దీంతో అలీని పాక్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు గళం విప్పారు.
జట్టు పగ్గాలు మార్పు అనంతరం అలీ మాట్లాడుతూ కెప్టెన్సీ భారం తన ఆటపై ప్రభావం చూపుతోందని.. ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆటపై దృష్టి సారించేందుకు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కొద్దిసేపటికే టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీగా కూడా తప్పకుంటున్నట్లు ట్విటర్లో ప్రకటించాడు. మార్చి చివర్లో పాకిస్థాన్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ జట్టు.. మరో రెండు పాయింట్లు కోల్పోతే ప్రపంచ కప్‌కు అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. | 2sports
|
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
Ganesh| Last Updated: మంగళవారం, 24 జూన్ 2014 (09:42 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో మంగళవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.345 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.55గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.349, విశాఖపట్నంలో రూ.358, విజయవాడ రూ.340, చిత్తూరులో రూ.388, ఉభయగోదావరి మార్కెట్లో రూ.340 రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.395 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్లో రూ.360 రూపాయలుగా పలుకుతోంది.
సంబంధిత వార్తలు | 1entertainment
|
Jul 05,2016
'రేబిజ్టెక్' చేతికి 'క్విక్ ఎడ్మిన్' ఈఆర్పీ
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 'రే బిజినెస్ టెక్నాలజీస్' (రే బిజ్ టెక్) ఈఆర్పీ విభాగంలో తన ఉనికిని మరింత విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ తాజాగా సరికొత్త ఈఆర్పీ ఉత్పత్తి 'క్విక్ఎడ్మిన్'ను సొంతం చేసుకుంది. విద్యా సంస్థలకు అవసరమైన అన్ని రకాల బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలను నిరంతరాయంగా అందజేసేలా రూపొందించిన 'క్విక్ ఎడ్మిన్' కొనుగోలు మూలంగా సంస్థ ఈ విభాగంలో మరింతగా బలపడేందుకు వీలు పడనుందని 'రే బిజ్టెక్' మేనేజింగ్ డైరెక్టర్ అజరురే తెలిపారు. అడ్మిషన్ల నుంచి మొదలుకొని లైబ్రెరీ, పరీక్షలు, క్యాంపస్ న్యూస్, హాస్టల్స్, ట్రాన్స్పోర్ట్, ఈవెంట్స్, అటెండెన్స్ వంటి కార్యకలాపాలను సరికొత్త ఈఆర్పీ ద్వారా అందించేందుకు వీలు పడుతుందని వివరించారు. విద్యా విభాగంలో సంస్థ తొలిసారిగా ఈఆర్పీని చేజిక్కించుకోవడంతో రానున్న రోజుల్లో భారత్తో సహా అమెరికా, ఆస్ట్రేలియాల్లో మరింతగా విస్తరించేందుకు దోహదం చేయగలదని అభిప్రాయపడ్డారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
గరుడవేగలో సన్నీలియోని ఫస్ట్ లుక్ అదిరింది
Highlights
గరుడవేగలో సన్నీలియోని ఐటమ్ నంబర్
సన్నీ ఐటమ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
దసరా సందర్భంగా సన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన గరుడవేగ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు
గత కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన పీఎస్వీ గరుడవేగ 126.18 సినిమాలో బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నిలియోన్ ఓ ఐటం సాంగ్ చేస్తోందని.. ఆ పాట ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కానుందని తరచుగా చెబుతూ వస్తోన్న పీఎస్వీ గరుడవేగ మూవీ యూనిట్ సభ్యులు తాజాగా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రాయిస్ సినిమాలో లైలా మై లైలా సాంగ్లో కనువిందు చేసిన విధంగానే గరుడవేగ సినిమాలోని ఐటంసాంగ్లోనూ సన్నిలియోన్ సెక్సీ లుక్స్తో అదరగొట్టింది. సన్నిలియోన్ అభిమానులకి దసరా కానుకగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ వారిని తెగ టెంప్ట్ చేస్తోంది.
చేసిన ఈ సినిమాలోని డియో డియో అనే ఐటంసాంగ్ అతి త్వరగానే వైరల్ అవడం ఖాయం అని ధీమా వ్యక్తంచేసింది సన్నిలియోన్. యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో కంపోజ్ చేసిన ఈ సాంగ్కి విష్ణు దేవ కొరియోగ్రఫీ అందించాడు.
Last Updated 25, Mar 2018, 11:41 PM IST | 0business
|
Aug 02,2017
రూ.2లక్షల కోట్ల 'కార్పొరేట్' అప్పుల పునరుద్ధరణ : జైట్లీ
న్యూఢిల్లీ : కార్పొరేట్లకు చెందిన భారీ మొత్తం రుణాలను బ్యాంకులు పునరుద్ధరిం చాయి. క్రితం ఆర్ధిక సంవ త్సరంలో ఆ వర్గాలకు చెందిన రూ.2,04,884 కోట్ల అప్పులను పునరద్ద రించినట్టు ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. 2014-15లో రూ.3,70,279 కోట్లు, 2015-16లో రూ.2,99,111 కోట్ల చొప్పున కార్పొరేట్ల అప్పులను పునరుద్ధరించినట్టు వెల్లడించారు. ఎవరి రుణాలు పునరుద్ధరించారు, ఏ ప్రతిపాదికన చేశారు అనే ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ వ్యవహారం రిజర్వు బ్యాంకు చూసుకుంటుందన్నారు. ఆర్బీఐ దీనిపై విధివిధానాలు కలిగి ఉందని, ఆ ప్రకారం జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్ఎఫ్), స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్షరింగ్ (ఎస్డీిఆర్), స్కీమ్ ఫర్ సస్టెయినెబుల్ స్ట్రక్షరింగ్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ (ఎస్4ఏ) ప్రకారం అప్పుల పునరుద్ధరణ జరుగుతుందన్నారు. రుణ గ్రహీతల పేర్లు, వివరాలు 1934 బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఆర్బీఐ యాక్ట్ 45ఈ సెక్షన్ ప్రకారం రహస్యంగా ఉంచబడుతాయన్నారు. రాజ్యాంగం ప్రకారం ఈ వ్యవహారం జరుగుతుందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
RELIANCE
ఆర్కామ్ నుంచి సూపర్ వేల్యూ
హైదరాబాద్, మే 3: తెలుగు రాష్ట్రాలలో కొత్త డేటా పథకాలను ప్రకటించడం ద్వారా అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ మొబైల్ డేటా యుద్ధానికి సై అంటోంది. ఇప్పటికే విభిన్న ఆఫర్లతో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తదితర మొబైల్ దిగ్గజాలు డేటా టారిఫ్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. తాజాగా ఆర్కామ్ సూపర్ వేల్యూ పేరుతో 70రోజుల డేటా ప్యాక్ను తీసుకువచ్చింది. ప్యాక్ విలువ రూ. 148కాగా 70జిబి వరకూ 4జీ హైస్పీడ్ డేటాను పొంద వచ్చని కంపెనీ చెబుతోంది. వెరసి రోజుకి 1జిబి డేటాను వినియో గించుకోవచ్చని, దీంతోపాటు రూ.50 టాక్టైమ్ కూడా లభిస్తుందని వెల్లడించింది. అంతేకాకుండా నిమిషానికి రూ.0.25 చొప్పున కాల్స్ చేసుకోవచ్చని వివరించింది. రూ.148 విలువగల ఈ ప్లాన్ రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమని పేర్కొంది. అంతేకాకుండా ఇందులో ఇతర పథకాలు కూడా ఉన్నాయి. సూపర్ వేల్యూ పథకంతోపాటు ఎఫ్ఆర్సి 54, ఎఫ్ఆర్సి 61 ప్లాన్లను ఆర్కామ్ ప్రవేశపెట్టింది. ఎఫ్ఆర్సి 54లో భాగంగా వినియోగదారులు 28 రోజులపాటు 4జీ డేటాను రోజుకి 1జిబి చొప్పున పొందవచ్చు. ఇందుకు రూ.54 రీఛార్జ్ చేసుకోవలసిఉంటుంది. ఆర్కామ్ నెట్వర్క్స్కు నిమిషానికి 10పైసలు చొప్పున కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్వర్క్లకు లోకల్, ఎస్టిడి కాల్స్ చేస్తే 25పైసలు చొప్పున వసూలు చేస్తారు. ఇక ఎఫ్ఆర్సి 61 ప్లాన్లోఅయితే రూ.61తో రీఛార్జ్ చేసుకుంటే 28రోజులకు రోజుకి 1జిబి 4ఈ డేటా లభిస్తుంది. ఆర్కామ్ నెట్వర్క్స్కు కాల్స్ చేస్తు 6సెకన్లకు 1పైసా టారిఫ్ కాగా ఇతర నెట్వర్క్ల కాల్స్కు 2 సెకన్లకు 1పైసా వసూలు చేస్తారు. | 1entertainment
|
JET Airways
వేతన కోతతోపాటు రూ.కోటి పూచీకత్తు బాండ్
ముంబయి, జూలై 25: జూనియర్ పైలట్ వేతనాల్లో 30-50శాతం వేతనాల కోతను సూచించిన జెట్ ఎయిర్వేస్ తాజాగా వారిని కోటి రూపాయల పూచికత్తు బాండ్లను ఇవ్వాలని కోరింది. కనీసం ఐదు నుంచి ఏడేళ్లపాటు ఎయిర్లైన్స్లో పనిచేస్తామన్న గ్యారంటీ ఇవ్వాలని సూచించింది. ఎక్కువ మంది జూనియర్ పైలట్లు పదిరోజుల ఆఫ్ను ప్రతినెలలోను సెలవులు తీసుకోవాలని, దీనివల్ల 30శాతం వేతనాలు తగ్గుతాయని జెట్ ఎయిర్వేస్ వెల్లడించింది. నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్, జెట్ ఎయిర్వేస్పైలట్ యూనియన్లుఈ బాండ్లు ఇవ్వాలన్న అంశాన్ని జూనియర్ పైలట్లకు తెలియజేశాయి. ఈ బాండ్లజారీ విధానం ఏకపక్షంగా ఉందని, వేతనాల్లో కోత విధి స్తూనే బాండ్లు కోరడం ఏకపక్షంగా ఉందని పైలట్లు విమర్శిస్తున్నారు. కొత్తగా పూచీ కత్తు బాండ్లను చూపించాలని కోరడం పైలట్లపై వేధింపులకు పాల్పడటమేనని తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్కు సుమారు 200మందికిపైగా జూనియర్పైలట్లు విధు ల్లో ఉన్నారు. వీరిలో కొందరు శిక్షణ కూడా తీసుకుంటున్నవారున్నారు. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి నెల లో పదిరోజుల ఆఫ్ఉంటుందని, సహేతుకమైన ప్రతిఫలం కూడా ఉంటుందని జెట్ఎయిర్వేస్ ప్రకటిం చింది. అయితేనేషనల్ ఏవియేషన్గ్రిడ్ ఈబాండ్లఅంశాన్ని యాజమాన్యంతో చర్చించనున్నట్లు తెలిసింది. | 1entertainment
|
Feb 13,2019
స్తబ్దతలో పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: గనులు, తయారీ రంగం అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చడంతో 2018 డిసెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీి) స్తబ్దతను ఎదుర్కొంది. ఈ నెలలో ఐఐపీ 2.4 శాతం పెరుగుదలను మాత్రమే నమోదు చేసిందని కేంద్ర గణంకాల శాఖ (సిఎస్ఒ) మంగళవారం వెల్లడించింది. 2018 నవంబర్ పారిశ్రామికోత్పత్తి సూచీని 0.5 శాతం నుంచి 0.3 శాతానికి సవరించింది. 2018-19 ఏప్రిల్ నుంచి డిసెంబర్తో ముగిసిన కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 4.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో 3.7 శాతం పెరుగుదల ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ రంగం 77.63 శాతం వాటా కలిగి ఉంది. క్రితం డిసెంబర్లో ఈ రంగం అత్యంత పేలవమైన 2.7 శాతం పెరుగుదలను మాత్రమే నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే మాసంలో 8.7 శాతం వృద్ధిని సాధించింది. ఇదే సమయంలో గనుల రంగం 1.2 శాతం వృద్ధిని నమోదు చేయగా.. 2018 డిసెంబర్లో 1 శాతానికి పడిపోయింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బన్నీ ఆ నాలుగు వద్దని... బతికి పోయాడు
అల్లు అర్జున్ భారీ డిజాస్టర్ సినిమాల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు.
TNN | Updated:
Jun 23, 2016, 08:27AM IST
బన్నీ ఆ నాలుగు వద్దని... బతికి పోయాడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ... మెగా హీరోల్లో ఒకడు. అతని కెరీర్ లో అట్టర్ ప్లాఫ్ సినిమా అంటూ లేదు. కనీసం యావరేజ్గానైనా ఆడి వెళతాయి. బన్నీ సినిమా సెలక్షన్ అలా ఉంటుంది మరి. ప్రతి సినిమాతో ఎంతో కొంత క్రేజ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. గంగోత్రితో మొదలెట్టి సరైనోడు వరకు జర్నీ చాలా సాఫీగా సాగించాడు. అయితే బయటికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసా... అల్లు అర్జున్ భారీ డిజాస్టర్ సినిమాల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. కథ విని తాను చేయను అని చెప్పిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా మారి బన్నీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపించాయి. | 0business
|
మమ్మల్ని తిట్టండి, కానీ చూడండి: స్టేడియం ఫుల్
Highlights
టీమిండియా ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రీ విజ్ఞప్తి ఫలించినట్లే ఉంది.
ముంబై: టీమిండియా ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రీ విజ్ఞప్తి ఫలించినట్లే ఉంది. మమ్మల్ని తిట్టండి, కానీ ఆట చూడండి అని ఎంతో ఆవేదనతో ఆయన ట్విటర్ లో పోస్టు చేశాడు. దాంతో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు ఆయనకు బాసటగా నిలిచాడు.
తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు కూడా తాను ఫుట్ బాల్ చూడడానికి వెళ్తున్నట్లు ట్వీట్ చేసి, తన ఫాలోయర్లకు కూడా ఆట చూడాలని విజ్ఞప్తి చేశారు
దాంతో సోమవారం ముంబై ఫుట్బాల్ అరెనాలో కెన్యాతో జరుగుతున్న మ్యాచ్ను వీక్షించేందుకు ఉత్సాహంతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. 18వేల మంది సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో చైనాతో జరిగిన మ్యాచ్ను వీక్షించేందుకు కేవలం 2,500 మంది మాత్రమే వచ్చారు.
అది చూసి తట్టుకోలేకపోయిన సునీల్ వీడియోని పోస్ట్ చేశాడు. ఈ మ్యాచ్ సునీల్కి 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకోవడంతో స్టేడియం మొత్తం నిండిపోయింది.
Last Updated 4, Jun 2018, 7:17 PM IST | 2sports
|
2014-2015 ఆర్థిక సంవత్సరంలో అదరగొట్టిన స్టాక్ మార్కెట్లు
- ఏడాదిలో 25 శాతం మేర పెరిగిన సూచీలు
- ఆరేళ్లలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన
- చివరి రోజున స్వల్ప నష్టాలు
ముంబయి: ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మంగళవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలలోనే ముగిసినప్పటికీ.. గత ఆరు సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 25% మేర దూకుడు చూపాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధ్యక్షతన స్థిరమైన ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరడం దీనికి తోడు కేంద్రం చేపడుతున్న ప్రోత్సాహక కార్యక్రమాలు కూడా ఈ ర్యాలీకి దోహదం చేశాయి. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మంగళవారం మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ చివరి వరకు వాటిని నిలుపుకోలేక పోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 18.37% మేర నష్టపోయి 27,957 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 1.30 పాయింట్ల మేర నష్టాలతో ముగిసి 8,491 పాయింట్ల వద్ద స్థిరపడింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగంలో మంచి కొనుగోళ్లు నమోదు అవడంతో మార్కెట్ విస్తృతి బలంగానే కనిపించింది. చమురు, సహజ వాయువు, ఆరోగ్యపు రంగాలు లాభాలలో నడవగా.. మిగతా రంగాల షేర్లు స్వల్ప నష్టాలలోనే ముగిశాయి.
అచ్చిరాని మార్చి...
మార్చి నెల మొత్తంలో సెన్సెక్స్ 4.8 శాతం మేర కుంగింది. 2013 ఫిబ్రవరి నుంచి ఒక నెలలో మార్కెట్లు ఇంత స్థాయిలో నష్ట పోవడం ఇదే ప్రప్రథమం. మంగళవారం ఓఎన్జీసీ (2.51%), టాటా స్టీల్ (1.72%), హిందాల్కో (1.71%), భెల్ (1.53%), హెచ్డిఎఫ్సీ (1.32%), ఎం అండ్ ఎం (1.06%) లు కుంగాయి. మరోవైపు టాటా పవర్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్యూఎల్, సిప్లా, సన్ ఫార్మా లాభాలలో నడిచాయి. ద్వితీయ షేర్ల ర్యాలీకి అద్దం పడుతూ మార్కెట్లో 1,588 షేర్లు లాభాలలో నిలవగా, 1,132 స్టాక్లు నష్టాల బాట పట్టాయి. మరో 113 షేర్లలో ఎలాంటి కదలిక కనిపించలేదు. ఈక్విటీ టర్నోవర్ రూ.2,552.45 నుంచి రూ.2,980కి ఎగబాకింది.
సెన్సెక్స్ -24.88%, నిఫ్టీ-26.65 % పెరుగుదల
2014-15 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 5,571.22 పాయింట్ల మేర పెరిగింది. అంటే 22,386.27 పాయింట్ల నుంచి 24.88 శాతం మేర పెరిగి 27,957 పాయింట్లకు చేరుకుందన్న మాట. ఒకనొక దశలో (మార్చి 4న) సెన్సెక్స్ 30,025 పాయింట్ల గరిష్ఠ స్థాయిని కూడా తాకిన సంగతి తెలిసిందే. ఇదే దారిలో నిఫ్టి కూడా 26.65 శాతం మేర ఎగిసి 8,491 పాయింట్లకు చేరింది. 2014-15 సంవత్సరంలో గరిష్ఠంగా 9,1190 పాయింట్ల స్థాయిని తాకింది. చమురు శుద్ధి సంస్థలలో మంచి వృద్ధి కనిపించినప్పటికీ తరువాత అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం తదితర కారణాల మూలంగా ఈ రంగం షేర్లు కొంత మసకబారాయి. హెడీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, భెల్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎం ఆండ్ ఎం, హిందాల్కో కొంత కుంగాయి. మరోవైపు ఆర్ఐఎల్, టాటా మోటార్స్, సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్టెల్, టాటా పవర్ సంస్థ షేర్లు చొప్పుకో దగ్గ లాభాలను ఆర్జించాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ జోరుకు కొంత బ్రేక్లు వేశాయి. భారత కంపెనీలు ఈక్విటీ మార్కెట్ల ద్వారా దాదాపు రూ.58,801 కోట్లను సమీకరించుకోగలిగాయి. 2010-11 తరువాత ఈక్విటీ సమీకరణ ఈ స్థాయిలో ఉండడం ఇదే ప్రప్రథమం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 3, Sep 2018, 12:45 PM IST
Highlights
అదే జరిగితే నేడు భారత్ ఓ బంగారం లాంటి అథ్లెట్ను కోల్పోయేది. ఆమె ప్రతిభ గురించి తెలుసుకున్న ద్రవిడ్ ఆర్థికంగా చేయూతనిచ్చాడు.
ఏషియన్ గేమ్స్ లో హెప్టథ్లాన్ విభాగంలో తొలిసారిగా భారత్ స్వర్ణం గెలిచింది. ఎంతో కష్టమైన ఈ గేమ్ ని అంతే కష్టపడి సాధించింది అథ్లెట్ స్వప్న బర్మన్. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి.. స్వర్ణం గెలవడంతో.. దేశం మొత్తం ఆమెను ప్రశంసిస్తోంది. అయితే.. ఈ అమ్మాయి విజయం వెనుక టీం ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్వప్న బర్మన్ తండ్రి ఓ రిక్షా పుల్లర్. ఆయనకు రెండు సార్లు గుండెపోటు రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. తల్లి టీ తోటలో పనిచేపే దినసరి కూలి. ఈ పరిస్థితుల్లో స్మప్న ఆటను కొనసాగించడం కష్టమైంది. దీంతోనే ఆమె తన ఆటకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. అదే జరిగితే నేడు భారత్ ఓ బంగారం లాంటి అథ్లెట్ను కోల్పోయేది. ఆమె ప్రతిభ గురించి తెలుసుకున్న ద్రవిడ్ ఆర్థికంగా చేయూతనిచ్చాడు.
ద్రవిడ్ మెంటార్ షిప్ కార్యక్రమం ద్వారా ఆర్థికంగానే కాకుండా మానసికంగా ధృడం అయ్యేలా శిక్షణను ఇచ్చాడు. ఆమెకే కాదు 2018 ఏషియాడ్లో పాల్గొన్న మరో 19 అథ్లెట్లకు ‘వాల్ ఆఫ్ క్రికెట్’ అనే పేరుతో ఆర్థికంగా సాయం చేసి ప్రోత్సాహించాడు. గో స్పోర్ట్స్ భాగస్వామ్యంతో ద్రవిడ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మారుమూల గ్రామాల్లోని క్రీడా ఆణిముత్యాల ప్రతిభను వెలకితీయడమే ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశ్యం. ఇలా ఎంతో మంది అథ్లెట్లను ద్రవిడ్ ప్రపంచానికి పరిచయం చేశాడు.. చేస్తున్నాడు.
Last Updated 9, Sep 2018, 11:57 AM IST | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
విలన్గా మారుతున్న మరో స్టార్ డైరెక్టర్
దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ఇప్పటివరకు సక్సెస్ఫుల్ ఫిలింమేకర్ అనిపించుకున్న సౌతిండియన్ సినీపర్సనాలిటీ...
TNN | Updated:
Sep 11, 2016, 05:20PM IST
దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ఇప్పటివరకు సక్సెస్ఫుల్ ఫిలింమేకర్ అనిపించుకున్న సౌతిండియన్ సినీపర్సనాలిటీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇకపై నటనలోనూ తనకున్న ప్రావీణ్యాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. తన సినిమాల్లో అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో కనిపించే గౌతమ్ మీనన్.. ఇక ఫుల్ లెంత్ యాక్టింగ్కి సిద్ధపడుతున్నాడు. అథర్వ, నయన్ తార జంటగా అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేయనున్న ఇమైక్క నొడిగల్ మూవీలో గౌతమ్ ఓ నెగటివ్ పాత్రలో కనిపించనున్నాడు. మొదట ఈ పాత్ర చేయడానికి అంతగా ఇష్టం ప్రదర్శించని గౌతమ్.. అజయ్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివాకా అది బాగా నచ్చడంతో అంగీకరించినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి మళయాళం దర్శకుడు వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో ఓ మళయాళంలో సినిమా ద్వారా ఫుల్ లెంత్ యాక్టర్ అవ్వాలనుకున్నాడు గౌతమ్. కానీ అంతకన్నా ముందే నయనతార నటిస్తున్న ఈ సినిమాతో విలన్ అవతారమెత్తుతున్నాడు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ICC Test Rankings: మళ్లీ కోహ్లీనే టాప్
ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్లో.. ఆస్ట్రేలియా గడ్డపై రెండు టెస్టుల్లో గెలుపొందిన భారత్ 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ (108), న్యూజిలాండ్ (107), దక్షిణాఫ్రికా (106), ఆస్ట్రేలియా (102) టాప్-5లో నిలిచాయి.
Samayam Telugu | Updated:
Dec 31, 2018, 03:26PM IST
ICC Test Rankings: మళ్లీ కోహ్లీనే టాప్
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్లో నిలకడగా రాణిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సోమవారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ను ప్రకటించగా.. మెల్బోర్న్ వేదికగా నిన్న ముగిసిన మూడో టెస్టు మ్యాచ్లో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మూడు పాయింట్లు చేజార్చుకున్నప్పటికీ.. 931 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 897 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. అతనికి కోహ్లీకి మధ్య వ్యత్యాసం 34 పాయింట్లు. ఇక అడిలైడ్, మెల్బోర్న్ టెస్టులో శతకాలు బాదిన చతేశ్వర్ పుజారా 834 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
హాలిడేస్ లో ప్రిన్స్ పిల్లలు
హాలిడేస్ అంటే చాలు పిల్లలలకు ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది.
TNN | Updated:
Mar 31, 2016, 04:14PM IST
హాలిడేస్ అంటే చాలు పిల్లలలకు ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. ఎక్కడికెళ్లి ఎంజాయ్ చేద్దామా అని ఉత్సాహపడుతుంటారు. ప్రిన్స్ మహేష్ పిల్లలు కూడా అందుకు మినహాయింపు కాదు మరి. అందుకే మహేష్ షూటింగులతో బిజీగా ఉన్నా ఆయన భార్య నమ్రత పిల్లలను గోవా ట్రిప్పుకు తీసుకెళ్లింది. పిల్లలు ఎంత హుషారుగా ఎంజాయ్ చేస్తున్నారో కదా? | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
NTR Mahanayakudu: బయోపిక్ తీసి పెద్ద తప్పుచేశాడట బాలయ్య! వర్మా ఏంది కర్మా
అసలే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఏదోలా ధైర్యం చేసి నిన్న రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ విడుదల చేశారు. ఇది కూడా ఫస్ట్ కంటే బెటర్ అనే అభిప్రాయం వస్తుంది తప్ప హిట్ అనే మాట రావడం లేదు. ఈ సందర్భంలో పుండుమీద కారం చల్లాడు వర్మ.
Samayam Telugu | Updated:
Feb 23, 2019, 05:53PM IST
‘ఏమయ్యా వర్మా.. నీ సినిమా ప్రమోషన్స్ నువ్ చేసుకోవచ్చుకదా.. ఎందుకు ప్రతిసారి బాలయ్యను ఆయన తీసిన ఎన్టీఆర్ బయోపిక్ని కెలుకుతావ్’.. అంటూ నందమూరి అభిమానులు చాలా సాఫ్ట్గా చెబుతున్నా వర్మ మాత్రం వినేట్టులేడు. గోకి మరీ తిట్టించుకోవడంతో దిట్ట అయిన వర్మ మరోసారి బాలయ్యను టార్గెట్ చేయడానికి తన క్రియేటివ్ మైండ్ని ఉపయోగించారు.
అసలే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఏదోలా ధైర్యం చేసి నిన్న రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ విడుదల చేశారు. ఇది కూడా ఫస్ట్ కంటే బెటర్ అనే అభిప్రాయం వస్తుంది తప్ప హిట్ అనే మాట రావడం లేదు. ఈ సందర్భంలో పుండుమీద కారం చల్లుతున్నట్టు నందమూరి అభిమానులు నిరుత్సాహంలో ఉంటే.. వర్మ రెచ్చగొట్టే వీడియో పోస్ట్ చేశారు. | 0business
|
internet vaartha 134 Views
భారత్ మార్కెట్కు కె.సిరీస్ యాక్టివ్వాష్-యాడ్వాష్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రూ.7500 కోట్ల టర్నోవర్ ఉన్న వాషింగ్మెషిన్ మార్కెట్లో శాంసంగ్ మార్కెట్ లీడర్గా నిలిచిందని కంపెనీ వైస్ప్రెసిడెంట్ రాజీవ్భూటాని వెల్లడించారు. కంపెనీ అత్యాధునికంగా రూపొందించిన శాంసంగ్ యాక్టివ్వాష్, యాడ్వాష్ పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లను భారత్ మార్కెట్లకు లాంఛనంగా విడుదలచసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది 35 శాతం ఉన్న మార్కెట్ వాటా 40శాతానికి పెంచుకోగలమని వెల్లడించారు. రాబడుల్లో కూడా ఇతర మార్కెట్ కంపెనీల కంటే 15-20శాతం అధికంగాఉంటాయని పేర్కొన్నారు. కొత్త వాషింగ్ మెషిన్లను శాంసంగ్ ప్రెసిడెంట్ సిఇఒ హెచ్సి వాంగ్, సీనియర్ ఉపాధ్యక్షుడు డాన్షిన్లు లాంఛనంగా మార్కెట్కు విడుదలచేసారు. వాషింగ్ మెషిన్ మార్కెట్లో టాప్లోడ్లో ప్రత్యే కించి శాంసంగ్కు 40శాతం వాటాకుపైబడి సాధిం చామని ఇప్పటికీ మార్కెట్ లీడర్గా ఉన్నట్లు తెలి పారు. యాక్టివ్వాష్ను భారత్ మేక్ఫర్ ఇండియా ప్రణాళికకు నిదర్శనంగా వెల్లడించారు. మొత్తం దుస్తులను 59 నిమిషాల్లోనే పూర్తిచేస్తుందని, సమయం శక్తిని ఆదాచేస్తుందని,యాడ్వాష్ ఎలాంటి క్లిష్టత లేని యాడ్వాష్ 8కెజి, 9కెజిల్లో లభిస్తున్న దన్నారు. కేవలం భారత్ మార్కెట్పైనే దృష్టి సారించామని, ఎగుమతిమార్కెట్కు ఈ రెండు కొత్త వెర్షన్లు కేటాయించలేదన్నారు. భారత్ మార్కె ట్ స్థిరపడినతర్వాతనే ఎగుమతులపై దృష్టిసారి స్తామన్నారు. కెసిరీస్ టాప్లోడ్శ్రేణిలో యాక్టివ్ వాష్ నేటి తరానికి ఖచ్చితంగా అనువైనదిగా నిలు స్తుందన్నారు కొత్తగా వచ్చిన 8కిలోల ఫ్రంట్లోడ్ ధరలు డీలర్వద్ద 37,250 రూపాయల నుంచి 43,850 రూపాయల వరకూఉందని, యాడ్వాష్ డీలర్ధర తొమ్మిది కిలోలు 59,990 రూపాయ లుగాఉందన్నారు. యాక్టివ్వాష్ కెసిరీస్ టాప్లోడ్ డీలర్ధరలు 18,590రూపాయలనుంచి 28,290 ల వరకూ ఉన్నాయని రాజీవ్ భూటాని వెల్లడిం చారు. ఈ కార్యక్రమంలో సీని యర్ మార్కెటింగ్ అధికారి రిషిసూరి కూడా పాల్గొన్నారు. | 1entertainment
|
Kapil
టుస్సాడ్స్లో కపిల్ మైనపు విగ్రహం
న్యూఢిల్లీ: ఇండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.కన్నాట్ ప్లేస్లోని రీగల్ సినిమా సమీపంలో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో కపిల్ మైనపు విగ్రహాన్ని ఉంచారు.గురువారం జరిగిన వేడుకలో కపిల్దేవ్ తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1983లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు కపిల్దేవ్ కెప్టెన్గా ఉన్నాడు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహామహుల సరసన నా విగ్రహం పెట్టడం గర్వకారణం. ఈ అనుభూతిని నేనెప్పటికి మరచి పోను.నా జీవితమంతా క్రికెట్నే ప్రాణంగా శ్వాసించాను. ప్రతి క్రికెటర్ విజయవంతం కావాలని నేనిప్పుడు కోరుకుంటున్నాను అని కపిల్ పేర్కొన్నాడు.58 సంవత్సరల వయసులో నా మైనపు విగ్రహం పెట్టడం నాకు గౌరవం.ఇది నాకు మరింత ప్రేరణ కలిగిస్తుంది.నన్ను మేడమ్ టుస్సాడ్స్ దాకా తీసుకొచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. 300 రకాల కొలతలు తీసుకోవడం చాలా బాగా అనిపించిందని కపిల్ వివరించాడు. మేడమ్ టుస్సాడ్స్కు మ్యూజియంకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్నాయి. టుస్సా డ్స్కు ప్రపంచ వ్యాప్తంగా 23 శాఖలున్నాయి. ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియం 23వది కావడం విశేషం.క్రీడా, మ్యూజిక్, ఫిల్మ్, టివి సెలబ్రిటీలు ఇందులోఉన్నారు. మహాత్మా గాంధీ, సచిన్, అమితాబ్, జాకీ చాన్,లేడీ గాగా ఇలా సుమారు 50 మైనపు విగ్రహాలు ఉన్నాయి. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బ్యాడ్మింటన్ కొత్త రూల్స్పై క్రీడాకారులు విముఖత..!
బ్యాడ్మింటన్లో కొత్తగా అమల్లోకి రానున్న నిబంధనలపై క్రీడాకారులు పెదవి విరుస్తున్నారు. మ్యాచ్ మధ్యలో కోచింగ్
Samayam Telugu | Updated:
Mar 13, 2018, 11:35AM IST
బ్యాడ్మింటన్ కొత్త రూల్స్పై క్రీడాకారులు విముఖత..!
బ్యాడ్మింటన్‌లో కొత్తగా అమల్లోకి రానున్న నిబంధనలపై క్రీడాకారులు పెదవి విరుస్తున్నారు. మ్యాచ్ మధ్యలో కోచింగ్ సమయాన్ని తగ్గించడం, ఇప్పటి వరకు ఉన్న మూడు సెట్‌లను ఐదు సెట్‌లుగా మార్చి.. గేమ్ పాయింట్లని కూడా 21 నుంచి 11కి తగ్గించాలనే కొత్త నిబంధనలు తమని ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకురాగా.. మరికొన్నింటిని మే 19న బ్యాంకాక్‌లో జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వార్షిక సర్వసభ్య సమావేశంలో చర్చించడం ద్వారా అమలు చేయనున్నారు. అయితే.. ఈ నిబంధనలపై క్రీడాకారులతో పాటు కోచ్‌లు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
Recommended byColombia
కొత్త నిబంధనలు ఇవే..!
* సర్వీస్ సమయంలో షటిల్‌ను తాకేటప్పుడు రాకెట్.. కోర్టు నుంచి 1.15 మీటర్ల మించి ఎత్తులో ఉండకూడదు. ఈ నిబంధన పీవీ సింధు లాంటి హైట్ షట్లర్లకి ఇబ్బందిగా మారనుంది. ఈ కొత్త రూల్ ఇప్పటికే అమల్లోకి రాగా.. బుధవారం నుంచి జరగనున్న ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌ టోర్నీలో ఆటగాళ్లకి అనుభవంలోకి రానుంది.
* సాధారణంగా ఇప్పటి వరకు 21 పాయింట్లతో గేమ్ మూడు సెట్ల రూపంలో ఉండేది. అయితే.. కొత్త రూల్ ప్రకారం.. గేమ్‌ని ఐదు సెట్లుగా మార్చి.. గేమ్ పాయింట్లను కూడా 21 నుంచి 11కే తగ్గించేశారు. దీంతో.. ఆరంభంలో వెనుకంజ వేసిన క్రీడాకారులు పుంజుకునేలోపే సెట్ ముగిసిపోతుంది. ఇది.. ఆటగాళ్ల మనోస్థైర్యాన్ని దెబ్బతీయనుందని కోచ్‌లు అభిప్రాయపడుతున్నారు.
* సెట్ మధ్యలో 11 పాయింట్లు ముగియగానే.. లెమన్ బ్రేక్‌ ఇస్తారు. ఈ సమయంలో ఆటగాళ్లు తమ కోచ్‌తో మాట్లాడే సౌలభ్యం ఉంటుంది. ఒకవేళ తప్పిదాలు చేస్తుంటే.. కోచ్ సలహా, సూచన మేరకు వారు తమ ఆటని వెంటనే దిద్దుకునే వెసులబాటు ఈ బ్రేక్ ద్వారా లభిస్తుంది. గతంలో.. ఇలా షట్లర్లకి మధ్యలో కోచింగ్ ఇచ్చే సదుపాయం లేదు. కానీ.. ప్రపంచ సమాఖ్య ఆ అవకాశం కల్పించింది. కానీ.. తాజాగా ఆ కోచింగ్ సమయాన్ని తగ్గిస్తూ కొత్త రూల్‌ని తీసుకొస్తోంది.
* ర్యాంకింగ్స్‌లో టాప్-15 క్రీడాకారులు కనీసం ఏడాదిలో 12 టోర్నీలు ఆడాలనేది అత్యంత కఠినమైన నిబంధనగా కోచ్‌లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో కామన్‌వెల్త్, ఆసియా గేమ్స్‌ని టోర్నీలను కలపకూడదు. మిగతా దేశాలతో పోలిస్తే.. భారత షట్లర్లకే ఈ నిబంధన ఎక్కువ నష్టం చేయనుంది. ఎందుకంటే.. కామన్‌వెల్త్‌, ఆసియా క్రీడలతో పాటు ఉబర్ కప్, ఇండియా ఓపెన్, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌(పీబీఎల్)ని కూడా మన షట్లర్లు ఆడాల్సి వస్తుంది. దీంతో.. ఏడాదిలో తీరిక లేకుండా పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ లాంటి అగ్రశ్రేణి షట్లర్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది.
‘బ్యాడ్మింటన్‌లో కొత్తగా ఎలాంటి మార్పులు చేస్తున్నారో.. పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. ఒకప్పుడు షట్లర్లకి బ్రేక్ సమయంలో కోచింగ్ ఇచ్చే వెసులబాటు ఉండేది కాదు. సమాఖ్య ఆ అవకాశం కల్పించింది. ఇప్పుడు మళ్లీ ఆ కోచింగ్ సమయాన్ని తగ్గిస్తున్నారు’ అని ఇటీవల మీడియాతో భారత చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అసహనం వ్యక్తం చేశారు.
‘కొత్త నిబంధనలు క్రీడాకారుల్ని శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. బ్రేక్ సమయంలో కోచ్‌తో చర్చించి.. వాళ్లు తప్పిదాలు దిద్దుకునే వెసులబాటు ఉంటుంది. తాజాగా ఆ సమయాన్ని తగ్గించడంపై షట్లర్లు ఆందోళన పడుతున్నారు’ అని సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ అభిప్రాయపడ్డారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సిడ్నీ: పాక్ పేసర్ల బౌలింగ్లో కోహ్లి నెట్ ప్రాక్టీస్.. కారణమిదే!
సిడ్నీ టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లి సహా మిగతా భారత బ్యాట్స్మెన్ పాకిస్థాన్ పేసర్ల బౌలింగ్లో నెట్ ప్రాక్టీస్ చేశారు. పెర్త్ టెస్టులో స్టార్క్ బౌలింగ్లో ఇబ్బంది పడ్డ కోహ్లి.. పాక్ పేసర్ బౌలింగ్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
Samayam Telugu | Updated:
Jan 2, 2019, 02:01PM IST
సిడ్నీ: పాక్ పేసర్ల బౌలింగ్లో కోహ్లి నెట్ ప్రాక్టీస్.. కారణమిదే!
హైలైట్స్
సిడ్నీ టెస్టు ఆరంభానికి ముందు పాక్ పేసర్ల బౌలింగ్లో కోహ్లి సేన మ్యాచ్ ప్రాక్టీస్
పెర్త్ టెస్టులో స్టార్క్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ కోహ్లి
కోహ్లికి బౌలింగ్ చేసిన పాక్ బౌలర్లు రవూఫ్, సల్మాన్.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టెస్టు సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా సిడ్నీలోనూ గెలిచితీరాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఆటగాళ్ల నెట్లో చెమటోడుస్తున్నారు. తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ను గెలిచి చరిత్ర సృష్టించడానికి కోహ్లి సేన ఉబలాటపడుతోంది. గురువారం నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలుస్తోంది. కానీ భారత బ్యాట్స్మెన్ మాత్రం నెట్స్లో పాకిస్థాన్ పేస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. | 2sports
|
చంద్రబాబుకు మానం మర్యాద లేవా-తమ్మారెడ్డి భరద్వాజ
Highlights
మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చెప్పటానికి సిగ్గులేదా
చంద్రబాబుకు మానం మర్యాద లేవా
ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఎవరైనా చెప్పుకుంటారా
ఏపీ సీఎం చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్తే మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదనటం ఒక తెలుగు వాడిగా నా ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంలో నా ఆత్మగౌరవమే కాదు ప్రతి తెలుగోడి ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు. ఒకవేళ మోదీ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా.. చంద్రబాబు ఆ మాట చెప్పడం తప్పు అన్నారు. ఇది ఎంత దారుణం. దీన్ని ఎవరైనా చెప్పుకుంటారా? అన్నారు. నిజంగా చంద్రబాబుకి ఆత్మగౌరవం ఉండి ఉంటే ఒకసారి రెండుసార్లు చూసి అప్పుడే మొత్తానికి బయటకు వచ్చేయాలి.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రధాని వద్దకు వెళితే అపాయింట్మెంట్ ఇవ్వారా? 29 సార్లు నా ముఖ్యమంత్రి వెళితే పట్టించుకోరా? ఎవడండీ ప్రధాన మంత్రి.. సీఎంని లోపలికి రానీయకుండా ఉండటానికి? వాడికి ఎంత ధైర్యం ఉండాలి? ప్రధాన మంత్రి ఎంత గొప్పోడైనా కావచ్చు. ఇలా చేస్తారా?
సంవత్సరన్నర పాటు మా ముఖ్యమంత్రిని లోపలికి రానీయకుండా చేశారంటే.. ఆ ముఖ్యమంత్రిని నేను ఓటేసి గెలిపించుకున్నా.. అతన్ని అవమానించారంటే మమ్మల్ని అవమానించినట్టే. మాకు ఈ అవమానానికి నువ్ ఏం సమాధానం చెప్తావ్ అంటూ ప్రధానిని ప్రశ్నించారు తమ్మారెడ్డి. అయితే అలాంటి దారుణమైన పరిస్థితుల్లో టీడీపీ ఎన్డీయే పార్టీని ఎందుకు వదిలేయలేదని తాను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారన్నారు తమ్మారెడ్డి.
Last Updated 25, Mar 2018, 11:53 PM IST | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మహేష్ పక్కన రకుల్కి ఛాన్స్?
తెలుగులో నెంబర్ వన్ కథానాయిక స్థానానికి పోటీపడుతోంది రకుల్ ప్రీత్ సింగ్.
TNN | Updated:
Jan 15, 2016, 11:03AM IST
మహేష్ పక్కన రకుల్కి ఛాన్స్?
తెలుగులో నెంబర్ వన్ కథానాయిక స్థానానికి పోటీపడుతోంది రకుల్ ప్రీత్ సింగ్ . చేతినిండా సినిమాలతో చాలా బిజీ అయిపోయింది. అలా అని ఆమె ఖాతాలో పెద్ద హిట్లు కూడా లేవు. బ్రూస్ లీ అయితే కనీసం ఆడలేదు. అయినా అమ్మడు బిజీనే. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ ని అమ్మడు కొట్టేయబోతోందట. ఏంటో తెలుసా? ప్రిన్స్ మహేష్ పక్కన రకుల్ నటించే ఛాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలో ముగ్గురు హీరోయిన్లు అనుకున్న సంగతి తెలిసిందే. కాజల్, ప్రణీత, సమంత. అయితే సమంత ఇంతవరకూ తన కాల్ షీట్లు ఇవ్వలేదట. తమిళంలో చాలా బిజీగా ఉండడం వల్ల ఆమె ఈ సినిమా షూటింగ్ లో ఇంతవరకు పాల్గొనలేదు. ఇదే కొనసాగితే... కొన్ని రోజులకు సమంతను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమె స్థానంలో ఎవరినో తీసుకోవాలో కూడా ఇప్పటికే చిత్రయూనిట్ చర్చించుకుందట. ఆ ఛాన్స్ రకుల్ కి ఇద్దామని వారు ఫిక్సయినట్టు సమాచారం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Hyderabad, First Published 6, Aug 2019, 2:06 PM IST
Highlights
బాలీవుడ్లో ఘన విజయం సాధించిన క్వీన్ సినిమా కు రీమేక్ గా తమిళ్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. బోల్డ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమా కావటంతో కొన్ని విజువల్ గా అసబ్యంగా ఉండే సన్నివేశాలు, చాలా డైలాగ్స్ను తొలగించాల్సిందిగా సెన్సార్ సభ్యులు సూచించారు. సీన్స్ను బ్లర్ చేయాలని అన్నారు.
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తమిళ్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన క్వీన్ సినిమా కు రీమేక్ ఇది. తెలుగులో తమన్నా, తమిళ్లో కాజల్, కన్నడలో పరూల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం మొదట్లోనే షూటింగ్ పూర్తయినా రిలీజ్ విషయంలో మాత్రం లేటవుతోంది. అందుకు కారణం సెన్సార్ సమస్యలు అని సమాచారం.
పారిస్ పారిస్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బోల్డ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమా కావటంతో కొన్ని విజువల్ గా అసబ్యంగా ఉండే సన్నివేశాలు, చాలా డైలాగ్స్ను తొలగించాల్సిందిగా సెన్సార్ సభ్యులు సూచించారు. సీన్స్ను బ్లర్ చేయాలని అన్నారు. దాంతో చిత్రయూనిట్ రివైజ్ కమిటీని ఆశ్రయించేందుకు రెడీ అవుతోంది. రివైజింగ్ కమిటీ తమిళ క్వీన్కు క్లియరెన్స్ వస్తే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.
రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మను కుమరన్ నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక ఐఫిల్ టవర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అమాయకంగా ఉండే ఓ అమ్మాయి.. జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల వల్ల ఎలా శక్తివంతమైన మహిళగా మారుతుంది అనేది ‘ప్యారిస్ ప్యారిస్’ కథ. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. మైఖెల్ టబూరియస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Last Updated 6, Aug 2019, 2:06 PM IST | 0business
|
India Srilanka Test Match
భారత్కు 439 పరుగుల అధిక్యత
కొలంబో : రెండో టెస్టు తొలి ఇన్సింగ్స్ శ్రీలంక 183 పరుగులకే కుప్పకూలింది. అంతకు ముందు భారత్ 622/9 పరుగులకు డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్కు 439 పరుగుల అధిక్యత లభించింది. 50/2 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన లంకను భారత్ ధీటుగా ఎదురించింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లపై విరుచుకుపడ్డారు. డిక్వెల్ (51) మినహా బ్యాట్స్మెన్లెవరూ ఆశించదగ్గ స్కోరు చేయలేకపోయారు. అశ్విన్ 5 వికెట్లతో రాణించగా, షమీ, జడేజా చెరో రెండు, ఉమేష్ యాదవ్ ఞక వికెట్ పడగొట్టారు. | 2sports
|
GMR
రుణభారం తగ్గడంతో జిఎంఆర్ ఇన్ఫ్రా ర్యాలీ!
హైదరాబాద్, జూన్ 3: రుణభారం తగ్గి కంపెనీ పని తీరు మెరుగుపడటంతో హైదరాబాద్కు చెందిన మౌలిక సదుపాయాల కల్పనాసంస్థ జిఎంఆర్ ఇన్ఫ్రా కౌంటర్లో షేర్లుపెరిగాయి. ఇన్వెస్టర్లు కొను గోళ్లకు ఆసక్తి చూపించారు. బిఎస్ఇలో జిఎంఆర్ ఇన్ఫ్రా ప్రస్తుతం 17శాతంపైగా దూసుకెళ్లి 17.55 వద్ద ట్రేడ్ అవుతోంది. 2016తో పోలిస్తే 2017 కల్లా కంపెనీ స్థూల రుణభారం 37,480కోట్ల నుంచి 19,856 కోట్లకు తగ్గిందని కంపెనీ స్టాక్ ఎక్ఛేంజిలకు తెలిపింది. దీనితో 2016-17 కల్లా నికరనష్టం 2713కోట్ల రూపాయలనుంచి రూ.575 కోట్లకు పరిమితంఅయినట్లు కంపెనీభావన. కంపెనీ గ్రూప్ సిఎఫ్ఒ మధు మాట్లాడుతూ విమానాశ్రయా లు ఇంధన విభాగాలు భారీగా మెరుగుపడటంతో నిర్వహణలాభం పుంజుకున్నదని అన్నారు. పన్నుల చెల్లింపులకుముందు 12శాతం బలపడి రూ.3497 కోట్లకు చేరింది. మార్జిన్లు కూడా 4శాతంపెరిగి 42 శాతానికి చేరాయి. గత ఏడాదిలో విమానాశ్రయ విభాగం బిజినెస్ భారీగాపెరిగింది.
తొలిసారి ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్టులు డివిడెండ్ను ప్రకటించాయి. ఇదే సమయంలో గోవా ఎయిర్పోర్టును కొత్తగా సాధించింది. మాల్దీవుల ఎయిర్పోర్టుకు సంబంధించి మధ్యవర్తిత్వ అవార్డు లభించింది. దీనితో కంపెనీ రూ.1800 కోట్లు అందుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్టు చుట్టు పక్కల భూమిద్వారా ఇప్పటికే ఆదాయం ఆర్జించిన కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లోని భూమిని విక్రయించేయోచన లోఉంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలోగల భూమిని సైతం రూ.800 నుంచి రూ.1000 కోట్లకు విక్రయించేయోచనలో ఉంది. ఇవేకాకుండా ఇతర భూముల ద్వారా మరో 400 కోట్లవరకూ సమకూరే వీలుంది. గత ఏడాదిప్రారంభం అయిన ఛత్తీస్గఢ్ పవర్ప్రాజెక్టు రుణాలపై రుణదాతలు వ్యూహాత్మకరుణ పునర్వ్యవస్థీకరణ అమలుచేసారు. దీనితో రూ.2992కోట్ల రుణాలు ఈక్విటీగా మారాయి. ప్రాజెక్టుల 52శాతం వాటా రుణదాతలకు వచ్చింది. కంపెనీ ఇపిసి ఆర్డర్ బుక్ రూ.7200 కోట్లకు చేరింది. దీనలో సరుకులకు ప్రత్యేకించిన తూర్పురైల్వేప్రాజెక్టు ఆర్డర్ రూ.2281 కోట్లు కలిసి ఉంది. జిఎంఆర్ విద్యుత్ విభాగం జిఎంఆర్ ఆరోరా తొలిసారిగా 143 కోట్ల నికరలాభం ఆర్జించింది. తెనగాను వ్యూహాత్మక భాగస్వామిగా చేర్చుకోవడం, గోవా ఎయిర్పోర్టు మరోటిరావడం జిఎంఆర్కు మధ్యవర్తిత్వ అవార్డు లభించడం వంటివి రుణభారాన్ని తగ్గించాయి.
కంపెనీకి నికరంగా తొమ్మిదికోట్ల నికరలాభం వచ్చింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో రూ.2664 నికరనష్టం నుంచి కంపెనీ రికవరీ అయింది. ఢిల్లీ, హైదరాబాద్ఎయిర్పోర్టులు తమ మొదటి డివిడెండ్లను ప్రకటించాయి. గోవాలోని మోపా గ్రీన్ఫీల్డ్ఎయిర్పోర్టును బిఒటి పద్ధతిలో సాధించింది. 40 ఏళ్లపాటు లీజు ఆపై 20ఏళ్లకు పొడిగించే అవకాశంఉంది. జిఎంఆర్ ఎయిర్పోర్టుల్లో ట్రాఫిక్82 మిలి యన్లకు పెరిగింది. 19శాతం వృద్ధినమోదుచేసింది. అలాగే రాజ మండ్రి గ్యాస్ప్రాజెక్టులో రుణదాతలు 1414కోట్ల రూపాయల రుణా న్ని 55శాతం ఈక్విటీగా మార్చారు. మొత్తం మీద రుణభారం తగ్గడం తో జిఎంఆర్ ఇన్ఫ్రా కొనుగోలుపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆస్ట్రేలియా క్రికెటర్లకి శిక్ష ఖరారు..!
బాల్ టాంపరింగ్కి డేవిడ్ వార్నర్ వ్యూహం రచించగా.. కేవలం ఏడు టెస్టులు మాత్రమే అనుభవమున్న బాన్క్రాఫ్ట్ ఆ పని చేసేందుకు
TNN | Updated:
Mar 28, 2018, 03:09PM IST
ఆస్ట్రేలియా క్రికెటర్లకి శిక్ష ఖరారు..!
దక్షిణాఫ్రికాతో రెండు రోజుల క్రితం ముగిసిన టెస్టు మ్యాచ్లో బాల్ టాంపరింగ్కి పాల్పడిన ఆస్ట్రేలియా క్రికెటర్లకి శిక్ష ఖరారైంది. ప్రాథమిక విచారణ అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బౌలర్ కామెరూన్ బ్రాన్క్రాఫ్ట్ ఈ తప్పిదానికి పాల్పడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ మంగళవారం రాత్రి వెల్లడించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రని మసకబార్చిన ఈ క్రికెటర్లపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన సీఏ చీఫ్ బుధవారం శిక్షని ప్రకటించారు.
Visit Site
Recommended byColombia
బాల్ టాంపరింగ్కి డేవిడ్ వార్నర్ వ్యూహం రచించగా.. కేవలం ఏడు టెస్టులు మాత్రమే అనుభవమున్న బాన్క్రాఫ్ట్ ఆ పని చేసేందుకు ఒప్పుకున్నాడు. దీనికి కెప్టెన్ స్టీవ్స్మిత్ కూడా అంగీకారం తెలిపినట్లు తేలడంతో.. ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. స్మిత్, వార్నర్లకి 12 నెలల నిషేధం, బాన్క్రాప్ట్పై 9 నెలలు నిషేధం విధిస్తున్నట్లు సీఏ చీఫ్ సదర్లాండ్ తెలిపారు. ఇప్పటికే ఈ ముగ్గరినీ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పించిన సీఏ.. స్వదేశానికి వచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా.. స్మిత్, వార్నర్లను ఆసీస్ కెప్టెన్, వైస్ కెప్టెన్ల బాధ్యతల నుంచి కూడా తప్పించింది. ఐపీఎల్లోనూ రాజస్థాన్ రాయల్స్ (స్మిత్), సన్రైజర్స్ హైదరాబాద్ (వార్నర్) నాయకత్వ బాధ్యతల్ని ఈ ఇద్దరూ వదులుకున్నారు. తాజా నిషేధంతో వీరిద్దరూ ఐపీఎల్కి కూడా దూరంకానున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Highlights
పెరూ వీక్.. డెన్మార్క్ విన్
హైదరాబాద్: యూసుఫ్ పాల్సన్ చేసిన ఏకైక గోల్ 30 ఏళ్ళ తర్వాత వరల్డ్ కప్ టోర్నమెంట్కు వచ్చిన పెరూపై డెన్మార్క్ గెలుపొందడానికి కారణమైంది. 1-0 స్కోరుతో డెన్మార్క్ విజేతగా నిలిచింది. బలహీనంగా ఉన్నప్పటికీ, శనివారం రాత్రి ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పెరూ చేసిన పోరాటం ప్రేక్షకులను కట్టిపడేసింది.టోటెన్హామ్, క్రిస్టియస్ ఎరిక్సన్ లాంటి హేమాహేమాలతో వీరంగం ఆడుతున్న డెన్మార్క్కు పెరూ గట్టి పోటీ ఇచ్చిన తీరు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
ఇంతటి ఉత్కంఠభరిమైన పోరులో ఫస్టాఫ్ ముగిసే సమయానికి మ్యాచ్ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. సెకండాఫ్లో యుసుఫ్ పాల్సన్ 59వ నిముషంలో గోల్ చేసి డెన్మార్క్కు ఆధిక్యతను కట్టబెట్టాడు. సెకండాఫ్ అంతా ఇరు జట్ల మధ్య హోరాహోరీతో పోరుతోనే ముగిసింది. డెన్మార్క్ను విజేతను చేసింది. యూసఫ్ పాల్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
Last Updated 18, Jun 2018, 11:07 AM IST | 2sports
|
senior actress, producer bv radha dies in bengaluru
నటి బి.వి.రాధ కన్నుమూత.. అవయవాలు దానం
సీనియర్ నటి, నిర్మాత బి.వి.రాధ బెంగళూరులో కన్నుమూశారు. ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో రాధ గుండెపోటుకు గురయ్యారు.
TNN | Updated:
Sep 10, 2017, 02:13PM IST
సీనియర్ నటి, నిర్మాత బి.వి.రాధ బెంగళూరులో కన్నుమూశారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన రాధను కుటుంబ సభ్యులు కళ్యాణి నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆదివారం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 70 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాధ.. బెంగళూరులోని ఆమె కుమార్తె ధనలక్ష్మి ఇంట్లో ఉంటున్నారు.
కన్నడలో సినీ రంగ ప్రవేశం చేసిన రాధ దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, తులు భాషల్లో అగ్రహీరోల సినిమాల్లో ఆమె నటించారు. 1964లో వచ్చిన కన్నడ చిత్రం ‘నవకోటి నారాయణ’లో తొలిసారి రాధ చిన్న పాత్ర పోషించారు. ఆ తరవాత అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో మంచి నటిగా నిలిచిపోయారు. ప్రముఖ కన్నడ దర్శకుడు కె.ఎస్.ఎల్.స్వామిని రాధ పెళ్లాడారు. దక్షిణాదిలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్, ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ తదితరులతో కలిసి నటించిన రాధ.. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
8 నుంచి భాగ్యనగరంలో బాలల సినిమా పండగ
అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. నవంబరు 8 నుంచి 14 వరకు భాగ్యనగరంలో బాలల సినిమా పండగ సందడి చేయనుంది. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ - ఇండియా (సీఎఫ్ఎస్ఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 20వ బాలల చలన చిత్రోత్సవాలకు బాలీవుడ్ నుంచే కాకుండా హాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు తరలిరానున్నారు. శిల్పాకళావేదికలో ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
TNN | Updated:
Oct 23, 2017, 07:55PM IST
అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు హైదరాబాద్‌ ముస్తాబవుతోంది. నవంబరు 8 నుంచి 14 వరకు భాగ్యనగరంలో బాలల సినిమా పండగ సందడి చేయనుంది. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ - ఇండియా (సీఎఫ్‌ఎస్ఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 20వ బాలల చలన చిత్రోత్సవాలకు బాలీవుడ్ నుంచే కాకుండా హాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు తరలిరానున్నారు. శిల్పాకళావేదికలో ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో 12 థియేటర్లను సిద్ధం చేస్తున్నారు. సీఎఫ్‌ఎస్‌ఐతో కలిసి తెలంగాణ ప్రభుత్వం.. ‘గోల్డెన్ ఎలిఫాంట్ (బంగారు ఐరావతం)’ పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది.
బాలల చిత్రోత్సవాల కోసం 109 దేశాల నుంచి 1402 సినిమాలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. వీటిలో యానిమేషన్, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. ప్రధాని మోదీ స్ఫూర్తితో 20వ బాలల చలన చిత్రోత్సవాల థీమ్‌ను ‘న్యూ ఇండియా’గా నిర్ణయించారు. 2022 నాటికి అవినీతి రహిత, నూతన భాతరదేశాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. | 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.