news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
రాజమౌళి RRR.. ఇదొక పజిల్!!
Samayam Telugu| Mar 23, 2018, 12.29 PM IST
బహుశా.. దీన్ని టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ఆఫ్ ద డికేడ్..అనాలేమో! తెలుగునాట మల్టీ స్టారర్ సినిమాలు అరుదు. అందులోనూ.. సరిసమాన స్థాయి ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి నటించడం అంటే.. కొన్ని దశాబ్దాల నుంచి అలాంటి సినిమాలు రాలేదని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఒకే సినిమాలో కనిపించబోతూ ఉండటం.. సంచలనాత్మకమైన అంశమే. ఈ ప్రాజెక్ట్ ఒకేసారి అనౌన్స్ కాలేదు. మొదట్లో ఊహాగానాలుగా మొదలై.. చివరకు కన్ఫర్మ్ అయ్యింది. దీంతో.. ఇది జనాల్లోకి నెమ్మదిగా వెళ్తోంది.
RRR అంటూ.. ఒక విధమైన వర్కింగ్ టైటిల్ ను అనౌన్స్ చేసేసి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలోని సినిమాను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ధ్రువీకరించేశాడు. అయితే పూర్తి వివరాలేవీ ప్రకటించకుండా.. ఈ అనౌన్స్ మెంట్ తో రాజమౌళి అందరికీ ఒక పజిల్ ను ఇచ్చాడు.
ఇప్పుడు ఈ సినిమా టైటిలేంటి? కథేంటి? కథనమేంటి? ఇది ఏ జోనర్ సినిమా? అనే అంశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సారి రాజమౌళి ఏ జోనర్లో వస్తున్నాడు..అది కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కలుపుకుని రావడం అంటే మాటలు కాదు.. ఆ ఇద్దరు హీరోలనూ కలిసి నటించడానికి ఒప్పించాడంటే.. ఇక్కడ రాజమౌళికి ఉన్న స్టార్ డైరెక్టర్ ఇమేజే కాదు, కథలో సత్తా కూడా ఎంతో ఉండి ఉండాలి!
మరి ఈ విషయంలో రాజమౌళి ఏ జోనర్ ను ఎంచుకుని ఉంటాడంటే.. ఈ సారి సైన్స్ ఫిక్షన్ తరహా సినిమాతో రాబోతూ ఉండవచ్చవనే మాట వినిపిస్తోంది. ఇంత వరకూ రాజమౌళి ఆ జోనర్ ను టచ్ చేయలేదు. కాబట్టి.. అలాంటి సినిమా అయి ఉండవచ్చనే ఊహాగానానికి అవకాశం దొరుకుతోంది. అలాగే.. రాజమౌళి మార్కు యాక్షన్ థ్రిల్లర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే టాక్ కూడా వినిపిస్తోంది. అన్నదమ్ముల తరహా పాత్రల మధ్యన నడిచే కథలతో ఇది వరకూ ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు ఈ సారి ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఎలా చూపబోతున్నాడో! | 0business
|
రూ.251కే స్మార్ట్ ఫోన్.. రింగింగ్ బెల్త్పై చీటింగ్ కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు!
రూ.251కే స్మార్ట్ ఫోన్.. రింగింగ్ బెల్త్పై కేసు మోహిత్ గోయెల్పై ఎఫ్ఐఆర్ నమోదు!
Selvi| Last Updated: శనివారం, 26 మార్చి 2016 (11:50 IST)
రూ.251కే స్మార్ట్ ఫోన్ ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్త్ గుర్తుండే వుంటుంది. ఇప్పుడీ కంపెనీ యాజమాన్యంపై చీటింగ్ కేసు నమోదైంది. సెక్షన్ 420 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నోయిడా పోలీసులు.
రింగింగ్ బెల్స్ యజమాని మోహిత్ గోయెల్, అధ్యక్షుడు అశోక్ చద్దాల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. భాజపా నేత కిరీట్ సోమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.
కేవలం రూ.251కే స్మార్ట్ ఫోన్ను తీసుకొస్తామన్న సంస్థ ప్రకటన అవాస్తవమని.. ఈ ధరకు స్మార్ట్ ఫోన్ను తయారు చేయడం సాధ్యం కాదని, ఇది ప్రజలను మోసపుచ్చడమేనని సోమయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రాథమిక విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఎఫ్ఐఆర్ను నమోదు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.కిరణ్ తెలిపారు. తదుపరి విచారణకు అవసరమైన పత్రాలను అందించాల్సిందిగా సంస్థను కోరినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనూప్ సింగ్ వివరించారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
Hyderabad, First Published 1, Nov 2018, 3:44 PM IST
Highlights
బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న నటుడు రణవీర్ సింగ్ ని సినిమా సెట్ నుండి గెంటేశారని వెల్లడించాడు. అయితే ఇది ఇప్పటి విషయం కాదు.. వివరాల్లోకి వెళితే.. ఓ టీవీ షోలో పాల్గొన్న రణవీర్ ''అక్షయ్ కుమార్, రవీనా టాండన్ నటించిన ఓ సినిమా షూటింగ్ చూడడానికి నేను వెళ్లాను. అప్పుడు నన్ను ఆ సెట్ నుండి గెంటేశారు'' అని రణవీర్ చెప్పాడు.
బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న నటుడు రణవీర్ సింగ్ ని సినిమా సెట్ నుండి గెంటేశారని వెల్లడించాడు. అయితే ఇది ఇప్పటి విషయం కాదు.. వివరాల్లోకి వెళితే.. ఓ టీవీ షోలో పాల్గొన్న రణవీర్ ''అక్షయ్ కుమార్, రవీనా టాండన్ నటించిన ఓ సినిమా షూటింగ్ చూడడానికి నేను వెళ్లాను. అప్పుడు నన్ను ఆ సెట్ నుండి గెంటేశారు'' అని రణవీర్ చెప్పాడు.
అయితే ఎందుకు గెంటేశారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో బాలీవుడ్ మీడియా వర్గాలు ఈ విషయాన్ని రవీనా టాండన్ వద్ద ప్రస్తావించారు. దీనికి స్పందించిన ఆమె.. ''రణవీర్ చాలా అల్లరివాడు. అప్పుడు అతడు చిన్న పిల్లాడు. ఇప్పటికీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నందుకు అతడిని అభినందిస్తున్నాను.
అసలు ఆరోజు సెట్ లో ఏం జరిగిందంటే.. అక్షయ్, నాపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఆ పాటలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సన్నివేశాల చిత్రీకరణ సమయంలో పిల్లలు ఉండకూడదనేది నా అభిప్రాయం. అప్పుడు రణవీర్ నన్నే చూస్తూ ఉన్నాడు.
పిల్లలపై చెడు ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో సెట్ లో ఉన్న నిర్మాతకి చెప్పి రణవీర్ ని బయటకి పంపించేశా.. అంతేకానీ నాకు తనపై ఎలాంటి కోపం లేదు'' అని చెప్పారు.
Last Updated 1, Nov 2018, 3:44 PM IST | 0business
|
Hyderabad, First Published 29, Mar 2019, 6:23 PM IST
Highlights
స్టార్ హీరోలు కొంత మంది త్వరలోనే ఎలక్షన్స్ ప్రచారాల్లో బిజీ కానున్నట్లు ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. మెయిన్ గా అల్లు అర్జున్ - రామ్ చరణ్ జనసేన పార్టీ కోసం ప్రచారాలు చేసే అవకాశం ఉందని టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు.
టాలీవుడ్ లో చాలా వరకు నటీనటులు ఎప్పుడు లేని విధంగా ఎలక్షన్స్ లో బిజీగా మారుతున్నారు. అయితే స్టార్ హీరోలు కొంత మంది త్వరలోనే ఎలక్షన్స్ ప్రచారాల్లో బిజీ కానున్నట్లు ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. మెయిన్ గా అల్లు అర్జున్ - రామ్ చరణ్ జనసేన పార్టీ కోసం ప్రచారాలు చేసే అవకాశం ఉందని టాక్ వచ్చింది.
అయితే ఈ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. అసలు ఈ విషయం వేరేవాళ్లు చెబితే తప్ప నేను ప్రత్యేకంగా తెలుసుకోలేదు. వారిని స్పెషల్ గా పాలిటిక్స్ లోకి పిలిచి ఇక్కడి వాతావరణంలో రుద్దాలని అనుకోవడం లేదు. గతంలో కూడా చెప్పాను. ఒక సీజన్ కి వారిని పాలిటిక్స్ కి రానివ్వకూడదు.
ఒకేసారి సినిమాలు పాలిటిక్స్ అంటే కష్టం. ఒకటి రెండు సందర్భాల్లో చరణ్ అన్నట్లు నాకు తెలిసింది. డైరెక్ట్ గా నా ముందు అనలేదు గాని ఒకవేళ అడిగి ఉంటె అప్పుడే వారికి వివరణ ఇచ్చేవాన్ని అంటూ.. వారి జాబ్ వారు చేసుకోవడం బెటర్ అని పవన్ క్లియర్ గా చెప్పేశాడు. దీంతో ఈ ప్రచారాల్లో బన్నీ - చరణ్ పాల్గొనడం అనేది జరగదని అర్ధం చేసుకోవచ్చు.
Last Updated 29, Mar 2019, 8:54 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఈ ఏడాది టీ20ల్లో మన స్పిన్నరే నెం.1
శ్రీలంకతో కటక్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ని ఒంటిచేత్తో స్పిన్నర్ చాహల్ గెలిపించాడు.
TNN | Updated:
Dec 21, 2017, 09:53AM IST
ఈ ఏడాది టీ20ల్లో మన స్పిన్నరే నెం.1
శ్రీలంకతో కటక్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ని ఒంటిచేత్తో స్పిన్నర్ చాహల్ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్.. వరుస ఓవర్లలో ఉపుల్ తరంగ, మాథ్యూస్, గుణరత్నె, తిసార పెరీరాలను పెవిలియన్‌కి పంపాడు. దీంతో 181 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన శ్రీలంక 16 ఓవర్లలో కేవలం 87 పరుగులకే కుప్పకూలిపోయింది.
గెలిపించే ప్రదర్శనతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’‌గా నిలిచిన చాహల్.. టీ20ల్లో మరో అరుదైన రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పటివరకు అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. కటక్‌ ప్రదర్శనతో చాహల్ అతడ్ని అధిగమించాడు. ఈ ఏడాది 10 టీ20 మ్యాచ్‌లాడిన చాహల్ మొత్తం 19 వికెట్లతో నెం.1 స్థానానికి ఎగబాకాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ముగిసే వరకూ చాహలే అగ్రస్థానంలో ఉండనున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
పిచ్ చూసి వ్యూహం మార్చా: భువనేశ్వర్
TNN| Oct 26, 2017, 12.51 PM IST
పుణె వన్డేలో పిచ్ చూసి తాను వ్యూహం మార్చినట్లు భారత్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వెల్లడించాడు. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన ఈ రెండో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ 45 పరుగులిచ్చి.. ఆరంభంలోనే ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (11), కొలిన్ మున్రో (10) వికెట్లతో పాటు మిడిల్ ఓవర్లలో హెన్రీ నికోలస్ (42) వికెట్ పడగొట్టాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 230/9కే పరిమితమైంది.
‘మ్యాచ్ ఆరంభంలో కొత్త బంతితో బౌలింగ్ చేసేటప్పుడు సాధారణంగా నేను స్వింగ్ రాబట్టేందుకు ఎక్కువ ప్రయత్నిస్తుంటాను. అయితే.. పుణె పిచ్ నుంచి నేను ఆశించిన మేర స్వింగ్కి సహకారం లభించలేదు. దీంతో నా వ్యూహాన్ని మార్చుకుని క్రమశిక్షణతో గుడ్ లెంగ్త్ ప్రదేశంలో బంతులు విసిరాను. కివీస్కి బ్యాట్స్మెన్ చిక్కారు. మైదానంలో ఆత్మవిశ్వాసంతో ఉంటే.. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఇక్కడ భారత్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలేమే. ఎందుకంటే.. గతంలో కంటే ఎక్కువగా ఫిటెనెస్పై దృష్టి సారించేలా ప్రస్తుతం ప్రోత్సహిస్తున్నారు. దీంతో నా ప్రదర్శన కూడా మునుపటి కంటే మెరుగైంది’ అని భువనేశ్వర్ వివరించాడు. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. | 2sports
|
స్టార్టప్లకు తగ్గిన ప్రాధాన్యత
- ఈ ఏడాది బడ్జెట్లో తగ్గిన కేటాయింపులు
న్యూఢిల్లీ: దేశంలోని యువతలో ఉన్న నైపుణ్యాన్ని, సృజనాత్మకతను బయటకు తీయడమే గాక నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యో గాలు కల్పించడానికి ఏర్పాటు చేసిన 'స్టార్టప్ ఇండియా' కార్యక్రమానికి ఈ ఏడాది బడ్జెట్లో నిధులు తగ్గాయి. మోడీ సర్కారు ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఈ పథకం ముందు నుంచి అంతంతమాత్రంగానే సాగుతోంది. రెండు రోజుల క్రితం బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనూ ఈ పథకా నికి కేవలం రూ. 25 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది గతేడాది సవరించిన బడ్జెట్ (రూ. 28 కోట్లు) కంటే తక్కువ కావడం గమనార్హం. మేకిన్ ఇండియాలో భాగంగా 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియాకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. కాగా, ఈ పథకం ప్రారంభ దశ నుంచి అవస్థలు పడుతూనే ఉంది. అంకుర సంస్థలు ఏర్పాటు చేయడానికి జౌత్సాహికులు ముందుకు వచ్చినా వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం విఫలమవుతోందనే వాదన ఉంది. అయితే, విదేశాలలో మాదిరిగా స్టార్టప్లు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వమే వీలైన సౌకర్యాలు కల్పిస్తే తప్ప ఈ పథకం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేదని ముంబయికి చెందిన ఓ అంకుర సంస్థ అధినేత అభిప్రాయపడ్డారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మరో రెండేళ్లలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో రెండేళ్లలో ఏకంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
Samayam Telugu | Updated:
Jun 20, 2018, 10:01AM IST
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో రెండేళ్లలో ఏకంగా 5జీ సేవలను అందుబాటులోకి తేనుంది. భారత్తో పాటు అంతర్జాతీయంగా కూడా ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ క్రియశీలకంగా పని చేస్తోందన్నారు. 5జీ టెక్నలాజీ కోసం రోడ్ మ్యాప్ రూపొందించామన్నారు. కాగా 2020 నాటికి ఈ సేవలను అందుబాటులోకి తేవడానికి ఈ టెక్నలాజీ అందించే నోకియా, కొరియంట్, జడ్టిఇ కంపెనీలతో చర్చలు జరుపుతుందని బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ అనీల్ జైన్ తెలిపారు. ఒకే రోజు భారత్, గ్లోబల్ మార్కెట్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిపిందని, పలు ఒప్పందాలు చేసుకుందన్నారు.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్
ది మొబైల్ అసోసియేషన్ (టిఎంఎ) న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మొబైల్ డివైస్ సమ్మిట్ 2018లో జైన్ మాట్లాడుతూ 3జీ , 4జీ అందుకోవడంలో ఆలస్యం అయినా ప్రభుత్వ రంగ సంస్థ 5జీ బస్ను మిస్ కాబోదన్నారు. కొత్తగా ఏర్పడిన టిఎంఎ 5జి సేవల కోసం అవసరమయ్యే టెక్నలాజీ, స్మార్ట్ఫోన్ల ప్రాముఖ్యతపై చర్చించింది.
5జి టెస్ట్ బెడ్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో జపాన్కు చెందిన ఎన్టిటి అడ్వాన్స్ టెక్నలాజీ కార్పొరేషన్ భారత భాగస్వామి అయినా విర్గో కార్పొరేషన్తో బీఎస్ఎన్ఎల్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ ఈకో సిస్టమ్లో ఇది 5జి మార్పు, అభివృద్దికి దోహదం చేయనుందని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆప్ టెలిమాటిక్స్ (సి-డాట్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విపిన్ త్యాగి పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం టెలికాం శాఖ(డీఓటీ) 5జీ గురించి చర్చాపత్రం విడుదల చేసి అన్ని టెలికాం కంపెనీలతో సంప్రదింపులు చేస్తోంది. కాగా 5జి సేవల కోసం 700 ఎంహెచ్జడ్, 3.5 గిగాహెడ్జ్, 24 గిగాహెడ్జ్, 28 గిగాహెడ్జ్ బాండ్ తరంగాలు తక్షణమే అందుబాటులో ఉన్నాయని డీఓటీ సైతం పేర్కొంది. | 1entertainment
|
రూ.300 కోట్లతో 'విరించి' హాస్పిటల్
- 600 పడకలతో హైదరాబాద్లో ఏర్పాటు
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐటీ సొల్యూషన్స్ కంపెనీ విరించి లిమిటెడ్ హైదరాబాద్లో 600 పడకలతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం 100 శాతం సబ్సీడరీగా విరించి హెల్త్కేర్ ప్రయివేటు లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను రూ.300 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని విరించి హాస్పిటల్స్ చైర్మన్ విష్ కొంపల్లి తెలిపారు. మరికొన్ని వారాల్లోనే తొలుత 350 పడకలతో ప్రారంభించినున్నామని, ఆ తర్వాత కొన్ని మాసాలకు 600 పడకలకు విస్తరించనున్నామన్నారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్డియాక్, ఆర్థో, నెఫ్రో, న్యూరో, ఎమర్జెన్సీ క్యాన్సర్, ట్రాన్స్ప్లాంటేషన్ తదితర విభాగాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.
వైద్య రంగంలోని అత్యాధునిక టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నామని తెలిపారు. తమ డయాగ్నోస్టిక్ ల్యాప్ ఎపీజెన్టీిక్స్ను దాటిన మాలిక్యూలర్ డయాగ్నోస్టిక్స్, జెనీటీక్స్ అండ్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ సర్వీసులతో పాటు 15,000 పైగా బయోమెకర్స్ టెస్టుల సామర్థ్యం కలిగి ఉందన్నారు. తమ హాస్పిటల్లో 75 మంది నిష్ణాతులైన డాక్టర్లు ఇందులోనూ 30 మంది బోర్డులో ఉన్నారని విరించి హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ మ్యాన తెలిపారు. మొత్తంగా 1000 మంది సిబ్బందితో సేవలు అందిస్తామన్నారు. తాము కెనరా బ్యాంకు నుంచి రూ.70 కోట్లు రుణంగా తీసుకున్నామన్నారు. 2015-16లో విరించి లిమిటెడ్ ఏకీకృత ఆదాయం రూ.218.34 కోట్లుగా నమోదయ్యింది. బుధవారం బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్ 1.50 పైసలు పెరిగి రూ.55.50 వద్ద ముగిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఏడేళ్లుగా ట్రై చేస్తున్నా.. రష్మిని ఇరకాటంలో పెట్టేసిన సుధీర్
యాంకర్ రష్మి, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ప్రేమ వ్యవహారం మరోసారి చర్చకొచ్చింది. అది కూడా ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ షోలో. ఈ షో సాక్షిగా తన మనసులో మాటను సుధీర్ బయటపెట్టేశాడు.
Samayam Telugu | Updated:
Nov 13, 2019, 10:53PM IST
రష్మి, సుడిగాలి సుధీర్
‘జబర్దస్త్’ కమెడియన్ సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే ఎవ్వరి మనసులోనైనా వెంటనే మెదిలే పేరు రష్మి. అంతలా, రష్మి-సుధీర్ జంట తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది. వాస్తవానికి వీళ్లిద్దరి మధ్య ఏమీ లేకపోయినా అప్పుడప్పుడు వాళ్లు ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్లు, లవర్స్ అన్నట్టుగా పేల్చే డైలాగులు ఇప్పటికీ అనుమానాలకు తావిస్తాయి. ‘జబర్దస్త్’ షోలో అయినా.. ఇంకే ఇతర షోలోనైనా రష్మి, సుధీర్ కనిపించారంటే ప్రేక్షకుల్లో ఒకరకమైన ఫీలింగ్ కలగడం ఖాయం. వాళ్లిద్దరూ కూడా దాన్ని అలానే మెయింటెయిన్ చేస్తున్నారు.
Also Read: లెస్బియన్గా రష్మి.. బోల్డ్ పాత్రలో రెచ్చిపోనున్న హాట్ యాంకర్!
తాజాగా మరోసారి వీళ్లిద్దరి మధ్య లవర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అది కూడా ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ స్టేజ్ మీదే. ఈనెల 15న ప్రసారమయ్యే ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ఎపిసోడ్ ప్రోమోను నిర్మాణ సంస్థ మల్లెమాల టీవీ యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ స్కిట్లో తన ప్రేమ గురించి చెప్పాడు. సుధీర్, రాం ప్రసాద్ రైలులో ప్రయాణం చేస్తుంటారు. ఇద్దరి మధ్య మాటామాటా కలుస్తుంది. ఈ క్రమంలో ‘లవ్వు గివ్వు అలాంటివేమైనా ఉన్నాయా’ అని సుధీర్ని రాం ప్రసాద్ అడిగాడు. వెంటనే సుధీర్ నవ్వుతూ యాంకర్ సీట్లో ఉన్న రష్మిని చూశాడు. రష్మి కూడా సిగ్గుపడుతూ నవ్వింది.
Also Read: పవన్లో నాకు ‘జార్జిరెడ్డి’ కనిపిస్తాడు.. అదే ఆవేశం, ఐడియాలజీ: నాగబాబు
‘‘ఉన్నాయిలెండి.. ఏడు సంవత్సరాల నుంచి ఒకమ్మాయిని ట్రై చేస్తున్నాను’’ అని సుధీర్ సమాధానం ఇచ్చాడు. ఈ సమయంలో వచ్చే ఆర్.ఆర్, రష్మి ఎక్స్ప్రెషన్స్ హైలైట్. ఇక రాం ప్రసాద్ ఆటో పంచ్లు మరో హైలైట్. ‘‘ఏడు సంవత్సరాల నుంచి వర్కౌట్ కాలేదంటే చాలా బ్యాడ్ మీరు’’ అని రాం ప్రసాద్ అన్నాడు. ‘‘అదేం కాదండి ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది.. మనమే కాదన్నాం’’ అని సుధీర్ సమాధానం ఇవ్వగానే రష్మి ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది. ‘‘ఏంటి అమ్మాయి యస్ చెప్పిందా.. ఆ అమ్మాయి ఎంత వరస్ట్గా ఉంటదో’’ అని పంచ్ పేల్చాడు రాం ప్రసాద్. మొత్తం మీద సుధీర్, రష్మి లవ్ మ్యాటర్ మరోసారి జబర్దస్త్ స్టేజ్పై బాగా పండింది.
Extra Jabardasth Latest Promo.Telecast on 15th November 2019 in ETV Telugu at 9:30 PM #Rashmi #SudigaliSudheer… https://t.co/tdg1NEi1Jk
— Mallemalatv (@mallemalatv) 1573657356000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కోహ్లి ఆ కెప్టెన్ ను గుర్తుకు తెస్తున్నాడు: రవిశాస్త్రి
సఫారీ గడ్డ మీద సత్తా చాటిన విరాట్ కోహ్లి.. పాకిస్థాన్ కెప్టెన్ ను మరిపిస్తున్నాడని భారత కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. టీమిండియా సారథిపై అతడు ప్రశంసలు గుప్పించాడు.
PTI | Updated:
Mar 5, 2018, 07:48PM IST
కోచ్ రవిశాస్త్రితో విరాట్ కోహ్లి
సఫారీ గడ్డపై బ్యాటింగ్ లో రాణించడంతోపాటు.. కెప్టెన్ గానూ జట్టును విజయపథంలో నిలిపిన విరాట్ కోహ్లిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి మరోసారి ప్రశంసలు గుప్పించాడు. పాకిస్థాన్ కు ప్రపంచ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ తో కోహ్లిని పోల్చాడు. ‘విరాట్ ఇంకా కెరీర్ ఆరంభంలోనే ఉన్నాడు. అతడింకా యువకుడే. కానీ ఇప్పటికే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. అతడు ఇమ్రాన్ ను గుర్తుకు తెస్తున్నాడు. పాకిస్థాన్ దిగ్గజ కెప్టెన్ లోని లక్షణాలు కోహ్లి ఉన్నాయ’ని రవిశాస్త్రి తెలిపాడు.
వన్డేల్లో నంబర్ 1 ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో 500కిపైగా పరుగులు చేశాడు. సఫారీ గడ్డ మీద ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ నెలకొల్పాడు. ఆరు ఇన్నింగ్స్ ల్లో కోహ్లి వరుసగా.. 112, 46*, 160*, 75, 36, 129* చొప్పున పరుగులు రాబట్టాడు.
Indian captain Virat Kohli with coach Ravi Shastri during a training session at Eden Garden in Kolkata on Monday ahead of the 1st Test Match against Sri Lanka.Photo by Swapan Mahapatra
ఇమ్రాన్ ఖాన్ 1992లో పాకిస్థాన్ కు వరల్డ్ కప్ అందించాడు. ఆ దేశ అత్యుత్తమ క్రికెటర్లలో అతడొకడు. ఇమ్రాన్ తరహాలోనే విరాట్ కూడా ఎప్పుడూ ఆధిక్యం కనబర్చాలనే తపనతోనే ఆడతాడని రవిశాస్త్రి చెప్పాడు.
రెండు నెలల్లోనే ఒకే టూర్లో అతడు 870కిపైగా పరుగులు చేశాడు. ఇది నిజంగా అద్భుతమని కోహ్లిపై కోచ్ ప్రశంసలు గుప్పించాడు. విరాట్ ఆవేశాన్ని తగ్గించుకోవాలని మాజీలు సలహా ఇస్తున్న విషయాన్ని శాస్త్రి దృష్టికి తీసుకురాగా.. వాళ్లు తమ పనేదో తాము చూసుకోవాలని ఘాటుగా బదులిచ్చాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
First Published 15, Oct 2017, 12:33 PM IST
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
Recent Stories | 0business
|
New Delhi, First Published 12, Aug 2018, 11:00 AM IST
Highlights
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల మరోసారి తన షేర్లను విక్రయించారు. 36 మిలియన్ల డాలర్ల విలువైన 3,28,000 షేర్లను విక్రయించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
వాషింగ్టన్: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల మరోసారి తన షేర్లను విక్రయించారు. 36 మిలియన్ల డాలర్ల విలువైన 3,28,000 షేర్లను విక్రయించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో షేర్ విలువ 109.08 డాలర్ల నుంచి 109.68 డాలర్లు వరకు అమ్మినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో మైక్రోసాఫ్ట్ తెలిపింది. తన వ్యక్తిగత ఆర్థిక కారణాలతోపాటు విస్తరణ దిశగా సత్య నాదెళ్ల తన షేర్లు అమ్ముకున్నారని సంస్థ ప్రతినిధి చెప్పారు.
సంస్థ విజయవంతానికి కట్టుబడి ఉన్న సత్యనాదెళ్ల
అయితే మైక్రోసాఫ్ట్ డైరెక్టర్లు నిర్దేశించిన అవసరాలకు అనుగుణంగా సంస్థ విజయవంతంగా ముందుకు సాగడానికి సత్యనాదెళ్ల కట్టుబడి ఉంటారని సంస్థ తెలిపింది. సత్య నాదెళ్ల విక్రయించిన షేర్లు 30 శాతం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికి 2.2 మిలియన్ల విభిన్న రకాల షేర్లను సత్యనాదెళ్ల కలిగి ఉన్నారు. కాగా, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే సత్యనాదెళ్ల తన షేర్లను విక్రయిస్తున్నారని బ్లూమ్ బర్గ్ నివేదించింది.
మూడు రెట్లు పెరిగిన మైక్రోసాఫ్ట్ షేర్లు
మైక్రోసాఫ్ట్ సీఈవోగా స్టీవ్ బాల్మెర్ నుంచి 2014 ఫిబ్రవరిలో బాధ్యతలు సత్య నాదెళ్ల విక్రయించిన తర్వాత సంస్థ షేర్ల విలువ మూడు రెట్లు పెరిగాయి. కాగా, సత్య నాదెళ్ల నాలుగేళ్లలో రెండోసారి అత్యధికంగా షేర్లు విక్రయించారు. ఆయన తన వాటాలోని షేర్లను విక్రయించడం ఇది రెండోసారి. రెండు సంవత్సరాల క్రితం 2016లో నాదెళ్ల 8.3 మిలియన్ డాలర్ల విలువైన 1,43,000 షేర్లను విక్రయించిన విషయం తెలిసిందే. స్టాక్ సేల్ నివేదిక ప్రకారం ఆయన దగ్గర ఇంకా 7,78,596 షేర్లు ఉన్నాయి. గతేడాది ఆయన 1.45మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు.
ఇలా మైక్రోసాఫ్ట్ ఆల్ టైమ్ రికార్డులు
2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా సంస్థ షేర్ ఉన్నత శిఖరాలకు దూసుకెళ్లడంతోపాటు ఆల్టైమ్ రికార్డులు నెలకొల్పింది. 835 బిలియన్ల డాలర్ల విలువ కలిగిన మైక్రోసాఫ్ట్.. మున్ముందు లక్ష కోట్ల డాలర్ల దిశగా దూసుకు వెళుతున్నది. తాజా పరిణామాలపై తక్షణం స్పందించడానికి మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి అందుబాటులోకి రాలేదు.
శ్రావణ ‘పసిడి’ ధగధగలు
ఇటువైపు శ్రావణ మాసం మొదలవుతుండగానే మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర శనివారం పెరిగింది. స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో పసిడి ధర పుంజుకుంది. రూ.180 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,700కి చేరింది. శ్రావణమాసం దగ్గరపడుతుండటంతో పాటు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ రావడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
పసిడితోపాటే వెండి కూడా
బంగారం బాటలోనే వెండి పయనించింది. రూ.105 పెరగడంతో కిలో వెండి రూ.39వేల మార్క్ను చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి ఆశించిన మేర డిమాండ్ రావడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు అంటున్నారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా బంగారం ధర 0.07శాతం పడిపోయింది. దీంతో ఔన్సు 1,211.20 డాలర్లు పలికింది. దేశ రాజధానిలో 99.9శాతం 10గ్రాముల పసిడి రూ.30,700 పలకగా.. 99.5శాతం పసిడి రూ.30,550గా ఉంది. | 1entertainment
|
virender sehwag backs ross taylor for aadhaar card, here is uidai reply
టేలర్కు ‘ఆధార్’ ఇవ్వాలంటూ వీరూ సిఫారసు!
హిందీలో అదరగొడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్కు ఆధార్ కార్డ్ ఇవ్వాంటూ వీరేంద్ర సెహ్వాగ్ సిఫారసు చేశాడు.
TNN | Updated:
Nov 6, 2017, 03:30PM IST
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్, వీరేంద్ర సెహ్వాగ్ మధ్య గతంలో ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకోగా.. ఈసారి ఆధార్ కార్డ్‌లను జారీ చేసే యూఐడీఏఐ కూడా ఈ వ్యవహరంలోకి ఎంట్రీ ఇచ్చింది. టేలర్‌ను టైలర్ (దర్జీ)గా పేర్కొంటూ ఇటీవల సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్లు పెట్టగా.. కివీస్ ప్లేయర్ కూడా హిందీలో అద్భుతంగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. తన బదులు ఎవరు ట్వీట్లు చేస్తున్నారో లేదంటే తనే హిందీ నేర్చుకున్నాడ తెలియదు కానీ అతడి హిందీ భాషా ప్రావీణ్యానికి అందరూ ఫిదా అవుతున్నారు.
రాజ్‌కోట్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ అయిపోన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో టేలర్ సెహ్వాగ్‌ను ఉద్దేశించి మరో పోస్ట్ పెట్టాడు. వీరూ.. రాజ్‌కోట్‌లో మ్యాచ్ తర్వాత దుకాణం బంద్ అయ్యింది. ఈసారి త్రివేండ్రంలో.. నువ్వు తొందరగా రా.. అంటూ మూసేసిన టైలరింగ్ షాప్ ముందు కూర్చొని ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. | 2sports
|
ICC Champions Trophy 2017
దక్షిణాఫ్రికాపై ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
TNN | Updated:
Jun 11, 2017, 02:43PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్నఅమీతుమీ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సెమీస్‌ చేరాలంటే ఇరు జట్లకి ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉండటంతో పోరు ఆసక్తికరంగా జరగనుంది. శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ జోరు అందుకోవాలని ఆశిస్తుండగా.. పాక్ చేతిలో పరాజయంపాలైన దక్షిణాఫ్రికా టైటిల్ రేసులో నిలవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఉమేశ్ యాదవ్ స్థానంలో అశ్విన్‌ని భారత్ జట్టులోకి తీసుకుంది.
భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ధోని, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా | 2sports
|
నా పనితీరు ఫలితాలు అప్పుడు తెలుస్తాయి!
- ప్రశంసలు, విమర్శలను పట్టించుకోకుండా పనిచేశా..
- వ్యవస్థకు విలువ జోడించేలా కృషి
- అమెరికా వెళ్లి ఉపాధ్యాయ వృత్తిలో చేరుతా
- శక్తి మేరకు సేవ చేస్తా
ఆర్బీఐ గవర్నర్ హోదా తనకు అద్భుతమైన అనుభూతిని పంచిందని కేంద్ర బ్యాంకు గవర్నర్ పదవి నుంచి త్వరలో దిగిపోనున్న రఘురామ్ రాజన్ అన్నారు. తాను పదవిలో ఉన్న ప్రతీ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించినట్లుగా ఆయన తెలిపారు. తగ్గింపునకు వీలున్నప్పటికీ అధిక వడ్డీరేట్లను కొనసాగించి ఆర్థికవ వ్యవస్థకు రాజన్ నష్టం చేశారన్న విమర్శల పట్ల ఆయన స్పందించారు. తాను పదవిలో ఉండగా తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు బాధించినప్పటికీ వాటి రానున్న అయిదారేండ్ల కాంలో వీటి ఫలితాలను దేశవాసులు అనుభవిస్తారని ఆయన అన్నారు. ఏదైన పని చేసినప్పుడు ప్రశంసలతో పాటు విమర్శలనేవి సహజమన్న రాజన్ అన్నారు. తన పనితీరును ప్రశంసిస్తూ విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా చాలా మంది సందేశాలను పంపేవారని ఆయన తెలిపారు. ఇవి తనకు నూతనోత్తేజాన్నిచ్చేవని అన్నారు. అయితే తాను ప్రశంసలు, విమర్శలను పట్టించుకోకుండా దేశానికి ఏది మేలు చేస్తుందో ఆదే విధానాన్ని అవలంభిస్తూ వచ్చానని అన్నారు. తనుకు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉందని.. వారి ఆకాంక్షలను నెరవేర్చేలా పని చేశానన్నారు. ఆర్థిక వ్యవస్థకు విలువను జోడించే యత్నం చేశానని వీటి ఫలాలు వెనువెంటనే కనిపించకపోయినప్పటికీ రానున్న రోజుల్లో దేశ వాసులు వాటి విలువను గమనిస్తారని ఆయన వివరించారు. ఆర్బీఐ 23వ గవర్నరుగా 2013 సెప్టెంబరు 4న బాధ్యతలు చేపట్టిన రాజన్ పదవీ కాలం వచ్చే నెల 4తో ముగియనుంది. ఆర్బీఐ గవర్నర్గా పదవీ కాలం ముగిశాక ఏం చేయాలన్న విషయమై తాను ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని అన్నారు. మునపటి మాదిరిగానే అమెరికా వెళ్లి విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిని చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయా సంస్థల ద్వారా అవసరమైన మేరకు దేశానికి తనవంతు సేవ చేస్తానని అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
on:
692 days 7 hours 53 mins ago
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న యువజనోత్సవాలు గురువారం ముగిశాయి. విశ్వవిద్యాలయ పరిధిలోని 38 అనుబంధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు... Readmore
on:
694 days 8 hours 37 mins ago
ఆంధ్రప్రదేశ్ 8వ ప్రాంతీయ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఓవరాల్ చాంపియన్షిప్ను కృష్ణాజిల్లా ముసునూరు జట్టు కైవసం చేసు కుంది. వ్యక్తిగత విభాగంలో చాంపియన్షిప్ను గుంటూరు జిల్లా కావూరి ఎపిఆర్ఎస్కు చెంది న పి.వ... Readmore
on:
729 days 16 hours 21 mins ago
కర్నూలు : ఈ నెల 25న స్థానిక స్పోర్ట్స్ అథా రిటీ స్టేడియంలో జిల్లాస్థాయి ఎస్జిఎప్ (అండర్ -19) అథ్లెటిక్స్, తైక్వాండో క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లాస్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్ చలపతిరావు ఒక ప్రకటన... Readmore
on:
731 days 7 hours 55 mins ago
ముంబయి : దేశ వ్యాప్తంగా కబడ్డీ కూతతో రెండున్నర నెలలు పాటు ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ (పికెఎల్) ఐదో సీజన్ ముగింపు దశ ఫ్లే ఆఫ్స్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. లీగ్ దశ ముగిసిపోవడంతో ఫ్లే ఆఫ్స్లో ఆరు జట్లు టైటిల్ ... Readmore | 2sports
|
- చిన్న నోట్ల ప్రింటింగ్ పెంచొచ్చు
- ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టు
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెద్ద నోటు రూ.2,000ను తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టులో పేర్కొంది. లేదా వీటి ముద్రణను నిలిపివేయవచ్చని తెలిపింది. ప్రస్తుత డిసెంబర్ 8 నాటికి రూ.15,78,700 కోట్ల విలువ చేసే నోట్లను ముద్రించారు. ఇందులో రూ.2,46,300 కోట్ల నగదును మార్కెట్లోకి పంపించలేదని బుధవారం ఎస్బీఐ రీసెర్చ్ ఈకోఫ్లాష్ రిపోర్టులో పేర్కొంది. ఆర్బీఐ, ప్రభుత్వ డాటా ఆధారంగా రూపొందించిన ఆ రిపోర్టు వివరాలు..
పెద్ద నోటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. వీటి స్థానంలో ఇంతకంటే తక్కువ విలువ చేసే నోట్లను తీసుకురావొచ్చు. లోకసభకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన రిపోర్టు ప్రకారం డిసెంబర్ 8 నాటికి రూ.500 విలువ చేసే 16,957 మిలియన్ల నోట్లను ముద్రించారు. కాగా రూ.2000 విలువ చేసే 3,654 మిలియన్ల నోట్లను ప్రింట్ చేశారు. ఈ మొత్తం నోట్ల విలువ రూ.15.78 లక్షల కోట్లుగా ఉందని ఎస్బీఐ రీసెర్చ్ గుర్తు చేసింది. కాగా చిన్న నోట్ల చలామణి విలువ రూ.3.50 లక్షల కోట్లుగా ఉంది. డిసెంబరు 8 వరకు రూ.13,324 బిలియన్ల విలువ కలిగిన పెద్ద నోట్లు మాత్రమే చలామణిలోకి వచ్చాయి. అంటే మిగతా రూ.2,463 బిలియన్లు ఆర్బీఐ దగ్గర అలాగే ఉన్నాయని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తన రిపోర్టులో పేర్కొన్నారు. ఈ స్థానంలో రూ.50, రూ.200 నోట్లను ముద్రించే అవకాశం ఉందన్నారు. దీంతో నగదు ప్రవాహాన్ని సాధారణ స్థితికి చేర్చే అవకాశం ఉందన్నారు.
ఆర్బీఐ డాటా ప్రకారం 2017 మార్చి నాటికి రూ.3,50,100 కోట్ల విలువ చేసే చిన్న కరెన్సీ సరఫరాలో ఉంది. కాగా రూ.13.32 లక్షల కోట్ల విలువ చేసే పెద్ద నోట్లు చెలామణీలో ఉన్నాయి. రూ.2,000 నోట్ల వల్ల లావాదేవీలు ఇబ్బందికరంగా మారాయి.
ఈ క్రమంలోనే ఆర్బీఐ వీటిని వెనక్కి తీసుకోవడం గాని లేదా ప్రింటింగ్ను రద్దు చేయడం కాని చేయొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ విశ్లేషించింది. విలువ పరంగా చూస్తే మొత్తం కరెన్సీలో చిన్న కరెన్సీ నోట్ల విలువ 35 శాతంగా ఉంది. గతేడాది నవంబర్ 8న మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను అనుహ్యాంగా రద్దు చేసింది.
మొత్తం కరెన్సీ సర్య్కూలేషన్లో వీటి విలువ 86-87 శాతం వరకూ ఉంటుంది. దీంతో దేశ ఆర్ధిక వ్యవస్థలో తీవ్ర నగదు కొరత ఏర్పడింది. నగదును మార్చుకోవడానికి ప్రజలు బారులు తీరారు. వీటి స్థానంలో ఆర్బీఐ కొత్త రూ.500, రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టింది. కాగా కొద్ది నెలల క్రితం ఆర్బీఐ తొలిసారి రూ.200 నోటును కూడా అందుబాటులోకి తెచ్చింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Jan 03,2019
హెటిరో చేతికి స్పెయిన్ ఫార్మా కంపెనీ
హైదరాబాద్: ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ హెటిరో గ్రూపునకు చెందిన యూరోపియన్ సబ్సీడరీ అమరొక్స్ లిమిటెబ్ స్పెయిన్ కేంద్రంగా పని చేస్తున్న టర్బిస్ ఫార్మాను కొనుగోలు చేసింది. అయితే ఎంత మొత్తానికి ఈ కొనుగోలు జరిపిందన్న వివరాలను వెల్లడించలేదు. టర్బిస్ ఫార్మా స్పెయిన్లో పలు ఉత్పత్తులతో పాటు రిటైల్ వ్యాపారంలో మంచి మార్కెటింగ్ నెట్వర్క్ కలిగి ఉన్నట్లు హెటిరో పేర్కొంది. ఈ స్వాధీనం తమ సంస్థ మరింత పటిష్టానికి దోహదం చేయనుందని తెలిపింది. అమరాక్స్ వేదిక ద్వారా యూరోపియన్ యూనియన్లో మరింత మంది వినియోగదారులను చేరడంతో పాటు తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి దోహదం చేయనుందని హెటిరో లాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవి నరస రెడ్డి పేర్కొన్నారు. తాజా కొనుగోలుతో సంస్థ ఐరోపా మార్కెట్లో అనుబంధ బ్రాండ్తో పాగా వేయడంతో పాటు మార్కెట్ను మరింతగా విస్తరించేందుకు వీలుపడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
IPL 2017
ఐపిఎల్లో నేటి మ్యాచ్లు
ఐపిఎల్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి.. మొదటి మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్తో గుజరాత్ లయన్స్ పోటీ పడనుంది.. అలాగే కోల్కతా నైట్రైడర్స్తో ముంబై ఇండియన్స జట్టు తలపడనుంది. మొదటి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి. | 2sports
|
Hyderabad, First Published 4, Mar 2019, 12:55 PM IST
Highlights
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రముఖ నటుడు హ్రితిక్ రోషన్, దర్శకుడు కరణ్ జోహార్ లపై సంచలన కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రముఖ నటుడు హ్రితిక్ రోషన్, దర్శకుడు కరణ్ జోహార్ లపై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కరణ్ జోహార్ బంధుప్రీతిని ప్రోత్సహిస్తారని, తన గురించి హ్రితిక్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు.
కరణ్ జోహార్ ప్రకటించిన ఉత్తమ నటి లిస్ట్ లో తన పేరు లేదని, మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన వ్యక్తి అతడికి కనిపించలేదని కంగనా మండిపడింది. కరణ్ లాంటి వారు కొందరు నటుల సామర్ధ్యాలను జనాల మనసులో ప్రశ్నార్ధంకంగా మార్చాలని ప్రయత్నిస్తుంటారని అంది.
ఇలాంటి చేయడం వలన తాను మరింత బలంగా నిలదొక్కుకుంటానని తెలిపింది. ఇక హ్రితిక్ రోషన్ గురించి మాట్లాడుతూ.. అతడికంత ప్రాధాన్యత ఇవ్వదలచుకోవడం లేదని చెప్పింది. 1970లలో జనాలు బెల్ బాటమ్ ప్యాంట్లను ఇష్టపడేవారు కానీ ఇప్పుడు అది తలచుకుంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తించామా అనిపిస్తుంది.. హ్రితిక్ రోషన్ అంశం కూడా అంతే అంటూ చెప్పింది.
రెండు సినిమాల్లో దాదాపు ఐదేళ్ల పాటు కలిసి పని చేసినట్లు అటువంటి నేనెవరో తెలియదని హ్రితిక్ చెప్పడం విచారకరమని అన్నారు. ఒకవేళ మీరు కరణ్, హ్రితిక్ ల స్థానంలో ఉంటే ఎలా స్పందిస్తారని ప్రశ్నిస్తే.. అలాంటి సందర్భం తనకు ఎదురుకాదని, నేను ఉన్న చోట వారు ఉండరని నవ్వుతూ బదులిచ్చింది.
Last Updated 4, Mar 2019, 12:57 PM IST | 0business
|
మరోసారి బ్యాంకుల ఏకీకరణ!
- అవకాశమున్న అన్ని బ్యాంకుల విలీనానికి స్కెచ్
- ఏడాది చివరి నాటికి మరో పెద్ద బ్యాంకు ఏర్పాటు !
- పచ్చజెండా ఊపేందుకు సిద్ధమవుతున్న సర్కారు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణ విషయంలో రానున్న రోజుల్లో సర్కారు మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అనుబంధ బ్యాంకులను 'భారతీయ స్టేట్ బ్యాంకు'లో (ఎస్బీఐలో) విలీనం చేసి ఎస్బీఐని ప్రపంచ స్థాయి బ్యాంకుగా నిలబెట్టే విషయంలో విజయం సాధించిన సర్కారు అదే జోష్ను కొనసాగించేలా ముందుకు సాగనుంది. దేశంలోని బ్యాంకులన్నింటిని సమీప దిగ్గజ బ్యాంకుల్లో ఏకీకరణ చేసి.. కేవలం 4-5 ప్రపంచ స్థాయి బ్యాంకులు మాత్రమే అందుబాటులోకి తేవాలన్నది సర్కారు ఆలోచన. ఇందులో భాగంగానే ఈ ఏడాది ముగింపు నాటికి ఇంకొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం జరిపి మరో దిగ్గజ బ్యాంకు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కూడా సర్కారు పచ్చజెండా ఉపనున్నట్టుగా సమాచారం. ఆయా బ్యాంకుల నిరర్థక ఆస్తులు కొంత మేర దిగివస్తే ఈ ఏడాది ముగింపు నాటికి బ్యాంకింగ్ రంగంలో మరో భారీ విలీనం చోటు చేసుకోనున్నట్టుగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డిసెంబరు ముగింపు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఒత్తిడిలోని ఆస్తుల విలువ రూ.లక్ష కోట్ల మేర పెరిగి దాదాపు రూ.6.06 కోట్లకు చేరువయ్యాయి. ఇందులో అత్యధికంగా విద్యుత్తు, ఉక్కు, రహదారి నిర్మాణం, టెక్స్టైల్స్ రంగాల్లోనే ఎన్పీఏలు అధికంగా నమోదు అయ్యాయి. బ్యాంకుల ఏకీకరణకు గాను ఉద్యోగులు, వాటాదారులు, అధికారులు తదితరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని సదరు అధికారి తెలిపారు. అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా ఏకీకరణ చేపట్టాల్సి ఉంటుందని వివరించారు. మరీ బలహీనంగా ఉన్న బ్యాంకులను మంచి బ్యాంకులతో విలీనం చేయడం సబబు కాదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. బ్యాంకుల ఏకీకరణకు గాను ప్రాంతీయ సమానత్వం, భౌగోళిక విస్తృతి, ఆర్థిక భారం, ఎలాంటి ఆటంకం లేకుండా బ్యాంకు ఉద్యోగుల బదలాయింపు లాంటి ప్రత్యేక అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుందని అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకుల్లో ఇప్పుడిప్పుడే లాభాల్లోకి మరలుతున్న దక్షిణాదికి చెందిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ను విలీనం చేయవచ్చని.. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంకులో దేనా బ్యాంక్ విలీనం చేపట్టొచ్చని ఆ అధికారి వెల్లడించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
allu arjun proves his stamina with naa peru surya
వామ్మో.. అల్లు అర్జున్ సినిమా అన్ని కోట్లకా..!
ఒకవైపు భారీ సినిమాలు బోల్తా కొడుతున్నా.. స్టార్ హీరోల సినిమాలకు స్టన్నింగ్ నంబర్లు వినిపించడం అయితే ఆగడం లేదు.
TNN | Updated:
Jan 18, 2018, 10:48AM IST
ఒకవైపు భారీ సినిమాలు బోల్తా కొడుతున్నా.. స్టార్ హీరోల సినిమాలకు స్టన్నింగ్ నంబర్లు వినిపించడం అయితే ఆగడం లేదు. సంక్రాంతి సినిమాల సందడి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తదుపరి సినిమాల విశేషాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తదుపరి సినిమా ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ శాటిలైట్ రైట్స్ గురించి సంచలన నంబర్లే వినిపిస్తున్నాయి. ఈ సినిమాను రికార్డు స్థాయి ధరకు అమ్మారని సమాచారం.
అదెంతా.. అంటే, పాతిక కోట్ల రూపాయలు అనే మాట వినిపిస్తోంది. ఔనట.. ఈ సినిమాను టీవీలో ప్రసారం చేసుకోవడానికి ఈ రేటుకు రైట్స్ అమ్మారని సమాచారం. కేవలం తెలుగు వరకే కాదు.. రీజినల్ లాంగ్వేజెస్ పరంగా తీసుకుంటే.. ఇది అత్యంత భారీ మొత్తమే అని చెప్పాలి. కేవలం టీవీ ప్రసార హక్కులతోనే ఇంత రాబట్టుకోవడం అంటే అది అల్లు అర్జున్ స్టామినాకు నిదర్శనం అని చెప్పాలి. | 0business
|
Hyderabad, First Published 3, Jul 2019, 3:31 PM IST
Highlights
రెండేళ్ల క్రితం విడుదలైన సంచలన చిత్రం అర్జున్ రెడ్డితో వెండితెరకు పరిచయమైంది. అర్జున్ రెడ్డి చిత్రం సాధించింది. వాస్తవానికి అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ కష్టం ఎంతుందో షాలిని పాండే కష్టం కూడా అంతే ఉంది.
రెండేళ్ల క్రితం విడుదలైన సంచలన చిత్రం అర్జున్ రెడ్డితో వెండితెరకు పరిచయమైంది. అర్జున్ రెడ్డి చిత్రం సాధించింది. వాస్తవానికి అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ కష్టం ఎంతుందో షాలిని పాండే కష్టం కూడా అంతే ఉంది. డెబ్యూ హీరోయిన్ గా అలాంటి బోల్డ్ రోల్ లో నటించి మెప్పించడం అంత సులువు కాదు.
ముద్దు సన్నివేశాల్లో కూడా షాలిని ఎలాంటి తడబాటు లేకుండా ధైర్యంగా నటించింది. కానీ అర్జున్ రెడ్డి క్రెడిట్ మాత్రం విజయ్ దేవరకొండ అకౌంట్ లో పడిపోయింది. అర్జున్ రెడ్డి సక్సెస్ ని కూడా షాలిని పాండే ఉపయోగించుకోలేకపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండే కొన్ని చిత్రాల్లో నటించినా అవి అంతగా సక్సెస్ కాలేదు.
దర్శకుడు సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ గా తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రం షాహిద్ కపూర్ కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో షాలిని పాండే పాత్రలో కియారా అద్వానీ నటించింది. కబీర్ సింగ్ చిత్రం ద్వారా షాహిద్ తో పాటు కియారా కూడా ప్రశంసలు దక్కించుకుంది. నార్త్ యువతంతా ప్రస్తుతం కియారా గురించి చర్చించుకుంటున్నారు.
కబీర్ సింగ్ చిత్ర యూనిట్ తో కియారా విరివిగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ చిత్రంపై వస్తున్న విమర్శలని తిప్పికొడుతూ తనని తాను బాగా ప్రమోట్ చేసుకుంది. తెలుగు వర్షన్ లో కష్టమంతా షాలినిదే అయినా కియారా తరహాలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఆమె ఉపయోగించుకోలేకపోయింది. కబీర్ సింగ్ చిత్రంపై కూడా షాలిని ఇంతవరకు స్పందించలేదు.
Last Updated 3, Jul 2019, 3:31 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ind vs Eng Women T20: తొలి టీ20లో పేలవంగా ఓడిన స్మృతి సేన..!
లక్ష్య ఛేదనలో భారత్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. ఫామ్లో ఉన్న స్మృతి మంధాన (2: 8 బంతుల్లో) ఒత్తిడికి గురవగా.. మరో ఓపెనర్ హర్లీన్ (8: 10 బంతుల్లో) నిరాశపరిచింది.
Samayam Telugu | Updated:
Mar 4, 2019, 02:59PM IST
Ind vs Eng Women T20: తొలి టీ20లో పేలవంగా ఓడిన స్మృతి సేన..!
హైలైట్స్
ఇంగ్లాండ్పై ఇటీవల వన్డే సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు
టీ20 సిరీస్ను మాత్రం ఓటమితో ఆరంభించిన స్మృతి మంధాన సేన
గాయంతో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ దూరం
పగ్గాలు అందుకున్న తొలి మ్యాచ్లోనే బ్యాటర్గా, కెప్టెన్గానూ విఫలమైన స్మృతి
ఇంగ్లాండ్పై వన్డే సిరీస్ను 2-1తో గెలిచిన భారత మహిళల జట్టు.. టీ20 సిరీస్ను మాత్రం పేలవ ఓటమితో ఆరంభించింది. గౌహతి వేదికగా ఈరోజు ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్లో విఫలమైన భారత్ జట్టు 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గాయం కారణంగా ఈ సిరీస్కి దూరమవగా.. స్మృతి మంధాన నాయకత్వంలో బరిలోకి దిగిన భారత్ జట్టు తొలి మ్యాచ్లోనే పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. మూడు టీ20ల సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 గురువారం జరగనుంది. | 2sports
|
Hyderabad, First Published 8, Sep 2018, 11:55 PM IST
Highlights
బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షోపై రోజురోజుకి ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకుంది. ఇక శనివారం ఎపిసోడ్ తో 91 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.
బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షోపై రోజురోజుకి ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకుంది.
ఇక శనివారం ఎపిసోడ్ తో 91 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ షో హైలైట్స్ విషయానికొస్తే.. తనీష్ పుట్టినరోజు కానుకగా అతడికి గ్రీటింగ్ కార్డ్స్ పంపించారు. అలానే అతడి సినిమా 'రంగు' ట్రైలర్ ని హౌస్ లో ప్లే చేసి చూపించారు.
కౌశల్ భార్యపై దీప్తి నిన్నటి ఎపిసోడ్ లో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కౌశల్ భార్య అతడితో ఎలా వేగుతుందో అనే అర్ధం వచ్చే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో నాని ఈ విషయంపై దీప్తికి చురకలు అంటించారు. హౌస్ మేట్స్ ఒకరిపై మరొకరు అభిప్రాయాలు చెప్పుకోవచ్చు కానీ పర్సనల్ విషయాల జోలికి పోవద్దని నేను మొదటి నుండి చెబుతున్నామని కానీ కౌశల్ భార్య గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ దీప్తిని ప్రశ్నించారు.
అయితే నేను ఆమె ఓపిక గురించి మాత్రమే అన్నానని తన వెర్షన్ చెప్పే ప్రయత్నం చేసింది దీప్తి. దీనికి కౌంటర్గా ఇలాంటి కామెంట్స్ మీపైన చేస్తే మీరు ఇలాగే స్పందిస్తారా? అంటూ నాని ప్రశ్నించారు.
Last Updated 9, Sep 2018, 1:29 PM IST | 0business
|
Washington D.C., First Published 11, May 2019, 11:12 AM IST
Highlights
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలతో చైనాకు ఆర్థిక నష్టం మాట పక్కన బెడితే అమెరికన్లకే ఇబ్బందులు ఎక్కువ అన్న సంగతి అవగతమవుతోంది. ఆంక్షలు కొనసాగుతున్నా చైనా నుంచి అమెరికాకు 539 బిలియన్ల డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి అయితే.. చైనాకు 120 బిలియన్ల విలువ గల అమెరికా ఎగుమతులు దిగుమతయ్యాయి.
డ్రాగన్పై మళ్లీ సుంకాల మోత సరే.. అమెరికాకే కష్టం
వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశాలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడే అవకాశాలు కన్పించట్లేదు సరికదా మరింత రాజుకున్నాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు పెంచడమే ఇందుకు కారణం.
మరో 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలను ట్రంప్ రెట్టింపు చేశారు. ఓ వైపు వాణిజ్య ఉద్రిక్తతలపై ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరుగుతుండగా.. ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు చైనా కూడా ఇందుకు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచేందుకు సిద్ధమైంది.
శుక్రవారం లేదా ఆ తర్వాత నుంచి చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు అమలవుతాయని యూఎస్ ఫెడరల్ రిజిస్టర్ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో చైనా నుంచి దిగుమతి చేసుకునే పలు, హ్యాండ్బ్యాగులు, దుస్తులు, పాదరక్షలు ఇలా తదితర 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న 10శాతం సుంకాన్ని 25శాతానికి పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చైనా వాణిజ్య శాఖ కూడా స్పష్టం చేసింది.
‘తాజా పరిణామాలపై చైనా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అమెరికాకు బదులిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. ఇప్పటికీ సహకారం, సంప్రదింపుల ద్వారా వాణిజ్య సమస్యను పరిష్కరించుకునేందుకు అమెరికా మాతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామని ఇటీవల ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సంప్రదింపుల కోసం చైనా అత్యున్నత వాణిజ్య రాయబార బృందం గురువారం అమెరికా చేరుకుంది. శుక్రవారం మరోసారి రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ సుంకాలను పెంచడం అంతర్జాతీయ మార్కెట్లలో కలవరం రేపుతుంది.
ఇదిలా ఉండగా.. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని, కానీ బీజింగ్ మరోసారి చర్చలు కోరుకుంటోందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మరోసారి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని వ్యాఖ్యానించారు.
ఒక్కసారి అమెరికా, చైనా మధ్య దిగుమతుల తీరు తెన్నులు గమనిద్దాం..2018లో అమెరికాకు 539 బిలియన్ల డాలర్ల విలువ చేసే ఎగుమతులు చైనా చేసింది. ఇందులో చైనా ఎగుమతి చేసిన వాటిల్లో రసాయనాలు 21.4 బిలియన్ల డాలర్లు, రవాణా సంబంధ వస్తువులు 21.7 బిలియన్ డాలర్లు, ఫర్నీచర్ 25.8 బిలియన్ డాలర్లు, 26.5 బిలియన్ డాలర్ల విలువగల ఫ్యాబ్రికేటెడ్ మెటల్స్ ఉన్నాయి.
29.8 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులు, 38.7 బిలియన్ డాలర్ల విలువ గల మెషినరీ, 40.2 బిలియన్ డాలర్ల విలువైన ప్లాస్టిక్, తోళ్లు, రబ్బర్ వస్తువులు, 44 బిలియన్ డాలర్ల తయారీ వస్తువులు, 49.9 బిలియన్ల డాలర్ల విలువైన విద్యుత్ పరికరాలు, 186.5 బిలియన్ డాలర్ల విలువైన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను చైనా ఎగుమతి చేస్తోంది.
ఇక చైనాకు అమెరికా ఎగుమతుల విలువ కేవలం 120.3 బిలియన్ల డాలర్లు మాత్రమే. 3.4 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ పరికరాలు, తయారీ రంగ వస్తువులు 3.7 బిలియన్ డాలర్లు, వ్యవసాయ ఉత్పత్తులు 5.9 బిలియన్ డాలర్లు కాగా, 7.1 బిలియన్ డాలర్ల విలువైన చమురు - గ్యాస్ చైనాకు ఎగుమతి అవుతోంది. రవాణా సంబంధ వస్తువులు 27.8 బిలియన్ డాలర్లు, 17.9 బిలియన్ డాలర్ల విలువైన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, 16.2 బిలియన్ డాలర్ల విలువైన రసాయనాలు, 11.1 బిలియన్ డాలర్ల విలువైన మెషినరీపై చైనా సుంకాలు విధిస్తుంది.
47 శాతం చైనా దిగుమతులపై అమెరికా సుంకాలు విధించింది. 5700కి పైగా ఉత్పత్తులపై దీని ప్రభావం పడింది. 91 శాతం అమెరికా దిగుమతులపై చైనా సుంకాలు విధిస్తోంది.
Last Updated 11, May 2019, 11:12 AM IST | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Gary Kirsten విషయంలో సెల్ఫ్ గోల్.. బీసీసీఐకి ముందే తెలీదా?
భారత మహిళల జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న గ్యారీ కిర్స్టెన్కు బీసీసీఐ నో చెప్పడం వివాదాస్పదమైంది.
Samayam Telugu | Updated:
Dec 21, 2018, 09:10AM IST
Gary Kirsten విషయంలో సెల్ఫ్ గోల్.. బీసీసీఐకి ముందే తెలీదా?
భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం గ్యారీ కిర్స్టన్ అప్లికేషన్ను బీసీసీఐ పక్కనబెట్టడం వివాదాస్పదంగా మారింది. 2011లో పురుషుల జట్టు ప్రపంచ కప్ గెలవడంలో కిర్స్టన్ పాత్ర మరువలేనిది. టీమిండియాను టెస్టుల్లో నంబర్ 1గా నిలిపారాయన. అలాంటి కోచ్ దరఖాస్తును పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణం చూపి పక్కన బెట్టడం పట్ల బీసీసీఐ అధికారులే మండిపడుతున్నారు. కిర్స్టన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్గా ఉన్నాడని తెలిసి మరీ బీసీసీఐ ఆయన నుంచి దరఖాస్తు స్వీకరించింది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన త్రిసభ్య కమిటీకి కిర్స్టన్ సీవీని పంపింది.
Visit Site
Recommended byColombia
అందుబాటులో ఉన్న వారిలో అత్యుత్తమమైన ముగ్గుర్ని ఎంపిక చేయమంటే.. ప్యానెల్ ముందుగా కిర్స్టన్ వైపు మొగ్గు చూపింది. డబ్ల్యూవీ రామన్, వెంకటేశ్ ప్రసాద్లను కూడా ఎంపిక చేశారు. ఆర్సీబీతో గ్యారీకి కాంట్రాక్ట్ ఉండటంతో కాదనుకున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలను నిర్దేశించే ముందే బీసీసీఐకి ఈ విషయం గుర్తుకు రాకపోవడం శోచనీయం. ‘మహిళల జట్టుతో కలిసి పని చేసేందుకు కిర్స్టన్ సుముఖత వ్యక్తం చేస్తే, మీరు కాదంటారా? టీ20 క్రికెట్ క్లబ్కు.. అది కూడా పురుషుల జట్టుకు కోచ్ ఉన్నాడని గ్యారీని వదులుకుంటారా? ఇది నిజంగానే జోక్’ అంటూ ఓ అధికారి విస్మయం వ్యక్తం చేశారు.
కిర్స్టన్ను కోచ్గా ఎంపిక చేయలేకపోతున్నామని తెలిసి త్రిసభ్య ప్యానెల్ సభ్యులు షాకయ్యారట. ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ వారిని అద్భుతంగా ఆకట్టుకుందని సమాచారం. కిరెస్టన్ రెండు నెలల క్రితమే ఆర్సీబీతో మళ్లీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. దీంతో ఆ పదవిని వదులుకోలేని స్థితిలో ఆయన ఉన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Suresh 109 Views teamindia
TEAMINDIA
దంబుల్లా: శ్రీలంక-భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా 108 పరుగులు చేసింది. భారత జట్టు తొలి వికెట్ రోహిత్ శర్మ రనౌట్ ఐన పిదప బరిలోకి దిగిన కోహ్లీ, ధావన్తో జత కట్టాడు. వీరి భాగస్వామ్యంలో స్కోరు పరుగులు పెడుతోంది. ధావన్ 49 బంతులు, 68 పరుగులు, కోహ్లీ 33 బంతుల్లో 35 పరుగులతో కొనసాగుతున్నారు. ధావన్ 10 బౌండరీలు కొట్టగా, కోహ్లీ 5 ఫోర్లు కొట్టారు. టీమిండియా స్కోర్ 16 ఓవర్లు ముగిసే సరికి 109/1. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
భారత్తో కష్టమే కానీ.. బంగ్లానే గెలుస్తుంది
కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో శుక్రవారం రాత్రి శ్రీలంకని ఓడించి ఫైనల్కి చేరిన బంగ్లాదేశ్..
TNN | Updated:
Mar 17, 2018, 08:24PM IST
భారత్తో కష్టమే కానీ.. బంగ్లానే గెలుస్తుంది
కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో శుక్రవారం రాత్రి శ్రీలంకని ఓడించి ఫైనల్‌కి చేరిన బంగ్లాదేశ్.. ఆదివారం భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఈ టోర్నీ లీగ్ దశలో భారత్‌తో తలపడిన రెండు సార్లూ పరాజయం చవిచూసిన బంగ్లాదేశ్ బదులు తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. శుక్రవారం రాత్రి మ్యాచ్ ముగిసే సమయంలో శ్రీలంక ఆటగాళ్లతో గొడవ, విజయానంతరం నాగిని స్టైల్ సంబరాలతో ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచంలో బంగ్లాదేశ్ హాట్ టాఫిక్‌గా మారింది. ఈ ఆత్మవిశ్వాసంతోనే భారత్‌ని తాము ఓడించగలమని బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ శనివారం మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేశాడు.
‘భారత్ జట్టు బలంగా ఉంది. కానీ.. బంగ్లాదేశ్ వరుస స్ఫూర్తివంతమైన విజయాలో మంచి ఊపు మీదుంది. కాబట్టి.. ఫైనల్లో కూడా ఆ జోరుని బంగ్లా కొనసాగిస్తుందనే నమ్మకం నాకుంది’ అని షకిబ్ అల్ హసన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. శ్రీలంక ఆటగాళ్లతో గొడవ గురించి మాట్లాడుతూ ‘ టీ20 మ్యాచ్ అంటే ఆ మాత్రం భావోద్వేగం, ఉత్కంఠ సహజం. లక్కీగా మేము మ్యాచ్ గెలిచాం. చివరి ఐదు ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇదొకటి’ అని వివరించాడు. ఆదివారం రాత్రి 7 గంటలకి కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
"యుద్ధం శరణం" అంటున్న నాగచైతన్య
Highlights
యుద్ధం శరణం గచ్చామి చిత్రంతో వస్తోన్న యువసామ్రాట్ నాగచైతన్య
ఈ చిత్రంలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి
ఆగస్ట్ లో యుద్ధం శరణామి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు
నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా వారాహి చలన చిత్రం పతాకంపై కృష్ణ ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రానికి "యుద్ధం శరణం" అనే టైటిల్ ను నిర్ణయించి నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. చిత్రీకరణ చివరి దశలో ఈ చిత్రం టీజర్ మరియు ఆడియో విడుదల తేదీలను కూడా నిర్ణయించినట్లు చిత్ర బృందం చెబుతోంది. "పెళ్లి చూపులు" ఫేమ్ వివేక్ సాగర్ సంగీత సారథ్యం వహించనుండగా.. శతచిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. "నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ "యుద్ధం శరణం". కథకి తగిన టైటిల్ ఇది. నాగచైతన్య లుక్-యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. శ్రీకాంత్, రావు రమేష్లు కీలకపాత్రలు పోషించనున్నారు. అలాగే.. మురళీశర్మ-రేవతీల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 15న ఫస్ట్ టీజర్ ను విడుదల చేయనున్నాం. ఇదే నెలలో ఆడియోను విడుదల చేసి.. ఆగస్ట్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్ గా "యుద్ధం శరణం" నిలిచిపోతుందన్న నమ్మకం ఉంది" అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రూ.350 నాణేలను తీసుకురానున్న ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే కొత్త నాణేన్ని ప్రవేశపెట్టనుంది. శ్రీ గురు గోవింద్ సింగ్ 350వ జయంతి వార్షికోత్సవం సందర్భంగా రూ.350 నాణేన్ని విడుదల చేయనుంది
TNN | Updated:
Mar 27, 2018, 05:30PM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే కొత్త నాణేన్ని ప్రవేశపెట్టనుంది. శ్రీ గురు గోవింద్ సింగ్ 350వ జయంతి వార్షికోత్సవం సందర్భంగా రూ.350 నాణేన్ని విడుదల చేయనుంది. నోట్ల రద్దు తరువాత పెద్ద నాణేలను తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.350 నాణేలను తీసుకురానుంది. ఈ మేరకు ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ కొత్త రూ.350 నాణెం ఎలా ఉంటుందనే దానిపై అంచనాలు ఇలా ఉన్నా
కొత్త నాణేన్ని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ
యి. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలత సిల్వర్ మిశ్రమ లోహాలు 50 శాతం, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, జింక్ లోహాల మిశ్రమంతో దీన్ని రూపొందించింది. ముందు భాగంలో అశోక స్తంభం, మధ్యలో "సత్యమేవ జయతే" నినాదాన్ని పొందుపర్చగా, ఎడమవైపున దేవనాగరి లిపిలో "భారత్", వెనుక భాగంలో ఇండియా అని ఆంగ్లంలో ఉంటుంది.
అలాగే నాణెం వెనుక దేవనాగరి లిపిలోని "శ్రీ గురు గోబింద్ సింగ్జీ 350వ ప్రకాశ ఉత్సవ్’’ అని కాయిన్కి పైభాగాన, దిగువన ఆంగ్లంలో "తఖ్త్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్ -1666-2016" చిత్రాన్ని అమర్చినట్టు తెలుస్తోంది. నాణెం బరువు సుమారు 35.35 గ్రాములు ఉంటుందని అంచనా. ఎంత విలువ మేరకు ఈ నాణేలను విడుదల చేస్తోంది స్పష్టం చేయలేదు. కానీ పరిమితంగానే వీటిని తీసుకొస్తున్నట్టు ఆర్బీఐ నోటిఫికేషన్లో పేర్కొంది. | 1entertainment
|
Hyderabad, First Published 22, Aug 2018, 4:17 PM IST
Highlights
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. బాహుబలి సినిమా సమయంలో పెళ్లి టాపిక్ వస్తే సినిమా పూర్తయిన తరువాత చేసుకుంటానని చెప్పాడు కానీ ఆ సినిమా పూర్తయి సూపర్ హిట్ అయి ప్రభాస్ మరో సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లిపోయాడు కానీ పెళ్లి ఊసెత్తడం లేదు.
అయితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నలు అతడి పెదనాన్న కృష్ణంరాజుకి ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయనకు మరోసారి ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి చెప్పారు. 'ఇంతకముందు వరకు బాహుబలి సినిమా పూర్తయిన తరువాత పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ అనేవాడు.
ఇప్పుడు 'సాహో' సినిమాతో బిజీ అయిపోయాడు. ఆ సినిమా అయ్యాక చూద్దాం అంటున్నాడు' అని కృష్ణంరాజు చెప్పుకొచ్చాడు. అయితే వీలైనంత తొందరగా ప్రభాస్ పెళ్లి జరిపించాలని ఇంట్లో వాళ్లు అనుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తప్పించుకొని తిరుగుతున్నాడు. వచ్చే ఏడాది 'సాహో' విడుదల కానుంది. అప్పుడైనా చేసుకుంటాడో.. లేక రాధాకృష్ణతో సినిమా ఉందని ఆ తరువాత చూద్దామని అంటాడో చూడాలి!
Last Updated 9, Sep 2018, 11:56 AM IST | 0business
|
News Room 365 WATCH LIVE TV
GST:తగ్గిన జీఎస్టీ వసూళ్లు
వస్తు సేవల పన్ను ( జీఎస్టీ) వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 94,016కోట్లుగా నమోదయ్యా యి
Samayam Telugu | Updated:
Jun 2, 2018, 10:30AM IST
వస్తు సేవల పన్ను ( జీఎస్టీ) వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 94,016కోట్లుగా నమోదయ్యా యి. గత నెల ఏప్రిల్లో ఈ వసూళ్లు రూ.1.03లక్షల కోట్లుగా ఉన్నాయి. గత మాసంలో సిజీఎస్టీ కింద రూ. 15,866 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ కింద రూ.21,691 కోట్లు. ఐజీఎస్టీ కింద రూ. 49,120 కోట్లు, సెస్ వసూళ్లుగా రూ. 7,339 కోట్లు చొప్పున వసూళ్లయ్యాయి.
జీఎస్టీ వసూళ్లు
2017-2018 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు జీఎస్టీ వసూళ్లు రూ.89,885కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ ఆధియా పేర్కొన్నారు. దీంతో పోల్చితే గత మాసం వసూళ్లలో పెరుగుదల ఉన్నట్లేనని అన్నారు. ఇ-వే బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత వచ్చిన మెరుగైన ప్రదర్శనను ఇది ప్రతిబింబిస్తుందని ట్వీట్ చేశారు. మొత్తం వసూళ్లు పెరగడమేకాకుండా, రిటర్న్స్ సంఖ్య కూడా పెరిగిందన్నారు. మే 31 వరకు ఏప్రిల్ నెలలో దాఖలు చేసిన రిటర్న్స్ సంఖ్య 60.47 లక్షలతో పోలిస్తే 62.46కి పెరిగిందన్నారు. మార్చి నెల జీఎస్టీ పరిహారం కింద మే 29న రాష్ట్రాలకు రూ.6696కోట్లు విడుదల చేశారు. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
సంచలనం సృష్టించడానికే విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికా వస్తున్నాడని డివిలియర్స్ తెలిపాడు. కోహ్లి ఎంతటి అంకితభావం ఉన్న కెప్టెనో మనకు తెలుసు. అతడు సౌతాఫ్రికాలో కచ్చితంగా చరిత్ర సృష్టించేందుకు ప్రయత్నిస్తాడని ఏబీ చెప్పాడు. మాకు ఆ విషయం తెలుసు. అందుకే కోహ్లి సేనను ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యాం అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. భారత్ యువరక్తంతో ఉరకలేస్తోంది. గతంతో పోలిస్తే.. ఇటీవల మా దేశంలో వారు మెరుగ్గా రాణిస్తున్నారని ఏబీ చెప్పాడు.
సొంత గడ్డ మీద భారత్‌పై గెలవడం ద్వారా టెస్టుల్లో అగ్రస్థానం చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తామని డివిలియర్స్ చెప్పాడు. కాగా భారత్‌తో సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని డివిలియర్స్, డేల్ స్టెయిన్‌లకు రెండేళ్ల తర్వాత టెస్టుల్లోకి దక్షిణాఫ్రికా పిలుపునిచ్చింది. జింబాబ్వేతో పింక్ బాల్‌తో జరగనున్న నాలుగు రోజుల టెస్టులో వీరిద్దరికీ చోటు లభించింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
sumalatha 146 Views 261-crore , profit , SPICEJET
spicejet flight
బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201920) తొలి త్రైమాసిక ఫలితాల్లో బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్జెట్ రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. సంస్థకు ప్రయాణికుల సంఖ్య పెరగడం, జెట్ ఎయిర్వేస్ మూసివేతతో చార్జీలు పెంచడం వంటి కారణాల వల్ల ఈసారి కంపెనీ లాభాలు పెరిగాయి. దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ నికర లాభం రూ.261 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే సమయంలో సంస్థకు రూ.38 కోట్ల నికర నష్టం వచ్చింది. సంస్థ మొత్తం ఆదాయం రూ.2,253 కోట్ల నుంచి రూ.3,145 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ రెవెన్యూ రూ.2,220 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు పెరిగింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/ | 1entertainment
|
internet vaartha 329 Views
న్యూఢిల్లీ : రింగింగ్బెల్స్ దేశీయ స్మార్ట్ఫోన్ కంపెనీ భారత్ కస్టమర్ల కోసం కారు చౌక స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెడుతోంది. రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ఈ ఫోన్ బుకింగ్స్ను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఫ్రీడమ్ 251 పేరిట విడుదలయ్యే ఈఫోన్ బుకింగ్స్ గురువారం ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభం అవుతాయి. 21వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ముగుస్తాయి. భారతీయ మొబైల్ మార్కెట్లో కొత్తగా ప్రవేశిస్తున్న ఈ కంపెనీ 4జి స్మార్ట్ఫోన్ను 2999 లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే మరో రెండు ఫీచర్ ఫోన్లను మార్కెట్కు ప్రవేశపెట్టింది. ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్కు సంబంఒధించి డ్యూయల్సిమ్3జి సామర్ధ్యంతో ఉంటుంది. నాలుగు అంగుళాల డబ్ల్యు విజిఎ డిస్ప్లేతోపాటు 1.3జిహెచ్జడ్ క్వాడ్కోర్ ప్రాసెసర్తో ఉంటుంది. ఫ్రీడమ్ 251 స్మార్ట్ఫోన్ వన్జిబి రామ్తోపాటు 8జిబి మొత్తం నిల్వ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఫ్రీడమ్ 251 స్మార్ట్ఫోన్కు 3.2 మెగాపిక్సెల్ కెమేరా వెనుకవైపు 0.3 మెగాపిక్సెల్ కెమేర ముందువైపు ఉన్నాయి. 1450 ఎంఎహెచ్ బ్యాటరీతో శక్తివంతంగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
World Cup 2019 రివ్యూ మీటింగ్.. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్కి అంబటి సెగ..?
వరల్డ్ కప్లో భారత ఆటతీరుపై సీఓఏ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనుంది. కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో కమిటీ భేటీ కానుంది. అలాగే చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్తోనూ కమిటీ సమావేశం కానుంది.
Samayam Telugu | Updated:
Jul 13, 2019, 08:28PM IST
హైలైట్స్
వరల్డ్ కప్ సెమీస్లో ఓడిన భారత్.
నాలుగో స్థానం ఎంపికలో విమర్శలకు తావిస్తోన్న సెలెక్టర్ల నిర్ణయాలు.
రిజర్వ్డ్ ఆటగాడైన రాయుణ్ని కాదని మయాంక్కు పిలుపు
వరల్డ్ కప్ 2019లో భారత్ పోరాటం అనూహ్యంగా సెమీఫైనల్తో ముగిసింది. మెగా టోర్నీ కోసం ఎప్పటి నుంచో సన్నద్ధమైనప్పటికీ.. సెమీస్లో 240 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక కోహ్లి సేన చతికిల పడింది. 45 నిమిషాల చెత్త ఆట.. మమ్మల్ని టోర్నీ నుంచి బయటకు పంపేసిందని కెప్టెన్ కోహ్లి వాపోయాడు. జట్టు ఓటమి పట్ల ఆటగాళ్లను నిందించడం సహజమే. కానీ ఈసారి మాత్రం ఆటగాళ్లతోపాటు సెలక్షన్ కమిటీ వైఫల్యాలు కూడా మెగా టోర్నీ నుంచి టీమిండియా అనూహ్య నిష్క్రమణకు కారణమయ్యాయి.
‘‘నాలుగోస్థానం కోసం అంబటి రాయుడిని ఫిక్స్ చేసి.. చివరి నిమిషంలో ఆల్రౌండర్ విజయ్ శంకర్ను ఎంపిక చేశారు. కానీ వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ను నాలుగోస్థానంలో ఆడించారు. శిఖర్ ధావన్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో.. అతడి స్థానంలో రాహుల్ను ఓపెనర్గా పంపించారు. బ్యాకప్గా మిడిల్ ఆర్డర్ ఆటగాడు పంత్ను పంపించారు. విజయ్ శంకర్ కూడా గాయం కారణంగా వైదొలగడంతో.. ఓపెనర్ అయిన మయాంక్ అగర్వాల్ను మిడిల్ ఆర్డర్ ఆటగాడి స్థానం కోసం వెంటనే ఇంగ్లాండ్ పంపారు. సెలెక్టర్లు ఇంతటి గజిబిజి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంట’’ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఘాటుగా ప్రశ్నించారు.
Visit Site
Recommended byColombia
జట్టు అద్భుత ప్రదర్శన చేసినప్పుడు సెలెక్టర్లకు నజరానాలు అందుతాయి. అలాగే జట్టు ఓడినప్పుడు వారు బాధ్యత తీసుకోవాలి, జవాబుదారీతనం ముఖ్యమని ఆ అధికారి వ్యాఖ్యానించారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నిత్యం జట్టుతోనే ఉన్నారు. నాలుగోస్థానం విషయంలో ఆయనే బాధ్యత తీసుకోవాలని ఆ అధికారి స్పష్టం చేశారు.
టీమిండియా కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి ఆదివారం లండన్ నుంచి స్వదేశానికి తిరిగొస్తున్నారు. వారు వచ్చాక.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) వారితో భేటీ కానుంది. ఈ భేటీ సందర్భంగా సెలెక్టర్ల విషయమై చర్చకు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో.. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్తోనూ వినోద్ రాయ్ నాయకత్వంలోని సీఓఏ భేటీ అయ్యే అవకాశం ఉంది.
కెప్టెన్, కోచ్, చీఫ్ సెలెక్టర్లతో సీవోఏ నిర్వహించబోయే సమావేశంలో అంబటి రాయుడి విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. నాలుగో స్థానానికి రాయుడు న్యాయం చేయలేడని సెలెక్టర్లు భావిస్తే.. వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో సిరీస్ వరకు అతడికే ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారని చీఫ్ సెలెక్టర్ను మేనేజ్మెంట్ ప్రశ్నించే అవకాశం ఉంది.
వరల్డ్ కప్లో రిజర్వ్డ్ ప్లేయర్గా రాయుణ్ని ఎంపిక చేశారు. కానీ ధావన్, విజయ్ శంకర్ గాయపడినప్పటికీ.. అంబటికి పిలుపు రాలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అతడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లు ఎందుకనే విషయమై కూడా మేనేజ్మెంట్ ప్రశ్నించే అవకాశం ఉంది. చాలా కాలం వన్డేలకు దూరమైన దినేశ్ కార్తీక్ను వరల్డ్ కప్కి ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న రావొచ్చు. సెమీఫైనల్లో భారత్ 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా కూడా.. ధోనీ ఏడో స్థానంలో ఎందుకు బ్యాటింగ్కు దిగాడనే విషయమై కూడా ఆరాతీసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తీసుకున్నాడని భావిస్తుండటంతో.. అతడే వివరణ ఇచ్చుకోవాల్సి రావచ్చు.
సెలెక్షన్ కమిటీ సభ్యులైన శరణ్దీప్ సింగ్, దేవాంగ్ గాంధీలు సెలక్షన్ మీటింగ్లలో తగిన సూచనలు ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెస్కేను ప్రశ్నించే అవకాశం ఉంది. | 2sports
|
Visit Site
Recommended byColombia
టీ20ల్లో బంగ్లాదేశ్‌కు ఇదే అతిపెద్ద ఛేజింగ్. వాస్తవానికి ఈ మ్యాచ్‌కు ముందు 14 టీ20లు ఆడిన బంగ్లా పులులు కేవలం ఒక్క దానిలో మాత్రమే విజయం సాధించారు. శనివారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లోనూ మొదట బంగ్లా పనైపోయిందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. కుశాల్‌ పెరీరా (74; 48 బంతుల్లో 8×4, 2×6), కుశాల్‌ మెండిస్‌ (57; 30 బంతుల్లో 2×4, 5×6), తరంగ (32; 15 బంతుల్లో 4×4, 1×6) మెరుపులు మెరిపించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (47; 29 బంతుల్లో 6×4, 1×6), లిటన్‌ దాస్‌ (43; 19 బంతుల్లో 2×4, 5×6) చెలరేగిపోయారు. జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి వికెట్‌గా లిటన్ పెవిలియన్‌కు చేరాడు. 100 పరుగుల వద్ద బంగ్లా తమీమ్ ఇక్బాల్ వికెట్‌ను కూడా కోల్పోయింది. విజయానికి 63 బంతుల్లో 115 పరుగులు చేయాల్సిన స్థితిలో ముష్ఫికర్ రహీమ్ క్రీజులోకి వచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లంక బౌలర్లను ఊచకోత కోశాడు. సౌమ్య సర్కార్‌ (24), మహ్మదుల్లా (20) నుంచి వచ్చిన సహకారంతో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేశాడు. తీవ్ర ఒత్తిడిలోనూ బంగ్లాకు అద్భుత విజయాన్ని అందించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా అందుకున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
DD vs CSK: చెన్నైకి షాకిచ్చిన ఢిల్లీ డేర్డెవిల్స్
ఐపీఎల్ 2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఢిల్లీ డేర్డెవిల్స్ ఊహించని షాకిచ్చింది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్ర్కమించిన ఢిల్లీ జట్టు ఫిరోజ్
Samayam Telugu | Updated:
May 18, 2018, 11:54PM IST
ఐపీఎల్ 2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఢిల్లీ డేర్డెవిల్స్ ఊహించని షాకిచ్చింది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్ర్కమించిన ఢిల్లీ జట్టు ఫిరోజ్ షా కోట్ల వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నైపై 34 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత హర్షల్ పటేల్ (36 నాటౌట్: 16 బంతుల్లో 1x4, 4x6), విజయ్ శంకర్ (36 నాటౌట్: 28 బంతుల్లో 2x4, 2x6) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసిన ఢిల్లీ.. అనంతరం బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఛేదనకు దిగిన చెన్నైని 128/6కే పరిమితం చేసింది. చెన్నై జట్టులో ఓపెనర్ అంబటి రాయుడు (50: 29 బంతుల్లో 4x4, 4x6), రవీంద్ర జడేజా (27 నాటౌట్: 18 బంతుల్లో 2x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (17: 23 బంతుల్లో 1x4), సురేశ్ రైనా (15: 18 బంతుల్లో 1x4) మిడిల్ ఓవర్లలో ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో ఆఖర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయి చెన్నై ఓటమి ఖాయమైంది. అయితే.. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్ చేరిన విషయం తెలిసిందే.
అంతకముందు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (17: 17 బంతుల్లో 1x4, 1x6) ఆరంభంలోనే ఔటవగా.. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ (38: 26 బంతుల్లో 3x4, 2x6)తో కలిసి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (19: 20 బంతుల్లో 3x4) కాసేపు ఇన్నింగ్స్ నడిపించినా.. ధాటిగా ఆడలేకపోయాడు. వీరిద్దరినీ రెండు బంతుల వ్యవధిలో ఎంగిడి ఔట్ చేయగా.. తర్వాత వచ్చిన హిట్టర్లు మాక్స్వెల్ (5), అభిషేక్ శర్మ (2) పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నారు. దీంతో.. 14.4 ఓవర్లలో 97/5తో ఢిల్లీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఆఖరి వరకూ పట్టుదలతో ఆడిన హర్షల్- శంకర్ జోడి ఐదో వికెట్కి అభేద్యంగా 32 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకి మెరుగైన స్కోరు అందించారు. ముఖ్యంగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన డ్వేన్ బ్రావో బౌలింగ్లో విజయ్ శంకర్ ఒక సిక్సర్ కొట్టగా.. హర్షల్ పటేల్ కళ్లు చెదిరే రీతిలో మూడు సిక్సర్లు బాదడంతో.. ఆ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. | 2sports
|
Visit Site
Recommended byColombia
అనంతరం రోహిత్ (37) కూడా కాసేపటికే చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. క్రీజ్లో కుదురుకుంటున్న అంబటి రాయుడు (13)ను ఔట్ చేసిన జంపా మరోసారి దెబ్బతీశాడు. దీంతో ఓ దశలో 80/1తో పటిష్టంగా కనిపించిన భారత్ 20 పరుగుల తేడాలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో భారత్ను ధోనీ-జాదవ్ ఆదుకున్నారు. పిచ్పై పరుగులు రావడం కష్టం కావడంతో వీరిద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా మహీ సింగిల్స్ తీయడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ భారత్ను గెలిపించారు. ఈ క్రమంలో జాదవ్, ధోనీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోనీకి ఇది వన్డేల్లో 71వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. 49వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ధోనీ టీమిండియాను గెలిపించాడు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 రన్స్ చేసింది. ఫించ్ డకౌట్ కాగా.. ఖవాజా (76 బంతుల్లో 50), స్టోయినిస్ (53 బంతుల్లో 37) ఆసీస్ను ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్కు 87 పరుగులు జోడించారు. మ్యాక్స్వెల్ (51 బంతుల్లో 40) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో షమీ, బుమ్రా కుల్దీప్లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
గాయత్రి గుప్తా వల్లే నా జీవితం ఇలా తయారయ్యింది-శ్రీ రెడ్డి
Highlights
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై యుద్ధం ప్రకటించిన నటి శ్రీ రెడ్డి
శ్రీరెడ్డి సంచలన విషయాలు వెల్లడించటం వెనుక వున్నదెవరో తెలుసా
ఫ్రెండ్ షిప్ కారణంగా.. తను వదిలేసినా నేను వదలలేదన్న శ్రీ రెడ్డి
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగౌ కౌచ్ కి వ్యతిరేకంగా... యుద్ధం ప్రకటించింది నటి శ్రీరెడ్డి. గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. ఇండస్ట్రీలో అవకాశాల పేరులో అమ్మాయిలను వాడుకోవడం.. తనను తనతో పాటు మరికొంతమందిని శారీరక, మానసిక హింసపై మీడియాకి ఎక్కింది ఈ తెలుగు నటి. అయితే తెలుగు పరిశ్రమ పెద్దలపై పలు సంచలన ఆరోపణలతో హాట్ టాపిక్గా మారిన శ్రీరెడ్డి అసలు తను ఇలా మారటానికి కారణం ఏంటో చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎవరో చెప్పలేదు.
అయితే అసలు తను పోరాటం మొదలు పెట్టడానికి బీజం పడిందే గాయత్రి గుప్తా వల్ల అంటూ బాంబ్ పేల్చింది. ఎందుకంటే.. తను గాయత్రి మంచి స్నేహితులమని, గాయత్రి తనకు జరిగిన అన్యాయంపై.. నోరు విప్పినా.. కొంత కాలం మాత్రమే మాట్లాడేసి.. ననయానో భయానో.. ఇష్యూను వదిలేసిందని, తాను అక్కడే ఆలోచనలో పడ్డానని శ్రీ రెడ్డి స్పష్టం చేసింది. గాయత్రి లాంటి. తన లాంటి ఎందరో అమ్మాయిలు ఇండస్ట్రీలో నిలదొక్కుకుందామని వచ్చి.. అవకాశాల కోసం పక్కలు పరచాల్సి రావటం వెనుక దాగున్న కుట్రల గుట్టు విప్పుతున్నానని శ్రీ రెడ్డి అంటోంది.
తమను బరితెగిస్తున్నారని అందరూ అంటున్నారని... కానీ అవకాశాల కోసం వెళితే పక్క పరిచేలా దిగజారుస్తారని, తమ కష్టాల గురించి నిజం తెలిసిన వాళ్లెవరూ తమ పట్ల అలాంటి దారుణమైన కామెంట్లు చేయరని శ్రీ రెడ్డి స్పష్టం చేసింది. మరి తన ఉద్యమం ఎందాక వెళ్తుందో చూడాలి.
Last Updated 26, Mar 2018, 12:02 AM IST | 0business
|
Recommended byColombia
635 ఎపిసోడ్లో హైలైట్స్..
కార్తీక్,మౌనితలు కారు దగ్గర కూర్చుని.. దీప అన్న మాటలను తలుచుకుంటూ ఉంటారు. మౌనిత ఆవేశంగా.. ‘నువ్వు ఎందుకు అలా దీపని వదిలేస్తావు? హిమ నా కూతురు లాంటిదే అని అది చెప్పుకుంటున్నప్పుడు లాగిపెట్టి ఒకటి కొట్టాల్సిందిగా నువ్వు? అయినా ఆ దీప నీ మనసు గెలుచుకోవడానికే అలా నాటకాలు ఆడుతోంది. లేదంటే ఇప్పటిదాకా హిమ ఎలా చదువుతుందని ఎప్పుడైనా చూసిందా?’ అంటూ అరుస్తుంది. వెంటనే కార్తీక్ ఆవేశంగా... ‘హిమ దాని కూతురేంటీ? ఇంకో సారి అలా మాట్లాడకు నువ్వు ’ అంటూ ఫైర్ అవుతాడు. వెంటనే తనే మాట్లాడుతూ.. ‘నీలానే దీప కూడా నీ గురించి అనుకోవచ్చుగా..? హిమ మీద నీకు ఎందుకు ఉన్నట్టుండి శ్రద్ధ వచ్చిందీ అని?’ అంటూ రివర్స్లో ప్రశ్నించడంతో మౌనిత కంగుతింటుంది.
‘ఇది దీప ఉద్దేశమా లేక నీదా? అసలు ఇదంతా కాదు కార్తీక్ ఆ వంటలక్క అంతకుముందు ఎప్పుడైనా హిమ కోసం పట్టించుకుందా? లేదుగా.. మనం ఎంటర్ అయ్యేసరికి ఇలా బిల్డప్ ఇస్తోంది’ అంటుంది బాగా ఎక్కిస్తుంది. సౌందర్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ‘అసలు ఎందుకండీ మన పెద్దరికం..? దీప బాధలను చూడ్డానికా? చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారుగా అంతా.. అందరినీ పిలిచి.. అన్ని నిజాలు చెప్పేస్తానండీ.. ఏది అయితే అది కానీయండీ’ అంటుంది భర్త ఆనందరావుతో ఆవేశంగా.. సరిగ్గా అప్పుడే హిమ వచ్చి.. ఏం చెప్పాలని నాన్నమ్మా? చెప్పు.. అంటుంది. సౌందర్య తడబడుతుంది. ‘ఏదైనా చెప్పాలంటే తడబడకూడదు నాన్నమ్మా.. చెప్పెయ్యాలి.. నేను చూడు ఇంత చిన్న పిల్లని ఎలా చెప్పేశానో..’ అంటుంది.
Read Also: మీరు ‘కార్తీకదీపం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్లు ఒక్క క్లిక్తో!
‘ఏం చెప్పావే?’ అని అడుగుతుంది సౌందర్య హిమని. ‘అదే నాన్నమ్మా.. డాడీని పెళ్లి చేసుకోమని అడిగేశాను. కొత్త అమ్మని చూసి చెబుతానని చెప్పేశాను’ అంటుంది హిమ నవ్వుతూ.. సౌందర్య, ఆనందరావులు షాక్ అవుతారు. సౌర్య ఒక చోట తన ఫ్రెండ్స్ ఆధ్యను, వాళ్ల అమ్మ(పోలీస్ ఆఫీసర్)ను కలుసుకుంటుంది. ‘మా నాన్నను వెతికి పెట్టండి.. మా అమ్మ కోసం మా నాన్నను కనిపెట్టండి.. ఇప్పటిదాకా మా నాన్నని నేను చూడలేదు’ అంటూ తన బాధనంతా ఆమెకు వివరిస్తుంది.
Read also: ‘కోయిలమ్మ’ సీరియల్ : అమర్కి ధైర్యం చెప్పిన రమేష్ చంద్ర! ‘2 రోజులు ఓపిక పట్టు’
దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ మీ నాన్న గురించి తెలుసుకోవాలంటే మీ ఇంట్లో రేషన్ కార్డ్ కానీ.. మీ నాన్న ఫొటో కానీ తీసుకుని రా. మీ నాన్నని నీకు అప్పగించే బాధ్యత నాది’ అని చెబుతుంది. దాంతో సౌర్య హ్యాపీగా ‘ఇంట్లో రేషన్ కార్డ్ ఉంటుంది మేడమ్ నేను తీసుకొని వస్తాను’అంటుంది. దీప ఇంట్లో సౌర్య కోసం వెతుక్కుంటూ టెన్షన్ పడుతుంది. సౌర్య నడచుకుంటూ వస్తూ.. తండ్రి కోసం ఆలోచిస్తూ వస్తుంది. ఓ సందు దాటుతున్న సమయంలో ఓ కారు వచ్చి సౌర్యను గుద్దేస్తుంది.
Read also: ‘మౌనరాగం’ అక్టోబర్ 25 ఎపిసోడ్ : అంకిత్కి అద్భుతమైన అవకాశం! అత్తంటికి లక్కీ..
కమింగ్ అప్లో...
కార్తీక్ ఆవేశంతో దీప మీద ఫైర్ అవుతాడు. ‘నీకు బుద్ధి ఉందా? మనిషివేనా నువ్వు. పసిదానికి మనసుతో అలా ఆడుకుంటావేంటే? పాపం ఆ వెర్రిది నాన్నా నాన్నా అంటూ కలవరిస్తూ రోడ్లు పట్టుకుని తిరుగుతుందే మెంటల్ దానా..’ అంటూ కోప్పడతాడు. దాంతో దీప చాలా సంతోషంగా నవ్వుతూ.. ‘కానీ మీలో ఇవాళ అచ్చమైన కన్నతండ్రి కనిపిస్తున్నాడు డాక్టర్ బాబూ’ అంటుంది. ‘హా.. కనిపిస్తే కనిపించనీ..’ అంటూనే షాకింగ్గా ఒక్కనిమిషం ఆగి ‘ఏంటీ?’ అంటాడు. ‘మీకు తెలియకుండానే మీలోని తండ్రి మనసు స్పందించింది. మీ కన్న కూతురు రోడ్ల మీద పిచ్చిదానిలా తిరుగుతుంటే మీ తండ్రి మనసు బాధపడుతుంది’ అంటుంది దీప. కార్తీక్ అలానే ఉండిపోతాడు. కార్తీకదీపం కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! | 0business
|
Mar 18,2018
'లక్ష'ణంగా మారుతీ స్విఫ్ట్ బుకింగ్లు!
ముంబయి: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్ అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. అతి తక్కువ సమయంలోనే లక్ష బుకింగ్ల మైలురాయిని చేరుకున్న కారుగా కొత్త స్విఫ్ట్ సరికొత్త రికార్డును సొంతం చేసుకోనుంది. మూడో జనరేషన్ స్విఫ్ట్ బుకింగ్లను జనవరి 18న కంపెనీ ప్రారంభించింది. శుక్రవారం నాటికి దాదాపు 90వేల బుకింగ్లు వచ్చినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. మరో వారంలో లక్ష బుకింగ్ల మైలురాయిని చేరుకుంటామని తెలిపింది. అలా జరిగితే కేవలం తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన తొలి కారుగా స్విఫ్ట్ రికార్డును దక్కించుకోనుంది. గతంలోనూ ఇతర కంపెనీల కార్లు లక్ష బుకింగ్ల మైలురాయిని చేరుకున్నాయి. అయితే అందుకోసం అవి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాయి. రెనో క్విడ్ ఆరు నెలల్లో, హ్యుందారు క్రెటా 8, మారుతి డిజైర్, వితారా బ్రెజా నాలుగు నెలల్లో ఈ ఘనత సాధించాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
అక్కినేని వారి కుటుంబం ఫోటో అదిరింది
Highlights
సోషల్ మీడియాలో సమంత గత కొద్ది రోజులుగా హంగామా చేస్తోంది. ప్రతీ సారి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చే సమంత.. ఈసారీ తన పేజ్ లో ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను పోస్ట్ చేసింది. సమంత, నాగచైతన్యలతో పాటు యంగ్ కపుల్ అఖిల్, శ్రేయా భూపాల్ లు కూడా కలిసి ఉన్న ఓ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసిన సమంత, ఫ్యామిలీ అంటూ రాసింది.
సమంత చైతూ.. ముందులా ఎవరికీ తెలియకుండా చాటు మాటు వ్యవహారాలు నడిపించడం మానేసి కొన్ని రోజులుగా ఓపెన్ గానే కలిసి తిరగడం, డేట్ కు వెళ్లడం లాంటివి చేస్తున్నారు. కొద్ది రోజులు క్రితం...'అవి లేకపోతే నేను జీవించలేను అనే వాటిలో మూడు చెప్పండి' అని ఓ ఫ్యాన్ అడగ్గా స్పందిస్తూ.. 'చైతూ, మస్కతీ ఐస్క్రీమ్, వర్క్' అని సమాధానమిచ్చింది సమంత.
ఇక నాగచైతన్య...'ఏమాయ చేసావే' సినిమా చేస్తున్పటి నుంచే సమంతతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తమకు తెలియకుండానే 'బెస్ట్ ఫ్రెండ్స్'గా మారిపోయామని, ఆ స్నేహమే ఒకరిపై ఒకరికి మరింత ఇష్టాన్ని పెంచింది. తమది ఏ ఒక్కరోజులోనో పుట్టిన ప్రేమ కాదని చెప్పుకొచ్చారు. మేము ఇంతకాలం స్నేహం చేసామా? ప్రేమలో ఉన్నామా? అంటే చెప్పడం కష్టమే. మేము ఎప్పుడూ ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు. 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయని ఊహిచుకోలేకపోయాను అని చైతు తెలిపారు.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
'కత్రీన కరీనా మధ్యలో కమల్ హసన్'
వినోదాన్ని నమ్ముకుని కొత్తవారితో లిమిటెడ్ బడ్జెట్లో చిత్రాన్ని నిర్మిస్తే తప్పకుండా తెలుగు ప్రేక్షకులు విజయాన్ని...
| Updated:
Jan 29, 2016, 06:43PM IST
'కత్రీన కరీనా మధ్యలో కమల్ హసన్'
వినోదాన్ని నమ్ముకుని కొత్తవారితో లిమిటెడ్ బడ్జెట్లో చిత్రాన్ని నిర్మిస్తే తప్పకుండా తెలుగు ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారనే గట్టి నమ్మకంతో రత్నని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రసాద్ కుమార్, శ్రీను విజ్జగిరిలు నిర్మాతలుగా నవకళ వారి బ్యానర్లో సంయుక్తగా నిర్మిస్తున్న చిత్రం ' కత్రీన కరీనా మధ్యలో కమల్ హసన్ ' . ఈ చిత్రంతో శశాంక్ మౌళి , పావని , మమత రావూత్లు హీరో, హీరోయిన్స్గా పరిచయం అవుతున్నారు. శ్రీకర్ సంగీతం అందిస్తున్న ఆడియోను త్వరలో విడుదల చేసి చిత్రాన్ని సమ్మర్లో రిలీజ్ చేసేందుకు యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. చిన్న చిత్రం, పెద్ద చిత్రం అనే తేడా లేకుండా వినోదాన్ని అందించే ప్రతీ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు విజయాన్ని అందించారు. అదే ఫార్ములాని నమ్ముకున్న మా దర్శకుడు రత్న యూత్కి నచ్చే చక్కటి వినోదాత్మక కథని మంచి కథనంతో వినోదాత్మకంగా చెప్పారు. మాకు చెప్పినదానికంటే వినోదాన్ని మరో వంతు ఎక్కువుగా అందించి తెరకెక్కించారు. ఈ చిత్రం షూటింగ్ని పూర్తిచేసుకుంది. త్వరలో శ్రీకర్ అందించిన ఆడియోను విడుదల చేసి సినిమాని సమ్మర్లో ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తామని అన్నారు. | 0business
|
team india jr
టీమిండియా కుర్రాళ్ల విజయం
ముంబయి: యూత్ వన్డే అండర్-19 అయిదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్పై టీమిండియా కుర్రాళ్లు విజయం సాధించారు. నాలుగవ వన్డేలో టీమిండియా కుర్రాళ్లు ఇంగ్లండ్ను 230 పరుగుల భారీ తేడాతో ఓడించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు చెందిన శుభం గిల్ 120 బంతులు ఆడి 160 పరుగులతో నాటౌట్గా నిలువగా,పృథ్వీషా 89 బంతులు ఆడి 105 పరుగులతో సెంచరీ సాధించడంతో 9 వికెట్ల నష్టానికి 382 పరుగుల మార్క్కు టీమిండియా చేరుకుంది.ఈ జోడి రెండవ వికెట్కు 164 బంతుల్లో 231 పరుగుల భారీ భాగస్వా మ్యం నెలకొల్పింది.తరవాత భారీ టార్గెట్ను చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ను బౌలర్లు చుట్టేశారు. కమలేశ్ నాగర్కోటీ 31 పరుగులిచ్చి 4 వికెట్లు,వివేకానంద తివారీ 20 పరుగులిచ్చి 3 వికెట్లు,శివమ్ మావీ 18 పరుగులిచ్చి 2 వికెట్లు ఈ ముగ్గురు కలిపి తొమ్మిది వికెట్లు పడగొట్ట డంతో ఇంగ్లండ్ జట్టు 152 పరుగులకే ఆలౌటైంది.ఈ విజయంతో భారత్ 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
===========
టి20లో త్రిబుల్ సెంచరీ
న్యూఢిల్లీ: టి20లో ఏకంగా 300 పరుగులు చేశాడు ఒక కుర్రాడు. నిజంగా ఇది సంచలనమే. ఢిల్లీలోని లలిత్ పార్క్లో ఫ్రెండ్స్ ప్రీమి యర్ లీగ్లో మావీ లెవెన్,ఫ్రెండ్ లెవన్ జట్లు తలపడ్డాయి.మావీ లెవన్ తరుపున ఆడిన 21 సంవత్సరాల మోహిత్ అల్వాల్ పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 72 బంతుల్లో త్రిబుల్ సెంచరీ చేశాడు బౌలర్లను వూచకోత కోసిన అతడి ఇన్నింగ్స్లో 14 బౌండరీలు,39 సిక్సర్లు ఉన్నాయి.18వ ఓవర్ వద్ద అతడి వ్యక్తిగత స్కోరు 250.ఆ తరువాత 12 బంతుల్లోనే మోహిత్ 50 పరుగులు చేశాడు.ఆఖరి ఓవర్లో వరుసగా అయిదు బంతుల్లో అయిదు సిక్సర్లు బాది 34 పరుగులు రాబట్టాడు.దీంతో మావీ లెవన్ 416 పరుగులు చేసింది.టార్గెట్ చేధనకు దిగిన ఫ్రెండ్స్ లెవన్ 216 పరుగులు తేడాతో పరాజయం చెందింది.మోహిత్ అల్వాల్ ఢిల్లీ తరుపున 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు.ఈ మూడు మ్యాచ్ల్లో అతడు చేసింది కేవలం 5 పరుగులే. | 2sports
|
Mar 23,2016
ప్రతికూలతలోనూ లాభాలే..
ముంబయి: బ్రస్సెల్స్లో బాంబు పేలుళ్ల నేపథ్యాన ఐరోపా మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూలత నెలకొన్నప్పటికీ మంగళవారం భారత మార్కెట్లు మాత్రం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా 'భారతీయ రిజర్వు బ్యాంకు' వడ్డీ రేట్లను తగ్గించనుందన్న అంచనాలతో సెన్సెక్స్ 11 వారాల గరిష్ట స్థాయికి చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్ 45.12 పాయింట్లు పెరిగి 25,330 పాయింట్లకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 10.65 పాయింట్లు వృద్ధి చెంది 7,714.90 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. రియాల్టీ సూచీ అత్యధికంగా 2.68 శాతం పెరిగింది. ఇదే క్రమంలో కన్సూమర్ డ్యూరెబుల్స్ 1.6 శాతం, విద్యుత్ 1.23 శాతం, కాపిటల్ గూడ్స్ 1.19 శాతం చొప్పున పెరిగాయి. ఎఫ్ఎంసీజీ 1.18 శాతం, బ్యాంకింగ్ 0.01 శాతం చొప్పున విలువ కోల్పోయాయి.సెన్సెక్స్ భెల్ 4.29 శాతం, హీరో మోటో కార్ప్ 2.28 శాతం, టాటా స్టీల్ 2.16 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.09 శాతం చొప్పున లాభాలు సాధించాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ 3.78 శాతం, ఐటీసీ 2.04 శాతం, అదాని పోర్ట్స్ 1.83 శాతం, హెచ్యుఎల్ 1.02 శాతం, కోల్ ఇండియా 0.77 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.3 శాతం, 0.5 శాతం చొప్పున పెరిగాయి.
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 18 పైసలు కోల్పోయి రూ.66.72 వద్ద నమోదయ్యింది. ఇంతక్రితం సెషన్లో విదేశీ మదుపర్లు రూ.1,396 కోట్ల విలువ చేసే నికర ఈక్విటీలు కొనుగోలుచేశారు. బ్రస్సెల్స్ పేలుళ్ల నేపధ్యంలో యూరోపియన్ షేర్లు నష్టాలు చవి చూశాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
జల్లికట్టును సపోర్టు చేస్తున్న వారిని ఏకిపారేశాడు వర్మ
Highlights
దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన జల్లికట్టు ఆట
జల్లికట్టు కు సపొర్ట్ తెలిపిన పలువురు సెలబ్రిటీలు
జల్లికట్టును సపోర్టు చేస్తున్న వారిని ఏకిపారేసిన వర్మ
కాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం.. ఈ విషయంలో జల్లికట్టును సపోర్టు చేస్తున్న వారిని ఏకిపారేశాడు. ''తమిళ వారికి జల్లికట్టు అనేది కరక్ట్ అయితే.. ఆల్ ఖైదీ తీవ్రవాదులకు కూడా అమాయకులైన వారిని పీక కోసి చంపడం కూడా కరక్టే. సినిమావాళ్ళేమో తెర మీద కనీసం ఒక పిట్టను కూడా హింసించినట్లు చూపకూడదు కాని.. తమిళ ప్రజలు మాత్రం గోవులను దారుణంగా హింసిస్తూ జల్లికట్టు ఆడుకోవచ్చా? జల్లికట్టు అనేది అనాగరికం'' అంటూ ట్వీట్లతో విరుచుకుపడ్డాడు వర్మ.
''జనాల ఆనందం కోసం మూగ జీవాలను హింసించడమే జల్లికట్టు. జయలలిత శశికళ వంటి లీడర్లను తెగల జాతుల్లా పూజించే జనాలకు ఇది కూడా నప్పిందిలే. జల్లికట్టును సపోర్టును చేస్తున్న సెలబ్రిటీలను.. 100 ఎద్దులతో తరుముతూ పరిగెత్తించాలి. అప్పుడు తెలుస్తుంది వారికి జనాలు ఎద్దులను తరిమితే వాటి ఫీలింగ్ ఎలా ఉంటుందో'' అంటూ రామూ గాట్టిగానే ఎద్దేవా చేశాడు.
అసలు ఒక అనాగరిక హక్కు కోసం పోరాడుతున్న ఆ జనాలను ఏమనాలి? జంతువులను టార్చర్ చేయడానికి అధికారం అడుగుతున్న వారికి ఏమని చెప్పాలి? అంటూ ఆలోచింపజేసే ప్రశ్నలనే వేశాడులే.'నోరు లేని జీవాలను జల్లికట్టు పేరుతో హింసించడం.. తీవ్రవాదం కంటే పెద్ద నేరమే'' అంటూ ముగింపు పలికాడు. వోట్ల కోసం.. పార్టీ టిక్కెట్ల కోసం.. ఈ సెలబ్రిటీలు అందరూ జల్లికట్టుకు సపోర్టునిస్తున్నారని డైరెక్టుగానే చెప్పేశాడులే.
Last Updated 26, Mar 2018, 12:03 AM IST | 0business
|
Highlights
అతిలోక సుందరి శ్రీదేవి మరణం యావత్ భారతాన్ని శోకంలో ముంచేసింది.
అనూహ్యంగా మరణించడంతో ఆమెకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది.
అతిలోక సుందరి శ్రీదేవి మరణం యావత్ భారతాన్ని శోకంలో ముంచేసింది. అందం అభినయంతో సినీప్రేమికులని మెస్మరైజ్ చేసిన ప్రతిభ శ్రీదేవిది. నిన్నటివరకు నిత్య యవ్వనంతో కనిపించిన శ్రీదేవి అనూహ్యంగా మరణించడంతో ఆమెకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. ఐదు పదుల వయసులో కూడా చలాకీగా ఉన్న శ్రీదేవి ఇలా ఊహించని విధంగా మరణించడంతో అంతా షాక్ కి గురయ్యారు. నటీమణిగా శ్రీదేవి సాధించని ఘనత లేదు. ఆమె అందానికి అతిలోక సుందరి అని పేరుపెట్టేసారు. అభినయానికి అంతా మంత్రముగ్దులయ్యారు. తెలుగు, తమిళ హిందీ భాషల్లో శ్రీదేవి స్టార్గా కొనసాగింది. అలాంటి నటి అనూహ్యంగా మరణించడంతో సినీ ప్రపంచం షాక్ కి గురైంది. శ్రీదేవిని గమనించిన వారంతా చిన్ననాటినుంచి ఆమెకు ఇటివంటి ఆరోగ్య సమస్య లేదని, శ్రీదేవి ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు. కానీ ఆమె ఊహించని విధంగా మరణించడం శ్రీదేవి ఆరోగ్యంపై చర్చ జరిగేలా చేస్తోంది. 2010,11 సంవత్సర మధ్య కాలంలో శ్రీదేవి క్యాన్సర్ బారీన పడ్డారని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. శ్రీదేవి సన్నిహితులు ఆ పుకార్లని కొట్టిపారేశారు. దీనితో అప్పట్లో శ్రీదేవి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.దుబాయ్ లోని తన మేనల్లుడి వివాహానికి హాజరైన శ్రీదేవి అక్కడ సంతోషంగా గడుపుతూ ఉన్నపళంగా గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.శ్రీదేవికి కొంతకాలంగా హైపర్ థైరాయిడిజం అనే వ్యాధితో భాదపడుతున్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. కానీ శ్రీదేవి కుటుంబ సభ్యులు దీనిగురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించలేదు.శ్రీదేవి వివాహ జీవితంలోకి అడుగుపెట్టాక తన కుమార్తెలే జీవితంగా బ్రతికింది. తన కుమార్తెలు జాన్వీ, ఖుషిని హీరోయిన్లుగా చూడాలని ఆశ పడింది. జాన్వీ నటిస్తున్న తొలి చిత్రం చూడకుండానే శ్రీదేవి మరణించడం విషాదకరం.
Last Updated 26, Mar 2018, 12:02 AM IST | 0business
|
internet vaartha 232 Views
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొత్త ప్రభుత్వం రియాల్టీ రంగానికి ఇస్తున్న ఇతోధిక ప్రోత్సాహంతో నగరంలోని ఐటికారిడార్తోపాటు శ్రీశైలం హైవే వంటి ప్రాంతాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం అదే కోవలో మణికొండ ప్రాంతం కూడా అద్వితీయ ప్రగతిలో ఉందని సర్వేలు స్పష్టం చేస్తునఆనయి. ఎయిర్పోర్టు,రైల్వేస్టేషన్లకు సుళువుగా చేరుకునే అవ కాశం ఉండటం, మెట్రోరైలు రాక వంటివి మణికొండకు మణిదీపంలా పరిణమించాయి. టెలికాం నగర్కీలకంగా ఉంది. ఔటర్ రింగురోడ్డుకు అతి సమీపంలోనే ఉన్న మణికొండ ప్రస్తుతం నగరంలోని టాప్రేగింగ్ ఉన్న పది ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. వాస్తవానికి హైదరాబాద్లో నివాసిత ప్రాంతాల మార్కెట్లు రానురాను పటి ష్టం అవుతున్నాయి. మణికొండ చెప్పుకోదగి నంతగా వాణిజ్యపరమైన వృద్ధిని సాధించింది. ఐటిహబ్గా ఉన్న హెటెక్సిటీ, నానక్రామ్ గూడ, గచ్చిబౌలి, రహేజా ఐటిపార్కు వంటి వాటికి సమీపంలోనే ఉండటంతో మణికొండ అత్యంత అందుబాటులోని నివాసిత ప్రాంతంలో ఐటి వృత్తినిపుణులు ప్రాధాన్యతనిస్తున్నారు. ఔటర్రింగురోడ్డు, ఇందిరాగాంధీ ఫ్లైఓవర్కు కేవలం మూడుకిలో మీటర్ల దూరంలోనే ఉంది. ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లకు సులువుగాచేరుకోవచ్చు. పాఠశాలలు, కళాశాల లు, బ్యాంకులు, సూపర్మార్కెట్లు, ఆసుపత్రులు, విదనోరంగాలపరంగా మణికొండ మరింతగా వృద్దిని సాధిస్తోంది. మల్టీబిలియన్ డాలర్ల ల్యాంకోహిల్స్ ప్రాజెక్టు, చిత్రపురికాలనీ వంటివి ఇక్కడ కీలకం. హైటెక్సిటీ, గచ్చిబౌలితో పోలిస్తే ఈ రెండు ప్రాజెక్టులు మరింత ఊతం ఇస్తున్నాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీల్లో సింగిల్బెడ్రూమ్ ప్రాజెక్టులు అతి తక్కువగా ఉన్నాయి. 2బిహెచ్కె, 3బిహెచ్కెయూనిట్ల ధరలు 35 లక్షలనుంచి మూడుకోట్లకుపైబడి ఉన్నాయి. అందువల్లనే మణికొండప్రాంతానికి కొనుగోలుదారులు దృష్టిసారిస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్, 2బెడ్రూం, 3బెడ్రూం ప్రాజెక్టులు 20 లక్షల నుంచి ఒక కోటి రూపాయలకుపైబడి ఉన్నట్లు జోన్స్లాంగ్ లాసెల్టీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్ వెల్లడించారు. ఐటి ప్రాజెక్టులకు అతిచేరువలో ఉన్నందుననే మణికొండకుప్రాధాన్యం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
జనవరి 10న అఖిల్ సర్ప్రైజ్ ఇస్తాడు!
‘హలో’తో ఉత్సాహాన్ని ఇచ్చే విజయాన్ని అందుకుని.. రీలాంచ్ అయ్యాడు అనిపించుకుంటున్న అక్కినేని అఖిల్
TNN | Updated:
Dec 30, 2017, 02:43PM IST
తొలి సినిమాతో డిజాస్టర్ ను ఎదుర్కొని ‘హలో’తో ఉత్సాహాన్ని ఇచ్చే విజయాన్ని అందుకుని.. రీలాంచ్ అయ్యాడు అనిపించుకుంటున్న అక్కినేని అఖిల్ తన తదుపరి సినిమాకు సిద్ధం అవుతున్నాడు. తను చేయబోయే మూడో సినిమా ఏది, దాని దర్శకుడు ఎవరు..? అనే అంశంపై అతిత్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు జనవరి పదిని అందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నాడు ఈ కుర్ర హీరో. జనవరి పదో తేదీన తన తదుపరి సినిమాను ప్రకటించబోతున్నట్టుగా స్వయంగా అఖిల్ చెప్పాడు.
అయితే అందుకు సంబంధించిన క్లూ కూడా ఏమీ ఇవ్వలేదు. సాధారణంగా ఒక సినిమా చేసిన హీరో మరో సినిమాకు కొంత గ్యాప్ తీసుకోవడం మామూలే. అఖిల్ మాత్రం అలాంటి గ్యాప్ ఏదీ లేకుండానే.. తదుపరి సినిమా గురించి అనౌన్స్ చేయబోతున్నాడు. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఛాంపియన్షిప్లో కిదాంబి శ్రీకాంత్ బోణి..!
మ్యాచ్ ఆరంభంలోనే 6-1తో దూసుకెళ్లిన శ్రీకాంత్ ఎక్కడా.. ప్రత్యర్థిని దరిచేరనీయలేదు. తనదైన శైలిలో
TNN | Updated:
Aug 21, 2017, 09:32PM IST
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ బోణి కొట్టాడు. టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే రష్యా క్రీడాకారుడు సెర్గీ సిరాంత్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించి ఘన విజయాన్ని అందుకున్నాడు. కేవలం 28 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-13, 21-12 తేడాతో వరుస సెట్లలో అలవోకగా గెలుపొందాడు.
మ్యాచ్ ఆరంభంలోనే 6-1తో దూసుకెళ్లిన శ్రీకాంత్ ఎక్కడా.. ప్రత్యర్థిని దరిచేరనీయలేదు. తనదైన శైలిలో దూకుడు కొనసాగించి నిమిషాల వ్యవధిలోనే ఆధిక్యం 11-6, 15-7కి పెంచుకుని 21-13‌తో తొలిసెట్‌ని కైవసం చేసుకున్నాడు. అనంతరం రెండో సెట్‌లో తొలుత 2-2తో సెర్గీ పోటీనిచ్చినా.. అతని బలహీనతలను సొమ్ము చేసుకున్న శ్రీకాంత్ 9-2తో ఆధిక్యం సాధించి చివరికి 21-12తో ముగించేశాడు. ఇటీవల వరుసగా రెండు సూపర్ సిరీస్‌ టైటిళ్లు గెలిచి కిదాంబి అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ind vs Aus: కంగారూలకి కొరకరాని కొయ్యగా మారిన చతేశ్వర్ పుజారా..!
తొలి సెషన్ రెండో ఓవర్లోనే కేఎల్ రాహుల్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా సహనంతో క్రీజులో నిలిచి ఆ తర్వాత 32 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా టీమ్కి మరో వికెట్ ఇవ్వలేదు.
Samayam Telugu | Updated:
Jan 3, 2019, 11:56AM IST
Ind vs Aus: కంగారూలకి కొరకరాని కొయ్యగా మారిన చతేశ్వర్ పుజారా..!
ఆస్ట్రేలియా గడ్డపై భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా పరుగుల వరద పారిస్తున్నాడు. సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్లో కేవలం 199 బంతుల్లోనే 13x4 సాయంతో చతేశ్వర్ పుజారా శతకం బాదేశాడు. టెస్టు కెరీర్లో పుజారాకి ఇది 18వ శతకం కాగా.. ఈ సిరీస్లో మూడోది కావడం విశేషం. అడిలైడ్ టెస్టు, మెల్బోర్న్ టెస్టులోనూ పుజారా సెంచరీ సాధించగా.. ఆ రెండు టెస్టులోనూ భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. సిరీస్లో ఇప్పటికే 1,000 బంతులు ఎదుర్కొన్న పుజారా.. కంగారూలకి కొరకరాని కొయ్యగా మారిపోయాడు..!
"This man just bats and bats and bats!" A third century this series and 18th in Tests. What a player @cheteshwar1… https://t.co/RpL1vPRCEh
— Telegraph Sport (@telegraph_sport) 1546495312000 | 2sports
|
బ్యాంకుల సమ్మెతో.. జీతం అందేనా!
- నేటి నుంచి బ్యాంక్ ఉద్యోగుల రెండ్రోజుల సమ్మె
- దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది సమ్మెబాట
- ఒకటో తేదీ తిరిగి తెరుచుకోనున్న బ్యాంక్లు
- సమ్మె పరిష్కారానికి చొరవచూపని సర్కారు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంకు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ నేటి (బుధవారం) నుంచి 48 గంటల సమ్మెకు దిగుతున్నారు. ఈ సమ్మెలో తొమ్మిది బ్యాంకు సంఘాలకు చెందిన ఉద్యోగులు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఆధ్వర్యంలో ఉమ్మడిగా సమ్మెలో పాల్గొననున్నారు. ప్రభుత్వ బ్యాంకులతో సహా ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకుల ఉద్యోగులు కూడా 30, 31 తేదీల్లో జరుగనున్న సమ్మెలో పాల్గొననున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ సమ్మెలో దేశంలోని 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల సమ్మె బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే నిరర్థక ఆస్తులు పెరిగిపోయి నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న బ్యాంకులకు తాజా సమ్మె మరో భారంగానే మారనుంది. బ్యాంకింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకింగ్ లావాదేవీలు ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఆన్లైన్ వ్యవహరాలు కూడా అనుకున్న స్థాయిలో జరిగే అవకాశాలు లేవని ఉద్యోగులు చెబుతున్నారు.
వేతన జీవులకు కష్టమే..
బ్యాంకు ఉద్యోగులు నెలాఖరున సమ్మె చేపట్టడంతో వేతన జీవులకు ఒకటో తేదీన జీతం అందడం కష్టంగానే కనిపిస్తోంది. చాలా కంపెనీలు, సంస్థలు ప్రతీ నెల ఒకటో తేదీకి ఒకట్రెండు రోజుల ముందు నుంచే వేతనాలకు సంబంధించిన లెక్కలను, జాబితాలును బ్యాంకులకు అందజేస్తాయి. వాటిని అక్కడి ఉద్యోగులు ప్రాసెస్ చేసి నెల ఆఖరి రోజు రాత్రి గానీ.. లేదా ఒకటో తేదీ ఉదయం గానీ ఆయా ఉద్యోగుల ఆకౌంట్లలోకి నగదును ట్రన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు తాజాగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె కారణంగా ఒకటో తేదీకి ముందు జరగాల్సిన బ్యాంక్ తంతు అంతా నిలిచిపోనుంది. ఫలితంగా ఒకటిన జీతాలు అందడం కష్టమేనని బ్యాంకు అధికారులతో పాటు యాజమాన్యాలు చెబుతున్నాయి. నెలాఖరున రెండు రోజులు సమ్మె రావడంతో బ్యాంకులు తిరిగి శుక్రవారం తెరుచుకోనున్నాయి. సమ్మె కారణంగా నిలిచిపోయిన లక్షలాది లావాదేవీలన్నింటిని శుక్రవారం ఒకేసారి క్లియర్ చేయడం సాధ్యపడదు. దీంతో ఈ నెల జీతం రెండు మూడు రోజులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోందని ఆధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటో తేదీన ఉన్న కమిట్మెంట్లను పూర్తి చేసేందుకు గాను వేతన జీవులు ప్రత్యామ్నాయాల వేటను ప్రారంభించారు. కొన్ని యాజమాన్యాలు సమ్మె నేపథ్యంలో 29నే జీతాలను బ్యాంకుల్లో వేసినా వాటిని.. ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే వీలు లేకుండా బ్యాంకుల బంద్ దెబ్బకొట్టనుంది. ఈ బంద్లో ఏటీఎం గార్డులు కూడా పాలుపంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏటీఎంలు మూతప డబోతున్నాయి. దీంతో వేతన విత్డ్రాయల్స్ కష్టతరంగా మారనుందని రిపోర్టులు పేర్కొన్నాయి. థర్డ్ పార్టీతో కలిసి బ్యాంకులు ఏటీఎంలను నింపినప్పటికీ, పెద్ద ఏటీఎంల వద్ద సెక్యురిటీ మాత్రం ప్రశ్నార్థకమే. దీంతో నగదు విత్డ్రాయల్స్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బంద్ నేపథ్యంలో కస్టమర్లు భారీ ఎత్తున్న నగదు విత్డ్రా చేసే అవకాశం ఉంది. దీంతో బుధ, గురువారాల్లో నగదు కొరత కూడా ఏర్పడూ అవకాశం ఉంది.
ఇది పూర్తిగా సర్కారు వైఫల్యమే..
బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టడం వెనుక సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. 2017 నవంబరు నుంచి బ్యాంకు ఉద్యోగుల వేతనాల సవరణ అంశం పెండింగ్లో ఉంది. దీనిపై న్యాయమైన పరిష్కారం కోరుతూ ఉద్యోగ సంఘాల వారు ఇప్పటి వరకు 12 దఫాలుగా చర్చలు జరిపినా.. వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయింది. కేవలం 2 శాతం వేతన పెంపును మాత్రమే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆఫర్ చేయడాన్ని ఉద్యోగులు నిరసిస్తున్నారు. దీనిని కూడా కొన్ని వర్గాల ఉద్యోగులకే వర్తింపజేస్తామంటూ భేరమాడుతున్నాయి. ప్రతిపాదించిన 2 శాతం వేతన పెంపు ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.'' అని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ జనరల్ సెక్రటరీ డి.టి.ప్రాంకో తెలిపారు. ఎన్పీఏలతో బ్యాంకు ఉద్యోగుల జీతాలకు ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. అసలే ఎన్పీఏలతో కునారిల్లుతున్న బ్యాంకింగ్లో సమ్మె రాకుండా ముందే తగిన చర్యలు చేపట్టే విషయంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. ఈ కారణంగానే ఉద్యోగులు చేసేది సమ్మె బాట పట్టడం శోచనీయం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
జహీర్.. నీకిదే చివరి అవకాశం: సెహ్వాగ్
భారత్ తరఫున వరుసగా మూడు ప్రపంచకప్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు నెలకొల్పిన జహీర్ ఖాన్కి
TNN | Updated:
Oct 7, 2017, 12:33PM IST
భారత్ తరఫున వరుసగా మూడు ప్రపంచకప్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు నెలకొల్పిన జహీర్ ఖాన్కి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో శనివారం బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇటీవల సినీనటి సాగరికతో నిశ్చితార్థం చేసుకున్న జహీర్ ఈ రోజు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్ తనదైలిలో విషెస్ చెప్పి నవ్వులు పూయించాడు. ‘భారత్ తరఫున తెలివైన, గొప్ప బౌలర్కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. జహీర్ నీకిదే చివరి బ్యాచిలర్ బర్త్ డే’ అంటూ ట్వీట్ చేశాడు.
అక్టోబరు 3, 2000లో కెన్యాపై క్రికెట్లోకి అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్ అనతికాలంలోనే జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. పదునైన పేస్ బౌలింగ్తో మ్యాచ్ ఆరంభంలోనే ప్రత్యర్థి ఓపెనర్లని ఉక్కిరిబిక్కిరి చేయడమేకాక.. జట్టులోని సహచర బౌలర్లకి సైతం సూచనలిస్తూ మార్గదర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రెండేళ్ల క్రితం అనూహ్యంగా క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన జహీర్.. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున మాత్రమే క్రికెట్ ఆడుతున్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో 200 వన్డేలాడిన జహీర్ 282 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా నిలిచాడు. 2003, 2007, 2011 ప్రపంచకప్లో భారత్ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా జహీర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. | 2sports
|
Nov 18,2016
ఫార్చ్యూన్ 50లో ఆదిత్య పూరికి చోటు
ముంబయి: ప్రపంచంలోని మేటి వ్యాపార వ్యక్తుల (బిజినెస్ పర్సన్స్) జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరికి స్థానం దక్కింది. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ మ్యాగజైన్ 2016 సంవత్సరానికి గాను 50 మంది బిజినెస్ పర్సన్స్ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆదిత్య పూరి 36వ స్థానంలో నిలిచారు. దేశంలో రెండో అతిపెద్ద ప్రయివేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీకి 1994 నుంచి ఆదిత్య పూరి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. పూరీ నేతృత్వంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు గత ఏడాది దాదాపు 1.9 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించినట్లుగా పత్రిక తెలిపింది. ఈ జాబితాలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకన్బర్గ్ తొలిస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల అయిదో స్థానంలో నిలిచారు. ఏవో స్మిత్స్ సంస్థకు చెందిన అజిత్ రాజేంద్ర, మాస్టర్ కార్డ్స్కు చెందిన అజరు భంగా 40వ స్థానాన్ని దక్కించుకున్నారు. 66 సంవత్సరాల పూరీ దేశంలోనే అత్యధికంగా జీతం పొందుతున్న బ్యాంకర్గా ఇప్పటికే రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
2017: క్రికెట్లో గుర్తుండిపోయే జ్ఞాపకాలు
కోహ్లి రికార్డుల ధమాకా, స్మిత్ బ్రెయిన్ ఫేడ్ మూమెంట్, లంకపై రోహిత్ విధ్వంసం.. ఇలా ఎన్నో ఘట్టాలకు 2017 వేదికైంది.
TNN | Updated:
Dec 28, 2017, 04:45PM IST
క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది చిరస్మరణీయ అనుభూతుల్ని మిగిల్చింది. భారత జట్టు తిరుగులేని విజయాలతో ఈ ఏడాదిని ముగించింది. డీఆర్ఎస్ కోసం డ్రెస్సింగ్ రూం వైపు చూసిన స్టీవ్ స్మిత్ తర్వాత బ్రెయిన్ ఫేడ్ అయిందని తప్పించుకోవాలని చూడడం.. భారత్‌పై విజయంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడం, రోహిత్ డబుల్ సెంచరీ.. ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఈ ఏడాది సొంతం. ఆసక్తికర విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
'RX 100' డైరెక్టర్ నితిన్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తాడో..?
Highlights
కొత్త టాలెంట్ ను గుర్తుపట్టి ముందుగానే లాక్ చేసే నితిన్.. అజయ్ భూపతి విషయంలో కూడా అదే చేసినట్లు సమాచారం. ఈ మేరకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మీడియాకు హింట్ లు కూడా ఇచ్చాడు
గతవారంలో విడుదలైన 'RX 100' సినిమా ఊహించని విధంగా ఘన విజయం సాధించింది. ఇప్పటికి రూ.10 కోట్ల షేర్ వసూలు చేసి నిర్మాతలకు లాభాలను మిగిల్చింది. ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతికి కూడా దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా చేసి ఇలాంటి లాభాలను చూపించడంతో ఇప్పుడు నిర్మాతలు, హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలో నిర్మాత స్రవంతి కిషోర్ హీరో రామ్ కోసం అజయ్ కు అడ్వాన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సురేష్ బాబు కూడా మూడు సినిమాల కోసం డీల్ కుదుర్చుకునేలా ప్లాన్ చేశాడు. కానీ అజయ్ భూపతి మాత్రం మరో యంగ్ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నాడు. అతడే నితిన్. కొత్త టాలెంట్ ను గుర్తుపట్టి ముందుగానే లాక్ చేసే నితిన్.. అజయ్ భూపతి విషయంలో కూడా అదే చేసినట్లు సమాచారం.
ఈ మేరకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మీడియాకు హింట్ లు కూడా ఇచ్చాడు. ప్రస్తుతం నితిన్ 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత 'ఛలో' మూవీ డైరెక్టర్ వెంకీ కుడుములుతో సినిమా చేయనున్నాడు. ఆ తరువాతే అజయ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని అజయ్ భూపతి.. నితిన్ సినిమా వర్క్ మొదలుపెట్టనున్నాడు.
Last Updated 18, Jul 2018, 12:14 PM IST | 0business
|
వస్తు సేవల పన్ను బిల్లుకు జేడీయు అనుకూలం : నితీశ్ కుమార్
pnr| Last Updated: గురువారం, 10 డిశెంబరు 2015 (16:53 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు తమ పార్టీ అనుకూలమని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు కీలక నేత నితీశ్ కుమార్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ.... జీఎస్టీ బిల్లును తాము వ్యతిరేకించడం లేదని స్పష్టంచేశారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ఖచ్చితంగా తమ పార్టీ సభ్యులు మద్దతిస్తారని తెలిపారు.
ఇదిలావుండగా, గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కలిశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన నితీశ్... పార్లమెంట్ భవన్కు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడే మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. బీహార్ అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
Read More: భారత్లో బాల్ టాంపరింగ్.. అడ్డంగా దొరికిన క్రికెటర్ (వీడియో)
బంగ్లాదేశ్తో నాగ్పూర్ వేదికగా ఆదివారం ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్లో 3.2 ఓవర్లు వేసిన దీపక్ చాహర్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ వికెట్లు కూడా పడగొట్టిన చాహర్.. టీమిండియా నమ్మదగిన బౌలర్గా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్లో స్లాగ్ ఓవర్లకి ముందు దీపక్ చాహర్తో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. జస్ప్రీత్ బుమ్రా తరహాలో నిన్ను డెత్ ఓవర్లలో వినియోగించుకోబోతున్నానని చెప్పాడట. ఇదే విషయాన్ని ఈ ఫాస్ట్ బౌలర్ తాజాగా వెల్లడించాడు.
Read More: దీపక్ చాహర్ హ్యాట్రిక్పై తప్పులో కాలేసిన బీసీసీఐ
‘మ్యాచ్లో నిన్ను జస్ప్రీత్ బుమ్రాలా కీలకమైన ఓవర్లలో బౌలింగ్ చేయించబోతున్నా అని రోహిత్ శర్మ చెప్పాడు. అలానే వికెట్ అవసరమైన సమయంలోనూ బౌలింగ్కి దింపుతానని చెప్పాడు. టీమ్ ఒత్తిడిలో ఉన్న టైమ్లో నాకు అలా బాధ్యతలు అప్పగించడాన్ని నేను ఆస్వాదించా. కెప్టెన్ అలా నాపై నమ్మకం ఉంచడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఒకవేళ టీమ్ కెప్టెన్ నన్ను విశ్వసించకపోతే..? అప్పుడు కచ్చితంగా బాధపడతా. రోహిత్ మ్యాచ్ కీలక సమయంలో నా చేతికి బంతినిచ్చి నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాడు’ అని దీపక్ చాహర్ వెల్లడించాడు.
Read More: రోహిత్ శర్మ చెత్త రికార్డ్.. లిస్ట్లో ధోనీ కూడా
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఆడుతున్న దీపక్ చాహర్.. నమ్మదగిన బౌలర్గా గుర్తింపు పొందాడు. ఎంతలా అంటే..? మ్యాచ్లో తాను వేసిన తొలి ఓవర్లో టీమ్కి వికెట్ అందించడాన్ని అతను గత కొంతకాలంగా అలవాటుగా మార్చుకున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పాస్పోర్ట్ కొత్త రూల్స్ జూన్ 1 నుంచే
2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
Samayam Telugu | Updated:
Jun 3, 2018, 05:12PM IST
2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. జూన్ 2018 నుంచి కొత్త పాస్ పోర్ట్ రూల్స్ అమలులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.
విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే వారికి పాస్ పోర్ట్ అవసరం. అలాంటి సమయంలో హఠాత్తుగా పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేస్తే హడావిడి ఉంటుంది. అలాంటి సమయంలో పోలీసులు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు అడపాదడపా డబ్బు డిమాండ్ చేస్తున్నారనన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఎన్నో వినతుల అనంతరం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనలను సవరించింది.
పాస్పోర్ట్ కొత్త రూల్స్ | 1entertainment
|
kohli11
అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇండి యన్ ప్రీమియర్ లీగ్లో ఆకర్షణీయమైన జట్టులో ఒకటి.కోహ్లీ సారథ్యంలోని ఈ జట్టు ఒక్కసారి టైటిల్ గెలువకపోయినా అతడంటే అభిమానులకు చెప్పలేని అభిమానం.ఐపిఎల్-10లో బెంగళూరు పేలవ ప్రదర్శనతో పాటు కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవ డంతోపాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి మొదటి స్థానం అలంక రించింది.
అయితే కోహ్లీ మైదానంలో సత్తా చాటకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అతడే టాప్.సోషల్ మీడియా వెబ్సైట్ ట్విటర్ సర్వే నిర్వహించి ఒక జాబితానువిడుదల చేసింది.పదవ సీజన్లో అభిమానులు ఏ ఆటగాళ్ల పేర్లు ఎక్కువగా విని యోగించారో లెక్కించి ఐపిఎల్-ఎలెవన్ జట్టును ప్రకటించింది.భారత స్టార్ క్రికెటర్లు చోటు దక్కిం చుకున్న ఈ జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.పుణే తరుపున అద్భుత ప్రదర్శన చేసిన విదేశీ ఆటగాడు బెన్ స్టోక్స్ ఒక్కడే జట్టులోకి ఎంపికయ్యాడు. కోహ్లీ తరువాత కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్, ముంబయి సారథి రోహిత్ శర్మ, అజింక్యా రహానే, సురేశ్రైనా, యువరాజ్, బెన్స్టోక్స్, ధోని, హర్భజన్, ఉమేశ్ యాదవ్, జహీర్ఖాన్ ఈ జాబితాలో ఉన్నారు. | 2sports
|
- ఆర్బీఐ పరపతి విధాన సమీక్షపై
విశ్లేషకుల మాట
- ఆశగా మదుపరులు, పారిశ్రామిక వర్గాలు..
- అలాంటివి తక్కువేనంటున్న దిగ్గజ బ్యాంకులు
న్యూఢిల్లీ: ఆర్థిక రంగంలో మందగమన ఛాయలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గించేలా పలు చర్యలు ఉంటాయని మదుపరులు, మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ విషయమై ఆర్థిక రంగ విశ్లేషకులు మాత్రం ద్వంద్వ వాదనలను వినిపిస్తున్నారు. వడ్డీరేట్లు తగ్గించేలా పరిస్థితుల ఒత్తిడి ఆర్బీఐపై ఉన్నందున వడ్డీ రేట్ల కోత తప్పక ఉంటుందని కొన్ని వర్గాలు చెబుతుండగా. మరికొందరు మాత్రం రిటైల్ ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున కేంద్ర బ్యాంకు అటువంటి చర్యలను చేపడుతుందన్న ఆశలు లేవన్న వాదన వినిపిస్తున్నారు. ఎక్కువ మంది బ్యాంకర్లు, విశ్లేషకులు మాత్రం కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ మంగళవారం జరిపే పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే ఆవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. కాగా భారత పారిశ్రామిక వర్గాలు మాత్రం టోకు ధరల ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, పారిశ్రామిక ప్రగతి పడకేయడం తదితర కారణాల వల్ల తాజా సమీక్షలో ఆర్బీఐ తప్పక వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంటుందన్న వాదనను వినిపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా వృద్ధికి ఊతం ఇచ్చేలా ఆర్బీఐ కొంత వడ్డీరేట్లను తగ్గించాలనే కోరకుంటోంది. గత జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయిని తాకి 5.4 వద్ద నిలిచింది. కాగా, అదే నెలలో డబ్ల్యూపీఐ మాత్రం -2.4 శాతంగా నిలిచింది. వడ్డీ రేట్లలో నిర్ణయానికి గాను బ్యాంక్ సీపీఐని ప్రామాణికంగా తీసుకుంటుంది. కాగా, ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించేందుకు ఆవకాశం ఉందని ఆయితే అనిశ్చితి నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ ఆ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడలని కొందరు బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. గత జూన్లో నిర్వహించిన పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ రెపోరేట్ను వరుసగా మూడోసారి 0.25 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే.
కోతలుండకపోవచ్చు..
'ఆర్బీఐ తాజా పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను తగ్గిస్తుందని నేను భావించడం లేదు.. టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ప్రతికూలంగా ఉంది. ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) మాత్రం కొంత పైకి ఎగిసింది. సీపీఐని ఆర్బీఐ ప్రామాణికంగా తీసుకుంటున్నందున వడ్డీ రేట్లలో కోతలు ఉండకపోవచ్చు.
- అరుంధతీ భట్టాచార్య. భారతీయ స్టేట్ బ్యాంక్, ఛైర్మన్
'యథాతథ స్థితియే..'
'ఆర్బీఐ యథాతథ పరిస్థితినే కొన సాగించవచ్చు. గత సమీక్షతో పోలిస్తే మంగ ళవారం నిర్వహించనున్న సమీక్షలో పెద్దగా మార్పులు ఏమి ఉండవనిపిస్తోంది. దేశంలో రుతుపవనాల కదలికలను, వర్షాభావ పరిస్థితులను ఆర్బీఐ దగ్గరగా గమననిస్తోంది.దేశంలో బాగా వర్షాలు కురిసినట్లు గానీ.. వర్షాభావం నెలకొన్న ట్లుగానీ సూచనలు కనిపించడం లేదు.
- రంజన్ ధావన్, సీఈఓ, ఎండీ, బ్యాంక్ ఆఫ్ బరోడా
ఊహించి చెప్పడం కష్టమే..
'భారతీయ రిజ ర్వు బ్యాంక్ ఎలాం టి నిర్ణయం తీసుకు ంటుందన్నది ఊహిం చడం కష్టమే. అయితే వడ్డీరేట్లు మాత్రం అధోముఖ ధోరణి లోనే ఉన్నాయి. ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో 25-50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నాము.'
పరేష్ సక్తాంకర్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్డీఎఫ్సీ.
ముందుగానే ప్రకటిస్తే వృద్ధికి దన్ను..
'ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ వడ్డీరేట్లను 0.25-0.50 శాతం మేర తగ్గిస్తుందన్న మేము భావిస్తున్నము. తగ్గింపు అనివార్యమైనపుడు దానిని ముందుగానే ప్రకటిస్తే అది పరిశ్రమ వర్గాలకు, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తుంది'. దేశంలో రుతుపవనాల విస్తృతి ఇప్పటి వరకు బాగానే ఉంది. వ్యవసాయంపై ఇప్పటి వరకు పెద్దగా ప్రతికూల ప్రభావమైతే లేదు ఈ పరిస్థితులలో పెట్టుబడులకు ఆకర్షణీయంగా వడ్డీరేట్లను ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -నైనాలాల్ కిద్వారు, కంట్రీ హెడ్, హెచ్ఎస్బీసీ.
0.25% తగ్గించే అవకాశం ఉంది..
మంగళవారం నాటి సమీక్షలో ఆర్బీఐ కనీస వడ్డీరేటు ఆర్బీఐ 0.25 శాతం మేర తగ్గించే అవకాశం ఉంది. దేశంలో సగటు వర్షపాతం నేపథ్యంలో వస్తు ధరలు తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బ ణం నియంత్రణలోనే ఉండేలా అగుపిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. - మూడీస్, అంతర్జాతీయ పరిశోధన సంస్థ.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
'సర్ధార్ గబ్బర్సింగ్' లేటెస్ట్ అప్డేట్స్
గబ్బర్సింగ్ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతున్న సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ లేటెస్ట్ షెడ్యూల్ ముగిసింది.
| Updated:
Feb 15, 2016, 08:49PM IST
'సర్ధార్ గబ్బర్సింగ్' లేటెస్ట్ అప్డేట్స్
గబ్బర్సింగ్ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతున్న సర్ధార్ గబ్బర్సింగ్ మూవీ షూటింగ్ లేటెస్ట్ షెడ్యూల్ ముగిసింది. ఫిబ్రవరి 12న రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైన మూడు రోజుల షెడ్యూల్ సోమవారంతో ముగిసింది. దర్శకుడు బాబీ పవన్కి రౌడీ మూకలకి మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కించాడని సమాచారం. రతన్పూర్ అనే గ్రామం బ్యాగ్రౌండ్లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ఈ షూటింగ్ పూర్తి చేశారు. దీంతో 60 శాతం సినిమా షూటింగ్ పూర్తయినట్టుగా మూవీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 8న రిలీజ్ చేసే యోచనలో వున్న మేకర్స్.. అందుకు తగిన విధంగా షూటింగ్, టాకీ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ముందుకు సాగిపోతున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
టీసీఎస్ షేర్లను అమ్మేసిన టాటా సన్స్
కార్పొరేట్ రంగంలో ఎప్పుడు ఏమి జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. టెలికాం, ఉక్కు రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలు భారీ అప్పులతో సతమతమవుతున్నాయి. ఒకప్పుడు దేశీయ దిగ్గజాలుగా వెలిగిన కంపెనీలకు సైతం అప్పుల బాధలు తప్పడం లేదు. టాటా కంపెనీ భారీ అప్పులు తీర్చేందుకు ఏకంగా టీసీఎస్ షేర్లను అమ్మాలనుకునే యోచన చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
TNN & Agencies | Updated:
Mar 15, 2018, 04:17PM IST
నెత్తి మీద బండలా మారిన అప్పులను తీర్చుకునేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లను టాటా సన్స్ అమ్మేసింది. గుదిబండలా మారిన అప్పులను తీర్చడం కోసం, ఆటో, స్టీల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం రూ.8,127 కోట్ల సమీకరణే లక్ష్యంగా సోమవారం.. టీసీఎస్‌లోని 1.48 శాతం షేర్లను టాటా సన్స్ గ్రూప్ విక్రయించింది. ఎన్ఎస్ఈలో సోమవారం సాయంత్రం బ్లాక్ ట్రేడ్ ద్వారా ఆ షేర్లను అమ్మింది టాటా సన్స్. స్టాక్ ముగింపు ధర అయిన రూ.3,052.15పై 4.17 శాతం నుంచి 5.9 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చి మరీ ఆ షేర్లను టాటా సన్స్ అమ్మకానికి పెట్టింది. జపాన్ టెలికాం దిగ్గజమైన డొకొమోతో 2013లో విడిపోయిన తర్వాత.. సంస్థకు టాటా సన్స్ 127 కోట్ల డాలర్లను చెల్లించింది. ఇక, అంతేగాకుండా టాటా టెలీ సర్వీసెస్ వల్ల మూటగట్టుకున్న రూ.35 వేల కోట్ల అప్పులనూ తిరిగి చెల్లించేందుకు టాటా సన్స్ అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే టాటా టెలీ సర్వీసెస్‌ను ఎయిర్‌టెల్‌లో కలిపేసే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఇక, దాంతో పాటు దివాళా తీసిన భూషణ్ స్టీల్, భూషణ్ స్టీల్ అండ్ పవర్‌లను చేజిక్కించుకోవాలనుకుంటున్న టాటా స్టీల్‌కు ఆర్థిక చేయూతనిచ్చేందుకూ టాటా సన్స్ ఒప్పందం చేసుకుంది. ఆ రెండు కంపెనీలను చేజిక్కించుకునేందుకు ఆ సంస్థల పేరిట ఉన్న రూ.60 వేల కోట్ల అప్పులను కట్టేందుకూ సిద్ధమైంది టాటా స్టీల్. తద్వారా ఆ కంపెనీలను హస్తగతం చేసుకోవడంలో భాగంగా అత్యధిక బిడ్ వేసిన కంపెనీగా టాటా స్టీల్ నిలిచింది. | 1entertainment
|
internet vaartha 179 Views
న్యూఢిల్లీ : వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయా న్నందించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.కోహ్లీ విన్నింగ్ ఇన్నింగ్స్తో టీమిండియా సెమీస్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.కాగా 1983 ప్రపంచ కప్ను అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్దేవ్,కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా భారత్ టార్గెట్ చేధన ప్రతి ఒక్కరినీ తీవ్ర ఉత్కంఠకు గురిచేసందని తెలిపారు.ఇది కోహ్లీకి టీం ఇండియాకు మరిచిపోలేని రాత్రిగా అబివర్ణించా రాయన. ఆస్ట్రేలియా తీవ్రంగా పోరాడినా భారత్ విజేతగా నిలిచిందన్నారు.ఆస్ట్రేలియన్ల దాటికి ప్రారంభంలో భారత్ కొంత తడబాటుకు గురైనా,తిరిగి గాడిలో పడటంతో విజయతీరాలకు చేరిందని పేర్కొన్నాడు.జట్టులో యువరక్తం, అనుభవజ్ఞులైన మేలు కలియికక కోహ్లీ ఇన్నింగ్స్ తోడై భారత్ను విజయం వైపు నడిపించిందని వివరించాడు.
ప్రారంభంలో ఒత్తిడికి గురైన కోహ్లీ తరువాత భారత్ ఇన్నింగ్స్లో కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నాడు.జట్టు అవసరాలు కోహ్లీకి బాగా తెలుసునని,అందుకే స్పష్టమైన అవగాహణతో బ్యాటింగ్కు దిగి చెలరేగిపోతున్నాడని,అతని మానసిక దృడత్వానికి నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటానని,ఎంత ఒత్తిడినైనా ఎదుర్కొని పోరాడే అతని ఆత్మ విశ్వాసం చాలా గొప్పదన్నాడు.ఆస్ట్రేలియా పోరాటంలో పదును తగ్గిందని, మరో పక్క కోహ్లీ,ధోనీ అలవోకగా పరుగులు చేస్తుండటంతో పరిస్థితి భారత్కు అనుకూలంగా మారిందన్నాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు నిస్సందేహంగా విజయం భారత్దే అనుకున్నానని కపిల్ దేవ్ వెల్లడించాడు.వీరు వికెట్ల మధ్య పరుగులు తీసే విధానం కూడా బాగుంటుందని ప్రశంసించాడు.మ్యాచ్ మొత్తంలో ఇదే రసవత్తరంగా కొనసాగిందన్నాడు. ఒకానొక దశలో తీవ్రమైన ఒత్తిడికి గురైన ఆస్ట్రేలియా ఫీల్డర్లు తడబాటుకు గురయ్యారని, భారత జట్టులో ఉన్న కోహ్లీ వంటి ఆటగాడు ఆస్ట్రేలియాకు లేడని,అదే పెద్ద తేడా అని పేర్కొన్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ అన్ని రకాల ప్రశంసలకు పూర్తిగా అర్హమైందనన్నాడు. ఎవరైనా ఇటువంటి ఇన్నింగ్స్ను మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారన్నాడు. ప్రత్యర్థులను ఆశ్చర్యపరుస్తూ ఈ టోర్నమెంట్లో ధోనీ తొలిసారి యువరాజ్ చేతికి బంతిని అందించాడు.తన వైవిద్యమైన బంతులతో బ్యాట్స్మెన్ను బొల్లా కొట్టించడంలో యువరాజ్ దిట్ట. తన తొలి బంతికే స్టీవెన్ స్మిత్కు పెవిలియన్కు పంపించాడు.దీంతో మ్యాచ్పై భారత్ పట్టు సాధించింది అని కపిల్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పించ్ వికెట్ కోల్పోవడం మ్యాచ్ను మలుపు తిప్పింది.దీంతో భారత్ ఊరిపి పీల్చుకుంది.ఫించ్ మొదట కొంత ఇబ్బంది పడినా తరువాత తన బ్యాట్ను ఝుళిపించాడు.మ్యాక్స్వెల్ పోరాడాలని ప్రయత్నించినా పిచ్పై బంతిని అంచనా వేయలేక నిలదొక్కుకోలేకపోయాడని విశ్లేషించాడు.కాగా ఈ మ్యాచ్లో కూడా ధోనీ బాగా ఆడాడని కొనియాడారు.ఈ సమయంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ బౌలర్లపై ఎదురుదాడి చేసినా భారత కెప్టెన్ చెక్కుచెదరలేదని,అతని అత్యుత్తమ బౌలర్లు కూడా ఎటువంటి ప్రభావం చూపని సమయంలో అమ్ములపొది నుంచి యువరాజ్ను బయటకు తీశాడన్నాడు. యువరాజ్ అనుభవం పై అతనికి ఉన్న నమ్మకమని పేర్కొన్నాడు.మొదటి అయిదు ఓవర్లలో మినహాయించి ఆశీష్ నెహ్రా కూడా ఆస్ట్రేలియన్లను కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడని, కానీ ఆస్ట్రేలియా ఒక మంచి ఇన్నింగ్స్ను ఆడిందని,యువరాజ్ ఇన్నింగ్స్ కూడా భారత్ విజయంలో కీలకమేనన్నాడు. అయితే మ్యాచ్ మొత్తంలో కోహ్లీ ప్రదర్శనే కనిపించిందని వివరించాడు.ఇందుకు కోహ్లీకి అభినందను తెలియజేసిన ఆయన ముంబై అతని ఆట కోసం ఎదురు చూస్తుందని కపిల్ పేర్కొన్నాడు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రియో ఒలింపిక్స్ విశేషాలు మీకోసం..
తొలిసారిగా దక్షిణ అమెరికా ఖండం ఈ వేడుకలకు ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రియో ఒలింపిక్స్ విశేషాలు..
TNN | Updated:
Jul 12, 2016, 01:02PM IST
ఆగష్టు 5న బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. తొలిసారిగా దక్షిణ అమెరికా ఖండం ఈ వేడుకలకు ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రియో ఒలింపిక్స్ విశేషాలు ..
- ఈ క్రీడల్లో 11 వేల మంది అథ్లెట్లు పాల్గొననున్నారట. వీరి కోసం 4.5 లక్షల కండోమ్స్ పంచిపెడుతున్నారట. అంటే ఒక్కొక్కరికి 41 చొప్పున అందజేస్తారట. ఈ చొప్పున ఒక్కో అథ్లెట్కు రోజుకు రెండు కండోమ్స్ చొప్పున వస్తాయి.
- అథ్లెట్లు, అధికారులు కలిసి 17 వేల మంది ఈ మెగా ఈవెంట్ కోసం తరలి రానున్నారు.
- ఒలింపిక్స్ ఆరంభ, ముగింపు వేడుకలు జరిగే మారకానా స్టేడియంలో 78 వేల మంది ప్రజలు ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించే వీలుంది.
- ఈ క్రీడల్లో 206 దేశాలు పాల్గొంటున్నాయి.
- ఒలింపిక్స్లో శరణార్థులు పాల్గొననుండటం ఇదే తొలిసారి.
- రియో ఒలింపిక్స్ కోసం 75 లక్షల టిక్కెట్లను అమ్మనున్నారు.
- ఈ గేమ్స్ కోసం 16 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో వ్యవస్థను విస్తరిస్తున్నారు.
- బర్రా ద టిజుకాలోని ఒలింపిక్ పార్కు, డియోడొరొ, కొపాకబనా బీచ్, మారకానా జోన్లలో ఒలింపిక్ వేడుకలు జరుగుతాయి.
- ఈ వేడుకలను వీక్షించేందుకు 5 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా.
- ఒలింపిక్ విలేజ్లో రోజుకు 60 వేల మంది కోసం ఆహారం సిద్ధం చేస్తారు. ఈ డైనింగ్ హాల్ 5 జంబో జెట్లు పట్టేంత పెద్దది.
- ఏడుగురు ఆటగాళ్లు ఆడే రగ్బీని తొలిసారిగా ఒలింపిక్స్లో చేర్చడం ఇదే తొలిసారి.
- ఈ ఒలింపిక్ క్రీడల మస్కట్ వినిసియస్ కాగా, టామ్ అనేది పారా ఒలింపిక్ మస్కట్.
- ఈ వేడుకల కోసం బ్రెజిల్ దాదాపు 100 మిలియన్ డాలర్లను ఖర్చు పెడుతోంది. | 2sports
|
వారు విదేశాల్లో తలదాచుకోలేరు
- ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ : భారత్లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకునేవారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా కొత్త చట్టాన్ని తీసుకు రావాలా లేక ఉన్న చట్టాలనే సవరించాలా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి విదేశాల్లో తలదాచుకొనే అవకాశం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు సాధ్యమైనన్ని దేశాలతో పరస్పర సహకార ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టుగా తెలిపారు. బ్యాంకులకు భారీగా రుణాలు ఎగ్గొటి లండన్ పారిపోయిన కింగ్ఫిషర్ చీఫ్ విజరు మాల్యానుభారత్కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు జైట్లీ వివరించారు. ఇటీవల లండన్లో పర్యటించినప్పుడు అక్కడి ప్రభుత్వ అధికారులతోనూ ఈ విషయమై చర్చలు జరిపామన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
Jasprit Bumrah: బుమ్రా ఎగతాళితో బౌలింగ్ వదిలేసిన కోహ్లీ
విరాట్ కోహ్లీ 2017 వరకూ అప్పుడప్పుడు మ్యాచ్ల్లో బౌలింగ్ చేసేవాడు. 2016 టీ20 ప్రపంచకప్లో అప్పటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఏకంగా అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ని పక్కనపెట్టి మరీ ఓ మ్యాచ్లో కోహ్లీతో బౌలింగ్ చేయించాడు.
Samayam Telugu | Updated:
Jun 3, 2019, 02:28PM IST
హైలైట్స్
రెండేళ్లుగా బౌలింగ్కి దూరంగా ఉంటున్న విరాట్ కోహ్లీ
2016 టీ20 ప్రపంచకప్లో అశ్విన్ని పక్కన పెట్టి మరీ కోహ్లీతో బౌలింగ్ చేయించిన ధోని
2017లో కోహ్లీ బౌలింగ్పై కామెంట్ చేసిన జస్ప్రీత్ బుమ్రా
వెన్నునొప్పి గాయం వేధించడంతో బౌలింగ్కి మరింత దూరం
తాజాగా వన్డే ప్రపంచకప్ కోసం కోహ్లీ మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్కప్ 2019లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తనలోని బౌలర్ని మరోసారి క్రికెట్ ప్రపంచానికి గుర్తుచేసేలా కనిపిస్తున్నాడు. రెండేళ్లుగా బౌలింగ్కి దూరంగా ఉంటున్న విరాట్ కోహ్లీ.. ఇటీవల నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడు. దీంతో.. ప్రపంచకప్లో అతను టీమిండియాకి అదనపు (ఆరో) బౌలర్గా ఉపయోగపడతాడంటూ మాజీ క్రికెటర్లు కితాబిస్తున్నారు.
వాస్తవానికి 2017 వరకూ విరాట్ కోహ్లీ అప్పుడప్పుడు మ్యాచ్ల్లో బౌలింగ్ చేసేవాడు. 2016 టీ20 ప్రపంచకప్లో అప్పటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఏకంగా అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ని పక్కనపెట్టి మరీ ఓ మ్యాచ్లో కోహ్లీతో బౌలింగ్ చేయించాడు. వెస్టిండీస్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆ జట్టు విజయానికి చివరి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమవగా.. అశ్విన్ని పక్కనపెట్టిన ధోనీ.. కోహ్లీ చేతికి బంతినిచ్చాడు. కానీ.. ఆ మ్యాచ్లో భారత్ జట్టు ఓడిపోయింది. అయినప్పటికీ.. ఆ తర్వాత కూడా విరాట్ కోహ్లీ తన బౌలింగ్ని కొనసాగించాడు. | 2sports
|
సిద్ధమవుతున్న ధావన్
\
ముంబయి:టీమిండియాకు చెందిన శిఖర్ ధావన్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధ్దమ వుతున్నాడు. ఫామ్, ఫిట్నెస్తో ఇబ్బంది పడుతున్న ధావన్ జూన్లో ఇంగ్లండ్ వేది కగా జరుగనున్న ఈ ప్రతిష్టాత్మక ఐసిసి ఛాంపియన్ టోర్నీలో భారత జట్టులో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు.నాకు ఇంకా రెండు,మూడు నెలల సమయం ఉంది.ఈ మధ్యలో మూడు,నాలుగు టోర్నమెంట్లలో పాల్గొంటాను. ఇందులో మంచి ప్రదర్శన చేస్తాను. వన్డేల్లో నా ఆట అత్యుత్తమంగా ఉంటుంది. త్వరలో జరిగే టోర్నమెంట్లో సత్తాచాటితే ఖచ్చితంగా జట్టులోకి వస్తానని ధావన్ పేర్కొన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్తో చివరిదైన మూడవ వన్డేలో ఢిల్లీ బ్యాట్స్మెన్ ధావన్ను తప్పించిన విషయం తెలిసిందే.మొదటి రెండు మ్యాచ్ల్లో వరుసగా 1,11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు | 2sports
|
Hyderabad, First Published 11, Aug 2019, 2:36 PM IST
Highlights
నాగ్ నటించిన 'మన్మధుడు 2' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఎంత స్పీడుగా వచ్చిందో ..అంతే స్పీడుగా భాక్స్ లు సర్దే పరిస్దితి తెచ్చుకుంది. సినిమా విడుదలకు ముందు నుంచీ విమర్శల్ని ఎదుర్కొన్న ఈ సినిమా అడల్ట్ కంటెంట్ తో అడ్డంగా దొరికిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగులు, జుగుప్సాకరమైన సీన్స్ ఈ సినిమాని ఫ్యామిలీలకు దూరంగా పెట్టేసాయి.
నాగ్ నటించిన 'మన్మధుడు 2' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఎంత స్పీడుగా వచ్చిందో ..అంతే స్పీడుగా భాక్స్ లు సర్దే పరిస్దితి తెచ్చుకుంది. సినిమా విడుదలకు ముందు నుంచీ విమర్శల్ని ఎదుర్కొన్న ఈ సినిమా అడల్ట్ కంటెంట్ తో అడ్డంగా దొరికిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగులు, జుగుప్సాకరమైన సీన్స్ ఈ సినిమాని ఫ్యామిలీలకు దూరంగా పెట్టేసాయి. అలాగని..యూత్ కు దగ్గరకాలేకపోయింది. సర్లే ఇదంతా రిలీజ్ అయ్యాక అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ విషయం సమంత ముందే పసిగట్టేసిందా అంటే అవుననే అనాల్సి వస్తోంది.
వాస్తవానికి 'మన్మధుడు 2'లో అక్కినేని వారి కోడలు సమంత గెస్ట్ రోల్ పోషించింది. అయితే, ట్రైలర్స్లో ఆమె పాత్రను సస్పెన్స్గా ఉంచారు,రివీల్ చేసారు. కానీ, ప్రమోషన్స్లో ఒక్కసారి అయినా సమంత పాల్గొవాలి. పోనీ సమంత చేసింది అని రివీల్ అయిపోతే కథ ఏమన్నా దెబ్బ తింటుందా అంటే అంత సీన్ లేదు. కానీ చిత్రంగా ఈ సినిమాకు మొదటనుంచీ సమంత దూరంగా ఉండిపోయింది. తన కుటంబ సినిమానే కదా అని ..కనీసం ఒక్క ట్వీట్ కూడా వెయ్యిలేదు.
కేవలం నాగార్జున తన మామగారనే కాదు.. సినిమా టీమ్ లో ఉన్న హీరోయిన్ రకుల్, దర్శకుడు రాహుల్, ఆయన భార్య చిన్మయి అంతా ఫ్రెండ్సే. అయినా సమంత కావాలనే ఇగ్నోర్ చేసిందని ఇప్పుడు అర్దమవుతోంది. అంటే ఆమె ఈ సినిమాకు ఇలాంటి పరిస్దితి వస్తుందని ఊహించిందన్నమాట. పొరపాటున తను కనుక ప్రమోట్ చేస్తే తర్వాత ఓ రేంజిలో ట్రోలింగ్ కు గురి అవుతానని కూడా అర్దం చేసుకుని ఉంటుంది. అలా సమంత ఈ విషయంలో తన తెలివిని ప్రదర్శించి..దూరంగా ఉండిపోయింది. నాగ్ కే ఆ విషయం రిలీజయ్యే దాకా అర్దమయ్యినట్లు లేదు.
Last Updated 11, Aug 2019, 2:36 PM IST | 0business
|
బాహుబలికి రెండేళ్లు.. సంతోషంతో అభిమానులకు ప్రభాస్ సందేశం
Highlights
బాహుబలి చిత్రానికి రెండేళ్లు
సంతోషంతో అభిమానులకు ప్రభాస్ సందేశం
రాజమౌళికి,, అభిమానులకు పెద్ద థాంక్స్ చెప్పిన ప్రభాస్
తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన "బాహుబలి: ద బిగినింగ్" సినిమా రిలీజై రెండేళ్లు పూర్తయింది. 2015, జూలై 10న ఈ చిత్రం ప్రేక్షకులకు ముందుకు వచ్చి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల మన్నన పొందడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి1 విజయంతో రెండో భాగంపై చిత్ర యూనిట్ మరింత విశ్వాసంతో పనిచేసింది. మరోవైపు "బాహుబలి: ద కన్క్లూజన్" సినిమా రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్ చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంది.
"బాహుబలి: ద బిగినింగ్" విడుదలై రెండేళ్లు పూర్తైన సందర్భంగా హీరో ప్రభాస్ తన సంతోషాన్ని ఫేస్బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. ఈ చిత్రం కోసం పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. చిత్ర యూనిట్ అంతా ఎంతో ఇష్టంగా పనిచేసిందని తెలిపాడు. ఇలాంటి గొప్ప అవకాశం రావడానికి కారణమైన తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. బాహుబలి చిత్రానికి పనిచేసిన వారందరినీ అభినందించాడు. తమను వెనకుండి నడిపించిన దర్శక ధీరుడు రాజమౌళికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు.
ప్రభాస్ ప్రస్తుతం మరో భారీ బడ్జెత్ సినిమా "సాహో" లో నటిస్తున్నాడు. బాహుబలి ది బిగినింగ్ ఆరంభం మాత్రమే అని చెప్పొచ్చు.
Last Updated 25, Mar 2018, 11:47 PM IST | 0business
|
మురిపించని జీఎస్టీ
- స్వల్ప లాభాల్లో మార్కెట్లు ొ సెన్సెక్స్ 17 పాయింట్ల పెరుగుదల
ముంబయి : పారిశ్రామికవర్గాలు, మదుపర్లు ఎంతో దీర్ఘకాలంగా ఎదురు చూస్తోన్న వస్తు సేవల బిల్లు (జీఎస్టీి)కు ఆమోదం లభించినప్పటికీ మార్కెట్లకు మద్దతు లభించకపోవడం గమనార్హం. జీఎస్టీి వాస్తవ రూపం దాల్చడానికి తీసుకోవాల్సిన సంస్కరణలు, రోడ్మ్యాప్పై మదుపర్ల అనుమానాలు వారిని ఆచీతూచి వ్యవహరించేలా చేశాయి. ఈ బిల్లు అమలుపై స్పష్టత కొరవడటానికి తోడు ధరలు పెరుగొచ్చని, వృద్ధి రేటు మందగించవచ్చన్న అంచనాల్లో మార్కెట్లకు స్వల్ప మద్దతు మాత్రమే లభించింది. ఈ నేపథ్యంలో గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పంగా 16.86 పాయింట్లు లేదా 0.06 శాతం పెరిగి 27,714.37 వద్ద ముగిసింది. ఉదయం 27,899.88 వద్ద ప్రారంభమైన సూచీ రోజంతా ఒడిదుడుకులకు గురి అవుతూనే ఓ దశలో గరిష్టంగా 27,921 వద్ద, మరో దశలో కనిష్టంగా 27,628 వద్ద ట్రేడింగ్ అయ్యింది. కాగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 6.25 పాయింట్లు పెరిగి 8,551.10 వద్ద నమోదయ్యింది. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.4 శాతం చొప్పున పెరిగాయి. మొత్తంగా మదుపర్ల మద్దతుతో 1436 స్టాక్స్ పెరగ్గా, 1264 స్టాకల్స్ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 07 పైసలు పటిష్టమై రూ.66.92 వద్ద ముగిసింది. బుధవారం సెషన్లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.578 కోట్ల నికర ఈక్విటీలు కొనుగోళ్లు చేశారు.
బీఎస్ఈలో రంగాల వారిగా రియాల్టీ సూచీ 2.25 శాతం, లోహ 1.53 శాతం, ఆటో 1.35 శాతం, మౌలిక వసతులు 0.92 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు కన్సూమర్ డ్యూరెబుల్స్ 0.82 శాతం, ఐటీ 0.53 శాతం, టెక్ 0.31 శాతం, బ్యాంకింగ్ 0.17 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. సెన్సెక్స్-30లో టాటా స్టీల్ 4.6 శాతం, టాటా మోటార్స్ 4.41 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.18 శాతం, అదానీ పోర్ట్స్ 2.06 శాతం, హీరో మోటో కార్ప్ 1.79 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు ఆసియన్ పెయింట్స్ 1.78 శాతం, ల్యూపిన్ 1.32 శాతం, ఇన్ఫోసిస్ 1.18 శాతం, కోల్ ఇండియా 0.75 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.74 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. బుధవారం రాజ్యసభలో జీఎస్టీి బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే 2017 ఏప్రిల్ నుంచి జీఎస్టీిని అమలులోకి తేవాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం అమలుకు కనీసం ఏడాదిన్నర పట్టొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బిల్లునకు పార్లమెంట్ ఆమోదం లభించినప్పటికీ, దేశంలోని 29 రాష్ట్రాలలో సగం రాష్ట్రాలు దీనికి ఆమోదించాల్సి ఉంది.. ఈ విధానం అమలునకు గాను జీఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ పరిణామాలకు తోడు జీఎస్టీతో ధరలు పెరుగుతాయన్న భయాలకు తోడు, జీఎస్టీ అమలులో అనేక అనుమానాలు మదుపర్లను కొంత ఒత్తిడికి గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే పెద్దగా కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదని బ్రోకర్లు పేర్కొంటున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Telangana Elections: నా సపోర్ట్ ఆమెకే.. అందుకేనా ‘బాబు’ల కలయిక
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఏపీ సీఎం చంద్రబాబు. సినీ రాజకీయ వర్గాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి ఫ్యామిలీ నుండి స్వర్గీయ నందమూరి హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసిని అలియాస్ చుండ్రు సుహాసినిని కుక్కట్ పల్లి స్థానంలో తెరపైకి తీసుకువచ్చారు.
Samayam Telugu | Updated:
Nov 26, 2018, 03:29PM IST
ఇటీవల సినీ నటుడు జగపతిబాబు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. అయితే ఈ సిట్టింగ్ వెనుక రాజకీయ వ్యూహం ఏం లేదని.. ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి చంద్రబాబును ఆహ్వానించేందుకే అమరావతి వచ్చినట్టు చెప్పుకొచ్చారు. అయితే పొలిటికల్ మాస్టర్ మైండ్ ఉన్న చంద్రబాబుతో సిట్టింగ్ అంటే రాజకీయ వ్యూహం లేకుండా ఉండదనేది తాజా పరిణామాలను బట్టి అర్ధమౌతోంది.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఏపీ సీఎం చంద్రబాబు. సినీ రాజకీయ వర్గాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి ఫ్యామిలీ నుండి స్వర్గీయ నందమూరి హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసిని అలియాస్ చుండ్రు సుహాసినిని కుక్కట్ పల్లి స్థానంలో తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే నందమూరి హీరోలు బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలు సుహాసిని విజయానికి రంగంలోకి దిగారు. తాజాగా జగపతిబాబు సైతం సుహాసినికి సపోర్ట్గా నిలిచారు.
సమస్యలపై స్పందించే గుణం నందమూరి ఫ్యామిలీ ఉందని.. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చిన సుహాసినికే తన మద్దతు అని, ఆమె ఈ ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు జగపతి బాబు. కాగా జగపతిబాబు చాలా ఏళ్లుగా కూకట్ పల్లిలో ఓ లగ్జరీ ఫ్లాట్లో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు. దీంతో స్థానికుడిగా తన మద్ధతుని ప్రకటించారు జగపతి బాబు. నందమూరి ఫ్యామిలీ హీరోల సినిమాల్లో ప్రతి నాయకుడిగా నటిస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్లలో పాలుపంచుకుంటున్న జగపతి బాబు సుహాసిని విజయంలో ఎలాటి భూమిక పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. | 0business
|
Aug 29,2017
హైదరాబాద్ మార్కెట్లోకి కొత్త వెర్నా
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందారు తాజాగా అందుబాటులోకి తెచ్చిన కొత్త వెర్నా కారు హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయిదో తరానికి చెందిన ఈ కొత్త కారు పెట్రోల్ వర్షన్ రూ.7,99,900-12,23,900 ధరల శ్రేణిలోనూ.. డీజిల్ వర్షన్ రూ.9,19,900-12,39,900 ధరల శ్రేణిలో (ఎక్స్ షోరూం ఢిల్లీ) అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. కొత్త వేరియంట్ను 50 శాతం అత్యాధునిక ద్రుఢత్వంతో కూడిన స్టీల్తో రూపొందించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ కారులో 1.6 లీటర్ పెట్రోల్/ డీజిల్ ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్స్, ఆరు స్పీకర్లు, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఫ్రంట్ ప్రొజెక్టర్ పోగ్ లాంప్స్ , కార్నరింగ్ లాంప్స్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి లాంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Dollars
విదేశీ ఇన్వెస్టర్ల మోజు
ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లకు రోజురోజుకూ ఆసక్తి పెరుగుతు న్నట్లు కుమ్మరిస్తున్న పెట్టుబడులే స్పష్టంచేస్తున్నా యి. ఈనెలలో తొలి వారం నాలుగు ట్రేడింగ్లలోనే విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు సుమారు 2.45 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 16 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు కుమ్మరిం చారు. వీటిలో రూ.5000 కోట్లు ఈక్విటీల్లోను, రూ.11,000కోట్లు రుణసెక్యూరిటీల్లోను పెట్టుబడు లు పెట్టారు. రాజ్యసభలో కూడా మెజార్టీ సాధించే దిశగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం, జిఎస్టి అమలుకు వీలుగా నాలుగు బిల్లులను పార్లమెంటు ఆమోదించడం, ఆర్ధికవ్యవస్థ పురోభివృద్ధిపై సానుకూల అంచనాలు వంటివి విద ేశీ ఇన్వెస్టర్లకు మంచి ధీమా కల్పిస్తున్నట్లు అంచ నా. గతనెలలో దేశీయ మూలధన మార్కెట్లలో ఎఫ్పిఐలు భారీస్థాయిలోనే పెట్టుబడులు పెట్టారు. మార్చి నెలలో మొత్తం రూ.57వేల కోట్లు అంటే 8.7బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు.
నల్ల ధనానికి చెక్పెడుతూ పోద్దనోట్ల రద్దును ప్రకటిం చిన కేంద్రం ప్రభుత్వం జిఎసప్టి వంటి ఆర్ధిక సంస్కరణలకు తెరతీస్తున్నదన్న అంచనాలు ఇన్వె స్టర్లకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. గత ఏడాది అక్టోబరు నుంచి ఎఫ్పిఐలు ఉన్నట్లుండి అమ్మకాల వైపు మళ్లారు. అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీపెంపు అంచనాలు, అధ్యక్ష ఎన్నికల్లోట్రంప్ విజయం దేశీ యంగా పెద్ద నోట్లరద్దు వంటి అంశాల నేపథ్యంలో 2016 అక్టోబరు మొదలు 2017 జనవరి వరకూ ఎఫ్పిఐలు మొత్తంగా రూ.80,000 కోట్లుకు పైబడి దేశీయ మార్కెట్ల నుంచి ఉపసంహరిం చుకున్నారు. ఈ పరిణామాల తర్వాత తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి మాసంనుంచి దేశీయస్టాక్స్పై విదేశీ ఇన్వెస్టర్లకు గురిపెరిగింది. దేశీయ మార్కెట్ల లో సెన్సెక్స్ ప్రామాణికసూచి 30వేల పాయింట్ల కు చేరువకాగా ఎన్ఎస్ఇ నిప్టీ కూడా తన రికార్డుస్థాయి 9900 మార్కును చేరింది. దీనివల్ల ఇన్వెస్టర్లకు మంచి ఊతం ఇచ్చినట్లు కనిపించింది. | 1entertainment
|
saina biopic heroine parineeti chopra latest photoshoot blowing the steam on web
'సైనా' హీరోయిన్.. హాట్ పోజులతో అబ్బాయిల మతి పోవున్
Web Title:saina biopic heroine parineeti chopra latest photoshoot blowing the steam on web
( Telugu News from Samayam Telugu , TIL Network)
1/26
'సైనా' హీరోయిన్.. హాట్ పోజులతో అబ్బాయిల మతి పోవున్
మీ కామెంట్ రాయండి
పరిణీతి చోప్రా.. బాలీవుడ్లోకి అడుగుపెట్టిన మొదటి చిత్రం ఇష్క్జాదేకు జాతీయ అవార్డ్ దక్కించుకున్న హీరోయిన్. మూడు పదుల వయసులోనూ చెక్కుచెదరని తన అందాలను కెమెరా క్లిక్కులతో బంధించి.. అబ్బాయిలకు పిచ్చెక్కిస్తోంది. ఘాటైన ఫొటోషూట్లతో రచ్చచేస్తుంది. ఈమె టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ కూడా. ప్రస్తుతం ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్లో నటిస్తోంది.. పరిణీతి.
సమయం తెలుగు న్యూస్ అలెర్ట్కు సబ్స్క్రైబ్ అవ్వండి
సమయం తెలుగు నుంచి బ్రేకింగ్ న్యూస్, టాప్ స్టోరీల నోటిఫికేషన్లను తక్షణమే పొందండి
ఇప్పుడు వద్దు | 0business
|
అర్జున్ టెండూల్కర్ టీమిండియా ఎంట్రీ.. దేశం తరపున తొలి వికెట్
Highlights
ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ దేశం తరపున తొలి వికెట్ తీశాడు.
ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ దేశం తరపున తొలి వికెట్ తీశాడు. శ్రీలంక్ పర్యటన కోసం బీసీసీఐ ప్రకటించిన అండర్-19 జట్టులో అర్జున్ చోటు దక్కించుకున్నాడు. కొలంబో వేదికగా ఇవాళ జరిగిన తొలి టెస్ట్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసింది..
మిషారా-ఫెర్నాండో లంక ఇన్నింగ్స్ను ఆరంభించారు.. ఈ క్రమంలో బౌలింగ్ దిగిన అర్జున్ టెండూల్కర్ పొదుపుగా బౌలింగ్ చేశాడు.. రెండో ఓవర్ చివరి బంతికి మిషారాని ఎల్బీడబ్ల్యూగా పంపాడు.. ఇది భారత్ తరపున అర్జున్కి తొలి వికెట్. ఈ విషయం తెలుసుకున్న సచిన్ అభిమానులు, సన్నిహితులు అర్జున్కు అభినందనలు తెలుపుతున్నారు..
Last Updated 17, Jul 2018, 6:54 PM IST | 2sports
|
DEVEDNAR SINGH
నిరాశ పరచిన దావీందర్ సింగ్
లండన్: ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారుల వైఫల్యం కొనసాగుతోంది. తొలిసారి జావెలిన్ త్రో ఫైనల్కు చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన దావీందర్ సింగ్ కంగ్ తుది పోటీ ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. పోటీలో 12వ స్థానంలో నిలిచి కంగుతిన్నాడు. ఫైనల్లో అతడు జావెలిన్ను 80.02 మీటర్లు మాత్రమే విసిరాడు. అదీ మూడో దఫాలో. తొలి ప్రయత్నంలో 75.40 మీటర్లు విసిరిన అతడు రెండోసారి ఫౌల్ అయ్యాడు. కంగ్ సీజన్, వ్యక్తిగత అత్యుత్తమం 84.57 మీటర్లు కాగా ఈసారి అంతదూరం కూడా జావెలిన్ను విసరలేదు. జర్మనీ అథ్లెట్ జానెస్ వెటర్ (89.89మీటర్లు) స్వర్ణం సాధించాడు. | 2sports
|
తేజస్వి నన్ను పంపించేసి గేమ్ ఆడింది: బిగ్ బాస్ ఎలిమినేషన్ పై శ్యామల
Highlights
కౌశల్ తెలివిగా నందిని పేరు చెప్పేశాడు. ఇక నన్ను, దీప్తి మా ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయడం తేజస్వికి కూడా కష్టం అయింది. దీప్తి ఉండడం వలన తేజుకి పెద్ద సమస్య ఉండదు. నాకు నొప్పి పుడితే నేను చెబుతాను కానీ దీప్తి చెప్పదు
బిగ్ బాస్2 నాలుగో వారం ఎలిమినేషన్ లో యాంకర్ శ్యామల బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇంటి నుండి వెళ్లేప్పుడు చాలా ఉద్వేగానికి గురయ్యారు శ్యామల. అసలు ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని అన్నారు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన ఎలిమినేషన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
''నేను ఎలిమినేట్ అయిన తరువాత చాలా మంది జస్టిస్ ఫర్ శ్యామల అంటూ సోషల్ మీడియాలోపోస్ట్ లు పెడుతున్నారు. వారి అభిమానానికి రుణపడి ఉంటాను. నిజానికి ఎలిమినేషన్ లో ఉన్న నాకు, దీప్తికి, నందినికి ఓట్లు ఒకే విధంగా వచ్చి ఉంటాయి. అందుకే కౌశల్, తేజస్విల దగ్గరున్న సేవ్ చేసే ఛాన్స్ ను వినియోగించారు. కౌశల్ తెలివిగా నందిని పేరు చెప్పేశాడు. ఇక నన్ను, దీప్తి మా ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయడం తేజస్వికి కూడా కష్టం అయింది. దీప్తి ఉండడం వలన తేజుకి పెద్ద సమస్య ఉండదు. నాకు నొప్పి పుడితే నేను చెబుతాను కానీ దీప్తి చెప్పదు. అక్కడ మన పక్కన ఎవరు ఉంటే మనకు సమస్య ఉండదో వాళ్లనే సెలెక్ట్ చేసుకోవడం గేమ్. ఇక్కడ తేజు నన్ను ఎలిమినేట్ చేసి గేమ్ ఆడింది.
ఇక షో నాకు రోలర్ కోస్టర్ రైడ్ లా అనిపించింది. ఇక ఈ వారంలో దీప్తి నామినేట్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఇంట్లో నుండి వచ్చినప్పటి పరిస్థితులను బట్టి చెబుతున్నాను. బాబు గోగినేని, దీప్తి సునయన, కౌశల్, గీతామాధురి వీరికి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. షోలో నాకు సెక్యురిటీ గార్డ్ టాస్క్ నాకు బాగా నచ్చింది'' అని చెప్పుకొచ్చింది.
ఇక హౌస్ లో తేజస్వి, సామ్రాట్ ల మధ్య ఏం జరుగుతుందని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ''అది బిగ్ బాస్ స్క్రిప్ట్ కాదు.. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనే స్ట్రాటజీతో కూడా వారిద్దరూ అలా చేయడం లేదు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక మనిషి మీద ఒక రకమైన ఫీలింగ్ రావడంలో తప్పేముంది'' అంటూ వారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. మీరు మీలాగా ఉంటే డెఫినిట్ గా గెలుస్తారు అలా అని గెలుపు మీ చేతుల్లో ఉండదని.. అదృష్టం కూడా ఉండాలని చెప్పింది. హోస్ట్ గా నాని యాంకరింగ్ తనకు చాలా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుందని వెల్లడించింది. | 0business
|
నాని చేతుల మీదుగా సునీల్ 'టూ కంట్రీస్' ఆడియో విడుదల
Highlights
సునిల్ హిరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2 కంట్రీస్
ఈ చిత్రాన్ని మహాలక్ష్మి ఆర్ట్స్ బేనర్ పై నిర్మించిన శంకర్
2 కంట్రీస్ ఆడియో విడుదల చేసిన యంగ్ హీరో, నేచురల్ స్టార్ నాని
మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై దర్శకుడు ఎన్ శంకర్ స్వీయ దర్శక నిర్మాణం లో సునీల్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం 'టూ కంట్రీస్'. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో బహు సందడిగా జరిగింది. హీరో నాని ఆడియో సీడీలను విడుదల చేసి తొలి సీడీని ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ కు అందచేశారు.
అనంతరం నాని మాట్లాడుతూ సునీల్ అన్నతో హీరో కాక ముందు నుండి మంచి పరిచయం ఉంది. `ఢీ` సినిమాకు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా రెకమండ్ చేసింది సునీల్ అన్నే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యే సమయానికి తను మంచి కమెడియన్గా పేరు తెచ్చుకునేశారు. కానీ నాతో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. నాలో కాన్ఫిడెంట్ను పెంచిన వ్యక్తి. ఇక 2 కంట్రీస్ సినిమా కంటెంట్ ఆల్ రెడీ ప్రూవ్ చేసుకున్న కంటెంట్. ఇక కామెడీ పరంగా సునీల్ అన్న చూసుకుంటాడు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనడంలో సందేహం లేదు అన్నారు.
సునీల్ నారంగ్ మాట్లాడుతూ గోపీ సుంద్ మ్యూజిక్ బావుంది. ఎన్.శంకర్గారికి, సునీల్గారికి ఆల్ ది బెస్ట్ అన్నారు.
ఈ చిత్ర డైరెక్టర్ ఎన్.శంకర్ మాట్లాడుతూ పవర్కి, నేచుర్కి చాలా దగ్గర సంబంధం ఉంది. మా సినిమా టీజర్ను పవర్స్టార్ పవన్కల్యాణ్ విడుదల చేశారు. ఆ టీజర్ను ఇప్పటి వరకు 40 లక్షల మంది చూశారు. అలాగే సినిమా పాటలను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. కాబట్టి సినిమా అందరికీ నచ్చుతుంది. ముందు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకోగానే..సునీల్ అయితేనే చేయాలని ముందుగా అనుకున్నాను. ఆ రైట్స్ కొనాలని అనుకుంటున్న తరుణంలో బండ్ల గణేష్ రైట్స్ను దక్కించుకున్నాడు. సరేనని కామ్గా అయిపోయాను. ఈ సినిమాను తెలుగులో నేనే చేయాలని రాసి ఉందేమో..అటు, ఇటు తిరిగి నా దగ్గరకే వచ్చింది. చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కదా! అని ఆలోచించి సినిమా చేశాను. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రీ రికార్డింగ్ ముగియగానే మలయాళం కంటే తెలుగులో సినిమా అద్భుతంగా వచ్చిందని తనే నా దగ్గర అన్నాడు. ఇక సునీల్ విషయానికి వస్తే, తనొక ట్రాన్స్ఫర్మర్. తను ఓన్ చేసుకుని నటించాడు. రేపు సినిమా చూసిన వారందరికీ సునీల్ తప్పకుండా గుర్తుంటాడు. శంకర్కి, సునీల్కు ఈ సినిమా గ్రేట్ జర్నీ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. హార్ట్ టచింగ్తో పాటు హ్యూమన్ వాల్యూస్ ఉన్న చిత్రమిది. చీకటిని చీకటి జయించదు. వెలుగే జయిస్తుంది. అలాగే ద్వేషాన్ని ద్వేషం జయించదు. ప్రేమ మాత్రమే జయిస్తుంది. ఇప్పటి యువత వేగ వంతమైన జీవితంలో పడి చాలా విషయాలను మరచిపోతున్నారు. అందులో నిజమైన ప్రేమ ఒకటి. నిజమైన ప్రేమ గుండెను తాకితే ఎలా ఉంటుందో తెలిపే చిత్రమే ఇది. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు.
సునీల్ మాట్లాడుతూ నాకు మలయాళ హీరో దిలీప్ సినిమాలు రీమేక్ చేయడానికి చక్కగా సూట్ అవుతాయి. ఆయన చేసిన సినిమానే తెలుగులో పూల రంగడుగా రీమేక్ చేసి సక్సెస్ కొట్టాను. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రం `2 కంట్రీస్`ను తెలుగులో చేయడం ఆనందంగా ఉంది. శంకర్గారు పట్టు వదలకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను భారీ రేంజ్లో నిర్మించారు. గోపీసుందర్గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమా తప్పకుండా అందికీ నచ్చుతుంది`` అన్నారు. వీర శంకర్ మాట్లాడుతూ మలయాళంలో 55 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో కూడా అంతే కలెక్షన్స్ను సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. జెమిని కిరణ్ మాట్లాడుతూ ఎన్.శంకర్ ఎంతో కష్టపడి డైరెక్ట్ చేస్తూనే సినిమాను నిర్మించారు. తనకు, సునీల్కి సినిమా పెద్ద హిట్ కావాలి అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ నేను రాజాది గ్రేట్ సినిమా సమయంలో రెండు, మూడు సీన్స్ చూశాను. సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని తెలుస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో దశరథ్, శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, బి.వి.ఎస్.రవి, వెంకీ కుడుముల, ఇ.సత్తిబాబు, వి.ఎన్.ఆదిత్య, సురేష్ కొండేటి, పృథ్వీ, నందిని సిధా రెడ్డి, భాస్కరభట్ల, శ్రేష్ఠ, దేదీప్య, వైష్ణవి, మేఘాంశ్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ను అభినందించారు.
సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, డైలాగ్స్: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వెంకటరమణ, ప్రొడక్షన్ కంట్రోలర్: కర్రపాటి రమణ, నిర్మాణం-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్.శంకర్.
Last Updated 25, Mar 2018, 11:58 PM IST | 0business
|
Hyderabad, First Published 10, Apr 2019, 2:46 PM IST
Highlights
సైరా మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న కూడా పనిలో వేగం పెంచలేదని చరణ్ యూనిట్ సబ్యులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సైరా. కొణిదెల ప్రొడక్షన్స్ లో మెగా తనయుడు రామ్ చరణ్ 200 కోట్ల బారి బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు గత రెండేళ్లుగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతవరకు సినిమా రిలీజ్ కాలేదు.
గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందని ప్రతిసారి చిత్ర యూనిట్ కవర్ చేస్తూ వస్తోంది. అయితే ఫైనల్ గా చరణ్ సినిమాను దసరా టైమ్ లో రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. అయితే సైరా మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న కూడా పనిలో వేగం పెంచలేదని చరణ్ యూనిట్ సబ్యులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
VFX పనుల వల్ల దర్శకుడు సురేందర్ రెడ్డి అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసేలా లేరని ఇటీవల రూమర్స్ గట్టిగానే వచ్చాయి,. ఇకపోతే చరణ్ అందరికి క్లాస్ పీకినట్లు ఇన్ సైడ్ టాక్. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనీ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి చిత్ర యూనిట్ దసరా సమయానికి సినిమాను ప్రేక్షకులకు అందిస్తుందో లేదో చూడాలి.
Last Updated 10, Apr 2019, 2:48 PM IST | 0business
|
గ్యాంగ్ లీడర్ పిల్లపై క్రష్ మొదలైంది
First Published 16, Sep 2019, 2:52 PM IST
గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ అబ్బాయిలను తెగ ఆకర్షిస్తోంది.
ఏడాదిలో ఎంతో మంది హీరోయిన్స్ తెరగ్రేటం చేస్తుంటారు. అందులో క్లిక్కయ్యే బ్యూటీలు ఏక్కువగా గ్లామర్ రోల్స్ తో యువతను ఆకర్షిస్తుంటారు.
కానీ ప్రియాంక మాత్రం తన న్యాచురల్ డ్రెస్సింగ్ స్టైల్ తో నే ఆకట్టుకుంటోంది.
గ్యాంగ్ లీడర్ సినిమాలో ఒక సాంప్రదాయ పద్దతిలో ఆమె కనిపించిన తీరుకు కుర్రకారులో క్రష్ మొదలైంది.
హడావుడి లేకుండా యాక్టింగ్ లో కూడా సింపుల్ నటనతో మెప్పించింది. ఆమె గ్లామర్ డోస్ పెంచకపోయినా అద్భుతంగా ఉందని మాస్ ఆడియెన్స్ కూడా ఫిదా అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్ పేజ్ లతో ప్రియాంక అరుళ్ మోహన్ నేమ్ వైరల్ అవుతోంది.
తప్పకుండా ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని అభిమానులు పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు.
ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుతోంది.
ఇప్పటికే 11కోట్ల షేర్స్ ని అందించినట్లు తెలుస్తోంది. మరి మిగతా రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
Recent Stories | 0business
|
Mar 07,2018
సమ్మెబాటలో గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారానికి గాను సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీ) ఉద్యోగులు, అధికారులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. 'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్స్' (యూఎఫ్ఆర్బీయూ) పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లోని అయిదు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం 2150 శాఖలలో దాదాపు 10వేల మందికి పైగా ఉద్యోగులు ఈ బ్యాంకుల్లో పని చేస్తున్నారు. గ్రామీణ బ్యాంకుల ప్రయివేటీకరణ యత్నాలను వ్యతిరేకిస్తున్నామని.. నిధుల సమీకరణ కోసం ఆర్ఆర్బీలను మార్కెట్ బాట పట్టించాలని సర్కారు యోచించడాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఆర్ఆర్బీ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలిపింది. ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకుల అధికారులు మూడు రోజుల పాటు సమ్మెబాట పట్టనుండడం, సమ్మెకు ముందు తరువాత కలుపుకొని నాలుగు రోజుల సెలవులు రానుండడంతో ఈ బ్యాంకుల్లో దాదాపు ఏడు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు, స్వయ సహాయక సంఘాల వారికి మార్చి నెలాఖరులో ఆర్థిక కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Aug 22,2015
5800 'జాగ్వర్'లు దెబ్బతిన్నాయి
ముంబయి: గత వారం చైనాలోని టైన్జిన్ పోర్టులో జరిగిన పేలుళ్లలో తమ సంస్థకు బాగానే నష్టం వాటిల్లినట్లు టాటా మోటార్స్ తెలిపింది. చైనాకు టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లను ఎగుమతి చేసే మూడు ప్రధాన రేవులలో 'టైన్జిన్' కూడా ఒకటని సంస్థ తెలిపింది. టైన్జిన్లో భారీ పేలుళ్ల జరిగిన సమయంలో అక్కడి పరిసర ప్రాంతాల్లో ఇటీవలే తాము చైనాకు ఎగుమతి చేసిన దాదాపు 5,800 వరకు జాగ్వార్ ల్యాండ్రోవర్ కార్లు పార్క్ చేసి ఉన్నట్లు సంస్థ తెలిపింది. పేలుళ్లలో ఈ కార్లు దాదాపుగా దెబ్బతిని ఉంటాయని కంపెనీ భావిస్తోంది. పేలుళ్లు జరిగిన ప్రాంతంలోకి వెళ్లేందుకు ఇంకా అనుమతులు లేని కారణంగా నష్టం ఎంత మొత్తంలో జరిగింది అంచనా వేయలేకపోతున్నట్లుగా టాటా మోటార్స్ తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు శుక్రవారం 3.54 శాతం మేర పడి 18 నెలల కనిష్ఠానికి కుంగింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్ల దిగువకు చేరింది. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని వినియోగదారులకు, సంస్థకు నష్టం వీలైనంత తక్కువగా ఉండేలా తాము కృషి చేస్తున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
లిస్ట్-ఏ క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నదీమ్
విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్ షాదాబ్ నదీమ్ సంచలన బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.
Samayam Telugu | Updated:
Sep 20, 2018, 02:45PM IST
జార్ఖండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షహబాజ్ నదీమ్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్పై పది ఓవర్లు వేసి పది పరుగులు మాత్రమే ఇచ్చిన నదీమ్.. 8 వికెట్లు తీశాడు. నదీమ్ స్పిన్ ధాటికి విలవిల్లాడిన రాజస్థాన్ జట్టు 28.3 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌటయ్యింది. గతంలో లిస్ట్-ఏ క్రికెట్లో అత్యత్తమ బౌలింగ్ గణాంకాలు ఢిల్లీకి చెందిన రాహుల్ సంఘ్వీ పేరిట ఉండేవి.
1997-98 సీజన్లో రాహుల్ హిమాచల్ ప్రదేశ్పై 15 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్పై 8 వికెట్లు తీయడం ద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో ఈ ఘనత సాధించిన చమింద వాస్, మైకెల్ హోల్డింగ్, డెరెక్ అండర్వుడ్ లాంటి దిగ్గజాల సరసన నదీమ్ చేరాడు. | 2sports
|
ముసలి తండ్రీ,కొడుకులుగా అమితాబ్,రిషి
Highlights
102 ఏళ్ళ తండ్రి.. అతనికి ఒక 75 ఏళ్ళ కొడుకు
27 ఏళ్ళ తరువాత అమితాబ్ అండ్ రిషి కపూర్ కలసి నటిస్తున్న సినిమా ఇది
102 ఏళ్ళ తండ్రి.. అతనికి ఒక 75 ఏళ్ళ కొడుకు.. అంటే టెక్నికల్ గా ముసలి తండ్రికి ముసలి కొడుకు అనమాట. ఈ థాట్ ఆలోచించడానికి చాలా బాగుంది కదూ. అయితే ఇప్పుడు ఇదే కాన్సెప్టులో తండ్రిగా అమితాబ్ బచ్చన్.. కొడుకుగా రిషి కపూర్ నటిస్తే ఎలా ఉంటుంది? అదిగో ''102 నాటౌట్'' సినిమా టీజర్ తరహాలో ఉంటుంది. బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ సినిమా కథాకమామిషూ ఏంటో చూద్దాం పదండి.
దాదాపు 27 ఏళ్ళ తరువాత అమితాబ్ అండ్ రిషి కపూర్ కలసి నటిస్తున్న సినిమా ఇది. ఇప్పుడు ఈ కాంబినేషన్లో 'ఓ మై గాడ్' సినిమాను తీసిన ఉమేష్ శుక్లా ఒక గుజరాతీ నాటకం ఆధారంగా ఈ ''102 నాట్ ఔట్'' సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా కథ చాలా సింపుల్. చాలా ముసలాడైన తండ్రి ఎంతో ఎనర్జటిక్ గా ఉంటూ తన ముసలి కొడుకును ఆటపట్టిస్తుంటాడు. అయితే ఆ కొడుకుకు కొన్ని ఇబ్బందులు రావడంతో.. మామూలుగా చరిత్రలో పిల్లలు తమ తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెడతారు కాని.. ఇక్కడ మాత్రం తన తండ్రే కొడుకును వృద్దాశ్రమానికి పంపేయాలని అనుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది అనేదే సినిమా. 102 ఏళ్ళ కురు వృద్దుడిగా అమితాబ్ గెడ్డంతో ఇరగదీస్తే.. రిషి కపూర్ కూడా అదరగొట్టేశాడు.
మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఎందుకంటే ఇద్దరు ఉద్దండులైన నటులు తమ సత్తాను చాటేస్తుంటే సిల్వర్ స్ర్కీన్ సైతం ఉలిక్కిపడుతోంది. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో!! | 0business
|
Hyderabad, First Published 3, Apr 2019, 9:27 AM IST
Highlights
మహేష్ బాబు మొదటి నుంచీ తన చిత్రాల డబ్బింగ్ విషయంలో మిగతా హీరోలకు భిన్నంగా వెళ్తున్నారు.
మహేష్ బాబు మొదటి నుంచీ తన చిత్రాల డబ్బింగ్ విషయంలో మిగతా హీరోలకు భిన్నంగా వెళ్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక..ఇక ఆ టెన్షన్ లేదనుకున్నాక,కొద్ది రోజులు విశ్రాంతి అనంతరం కూల్ గా డబ్బింగ్ మొదలెడతూంటారు. దాదాపు ప్రతీ సినిమా కు ఇదే పద్దతి అనుసరిస్తున్నారు.
మిగతా హీరోలు...షూటింగ్ భాగం పూర్తవుతుందనగానే మొదలెట్టేసారు. ఓ ప్రక్క షూటింగ్ ..మరో ప్రక్క గ్యాప్ లో డబ్బింగ్ పూర్తి చేస్తూంటారు. అయితే ఈ సారి మహేష్ మనస్సు మార్చుకున్నారు. తన పద్దతికి బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం.
ఇంకా కొద్దిగా షూటింగ్ పార్ట్ ఉందనగానే డబ్బింగ్ స్టార్ట్ చేసేసారు. రిలీజ్ కు టైమ్ ఉన్నా పనులు పరుగెట్టిస్తున్నారు. అందుకు కారణం ...సినిమాలో తన క్యారక్టర్ రకరకాల టైమ్ జోన్స్ లో జరుగుతుందని, అందుకు తగ్గట్లే తన వాయిస్ మాడ్యులేషన్స్ మార్చుకోవాల్సి వస్తుందని గమనించి, ఫెరఫెక్షన్ రావాలంటే కంటిన్యూగా డబ్బింగ్ చెప్పటం ...మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ సరిచూసుకుంటూ వెళ్లాలని ఫిక్స్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.
దాంతో మహర్షి టీమ్ ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. అది మహేష్ డెడికేషన్ తప్ప వేరేది కాదని, ఆయన మొదట నుంచి తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్లుగా చేసారని, ఇప్పుడు తన వాయిస్ తో జీవం పోస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏదైమైనా ఓ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చే లక్షణాలు కనపడతున్నాయి కదా.
మహేష్ బాబు మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్ర చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ కాబోతున్నది.
Last Updated 3, Apr 2019, 9:27 AM IST | 0business
|
ఆరోగ్య బీమాలోకి ఆదిత్య బిర్లా
- 10% మార్కెట్ వాటాయే లక్ష్యం: ఏబీహెచ్ఐసీఎల్ సీఈవో
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'ఆదిత్యా బిర్లా ఫైనాన్సీయల్ సర్వీసెస్ గ్రూపు' ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఎంఎంఐ హోల్డింగ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 'ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్షూరెన్స్' (ఏబీహెచ్ఐసీఎల్)ను ఏర్పాటు చేసింది. భారత బీమా విభాగంలో వచ్చే నాలుగైదు ఏండ్లలో 8-10 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా ఆదిత్యా బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. ఇదే సమయంలో అగ్రశ్రేణీ ఐదు కంపెనీల్లో చోటు దక్కించుకోవాలని నిర్దేశించుకున్నామని వెల్లడి ంచారు. ప్రస్తుతం 7 పట్టణాల్లో కార్యాలయాలు కలిగి ఉన్నామని, వచ్చే ఏడాది కల్లా మరో 25 పట్టణాలకు విస్తరిస్తామన్నారు. ఇప్పటికే 150 పట్టణాల్లోని 1400-1500 ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వివరించారు. ప్రతి ఏడాది 300 వరకు ఆసుపత్రులను జోడిస్తామన్నారు. ప్రధానంగా 35-45 ఏళ్ల వయస్సు వారిని లక్ష్యంగా చేసుకున్నట్లుగా వివరించారు. వచ్చే ఏడాది ఆన్లైన్ బీమా పథకాలను కూడా ఆవిష్కరిస్తామన్నారు. తాము 'గ్రూపు ఆక్టివ్ హెల్త్', 'రిటైల్ ఆక్టివ్ హెల్త్' పథకాలను అందిస్తున్నామన్నారు. ఇతర బీమా కంపెనీలతో పోల్చితే ఇవి చౌక అయిన పథకాలని పేర్కొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
స్టార్టప్లకు కేంద్రం వరాలు
కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ నిర్వచనాన్ని కూడా మార్చింది. ఏదైనా ఒక కంపెనీ ప్రారంభించిన (రిజిస్ట్రేషన్) నాటి నుంచి 10 ఏళ్ల వరకు స్టార్టప్గానే పరిగణిస్తారు. గతంలో ఇది ఏడేళ్లు మాత్రమే ఉండేది.
Samayam Telugu | Updated:
Feb 19, 2019, 06:41PM IST
హైలైట్స్
ఏంజల్ ట్యాక్స్ నిబంధనల సరళీకరణ
రూ.25 కోట్ల వరకు ఇన్వె్స్ట్మెంట్లపై పన్ను మినహాయింపు
ఇప్పటి వరకు ఈ పరిమితి రూ.10 కోట్లు
స్టార్టప్ నిర్వచనంలోనూ మార్పులు
కేంద్ర ప్రభుత్వం స్టార్టప్లకు చేయూతనందించేందుకు సిద్ధమైంది. వీటిని ప్రోత్సహించేందుకు పలు వరాలు కురిపించింది. ఏంజల్ ట్యాక్స్ నిబంధనలను సరళీకరించాలని నిర్ణయించింది. రూ.25 కోట్ల వరకు ఇన్వె్స్ట్మెంట్లపై పన్ను మినహాయింపు కల్పించింది. ప్రస్తుతం ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన నిధులు సహా స్టార్టప్ మొత్తం ఇన్వెస్ట్మెంట్లు రూ.10 కోట్లు దాటకపోతేనే పన్ను మినహాయింపు సౌకర్యం ఉంది. ఇప్పుడు రూ.25 కోట్ల వరకు ఇన్వె్స్ట్మెంట్లపై ఈ సౌలభ్యం పొందొచ్చు. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల కానుంది.
కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ నిర్వచనాన్ని కూడా మార్చింది. ఏదైనా ఒక కంపెనీ ప్రారంభించిన (రిజిస్ట్రేషన్) నాటి నుంచి 10 ఏళ్ల వరకు స్టార్టప్గానే పరిగణిస్తారు. గతంలో ఇది ఏడేళ్లు మాత్రమే ఉండేది. ఈ సంస్థలు కచ్చితంగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వద్ద నమోదవ్వాలి. అలాగే వీటి వార్షిక టర్నోవర్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లకు లోపే ఉండాలి. రూ.100 కోట్లు దాటితే స్టార్టప్గా పరిగణించరు. ప్రస్తుతం టర్నోవర్ పరిమితి రూ.25 కోట్లుగా ఉంది.
Delighted to inform you that a Gazette Notification will be issued today simplifying the process for startups to ge… https://t.co/WVCTZ8b3xM
— Suresh Prabhu (@sureshpprabhu) 1550554294000
అలాగే రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన లిస్టైడ్ కంపెనీ, ప్రవాసులు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (కేటగిరి 1) ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్ చేస్తే రూ.25 కోట్ల పరిమితిని దాటినా కూడా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56 (2) (7బి) కింద మినహాయింపు పొందొచ్చు.
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56 (2) (7బి) కింద మినహాయింపు పొందాలంటే స్థిర ఆస్తి, రూ.10 లక్షలపైన విలువైన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వంటివి చేయకూడదు. | 1entertainment
|
HASSAN
పాక్ జాతీయ జట్టుకు ఆడాలన్నదే కల
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఇటీవల చా§్ువాలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం పొంది ఇప్పుడు ఏకంగా మోడల్ అయిపోయాడు.ఇప్పుడు ఒ పరాటా మేకర్ పాకిస్థాన్ క్రికెట్లో సంచలనంగా మారుతున్నాడు.తన టార్గెట్ పాక్ జాతీయ జట్టు కు ఆడటమేనంటున్నాడు.వివరాల్లోకి వెళితే బలూ చిస్థాన్కు చెందిన హసన్ఖాన్ అనే యువకుడు స్థానిక రెస్టారెంట్లో పరాటా మేకర్గా పనిచేస్తూ క్రికెట్ ఆడుతున్నాడు. హోటల్లో వచ్చే డబ్బుల తోనే క్రికెట్ కిట్కొని ప్రాక్టీస్ చేసేవాడు. జిల్లా స్థాయిలో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్గా అతని ప్రతిభ గురించి తెలుసుకున్న క్రికెట్ పెద్దలు క్వెట్టా డొమెస్టిక్ గ్రేడ్-2 మ్యాచ్లో అవ కాశం కల్పిం చారు. అక్కడ చక్కటి ప్రదర్శన కనబర్చడంతో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ఎంపికై పాకిస్థాన్ సూపర్లీగ్(పిఎస్ఎల్)లో ఆడాడు. ఇటీ వల పాకి స్థాన్ క్రికెట్ బోర్డు అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చింది.అదేంటంటే జాతీయ క్రికెట్ అకాడమీ జట్టుకు అతడ్ని ఎంపిక చేసింది. జనవరి 14 నుంచి పాక్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సిఎ), మలేసియా జట్ల మధ్య లాహోర్లో టి20 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ సిరీస్లో గానీ హసన్ ఖాన్ మెరిస్తే గనుక, నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపి స్తుంది. ఎస్సిఎ జట్టులోకి ఎంపిక చేసినందుకు క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇంత తొంద రగా వస్తుందనుకోలేదు. అంతా అల్లా దయ. ఎప్పటికైనా జాతీయ జట్టులో ఆడాలన్నదే నా కల అని క్రికెటర్గా ఎదుగుతున్న ఈ పరాటా మేకర్ హసన్ ఖాన్ వివరించాడు. | 2sports
|
Visit Site
Recommended byColombia
టీమ్లో రిషబ్ పంత్ తరహా హిట్టర్ ఉండింటే బాగుండేదని అభిప్రాయపడిన హర్భజన్ సింగ్.. కనీసం ఇకనైనా అతనికి ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు. నిన్న 289 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ శిఖర్ ధావన్ (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), అంబటి రాయుడు (0) ఫెయిలవగా.. రోహిత్ శర్మ (133: 129 బంతుల్లో 10x4, 6x6), మహేంద్రసింగ్ ధోని (51: 96 బంతుల్లో 3x4, 1x6) సత్తాచాటారు. అయినప్పటికీ ఆఖర్లో రోహిత్కి సహకారం లభించకపోవడంతో భారత్ 254/9కే పరిమితమైంది.
భారత వన్డే జట్టులోకి హార్దిక్, రాహుల్ స్థానంలో శంకర్, శుభమన్ ఎంపిక
‘ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ తరహాలో రిషబ్ పంత్ హిట్టింగ్ చేయగలడు. ఎంతలా అంటే ఒక ఓవర్లోనే ఆరు సిక్సర్లు కొట్టలేడుగానీ.. ఓ 30 బంతులు ఆడితే మాత్రం కనీసం ఆరు సిక్సర్లు కొట్టే సామర్థ్యం అతనిలో ఉంది. ఆ మాత్రం హిట్టింగ్ చాలదా..? మ్యాచ్ని మలుపు తిప్పడానికి. ప్రస్తుతం భారత్ జట్టుకి ఓ పవర్ హిట్టర్ అవసరం ఉంది. ఆరంభంలోనే వేగంగా మూడు వికెట్లు చేజారిన తర్వాత.. లోయర్ ఆర్డర్లో పంత్ తరహా హిట్టర్ ఉంటే జట్టుకే మేలు జరుగుతుంది’ అని హర్భజన్ సూచించాడు.
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం రెండో వన్డే, ఆ తర్వాత మెల్బోర్న్ వేదికగా శుక్రవారం మూడో వన్డేని భారత్ ఆడనుంది. అనంతరం జనవరి 23 నుంచి న్యూజిలాండ్ పర్యటనలో ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyderabad, First Published 3, Sep 2019, 11:21 PM IST
Highlights
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్గా 44 ఎపిసోడ్లను పూర్తి చేసి మంగళవారం నాటితో 45వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి ఎంటర్ అయింది యాంకర్ శిల్పా చక్రవర్తి. ఇక మంగళవారం ఎపిసోడ్ లో తన గేమ్ ని మొదలుపెట్టింది శిల్పా. హౌస్ లో తన మొదటిరోజు కాబట్టి అన్నీ గమనిస్తున్నానని రేపటి నుండి విజృంభిస్తా అంటూ సవాల్ చేసింది.
ఒక్కరోజు కాకపోతే వారంరోజులు గమనించు.. వారంలోనే వెళ్లిపోవచ్చు కూడా అంటూ పంచ్ వేశారు బాబా భాస్కర్. ఆ మాట తనకు నచ్చలేదని బాబాకి మొహం మీదే చెప్పింది శిల్పా. ఇక శిల్పాకి శ్రీముఖికి పడదని.. వారిద్దరికీ ఏవో పాత ప్రాబ్లమ్స్ ఉన్నాయని రాహుల్ తో గుసగుసలాడింది పునర్నవి.
ఈ వారం టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్కు దొంగలు దోచిన నగరం అనే టాస్క్ ఇచ్చారు. దొంగలు ముఠా, నగర వాసులు అని కంటెస్టెంట్స్ను రెండు గ్రూపులుగా విడగొట్టి గేమ్ ఆడించారు. దొంగలకు రాణిగా శిల్పాను పెట్టారు. గేమ్ మొదలైన తరువాత టాస్క్ మొత్తం హింసాత్మకంగా మారిపోయింది.
ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ రచ్చ చేశారు. దీంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ లివింగ్ ఏరియాలోకి పిలిచి హౌస్లో హింసకు తావులేదని చెప్పారు. అయినప్పటికీ టాస్క్ అలా డిజైన్ చేయడంతో హౌస్ మేట్స్ తన్నుకోక తప్పలేదు. ఇక ఈ టాస్క్ రేపటి ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవ్వనుంది.
Last Updated 3, Sep 2019, 11:21 PM IST | 0business
|
Hyderabad, First Published 6, Oct 2018, 11:18 AM IST
Highlights
సెలబ్రిటీల పిల్లలకి కష్టాలు ఏముంటాయని అందరూ అనుకుంటారు. కానీ వారు కూడా అందరిలానే సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కూతురు పూజా భట్ దర్శకురాలిగా, నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది.
సెలబ్రిటీల పిల్లలకి కష్టాలు ఏముంటాయని అందరూ అనుకుంటారు. కానీ వారు కూడా అందరిలానే సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కూతురు పూజా భట్ దర్శకురాలిగా, నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది.
అయితే కొంతకాలం పాటు ఆమె ఓ వ్యక్తితో డేటింగ్ చేసేదట. అతడికి విపరీతమైన తాగుడు అలవాటు ఉండేదని, తాగొచ్చి ఆమెని కొట్టేవాడని షాకింగ్ కామెంట్స్ చేసింది పూజా భట్. అతడి గురించి ఆమె మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ.. ఇలాంటి చెత్త గురించి బయట చర్చించడం వల్ల వచ్చే లాభం ఏముంటుందని ప్రశ్నించిందని ఆమె గుర్తుచేసుకుంది.
మహేష్ భట్ కూతుర్ని అయినంత మాత్రమా.. నాకు తక్కువ బాధ కలగదు కదా..? అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో తనుశ్రీ వివాదం వెలుగులోకి రావడంతో.. ఈ వివాదంపై స్పందిస్తూ.. పూజా భట్ తను ఎదుర్కొన్న విషయాలను వెల్లడించింది.
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ చెప్పినప్పుడుఇన్నేళ్లు నోరు మూసుకొని ఉన్న ఆమె ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందని కొందరు అనడం స్వయంగా విన్నానని పూజా భట్ తెలిపారు.
సంబంధిత వార్తలు.. | 0business
|
Hyderabad, First Published 2, Sep 2019, 5:08 PM IST
Highlights
సాహో.. డిజాస్టర్, అట్టర్ ప్లాఫ్, అంటూ కామెంట్స్, రివ్యూస్ వచ్చినా కలెక్షన్స్ వైజ్ గా సత్తా చాటింది. బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. ఫస్ట్ డే నే కలెక్షన్స్ విషయంలో దుమ్ముదులిపింది.ముఖ్యంగా హిందీలో టాక్తో సంబంధం లేకుండా ‘సాహో’ రికార్డు కలెక్షన్స్ తో దూసుకువెల్తోంది. నార్త్ లో ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యింది. బీహార్ వంటి ఏరియాల్లో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది.
సాహో.. డిజాస్టర్, అట్టర్ ప్లాఫ్, అంటూ కామెంట్స్, రివ్యూస్ వచ్చినా కలెక్షన్స్ వైజ్ గా సత్తా చాటింది. బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. ఫస్ట్ డే నే కలెక్షన్స్ విషయంలో దుమ్ముదులిపింది.ముఖ్యంగా హిందీలో టాక్తో సంబంధం లేకుండా ‘సాహో’ రికార్డు కలెక్షన్స్ తో దూసుకువెల్తోంది. నార్త్ లో ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యింది. బీహార్ వంటి ఏరియాల్లో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది.
అయితే వినాయిక చవితి , వీకెండ్ ఎఫెక్ట్ ఇప్పటికి దాకా చూపించింది. ఆ డ్రీమ్ రన్ త్వరలోనే క్లోజ్ అవుతోందంటున్నారు ట్రేడ్ నిపుణులు. బాహుబలి సక్సెస్, ప్రభాస్ కు పాన్ ఇండియా ఇమేజ్ , కాంపిటేషన్ సినిమాలు లేకపోవటం, భారీ ప్రమోషన్స్, ప్రోమోలలో వదిలిన భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఫస్ట్ వీకెండ్ కు కలిసొచ్చాయి. గణేష్ చతుర్ది సైతం మంచి ఫలితాన్నే ఇచ్చింది. అయితే రేపటి నుంచి సాహోకు అసలైన టెస్టెంట్ టైమ్.
అది ప్రక్కన పెడితే సాహో కొట్టిన దెబ్బకు ...ఆయన తదుపరి చిత్రం జాను పై పడిందని సమాచారం. మీడియా వర్గాల్లో ప్రచారం అవుతున్న దాన్ని బట్టి ఈ సినిమా ఆపేసారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మాత్రమే జరిగింది. పూజ హెడ్గే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంది. అయితే సాహోప్రమోషన్స్ కోసం ఆ షూటింగ్ ఆపు చేసారు.
సాహో ఫెరఫార్మెన్స్ బట్టి ఆ సినిమాని ముందుకు తీసుకెళ్దామనుకున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందే ఆ సినిమాని ఇప్పుడున్న పరిస్దితుల్లో ప్రక్కన పెడ్డటమే బెస్ట్ అని నిర్మాతలు యువి క్రియేషన్స్ నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే సాహో రన్ పడిపోతే రికవరీలు ఇవ్వాలి. ఆ ఇంపాక్ట్ నెక్ట్స్ ఫిల్మ్ మీద పడుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Last Updated 2, Sep 2019, 5:08 PM IST | 0business
|
Currency
రూ.500 కోట్లు తగ్గకుండా గ్రామీణులకు చేరువకావాలి
ముంబై, జనవరి 3: బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలకు తాజాగా రానున్న రోజుల్లో రూ.500 కోట్లకు తక్కువ కాకుండా గ్రామీణప్రాంతాలు పంపిణీచేయాల్సిన అనివార్య పరిస్థితులు అలుముకున్నాయి. జిల్లాస్థాయి ప్రస్తుత కరెంటు, పొదుపుఖాతాల గణాంకాల ఆధారంగా ఈ మొత్తం కస్టమర్ల అవసరాలకు పంపిణీచేయాల్సి ఉంటుందని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో 40శాతం గ్రామీణ ప్రాంతాలకు పంపిణీచేయాలని, పెద్దనోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను అధిగమిం చేందుకు కొత్తగా వచ్చిన రూ.500 నోట్లు లేదా అంతకు తక్కువ నోట్లను కూడా పుష్కలంగా గ్రామీణ ప్రాంతాలకు చేరువచేయాలని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్కంపెనీలు యోచిస్తున్నా యి.
ఇప్పటికిప్పుడు పరిస్థితులను బేరీజువేస్తే 40శాతం నోట్లపంపిణీ జరగలేదనే తెలుస్తోంది. బ్యాంకులు తాజానోట్లు గ్రామీణశాఖలకు ఇచ్చేం దుకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులవద్ద కరెన్సీ చెస్ట్లను కూడా నిర్వహిస్తున్నాయి. జిల్లా సహకార బ్యాంకులు, ఇతర వాణిజ్యబ్యాంకులు, వైట్లేబుల్ ఎటిఎంలు, పోస్టాఫీసులు వంటివాటికి ప్రాధాన్యతా క్రమంలో నోట్లను పంపిణీచేయాల్సి ఉంటుందని మేధావులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. జిల్లా స్థాయి పొదుపు, కరెంటుఖాతాల గణాంకాల ఆధా రంగా పంపిణీ వ్యవస్థను తరచూ తనిఖీలు చేయా లని గ్రామీణ, అర్బన్ ప్రాంత కస్టమర్లను బేరీజు వేసుకోవాలని కూడా ఆర్థిక నిపుణుల అంచనా. జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న కరెన్సీచెస్ట్లు బ్యాంకు నోట్లను నిర్దిష్టమైన నిష్పత్తిలో గ్రామీణ ్ రపాంతాలకు సరఫరాచేయాలని కోరు తున్నారు. ఆర్బిఐ తన అధికారిక నోటి ఫికేషన్లో ఇదే అంశాలనుప్రస్తావిస్తూ తన వెబ్ సైట్లో ఉంచింది.
ఎటిఎంలు, వైట్లేబుల్ ఏటిఎం ఆపరేటర్లు వంటివి రూ.500, రూ.100 నోట్లు కూడా ఎటిఎం కేటగిరీల్లో పంపిణీకి సిద్ధంచేయాలని ఆర్బిఐసూచించింది. ఎటిఎం లు, ప్రైవేటుఎటిఎంలు రెండూ కూడా గరిష్టస్థాయిలో కరెన్సీని సిద్ధంగాఉంచుకోవాలని ఆర్బిఐ సూచించింది. రూ.100కు తక్కువ ఉన్న నోట్లను సులభం గా జారీచేయాలని ఆర్బిఐ సూచించింది. అలాగే బ్యాంకు లు నాణేలకు ఇండెంట్లు వేయా లని, ఆర్బిఐ పంపిణీ విభాగం నుంచి సరఫరా పొందాలని ఆర్బిఐ సూచించింది. ప్రజల కు అవసరాల నిమిత్తం జారీచేసే కరెన్సీకి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆర్బిఐ కూడా బ్యాంకులు, ఆర్థికరంగ సంస్థలకు ఆదేశాలు జారీచేసింది. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
5 బ్యాంకుల ఎన్పీఏలే రూ.46 వేల కోట్లు
దేశంలో 22 వరకు ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలపై రిజర్వుబ్యాంక్ ఇండియా డేగకన్నువేసింది. ఈ బకాయిలను కనిపెట్టి వాటి వసూళ్లకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దిద్దుబాటు చర్యలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను చేసింది
Samayam Telugu | Updated:
May 30, 2018, 02:54PM IST
దేశంలోని ఐదు పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో అంచనా కంటే ఎక్కువగా రూ.46వేల కోట్ల మేర మొండి బకాయిలు ఉన్నట్లు రిజర్వు బ్యాంక్ ఇండియా ఆడిట్లో తేలింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరికి బ్యాంకుల బకాయిలను ఆడిటర్లు లెక్కించారు. పెద్ద బ్యాంకుల జాబితాలో ఐడిబిఐ లేనన్పటికీ, ఈ బ్యాంకు మొండి బకాయిలు రూ. 56వేల కోట్లకు చేరడం గమనార్హం. బ్యాంకులను ఆడిట్ చేయడం వల్ల పై మొండి బకాయిలు బయటపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్రమైన నష్టాల్లో ఉన్నాయని తేలింది.
దేశంలో 22 వరకు ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలపై రిజర్వుబ్యాంక్ ఇండియా డేగకన్నువేసింది. ఈ బకాయిలను కనిపెట్టి వాటి వసూళ్లకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దిద్దుబాటు చర్యలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను చేసింది. ఈ బ్యాంకుల నిరర్ధక ఆస్తుల విలువ గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే పరిణామం.
మొండి బకాయిలు పేరుకుపోయిన బ్యాంకులు తిరిగి పుంజుకునేందుకు ఆర్బీఐ నిర్దేశించిన ప్రణాళికను అమలు చేసినా నిలదొక్కుకోవడం కష్టమేనని ఆర్బిఐ మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్ఎస్ ముంద్రా చెప్పారు. మొండి బకాయిల వసూళ్లు న్యాయపరంగా, లాజిస్టిక్గా అనేక సవాళ్లను ఎదుర్కొనే ప్రక్రియగా మారింది. | 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.