news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Hyderabad, First Published 19, Oct 2018, 10:57 AM IST
Highlights
కోలీవుడ్ లేడీ డైరెక్టర్ లీనా మణిమేకలై మరో దర్శకుడు సుశీ గనేషన్ పై లైంగిక ఆరోపణలు చేసింది. కారులో లిఫ్ట్ ఇచ్చి మరీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో సుశీ గనేషన్ స్పందిస్తూ.. లీనా కావాలనే ఇదంతా చేస్తుందని ఆమె ఆరోపణలను ఖండించారు.
కోలీవుడ్ లేడీ డైరెక్టర్ లీనా మణిమేకలై మరో దర్శకుడు సుశీ గనేషన్ పై లైంగిక ఆరోపణలు చేసింది. కారులో లిఫ్ట్ ఇచ్చి మరీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో సుశీ గనేషన్ స్పందిస్తూ.. లీనా కావాలనే ఇదంతా చేస్తుందని ఆమె ఆరోపణలను ఖండించారు. ఈ విషయంలో హీరో సిద్ధార్థ్.. లీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో సుశీ గనేషన్ అతడిని బెదిరించాడు. సిద్ధార్థ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ సుశీ గనేషన్ గురించి ఇప్పటికైనా తెలుసుకోండి అంటూ ట్వీట్ చేశాడు.
తన ఇమేజ్ కి డ్యామేజ్ జరగడంతో సుశీ గనేషన్ ఇప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాడు. తన పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తుండం సెయింట్ థామస్ మౌంట్ అసిస్టెంట్ కమీషనర్ కి దర్శకురాలు లీనా మణిమేకలపై ఫిర్యాదు చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తోన్న లీనాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా స్థానిక సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టులో ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అందులో దర్శకురాలు లీనా చేసిన వ్యాఖ్యలు తనను మనోవేదనని గురిచేశాయని పేర్కొన్నారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు ఈ నెల 22న విచారణ జరపనుంది.
ఇవి కూడా చదవండి.. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
త్రివిక్రమ్తో పవన్ సినిమాకి ప్లానింగ్ ?
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో సినిమా అంటే పవన్ ఫ్యాన్స్కి అంతకన్నా క్రేజీ న్యూస్ మరొకటుండదేమో!
| Updated:
Jun 1, 2016, 09:52AM IST
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో సినిమా అంటే పవన్ ఫ్యాన్స్కి అంతకన్నా క్రేజీ న్యూస్ మరొకటుండదేమో! జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు ఆ ఇద్దరి కాంబినేషన్ని బాగా హైలైట్ చేశాయి. తాజాగా ఈ ఇద్దరు మరో సినిమాకి ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ఎస్.జే. సూర్య డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో పవన్ బిజీ అయ్యాడు. ఇదిలావుంటే నితిన్, సమంతల కాంబినేషన్లో రిలీజ్కి రెడీ అవుతున్న అ..ఆ సినిమాతో ప్రస్తుతం త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. అ..ఆ రిలీజవడంతోనే కాస్త ఫ్రీ అయ్యే త్రివిక్రమ్ ఆ తర్వాత జూన్ నుంచి పవన్ సినిమా స్క్రిప్ట్పై కూర్చుంటాడని... నవంబర్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని టాక్ వినిపిస్తోంది. ఆలోగా ఎస్.జే. సూర్య సినిమా వర్క్ పూర్తి చేసుకుని పవన్ కూడా త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడనేది ఆ వార్తల సారాంశం. అంతాబాగానే వుంది కానీ మొన్నామధ్య వరకు హరీష్ శంకర్ డైరెక్షన్లో సినిమాకి ప్లానింగ్ జరుగుతోందని తెలిసింది. మరి ఆ ప్రాజెక్ట్ సంగతేంటనేదే ప్రస్తుతానికి అర్థం కాని విషయం. అసలు ఆ పార్జెక్టు వున్నట్టా లేనట్టా అనేది తెలియాలంటే ఇంకొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అంచనాలు పెంచుతున్న 'కడంబన్' టీజర్
భారీ బడ్జెట్తో ఎపిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న సినిమా 'కడంబన్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ టీజర్ విడుదల చేశారు....
TNN | Updated:
Nov 2, 2016, 04:44PM IST
ఆర్య , కేథరీన్ ట్రెసా హీరోహీరోయిన్లుగా భారీ బడ్జెట్‌తో ఎపిక్ యాక్షన్ డ్రామాగా తమిళంలో రూపొందుతున్న సినిమా 'కడంబన్'. రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్.బీ చౌదరి నిర్మిస్తుండగా, బి. సురేష్, జీవన్, జితన్ రమేష్, జీవా మరియు ఆర్యలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్ విడుదల చేశారు. వైల్డ్ లుక్‌తో టార్జాన్ లాగా హీరో ఆర్య కనిపించడం పట్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఆర్. బీ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు కాబట్టి ఈ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 16న ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
Arya has been working quite a bit on his physique for the forest-themed flick, ‘Kadamban’ for the past year. Now, the first look has been unveiled and it looks like all his hard work in the gym has paid off really well.
In the first look, the actor can be seen wearing a small dhoti, flaunting his ripped body. His pose and the jungle background really give off the required vibe, which is very exciting for Kollywood. However, the stick in his hands signifies that he is somewhat more civilized than the actual Tarzan character. On the whole, it definitely looks like an action film every cinema lover should look forward to. | 0business
|
Hyderabad, First Published 24, Sep 2018, 12:12 PM IST
Highlights
బిగ్ బాస్ సీజన్ 2 లో ఫినాలేకి చేరుకున్న కౌశల్ పై కత్తి మహేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల హౌస్ లో చోటుచేసుకున్న సంఘటనలను ఆధారం చేసుకొని.. 'కౌశల్ అంతా కోల్పోయాడు.. అతడిని హౌస్ నుండి బయటకి గెంటేయండి' అని పోస్ట్ పెట్టారు కత్తి మహేష్.
బిగ్ బాస్ సీజన్ 2 లో ఫినాలేకి చేరుకున్న కౌశల్ పై కత్తి మహేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల హౌస్ లో చోటుచేసుకున్న సంఘటనలను ఆధారం చేసుకొని.. 'కౌశల్ అంతా కోల్పోయాడు.. అతడిని హౌస్ నుండి బయటకి గెంటేయండి' అని పోస్ట్ పెట్టారు కత్తి మహేష్.
శనివారం ఎపిసోడ్ లో నాని కౌశల్ ని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. 'చాలా పేలవమైన, విసుగుపుట్టించే సమాధానం కౌశల్ చెప్పాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అతడు చికాకు తెప్పించే వ్యక్తి' అని చెబుతూ.. తాజాగా మరొక పోస్ట్ పెట్టారు. 'కౌశల్ బిగ్ బాస్ 2 లోనే చాల విసుగు తెప్పించే వ్యక్తి. ఒకవేళ అతను బిగ్ బాస్ 2 టైటిల్ గెలిస్తే మనమెంత ఇడియట్స్ అనే విషయం ప్రూవ్ అవుతుంది' అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఇక తాను హౌస్ లో కంటెస్టెంట్ దీప్తి నల్లమోతు కోసం కాంపెయిన్ నిర్వహిస్తానని తెలిపారు. కౌశల్ ని టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ చేసిన కామెంట్స్ పై స్పందించిన ఓ మహిళ.. ''ప్రజలు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్లనే మీరెందుకు టార్గెట్ చేస్తారని'' ప్రశ్నించింది. దీనికి సమాధానంగా 'ప్రజల ఒపీనియన్ తో తనకు సంబంధం లేదని.. తన దారిలో తాను వెళ్తానని' స్పష్టం చేశాడు కత్తి మహేష్.
ఇవి కూడా చదవండి.. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహ్మద్ షమీ
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో షమీ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
TNN | Updated:
Mar 25, 2018, 11:14AM IST
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహ్మద్ షమీ
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో షమీ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ నుంచి షమీ క్షేమంగా బయటపడ్డాడు. కానీ అతడి తలకు గాయాలయ్యాయి. డెహ్రాడూన్లోని ఆసుపత్రిలో చేరగా.. అతడి తలకు కుట్లు వేసిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఒకట్రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. షమీ ప్రయాణిస్తోన్న కారును లారీ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. | 2sports
|
internet vaartha 187 Views
పాక్ ముద్దుగుమ్మ ప్రశ్న ?
న్యూఢిల్లీ : టి20 వరల్డ్ కప్లో భారత్పై గెలిస్తే స్ట్రిప్ డాన్స్ చేస్తానని ప్రకటించి సంచలనం రేపిన పాకిస్థాన్ ముద్దుగుమ్మ క్వండిల్ బలోచ్ కొత్త పల్లవి అందుకుంది. కాగా భారత్ చేతిలో ఓటమిపాలైన పాక్ జట్టును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఆవేశం చల్లారిన తరువాత అఫ్రిది నువ్వే నా లవర్ అంటూ పేర్కొంది, కాగా తాజాగా మనసు మార్చుకుని కోహ్లీకి ఒక ట్వీట్ ఇచ్చింది. కోహ్లీ ఇంకా నీ జీవితంలో అనుష్కాశర్మ ఉందా? అని అడిగింది. ఇప్పుడిప్పుడే బ్రేకప్ నుంచి కోలుకుని ఆమెను కలుపుకునేదిశగా స్పందిస్తున్న కోహ్లీ దీనికి ఏమంటాడో చూడాలి. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మహేష్ బాబు- మురుగదాస్ మూవీ టైటిల్ 'ఏజెంట్ శివ'?
మహేష్ బాబు సినిమా కావడం, మురుగదాస్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ ఉండటంతో సినిమా ప్రీబిజినెస్ ప్రతీ ఏరియాలో మహేష్ ఇదివరకు సినిమాల కంటే రెట్టింపు స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం...
TNN | Updated:
Oct 26, 2016, 02:39PM IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో మూవీ అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అయితే సినిమా సంగతి ఎలా ఉన్నా వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ టైటిల్‌పై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఒక వైపు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ టైటిల్ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు చిత్ర యూనిట్. 'ఎనిమీ' , ‘అభిమన్యుడు’ టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా వాటిపై ఆసక్తి చూపుతున్నట్లు లేదు. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం ' ఏజెంట్ శివ ' అనే మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.
ఈ సినిమాలో మహేష్ ఓ ఇంటెలింజెట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. అందుకు 'ఏజెంట్ శివ' టైటిల్‌పై మహేష్ ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో ఇదే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో మురుగదాస్ ఉన్నట్లు చిత్రానికి సంబంధించిన సభ్యుల ద్వారా తెలుస్తోంది. మహేష్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తుంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి ఎందుకు పెట్టాలి?
పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించి దాన్ని ఈక్విటీ, డెట్ షేర్లలో పెట్టుబడి పెడతారు. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా ప్రొఫెషనల్ మేనేజర్లు ఉంటారు.
Samayam Telugu | Updated:
May 11, 2018, 11:55AM IST
మ్యూచువల్ ఫండ్లు
చిన్న మొత్తాల్లో నిరంతరం మదుపు చేయాలని అనుకునే వారికి మ్యూచువల్ ఫండ్లు ఒక చక్కటి మార్గం. పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించి దాన్ని ఈక్విటీ, డెట్ షేర్లలో పెట్టుబడి పెడతారు. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా ప్రొఫెషనల్ మేనేజర్లు ఉంటారు. ఫండ్ మేనేజర్లు పెట్టుబడిదారుల నుంచి భాగస్వామ్యం పొందిన మొత్తాలను జమ చేసి, ఆ ఫండ్ లక్ష్యాలను సాధించేందుకు తగిన రీతిలో మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెడతారు. అయితే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు అనగానే చాలా మందికి వచ్చే సందేహం అవి స్టాక్ మార్కెట్ సంబంధితమైనవని. అవును ఇవి స్టాక్ మార్కెట్ ఆధారమైన పెట్టుబడులే అయినా అంత రిస్క్ ఉండవు. స్టాక్ మార్కెట్ ఆధారంగా మంచి రాబడులు పొందాలనుకుంటూ ఎక్కువ రిస్క్ తీసుకోలేని వారికి ఇది ఒక మంచి మార్గం. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రోత్సాహం కలిగించే 10 కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్
1. వృత్తిపర నిపుణుల ద్వారా నిర్వహణ:
అనుభవజ్ఞులు మరియు వృత్తిపర నిపుణుల సేవలు మీకు లభిస్తాయి.వీళ్ళు ఆయా ఫండ్ల నిర్వహణను మరియు కంపెనీల అవకాశాలను పరిశీలిస్తారు మరియు పథకము యొక్క లక్ష్యాలను సాధించటం కోసం తగిన పెట్టుబడులను ఎంచుకుంటారు. సాధారణ పెట్టుబడిదారులకు అంత అవగాహన కానీ వాటిని పర్యవేక్షించే సమయం కానీ ఉండదు. కాబట్టి ఏఎమ్సీ నియమిత నిపుణులు మ్యూచువల్ ఫండ్ల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
2. వివిధీకరణ:
విస్తారమైన వివిధ వర్గాల పరిశ్రమలలో మరియు విభాగాలలో మ్యూచువల్ ఫండ్ లు పెట్టుబడి పెడతాయి. ఈ వివిధీకరణ ముప్పును తగ్గిస్తుంది ,ఎందుకంటే, చాలా అరుదుగా అన్ని స్టాకులు ఒకేసారి మరియు ఒకే పరిమాణంలో పడిపోతాయి. ఈ వివిధీకరణను, మీ అంతట మీరే చేసే దాని కన్నా మ్యూచువల్ ఫండ్ ద్వారా చేస్తే ,చాలా తక్కువ డబ్బు తో దీనిని సాధించవచ్చు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
3. పాలన సౌలభ్యం :
మ్యూచువల్ ఫండ్ లలో పెట్టుబడి పెట్తే , పేపర్ పని తగ్గుతుంది మరియు అధ్వానమైన డెలివరీలు, చెల్లింపులలో ఆలస్యం మరియు బ్రోకరులతో మరియు కంపెనీలతో అనవసరంగా మళ్ళీ మళ్ళీ కనుక్కోవడం లాంటి సమస్యలను మీరు నివారించ వచ్చు. మ్యూచువల్ ఫండ్ లు మీ సమయాన్ని పొదుపు చేస్తాయి. మరియు పెట్టుబడులను పెట్టడమును సులభతరముగా మరియు సౌకర్యవంతంగా చేస్తాయి.
4. రాబడుల సంభావ్యత
మధ్య కాలం నుండి దీర్ఘకాలంలో, మ్యూచువల్ ఫండ్ లకు ఎక్కవ రాబడుల సంభావ్యత ఉంది, ఎందుకంటే, వాళ్ళు , ఎంపిక చేసిన సెక్యూరిటీలను వివిధీకృత బాస్కెట్లలో పెట్టుబడి పెట్తారు.
5. తక్కువ ఖర్చులు:
మూలధన మార్కెట్ ల లో సీదా పెట్టుబడి పెట్టడం తో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్ లు, తక్కువ ఖర్చు తో పెట్టుబడి పెట్టే విధానం, ఎందుకంటే బ్రోకరేజ్, అధీనానికి సంబంధించిన ఫీజులు మరియు ఇతర ఫీజులు తగ్గడం వలన పెట్టుబడిదారుల ఖర్చు తగ్గుతుంది
6. స్థిరచరాస్తులను నగదుగా మార్చడం:
ఓపెన్ ఎండెడ్ పథకాలలో, ఆస్తుల నికర విలువకు (ఎన్ ఎ వి)సంబంధించిన ధరకు మ్యూచువల్ ఫండ్ ల నుండి సత్వరంగా మీ డబ్బు లభిస్తుంది. క్లోజ్ ఎండెడ్ పథకాలలో, స్టాక్ ఎక్స్చేంజ్ లో , అప్పుడున్న మార్కెట్ ధరకు మీ యూనిట్ లను అమ్మాలి లేదా నియత కాలంలో ప్రతిపాదించిన, కొన్ని క్లోజ్-ఎండెడ్ మరియు ఇంటర్వల్ పథకాలలో మ్యూచువల్ ఫండ్ ద్వారా యూనిట్ లను ఎన్ ఎ వి సంబంధిత ధరలో తిరిగి కొనాలి.
7. పారదర్శకత:
మీకు నియతకాలంలో మీ పెట్టుబడి యొక్క విలువ గురించి నియమబద్ధంగా సమాచారము లభిస్తుంది అంతేకాకుండా మీ పథకం ద్వారా చేసిన ప్రత్యేక పెట్టుబడుల గురించి, ప్రతి ఆస్తుల వర్గాలలో పెట్టుబడి చేసిన అనుపాతం మరియు నిధుల నిర్వహణాధికారి యొక్క పెట్టుబడి వ్యూహం మరియు దృక్పధం గురించి తెలియజేయబడుతుంది .
8. సర్దుబాటుకు వీలుండటం:
క్రమబద్ధ పెట్టుబడుల ప్రణాళికలు (ఎస్ ఐ పి), క్రమబద్ధ ఉపసంహరణ ప్రణాలికలు (ఎస్ డబ్ల్యూ పి) డివిండెండ్ ను తిరిగి పెట్టుబడి పెట్టడానికి ప్రణాళికలు వంటి ఫీచర్ ల ద్వారా మీ అవసరాలు మరియు సౌలభ్యానికి అనుకూలంగా, క్రమబద్ధంగా పెట్టుబడి పెట్ట వచ్చు లేదా నిధులను తీసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు _ ప్రయోజనాలు
9. పథకాల ఎంపికలు:
మీ జీవిత కాలంలో మారుతూ ఉండే అవసరాలకు తగిన వివిధ రకాల ప్రణాళికలను మ్యూచువల్ ఫండ్ లు ప్రతిపాదిస్తున్నాయి.
10. బాగా క్రమబద్ధం చేయబడినయి :
అన్ని మ్యూచువల్ ఫండ్ లు సెబితో రిజిస్టర్ చేయబడినయిమరియు పెట్టుబడి దారుల ప్రయోజనాలను సంరక్షించడం కోసం, తయారుజేయబడిన ఖచ్చితమైన నిబంధనల ప్రకారం అవి నిర్వహణ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్ల నిర్వహణను క్రమబద్దంగా సెబి పరిశీలిస్తుంది
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
పోరా శ్రీమంతుడా.. పోపోరా శ్రీమంతుడా!
మహేశ్ బాబు, శ్రుతి హాసన్ జంటగా నటించిన శ్రీమంతుడు సినిమా విడుదలై నేటికీ సరిగ్గా ఏడాది గడిచింది.
TNN | Updated:
Aug 7, 2016, 10:11AM IST
మహేశ్ బాబు, శ్రుతి హాసన్ జంటగా నటించిన శ్రీమంతుడు సినిమా విడుదలై నేటికీ సరిగ్గా ఏడాది గడిచింది. ఊరిని దత్తత తీసుకోవడం కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రజల హృదయాలను తాకింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ మంచి సందేశం ఇస్తూనే కమర్షియల్గానూ విజయం అందుకుంది. మహేశ్ నటన, లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. శ్రుతితో ఆయనకు జోడీ చక్కగా కుదిరింది. పల్లెమీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన తండ్రిగా జగపతి బాబు తనదైన శైలిలో నటించారు. అదే సమయంలో పల్లెలో తన మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకుగా మహేశ్ అద్భుతమే చేశారు. వీరిద్దరితోపాటు హీరోయిన్ శ్రుతిహాసన్, ఆమె తండ్రిగా.. ఊరంతా జనంతో కళకళలాడాలని పరితపించే వ్యక్తిగా రాజేంద్రప్రసాద్ నటన ఆకట్టుకుంది. ఈ తారాగాణానికి తోడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ను ఈ సినిమాకు ప్రాణంగా చెప్పవచ్చు. రామ రామ.., పోరా శ్రీమంతుడా .. పాటలు ఇప్పటికే తెలుగు లోగిళ్లలో మారుమోగుతూనే ఉన్నాయి. శ్రీమంతుడు సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా.. అద్భుతమైన టీంతో కలిసి నటించడం ఆనందాన్ని ఇచ్చిందన్న మహేశ్.. మీ ప్రేమకు చాలా థ్యాంక్స్ అంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
— Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2016
It's been a year since @shrutihaasan stole our hearts as #Charuseela ! #1YearForSensationalSrimanthudu pic.twitter.com/gAAtQUch9D | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
అతను సెంచరీ కొడతాడు.. ఆసీస్ ఓడిపోతుంది
చాలా మంది ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లిని ఇష్టపడుతున్నారు. కానీ కొద్దిమంది రిపోర్టర్లు మాత్రం
TNN | Updated:
Mar 22, 2017, 06:38PM IST
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆట కంటే వివాదాల గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఇరు జట్ల క్రికెటర్ల మధ్య బెంగళూరు టెస్టులో మొదలైన రచ్చ.. రాంచీ టెస్టుతో పతాక స్థాయికి చేరుకుంది. మధ్యలో ఆస్ట్రేలియా మీడియా కూడా దూరడంతో అది కాస్తా రెండు దేశాల మధ్య క్రికెట్ వివాదంలా మారిపోయింది. తాజాగా భారత కెప్టెన్ కోహ్లిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చిన ఆసీస్ మీడియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో ఇప్పటికే మీడియాకి చురకలు అంటించగా.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కూడా కోహ్లికి మద్దతుగా నిలిచి ఆసీస్ మీడియాకి హితవు పలికాడు.
‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని పోల్చడం నీచమైన పని. మైదానంలో కోహ్లి ఏం చేస్తున్నాడో... నిజానికి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా అదే చేస్తున్నాడు. గుర్తించుకోండి.. నాతో పాటు చాలా మంది ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లిని ఇష్టపడుతున్నారు. కానీ కొద్దిమంది రిపోర్టర్లు మాత్రం ఈ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఏ క్రికెటరైనా కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నప్పుడు అతణ్ని ఔట్ చేయడం ప్రత్యర్థికి కష్టమవ్వచ్చు. ప్రస్తుతం విరాట్ కోహ్లి కూడా అదే స్థానంలో ఉన్నాడు. ఈ వరుస వివాదాల నేపథ్యంలో విరాట్ కోహ్లి ధర్మశాలలో భారీ శతకం బాది భారత్ జట్టును గెలిపించేయచ్చు’ అని క్లార్క్ జోస్యం చెప్పాడు. సిరీస్‌లో విజేత
నిర్ణయాత్మకమైన నాలుగో టెస్టు శనివారం నుంచి ధర్మశాలలో జరగనుంది. | 2sports
|
Suresh 106 Views gopi
గోపిచంద్, మైత్రీ ఫౌండేషన్ అవగాహన ఒప్పందం
హైదరాబాద్ (గచ్చిబౌలి), : పుల్లెల గోపిచంద్ బాడ్మింటన్ ఆకాడమీ ఆధ్వర్యంలోని గోపిచంద్ ఫౌండేషన్, ప్రముఖ పవర్ సెక్టార్ కంపెనీ మైత్రీ సంస్థ ఆధ్వర్యంలోని మైత్రీ ఫౌండేషన్లు గురువారం అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. అన్ని క్రీడల్లో ఉన్న నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు చేయూత నిచ్చేందుకు సిద్దమయ్యాయి. కోచ్ లీడ్ అథ్లెటిక్ ప్రోగ్రాం పేరు తో ఆర్థిక స్థోమత లేక అద్బుతమైన నైపుణ్యాన్ని మరుగున పడు తున్న క్రీడాకారులకు చేయూతనిచ్చి శిక్షణ అందించేందుకు ముం దుకు వచ్చారు. ఈమేరకు గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్ బాడ్మింటన్ అకాడమీలో గురువారం జరిగిన కార్యక్రమంలో బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ రవికైలాశ్లు పాల్గొని దీనికి సంబంధించిన వివరాలు వెల్ల డించారు. ద్రోణాచార్య అవార్డు గ్రహిత అథ్లెట్ రమేశ్ ఆధ్వర్యం లో తెలంగాణ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలు, పేద కుటుం బాల నుంచి వచ్చిన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అత్యు త్తమ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరికి ఆర్థిక సహాయంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రానున్న రెండేళ్ల కాలానికి మైత్రీసంస్థ తన సిఎస్ఆర్ ఫండ్గా 3కోట్ల రూపా యలను కేటాయిస్తుంది. మొదటి విడతలో ఇప్పటికే పలు జాతీ యటోర్నీల్లో సత్తా చాటిన ద్యుతిచంద్, కావ్య, జ్యోతి, విశా లాక్షి, నిత్య, దీప్తి, హర్షిత, శిరీషలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కోచ్ గోపిచంద్ మాట్లాడుతూ బాడ్మింటన్తో పాటు మిగిలిన క్రీడల్లోనూ క్రీడాకారులను ఆదుకోవాలని నిర్ణయిం చా మని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని ప్రారం భించా మన్నారు.నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించి వారిని ఎంపిక చేసి గోపిచంద్ అకాడమీతో పాటు పలు ప్రాంతాల్లో కోచ్ రమేశ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ రవి కైలాశ్ మాట్లాడుతూ ఆర్థిక సమ స్యలతో ఎంతో విలువైన నైపుణ్యం ఉన్నక్రీడాకారులు వెలుగులోకి రాకుండా పోతున్నారనివాపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాము ఈ కార్యక్రమంచేపట్టామని, తమను చూసి మరికొంతమంది కార్పొరే టర్ సంస్థలు ముందుకు వస్తే సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి రంగారావు, బాడ్మింటన్ క్రీడాకారులు పివి.సింధు, పారుపల్లి కాశ్యప్, క్రీడాకారులు శంకర్, మృదుల, సౌజన్య, మైత్రిఫౌం డేషన్ సభ్యులు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు
=========== | 2sports
|
Vaani Pushpa 134 Views Bank shares , profits
Bank
ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మరోసారి 25 బేసిస్ పాయింట్లు రెపోరేటును తగ్గించడంతో సోమవారం ట్రేడింగ్లో బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు 1.59శాతం పుంజుకొని రూ.1208.65వద్ద, ఐసిఐసిఐ బ్యాంకు 0.89శాతం పెరిగి రూ.417.60వద్ద కదులుతున్నాయి. మిగిలిన షేర్లలో ఎస్బ్యాంకు 3.68శాతం, కోటక్ మహీంద్రా బ్యాంకు 1.61శాతం, యాక్సిస్ బ్యాంకు 0.49శాతం, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 0.04శాతం పుంజుకోగా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 3.02శాతం, బ్యాంకు ఆఫ్ బరోడా 2.20శాతం, ఫెడరల్ బ్యాంకు 1.57శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 1.53శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు 1.12శాతం, ఆర్బిఎల్ బ్యాంకు 0.59శాతం క్షీణించాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
Cricket tourney
పిబి జయసింగ్ స్మారక క్రికెట్ టోర్నీ ప్రారంభం
ఫతేమైదాన్,(హైదరాబాద్) ,డిసెంబర్ 28 సుజాత ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ పిబి జయసింగ్ మెమోరియల్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైయ్యాయి. ఈ పోటీలను మోహన్ పటేల్ ప్రారంభించారు. ఇక్కడ జరిగిన సుజాత కేఓసి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సుజాట ఇంటర్నేషనల్ స్కూల్ 64 పరుగులతో కేఐఓసి బెంగుళూర్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సుజాత ఇంటర్నేషనల్ స్కూల్ నిర్ణీత 20 ఓవర్లల్లో 158 పరుగులు సాధించింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన కేఐఓసి జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 94 పరు గులకే అలౌట్ అయింది. | 2sports
|
Sep 24,2017
ఈపీఎఫ్వో 'మార్పు' చిక్కులకు చెల్లు!
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని ఉద్యోగులు వివిధ కారణాలతో కొలువులు మారినా.. వారి ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్వో) ఖాతాల మార్పునకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు గాను ఈపీఎఫ్వో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కొలువు మారగానే సదరు ఉద్యోగి ఈపీఎఫ్వో నిధులు కొత్త ఖాతాలోకి మారిపోయేలా భవిష్యనిధి సంస్థ చర్యలు చేపట్టింది. తమ పీఎఫ్ నిధుల బదలాయింపునకు ఇప్పటి వరకు ఉద్యోగులు ఫారమ్-13 ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు.. వాటిని కొత్త ఖాతాలలోకి మార్చుకొనేందుకు చాలా ఇబ్బంది పాడాల్సి వచ్చేది. వీటన్నింటిని తొలగించేందుకు గాను ఈపీఎఫ్వో సంస్థ కొత్తగా కాంపోజిట్ ఫారమ్-11ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఉద్యోగి తన కొత్త ఉద్యోగ వివరాలతో పాటు పాత ఈపీఎఫ్వో ఖాతా సమాచారాన్ని సంబంధిత డిక్లరేషన్, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ నంబరుతో కొత్త యాజమాన్య సంస్థ ద్వారా అందిస్తే చాలు.. స్వల్ప కాలంలోనే సదరు ఉద్యోగి సొమ్ము కొత్త ఖాతాలోకి మారిపోతుందని ఈపీఎఫ్వో అధికారులు చెబుతున్నారు. ఇలా ఉద్యోగి ఎన్ని కొలువులు మారినా ఇబ్బంది లేకుండా వ్యవస్థలో ఏర్పాట్లు చేసినట్టుగా వారు వివరిస్తున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Visit Site
Recommended byColombia
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు పవర్‌ప్లే (మొదటి ఆరు ఓవర్లు) ముగిసే సమయానికి 40/1తో నిలవగా.. ఛేదనలో పవర్‌ప్లే ముగిసే సమయానికి శ్రీలంక 75/2తో మెరుగై స్థితిలో నిలిచింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా.. వరుసగా 4 4, 4, 6, 4Nb, 4, 0 బాదేయడంతో ఈ స్కోరు సాధ్యమైంది.
‘మొదటి ఆరు ఓవర్లలోనే భారత్‌‌కి మ్యాచ్‌ను శ్రీలంక దూరం చేసేసింది. పవర్‌‌ప్లే ముగిసిన తర్వాత.. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ హిట్టింగ్ చేయడాన్ని బాగా తగ్గించారు. పిచ్‌ నెమ్మదించడం కూడా ఓ కారణం కావొచ్చు..? అయినా.. ఆ జట్టు గెలవగలిగింది. కుశాల్ పెరీరా ఒకే ఓవర్‌లో 27 పరుగులు రాబట్టడం, పవర్‌ప్లేలోనే 75 పరుగులు చేయడం మ్యాచ్‌లో కీలక మలుపు. ఆదిలోనే రోహిత్ శర్మ (0), సురేశ్ రైనా (1) వికెట్లను చేజార్చుకోవడం భారత జట్టుని ఎక్కువ దెబ్బతీసింది. ఒకవేళ వికెట్లు పడకుండా ఉండుంటే.. భారత్‌ మరింత దూకుడుగా ఆడేది..!’ అని ధావన్ వెల్లడించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
`మెగా 150 గేమ్`ను విడుదల చేసిన వి.వి.వినాయక్, దిల్రాజు
Highlights
`మెగా 150 గేమ్`ను విడుదల చేసిన వి.వి.వినాయక్, దిల్రాజు
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150` బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంలో మెగాభిమానులు ఎం యాప్ సోర్స్ డెవలప్ మెంట్ అనే కంపెనీ స్టార్ట్ చేసిన సతీష్ బాబు ముత్యాల, ప్రసాద్ బొలిశెట్టి, పవన్ కొర్లపాటి, శేషు లొశెట్టి `మెగా 150` గేమ్ను ప్లాన్ చేశారు. చిరంజీవి నటించిన 150 సినిమాలతో ఈ గేమ్ను తయారు చేశారు. 14 లెవల్స్లో ఉండే ఈ మొత్తం గేమ్ను రెండు వాల్యూమ్స్లో విడుదల చేస్తున్నారు. మొదటి వాల్యూమ్లో 110 సినిమాలతో గేమ్ ఉంటే, రెండో వాల్యూమ్లో 40 సినిమాలతో గేమ్ను రూప కల్పన చేశారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ``మెగాభిమానుంలందరూ కలిసి చేసిన మెగా 150 గేమ్ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మంచి క్వాలిటీతో రూపొందిన ఈ గేమ్ను పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ - మెగాస్టార్ చిరంజీవిగారిపై అభిమానంతో ఆయన అభిమానులందరూ కలిసి చేసిన ఈ మెగా 150 గేమ్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ గేమ్ను తయారు చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ఎం యాప్ సోర్స్ డెవలప్ మెంట్ ప్రతినిధులు సతీష్ బాబు ముత్యాల, ప్రసాద్ బొలిశెట్టి, పవన్ కొర్లపాటి, శేషు లొశెట్టి మాట్లాడుతూ - ``చిన్నప్పట్నుంచి మెగాస్టార్ చిరంజీవిగారి సినిమాలు చూస్తూ ఆయనను అభిమానిస్తూ పెరిగాం. కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవిగారిపై ఇలాంటి గేమ్ చేయాలని ప్లాన్ చేశాం. చిరంజీవిగారి 150 సినిమాల్లో ప్రతి ఒక సినిమాను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో గేమ్ ప్లాన్ చేశాం. 14 లెవల్స్గా 150 సినిమాలను దృశ్య రూపకంలోకి తీసుకొచ్చాం. చిరంజీవిగారి 110 సినిమాలను ఒక వాల్యూమ్ క్రింద, మిగిలిన 40 సినిమాలను మరో వాల్యూమ్ క్రింద క్రియేట్ చేశాం. ఈ గేమ్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం`` అన్నారు.
Last Updated 26, Mar 2018, 12:00 AM IST | 0business
|
Sep 27,2018
టెక్నో నుంచి కెమాన్ స్మార్ట్ఫోన్లు..
హైదారబాద్: ట్రాన్సిషన్ ఇండియా సంస్థ టెక్నో ప్రీమియం స్మార్ట్ఫోన్ బ్రాండ్లో కొత్తగా మూడు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కెమాన్ సీరిస్లో సంస్థ 6.2 అంగుళాల తెరతో సంస్థ వీటిని బుధవారం ఆవిష్కరించింది. ట్రాన్సిషన్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గౌరవ్ టికూ మార్కెట్లోకి కొత్త ఫోన్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఇన్ఫినెక్స్, టెక్నో, ఐటెల్ బ్రాండ్లతో స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నామన్నారు. చైనాకు చెందిన తమ సబ్సిడరీ కంపెనీ ఉత్పత్తులు దేశంలో 35వేల పైగా రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రేటర్ నోయిడాలో తమకు తయారీ ప్లాంట్ కూడా ఉందన్నారు. ప్రస్తుతం ఎనిమిది మోడళ్లు మార్కెట్లో ఉన్నాయని తెలిపారు. దేశంలోని మొత్తం స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో తమకు 5 శాతం మార్కెట్ వాటా ఉందన్నారు. అత్యధికంగా రూ.6వేల-15వేల మధ్య ఫోన్లకు ఎక్కువగా డిమాండ్ ఉందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హైదరాబాద్ జిమ్నాస్ట్ అరుణకి కాంస్యం..!
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగుతున్న జిమ్నాస్టిక్ ప్రపంచకప్ 2018లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న
TNN | Updated:
Feb 24, 2018, 03:53PM IST
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరుగుతున్న జిమ్నాస్టిక్ ప్రపంచకప్‌ 2018లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న
హైదరాబాద్ జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం జరిగిన టోర్నీ ఫైనల్లో అరుణ 13.469 పాయింట్లతో వాల్ట్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్స్‌లో 11.466 పాయింట్లు సాధించి ఫైనల్‌కి చేరిన అరుణ.. తుదిపోరులో అద్భుత ప్రదర్శనతో మెరిసింది.
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌కి మొత్తం 16 దేశాల నుంచి అథ్లెట్స్‌ ప్రాతినిథ్యం వహించగా.. గత రెండు రోజుల నుంచి క్వాలిఫయింగ్ రౌండ్స్‌ జరిగాయి. వాల్ట్ క్వాలిఫయింగ్‌లో 13.566 పాయింట్లతో రెండోస్థానం దక్కించుకున్న అరుణ.. శుక్రవారం చివరి స్థానం(8వ స్థానం)లో ఫైనల్‌కి ప్రవేశించి కాంస్య పతకం చేజిక్కించుకోవడం విశేషం. | 2sports
|
Visit Site
Recommended byColombia
బంగ్లాదేశ్ ఆఖరి బంతికి విజయం వాకిట బోల్తాపడింది. గతంలోనూ ఇదే తరహా ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో బంగ్లా జట్టు చివరి బంతికి ఓటమిపాలైంది. 2016లో బెంగళూరులో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 146/7కే పరిమితమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ విజయం దిశగా సాగింది. చివరి ఓవర్లో 11 పరుగులు చేస్తే బంగ్లాదే గెలుపు.
హార్దిక్ పాండ్య విసిరిన చివరి ఓవర్ మొదటి బంతికి మహ్మదుల్లా సింగిల్ తీయగా.. రెండు, మూడు బంతులను ముస్తాఫికర్ రహీమ్ బౌండరీకి తరలించాడు. బంగ్లా విజయానికి మూడు బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరం. ఈ దశలో భారీ షాట్లకు యత్నించిన ముస్తాఫికర్, మహ్మదుల్లా వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో బంగ్లా విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి.
ఒక్క పరుగు చేస్తే మ్యాచ్ టైగా ముగిసే అవకాశం. దీంతో ధోనీ, నెహ్రా కలిసి బంతి ఎక్కడ విసరాలో పాండ్యకు సలహా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఫీల్డింగ్ సెట్ చేశారు. క్రీజ్‌లోకి వచ్చిన షువగట పాండ్య విసిరిన బంతిని ఆడటంలో విఫలమయ్యాడు. కానీ సింగిల్‌ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని ముస్తాఫిజుర్ రహ్మాన్ వేగంగా పరిగెత్తుకొచ్చాడు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ధోనీ బౌలర్ బంతి విసరక ముందే కుడి చేతి గ్లోవ్ తీసి సిద్ధంగా ఉన్నాడు. బంతిని అందుకోవడమే ఆలస్యం.. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు. ధోనీ రనౌట్ చేయడతో ఒక్క పరుగు తేడాతో బంగ్లా అనూహ్యంగా ఓడగా.. భారత్ సంబరాల్లో మునిగిపోయింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
సెప్టెంబర్లోను 23.7 శాతం క్షీణత
vehicle
న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకు పోయిన ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. వరసగా 11వ నెల కూడా ఆటోమొబైల్ అమ్మకాలు క్షీణించాయి. సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 23.69 శాతం క్షీణించాయి. ఈ నెలలో కేవలం 2,23,317 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. 2018సెప్టెంబర్ నెలలో 2,92,660 యూనిట్ల ప్రయాణికుల వాహనాలు అమ్ముడుపోయాయి. సెప్టెంబర్ నెల వాహన విక్రయాల గణాంకాలను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) శుక్రవారం విడుదల చేసింది. దేశీయ కార్ల అమ్మకాల్లో 33.4 శాతం క్షీణత నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్లో 1,97,124యూనిట్ల ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది అదే నెలలో 1,31,281 యూనిట్లకు పరిమితమైంది.
ఇక మోటారు సైకిళ్ల అమ్మకాలు 23.29 శాతం తగ్గి 10,43,624 యూనిట్లకు పరిమితమైనాయి. మరో వైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22.09 శాతం, కమర్షియల్ వాహనాల అమ్మకాలు 39.06 శాతం తగ్గాయి. అన్ని కేటగిరీలకు కలిపి మొత్తంగా సెప్టెంబర్ నెలలో 20,04,932 యూనిట్ల వాహనాలు అమ్ముడు పోయాయి. 2018 సెప్టెంబర్ నెలలో విక్రయించిన 25,84,062 యూనిట్లతో పోలిస్తే ఇది 22.41 శాతం తక్కువ అని సియామ్ పేర్కొంది.సంక్షోభంనుంచి బయలపడేందుకు, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/ | 1entertainment
|
సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సీఎం
Highlights
సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సీఎం
శ్రీమంతుడు తర్వాత కొరటాలతో మహేష్ చేస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకుండగా జీరో కట్స్ తో ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను జారీచేయడం విశేషం.
వినోదానికి సందేశాన్ని జోడించి కొరటాల సిద్ధం చేసిన ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలోను ఆసక్తి వుంది. ఈ సినిమాకి ముందు కొరటాల తెరకెక్కించిన అన్ని సినిమాలు ఘన విజయాలను సాధించాయి. ఆ సక్సెస్ ల జాబితాలో 'శ్రీమంతుడు' కూడా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో మహేశ్ వుంటే, ఈ సినిమా తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందనే ఆశతో కైరా అద్వాని వుంది.
Last Updated 16, Apr 2018, 4:32 PM IST | 0business
|
BATA-INdia
52వారాల గరిష్టానికి బాటా ఇండియా షేర్లు
ముంబయి,ఆగస్టు 4: బాటా ఇండియా 52వారాల గరిష్టస్థాయికి చేరిం ది. రూ.611గా షేర్ల విక్రయం జరిగి బిఎస్ఇలో ఉదయం ట్రేడింగ్ లోనే ఐదుశాతం పెరిగింది. కంపెనీ వార్షిక పద్ధతిలో నికరలాభం 20 శాతంపెంచుకుని 60.4కోట్లుగా ప్రకటించింది. పాదరక్షలు, విడిభాగా ల బిజినెస్లో ఉన్న సంస్థ నికరలాభం గత ఏడాది 50.5 కోట్లు మాత్రమే. కంపెనీ నికరఅమ్మకాలు ఈత్రైమాసికంలో పదిశాతంపెరిగి రూ.675కోట్ల నుంచి రూ.743కోట్లకు చేరాయి. కంపెనీ నిర్వహణ మార్జిన్ కూడా 13.7నుంచి 14.3 శాతానికి మెరుగుపడింది.
కంపెనీ స్థూల మార్జిన్ ఒకటిశాతం మెరుగుపడింది. విలువలుజోడించిన ఉత్ప త్తులు ప్రవేశపెట్టడంతో ఇదిసాధ్యం అయిందని బాటా ఇండియా వెల్లడించింది. లైఫ్స్టైల్ సెగ్మెంట్పై కంపెనీ ఎక్కువ దృష్టిపెట్టింది. పదిశాతం స్టోర్ విక్రయాలు పెరిగాయి. మరో 40 కొత్తస్టోర్లను ఏర్పాటు చేసి 15శాతంవృద్ధిని రిటైల్టర్నోవర్లో సాధిస్తామని వెల్లడించింది. ఉదయానికే కంపెనీ స్టాక్ 4.5శాతం పెరిగి రూ.610గానిలిచింది. మొత్తం 2.27మిలియన్ల వాటాలు ఎన్ఎస్ఇ,బిఎస్ఇల్లో చేతులుమారాయి.
==== | 1entertainment
|
రాజా ది గ్రేట్ 4 రోజుల కలెక్షన్స్
Highlights
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన రాజా ది గ్రేట్
దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన రాజా ది గ్రేట్
బాకక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు పెంచిన రాజా ది గ్రేట్
మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్. రవితేజ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడం, పైగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పటాస్, సుప్రీమ్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో రాజా ది గ్రేట్పై రిలీజ్కు ముందే అంచనాలు ఉన్నాయి. బుధవారమే థియేటర్లలోకి దిగిన ఈ సినిమాకు లాంగ్ వీకెండ్, దీపావళి కలిసొచ్చాయి. తొలి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా నాలుగు రోజులకు రూ.15 కోట్ల షేర్ రాబట్టింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులకు రూ. 31 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా ఏపీ, తెలంగాణలోనే రూ.15.73 కోట్ల షేర్ వసూలు చేసింది. రవితేజకు ఇవి కెరీర్ పరంగా బెస్ట్ వసూల్లుగా ఉన్నాయి. ఇక సినిమాకు పోటీ సినిమాలు లేకపోవడంతో పాటు రాజు గారి గది 2 బాక్సాఫీస్ వద్ద డల్ అవ్వడం ఈ సినిమాకు బాగా కలిసిరానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సేఫ్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
రాజా ది గ్రేట్ 4 డేస్ ఏరియా వైజ్ షేర్ ఇలా ఉంది.....
నైజాం - 6.55 | 0business
|
Indian Gymnast depa karmakar
బిఎండబ్ల్యూ తిరిగివ్వను
న్యూఢిల్లీ: తాను అందుకున్న బిఎండబ్ల్యూ కారును తిరిగి ఇవ్వనని జిమ్నాస్ట్ దీపాకర్మాకర్ స్పష్టం చేసింది. సచిన్ చేతులమీదుగా ఆ కారు తాలాలు అందుకున్నానని, తన జీవితంలో అదో గొప్ప సంఘటన అని వివరించిందామె. సచిన్ ఇచ్చిన బహుమతి వెనక్కు ఇవ్వటం లేదా తిరస్కరించటం అనేది కనీసం ఊహించనైనా ఊహించలేదని ఆమె పేర్కొంది. | 2sports
|
Hyderabad, First Published 16, May 2019, 10:19 AM IST
Highlights
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ కు చేదు అనుభవం ఎదురైంది. పలు సంధర్భాల్లో సెలెబ్రిటీలు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వార్తలు వింటూనే ఉన్నాం. శిల్పా శెట్టి, షారుఖ్ ఇలా బడా స్టార్స్ విమానాశ్రయాల్లో సెక్యూరిటీ సిబ్బంది వల్ల సమస్యలు ఎదుర్కొన్న వారే.
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ కు చేదు అనుభవం ఎదురైంది. పలు సంధర్భాల్లో సెలెబ్రిటీలు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వార్తలు వింటూనే ఉన్నాం. శిల్పా శెట్టి, షారుఖ్ ఇలా బడా స్టార్స్ విమానాశ్రయాల్లో సెక్యూరిటీ సిబ్బంది వల్ల సమస్యలు ఎదుర్కొన్న వారే. భాష ఏదైనా కానీ తన గాత్రంతో మంత్రముగ్దుల్ని చేసే శ్రేయా ఘోషల్ సింగపూర్ ఎయిర్ లైన్స్ పై సోషల్ మీడియాలో విరుచుకుపడింది.
శ్రేయా ఘోషల్ బుధవారం రోజు తన సంగీత వస్తువులని తీసుకుని సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం ఎక్కేందుకు వెళ్లారు. కానీ సెక్యూరిటీ అధికారులు ఆమెని విమానం ఎక్కనివ్వలేదు. సంగీత వస్తువులని తీసుకువెళ్లకూడదని అడ్డుకున్నారట. దీనితో శ్రేయా ఘోషల్ కు నిరాశే ఎదురైంది. సింగపూర్ ఎయిర్ లైన్స్ నిర్వాకాన్ని శ్రేయా ఘోషల్ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది.
సంగీత విద్వాంసులు, గాయకులు సింగపూర్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించకూడదు అనుకుంటా. సంగీతానికి సంబంధించిన విలువైన వస్తువులు ఉంటే వెనక్కు పంపిస్తున్నారు. సింగపూర్ ఎయిర్ లైన్స్ వాళ్ళు మంచి గుణపాఠం నేర్పారు అంటూ శ్రేయా ఘోషాల్ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. శ్రేయా ట్వీట్ పై సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పందించింది. సారీ శ్రేయా ఘోషల్.. మీ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలపై విచారణ చేస్తున్నాం అని ట్వీట్ చేశారు.
I guess @SingaporeAir does not want musicians or any body who has a precious instrument to fly with on this airline. Well. Thank you. Lesson learnt.
— Shreya Ghoshal (@shreyaghoshal) May 15, 2019
Last Updated 16, May 2019, 10:19 AM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
శర్వానంద్ గాయం పెద్దదే.. సర్జరీకి 11 గంటలు!
సోమవారం ఉదయం హైదరాబాద్లోని ఓ కార్పోరేట్ హాస్పిటల్లో శర్వానంద్ భుజానికి సర్జరీ చేశారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం అయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Samayam Telugu | Updated:
Jun 18, 2019, 11:20AM IST
షూటింగ్లో భాగంగా హీరో శర్వానంద్ గాయపడిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్లో స్కైడైవింగ్ చేస్తుండగా శర్వానంద్ ప్రమాదానికి గురయ్యారు. శర్వానంద్ భుజానికి, కాళ్లకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆయన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. స్కైడైవింగ్ను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో శర్వానంద్ తన కాళ్లపై కాకుండా భుజాలపై ల్యాండ్ అయ్యారు. దీంతో ఆయన భుజానికి పెద్ద గాయమే అయ్యింది. దీనితో పాటు కాళ్లకు కూడా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యాయి.
సోమవారం ఉదయం హైదరాబాద్లోని ఓ కార్పోరేట్ హాస్పిటల్లో శర్వానంద్ భుజానికి సర్జరీ చేశారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం అయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నలుగురు ఆర్థో సర్జన్లు సుమారు 11 గంటలపాటు కష్టపడి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారని వెల్లడించారు. సర్జరీ తరవాత శర్వానంద్ను ఐసీయూకు తరలించారని, అక్కడే ఆయన మరో నాలుగు రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారని సమాచారం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తరవాత శర్వా రెండు నెలల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. పూర్తిగా కోలుకున్న తరవాతే శర్వా ‘96’ రీమేక్ షూటింగ్లో పాల్గొంటారు. | 0business
|
రూ 3,199లకే పానాసోనిక్ స్మార్ట్ఫోన్..
- టీ44 లైట్ పేరిట మార్కెట్లోకి విడుదల
న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ పానాసోనిక్ టీ44 లైట్ పేరిట తక్కువ ధర కలిగిన స్మార్ట్ఫోన్ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను సంస్థ రూ.3,199గా నిర్ణయి ంచింది. నేటి యువత అభిరుచులకు తగ్గట్టుగా రూపొందించినట్లుగా పానాసోనిక్ ఇండియా మొబిలిటీ డివిజన్ బిజినెస్ హెడ్ పంకజ్ రానా తెలిపారు. యాండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్, 512 ఎంబీ ర్యామ్, 8 జీబీ అంతర్గాత మొమరీతో పాటు 32 వరకు అంతర్గత మెమోరీని పెంచుకొనే సౌలభ్యం 2 మెగాఫిక్స్ల్ వెనుక కెమేరా, ఎల్ఈడీ ఫ్లాష్, వీజీఎ ముందు కెమెరాతో పాటు 2400 ఏంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్లో 3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎఫ్ఎం లాంటి అదనపు సౌకర్యాలు వున్నట్టు వెల్లడించారు. టీ44 అమ్మకాలను 1 ఆగస్టు మధ్యాహ్నాం 3 గంటల నుంచి ప్రారంభించనున్నట్లుగా కంపెనీ తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బిగ్బాస్.. నాకు ఫ్రెష్ అబ్బాయ్ కావాలి
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 25 ఎపిసోడ్లను పూర్తి చేసి 26వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది.
TNN | Updated:
Aug 10, 2017, 11:29PM IST
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 25 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 26వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ షోలో ముమైత్ ఖాన్ రచ్చ మామూలుగా ఉండటం లేదు. హౌస్‌లో ఉన్న సెలబ్రిటీలు అంతా ఒక ఎత్తు అయితే ముమైత్ ఖాన్ డిఫరెండ్. తనకు నచ్చని పని ఉంటే మొహం మీద కుండబద్దలు కొట్టేసినట్లు మాట్లాడుతూ.. తన పని తాను చేసుకుపోతూ హౌస్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది ముమైత్. అయితే ఈరోజు ఎపిసోడ్ తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలంటూ కుండబద్దలు కొట్టేసింది.
అతడికి మ్యారేజ్ కాకుండా ఉంటే చాలని, పెళ్లైన సెకండ్ హ్యాండ్ వద్దని, గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండకూడదని,ఎలాంటి రిలేషన్ లేని ఫ్రెష్ అబ్బాయి కావాలంటూ ముమైత్ తన కలల రాకుమారుడి కోసం కండిషన్స్ పెట్టేసింది. దీనికి శివబాలాజీ, ధనరాజ్ కల్పించుకుని పెళ్లైన వాడితో నీ ప్రాబ్లమ్ ఏంటి? అనగా నాకు ఫ్రెష్ అబ్బాయే కావాలని అలాంటి వాడిని బిగ్ బాస్ హౌస్‌కి పంపించాలంటూ బిగ్ బాస్‌ను రిక్వెస్ట్ చేసింది. అలాంటి వాడు కావాలంటే దొరకడని ప్రత్యేకంగా చేయించుకోవాలంటూ పంచ్ వేశాడు ధనరాజ్.
Visit Site
Recommended byColombia
అయితే తనకు అబ్బాయి కావాలంటూ బిగ్ బాస్‌ని ముమైత్ వేడుకోవడం ఇదే ఫస్ట్ టైం కాదు. రెండో వారం ప్రారంభం నుండి తనకోసం ఓ అబ్బాయిని పంపించమంటూ సిల్లీగానే అంటున్నా.. ఈరోజు ఎపిసోడ్ మాత్రం కాస్త సీరియస్‌గా డిస్కస్ చేసింది ముమైత్. మరి ప్రిన్స్ కోరిక మన్నించి దీక్షను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపించిన బిగ్ బాస్.. ముమైత్ కోరికను ఎంతవరకూ పరిగణలోనికి తీసుకుంటాడో చూడాలి.
ఇక హౌస్‌లో ఉన్న సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. ఈ ఛాన్స్ టు టాక్‌లో భాగంగా కల్పన, ప్రిన్స్, మహేష్ కత్తి, అర్చన, ధనరాజ్,శివబాలాజీ తమ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడగా.. ఆదర్శ్, దీక్ష, ముమైత్, శివతేజలు ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోపు టాస్క్‌లో భాగంగా.. ఛాన్స్ టు టాక్‌లో మిగతా సభ్యులకు ఫోన్ కాల్ రావాలంటే రీఫిల్ చేయాల్సిఉంటుందని.. అందుకోసం నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ కోసం హౌస్ సభ్యులందరూ కలసి ఇద్దరు పేర్లను నామినేట్ చేయాలని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.
దీంతో ఎవర్నిఎలిమినేషన్ కోసం నామినేట్ చేయాలో తెలియక హౌస్‌లో గందరగోళం నెలకొంది. చివరికి ఆదర్శ్, ధనరాజ్‌లు తమకు తాముగా ఎలిమినేషన్‌కు తమ పేర్లను చెప్పడానికి ముందుకు రాగా.. మమైత్, మహేష్ కత్తిలు కూడా తాము ఎలిమినేషన్‌కు సిద్ధమే అంటూ ముందుకు వచ్చారు. మరి ఫోన్ టు టాక్‌ రీఫిల్‌లో ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యే ఆ ఇద్దరు సెలబ్రిటీలు ఎవరో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
దేవీశ్రీ ప్రసాద్కు పితృవియోగం
సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవి శ్రీ తండ్రి అయిన గొర్తి సత్యమూర్తి గుండెపోటుతో మరణించారు.
TNN | Updated:
Dec 14, 2015, 09:39AM IST
దేవీశ్రీ ప్రసాద్కు పితృవియోగం
సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవి శ్రీ తండ్రి అయిన గొర్తి సత్యమూర్తి గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని తన నివాసంలో సోమవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. సత్యమూర్తి దాదాపు 90 సినిమాలకు రచయితగా వ్యవహరించారు. దేవత, ఖైదీ నెం:786, చంటి, బంగారు బుల్లోడు, ఛాలెంజ్, అభిలాష, భలేదొంగ వంటి హిట్ సినిమాలకు రచయితగా తన సేవలందించారు. ఆయన అంత్యక్రియలు సాయంత్రం చెన్నైలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబసభ్యులు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
india vs south africa 2019: we need to take advantage of india's inexperienced pace attack, says klusener
టీమిండియా ఆ బలహీనతే.. సఫారీలకి బలం
భారత టీ20 జట్టులో ప్రస్తుతం అగ్రశ్రేణి బౌలర్ ఒక్కరూ లేరు. కుర్రాళ్లని పరీక్షించాలని ఆశించిన సెలక్టర్లు.. బుమ్రా, భువీలతో పాటు చాహల్, కుల్దీప్లకి రెస్ట్ ఇచ్చారు. దీంతో.. దక్షిణాఫ్రికాతో పోలిస్తే..? భారత్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
Samayam Telugu | Updated:
Sep 14, 2019, 08:28PM IST
హైలైట్స్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రాత్రి తొలి టీ20 మ్యాచ్
టీమిండియా బౌలింగ్ బలహీనంగా ఉందన్న సఫారీ బ్యాటింగ్ కోచ్
వరల్డ్ కప్ నేపథ్యంలో సీనియర్లకి విశ్రాంతినిచ్చిన భారత సెలక్టర్లు
దక్షిణాఫ్రికా జట్టులోనూ కనిపిస్తున్న అనుభవలేమి
ధర్మశాల వేదికగా ఆదివారం రాత్రి జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా బలహీనతపై తాము దెబ్బ వేస్తామని దక్షిణాఫ్రికా అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్ వెల్లడించాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. యువ క్రికెటర్లని పరీక్షించాలని ఆశించిన భారత సెలక్టర్లు.. సీనియర్ ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు అగ్రశ్రేణి మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్లకి టీ20 సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు. దీంతో.. వారి స్థానాల్లో చోటు దక్కించుకున్న ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్లతో ప్రస్తుత టీ20 టీమ్ అనుభవలేమితో కనిపిస్తోంది. ఈ బలహీనతే టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికాకి బలంగా మారబోతోందని క్యూసెనర్ వెల్లడించాడు.
Read More: దక్షిణాఫ్రికా కొత్త టీ20 కెప్టెన్కి సపోర్టిస్తా: మిల్లర్
తొలి టీ20 నేపథ్యంలో శనివారం మీడియాతో క్యూసెనర్ మాట్లాడుతూ ‘భారత టీ20 జట్టు బౌలింగ్ విభాగంలో అనుభవలేమి స్పష్టంగా కనబడుతోంది. సిరీస్లో.. ఈ బలహీనతని దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లు అవకాశంగా తీసుకోవాలి. యువ బౌలర్లు లయ అందుకునేలోపే దూకుడుగా ఆడి వారిని ఒత్తిడిలోకి నెట్టాలి. అలా అని.. సిరీస్లో భారత్ని మేము ఏమీ తక్కువగా అంచనా వేయడం లేదు. ఆ జట్టులో అగ్రశ్రేణి ఆటగాళ్లున్నారు. అయితే.. భారత బౌలింగ్ బలహీనత మాత్రం.. దక్షిణాఫ్రికాకి బలంగా మారనుంది’ అని వెల్లడించాడు. | 2sports
|
బంగ్లాదేశ్ 156/5 (20 ఓవర్లు)
ఆస్ట్రేలియా 157/7 (18.3 ఓవర్లు)
ఖావాజా 58 పరుగులతో హాఫ్ సెంచరీ
జంపాకు మూడు వికెట్లు
బెంగళూరు : వరల్డ్ టి20లో భాగంగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ను బ్యాటింగ్ చేయాలని కోరింది.దీంతో బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 155 పరుగులు చేసింది.కాగా అనంతరం బ్యాటింగ్కు చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 156 పరుగులు సాధించింది.దీంతో బంగ్లాదేశ్పై ఆస్ట్రేలియా గెలుపొందింది.బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్యా సర్కార్ 1 పరుగు చేసి .పెవిలియన్కు వెళ్లిపోగా,మరో ఓపెనర్ మొహమ్మద్ మిథున్ 23 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఆ తరువాత షబ్బీర్ రెహ్మన్ 12 పరుగులతో నిరాశపరిచినా, షకిబుల్ హాసన్ 25 బంతులు ఆడి 3 బౌండరీలు,1 సిక్సర్తో 33 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు.ఇక చివరి ఓవర్లలో మొహ్మదుల్లా 29 బంతుల్లో 7 బౌండరీలు,1 సిక్సర్తో చెలరేగడంతో పాటు ముష్పికర్ రహీమ్ 15 పరుగులతో నాటౌట్గా నిలువడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది.
ఖవాజా హాఫ్ సెంచరీ
బంగ్లాదేశ్ తరువాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తడబడినా చివరి వరకు పోరాడి ఊపిరి పీల్చుకుంది. బంగ్లాదేశ్ నిర్ధేశిత టార్గెట్ను చేధించే క్రమంలో ఆసీస్ ఎట్టకేలకు విజయం సాధించింది.ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 45 బంతుల్లో 7 బౌండరీలు,1 సిక్సర్తో 58 పరుగులు చేయగా,షేన్ వాట్సన్ 15 బంతుల్లో 2 బౌండరీలు,1 సిక్సర్తో 21 పరుగులు చేసి ఆసీస్ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించారు.కాగా ఈ జోడీ తొలి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆసీస్ను పటిష్టస్థితికి చేర్చింది.స్మిత్ 14 పరుగులు,డేవిడ్ వార్నర్ 17 పరుగులు,మిచెల్ మార్ష్ 6 పరుగులు చేసి నిరాశపరచడంతో ఆసీస్ శిబిరంలో ఆందోళన కలిగింది.కాగా మాక్స్వెల్ 15 బంతుల్లో 2 బౌండరీలు,2 సిక్సర్లతో 26 పరుగులు చేసి ఆసీస్ను విజయంవైపు నడిపారు.ఆసీస్ విజయానికి తొమ్మిది పరుగులు అవసరం ఉన్న సమయంలో మ్యాక్స్వెల్ ఔట్కావడంతో స్వల్ప వ్యవధిలో జాన్ హేస్టింగ్ 3 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు,కాగా 19వ ఓవర్లో ఫాల్కనర్ 5 పరుగులు చేసి నాటౌట్గా నిలువడంతో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
టీ20ల్లో భారత్ ప్రపంచ రికార్డ్.. లంక టార్గెట్ 261
టీమిండియా సారథి రోహిత్ శర్మ టీ20 చరిత్రలో వేగవంతమైన సెంచరీ బాదేయడంతో లంక జట్టుకు భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లంక జట్టు ముందు 261 పరుగుల లక్ష్యం ఉంచింది.
TNN | Updated:
Dec 22, 2017, 11:55PM IST
టీమిండియా సారథి రోహిత్‌ శర్మ టీ20 చరిత్రలో వేగవంతమైన సెంచరీ (118; 42 బంతుల్లో 12×4, 10×6) బాదేయడంతో లంక జట్టుకు భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రోహిత్‌తో పాటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (89; 49 బంతుల్లో 5×4, 8×6) కూడా రాణించడంతో భారత్.. టీ20 చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు సాధించింది. రెండో టీ20లోనైనా గెలుపు అందుకుని సిరీస్‌ ఫలితాన్ని చివరిదైన మూడో టీ20 వరకూ తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్న లంక జట్టకు ఈసారి కూడా నిరాశ తప్పేట్లు లేదు. | 2sports
|
sumalatha 146 Views fixed deposits , interest rates , SBI
SBI
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. మిగులు ద్రవ్యం, తగ్గుతున్న వడ్డీరేట్లను ఇందుకు కారణంగా చూపింది. తక్కవ కాలపరిమితి కలిగిన (179 రోజుల్లోపు) డిపాజిట్లపై 50 నుంచి 75 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఆపై కాలపరిమితి కలిగిన రిటైల్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు.. బల్క్ సెగ్మెంట్లో 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రూ.2కోట్లు ఆపై బల్క్ డిపాజిట్లపైనా వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/ | 1entertainment
|
internet vaartha 220 Views
న్యూఢిల్లీ : భారతీయ మార్కెట్లకు బిఎండబ్ల్యు మినీ దూసుకువస్తోంది. న్యూఢిల్లీ లోని ఆటోఎక్స్పోలో కొత్తకొత్త మోడళ్లను ప్రద ర్శించిన బిఎండబ్ల్యు తాజాగా మినీ ఇండియా ను ప్రవేశపెట్టింది. కొత్తగా విడుదల చేసిన మినీ క్లబ్మ్యాన్ నుంచి మినీ తన విజయపరంపర కొనసాగిస్తుందని కంపెనీ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్వాన్షార్ పేర్కొన్నారు. మిని కన్వర్టిబుల్ అగ్రగామి చిన్నకార్ల వలయంలో మొదటి ఏకైక కన్వర్టిబుల్కాగా అంత్యంత ఎక్స్క్లూజివ్ వెర్షన్తో ఉంది. ఓపెన్టాప్ డ్రైవింగ్తో వస్తోంది. టాప్డౌన్ లేదా టాప్అప్తో ఆల్న్యూ మినీ కన్వర్టిబుల్ తన ఫీస్ట్తో ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశంలో మినీమోడల్ రేంజ్మినీ కూపర్ఎస్3డోర్, మినీకూపర్ డి3డోర్, మినీకూపర్ డి5డోర్, మినీ కన్వర్టిబుల్మినీ కంట్రీమాన్డిలు ఉన్నాయన్నారు. ఈ మినీకార్లు ముంబై, బెంగళూరు నవనీత్మోటార్స్, హైదరాబాద్కున్ ఎక్స్క్లూజివ్ షోరూంలలో లభిస్తాయన్నారు. | 1entertainment
|
స్టార్ హీరోలు పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..!
First Published 6, Sep 2019, 11:50 AM IST
సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎన్నో ఏళ్లు కష్టపడితే గానీ డైరెక్టర్ గా ఛాన్స్ రాదు.
సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎన్నో ఏళ్లు కష్టపడితే గానీ డైరెక్టర్ గా ఛాన్స్ రాదు. అలాంటిది మొదటి సినిమాతోనే స్టార్ హీరోని డైరెక్టర్ చేసే ఛాన్స్ రావడం అదృష్టమనే చెప్పాలి. ఇక మన స్టార్ హీరోలు కొందరు దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేశారు. అలా పరిచయమైన వారు ఇప్పుడు అగ్ర దర్శకులుగా చెలామణి అవుతున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!
ప్రభాస్ - వంశీ పైడిపల్లి, కొరటాల శివ వంటి కమర్షియల్ మాస్ దర్శకులకు ఇండస్ట్రీకి పరిచయం చేసింది ప్రభాసే. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ అనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ - 'తొలిప్రేమ' సినిమాతో కరుణాకరన్ ని, 'బద్రి' సినిమాతో పూరి జగన్నాథ్ ని దర్శకులుగా టాలీవుడ్ పరిచయం చేశాడు పవన్. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ ని డీల్ చేయడంలో కరుణాకరన్ దిట్ట అయితే.. కమర్షియల్ మాస్ సినిమాలు తీయడంలో పూరికి ప్రత్యేకమైన పేరుంది.
ఎన్టీఆర్ - 'స్టూడెంట్ నెం 1' సినిమాతో రాజమౌళి లాంటి డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. అలానే 'ఆది' సినిమాతో వివి వినాయక్ కి గ్రాండ్ ఎంట్రీ లభించింది.
నాగార్జున - 'శివ' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాలో నాగ్ హీరోగా నటించారు. టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. అలానే 'సంతోషం' సినిమాతో దశరథ్ ని పరిచయం చేశారు.
వెంకటేష్ - వెంకటేష్ నటించిన 'ప్రేమించుకుందాం రా' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు దర్శకుడు జయంత్ సి పరాన్జీ. ఈ సినిమా తరువాత మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలను డైరెక్ట్ చేశారు.
చిరంజీవి - 'మంచు పల్లకీ' సినిమాతో పెద్ద వంశీని, 'ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య' అనే సినిమాతో కోడిరామకృష్ణని ఇండస్ట్రీకి పరిచయం చేసింది చిరంజీవే..
అల్లు అర్జున్ - 'ఆర్య' సినిమాతో సుకుమార్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ అల్లు అర్జున్, సుకుమార్ లని ఓవర్ నైట్ స్టార్లను చేసింది. అలానే 'నా పేరు సూర్య' సినిమాతో వక్కంతం వంశీని డైరెక్టర్ గా పరిచయం చేశాడు బన్నీ.
రవితేజ - 'షాక్' సినిమాతో హరీష్ శంకర్ ని, 'భద్ర' సినిమాతో బోయపాటి శ్రీనులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రవితేజనే.. అలానే 'నీకోసం'తో దర్శకుడు శ్రీనువైట్లని పరిచయం చేశారు.
గోపీచంద్ - 'శౌర్యం' సినిమాతో శివ లాంటి మాస్ డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు గోపీచంద్. ప్రస్తుతం శివ కోలీవుడ్ లో స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
కళ్యాణ్ రామ్ - 'పటాస్' సినిమాతో అనీల్ రావిపూడిని, 'అతనొక్కడే' సినిమాతో సురేందర్ రెడ్డి లాంటి మాస్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘటన కళ్యాణ్ రామ్ సొంతం.
రానా - 'ఘాజీ' లాంటి సినిమాతో సంకల్ప్ రెడ్డి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు రానా.
వరుణ్ తేజ్ - 'తొలిప్రేమ' సినిమాతో వెంకీ అట్లూరిని దర్శకుడిగా పరిచయం చేశాడు వరుణ్ తేజ్.
Recent Stories | 0business
|
BSE
ఐదేళ్లలో 30,000 పాయింట్లకు నిఫ్టీ!
న్యూఢిల్లీ, జూన్ 9: భారత్ స్టాక్ఎక్ఛేంజిల్లో కీలకమై నదిగా కొనసాగుతున్న నేషనల్ స్టాక్ఎక్ఛేంజి నిఫ్టీ 50సూచి వచ్చే ఐదేళ్లలో 30వేల పాయింట్లకు చేరు కోగలదని అంతర్జాతీయ రేటింగ్స్సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. సంఘటిత వృధ్ధిపరంగా చూస్తే 25శాతం చొప్పున పెరుగుతుందని సంస్థ ఎండి రిధమ్దేశాయి అంచనావేసారు. ఎగుమతులు మెరుగుపడి, మౌలికవనరులపై ప్రభుత్వ వ్యయం పెంచడం వల్ల ప్రవేటురంగం కొంత రికవరీ అవు తుందని, వచ్చే 12నెలల్లోనే స్పష్టం అవుతుందని రిధమ్దేశాయి వెల్లడించారు. 2003-2007 మధ్యకాలంలో చూస్తే నిఫ్టీ రాబడులు 39శాతంగా పెరిగాయి. ఆసమయంలోనే సూచి ఏడురెట్లు పెరి గింది. అదే ప్రస్తుతకాలంలో అంచనావేస్తే 20శాతం పెరుగుతుందని తేలింది. నిఫ్టీ 50సూచి ప్రయా ణంలో ఇన్వెస్టర్ల రిటర్నులు మూడురెట్లు పెరుగుతా యన్నారు.
ఐటిరంగస్టాక్స్పరంగాను, ఫార్మారంగ కౌంటర్లతోపోలిస్తే కొంతమెరుగుపడతాయని రిధమ్ దేశాయి అంచనావేసారు. రానున్న మూడునెలల కాలంలో జిఎస్టి అమలుద్వారా వచ్చే సమస్యలన్నీ సర్దుబాటవుతాయన్నారు. ప్రభుత్వానికి రాబడి లక్ష్యం చేజార్చుకునే దిశగాలేదని, జిఎస్టి ఖచ్చి తంగా అమలవుతుందని వెల్లడించారు. దేశీయ స్టాక్స్పరంగాచూస్తే ఈక్విటీలకు ఎక్కువప్రాధాన్యం ఉంటుందన్నారు. అంతర్జాతీయ కంపెనీల కంటే దేశీయ కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని రిధమ్దేశాయి అంచనా. ఐటిస్టాక్స్ ఎక్కువ బుల్లిష్ గా ఉంటాయని ఫార్మారంగానికి కూడా మంచిరోజు లు ఉంటాయన్నారు. రాబడుల వృద్ధిమరింతగా పెరిగితే ఉపాధి సంక్షోభం తగ్గు తుందని రాబడుల వృద్ధి 12శాతంగా ఉంటే మార్జిన్లు పుంజుకుంటాయ న్నారు. కంపెనీల లాభాలు వృద్ధి చెంది కార్పొరేట్ రంగం కూడా నియామకాలకోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశముంటుందని, దీనివల్ల మానవవనరు ల వృద్ధి ఉంటుందని రిధమ్దేశాయి అంచనా వేసారు. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బ్రాహ్మణి సర్ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టిన ఎన్టీఆర్
నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా తన అన్నయ్య నటనకు ముగ్దురాలు అయిపోయారు. ఇటీవల ‘అరవింద సమేత’ సినిమా చూసిన ఆమె ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు.
Samayam Telugu | Updated:
Oct 21, 2018, 04:25PM IST
బ్రాహ్మణి సర్ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేస్తూ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కొనియాడుతున్నారు. ఇక నందమూరి అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు.
Visit Site
Recommended byColombia
ఇదిలా ఉంటే, నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా తన అన్నయ్య నటనకు ముగ్దురాలు అయిపోయారు. ఇటీవల ‘అరవింద సమేత’ సినిమా చూసిన ఆమె ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా విజయ దశమి రోజున తన అన్న ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ను బ్రాహ్మణి పంపించారు. ప్రేమతో తన చెల్లెలు పంపిన ఆ బహుమతిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకున్నారట. అంతేకాకుండా అంత గొప్ప బహుమతిని తనకు పంపిన బ్రాహ్మణికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారని సమాచారం.
ఇంతకీ నారా బ్రాహ్మణి తన అన్నయ్యకు పంపిన బహుమతి ఏంటంటే.. హరికృష్ణ ఆల్బమ్. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన పెదనాన్న హరికృష్ణ పాత ఫొటోలను సేకరించి వాటిని ఆల్బమ్గా తయారు చేయించి సీడీ రూపంలో ఎన్టీఆర్కు బ్రాహ్మణి పంపించారు. తన చెల్లెలు పంపిన ఆ సీడీలోని ఫొటోలను చూసిన ఎన్టీఆర్.. తన తండ్రి హరికృష్ణను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారని సన్నిహితుల ద్వారా తెలిసింది. దసరా రోజున తన తండ్రిని మనస్ఫూర్తిగా తలుచుకునేలా చేసిన చెల్లలు నారా బ్రాహ్మణికి ఎన్టీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారని వారు వెల్లడించారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Sep 08,2018
ఎస్కార్ట్ నుంచి డ్రైవర్ రహిత ట్రాక్టరు
న్యూఢిల్లీ: వ్యవసాయ, నిర్మాణ ఉపకరణాల తయారీ సంస్థ ఎస్కార్ట్ అన్నదాతలకు సౌకర్యవంతంగా కొంత సౌకర్యవంతంగా ఉండేందుకు గాను డ్రైవరు రహిత ట్రాక్టర్లను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. వ్యవసాయానికి సాంకేతికతను జోడించే ప్రయత్నంలో భాగంగా ఈ ఆటోమేటెడ్ ట్రాక్టర్ను మార్కెట్లోకి తీసుకు వచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఈ డ్రైవర్లెస్ ట్రాక్టర్ను ఆపరేట్ చేసేందుకు మైక్రోసాఫ్ట్, రిలయన్స్ జియో, ట్రింబుల్, సంవర్ధన మదర్సన్ గ్రూప్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలతో జతకట్టినట్లు సంస్థ పేర్కొంది. ఎస్కార్ట్ గ్రూప్ ఎండీ నిఖిల్ నందా మాట్లాడుతూ.. ఈ స్మార్ట్ ట్రాక్టర్ రైతన్నసాయం లేకుండానే మొబైల్ సందేశాల ఆదారంగా కృత్రిమ మేథ ఆధారంగా దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులు చేస్తుందని తెలిపారు. రానున్న రెండేళ్లలో అధిక సంఖ్యలో ఈ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆయన వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Bathukamma Song: మంగ్లీ బత...
బాబాయి పవన్ కళ్యాణ్కి బర్త్డే గిఫ్ట్గా తన కొత్త సినిమా బ్రూస్ లీ టీజర్ని రిలీజ్ చేశాడు అబ్బాయి రాంచరణ్ తేజ్ . శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తుండగా చిరంజీవి ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నఈ సినిమా ఈ దసరా సందర్భంగా రిలీజ్ కానుంది. రాంచరణ్ ఓ స్టంట్మన్ పాత్రలో దర్శనమివ్వనున్న మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్లో అప్పుడే 'బ్రూస్ లీ'పై అంచనాలు రెట్టింపయ్యాయి.
పవన్కి చెర్రీ ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఏంటి ? | 0business
|
భారీ స్కోరు దిశగా కోల్కతా (వీడియో)
Highlights
భారీ స్కోరు దిశగా కోల్కతా (వీడియో)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా ఓపెనర్ క్రిస్ లిన్ భారీ సిక్సర్లతో అలరిస్తూ..స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. మరోవైపు కెప్టెన్ దినేశ్ కార్తీక్ 30(19) బ్యాట్ ఝళిపిస్తుండటంతో కోల్కతా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో 15ఓవర్లు ముగిసే సరికి కోల్కతా మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. | 2sports
|
Hyderabad, First Published 13, Oct 2018, 12:46 PM IST
Highlights
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత మొత్తానికి అభిమానులకు మంచి ఆనందాన్ని ఇచ్చింది. సినిమా కలెక్షన్స్ చూస్తుంటే సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని తెలుస్తోంది.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత మొత్తానికి అభిమానులకు మంచి ఆనందాన్ని ఇచ్చింది. సినిమా కలెక్షన్స్ చూస్తుంటే సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని తెలుస్తోంది. ఇప్పటికే పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులు నమోదయ్యాయి. యూఎస్ లో కూడా సినిమా 1 మిలియన్ మార్క్ ను దాటేసింది.
ఇక సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా మంచి క్రేజ్ తెచ్చింది. మెయిన్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచిందని చెప్పాలి. అయితే థమన్ కెరీర్ ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది. పలువురు స్టార్ దర్శకులు అతనితో వర్క్ చేయాలనీ అనుకుంటున్నారు. ఇక త్వరలో రిలీజ్ కానున్న సాహో స్పెషల్ టీజర్ కు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా స్పెషల్ టీజర్ ను రిలీజ్ చెయ్యాలని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. అందుకే టీజర్ కోసం మ్యూజిక్ కంపోజ్ చేయమని థమన్ ని కోరినట్లు సమాచారం. అసలైతే సినిమాకు శంకర్ ఏ హాసన్ లాయ్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న సాహో సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Last Updated 13, Oct 2018, 12:46 PM IST | 0business
|
సడెన్ షాకిచ్చిన నమిత.. పెళ్లి తేదీ ప్రకటన
Highlights
పెళ్లి తేదీ ప్రకటించిన బొద్దుగుమ్మ నమిత
గత కొంత కాలంగా నమిత వివాహంపై రకరకాల రూమర్లు
రూమర్లకు చెక్ పెడుతూ వరున్ని, పెళ్లి తేదీని ప్రకటించిన నమిత
గతకొంతకాలంగా సౌత్ బొద్దుగుమ్మ నమిత పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో షికారు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు శరత్ బాబును నమిత పెళ్లి చేసుకోబోతోందని, అతనితోనే సహజీవనం చేస్తోందని రకరకాల వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. వాటన్నింటికి చెప్ పెడుతూ నమిత పెళ్లి తేదీని ప్రకటించి షాకిచ్చింది.
సొంతం సినిమాతో వెండితెరకు పరిచయమైంది నార్త్ బ్యూటీ నమిత. ఉన్నట్టుండి ఓ తమిళ నటుడిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ నమిత అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చింది. తమిళ నటుడు వీరాతో ఈనెల 24న తన వివాహం జరగనుందని నమిత స్వయంగా చెప్పింది. తమిళ బిగ్ బాస్ ప్రోగ్రాం కంటెస్టెంట్లు రజియా విల్సన్ మరికొందరు కలిసి సోషల్ మీడియాలో ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నామంటూ వీడియో మెసేజ్ ద్వారా అభిమానులందరికీ నమిత పెళ్లి సంగతి తెలియజేశారు.
ఆ వీడియోలో తన బాయ్ ఫ్రెండ్.. ఉడ్ బీతో కలిసి కనిపించిన నమిత తన సొట్టబుగ్గల నవ్వులతో ఆనందంగా మాట్లాడింది. నవంబర్ 24న వీరాతో తన పెళ్లి జరగనుందని.. మీ అందరి ప్రేమాభిమానాలు తనకెప్పుడూ ఉండాలని కోరుకుంది. నమిత పెళ్లి చేసుకోబోతున్న వీరా తమిళంలో చిన్నాచితకా పాత్రలు చేస్తుంటాడు. వీళ్లిద్దరూ కలిసి మియా అనే థ్రిల్లర్ ఫిలింలో నటించారు.
నమిత పరిచయమైంది.. పేరు తెచ్చుకుంది తెలుగు తెరపైనే అయినా ఇక్కడ ఆమెకు చెప్పుకోదగిన అవకాశాలు ఒకటి రెండు మాత్రమే వచ్చాయి. భారీ అందాలకు పెద్దపీట వేసే కోలీవుడ్ వెల్ కం చెప్పడంతో పెట్టెబేడా సర్దుకుని చెన్నైకి షిఫ్టయిపోయింది. అక్కడ అభిమానులు గుడికట్టే రేంజికి నమితను ఆదరించారంటే అర్థం చేసుకోవచ్చు. చివరకు తమిళనాడులోనే తన లైఫ్ పార్టనర్ ను వెతుక్కుని అక్కడే సెటిలయిపోతోంది.
— Raiza Wilson (@raizawilson10) November 9, 2017
Last Updated 26, Mar 2018, 12:03 AM IST | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
మీరా మాకు సలహా ఇచ్చేది.. టీడీపీకి తమ్మారెడ్డి కౌంటర్
టీడీపీ వర్సెస్ టాలీవుడ్. ఏపీలో మళ్లీ మరో వార్ మొదలయ్యింది. అధికార పార్టీ టాలీవుడ్ను టార్గెట్ చేయడంతో అటు నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఇప్పటికే పోసాని ఓ రేంజ్లో ఫైర్ అయితే... ఇప్పుడు దర్శక నిర్మాత తమ్మారెడ్డి కౌంటరిచ్చారు.
Samayam Telugu | Updated:
Mar 21, 2018, 01:46PM IST
టీడీపీ వర్సెస్ టాలీవుడ్. ఏపీలో మళ్లీ మరో వార్ మొదలయ్యింది. అధికార పార్టీ టాలీవుడ్ను టార్గెట్ చేయడంతో అటు నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఇప్పటికే పోసాని ఓ రేంజ్లో ఫైర్ అయితే... ఇప్పుడు దర్శక నిర్మాత తమ్మారెడ్డి కౌంటరిచ్చారు. టాలీవుడ్కు సూక్తులు చెప్పేటప్పుడు... ముందు టీడీపీలో ఉన్న సినిమావాళ్ల సంగతేంటో చెప్పాలన్నారు. పార్టీలో ఉన్నవాళ్లతో ప్రకటనను ఇప్పిస్తే... తర్వాత మిగిలిన వాళ్లు మాట్లాడతమన్నారు. తమిళనాడులో పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటయ్యారని... ఏపీలో కూడా అందరూ కలిస్తే సినీ పరిశ్రమ కూడా తోడుగా ఉంటుందన్నారు.
సినిమావాళ్లు హోదా ఉద్యమం కోసం విశాఖ వస్తే అరెస్ట్ చేయించింది ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు తమ్మారెడ్డి. పదవి ఉందని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఎలా పడితే అలా మాట్లాడటం సరికాదన్నారు. ఇన్నాళ్లూ సైలెంట్గా ఉన్నవాళ్లకు ఇప్పుడు హోదా గుర్తొచిందా అని ప్రశ్నించారు. అలాగే పవన్పై టీడీపీ నేతల విమర్శలపైనా స్పందించారు. నిన్నటి వరకు మంచోడైన పవన్ ఇప్పుడు చెడ్డవాడు అయ్యాడని... అలాగే ఆధారాలు లేకుండా పవన్ విమర్శలుచేయడం కూడా మంచిదికాదన్నారు. సినిమా వాళ్ల భార్యల గురించి అసభ్యంగా మాట్లాడినపుడు మాట్లాడని వారు... ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని గట్టిగా ప్రశ్నించారు. | 0business
|
భావోద్వేగానికి లోనైన టీం ఇండియా పేసర్ షమీ
Highlights
కూతురితో వీడియో కాల్ మాట్లాడుతూ...
ఇటీవల వివాదాలతో సతమతమవుతున్న టీం ఇండియాలో ఫేస బౌలర్ మహ్మద్ షమి తన కూతురిని చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం టీం ఇండియాలో చోటు కోల్పోడంతో పాటు భార్య పెట్టిన కేసులతో అతడు గత కొద్ది రోజులుగా అతడు సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యలతో మానసికంగా కుంగిపోయిన మహ్మద్ షమీ తన కూతురితో వీడియో కాల్లో మాట్లాడగానే భావోద్వేగానికి గురయ్యాడు.
ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. " నిన్ను మూడు నెలల తర్వాత చూసినందుకు ఆనందంగా ఉంది...ఐ లవ్ యూ మై హార్ట్ బీట్..’అంటూ ఉద్వేగానికి లోనైన షమీ తన కూతురితో వీడియో కాల్ మాట్లాడుతున్న ఫోటో అప్ లోడ్ చేశాడు.
భార్య హసీన్ జహాన్ గొడవల కారణంగా మహ్మద్ షమీ కి దూరంగా ఉంటోంది. ఈమెతో పాటు వీరి కూతురు కూడా షమీ కి దూరంగా ఉంటునన్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల షమీకి రోడ్డు ప్రమాదం జరగ్గా అతన్ని పరామర్శించేందుకు భార్య హసీన్ కూతురితో కలిసి హాస్పిటల్ కి వచ్చింది. అయితే షమీ మాత్రం భార్యతో మాట్లాడకుండా పాపతో మాత్రమే మాట్లాడినట్లు అప్పట్లో హసీన్ వెల్లడించింది. దీన్ని బట్టి షమీకి తన కూతురంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. తాజా పోస్టింగ్ తో మరో సారి కూతురిపై తనకున్న ప్రేమను షమీ చాటుకున్నాడు. | 2sports
|
Hyderabad, First Published 28, Sep 2018, 9:51 AM IST
Highlights
బాలీవుడ్ నటి తనుశ్రీదత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ ని టార్గెట్ చేస్తూ ఆయనపై పలు ఆరోపణలు చేసింది. ఆయన మహిళలను లైంగికంగా వేధిస్తాడని.. ఆ విషయం తెలిసినా.. ఎవరూ బయటకి మాట్లాడరని.. తనను కూడా వేధించాడని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ నటి తనుశ్రీదత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ ని టార్గెట్ చేస్తూ ఆయనపై పలు ఆరోపణలు చేసింది. ఆయన మహిళలను లైంగికంగా వేధిస్తాడని.. ఆ విషయం తెలిసినా.. ఎవరూ బయటకి మాట్లాడరని.. తనను కూడా వేధించాడని చెప్పుకొచ్చింది. 2009లో ఓ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేసింది తనుశ్రీదత్తా.
ఈ విషయంపై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్పందించారు. నానా వ్యక్తిత్వం అలాంటిది కాదని.. ఆయన ఎవరితో కూడా తప్పుగా ప్రవర్తించలేదని అన్నారు. తనుశ్రీ చెబుతోన్న సినిమాకు తనే కొరియోగ్రాఫర్ గా పని చేసినట్లు తనుశ్రీ.. నానాపటేకర్ ని తప్పుగా అర్ధం చేసుకున్నారని వెల్లడించారు.
దీనిపై కూడా తనుశ్రీ కామెంట్ చేస్తూ.. నానాపటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సమయంలో గణేష్ చూశారని.. ఆ సమయంలో ఆయన రెస్పాండ్ అవ్వలేదని వెల్లడించింది. అయితే ఈ విషయాలపై నానాపటేకర్ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఓ ఆంగ్ల మీడియా విలేకరితో ఫోన్ లో మాట్లాడిన నానాపటేకర్.. ''ఆ అమ్మాయి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే నన్నేం చేయమంటారు..? సెట్ లో నాతో పాటు వందల మంది ఉన్నారు. ఈ విషయం గురించి నేను ఎంత మాట్లాడినా వృధానే.. లీగల్ గా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీడియాలో నేనేం మాట్లాడినా.. అవి మరోరకంగా రాస్తుంటారు'' అని స్పష్టం చేశారు.
సంబంధిత వార్త.. | 0business
|
ఆయనెవరు: ఆసీస్ దిగ్గజంపై క్రిస్ గేల్ వ్యంగ్యం
Highlights
క్రిస్ గేల్ మైదానంలోనే కాకుండా వెలుపల కూడా ఏదో రకమైన వివాదానికి కేంద్ర బిందువు అవుతూ ఉంటాడు.
ముంబై: క్రిస్ గేల్ మైదానంలోనే కాకుండా వెలుపల కూడా ఏదో రకమైన వివాదానికి కేంద్ర బిందువు అవుతూ ఉంటాడు. తద్వారా వార్తల్లో నిలస్తూ ఉంటాడు. ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఎవరంటూ తాజాగా ప్రశ్నించి వివాదానికి తెరలేపాడు. ఆయనెవరో తనకు తెలియదని వ్యంగ్యంగా అన్నారు.
2016లో బిగ్బాష్ లీగ్ సందర్భంగా ఓ మహిళా వ్యాఖ్యాతతో గేల్ అసభ్యకరంగా మాట్లాడి వివాదం సృష్టించాడు. ఆ సందర్భంలో గేల్ను క్రికెట్ నుంచి బహిష్కరించాలని ఇయాన్ చాపెల్ అన్నాడు.
తాజాగా ముంబై మిర్రర్ ఇంటర్వ్యూలో ఇయాన్ చాపెల్ చేసిన డిమాండ్ ను ప్రస్తావించగా చాపెల్ అంటే ఎవరంటూ ఎదురు ప్రశ్నించాడు.
Last Updated 30, May 2018, 7:46 AM IST | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఎన్టీఆర్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్
జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై మరింత హైప్..
| Updated:
Jan 18, 2017, 03:20PM IST
జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై మరింత హైప్ నెలకొని వుంది. 'జనతా గ్యారేజ్' రిలీజైన తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటుండం కూడా తారక్ ఫ్యాన్స్‌ని ఇంకొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాబీ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన లాంచ్ అవనుంది. జై లవకుశ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో వున్న ఈ సినిమా తారక్ కెరీర్‌లో 27వ మూవీ అవుతుంది.
తారక్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న 'జై లవకుశ'లో తారక్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఆగస్టు 11న మూవీని రిలీజ్ చేద్దామనే ఆలోచనలో యూనిట్ వున్నట్టు ప్రచారం జరుగుతోంది కానీ దీనిపై ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. | 0business
|
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
First Published 23, Oct 2017, 1:29 PM IST
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
Recent Stories | 0business
|
Mumbai indians
టి20ల్లో ముంబయి అరుదైన ఘనత
ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) పదవ సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ విజయంతో ముంబై ఇండియన్స్20 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.ఈ విజయంతో ముంబై ఇండియన్స్ మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది.టి20 క్రికెట్లో వందవ విజయం సాధించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ అరుదైన ఘనతను సాధించింది.
ఇప్పటి వరకు 176 టి20 మ్యాచ్లాడిన ముంబై విజయాలు సాధించగా,73 మ్యాచ్ల్లో పరాజయం చెందింది.ఇప్పటి వరకు 152 మ్యాచ్లు ముగిశాయి.మరో గేమ్ టైగా ముగియగా,రెండు మ్యాచ్లు రద్దయ్యాయి.ఇదిలా ఉంటే ఐపిఎల్లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 152 మ్యాచ్లు ఆడగా అందులో 89 మ్యాచ్ల్లో విజయం సాధించగా,64 మ్యాచ్ల్లో పరాజయం చెందింది.ఒక గేమ్ టైగా ముగిసింది.ఐపిఎల్లో రెండవ అత్యధిక విజయాల శాతం 58.60 నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది.100 టి20 విజయాలు సాధించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.60.68 శాతంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందంజలో ఉంది.2010 నుంచి 2014 వరకు చాంపియన్స్ లీగ్లో ముంబై ఇండియన్స్ మొత్తం 22 మ్యాచ్లాడి 11 విజయాలు సాధించగా,9 మ్యాచ్లలో పరాజయం చెందింది.దీంతో కలుపుకుని వంద టి20 విజయాలను సాధించిన తొలి జట్టుగా ముంబై నిలిచింది.
2013,2015 సీజన్లలో ఐపిఎల్ ఛాంపియన్గా ఎన్నికైంది.ఐపిఎల్లో అయిదు సీజన్ల వరకు ఒడిదొడుకులు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ 2013,2015 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి రెండుసార్లు ఛాంపియన్గా నిలిచింది.2010లో రన్నరఫ్గా 2011,2012, 2014లో ప్లే ఆఫ్కు అర్హత సాధించింది.చాంపియన్స్ లీగ్ టి20లో 2011, 2013లో విజేతగా నిలిచింది. | 2sports
|
Dec 29,2018
జియో 'హ్యపీ న్యూ ఇయర్' ఆఫర్
న్యూఢిల్లీ: ఆకర్షణీయమైన డాటా ఆఫర్లతో టెలికాం సంచలనంగా దూసుకు వచ్చిన రిలయన్స్ జియో సంస్థ నూతన సంవత్సరాది పురస్కరించుకొని ఈ ఏడాది కూడా కొత్త సంవత్సరం ఆఫర్తో యూజర్లను ఆకట్టుకొనేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్'ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా రూ. 399 రీచార్జ్పై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ జియో ప్రస్తుత, కొత్త యూజర్లు అందరికీ వర్తిస్తుందని జియో ప్రకటించింది. అయితే ఈ క్యాష్బ్యాక్ కూపన్లు రూపంలో లభిస్తుందని తెలిపింది. దీనికి సంబంధిచిన కూపన్ మై జియో కూపన్లో యాడ్ అవుతుంది. దీని ద్వారా ఏజియోలో షాపింగ్కు వాడవచ్చు. అయితే ఈ క్యాష్ బ్యాక్ను పొందాలంటే కనీసం వెయ్యి రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి. శుక్రవారం ప్రారంభమైన ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ జనవరి 31,2019తో ముగుస్తుంది. ఇలా వచ్చిన కూపన్లను మార్చి 15, 2019 లోపు రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
షాక్..! ప్రభాస్ సాహో ఫైట్ సీక్వెన్స్ వీడియో లీక్
Highlights
షాకింగ్..! ప్రభాస్ సాహో ఫైట్ సీక్వెన్స్ వీడియో లీక్
బాహుబలి సిరీస్ తో గ్రాండ్ సక్సెస్ సాధించి.. తన రేంజ్ ను అదే స్థాయిలో కంటిన్యూ చేసేందుకు ప్లాన్ చేసుకుని మరీ ప్రభాస్ చేస్తున్న మూవీ సాహో. హైద్రాబాద్ లో కొంత భాగం షూటింగ్ జరపుకోగా.. ఇప్పుడు దుబాయ్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నారు.
దుబాయ్ ప్రభుత్వం నుంచి స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని.. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకొచ్చి మరీ.. ఈ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారు. బుర్జ్ ఖలీఫా చుట్టూ సాగే ఈ ఛేజింగ్ సీన్.. మూవీకే హైలైట్ అవుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండగా.. అన్నిటిలోకి ఇదే టాప్ రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ దుబాయ్ నుంచి సాహో షూట్ కి సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఎలాంటి లీకులు లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇవి ఎలా బైటకు వచ్చాయని తెగ మథన పడుతున్నారట సాహో టీం. ముఖ్యంగా ప్రభాస్ లుక్ రివీల్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారట.
పైకి ఇలా చెబుతున్నా కానీ.. సాహో కి బజ్ అండ్ బిజినెస్ పెంచడం కోసం.. సినిమా మేకర్సే ఈ ఫోటోలను లీక్ చేశారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఆ వెంటనే దుబాయ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా.. అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎపిసోడ్ గానే చెబుతున్నారు. ఇలాంటివి ఏ మేకర్స్ అయినా చెప్పరు.. ఒప్పుకోరు కానీ.. ఇకపై అయినా లీకులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు సాహో టీం.
Last Updated 4, May 2018, 1:08 PM IST | 0business
|
సుడిగాలి సుధీర్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మి
Highlights
జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు పొందిన యాంకర్ రష్మి
సినిమా అవకాశాలు అందుకుంటున్న రష్మి
సుధీర్ తో పెళ్లి గురించి ఫేస్ బుక్ లైవ్ లో చెప్పిన రష్మి
జబర్థస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన నటి రష్మీ గౌతమ్. ఆ షో ద్వారా ఆమెకు చాలా పాపులారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రష్మి.. మరో కొత్త సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా ప్రమెషన్స్ లో భాగంగా ఆమె ఫేస్ బుక్ లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడింది. లైవ్ చాట్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మేకప్ లేకుండా ఫేస్బుక్ లైవ్లోకి వచ్చిన రష్మీని నెటిజన్లు కామెంట్లతో విసిగించారు. మేకప్ లేకుండా కనిపించాలా వద్దా అనేది తన సొంత నిర్ణయమని చెప్పింది. తనకు నచ్చిన విధంగా ఉండాలని కోరుకొంటానని.. ఒకరి కోసం తన నిర్ణయాలు మార్చుకొనని తేల్చి చెప్పింది. సొంత ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవడం చాతకాని వాళ్లు తన మేకప్ గురించి మాట్లాడుతారా అని రష్మీ మండిపడింది.
తెలుగు భాష మాట్లాడటం రాని నువ్వు తెలుగు సినిమాల్లో నటించడం మానుకో అని ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నేను వైజాగ్లో పుట్టి పెరిగాను. నా తల్లి ఒరిస్సా, తండ్రి యూపీకి చెందిన వాళ్లు. నేను కేంద్రీయ విద్యాలయాల్లో చదివాను. అక్కడ ప్రాంతీయ భాషను ప్రోత్సహించరు. కేవలం హిందీనే నేర్పిస్తారు. కేవలం భాష, ప్రాంతం, కులాన్ని ఆధారంగా చేసుకొని ఒకరి ప్రతిభను అంచనా వేయవద్దు’ అని రష్మీ గట్టిగానే సమాధానం చెప్పింది.
‘సుడిగాలి సుధీర్తో పెళ్లి ఎప్పుడు చేసుకొంటున్నారని, ఇంకా ఏదో చాలా మంది అడుగుతుంటారు. కానీ సుధీర్ నేను ప్రొఫెషనల్గా మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి జబర్దస్త్, ఢీ అనే రెండు షోలు చేస్తున్నాం. అదేకాకుండా చాలా ఈవెంట్లు చేస్తుంటాం. షూటింగ్ సందర్భంగా చాలా క్లోజ్గా ఉంటాం. అలా అని మా మధ్య రిలేషన్ గురించి ఓ నిర్ణయానికి మీరు రావొద్దు. అందరితో క్లోజ్గా ఉన్నట్టే సుధీర్తో కూడా ఉంటాను. అంతా మాత్రాన ఇద్దరం పెళ్లి చేసుకొంటారా అని అడగడం సరికాదు. సుధీర్ చేసే కొన్ని ఎపిసోడ్స్ చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. వాళ్లు చేసే స్కిట్స్ ఫన్నీగా బాగా ఉంటాయి. వచ్చే ఫిబ్రవరిలో జబర్ధస్త్కు ఐదేళ్లు పూర్తవుతుంది. సుధీర్, చంద్ర, ప్రకాశ్, రాంప్రసాద్ వారితో కలిసి ఐదేళ్లుగా పనిచేస్తున్నాను. కాబట్టి మా మధ్య క్లోజ్ రిలేషన్ ఉంటాయి. ఒకే వయసు ఉండటంతో ఎక్కువగా కనెక్ట్ అవుతాం మీరందరూ కేవలం నాపై, సుధీర్పై మాత్రమే దృష్టిపెడుతారు. అందుకే మీకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది అని రష్మీ ముఖం మీదే చెప్పేసింది.
Last Updated 26, Mar 2018, 12:04 AM IST | 0business
|
త్వరలో అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా చిత్రం
Highlights
అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా త్వరలో చలన చిత్రం
డాక్టర్ అబ్దుల్ కలామ్ అనే టైటిల్ తో రానున్న మూవీ
మూవీలో అబ్దుల్ కలామ్ సాధించిన విజయాలు, స్పూర్తిగా నిలిచిన అంశాలు
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత విశేషాల ఆధారంగా 'డాక్టర్ అబ్దుల్ కలాం' అనే టైటిల్ తో త్వరలో ఓ చలన చిత్రం రానుంది. ఈ చిత్రానికి హీ డ్రెమ్ట్, హీ కాంకర్డ్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. నిర్మాత అనిల్ సుంకర గత ఫిబ్రవరి లోనే రూపొందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరోసారి తాజాగా... ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేయించారు. అబ్ధుల్ కలాం జీవితంపై రాజ్ చెంగప్ప రాసిన బుక్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు సమాచారం.
అబ్దుల్ కలాం జీవితంపై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ లు తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కలాం బాల్యం మొదలు సాధించిన విజయాలు, పోక్రాన్ అణు బాంబు ప్రయోగం, సిఐఎని ఎలా ఫూల్ చేసింది, పేపర్ బాయ్ రాష్ట్రపతి స్థాయికి ఎలా ఎదిగింది, ఆయన రాష్ట్ర పతిగా ఎలాంటి స్పూర్తినిచ్చారు.. మొదలైన స్పూర్తి దాయక విషయాలను చూపించనున్నారు.
Last Updated 25, Mar 2018, 11:41 PM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
జబర్దస్త్ రష్మీ, సుడిగాలి సుధీర్ల పెళ్లి ఐపోయింది!
అవును వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. అతిథులను ఆహ్వానించి, అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకుని సంబరంగా పెళ్లి చేసుకున్నారు.
| Updated:
Mar 9, 2018, 10:14AM IST
అవును వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. అతిథులను ఆహ్వానించి, అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకుని సంబరంగా పెళ్లి చేసుకున్నారు. అతిథులు అంతా అక్షింతలు చేసి వారిని ఆశీర్వధించారు. కాపురానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.. ఇన్నాళ్లూ ప్రేమ జంటగా ప్రచారం పొందిన జబర్దస్త్ రష్మీ, సుడిగాలి సుధీర్ లు వివాహం చేసుకున్నారు.. అయితే సీరియస్ గా కాదులేండి. సిల్లీగా.. వీళ్లిద్దరూ పరమ సి ల్లీగా పెళ్లి చేసుకున్నారు. టీవీ స్టూడియోలో తలంబ్రాలు పోసుకున్నారు.
ఇదంతా ఒక కొత్త టీవీ షో ప్రోమో కోసం చేసిన పని. ‘అహనాపెళ్లంట’ పేరుతో మొదలయ్యే కొత్త టీవీ షో కోసం వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో వీళ్లిద్దరూ జంటగా యాంకరింగ్ చేయబోతున్నట్టుగా ఉన్నారు. | 0business
|
నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లతో హర్మన్ ప్రీత్ మోసం..? డీఎస్పీ ర్యాంక్ తొలగింపు
Highlights
టీమిండియా మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ ప్రభుత్వానికి సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్లు నకిలీవని పోలీసులు తేల్చడంతో.. ఆమె డీఎస్పీ ర్యాంక్ హోదాను తొలగిస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
టీమిండియా మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేశారు.. ప్రభుత్వానికి ఆమె సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్లు నకిలీవని పోలీసులు తేల్చడంతో ఆమె డీఎస్పీ ర్యాంక్ హోదాను తొలగిస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మహిళ వన్డే ప్రపంచకప్లో భాగంగా సెమీస్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో హర్మన్ ప్రీత్ అద్భుతంగా ఆడారు.. సెంచరీ సాధించి భారత్ను ఫైనల్స్కే చేర్చారు. దీంతో యావత్ దేశం ఆమెను ప్రశంసల్లో ముంచెత్తింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రప్రభుత్వాలు ఆమెకు అవార్డులు, రివార్డులు ప్రకటించాయి. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం కూడా ఆమెకు డీఎస్సీ హోదాను ప్రకటించింది.
ఈ ఏడాది మార్చి 1న ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సమక్షంలో ఆమె బాధ్యతలు సమర్పించారు. విద్యార్హతలు ప్రభుత్వానికి సమర్పించే పక్షంలో 2011లో తాను చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటి నుంచి డిగ్రీ పాసైనట్లు పోలీస్ శాఖకు ధ్రువపత్రాలు సమర్పించారు. అది నకిలీదని ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. దీనిలో అది నకిలీదని తేలింది..దీంతో హర్మన్ప్రీత్ డీఎస్సీ ర్యాంక్ను తొలగిస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.
ఆమె కేవలం 12వ తరగతి మాత్రమే పాస్ అయినట్లుగా తెలుస్తున్నందున... ఆమె అర్హతకి కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఓ అధికారి అన్నారని వార్తలు వస్తున్నాయి. కాగా, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చట్టపరంగా హర్మన్ప్రీత్పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. ఈ కేసులో ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేస్తే.. ఆమె అందుకున్న అర్జున అవార్డును కూడా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మరో వైపు హర్మన్ప్రీత్ ఇదే సర్టిఫికేట్తో రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారని.. అలాంటప్పుడు అది నకిలీ సర్టిఫికేట్ ఎలా అవుతుందని హర్మన్ ప్రీత్ మేనేజర్ ప్రశ్నించారు. | 2sports
|
Suresh 150 Views
Angelo Mathews
లండన్ లోని లీడ్స్ హెడెంగ్లీలో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో స్వల్ప స్కోర్ బోర్డు వద్దనే నాలుగు వికెట్లను కోల్పోయిన లంకను మాథ్యూస్ ఆదుకోని మంచి స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. 227 పరుగుల వద్ద శతకం నమోదు చేసుకొని దూకుడు పెంచుతున్నాడు. మాథ్యూస్ 115 బంతులతో 9 ఫోర్లు 2 సిక్సులతో 100 పరుగులు చేశాడు. | 2sports
|
Hyderabad, First Published 25, Oct 2018, 9:59 AM IST
Highlights
సినీ నటుడు ఉదయ కిరణ్ నండూరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీర్ పేట్ కి చెందిన శివ ప్రసాద్ అనే వ్యాపారికి జూబ్లీహిల్స్ రోడ్ నెం.59లోని నందగిరి హిల్స్ ఆదిత్య హిల్స్ లో ఫ్లాట్ ఉంది.
సినీ నటుడు ఉదయ కిరణ్ నండూరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీర్ పేట్ కి చెందిన శివ
ప్రసాద్ అనే వ్యాపారికి జూబ్లీహిల్స్ రోడ్ నెం.59లోని నందగిరి హిల్స్ ఆదిత్య హిల్స్ లో ఫ్లాట్ ఉంది.
దీన్ని అద్దెకు తీసుకోవడానికి సినీ నటుడు ఉదయ్ కిరణ్ తప్పుడు గుర్తింపు పత్రాలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఉదయ్ కిరణ్ కి సంబంధించిన వివరాలను శివ ప్రసాద్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేయగా.. డ్రగ్స్, కారు దొంగతనం కేసుల్లో అతడు జైలుకి వెళ్లి వచ్చినట్లు గుర్తించాడు.
దీంతో అతడు ఉదయ్ కిరణ్ కి ఫోన్ చేసి ఫ్లాట్ అద్దెకి ఇవ్వడం లేదని చెప్పాడట. అయితే అప్పటికే లగేజీతో సహా ఫ్లాట్ కి వచ్చిన ఉదయ్ కిరణ్ వాచ్ మెన్ దగ్గర తాళాలు తీసుకొని లోపలకి వెళ్లే ప్రయత్నం చేశాడు.
అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని వాచ్ మెన్, ఇంటి యజమాని పైకి 20 మంది రౌడీలని పంపించాడట. ఇళ్లు ఖాళీ చేయనని హెచ్చరించాడట. దీంతో ఉదయ్ కిరణ్ పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. | 0business
|
Jan 22,2017
ఎల్ అండ్ టీ టెక్ లాభాల్లో 17% క్షీణత
న్యూఢిల్లీ: డిసెంబరుతో ముగిసిన త్రైమా సికానికి ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి సంస్థ నికర లాభం 17 శాతం మేర క్షీణించి రూ.108.7 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.130.8 కోట్లగా నమోదైంది. వివిధ కార్యకలాపాల ద్వారా డిసెంబరు త్రైమాసికంలో సంస్థ కంపెనీ ఆదాయం నాలుగు శాతం మేర పెరిగినట్టుగా ఎల్ అండ్ టీ టెక్ బీఎస్ఈకి తెలియజేసింది. 2016-17 మూడో త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ.810.4 కోట్ల రెవెన్యూ నమోదు చేసుకుంది. మొత్తం ఆదాయంలో పరిశ్రమలు, రవాణాకు చెందిన ఉత్పత్తుల ద్వారానే దాదాపుగా 60 శాతం మేర ఆదాయం సమకూరినట్టుగా కంపెనీ వెల్లడించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అక్కినేని vs అక్కినేని: సమంత, నాగ్ ఫైటింగ్
అక్కినేని వారింట కోడలిగా సమంత అడుగుపెట్టి వారమైనా కాలేదు. మామా కోడళ్ల మధ్య అప్పుడే పోరు మొదలైంది.
TNN | Updated:
Oct 12, 2017, 11:02AM IST
అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత .. తన మామ నాగార్జునతో కలిసి పోటీకి సై అంటోంది. అర్థం కాలేదా? వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన రాజు గారి గది 2 సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. 127 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా హార్రర్, హ్యూమర్ కలబోతగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మలయాళ చిత్రం ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఓంకార్ దర్శకత్వం వహించారు. పీవీపీ సంస్థ ఈ మూవీని నిర్మించింది.
ఈ మూవీలో సమంత దెయ్యంగా నటించగా, నాగార్జున మెంటలిస్ట్‌గా కనిపిస్తారు. ఈ సినిమా సమంత వర్సెస్ నాగార్జునగా సాగనుంది. దెయ్యంగా పగ తీర్చుకోవాలని భావించే సమంత, దాని అడ్డుకోవడం కోసం ప్రయత్నించే మెంటలిస్ట్‌ పాత్రలో నాగ్.. ఇలా ఒకరితో మరొకరు పోటీ పడనున్నారు. నాగ చైతన్యతో పెళ్లయ్యాక సమంత అక్కినేని కుటుంబ సభ్యురాలైంది. సామ్ వివాహమైన కొద్ది రోజులకే నటించిన ఈ చిత్రం విడుదల అవుతుండటంతో.. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో అమృత అనే లా స్టూడెంట్ పాత్రలోనూ సమంత కనిపించనుంది. ‘రాజుగారి గది’లో హీరోగా నటించిన అశ్విన్‌తో పాటు సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, షకలక శంకర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. | 0business
|
బిగ్ బాస్2: రెమ్యునరేషన్ లో అన్యాయం?
Highlights
బిగ్ బాస్ హౌస్ లో కామన్ పీపుల్ కు అన్యాయం
బిగ్ బాస్ సీజన్ 2 రోజురోజుకి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ షోని రసవత్తరంగా నడిపించడానికి నిర్వాహకులు కసరత్తులు చేస్తున్నారు. ఈ షోలో సెలబ్రిటీ లతో పాటు ముగ్గురు కామన్ పీపుల్ కు కూడా అవకాశం ఇచ్చారు. కానీ మొదటి రెండు వారాల్లో ఇద్దరు కామన్ పీపుల్ సంజన, నూతన్ నాయుడు బయటకి వచ్చేశారు. ఓటింగ్ లో వీరికి అన్యాయం జరిగిందనే కామెంట్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో కూడా కామన్ పీపుల్ కు అన్యాయం జరిగిందని అంటున్నారు. నిజానికి ఈ షోలో పాల్గొన్న ఒక్కో సెలబ్రిటీకు వారి రోజువారీ కాల్షీట్ కు ఎంత పారితోషికం తీసుకుంటారో దానికి డబుల్ చేసి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. మరి కామన్ పీపుల్ కు ఎంత పారితోషికం దక్కిందనే విషయంలో స్పష్టత వస్తోంది. సంజన, నూతన్ నాయుడులకు ఇప్పటివరకు ఈ షోలో పాల్గొన్నందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ గా ఇవ్వలేదని తెలుస్తోంది.
ఈ హౌస్ లో మెంబర్స్ గా కొనసాగడానికి దాదాపు 29 పేజీల అగ్రిమెంట్ పై సంతకాలు తీసుకున్నారని తమ బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ కూడా తీసుకున్నారని సంజన, నూతన్ నాయుడులు వెల్లడించారు. కానీ తమకు ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదని అన్నారు. నూతన్ నాయుడు తనకు డబ్బులు అక్కర్లేదని ముందే చెప్పినట్లు వెల్లడించారు. సంజన కూడా హౌస్ లో కనిపిస్తే చాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది.
దీంతో షో నిర్వాహకులు కూడా వారి రెమ్యునరేషన్ విషయాన్ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా బిగ్ బస్ హౌస్ లో కామన్ మ్యాన్ కు రెమ్యునరేషన్ విషయంలో కూడా అన్యాయం జరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్న కేదార్..!
శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత ఫీల్డర్ కేదార్ జాదవ్ కళ్లు చెదిరే రీతిలో
TNN | Updated:
Aug 20, 2017, 06:25PM IST
శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత ఫీల్డర్ కేదార్ జాదవ్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ 35వ ఓవర్ వేసిన అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ హసరంగ (2) భారీ షాట్ ఆడాడు. బంతి లాంగాన్‌లో చాలా ఎత్తుకి లేచింది. అందరూ.. అది సిక్స్‌గా వెళ్తోందని ఊహించారు. కానీ.. బంతి లాంగాన్‌లోని బౌండరీ లైన్‌కి లోపలే కిందకి పడుతుండటంతో.. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కేదార్ జాదవ్ స్పందించాడు.
మిడాన్ నుంచి వేగంగా బంతిని చూస్తూ అలానే వెనక్కి వెళ్లిన జాదవ్.. ఏ మాత్రం తడబడకుండా చివరి క్షణంలో డైవ్ చేస్తూ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. సాధారణంగా ఫీల్డర్ మైదానంలో ఎంత దూరమైనా.. ముందుకు వెళ్లి అలవోకగా క్యాచ్ అందుకోగలడు. కానీ.. వెనక్కి వెళ్తూ.. అదీ ఎక్కువ ఎత్తు నుంచి వస్తున్న బంతి గమనాన్ని పరిశీలిస్తూ అందుకోవడం అంత సులువు కాదు. క్యాచ్ అందుకున్న తర్వాత.. పట్టుతప్పి కేదార్ వెనక్కి అలానే పడిపోయాడు. కానీ.. బంతిని వదల్లేదు. | 2sports
|
30 శాతం ఆదాయవృద్ధే లక్ష్యం
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తమ రెవెన్యూలో 30 శాతం వృద్ధి అంచనా వేస్తున్నామని మాట్రిక్స్ టెలికం అండ్ సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సాగర్ గొసలియా అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్తో కలిసి మాట్రిక్స్ బ్రాండ్లో లర్జ్ ఎంటర్ప్రైజెస్ అత్యాధునిక ఐపి-పిబిఎక్స్ను ఆయన విడుదల చేశారు. దీంతో వివిధ కార్యాలయాల్లో 1500పైగా ఇంటర్కమ్ ఫోన్లు, డిజిటల్ స్మార్ట్పోన్లు, ఎస్ఎంఎస్, వాయిస్కాల్స్ను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. వినియోగదారుల సంఖ్యను బట్టి ఇది రూ.10 లక్షలు-రూ.16లక్షల మధ్య విలువ చేస్తుందన్నారు. క్రితం ఆర్ధిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవర్ సాధించామని సాగర్ చెప్పారు. తమ మొత్తం రెవెన్యూలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 20 శాతంగా ఉందన్నారు. గత 15 ఏళ్లలో 500 పైగా ఉత్పత్తులను ఆవిష్కరించామని చెప్పారు. తమ మొత్తం టర్నోవర్లో 25 శాతం ఎగుమతుల ద్వారా సమకూరుతుందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 19, Apr 2019, 12:26 PM IST
Highlights
పవర్ స్టార్ అంటే ఎందుకంత ఇష్టం? అనే ప్రశ్నకు ప్రతి ఒక్క అభిమాని ఒక్కో విధంగా సమాధానం చెబుతూ ఉంటారు. ఫైనల్ అందరూ చెప్పే కామన్ ఆన్సర్ పవర్ స్టార్ మంచి మనస్తత్వం.
పవర్ స్టార్ అంటే ఎందుకంత ఇష్టం? అనే ప్రశ్నకు ప్రతి ఒక్క అభిమాని ఒక్కో విధంగా సమాధానం చెబుతూ ఉంటారు. ఫైనల్ అందరూ చెప్పే కామన్ ఆన్సర్ పవర్ స్టార్ మంచి మనస్తత్వం. సహాయపడే గుణమున్న పవన్ కళ్యాణ్ ఎంతో మంది అభిమానులను గెలుచుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీలో ఆయన్ను అందరితో పోటీపడి ప్రేమించే వ్యక్తి సాయి ధరమ్ తేజ్ ఒకరు.
అలాగే పవన్ కి కూడా మేనల్లుడిపై ప్రేమ ఎక్కువే. రీసెంట్ గా పాలిటిక్స్ నుంచి కాస్త బయటపడ్డ పవన్ హైదరాబాద్ కు వచ్చి రాగానే చిత్రలహరి సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రశంసించాడు. అయితే పవన్ ని సాయి అందరికంటే ఎక్కువ ఇష్టపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. ,ముఖ్యంగా పవన్ సాయికి ఒక గాడ్ ఫాదర్ లా మారినట్లు అర్ధమవుతోంది.
చిన్నప్పటి నుంచి పవన్ ఎక్కువగా సాయిని ప్రేమగా చూసుకునేవారట. ఇష్టమైన బొమ్మలు కొనివ్వడం అలాగే లైఫ్ గురించి మంచి చెడ్డలు చెప్పడం. చివరికి యాక్టింగ్ కెరీర్ మొదలవ్వడానికి కూడా పవన్ సాయికి స్ఫూర్తినిచ్చాడు. ఇండస్ట్రీకి రకాముందు అవసరమైనప్పుడు పవన్ బైక్ ను పర్సనల్ లైఫ్ కి సాయి వాడుకునేవాడట. సినిమాల్లోకి రావడానికి మొదట సలహా ఇచ్చింది కూడా పవర్ స్టారే అని సాయి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
Last Updated 19, Apr 2019, 12:26 PM IST | 0business
|
టీమిండియా
సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న భారత్
శ్రీలంకపై ఓటమితో టీమిండియాకు ఊహించని షాక్ -ఓటమితో టీమిండియాపై విమర్శల వెల్లువ కోహ్లీ మోసగాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు కెఆర్కె మిస్టర్ కోహ్లీ…పాక్ను చూసి నేర్చుకో అని వినోద్ కాంబ్లీ విమర్శలు శ్రీలంక మ్యాచ్పై ముందే వార్నింగ్ ఇచ్చిన బజ్జీ – యువికి బౌలింగ్ ఇవ్వకపోవడంపై కోహ్లీ సమాధానం
లండన్µ: కొద్ది రోజులుగా వరుస విజయాలు నమోదు చేసి, టైటిల్ ఫేవరెట్గా, ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగన భారత్కి రెండో మ్యాచ్లోనే ఊహించని షాక్ తగిలింది.లంకేయులతో జరిగిన పోరులో భారత బ్యాట్స్మెన్స్ చెలరేగినా బౌ లర్లు విఫలమవ్వడంతో శ్రీలంక చేతిలో 7వికెట్లతో భారత్ పరాజయం చవి చూసింది. ఈ ఓటమితో సెమీఫైనల్ అవకాశాన్ని భారత్ సంక్షిష్టం చేసు కుంది. టోర్నీలో నిలవాలంటే దక్షిణాఫ్రికాతో ఆది వారం జరగనున్న మ్యాచ్లో భారత్ తప్పక గెలవాల్సి ఉంటుంది.ఈమ్యాచ్ నెగ్గితేనే సెమీస్కు చేరుతుంది. గ్రూప్ బిలో భాగంగా భారత్, పాకి స్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలకం జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో ఇంకో మ్యాచ్ నెగ్గిన రెండు జట్లే సెమీస్కు చేరతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో తరువాత మ్యాచ్ ప్రతి ఒక్క జట్టు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో తర్వాత మ్యాచ్లు రసవత్తరంగా మారాయి.
టీమిండియా పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై 124పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆతర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొలి పరాభవానికి గురికావడం పట్ల క్రికెట్ అభిమా నులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిపై బాలీ వుడ్ నటుడు కెఆర్కె కోహ్లీ మోసగాడని విజ§్ు మాల్యా లాంటి వాడితో పార్టీలు చేసుకుంటే ఇలానే ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేయగా, మాజీ టీమిండియా బ్యాట్స్మెన్ వినోద్ కాంబ్లీ మిస్టర్ కోహ్లీ పాక్ను చూసి నేర్చుకో అంటూ విమ ర్శిం చారు. శ్రీలంక జట్టును తక్కువగా అంచనా వే యొద్దని మ్యాచ్కు ముందే హర్భజన్ వార్నింగ్ ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియా సమా వేశంలో మాట్లాడుతూ యువరాజ్ను బౌ లింగ్కు దించకపోవడంపై, జాదవ్ను బౌలింగ్కు దించ డంపై సమాధాన మిచ్చాడు.
ఏమాత్రం ప్రభావం చూపని భారత బౌలర్లు.. మెరుగుపడని ఫీల్డింగ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో గురువారం భారత్-శ్రీలంక మ్యాచ్లో భారత్పై శ్రీలంక 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ శిఖర్ దావన్ చేసిన శతకం వృథా అయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్లు లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓపెనర్ శిఖర్ దావన్ బౌండరీల మోత మోగించి 128బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 125పరుగులు చేశాడు. దావన్తో పాటు మరో ఓపెనర్ రోహిత్ 79 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 18 పరుగులు, మహేం ద్రసింగ్ ధోనీ 52బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లతో 63పరుగులు ఇద్దరు అర్థశ తకాలు చేశారు.చివర్లో కేదార్ జాదవ్ 13బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 25పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో టీమిండియా శ్రీలం కకు 322పరుగుల భారీ లక్ష్యాన్ని నిరే ్ధశించింది.
322పరుగుల లక్ష్యంతో బరిలోదిగిన లంకేయు లు భారతబౌలర్లను సమర్థంగా ఎదు ర్కొన్నారు. టీమిండియా ప్రధాన బౌలర్లు ఏమా త్రం ప్రభావం చూపలేదు.టీమిండియా ఫీల్డింగ్ కూడా ఏమి మె రుగవ్వకపోవడంతో లంకేయులు బ్యాట్లను ఝుళి పించారు. ఓపెనర్ డిక్వెల్లా 7పరుగులకే అవు టైనా ఓపెనర్ ఎండి గుణతిక్లా 72బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లతో 76 పరుగులు చేయగా, వన్ డౌన్ బ్యాట్స్మెన్ మెండిస్ 93బంతుల్లో 11ఫోర్లు, ఒక సిక్సర్తో 89పరుగులు చేసి లంక ఇన్నింగ్స్ను పటిష్ట స్థితిలో నిలిపారు. వీరిద్దరూ రనౌట్ కాగా పెరార 44బంతుల్లో 5ఫోర్లు 47పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుతిరిగాడు. చివర్లో మాథ్యూస్ 44బం తుల్లో 6ఫోర్లతో 52పరుగులతో, గుణరతేబీలి 21బంతుల్లో రెండు ఫోర్లు, రెండ్లు సిక్సర్లతో 34 పరుగులతో మెరుపులు మెరిపించి నాటాట్గా నిలవడంతో లంక 48.4ఓవర్లలో 7వికెట్లతో 322 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకే ఒక వికెట్ తీసుకున్నారు. కోహ్లీ ఓ మోసగాడు: బాలీవుడ్ నటుడు కెఆర్కె సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ (కెఆర్కె) గురించి ప్రత్యేకంగా పరిచయం చేసు కోవాల్సిన అవసరం లేని వ్యక్తి.
గత కొన్నాళ్లుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారాడు. తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ది ఓవల్ వేధికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 7వికెట్లు తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిని జీర్ణించుకోలేని కమల్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీతో సహా టీమిండియాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈమ్యాచ్లో ధావన్ సెం చరీ చేసినా, రోహిత్ శర్మ, ధోనిలు అర్థసెంచరీలతో రాణించడంతో టీమిండియా 321పరుగులు చేసినప్పటికీ టీమిండియా ఓడిపోవడంపై కెఆర్కె తీవ్రంగా తప్పుపట్టాడు. విజ§్ు మాల్యాతో కలిసి పార్టీలు చేసుకుంటే ఫలి తం ఇలానే ఉంటుంది. అయినా డకౌట్ అయిన కోహ్లీ ఇంకా స్కోరు చేసి ఉంటే బాగుండేది అన్నాడు. అందుకోసం మాల్యాను పిలిస్తే బాగుం టుంది. ఇదివరకే దక్షిణాఫ్రికా పాక్ చేతిలో ఓట మితో రగిలిపోతోంది.
వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోతుందని భావించను. భారత్ తన తదుపరి మ్యాచ్ సఫారీలతో ఆడాల్సి ఉంటుంది. ఈరోజు అంతా తేలిపోయింది. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గదు. ఒక వేళ సఫారీలను ఓడిం చినా.. సెమీస్లోగానీ, లేక చివరి మెట్టుపై ఫైనల్లోనైనా భారత్ బోల్తా కొట్టడం ఖాయం అని కెఆర్కె వరుస ట్వీట్లతో మండిపడ్డాడు. రెండు కోట్ల జనా భా ఉన్న లంకలో 11మంది ఛాంపియన్లు దొరి కారు. కానీ 130కోట్ల భారత జనాభాలో 11మంది విన్నర్లను బిసిసిఐ గుర్తించలేక పోయింది. ఇది కలియుగం కనుక రావణులే గెలుస్తారని లం కేయులు నిరూపించారని కెఆర్కె తన వరుస ట్వీట్లలో రాసుకొచ్చాడు. మరోవైపు కెఆర్కె తీరుపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. మిస్టర్ కోహ్లీ పాక్ను చూసి నేర్చుకో: వినోద్ కాంబ్లీ శ్రీలంకను తక్కువ అంచనా వేయడంతో భారత క్రికెట్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని మాజీ టీమిండియా ఆటగాడు వినోద్ కాంబ్లీ ద్వజమెత్తాడు. అసలు గేమ్ ప్లాన్ ఎలా ఉండాలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును చూసి నేర్చుకుంటే బాగుంటుందంటూ తీవ్రంగా మండిపడ్డాడు. వరల్డ్ నంబర్ వన్ జట్టైన దక్షిణాఫ్రికాను పాకిస్తాన్ ఎలా కట్టడి చేసి విజయం సాధించిందో ఒకసారి కోహ్లీ చూసి నేర్చుకుంటే భాగుంటుందంటూ చురకలం టించాడు. పరుగుల సునామిలో లంకేయులు పైచేయి సాధించారని, ఇక్కడ టీమిండియా ప్లానింగ్ కనపడలేదన్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ గేమ్ ప్లాన్ను ఒక్కసారి చూడండన్నాడు. సఫారీలపై పాక్ ప్రణాళిక చాలా బాగుందన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో పాక్ ప్రణాళికను చూసి కోమ్లీ ఖచ్చితంగా నేర్చుకుంటే మంచిదని కాంబ్లీ విమర్శించాడు. ముందే వార్నింగ్ ఇచ్చిన హర్భజన్ శ్రీలంకతో మ్యాచ్కు ముందు లంకను తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భజ్జీ టీమిండియాను హెచ్చరించాడు. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంక ఓటమి పాలవ్వడంతో భారత్తో జరిగే మ్యాచ్ శ్రీలకంకు చావో రేవో లాంటిదనే విషయాన్ని కోహ్లీసేన గుర్తించుకోవాలని మ్యాచ్కి ముందు ఐసిసికి రాసిన కాలమ్లో కోహ్లీసేనకు హర్భజన్ సింగ్ వార్నింగ్ మెసేజ్ పంపాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 125పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో ప్రతి ఒక్కరూ పాజిటివ్ క్రికెట్ ఆడారు.
బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగం రాణించడం సంతోషం అని భజ్జీ పేర్కొన్నారు. ఈమ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంజట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం అభినందనీయమని కోహ్లీసేనపై భజ్జీ ప్రశంసలు కురిపించారు.అయితే 50ఓవర్ల మ్యాచ్ కావడంతో భారత్పై శ్రీలంక గెలిచే అవకాశాలను కొట్టిపారేయలేని భజ్జీ వ్యాఖ్యానించాడు. యువరాజ్కు బౌలింగ్ ఇవ్వకపోవడంపై కోహ్లీ: ఈ మ్యాచ్లో వెటరన్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఎందుకు బౌలింగ్ వేయలేదో టీమిండియా కెప్టెన్ కోహ్లీ వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం విలేకర్లు అడిగిన పార్ట్టైమ్ బౌలర్ యువరాజ్ సింగ్ని ఎం దుకు వినియోగించలేదన్న ప్రశ్నకు ఇలా బదు లిచ్చాడు. చూడండి..నాలుగు లేదా ఐదు వికెట్లు తీసి ఉంటే ఆ సమయంలో పార్ట్ టైమ్ స్పిన్నర్ యువరాజ్ చేత బౌలింగ్ చేయించే వాడిని. మరో వైపు 6ఓవర్లు వేసినా జడేజా కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాట్స్మెన్ నిల కడగా ఆడుతున్నారు.
ఇలాంటి సమయంలో జడే జానే ఇబ్బంది పడ్డాడు. అలా కాకుండా యువీ అయితే మరింతగా ఇబ్బంది పడేవాడు అని కోహ్లీ చెప్పాడు. అయితే ధోనీని సంప్రదించిన తర్వాత కేదార్ జాదవ్కు బౌలింగ్ ఇవ్వడంపై కూడా కోహ్లీ వివరించారు. ధోనీతో మాట్లాడాను. మేమిద్దరం కూడా కేదార్ జాదవ్ అయితే బాగుంటుందని అభిప్రాయానికి వచ్చాం. ఆ సమయంలో అతడే మాకు బెటర్ అని అనిపించాడు. ఇంగ్లాండ్ లాంటి వేదికలపై బ్యాట్స్మెన్లను సీమర్ల ద్వారా ఇబ్బంది పెట్టొచ్చని కోహ్లీ తెలిపాడు. ఆ ఉద్ధేశ్యంతోనే కేదార్ జాదవ్కి బౌలింగ్ ఇవ్వడం జరిగింది. పిచ్ పరిస్థితి, మ్యాచ్ జరుగుతున్న తీరుపై అప్ప టికప్పుడు ప్రణాళికలు మారుతుంటాయి. స్పిన్నర్లు పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో మనం బౌలింగ్ వేయడంలో తప్పులేదు. ఆస మయంలో అదే సరైన నిర్ణయమని అభిప్రాయ పడ్డాను అని కోహ్లీ చెప్పాడు. | 2sports
|
ధరలు పెంచే యోచనలో టాటామోటార్స్..
- ఉత్పత్తి వ్యయం పెరగడమే కారణం : మయాంక్ పరేఖ్ వెల్లడి
న్యూఢిల్లీ:దేశంలోఅంతకంతకు పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చు కారణంగా ప్రస్తు తం వున్న వాహన ధరలను ఇప్పటికే పలు కార్ల సంస్థలు సవరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే..ఇప్పుడు అదే దారిలో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ అయిన టాటామోటర్స్ కూడా ధరలు పెంచే యోచనలో వున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఉత్పత్తి ఖర్చు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని..ప్రస్తుతం ధరలను పెంచే అంశంపై కసరత్తు చేస్తున్నట్టు టాటామోటర్స్ ప్యాసింజర్ వాహనాల బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు మయాంక్ పరేఖ్ పేర్కొన్నారు. పెంపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై స్పష్టత ఇవ్వనప్పటికీ..ఈ పండుగల సీజన్లోనే ధరలు పెరగవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే తమ సంస్థ ఇప్పటి వరకు ధరలను సవరించలేదని మయాంక్ తెలిపారు.
8% పెరిగిన టాటా మోటార్స్ అమ్మకాలు
సెప్టెంబర్ నెలలో 48,648 యూనిట్లతో ఎనిమిది శాతం అమ్మకాలు పెరిగాయని టాటామోటార్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. గతేడాది ఇదే నెలలో 45,215 విక్రయాలు జరిపినట్టు తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బాలకృష్ణ- నయనతారలది సూపర్ హిట్ జోడి
ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్న బాలయ్య, నయన్
బాలకృష్ణ తల్లి పాత్రలో నయనతార
నందమూరి సింహం బాలకృష్ణ నయన తారల జంటకు ప్రేక్షకులలో ఒక మంచి గుర్తింపు ఉంది. దీనికితోడు వీరద్దరు కలిసి నటిస్తే ఆసినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడ ఉంది. ‘సింహ’ ‘శ్రీరామరాజ్యం’ సినిమాల విజయానికి ఈజంట కెమిస్ట్రీ బాగా సహకరించింది అని విమర్శకులు కూడ ఒప్పుకుంటారు.
ఈనేపధ్యంలో ఈజంటను ముచ్చటగా మూడోసారి కలిపి దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తీస్తున్న సినిమాలో నయనతార బాలకృష్ణకు తల్లిగా నటిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ 102వ సినిమాగా రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఏకబిగువున జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ కాదు అని టాక్. వేరే మరో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అని తెలుస్తోంది.
సినిమాలోని కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్ లో నయనతార సీనియర్ బాలయ్య భార్యగా కనిపిస్తుందని సమాచారం. అదీ కాకుండా కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వడానికి కారణం బాలయ్య అని అంటున్నారు. ఈ మూవీలో నయనతార పాత్రకు ఉన్న ప్రాధాన్యతను గ్రహించిన బాలకృష్ణ ఆమెను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేయడంతో నయనతార ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా బాలకృష్ణ సరసన నటించబోయే యంగ్ హీరోయిన్స్ పాత్రలలో ఒకదానికి మళయాళ హీరోయిన్ నటాషాజోషిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వేగంగా పూర్తిచేసి బాలకృష్ణకు సెంటిమెంట్ పరంగా బాగా కలిసివచ్చే రాబోతున్న సంక్రాంతికి విడుదల చేయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్..
Last Updated 26, Mar 2018, 12:02 AM IST | 0business
|
Hyderabad, First Published 16, May 2019, 2:14 PM IST
Highlights
'జెర్సీ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ తమిళ, కన్నడ భాషల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంది.
'జెర్సీ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ తమిళ, కన్నడ భాషల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఇటీవల ఆమె నటించిన 'జెర్సీ' సినిమా ప్రమోషన్స్ లో స్టార్ హీరోయిన్ సమంతపై కామెంట్ చేసింది శ్రద్ధా.
కన్నడలో శ్రద్ధా నటించిన 'యూటర్న్' సినిమాను తెలుగులో సమంత రీమేక్ చేసింది. అయితే తన పాత్రలో సమంతని చూడలేకపోయానని, తనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చానని కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది. దీంతో సమంత అభిమానులు శ్రద్ధాపై విరుచుకుపడ్డారు.
ఇప్పుడు ఈ బ్యూటీ ఏకంగా సమంతను రీప్లేస్ చేసి ఆమె ఛాన్స్ ని కొట్టేసింది. విశాల్, సమంత నటించిన 'ఇరుంబు తిరై' గతేడాది విడుదలై సక్సెస్ అందుకుంది. తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో సినిమాను విడుదల చేశారు.
ఇప్పుడు దానికి సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోగా విశాల్ కొనసాగుతాడు. కానీ హీరోయిన్ గా సమంతకి బదులు శ్రద్ధా శ్రీనాథ్ ని తీసుకున్నారు. ఇప్పటికే అజిత్ తో కలిసి 'పింక్' రీమేక్ లో నటిస్తోన్న శ్రద్ధా ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
డోపింగ్ వివాదంలో నర్సింగ్ కు క్లీన్ చిట్
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై వెలుగు చూసిన డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెడుతూ క్లియరెన్స్ ఇచ్చింది.
TNN | Updated:
Aug 2, 2016, 06:15AM IST
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై వెలుగు చూసిన డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెడుతూ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఆయన రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు మార్గం సుగుమం అయ్యింది. నాడా-2015 యాంటీ కాపీయింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్ కు ఉపశమనం లభించింది. దీంతో భారత్ నుంచి 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ ప్రాతినిథ్యం షురూ అయ్యింది. నర్సింగ్ తీసుకున్న డ్రింక్ లో ఉత్ప్రేరకాలు కలిపారని నాడా తెలిపింది. నర్సింగ్ యాదవ్ దోషి కాదని నాడా తేల్చింది. నర్సింగ్ యాదవ్పై బ్యాన్ తొలగడంతో అతడి అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. వారణాసిలో అతని ఇంటి వద్ద పండుగ వాతావారణం నెలకొంది. గతంలో నర్సింగ్ డోపీగా తేలడంతో అతడి స్థానంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ప్రవీణ్ రాణా (74 కిలోల)ను ఒలింపిక్స్ కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఐతే నర్సింగ్ డోప్ పరీక్షలో విజయవంతం కావడంతో ప్రస్తుతం ఇతనే ఆడనున్నారు.
పతకంతో తిరిగొస్తా
‘‘ఆఖరికి నిజమే గెలిచింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఉదంతాన్ని ఇంతటితో మరిచిపోయి పూర్తిగా ఒలింపిక్స్ పై దృష్టి సారిస్తా. రియో నుంచి పతకంతో తిరిగొస్తా’’ అంటూ నర్సింగ్ యాదవ్ పేర్కొన్నారు.
నీకే నా మద్దతు | 2sports
|
Bathukamma Song: మంగ్లీ బత...
సినిమాల్లో క్లైమాక్స్‌కు వచ్చేసరికి హీరో బ్రతుకుతాడు, విలన్లు చనిపోతారు అంతటితో శుభం. కానీ అదే వారి నిజ జీవితంలో జరిగితే అంతకన్నా విషాదం మరొకటి ఉండదు. ఇలాంటి విషాద సంఘటన ఈరోజు ఓ కన్నడ సినిమా షూటింగ్ సమయంలో చోటు చేసుకుంది. క్లైమాక్స్ సన్నివేశంలో నటిస్తూ ఇద్దరు నటులు నీటిలో మునిగిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో ' మస్తిగుడి ' అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. దునియా విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్‌లో భాగంగా సోమవారం ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాన్ని మాగడి తాలూకా లోని తిప్పగొండనహల్లి అనే ప్రాంతంలో ఓ పెద్ద రిజర్వాయర్ వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశంలో హీరో పాత్రలో నటిస్తున్న విజయ్‌తో పాటుగా విలన్ పాత్రల్లో నటిస్తున్న మరో ఇద్దరు నటులు అనిల్, ఉదయ్‌లు కలిసి హెలికాప్టర్ నుండి రిజర్వాయర్‌లో దూకాలి.
డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే సోమవారం మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో హెలికాప్టర్ నుంచి చెరువులో దూకారు. అయితే హీరో విజయ్ మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరగా అనిల్, ఉదయ్ ఇద్దరూ ఆ చెరువులో 2 గంటల నుంచి జాడలేకుండా పోయారు. భయంతో వారు మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరి నటుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
- Courtesy by Vijay Karnataka
The shooting of an action sequence for an upcoming Kannada movie turned tragic, when two actors who jumped off a copter into Tippagondanahalli reservoir, 35 km west of Bengaluru, were feared drowned on Monday afternoon.
The duo, Uday and Anil, jumped into the water around 2.45 pm. Panic spread when they did not emerge from water after the stipulated time. The fire and emergency services were immediately informed.
The duo was shooting for director Nagashekar's Maasti Gudi, featuring actor Duniya Vijay .
Vijay had also jumped with the duo, but swam to the shore on time. Sources said, the film star had a safety vest, but Uday and Anil were not provided with the same.
A boat was supposed to pick up the duo after they had jumped into the water. However, it is suspected that the delay in the boat reaching the spot might have resulted in the tragedy.
A fire tender was stationed at the lake as part of the safety arrangement at the shooting location, said fire control room officials. Around 3 pm, the control room received a call from the unit on the ground, requesting for a search and rescue team after the duo was feared drowned.
The unit was immediately pressed into service. After two hours, more units were called.
Industry insiders call Uday a promising and hard working actor, who was always ready to do anything for a film. Initially known to be a stunt double, he rose to fame as the villain in Duniya Vijay starrer Jayammana Maga . He has since acted in many other films as villain.
Anil, known for his eight-pack abs, has acted in over 25 films and was also shooting for the under-production films Hebbuli and Bharjari . His colleagues compliment him as a silent worker. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సెమీస్లో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
రెండన్నర గంటల ఆట సమయం వృథా కావడంతో మ్యాచ్ని 42 ఓవర్లకి కుదించారు. లీగ్ దశలో ఇప్పటికే ఆస్ట్రేలియా
TNN | Updated:
Jul 20, 2017, 06:16PM IST
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా దాదాపు రెండన్నర గంటల ఆట సమయం వృథా కావడంతో మ్యాచ్‌ని 42 ఓవర్లకి కుదించారు. లీగ్ దశలో ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసిన భారత్.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఇంగ్లాండ్‌తో ఫైనల్లో తలపడనుంది.
భారత్ జట్టు: మంధానా, పూనమ్ రౌత్, మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, వేదా, సుష్మా, జులన్ గోస్వామి, శిఖ పాండే, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ | 2sports
|
Hyderabad, First Published 27, Jun 2019, 11:37 AM IST
Highlights
విజయనిర్మల గారి లాంటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం
అరుదైన దర్శక నటీమణి శ్రీమతి విజయ నిర్మల గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మన తెలుగు పరిశ్రమలో భానుమతి గారి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి విజయనిర్మల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం. కృష్ణగారికి జీవిత భాగస్వామినిగా ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణగారికి, నరేష్ కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి. | 0business
|
తల్లి కాబోతున్న నిషా అగర్వాల్
Highlights
ఏమైంది ఈవేళ తో సినీ రంగ ప్రవేశం చేసిన నిషా
ముంబయికి చెందిన వ్యాపారవేత్తతో వివాహం చేసుకున్న నిషా
తల్లి కాబోతున్నట్లు రూమర్లు
అందాల తార కాజల్ చెల్లెలిగా సినీరంగ ప్రవేశం చేసింది నిషా అగర్వాల్. ‘ ఏమైంది ఈవేళ’, సోలో వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆ తర్వాత ఆమెకు పెద్దగా హిట్లు రాలేదు. ఆమె సోదరి కాజల్ వరస అవకాశాలతో దూసుకుపోతుండగా నిషా కి మాత్రం ఛాన్సులు రాలేదు. దీంతో అక్క వివాహం కాకుండానే ఈ చెల్లి పెళ్లిపీటలెక్కేసింది.
ముంబయికి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న నిషా.. వ్యాపార రంగంలో అడుగుపెట్టిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న నిషా.. ప్రస్తుతం తల్లి కాబోతోందట. ఈ విషయాన్ని నిషా కుటుంబసభ్యులు కూడా ధ్రువీకరించినట్లు సమాచారం. త్వరలోనే కాజల్ వాళ్లింట్లో బుల్లి పాపాయి సందడి చేయబోతోందని టాలీవుడ్ టాక్.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
internet vaartha 111 Views
యాక్సిస్ బ్యాంకుతో ప్రత్యేక క్రెడిట్ కార్డు
ముంబై : ఎయిర్ఇండియా నుంచి ఎదు రవుతున్న పోటీనీ తట్టుకునేందుకు ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు ప్రాంతీయ కనెక్టివిటీని పెంచు కునేందుకు పోటీపడుతున్నాయి. దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికలను అమలుచేస్తామని సిఒఒ సంజీవ్ కపూర్ వెల్లడించారు. టాటాసింగపూర్ ఎయిర్లైన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విస్తారాకు ప్రస్తుతం 11 ఎయిర్బస్ ఎ320విమానాఉన్నాయి. మరో తొమ్మి ది 2018కల్లా కొనుగోలుచేస్తోంది. దీనితో విదేశీ రూట్లలో కూడా సర్వీసులు తిప్పాలని కంపెనీ యోచిస్తోంది. దక్షిణాసియా ప్రాంతాలకు ముందు రూట్లు ఎంపికచేసుకుంది. వీటితోపాటే ప్రాంతీయ మార్కెట్పై కూడా దృష్టిపెట్టింది. ఇప్పటివరకూ వెళ్లని రూట్లను ఎంపికచేసుకుని నడపాలని నిర్ణ యించింది. దేశీయ రూట్లలో ప్రాంతీయ కనెక్టివిటీ కి చిన్న విమానాలు అవసరం అవుతాయి. వీటివల్ల చిన్ననగరాలకుసైతం వెళ్లిపోవచ్చు. చిన్న విమానం ఉండాలి లేదా ప్రాంతీయ విమానసంస్థతో టైఅప్ అయినా ఉండాలని నిర్ణయించినట్లు సంజీవ్కపూర్ వివరించారు. ఐదేళ్లు, 20 విమానాలపరిమితులను సడలించడంవల్ల ప్రాంతీయ కనెక్టివిటీతోపాటు అంతర్జాతీయ రూట్లకు సైతం వెళ్లే వీలుంటుంది. 20శాతం వార్షికవృద్ధి సరిపోదని ఆయన అంచనా. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రాంతీయ కనెక్టివిటీని మరింతగా పెంచుతామని చెపుతున్నారు. ప్రస్తుతం12నుంచి 17రూట్లకు వెళ్లా మని, పోర్టుబ్లయర్కు కూడా సెప్టెంబరులో ప్రారంభిస్తామన్నారు 40నుంచి 70 విమానాలకు పెరిగా యి. 100 విమానాలకు ఈ ఏడాది చివరికి చేరతాయన్నారు. విమానం వినియోగం 13 గంటలుగా ఉంది. అలాగే లోడ్ఫ్యాక్టర్ను కూడా 80శాతం వృద్ధిచేసినట్లు తెలిపారు. విస్తారా సేవలను మరింత పటిష్టంచేసుకునేందుకు గాను యాక్సిస్ బ్యాంకతో కలిసి విస్తారా యాక్సిస్ బ్యాంకు కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. యాక్సిస్బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యాటక,ప్రయాణ రంగాలకు ఈ కార్డులు ఎంతో ఉపకరిస్తాయని అంచనా. | 1entertainment
|
Aug 19,2016
2న బ్యాంకు ఉద్యోగుల సమ్మెబాట!
న్యూఢిల్లీ: ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలు, చేటు చేసే కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 2న నిర్వహించనున్న 'అఖిల భారత సాధారణ సమ్మె'లో బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ, విదేశీ, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులు అధికారులు కలుపుకొని దాదాపు అయిదు లక్షల మంది సమ్మెలో పాల్గొంటారని 'ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్' (ఏఐబీఈఏ) గురువారం ప్రకటించింది. దేశంలోని 'కేంద్ర కార్మిక యూనియన్'లు ఏర్పాటు చేసిన 'నేషనల్ ట్రేడ్ యూనియన్ కన్వెన్షన్'లో సెప్టెంబరు 2న 'అఖిల భారత సాధారణ సమ్మె'ను చేపట్టాలని నిర్ణయించినట్లుగా ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటాచలం తెలిపారు. బ్యాంకుల లాభనష్టాల ఖాతాలలో ఒడుదొడుకులను సరిది ద్దడం అంటూ సర్కారు అధిక మొత్త ంలో లాభాలను ముం దస్తు కేటాయిం పులకు మళ్లించడాన్ని ఆయన ఆక్షేపిం చారు. ఈ విధంగా బాడా బాబుల మొండి బాకీలు బయట ప్రపం చానికి తెలియ కుండా చేస్తున్నారని అన్నా రు.ఏటా సగటున రూ.50,000 కోట్ల మేర రుణాలను రైట్ఆఫ్ చేస్తున్నారని వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. మొండి బాకీల విషయం లో కఠిన ంగా వ్యవహరించాల్సి సర్కారు ఈ విధంగా ప్రవరిం చడాన్ని ఆయన తప్పు బట్టారు. ప్రభుత్వ బ్యాంకులు చిన్నవై పో యాయంటూ విలీనాలను ప్రతిపాది స్తున్న సర్కారు ప్రయివేట సంస్థలు చిన్న బ్యాంకులను తెరుచుకొ నేందుకు అనుమతులు ఇస్తుండటం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నాలాగే ఆరాధ్య చాలా సున్నితం
తన కూతురు ఆరాధ్య తనలాగే చాలా సున్నిత మనస్కురాలని చెప్తోంది ఐశ్వర్య.
TNN | Updated:
Sep 26, 2015, 04:10PM IST
తన కూతురు ఆరాధ్య తనలాగే చాలా సున్నిత మనస్కురాలని చెప్తోంది ఐశ్వర్య. వినాయకుడిని అమితంగా పూజించే బచ్చన్ కోడలు తన కూతురుకి హారతి పాటని నేర్పింది. ‘ప్రతి సాయంత్రం మా ఇంట్లో దీపాలు పెట్టేప్పుడు వినాయక హారతి పాటని పెడతాం. అది వింటూ వింటూ ఆరాథ్య నేర్చేసుకుంది. ఇప్పుడు తను ఆ పాటని చక్కగా పాడేస్తుంది కూడా’ అని చెప్పింది. ఈ సెలబ్రిటీ తల్లీకూతుళ్లిద్దరూ నవంబర్లోనే పుట్టారు. ఇదే విషయమై ఓ జర్నలిస్టు మీ ఇద్దరిలో కామన్ గుణాలేంటని ఐశ్వర్యను అడిగితే ‘మా ఇద్దరం కూడా చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉన్న వాళ్లం’ అని చెప్పింది. | 0business
|
హలో మేకర్స్ కు నోటీసులు
Highlights
హలో చిత్రంలో వాడిన ఫోన్ నంబర్ తో వ్యక్తికి తంటా
ఆ నెంబరు వాడుతున్న వికాస్ ను విసిగిస్తున్న ఫోన్ కాల్స్
తనను పెళ్లిచేసుకుంటామంటూ విపరీతంగా ఫ్యాన్స్ గొడవ
గత ఏడాది చివరాంతంలో విడుదల అయిన అఖిల్ సినిమా ‘హలో’ రూపకర్తలకు లీగల్ నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సినిమాలో తన ఫోన్ నంబర్ ను వాడుకోవడంపై గుర్గావ్ కు చెందిన వికాస్ ప్రజాపతి అనే వ్యక్తి ‘హలో’ నిర్మాతలకు ఈ నోటీసులు పంపించినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ కు తన ఫోన్ నంబర్ వాడారు అని వికాస్ చెబుతున్నాడు. ఆ ఫోన్ నంబర్ ను తెరపై చూపడంతో.. తనకు లెక్కకు మించి కాల్స్, మెసేజ్ లు వచ్చాయని వికాస్ అంటున్నాడు.
ఓ కంప్యూటర్ ఆపరేటర్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్. అదీ మామూలుగా కాదు. పెళ్లి చేసుకుంటామనే రేంజిలో... నెల రోజుల నుంచి‘హాయ్.. నేను నీ అభిమానిని’, ‘నీతో ఒకసారి మాట్లాడొచ్చా..’, ‘ఐ లవ్యూ..నిన్ను పెళ్లి చేసుకుంటా..’ అంటూ మొదలుపెట్టి.. కొన్ని వందల, వేల మెసేజ్ లు వస్తున్నాయి. వీటితో పాటు ఇదే తరహా సందేశాలతో ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయట. ఉన్నట్టుండి తనకు ఆ మేసేజ్ లు ఎందుకు వస్తున్నాయో.. వికాస్ కు అర్థం కాలేదట. కానీ.. తర్వాత విచారిస్తే.. తన ఫోన్ నంబర్ ను హలో సినిమాలో ఉపయోగించారని అతడికి అర్థమైంది.
అందులోనూ.. ఆ సినిమాలో హీరోయిన్ నంబర్ గా తన నంబర్ ను చూపించారని, దీంతో.. వరస పెట్టి కాల్స్ వస్తున్నాయని వికాస్ చెబుతున్నాడు. ఏదో ఒకటీ రెండు కాల్స్ కాదు.. హలో సినిమాను చూసి, అందులో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కు ఫిదా అయిన వాళ్లంతా వికాస్ నంబర్ కు కాల్స్ చేస్తున్నారట. దీంతో తనకు ఇదంతా ఒక టార్చర్ గా మారిందని వికాస్ చెబుతున్నాడు.
దీంతో తను చాలా నష్టపోయాను అని, ఫోన్ నంబర్ ను మార్చేద్దామా.. అనుకుంటే, అది తన స్నేహితులందరికీ ఈ నంబరే ఇచ్చుకున్నాను అని, ఐదు సంవత్సరాలుగా అనేక మందికి ఈ నంబర్ ను ఇచ్చుకోవడంతో ఇప్పుడు మార్చడం ఇబ్బందిగా మారిందని వికాస్ చెబుతున్నాడు. తను పడిన ఈ ఇబ్బందికి గానూ.. యాభై లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కోరుతున్నాడితను. ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించాడితను.
అయితే తాము అనుమతి తీసుకున్నామని.. ఈ నంబర్ ప్రొవైడర్ల నుంచి అనుమతితో సినిమాలో వాడుకున్నామని ‘హలో’ నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఆ సంస్థ మాత్రం ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదని చెబుతుండటం గమనార్హం.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST | 0business
|
Hyderabad, First Published 6, Aug 2019, 3:39 PM IST
Highlights
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ విషయంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల మధ్య విబేధాలు వచ్చాయని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారట. కానీ బన్నీకి మాత్రం ఐటెం సాంగ్ పెట్టడం అసలు ఇష్టం లేదని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబో రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాల్లో కూడా ఐటెం సాంగ్స్ లేవు. 'జులాయి' సినిమాలో ఉదయభాను ఐటెం సాంగ్ ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ సినిమాలో ఐటెం సాంగ్ లేదు.
ఇప్పుడు మరోసారి బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో ఐటెం సాంగ్ అంశం తెర మీదకి వచ్చింది. సినిమాలో ఓ కీలక సందర్భంలో ఐటెం సాంగ్ కచ్చితంగా ఉండాలని త్రివిక్రమ్ అభిప్రాయపడుతున్నారట. కానీ ఇలాంటి కథలో ఐటెం సాంగ్ ఉంటే బాగోదని బన్నీ ఫీల్ అవుతున్నాడట. ఈ విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయనే మాటలు వినిపిస్తున్నాయి.
గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటి టబు, యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. | 0business
|
హిందీ సూపర్హిట్ జాలీ ఎల్.ఎల్.బి. ఆధారంగా సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్.ఎల్.బి' ప్రారంభం
Highlights
సప్తగిరి హీరోగా మరో తెలుగు చిత్రం
సప్తగిరి ఎక్స్ ప్రెస్ నిర్మాతలే ఈ మూవీ నిర్మాత
జాలీ ఎల్.ఎల్.బిని తెలుగులో రీమేక్ చేస్తున్న డా.రవికిరణ్
కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్ప్రెస్ వంటి సూపర్హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత యువ నిర్మాత డా. రవికిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా మరో విభిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో సూపర్డూపర్ హిట్ అయిన 'జాలీ ఎల్.ఎల్.బి' పార్ట్-1 రైట్స్ ఫ్యాన్సీ ఆఫర్తో స్వంతం చేసుకొని 'సప్తగిరి ఎల్.ఎల్.బి' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్లో 5 ఏళ్ళు, సూపర్గుడ్ ఫిలింస్లో 5 ఏళ్ళు దర్శకత్వశాఖలో పని చేసి డా. డి.రామానాయుడుగారికి, సూపర్గుడ్ ఆర్.బి. చౌదరికి ప్రియ శిష్యుడనిపించుకుని 'కలిసుందాం..రా', 'ప్రేయసిరావే', 'నిన్నే ప్రేమిస్తా', 'భీమిలి కబడ్డీ జట్టు' 'రచ్చ' వంటి సూపర్హిట్ చిత్రాలకు పని చేసి, దిల్ రాజు బేనర్లో 'మిస్టర్ పర్ఫెక్ట్'కి దర్శకత్వశాఖలో వర్క్ చేసిన చరణ్ లక్కాకుల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
జూన్ 22న సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ముహూర్తం షాట్కి సూపర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టగా, నిర్మాత డా. రవికిరణ్ కుమార్తెలు బేబీ ఐశ్వర్య, బేబీ అస్మిత కెమెరా స్విచాన్ చెయ్యగా, సీనియర్ ఎడిటర్ గౌతంరాజు గౌరవ దర్శకత్వం వహించారు.
'నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు' అని హీరో సప్తగిరి తొలి డైలాగ్ చెప్పారు. అనంతరం హీరో కామెడీ కింగ్ సప్తగిరి మాట్లాడుతూ - ''నేను హీరోగా నటించిన తొలి చిత్రం 'సప్తగిరి ఎక్స్ప్రెస్'ని మేము ఊహించినదానికంటే పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ విజయం నాకు, నా నిర్మాత రవికిరణ్గారికి ఎంతో బాధ్యతని పెంచింది. అందుకే ఎన్నో కథలు అనుకొని ఫైనల్గా హిందీలో సూపర్హిట్ అయిన 'జాలీ ఎల్.ఎల్.బి' పార్ట్-1 రైట్స్ తీసుకొని డెఫినెట్గా మళ్ళీ సూపర్హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నాం. నా కెరీర్లోకి ఇది మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు.
నిర్మాత డా. రవికిరణ్ మాట్లాడుతూ - ''సప్తగిరితో మేము నిర్మించిన తొలి చిత్రం ఎవరూ ఊహించనంత అద్భుత విజయాన్ని సాధించింది. మళ్ళీ సప్తగిరి హీరోగా అంతకంటే పెద్ద హిట్ తియ్యాలని 'జాలీ ఎల్.ఎల్.బి' రైట్స్ తీసుకొని తెలుగులో మనకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవకుండా ఈ 'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రాన్ని ప్లాన్ చేశాం. ఈనెల 25 నుండి కంటిన్యూస్గా షెడ్యూల్ జరుగుతుంది. మా బేనర్కి ఇది మరో పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.
దర్శకుడు చరణ్ లక్కాకుల మాట్లాడుతూ - ''గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావుగారి క్లాప్తో ఈ సినిమా ప్రారంభం అయినందుకు ఆనందంగా వుంది. మంచి నిర్మాత డా. రవికిరణ్గారు. సక్సెస్ఫుల్ హీరో సప్తగిరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. దర్శకుడిగా ఈ చిత్రాన్ని సూపర్హిట్ చెయ్యడానికి శాయశక్తులా కృషి చేస్తాను'' అన్నారు.
కామెడీ కింగ్ సప్తగిరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో షకలక శంకర్, డా. శివప్రసాద్లతో పాటు ప్రముఖ తారాగణం నటిస్తారు.
ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: విజయ్ బుల్గానిన్, కో-డైరెక్టర్: రాజశేఖర్రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్.ఆర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: అర్జున్, పాటలు: చంద్రబోస్, కందికొండ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్, దర్శకత్వం: చరణ్ లక్కాకుల.
Last Updated 25, Mar 2018, 11:39 PM IST | 0business
|
సెన్సార్ టాక్: ఛల్ మోహన రంగ
Highlights
సెన్సార్ టాక్: ఛల్ మోహన రంగ
సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఛల్ మోహన రంగ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ లెంగ్త్ కామెడీతో ఇరగదీసేశారట. అలాగే ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సున్నితంగానే ఉన్న అసలు ఊహించలేని విధంగా ఉంటుందట. ఇక సెకండాఫ్ అయితే రొమాంటిక్ సన్నివేశాలతో నితిన్- మేఘా ఆకాష్ లు ప్రేమను పండించేశారని అంటున్నారు.
అయితే.. అటు కామెడీ విషయంలో కానీ.. ఇటు రొమాన్స్ విషయంలో కానీ ఎక్కడా కొంచెం కూడా హద్దులు దాటకపోవడంతోనే యూ సర్టిఫికేట్ లభించిందని అంటున్నారు. త్రివిక్రమ్ మార్క్ కామెడీ సన్నివేశాలు చాలానే పడ్డాయట. మొత్తం మీద మోహన రంగడు.. బాక్సాఫీస్ కళ్లెం పట్టుకుని ఛల్ ఛల్ మనేందుకు పర్ఫెక్టుగా సిద్ధం అయిపోయాడు.
Last Updated 2, Apr 2018, 5:03 PM IST | 0business
|
Hyderabad, First Published 28, Aug 2018, 3:24 PM IST
Highlights
స్టార్ హీరోల సినిమా విడుదలైదంటే.. అది హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. రెండు రోజులకి రూ.50 కోట్ల పోస్టర్, వారం రోజులకి రూ. 100కోట్ల పోస్టర్ వేస్థుటున్నారు నిర్మాతలు. నిజంగానే సినిమా అంత కలెక్ట్ చేయకపోయినా.. మరింత బజ్ క్రియేట్ చేయడానికి ఇలా ఫేక్ కలెక్షన్స్ తో పోస్టర్లు వేయిస్తుంటారు
స్టార్ హీరోల సినిమా విడుదలైదంటే.. అది హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. రెండు రోజులకి రూ.50 కోట్ల పోస్టర్, వారం రోజులకి రూ. 100కోట్ల పోస్టర్ వేస్థుటున్నారు నిర్మాతలు. నిజంగానే సినిమా అంత కలెక్ట్ చేయకపోయినా.. మరింత బజ్ క్రియేట్ చేయడానికి ఇలా ఫేక్ కలెక్షన్స్ తో పోస్టర్లు వేయిస్తుంటారు. తాజాగా 'గీత గోవిందం' సినిమాకు కూడా వంద కోట్ల పోస్టర్ వేశారు. రెండు రోజుల క్రితమే కదా.. రూ.40 కోట్లు క్రాస్ చేసిందనన్నారు.. అప్పుడే వంద కోట్ల పోస్టర్ ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ సినిమా ఇప్పటివరకు రూ.50 కోట్ల షేర్ రాబట్టింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ రూ.100 కోట్లు మాత్రం రాలేదనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటి వరకు సినిమా మహా అయితే రూ. 70 నుండి 80 కోట్ల షేర్ వసూలు చేసి ఉండొచ్చని.. వంద కోట్లకు మరికొన్ని రోజులు పడుతుందని అంటున్నారు. త్వరలోనే రాబోయే కలెక్షన్స్ తో ముందుగానే పోస్టర్ వేసి దించేసింది అల్లు అరవింద్ కాంపౌండ్.
ఇలా అత్యుత్సాహంతో పోస్టర్ వదిలి విమర్శలపాలవుతుంది గీత గోవిందం టీమ్. జెన్యూన్ హిట్ ని జెన్యూన్ గానే చూపిస్తే బాగుంటుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి.. | 0business
|
శ్రీసిటీలో ఏప్రిల్ నుంచి ఉత్పత్తి
- ఇసూజూ సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్
కోల్కతా: ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు ద్వారా వచ్చే ఏప్రిల్ నుంచి వాణిజ్య ఉత్పత్తిని మొదలు పెట్టాలని జపాన్కు చెందిన ఆటో దిగ్గజ సంస్థ ఇసూజూ నిర్ణయించింది. భారత్లోనే మొట్టమొదటి సారిగా ఈ సంస్థ శ్రీ సిటీ సెజ్లో సుమారు రూ.3000 కోట్ల వ్యయంతో సాలీన సుమారు 1.20 లక్షల వాహనాలను తయారీ సామర్థ్యంలో కొత్త ప్లాంటును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కొత్త ప్లాంటు ద్వారా తొలి సంవత్సంంలోనే దాదాపుగా 10,000 వాహనాలను విక్రయించాలని నిర్ణయించినట్లు సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ షిగేరూ వకబయాషీ తెలిపారు. గత ఏడాది సంస్థ దేశీయంగా దాదాపు 1,300 వాహనాలను విక్రయించినట్లు ఆయన వెల్లడించారు. 2015-16 నాటికి తమ డీలర్ నెట్వర్క్ను 60 అవుట్లెట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు షిగేరూ తెలిపారు. ఈ కొత్త ప్లాంటులో ఏప్రిల్ నుంచి ఉత్పత్తి ప్రారంభించి రానున్న రోజుల్లో దానిని దశల వారీగా రెండు లక్షల వాహనాలకు పెంచనున్నట్లుగా ఆయన వెల్లడించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Pak Batting
10 ఓవర్లకు పాక్ : 65-0
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ 10 ఓవరుల పూర్తయ్యే సరికి వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది.. ఓపెనర్లు ఫఖర్ జమాన్ 43, అజర్ ఆలీ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.. పాకిస్థాన విజయం సాధించటానికి 40 ఓవర్లులో 172 పరగులు చేయాల్సి ఉంది. | 2sports
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
విపణిలోకి వోల్వో ఎక్స్సీ 60..
Wed 13 Dec 03:44:54.418213 2017
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ మేకర్ వోల్వో కార్స్ మంగళవారం భారత మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీ ఎక్స్ సీ 60 కొత్త వెర్షన్ను విడుదల చేసింది. ఆల్ ఇం
నాలుగు నెలల కనిష్టానికి పసిడి
Wed 13 Dec 03:45:00.444648 2017
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గడానికి తోడు దేశీయంగా కూడా స్థానిక వర్తకుల నుంచి బంగారానికి డిమాండ్ పడిపోవడంతో అపరంజి ధర వరుసగా దిగివస్తోంది. మంగళవారం మరో రూ.18
భారత ఐటీకి ఇజ్రాయిల్ చేయూత
Wed 13 Dec 03:45:07.415442 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: గ్లోబల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యూలేషన్ (జీడీపీఆర్) నిబంధనలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్గ్రేడ్ చేసుకోవడంలో భారత ఐటీ కంపెనీలకు ఇ
ఐపీవోకు రానున్న రిలయన్స్ జియో!
Wed 13 Dec 03:45:14.192025 2017
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రావడానికి కసరత్తు చేస్తోంది. రిలయన్స్ జియో కోసం ఇప్పటికే 31
సమీపిస్తోన్న ఎన్పీఏల గడువు
Tue 12 Dec 07:13:56.884918 2017
న్యూఢిల్లీ : బడా మొండి బాకీల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు నిర్దేశించిన గడువు దగ్గరపడింది. దీంతో పలు కంపెనీల మొండి బకాయి(ఎన్పీఏ)ల పంతం పట్టడంపై బ్యాంకులు దృష్టి సారించాయ
లాభాల్లో ముగిసిన మార్కెట్లు..
Tue 12 Dec 07:14:50.40197 2017
ముంబయి : ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు తగ్గినా గెలుపొందే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాల్లో సోమవారం భారత మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మదు
ఆ డిపాజిట్ల బాధ్యత ప్రభుత్వానిదే: జైట్లీ
Tue 12 Dec 07:14:55.167624 2017
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ప్రజల చేసుకునే డిపాజిట్లకు ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని అరుణ్ జైట్లీ అన్నారు. ప్రతిపాదిత 'ఫైనాన్షియల్ రిజుల్యూషన్ అండ్ డిపాజి
మార్కెట్లోకి రాధా టీఎంటీ స్టీల్
Tue 12 Dec 07:15:00.471007 2017
హైదరాబాద్ : రాధా స్మెల్టర్స్ ప్రయివేటు లిమిటెడ్ మార్కెట్లోకి రాధా టీఎంటీ 550 స్టీల్ బార్లను విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 400 మంది డీలర్లు, డిస్ట్రిబ్యూట
ఎనిమిది వేల మందికి నోటీసులు
Tue 12 Dec 07:15:05.978552 2017
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వ్యక్తులు, టీడీఎస్ చెల్లింపుల్లో ఆలస్యం చేసిన వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ న్యాయపరమైన చర్యలకు దిగింది. ఈ అంశంలో 8వేల
వృద్ధి రేటు 6.5% పెరుగొచ్చు
Tue 12 Dec 07:15:11.916961 2017
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5 శాతంగా పెరుగొచ్చని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ సి రంగ రాజన్ పేర్కొన్నారు. దేశ వృద్ధి రేటు నెమ్మదిగా పెరుగు
'స్టార్టప్ ఇండియా'కు స్టార్టింగ్ ప్రాబ్లెం
Mon 11 Dec 05:58:38.135168 2017
* కడవేర్గు దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోడీ స్వహస్తాలతో ప్రారంభించిన 'స్టార్టప్ ఇండియా' పథక ఉద్దేశమే మారిపోయింది. ఎన్నెన్నో కలలు
చిక్కుల్లో స్థిరాస్తి రంగం..!
Mon 11 Dec 05:58:45.577967 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: దేశంలోని స్థిరాస్తి సంస్థలు గత దశాబ్ద కాలంలో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అర్థిక వ్యవస్థలో నెలకొన్న స్తబ్దత, బ్యాంకులు ఆచి
కార్లపై రూ.లక్షవరకు తగ్గింపు
Sun 10 Dec 05:50:52.376116 2017
చెన్నయ్ : కారు కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం. కొత్త ఏడాదిలో ధరలు పెంచనున్నట్లు ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. కాగా ప్రస్తుత మాసంలో డిస్కౌంట్లను అంది
భారత్లోనే కాకుండా విదేశాల్లోనూ గనులను విస్తరించాలి
Sun 10 Dec 05:50:59.666521 2017
హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద ముడి ఇనుప ఖనిజం ఉత్పత్తిదారుగా ఉన్న ఎన్ఎండీిసీ ప్రగతిని శనివారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేందర్ సింగ్ సమీక్షించారు. హైదరాబాద్లోన
సిండికేట్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గింపు
Sun 10 Dec 05:51:07.401241 2017
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని సిండికేట్ బ్యాంకు శనివారం మార్జినల్ కాస్ట్ బేసడ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్ఆర్)ను తగ్గించింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ బ్యాం
'ఇన్ఫోసిస్ బోర్డును పునర్నిర్మించాలి'
Sun 10 Dec 05:51:21.468204 2017
బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్పై ఆ కంపెనీ మాజీ అధికారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్ బోర్డును పునర్నిర్మించాలని మాజీ చీఫ్
పెరిగిన ప్రత్యక్ష పన్నులు
Sun 10 Dec 05:51:30.463165 2017
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో రూ.4.8 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరిగాయి. గతేడాది ఇదే కాలం వసూళ్లతో పోల్చితే ఇవి 14.4 శాతం
ఎస్ఎంఇలకు గోడాడీ భద్రత ఆఫర్లు
Sun 10 Dec 05:51:38.791187 2017
హైదరాబాద్ : దేశంలోని చిన్న వ్యాపారాలకు ఆన్లైన్ భద్రత ఆఫర్లను అందిస్తున్నట్లు డొమైన్ల విక్రయ సంస్థ గోడాడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం మెకాఫీ రక్షణను అందుబాటులోకి తె
ప్రభుత్వరంగ సంస్థలతో దేశానికి తోడ్పాటు
Sat 09 Dec 06:12:26.242064 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ప్రభుత్వరంగ సంస్థలు దేశానికి తోడ్పాటును అందిస్తున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఒక స్థిరమైన పారిశ్రామిక పునాదిని నిర్మించడంలోన
వచ్చే ఏడాది మరిన్ని కొత్త మోడళ్లు..
Sat 09 Dec 06:12:31.446128 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: వచ్చే ఏడాదిలో మరో మూడు కొత్త మోడల్ బైకులను అందుబాటులోకి తెస్తామని యూఎం లోహియా టూ వీలర్స్ సీఈవో రాజీవ్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం రూ.2లక్ష
ప్రభుత్వంతో ఓయో ఒప్పందం
Sat 09 Dec 06:12:37.070834 2017
హైదరాబాద్: తెలంగాణలో హాస్పిటాలిటీ, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓయో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్బంగా హైదరాబాద్లో ఏర్పాటుచేసిన టెక్ డెవలప్
త్వరలోనే తెలంగాణలో స్టీల్ ప్లాంట్
Sat 09 Dec 06:12:42.715168 2017
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రెండు స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రక్రియ దగ్గర పడిందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో
మహీంద్రా నుంచి కొత్త డీజిల్ జనరేటర్లు
Sat 09 Dec 06:12:48.705589 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా పటరోల్ తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి నూతన శ్రేణీ డీజిల్ జనరేటర్లను విడుదల చేసింది. 250, 320 కెేవీఏ సామర్
వచ్చే ఏడాది 7.5% వృద్ధి రేటు
Sat 09 Dec 06:12:54.61737 2017
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19)లో భారత వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ విత్త సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. వచ్చే ఏడాది జీడీపీ పుంజు
వారాంతంలో కొనసాగిన పరుగు..
Sat 09 Dec 06:13:00.83366 2017
ముంబయి : వివిధ పరిణామాల మధ్య దేశీయ, అంతర్జాతీయ మదుపర్లు భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం బీఎస్ఈ
మార్కెట్లకు బ్యాంకింగ్ అండ..!
Fri 08 Dec 05:24:44.531331 2017
ముంబయి : వరుసగా రెండు రోజులు నష్టాలు చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం భారీ ఉపశమనం లభించింది. బ్యాంకింగ్, టెలికాం, లోహ, ఆటో సూచీల పరుగుతో మార్కెట్లు లాభాల్లో
'ఆంధ్రాబ్యాంక్' ఆధ్వర్యంలో నాణెముల పంపిణీ
Fri 08 Dec 05:24:50.925604 2017
హైదరాబాద్ : రాష్ట్రపతి రోడ్డులోని తమ బ్రాంచ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్లో నాణెములు పంపిణీ చేసినట్టు ఆంధ్రాబ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్ వెంకటేశ్వ
ముత్తూట్ నుంచి చౌక రుణాల పథకం
Fri 08 Dec 05:24:56.344672 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్ : పసిడి తనఖా రుణాలు అందించే ముత్తూట్ ఫైనాన్స్ ప్రత్యేకంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థ (ఎస్ఎంఈ)ల మూలధన అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక రుణ
నాలుగేండ్లలో వెయ్యి కోట్ల రెవెన్యూ లక్ష్యం
Fri 08 Dec 05:25:02.453646 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రికల్ ఉత్పత్తుల కంపెనీ హావెల్స్ ఇండియాకు చెందిన స్టాండర్డ్ విభాగం వచ్చే మూడు, నాలుగేండ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగ
ఫిలిప్పీిన్స్ ఎయిర్పోర్టు రేసులో జీఎంఆర్
Fri 08 Dec 05:25:08.875663 2017
హైదరాబాద్: ఫిలిప్పీిన్స్లోని క్లార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నూతన టెర్మినల్ బిల్డింగ్ ప్రాజెక్టును దక్కించుకోవడానికి జీఎంఆర్ గ్రూపు పోటీ పడుతోంది. ఇందుకోసం మనీలా
ఎస్ఎంఈల కోసం టాలీ 'ఎక్సలరేటర్'
Fri 08 Dec 05:25:15.109147 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: చిన్న, మధ్య తరహా పరిశ్రమల జీఎస్టీ ఫైలింగ్స్ కోసం టాలీ సొల్యూషన్స్ ప్రత్యేకంగా ఎక్సలరేటర్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింద
'నువొకొ విస్టాస్'కు ఫిక్కీ సీఎస్ఆర్ అవార్డు
Fri 08 Dec 04:23:46.96344 2017
న్యూఢిల్లీ : బిల్డింగ్ మెటీరియల్స్ తయారీ సంస్థల్లో ఒకటైన నువొకొ విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ 2016-17కు గాను మహిళాసాధికారికత విభాగంలో ఫిక్కీ సీఎస్ఆర్ జ్యూరీ రికమండ
మరో 'సారీ' వడ్డీ రేట్లు యథాతథం
Thu 07 Dec 06:23:59.677485 2017
ముంబయి: వచ్చే ఏడాది మార్చి వరకు వడ్డీ రేట్ల తగ్గింపు ఉండబోదని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంకేతాలు ఇచ్చింది. ద్రవ్యోల్బణం పెరగనుందన్న భయాలతో వడ్డీ రేట్లను తగ్గి
బంగారం గనుల్లోకి ఎన్ఎండీసీ
Thu 07 Dec 06:24:04.884648 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తిదారు ఎన్ఎండీసీ కొత్తగా బంగారం, వజ్రాలు, టంగ్స్టన్ గనులపై దృష్టి పెట్టింది. డిసెంబర్ 8న హైదరాబాద్లో
విపణిలోకి టీవీఎస్ ఆపాచీ ఆర్ఆర్ 310
Thu 07 Dec 06:24:10.392367 2017
చెన్నై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ బుధవారం భారత్ మార్కెట్లోకి అపాచీ ఆర్ఆర్ 310ను విడుదల చేసింది. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్షోరూం ఢిల్
రూ.1649కే ఎయిర్టెల్ 4జీ ఫోన్
Thu 07 Dec 06:24:15.676668 2017
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ భాగస్వామ్యంతో చౌక ధరలో 4జీ స్మార్ట్ఫోన్ను తెచ్చింది. జియోకి
హైదరాబాద్కు అలహాబాద్ బ్యాంకు సీఎండీ
Thu 07 Dec 06:24:21.427962 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అలహాబాద్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో ఉషా అనంతసుబ్రమణ్యన్ నేడు హైదరాబాద్కు రానున్నారని బ్యాంకు వర్గ
హోండా ధరలు పెరుగుతారు!
Thu 07 Dec 06:24:28.509552 2017
న్యూఢిల్లీ : ప్రముఖ హోండా కార్స్ ఇండియా తన మోడల్స్పై ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. 2018 జనవరి 1 నుంచి ఆ కంపెనీ పలు మోడళ్లపై రూ.25వేల వరకు ధరలు పెంచుతున్నట్టు వెల్లడ
సింక్రోనీ నీటి సౌకర్యం..
Thu 07 Dec 05:08:31.010244 2017
హైదరాబాద్: ఫైనాన్సీయల్ సర్వీసెస్ కంపెనీ సింక్రోనీ ఫైనాన్సీయల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని 32వేల మందికి పైగా ప్రజలకు తాగునీటి సౌకర్యం అందించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్
ఎగుమతిదారులకు ఊరట..!
Wed 06 Dec 06:16:14.422187 2017
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా పడిపోతున్న భారత ఎగుమతులకు మద్దతునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక చర్యలు ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ) 201
తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి వివో7
Wed 06 Dec 06:16:21.433441 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ వివో తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి వీ7 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ, ఏప
యూకే సంస్థతో హలో కర్రీ జట్టు
Wed 06 Dec 06:16:33.283883 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ఇండియన్ ఫాస్ట్ఫుడ్ గొలుసుకట్టు సంస్థ హలో కర్రీ, బ్రిటన్కు చెందిన ఫుడ్ అడ్వైజర్తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదు ర్చుకుంది. మంగళ
మార్కెట్లకు 'ఆర్బీఐ' భయాలు
Wed 06 Dec 06:18:45.707147 2017
ముంబయి : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో మంగళవారం భారత మార్కెట్లు స్వల్ప ఒత్తిడికి గురి అయ్యాయి. ఈ సమీక్షలో ఆర్బీఐ వడ
ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలోకి స్వీట్ మ్యాజిక్
Wed 06 Dec 06:16:54.552213 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: స్వీట్ మ్యాజిక్ వీట్ రస్క్ ఆవిష్కరణతో ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్టు స్వీట్ మ్యాజిక్ ఫుడ్స్ సంస్థ ప్రకటించింది. ముంద
సోలార్ పవర్లోకి బాబా రామ్దేవ్
Wed 06 Dec 06:17:01.112106 2017
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయించిన యోగా గురు రామ్దేవ్ బాబా తన వ్యాపారాన్ని ఇతర రంగాల వైపు విస్తరించే యోచనలో ఉన్నారు. పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్ అ
కోటిపైగా చేరిన గూగుల్ 'తేజ్' యూజర్లు!
Wed 06 Dec 06:17:30.423415 2017
న్యూఢిల్లీ: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇటీవల తీసుకొచ్చిన మొబైల్ వ్యాలెట్ యాప్ 'గూగుల్ తేజ్'లో 1.2 కోట్ల యాక్టివ్ యూజర్లను కలిగిఉన్నట్టు మంగళవారం ప్రకటించింది.
ప్రీ బడ్జెట్ సమావేశం..
Wed 06 Dec 06:18:36.441532 2017
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముందస్తు బడ్జెట్ మీటింగ్ కసరత్తులో భాగంగా మంగళవారం వ్యవసాయ రంగ స్టేక్ హోల్డర్స్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్
ఆధార్ అనుసంధానత తప్పదా...!
Tue 05 Dec 13:06:46.745393 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: వ్యక్తిగత విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్ను పేదవాడిపై రుద్దే ప్రయత్నాలను సర్కారు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాదాపు ఆరు ప్రధాన సేవలకు ఆధార
రిటైల్ మార్కెట్పై జియోమీ కన్ను..
Tue 05 Dec 04:07:56.734782 2017
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ జియోమీ రిటైల్ (ఆఫ్లైన్) మార్కెట్పై దృష్టి కేంద్రీకరించినట్టు వెల్లడించింది. ప్రస్తుతం తమకు భారత స్మార
నిధుల కోసం బ్యాంకులు మార్కెట్ బాట
Tue 05 Dec 04:07:25.626777 2017
న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) సమస్యతో సతమతమవుతున్న బ్యాంకులు తమ మూలధన అవసరాల కోసం కావాల్సిన నిధుల నిమిత్తం మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ జరపాలని యోచిస్తున్నాయి. ఇంద | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Vogue Women of The Year 2018: వహ్.. జాన్వీ!! అదిరేటి డ్రెస్లో అందాల ప్రదర్శన
ధడక్ చిత్రం తరువాత హాట్ హాట్ ఫోటో షూట్లతో తనలోని గ్లామర్ కోణాలను బయటపెట్టిన ఈ బ్యూటీ తాజాగా వోగ్ ఉమెన్ అవార్డ్స్ ఫంక్షన్లో బంగారు వర్ణపు లాంగ్ ఫ్రాక్లో అందాలు ఆరబోస్తూ వీక్షకులు మతులు పోగొట్టింది.
Samayam Telugu | Updated:
Oct 29, 2018, 02:11PM IST
Vogue Women of The Year 2018: వహ్.. జాన్వీ!! అదిరేటి డ్రెస్లో అందాల ప్రదర్శన
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ అరంగేట్రం కోసం ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు ‘ధడక్’ చిత్రంతో అదిరిపోయే ట్రీట్ దొరికింది. అయితే ఆమె నుండి కోరుకున్న హాట్ అండ్ సెక్సీ మాత్రం ఆ చిత్రంలో లభించలేదు. అయితేనేం.. గ్లామర్ షో అంటే చెవికోసుకునే జాన్వీ కపూర్ ఫోటో షూట్లు, మూవీ ఫంక్షన్లు, ఫ్యామిలీ పార్టీలలో పొదుపుగా బట్టలేసి అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తుంటుంది.
‘ధడక్’ చిత్రం తరువాత హాట్ హాట్ ఫోటో షూట్లతో తనలోని గ్లామర్ కోణాలను బయటపెట్టిన ఈ బ్యూటీ తాజాగా వోగ్ ఉమెన్ అవార్డ్స్ ఫంక్షన్లో బంగారు వర్ణపు లాంగ్ ఫ్రాక్లో అందాలు ఆరబోస్తూ వీక్షకులు మతులు పోగొట్టింది. లేలేత అందాలతో కనువిందు చేస్తూ కెమెరా కంటికి కునుకు లేకుండా చేసింది. | 0business
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
టార్గెట్ కోటి రూపాయలు.. ఎలా సంపాదించాలి? అందుబాటులో ఒక ఆప్షన్!
రిస్క్ లేకుండా ధనవంతులు కావాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. అయితే దీనికి సహనం కావాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి.
Samayam Telugu | Updated:
Nov 2, 2019, 05:39PM IST
టార్గెట్ కోటి రూపాయలు.. ఎలా సంపాదించాలి? అందుబాటులో ఒక ఆప్షన్!
హైలైట్స్
కోటీశ్వరులు కావాలని ప్లాన్ చేస్తున్నారా?
అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది
ఇందులో డబ్బులు పెడితే కచ్చితంగా రూ.కోటి పొందొచ్చు
అయితే దీర్ఘకాలంలో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది
డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా. అది కూడా త్వరితగతిన కోటీశ్వరులు కావాలని ప్రయత్నిస్తున్నారా? అయితే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని సంపాదించాలి. లేదా మంచి బిజినెస్ను స్టార్ట్ చేయాలి. మోస్తారు జీతం వచ్చే వారు కోటీశ్వరులు కాలాలంటే చాలా ఏళ్లు పడతాయి. ప్రణాళికాబద్ధంతో, సరైన ఇన్వెస్ట్మెంట్ వ్యూహంతో ముందుకు వెలితే అనుకున్న లక్ష్యాన్ని సాకారం చేసుకోవచ్చు.
రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, కచ్చితనమైన రాబడి కోరుకునే వారికి డబ్బు సంపాదించేందుకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని పేరు పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). పోస్టాఫీస్కు వెళ్లి ఈ అకౌంట్ను తెరవొచ్చు. | 1entertainment
|
Vaani Pushpa 94 Views FROM 30TH , IPO , IRCTC
ipo
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన అనుబంధ కంపెనీ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) ఐపిఒ అతి త్వరలోనే ఇన్వెస్టర్ల ముందుకు రానుంది. ఈ నెల 30 నుంచి పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించడంతో దేశ ఈక్విటీ మార్కెట్లు ఒక్కసారిగా బేరిష్ నుంచి బుల్లిష్గా మారిన వెంటనే ఐఆర్సిటిసి తన ఐపిఒ ప్రణాళికను బయటకు తీయడం విశేషం. కార్పొరేట్ పన్ను కోతతో సూచీలు ఇప్పటికే 8 శాతం పెరిగాయి. గడచిన కొన్ని నెలల్లో ఐపిఒ మార్కెట్ చతికిలపడి ఉంది. ఒకటి, రెండు మినహా పెద్దగా ఐపిఒలు రాలేదు. మార్కెట్లు తీవ్ర అనిశ్చితి పరిస్థితుల్లో, బేరిష్ సెంటిమెంట్ ఉండడంతో ఐపిఒ ప్రణాళికలను కంపెనీలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కానీ, ఉన్నట్టుండి మార్కెట్లు సానుకూలంగా మారడం ఐపిఒ మార్కెట్లో మళ్లీ కళవచ్చింది. ఇందులో ముందుగా ఐఆర్సిటిసి ఉండడం మరింత ఆసక్తికరం. ప్రతిపాదిత ఐఆర్సిటిసి ఐపిఒ ద్వారా ప్రభుత్వం రూ.480కోట్లను సమీకరించాలనుకుంటోంది. అంటే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రభుత్వం ఐఆర్సిటిసిలోని తనకున్న వాటాలో కొంత మొత్తాన్ని ఐపిఒలో భాగంగా విక్రయించనుంది. అంటే ఈ ఐపిఒ ద్వారా సమీకరించే నిధులు ప్రభుత్వ ఖజానాకే వెళతాయి. ఐఆర్సిటిసిలో 12.5శాతం వాటాను ప్రభుత్వం ఐపిఒ ద్వారా తగ్గించుకుంటోంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి…. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
BSE
రుతుపవనాలు, ఐపిఒలే కీలకం
ముంబయి,జూన్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వచ్చేవారం రుతుపవనాల కదలికలపైనే ఆధారపడి కొనసాగుతాయని అంచనా. ఇప్పటికే అంచనాలకు అనుగుణంగా వర్షపాతం దేశంలోని పలు ప్రాంతాలకు తాకింది. 96శాతం సాధారణ సగటు అంచనావేసిన వాతావరణశాఖ ఆ తర్వాత 98శాతానికి సవరించింది. దేశ వ్యవసాయ రంగానికి అత్యంత సానుకూల అంశంకాగా జిడిపి వృద్ధికి దోహదంచేస్తుంది. గీనితో గత వారం ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమధోరణి కనిపించినా దేశీయ మార్కెట్లు సానుకూలంగానే కొనసాగాయి. వచ్చే వారి ఇన్వెస్టర్లు ఎక్కువగా ప్రైమరీ మార్కెట్లపై దృష్టి పెడారని అంచనా. మార్కెట్లు మరోసారి పునరేకీకరణ దిశగా కొనసాగుతుంది.
ఫార్మాసంస్థ ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఐపిఒ మంగళవారం ముగుస్తుంది. తేజాస్ నెట్వర్క్ పబ్లిక్ ఇష్యూ ఇప్పటికే ముగిసింది. ఎరిస్ లైఫ్ ఐపిఒకి ధరలు 600-603కాగా 2.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. ఇదేబాటలో సిడిఎస్ ఎల్ పబ్లిక్ ఇష్యూ సోమవారం ప్రారంభం అవుతుం ది. ఇష్యూకి ధరల శ్రేని 167-170 కాగా 1.8 కోట్ల షేర్లను జిటిపిఎల్ అమ్మకానికి పెట్టింది. గత వారంలో అమెరికా ఫెడ్రిజయ్వి పావుశాతం వడ్డీరేటు పెంచిం ది. ఫెడ్ఫండ్స్రేటు 1-1.25శాతానికి చేర్చింది. గత వారం మొత్తం అమ్మకాలకే ప్రాధాన్యతనిచ్చిన ఎఫ్పిఐ లు పెట్టుబడుల విషయంలో ఎలా స్పందిస్తారన్న అం శం కీలకం అవుతుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
దేశీయ ఫండ్స్ భారీ కొనుగోళ్లతో మార్కెట్లను ఆదుకుంటూ వస్తున్నవషయం తెలిసిందే. మరోవైపు డాలరుతో రూపాయి కదలికలు,ముడిచమురుధరలు సైతం సెంటిమెంట్పై ప్రభావం చూపిస్తాయి. వచ్చే వారం మధ్యలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు పాలసీయేతరమైన అంశాలపై సమావేశం నిర్వహిస్తుంది. అమెరికా గృహవిక్రయ గణాంకాలు, జపాన్ తయారీ రంగం, యూరోజోన్ తయారీ, సేవలరంగ గణాంకాలు సైతం విడుదలవుతాయి. వీటన్నింటితో పాటు విదేశీ మార్కెట్లలో నెలకొనే ధోరణులు సైతం మార్కెట్లను ప్రభావితం చేస్తాయని అంచనా. | 1entertainment
|
CHIDAMBARAM
అత్యవసర పరిస్థితిపైనే ఇందిర తప్పిదం అని ఒప్పుకున్నారు
న్యూఢిల్లీ, డిసెంబరు 24: దేశంలో ఆనాడు అత్యవసరపరిస్థితిని విదించడం పెద్ద తప్పేనని నాటి అధినేత్రి ఇందిరాగాంధీ స్వయంగా అంగీకరించారని, అదేవిధం గా నేడు పెద్దనోట్ల చెలామణి రద్దు కూడా పెద్ద తప్పుగానే భావించి తప్పిదాన్ని మోడీ అంగీకరించాలని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. అయితే ప్రధాని మోడీ తన తప్పును అంగీకరించేందుకు సిద్ధంగా లేరని 45 కోట్ల మందిప్రజలను యాచకులుగా మార్చి వేస్తోందని, మధ్యతరగతి ప్రజలను 45రోజుల పాటు సమస్యల్లోనికి నెట్టివేసిందని అన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకుమరో ఆరునెలల వ్యవది పడుతుందన్నది అందరూ అంగీకరిం చాల్సిందేనన్నారు. సత్యమర్తిభవన్లో పార్టీ కేడర్ను ఉద్దేశించి మాట్డాఉతూ కాంగ్రెస్కేడర్ మొత్తం ప్రజల్లోనికి వెళ్లి వారి సమస్యలపై పోరాడాల్సిన తరునం ఇదేనని పిలుపునిచ్చారు.
నల్లధనాన్ని కూకటివేళ్లతో పెకలించివేస్తుందని బిజెపి చెపుతున్న పెద్దనోట్ల రద్దువల్ల ఎలాంటి ప్రభావం ఉండదని, అవినీతి, నకిలీ కరెన్సీని నిర్మూలిస్తామని చెప్పడం అర్ధ రహితమని ఆనాలోచిత విధానమని అన్నారు. నగదురహిత ఆర్థికవ్యవస్థ ఎలా సాధ్యం అవుతుందని, అమెరికాలాంటి పెద్ద దేశంలోనే 46శాతం లావాదేవీ లు నగదురూపంలో జరుగుతున్నాయని, అమెరికా ఏర్పడి 300 సంవత్సరాల యిందన్న అంశం మోడీ గుర్తుచేసుకోవాలన్నారు. అలాగే జర్మనీలో కూడా 80శాతం నగదురూపంలోనే లావాదేవీలు జరు గుతున్నాయన్నారు.
తాను ఒక అనాలోచిత, తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానిమోడీ అంగీకరించాల్సిందేనన్నారు. తాము చేసిన తప్పుడు నిర్ణయాలను అంగీకరించడంలో తప్పులేదని, తప్పుచేసామని ఒప్పుకోవడం ఆత్మన్యూనత కానేకాదని మోడీ గుర్తుంచు కోవాలని చిదంబరం సూచించారు. మోడీ నోట్లరద్దుకు ముందు కొత్తనోట్ల ముద్రణ ఎంత కాలం పడుతుంది, ఈలోపు ఎటిఎం మెషిన్లు రీకాలిబ్రేట్ అవుతాయాఅన్నది ముందు అంచ నా వేయాలన్నారు.రూ.500,రూ.1000నోట్లు రద్దుచేసినతర్వాత రూ.2వేల నోట్లు తెచ్చి ప్రయోజనం ఏమిటన్నది కూడా వివరించలేకపోయిందన్నారు. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Aravinda Sametha Box Office Collections:‘అరవింద సమేత’ 3 రోజుల్లో రూ.100 కోట్లు
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తొలి మూడు రోజుల్లో రూ.41 కోట్లకు పైగా షేర్ను ‘అరవింద సమేత’ వసూలు చేసింది.
Samayam Telugu | Updated:
Oct 15, 2018, 10:23AM IST
Aravinda Sametha Box Office Collections:‘అరవింద సమేత’ 3 రోజుల్లో రూ.100 కోట్లు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ మూవీకి మాస్ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. తొలిరోజు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన వీర రాఘవుడు.. ఆ తరవాత కాస్త నెమ్మదించినా మొత్తంగా మంచి వసూళ్లు రాబడుతున్నాడు. ఇదిలా ఉంటే, ఈ సినిమా తొలి వారం ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వాస్తవానికి రూ.100 కోట్ల మార్క్ను తొలి 3 రోజుల్లోనే దాటేసింది. ఆదివారంతో ముగిసిన తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ.71 కోట్లు షేర్ వసూలు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనిలో నైజాం షేర్ రూ.13.82 కోట్లు, సీడెడె షేర్ రూ.11.16 కోట్లుగా ఉంది.
ఇదిలా ఉంటే, కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తొలి మూడు రోజుల్లో రూ.41 కోట్లకు పైగా షేర్ను ‘అరవింద సమేత’ వసూలు చేసింది. తొలిరోజు రూ.26.64 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు రూ.8 కోట్లు, మూడో రోజు రూ.7.11 కోట్ల వసూళ్లను ‘అరవింద సమేత’ రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే రూ.41.75 కోట్ల షేర్ను ఈ చిత్రం వసూలు చేసింది. అటు యూఎస్లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీసు వద్ద 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. యూఎస్ బాక్సాఫీసు వద్ద 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఎన్టీఆర్ నాలుగో చిత్రమిది. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వంద మంది రైతులకు ఒకే ఆధార్ నంబర్.. ప్రహసనంలా ‘మహా’ రుణమాఫీ
రైతులకు రుణ మాఫీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అభాసుపాలవుతోంది.
TNN | Updated:
Oct 25, 2017, 03:47PM IST
రైతులకు రుణ మాఫీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అభాసుపాలవుతోంది. రుణ మాఫీ దరఖాస్తుల్లో వంద మందికి పైగా రైతులు ఒకే ఆధార్‌ సంఖ్య‌తో అనుసంధానం కావడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు తలపట్టుకున్నారు. వ్యవసాయ రుణాల మాఫీ కోసం రైతులు ఆధార్‌‌‌తో ఆన్‌‌లైన్‌‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
డూప్లికేషన్లను అరికట్టడానికి, నకిలీలు రుణ మాఫీ పొందకుండా ఉండటం కోసం ఆధార్ లింకింగ్ ఉపయోగకరమని సర్కారు భావించింది. కానీ తీరా చూస్తే.. ఒకే ఆధార్‌ నెంబర్‌‌కు వంద మందికిపైగా రైతులు అనుసంధానం చేసుకున్నారు. దీంతో అధికారుల మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ప్రతిష్టాత్మక రుణ మాఫీ కాస్తా ఇప్పుడు ప్రహసనంగా మారింది.
నకిలీ లబ్ధిదారులను గుర్తించడానికి ఆధార్ అనుసంధానం ఉపయోగపడుతుందని భావించాం. కానీ ఇంత మంది రైతులు ఒకే ఆధార్ సంఖ్యతో అనుసంధానం అవుతారని అనుకోలేదు. రైతుల వద్దకే వెళ్లి అన్నీ తనిఖీ చేయాలంటే కొన్ని వారాల సమయం పడుతుందని ఆన్‌‌లైన్‌ నమోదు ప్రక్రియ చేపట్టాం. కానీ పరిస్థితి ఇలా తయారైందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. రుణ మాఫీ అమలో జాప్యం కారణంగా రైతులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వారు చెప్పారు.
రుణ మాఫీ అమలుకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, ఇతర అడ్డంకులను అధిగమించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌.. బ్యాంకర్లు, అధికారులతో భేటీ అయ్యారు. కొందరు రైతుల పేర్లు గల్లంతు కావడం, మరికొందరు రైతుల భూమి వివరాల్లో తేడాలు ఉండటం లాంటి సమస్యల్ని గుర్తించారు. కొందరు రైతులకైతే ఇచ్చే రుణ మాఫీకీ, వడ్డీకి పొంతన ఉండటం లేదు. దీంతో ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని తేల్చే వరకూ రుణ మాఫీ చేయలేమని బ్యాంకర్లు స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 34 వేల కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. తొలి విడతలో భాగంగా.. రూ. 4 వేల కోట్లను గత వారం విడుదల చేసింది. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మ్యాచ్ అక్కడే మలుపు తిరిగింది: కుల్దీప్
శ్రీలంకతో విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డే మ్యాచ్ 28వ ఓవర్లోనే కీలక మలుపు తిరిగిందని భారత మణికట్టు
TNN | Updated:
Dec 18, 2017, 03:04PM IST
మ్యాచ్ అక్కడే మలుపు తిరిగింది: కుల్దీప్
శ్రీలంకతో విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డే మ్యాచ్ 28వ ఓవర్‌లోనే కీలక మలుపు తిరిగిందని భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. ఆ ఓవర్ బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్.. అప్పటికే భారత్‌ బౌలర్లకి వరుస బౌండరీలతో సవాల్ విసురుతున్న ఓపెనర్‌ ఉపుల్ తరంగ (95)‌ని ఔట్ చేసి శ్రీలంక‌కి షాకిచ్చాడు. తర్వాత నాలుగు బంతుల వ్యవధిలోనే దూకుడుగా ఆడే నైజమున్న డిక్వెల్లా (8)ని కూడా కుల్దీప్ ఔట్ చేయడంతో ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు చేజార్చుకున్న లంక ఒత్తిడిలో పడింది. చివరికి ఆ జట్టు 215 పరుగులకే కుప్పకూలగా.. లక్ష్యాన్ని భారత్ 32.1 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. | 2sports
|
రూ.200 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రోలక్స్ ఉత్పత్తి కేంద్రం
WD|
ఎలక్ట్రోలక్స్ కంపెనీ రూ. 200 కోట్ల పెట్టుబడితో ఉత్తరాఖండ్లోని ఉదంసింగ్నగర్లో కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఉత్పత్తి కేంద్రం ద్వారా అత్యాధునిక టెక్నాలజీతో రెఫ్రిజిరేటర్లు, వాషింగ్మిషన్లను ఉత్పత్తి చేయనుందని ఎలక్ట్రోలిక్స్ సీఈవో అనీరుద్ద్ ధోత్ విలేకరులతో తెలిపారు.
గత ఏడాది రూ. 500 కోట్లుగా ఉన్న ఎలక్ట్రోలక్స్ అమ్మకపు విలువ ఈ ఏడాది 650 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఓఓ ఎరిక్ బ్రగంజా వివరాలందించారు. ఈ అమ్మకపు విలువ పెరగడంతో గత ఏడాది 16.25 శాతం ఉన్న కంపెనీ ఆదాయం 65శాతం మేర పెరిగిందని ఆయన చెప్పారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
'ఏం సందేహం లేదు .. ఈ అందాల గుమ్మ.. ఆ రాశీఖన్నా..నే!'
Web Title:heroine raashikhanna latest hot photoshoot grabs the youth attention
( Telugu News from Samayam Telugu , TIL Network)
1/20
'ఏం సందేహం లేదు .. ఈ అందాల గుమ్మ ఆ రాశీఖన్నా..నే!'
మీ కామెంట్ రాయండి
'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ రాశీఖన్నా. గోపిచంద్తో నటించిన 'జిల్' మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ మధ్య స్లిమ్గా తయారైందండోయ్. ఇక లేట్ ఎందుకు అనుకుంటుందేమో.. సోషల్ మీడియాలో తన నాజుకు అందాలు కనిపించేలా పోస్టుల మీద పోస్టులు చేస్తుంది. ప్రస్తుతం రాశీఖన్నా 'వెంకీమామ' చిత్రంలో వెంకటేష్ సరసన జోడిగా నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సమయం తెలుగు న్యూస్ అలెర్ట్కు సబ్స్క్రైబ్ అవ్వండి
సమయం తెలుగు నుంచి బ్రేకింగ్ న్యూస్, టాప్ స్టోరీల నోటిఫికేషన్లను తక్షణమే పొందండి
ఇప్పుడు వద్దు | 0business
|
Hyd Internet 103 Views Rohit Sharma
Rohit Sharma
నాగ్ పూర్ః నాగ్ పూర్ వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శతకం చేశాడు. ఈ వన్డే తో మరో రికార్డు కూడా శర్మ సొంతం చేసుకున్నాడు. వన్డే కెరీర్ లో 14వ సెంచరీ చేసిన శర్మ, వన్డేల్లో ఆరువేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో, వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డుల కెక్కాడు. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Hyd Internet 87 Views sony mobiles
sony mobiles
జపాన్ః జపాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానికి ఉత్పత్తుల సంస్థ సోని తన నూతన స్మార్ట్ఫోన్ అవెంజర్ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 630 లేదా 660 ప్రాసెసర్ను ఏర్పాటు చేయనున్నారు. మిడ్రేంజ్ ఫోన్గా దీన్ని విడుదల చేయనున్నారు. ఇందులో సరికొత్త ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ను అందించనున్నారు. దీనిలో ఫీచర్లు ఇలా ఉన్నాయి. 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 23 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3000 ఎంఏహెచ్బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. | 1entertainment
|
6.8లక్షల కోట్లకు పెరిగిన బకాయిలు
ఒక్క ఏడాదిలోనే 40వేల కోట్ల రద్దు
ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు, పేరుకు పోతున్న నిరర్ధక ఆస్తులపై కోర్టులు కొరడా ఝళిపిస్తున్నాయి. సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో కొంతవరకైనా మేలుజరుగుతుందన్నది స్పష్టంఅవుతోంది. రూ.500 కోట్లకుపై బడి బకాయి ఉన్న బకాయిదారుల జాబితాలను అందచేయాలని సుప్రీం కోర్టు రిజర్వుబ్యాంకును ఆదేశించింది. అలాగే ఆయా కంపెనీల వివరాలు కూడా అందచేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే ఏఏకంపెనీల రుణాలనుపునర్ వ్యవస్థీకరించిందీ ఆ కంపెనీల జాబితా కూడా తమకు అందచేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. సరైన నియమ నిబందనలు పాటించకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈవిధంగా భారీ రుణాలు ఎలా ఇచ్చాయని కూడా ప్రశ్నించింది. అంతేకాకుండా వీటిరికవరీకి అవసరమైన యంత్రాంగం ఉందా లేదా అని కూడా ప్రశ్నించింది. కార్పొరేట్ సామ్రాజ్యాలు నడుపుతున్న మహా మహుల జాబితా మీవద్దనే ఉంది. వీరి బకాయిల వివరాలను కూడామాకు అందించండి అని ప్రశ్నిం చింది. దేశంలోని ప్రముఖ దినపత్రికలన్నింటి లోనూ మొత్తం 29 ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు 1.14లక్షల కోట్లుగా ఉన్నా యని, డాలర్లలోచూస్తే 16.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ప్రకటించాయి. ఇవన్నీ కూడా గడచిన రెండేళ్లనుంచే ఉన్నాయని అంతకుముందున్న వాటిసంగతేమిటని న్యాయ మూర్తులు ప్రశ్నించారు. సర్వోన్నతన్యాయస్థానం కోరిన వివరాలను సీల్డ్కవర్లో అందచేయాలని సూచించింది. న్యాయవాది ఉద్యమకారుడు ప్రశాంత్భూషణ్ దాఖలుచేసిన కేసు విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నోటీసులు ఈ ఆదేశాలు జారీచేయడం ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వరంగంలోని హడ్కో కేటాయించిన రుణాలు మొత్తం 14వేల కోట్ల వరకూ ఉన్నాయని ఇవన్నీ రెండువేల సంవత్సరంలోనే కేటాయించిందని అయితే ప్రభుత్వరంగ బ్యాంకులు కేటా యించిన 40 వేల కోట్ల రూపాయలను ఒక్క సంవత్సరంలోనే గత ఏడాది రద్దు చేసిన అంశాన్ని ఉటంకిస్తూ వీటిపై విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రానిబాకీలు పేరుకుపోతుండటం, సాక్షాత్తూ రిజర్వుబ్యాంకు కూడా గడచిన రెండు త్రైమాసికాల నుంచి బ్యాంకులను హెచ్చరిస్తున్న నేపథ్యం లో సుప్రీం ఆదేశాలు మరింత ఊతం ఇచ్చాయి. వీటికితోడు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో కూడా మూడోత్రైమాసికంలో రానిబాకీల ప్రభావం మరింతగా కనిపించింది. ప్రతి బ్యాంకులోను రానిబాకీల కేటాయింపులు పెంచుతూ రావ డంతో రిజర్వుబ్యాంకు ముక్కుపిండి వసూలు చేయాలన్న ఆదేశాలను అద్దం పట్టింది. ఇప్పటికే భారతీయ రిజర్వుబ్యాంకు 2017 మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఆస్తిఅప్పుల పట్టీలను ప్రక్షాళన చేసుకోవాలని ఆదేశించింది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ లో రానిబాకీలు మొత్తం 100 బిలియన్ డాలర్లువరకూ ఉన్నట్లు అంతర్జాతీయ సర్వే సంస్థలు అంచనాలు వేసాయి. అలాగే భారతీయ కరెన్సీలో చూస్తే ఈమొత్తం 6.8 లక్షల కోట్లకు సమానంగాఉంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే రాని బాకీల్లో మొత్తం 85శాతం రావాల్సిఉంది. ఓవైపు విదేశాల్లో నిక్షిప్తంచేసిన నల్లధనాన్ని భారత్కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సుప్రీం పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. ఇందుకోసం సుప్రీం మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ సిట్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. సత్వర దర్యాప్తుకు ఉపక్రమించిన సిట్ తన ప్రగతి నివేదికలను సుప్రీంకు అందచేస్తూవస్తోంది. ఆర్థికవ్యవస్థలో అత్యంత కీలకమైన బ్యాంకింగ్ వ్యవస్థలో పెరిగిపోతున్న మొండిబకాయిలు, రానిబాకీ లు నిరర్ధక ఆస్తులు ఇలా వివిధ రూపాల్లో ఉన్న ఈ బకాయిలను ఓ కొలిక్కితీసుకురావాలంటే సుప్రీంకోర్టులాంటి న్యాయవ్యవస్థలు జోక్యం అనివార్య మని మేధావులు, ఆర్థికరంగనిపుణులు భావిస్తున్న తరుణంలోసుప్రీం తాజా ఆదే శాలుకార్పొరేట్, మొండిబకాయిదారుల్లో గుబులురేపుతాయనడంలో సందేహం లేదు. | 1entertainment
|
internet vaartha 222 Views
హైదరాబాద్ : 16వ సీనియర్ జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర క్రీడా కారులు జాతీయ బీచ్ వాలీబాల్ చాంపియన్షిప్ పోటీలలో స్వర్ణ పతకం సాధించారు. పతకం సాధించిన క్రీడాకారుడు ఎస్.రవిందర్ రెడ్డి, పి.క్రిష్ణ చైతన్య మర్యాద పూర్వకంగా బుధవారం నాడు ఎల్బీస్టేడియంలో తెలంగాణ శాట్స్ఎండిని కలిశారు. ఈ సందర్భంగా వి.సి.ఎండి ఏ. దినకర్ బాబు క్రీడా కారులను అభినందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జాతీయ బీచ్ వాలీబాల్లో తెలంగాణ క్రీడా కారులు స్వర్ణ పతకం సాధించడం ఎంతో అనందంగా ఉందని అయన చెప్పారు. బీచ్ వాలీబాల్ క్రీడాకారులకు తెలంగాణ శాట్స్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన అన్నారు. ఈ క్రీడా కారులను స్పూర్తిగా తీసుకొని మిగితా క్రీడాకారులు కూడా జాతీయ స్థాయిలో పతకాలు సాధించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జి.ఏ.శోభ, కోచ్ : రమా దేవి, రంగారెడ్డి జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్లో మన క్రీడా కారులు 21-15,21-19తో తమిళనాడుపై విజయకేతనం ఎగురవేశారు. | 2sports
|
internet vaartha 257 Views
ముందుగా న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా కంపెనీల్లో కనీసం ఒక్క సంస్థలో అయినాసరే ఈ ఆర్ధిక సంవత్సరంలో పదిశాతం వాటాలను విక్రయించి పెట్టుబడుల ఉపసంహరణలో వృద్ధిని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రాథమిక మార్కెట్లో న్యూ ఇండి యా అస్యూరెన్స్ను జాబితా చేస్తోంది. ఆర్ధిక సేవల విభాగం వీటి విలువలు మదింపుచేసే పనిలో ఉంది. ఇతరసాధారణ బీమా కంపెనీలను కూడా స్టాక్ ఎక్ఛేంజిల్లో జాబితా చేసి ఐపిఒల జారీద్వారా వాటాలను విక్రయించే పనికి పూనకుంటున్నది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు త్వరలోనే ఐపిఒలకు రావచ్చన్నది అంచనా. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో మరింత పారదర్శకంగా ఈ వాటాల విక్రయం నిర్వహించేందుకు బడ్జెట్లో ప్రకటించినట్లుగా ముందు స్టాక్ ఎక్ఛేంజిల్లో జాబితాచేయనున్నట్లు ఆర్ధిక శాఖ విభాగం ప్రకటించింది. న్యూ ఇండియా అస్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలు రెండు కూడా రెండంకెల నికరలాభం ప్రకటించాయి. 2014-15లో 31.4శాతం, మరుసటి సంవత్సరం 17.9శాతంచొప్పున లాభాలు వచ్చాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్ నికరలాభం 1431 కోట్లుగా ఉంది. ఓరియంటల్ ఇన్సైరెన్స్,యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ 14.8శాతం, 43శాతంగా నికరలాభాల్లో క్షీణత ను గుర్తించాయి. దేశంలోని ఏ ఒక్క బీమా సంస్థ కూడా ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లలో జాబితా కాలేదు. బీమారంగ నిపుణుల అంచనాలప్రకారం చూస్తే ప్రభుత్వరంగంలోని సాధారణ బీమా కంపెనీలకు సరైన విలువలు మదింపుచేయడం కొంత కష్టమైన పనేనని ఎందుకంటే ఎక్కువ నష్టాలు, క్లెయింలు అధికంగా ఉండటం వల్ల మోటారు బీమా వంటి కీలక విభాగాల విలువల మదింపు కష్టం అవుతుందని చెపుతున్నారు. ఎన్ఐఎ సిఎండి జి.శ్రీనివాసన్ మాట్లాడుతూ తమ సంస్థ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కు సిద్ధం అవుతోందని, ఆర్ధికరంగపరంగా పటిష్టంగా ఉన్నట్లు వివరించారు. మార్కెట్ వాటా కూడా దేశీయంగాను, అంతార్జతీయ మార్కెట్లలో పెరుగుతోందన్నారు ప్రభుత్వరంగంలోని నాలుగు బీమా కంపెనీలు ప్రస్తుతం జా బితా కావాల్సిన అవసరం ఉందని, వీటిలో న్యూ ఇండియా అస్యూరెన్స్ మొట్టమొదటిదిగా జాబి తా అవుతోందన్నారు. ఆర్ధిక మంత్రిఅరుణ్ జైట్లీతన బడ్జెట్ప్రసంగంలో ప్రభుత్వరంగ కంపెనీల్లో పబ్లిక్ షేర్హోల్డింగ్ పారదర్శకతకు నిదర్శనంగా ఉంటుందని, సాధారణ బీమా కంపెనీలు ఇందుకోసం స్టాక్ ఎక్ఛేంజిల్లో జాబితా కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభు త్వం ఆర్ధికలోటును 2016-17 ఆర్ధిక సంవత్స రానికి సంబంధించి జిడిపిలో 3.5శాతానికి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం 3.9శాతంగా లోటు కనిపిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధనీకరణకింద ప్రభుత్వం 25వేల కోట్లు కేటాయించింది. సమస్యాత్మక ఆస్తులు, రానిబాకీలు మరింతపెరిగితే ప్రభుత్వం మరింతగా సాయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యానికి వస్తే 2017సంవత్సరానికి 56,500 కోట్లుగా ఉంది. 19శాతం ప్రాథమిక లక్ష్యం కంటే తక్కువగా ఉంది. 2016లో 69,500 కోట్లుగా నిర్ణయించారు. మొత్తం 36వేల కోట్లు మైనార్టీ వాటాల విక్రయం ద్వారాను, వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా 20,500 కోట్లు రాగలవన్నది అంచనా. బీమా చటాంటల సవరణ చట్టం 2015 ప్రకారం చూస్తే ప్రభుత్వరంగంలోని సాధారణ బీమా కంపెనీలు మూలధనవ నరులు సమీకరించుకునేందుకు వెసులుబాటు ఉంది. ప్రభుత్వ వాటా 51శాతానికి తగ్గకుండా చూస్తూ వాటాలను విక్రయించడం ద్వారా నిధులు సమీకరించవచ్చు. ప్రస్తుతం 100శాతం ఉన్న కంపెనీల్లో బిజినెస్ విస్తరణకు, పోటీతత్వం మరింతగా పెంచుకునేందుకు ఈ వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించవచ్చని చట్టం నిర్దేశిస్తోంది. సాధారణ బీమా కంపెనీల అనుబంధ సంస్థలలను 2000 సంవత్సరంలోనే స్వతంత్ర కంపెనీలుగా పునరుద్ధరించారు. 2012లో బీమా నియంత్రణ ప్రాథికార సంస్థ ఐపిఒ మార్గదర్శకాలను విడుదల చేసింది. బీమా కంపెనీల ఆర్ధిక పరిపుష్టిని పరిగణనలోనికి తీసుకుని వాటా విక్రయాలకు అనుమతిస్తామని ఐఆర్డిఎఐ వెల్లడించింది. 1973లో సాధారణ బీమా కంపెనీల వ్యాపారాన్ని 1973 జనవరి ఒకటవ తేదీ జాతీయం చేసారు. ఏడు కంపెనీలను నాలుగు కంపెనీలుగా విలీనం చేసారు నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ఇన్సూరెన్స్,యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలుగా విభజించారు. జిఐసిఆఫ్ ఇండియా 1971లో విలీనం అయి 1973నుంచి వ్యాపారలావ ాదేవీలుప్రారంభించింది. 2000వ సంవత్సరంలో జిఐసి అనుబంధ సంస్థలను స్వతంత్ర కంపెనీలుగా పునర్ వ్యవస్థీకరించారు. జిఐసిని కూడా జాతీయస్థాయిలో పునఃబీమా సంస్థగా పటిష్టం చేశారు. 2002లో పార్లమెంటులో జిఐసి నుంచి అనుబంధ సంస్థలను వేరు చేశారు.2005లోనే పార్లమెంటు విదేశీ పెట్టుబడుల వాటాను బీమా కంపెనీల్లో 409శాతానికి పెంచుకునేవిధంగా బిల్లును ఆమోదించింది. అయితే ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతి అవసరం అవుతుంది. 2016లో ఎన్డిఎ ప్రభుత్వం 49శాతం వరకూ విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్రూట్లో రావచ్చు. ప్రస్తుతం దేశంలో 28 సాధారణ బీమా కంపెనీలున్నాయి. ఎక్స్పోర్టు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత వ్యవసాయ బీమా కంపెనీ వంటివాటితో కలిపి ఈ బీమా కంపెనీలు భారీ ఎత్తున లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఐపిఒలకు వస్తే బీమా కంపెనీలకు నిధులు వెల్లువలా వస్తాయన్నది ప్రభుత్వ భావన కాడంతో సత్వరమే నాలుగు కంపెనీలు కూడా ఐపిఒకు రావచ్చని వినవస్తోంది. | 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.