news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
internet vaartha 224 Views
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా టి20 సిరీస్లో ఆసీస్ను మట్టికరిపించిన వరల్డ్ నెంబర్ వన్గా స్వదేశం చేరిన టీమిండియా జట్టును శ్రీలంక ఘోరమైన దెబ్బకొట్టింది. కాగా అనుభవం లేదు, స్వదేశం కాదు, నాణ్యమైన జట్టు కాదు అని విమర్శలు చేసిన వారికి సమాధానమిస్తూ భారత జట్టును అవలీలగా తొలి టి20లో శ్రీలంక జట్టు ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు వరల్డ్ టి20 నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి నెంబర్ త్రీగా మారింది. దీంతో టీమిండియా లంకేయులను ఇప్పుడు సీరియస్గా తీసుకుంది. కాగా రాంచీ వేదికగా జరుగనున్న రెండవ టి20లో సత్తా చాటాలను భావిస్తుంది. అయితే బ్యాటింగ్లో వైఫల్యం జట్టును ఓటమిపాలు చేసిందన్న సంగతిని జట్టు గుర్తించింది. దీంతో రెండవ టి20లో శ్రీలంక యువ బౌలర్లకు ముకుతాడు వేయాలని టీమిండియా టాపార్డర్ భావిస్తుంది.
త్వరలో వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్గా శ్రీలంకను అడ్డుకోవాలంటే అంతకంటే ముందే ఆ జట్టును ఓటమితో దెబ్బకొట్టాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు.కాగా తద్వారా వరల్డ్ కప్కు సరిపడా మానసిక స్థైర్యం సంతరించుకోవాలని టీమిండియా చూస్తుంది. | 2sports
|
ఒలింపిక్ సంఘంపై విధించిన నిషేధాన్ని తొలగిస్తు న్నట్లు కేంద్రం ప్రకటించింది.
భారత ఒలింపిక్ సంఘంపై నిషేధం ఎత్తేసిన కేంద్రం
న్యూఢిల్లీ, జనవరి 13 :దేశంలోని క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నందున భారత ఒలింపిక్ సంఘంపై విధించిన నిషేధాన్ని తొలగిస్తు న్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం క్రీడా మంత్రిత్వ శాఖ మీడియాకు ఒ ప్రకట విడుదల చేస్తూ, కళంకిత వ్యక్తులైన అభ§్ుసంగ్ చౌతాలా, సురేష్ కల్మాడీలను జీవిత కాల అధ్యక్షులుగా ఎంపిక విధానంలో ఐఓఏలో అక్రమాలకు తెరలేచిందన్న ఆరోపణలపై నోటీసులు పంపినా స్పందించనందునే నిషేదం విధించాల్సి వచ్చింది. అయితే ఐఓఏ దిద్దుబాటు చర్యలతో పాటు కల్మాడీ, చౌతాలాలను తొలగించడంతో నిషేధాన్ని ఎత్తివే యాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొంది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆరేళ్ల సామ్సంగ్ ఆధిపత్యానికి షియోమి గండి
భారత నంబర్ వన్ స్మార్ట్ఫోన్ మాదేనంటూ కొన్నాళ్లుగా షియోమి ప్రచారం చేస్తోంది. మొత్తానికి ఇదే నిజమైంది.
TNN | Updated:
Jan 25, 2018, 04:35PM IST
భారత నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ మాదేనంటూ కొన్నాళ్లుగా షియోమి ప్రచారం చేస్తోంది. మొత్తానికి ఇదే నిజమైంది. తాజా లెక్కల ప్రకారం భారత్‌లో షియోమి నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ సంస్థగా అవతరించింది. ఆరేళ్లపాటు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలిన కొరియా దిగ్గజం సామ్సంగ్ రెండో స్థానానికి పడిపోయింది. పరిశోధన సంస్థ కానలిస్ నివేదిక ప్రకారం చైనీస్ కంపెనీ షియోమి భారత్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది. 2017 నాలుగో త్రైమాసికంలో షియోమి మొత్తం 8.2 మిలియన్ యూనిట్లను భారత్‌లో విక్రయించింది.
భారత మార్కెట్‌లో 17 శాతం వార్షిక వృద్ధి సాధించినట్లు సామ్సంగ్ ప్రకటించినప్పటికీ.. తన ఆధిపత్యాన్ని కాపాడుకోవంలో మాత్రం విఫలమైంది. నాలుగో త్రైమాసికంలో సామ్సంగ్ మొత్తం 7.3 మిలియన్ స్మార్ట్‌ఫోన్లను విక్రయించి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తంగా చూసుకుంటే భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధి 6 శాతంగా ఉందని కానలిస్ నివేదిక వెల్లడించింది. వివో, ఒప్పో, లెనెవో వరసగా టాప్ 5లో స్థానం సంపాదించాయి. దేశంలో మొత్తం 30 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను ఈ ఐదు కంపెనీలు విక్రయించినట్లు నివేదిక పేర్కొంది. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నోట్ల రద్దు నిష్ఫలం.. ఇలా అయ్యిందేంటి?
కొండను తవ్వి ఎలుకను పట్టారు.. మోడీజీ ఇదేంటి?
TNN | Updated:
Aug 31, 2017, 10:37AM IST
కొండను తవ్వి ఎలుకను పట్టారు, నల్లధనాన్ని అరికడతామని చెప్పి అర్థం లేని పని చేశారు..నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న వ్యక్తికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఇవ్వాలి... ఇవీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలపై వస్తున్న విమర్శలు. రద్దైన నోట్లలో 99 శాతం నోట్లు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన నేపథ్యంలో... నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీపై ప్రతిపక్షాలు విమర్శల వాన కురిపిస్తున్నాయి.
నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదటి నుంచి విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. మారకంలోని ఐదు వందల, వెయ్యి రూపాయల నోట్లను గత ఏడాది నవంబర్ ఎనిమిదో తేదీన రద్దు చేశారు మోడీ. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ లో అది సంచలనంగా మారింది. నల్లధనికుల, ఉగ్రవాదుల ఆటకట్టించడానికే ఆ నిర్ణయం అని మోడీ ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే ఉన్నఫలంగా చేతిలో ఉన్న నోట్లు రద్దైపోవడం, కొత్త నోట్లు అవసరానికి చేతికి రాకపోవడంతో.. ప్రజల ఇబ్బందులు పతాక స్థాయికి చేరాయి. వారం, పది రోజులు.. దాదాపు నెల రోజుల పాటు కాసులకు కటకట అయ్యింది. తాము సంపాదించుకున్న సొమ్మును అవసరానికి ఖర్చు పెట్టుకోలేకపోయారు దేశ ప్రజలు.
బ్యాంకుల ముందు మీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. ఏటీఎంలు సాధారణ స్థితికి రావడానికి నెలలు పట్టాయి. ఏతావాతా.. నోట్ల రద్దుతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరోవైపు అదే సమయంలో పట్టుబడ్డ నల్లధనికుల వద్ద కోట్ల రూపాయల స్థాయిలో కొత్త నోట్లు దొరకడం.. విమర్శలకు తావిచ్చింది. పరిస్థితి క్రమంగా కుదుటపడింది.
అయితే తాజాగా ఆర్బీఐ రిపోర్టు మళ్లీ నోట్ల రద్దు అంశాన్ని చర్చనీయాంశంగా మార్చింది. నోట్ల రద్దుతో నల్లధనికులు దొరుకుతారనేది అబద్ధమని తేలిపోయిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయంటే.. ఇక నోట్ల రద్దు ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నాయి. కొత్త నోట్ల రద్దు ముద్రణకు ఆర్బీఐ భారీ స్థాయిలో ఖర్చు చేసిందని.. అది అదనపు భారంగా మారిందని విమర్శిస్తున్నాయి.
అర్థం లేని నిర్ణయాన్ని తీసుకుని జనాలకు నరకాన్ని చూపి, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారని.. కొంతమంది ఆర్థికవేత్తలు కూడా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఏదేమైనా ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో.. మోడీ సర్కారు ఒకింత ఆత్మరక్షణలో పడింది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీ.. నువ్వు ఎప్పటికీ మాకు కెప్టెనే..!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి చర్చ వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ తప్పక గుర్తు
TNN | Updated:
Aug 31, 2017, 05:59PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి చర్చ వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ తప్పక గుర్తు చేసుకునే విషయం అతని కెప్టెన్సీ. అంతలా టీమిండియా నాయకత్వ హోదాలో ఈ ఫినిషర్ ఇమిడిపోయాడు. తాజాగా శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డే ధోనీ కెరీర్లో 300వ వన్డే ఈ సందర్భంగా బీసీసీఐ అతనికి ప్రత్యేక బహుమతిని అందజేసింది.
నాలుగో వన్డే ప్రారంభంకాకముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి.. జట్టులోని క్రికెటర్ల సమక్షంలో ధోనీకి ఈ ప్రత్యేక బహుమతిని అందజేశాడు. ఈ సందర్భంగా వీడియోతో పాటు కోహ్లి అన్న మాటల్ని బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ‘ధోనీ.. నువ్వు ఎప్పటికీ మాకు కెప్టెన్వే’ అని ధోనీని కోహ్లి ప్రశంసించాడు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘సైరా’ నుంచి సినిమాటోగ్రాఫర్ ఔట్!
తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
TNN | Updated:
Sep 21, 2017, 04:38PM IST
‘సైరా’ నుంచి సినిమాటోగ్రాఫర్ ఔట్!
తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. చిరు 151వ సినిమాగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఎంచుకుని తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదలకాగానే మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ అని టైటిల్ పెట్టడం.. దానికి తగినట్టుగానే చిరంజీవి గ్రాఫికల్ లుక్‌ను చూసి అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడంతోనే సినిమా తారాగణం, టెక్నికల్ టీంని పరిచయం చేశారు.
కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా చిత్రీకరణలో ప్రధానమైన సినిమాటోగ్రాఫర్ ‘సైరా’ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘సైరా’కు మొదట రవివర్మన్ చాయాగ్రహణం వహించనున్నట్లు ప్రకటించారు.
అయితే ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారట. అందుకని ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. రవివర్మన్ స్థానంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలును తీసుకున్నట్లు సమాచారం. చిరంజీవి గత చిత్రం ‘ఖైదీ నంబర్ 150’కి రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇప్పుడు మరోసారి చిరంజీవితో పనిచేసే అవకాశం రావడం రత్నవేలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారట.
కాగా, ‘సైరా’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం మరో విశేషం. నయనతార, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని స్వరపరుస్తున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
sandhya 330 Views Paytm , transactions
Paytm
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలపై పేటిఎం అదనపు ఛార్జీలు వసూలు చేయనుందనే పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో కంపెనీ ఆ పుకార్లను ఖండించింది. తాము ఎటువంటి ఛార్జీలను వసూలు చేయబోమని స్పష్టం చేసింది. పేటిఎం గేట్వే, పేటిఎం యాప్ ద్వారా కార్డులు, యూపిఐ, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్లో ఏ రూపంలో వినియోగదారులు లావాదేవీలు జరిపినా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
క్రెడిట్ కార్టు లావాదేవీలపై 1 శాతం, డెబిట్ కార్డులపై 0.9 శాతం, నెట్బ్యాంకింగ్, యూపిఐ లావాదేవీలపై రూ.12 నుంచి 15 వసూలు చేసేందుకు పేటియం సిద్దమవుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో పేటియం ఈ విధంగా స్పందించింది.
తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/latest-news/ | 1entertainment
|
Jan 30,2019
మూడో రోజూ మురిపించని మార్కెట్లు
న్యూఢిల్లీ: వరుసగా మూడో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. బడ్జెట్పై కార్పొరేట్ల నిరాశపూరిత అంచనాలు, బలహీన అంతర్జాతీయ పరిణామాలు, డిసెంబర్ త్రైమాసికంలో పలు కార్పొరేట్ కంపెనీల ఆర్ధిక ఫలితాలు ఉత్సాహాన్ని ఇవ్వలేకపోవడం తదితర అంశాలు మార్కెట్లపై విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాల మధ్య బీఎస్ఈ సెన్సెక్స్ 64.20 పాయింట్లు తగ్గి 35,592.50కు పడిపోయింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 9.35 పాయింట్లు తగ్గి 10,652.20 వద్ద ముగిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Suresh 89 Views india vs srilanka 3rd test
india vs srilanka 3rd test
పల్లెకలె: భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు రెండో
ఇన్నింగ్స్లో 19/1 స్కోర్ సాధించింది. అంతకుముందు శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో భారత బౌలర్ల ధాటికి 135
పరుగులకే కుప్పకూలింది. దీంతో శ్రీలంక ఇంకా 333పరుగుల వెనకంజలో ఉంది. | 2sports
|
ఆ టైమింగ్ క్యాచ్ చేయగలనో లేదో అని భయపడ్డాను-అడివి శేష్
Highlights
మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన అమీ తుమీ
అమీ తుమీ చిత్రంలో అనంత్ పాత్ర పోషించిన అడివి శేష్
బాహుబలి సినిమాతో మళ్లీ నిలదొక్కుకున్న అడివి శేష్ అంతరంగం
అనంత్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను..
నా కెరీర్ లో నేను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటించడం ఇదే మొదటిసారి. అసలు నేను కామెడీ చేయగలనా అనే అనుమానం నాకే ఉండేది. అయితే.. మోహనకృష్ణ ఇంద్రగంటిగారు "నువ్వు చేయగలవ్" అని చెప్పి నాతో అనంత్ పాత్ర చేయించారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్ లాంటి నటుల స్థాయిలో కామెడీ పండించగలనో లేదో అని భయపడ్డాను.. కానీ ఇంద్రగంటి గారి వల్ల బాగానే చేశాననిపించింది. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులే చెప్పాలి.
విజన్ మొత్తం ఇంద్రగంటిగారిదే..
నేను, అవసరాల, వెన్నెల కిషోర్, తనికెళ్లభరణి.. నాలుగురమూ దర్శకులమే. మేం నలుగురం కలిసి ఒక సినిమాలో నటించడం వలన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కు చేతులు ఎక్కువ పడ్డాయని చాలామంది అనుకొన్నారు. కానీ.. సినిమాలో విజన్ మొత్తం ఇంద్రగంటిగారిదే. ఆయన ప్రతి పాత్రను తీర్చిదిద్దిన తీరు.. కామెడీని పండించిన విధానం "అమీ తుమీ"లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
రొమాన్స్ చేయగలుగుతానో లేదో అనే సందేహపడేవారు..
"పంజా" చేస్తున్నప్పుడు "నీ మొహానికి విలన్ ఏంట్రా?" అనేవారు. ఆ తర్వాత "కిస్" సినిమా చేస్తున్నప్పుడు "రొమాన్స్ చేయగలవా" అన్నారు. ఇప్పుడు "అమీ తుమీ"కి కూడా అదే "నేను కామెడీ చేయగలనా?" అనే సందేహం నాతోపాటు చాలామంది వ్యక్తపరచారు. సో ఆ సినిమాల రిజల్ట్స్ చూశాం. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ చూడాలి.
క్షణం కెరీర్ కి పెద్ద మైనస్ అయిపోద్దనేవారు..
"క్షణం" సినిమాలో నాకు ఒక కూతురు ఉంటుంది అంటే.. ఇప్పుడే కదా కెరీర్ స్టార్ట్ అయ్యింది అప్పుడే తండ్రి పాత్ర ఏమిట్రా, కెరీర్ కి ప్రోబ్లమ్ అవుతుంది అనేవారు. కానీ.. నేను నమ్మకంతో ఆ సినిమా చేశాను. రిజల్ట్ మీ అందరికీ తెలిసిందే. ఒక నటుడిగా పాత్రను పండించడమే నాకు తెలుసు, అంతే తప్ప.. అది ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది నేను పట్టించుకోను.
బాహుబలి బ్రతికించింది..
అప్పటికే "కిస్" సినిమా ఫ్లాప్ అయ్యి మానసికంగా కృంగిపోయి ఉన్న తరుణంలో "బాహుబలి" సినిమాలో ఆఫర్ లభించడం ఆ సినిమా విడుదలయ్యాక నాకు మంచి పేరు లభించడంతో కాస్త నిలదొక్కుకున్నాను.
ఆయనుండడం వల్లే నాకు పేరొచ్చింది..
"పంజా" సినిమాలో పవన్ కళ్యాణ్ గారికంటే నా క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అయ్యింది అని చాలామంది అంటుంటారు. కానీ.. వాళ్ళందరికీ చెప్పదలుచుకొనేది ఒక్కటే.. "ఆయన ఉండడం వల్లే నేను హైలైట్ అయ్యాను, నాకు పేరొచ్చింది".
డైరెక్షన్ చేస్తాను కానీ..
మళ్ళీ డైరెక్షన్ చేస్తారా అంటే.. చేస్తా కానీ అందులో నటించను. ఒక 40-50 కథలున్నాయి నా దగ్గర. అయితే.. వాటిలో పనికొచ్చేవి ఎన్ని అనేది మాత్రం తెలియదు!
Last Updated 25, Mar 2018, 11:51 PM IST | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘మెగా’ సెలబ్రేషన్స్: చెర్రీ బర్త్ డే వేడుకల్లో పవన్ సందడి
‘వారెవ్వ ఏమి పిక్కూ... ఇచ్చిందిగా మెగా అభిమానులకు సూపర్ కిక్కూ’ అంటూ మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఈ ఫోటో చూసి.
Samayam Telugu | Updated:
Mar 27, 2018, 08:11PM IST
‘మెగా’ సెలబ్రేషన్స్: చెర్రీ బర్త్ డే వేడుకల్లో పవన్ సందడి
‘వారెవ్వ ఏమి పిక్కూ... ఇచ్చిందిగా మెగా అభిమానులకు సూపర్ కిక్కూ’ అంటూ మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఈ ఫోటో చూసి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనటం.. ఆ పక్కనే అన్న, వదినలు కూడా ఉండటం మెగా అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుంది. ఈ ముగ్గురు స్టార్లు ఒకే ఫ్రేమ్లో నవ్వులు చిందిస్తూ ఉన్న ఈ మెగా పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గత రాత్రి చరణ్ బర్త్ డే వేడుకలను ఫలక్నుమా ప్యాలెస్లో వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లి.. అన్నా, వదినలతో చాలా సేపు గడిపివచ్చారు. ఈ విషయాన్ని ఉపాసన ఫేస్బుక్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘కొణిదెల కుటుంబ సభ్యుల బంధం. అత్తమ్మ వండిన అద్భుతమైన లంచ్. పుట్టినరోజు శుభాకాంక్షలు మిస్టర్ సి’ అంటూ మెగా ఆనందాన్ని మెగా అభిమాలనుతో పంచుకున్నారు మెగా కోడలు ఉపాసన.
కాగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానుల నుంచి ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువలా వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చెర్రీ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు మెగా అభిమానులు. ఇక రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ ఈ నెల 30న విడుదల కానుండటంతో ఇప్పటి నుండే మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
క్లీన్ స్వీప్ పై కోహ్లీ సేన గురి !
TNN| Aug 18, 2016, 04.18 PM IST
విండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ పై గురిపెట్టింది. పోర్టు బ్లెయిర్ వేదికగా చిట్టచివరి మూడో టెస్ట్ ఈ రోజు రాత్రి 7:30కి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గి విండీస్ ను వైట్ చేయాలనే లక్ష్యంతో కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది. కరేబియన్ గడ్డపై అడుపెట్టిన టీమిండియా ఇప్పటికే 2-0 తేడాతో టెస్ట్ సీరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.చిట్టచివరిదైన మ్యాచ్ లో నెగ్గి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం టీమిండియా ఫాంను పరిగణనలోకి తీసుకుంటే.. విండీస్ ను బోల్తా కొట్టించడంపెద్దకష్టం కాకపోవచ్చని క్లీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సొంత గడ్డపై ఆడుతున్న విండీస్ కు పరువుదక్కాలంటే ఈ మ్యాచ్ను ఎలాగైనా నెగ్గితీరాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విండీస్ ఆటగాళ్లు సర్వశక్తులు వడ్డి టీమిండియాను ఎలాగైనా కట్టడి చేయాలని లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. దీంతో మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఓటమి భయమే శ్రీలంకని ముంచేస్తోంది..!
భారత్తో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్లో శ్రీలంక ఓటమి భయంతోనే ఒత్తిడికి గురై పరాజయాలను చవిచూస్తోందని
TNN | Updated:
Aug 24, 2017, 07:15PM IST
భారత్‌తో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్‌లో శ్రీలంక ఓటమి భయంతోనే ఒత్తిడికి గురై పరాజయాలను చవిచూస్తోందని ఆ దేశ మాజీ క్రికెటర్ మహేల జయవర్దనె అభిప్రాయపడ్డాడు. టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 3-0తో క్లీన్‌స్వీప్‌కి గురైన ఆ జట్టు.. తొలి వన్డేలోనూ పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం చవిచూసింది. తాజాగా గురువారం జరుగుతున్న రెండో వన్డేలోనూ భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 236/8కే పరిమితమైంది.
‘శ్రీలంక జట్టు ఆత్మవిశ్వాసం ప్రస్తుతం పూర్తిగా సన్నగిల్లింది. వారిలో ఓటమి భయం స్పష్టంగా కనబడుతోంది. మ్యాచ్ గెలవాలనే పట్టుదల, గెలుస్తామనే ధీమా ఇసుమంతైనా వారిలో నాకు కనిపించడం లేదు. జట్టుతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కార మార్గం కనిపెట్టాలి. టెస్టు సిరీస్‌లో తమ ప్రదర్శనపై జట్టులోని క్రికెటర్లందరూ చాలా నిరాశలో ఉన్నారు. కనీసం వన్డేల్లోనైనా భారత్‌కి పోటీనివ్వాలంటే.. వారిలో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపాల్సిందే’ అని జయవర్దనె వివరించాడు. | 2sports
|
Suresh 81 Views South Africa score 9/2
india , South Africa test match
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:రెండు వికెట్ల నష్టానికి 9 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 224/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 497/9 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిన్న సెంచరీతో చెలరేగిన రోహిత్ ఇవాళ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 255 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 28 ఫోర్లు, 6 సిక్సర్లతో 212 పరుగులు చేశాడు. మరోవైపు అజింక్య రహానే కూడా సెంచరీతో మెరిశాడు. 192 బంతుల్లో 17 ఫోర్లు, సిక్సర్తో 115 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 51, ఉమేశ్ యాదవ్ 31 పరుగులు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు తొలి ఓవర్ రెండో బంతికే ఎదురుదెబ్బ తగిలింది. షమీ బౌలింగ్లో ఓపెనర్ డీన్ ఎల్గర్ డకౌట్ కాగా, ఆ తర్వాతి ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ చివరి బంతికి మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(4)ను పెవిలియన్ పంపాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/ | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
స్టార్ హీరో కోసమే వంశీ హీరో అఖిల్ని వదిలేశాడా ?
ఊపిరి సినిమా తర్వాత ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ హీరోగా మరో మూవీ...
TNN | Updated:
May 13, 2016, 09:19PM IST
ఊపిరి సినిమా తర్వాత ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ హీరోగా మరో మూవీ రీమేక్ సెట్స్పైకి వెళ్తుందనే ప్రచారం జరిగింది. హిందీలో రూ. 100 కోట్ల క్లబ్2లో చేరిన ' యే జవానీ హై దివానీ ' సినిమాని అఖిల్ హీరోగా రీమేక్ చేయనున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. నాగార్జున , అఖిల్ ఈ రీమేక్ పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. కానీ ఇంతలోనే ఆ ఇద్దరికి షాక్నిస్తూ ఈ రీమేక్పై తనకి అంతగా ఆసక్తి లేదని చెప్పేశాడు వంశీ పైడిపల్లి. 'ఊపిరి' ఆల్రెడీ ఓ రీమేక్ కనుక ఆ వెంటనే మరో రీమేక్ చేయడం తనకి ఇష్టంలేదని చెప్పాడట వంశీ. కానీ వాస్తవానికి అసలు కారణాలు వేరే వున్నాయనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మరో బిగ్ స్టార్ హీరోతో సినిమా చేయాలనే ప్లాన్లో వున్న వంశీ తన వద్ద ఓ స్టోరీని ఆ బిగ్ స్టార్కి వినిపించి అతడి వద్ద గట్టి హామీ పొందినట్టుగా తెలుస్తోంది. బహుశా అఖిల్ సినిమాని ఆదిలోనే వదిలేయడానికే అదే అసలు కారణం అయ్యుంటుందని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. దీనికి వంశీ పైడిపల్లి ఏం చెబుతాడో వేచిచూడాల్సిందే మరి! | 0business
|
మీరు గర్వంగా తలెత్తుకుని తిరిగేలా రక్తం ధారపోసి పోరాడతా : ఎన్టీఆర్
Highlights
ఘనంగా జైలవకుశ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
అభిమానుల మధ్య ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ల జైలవకుశ ట్రైలర్ లాంచ్
వేడుకలో అభిమానులద్దేశించి ఎమోషన్ అయిన ఎన్టీఆర్
'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో.. ఈ జన్మలో మీ అందరి ప్రేమ, ఆప్యాయత, అభిమానం దక్కిందని అన్నారు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్నా.... ఇంకో జన్మ ఉంటే మీ రుణం తీర్చుకుంటాను. ఈ జన్మ మాత్రం వీళ్లతో(అభిమానులు) ఉండిపోతాను. ఒక తల్లి కడుపున పుట్టక పోయినా మీరు చూపించే అభిమానం, ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను. మీ అందరి రూపంలో ఇంత గొప్ప కుటుంబం దొరికింది... అని ఎన్టీఆర్ అన్నారు.
ఒక మంచి భర్తగా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి తండ్రిగా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి కొడుకుగా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి తమ్ముడిగా ఉండటానికి ప్రయత్నిస్తాను.. కానీ మీ దగ్గర మాత్రం ప్రయత్నించడం ఉండదు. మీ దగ్గర ఎప్పుడూ ఎమోషనే ఉంటుంది అని అభిమానులనుద్దేశించి ఎన్టీఆర్ అన్నారు. రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతానని మనవి చేసుకుంటున్నాను. నాకు ఎవరూ ముఖ్యం కాదు, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే ముఖ్యం. మీకు నచ్చే వరకు, మీరు గర్వంగా తలెత్తుకుని తిరిగే వరకు ఎల్లప్పుడూ ఇలాగే పోరాడూతూనే ఉంటాను. మంచి చిత్రాలు తీసి మీ రుణం తప్పకుండా ఈ జన్మలో తీర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకో జన్మంటూ ఉంటే ఆ జన్మలో కూడా మీ రుణం తీర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు... అని ఎన్టీఆర్ అన్నారు.
జై లవ కుశ గురించి ఎలా మాట్లాడాలి అని పదాలు వెతుక్కుంటున్నాను. ఎప్పుడూ ఇలాంటి కన్ఫ్యూజన్ లేదు. బహుషా లోపల ఉన్నటువంటి ఎమోషన్ వల్ల బయటకు రావడం లేదేమో, అందుకే ఏరుకుంటున్నాను పదాలను, ఈ రోజు వచ్చినటువంటి ఈ స్థాయి దేవుడు చల్లగా చూశాడు, అభిమానులు ప్రోత్సహించారు, మా దర్శకులు ఫోకస్డ్ గా ఉన్నారు కాబట్టే ఈ రోజు ఈ స్థాయిలో ఉండగలిగాను, ఈ మూడింటిలో ఏ ఒక్కటి తక్కువైనా నిజంగా ఈ రోజు జై లవ కుశ అనే సినిమా ఉండేది కాదేమో.... అని ఎన్టీఆర్ అన్నారు.
నేను, అన్నయ్యా ఎప్పుడైతే మా బేనర్లో సినిమా చేద్దామని అనుకున్నామో ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాలేదు. సినిమా హిట్టు, ప్లాపులు మన చేతుల్లో లేవు, అది దైవ నిర్ణయం, మనం ప్రయత్నం మాత్రమే చేయగలం, ఈ చిత్రం విషయంలో సక్సెస్ కంటే ముఖ్యం అభిమానులు గర్వంగా సినిమా చూసిన తర్వాత ఏం తీశార్రా అన్నాదమ్మలు అని వాళ్లు అనుకోవాలి. ఎంత బాగా తీశార్రా మా కన్నకొడుకులు అని అమ్మా నాన్నా అనుకోవాలి. వీటన్నింటికంటే మనిద్దరం అద్భుతమైన సినిమా తీశామని నేను అన్నయ్య అనుకోవాలి. అవన్నీ దేవుడు విని బాబీని పంపించాడేమో.. అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.
బాబీ వచ్చి కథ చెప్పినపుడు భయపడిపోయాను. ముందు భయం వేసింది. ఈ చిత్రం చేయగలుగుతానా? అని... నేను, అన్నా ఏదైతే అనుకున్నామో, మా డ్రీమ్ కు కావాల్సిన ఆయుధాలన్నీ ఆయన తీసుకొచ్చిన కథలో ఉన్నాయి... అని ఎన్టీఆర్ తెలిపారు. ఆ ఇద్దరి పేర్లు సినిమా హిట్టయితే చెబుతా ఈ కథను నాకు అత్యంత దగ్గరైనటువంటి ఇద్దరు ఆప్తులతో షేర్ చేసుకున్నాను. వారి పేర్లు ఇపుడు చెప్పను, ఈ సినిమా సూపర్ హిట్టయితే వారి పేర్లను చెబుతాను. అప్పటి వరకు వారిద్దరి పేర్లు చెప్పను. వారిద్దరితో నేను ఎప్పుడైతే కథ షేర్ చేసుకున్నానో వాళ్లు కూడా బ్రహ్మాండంగా ఉందని ప్రోత్సహించడం జరిగింది. ఈ సినిమా మీ అందరికీ గర్వకారణంగా ఉన్న రోజే చెబుతాను వారిద్దరూ ఎవరు? అనేది.... అని ఎన్టీఆర్ అన్నారు.
‘జై లవ కుశ' ప్రయాణం మొదలైనప్పటి నుండి మీ అందరికీ గర్వకారణంగా ఉండాలనే ఒక ఫినిష్ లైన్ తప్ప ఏమీ కనిపించలేదు. రోజూ పొద్దున్నే లేచి పరుగెత్తాం, ఎంత కష్టమైనా సరే పర్లేదు. చివరకు ఈ రోజు ఇలా మీ అందరి ముందు రావడం జరిగింది. బావుంటుందని నమ్ముతున్నాను. తప్పకుండా మీ అందరికీ గర్వకారణంగా ఉంటుంది, మా అమ్మ నాన్నలకు, నాకు, అన్నకు గర్వ కారణంగా ఉంటుందని అనుకుంటున్నాను. మిగతాదంతా పైవాడి చేతుల్లో ఉంది, మా ఆరాధ్య దైవం తాతగారి చేతుల్లో ఉంది, వారి ఆశీర్వాదం తోడైతే మేము కన్న కల కూడా నిజమౌతుంది అని మనసారా నమ్ముతున్నాను... అని ఎన్టీఆర్ అన్నారు.
సినిమా చేయాలనుకుని ఫిక్స్ అవగానే , మేమంతా ఒకే మాటపై వచ్చి ఫైనలైజ్ చేసిన ఫస్ట్ టెక్నీషియన్ మా దేవిశ్రీ ప్రసాద్. మా రిలేషన్ ఎలా ఉంటుందో దేవి ఇచ్చే పాటలతోనే తెలుస్తుంది అని ఎన్టీఆర్ అన్నారు. చోటా అన్న భుజాలపైనే అంతా వుంటుంది. తనను డిఓపీగా పని చేస్తే అందరూ రిలాక్స్ అవ్వొచ్చు. చోటాగారు మొత్తం ప్రెషన్ ఆయన భుజాలపై వేసుకుంటారు. ఈ రోజు సినిమా అనుకున్న సమయానికి వస్తుందంటే ముఖ్యమైన కారణం చోటా గారు. ఎన్నో విషయాలు ఆయన తన భుజాలపై వేసుకున్నారు. పూణెలో చేసిన షెడ్యూల్ లో 19 రోజుల పాటు చోటగారు పడిన కష్టం మాటల్లో చెప్పలేను. ఈ సినిమాకు ముఖ్యమైన పిల్లర్లలో ఆయన ఒకరు... అని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమాకు ముఖ్యమైన పిల్లర్స్ అలాగే కోన, చక్రి.. బాబీ తీసుకొచ్చిన కథకు, కష్టానికి కుడి భుజం, ఎడమ భుజంగా సపోర్టు చేశారు. అలాగే మా సినిమా ఆర్ట్ డైరెక్టర్ ప్రసాద్ గారు మరో పిల్లర్. అలాగే రామ్ లక్ష్మణ్ బ్రదర్స్... ఈ సినిమాకు ముఖ్యమైన వ్యక్తులు అని ఎన్టీఆర్ అన్నారు.
మూడు పాత్రలు ఒకేసారి చేసేటపుడు 38 విఎఫ్ఎక్స్ షాట్స్ చేయాల్సి వచ్చింది. 38 విఎఫ్ఎక్స్ షాట్స్ అంటే ఒక్కో పాత్ర మూడు సార్లు బట్టలు మార్చాలి. 76 సార్లు బట్టలు మార్చేపుడు నిజంగా ఒక్కోసారి బాధగా ఉండేది. అదే సమయంలో అభిమానులకు నచ్చాలి, వారి కోసం కష్టపడాలి అని అనిపిస్తూ ఉండేది. నాకు సపోర్టుగా నిలిచిన రాశి, నివేదా లకు థాంక్స్. వారి సపోర్టు ఎప్పటికీ మరిచిపోలేను... అని ఎన్టీఆర్ అన్నారు.
ఈ చిత్రానికి పని చేసిన సాయి కుమార్ గారికి, పోసాని కృష్ణ మురళి గారికి, ఇంకా ఎంతో మంది నటీనలులకు, సాంకేతిక నిపుణులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం మనందరి గుండెల్లో సుస్థిర స్థానం ఉండిపోతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో ఏ ఒక్క పేరు లేక పోయినా అది కరెక్ట్ అవ్వదు. ఈ చిత్రం ప్రపంచంలో ఉన్న అన్నదమ్ములందరికీ అంకితం. ఈ చిత్రం చూసి అన్నదమ్ములందరూ కూడా ఇన్స్ స్పైర్ అవుతారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను.. అంటూ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
Last Updated 26, Mar 2018, 12:04 AM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
తమిళ దర్శకుడితో బాలకృష్ణ తర్వాతి చిత్రం
బసవతారకరామపుత్ర బాలకృష్ణ తన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
| Updated:
Jan 28, 2017, 05:07PM IST
బసవతారకరామపుత్ర బాలకృష్ణ తన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కెరీర్‌లో 100వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలన్న తన కల సాకారం చేసుకున్న బాలయ్య బాబు ఇప్పుడు నెమ్మదిగా ఫోకస్‌ని తన తర్వాతి చిత్రంపైకి మార్చారు. 100వ చిత్రం తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే చిత్రం చేయాలని భావించారు బాలకృష్ణ. అయితే, ఉన్నట్టుండి ఏమయ్యిందో ఏమో తెలీదు కానీ ప్రస్తుతానికి బాలకృష్ణ ఆ చిత్రంతోపాటు దర్శకుడిని కూడా మార్చేసినట్టు తెలుస్తోంది.
ఇంతకుముందు సౌతిండియాలో రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి లీడ్ హీరోలతో సినిమాలు చేసి, హిట్స్ కొట్టిన తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈమధ్యే రవికుమార్ వినిపించిన స్టోరీ లైన్ బాలయ్యకు బాగా నచ్చిందట. అందుకే ఆ స్టోరీనే ఇక పట్టాలపైకి ఎక్కించాలని డిసైడ్ అయినట్టుగా సినీవర్గాల్లో ఓ ప్రచారం జరుగుతోంది. కృష్ణవంశీ, రవికుమార్ చిత్రాల్లో ఏది సెట్స్ పైకి వెళ్తుందో తెలియాలంటే ఇంకొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Coach Achrekar: కోచ్ అచ్రేకర్ మృతిపై సచిన్ భావోద్వేగ ట్వీట్
‘సార్ సమక్షంలో ఉంటే నాకు క్రికెట్ స్వర్గంలా అనిపించింది. ఎంతో మంది లాగానే నేను కూడా ఆయన వద్దే క్రికెట్లో ఓనమాలు (ఏబీసీడీలు) నేర్చుకున్నాను. నా కెరీర్కు ఆయన పునాది వేశారని’ సచిన్ ట్వీట్ చేశారు.
Samayam Telugu | Updated:
Jan 2, 2019, 11:10PM IST
Coach Achrekar: కోచ్ అచ్రేకర్ మృతిపై సచిన్ భావోద్వేగ ట్వీట్
హైలైట్స్
నాకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి అచ్రేకర్ సార్
ఆయన వద్దే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాను
మీరు ఎప్పటికీ మా మనసులోనే ఉంటారంటూ సచిన్ ట్వీట్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. తనను గొప్ప ఆటగాడిగా తయారుచేసిన గురువు అచ్రేకర్ అంటే సచిన్కు అమితమైన ప్రేమ. సార్ మన మధ్య లేరని, ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానంటూ భావోద్వేగంతో సచిన్ ట్వీట్ చేశాడు.
‘సార్ సమక్షంలో ఉంటే నాకు క్రికెట్ స్వర్గంలా అనిపించింది. ఎంతో మంది లాగానే నేను కూడా ఆయన వద్దే క్రికెట్లో ఓనమాలు (ఏబీసీడీలు) నేర్చుకున్నాను. నా కెరీర్కు ఆయన పునాది వేశారు. ఆయన నా జీవితానికి ఎంత చేశారన్నది నేను మాటల్లో చెప్పలేను. గత నెలలో కూడా మరికొందరు శిష్యులతో పాటు వెళ్లి సార్ను కలిశాను. పాత జ్ఞాపకాలను మళ్లీ నెమరువేసుకున్నాం. ఆటతో పాటు మమ్మల్ని మంచి మనుషులుగా తీర్చదిద్దారు. మీ జీవితంలో నన్ను భాగం చేసినందుకు ధన్యవాదాలు. మీ శిక్షణతో నన్ను ఉన్నత స్థానంలో నిలిపారు. నాతోపాటు ఎంతో మందికి అద్భుతమైన నైపుణ్యాన్ని ఇచ్చారు. మీరు ఎప్పుడు మా మనసులో ఉండిపోతారు’ అంటూ కోచ్ రమాకాంత్ అచ్రేకర్తో దిగిన ఫొటోను షేర్ చేసుకున్నారు.
You’ll always be in our hearts. https://t.co/0UIJemo5oM
— Sachin Tendulkar (@sachin_rt) 1546447917000
‘ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమాకాంత్ అచ్రేకర్ ఇక లేరు. ఆయన మృతిపట్ల బీసీసీఐ సంతాపం ప్రకటిస్తోంది. అచ్రేకర్ కేవలం గొప్ప క్రికెటర్లు చేయడమే కాదు, వారిని గొప్ప మనుషులుగా కూడా తీర్చిదిద్దారు. భారత క్రికెట్కు ఆయన అందించిన సేవలు వర్ణణాతీతమమని’ బీసీసీఐ తన ట్వీట్లో పేర్కొంది.
The BCCI expresses its deepest sympathy on the passing of Dronacharya award-winning guru Shri Ramakant Achrekar. No… https://t.co/o7zHYVOsgI
— BCCI (@BCCI) 1546436998000
భారత క్రికెట్కు ఎంతోమంది ఆణిముత్యాలను అందించిన వ్యక్తి అచ్రేకర్ అని వీవీఎస్ లక్ష్మణ్ నివాళులర్పించాడు. సచిన్ రూపంలో ఓ గొప్ప కానుకను భారత క్రికెట్కు అందించారని, అచ్రేకర్ సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.
సచిన్ను గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన అచ్రేకర్ 87 ఏళ్ల వయసులో ముంబైలో తుదిశ్వాస విడిచారు. సచిన్, వినోద్ కాంబ్లిలకు పాఠశాల స్థాయిలో అచ్రేకర్ క్రికెట్లో శిక్షణ ఇచ్చారు. అచ్రేకర్ను ద్రోణాచార్య అవార్డుతో పాటు పద్మ శ్రీ కూడా వరించింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyderabad, First Published 13, Aug 2019, 2:21 PM IST
Highlights
‘నేను ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తించొద్దు. దయచేసి ఇలాంటి వదంతులు సృష్టించకండి’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు ప్రముఖ గాయని నేహా కక్కర్.
ప్రముఖ గాయని నేహా కక్కర్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 'ఇండియన్ ఐడల్' కార్యక్రమంలో పాల్గొన్న విభోర్ పరాషర్ అనే కంటెస్టంట్ తో నేహా కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని.. వీరిద్దరూ కలిసి కచేరి కార్యక్రమాలకు వెళ్తున్నారని వార్తలు ప్రచురిస్తున్నాయి.
దీనిపై స్పందించిన నేహా ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించకండి అంటూ వేడుకున్నారు. ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉన్నాను.. కానీ నేను మాట్లాడి తీరాల్సిందేనని చెబుతూ.. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్న వారు నేను ఒకరికి కూతురునని, సోదరినని గ్రహించరు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంతకాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడినట్లు.. తన పనితనంతో కుటుంబాన్ని గర్వపడేలా చేశానని.. అలాంటప్పుడు వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని చెప్పింది. తనొక సెలబ్రిటీ అయినప్పటికీ ముందుగా మనిషిగా పుట్టానని, వేరొకరితో తనకు సంబంధాలున్నాయంటూ తప్పుడు వార్తలు సృష్టించి మరింత కుంగిపోయేలా చేయకండి అంటూ రిక్వెస్ట్ చేసింది.
మీ సోదరి గురించి, కూతురి గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారా..? నేను ఆత్మహత్య చేసుకునేలా చేయకండి అంటూ మండిపడింది. ప్రస్తుతం తన టైం బాగాలేదని.. కానీ ఎప్పుడూ ఇలాగే ఉండదని చెప్పింది. త్వరలోనే కోలుకుంటానని వెల్లడించింది.
Last Updated 13, Aug 2019, 2:21 PM IST | 0business
|
Hyd Internet 66 Views PNB
PNB
ఢిల్లీః నష్టాల బాటలో నడుస్తున్న 300 బ్రాంచ్లను తరలించడం లేదా మూసివేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ వచ్చే 12 నెలల్లో జరుగుతోందని పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా ప్రకటించారు. ఇప్పటికే 2 నుంచి 3 బ్రాంచ్లను మూసివేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 6,937 బ్రాంచ్లు ఉన్నాయి. సెప్టెంబర్ 2017 నాటికి 6,940 బ్రాంచ్లు ఉన్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
సరికొత్తగా హలీమ్ లాంచ్
రంజాన్ మాసం పురస్కరించుకుని ఉద్యోగులంతా వారి ముఖాలకు “I Love Haleem” అనే పెయింటింగ్ వేయించుకుని రోజంతా పనిచేశారు.
Samayam Telugu | Updated:
May 24, 2018, 03:00PM IST
కురియోస్ హలీమ్
“I Love Haleem” పేరుతో ఒక రోజంతా పనిచేసిన ఉద్యోగులు
హైదరాబాద్లో కొంత మంది డాక్టర్ వృత్తి నుంచి వ్యాపారులుగా మారి ప్రారంభించిన కేఎల్సీపీ హెల్తీ ఫుడ్స్ ఒక సరికొత్త ప్రయోగం చేసింది. రంజాన్ మాసం సందర్భంగా హలీం ప్రారంభ సమయంలో వినూత్న యత్నం చేసింది. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో హలీం ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. దాన్ని పురస్కరించుకుని ఉద్యోగులంతా వారి ముఖాలకు “I Love Haleem” అనే పెయింటింగ్ వేయించుకుని రోజంతా పనిచేశారు. కురియోస్ హలీమ్ పేరిట రంజాన్ సీజన్ సందర్భంగా హలీమ్ ఉత్పత్తిని తయారుచేస్తున్న ఉద్యోగులంతా ఒక రోజంతా “I Love Haleem” వేసుకుని పనిచేశారు.
కంపెనీలో మేనేజ్మెంట్ ఇంటర్న్గా పనిచేస్తున్న శ్రీజ ఇలా చెప్పారు. ''కేవలం ప్రాడక్ట్ను ప్రమోట్ చేసుకునేందుకు ఇలా చేయలేదని, నిజంగా వారంతా హలీమ్ ఉత్పత్తిని నమ్మడం వల్లే ఇలా చేశామని చెబుతున్నారు. ''
కురియోస్ హలీమ్ టీమ్ సెల్ఫీ మూమెంట్
హలీమ్ అనేది చాలా న్యూట్రిషన్ విలువ కలిగిన ఆహారం. రంజాన్ సీజన్లో దీన్ని తినడాన్ని మేమంతా ఆస్వాదిస్తున్నాం. అందువల్లే నా ముఖానికి ఈ పెయింటింగ్ వేసుకున్నానని అహ్మద్ అనే ఉద్యోగి వెల్లడించారు.
ఆహార ఉత్పత్తులను అందించే కంపెనీ కేఎల్సీపీ హెల్త్ ఫుడ్స్. కేఎల్సీపీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన గ్రూప్ కంపెనీ ఇది. కేఎల్సీపీ ఇప్పటికే కురియోస్ఈటీ, మన కర్రీస్ పేరిట టేక్ అవే ఫుడ్ అవుట్లెట్లను నిర్వహిస్తోంది. కురియోస్ఈట్ కర్రీ కేఫ్లు ఇప్పటికే నగరంలో కాస్త ప్రాచుర్యం పొందాయి. ఈ ఉత్సాహంతో ఈ ఏడాది కురియోస్ హలీమ్ ప్రవేశపెట్టారు.
కురియోస్ హలీమ్
కురియోస్ హలీమ్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
2.5 అడుగుల గణపయ్యకి సచిన్ పూజలు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ 2.5 అడుగుల బొజ్జ గణపయ్యకి ప్రత్యేక పూజలు నిర్వహించారు
TNN | Updated:
Sep 2, 2017, 06:22PM IST
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ 2.5 అడుగుల బొజ్జ గణపయ్యకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబయిలోని గుర్గాన్ ప్రాంతంలో కేశ్వాజీ నాయక్ చావ్ ఏర్పాటు చేసిన వినాయకుడ్ని సచిన్ తాజాగా దర్శించుకున్నారు. దాదాపు 150 జనవాసాల మధ్య ఏటా ఏర్పాటు చేసే ఈ విగ్రహానికి చాలా మహిమ ఉంటుందని భక్తుల విశ్వాసం. ముంబయిలో అన్ని విగ్రహాల కంటే ముందు ఈ చిన్న బొజ్జ గణపయ్యనే తొలుత ప్రతిష్ఠించనున్నట్లు వినికిడి.
ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసే కేశ్వాజీ నాయక్ చావ్‌ ఉత్సవ కమిటీకి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే తొలుత స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవాన్ని జరిపినట్లు స్థానికులు చెప్తుంటారు. అక్కడ ఎలాంటి లౌడ్ స్పీకర్లు.. హంగులు, ఆర్భాటాలు ఉండవు. సంప్రదాయబద్ధంగా భక్తులు పూజలు నిర్వహించి చివరికి నిమజ్జనం చేస్తారు. | 2sports
|
చాలాకాలం తర్వాత రవితేజ మళ్ళీ కన్పించాడు
Highlights
రవితేజ ఏం చేస్తున్నాడు అన్న ప్రశ్న టాలీవుడ్లో కోడైకూసింది.
బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ
టచ్ చేసి చూడు సినిమా ఫస్ట్ లుక్ తో మళ్ళి వెలుగులోకి వచ్చిన రవితేజ
ఆ మధ్య ఓ సినిమా కోసం 'సిక్స్ ప్యాక్ ఫిజిక్' ట్రై చేసి, ఆ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే, రెస్ట్ తీసుకోవడం కోసమే ఈ 'గ్యాప్' అనే ప్రచారమూ తెరపైకొచ్చింది. ఎలాగైతేనేం, చాలాకాలం తర్వాత రవితేజ మళ్ళీ కన్పించాడు. అదీ 'టచ్ చేసి చూడు' అంటూ. అవును, ఇది రవితేజ కొత్త సినిమా టైటిల్. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
రవితేజ మార్క్ మాస్ స్టయిల్లో స్టిల్ని రిలీజ్ చేసింది 'టచ్ చేసి చూడు' చిత్ర యూనిట్. రేపు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ, ఫస్ట్ లుక్ని టైటిల్తోపాటు విడుదల చేసేశారు. ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రానికి సంగీతం ప్రీతమ్స్. 'బెంగాల్ టైగర్' తర్వాత మరోమారు రవితేజతో 'టచ్ చేసి చూడు' సినిమాలో కన్పించబోతోంది ముద్దుగుమ్మ రాశి ఖన్నా.
Last Updated 25, Mar 2018, 11:54 PM IST | 0business
|
భారత సంప్రదాయ దుస్తుల్లో జట్టుకు మద్దతు
సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న క్రికెటర్లు
హైదరాబాద్: ఐపిఎల్ 10 సీజన్లో దేశ,విదేశాలకు చెందిన క్రికెటర్లు ఈ సీజన్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.ముఖ్యంగా పదవ సీజన్ కోసం భారత్కు వచ్చిన విదేశీ క్రికెటర్లు భారత సంప్రదాయ దుస్తుల్లోవచ్చి వారు ఆడుతున్న జట్టుకు మద్దతు తెలపాలని కోరుతున్నారు.ఇటీవల ముగి సిన భారత-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లోఇరు జట్లకు చెందిన ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు పేలాయి.డిఆర్ఎస్ రివ్యూ వివాదం ఇరు జట్ల మధ్య పెనుదుమారాన్ని సృష్టించింది.రాంచీ టెస్టుల్లో కోహ్లీ గాయంపై ఆసీస్ ఆటగాళ్లు ఎగతాళి చేసిన నేపథ్యంలో కోహ్లీకూడా అదే స్థాయిలో ధీటుగా సమాధాన మిచ్చాడు.ఇలా నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆటగాళ్లు కొన్నిసార్లు వాగ్వాదానికి దిగారు. ధర్మశాల టెస్టు అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆటలో స్లెడ్జింగ్ లాంటివి సహజమే అని,తాను ఆ విధంగా మాట్లాడినందుకు స్మిత్ క్షమాపణలు కూడా కోరిన సంగతి తెలిసిందే.టెస్టు సిరీస్ ముగియడానికి ముందు స్టీవ్ స్మిత్ని రైజింగ్ పూణే జాయింట ప్రాంచైజీ ధోనిని తప్పించి అతడి స్థానంలో కెప్టెన్గా నియమించింది.ఈ నేపథ్యంలో పుణే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను స్మిత్ నిర్వహిస్తున్నాడు.ఇందులో భాగం గా జట్టు కోసం స్మిత్ తాజాగా భారత సంప్రదాయ దుస్తులు ధరించి ఒక ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొని ఆశ్చర్యపరిచాడు.అంతేకాదు మరాఠి బాషలో పుణే జట్టుకు మద్దతు తెలుపాలని అభిమానులను కోరాడు. ఈ కార్యక్రమంలో భారత ఆటగాడు రహానే కూడా పాల్గొన్నాడు.సంప్రదాయ దుస్తులను ధరించిన స్మిత్ బ్యాట్ పట్టుకుని రహానేతో కలిసి పోటోలకు పోజులిచ్చాడు.ఈ పోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తున్నాయి. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నితిన్, శర్వా.. కాంబో సినిమా పేరు అదే!
నితిన్, శర్వానంద్ కాంబోలో ఒక సినిమాను రూపొందించడం గురించి అధికారిక ప్రకటన చేశాడు ప్రముఖ నిర్మాత
TNN | Updated:
Dec 18, 2017, 01:07PM IST
నితిన్, శర్వానంద్ కాంబోలో ఒక సినిమాను రూపొందించడం గురించి అధికారిక ప్రకటన చేశాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు . పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజు తన తదుపరి సినిమాల గురించి వివరించారు. ఇందులో శర్వానంద్, నితిన్ కాంబోలో ఒక మల్టీస్టారర్ సినిమాను రూపొందించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని కూడా తెలపడం విశేషం.
అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి టైటిల్ నుకూడా అనౌన్స్ చేశారు. ఇంతకీ ఈ యంగ్ హీరోలిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా పేరేంటంటే.. ‘దాగుడుమూతలు’ ఈ టైటిల్ ను దిల్ రాజు ప్రకటించారు. తమ తమ కెరీర్ లలో బెస్ట్ స్టేజీలో ఉన్న ఇద్దరు యంగ్ హీరోలు కలిసి నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బంపర్ ఆఫర్ కొట్టేసిన కాజల్?
కాజల్ కెరీర్ మళ్ళీ ఊపందుకుందనే మాటలు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఇక కాజల్ కథ ముగిసిపోయిందనుకున్న తరుణంలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది.
TNN | Updated:
Dec 6, 2016, 07:41PM IST
Kajal Agarwal romance again with NTR
కాజల్ కెరీర్ మళ్ళీ ఊపందుకుందనే మాటలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇక కాజల్ కథ ముగిసిపోయిందనుకున్న తరుణంలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం కాజల్, మెగాస్టార్ సరసన 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో నటిస్తోంది. దీని తరువాత కాజల్ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదనుకున్నారంతా. కానీ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా కాజల్ ఎన్నుకున్నారనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. కాజల్ గతంలో మహేష్ తో 'బిజినెస్ మెన్', 'బ్రహ్మోత్సవం' వంటి చిత్రాల్లో నటించింది. అదే క్రమంలో మరోసారి ఛాన్స్ కొట్టేసిందని చెబుతున్నారు. | 0business
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఎయిర్ ఏషియా: రూ.999 కే టిక్కెట్లు
మలేషియన్ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా మళ్లీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 999కే దేశీయ ప్రయాణ టిక్కెట్ల రేట్లను ప్రకటించింది.
Samayam Telugu | Updated:
Sep 2, 2018, 09:26AM IST
ఎయిర్ ఏషియా ఇండియా(ఏఏఐ)భారీగా డిస్కౌంట్స్ ప్రకటించింది. అంతర్జాతీయ ఫ్లైట్లకు రూ.1,399 తో ఛార్జీలు ప్రారంభం కానున్నాయి. డొమెస్టిక్ ఫ్లైట్స్ కు రూ.999 ప్రారంభ ధర. ఈ ఆఫర్ పరిమిత కాలంగా ఉంటుంది. ఎయిర్ ఏషియా గ్రూపునకు సంబంధించిన అన్ని ఫ్లైట్లలో ఈ ఆఫర్ వర్థిస్తుంది.
ఇవాళ అర్థరాత్రి నుంచి టికెట్లు బుక్ చేసుకునేందుకు విండో ఓపెన్ కానుంది. ఇప్పుడు బుక్ చేసుకుంటే... వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 19 నుంచి నవంబర్ 26 మధ్యలో ప్రయాణం చేయవచ్చు. ఎయిర్ ఏషియా.కామ్, ఎయిర్ ఏషియా మొబైల్ ఆప్ ద్వారా టికెట్లు బుకింగ్ సౌకర్యం ఉంది. కౌలాలంపూర్, బ్యాంకాక్, సిడ్ని, ఆక్లాండ్ ,మెల్ బోర్న్ ,సింగపూర్, బాలి లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు ఈ అవకాశాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది ఎయిర్ ఏషియా భావిస్తోంది. భారత్లో 21 ప్రాంతాల నుంచి తన సర్వీసులను నడుపుతోంది. | 1entertainment
|
గిల్లితే గిల్లిచ్చుకోవాలా... మాకు ఫీలింగ్స్ ఉండవా.? : మాధవిలత
Highlights
గిల్లితే గిల్లిచ్చుకోవాలా... మాకు ఫీలింగ్స్ ఉండవా.? : మాధవిలత
తెలుగు ఇండస్ర్టీ లో అమ్మాయిలకు వేధింపులు కామన్. ఇక్కడ హీరోల డామినేషన్ ఎక్కువ వాళ్లని తట్టుకోవడం చాలా కష్టం. సినీ ఇండస్ట్రీలో మహిళలకు పెద్దపీట వేయాలన్నది నా కోరిక, అందునా తెలుగమ్మాయిలు ఎక్కువగా రావాలి. అసలు ఇండస్ర్టీలో క్యాస్టింగ్ లేకుండా చేయడమే నా ధ్యేయం.
ఇక అసలు విషయానికి వస్తే... నటి మాధవీలత తన పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది. తాను రాజీకాయాల్లోకి వస్తున్నానని చెప్పిన వెంటనే.. తనంటే గిట్టని వాళ్లంతా చెప్పకూడని పదాలను ఉపయోగిస్తూ కామెంట్లు చేశారని, ఆ కామెంట్లు చూసిన తనకు చాలా బాధ కలిగిందని చెప్పుకొచ్చింది.
ఇలా బాధపడితే.. నీవేమీ పొలిటికల్ లీడర్ అవుతావు..? అని మరికొందరు ప్రశ్నించారని చెప్పింది. ఏం నేను మనిషిని కాదా..? నాకు ఫీలింగ్స్ లేవా..? నాకు కన్నీళ్లు రావా..? ఇతరులు చదవని రీతిలో పదాలు ఉపయోగిస్తూ ఆ కామెంట్స్ చేశారని చెప్పింది. వారు గిల్లితే గిల్లించుకోవాల్నా..? రక్తం వచ్చేలా గిచ్చుతామంటారు..? ఆ తరువాత ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోకూడదంటూ కామెంట్స్ పెడుతుంటారు.. వాటన్నిటినీ మేం భరించాల్నా..? అంటూ ప్రశ్నించింది మాధవీ లత.
Last Updated 23, Jun 2018, 1:34 PM IST | 0business
|
Read Also: అషు రెడ్డి బ్యాక్ టు బిగ్ బాస్.. వైల్డ్ కార్డ్ చస్కా మస్కా?
ఇక ఈ 11 మందిలో బిగ్ బాస్ విన్నర్ అయ్యేదెవరన్నదానిపై ఇంకా 65 రోజుల ఆట మిగిలి ఉండగానే లెక్కలు మొదలయ్యాయి. ఇందుకోసం గత రెండు సీజన్ల విన్నర్స్, రన్నర్స్ని ఏ ప్రాతిపదిక ఆడించారు? విజేతలెలా అయ్యారంటూ విశ్లేషణలు మొదలుపెట్టారు.
మూడో సీజన్లో టైటిల్ ఫేవరేట్గా బిగ్ బాస్ హౌస్కి అడుగుపెట్టింది యాంకర్ శ్రీముఖి. ఆమెతో పాటు వరుణ్ సందేశ్ కూడా టైటిల్ కోసం భార్యతో సహా గట్టి పోరాటమే చేస్తున్నారు. ఇక మిగిలిన బాబా భాస్కర్, రవి, అలీ రజా, శివజ్యోతి, వితికా, పునర్నవి, హిమజ, మహేష్ ఇలా 11 మంది కంటెస్టెంట్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్నప్పటికీ వీరిలో బిగ్ బాస్ విన్నర్ అయ్యేది ఒక్కరే కావడంతో ఆ ఒక్కడు అలీ రజా అంటూ కొత్త విశ్లేషణలు మొదలయ్యాయి.
బిగ్ బాస్ హౌస్లో కోపిష్ఠిగా అందరితో గొడవలు పెట్టుకుంటున్న అలీనే ఈ సీజన్ విన్నర్ అంటూ కొత్త లెక్కలు బయటకు తీస్తున్నారు. అదేంటంటే.. అలీ బిగ్ బాస్ హౌస్లో 11వ కంటెస్టెంట్గా అడుగుపెట్టడమే అతడ్ని విన్నర్ చేస్తుందట.
ఇదేం లెక్క అంటే.. బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా నిలిచిన శివ బాలాజీ, సీజన్ 2 విజేత కౌశల్లు కూడా 11వ కంటెస్టెంట్స్గానే హౌస్లో అడుగుపెట్టి విజేతలయ్యారట. ఇప్పుడు సీజన్ 3లో 11వ కంటెస్టెంట్గా అలీ రజా అడుగుపెట్టడంతో ఈ సీజన్కి కూడా 11 సెంటిమెంట్ను ఫాలో అవుతారంటూ అతడే బిగ్ బాస్ విన్నర్ అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ నంబర్ న్యూమరాలజీ వర్క్ ఔట్ అవుతుందా లేదా? అన్నది అలీ రజా ఎలిమినేషన్పై ఆధారపడి ఉంటుంది. | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
స్వీడన్ గెలిచెన్.. దక్షిణ కొరియా పోరాడి ఓడెన్
Highlights
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆండ్రియాస్ గ్రాన్క్విస్ట్
హైదరాబాద్: 16 ఏళ్ళ తర్వాత ఫిఫా వరల్డ్ కప్కు క్వాలిఫై అయిన దక్షిణ కొరియా తొలి మ్యాచ్లో ఓటమి పాలైంది. ఆసియా ఖండం నుంచి టోర్నమెంట్కు క్వాలిఫై అయిన రెండో టీమ్గా పేరొందిన ఈ జట్టు, నిజ్నీ నొవ్గొరొడ స్టేడియంలో సోమవారం జరిగిన గ్రూప్ ఎఫ్ మ్యాచ్లో స్వీడన్ చేతిలో 1-0 తేడాతో పరాజయం పొందింది. దీంతో స్వీడన్ వరల్డ్ కప్లో బోణి చేసింది.
కెప్టెన్ ఆండ్రియాస్ గ్రాన్క్విస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చివరిదాకా పోరాడి ఓడిన దక్షిణ కొరియా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.ఫస్టాఫ్లో రెండు టీమ్స్ ఒక్క గోల్ కూడా చేయలేదు. దీంతో ఫుట్బాల్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.సెకండాఫ్ 65వ నిముషం వద్ద స్వీడన్కు పెనాల్టి కిక్ చేసే అవకాశం లభించింది. టీమ్ స్కిప్పర్ గ్రాన్క్విస్ట్ ఆ అవకాశాన్ని అద్భుతంగా మలచుకొని గోల్ చేశాడు. స్వీడన్కు 1-0 ఆధిక్యతను సంపాదించి పెట్టాడు. ఆఖరిదాకా అదే ఆధిక్యతను కొనసాగించిన స్వీడన్ వరల్డ్ కప్లో మొదటి గెలుపును నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్స్లో మాజీ చాంపియన్ ఇటలీని కంగు తినిపించిన స్వీడన్ పదేళ్ళ తర్వాత వరల్డ్ కప్కు క్వాలిఫై అయ్యింది. 2006 వరల్డ్ కప్లో 16వ రౌండ్లో జర్మనీ చేతిల నాకౌటైంది. అండర్ డాగ్గా వరల్డ్ కప్ బరిలోకి దిగిన దక్షిణ కొరియాకు సమీకరణలు మార్చే సత్తా ఉంది. అతి కష్టమ్మీద క్వాలిఫై అయ్యింది.
Last Updated 19, Jun 2018, 11:16 AM IST | 2sports
|
Visit Site
Recommended byColombia
భారత క్రికెటర్లకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ విందు ఇచ్చిన సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రిషబ్ పంత్ను పరిచయం చేస్తుండగా.. ‘ఇతను నాకు ఎందుకు తెలియదు.. పంత్.. నీవు స్లెడ్జ్ చేశావ్ కదా. నీ స్లెడ్జింగ్ను స్వాగతిస్తున్నాను. ఆటతో పాటు మేం ఇలాంటి రసవత్తర పోరునే ఇష్టపడతాం’ అని ప్రధాని మోరిసన్ అనడంతో Ind Vs Aus: పంత్ స్లెడ్జింగ్పై స్పందించిన ఆస్ట్రేలియా ప్రధానిపంత్తో పాటు అక్కడున్న వారు గట్టిగా నవ్వేశారు.
మెల్బోర్న్లో జరిగిన కీలకమైన మూడో టెస్ట్లో ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్, భారత కీపర్ పంత్ల మధ్య స్లెడ్జింగ్ జరగడం తెలిసిందే. పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ‘జట్టులోకి ధోని వచ్చాడు. ఇక నువ్వు ఇక్కడే మా బిగ్బాష్ లీగ్ ఆడుకో. మా దేశంలో సెలవులను అస్వాదించు. నువ్వు మా ఇంట్లో బేబీ సిట్టర్గా ఉంటే మేమిద్దరం సినిమాని ఎంజాయ్ చేస్తామంటూ’ ఆసీస్ కెప్టెన్ పైన్ స్లెడ్జింగ్ చేశాడు. ‘మనం ఓ ప్రత్యేక అతిథిని చూస్తున్నాం. పెద్దగా బాధ్యతలేని పని. అదే తాత్కాలిక కెప్టెన్’ అని పంత్ సైతం ఘాటుగానే బదులిచ్చాడు.
చివరిదైన నాలుగో టెస్ట్ సిడ్నీలో గురువారం (జనవరి 3) నుంచి ప్రారంభం కానుంది. 2-1తో ఆధిక్యంలో ఉన్న విరాట్ కోహ్లీ సేన సిడ్నీ టెస్టులో నెగ్గి సిరీస్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలని భావిస్తోంది.
Read: ఆసీస్ కెప్టెన్ కవ్వింపులకి రిషబ్ పంత్ కౌంటర్..!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
internet vaartha 251 Views
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 300కుపైగా ఔషధాలపై విధించిన నిషేధం ఆయుర్వేద ఉత్పత్తులకు కలిసొస్తుందన్న అంచనాలు పెరిగాయి. ప్రత్యేకించి ఆయుర్వేద దగ్గుమందులు, జలుబు మందులపై ఎక్కువ ప్రచారానికి ఆయుర్వేద కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. డాబర్ కంపెనీ ఇటీవలే తన దగ్గు ముందుడాబర్ హానిటస్పై విస్తృత ప్రచారం ప్రారంభించింది. ఫిక్సెడ్డోస్ కాంబినేషన్ మందుల్లో మూడొందలకుపైగా ఉత్ప త్తులను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిలో అధిక భాగం దగ్గు ముందులు, జలుబు మందులే ఎక్కువ ఉన్నా యి. వచ్చే వారం ఆయుర్వేద ఉత్పత్తిదారుల సంఘం ముంబై లో సమావేశం అయి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న అంశంపై విస్తృత చర్చలు జరుపుతుందని అంచనా. కస్టమర్లకు ఆయుర్వేదం ద్వారా పూర్తి భద్రత ఉంటుందన్న విశ్వాసం పెంపొందించాలని, ఎటువంటి ఆరోగ్యహాని, దుష్ఫ లితాలు ఉండబోవని వివరించేందుకు కృషిచేస్తున్నాయి. బైద్య నాధ్ చరక్, హిమలాయ డ్రగ్కంపెనీ, డాబర్ ఇలాంటి వన్నీ ఆయుర్వేద మందులనే ఉత్పత్తిచేస్తున్నాయి. ఎఫ్డిసి నిషేధం కేవలం కొద్దికాలంపాటు మాత్రమే కొనసాగుతుందని, ఈ కాలంలో ఆరోగ్యఉత్పత్తుల మార్కెటింగ్ను విస్తృతం చేసుకోవా లన్న లక్ష్యంతోఉన్నాయి. ఆయుర్వే ఉత్పత్తుల టర్నోవర్ సుమా రు 500 కోట్లకుపైబడి ఉంటున్నదని తెలిసింది. వాస్తవానికి ఎక్కువ ఆయుర్వేద ఉత్పత్తిదారులు దేశంలో 300నుంచి 500 కోట్లటర్నోవర్తో ఉన్నారు. సాంప్రదాయ ఇంగ్లీషు మందులతో సమానంగా వీటి టర్నోవర్కంపెనీలు కూడా ఉన్నట్లు తెలు స్తోంది. ప్రస్తుతం ఆయుర్వేఉత్పత్తుల మార్కెట్సైజ్ 25 వేల కోట్లకుపైబడి ఉంటుందని అంచనా. సంఘటిత రంగంలో 12 శాతం, చిన్న అసంఘటితరంగంలో 88శాతం, వార్షికవృద్ధి 10 -15శాతంతో ఉందని అంచనావేస్తున్నారు. ఇతర మందులపై నిషేధం విధించిన కారణంగా ఆయుర్వేద మందుల టర్నోవర్ 20-25శాతంగా ఉటుందని అంచనా వేస్తున్నారు. చరక్ఫార్మా ఎండి నిమిష్ ష్రాప్ మాట్లాడుతూ 25వేల కోట్ల టర్నెవర్ఉన్న ఆయుర్వేద మార్కెట్ ఎక్కువగా కోటి రూపాయలకంటే తక్కువ టర్నోవర్ ఉన్న అసంఘటిత చిన్నమార్కెట్ల చేతుల్లోనే ఉందని ఆందళన వ్యక్తంచేశారు. ఆయుర్వేదిక్ డ్రగ్ మార్కెట్లో 88శాతం వాటా వీరిదేనని, కేవలం రెండు శాతం మాత్రమే టాప్ సంస్థలు ఉన్నాయని, ఎనిమిది శాతం మధ్యస్థాకేటగిరీ కంపెనీలు ఉన్నట్లుఆయన తెలిపారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేద, సహజవనరులనుంచి వైద్యానికి ప్రాధా న్యం, ఆదరణ పెరుగుతుండటంతో రానురాను మార్కెట్ పెరు గుతోంది. గడచిన రెండేళ్లలో భారీ ఎత్తున ఆయుర్వేదకు మార్కెట్ పెరిగిందన్నది వాస్తవం. డాబర్ ప్రతినిధి దుగ్గల్ మాట్లాడుతూ డాక్టర్ల సిఫారసులు కూడా కొంతమార్కెట్కు ఊతం ఇస్తాయని, చైనాతరహాలో కాకుండా ప్రత్యామ్నాయ అల్లోపతి వైద్యం మరింతగాపెరగాల్సి ఉందని అన్నారు భారత్ లో ఇలాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ వృద్ధి చెందలేనదన్నారు. ఉదాహరణకు ఎంబిబిఎస్ప్రోగ్రామ్ కేవలం ప్రత్యామ్నాయ అల్లోపతి వైద్యం మాత్రమే భోధిస్తుందని, మొదటిరెండేళ్ల తర్వాత ప్రత్యేకాంశాలకు మారతాయని అన్నారు. ఆ తర్వాత సగం కాలం డాక్టర్ల సిఫారసులు, ప్రాధాన్యతల ఆధారంగా పెరుగుతుందని అన్నారు. అయితే ఆయుర్వేదంలో అలా ఉండదని, అన్ని వనమూలికలు, అన్ని వనరులకు సమాన ప్రాతినిధ్యం ఉంటున్నందున అల్లోపతితో సమానంగా ఓ ఆయుర్వేదకు కూడా ఆదరణ లభిస్తున్నదన్నారు. ఇటీవలి నిషేధం ఆయుర్వేద మందులకు కొంతవరకైనా మార్కెట్ పెంచు తుందన్న ధీమాను ఈకంపెనీలు వ్యక్తంచేస్తున్నాయి. మాన వాళి ఆరోగ్యానికి చేటుతెచ్చే మిశ్రమాలు అధికంగా ఉన్నా యన్న అంశంపై ప్రముఖ కంపెనీల దగ్గుమందులు సైతం నిషేదానికి గురయ్యాయి. అలాగే విక్స్యాక్షన్ 500 ప్లస్, కోరెక్స్ వంటి దగ్గుమందులపై కూడా కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డ్రగ్ కంట్రోల్జనరల్ ఆఫ్ ఇండియా నిషేధం ప్రకటించింది. సుమారు 300కుపైగా ఈ మందులు ఉండ టంతో అదే రుగ్మతలకు సంబంధించి వివిధఆయుర్వేద మం దులు కూడా ఉత్పత్తి అవుతున్నాయి. అయితే అల్లోపతిలో లభించే తక్షణ ఉపశమనం ఆయుర్వేదలో లభిస్తుందా అన్న ప్రశ్నలు ఎక్కువ పీడిస్తుండటంతో ఎక్కువశాతం ఆల్లోపతికే ఓటువేస్తున్నారు అయితే ఆయుర్వేద మందులు వాడితో రోగ న్ని సమూలంగా నిర్మూలిస్తుందన్న వాదన ఇప్పటికీ ఆరోగ్య ప్రపంచంలోఉంది. అందుకే ప్రభుత్వాలు ఆయుష్పేరిట సాం ప్రదాయ వైద్యపద్ధతులను ఇప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. | 1entertainment
|
ఐసీసీ చీఫ్గా శ్రీనీ?
- బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మనోగతం
ముంబయి : జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల అనుగుణంగా బీసీసీఐ నూతన పాలక మండలిని ఎన్నుకుని రెండు రోజులైనా గడువక ముందే.. బోర్డులో పాత రాజకీయాలు మొదలయ్యాయి. 70 ఏండ్ల పైబడిన వారు బీసీసీఐ, రాష్ట్ర సంఘాల్లో పదవులు చేపట్టేందుకు అనర్హులు. బీసీసీఐ, ఐసీసీ మాజీ బాస్ ఎన్ శ్రీనివాసన్ కోసం గంగూలీ సారథ్యంలోని బీసీసీఐ రాజ్యాంగానికి కీలక సవరణ చేసే అవకాశం కనిపిస్తోంది. బీసీసీఐలో బలమైన నాయకత్వం లేని సమయంలో ఐసీసీలో భారత్కు తీరని నష్టం వాటిల్లింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్వయంగా భారత్కు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) ఆదాయంలో 70 శాతం భారత మార్కెట్ నుంచి లభిస్తోంది. ఐసీసీ ఆదాయంలో సింహభాగం వాటా భారత్కు దక్కాలని ఎన్. శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్గా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని శశాంక్ మనోహర్ రద్దు చేశారు. ఐసీసీలో బీసీసీఐ ఆధిపత్యం, ఆదాయ వాటా తిరిగి కోరుకుంటున్న భారత్ మరోసారి ఎన్. శ్రీనివాసన్ను ఐసీసీలో చూడాలనుకుంటోంది. దీనిపై నూతన ఆఫీస్ బేరర్లలో ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం. ఐసీసీ రాజకీయం తెలిసిన శ్రీనివాసన్ను బీసీసీఐ ప్రతినిధిగా పంపితే, భారత ప్రయోజనాలను కాపాడగలడని ఆఫీస్ బేరర్లు విశ్వసిస్తున్నారు. ఐసీసీ తదుపరి సమావేశం 2020 ఫిబ్రవరిలో జరుగనుంది. శ్రీనివాసన్ను భారత ప్రతినిధిగా పంపేందుకు సమయం ఉన్నప్పటికీ.. రానున్న ఎన్నికల్లో అతడిని చైర్మన్ రేసులో నిలిపేందుకు బీసీసీఐ యోచిస్తోంది. ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 2sports
|
Hyderabad, First Published 10, Sep 2019, 6:25 PM IST
Highlights
సీనియర్ హీరోయిన్ సంఘవి వెండితెరపై ఓ నటి. 90వ దశకం నుంచి 2000 తర్వాత కూడా హీరోయిన్ గా కొనసాగింది. తెలుగు లో తాజ్ మహల్ చిత్రంతో సంఘవి ఎంట్రీ ఇచ్చింది. సంఘవి కర్ణాటకలో పుట్టి పెరిగిన మహిళ. తాజ్ మహల్ చిత్రంలో మెప్పించడంతో సంఘవికి తెలుగులో అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కింది.
2016లో సంఘవి వివాహబంధంతో స్థిరపడింది. ఇటీవల వెండి తెరపై సంఘవి ఎక్కువగా కనిపించడం లేదు. సంఘవి తాజాగా ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొంది. ఆ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమెడియన్ అలీకి తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ముఖ్యంగా సంఘవి బాలకృష్ణ గురించి చెప్పిన ఓ విషయం ఆసక్తిగా మారింది. మొదటగా తనకు బాలకృష్ణ తో నటించే అవకాశం సమరసింహారెడ్డి చిత్రంతో వచ్చిందని సంఘవి తెలిపింది. ఆ చిత్రంలో బాలయ్యతో కలసి నటించాలంటే నాకు భయం వేసింది. ఎందుకంటే బాలయ్యకు చాలా కోపం అని విన్నా. షూటింగ్ సమయంలో ఎలా రియాక్ట్ అవుతారనే టెన్షన్ నాలో ఉండేది.
కానీ బాలకృష్ణగారే తన భయాన్ని పోగొట్టారని సంఘవి తెలిపింది. సెట్స్ లో నేనే ఒంటరిగా కూర్చుని ఉన్నా. ఎందుకు దూరం దూరంగా ఉంటున్నావు అని బాలయ్య అడిగారు. మీకు కోపం అని విన్నాను సర్.. అందుకే ఇలా అని చెప్పా. దానికి ఆయన నవ్వుతూ నాకు అసలు కోపమే రాదు అని అన్నారు.
ఆయనే స్వయంగా వచ్చి ఆ మాట చెప్పడంతో నా భయం పోయింది. ఎలాంటి బెదురు లేకుండా సినిమాలో నటించా. ఆ తర్వాత గొప్పింటి అల్లుడు చిత్రంలో కూడా ఆయనతో కలసి నటించానని సంఘవి గుర్తుచేసుకుంది.
Last Updated 10, Sep 2019, 6:25 PM IST | 0business
|
Visit Site
Recommended byColombia
1900లో పారిస్లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో చివరిసారిగా క్రికెట్ ఆడారు. మళ్లీ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ను చేర్చడం కోసం ఐసీసీ ప్రయత్నాలు చేస్తోంది. 2028లో లాస్ ఏంజిల్స్ ఆతిథ్యం ఇవ్వనున్న ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు దక్కుతుందని ఐసీసీ ఆశాభావంతో ఉంది.
కామన్వెల్త్ గేమ్స్ విషయానికి వస్తే.. 1998లో తొలిసారి క్రికెట్ ఆడారు. దక్షిణాఫ్రికా పురుషుల జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత కామెన్వెల్త్ క్రీడల్లో క్రికెట్కు అవకాశం కల్పించలేదు. 2022లో బర్మింగ్హమ్ వేదికగా జరగబోయే కామన్వెల్త్ గేమ్స్లో టీ20 ఫార్మాట్లో మహిళ క్రికెట్కు చోటు కల్పించాలని కోరుతూ ఐసీసీ బిడ్ వేసింది.
ఏసియన్ గేమ్స్, కామన్వెల్త్ తదితర అంతర్జాతీయ ఈవెంట్లలో క్రికెట్ను చేర్చేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సుముఖంగా ఉన్నప్పటికీ.. బీసీసీఐ మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదు. బీసీసీఐకి స్వయం ప్రతిపత్తి హోదా ఉంది. ఒకవేళ ఈ పోటీలకు మన క్రికెట్ జట్టును పంపితే.. మనదేశ ఒలింపిక్ కమిటీకి బీసీసీఐ జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది.
అందుకే ఊపిరి సలపని షెడ్యూల్ ఉందనే కారణంతో గ్వాంగ్జౌ, ఇంచియాన్ ఆసియా క్రీడలకు క్రికెట్ జట్టును పంపలేదు. కానీ 2022 నాటికి బీసీసీఐని ఒప్పిస్తామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆశాభావంతో ఉంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
హెచ్ 1 బీ వీసా గడువు ముగిస్తే.. వెనుదిరగాల్సిందేనా ఇక!
వీసా గడువు తీరిపోయిన వారు వీసా పొడిగింపు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏవైనా కారణాల వల్ల అవి తిరస్కరణకు గురైతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.
Samayam Telugu | Updated:
Oct 1, 2018, 01:14PM IST
హెచ్ 1 బీ వీసా గడువు ముగిస్తే.. వెనుదిరగాల్సిందేనా ఇక!
అమెరికా ప్రభుత్వం గతంలో ప్రకటించిన కొత్త 'ఇమ్మిగ్రేషన్' విధానం సోమవారం (అక్టోబరు1) నుంచి అమల్లోకి రానుంది. 2013లో ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన నిబంధన స్థానంలో.. ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం వల్ల 'హెచ్1-బీ' వీసాపై అమెరికా వెళ్లిన నిపుణులు అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కోనున్నారు. ఈ నిబంధన ప్రకారం.. వీసా గడువు తీరిపోయిన వారు వీసా పొడిగింపు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏవైనా కారణాల వల్ల అవి తిరస్కరణకు గురైతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ విధాన ప్రభావం అమెరికాలోని దాదాపు 7లక్షల మంది భారతీయులపై పడనుంది.
వారికి కాస్త ఊరట
అయితే ఈ కొత్త నిబంధన ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారికి, దరఖాస్తు పెండింగ్లో ఉన్నవారికి మాత్రం వర్తించదు. ఇటీవలి కాలంలో హెచ్–1బీ వీసా పొడిగింపు కోసం వచ్చిన దరఖాస్తులు భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో అధికశాతం భారతీయులవే ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక హెచ్–1బీ వీసాదారులకు నోటీసులు జారీచేయమని అమెరికా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో ఆ వీసా కలిగి ఉన్న భారతీయులకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.
అక్రమంగా నివసించేవారికి 'ఎన్టీఏ' జారీ
సాధారణంగా వీసా గడువు తీరిన తర్వాత సగటున 240 రోజులు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి ఉంది. ఆలోపు వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురైతే వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి. అలా కాకుండా అనధికారికంగా అక్కడే నివసించే వాళ్లకి యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్(యూఎస్సీఐఎస్) విభాగం ‘నోటీస్ టు అప్పియర్(ఎన్టీఏ)' జారీ చేస్తుంది. ఇది జారీ చేసిన తర్వాత సదరు ఉద్యోగులు ఉద్యోగంలో కొనసాగడానికి వీలుండదు. దీనిపై విచారణ జరిగే వరకు మాత్రమే అమెరికాలో ఉండటానికి అవకాశం ఉంటుంది. దీని ప్రకారం వీసా గడువు తీరిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి ఉంటుంది.
గరిష్ఠంగా ఐదేళ్ల నిషేధం
విచారణ సమయంలో సదరు వ్యక్తి అమెరికాలో లేనట్లయితే అతనిపై గరిష్ఠంగా ఐదేళ్ల పాటు అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తారు. వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక కూడా ఏడాదిపాటు అమెరికాలో అనధికారికంగా నివసిస్తే వారిపై పదేళ్లపాటు నిషేధం అమలు చేస్తారు. వీసా గడువు పెంచుకోవడానికి లేదా, తమ స్టేటస్ మార్పుకోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైతే సదరు వ్యక్తులు వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. వీళ్లకి ఎన్టీఏ నోటీసులు జారీ చేయరు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Recommended byColombia
#SAvAUS This nudge between Rabada and Smith will no doubt be reviewed by the match referee pic.twitter.com/2ln0tmTOln
— Michael Sherman (@Golfhackno1) March 9, 2018
మైదానంలో ఇలా ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఆటగాడ్ని గాయపర్చేందుకు ప్రయత్నిస్తే.. అతనిపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. రబాడ చేసిన తాజా తప్పుకి అతని మ్యాచ్ ఫీజులో భారీ కోతతో పాటు అతని ఖాతాలో కనీసం మూడు డీమెరిట్ పాయింట్లు చేర్చే అవకాశముంది. గత ఏడాది రెండు సందర్భాల్లో రబాడ ఇలా క్రమశిక్షణ తప్పడంతో ఐదు పాయింట్లు చేరాయి. శ్రీలంక క్రికెటర్ డిక్వెల్లాతో ఒక మ్యాచ్లో, ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్స్టోక్స్తో ఒక టెస్టులో రబాడ హద్దులు మీరి ప్రవర్తించడంతో గత ఏడాది ఐసీసీ అతనికి జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్లు చేర్చింది. తాజా తప్పుతో అతని ఖాతాలో మరో పాయింట్ చేరినా.. కనీసం రెండు టెస్టులు సస్పెన్షన్ వేటు పడే అవకాశముంది. అదే జరిగితే.. ఆస్ట్రేలియా మిగిలిన రెండు టెస్టులకి రబాడ దూరమవ్వాల్సి వస్తుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 118 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
internet vaartha 143 Views
న్యూఢిల్లీ : కంపెనీల పనితీరు, సంస్థల ఆర్థిక పరిపుష్టికి మరింతగా కృషిచేసి కార్పొరేట్ వృద్ధికి కీలకం అవుతుండటంతో భారత్లోని కంపెనీల సిఇఒల జీతభత్యాలు రెట్టింపు అవుతున్నాయి. సిఇఒ సగటు వార్షిక వేతనం రూ.20 కోట్ల రూపాయలుగా ఉంది. రెండేళ్లక్రితం ఈ సగటు రూ.10 కోట్లుగా ఉంది. అమెరికాలోని జాబితాఅ యిన భారీ కంపెనీల సిఇఒలను చూస్తే 1/6వంతుగా ఉన్నట్లు అంచనా. అమెరికాలో సగటు సిఇఒ వేతనం 130 కోట్లు డాలర్లలో చూస్తే 20 మిలియన్ డాలర్లుగా ఉంటుంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కొంత తగ్గింది కూడా అయినా అమెరికాతో పోలిస్తే భారత్లో సిఇఒల జీతభత్యాలు తక్కువే. భారత్ఓప్రైవేటు కంపెనీల్లో సిఇఒల సగటు వేతనం ప్రభుత్వరంగ కంపెనీలతో పోలిస్తేసమాంతరంగాఉంది. రూ.25-30 లక్షలుగా ఉన్నట్లుఅంచనా. స్టాక్ ఎక్ఛేంజిల్లో జాబితా అయిన టాప్ కంపెనీల్లోని సిఇఒల వేతనాలు చూస్తే మొత్తంగా పరిహారం టాప్ ఎగ్జిక్యూటివ్లకు రూ.19 కోట్లకు మించి లేదని స్పష్టంఅవుతోంది. ఈమొత్తంలో వేత నం, కమిషన్లు,భత్యాలు, ఎంప్లాయీ స్టాక్ ఆప్ష న్స్ వంటివి కూడి ఉన్నాయి. సిఇఒలతోపాటు, ఎగ్జి క్యూటివ్ చైర్పర్సన్స్, ఎండిలువంటి వారికి భారీ పరి హారం లభిస్తోంది. మొత్తం 24ప్రైవేటు కంపెనీల్లో 20 కంపెనీలను సర్వేచేస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూసాయి. సెన్సెక్స్లోని ప్రభుత్వరంగసంస్థల్లో ఆరు సంస్థలు గణాంకాలు లభించాయి. భారతీయ స్టేట్ బ్యాంకుపరంగాచూస్తే ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య వేతనం 31.1లక్షలుగా ఉంది. ఇతరప్రైవేటు రంగ దిగ్గజాలపరంగా ఎల్అండ్టి ఎఎంనాయక్ 66.14 కోట్లు ఆర్జించారు. ఈ మొత్తంలో 39 కోట్లు భత్యాలు, ఇతర అలవెన్సుల రూపంలోనే ఉన్నాయి. ఇన్ఫోసిస్ విశాల్ సిక్కా 48.73 కోట్లుగా ఉంది. లూపిన్ దేశ్బంధుగుప్తా 44.8కోట్లవరకూ ఉన్నట్లు అంచనా. బ్యాంకుల ఎండిసిఇఒల వేతనాలు ఒకింత తక్కువగా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకు శిఖాశర్మకు 5.5 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంకు చందాకొచ్చర్కు 6.6 కోట్లు, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆదిత్యపూరికి 9.7కోట్లు ప్యాకేజి లభిస్తోంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డిఎఫ్సి ఛైర్మన్ దీపక్ పరేఖ్ 1.89 కోట్లు, వైస్ఛైర్మన్ సిఇఒ కేకీ మిస్త్రీ 9.3కోట్లు ఎండి రేణుసూద్ కర్నాడ్ 8.5 కోట్లు ప్యాకేజిలో ఉన్నారు. నాలుగు కంపెనీలకు సంబంధించి సమాచారం ందలేదు. సన్ఫార్మా, మారుతి, హీరోమోటోకార్ప్, సిప్లా కంపెనీల గణాంకాలు అందుబాటులోలేవు. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
సిరీస్లో 4 టెస్టులాడిన మిచెల్ స్టార్క్ 7 ఇన్నింగ్స్ల్లో కలిపి మొత్తం 13 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. మరోవైపు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 21 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో.. భారీ అంచనాలున్న స్టార్క్ విఫలమవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
టెస్టు సిరీస్లో తనతో అతిగా కవ్వింపులకి దిగినప్పటికీ మిచెల్ స్టార్క్కి తాజాగా కోహ్లీ మద్దతుగా నిలిచాడు. ‘ఆస్ట్రేలియా టీమ్లో అగ్రశ్రేణి పేసర్గా కొనసాగుతున్న మిచెల్ స్టార్క్పై మీ విమర్శలతో ఇంకా ఒత్తిడి పెంచుతున్నారు. అతను చాలా నైపుణ్యమున్న బౌలర్. జట్టుని ఒంటిచేత్తో గెలిపించే సామర్థ్యం ఉన్న అలాంటి బౌలర్ని మాటలతో బాధపెట్టి.. చేజార్చుకోకండి’ అని విరాట్ కోహ్లీ సూచించాడు.
మిచెల్ స్టార్క్ అన్న మిచెల్ జాన్సన్తో 2014-15 పర్యటనలో విరాట్ కోహ్లీ పెద్ద ఎత్తున పోటాపోటీగా కవ్వింపులకి దిగాడు. వాస్తవానికి ఆ కవ్వింపుల కారణంగానే విరాట్ కోహ్లీలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ వెలుగులోకి వచ్చాడు. తాజా పర్యటనలోనూ జాన్సన్ తరహాలో కాకపోయినా.. స్టార్క్ తనదైన కవ్వింపు చూపులతో విరాట్ కోహ్లీతో పాటు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే.. లయ తప్పిన అతని బౌలింగ్ని భారత్ బ్యాట్స్మెన్ ఉతికారేశారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
బి2బి పోర్టల్తో మరింత మార్కెట్ వాటా
పాల్రెడ్ టెక్నాలజీస్ ఛైర్మన్ శ్రీకాంత్రెడ్డి
హైదరాబాద్ : భారత్లో నంబర్వన్ ఆన్లైన్ టెక్ యాక్ససరీస్ సంస్థగా ఎదిగిన లేటెస్ట్ వన్ డాట్కామ్ తాజాగా బి2బి పోర్టల్ను విడుదల చేసింది మొబైల్, టెక్ ఉపకరణాల విక్రయాలకు రిటైలర్లకు అందుబాటులోనికి తెచ్చేందుకు బి2బి పోర్టల్ ఎంతో ఉపకరిస్తుందని కంపెనీ సిఇఒ అమీన్ క్వాజా వెల్లడించారు ఇప్పటికే దేశంలో తాము పదివేల ప్రాంతాలకు చేరువ కాగలిగామని, 1.5 మిలియన్ ఆర్డర్లను ప్రాసెస్ చేస్తున్నట్లు పాల్ రెడ్ టెక్నాలజీస్ ఛైర్మన్ పి.శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు. తాజాగా లేటెస్ట్వన్ డాట్కామ్ 1.25 లక్షల మంది తమ వెబ్సైట్ను వీక్షిస్తున్నారని, రోజుకు కనీసం నాలుగువేలకుపైగా ఆర్డర్లు వస్తున్నట్లు వివరించారు. ఈ త్రైమాసికం ముగిసేలోపే 20 లక్షల మందికి కస్టమర్లబేస్ను పెంచుకోగలమని ఆయన ధీమా వ్యక్తంచేసారు. ఈ ఆర్థికసంవత్సరం ముగిసేలోపు తమ బి2బి పోర్టల్ ద్వారా వెయ్యి మంది రిటైలర్లను రిజిష్టరు చేసుకోవడంతో పాటు పదివేల ఔట్లెట్లను మూడేళ్లలోపే చేరుకునేదిశగా కృషిచేస్తున్నట్లు వివరించారు. బి2బి పోర్టల్పరంగా లేటెస్ట్వన్డాట్కామ్పై రిటైలర్ కనిష్టంగా మూడు వేల రూపాయలు ఆర్డరుతో కొనసాగించే వీలుందని సిఇఒ అమీన్ క్వాజా వివరించారు. తమ ఉత్పత్తుల కేటలాగ్పై పదివేలకుపైగా మొబైల్ టెక్ ఉపకరణాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో భారీ గిడ్డంగుల వ్యవస్థ ఉందని, మరికొన్ని నగరాలకు సత్వరమే విస్తరిస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం మొబైల్ ఉపకరణాలమార్కెట్ రూ.18వేల కోట్లరూపాయలుగాఉందని, దేశంలో 70వేలకుపైగా ఔట్లెట్లు పనిచేస్తున్నట్లు శ్రీకాంత్రెడ్డి వివరించారు. వీటిలో పదివేల ఔట్లెట్లు సంఘటితరంగం, కార్పొ రేట్ రేతుల్లో ఉన్నాయని మిగిలిన 60వేల స్టోర్లు ఎంఎస్ఎంఇ రంగంలో ఉన్నట్లు ఆయన వివరిం చారు. లేటెస్ట్వన్ డాట్కామ్ తాజాగా ఈ ఏడాది చివరినాటికి 1000 మంది రిటైలర్లను రాబట్టాలని లక్ష్యం నిర్దేశించామని, ఈ ఏడాదిచివరినాటికి పది వేల ఔట్లెట్లకు పెంచుతామని అన్నారు. సత్వరమే ఇందుకోసం మొబైల్యాప్ను కూడా విడుదలచేసే లక్ష్యంతో ఉన్నట్లు శ్రీకాంత్రెడ్డి, అమీన్క్వాజాలు వివరించారు. సంస్థకు ఇటీవలే ఇటి సంస్థనుంచి అత్యుత్తమ పారిశ్రామికవేత్తగా లేటెస్ట్వన్ తరపున అవార్డు సాధించినట్లు అమీన్ క్వాజా వివరించారు. | 1entertainment
|
internet vaartha 202 Views
ముంబై : ఆటలో పాలిటిక్స్ను మిక్స్ చేస్తున్నారం టూ క్రికెట్ సెలక్షన్ కమిటీలపై మండిపడుతున్నారు నెటిజన్లు. ప్రముఖ క్రికెటర్ సచిన్ కుమారుడు అర్జున్ని అండర్-19 జట్టుకు ఎంపిక చేయడం నెటిజెన్స్ తాజా ఆగ్రహానికి కేంద్ర బిందువుగా మారింది. అధికారికంగా, ప్రత్యేకించి ఎవరూ అర్జున్పై ఎలాంటి ఆరోపణలు చేయన ప్పటికి సోషల్ మీడియాలో నెటిజన్స్ లేవనెత్తిన చర్చ హాట్ టాపిక్గా మారింది.అండర్-19 జట్టుకు అర్జున్ను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ కమిటీ మహారాష్ట్ర స్కూల్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్ ద్వారా వెయికి పైగా పరుగులు సాధించిన ప్రణవ్ ధన్వాడేను మాత్రం ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు.దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని కూడా రూపొందించిన కొంత మంది నెటిజన్స్ సోషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.అర్జున్…. నీలాగా నా తండ్రి మాజీ క్రికెటర్ హోదా లేదు,ఆయన ఒక సాధారణ ఆటోడ్రైవర్,నీలాగా సెలక్టర్లను మేనేజ్ చేయడం నాకు రాదు,ఎందుకంటే నా కుటుంబానికి,తల్లిదండ్రులకు అంత స్థోమత లేదు.అదీగాక నేలా నేను అగ్ర కులానికి చెందిన వాడిని కూడా కాదు,నాకంటూ ఉన్నతి ప్రతిభ మాత్రమే.అందుకే సెలక్షన్ కమిటీకి నేను గుర్తు రాలేదు అంటూ ప్రవీణ్ ధన్వాడే ఆవేదన చెందుతున్నట్లుగా రూపొందించిన ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్గా విస్తరిస్తుంది. దీనిపై స్పందించిన ప్రవీణ్ ధన్వాడే తండ్రి ప్రశాంత్ ధన్వాడే మాత్రం సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణ లను ఖండించాడు. అర్జున్పై ఇలాంటి ప్రచారం చేయ డం సబబు కాదని సూచించారు. ఇంకా అం డర్-16లో కూడా ఆడని తన కుమారుడిని అప్పుడే అండర్-19లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.అర్జున్,ప్రణవ్ ఇద్దరు మంచి మిత్రు లని ఇలాంటి నెగెటివ్ ప్రచారం వాళ్లిద్దరి కేరీర్ని ఒత్తిడిలోకి నెడుతుందన్నాడు. ఇలాంటి ఆరోపణలు ఎంతమాత్రం సరికాదని చెప్పిన అయన అర్జున్,ప్రణవ్ ప్రతి రోజు మాట్లాడుకుంటారని ఈ ప్రచారం శ్రుతిమించితే వాళ్లిద్దరిపై ఒత్తిడి పెరుగుతుందన్నాడు.దీనిపై స్పందించిన వారి కోచ్ కూడా నెటిజన్ల ఆరోపణలను తప్పుబట్టారు. జట్టు లో మిగతా పది మందిని వదిలేసి కేవలం అర్జున్ పైనే నెగెటివ్ ప్రచారం చేయడమేంటని నిల దీశాడు. | 2sports
|
Nov 19,2016
మరో ఐదు సహారా ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: మదుపర్ల నుంచి భారీగా నిధులు సమీకరించి తిరిగి చెల్లించడంలో విఫలమైన సహారా గ్రూపు ఆస్తులను మరోసారి వేలం వేయడానికి మార్కెట్, పెట్టుబడుల నియంత్రణ సంస్థ సెబీ కసరత్తు చేస్తోంది. సహారాకు చెందిన 5 భూముల వేలానికి రంగం సిద్ధం చేసింది. వీటి రిజర్వు ధర రూ.130కోట్లుగా అంచనా వేసింది. ఎస్బిఐ క్యాప్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 28న రూ.102 కోట్ల రిజర్వు ధరతో మూడు ఆస్తులను వేలం వేయనుంది. అదే విధంగా డిసెంబర్ 27న హెచ్డిఎఫ్సి రియాల్టీ రూ.29 కోట్ల రిజర్వు ధర కలిగిన రెండు ప్రాపర్టీలను వేలానికి పెట్టామని సెబీ వేరు వేరు నోటీసుల్లో తెలిపింది. నిబంధనలకు విరుద్దంగా రూ.25,000 కోట్లకు పైగా నిధులు సమీకరించిన సహారా గ్రూపు వాటిని చెల్లించడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ కేసులో సహారా చీఫ్ సుబ్రతో రారు జైలు కెళ్లారు. ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. కాగా ఈ కేసులో దేశవ్యాప్తంగా సహారాకు ఉన్న 61 సహారా ఆస్తులను వేలం వేయడం ద్వారా రూ.6,500 కోట్ల నిధులను రాబట్టుకోవాలని సెబీ లక్ష్యంగా పెట్టుకుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Dec 05,2018
ఆరు రోజుల లాభాలకు బ్రేక్!
ముంబయి: వరుసగా ఆరు సెషన్లలో లాభాలు కదలాడిని దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలను చవి చూశాయి. రిజర్వు బ్యాంకు ద్రవ్య సమీక్షపై నెలకొన్న ప్రతికూల విశ్లేషణలు, గ్లోబల్ మార్కెట్లో చమురు ధరల పెరగుదల, అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న గందరగోళ పరిణామాలు, డాలర్తో రూపాయి విలువ తగ్గడం తదితర అంశాలు మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 107 పాయింట్లు క్షీణించి 36,134.31కి పడిపోయింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 14.25 పాయింట్లు తగ్గి 10,869.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో 13 స్టాక్స్ లాభపడగా, 17 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఇన్ఫోసిస్ అత్యధికంగా 2.44 శాతం లాభపడగా, ఇదే బాటలో ఎస్బీ ఐ, హెచ్ యుఎల్, టీసీ ఎస్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ స్టాక్స్ రాణించాయి. మరోవైపు సన్ఫార్మా అత్యధికంగా 2.75 శాతం క్షీణించగా ఇదే క్రమంలో ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు అధికంగా నష్టపోయాయి. నిఫ్టీ 50లో 26 స్టాక్స్ నష్టపోగా, 24 స్టాక్స్ లాభపడ్డాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్ సూచీ 0.07త శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.14 శాతం చొప్పున రాణించాయి. ఐటీ, టెక్, ఆయిల్ అండ్ గ్యాస్, లోహ, ఇంధన, వైద్య రంగాల సూచీలకు మదుపర్ల నుంచి మద్దతు లభించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Suresh 94 Views
ఆర్జియోకు కనెక్టివిటీ పోర్టులకు ఎయిర్టెల్ సిద్ధం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: భారతి ఎయిర్టెల్కు ఆర్జియో నుంచి అదనపు ఇంటర్ కనెక్టివిటీ పోర్టు లు ఏర్పాటుచేసేందుకు అవసరమైన చెల్లింపులు అందాయని ఎయిర్టెల్ స్పష్టంచేసిం ది. రెండు కంపెనీలు కూడా పరస్పరం ఒప్పందంపై సంతకాలుచేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఇకపై సం యుక్తంగా పోర్ట్ఆఫ్ ఇం టర్కనెక్షన్స్ను సంయు క్తంగా తనిఖీలు చేస్తాయని ప్రకటించింది. కనెక్షన్, పరీక్ష లు వంటివి రెండూ జాయింట్గా నిర్వహిస్తాయి. పోర్టులను విజయవంతంగా కనెక్ట్ చేసిన తర్వాత పబ్లిక్కు విడుదలవుతాయి. ఎయిర్ టెల్ అదనపు పిఒఐలకోసం ఈనెల 14వ తేదీనే డిమాండ్నోట్లు జారీచేసింది. డిమాండ్నోట్లపై చెల్లింపులను ఆర్జియో నుంచి ఈనెల 15వ తేదీనే అందుకుంది. మరో విడతగా 16వ తేదీ కూడా జియో చెల్లింపులు చేసినట్లు ఎయిర్టెల్ ప్రకటిం చింది. ద్వైపాక్షిక సంప్రదింపుల ఫలితంగా ఈనెల 13వ తేదీ ఎయిర్టెల్ అదనపు పోర్ట్ఆఫ్ ఇంటర్కనెక్షన్స్ (పిఒఐ)లను జారీచేసేం దుకు అంగీకరించింది.తాజా ఒప్పం దంతో మొత్తం పిఒఐలు మూడు రెట్లు ఎక్కువ కేటాయించినట్లవు తుందని 15 మిలియన్లకుపైగా కస్టమర్లకు సేవలందించేందుకు వీలు కలుగుతుందని ఎయిర్టెల్ ప్రకటించింది. ఎయిర్టెల్ తనవైపు నుంచి ఎటువంటి సామర్ధ్యం భారం వంటివిలేవని ఎయిర్టెల్ జియోకు పాయింట్ల ను వాణిజ్యకార్యకలాపాలకు ముందునుంచీ అంది స్తున్నట్లు వెల్లడించింది. ఆర్జియో చెల్లింపులు చేసిన తేదీ నుంచి 90రోజులపాటు ఇంటర్కనెక్ట్ కమిషనర్ వ్యవధి ఉంటుంది. ఆర్జియో కూడా తమతో పూర్తి సహకారం అందిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. | 1entertainment
|
TRIPATI1
పుణేను గెలిపించిన త్రిపాఠి
కోల్కతా 155/8 (20 ఓవర్లు) పుణే 158/6 (19.2 ఓవర్లు) పుణే కట్టుదిట్టమైన బౌలింగ్ కోల్కతా బ్యాట్స్మెన్ పోరాటం వృధా కోల్కతా: పుణే కట్టుదిట్టమైన బౌలింగ్లో కోల్కతా నైట్ రైడర్స్ బుధవారం 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. సొంతగడ్డపై రైజింగ్ పుణే సూపర్్ జెయింట్తో జరిగిన మ్యాచ్లో నైట్ రైడర్స్ తడబడింది.దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు స్కోరుకే చేరింది.పుణే 19.2 ఓవర్లలో 6వికెట్లకు 158 పరుగులు చేసింది. దీంతో కోల్కతాపై పుణే 4 వికెట్లతో విజయం సాధించింది.
కోల్కతాకు చెందిన బ్యాట్స్మెన్ పోరాటం వృధా అయింది.మిడిలార్డర్లో గ్రాండ్ హోం 19 బంతులు ఆడి 3 బౌండరీలు,2 సిక్స ర్లతో 36 పరుగులు చేయగా,సూర్యకుమార్ యాదవ్ 16 బంతులు ఆడి 2 బౌండరీలు,2 సిక్సర్లతో 30 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో పుణేకు 156 పరుగులు టార్గెట్ను నిర్ధేశించగలిగింది.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగులు ఏమి చేయక ముందే తొలి ఓవర్లోనే ఓపెనర్ నరైన్ వికెట్ కోల్పోయింది.అనంతరం నాలుగవ ఓవర్లో షెల్టన్ జాక్సన్ 10 వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో హిట్ వికెట్గా వెనుదిరిగాడు. వేగంగా ఆడుతున్న గంభీర్్ 19 బంతులు ఆడి 3 బౌండరీలు,1 సిక్సర్తో 24 పరుగులు చేసి జట్టు స్కోరు 40వద్ద సుందర్ బౌలింగ్లోనే వెనుది రగడంతో కోల్కతా ఒత్తిడిలో వెళ్లిపో యింది. మనీశ్పాండే 37 పరుగులతో ఇన్నింగ్ నిర్మించేం దుకు పాటుపడినా ఎక్కువ సేపు నిలువలేదు.భారీ షాట్లతో చెలరేగే యూసుఫ్ పఠాన్ 4 పరుగులు చేసి నిరాశపరిచాడు
.ఈ దశలో క్రీజులో ఉన్న గ్రాండ్ హోం,సూర్యకుమార్ జట్టుకు గౌరవప్ర దమైన స్కోరు అందించేందుకు చివరి వరకు పోరాడాడు.ఉనద్కత్ వేసిన 17వ ఓవర్లలో కేవలం ఒక్క పరుగు మాత్రమే రావడం విశేషం.ఉనద్కత్ వేసిన 19వ ఓవర్లో మాత్రం వీరిద్దరు భారీ షాట్లతో విజృంభించి ఏకంగా 21 పరుగులు రాబట్టారు.దీంతో కోల్కతా స్కోరు 150 పరుగుల మార్క్ను దాటింది.కీలకమైన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో నాలుగు పరుగులే రావడంతో 155 పరుగులకే పరిమితమైంది.పుణే బౌలర్లలో ఉనద్కత్,వాష్టింగ్టన్ సుందర్లకు ఒక్కొక్కరికి రెండు వికెట్లు లభించగా బెన్స్టోక్స్,తాహిర్, క్రిష్టియన్లకు ఒక్కొక్కరికి ఒక వికెట్ దక్కింది.
దుమ్మురేపిన త్రిపాఠి:
కోల్కతా నైట్ రైడర్స్ తరువాత బ్యాటింగ్కు దిగిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ బ్యాట్స్మెన్ తిప్రాఠిదుమ్మురేపాడు. ఇక ఓపెనర్ అజింక్యా రహానే 9 బంతులు ఆడి 2 బౌండరీలతో 11 పరుగులు చేసియాదవ్ బౌలింగ్ లో జాక్సన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.మరో ఓపెనర్ త్రిపాఠి 52 బంతులు ఆడి 9 బౌండరీ లు,7 సిక్సర్లతో 93 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్లో పెవిలియన్కు వెళ్లిపోయాడు.స్మిత్ 9 బంతుల ఆడి 1 సిక్సర్తో 9 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్లో పెవిలియన్కు వెళ్లిపోగా,తివారి 9 బంతులు ఆడి 1 బౌండరీతో 8 పరుగులు చేసి వోక్స్బౌలింగ్లో వెనుదిరిగాడు.స్టోక్స్ 15 బంతులు ఆడి 1 బౌండరీతో 14 పరుగులు చేసి నరైన్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలి యన్కు వెళ్లిపోయాడు.ధోని 9 బంతులు ఆడిఇ 5 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో జాక్సన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.క్రిస్టియన్ 10 బంతులు ఆడి 1 సిక్సర్తో 9 పరుగులతో, వాషింగ్టన్ సుందర్ 3 బంతులు ఆడి 1 పరుగుతో నాటౌట్గా ఉన్నారు | 2sports
|
sandhya 292 Views AFG vs PAK , World Cup 2019
AFG vs PAK
లండన్: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ కెప్టెన్ గుల్బదిన్ నైబ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచుల్లో ఆఫ్ఘాన్ ఓటమి పాలైంది. మరోవైపు నాకౌట్ చేరేందుకు పాక్ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ పోరు రసవత్తరం కానుంది.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/nri/ | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నెల గరిష్టానికి బంగారం ధరలు
ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.32,030కి చేరాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు రూ.110పెరిగాయి. దీంతో బంగారం ధరలు నెల రోజుల గరిష్టానికి చేరినట్లయింది
TNN | Updated:
Mar 24, 2018, 06:02PM IST
ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.32,030కి చేరాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు రూ.110పెరిగాయి. దీంతో బంగారం ధరలు నెల రోజుల గరిష్టానికి చేరినట్లయింది. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగి రూ.29,570కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,430 వద్ద ఉంది.
పెరిగిన బంగారం రేట్లు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,570; 24 క్యారెట్ల బంగారం ధర రూ. 31,430గా ఉన్నాయి.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,990; 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,060గా ఉన్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,030గా ఉన్నాయి.
కలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,460గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,060గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,750, 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,430గా ఉన్నాయి.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారంరూ. 29,570 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 31,430గా పలుకుతోంది. | 1entertainment
|
Hyderabad, First Published 13, Mar 2019, 4:13 PM IST
Highlights
టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ గతేడాది 'అరవింద సమేత' సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు.
టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ గతేడాది 'అరవింద సమేత' సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మే నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.
త్రివిక్రమ్ తన సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ ని బాగా చూపిస్తుంటారు. 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అ ఆ', 'అజ్ఞాతవాసి', 'అరవింద సమేత' వంటి సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి. బన్నీతో త్రివిక్రమ్ చేయబోయే సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ తో కూడిన కథ అని సమాచారం.
ఎప్పుడైతే ఈ విషయం బయటకి వచ్చిందో.. అందరూ 'సన్నాఫ్ సత్యమూర్తి'కి సీక్వెల్ అనుకున్నారు కానీ ఇది కొత్త కథ అని తెలుస్తోంది. అయితే ఫాదర్ సెంటిమెంట్ మాత్రం పక్కా ఉంటుంది. ఈ సినిమాకి టైటిల్ గా కొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు.
అందులో 'నాన్న.. నేను' అనే టైటిల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. మరో హీరోయిన్ పాత్రలో కేథరిన్ త్రెసా కనిపించనుందని టాక్. ఈ విషయాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే
రానుంది. | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Hyderabad, First Published 13, Aug 2018, 11:38 AM IST
Highlights
ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది.
నట విశ్వరూపం, నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు ‘ఎన్టీఆర్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీయార్’. ఆయన తనయుడు, సినీనటుడు బాలకృష్ణ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి, బసవతారకం పాత్రలో విద్యాబాలన్, నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, కృష్ణ పాత్రలో మహేష్ బాబు, శ్రీదేవి పాత్రలో రకుల్ లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. తాజాగా తెలిసిన మరో విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర కూడా ఉందట.
ఎన్టీఆర్-చిరంజీవి కలిసి ‘తిరుగులేని మనిషి' సినిమాలో నటించారు. ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్' బయోపిక్లో చిరు పాత్ర ఉంటుందనే వార్తలు జోరందుకున్నాయి.అయితే చిరంజీవి పాత్ర ఉంటుందనే విషయమై చిత్ర బృందం నుండి ఎలాంటి ప్రకటన లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆయన పాత్ర ఎవరు పోషిస్తారనేది కూడా ఆసక్తికరమే. మరి దీనిపై దర్శకుడు క్రిష్ ఓ క్లారిటీ ఇస్తే బావుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
Last Updated 9, Sep 2018, 12:19 PM IST | 0business
|
బాయ్ ప్రెండ్ పై పడుకుని టూ పీస్ బికినితో ఫోజిచ్చిన హీరోయిన్
Highlights
బాయ్ ప్రెండ్ పై పడుకుని టూ పీస్ బికినితో ఫోజిచ్చిన హీరోయిన్
అందాలతో కనువిందు చేయడంలో అందరికన్నా ఒకడుగు ముందే ఉంటానని అమీ జాక్సన్ ఈమధ్య తెగ ప్రూవ్ చేసుకుంటోంది. బ్రిటన్ నుంచి నేరుగా సౌత్ లో అడుగు పెట్టిన ఈ బ్యూటీ చేసినది తక్కువ సినిమాలే అయినా గుర్తింపు మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. అమీ చేసినవన్నీ భారీ ప్రాజెక్టులే కావడంతో కొద్ది కాలంలోనే బాగా పాపులరయింది.
ఈమధ్య సినిమాలకు కాస్త గ్యాపిచ్చిన అమీ ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కు వెళ్లింది. ఈ సందర్భంగా టూపీస్ బికినీల్లో కనిపించి ఫ్యాన్స్ అందరిలో హీట్ పెంచింది. ఇప్పుడు మరోసారి తన అందాలన్నీ చూపిస్తూ మరో పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిని చూసిన అమీ అభిమానుల్లోని కుర్రాళ్లు ఒక్కసారిగా దిగాలు పడిపోయారు. ఎందుకంటే ఈ పిక్ లో అమీ జాక్సన్ తన బాయ్ ఫ్రెండ్ తో చాలా క్లోజ్ గా మూవవుతూ ఏకంగా లిప్ కిస్ ఇస్తూ కనిపించింది. ఓవైపు అమీ అందాలను చూసి ఆనంద పడాలో... లేక బాయ్ ఫ్రెండ్ తో అలా ఉండటం చూసి అసూయ పడాలో తెలియని పరిస్థితి ఆమె వీరాభిమానులది.
అమీ జాక్సన్ ప్రస్తుతం 2.0 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారత దేశంలోనే అత్యధికంగా రూ. 400 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది.
Last Updated 20, Jun 2018, 1:24 PM IST | 0business
|
photographers beaten up for taking shilpa shetty’s photos, restaurant bouncers arrested
శిల్పాశెట్టి ఫొటో ఎఫెక్ట్.. ఫొటోగ్రాఫర్లపై బౌన్సర్ల దాడి
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాలను కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఫొటోగ్రాఫర్లను బౌన్సర్లు చితక్కొట్టారు.
TNN | Updated:
Sep 8, 2017, 01:30PM IST
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌‌కుంద్రాలను కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఫొటోగ్రాఫర్లను బౌన్సర్లు చితక్కొట్టారు. ముంబైలో గురువారం రాత్రి ఓ రెస్టారెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని బాంద్రాలో ఉన్న బాస్టియన్ రెస్టారెంట్‌కు గురువారం రాత్రి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా వెళ్లారు. డిన్నర్ అనంతరం రెస్టారెంట్ బయటికి వచ్చి మీడియా ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. అనంతరం అక్కడి నుంచి వారు బయలుదేరుతుండగా రెస్టారెంట్ బౌన్సర్లు, ఫొటోగ్రాఫర్ల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో బౌన్సర్లు ఇద్దరు ఫొటోగ్రాఫర్లను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో హిమన్షు షిండే, సోను అనే ఇద్దరు ఫోటోగ్రాఫర్లు గాయపడ్డారు.
శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా వెళ్లడానికి వీలుగా బౌన్సర్లు దారిని క్లియర్ చేస్తున్నారు. ఈ సయంలో ఇద్దరు ఫొటోగ్రాఫర్లు శిల్పా, కుంద్రాలకు దగ్గరగా వచ్చారు. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన బౌన్సర్లు వారిద్దరూ ఎడాపెడా బాదేశారు. ఈ దాడిపై ఇద్దరూ ఫొటోగ్రాఫర్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు రెస్టారెంట్ బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో దాడి వీడియోలు రికార్డయ్యాయి. ఈ వీడియోలను న్యూస్ ఏజెన్సీ ఏన్ఐ ట్వీట్ చేసింది. బౌన్సర్లు ఫోటోగ్రాఫర్లపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా రికార్డయింది. అయితే ఈ వీడియోలు శిల్పా, కుంద్రాలు లేరు.
Scuffle b/w bouncers of a restaurant& 2 photographers for taking pics of Shilpa Shetty&Raj Kundra while leaving,y'day.FIR registered #Mumbai pic.twitter.com/lO8ASrU8RV | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఇండియాలో సెక్స్ కామెడీ సినిమాలు చేయను -ఫక్రీ
ఇండియాలో అడల్ట్ లేదా సెక్స్ కామెడీ వంటి సినిమాలు చేయను అని చెబుతోంది బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ.
TNN | Updated:
Apr 24, 2016, 05:39PM IST
ఇండియాలో అడల్ట్ లేదా సెక్స్ కామెడీ వంటి సినిమాలు చేయను అని చెబుతోంది బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ. ఎందుకంటే వెస్టెర్న్ కల్చర్తో పోల్చుకుంటే ఇక్కడి ఆడియెన్స్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా భిన్నమైంది అని తన నిర్ణయం వెనుకున్న కారణాన్ని సైతం వివరిస్తోంది నర్గీస్. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన ఓ వార్తా కథనం ప్రకారం తాను ఇండియాలో అడల్ట్స్, సెక్స్ కామెడీ సినిమాలు చేయను అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 'అదే ఒకవేళ అమెరికా, జర్మనీ, లండన్ ఆడియెన్స్ సెన్సాఫ్ హ్యూమర్ ఇక్కడికన్నా పూర్తి భిన్నంగా వుంటుంది. తాను అటువంటి సినిమాలు చేయాలనుకుంటే అక్కడ చేసే అవకాశం వుంది' అని బాహటంగానే తన అభిప్రాయాన్ని చెప్పేసిందీ స్లిమ్ లేడీ. ఈమధ్య కాలంలో బాలీవుడ్లో అటువంటి సెక్స్ కామెడీ సినిమాలు చాలానే విడుదలయ్యాయి కానీ తాను మాత్రం వాటిని చూడలేదంటున్న నర్గీస్ ఫక్రీ ఖాతాలో ప్రస్తుతం అజార్(అజారుద్దీన్ బయోపిక్), హౌజ్ఫుల్-3 సినిమాలున్నాయి. | 0business
|
తేజ ప్రయత్నించినా.. శ్రీరెడ్డి వినలేదట.. సురేష్ బాబు పరువు మొత్తం పోయింది
Highlights
తేజ ప్రయత్నించినా.. శ్రీరెడ్డి వినలేదట.. సురేష్ బాబు పరువు మొత్తం పోయింది
ఎన్నో ఫ్లాపుల తర్వాత నేనే రాజు నేనే మంత్రి తో ఒక హిట్ తీశాడు తేజ. ఆ వెంటనే వెంకటేష్ తో సినిమా తీయమని తన బ్యానర్ లోనే ఆఫర్ ఇచ్చాడు సురేష్ బాబు. అంతా బాగానే ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు వెంకటేష్ సినిమా తేజ కెరీర్ కి హెల్ప అయ్యేది. అయితే శ్రీరెడ్డి అభిరామ్ ఇష్యూలో శ్రీరెడ్డిని సైలెంట్ అయ్యేలా చేస్తానని తేజ సీన్ లోకి ఎంటరయ్యాడు. శ్రీరెడ్డి తో మాట్లాడాడు కూడా కాంప్రమైస్ చేశాడు. ఆ తర్వాత శ్రీరెడ్డి కి తాను డైరెక్ట్ చేస్తున్న రెండు సినిమాల్లో ఛాన్స్ ఇస్తున్నానని ఒక రేంజ్ లో చెప్పుకున్నాడు. ఇక ఇండస్ట్రీ లో ఉన్న మిగతావాళ్లు కూడా అవకాశాలు ఇవ్వాలని భారీ డైలాగ్ కొట్టాడు.
అయితే తెర వెనుక ఏం జరిగిందో ఏమో గానీ మా అసోసియేషన్ ప్రెస్ మీట్ తర్వాత శ్రీరెడ్డి అడ్డం తిరిగింది. తేజను అడ్డు పెట్టుకుని తనను బక్రాను చేస్తున్నారన్న అనుమానం శ్రీరెడ్డికి వచ్చింది. ఆవెంటనే సముదాయించాలనుకున్నారు కానీ తేజ మాట వినకుండా అభిరామ్ తో సన్నిహిత ఫోటోలు భయటపట్టేసింది. ఆ దెబ్బతో తేజ సురేష్ బాబుల బండారం మొత్తం బయటపడింది. శ్రీరెడ్డి దగ్గర ఉన్న సాక్ష్యాలు బయటపెట్టకుండా ఉండడానికి తనకు ఆఫర్లు ఇస్తున్నానంటు ఈ బడా ఫ్యామిలీ తరపున తేజ శ్రీరెడ్డికి తేజ పెట్టిన కండీషన్. ఈ విషయం లో తేజ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని మానేజ్ చేస్తానని చెప్పి ఇలా పూర్తిగా పరువు పోయేలా చేశాడని సురేష్ బాబు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అందుకే తేజ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడంట.
Last Updated 12, Apr 2018, 5:35 PM IST | 0business
|
Sep 15,2018
రూపాయి దన్నుతో మార్కెట్లు పరుగు..
ముంబయి: స్టాక్ మార్కెట్లలో లాభల పరుగు కొనసాగుతోంది. దాదాపు నాలుగుల లక్షల కోట్ల భారీ వరుస నష్టాల నుంచి తేరుకుని లాభాల దిశగా పరుగులు తీస్తోంది. రూపాయి పుంజు కోవడం, కొనుగోళ్ల మద్దతుతో శుక్రవారం నాటి ట్రేడింగ్లో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. దీంతో సూచీలు వారం రోజుల గరిష్టానికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, డాలర్తో రూపాయి మారకం విలువ పుంజుకోవడంతో శుక్రవారం నుంచే సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ఆరంభించగా.. నిఫ్టీ కూడా మళ్లీ 11,500 మార్క్ పైన ట్రేడ్ అయ్యింది. అయితే ఆ తర్వాత కాస్త తడబడిండి.. బ్యాంకింగ్, లోహ, స్థిరాస్తి, ఆటోమొబైల్, హెల్త్కేర్, విద్యుత్ తదితర రంగాల్లో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చాయి. ఫలితంగా మధ్యాహ్నం సెషన్లో మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్ల వరకు లాభపడింది. చివరకు 373 పాయింట్ల లాభంతో 30,091 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 145 పాయింట్లు లాభపడి 11,515 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.23 పైసలు కోలుకుని రూ. 71.95 దరిదాపుల్లో కొనసాగింది. దాదాపుగా నాలుగు లక్షల కోట్ల మేర నష్టపోయి ఉసూరుమన్న మదుపరులకు వారాంతంలో స్టాక్ మార్కెట్లు కాస్త ఊరటను కల్పించాయి. సూక్ష్మ గణాంకాలు కలిసి రావడం వల్లే మార్కెట్లు లాభపడినట్టుగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. | 1entertainment
|
వన్డే సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ
Highlights
ఇప్పటికే స్వదేశంలో ఆడిన టీ20 సిరీస్ లో భారత్ చేతిలో ఓటమిపాలై పరాభవంతో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదుదెబ్బ తగిలింది. ఇవాళ జరిగే మొదటి వన్డే నుండి ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ అలెక్స్ హేల్స్ దూరమయ్యాడు. అతడు నెట్ లో ప్రాక్టీస్ చేస్తుండగా తీవ్రంగా గాయపడినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఇప్పటికే స్వదేశంలో ఆడిన టీ20 సిరీస్ లో భారత్ చేతిలో ఓటమిపాలై పరాభవంతో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదుదెబ్బ తగిలింది. ఇవాళ జరిగే మొదటి వన్డే నుండి ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ అలెక్స్ హేల్స్ దూరమయ్యాడు. అతడు నెట్ లో ప్రాక్టీస్ చేస్తుండగా తీవ్రంగా గాయపడినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఇప్పటికే టీ20 సిరీస్ పరాభవంతో రగిలిపోతున్న ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. భారత్ చేతిలో స్వదేశంలో జరిగిన టీ20 సీరీస్ ను 2-1 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వన్డేల్లో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో గెలిచి ఐసిసి వన్డే ర్యాకింగ్స్ లో టాప్ ప్లేస్ ను నిలబెట్టుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. అదేవిధంగా ఐసిసి టాప్ ర్యాకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న టీంఇండియా ఈ సీరీస్ ను వైట్ వాష్ చేసి అగ్రస్థానికి ఎగబాకాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఈ వన్డే సీరీస్ రెండు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇటీవల ముగిసిన టీ20 సిరీస్లో అలెక్స్ హేల్స్ అద్భుతంగా రాణించాడు. అయితే ఇదే ఊపును వన్డేల్లోనూ ప్రదర్శిస్తాడని ఇంగ్లాండ్ జట్టు అతడిపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలో అతడు పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతూ మొదటి వన్డే నుండి తప్పుకున్నాడు, అతని స్థానంలో డావిడ్ మలాన్ను జట్టులోకి తీసుకున్నట్లు ఇంగ్లాండ్ బోర్డు ప్రకటించింది.
హేల్స్ ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, తొందరగా కోలుకునేందుకు కావాల్సిన చికిత్స అందిస్తున్నట్లు ఇంగ్లాండ్ బోర్డు వివరించింది. అతడు త్వరగా కోలుకుని రెండో వన్డేకు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నట్లు బోర్డు తెలిపింది.
Last Updated 12, Jul 2018, 4:26 PM IST | 2sports
|
Visit Site
Recommended byColombia
సమస్యలను పరిష్కరించుకొని తన కుటుంబంతో మళ్లీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని షమీ చెప్పాడు. ‘‘నా భార్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. విచారణలో నాపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఒకవేళ అవన్నీ అబద్ధమని తేలితే.. హసీన్ జవాబు చెప్పాలి. ఇది కుటుంబ సమస్య కాబట్టి.. ఇద్దరం కలిసి కూర్చుని పరిష్కరించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా’’ అని షమీ చెప్పాడు.
‘‘ఎవరి గురించైనా ఏదైనా మాట్లాడటం తేలికే. నాపై చేసిన ఆరోపణల్ని తను నిరూపించాల్సి ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది, తను అపార్థం చేసుకుంది. కానీ అవన్నీ పక్కనబెట్టి కుటుంబం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నా’’ అని తెలిపాడు.
షమీపై హసీన్ జహాన్ కేసు నమోదు చేయడం వల్ల త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్‌లో అతడు ఆడేది అనుమానంగా మారింది. ఈ పేస్ బౌలర్ విషయంలో అతడు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ బీసీసీఐ అధికారులతో చర్చలు జరుపుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఐదో వన్డేలో బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
భారత్తో కొలంబో వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
TNN | Updated:
Sep 3, 2017, 03:42PM IST
భారత్‌తో కొలంబో వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా సస్పెన్షన్‌కి గురై గత రెండు వన్డేలకి దూరంగా ఉన్న కెప్టెన్ తరంగ.. మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయగా.. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో భారత్‌కి వచ్చేశాడు. దీంతో అతని స్థానంలో అజింక్య రహానె తుది జట్టులోకి వచ్చాడు.
ధావన్‌తో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, అక్షర్‌ పటేల్ ఐదో వన్డేకి దూరమవగా.. రహానె, భువనేశ్వర్ కుమార్, చాహల్, కేదార్ జాదవ్ తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక జట్టులో ఒక మార్పు మాత్రమే జరిగింది. కుశాల్ మెండిస్ స్థానంలో ఉపుల్ తరంగ జట్టులోకి వచ్చాడు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. | 2sports
|
Realestate
రియాల్టీలో ‘బండ్లగూడ 5% వృద్ధి
హైదరాబాద్, మే 17: దేశవ్యాప్తంగా రియాల్టీ మార్కెట్ 2017మొదటిత్రైమాసికంలో మద్దతు కోసం వెంపర్లాడింది. 2017-18లో బడ్జెట్లో పలు చర్యలు ప్రకటించడం, మౌలికవసతుల మెరుగుదల, కనెక్టివిటీ పెంపుదల అందుబాటుధరల్లో గృహనిర్మాణం వంటి వాటికి సంబంధించినవి ఉన్నాయి. అయితే గత ఏడాది చివరి త్రైమాసికంలో పెద్దనోట్లరద్దు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసిందని 99 ఏకర్స్ డాట్కామ్ సిబిఒ నరసింహ జయ కుమార్ వెల్లడించారు. ఇంటి రుణాల సబ్సిడీలు, అందుబాటు హౌసింగ్కు పరిశ్రమ హోదా, ఎల్టిసిజి టాక్స్ హోల్డింగ్కాలవ్యవధిలో మార్పులు మార్కెట్ దశనే మారుస్తున్నట్లు వెల్లడించారు కొనుగోలుదారుని సెంటిమెంట్కు అనుగుణంగా 99ఏకర్స్ డాట్కామ్పై లిస్టింగ్స్ పూరితంగా సవరిస్తే 2017 అర్ధబాగంలో మార్కెట్ పుంజుకుంటుందని అన్నారు. ఇక గ్రేటర్ హైదరా బాద్ పరిధిలోని బండ్లగూడ త్రైమాసిక ప్రాతిపదికన ఐదు శాతం వృద్ధితో ఉందని తేలింది. వూహాత్మకంగా ఔటర్ రింగ్రోడ్ పొడవునా అనేక ఆస్తులు రావడమే ఇందుకుకీలకం. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్లలో డిమాండ్ నిలకడగా ఉంది. మూలధన అద్దె విలువల్లో సానుకూలదశగా ఉంది.
గచ్చిబౌలి, బేగంపేట,మార్కెట్లు కొత్త రిసేల్ ఇన్వెం టరీ మిక్స్తో సంతృప్తిస్థాయికి చేరుకున్నాయి. పౌరవసతుల లేమితో ఆకర్షణను కోల్పోయాయి. రెండోత్రైమాసికంలో కూడా పెద్దనోట్ల రద్దులేపిన సమస్యలు ఎదుర్కొవడంలో ల్యాండ్ లావాదేవీలు విఫలంఅయ్యాయి. నిజాంపేట, మణికొండ, చందానగర్, హైటెక్సిటీ,రెసిడెన్షియల్ లీజింగ్ లో వృద్ధి కనిపించింది. త్రైమాసిక ప్రాతిపదికన 10-14శాతం వరకూ నమోదయింది. జూబ్లిహిల్స్, గచ్చిబౌలి, కొత్తగూడ ప్రధాన రహదారుల్లో రిటైల్ లీజింగ్ కార్యకలాపాలు అధికంఅయ్యాయి. రూ.25 లక్షలలోపు ఆస్తుల అందుబాటులో గణనీయంగా ఆరుశాతం తగ్గుదల చోటు చేసుకోవడం డిమాండ్ సరఫరాల్లో సమతుల్యత దెబ్బతిన్నది. అయితే విలాసవంతమైన ఆస్తుల మార్కెట్లో డిమాండ్ మరింత తగ్గింది. హైదరాబాద్లో మెజార్టీ రెసిడెన్షియల్ స్టాక్ రూ.40 లక్షలలోపు కొనసాగుతున్నాయి. వక్కువ ధరకు ఇళ్ల నిర్మానంలో లాభదాయకత లేకపోవడంతో సరఫరాకంటే డిమాండ్ 24శాం అధికంగా ఉందని 99ఏకర్స్ వెల్లడించింది. గత త్రైమాసికంలో ఈడిమాండ్ 18శాతం మాత్రమే ఉందని అంచనా. | 1entertainment
|
శ్రీనగర్ నుంచి త్వరలోనే విదేశీ విమాన సేవలు
శ్రీనగర్| Pavan Kumar| Last Modified శనివారం, 2 ఆగస్టు 2008 (17:58 IST)
జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ నుంచి విదేశీ విమాన సేవలు త్వరలోనే ప్రారంభం అవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ చెప్పారు. శ్రీనగర్ విమానాశ్రయంలో చేపట్టిన స్థాయి పెంపు, విస్తరణ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. బహుశా విదేశీ విమాన సేవలు మాసంలోపే ప్రారంభం అవుతాయన్నారు.
శ్రీనగర్ విమానాశ్రయ విస్తరణ పనుల కోసం రూ.101 కోట్లు వెచ్చించటం జరిగిందని తెలియజేశారు. విమానాశ్రయంలో చేపట్టిన పనులను పరిశీలించటానికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సైఫుద్దీన్ సోజ్, మాజీ సీఎం గులాం నబీ అజాద్, ఇతర అధికారులు ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్లో విమాన ప్రయాణీకుల రాకపోకల్లో 30 శాతం మేర వృద్ధి సాధించిందని మంత్రి పటేల్ చెప్పారు. ఇది ప్రధాన విమనాశ్రయాలైన ముంబయి, ఢిల్లీల కంటే ఎక్కువని తెలిపారు. జమ్మూ విమానాశ్రయ విస్తరణ పనుల కోసం రూ.250 కోట్లు కేటాయించడం జరిగిందని వివరించారు.
రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలైన లడఖ్, కార్గిల్లలో విస్తరణ పనులు చేపట్టటానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఆర్మీ దీనికవసరమైన భూమిని తమకు అప్పగిస్తే పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. శ్రీనగర్ నుంచి విదేశీ సేవల విమానం దుబాయ్కు నడుస్తుందని పటేల్ వెల్లడించారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
veg market
దిగివచ్చిన టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ, నవంబరు 15: టోకుధరలసూచి ద్రవ్యోల్బణం అక్టోబరునెలలో 3.39శాతానికి తగ్గింది. సెప్టెం బరు నెలలో 3.57శాతం ఉన్న ఈ సూచి మరింత తగ్గిందని అంచనా. ఆహార ఉత్పత్తులధరలు మరిం త తగ్గడమే ఇందుకుకీలకం. ఆహార ఉత్పత్తుల కేటగిరీలో 0.3శాతం తగ్గడంతో కొంతమేర సానుకూలం అయింది. పెసలు, చేపలు, ఇతర మషాలా ఉత్పత్తుల ధరలు తగ్గినట్లు తేలింది. 2015 అక్టోబరులో టోకుధరల సూచి ద్రవ్యోల్బణం 3.7శాతంగా నిలిచింది.
ఇక పప్పుదినుసుల ద్రవ్యోల్బణం గరిష్టంగా ఉంది. అక్టోబరులో 21.80శాతంగా నిలిచింది. వాణిజ్యమంత్రిత్వశాఖ అక్టోబరునెల గణాంకాలను మంగళవారం విడుదలచేసింది. బంగాళాదుంపలపరంగాచూస్తే రోజువారి వినియోగం ఎక్కువ ఉంటుం ది. గరిష్టంగా పెరిగాయి. 60.58శాతం పెరిగింది. పండ్లరకాల్లో ధరలు 6.45శాతంపెరిగినట్లు వాణిజ్య శాఖ అంచనావేసింది. మొత్తంగాచూస్తే ఆహారద్రవ్యోల్బణం విభాగంలో స్వల్పంగా పెరిగింది. అక్టోబరులో 4.34శాతంగా ఉంది. అదే సెప్టెంబరులో నమోదయిన 5.75శాతం కంటే తక్కువకు రావడం సంతో షకరం. ఇక తయారీరంగఉత్పత్తులకు ద్రవ్యో ల్బణం 2.48శాతం నుంచి 2.67శాతంగా ఉంది. చక్కెరపరంగా ద్రవ్యోల్బణం 29.63 శాతంగా ఉంది. పెట్రోలుధరలు 3.57 శాతంగా ఉన్నట్లు అంచనా.
టోకుధరలసూచి ద్రవ్యోల్బణం ఆగస్టునెలలో సవరించిన అంచనాలను చూస్తే 3.85శాతంగా నిలి చింది. అంతకుముందు 3.74శాతంగా ఉంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను కూడా విడుదలచేయాల్సి ఉంది. ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ అధ్యక్షతన ఏర్పాటయిన మానిటరి పాలసీ కమిటీ గతనెలలోనే వడ్డీరేట్లను 0.25శాతం తగ్గించి 6.25శాతానికి రెపోరేట్లు తగ్గించింది. టోకుధరలసూచి ద్రవ్యోల్బణం తగ్గడంతో వడ్డీరేట్లు తగ్గించేందుకు మరింతగా అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా. 2016 చివరి త్రైమాసికం నాటికి ద్రవ్యోల్బణం ఐదుశాతానికి తీసుకురావాలన్న లక్ష్యంతో ఆర్బిఐ ఉంది. దీనివల్ల వడ్డీరేట్ల తగ్గింపునకు మరింత అవకాశం ఉంటుందని అంచనా. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
స్లెడ్జింగ్కు ముగింపు పలకండి: ఆసీస్ ప్రధాని
బాల్ ట్యాపంరింగ్ వివాదంతో తీవ్ర మనస్థాపానికి లోనయిన ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ మరో అడుగు ముందుకేసి స్లెడ్జింగ్కు ముగింపు పలకాలని సూచించారు.
Samayam Telugu | Updated:
Mar 27, 2018, 12:34PM IST
స్లెడ్జింగ్కు ముగింపు పలకండి: ఆసీస్ ప్రధాని
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా.. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో దేశ ప్రతిష్ట మసకబారడంతో ఆస్ట్రేలియా ప్రధాని తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. యువతకు ఆదర్శంగా నిలవాల్సిన ఆటగాళ్లు ఇలా చేయడం నమ్మకలేకపోతున్నానని చెప్పారాయన. ఈ ఘటన ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది. క్రికెట్లో స్లెడ్జింగ్కు ముగింపు పలకాలని మాల్కమ్ టర్న్బుల్ తాజాగా సూచించారు. ప్రస్తుతం స్లెడ్జింగ్ అదుపు తప్పిందని, ఆటను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బాల్ ట్యాంపరింగ్ ఘటనపై విచారణలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఆయన క్రికెట్ ఆస్ట్రేలియాను డిమాండ్ చేశారు. బాల్ ట్యాంపరింగ్ వ్యవహరంలో బాధ్యులపై బుధవారం నిర్ణయం వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో టర్న్బుల్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకుంటూ.. స్లెడ్జింగ్కు దిగడాన్ని అధికారులు అరికట్టాలని క్రికెట్ను మళ్లీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే ఇది తప్పనిసరని ఆస్ట్రేలియా ప్రధాని తెలిపారు. ‘స్లెడ్జింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆటలో దూషణకు చోటు ఉండొద్ద’ని టర్న్బుల్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్లో, ప్రస్తుతం జరుగుతోన్న దక్షిణాఫ్రికా సిరీస్లోనూ ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరితో మరొకరు దురుసుగా ప్రవర్తించారు. డికాక్-వార్నర్ గొడవ పడగా.. స్మిత్ను అవుట్ చేసిన రబాడ అతడి భుజాన్ని నెట్టుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో రబాడపై రెండు టెస్టుల నిషేధం విధించిన ఐసీసీ అనంతరం దాన్ని ఎత్తివేసింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Train టికెట్ క్యాన్సల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
కొన్ని సందర్భాల్లో ఊహించని కారణంగా ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేయాల్సి రావొచ్చు. అందువల్ల టికెట్ క్యాన్సల్ రూల్స్ను ముందుగానే తెలుసుకొని ఉంటే ఎలాంటి సమస్య ఉండదు.
Samayam Telugu | Updated:
Oct 26, 2019, 01:10PM IST
Train టికెట్ క్యాన్సల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
హైలైట్స్
ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారానే ఇ-టికెట్లను రద్దు చేసుకోవచ్చు
చార్జీలు మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు
కన్ఫార్మ్ అయిన తత్కాల్ టికెట్ను రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ రాదు
ట్రైన్ క్యాన్సిల్ అయితే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి
ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ట్రైన్ ప్యాసింజర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. ఇ-టికెటింగ్ సేవలు కూడా ఇందులో భాగమే. ఐఆర్సీటీసీ వెబ్సైట్కు వెళ్లి ట్రైన్ టికెట్లను (తత్కాల్ సహా) బుక్ చేసుకోవచ్చు. టికెట్లను బుక్ చేసుకోవడమే కాకుండా ఆ టికెట్లను క్యాన్సల్ చేసుకునే సదుపాయం కూడా ఐఆర్సీటీసీ కల్పిస్తోంది.
రైల్వే ఇ-టికెట్లకు సంబంధించిన ఐఆర్సీటీసీ లేటెస్ట్ క్యాన్సలేషన్ రూల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
✺ ఐఆర్సీటీసీ ప్రకారం.. ట్రైన్ చార్ట్ ప్రిపేర్ కావడానికి ముందు వరకు ఇ-టికెట్లను క్యాన్సల్ చేసుకోవచ్చు. | 1entertainment
|
Apr 04,2015
సిండికేట్ బ్యాంకు మాజీ సిఎండిపై కేసు
న్యూఢిల్లీ : సిండికేట్ బ్యాంకు మాజీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కె జైన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మనీలాండరింగ్ కేసు బుక్ చేసింది. గతేడాది ఆయన్ను సిబిఐ అవినీతి కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రివెంట్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్ఎ) కింద ఇది వరకే సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జైన్ నిబంధనలకు విరుద్దంగా పలు కంపెనీలకు రుణ పరిమితి పెంచేందుకు రూ.50 లక్షలు లంచం తీసుకుంటు సిబిఐకి దొరికిపోయారు. ఆరు నెలల పాటు నిఘా ఉంచి ఆయన్ను పట్టుకున్నారు. అనంతరం జైన్ నివాసం నుంచి రూ.21 లక్షల నగదు, రూ.1.68 కోట్ల విలువపైన బంగారం, రూ.63 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైన్తో పాటు మరో 11 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోదక చట్టం కింద రెండు ఎఫ్ఐఆరల్లు నమోదు చేశారు. ఇందులో భూషణ్ స్టీల్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ సింఘాల్, ప్రకాశ్ ఇండిస్టీస్ ఛైర్మన్ ఎండి వేద్ ప్రకాశ్ అగర్వాల్తో పాటు చార్టర్డ్ ఎకౌంటెంట్ పవన్ బన్సాల్ ఉన్నారు. దీనిపై విచారణ చేసి తాజాగా జైన్తో పాటు దీనికి సంబంధించిన వారిపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేశారని తెలుస్తోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
N ewZealand Team in Bus
న్యూజిలాండ్ ఆశలన్నీ నాలుగవ వన్డే పైనే
రాంచీ: అయిదు వన్డేల సిరీస్లో భాగంగా టీమిం డియా- న్యూజిలాండ్ మధ్య జరుగనున్న నాలుగవ వన్డేకి రాంచీ సిద్దమైంది.కాగా మూడవ వన్డేలో విజయం సాధించి 2-1తో ముందంజలో ఉన్న ధోనీ సేన సిరీస్ గెలుపుపై దృష్టి సారిం చింది. సిరీస్ ఫలితాన్ని విశాఖలో జరిగే వన్డే వరకు పొడిగించకుండా రాంచీలోనే ముగించా లని కసరత్తులు చేస్తుంది.ఇప్పటికే ధోనీ సేన రాంచీ మ్యాచ్ కోసం జార్ఖండ్ చేరుకుంది. అయిదు వన్డేల సిరీస్లో తొలి వన్డేలో గెలిచిన టీమిండియా,ఢిల్లీలో జరిగిన రెండవ వన్డేలో న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఆరు పరుగుల తేడాతో పరాజయం చెందింది.దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఆశలన్నీ ధోనీ,కోహ్లీలపై ఇక కీలకమైన మూడవ వన్డేలో ధోనీ 80 పరుగు లతో సత్తా చాటగా కోహ్లీ 154 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిం చాడు.దీంతో సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిపారు.కాగా ఈ క్రమంలో నాలుగవ వన్డేలో కూడా ఇదే జోరుని కొనసాగించాలని టీమిం డియా భావిస్తుంది.ఇందుకోసం జట్టులో కూడా ఎటువంటి మార్పులు చేయడం లేదు.మూడు వన్డేలకు గాను ఏదైతే జట్టు బరిలోకి దిగిందో అదే జట్టుని చివరి రెండు వన్డేలకు కూడా యధాతథంగా ఉంచుతూ జాతీయ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.ఇక న్యూజిలాండ్ మాత్రం నాలుగవ వన్డేలో విజయం సాధించి బరిలో నిలువాలని చూస్తుంది.నాలుగవ వన్డేలో గెలుపు భారత్ కంటే న్యూజిలాండ్కు ఎంతో అవసరం.ఇప్పటికే జరిగిన టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ జట్టును భారత్ వైట్ వాష్ చేసింది.వన్డేల్లో గెలిచి సగర్వంగా ఇంటికి వెళ్లా లని విలియమ్సన్ సేన భావిస్తుంది. కాబట్టి నాలుగవ వన్డేలో న్యూజిలాండ్ జట్టుకు గెలుపు అవసరం. ప్రతిష్టాత్మక నాలుగవ వన్డే జార్థండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం జరిగే మ్యాచ్ని న్యూజిలాండ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.కాగా నాలుగవ వన్డేలో విజయం సాధించి ఇక్కడే సిరీస్ గెలవా లనే పట్టుదలతో టీమిండిఆయ ఉంటే ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలనే న్యూజిలాండ్ భావిస్తుంది.ఈ క్రమంలో ఇరు జట్లు వ్యూహాలకు పదును పెడుతున్నారు.
మూడవ వన్డేలో కేవలం ఒక్క మార్పుతో మాత్రమే బరిలోకి దిగిన న్యూజి లాండ్ నాలుగవ వన్డేలో ఎటువంటి మార్పులు లేకుండా మ్యాచ్కి సన్నద్దమయ్యే అవకాశం ఉంది. మూడవ వన్డేలో ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ జట్టులోకి రావడంతో జట్టు కొంత బలంగా కనిపిస్తుంది.కాగా మొహాలిలో ఆదివారం జరిగిన మూడవ వన్డేలో జేమ్స్ నీషమ్-హెన్రీల జోడి సరికొత్త భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.మూడవ వన్డేలో తొమ్మిదవ వికెట్కు 84 పరుగులు జోడించారు.దీంతో తొమ్మిదవ వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన న్యూజిలాండ్ జోడీగా అవతరించింది. కాగా ఈ భాగస్వా మ్యంతో 2009లో భారత్పై 9వ వికెట్కు కివీస్ జోడీ మిల్స్-సౌథీలు నమోదు చేసిన 83 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు. దీంతో న్యూజిలాండ్ జట్టులో దాదాపు మార్పులు ఉండకపోవచ్చని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక భారత్ విషయానికి వస్తే తుది జట్టులో ఎటువంటి మార్పులు ఉండవు. కాగా న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్, అజింక్యా రహానే ఇప్పటి వరకు మంచి భాగస్వా మ్యాలు నెలకొల్పలేదు.ధావన్,కెఎల్ రాహుల్లు గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమవడంతో ఓపెనర్లుగా రోహిత్,అజింక్యా రహానే బరిలోకి దిగుతున్నారు.నాలుగవ వన్డేలోనైనా భారత ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తారో లేదో చూడాలి.ఇదిలా ఉంటే నాలుగవ వన్డే జరుగుతున్న రాంచీలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది.ఇప్పటి వరకు రాంచీలో టీమిండియా మూడు మ్యాచ్లు ఆడిగా రెండింటిలో గెలిచింది.కాగా ఈ సిరీస్లో ఎంతో కీలకం కానున్న రాంచీ మ్యాచ్ ధోనీ సేనకు కలిసివచ్చేలాగా ఉంది. అంతేకాదు రాంచీలో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది.జనవరి 19,2013లో భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీలో తొలి మ్యాచ్ జరిగింది. ధోనీ నేతృత్వంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది.మొదట జడేజా, ఇషాంత్, అశ్విన్లు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 42.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది.అనంతరం బ్యాటింగ్కు దిగిన కోహ్లీ 77 పరుగులతో నాటౌట్గా నిలువడంతో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 28.1 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది.ఇక అక్టోబరు 23,2013లో భారత్,ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్కి వర్షం అడ్డంకిగా మారింది.టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.కెప్టెన్ జార్జ్ బెయిలీ 98 పరుగులు,మాక్స్వెల్ 92 పరుగులతో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.కాగా 296 పరుగులు టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 4.1 ఓవర్లలో జిరో పరుగులు వద్ద 27 పరుగులు చేయగా వర్షం అడ్డంకిగా మారింది.దీంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు.ఇక నవంబర్ 16 2014లో కోహ్లీ నేతృత్వంలోని భారత్ 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.అయిదు వన్డేల సిరీస్ను ఈ మ్యాచ్తో క్లీన్ స్వీప్ చేసింది.శ్రీలంక 8 వికెట్లకు 286 పరుగులు చేయగా కోహ్లీ 139 పరుగులతో సెంచరీ సాధించాడు.దీంతో టీమిండియా 7 వికెట్లకు మరో 8 బంతులు ఉండగానే గెలిచింది. | 2sports
|
Visit Site
Recommended byColombia
2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్లు జరగనున్నట్లు పేర్కొంది. టీ20 సిరీస్తో భారత పర్యటన ప్రారంభమవుతుంది. డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ మొదలవుతుంది. అనంతరం జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ జరుతుంది. తొలి టీ20 మ్యాచ్ బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో జరగనుంది. అలాగే తొలి టెస్టు మ్యాచ్ అడిలైడ్లో ప్రారంభంకానుంది. ఇక సిడ్నీలో తొలి వన్డే జరుగుతుంది.
ఇదిలా ఉంటే, బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఏడాది నిషేధానికి గురైన ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఈ మూడు సిరీస్ల్లో ఆడలేరు. వారిపై నిషేధం 2019 మార్చి వరకు ఉండటంతో ఈ సిరీస్కు దూరం కాక తప్పదు. ఇదే వివాదంలో 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న బాన్క్రాఫ్ట్ భారత్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య డే అండ్ నైట్ టెస్టు నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి భారత్ ఇప్పటి వరకు పింక్ బాల్తో ఆడలేదు. ఆసీస్ ఇప్పటి వరకు నాలుగు డే నైట్ టెస్టు సిరీస్లు ఆడగా అన్నింటిలోనూ గెలిచింది.
ఇదీ షెడ్యూల్..
మొదటి టీ20: నవంబరు 21 - గబ్బా, బ్రిస్బేన్
రెండో టీ20: నవంబరు 23 - ఎంసీజీ, మెల్బోర్న్
మూడో టీ20: నవంబరు 25 - ఎస్సీజీ, సిడ్నీ
మొదటి టెస్ట్: డిసెంబరు 6 - అడిలైడ్ ఓవల్, ఆడిలైట్
రెండో టెస్ట్: డిసెంబరు 14 - పెర్త్ స్టేడియం, పెర్త్
మూడో టెస్ట్: డిసెంబరు 26 - ఎంసీజీ, మెల్బోర్న్ (బాక్సింగ్ డే టెస్టు)
నాలుగో టెస్ట్: జనవరి 3 - ఎస్సీజీ, సిడ్నీ
మొదటి వన్డే: జనవరి 12 - ఎస్సీజీ, సిడ్నీ
రెండో వన్డే: జనవరి 15 - అడిలైడ్ ఓవల్, ఆడిలైట్
మూడో వన్డే: జనవరి 18 - ఎంసీజీ, మెల్బోర్న్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
News Room 365 WATCH LIVE TV
భారత్, పాక్ మధ్య టెస్టులు జరగాలి: ఫరూక్
2008లో ‘ముంబయి దాడులు’ తర్వాత ఈ దాయాది దేశాల మధ్య కనీసం ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు. కానీ.. ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్, ఆసియా కప్ లాంటి టోర్నీల్లో మాత్రం భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయి.
Samayam Telugu | Updated:
Nov 1, 2018, 02:29PM IST
భారత్, పాకిస్థాన్ మధ్య టెస్టు మ్యాచ్లు జరిగితే చూడాలని తాను కోరుకుంటున్నట్లు భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ వెల్లడించాడు. 2008లో ‘ముంబయి దాడులు’ తర్వాత ఈ దాయాది దేశాల మధ్య కనీసం ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు. కానీ.. ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్, ఆసియా కప్ లాంటి టోర్నీల్లో మాత్రం భారత్ , పాక్ జట్లు తలపడుతున్నాయి. అయితే.. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధానిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఉండటంతో దాయాది దేశాల మధ్య క్రికెట్ గురించి చర్చలు జరిగే అవకాశముందని ఫరూక్ ధీమా వ్యక్తం చేశాడు.
‘భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్లు జరగాలి. అలా జరిగితే పాకిస్థాన్కే కాదు.. ప్రపంచానికీ మంచిది. కానీ.. ఇప్పుడు దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పాక్ ప్రధానిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఉండటంతో క్రికెట్పై ఇరు దేశాల మధ్య త్వరలోనే ఓ చర్చ జరిగే అవకాశం ఉంది. తొలి ప్రతిపాదన కూడా పాక్ నుంచే రావచ్చు. అయితే.. ఇప్పుడు సమస్యంతా భారత రాజకీయ నాయకుల్ని ఒప్పించడమే. ఒక క్రికెటర్గా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్లు జరిగితే చూడాలని ఉంది’ అని ఫరూక్ ఇంజినీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
2008 తర్వాత ఆసియా కప్, ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీల్లో వన్డే, టీ20లు ఆడిన భారత్, పాకిస్థాన్ జట్లు కనీసం ఒక్క టెస్టు మ్యాచ్ కూడా తలపడలేకపోయాయి..!! | 2sports
|
Apr 19,2015
అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్ : ప్రముఖ ఆభరణాల విక్రయం సంస్థ పిఎంజె జువెల్స్ అక్షయ తృతీయ సందర్బంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రతి లక్ష రూపాయాల కొనుగోలుపై ఒక్క బంగారు నాణేం ఉచితంగా అందిస్తున్నామని ఆ సంస్థ సిఇఒ కుశల్ కుమార్ తెలిపారు. స్వర్ణరత్న ఇన్వెస్ట్ ప్లాన్లో 75 శాతం రాయితీ ప్రకటిస్తున్నామన్నారు. శనివారం నగరంలోని తమ స్టోర్లో ఈ ఆఫర్లను ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వినూత్న ఆలోచనలతో నూతన డిజైన్లలో ఆభరణాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. పెళ్లిళ్లకు ప్రత్యేక ఆభరణాలు అందిస్తున్నామని డైరెక్టర్ సంజరు కుమార్ అన్నారు. ఆభరణాల విక్రయంలో తమ సంస్థకు అంటూ ఓ చరిత్ర ఉందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 9, Oct 2018, 11:43 AM IST
Highlights
నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ఇప్పటినుండే సినిమా ప్రమోషన్స్ ని ముమ్మరం చేసింది.
నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ఇప్పటినుండే సినిమా ప్రమోషన్స్ ని ముమ్మరం చేసింది. ఇప్పటికే టీజర్ ని విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రబృందం తాజాగా సినిమాలో మొదటి పాటని విడుదల చేసింది.
ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో 'వై నాట్' అనే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాట విన్న చైతు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటివరకు తెలుగు సినిమాలలో రాని సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఈ లవ్ స్టోరీ అయినా కలిసొస్తుందా ?
ప్రస్తుతం కోలీవుడ్ లో లీడింగ్ లేడీగానే కొనసాగుతున్న నయన్ ఒకప్పుడు తెలుగులోనూ టాప్ హీరోయిన్ అనే అనిపించుకుంది.
TNN | Updated:
Aug 3, 2015, 11:23AM IST
ప్రస్తుతం కోలీవుడ్ లో లీడింగ్ లేడీగానే కొనసాగుతున్న నయన్ తార ఒకప్పుడు టాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ అనే అనిపించుకుంది. కానీ గత కొన్నేళ్లుగా ఆమె టాలీవుడ్ కు దూరమైంది. అడపాదడపా చేసిన తెలుగు సినిమాలు కూడా ఆమెకి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు తీసుకురాలేకపోయాయి. చిరంజీవి 150వ సినిమాకి, బాలయ్య డిక్టేటర్ సినిమాకి హీరోయిన్ గా నయన్ పేరు వినిపించినప్పటికీ అవేవీ వర్కౌట్ అవలేదు. పైనల్ గా ఇప్పుడామె చేతిలో వున్న ఒకే ఒక్క తెలుగు సినిమా క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ సరసన చేయనున్న మూవీ. ఓనమాలు, మళ్లీమళ్లీ ఇది రానిరోజు వంటి సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం టేసుకున్న క్రాంతి మాధవ్ మంచి ప్రేమ కథాంశంతో వెంకీ-నయన్ ల సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. కనీసం ఈ లవ్ స్టోరీ అయినా ఆమె టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలని తెచ్చిపెడుతుందో లేదో మరి. | 0business
|
Hyderabad, First Published 14, Apr 2019, 12:57 PM IST
Highlights
ఇప్పుడు అల్లు అర్జున్ సైతం ద్విపాత్రాభినయం చేయటానికి అంగీకరించారని సమాచారం. ఇప్పటి దాకా బన్ని ...డ్యూయిల్ రోల్ లో కనపడలేదు. దాంతో ఖచ్చితంగా ప్రాజెక్టు కు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇంతకీ ఏ డైరక్టర్ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయబోతన్నారంటే..
ద్విపాత్రిభినయం చేయటం ప్రతీ హీరోకీ ఇష్టమే. అయితే స్టార్ గా ఓ స్దాయికి వచ్చేకే ఆ ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తూంటారు. ముఖ్యంగా ద్విపాత్రాభినయం చేయటానికి తగ్గ కథ సెట్ కాకపోతే దాని జోలికి వెళ్లపోవటమే బెస్ట్ అని స్టార్స్ నమ్ముతారు. ఎందుకంటే రెండు పాత్రలూ ఒకేలా ఉంటే ఇంక చేయటానికి ఏముంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం ద్విపాత్రాభినయం చేయటానికి అంగీకరించారని సమాచారం.
ఇప్పటి దాకా బన్ని ...డ్యూయిల్ రోల్ లో కనపడలేదు. దాంతో ఖచ్చితంగా ప్రాజెక్టు కు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇంతకీ ఏ డైరక్టర్ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయబోతన్నారంటే..
అల్లు అర్జున్ 21 వ సినిమా తన పుట్టిన రోజు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఓ మై ఫ్రెండ్, ఎంసిఏ వంటి సినిమాలు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో సినిమా తెరకెక్కబోతున్నది. ఈ సినిమాకు ఐకాన్... కనుబడుటలేదు అనే టాగ్ లైన్ తో కూడిన టైటిల్ ను ప్రకటించారు.
త్రివిక్రమ్, సుకుమార్ ల సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాలోనే అల్లు అర్జున్ ... ద్విపాత్రాభినయం చేస్తున్నాయండున్నారు. అప్పట్లో వచ్చిన చిరంజీవి జేబు దొంగ తరహాలో ఈ సినిమా ఉంటుందంటున్నారు.
Last Updated 14, Apr 2019, 12:57 PM IST | 0business
|
Hyderabad, First Published 29, Jun 2019, 3:00 PM IST
Highlights
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా 'మెంటల్ హై క్యా'.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా 'మెంటల్ హై క్యా'. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి వివాదాలు అలముకున్నాయి.
మానసిక రోగులను అవమానపరిచేలా ఈ సినిమా టైటిల్ ఉందంటూ 'ఇండియన్ సైకియార్టిస్ట్ సొసైటీ(ఐపీఎస్), దీపికా పడుకొనే 'ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్' లతో పాటు సీబీఎఫ్ సీ చీఫ్ ప్రసూన్ జోషికి లేఖ రాశాయి. టైటిల్ మార్చాలని డిమాండ్ చేశాయి. దీంతో తాజాగా కంగనా సీబీఎఫ్ సీ ని కలిసింది.
అవసరమైన టైటిల్ మార్చడానికి సిద్ధంగా ఉన్నట్లు అదే విషయాన్ని మీడియాకు వెల్లడించింది. ఈ క్రమంలో సినిమా పేరు 'జడ్జిమెంటల్ హై క్యా'గా మార్చినట్లు బాలాజీ టెలీ ఫిలిమ్స్ వెల్లడించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Last Updated 29, Jun 2019, 3:00 PM IST | 0business
|
Hyderabad, First Published 25, Sep 2018, 4:29 PM IST
Highlights
స్లిప్లో చాలా సార్లు ధోనీకి దగ్గరగా నిల్చుని ఆయన ఆటతీరును నిశితంగా పరీక్షించేవాడిని’ అని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
కెప్టెన్సీ బాధ్యతలు ఎలా నెరవేర్చాలో తాను టీం ఇండియా మాజీ కెప్టన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ని చూసే నేర్చుకున్నానని విరాట్ కోహ్లీ తెలిపారు. ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ పలు విషయాలు చర్చించారు.
‘కేవలం మహేంద్రసింగ్ ధోనీ నుంచే నేను నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నా. ధోనీతో ఎప్పుడూ నేను ఆట గురించే మాట్లాడతా. నేను వైస్కెప్టెన్గా కాకముందే ఆయనతో నా సలహాలు, సూచనలు పంచుకునేవాడిని. ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నా. స్లిప్లో చాలా సార్లు ధోనీకి దగ్గరగా నిల్చుని ఆయన ఆటతీరును నిశితంగా పరీక్షించేవాడిని’ అని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘నాకు ఆట గురించి ఆలోచించడం అంటే చాలా ఇష్టం. అందుకే కెప్టెన్సీని నేను ఎంతగానో ఆనందిస్తున్నా. ఆటలో నేను ఛేదననే ఇష్టపడుతుంటా. గేమ్ జరుగుతున్నంతసేపు నా మెదడుకు పనిపెడుతూనే ఉంటా’ అని కోహ్లీ చెప్పుకొచ్చారు.
Last Updated 25, Sep 2018, 4:29 PM IST | 2sports
|
శారీలో నడుము అందాలు.. శ్రద్దా దాస్ కిల్లింగ్ ఫోజులు అదుర్స్!
First Published 15, Sep 2019, 4:07 PM IST
శ్రద్దా దాస్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. కానీ హీరోయిన్ గా శ్రద్దా దాస్ కు వచ్చిన అవకాశాలు అంతంత మాత్రమే. స్పెషల్ రోల్స్, ప్రత్యేక గీతాల్లో మాత్రమే శ్రద్దాకు అవకాశాలు దక్కుతున్నాయి.
(Courtesy:Instagram)శ్రద్దా దాస్ నటించిన తొలి చిత్రం సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం.
(Courtesy:Instagram) అల్లు అర్జున్ ఆర్య 2లో శ్రద్దా కీలక పాత్రలో నటించింది.
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ నటనలో సత్తా చాటేలా మంచి అవకాశం రాలేదు.
(Courtesy:Instagram)హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా శ్రద్ధ నటించింది.
(Courtesy:Instagram)తాజాగా శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
(Courtesy:Instagram) అందాలు అరబోయడంతో శ్రద్దా దాస్ వెనకడుగు వేయదు.
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫోటో గ్యాలరీ
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫోటో గ్యాలరీ
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫోటో గ్యాలరీ
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫోటో గ్యాలరీ
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫోటో గ్యాలరీ
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫోటో గ్యాలరీ
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫోటో గ్యాలరీ
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫోటో గ్యాలరీ
Recent Stories | 0business
|
50లక్షల మంది కస్టమర్లకు హోంక్రెడిట్ విస్తరణ
భారత్లో వచ్చేనెల నుంచి ఆన్లైన్ రుణాలు
ముంబై,: హోంక్రెడిట్ఫైనాన్స్ 2018 చివరినాటికి 50లక్షల మంది కస్టమర్లకు చేరువ కావాలన్న లక్ష్యంతో నెట్వర్క్ను పటిష్టంచేస్తున్నది. ఆర్ధికచేకూర్పు, మొదటిసారి రుణం తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్ను పెంపొందించుకునేందుకు వారిలో అవగాహన పెంచడం వంటివిచేస్తోంది. అంతేకాకుం డా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆన్లైన్లోనే రుణాలు పంపిణీచేసేందుకు నిర్ణయించింది. కస్టమర్లరుణా లను మరింతగా పెంచుకునేందుకు ఎక్కువ కృష ిచేస్తున్నది. గుర్గావ్కేంద్రంగా పనిచేస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ భారత్లో ఐదేళ్లలో మరింతపటిష్టం అయింది. దేశవ్యాప్తంగా రుణపరి మితిని సగటున రూ.10వేలకు జారీచేస్తోంది. జులై సెప్టెంబరు మాసంలో గత ఏడాది 87.2 శాతం మార్కెట్ వాటా సాధించినట్లు ప్రకటించింది. దేశం లో రెండు మిలియన్ల కస్టమర్లు ఉన్నారని ఇకపై ఆన్లైన్ రుణాలద్వారా మరింతగా చేరువ అవుతా మని వెల్లడించారు. కంపెనీ సిఇఒ పావెల్ మాకో మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో హోంక్రెడిట్ భారత్ లో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. ప్రస్తు తం ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో తాము అంది స్తున్న సేవలు విజయవంతం అయ్యాయని, భారీ విస్తరణతోపాటు మంచి వృద్ధిని కూడా సాధించినట్లు సిఇఒ వెల్లడించారు. 2012-13లో ఐదు నగరాల్లో ప్రారంభించిన నాన్బ్యాంకింగ్ఫైనాన్స్ నేడు 15 భారతీయ రాష్ట్రాల్లోని 60నగరాలకు చేరువ అయిం దని కేవలం ఐదేళ్లలోనే ఈ విజయం సొంతంచేసు కున్నట్లు సిఇ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ హోమ్క్రెడిట్ఫైనాన్స్ భారత్లో ఏడువేల టచ్పాయింట్లతో పనిచేస్తోంది. 17వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తు న్నట్లు వెల్లడించింది. హోంక్రెడిట్ బివికి అనుబం ధంగా ఉన్న హోంక్రెడిట్ ఇండియా భారత్లో పటిష్టం కావడమే కాకుండా అంత ర్జాతీయంగా మాతృసంస్థకు లక్షమందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నట్లు వివరించింది. 11 దేశాల్లో 64 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నా రని 2.40 లక్షల టచ్పాయింట్లు రుణ కార్యాల యాలు, శాఖలు, పోస్టాఫీసులు సౌజన్యంతో కూడా నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. | 1entertainment
|
2008 నాటికి అశోక్ లేలాండ్ దుబాయ్ కేంద్ర ఉత్పత్తి
న్యూఢిల్లీ(ఏజెన్సీ)| Selvi| Last Modified బుధవారం, 5 సెప్టెంబరు 2007 (15:06 IST)
హిందుజా గ్రూప్కు చెందిన అశోక్ లేలాండ్ సంస్థ రాబోయే 2008 నాటికి దుబాయ్ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాసు చేస్తోంది. 2008 ఫిబ్రవరి నెలలో దుబాయ్ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించనుందని అశోక్ లేలాండ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అశోక్ లేలాండ్ ఉత్పత్తిని అభివృద్ధి చేసే దిశగా దుబాయ్ కేంద్ర ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆ వివరాలు తెలిపాయి.
ఈ కేంద్ర ఉత్పత్తికి అశోక్ లేలాండ్ రూ. 50 కోట్ల పెట్టుబడి పెట్టిందని కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ ఆర్. శేషసాయి చెప్పారు. రెండువేల బస్సులను దుబాయ్ కేంద్రం ఉత్పత్తి చేయనుందని ఆయన అన్నారు. దుబాయ్ ఎగుమతుల కోసం కంపెనీ రూ.550 కోట్లను వెచ్చించిందని శేషసాయి తెలిపారు. దుబాయ్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 77 వేల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అన్నారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
London, First Published 10, Aug 2018, 12:17 PM IST
Highlights
టీమిండియా కోచ్ రవిశాస్త్రి నెటిజన్లకు పదే పదే టార్గెట్ అవుతున్నారు. మొన్నా మొదటి టెస్ట్ మ్యాచ్ మధ్యలో నిద్రపోయినందుకు భారత అభిమానులు ఫైరయ్యారు.
టీమిండియా కోచ్ రవిశాస్త్రి నెటిజన్లకు పదే పదే టార్గెట్ అవుతున్నారు. మొన్నా మొదటి టెస్ట్ మ్యాచ్ మధ్యలో నిద్రపోయినందుకు భారత అభిమానులు ఫైరయ్యారు. నిన్న లండన్లో వేడిని తట్టుకోలేక కూల్డ్రింక్ తాగమన్నందుకు.. రవిశాస్త్రి తాగుబోతని... జట్టుకు సలహాలు ఇవ్వకుండా కూల్డ్రింక్స్ అమ్ముకుంటున్నాడంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా లార్డ్స్ గ్రౌండ్ పిచ్ను పరిశీలిస్తున్న రవిశాస్త్రి ఫోటోపై కామెంట్లు పేల్చారు నెటిజన్లు.
ఈ ఫోటోలో రవి పొట్ట కొట్టొచ్చినట్లు కనిపించింది. దీంతో అతడి ఫిట్నెస్పై సెటైర్లు పేలుతున్నాయి. ‘‘ఆటగాడిగా ఉన్నప్పుడు ఫిట్నెస్ బాగానే మెయింటెన్ చేశావ్.. కోచ్ అయ్యాకా ఏమైంది’’, ‘‘ఆటగాళ్లు ఫిట్గా ఉండాలి అంటాడు.... అతను మాత్రం బాడీ పెంచేస్తున్నాడు’’.. ‘‘రవిశాస్త్రి డెలివరీకి సిద్ధంగా ఉన్నాడు.. కోచ్కు యో యో టెస్ట్ పెట్టాలేమో’’ అంటూ విమర్శలు సంధిస్తున్నారు.
‘‘పొట్టను పెంచడం నేరమేమి కాదు.. కానీ డైటింగ్ కూడా అవసరం ముందు అది గమనించు’’, ‘‘ లార్డ్స్లో ఎవరు గెలిచినా.. బెల్లీ విన్నర్ మాత్రం రవిశాస్త్రే’’ అంటూ చిత్ర విచిత్రంగా పోస్టులు చేస్తున్నారు. దీంతో రవిశాస్త్రి పొట్టపై సోషల్ మీడియాలో హాట్ హాట్గా చర్చ నడుస్తోంది.
Last Updated 9, Sep 2018, 12:49 PM IST | 2sports
|
Hyderabad, First Published 12, Jul 2019, 12:44 PM IST
Highlights
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రద్ధా చాలా కాలంగా తన స్నేహితుడు రోషన్ శ్రేష్టతో ప్రేమలో ఉందని.. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుందని.. శ్రద్ధా తల్లి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉందని గురువారం నాడు వార్తలు వినిపించాయి.
దీనిపై స్పందించిన శ్రద్ధాకపూర్ తండ్రి శక్తికపూర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. శ్రద్ధా వివాహం చేసుకోబోతుందట కదా నిజమేనా..? అని మీడియా అడిగిన ప్రశ్నకి శక్తికపూర్ స్పందిస్తూ.. 'అవునా.. నిజంగా నా కూతురు పెళ్లి చేసుకోబోతుండా..? ఎక్కడ..? పెళ్లెప్పుడు..? ఈ పెళ్లి గురించి నాకేం చెప్పలేదు.. కానీ తండ్రిగా నేను కూడా అక్కడ ఉండాలి కదా.. ప్లీజ్ నా కూతురి పెళ్లికి నన్ను పిలవండి.. మర్చిపోకండి' అంటూ సెటైర్లు వేశాడు.
ఆ తరువాత శ్రద్ధాకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. మరో నాలుగేళ్ల వరకు ఆమె పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'సాహో', 'స్ట్రీట్ డాన్సర్ 3D','బాఘి 3' వంటి చిత్రాల్లో నటిస్తోంది.
Last Updated 12, Jul 2019, 12:44 PM IST | 0business
|
Visit Site
Recommended byColombia
1997లో సల్మాన్ ఖాన్-కరిష్మాకపూర్ కాంబినేషన్‌లో వచ్చి జూడ్వా మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా జుడ్వా 2ను తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ధావన్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. ఇదిలాఉంటే తాజా ట్రైలర్‌లో శ్రీలంక బ్యూటీ జాక్విలైన్ తనదైన స్టైల్‌లో అందాలు ఆరబోస్తుంటే.. ఆమెతో పోటీ పడుతూ రెచ్చిపోయి ఎక్స్‌పోజింగ్ చేసింది తాప్సీ. బికినీతో కైపెక్కించే ఫోజులు ఇస్తూ హీరోకి లిప్ లాక్ కూడా ఇచ్చేసింది తాప్సీ. 3 నిమిషాల నివిడిగల ట్రైలర్‌ మొత్తంలో ఈ తరహా లిప్ లాక్‌లు చాలానే ఉండటంతో సినిమా మొత్తంలో ఈ ముద్దుగుమ్మలు రచ్చ ఏం రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 29న థియేటర్స్‌లో సందడి చేయనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
డివిలియర్స్కి తమ్ముడిలా ఉన్నావే..?
ఐపీఎల్ తరహాలో వెస్టిండీస్లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) అభిమానుల్ని ఆకర్షిస్తోంది.
TNN | Updated:
Sep 4, 2017, 04:06PM IST
ఐపీఎల్ తరహాలో వెస్టిండీస్లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) అభిమానుల్ని ఆకర్షిస్తోంది. మెరుపు ఫీల్డింగ్, కళ్లు చెదిరే షాట్లకి కలబోతగా మారిన సీపీఎల్.. సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసి వీడియో వైరల్గా మారింది. ఓ జట్టులోని లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వైడ్ లైన్పైకి వెళ్లి ఏబీ డివిలియర్స్ తరహాలో షాట్ కొట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. టాప్ క్రికెటర్లు సైతం పేస్ బౌలింగ్లో ఈ తరహా షాట్ కోసం ప్రయత్నించరు. కానీ.. సైయిరీస్ సాహసోపేత షాట్ ఔరా అనిపిస్తోంది.
జట్టు విజయానికి 22 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన దశలో.. ఫాస్ట్ బౌలర్ బంతిని ఆఫ్ స్టంప్కి దూరంగా విసిరాడు. సాధారణంగా ఈ బంతిని బ్యాట్స్మెన్ పాయింట్ దిశగా లేదా.. థర్డ్ మ్యాన్ దిశగా ప్లిక్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ.. సైయిరీస్ బంతి అంచనా వేసి ముందుగానే వైడ్ లైన్కి దగ్గరగా వెళ్లిపోయి మోకాళ్లపై కూర్చుని షాట్కి సిద్ధమైపోయాడు. బంతి పూర్తిగా బౌన్స్ అయ్యేలోపే.. చక్కగా బ్యాట్కి మిడిల్ చేస్తూ .. డీప్ స్వ్కైర్లెగ్ దిశగా షాట్ కొట్టాడు. అంతే.. బంతి నేరుగా వెళ్లి స్టాండ్స్లో పడింది. ఏడాది క్రితం ఐపీఎల్లో ఈ తరహా షాట్ని ఏబీ డివిలియర్స్ అభిమానులకి పరిచయం చేశాడు. దీంతో డివిలియర్స్కి తమ్ముడిలా ఉన్నావే.. అచ్చం అలానే షాట్ కొట్టావ్ అంటూ.. అభిమానులు సోషల్ మీడియాలో సైయిరీస్ని ప్రశంసిస్తున్నారు. | 2sports
|
i am ready for villain roles says aditya om
ఈ హీరోని గుర్తు పట్టారా.. విలన్గా వస్తాడట!
'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రంతో పరిచయమై దాదాపు 30 చిత్రాల్లో నటించిన ఆదిత్య ఓం ఆ తరువాత తెరమరుగయ్యారు.
TNN | Updated:
Oct 4, 2017, 05:56PM IST
' లాహిరి లాహిరి లాహిరిలో ' చిత్రంతో పరిచయమై దాదాపు 30 చిత్రాల్లో నటించిన ఆదిత్య ఓం ఆ తరువాత తెరమరుగయ్యాడు. అయితే ఆదిత్య ఓం నటించి, దర్శకత్వం వహించిన 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' గత సంవత్సరం విడుదలైంది ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు. దీంతో ఇప్పుడు ఆదిత్య ఓం విలన్‌ పాత్రలు, విలక్షణ పాత్రలు పోషించేందుకు సిద్ధమయ్యారు.
అక్టోబర్‌ 5 ఆదిత్య ఓం పుట్టినరోజు సందర్భంగా ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయంలో తనకు సీనియర్‌ నటులైన జగపతిబాబు, సాయికుమార్‌, శ్రీకాంత్‌లను ఆదర్శంగా తీసుకున్నట్టు తెలిపారు. హీరోగా ఒకటిన్నర దశాబ్దంగా తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు సదా కృతజ్ఞుడనై వుంటానని, ఇకపై విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం తనకు వుందని ఆదిత్య ఓం తెలిపారు. | 0business
|
రహానే ఔట్:
విశాఖ: భారత్-ఇంగాండ్ జట్ల మధ్య విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన రహానే బ్రాడ్ బౌలింగ్లో కుక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాఉడ.. దీంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు, కోహ్లీ 70 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. | 2sports
|
-రుణ లభ్యత పెంపు, లిక్విడిటీ దన్ను కోరాం
- భిన్నాభిప్రాయలపై పెద్దబ్యాంక్తో చర్చించాం
- చర్చిస్తే... ఆ వ్యవస్థను నాశనం చేసినట్టేనా..!
- బాధ్యతల్ని, ఇబ్బందుల్ని తెలియజేసే యత్నం చేశాం..
- ఆర్బీఐ అధికారాలను మా ప్రభుత్వం లాక్కోలేదు.. : ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడిన సంగతిని మోడీ సర్కారు ఎట్టకేలకు బాహాటంగా ఒప్పుకుంది. స్వయంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్బీఐ పనితీరుకు సంబంధించి తమకు రెండు మూడు అంశాల్లో భేదాబిప్రాలున్నాయని వెల్లడించారు. ఈ అంశాలకు సంబంధించి తాము లోతుగా చర్చలు జరిపామని ఆయన తెలిపారు. లోతుగా చర్చలు జరపడం.. ఆర్బీఐ వ్యవస్థను నాశనం చేయడం ఎలా అవుతుందని ఆయన తమ ప్రభుత్వ విమర్శకులను ప్రశ్నించారు. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంపై రేగుతున్న రాజకీయ దుమారానికి జైట్లీ తనదైన రీతిలో వివరణనిచ్చారు. గతంలో కొన్ని ప్రభుత్వాలు, ప్రధానులుగా పని చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు తమ హయాంలో ఆర్బీఐ గవర్నర్లు రాజీనామాలు చేసేలా.. చేపట్టిన అనూహ్య చర్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 'టైమ్స్ నెట్వర్క్స్ ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్'లో ఆయన మాట్లాడుతూ వ్యవస్థలో రుణ లభ్యత పెరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆర్థిక వ్యవస్థకు అవసరమైన లిక్విడిటీ దన్నును కల్పించాలన్న అంశాలపై ఆర్బీతో కొంత భేదాభిప్రాయాలు ఏర్పడినట్టుగా జైట్లీ వెల్లడించారు. ఈ అంశాలపై తమ ఆందోళనను వెల్లడించేందుకు గాను ప్రభుత్వం ఆర్బీఐతో చర్చలను ప్రారంభించిందని తెలిపారు. ఈ అంశాలు కూడా ఆర్బీఐ విధుల్లో భాగమే అయినందున వీటిపై దృష్టి సారించాలని పెద్ద బ్యాంక్ను కోరామని ఆయన తెలిపారు. స్వయంప్రతిపత్తి, స్వతంత్రత కలిగిన ఆర్బీఐ లాంటి సంస్థతో చర్చలు జరపడం ఆ వ్యవస్థను నాశనం చేయడం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అయితే ఆర్బీఐ పనితీరును ప్రశ్నించే క్రమంలో ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్-7ను వినియోగించిందన్న అంశంపై జైట్లీ స్పష్టతనివ్వలేదు.
లోపాల్ని తెలియజేసే ప్రయత్నం చేశాం..
తాము సార్వభౌమాధికారం కలిగిన ప్రభుత్వమని, ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు సంబంధించి సర్కారు, ఆర్బీఐలు ముఖ్యమైన వాటాదారులని ఆయన అన్నారు. ఆర్బీఐ చేయాల్సిన పనులను తాము చేజిక్కించుకోవడం లేదని.. కాకుంటే క్రెడిట్, లిక్విడిటీలు ఆర్బీఐ భాద్యతేనని గుర్తు చేస్తున్నామన్నారు. ఎకొన్ని సమయాల్లో వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలకు ఇబ్బందులను గురించి తెలియపరుస్తూ.. లోపాలను సరిదిద్దుకోవాల్సిందిగా కోరాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వ్యవస్థలోని ఇబ్బందులను గురించి ప్రభుత్వం తెలియజేయకపోతే.. సర్కారు తన కర్తవ్య నిర్వహణలో విఫలమవుతుందని అన్నారు. ప్రభత్వ విధానాలతో ఆర్బీఐ విధానాలు సమకాలీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyd Internet 314 Views bumper offer for airtel customers
AIRTEL
ఢిల్లీ: దేశీయ టెలీకాం రంగంలో రిలయన్స్కు చెందిన జియో తెచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఇతర టెలికాం సంస్థలు తమ ఉనికిని
కపాడుకొనుటకు నానా తంటాలు పడుతున్నాయి. ముఖ్యంగా జియో ఎఫెక్ట్ నుంచి తమ కస్టమర్లకు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే జియోకు దీటుగా డేటా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ రూ. 5కే 4జీబీ డేటా అంటూ బంపర్ ఆఫర్తో ముందుకొచ్చింది. అంటే రూ. 5తో రీఛార్జ్ చేసుకుంటే 4జీబీ 3జీ లేదా 4జీ డేటాను పొందవచ్చు. ఏడు రోజుల వాలిడిటీతో ఈ ఆఫర్ను తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్ 4జీ సిమ్ కలిగిన లేదా 4జీ సిమ్కు అప్గ్రేడ్ అయిన ఎంపిక చేసిన ఎయిర్టెల్ ప్రీపెయిడు వినియోగ దారులకు మాత్రమే వర్తిస్తుందని ఎయిర్టెల్ తెలిపింది. అంతేగాక ఏడు రోజుల తర్వాత డేటా మిగిలిపోతే దాన్ని మళ్లీ వేరే ప్లాన్కు బదిలీ చేసే సౌకర్యం లేదని పేర్కొంది. దీంతో పాటు రూ.8, రూ. 15, రూ. 40లతో వాయిస్ కాలింగ్ ఆఫర్లను కూడా ఎయిర్ వినియోగదారులకు అందుబాటులో
ఉంచింది. | 1entertainment
|
Aug 13,2017
మరో'సారి' నష్టాల్లోకి జారిన ఆర్కాం
ముంబయి: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కాం) జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలోనూ మరోసారి నష్టాలను ప్రకటించింది. కొత్త టెలికాం సంస్థలు మార్కెట్లోకి రావడం.. చౌక ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షిస్తుండడం సంస్థ లాభాలపై ప్రభావం చూపింది. దీంతో ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికానికి కంపెనీ నష్టం రూ .1,210 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.90 కోట్ల లాభాన్ని ప్రకటించడం విశేషం. మొత్తం ఆదాయం 33 శాతం క్షీణించి రూ.5,361 కోట్ల నుంచి రూ.3,591 కోట్లకు చేరుకుందని ఆర్కాం తెలిపింది. ఇప్పటికే దాదాపు రూ. 45,000 కోట్ల రుణభారంలో కూరుకుపోయిన ఆర్కాం తాజా ఫలితాలంతో మరింత కుదేలైంది. ఆర్కామ్ సంస్థ నష్టాలను ప్రకటించడం వరుసగా ఇది మూడో త్రైమాసికం కావడం విశేషం. ఎయిర్సెల్తో సంస్థ విలీనపు ప్రక్రియ అనుకున్నట్టుగానే ముందుకు సాగుతున్నట్టుగా ఆర్కాం తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
‘కౌన్ బనేగా కరోడ్పతి’లో మహిళా క్రికెటర్లు..!
బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి(కేబీసీ)’లో భారత మహిళా క్రికెటర్లు సందడి చేశారు
TNN | Updated:
Sep 2, 2017, 03:47PM IST
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)’లో భారత మహిళా క్రికెటర్లు సందడి చేశారు. ఇటీవల ఇంగ్లాండ్‌లో ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరిన భారత్ జట్టు అక్కడ పరాజయం చవిచూసినా.. పోరాట స్ఫూర్తితో అందర్నీ ఆకట్టుకుంది. షో సందర్భంగా అమితాబ్ అడిగిన ఛాలెంజింగ్ ప్రశ్నలకి క్రికెటర్లు మిథాలీ రాజ్, పూనమ్ రౌత్, స్మృతి మందాన‌, వేదా కృష్ణ‌మూర్తి, జులన్ గోస్వామి, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ సరదాగా సమాధానాలు చెప్పి రూ. 6.40లక్షలని గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని హైదరాబాద్‌లోని ఓ ఛారిటీ సంస్థకి అందజేయనున్నట్లు క్రికెటర్లు వెల్లడించారు.
ప్రపంచకప్‌‌‌లో అందమైన ఆటతో వెలుగులోకి వచ్చిన స్మృతి మందాన‌.. ‘చిన్నపిల్లల తరహాలో కొంటె పనులు చేయడం తనకిష్టమని.. క్రికెట్ ఆడేటప్పుడు చుట్టుపక్కల ఇళ్లలోని సామాన్లు పగలగొట్టేశాను’ అని వెల్లడించింది. ఐపీఎల్‌లో ఏ జట్టు పేరులో జంతువు ఉందని ప్రశ్నించగా.. సమాధానం చెప్పడంలో కెప్టెన్ మిథాలీ రాజ్, వేదా విఫలమయ్యారు. దీంతో ఆడియన్స్ సహాయంతో అనంతరం సమాధానం చెప్పారు. చిన్నతనంలో క్రికెట్ బంతి‌ని కొనుగోలు చేసేందుకు తన తండ్రి జేబులోంచి డబ్బులు దొంగతనం చేసినట్లు ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి వెల్లడించింది. | 2sports
|
మార్కెట్లోకి అలర్జీ ప్రొటక్ట్ వాషింగ్ మిషిన్
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత గృహోపకరణాల అమ్మకాలు పడిపోయాయని గోద్రెజ్ అప్లరున్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు. ఈ రెండు నిర్ణయాల వల్ల పరిశ్రమ ఒత్తిడికి గురి అయ్యిందన్నారు. బుధవారం హైదరాబాద్లో ఆయన నూతన అలర్జీ ప్రొటక్ట్ ఫీచర్తో ఫ్రంట్ లోడ్ ఫుల్లీ అటోమేటెడ్ వాషింగ్ మిషీన్ను ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిఎస్టి వల్ల వాషింగ్ మిషన్లు మూడున్నర శాతం మేర ప్రియమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం వీటిపై 28 శాతం జిఎస్టి అమల్లో ఉందన్నారు. కొత్త వాషింగ్ మిషిన్ను అత్యాధునిక టెక్నాలజీతో, ఎకో బ్యాలెన్సింగ్ వ్యవస్థలో రూపొందించినట్టు తెలిపారు. దీంతో విద్యుత్తు ఆదా అవుతుందని అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 3, Sep 2018, 5:35 PM IST
Highlights
ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అన్ని చోట్ల శ్రీకృష్ణునికి పూజాలు జరుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా.. కృష్ణడు, గోపికల అవతారాల్లో దర్శనమిస్తున్నారు
ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అన్ని చోట్ల శ్రీకృష్ణునికి పూజాలు జరుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా.. కృష్ణడు, గోపికల అవతారాల్లో దర్శనమిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలు కూడా కృష్ణ, గోపికలుగా కనిపించి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. '
బన్నీ కుమారుడు అయాన్ కృష్ణుడి వేషంలో, అర్హ గోపిక వేషంలో రెడీ అయి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. వీరిలో అర్హ కాస్ట్యూమ్స్, గోపిక అవతారంలో ఆమె కనిపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయాన్ పిల్లనగ్రోవి చేతపట్టుకొని అచ్చం బాలకృష్ణుడిని తలపిస్తున్నాడు. | 0business
|
Hyderabad, First Published 11, Sep 2019, 2:20 PM IST
Highlights
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మళ్లీ లొల్లి మొదలైంది. అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మధ్య వివాదం తలెత్తినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ విజయం సాధించిన తరువాత అందులో ఉన్న సభ్యుల మధ్యనే గొడవలు జరగడం మొదలయ్యాయి. 'మా' అధ్యక్షుడు నరేష్ కి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ కి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఈ క్రమంలో నరేష్ కి షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి రాజశేఖర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
శివాజీరాజా 'మా' అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న నరేష్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శివాజీరాజాపై పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు నరేష్. నరేష్ ప్యానెల్ లో జీవిత, రాజశేఖర్ దంపతులకు మంచి పదవులు దక్కాయి.
మొదట్లో అందరూ బాగానే ఉన్నారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న కొన్ని పరిణామల వల్ల వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నరేష్ తన ప్యానెల్ సభ్యులతో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం సభ్యులకు నచ్చడం లేదు.
ఇప్పటికే నటి హేమ ఈ విషయంపై కామెంట్స్ చేసింది. ఇప్పుడు రాజశేఖర్ దంపతులు కూడా ఈ విషయంలో గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నరేష్ కి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జీవితరాజశేఖర్ దంపతులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ వివాదం ఎక్కడవరకు వెళ్తుందో చూడాలి!
Last Updated 11, Sep 2019, 3:50 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ తడబాటు.. 12 పరుగులు.. 6 వికెట్లు
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాప్ ఆర్డర్ అనూహ్యంగా తడబడింది. వర్షం కారణంగా కుదించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో
TNN | Updated:
Aug 24, 2017, 09:52PM IST
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాప్ ఆర్డర్ అనూహ్యంగా తడబడింది. వర్షం కారణంగా కుదించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో 18 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 121/6తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. శ్రీలంక బౌలర్ ధనుంజయ (5/25) ధాటికి కేవలం 12 పరుగుల వ్యవధిలోనే భారత్ వరుసగా 6 వికెట్లను చేజార్చుకుంది.
ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ వేసిన ధనంజయ బౌలింగ్‌లో తొలుత రోహిత్ శర్మ (54) ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటవగా.. అనంతరం శిఖర్ ధావన్ (49)ని సిరివర్దనె పెవిలియన్‌కి పంపాడు. మళ్లీ 18వ ఓవర్ వేసిన ధనుంజయ వరుస వికెట్లతో మ్యాచ్‌ని రసవత్తరంగా మార్చేశాడు. ఆ ఓవర్ తొలి బంతికి కేదార్ జాదవ్ (1)ని క్లీన్‌బౌల్డ్ చేసిన ధనుంజయ.. మూడో బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లి (4), ఐదో బంతికి కేఎల్ రాహుల్ (4)ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్య (0) కూడా ధనుంజయ బౌలింగ్‌లోనే క్రీజు వెలుపలికి వచ్చి భారీ షాట్ కోసం ప్రయత్నిస్తూ స్టంపౌట్ అయ్యాడు. దీంతో 109/1 నుంచి భారత్ ఒక్కసారిగా 121/6తో నిలిచింది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఇన్ఫోసిస్లోకి నందన్ నిలేకని రీ ఎంట్రీ
వ్యాపారవర్గాలు ఊహించిందే జరిగింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటీవ్ చీఫ్ నందన్ నిలేకని ఇన్ఫోసిస్లోకి..
TNN | Updated:
Aug 24, 2017, 10:54PM IST
వ్యాపారవర్గాలు ఊహించిందే జరిగింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటీవ్ చీఫ్ నందన్ నిలేకని ఇన్ఫోసిస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చుకున్నారు. నిలేకనిని నాన్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్‌గా నియమిస్తూ ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 26 ఏళ్ల వయస్సులో వున్నప్పుడు ఇన్ఫోసిస్‌ని స్థాపించిన వారిలో ఒకరైన నిలేకని 2009లో రెండవసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వంతో కలిసి ఆధార్ ఆలోచనకి ప్రాణం పోశారు. ఆధార్ వెనుకున్న ఈ మాస్టర్ మైండ్ అప్పటి నుంచి యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంక్షోభంలో వున్న నేపథ్యంలో సంస్థని సంక్షోభం నుంచి బయటపడేసేందుకు నందన్ నిలేకని మరోసారి ఇన్ఫీ నాన్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
ఇదిలావుంటే, ఇన్ఫోసిస్ బోర్డు నుంచి తప్పుకుంటున్నట్టుగా ఇన్ఫోసిస్ ఛైర్మన్ ఆర్.శేషసాయి, కో చైర్మన్‌ రవి వెంకటేశన్‌, జెఫ్‌ లేమాన్‌లు చేసిన రాజీనామాలను సంస్థ అంగీకరించింది. దీంతో శేషసాయి, రవి వెంకటేషన్, జెఫ్ లేమాన్ ఇన్ఫోసిస్ బోర్డు నుంచి వైదొలిగారు. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
‘మా పోరాటం ఓ స్థాయికి చేరింది. ఇప్పుడిక రాజీపడే ప్రశ్నేలేదు. నేను ఒంటరిగా పోరాడుతున్నా. దీన్ని ఇప్పుడు మధ్యలోనే వదిలేస్తే మొత్తం మహిళా సమాజానికే ఓటమిలా పరిణమిస్తుంది. నేను అలా ఎందుకు చేస్తా? నా వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి’ అని హసీన్ చెప్పింది.
షమి తనకు ప్రాణ హాని ఉందని హసీన్ ఆరోపించింది. పోలీసుల రక్షణ కోరడాన్ని ఆమె సమర్థించుుంది. ‘షమి ఇవాళ ఉదయం కూడా ఫోన్ చేశాడు. నీకు సిగ్గుగా లేదా? నన్ను ఇరికించావు అని బెదిరించాడు. కూతుళ్లు, తన భవిష్యత్ దృష్ట్యా ఆరోపణలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని కోరాడు’ అని హసీన్ చెప్పుకొచ్చింది.
తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలున్నాయని, తనను చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని షమీ భార్య హసీన్ జహాన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న కోల్కతా పోలీసులు విచారణ చేపట్టారు.
షమీ, హసీన్ జహాన్
మరోవైపు.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది. బీసీసీఐ అతడిని బి గ్రేడ్లో చేరుస్తూ కాంట్రాక్టు కూడా ప్రకటించింది. దీంతో అతడి క్రికెట్ కెరీర్కు ఎలాంటి ఢోకా లేదని స్పష్టమైంది. అందుకుతగ్గట్టే షమీ కూడా.. అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న తన ప్రాక్టీస్కు ఏమాత్రం విరామం ప్రకటించకపోవడం గమనార్హం. అభిమానులు కూడా అతడికి అండగా నిలుస్తున్నారు. ‘నీకు మేము అండగా ఉంటాం. నువ్వు జట్టులోకి తప్పక తిరిగి వస్తావు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Thomos Hrudlika
రూ.10వేల రుణపరపతిలో హోంక్రెడిట్ ఇండియా
హైదరాబాద్, అక్టోబరు 13: రిటైల్రంగరుణాల్లోను, స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లకు రుణపరపతిని అందిస్తున్న హోమ్క్రెడిట్ ఇండియాభారత్లో రెండో త్రైమా సికంలో 60శాతం మార్కెట్ వాటాసాధిస్తుందని కంపెనీ ముఖ్య మార్కెటింగ్ అధికారి థొమస్ హృడ్లికా అన్నారు. పదివేల రూపాయల లోపు రుణపరపతిలో ఇప్పటికే నంబర్వన్గా నిలిచామని జూన్ 30వ తేదీనాటికి 680 కోట్ల రుణాలు పంపిణీచేసినట్లు తొమస్ వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల లో కూడా తాము కీలకంగా నిలిచామని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం కేంద్రాల్లో శాఖలు పనిచేస్తున్నాయన్నారు. రానున్న కాలంలో రెండు రాష్ట్రాల్లోను సిబ్బంది సంఖ్యను రెట్టింపుచేస్తామని ప్రస్తుతం ఉన్న 700 సంఖ్యను 1200కు పెంచుతామన్నారు చైనాతరహాలో రోజుకు వెయ్యి దరఖాస్తులు ప్రాసెస్ చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. పదినుంచి 15వేల రుణాలకు ఎక్కువ డిమాండ్ ఉందని, ప్రస్తు తం తమ రుణాల టికెట్సైజ్ రూ.60వేల వరకూ ఇస్తామన్నారు. అయితే రుణగ్రహీతల సామర్ధ్యం ఆధారంగా ఉంటుందన్నారు. స్మార్ట్ఫోన్ల పరంగా ఆరు నుంచి పదినెలలు, టూవీలర్లపరంగా రెండు వారాల నుంచి 36 నెలల వరకూ ఈ రుణపరపతి ని అందిస్తామని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 11దేశాల్లో సేవలందిస్తున్న హోంక్రెడిట్ భారత్లో 50 నగరాల్లో సేవలందిస్తోందని తొమస్ హృడ్లికా వెల్లడించారు. తమకు భారత్లోని హోమ్క్రెడిట్ సేవలందిస్తున్న నగరాల్లో టాప్3 ర్యాంకులో హైదరాబాద్ నిలిచిందని అందుకే హైదరాబాద్పై ఎక్కువ దృష్టిసారించామని ఆయన అన్నారు
2017 చివరినాటికి 30వేల మందికి తమ ఉద్యోగులను పెంచుతామని థొమస్ వెల్లడించారు. కేవలం ఐదు నిమిషాల్లోనే కస్టమర్లు రుణాలు పొందగలుగుతున్నారని మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ ట్యాబ్పిసిలు, ఎలక్ట్రా నిక్ వస్తువులు, ద్విచక్రవాహనాలు కొనగలి గిన అర్హత కలిగిన కస్టమర్లకు కంపెనీ ఆయా స్టోర్స్లోనే ఫైనాన్సింగ్ అందిస్తుం దని వివరించారు. భారత్లోనే కాకుండా యూరప్, ఆసియా, ఉత్తర అమెరికాల్లోని దేశాల్లో హోమ్క్రెడిట్ తన కార్యకలాపాలు విస్తరించిందని ఆయన అన్నారు. భారత్ లో జియోని, ఇంటెక్స్, లావా, మైక్రో మాక్స్, ఒప్పో, సాంమ్సంగ్, వివోలాంటి ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీలతో ఒప్పందంచేసుకు న్నట్లు థామస్ హృడ్లికా వెల్లడించారు. సమావేశంలో సంస్థ ఎపి, తెలంగాణ రీజినల్ మేనేజర్ పాల్గొన్నారు. | 1entertainment
|
Dec 27,2018
ఎట్టకేలకు మార్కెట్లకు ఉపశమనం
ముంబయి : వరుసగా మూడు రోజులు నష్టాలను ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లకు బుధవారం ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి సూచీలు, రిలయన్స్ ఇండిస్టీస్ స్టాక్స్ ప్రధాన మద్దతును అందించాయి. దీంతో బిఎస్ఇ సెన్సెక్స్ 180 పాయింట్లు లేదా 0.51 శాతం రాణించి 35,650 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 66 పాయింట్లు లేదా 0.62 శాతం లాభపడి 10,730 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లు అర శాతం మేర పెరగడం ఇతర దేశాల మార్కెట్లకు మద్దతునిచ్చాయి. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ ఇంట్రా ట్రేడింగ్లో 39 పైసలు పటిష్టమై 69.75కు చేరడం మదుపర్లలో విశ్వాసాన్ని నింపింది. తుదకు రూపాయి విలువ ఏడు పైసలు బలోపేతమై 70.07 వద్ద ముగిసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 43 సెంట్లు తగ్గి 50.90 డాలర్ల వద్ద నమోదయ్యింది. దీంతో ఏడాది కనిష్టానికి చమురు ధరలు దిగిరావడం తదితర పరిణామాలు భారత మార్కెట్లకు లాభాలను తెచ్చిపెట్టాయి.
సెన్సెక్స్-30లో భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా 3.95 శాతం పెరిగింది. ఇదే క్రమంలో హెచ్డిఎఫ్సి 2 శాతం, హెచ్డిఎఫ్సి బ్యాంకు 1.96 శాతం, ఎల్అండ్టి 1.14 శాతం, బజాజ్ ఆటో 1.10 శాతం చొప్పున అధికంగా లాభపడిన వాటిలో ముందు వరసలో ఉన్నాయి. మరోవైపు సన్ ఫార్మా, యస్ బ్యాంకు, టిసిఎస్, ఎన్టిపిసి, టాటా మోటార్స్ సూచీలు 1.78 శాతం నుంచి 0.70 శాతం వరకు అధికంగా విలువ కోల్పోయిన వాటిలో టాప్లో ఉన్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Vaani Pushpa 233 Views pe/vc funds are best
currency
న్యూఢిల్లీ: ప్రైవేటు ఈక్విటీ వెంచ్ క్యాపిటల పెట్టుబడుల ఆల్టైమ్ గరిష్టస్థాయికి చేరాయి. జనవరి ఆగస్టునెలల మధ్యకాలంలో 36.7 బిలియన్ డాలర్లకుపైబడిన పెట్టుబడులు వచ్చినట్లు గణాంకాలువెల్లడిస్తునానయి. ఇన్ఫ్రా రంగానికి అత్యధిక పెట్టుబడులు వస్తుంటాయి. మొత్తం 803 మిలియన్డాలర్ల విలువైన డీల్స్ ఇన్్ఫ్రా రంగానికే వచ్చాయి. ఆ తర్వాత రియాల్టీ రంగానికి 764 మిలియన్ డారల్లు పెట్టుబడులు అందాయి. అంతకుముందు ఏడాది 2018లో ఇదేకాలంలో 36.5 బిలియన్ డాలర్లనుంచి మరింతగాపెరిగాయి. భారత ప్రైవేటు ఈక్విటీ వెంచర్క్యాపిటల్ అసోసియేషన్ గణాంకాలనుచూస్తే ఈ పెట్టుబడులు ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. ప్రైవేటు ఈక్విటీ వెంచర్ పెట్టుబడులు 39శాతం పెరిగాయి. మొత్తం 82 డీల్స్లో 4.4బిలియన్ డాలర్లు జరిగాయి. అదే గత ఏడాది ఈకాలంలో 59 డీల్స్ 3.9 బిలియన్ డాలర్లుగా కొనసాగాయి. ఆగస్టునెలలో ప్రైవేటు ఈక్విటీ వెంచర్ క్యాపిటల్ 39శాతం పెరిగి 4.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు 59 డీల్స్లో 3.9 బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. ఎర్నెస్ట్ అండ్ యంగ్ సర్వే నివేదికలప్రకారం 16 మెగాడీల్స్ 100 మిలియన్ డాలర్లకుపైబడిన డీల్స్ జరిగాయి. పటిష్టమైన పెట్టుబడుల కార్యకలాపాలు జరిగాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ట్రైన్లో టీమిండియా క్రికెటర్... జనాలు షాక్
క్రికెటర్ల లైఫ్ ఎలా ఉంటుంది. ఆ జల్సానే వేరు. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఎగబడతారు. సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్లు ఇవ్వాలి... ఒక్కమాటలో చెప్పాలంటే ఆ స్టైలే వేరు. అలాంటిది ఓ క్రికెటర్ సాధారణ వ్యక్తిలా ట్రైన్లో వెళతాడా చెప్పండి. కాని ఓ క్రికెటర్ ఎదురుగా వచ్చి కూర్చున్నా... ట్రైన్లో జనాలు నమ్మలేకపోయారు.
TNN | Updated:
Mar 2, 2018, 10:24PM IST
క్రికెటర్ల లైఫ్ ఎలా ఉంటుంది. ఆ జల్సానే వేరు. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఎగబడతారు. సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వాలి... ఒక్కమాటలో చెప్పాలంటే ఆ స్టైలే వేరు. అలాంటిది ఓ క్రికెటర్ సాధారణ వ్యక్తిలా ట్రైన్‌లో వెళతాడా చెప్పండి. కాని ఓ క్రికెటర్ ఎదురుగా వచ్చి కూర్చున్నా... ట్రైన్‌లో జనాలు నమ్మలేకపోయారు. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించారట. అతనెవరో తెలుసుకునేందుకు కొంతమంది గూగుల్‌లో కూడా వెతకారట. తర్వాత అతనెవరో తెలుసుకొని షాకయ్యారట. అతనెవరో కాదండీ శార్దూల్ ఠాకూర్ . ట్రైన్‌లో ప్రయాణించి అందరికి పెద్ద షాకే ఇచ్చాడు ఈ యంగ్ క్రికెటర్. | 2sports
|
రూపాయి త్వరలో కోలుకుంటుంది
- ఎఫ్పీఐలు పెరిగితే 68-69 స్థాయికి: సర్కారు
న్యూఢిల్లీ: డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమవుతున్నా త్వరలోనే పరిస్థితులు సర్దుకోవచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెలలో దేశంలోకి సానుకూల పెట్టుబడులు వస్తే రూపాయి విలువ డాలరుతో పోలిస్తే రూ.68-69 వద్ద స్థిరపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టర్కీపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఆసియాలోని అన్ని దేశాల కరెన్సీ ఒత్తిడిలోకి జారుకున్నాయని ఆయన అన్నారు. ఆసియాలోని అన్ని కరెన్సీల కంటే రూపాయి బలహీన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ.. అది భారతపై ఇతర దేశాల అవగాహనను ప్రభావితం చేయలేదనివివరించారు. రూపాయి పతనం కారణంగా దేశంలోకి 'ఫారన్ పోర్టుఫోలియో ఇన్వెష్ట్మెంట్స్' (ఎఫ్పీఐ) రాకపై ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. దీనికి తోడు జులైలో ఎఫ్పీఐలు ఎక్కువగా దేశం దాటి వెళ్లకపోవడం కూడా ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇక్కడ మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో విదేశీ పెట్టుబడులు ఎక్కువగా దేశం దాటి వెళ్లాయని అన్నారు. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం 2000 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడుల ఎల్లలు దాటి వెళ్లాయని ఆయన వివరించారు. భవిష్యత్తులో చమరు ధరలు మరింత పెరుగకుండా ఉంటే రూపాయి విలువ డాలరుతో పోలిస్తే రూ.68-69ల స్థాయిలో స్థిరపడే అవకాశం ఉందని ఆయన విశ్లేషించి చెప్పారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
MaLya11
డీల్కు ముందే డియోజియోకు తెలుసు!
న్యూఢిల్లీ,జూన్ 25: కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాలను ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేసి పన్నుల ఎగవేత, మనీలాండ రింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త విజ§్ుమాల్యా తన యునైటెడ్ స్పిరిట్స్ను బ్రిటన్ సంస్థ డియోజియోకు విక్రయించేముందే నిధులు బదలాయిం చారా అన్నది విచారణ జరుగుతోంది. ఈ అంశం కొను గోలుకు ముందే డియోజియోకు తెలుసని అమెరికా వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. 2012లో డియోజియో ఎగ్జిక్యూటివ్లను ముంబై నవాసానికి ఆహ్వానించిన మాల్యా వారికి విలాసవంతమైన విందును ఇచ్చారని యునైటెడ్ స్పిరిట్స్లో మెజార్టీ వాటాను వారికి ఆఫర్చేసి నట్లు కథనం ఉటంకించింది. డియో జియో ఈ ఆఫర్పై దీర్ఘకాలం తర్జన భర్జనలు పడింది. రెండువైపులా తిరిగి చర్చలు ప్రారంభం అయ్యా యి. కంపెనీ విలీనమే ఒక సవాల్గా నిలిచింది.
ఇక మద్యం ఉత్పత్తుల పరంగా విజ§్ుమాల్యా కింగ్గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకున్న ఎయిర్లైన్ కంపె నీ నగదుపరంగా సమసయలు ఎదుర్కొనడంతో తన మద్యం బిజినెస్ నుంచి ఈ కంపెనీకి అడ్వాన్సులు ఇచ్చారు. కేవలం చేతితోరాసిన చిట్టాపద్దుల్లో వీటిని చూపించారు. వాటినిసైతం డియోజియోకు చూపించి నట్లు వాల్స్ట్రీట్ కథనం ప్రచురించింది. డియోజియోకు చెప్పినట్లుగా ఈ మొత్తాలను కొన్ని కీలకరాష్ట్రాల్లోని రాజ కీయ నేతలకు ఇచ్చినట్లు తేలింది. ఈ రాష్ట్రాల్లో యునై టెడ్ స్పిరిట్స్ ఉత్పత్తి యూనిట్లను నిర్వహించింది. తదనంతరం డియోజియో యుఎస్ఎల్లో 55శాతం వాటాను 3.2బిలియన్ డాలర్లకు ఒనుగోలుచేసింది. ఐదేళ్ల తర్వాత మాల్యా బిజినెస్ను మొత్తం టేకోవర్చేసిం ది. జానీ వాకర్ విస్కీ, స్మిర్నాఫ్ వోడ్కాతయారీపరంగా నంబర్వన్గా నిలిచింది.
డియోజియోకు ఈ డీల్ నిర్వహించిన ఇవాన్ మెనెజెస్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా వచ్చారు. తదనంతరం డియోజియో భారతీయ అధికారయంత్రాంగం చట్రంలో అనేక సమస్యలు ఎదు ర్కొంది. న్యాయపరమైన సమస్యలు కూడా ఎదుర య్యాయి. ఈడీల్ను మాల్యా మనీలాండరింగ్ కోసం వినియోగించారా అన్నది కూడాదర్యాప్తుసంస్థలు విచారణ చేశాయి. అయితే ఇపుడు బ్యాంకర్లు డియో జియో కొను గోలుచేసిన షేర్లను కూడా తిరిగి రాబట్టాలని చూస్తున్నా యి. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి 500 మిలియన్ డాలర్ల ను మాల్యా బదలాయించారని ఆ మొత్తం తిరిగి చెల్లించలేదని డియోజియో చెపుతోంది. ఆయన ఇతర వ్యాపారాలకు మద్దతుగా ఈ నిధులు బదలాయించారని డియోజియో అంగీకరించింది. కంపెనీ డీల్పై సంతకం చేసేముందే ఇవన్నీ తెలుసు కున్నట్లు అమెరికాపత్రిక విశ్లే షించింది.
యుఎస్ఎల్లో జరిగిన లావాదేవీలన్నీ డీల్ పూర్తయిన తర్వాత మాత్రమే స్పష్టం అయిందని ఆధారాలు అప్పుడే లభించాయని డియోజియో అధికారప్రతినిధి వివరించారు. లండన్కు చెందిన డియోజియో గతఏడాదే మాల్యాతో సంబంధాలు తెంచేసుకుంది. మాల్యా తనరుణబకాయిలు ఎగవేసార న్న అభియోగాలపై మనీలాండరింగ్, పన్నుల ఎగవేత కేసులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు తమకు 1.6 బిలియన్ డాలర్లు బకాయిలు రావాలని వీటినిరప్పించేం దుకు మాల్యాను అవసరమైతే జైలుకు పంపిస్తామని చెపుతున్నాయి. గడచినఏప్రిల్నెలలో మాల్యా లండన్లో అరెస్టు అయి 6.50 లక్షల పౌండ్ల బెయిల్పూచీకత్తుపై విడుదలయ్యారు. నేరస్తుల అప్పగింత కార్యక్రమం కింద మాల్యాను అరెస్టుచేసారు.అయితే మాల్యా ఇప్పటికీ తానెలంటి అక్రమాలు చేయలేదని ప్రకటించడం విశేషం. | 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.