news
stringlengths
299
12.4k
class
class label
3 classes
పీఎస్‌బీలకు నూతన జవసత్వాలు - రూ.25,000 కోట్ల మూలధనం సమకూర్చనున్న కేంద్రం - మంచి ప్రారంభానికి నాంది : రాజన్‌             ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) నూతన జవసత్వాలను నింపేందుకు గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సూమారు రూ.25000కోట్ల మేర మూలధనం సమకూర్చాలని కేంద్రం యోచిస్తోందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పునరుద్ఘాటించారు. ఇది మంచి ప్రారంభంనాకి ప్రస్తుత అవసరాలను తీర్చేందుకు ఇది సరిపోతుందని ఆయన అన్నారు. బ్యాంకులకు తిరిగి మూలధన సమకూర్చేందుకు గాను ఈ ఏడాది బడ్జెట్‌లో రూ,7940 కోట్ల మేర ప్రతిపాదనలను ఉంచిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, మరో రూ,12,010 కోట్ల అదనపు మూలధనాన్ని బ్యాంకులకు అందించేందుకు గాను శుక్రవారం పార్లమెంట్‌ ఆమోదం పొందారు. రూ.5000 కోట్లను సప్లమెంటరీ డిమాండ్‌ మేరకు అందించనున్నారు. దీంతో మొత్తం బ్యాంకుల మూలధనీకరణ రూ.25000 కోట్లకు చేరనుంది. అయితే ఆర్థిక మంత్రి జైట్లీ మాత్రం ఒక ప్రకటన చేస్తూ పీఎస్‌బీలకు ప్రస్తుతానికి చాలినంత మూలధనం ఉందని అయితే.. రానున్న నాలుగేళ్ల కాలంలో బ్యాంకులకు దాదాపు రూ.1,80,000 కోట్ల మేర మూలధనం అదనంగా అవసరం కావచ్చని జైట్లీ అభిప్రాయపడ్డారు. బడ్జెటరీ సాయం కింద రూ.70,000 కోట్లు, ప్రస్తుత, వచ్చే ఏడాది రూ.25,000 కోట్లను 2017-18, 2018-19లో రూ.10,000 కోట్ల మేర సమకూర్చనున్నట్లుగా ఆయన తెలిపారు. మరోవైపు బ్యాంకులు కూడా మిగతా రూ.1.1 లక్షల కోట్లను మార్కెట్‌ ద్వారా సమీకరించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.దీనిపై ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌. గాంధీ స్పందిస్తూ ఇది ప్రభుత్వం నుంచి ఆహ్వానించ తగ్గ చర్య అని పేర్కొన్నారు. మిగతా రూ.1.1 లక్షల కోట్ల సొమ్మును బ్యాంకులు రానున్న నాలుగేళ్లలో సమీకరించాల్సి ఉంటుందని.. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులలో వాటాల కొనుగోలుకు మార్కెట్లు చాలా ఆసక్తిగా ఉన్నాయని ఆయన అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ‘నేను సచిన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్లు మీడియాలో కొంత మంది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ‘నాకు ప్రపంచ కప్ కావాలి’ అని నేను అన్న విషయం వాస్తవమే. అసలు నా స్పందనకు అతని ప్రకటనకు సంబంధమేలేదు. నా స్టేట్‌మెంట్ అతనికి వ్యతిరేకంగా కూడా కాదు. గత 25 ఏళ్లుగా నా ప్రాణ స్నేహితుల్లో సచిన్ కూడా ఒకరు’ అని గంగూలీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. A lot of people in the media is trying to put my statement against sachin s when I said “I want the World Cup”My re… https://t.co/hk34j4FCmv — Sourav Ganguly (@SGanguly99) 1551008606000 పుల్వామా ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్‌పై భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడొద్దంటూ పలువురు సీనియర్ క్రికెట్లు బీసీసీఐకి సూచించారు. అయితే దీన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యతిరేకించారు. ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్‌ ఆడకపోతే మనకే నష్టమని.. అనవసరంగా పాయింట్లు చేజార్చుకున్నవాళ్లం అవుతామని సచిన్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై గంగూలీ స్పందిస్తూ సచిన్ అభిప్రాయంతో గంగూలీ విభేదించారు. కోల్‌కతాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ మాట్లాడుతూ.. ‘అతను(సచిన్) పాకిస్థాన్‌పై రెండు పాయింట్లు కావాలని కోరుకుంటున్నారు. నాకు మాత్రం ప్రపంచ కప్ కావాలి’ అని వ్యాఖ్యానించారు. పాక్‌తో భారత్‌ మ్యాచ్‌ రద్దు చేసుకోవాలని గంగూలీ అభిప్రాయపడ్డారు. అలాగే క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ పాక్‌తో తెగదెంపులు చేసుకోవాలన్నారు. అయితే ఈ విషయంలో కేంద్రం నిర్ణయం మేరకు నడుచుకుంటామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
india vs south africa 1st t20i: virat kohli and co. reach dharamsala ధర్మశాలకి చేరుకున్న భారత టీ20 జట్టు సఫారీలతో తొలి టీ20 కోసం భారత జట్టు ఈరోజే ధర్మశాలకి చేరుకుంది. ఆదివారం రాత్రి 7 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుండగా.. శనివారం టీమిండియా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. Samayam Telugu | Updated: Sep 13, 2019, 09:01PM IST హైలైట్స్ భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ గత సోమవారమే ధర్మశాలకి చేరుకున్న సఫారీ టీమ్ శుక్రవారం అక్కడికి చేరుకున్న టీమిండియా క్రికెటర్లు సిరీస్‌లో మొత్తం మూడు టీ20లు.. రెండో టీ20 మొహాలిలో Image Courtesy: BCCI Twitter దక్షిణాఫ్రికాతో ఆదివారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ కోసం భారత జట్టు శుక్రవారం ధర్మశాలకి చేరుకుంది. సఫారీలతో మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియా ఆడనుండగా.. ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో.. ఈరోజు ఢిల్లీ నుంచి బయల్దేరిన భారత క్రికెటర్లు.. ధర్మశాలకి చేరుకున్నారు. ఇక రెండో టీ20 మ్యాచ్ బుధవారం మొహాలి వేదికగా, మూడో టీ20 ఆదివారం (ఈనెల 22న) బెంగళూరు‌లో జరగనుంది. A traditional welcome for #TeamIndia as they arrive in Dharamsala ahead of the 1st T20I against South Africa.… https://t.co/D7ToekSAJX — BCCI (@BCCI) 1568380320000 దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల భారత్‌కి చేరుకున్న సఫారీ టీ20 జట్టు.. గత సోమవారమే ధర్మశాలకి చేరుకుంది. భారత గడ్డపై ఇప్పటి వరకూ టీమిండియా చేతిలో ఒక్కసారి కూడా టీ20ల్లో ఓడిపోని దక్షిణాఫ్రికా టీమ్.. అదే రికార్డ్‌ని కొనసాగించాలని ఆశిస్తుండగా.. సొంతగడ్డపై టీ20ల్లో గెలుపు రుచి చూడాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్ ఆసక్తికరంగా జరగనుంది. Read More: భారత్‌లో దక్షిణాఫ్రికా టూర్.. షెడ్యూల్ ఇదే భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ దక్షిణాఫ్రికా టీ20 జట్టు: డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), దుస్సేన్ (వైస్ కెప్టెన్), బవుమా, జూనియర్ డాలా, బోర్న్ పోర్టుయిన్, హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్, ఫెహ్లుక్వాయో, పిట్రోరియస్, కగిసో రబాడ, షంషీ, స్మట్స్
2sports
-  పట్టణాల్లో కంటే ఎక్కువ ధరలు - టాప్‌లో గుజరాత్‌ క్రిసిల్‌ - అధ్యయనంలో వెల్లడి                       న్యూఢిల్లీ : పట్టణ ప్రాంతాల ధరలతో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం పోటీ పడుతోంది. దీంతో పట్టణేతర ప్రాంతాల్లో అత్యధికంగా ఉండే పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు తమ కొనుగోలు శక్తిని కోల్పోతున్నారు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే వివిధ ఉత్పత్తుల ధరలు ఎక్కువగా పలుకుతున్నాయని క్రిసిల్‌ ఒక అధ్యయనంలో వెల్లడించింది. కేంద్ర గణంకాల శాఖ వెల్లడించిన వినియోగ దారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీిఐ) అధారంగా క్రిసిల్‌ దీన్ని విశ్లేషించింది. కాగా ధరల నియంత్రణపై అనునిత్యం మాట్లాడే బీజేపీి పార్టీ పాలిత రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం భారీగా పెరగడం గమనార్హం. గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ధరలు ఏకంగా రెండంకెల పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. జులై మాసంలో ఇక్కడ సీపీిఐ ఏకంగా 10.14 శాతం ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ధరలు 8 శాతానికి తక్కువగా ఎప్పుడూ దిగిరాలేదు. జాతీయ సగటుతో పోల్చితే ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జులై మాసంలో జాతీయ సగటు ద్రవ్యోల్బణం సూచీ 6.48 శాతంగా చోటు చేసుకుంది. ఆగస్టులో 5.87 శాతంగా ఉంది. కాగా గ్రామీణ గుజరాత్‌లో వరుసగా ద్రవ్యోల్బణం సూచీ 7.71 శాతం, 9 శాతంగా చోటు చేసుకుంది. ఒడిస్సాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ద్రవ్యోల్బణం సూచీ రెండకెంల స్థాయికి చేరింది. ఈ ఏడాది జులై మాసంలో ఇక్కడ 10 శాతానికి ఎగిసింది. కాగా ఆగస్టులో 7.07 శాతానికి తగ్గిందని కేంద్ర గణంకాల శాఖ పేర్కొంది. ఇతర రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా సగటున మహారాష్ట్ర 6.85 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 6.71 శాతం, జమ్ము, కాశ్మీర్‌లో 6.4 శాతం, హర్యానా 6.21 శాతం, పశ్చిమ బెంగల్‌లో 5.98 శాతంగా చోటు చేసుకున్నాయి. గత ఐదేండ్ల కాలంలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం పెరుగుదల ఎక్కువగా ఉందని క్రిసిల్‌ ఈ అధ్యయనంలో వెల్లడించింది. ఇంతక్రితంతో పోల్చితే ధరల్లో ఇప్పుడు 100 బేసిస్‌ పాయింట్ల అంతరం చోటు చేసుకుందని పేర్కొంది. ప్రధానంగా కీలక, ఇంధన ధరలు ఈ ప్రాంతాల ద్రవ్యోల్బణానికి దారి తీశాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం సూచీ 5.26 శాతంగా, మేలో ఇది 4.89 శాతంగా ఉందని పేర్కొంది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా 6.49 శాతం, 6.2 శాతంగా చోటు చేసుకుందని తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 157 Views బెంగళూరు : పిట్‌నెస్‌ కలిగి ఉండటమే క్రికెట్‌కు ముఖ్యమని  డాషింగ్‌ ఓపెనర్‌ మురళీ విజయ్ పేర్కొన్నాడు. కాగా రాబోయే 12 నెలల్లో భారత్‌ 17 టెస్టు మ్యాచ్‌లను ఆడనున్న నేపథ్యంలో బెంగళూరు స్టేడియంలో ఏర్పాటు చేసిన క్యాంపులో మురళీ విజయ్ మాట్లాడుతూ చక్కటి ఫలితాలు రాబట్టాలంటే ఫిట్‌నెస్‌ అన్నింటికంటే ముఖ్య మన్నాడు. ఆటలో మరింత ముందుకు వెళ్లడానికి ఇది దోహద పడుతుందని, ప్రస్తుతం జట్టుకు వృత్తి నైపుణ్యాలు కలిగిన చక్కటి ఫిజియోలు, ఫిట్‌నెస్‌ నిపుణులు ఉన్నారని, ఈ ఏడాది అంతా జట్టు చక్కని సామథ్యం కలిగి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే మూడుసార్లు వెస్టిండీస్‌లో పర్యటించిన తనకు అక్కడి పరిస్థితులపై అవగాహణ ఉందని పేర్కొన్నాడు. అన్ని విభాగాల్లో బాగా ఆడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా కొత్త కోచ్‌ అనిల్‌ కుంబ్లేతో పనిచేయడం మంచి అనుభూతి అని,ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు.
2sports
ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సింధు న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధు ఉమెన్స్‌ సింగిల్స్‌లో ప్రత్యర్థిపై విజయం సాధించి ఇండియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. కాగా సింధు థాయ్ లాండ్‌ క్రీడాకారిణి బుసనన్‌పై 17-21,21-19,21-16 తేడాతో గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్స్‌లో స్థానం సంపాదించుకుంది. పురుషుల డబుల్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులు మను, సుమీత్‌రెడ్డిలు చైనా, తైవాన్‌కు చెందిన ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు.
2sports
Hyderabad, First Published 10, Aug 2019, 2:00 PM IST Highlights గతంలో వచ్చిన హిట్ సినిమా ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు పుట్టే ఐడియానే సీక్వెల్. అయితే చాలా సీక్వెల్స్ ..అంతకు ముందు సినిమా ఎక్కడ ఆగిందో ...ఆ తర్వాత వారి జీవితంలో ఏం జరిగింగో చెప్పటానికి ప్రయత్నిస్తూంటాయి. మరికొన్ని టైటిల్ సీక్వెల్ అంటే కేవలం టైటిల్ కు మాత్రమే సీక్వెల్ ఉంటుంది. అంతకు మించి మొదట సినిమాతో ఈ సీక్వెల్ కు ఏ సంభందం ఉండదు. అలాంటి టైటిల్ సీక్వెల్ సినిమానే 'మన్మథుడు-2'. గతంలో వచ్చిన హిట్ సినిమా ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు పుట్టే ఐడియానే సీక్వెల్. అయితే చాలా సీక్వెల్స్ ..అంతకు ముందు సినిమా ఎక్కడ ఆగిందో ...ఆ తర్వాత వారి జీవితంలో ఏం జరిగింగో చెప్పటానికి ప్రయత్నిస్తూంటాయి. మరికొన్ని టైటిల్ సీక్వెల్ అంటే కేవలం టైటిల్ కు మాత్రమే సీక్వెల్ ఉంటుంది. అంతకు మించి మొదట సినిమాతో ఈ సీక్వెల్ కు ఏ సంభందం ఉండదు. అలాంటి టైటిల్ సీక్వెల్ సినిమానే `మన్మథుడు-2` . ఫ్రెంచ్ లో వచ్చి విజయవంతమైన  I Do (2006) సినిమా రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ఎంతవరకూ మన ప్రేక్షకులను ఆకట్టుకుంది.  `మన్మథుడు-2` అని టైటిల్ పెట్టడానికి కారణం వేరే ఏమైనా ఉందా.... త్రివిక్రమ్ స్దాయిలో జోక్స్ ని ఈ సినిమా నుంచి ఎక్సపెక్ట్ చేయచ్చా... వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. కథ ఏంటి..? సాంబశివరామ్ ఉరఫ్ సామ్ (నాగార్జున) పోర్చుగల్ లో సెటిలైన ఓ తెలుగు  ఫ్యామిలికి చెందిన వాడు. ఫ్లాష్ బ్యాక్ లో  తన లవ్ ఫెయిల్యూరు అవటంతో ప్లే బోయ్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఆ కాన్సెప్టులో భాగంగా ప్రేమ, పెళ్లి వంటివాటికి దూరంగా ఉంటాడు. జీవితంలో ఎప్పటికి పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అతనికి తన తల్లి, కుటుంబ వ్యక్తుల పట్టుదలతో పెళ్లికి ఓకే అనాల్సి వస్తుంది. అయితే పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్లని నొప్పించకూడదు...తను సఫర్ అవకూడదు అని ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అవంతిక(రకుల్ ప్రితి సింగ్) అనే అమ్మాయిని ..గంటకు ఇంత అని మాట్లాడి తన గర్ల్ ఫ్రెండ్ గా నటించటానికి తన ఇంటికి తీసుకు వస్తాడు.  అక్కడ నుంచి ఏం జరిగింది. మెల్లి మెల్లిగా అవంతికతో సామ్ ఎలా ప్రేమలో పడ్డాడు...  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.    ఆ పాత కథే... ఇంట్లో వాళ్లు పెళ్లికి పట్టుబడితోనే లేక వేరే కారణం చేతో ...ఓ అబ్బాయి లేదా అమ్మాయిని డబ్బుకు మాట్లాడుకుని తీసుకువచ్చి ఇంట్లో వాళ్లకు పరిచయం చేయటం,గొడవలు,చివరకు వాళ్లతోనే  ప్రేమలో పడటం వంటి కథలు మన తెలుగు సినిమాకు కొత్తేమీ కాదు. అప్పట్లో చిరంజీవి హీరోగా వచ్చిన మొగడు కావాలి నుంచి నిన్న మొన్నటి సుకుమారుడు వరకూ ఇలాంటి కథలు ఎన్నో తెలుగు తెర చూసేసింది. అయితే అవి మరీ ప్రెడిక్టుబుల్ గా ఉంటున్నాయని అనిపించటంతో ఈ మధ్యకాలంలో  ప్రక్కన పెట్టింది. దాన్ని  నాగ్ ఈ కాలం కథ అనుకుని రైట్స్ కొనుక్కుని మరీ చేయటమే వింత.  ఆయన చూడానికి యంగ్ గా ఉన్నా ఆయన ఐడియాలు మాత్రం ఆ కాలంలోనే ఆగాయా అని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తూంటే.  ఇదో విచిత్రం... 2013లో నాగ్ హీరోగా గ్రీకు వీరుడు చిత్రం వచ్చింది. ఆ సినిమాలోనూ ఇదే కథ. అప్పట్లో ఈ ప్రెంచ్ సినిమాని ఫ్రీ మేక్ చేసారని చెప్పుకున్నారు. ఆ సినిమాలో నాగ్ ది ప్లే బోయ్ క్యారక్టరే. తన ఇంట్లో వాళ్ల  పోరు పడలేక నయనతార ను డబ్బుకు మాట్లాడుకుని  తన కాబోయే భార్యగా ఇంటికి తీసుకువస్తాడు. అక్కడ నుంచి ఆ నాటకం ఆడుతూ ..ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అయితే ఆ పడిపోవటం..పడిపోవటం ఇక లేవకపోవటంతో కథ ప్లాఫూరు వెళ్లింది. అయితే ఇక్కడ ఒరిజనల్ సినిమా రైట్స్ కొనుక్కుని చేయటంతో..పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం రాలేదు. దాంతో ఒరిజనల్ లో ఉన్న ఎమోషన్స్ ని, ఫన్ ని ఇక్కడ క్యారీ చేయగలిగారు. అది ప్లస్ అయ్యింది. అంతకు మించి పెద్దగా తేడా ఏమీ లేదు.  ఏదైమైనా ఒకే కథను కొద్ది సంవత్సరాల తేడాతో అదే హీరో చేయటం అనేది చెప్పుకోదగ్గ విషయమే. ఇది హిట్టైతే...తన పాత ప్లాఫ్ లను మరోసారి సరిచేసి కొత్త సరుకు గా ప్రెజెంట్ చేయచ్చు. కథ, కథనం.. దాదాపు పన్నేండేళ్ల క్రితం వచ్చిన `మన్మథుడు` సినిమా ఇప్పటికీ టీవీల్లో వచ్చినా జనాలు చూస్తూనే ఉన్నారు అంటే త్రివిక్రమ్ పంచ్ డైలాగులు, విజయ్ భాస్కర్ దర్శకత్వం, బ్రహ్మానందం కామెడీ మర్చిపోలేకపోవటమే. ఈ సీక్వెల్ లో అవే మిస్సయ్యాయి. దర్శకుడుగా రాహుల్ రవీంద్ర..సినిమాని డైలాగులతో..అప్పటికప్పుడు వచ్చే కాంప్లిక్ట్ తో అక్కడక్కడ ద్వందార్దాలుతో  నడిపేయాలనుకున్నారు కానీ సినిమాలో ప్రధాన కథ మనకు కనెక్ట్ అవుతుందా లేదా...స్క్రీన్ ప్లే స్టాప్ అండ్ స్టార్ట్ అన్నట్లుగా సాగుతోంది ఇబ్బంది అవదు కదా అని ఆలోచించినట్లు లేరు. ప్రెంచ్ సినిమా వచ్చిన 2006  లో తెలుగులో రైట్స్ కొని చేసి ఉంటే ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యేది. ఇప్పటికి ఈ కథ స్టేల్ అయ్యిపోయింది. హీరో,హీరోయిన్స్  క్యారక్టర్స్ లో కానీ వాళ్ల మధ్య జరిగే సంఘటనలలో కాని ఎక్కడా డెప్త్ లేదు. ఫార్స్ తో నడిచే ఈ కథలో వెన్నెల కిషోర్ కామెడీ ఒకటే అదీ ఫస్టాఫ్ లో వర్కవుట్ అయ్యింది. సెకండాఫ్ లో అదీ లేదు. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే గంజాయి ఎపిసోడ్స్ లాంటివి..ఇంకా ఈ రోజుల్లో చూడాలి అంటే చాలా కష్టపడాలి.    టెక్నికల్ గా.. ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్ పోర్చుగీస్ అందాలను బాగా పట్టుకుంది.  సంగీతం సూపర్ కాదు కానీ గుడ్. ఎడిటింగ్ మాత్రం ఫస్టాఫ్ లెంగ్త్ ఎక్కువై ఫుల్  సినిమా చూసిన ఫీల్ వచ్చింది. దాన్ని తగ్గించవచ్చేమో. సెకండాఫ్ లోనూ అదే పరిస్దితి. మినిమం ఓ ఇరవై నిముషాలు దాకా తీసేస్తా కానీ ఆ నీరసం తగ్గదు. ఈ సినిమా హైలెట్స్ లో నాగ్, రకుల్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించే చెప్పుకోవాలి. అవి సూపర్బ్ గా ఉన్నాయి. దర్శకుడుగా రాహుల్ రవీంద్రన్ ..ఇలాంటి డల్ సినిమా తీస్తాడని ఊహించం. ఆ పాపం ..రీమేక్ దేనేమో. డైలాగులు సినిమాకు కొంచెం కూడా ప్లస్ కాలేదు. విసుగెత్తించాయి చాలా చోట్ల.
0business
- 100వ టీ20లో హిట్‌మ్యాన్‌ విజృంభణ - సిక్సర్లతో విరుచుకుపడిన రోహిత్‌ శర్మ - రాజ్‌కోట్‌ టీ20లో భారత్‌ ఘన విజయం నవతెలంగాణ-న్యూఢిల్లీ రాజ్‌కోట్‌ టీ20కి మహా తుపాను ముప్పు పొంచి ఉందని భయపెడితే.. తీరా బంగ్లాదేశ్‌ను రోహిత్‌ సునామీ ముంచెత్తింది. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో రాజ్‌కోట్‌లో విశ్వరూపం చూపించిన రోహిత్‌ శర్మ (85, 43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు. రోహిత్‌ శర్మకు రాజ్‌కోట్‌ మ్యాచ్‌ కెరీర్‌ 100వ టీ20. రోహిత్‌ శర్మకు తోడు మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (31) రాణించటంతో రెండో టీ20లో భారత్‌ 15.4 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 153/6 పరుగులు చేసింది. లిటన్‌ దాస్‌ (29), మహ్మద్‌ నయీం (36), సౌమ్య సర్కార్‌ (30), మహ్మదుల్లా (30) రాణించారు. సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం నాగ్‌పూర్‌లో జరుగనుంది. రోహిత్‌ వీరోచితం : కెరీర్‌ 100వ టీ20లో తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (85, 43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫీల్డింగ్‌లో నిరాశపరిచిన రోహిత్‌.. బ్యాట్‌తో ధనాధన్‌ ఆడాడు. బంగ్లాదేశ్‌పై సిక్సర్ల వర్షం కురిపించాడు. 154 పరుగుల ఛేదనలో హిట్‌మ్యాన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 23 బంతుల్లో అర్ద సెంచరీ నమోదు చేశాడు. మొసద్దెక్‌ వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో రోహిత్‌ శర్మ విశ్వరూపం చూపించాడు. ఆ ఓవర్‌ తొలి బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా, రెండో బంతిని డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా, మూడో బంతిని లాంగ్‌ ఆన్‌ వైపుగా సిక్సర్లుగా మలిచాడు. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో కదంతొక్కిన రోహిత్‌ మరో సిక్సర్‌ బాదే ప్రయత్నంలో వికెట్‌ కోల్పోయాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (31, 27 బంతుల్లో 4 ఫోర్లు) హిట్‌మ్యాన్‌కు సహకారం అందించాడు. నాలుగు ఫోర్లు బాదిన ధావన్‌, మరోసారి ధనాధన్‌ అందుకునేందు ఇబ్బంది పడ్డాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలోనే 118 పరుగులు జోడించి భారత్‌ విజయాన్ని ఖాయం చేశారు. ఆరంభం అదిరినా.. : టాస్‌ నెగ్గిన భారత్‌ ఛేదనకు మొగ్గు చూపింది. రాజ్‌కోట్‌లో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. లిటన్‌ దాస్‌ (29, 21 బంతుల్లో 4 ఫోర్లు), మహ్మద్‌ నయీం (36, 31 బంతుల్లో 5 ఫోర్లు) తొలి వికెట్‌కు వేగంగా 60 పరుగులు జోడించారు. లిటన్‌ దాస్‌, నయీం రెండు వైపులా బౌండరీలతో చెలరేగారు. దాస్‌ నాలుగు ఫోర్లు బాదగా, నయీం ఐదు బౌండరీలతో మెరిశాడు. ఓపెనర్ల జోరుతో బంగ్లాదేశ్‌ భారీ స్కోరు దిశగా సాగింది. నం.3 సౌమ్య సర్కార్‌ (30, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఓపెనర్ల జోరు కొనసాగించాడు. ఆఖరు ఓవర్లలో పరుగుల నియంత్రణ పాటించిన బౌలర్లు బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. మహ్మదుల్లా (30, 21 బంతుల్లో 4 ఫోర్లు) రాణించినా, బంగ్లాదేశ్‌ 153 పరుగులే చేసింది. భారత బౌలర్లలో చాహల్‌ (2/28) రాణించాడు. తొలి టీ20 హీరో ముష్ఫీకర్‌ రహీమ్‌ (4) నాలుగు పరుగులకే వికెట్‌ కోల్పోయాడు. ముష్ఫీకర్‌ నిష్క్రమణ బంగ్లాదేశ్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఆఖరు మూడు ఓవర్లలో భారత్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ : లిటన్‌ దాస్‌ (రనౌట్‌) 29, నయీం (సి) అయ్యర్‌ (బి) సుందర్‌ 36, సర్కార్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) చాహల్‌ 30, ముష్ఫీకర్‌ (సి) కృనాల్‌ (బి) చాహల్‌ 4, మహ్మదుల్లా (సి) దూబె (బి) చాహర్‌ 30, అఫిఫ్‌ (సి) రోహిత్‌ (బి) ఖలీల్‌ 6, మొసద్దెక్‌ నాటౌట్‌ 7, అమినుల్‌ నాటౌట్‌ 5, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 153. వికెట్ల పతనం : 1-60, 2-83, 3-97, 4-103, 5-128, 6-142. బౌలింగ్‌ : దీపక్‌ 4-0-25-1, ఖలీల్‌ 4-0-44-1, సుందర్‌ 4-0-25-1, చాహల్‌ 4-0-28-2, దూబె 2-0-12-0, కృనాల్‌ 2-0-17-0. భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ (సి) మిథున్‌ (బి) ఇస్లాం 85, ధావన్‌ (బి) ఇస్లాం 31, రాహుల్‌ నాటౌట్‌ 24, అయ్యర్‌ నాటౌట్‌ 8, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (15.4 ఓవర్లలో 2 వికెట్లకు) 154. వికెట్ల పతనం : 1-118, 2-125. బౌలింగ్‌ : ముస్తాఫిజుర్‌ 3.4-0-35-0, సఫిల్‌ ఇస్లాం 2-0-23-0, ఆమిన్‌ 4-0-32-0, ఇస్లాం 4-0-29-2, అఫిఫ్‌ 1-0-13-0, మొసద్దెక్‌ 1-0-21-0. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా? రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ గా అతన్ని కాదని మరొకరని పెళ్లి చేసుకుంది. ఏంటి ఎంతమంది రణబీర్ కు హ్యాండ్ ఇస్తారని అనుకోకండి. ఈ వార్త చదివితే మీకే తెలుస్తుంది. TNN | Updated: Oct 31, 2016, 03:53PM IST రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ అతన్ని కాదని మరొకరని పెళ్లి చేసుకుంది. ఏంటి ఎంతమంది రణబీర్ కు హ్యాండ్ ఇస్తారని అనుకోకండి. ఈ వార్త చదివితే మీకే తెలుస్తుంది. రణబీర్ సరసన సినిమాలో గాళ్ ఫ్రెండ్ గా నటించిన అమ్మడి పెళ్లి గురించి ఇదంతా. పాకిస్తాన్ లో పుట్టిన బ్రిటన్ వ్యాపారవేత్త డినో లల్వానితో ఏడాది కాలంగా డేటింగ్ చేస్తోన్న హాట్ బ్యూటీ లిసా హేడన్ అతన్ని పెళ్లిచేసుకుంది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో లీసా రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. కామెడీ టైమింగ్ అండ్ పంచ్ డైలాగ్ లో తో ఈ అమ్మడు అందులో అదరగొట్టేసింది. అందరూ ఆ యాక్ట్ ను ఎంజాయ్ చేస్తున్న వేళ సడన్ గా ఈ అమ్మడు ముఝే కో షాదీ హోగయా అని చెప్పడం కాస్త షాకింగే. చెన్నయ్ లో పుట్టి ఫారిన్ లో పెరిగిన లిసా తెలుగులో రామ్ చరణ్ రచ్చ సినిమా టైటిల్ సాంగులో నటించింది. దీంతో మనకు కూడా ఈమె సుపరిచితమే. ఈ హాట్ ముద్దుగుమ్మ డినోను పెళ్లి చేసుకుంటున్నట్లు నెలకిందట తన ఇన్ స్టా గ్రామ్ లోనూ పోస్ట్ చేసింది. మొత్తానికి ఒక బీచ్ సాక్షిగా క్రిస్టియన్ పద్ధతిలో అతనితో ఈ ముద్దుగుమ్మ పెళ్లి జరిగిపోయింది. తన స్నేహితురాళ్లు ఆమెకు బ్రయిడ్ మెయిడ్స్ కాగా.. దగ్గర బంధువులు అందరూ అటెండ్ అయ్యారు. తన మ్యారేజ్ ఫోటోలన్నీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ హాట్ భామ.
0business
Hyderabad, First Published 10, Jul 2019, 10:50 AM IST Highlights జెర్సీ సినిమాతో సక్సెస్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ గ్యాంగ్ లిడర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని ఈ మధ్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ ఒక క్రేజీ సినిమా సీక్వెల్ లో నాని నటించబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.     జెర్సీ సినిమాతో సక్సెస్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ గ్యాంగ్ లిడర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని ఈ మధ్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ ఒక క్రేజీ సినిమా సీక్వెల్ లో నాని నటించబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా తెరకెక్కిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చిన్న బడ్జెట్ లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే దర్శకుడు స్వరూప్ ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సీక్వెల్ ని సెట్ చేస్తున్నాడు.  అయితే కొన్ని పాయింట్స్ ను ఇటీవల నాని ముందు ప్రస్తావించగా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ తో మారోసారి నానిని కలిసి మెప్పించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.మరి ఆ సినిమాలో నాని గెటప్ ఎలా ఉంటుందో చూడాలి. గ్యాంగ్ లీడర్ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.  Last Updated 10, Jul 2019, 10:50 AM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పవన్ ఫ్యాన్స్‌కి క్లాస్ పీకిన యాంకర్ ఝాన్సీ మెగా హీరోల సినిమాలకు పవన్ హాజరుకాలేదంటే ఆ వేడుకలో పవన్ అభిమానులు నానా హంగామా చేయడం మామూలు విషయమే. కాని మెగా ఫ్యామిలీతో సంబంధం ‘వంగవీటి’ ఆడియో వేడుకలోనూ పవన్ నినాదాలతో హోరెత్తించారు. TNN | Updated: Dec 5, 2016, 03:51PM IST ‘క్రమశిక్షణే ఆయుధంగా మీ హీరో మంచి పేరు తెచ్చుకున్నాడు. మీరు ఆయనకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇలా గోల చేస్తూ ఆ హీరోకి మచ్చలా తయారయ్యారు మీరంతా. కేవలం కొంతమంది వల్ల ఆయన అభిమానులందరికీ చెడ్డపేరు వస్తోంది. విజయవాడ వస్తే ఇలాగేనా గౌరవించేది. ఎంతో దూరం నుంచి ఈ వేడుకకు వచ్చిన అతిథులను ఇలాంటి నినాదాలతో ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని యాంకర్ ఝూన్సీ పవన్ అభిమానులకు క్లాస్ పీకటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.. ఫంక్షన్ ఏదైనా సరే పవన్ నామస్మరణతో ప్రాంగణం మారుమోగాల్సిందే. ఆ హీరో ఫంక్షన్ ఈ హీరో ఫంక్షన్ అని లేదు ఏ కార్యక్రమానికైనా పవన్ అభిమానులు వేలల్లో హాజరవుతారు. పవన్ కళ్యాణ్‌కి ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ అటువంటిది. ఇటీవల చిరంజీవి, రామ్‌చరణ్‌, బన్నీ వంటి మెగా హీరోలతోబాటు ప్రభాస్‌ను కూడా పవన్‌ ఫ్యాన్స్‌ ఇబ్బందులకు గురి చేశారు. అయితే పవన్ ఫాన్స్‌ని వారించే ప్రయత్నం చేసినా లాభంలేకపోవడంతో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బహిరంగంగానే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. తీరు మార్చుకోవాలని పవన్‌ ఫ్యాన్స్‌కు క్లాస్‌ పీకాడు. అయితే పవన్ అభిమానులు మాత్రం తగ్గేదే లేదని ‘వంగవీటి’ఆడియో ఫంక్షన్‌లో మరోసారి రుజువుచేశారు. మెగా హీరోల సినిమాలకు పవన్ హాజరుకాలేదంటే ఆ వేడుకలో పవన్ అభిమానులు నానా హంగామా చేయడం మామూలు విషయమే. కాని మెగా ఫ్యామిలీతో సంబంధం ‘వంగవీటి’ ఆడియో వేడుకలోనూ గోల చేశారు. విజయవాడలో కె. ఎల్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో శనివారం రాత్రి జరిగిన ‘వంగవీటి’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి భారీ సంఖ్యలో పవన్‌ ఫ్యాన్స్‌ హాజరయ్యారు. పవర్‌స్టార్‌ నినాదాలతో హోరెత్తించి వేదిక వైపునకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో స్టేజ్ మొత్తం కదిలిపోతుండటంతో యాంకరింగ్ చేస్తున్న ఝాన్సీ పవన్ అభిమానులను ఉద్దేశించి పవన్ అభిమానులు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ మీలాంటి అభిమానుల వల్లే పవన్‌కి చెడ్డ పేరొస్తుందని ఝూన్సీ వ్యాఖ్యానించింది. అయితే ఝాన్సీ సీరియస్‌గా క్లాస్ పీకడం నచ్చని పవన్ అభిమానులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం ఝాన్సీకి వ్యతిరేకంగా అనేక పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు పవన్ ఫాన్స్.
0business
Coporate Sector కార్పొరేట్లకు తప్పని నగదు సంక్షోభం ముంబై, నవంబరు 21: ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నోట్లరద్దు చెలామణి మంచి నిర్ణయమే అయినా భారత్‌ కార్పొరేట్‌ రంగంపై తీవ్రప్రభావమే చూపించిందని చెప్పాలి.నల్లధనం కట్టడిజరిగి, నకిలీ కరెన్సీకి పూర్తిస్థాయిలో చెక్‌పెట్టగలిగామని ప్రభు త్వం చెపుతున్నా కేవలం సామాన్య మధ్యతరగతి ప్రజలే కాకుండా కార్పొరేట్‌కు కూడా నగదు సంక్షో భం తప్పలేదు. కొన్ని కంపెనీల షేర్లు ఈ అర్ధ సంవత్సరంలో భారీగా దెబ్బతింటాయన్న అంచనా లు కూడా ఉన్నాయి. నగదు కొరతతో కంపెనీల ట్రక్కులు, ఇతర రవాణా వాహనాలు నిలిచిపోయా యి. సరపఱా రంగం పూర్తిగా దెబ్బతిన్నది. కార్మి కులు ఉచితంగా ఉత్పత్తులు లోడింగ్‌చేయలేరు. సరి కదా తర్వాత చెల్లింపులుంటాయన్న ధీమా కూడా వారికిలేకపోవడంతో ఎక్కడివక్కడ స్తంభించి పోయాయి. మోడీ ప్రకటించిన నోట్లరద్దుకారణంగా చెలామణిలో ఉన్న 85శాతం నగదు రద్దులపద్దు లోనికి వెళ్లింది. డాలర్లలో చూస్తే రూ.500 నోటు కు 7.3డాలర్లు, 1000నోటుకు 14.7డాలర్లు పలు కుతున్నాయి. రెండులక్షల కోట్ల డాలర్ల భారత్‌ ఆర్థిక వ్యవస్థలో వినియోగరంగ వ్యయమే 56శాతం వరకూ ఉంది. కేవలం చిన్నమొత్తంలో అందుబాటు లో ఉన్న చిన్న కరెన్సీ నోట్లు ప్రస్తుత అవసరాలకు ఎంతమాత్రం సరిపోవన్నది తెలిసిందే. ఎటిఎం యంత్రాల్లో సాంకేతికలోపాల కారణంగా ప్రజలు వచ్చేనెల 30వ తేదీ వరకూ కూడా అవస్తలపాలు కావాల్సిందేనని తెలుస్తోంది. ముందుగా బయటికి సమాచారం లీక్‌ అవుతుందని ఎటిఎం యంత్రాల మార్పిడి, కొత్తనోట్ల ముద్రణ వంటి వాటిపై ప్రభు త్వం స్పష్టతనివ్వలేదు. చిన్న,మధ్యతరహా కంపెనీ లు, భారీ కార్పొరేట్‌ కంపెనీలు సైతం భారీగా పత నం అవుతున్నట్లు అంచనా. రాబడులు కూడా దెబ్బ తిన్నాయి. ఇదే రెండునెలలు కొనసాగితే మరింతగా దెబ్బతింటామని చెపుతున్నారు. వినియోగరంగ కంపెనీలపరంగా హెయిర్‌ ఆయిల్‌, షాంపూ, ఇతర లోషన్లు అమ్మే కంపెనీలకు అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. నగదు సంక్షోభం కారణంగా భారత్‌ జిడిపి వృద్ధిరేటును 7.8శాతం నుంచి 4.1పర్సం టేజి పాయింట్లకు తగ్గే అవకాశం ఉంటుందని అంచ నా. డిసెంబరు త్రైమాసికంలో కూడా ఇదేతీరు కని పించే అవకాశం ఉందని, కార్పొరేట్‌ నిర్వహణ లాభాలు ఈ సంవత్సరంలో 40శాతం తగ్గుతాని యాంబిట్‌ కేపిటల్‌ అంచనావేసింది. కొన్ని ఐటి కంపెనీల్లో కూడా ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు కష్టం అవుతోంది. నిర్మాణరంగ కంపెనీలు, బిల్డింగ్‌ మెటీరియల్‌ కాంట్రాక్టర్లకు ఈ సమస్య మరింతగా ఉంది. ఎక్కువమంది భారతీయులకు ఇప్పటికీ బ్యాంకు ఖాతాలేలేవు. ఎక్కువమందికి నగదు రూపంలోనే చెల్లింపులు జరుగుతాయి. బ్రోకరేజి కంపెనీ మోతీలాల్‌ ఓస్వాల్‌ తన విశ్లేషణలో ఈ అర్ధసంవత్సరం కార్పొరేట్‌ రాబడుల్లో భారీగా పత నం ఉంటుందని అంచనా వేసింది. ఆటోమొబైల్‌, రిటైల్‌, వినియోగరంగ ఉత్పత్తులు, సిమెంట్‌, టెలి కాం, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు దిగజారే అవకాశం ఉంది. భారత్‌లో సేవారంగమే జిడిపికి మూడింట రెండొంతులు వాటా సమకూరుస్తోంది. ఇక క్రెడిట్‌ స్యూస్సీ సంస్థ అయితే 90శాతం వరకూ వినియోగరంగ ఉత్పత్తులు నగదురూపం లోనే కొనుగోళ్లు జరుగుతాని ఇన్‌ఫ్రా లావాదేవీలు ఆన్‌లైన్‌లో తక్కువేనని, అతికొద్దిమంది మాత్రమే లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారని ప్రకటించిం ది. ఇక ఢిల్లీ, గుర్‌గావ్‌ వంటి పారిశ్రామిక హబ్‌లు, ఐటిహబ్‌లలో చిన్నచిన్న హోటళ్లు ఇతర సంస్థలు చిన్నబిల్లులకు కార్డులపై చెల్లింపులను నిరాకరిస్తు న్నాయి. గ్రామీణప్రాంతాల్లో ఎక్కువ నగదు లావా దేవీలే అధికం కాబట్టి పూర్తిగా స్తంభించిపోయింది. గోధుమ పండించే రాష్ట్రాల్లో విత్తనాలు,ఎరువులు సగానికి విక్రయాలు పడిపోయాయి. ఈ ప్రభావం తప్పించేందుకు ప్రభుత్వం ఏదైనా సడలింపులు ఇస్తుందా అన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భారత్‌లోని ప్రతి ఇంటిపైనా ప్రధాని మోడీ ఐటిదాడులు చేయించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు కనిపిస్తున్నదని పలువురు విమర్శిస్తు న్నారు. ప్రభుత్వం సడలింపులు తెస్తే తప్ప ఈ నగదుసంక్షోభం నుంచి బైటపడలేమని వారివాదన.
1entertainment
విద్యుత్‌ వాహనాలకు జిఎస్‌టి తగ్గింపు వాయిదా nirmala sitaraman న్యూఢిల్లీ: ఆధార్‌సాయంతో రిజిస్ట్రేషన్‌కు జిఎస్‌టి మండలి అనుమతించింది. విద్యుత్‌ వాహనాలకు రేట్‌కట్‌ను మాత్రం వాయిదావేసింది. ఆర్ధికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన మొట్టమొదటిజిఎస్‌టి మండలి సమావేశంలో జిఎస్‌టి పోర్టల్‌పై ఆధార్‌సాయంతో రిజిస్ట్రేషన్‌చేసుకోవచ్చని ఆమోదించింది. అలాగే లాభాపేక్ష నియంత్రణ ప్రాధికార సంస్థ పదవీకాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగించింది. జిఎస్‌టి మండలి తగ్గించిన చార్జిలను వినియోగదారులకు వర్తింపచేయని సంస్థలపై జరిమానాను పదిశాతంవరకూ విధించేందుకు అనుమతించింది. 35వ జిఎస్‌టి మండలి సమావేశం అనంతరం వివరాలను ఆర్ధికశాఖ కార్యదర్శి ఎబిపాండే ఢిల్లీలో మీడియాకు వివరించారు. ఆగస్టు 30వ తేదీవరకూ జిఎస్‌టి రిటర్నులు దాఖలుచేసేందుకు గడువు పొడిగించింది. కొత్త జిఎస్‌టి రిటర్నుల దాఖలు వ్యవస్థ 2020 జనవరినుంచి అమలుకు వస్తుందన్నారు. విద్యుత్‌ వాహనాలపై జిఎస్‌టి రేట్‌ను ఐదుశాతానికి తగ్గించాలని, ప్రస్తుతం ఉన్న 12శాతం సుంకాన్ని ఐదుశాతానికి తగ్గించాలని విద్యుత్‌ ఛార్జర్లపై 18శాతం సుంకాన్ని 12శాతానికి తగ్గించాలని చేసిన ప్రతిపాదనలను ఫిట్‌మెంట్‌ కమిటీకి నివేదించారు. ఇక జాతీయ లాభాపేక్షనియంత్రణ పర్యవేక్షణ సంస్థ (ఎన్‌ఎఎ) పదవీకాలం 2021 నవంబరు 30వ తేదీ వరకూ పొడిగించారు. ఎన్‌ఎఎ సంస్థ 2017 నవంబరు 30వ తేదీ అమలుకువచ్చింది. జిఎస్‌టి మండలి తగ్గించిన జిఎస్‌టి రేట్లను వినియోగదారులకు అమలుచేయని సంస్థలపైచర్యలు తీసుకునేందుకు ఈ సంస్థ ఏర్పాటయింది. ఛైర్మన్‌గా బిఎన్‌శర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్‌ఎఎ 67 ఉత్తర్వులుజారీచేసింది. 2017 జులై ఒకటవ తేదీనుంచి జిఎస్‌టి అమలు ప్రారంభించిన వెనువెంటనే ప్రభుత్వం జాతీయస్థాయిలో లాభాపేక్ష నియంత్రణపర్యవేక్షక అథారిటీని ఏర్పాటుచేసేందుకు నిర్ణయించింది. రెండు సంవత్సరాల కాలపరిమితితోఏర్పాటుచేసిన ఈ సంస్థ కంపెనీలు వినియోగదారులకు జిఎస్‌టి రేట్ల తగ్గింపును అమలుచేయకపోతే విచారించి చర్యలు తీసుకుంటుంది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 'స్పైడర్'తో పోటీకి సిద్ధమైన హారర్ కామెడి సినిమా సెప్టెంబర్ 27న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న... TNN | Updated: Aug 13, 2017, 05:09PM IST సెప్టెంబర్ 27న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, 'స్పైడర్'తోపాటే అదే రోజు బరిలో నిలిచేందుకు మరో చిన్న సినిమా సిద్ధమైంది. జర్నీ ఫేమ్ జై, అంజలి జంటగా నటించిన అప్‌కమింగ్ హారర్ - కామెడి సినిమాను కూడా సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్టు తాజాగా ఆ మూవీ యూనిట్ వర్గాలు తెలిపాయి. బెలూన్ అనే టైటిల్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో జనని అయ్యర్ ఓ ప్రధాన పాత్ర పోషించగా రాజ్ తరుణ్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ తరుణ్‌ని తమిళ ఆడియెన్స్‌కి పరిచయం చేస్తున్న తొలి సినిమా ఇదే. ఓ భవనంలో దెయ్యాలు వున్నాయనే కథనం చుట్టూ ఈ హారర్ కామెడీ అల్లుకుని వుంది. అయితే, అంతిమంగా ఆ భవనంలో వున్న ఆ అంతు చిక్కని మిస్టరీని ఛేదించడంతో ఈ సినిమా కథ సుఖాంతం కానుంది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్మర్స్ మాస్టర్ ప్లాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు యవన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేశారు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ డబుల్ సెంచరీ.. ఔట్ దక్షిణాఫ్రికాతో వైజాగ్ టెస్టులో బ్యాక్ టు బ్యాక్ శతకాలు బాదిన ఓపెనర్ రోహిత్ శర్మ.. రాంచీ టెస్టులోనూ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. టెస్టు కెరీర్‌లో రోహిత్‌కి ఇదే తొలి డబుల్ సెంచరీ. Samayam Telugu | Updated: Oct 20, 2019, 01:07PM IST హైలైట్స్ దక్షిణాఫ్రికాపై రాంచీ టెస్టులో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ ఈరోజు 117 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత ఓపెనర్ అజింక్య రహానెతో కలిసి నాలుగో వికెట్‌కి 267 పరుగుల భాగస్వామ్యం టెస్టు కెరీర్‌లో రోహిత్ శర్మకి ఇదే ఫస్ట్ డబుల్ సెంచరీ దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మ్యాచ్‌లో రెండో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 117తో ఈరోజు తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన రోహిత్ శర్మ 249 బంతుల్లోనే 28x4, 5x6 సాయంతో 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2013 నుంచి టెస్టులు ఆడుతున్న రోహిత్ శర్మకి కెరీర్‌లో ఇదే ఫస్ట్ డబుల్ సెంచరీ కావడం విశేషం. Read More: రోహిత్ శర్మ దెబ్బకి సిక్సర్ల వరల్డ్ రికార్డ్ బ్రేక్..! 199 పరుగుల వద్ద ఎంగిడి బౌలింగ్‌లో సిక్స్‌తో ద్విశతకాన్ని అందుకున్న రోహిత్ శర్మ (212: 255 బంతుల్లో 28x4, 6x6) ఆ ఓవర్‌లోనే మరో సిక్స్ బాదాడు. కానీ.. ఆ తర్వాత ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ ఎంగిడి చేతికి చిక్కాడు. దీంతో.. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్‌కి తెరపడింది. Scores of Rohit Sharma in this series: 176(244) 127(149) 14(35) 212(255) - Most Runs. - Most Hundreds. - Most Fo… https://t.co/2wMQDnjAbt — Johns (@CricCrazyJohns) 1571554949000 ఆటలో తొలిరోజైన శనివారం మయాంక్ అగర్వాల్ (10), చతేశ్వర్ పుజారా (0), విరాట్ కోహ్లి (12) మొదటి సెషన్‌లోనే ఔటవడంతో.. భారత్ 39/3తో నిలిచింది. ఈ దశలో అజింక్య రహానె (115: 192 బంతుల్లో 17x4, 1x6)‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని నిర్మించిన రోహిత్ శర్మ భారీ స్కోరుకి బాటలు వేశాడు. రహానెతో కలిసి నాలుగో వికెట్‌కి అభేద్యంగా 267 పరుగుల భాగస్వామ్యాన్ని రోహిత్ శర్మ నెలకొల్పడంతో.. భారత్ జట్టు రెండో సెషన్‌లో 88.1 ఓవర్లు ముగిసే సమయానికి 370/5తో నిలిచింది. 500+ runs for Rohit Sharma in this series. The last Indian opener to score over 500 runs in a series was Sehwag a… https://t.co/YLU11b1ExZ — Bharath Seervi (@SeerviBharath) 1571550561000 దక్షిణాఫ్రికాతో ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదిన రోహిత్ శర్మ.. తాజా సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గానూ కొనసాగుతున్నాడు. అంతేకాకుండా.. దక్షిణాఫ్రికాపై ఓ టెస్టు సిరీస్‌లో రెండు సార్లు 150+ స్కోరు చేసిన తొలి ఓపెనర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
2sports
"జగన్ అను నేను" పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ Highlights రాజకీయాలకు , సినీ రంగానికి అవినాభావ సంబంధం పలు సందర్భాల్లో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సినిమాలు తాజాగా రాజకీయాలపై వచ్చిన సినిమా జగన్ పైనే అంటూ రూమర్స్ భరత్ అను నేను కథ నేపథ్యంపై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న భరత్ అను నేను విజన్ ఆఫ్ భరత్ నిన్న రిలీజై వైరల్ ఔవుతున్న సంగతి తెలిసిందే. ఈ విడియోలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ తో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనెక్షన్ వుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సినిమాలతో రాజకీయాలకు ముడిపడి వుండటం సహజమే. అయితే ఇలా రాజకీయాలతో లింకుండే సినిమాలు చాలా అరుదు. సాధారణంగా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు సూపర్ హిట్ టాక్ వుంటుంది.   రాజకీయ నేతలతో సినిమా హీరోలకు సంబంధాలుండటం సహజం. టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు కూడా ఇందుకు మినహాయింపేం కాదు. ఇక ట్విటర్ లో మహేష్ బాబు ఫాలో అయ్యే ఏకైక రాజకీయ నేత ఆయన బావ గల్లా జయదేవ్ మాత్రమే. మహేష్ బాబు సోదరి పద్మావతి భర్త అయిన జయదేవ్ టీడీపీలో వున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ ముందు నుంచి కాంగ్రెస్ సభ్యుడైన కృష్ణ వైఎస్ కు ఆకర్షితుడై.. ఆ సంబంధాలు ప్రస్థుతం వైకాపా అధినేతగా వున్న జగన్ కుటుంబంతోనూ కొనసాగిస్తున్నారు.     కృష్ణ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి వున్న సాన్నిహిత్యం నేపథ్యంలో... భరత్ అను నేను మూవీలో జగన్ కు సపోర్ట్ గా కొన్ని సీన్స్ పెట్టారని వైకాపా, జగన్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. దీంతో జగన్ అభిమానులు సోషల్ మీడియాలో దీన్ని తెగ ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు “జగన్ అను నేను” అంటూ డైలాగ్ ట్యాగ్ చేసి ప్రచారం చేస్తున్నారు.   అయితే ఈ మూవీకి అలాంటి సంబంధం ఏమీ లేదని.. ఈ చిత్రం కేవలం రాజకీయ డ్రామా అని, దీనితో ఏ రాజకీయ పార్టీకి గానీ, నేతకు గానీ సంబంధం లేదని దర్శకుడు కొరటాల శివ తేల్చి చెప్పారు. అంతే కాక ఈ చిత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో రాసుకున్న కథ అని, ప్రస్థుతం వున్న రాజకీయ పరిస్థితులకు, నేతలకు ఈ చిత్రంతో సంబంధం లేదని కొరటాల స్పష్టం చేశారు.   ఏదేమైనా రాజకీయంగా మాత్రం ఈ చిత్రాన్ని వుపయోగించుకునేందుకు తమదే అనిపించుకునేందుకు కావల్సినంత ప్రయత్నం ఓ వర్గం అదే పనిగా పనిచేస్కున్నారు. ఈ క్రింద లింకులో... పవన్ ఇంట విషాదం... వివరాలు   https://goo.gl/WHnKiy Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
రకుల్ టీచర్ పాఠాలు చెప్పిందోచ్ Highlights టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ  ఆధ్వర్యంలో  8,9 తరగతి పిల్లలకు పాఠాలు చెప్పిన రకుల్ 2014 నుంచి మంచు లక్ష్మి, చైతన్య ఎంఆర్ఎస్కేలు నిర్వహిస్తున్న టీచ్ ఫర్ ఛేంజ్ తెలుగులో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ బిజినెస్ తోపాటు సోషల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువే చేస్తుంటుంది. పాఠశాలల్లో విద్యా వ్యవస్థ మెరుగు పడేందుకు సాయమందించేలా ఏర్పడ్డ టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ఆధ్వర్యంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది. ఆంగ్లంలో విద్యార్థులకు తర్ఫీదునిప్పించే ఈ సంస్థ ఏడాది చివరలో టోఫెల్ ప్రైమరీ సర్టిఫికెట్ తో విద్యార్థులకు ఉత్తీర్ణతనిస్తుంది. బీ ద చేంజ్, టీచ్ ఫర్ చేంజ్ నినాదంతో రకుల్ విద్యార్థులకు చైతన్య వంతులను చేస్తూ ఆదర్శవంతంగా నిలిచింది. Last Updated 25, Mar 2018, 11:37 PM IST
0business
Suresh 105 Views వరల్డ్‌ నంబర్‌ వన్‌ బైల్స్‌పై గెలవడమే టార్గెట్‌ కోల్‌కతా: రియో ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్స్‌ వాల్డ్‌ విభాగంలో తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ తదుపరి టార్గెట్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ జిమ్నాస్ట్‌ సిమోస్‌ బైల్స్‌ను ఓడించడమేనట.కాగా అమెరికాకు చెందిన బైల్స్‌పై గెలువడమే టార్గెట్‌గా సిద్దమవతున్నట్లు దీపా తాజాగా పేర్కొంది.రియోలో వాల్ట్‌ జిమ్నాస్టిక్స్‌లో బంగారు పతకం సాధించిన బైల్స్‌ తాను చూసిన మహిళా జిమ్నాస్టిక్స్‌లో ఎంతో మెరుగైన క్రీడాకారిణిగా దీపా కితాబిచ్చింది.ఆమె కంటే నేను ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాను, కాకపోతే బైల్స్‌ను ఓడించడానికి ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాం, అదే టార్గెట్‌గా ప్రిపరేషన్‌ మొదలుపెట్టా,ఆమెను ఓడించడమే నా తదుపరి టార్గెట్‌ అని దీపా పేర్కొంది.నగరంలో జరిగిన దుర్గా పుజా కార్యక్రమంలో పాల్గొన్న దీపా తన రియో ప్రద ర్శనపై సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే రియోలో పతకం సాధించకపోవడంతో యావత్‌ భారతావని నిరాశకు లోనైన విషయం తనకు తెలుసునని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.కాగా తాను పతకం గెలిచి ఉంటే దాన్ని దేశానికి అంకితం ఇచ్చే దానినని దీపా కార్మాకర్‌ వెల్లడించింది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV #మీటూ.. ఆ వయసులోనే వేధింపులు, చెప్పడానికి ఇన్నేళ్లు: నటి పార్వతి లైంగిక వేధింపులపై మరో నటి గళం విప్పింది. అది చెప్పడానికి 17 ఏళ్లు పట్టిందని తెలిపింది. Samayam Telugu | Updated: Oct 31, 2018, 11:50PM IST #మీటూ.. ఆ వయసులోనే వేధింపులు, చెప్పడానికి ఇన్నేళ్లు: నటి పార్వతి మీటూ తన ప్రకంపనలు కొనసాగిస్తూనే ఉంది. ఏమీ తెలియని వయసులోనే తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ దక్షిణాదికి చెందిన నటి పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగేళ్ల వయసులో తాను వేధింపులు ఎదుర్కొంటే, దాని గురించి తెలుసుకోడానికి 17 ఏళ్లు, మాట్లాడటానికి మరింత కాలం పట్టిందని పార్వతి తెలిపింది. ఇటీవల ముంబైలో జరిగిన మామి ఫిలిం ఫెస్టివల్‌కు పార్వతి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ తనపై వేధింపుల పర్వాన్ని వివరించింది. ‘నాలుగేళ్ల వయసులో నేను వేధింపులు ఎదుర్కొన్నా. ఆ విషయం తెలుసుకోవడానికి నాకు 17 ఏళ్లు పట్టింది. రోజూ ఈ విషయాన్ని తలుచుకుంటూనే ఉంటా. దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ఆ సంఘటన నిత్యం నన్ను బాధిస్తోంది’ అని పార్వతి తెలిపింది. మీటూ ఉద్యమం ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో తనకు ఈ విషయాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందని పార్వతి చెప్పింది. కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో పార్వతి సుమారు 20 సినిమాల్లో నటించారు. 2017లో ‘కరీబ్‌ కరీబ్‌ సింగిల్‌’ సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌)లోనూ పార్వతి సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. మీటూ ఉద్యమం పెను మార్పులు తీసుకొస్తోందని, మహిళలు తమపై జరిగిన ఘటనల గురించి బయటపెడుతుంటే నిందితులు చిక్కుల్లో పడుతున్నారని.. కొంత మందికి పని కూడా దొరకడంలేదని పార్వతి చెప్పుకొచ్చింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఇవాళ భారత్ - సౌతాఫ్రికాల మధ్య మూడో టెస్ట్ మరికాసేపట్లో భారత్- సౌతాఫ్రికాల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. TNN | Updated: Nov 25, 2015, 08:43AM IST నాగ్ పూర్ వేదికగా భారత్ - సౌతాఫ్రికా మధ్య బుధవారం మూడో టెస్టు జరగనుంది.నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా.. ఇప్పటికే సిరీస్ 2-0 తేడాతో కోహ్లీ సేన ముదంజలో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రేపటి మ్యాచ్ లో రాణించేందుకు ఇరు జట్టు ప్రాక్టీస్ లో నిమగ్నమైమయ్యాయి. ప్రస్తుత ఫాంను బట్టి కోహ్లీసేనే ఫ్యావరేట్ గా బరిలోకి దిగుతోంది. గత రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి కోహ్లీ సేన మంచి దూకుడు మీద ఉంది. దానికి తోడు నాగ్ పూర్ పిచ్ స్పీన్ కు అనుకూలమైనది. గత రెండు టెస్టులు డ్రై పిచ్ లపై రాణించిన టీమిండియాకు ఈ పిచ్ పై రాణించడం మరింత సులభం. ఎందుకంటే నాణ్యత గల ప్రపంచ స్థాయి స్పిన్నర్ల టీమిండియాలో ఉండనే ఉన్నారు. జడేజా, అశ్విన్ మంచి ఫాంలో ఉన్నారు. దానికి తోడు మిశ్రా కూడా ఫాంలోకి వస్తే భారత్ కు ఇక తిరుగు ఉండదు. ఇక బ్యాటింగ్ విషయంలో భారత్ కు ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి టీం ఎంపిక విషయంలో ఇద్దరు సిన్నర్లతో బరిలోకి దిగాల లేదంటే ముగ్గరు స్పినర్లతో దిగాలనే దానికి మేనేజ్ మెంట్ కసరత్తు చేస్తోంది.
2sports
internet vaartha 135 Views న్యూఢిల్లీ : షరపోవా టెన్నిస్‌ క్రీడలో ఈ పేరు చిరపరిచితమే.కాగా ఆమెపై విధించిన రెండేళ్ల నిషేదాన్ని క్రీడల ఆర్బిట్రేషన్‌ కోర్టు 15 నెలలకు కుదించడంతో ఆమె కోసం స్పాన్నర్లు క్యూ కడుతున్నారు.ఆస్ట్రేలియా ఓపెన్‌ సందర్బంగా నిషేదిత మెల్డోనియం వాడి నందుకు మరియాపై కోర్టు రెండేళ్లు నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ఈ ఏడాది జనవరి 26 నుంచి అమలయ్యేలా ఈ జూన్‌లో రెండేళ్ల నిషేదం విధించింది.తాజాగా కోర్టు నిషేదాన్ని 15 నెలలకు కుదించడంతో 2017 ఏప్రిల్‌లో ఈ టెన్నిస్‌ తార తిరిగి టెన్నిస్‌ కోర్టులోకి అడుగుపెట్టనుంది. నిషేదం విధించిన సమయంలో వద్దనుకున్న స్పాన్నర్లు ఇప్పుడు ఆమె కోసం  మళీ క్యూకడుతున్నారు.  నిషేధం కారణంగా ఒక్క సారి ఆమెకు దూరమైన స్పా న్సర్లు ఇప్పుడు తిరిగి ఆమెతో ఒప్పందాలు చే సుకోవడానికి పోటీ పడుతున్నారు. ప్రపంచం లోనే అత్యంత పెద్దదైన స్పోర్ట్స్‌ వేరర్‌ బ్రాండ్‌ నైకీ మరియాపై ఉన్న రెండేళ్ల నిషేదం వరకు తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని, నిషేధం అనంతరం తిరిగి ఆమెతో కొనసాగు తామని గతంలో ప్రకటించింది. స్విస్‌కు చెందిన వాచీల సంస్థ ట్యాగ్‌ హ్యూయర్‌, ఫోక్స్‌వ్యాగన్‌కి చెందిన పోర్షే. జర్మనీకి చెందిన ఒక లగ్జరీ కార్ల తయారీ సంస్థ తమ ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో పునరాలోచనలో పడ్డాయి. పలు సంస్థలు రద్దు చేసుకున్న ఒప్పందాలను తిరిగి కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతుండగా మరికొన్ని సంస్థలు తాజా ఒప్పందాల కోసం పోటీ పడుతున్నాయి.
2sports
Supreme Court finds Oscar Pistorius guilty of murder ఆస్కార్ పిస్టోరియస్ నేరస్తుడే! గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్కాంప్ హత్య కేసులో ప్రఖ్యాత ఒలింపియన్ ఆస్కార్ పిస్టోరియస్ నేరస్తుడే అని కోర్ట్ చెప్పింది TNN | Updated: Dec 3, 2015, 07:34PM IST గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్కాంప్ హత్య కేసులో ప్రఖ్యాత ఒలింపియన్ ఆస్కార్ పిస్టోరియస్ నేరస్తుడే అని దక్షిణాఫ్రికా అప్పీళ్ల కోర్ట్ గురువారం నాడు పేర్కొంది.ఈ నేపథ్యంలో గతంలో దిగువ కోర్ట్ ఇచ్చిన తీర్పును ఆ కోర్టు కొట్టివేసింది. ఈ కేసు కింద ఆస్కార్ కు కనీసం తక్కువలో తక్కువగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కేసును విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెపుతున్న వేళ, హతురాలు రీవా స్టీన్కాంప్ తల్లి కూడా కోర్టు హాలులోనే ఉన్నారు. ఆస్కార్ వికలాంగుడైనందున అతగాడి శిక్షను తగ్గించమంటూ అతని తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. 29 ఏళ్ల పిస్టోరియస్ గృహంలో 2013లో ప్రేమికుల దినోత్సవం నాటి ఉదయం వేళ రీవా హత్యకు గురయిన సంగతి తెలిసిందే. గర్ల్ ఫ్రెండ్ రీవాతో (పైల్)
2sports
భాగమతి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ First Published 5, Feb 2018, 9:46 PM IST భాగమతి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ భాగమతి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ భాగమతి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ భాగమతి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ భాగమతి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ భాగమతి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ భాగమతి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ భాగమతి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ Recent Stories
0business
Suresh 97 Views Aircel ఎయిర్‌సెల్‌ డేటా ఆఫర్‌ హైదరాబాద్‌, మే14: డేటా టారిఫ్‌ వార్‌లోకి ఎయిర్‌సెల్‌ కూడా చేరింది. వన్‌జిబి 3జి డేటాను 76 రూపా యలకు అందిస్తోంది.ఏదేని డేటాప్యాక్‌ రీఛార్జ్‌ ఎఫ్‌టిటి ప్రయోజనాలపై 100 ఎంబి డేటాను ఉచితంగా అంది స్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌సెల్‌ యాప్‌పై ఎక్స్‌క్లూజివ్‌ డేటా కాలింగ్‌ ఆఫర్లను పరిచయం చేసింది. వన్‌జిబి డేటాను పదిరోజుల వ్యవధిలో పొందుతారు. కస్టమర్లు 50 ఆపై విలువైన ఏదేని డేటా రీఛార్జి ప్యాక్‌పై ఉచితంగా 100ఎంబి డేటా పొందవచ్చని వివరించారు. కంపెనీ చీఫ్‌మార్కెటింగ్‌ అధికారి అనుపమ్‌ వాసుదేవ్‌ మాట్లాడుతూ యాప్‌ల ద్వారా కస్టమర్ల అవసరాలను తెలుసుకుంటున్నామని వారి అభిరుచులకు అనుగుణంగా ఎయిర్‌సెల్‌ డేటాప్యాక్‌లు అందిస్తుందన్నారు. ఎయిర్‌సెల్‌ పూర్తిటాక్‌టైమ్‌ను రూ.86రీఛార్జిపై అందిస్తుందన్నారు.
1entertainment
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
Hyderabad, First Published 18, Aug 2019, 8:51 PM IST Highlights యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.  ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. మరోసారి ఇంత మంది అభిమానులని చూస్తానో లేదో అంటూ సెల్ఫీ తీసుకున్నారు. బాహుబలితో తెలుగు సినిమా సత్తాని ప్రపంచం మొత్తానికి తెలియజేసిన రాజమౌళికి కృతజ్ఞతలు అని తెలిపారు. యువి క్రియేషన్స్ నిర్మాతలతో నాకు మంచి రిలేషన్ ఉంది. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత యువీ నిర్మాతలు మిర్చి చిత్రాన్ని తీశారు. ఆ చిత్రానికి మిస్టర్ పర్ఫెక్ట్ కు మించి డబ్బు ఖర్చయింది. అంత డబ్బు ఎందుకు పెడుతున్నారు అని అడిగా.. ప్రభాస్ కోసం అని బదులిచ్చారు.  మళ్లీ బాహుబలి తర్వాత అంతకు మించి సాహో చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టారు. ఈ సారి కూడా ప్రభాస్ కోసమే అని బదులిచ్చారు. సాహో నిర్మాతలని చూసి నేను ఆలిండియా ఫిలిం ఎలా తీయాలో నేర్చుకుంటున్నా అని దిల్ రాజు తెలిపారు. రాజమౌళికి బాహుబలి లాంటి చిత్రం తీయడానికి 10 సినిమాలకు పైగా సమయం పట్టింది. కానీ సుజీత్ రెండవ చిత్రంతోనే ఆలిండియా చిత్రాన్ని డైరెక్ట్ చేసాడని ప్రశంసించారు.  ప్రభాస్ ఆలిండియా స్టార్. ఏ రాష్ట్రానికి వెళ్లినా ప్రభాస్ అభిమానులు కనిపిస్తున్నారు. ప్రభాస్ ఇలాగే భారీ చిత్రాల్లో నటిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని దిల్ రాజు కోరారు.
0business
Hyderabad, First Published 10, May 2019, 7:24 PM IST Highlights మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని దూసుకుపోతున్నాడు. వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రాలు వైవిధ్యభరితంగా ఉంటున్నాయనే ప్రశంసలు దక్కుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని దూసుకుపోతున్నాడు. వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రాలు వైవిధ్యభరితంగా ఉంటున్నాయనే ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం వరుణ్ వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.  వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడు. తాజాగా వరుణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన ఓ ఫోటో నెటిజన్లని ఫిదా చేస్తోంది.తన తండ్రి నాగబాబు, పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలసి ఉన్న ఫోటోని వరుణ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇది వరుణ్ తేజ్ చిన్ననాటి ఫోటో. పాలబుగ్గల పిల్లాడిలా కనిపిస్తున్న వరుణ్ పవన్ కళ్యాణ్ భుజాలపై ఎక్కి కనిపిస్తున్నాడు.  పవన్ కళ్యాణ్ కు చెరోవైపు నాగబాబు, చిరంజీవి ఉన్నారు. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులతో ఉన్నా.. వారిని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా అని కామెంట్ పెట్టాడు.ఈ ఫొటోలో నాగబాబు గడ్డంతో రఫ్ లుక్ లో ఉండగా చిరు హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్నాడు.  ఏప్రిల్ లో ముగిసిన ఏపీ ఎన్నికల సందర్భంగా వరుణ్ తేజ్ కూడా జనసేన పార్టీ తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి నాగబాబు పోటీ చేసిన నరసాపురం నియోజకవర్గంలో వరుణ్ ప్రచారం నిర్వహించాడు. వరుణ్ ప్రస్తుతం నటిస్తున్న వాల్మీకి చిత్రం జిగర్తాండ అనే తమిళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది.     Dug this up from the old archives! With my most favourite people! — Varun Tej Konidela (@IAmVarunTej) May 10, 2019 Last Updated 10, May 2019, 7:24 PM IST
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV హైదరాబాద్‌లో 'క్వాల్‌కమ్'క్యాంపస్..10వేల ఉద్యోగాలు! అమెరికాలోని శాన్‌డియాగో ప్రధాన కార్యాలయం తర్వాత అంత భారీ స్థాయిలో క్వాల్‌కమ్ మెగా క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. Samayam Telugu | Updated: Oct 7, 2018, 11:39AM IST అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం 'క్వాల్‌కామ్‌' సంస్థ హైదరాబాద్‌లో అతిపెద్ద క్యాంప్‌స్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు 400 మిలియన్ డాలర్ల (రూ.3,000 కోట్లు) పెట్టుబడితో ఈ క్యాంప్‌సను నెలకొల్పనుంంది. అమెరికా వెలుపల క్వాల్‌కామ్‌ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద క్యాంపస్‌ ఇదే కావటం విశేషం. శనివారం (అక్టోబరు 6) తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుతో క్వాల్‌కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఇంజనీరింగ్‌) శశి రెడ్డి, డైరెక్టర్‌ చంద్ర శేఖర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పెట్టనున్న వివరాలు, అభివృద్ధి ప్రణాళికలు వారు మంత్రికి వివరించారు. హైదరాబాద్‌కు మరిన్ని కంపెనీలు: కేటీఆర్ అమెరికాలోని శాన్‌డియాగో ప్రధాన కార్యాలయం తర్వాత అంత భారీ స్థాయిలో మెగా క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయటం ఎంతో సంతోషాన్నిస్తోందని అన్నారు. క్వాల్‌కామ్‌ భారీ క్యాంపస్‌.. ఎలక్ట్రానిక్, సెమికండక్టర్‌ పరిశ్రమ వృద్ధికి మరింత ఊతమివ్వనుందని తెలిపారు. దీంతో మరికొన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఎలక్ట్రానిక్స్‌, సెమికండక్టర్‌ విభాగంలోకి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. 5జీ టెక్నాలజీపై పరిశోధనలు: క్వాల్‌కమ్ వైస్‌ ప్రెసిడెంట్‌ ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్‌లో 5జీ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి, టెస్టింగ్‌ వంటి కార్యకలాపాలను నిర్వహించనున్నారు. మొబైల్‌ కమ్యూనికేషన్‌ను మరింత మందికి చేరువ చేయటమే కాకుండా వైర్‌లెస్‌ విప్లవాన్ని తీసుకురావటంలో క్వాల్‌కామ్‌ కీలకంగా ఉండనుందని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ శశి రెడ్డి తెలిపారు. క్వాల్‌కామ్‌ ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. 2004లో హైదరాబాద్‌లో సంస్థ కార్యకలాపాలను ప్రారంభించిందని, ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 4,000గా ఉందని ఆయన వివరించారు. మెగా క్యాంపస్‌ అందుబాటులోకి వస్తే ఉద్యోగుల సంఖ్య పదివేలకు చేరుకోనుందని చెప్పారు. వచ్చే ఏడాది పనులు ప్రారంభం 2019లో ప్రాంగణ ఏర్పాటు పనులను ప్రారంభించనున్నారు.హైదరాబాద్‌లోని కోకాపేట ఐటీ క్లస్టర్‌‌లో 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మెగాక్యాంప్‌సను ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. క్వాల్‌కామ్‌.. అమెరికా సహా భారత్‌, ఇజ్రాయిల్‌, సింగపూర్‌, చైనా, పశ్చిమ యూర్‌పల్లోని వివిధ ప్రాంతాల్లో 167 కార్యాలయాలతో పాటు ఆర్‌ అండ్‌ డి సెంటర్లను నిర్వహిస్తోంది.
1entertainment
PCB gets clearance from Pak govt for Indo-Pak series in Sri Lanka 'ఇండోపాక్ క్రికెట్ సిరీస్'కు నవాజ్ ఓకే! దాయాది దేశం పాకిస్థాన్ తో భారత్ మరోమారు క్రికెట్ మైదానంలో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. TNN | Updated: Nov 26, 2015, 06:57PM IST దాయాది దేశం పాకిస్థాన్ తో భారత్ మరోమారు క్రికెట్ మైదానంలో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనతో క్రికెట్ ఆడటానికి పాక్ క్రికెట్ బోర్డ్ చేసుకున్న విన్నపానికి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ సానుకూలంగా స్పందించారు. మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాక్ తో క్రికెట్ ఆడేందుకు మన దేశ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ కూడా కేంద్రాన్ని అనుమతి కోరిన సంగతి తెలిసిందే. శ్రీలంక గడ్డపై భారత్ తో క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని తాము చేసిన విన్నపానికి నవాజ్ అంగీకరించారని.. ఇందుకు అనుమతిని మంజూరు చేశారని పీసీబీ చైర్మన్ షహారియార్ ఖాన్ పీటీఐకు చెప్పారు. తీవ్రవాదుల నుండి ముప్పు పొంచి ఉన్న కారణంగా విదేశీ జట్లు ఏవీ పాక్ గడ్డపై అడుగుపెట్టేందుకు సుముఖంగా లేవు. అలాగే, భారతదేశంలోకి పాకీలు అడుగుపెట్టాలన్నా కూడా వారికి మన క్రికెట్ అభిమానులు ముచ్చెమటలు పోయిస్తారు. కొన్ని జాతీయవాద సంస్థలు కూడా పాక్ రాకను భారత్ లో ఇష్టపడవు. ఈ నేపథ్యంలో శ్రీలంకలో క్రికెట్ ఆడితే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదనే యోచన చేశారు.
2sports
ఐటీ రంగంలో క్లిష్ట పరిస్థితులు.. ఊడుతున్న ఉద్యోగాలు - తొలిసారి తగ్గిన సిబ్బంది - నాస్కామ్‌ అంచనాలు తప్పే అవకాశం..! బెంగళూరు : భారత ఐటీ పరిశ్రమలో క్లిష్ట పరిస్థితులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఉద్యోగుల సంఖ్య నానాటికీ దిగజారిపోతుంది. ఒకప్పుడు భారీగా ఉపాధి కల్పనకు నిలయంగా ఉన్న 154 బిలియన్‌ డాలర్ల దేశీ ఐటీ రంగం తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. కొత్త ఉద్యోగాలు కల్పించడంలో స్తబ్దత నెలకొంది. తొలిసారి భారతదేశంలోనే అగ్రశ్రేణీ ఐదు ఐటీ కంపెనీల్లోని మూడింటిలో ఉద్యోగులు భారీగా తగ్గిపోయారని మింట్‌ ఓ కథనం ప్రచురించింది. ప్రస్తుత ఏడాది జూన్‌30తో ముగిసిన త్రైమాసికం నాటికి ఈ టాప్‌-5 కంపెనీల్లో 984,913 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కాగా ఇంతక్రితం మార్చితో ముగిసిన త్రైమాసికం సంఖ్యతో పోల్చితే 1,821 మంది తగ్గిపోయారు. 2017 మార్చి ముగింపు నాటికి దేశీయ ఐటీ పరిశ్రమలో మొత్తంగా 39 లక్షల మంది పని చేస్తున్నారని ఐటీ పరిశ్రమ బాడీ నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) వెల్లడించింది. ప్రస్తుత ఏడాదిలో ఐటీ రంగంలో కొత్తగా కనీసం 150,000 మందికి ఉద్యోగాలు లభించవచ్చని నాస్కామ్‌ అంచనా వేసింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే నాస్కామ్‌ అంచనాలు తప్పేలా కనిపిస్తున్నాయి. కంపెనీల వ్యాపార పద్దతులు, విధానాలు మారడంతో ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడంలో తీవ్ర కఠినతరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పరిశ్రమ విశ్లేషణ. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలు, మరోవైపు ఆటోమేషన్‌ ప్రభావంతో చాలా కంపెనీలు తమ ప్రస్తుత ఉద్యోగులు, నియామకాల విషయంలో పున్ణసమీక్షించుకోవడం మొదలుపెట్టాయి. ప్రధానంగా ఈ రెండు ప్రభావాలతోనే కంపెనీలు సిబ్బందికి కోత పెడుతున్నాయని అంచనా. దేశంలోని ప్రముఖ ఏడు ఐటీ కంపెనీలు దాదాపుగా 56 వేల మంది ఇంజనీర్లను వెళ్లిపోవాలని సూచించినట్టు ఆంగ్ల పత్రిక మింట్‌ ఒక కథనం వెలువరించింది. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య రెండింతలు పెరుగుతుందని అంచనా వేసింది. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌లోనూ... దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)లో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 1,414 మంది తగ్గి 3,85,809కి చేరింది. ఇన్ఫోసిస్‌లో నికరంగా 1,811 ఉద్యోగాలు పోయాయి. టెక్‌ మహీంద్రాలో 1,713 మంది ఉద్యోగాలు తగ్గాయి. కేవలం విప్రో, హెచ్‌సీఎల్‌లు మాత్రమే తమ ఉద్యోగుల నికర సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది. అది కూడా బెంగళూరుకి చెందిన ఓ ఐటీ సంస్థతో విప్రో కుదుర్చుకున్న ఒప్పందం సఫలమవడంతో విప్రో అదనంగా ఉద్యోగులను చేర్చుకోగలిగింది. ఇన్ఫోసర్వర్‌ను విప్రో కొనుగోలు చేయడంతో కొత్తగా 200 మంది ఉద్యోగులను తీసుకుంది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ ఒక అవుట్‌ సోర్సింగ్‌ క్లయింట్‌ ద్వారా మరో 1000 మంది ఉద్యోగులను తీసుకుంది. ఇతర ఐటీ కంపెనీలు ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌, మైండ్‌ట్రీ లిమిటెడ్‌, కెపీఐటీ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, హెక్సావేర్‌ లిమిటెడ్‌, సైయంట్‌ లిమిటెడ్‌లు క్రితం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 2,026 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. ఈ కంపెనీల్లో మొత్తంగా 77,447 మంది సిబ్బంది పని చేస్తోన్నారు. అంటే దాదాపుగా దేశంలోని అతిపెద్ద 10 ఐటీ కంపెనీలు ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికరంగా కొత్తగా 205 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. ప్రతీ త్రైమాసికంలో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ పరిశ్రమ నియామకాలపై నీలినీడలు కమ్ముకోవడంతో ఈ రంగంపై ఆశలు పెట్టుకుంటున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 4, Oct 2019, 10:08 AM IST Highlights సరికొత్త ప్రపంచాన్ని చూపించి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన  ఆ కథకు ప్రస్తుతం మూడు పార్ట్ లు తెరకెక్కుతున్నాయి. నెక్స్ట్ అవతార్ 2 కోసం దర్శకుడు జేమ్స్ కేమెరూన్ చాలా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా షూటింగ్ కి సంబందించిన ఒక లొకేషన్ పిక్ ని చిత్ర నిర్మాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అవతార్ సినిమా అంటే తెలియని ప్రేక్షకుడు ఉండడు. సరికొత్త ప్రపంచాన్ని చూపించి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన  ఆ కథకు ప్రస్తుతం మూడు పార్ట్ లు తెరకెక్కుతున్నాయి. నెక్స్ట్ అవతార్ 2 కోసం దర్శకుడు జేమ్స్ కేమెరూన్ చాలా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా షూటింగ్ కి సంబందించిన ఒక లొకేషన్ పిక్ ని చిత్ర నిర్మాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఓ వైపు ఎగసిపడుతున్న అగ్ని జ్వాలలు -  మరోవైపు సముద్రపు అలలు.. ఆ కాంబినేషన్ లో ఒక సీన్ ను 3డి కెమెరాతో షూట్ చేస్తున్నారు. సాధారణంగా కెమెరామెన్ షూట్ చేస్తుంటారు. కానీ తనకు ఇష్టమైన సీన్ ని జేమ్స్ కేమెరూన్ ఇష్టంగా షూట్ చేసుకున్నాడు. అగ్ని - అలలు - 3డి తనకు ఇష్టమైన కాంబినేషన్ అని జేమ్స్ కేమెరూన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  ఇక అవతార్ 2 షూటింగ్ పార్ట్ ఇప్పటికే ఎండ్ కి వచ్చేసింది. గ్రాఫిక్స్ వర్క్స్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2021 డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక మిగతా రెండు పార్ట్ లకు సంబందించిన షూటింగ్ ని కూడా ఒకేసారి పూర్తి చేయనున్నారు. 2024 అనంతరం అవతార్ 1 అండ్ 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. Last Updated 4, Oct 2019, 10:08 AM IST
0business
Suresh 380 Views emerging 15 నుంచి ఢాకాలో ఎమర్జింగ్‌ కప్‌ న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఎసిసి) ఆధ్వర్యంలో డాకాలో జరిగే అండర్‌-23 ఎమర్జింగ్‌ కప్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది.ఈ జట్టులో ముంబై టీనేజి సెన్సేషన్‌ పృథ్వీ షా చోటు దక్కించుకున్నాడు.15 మంది సభ్యులు గల జట్టుకు తమిళనాడుకు బ్యాట్స్‌మెన్‌ బాబా అపరాజిత్‌ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.దేశవాళీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లను ఈ టోర్నీకి బిసిసిఐ ఎంపిక చేసింది.అండర్‌ -23 జట్టులో బెంగాల్‌ ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌,ఆఫ్‌ స్పిన్నర్‌ అమీర్‌ గానీ,లెప్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ కనిష్క్‌ సేథ్‌ తదితరులు ఉన్నారు. ఇక ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా గాదే హనుమ విహారికి కూడా జట్టులో చోటు లభించింది.ఇటీవల జరిగిన విజ§్‌ు హజారే ట్రోఫీలో విహారి ఆరు మ్యాచ్‌ల్లో కలిసి 262 పరుగులు చేశాడు.ఈ టోర్నీలో 23 సంవత్సరాల లోపు ఆటగాళ్లే పాల్గొనాల్సి ఉన్నప్పటికి,ఏసిసి నిబంధనలు సవరించి 23 సంవత్సరాలకు పైగా ఉన్న నలుగురు ఆటగాళ్లు జట్టులో ఉండొచ్చనే నిబంధన ఉంది.డాకాలో ఈనెల 15 నుంచి 26 వరకు ఈ టోర్నీ జరుగనుంది.2013లో చివరిసారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించింది.హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన అంకుశ్‌ బాయిన్స్‌ వైస్‌ కెప్టెన్‌,వికెట్‌ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.అండర్‌-19 ప్రాబబుల్స్‌తో కలిపి అండర్‌ -23 జట్టు సభ్యులకు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు. ==========
2sports
sumalatha 137 Views india VS south africa , mayank , Team India , Vizag Test mayank విశాఖపట్నం: భారత్దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 81 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 306 పరుగులు చేసింది. మయాంక్ 204 బంతుల్లో సెంచరీ చేశాడు. తొలి రోజు రోహిత్ శర్మ (166) శతకం బాదాడు. మయాంక్ 250 బంతుల్లో 137 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. సఫారీలపై భారత తరఫున 299 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించారు. తొలి వికెట్ పై టెస్టుల్లో భారత్ తరఫున రెండో అత్యధిక భాగస్వామ్యం, మొదటిది మాత్రం మన్కడ్రాయ్ (413) పేరిట ఉంది. గతంలో సెహ్వాగ్గంభీర్ (218) పేరిట అత్యధిక పరుగుల రికార్డు ఉండేది. మయాంక్ స్వదేశం, విదేశాలో తొలి ఇన్నింగ్స్ 50+ పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సన్నీ లియోన్ హర్ట్ అయిందిట! సెక్సీతార సన్నీలియోన్ ను ఒక స్టైలిస్ట్ కంటతడిపెట్టించాడు.. TNN | Updated: Dec 15, 2015, 11:19AM IST బూతు చిత్ర పరిశ్రమ నుండి బాలీవుడ్ కు దిగుమతి అయిన సన్నీ లియోన్ అంటే పడిచచ్చిపోని వారు ఎవరుంటారు చెప్పండి? హాట్ హాట్ ఫోజులతో చిన్నా పెద్దా అందరినీ కవ్వించే ఈ సెక్సీ బామ ఫిజిక్ ను ఒక ఫిట్ నెస్ స్టైలిస్ట్ తేలిగ్గా తీసిపారేశాడుట. నువ్వు కాస్త నీ శరీర వంపు సొంపులపై దృష్టి పెడితే మంచిది అని ఆ స్టైలిస్ట్ చెప్పగానే సన్నీ లియోన్ అవాక్కయిందని బాలీవుడ్ లైఫ్.కామ్ చెప్పింది. ఎక్కడెక్కడి వారంతా తన వయ్యారపు సొంపులను చూసి తెగ ఫిదా అయిపోతుండగా, ఇతగాడేంటీ నా శరీరం షేప్ కోల్పోయిందంటున్నాడని కళ్లల్లో నీళ్లను జరజరా కార్చేసింది. సన్నీ లియోన్ తాజాగా ఒప్పుకున్న మస్తీజాదే చిత్రంలో ఆమె 27 బికినీలను ధరించాల్సి ఉంది. దాంతోపాటు సగానికన్నా తక్కువైన దుస్తులతో అందాలను ఆరబోయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె శరీరం మరింత షేప్ సంతరించుకోవాలని చిత్రానికి స్టైలిస్ట్ పనిచేస్తున్న ప్రముఖ డిజైనర్ సన్నీకి సూచించాడు. మొత్తానికి అందరినీ కవ్వించే సన్నీ లియోన్ ను ఆ స్టైలిస్ట్ కంట తడిపెట్టించాడన్నమాట.
0business
on: 431 days 7 hours 10 mins ago శనివారం జకార్తాలో 18వ ఆసియా క్రీడలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత బృందానికి కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత, జావెలిన్‌త్రోయర్‌ నీరజ్‌ చోప్రా త్రివర్ణ పతాకం చేబూని అందరికంటే ముందు ... Readmore on: 507 days 9 hours 4 mins ago తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రీడలపై ఆసక్తిని కలిగించాలని, పిల్లలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో 36వ జాతీయస్థాయి జూనియర్‌ బాల, బాలికల ... Readmore on: 605 days 7 hours 11 mins ago కర్నూలులోని స్థానిక స్పోర్ట్స్‌ అథారిటీ అవుట్‌ డోర్‌ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న ధూల్‌ క్రీడోత్సవంలో చివరిరోజు సినీతార ప్రణీత సందడి చేశారు. పర్యాటక శాఖ, యువజన సర్వీసుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ... Readmore on: 605 days 8 hours 47 mins ago రాష్ట్రంలో కొత్తగా పది క్రీడా అకాడమీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా సాధికారిత సంస్థ (శాప్‌) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బంగార్రాజు తెలిపారు. జిల్లా పర్యటనకు ఆదివారం వచ్చిన ఆయన కలెక్టరేట్‌లోని సెట్‌శ... Readmore on: 633 days 17 hours 53 mins ago పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడగెం మండలం కె.ఆర్‌ పురం ఐటిడిఎ వద్ద నిర్వహిస్తున్న జోనల్‌ స్థాయి బాలుర క్రీడులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ... Readmore on: 665 days 22 hours 27 mins ago పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ కళాశాలలో ాయువ మహోత్సవ్‌్ణ కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమానికి... Readmore on: 685 days 6 hours 10 mins ago కృష్ణా డిస్ట్రిక్ట్‌ హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మోటమర్రి హరిత మెమోరియల్‌ ట్రస్టు సారథ్యంలో ఆంధ్ర జాతీయ కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌ 8వ సీనియర్‌ హాకీ మహిళా టోర్నమెం... Readmore
2sports
Hyderabad, First Published 11, Jul 2019, 2:19 PM IST Highlights ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే..  ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.. ఆ తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇటీవల ఆయన హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ ఆ ఆపరేషన్ ఫెయిల్ అయినట్లు సమాచారం. ఆపరేషన్ జరిగిన చోట ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో పోసాని మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి హెర్నియా ఆపరేషన్ జరిపినట్లు, ఒకట్రెండు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జ్ చేయబోతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. నటుడిగా పోసాని ఎంతో బిజీగా ఉన్నారు. అలానే రాజకీయాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడం బాధాకరం. త్వరలోనే ఆయన కోలుకొని మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుందాం! Last Updated 11, Jul 2019, 2:19 PM IST
0business
Hyderabad, First Published 9, Apr 2019, 12:36 PM IST Highlights ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే తన తొలి పారితోషికాన్ని అందుకున్నారు. 2018లో $1.40 తీసుకోగా.. ఈ ఏడాది ఇంకా ఎక్కువ మొత్తం అందుకునే అవకాశం ఉందని అంచనా. సిలికాన్ వ్యాలీ: ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే తన తొలి పారితోషికాన్ని అందుకున్నారు. 2018లో $1.40 తీసుకోగా.. ఈ ఏడాది ఇంకా ఎక్కువ మొత్తం అందుకునే అవకాశం ఉందని అంచనా. ఇంతకుముందు ట్విట్టర్ యూజర్లు 140 క్యారెక్టర్స్ మాత్రమే వన్ సెంట్‌కు ఉపయోగించే పరిమితి ఉండేది. అయితే, 2017లో ఈ పరిమితిని 280 క్యారెక్టర్స్‌కు పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో డోర్సే పారితోషికం కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. 2015లో ట్విట్టర్‌కు  తిరిగొచ్చిన డోర్సే.. అప్పట్నుంచి ఎలాంటి పారితోషికాన్ని తీసుకోకపోవడం గమనార్హం. తాజాగా ఆయన ఆ మొత్తాన్ని తొలిసారిగా పొందారు. అయితే, గత మూడేళ్లలో వచ్చే కంపెన్సేషన్స్, బెనిఫిట్స్ మాత్రం ఆయన తీసుకోలేదు. ఈ మేరకు ట్విట్టర్ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో సోమవారం వెల్లడించింది. ట్విట్టర్ దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొద్ది సంవత్సరాలుగా సహ వ్యవస్థాపకుడైన డోర్సే జీతం తీసుకోవడం లేదని పేర్కొంది. కాగా, 2018 ప్రారంభంలోనే డోర్సే షేర్లు 20శాతం విలువ పెరగడం గమనార్హం. ఇది ఇలావుండగా, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బేస్ శాలరీ $1గానే చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. 2004 నుంచి అల్ఫాబెట్ సీఈఓ లారీ పేజ్ కూడా ఏడాదికి $1 మాత్రమే బేస్ శాలరీగా తీసుకుంటున్నారు. ఇతర కంపెన్సేషన్స్ వదులుకున్నారు.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మహేష్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పీక్స్ సూపర్ స్టార్ మహేష్‌ దూసుకెళుతున్నాడు. ఫ్యాన్స్ ఫాలోయింగ్‌లో టాలీవుడ్ హీరోలందర్ని దాటేస్తూ... టాప్‌లో నిలబడ్డాడు. ట్విట్టర్‌లో మహేష్‌ను ఏకంగా 6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. Samayam Telugu | Updated: Apr 5, 2018, 04:48PM IST సూపర్ స్టార్ మహేష్‌ దూసుకెళుతున్నాడు. ఫ్యాన్స్ ఫాలోయింగ్‌లో టాలీవుడ్ హీరోలందర్ని దాటేస్తూ... టాప్‌లో నిలబడ్డాడు. ట్విట్టర్‌లో మహేష్‌ను ఏకంగా 6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తెలుగులో ఈ అరుదైన ఘనతను అందుకున్న మొదటి హీరోగా కూడా అరుదైన రికార్డును అందుకున్నాడు. 2010లో సరిగ్గా ఇదే నెలలో మహేష్ ట్విట్టర్‌ అకౌంట్‌ను ఓపెన్ చేశాడు. ఇప్పుడు అదే నెలలో 6 మిలియన్ ఫాలోవర్లను దాటేశాడు. మహేష్ తర్వాత దగ్గుబాటి రానా, నాగార్జునలు 5 మిలియన్ ఫాలోవర్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. కమల్‌హాసన్, రజనీలకు 4 మిలియన్లు ఉన్నారు. హీరోయిన్ల ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. శ్రుతిహాసన్‌న ఏకంగా 7 మిలియన్లమంది ఉన్నారట. తర్వాత సమంతాకు 6 మిలియన్లు ఫాలో అవుతున్నారట.
0business
తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ First Published 4, Feb 2018, 4:12 PM IST తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ Recent Stories
0business
సమాఖ్యపై చేసిన అవినీతి ఆరోపణలే కారణం Lionel Messi అసున్‌కియాన్‌: ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు, అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మూడు నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ సమాఖ్య (దివీవిలీనితీవీలి)పై అతడు చేసిన అవినీతి ఆరోపణలే ఇందుకు కారణం. దివీవిలీనితీవీలి సమాఖ్య అతడిపై నిషేధంతో పాటు 50 వేల డాలర్ల జరిమానా కూడా విధించింది. ఈ నిషేధాన్ని అప్పీల్‌ చేసేందుకు మెస్సీకి ఏడు రోజుల సమయం ఉంది. జులైలో నిర్వహించిన కోపా అమెరికా 2019 ప్రపంచకప్‌ పోటీల్లో.. చిలీ జట్టుతో తలపడిన మ్యాచ్‌లో అర్జెంటీనా 21 తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌ అనంతరం మెస్సీ దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ కార్యవర్గంపై అవినీతి ఆరోపణలు చేశాడు. బ్రెజిల్‌ను గెలిపించేందుకు ఈ పోటీల్లో అవినీతి జరిగింది. తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/
2sports
Vaani Pushpa 150 Views anil kumble , Kings eleven punjab anil kumble ముంబయి: టీమిండియా మాజీ కోచ్‌, స్పిన్‌ దిగ్గజం అనిల్‌కుంబ్లే ఐపిఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆ జట్టు యాజమాన్యంతో ప్రస్తుతం తుది విడత చర్చలు జరుపుతున్నాడని ఓ పత్రిక పేర్కొంది. పంజాబ్‌ జట్టు యాజమాన్యం త్వరలో నిర్వహించే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కుంబ్లే గతంలో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఏడాదిపాటు ప్రధాన కోచ్‌గా కొనసాగాడు. కోహ్లీతో విభేదాల కారణంగా పదవి నుంచి తప్పుకొన్నాడు. కుంబ్లే నేతృత్వంలో టీమిండియా కరేబియన్‌ పర్యటనలో అద్భుతంగా రాణించడం విశేషం. అలాగే స్వదేశంలోనూ 2016-17సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈనేపథ్యంలో 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాక్‌ చేతిలో టీమిండియా ఓటమిపాలైన మరుసటి రోజే కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అదే సమయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో బేదాభిప్రాయాలు రావడం చర్చనీయాంశంగా మారింది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
Hyderabad, First Published 20, Oct 2018, 2:17 PM IST Highlights సాధారణంగా ఎంత చిన్న సినిమా అయినప్పటికీ షూటింగ్ కి మినిమమ్ ఐదారు నెలల సమయం పడుతుంది. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే ఒక ఏడాది అనేది గ్యారెంటీగా మారింది. సాధారణంగా ఎంత చిన్న సినిమా అయినప్పటికీ షూటింగ్ కి మినిమమ్ ఐదారు నెలల సమయం పడుతుంది. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే ఒక ఏడాది అనేది గ్యారెంటీగా మారింది. దర్శకుడి ప్లానింగ్ ను బట్టి కూడా షూటింగ్ ఆధారపడి ఉంటుంది. ఇక రీసెంట్ గా రజినీకాంత్ తో యువ దర్శకుడు వర్క్ చేసిన విధానం అందరిని ఆకర్షించింది.  మెయిన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ షాకిచ్చారనే చెప్పాలి. రజినీ సినిమాలంటే ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమాలో స్టార్ నటీనటులు ఉంటారు కాబట్టి వారి డేట్స్ ను బట్టి కూడా షెడ్యూల్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే యంగ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు రజినీతో పేట సినిమా షూటింగ్ ను నాలుగునేళ్లలోపే పూర్తి చేశాడు. అసలైతే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఐదు నెలల సమయం చిత్రీకరణకు కేటాయించారు.  కానీ ఇప్పుడు నాలుగు నెలలకి మరో 15 రోజులు మిగిలి ఉండగానే పూర్తయ్యింది. ముఖ్యంగా రజినీకాంత్ సపోర్ట్ చేయడం వల్లే సినిమా ఫాస్ట్ గా ఫినిష్ చేసినట్లు సమాచారం. నవాజుద్దీన్ సిద్దిఖి - విజయ్ సేతుపతి - సిమ్రాన్ - త్రిష లాంటి నటి నటులు ఉన్నప్పటికీ వారి డేట్స్ ను కరెక్ట్ గా సెట్ చేసుకొని పేట సినిమాను జెట్ స్పీడ్ లో పూర్తి చేశారు.  సాధారణంగా చిన్న సినిమాలకు ఆరు నెలల సమయం పడుతుంది. ఇక పెద్ద సినిమాలకైతే రెండేళ్ల సమయం. కానీ సూపర్ స్టార్ సినిమా ఇంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి రావడం ఆశ్చర్యంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు.   Last Updated 20, Oct 2018, 2:17 PM IST
0business
vijay devarakonda meets ramgopal varma ఆర్జీవీతో అర్జున్ రెడ్డి పార్టీ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం వివాదాల్లో చిక్కుకున్న మొట్టమొదటి రోజు నుంచి ఆ మూవీ యూనిట్‌కి అండగా నిలుస్తూ... TNN | Updated: Sep 5, 2017, 08:47PM IST విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం వివాదాల్లో చిక్కుకున్న మొట్టమొదటి రోజు నుంచి ఆ మూవీ యూనిట్‌కి అండగా నిలుస్తూ వచ్చాడు రాంగోపాల్ వర్మ. లిప్ లాక్ వివాదం మొదలుపెడితే, బూతు డైలాగ్స్ వరకు అన్ని వివాదాల్లోనూ అర్జున్ రెడ్డి సినిమాకి ఎంతో మద్దతు పలికాడు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పర్‌ఫార్మెన్స్‌ని కూడా ప్రశంసించి ప్రమోషన్స్ పరంగా ఆ సినిమాను మరో స్థాయికి చేర్చాడు వర్మ. అందుకేనేమో ఇటీవల ముంబై వెళ్లిన సందర్భంలోనే కొంత సమయం వెచ్చించి రాంగోపాల్ వర్మని కలిశాడు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగానే రాంగోపాల్ వర్మతో కలిసి విజయ్ దేవరకొండ తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్జున్ రెడ్డి సినిమా వర్మ ఆలోచనలకి దగ్గరిగా వుండే చిత్రం. అందులోనూ తనపై వచ్చిన వివాదాలని హ్యాండిల్ చేయడంలోనూ ఎంతో ధైర్యం ప్రదర్శించాడు యువ నటుడు విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరూ కలిసి సినిమా తీస్తే, అదెలా వుంటుందో చూడాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. ఆర్జీవీ తల్చుకోవాలే కానీ అదెంతసేపు చెప్పండి!!
0business
ఇ-కామర్స్‌పై తగ్గుతోన్న మోజు - ఐదున్నర కోట్ల మంది మానేశారు - రెండోసారి కొనుగోళ్లకు దూరం -  రూ.3.5 లక్షల కోట్ల అమ్మకాలపై ప్రభావం - గూగుల్‌, ఒమిడ్యర్‌ రిపోర్టు ప్రజాశక్తి - బిజినెస్‌ డెస్క్‌ వినియోగదారులకు ఆన్‌లైన్‌ మార్కెట్‌పై ఆసక్తి పడిపోతోంది. గత 12 నెలల్లో దాదాపుగా 5.4 కోట్ల మంది ఈ లావాదేవీల నుంచి బయటికి వచ్చేశారని గూగుల్‌, ఒమి ్డయర్‌ నెట్‌వర్క్‌లు సంయుక్తగా నిర్వహించిన ఒక రిపోర్టులో వెల్లడయ్యింది. దీంతో భారత్‌లో ఇంటర్నెట్‌ చాలా వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ఇ-కామర్స్‌కు భారీ డిమాండ్‌ ఉంటుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. గతేడాది 54 మిలియన్ల మంది ఒక్క సారి మాత్ర మే ఆన్‌లై న్‌ కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. మరోసారి ఈ వేది కల్లో ఎలాంటి కొనుగోళ్లు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆన్‌లైన్‌ వ్యాపార వర్గాలు దాదాపుగా రూ.3.5 లక్షల కోట్లు (50 బిలియన్‌ డాలర్ల) వ్యాపారం కోల్పోయారని అంచనా. ఈ రిపోర్టు ప్రకారం.. భారత్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నెట్‌ వినియోగదారులు భారీగా పెరుగుతున్నారు. ప్రతీ ఏడాది దాదాపుగా 4 కోట్ల మంది కొత్తగా నెట్‌ వినియోగంలోకి వస్తున్నారు. మొత్తంగా 39 కోట్ల ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 40 శాతం మంది ఎప్పుడో ఒక్కసారి ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో 56 శాతం మంది పురుషులు నమోదైయ్యారని అంచనా. ఇందులో 60 శాతం మంది పట్టణ వసూలే. అందులోనూ 80 శాతం మంది 34 సంవత్సరాల లోపు వారే. 5.4 కోట్ల మంది ఇ-కామర్స్‌కు దూరం కాగా మరో 5 కోట్ల మంది క్రియాశీలక కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నారు. ప్రధాన కారణాలు.. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు తగ్గడానికి గల కారణాలను ఆ సంస్థలు ఈ రిపోర్టులో వెల్లడించాయి. ఆన్‌లైన్‌ ఉత్పత్తులపై నమ్మకం పడిపోవడం. 18 శాతం మంది దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసే సమయంలో ముట్టుకొని చూసే అవకాశం లేకపోవడం. అఫ్‌లైన్‌ లేదా రిటైల్‌ మార్కెట్‌లో కొనుగోళ్లు అనుకూలంగా ఉండటం. ఇ-కామర్స్‌లో కొనుగోలు చేసిన ఉత్పత్తులను రిటర్న్‌ చేయడానికి, రిఫండ్‌ పొందడం క్లిష్టంగా ఉండటం. మరోవైపు ఆన్‌లైన్‌ పోర్టలల్లో ఉపయోగించే ఆంగ్ల భాషలో షరతులు, విదివిధానాలు అర్థం కాకపోవడం ప్రధాన కారణమే. చాలా సవాళ్లు : గూగుల్‌ ఇండియా ఆన్‌లైన్‌ వినియోగదారులు తగ్గిపోవడం ఇ-కామర్స్‌ కంపెనీలకు పెద్ద సవాల్‌ అని గూగుల్‌ ఇండియా కంట్రీ డైరెక్టర్‌ సేల్స్‌ వికాస్‌ అగింనహోత్రి పేర్కొన్నారు. తిరిగి 5 కోట్ల మంది వినియోగదారులను ఆకర్షించగలిగితే 50 బిలియన్‌ డాలర్ల వ్యాపారానికి అవకాశం ఉందన్నారు. చాలా మంది నూతన వినియోగదారులు ఆన్‌లైన్‌కు దగ్గర కావడం లేదని ఒమిడ్యర్‌ నెట్‌వర్క్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రూపా కడ్వా పేర్కొన్నారు. కొన్ని ఇంగ్లీష్‌తో పాటు హిందీలో సమాచారం ఇస్తున్నప్పటికీ, అనేక స్థానిక భాషల్లో ఉత్పత్తుల సమాచారం లభించకపోవడంతో కొనుగోలుదారులు నిరాశకు గురైతున్నారన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Delhi, First Published 4, Sep 2018, 12:20 PM IST Highlights టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌లు డేటింగ్ చేస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. రవిశాస్త్రి గత చరిత్ర తిరిగి వార్తల్లో నిలుస్తోంది టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌లు డేటింగ్ చేస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. రవిశాస్త్రి గత చరిత్ర తిరిగి వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా నటి అమృతాసింగ్‌తో డేటింగ్, బ్రేకప్ విషయాల గురించి నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. 1980లలో టీమిండియా కీలక ఆటగాడిగా రవికి దేశంలో మంచి పాపులారిటీ ఉండేది. ఆ సమయంలో బాలీవుడ్ నటి అమృతా సింగ్‌తో కలిసి వివిధ బ్రాండ్ల ప్రకటనల్లో నటించేవారు. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. డేటింగ్ చేస్తున్నారని అప్పట్లో భారతీయ మీడియా కోడై కూసింది. అయితే అమృతా సింగ్‌తో కలిసి.. రవిశాస్త్రి ఓ మ్యాగజైన్ కవర్ ఫోటోకు ఫోజివ్వడంతో దేశానికి వీరి ప్రేమ గురించి తెలిసింది. 1986లో వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఈ జంట పెళ్లీ పీటలదాకా వెళ్లలేకపోయింది. ఇందుకు కారణాలు ఏంటో ఎవరికి తెలియదు. అయితే ఒక సందర్భంలో ‘‘ నేను ఆవేశపరుడిని.. ఓ నటిని నేను భార్యగా కోరుకోలేను... నా సతీమణికి తన ఇళ్లే తొలి ప్రాధాన్యంగా ఉండాలి’’ అని రవి వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో ‘‘ ప్రస్తుతం నా కెరీర్‌లో బిజీగా ఉంటున్నాను.. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ మంచి భార్యగా.. తల్లిగా మారుతానని’’ తెలిపారు. 1990లో రవిశాస్త్రి రీతూసింగ్‌ను పెళ్లిచేసుకోగా.. 1991లో అమృతాసింగ్‌ను సైఫ్ అలీఖాన్ వివాహం చేసుకున్నారు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV టెస్టులపై బీసీసీఐ శీతకన్ను వేస్తోంది: గంభీర్ వన్డే, టీ20ల మోజులో పడి.. టెస్టు క్రికెట్‌‌ ఆదరణని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పట్టించుకోవడం లేదని టీమిండియా వెటరన్ ఓపెనర్ Samayam Telugu | Updated: May 17, 2018, 07:00PM IST వన్డే, టీ20ల మోజులో పడి.. టెస్టు క్రికెట్‌‌ ఆదరణని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పట్టించుకోవడం లేదని టీమిండియా వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌‌కి కల్పిస్తున్న ప్రచారంలో కొంచెం కూడా టెస్టు‌లకి కల్పించలేదని.. దీంతో... క్రమంగా అభిమానులు ఐదురోజుల సుదీర్ఘ ఫార్మాట్‌కి దూరమవుతున్నారని గంభీర్ వెల్లడించాడు. తాజాగా బీసీసీఐ పాలకుల కమిటీ అధ్యక్షుడు వినోద్ రాయ్, బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీని కలిసిన గంభీర్.. టెస్టు క్రికెట్ మనుగడని కాపాడాలని విన్నవించాడు. ‘వన్డే, టీ20లకి ఇచ్చే ప్రాధాన్యం.. టెస్టు క్రికెట్‌కి బీసీసీఐ ఇవ్వడం లేదు. 2011లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది. ఆ మ్యాచ్‌లో మొదటి రోజు భారత్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్టేడియంలో వెయ్యి మంది మాత్రమే అభిమానులున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ఆటగాళ్లు మ్యాచ్ ఆడుతుంటే.. కేవలం 1000 మంది మాత్రమే అభిమానులు స్టేడియంలో ఉంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. టెస్టు క్రికెట్‌కి ఆదరణ తగ్గడానికి కారణాలేంటో..? నాకు తెలీదు. ఒకవేళ టీ20, వన్డేల సంఖ్యని తగ్గిస్తే మళ్లీ టెస్టులకి పూర్వ వైభవం వస్తుందేమో..?’ అని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జులైలో జరగనున్న ఇంగ్లాండ్‌ పర్యటనలో తొలుత మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్న భారత్.. ఆ తర్వాత ఐదు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనకి గంభీర్‌ ఎంపికవలేదు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Ashritha Daggubati: వెంకటేష్ కూతురు పెళ్లి.. అంతా సీక్రెట్! విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ‘ఎఫ్ 2’ చిత్రంతో ప్రేక్షకుల్లో ఫుల్ ఫన్ నింపిన విక్టరీ వెంకటేష్.. ‘వెంకీమామ’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. అయితే వెంకీ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా వెంకీమామగా మారారు. వెంకీ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. Samayam Telugu | Updated: Mar 20, 2019, 08:41AM IST Ashritha Daggubati: వెంకటేష్ కూతురు పెళ్లి.. అంతా సీక్రెట్! ‘ఎఫ్ 2’ చిత్రంతో ప్రేక్షకుల్లో ఫుల్ ఫన్ నింపిన విక్టరీ వెంకటేష్.. ‘వెంకీమామ’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. అయితే వెంకీ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా వెంకీమామగా మారారు. వెంకీ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆశ్రిత.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దలు వివాహానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అబ్బాయి తండ్రి రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు కావడంతో ఈ పెళ్లి పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది.
0business
Hyderabad, First Published 7, Aug 2019, 2:50 PM IST Highlights యువ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం రణరంగం. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  యువ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం రణరంగం. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. 1980 కాలం, ప్రజెంట్ ని కలుపుతూ సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తాజాగా రణరంగం ట్రైలర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించారు.  రాంచరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ట్రైలర్ చాలా ఉత్కంఠ భరితంగా ఉంది. శర్వానంద్ అదరగొట్టేశాడు. రణరంగం చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు అని చరణ్ తెలిపాడు. ప్రభాస్ కూడా రణరంగం ట్రైలర్ ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. డార్లింగ్ శర్వానంద్, రణరంగం చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అని తెలిపాడు.  1980 కాలంలో స్మగ్లింగ్ చేసే యువకుడిగా, ప్రజెంట్ లో మిడిల్ ఏజ్డ్ గ్యాంగ్ స్టర్ గా శర్వానంద్ కనిపిస్తున్నాడు. సుధీర్ వర్మ తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
0business
నందమూరి కళ్యాణ్‌రామ్‌ - కాజల్ అగర్వాల్ ల నూతన చిత్రం 'MLA' ప్రారంభం Highlights నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎమ్మెల్యే చిత్రం ప్రారంభం ఎమ్మెల్యే టైటిల్ తో రానున్న ఈ మూవీలో కాజల్ హీరోయిన్ నందమూరి కళ్యాణ్‌రామ్‌ తనయుడు సౌర్యా రామ్ క్లాప్ కెమెరా స్విచాన్ చేసిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ కూతురు తారక అద్విత నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో రాబోతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ 'MLA'. "మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్" అనేది కాప్షన్. ఈ చిత్రం లో అందాల భామ కాజల్ హీరోయిన్ గా కనిపించనున్నారు.  T.G. విశ్వప్రసాద్ సమర్పణ లో ,బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ LLP బ్యానర్ ల సంయుక్త నిర్మాణం లో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తారు.  ఈ చిత్రం పూజా కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సాయి బాబా దేవస్థానం లో జరిగింది. హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, దర్శకులు ఉపేంద్ర మాధవ్, కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల, నిర్మాతలు C భరత్ చౌదరి మరియు M. V. కిరణ్ రెడ్డి కుటుంబ సమేతం గా పాల్గొన్న ఈ కార్యక్రమం యూనిట్ సభ్యుల మధ్య జరిగింది.  నందమూరి కళ్యాణ్‌రామ్‌ తనయుడు సౌర్యా రామ్ మరియు నిర్మాత భరత్ చౌదరి తనయుడు కరణ్ ఈ చిత్రానికి క్లాప్ ఇవ్వగా, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కూతురు తారక అద్విత మరియు నిర్మాత M. V. కిరణ్ రెడ్డి కూతురు ఐక్రా కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దేవుడి పఠాల మీద చిత్రీకరించిన మొదటి షాట్ కు ప్రముఖ రచయిత కోనా వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు.  "ఆధ్యంతం వినోదభరితం గా సాగే ఈ చిత్రం హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాం. నూతన దర్శకుడు ఉపేంద్ర రాసుకున్న కథ చాలా ఫ్రెష్ గా ఉంది. జూన్ 9 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం చివరి భాగం లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం", అని నిర్మాతలు తెలిపారు.  " టోటల్ న్యూ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా లో కనపడతారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారి కి, చిత్ర నిర్మాతల కి కృతఘ్నతలు తెలుపుతున్నా. MLA అనే టైటిల్ కి, కాప్షన్ కి పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది", అని దర్శకులు ఉపేంద్ర అన్నారు.  రవి కిషెన్, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, లాస్యా , మనాలి రాథోడ్ ఈ చిత్రం లో ని ప్రధాన నటులు.  ఇతర నటీ నటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుపుతాము అని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , రచనా సహకారం : ప్రవీణ్ వర్మ, ఆది నారాయణ,  సంగీతం: మని శర్మ , సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ , ఎడిటింగ్‌: తమ్మిరాజు , సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , కో ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల , నిర్మాతలు : C భరత్ చౌదరి మరియు M. V. కిరణ్ రెడ్డి,  కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్.  Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టును నిర్మించనున్న దుబాయ్! PNR| Last Updated: సోమవారం, 1 డిశెంబరు 2014 (13:07 IST) ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టును దుబాయ్ నిర్మించనుంది. దుబాయ్‌లోని వరల్డ్ సెంట్రల్‌కు అతి సమీపంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు‌గా నిర్మించనున్న ఈ ఎయిర్ పోర్టు కోసం 3,200 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎయిర్ పోర్టులో ఏ380 విమానాలు టేకాఫ్ తీసుకునేందుకు వీలుగా, 4.5 కిలోమీటర్ల పొడవుతో మొత్తం 5 రన్ వేలు ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో 12 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే ఈ విమానాశ్రయం, 2020కల్లా 20 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తుందని దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ కార్పోరేట్ కమ్యూనికేషన్స్ అధిపతి జులియిస్ బామన్ తెలిపారు. ప్రస్తుతం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో కెల్లా రెండవ అతిపెద్ద బిజీగా ఉన్న విమానాశ్రయంగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. సంబంధిత వార్తలు
1entertainment
Baroda, First Published 13, Sep 2018, 12:09 PM IST Highlights ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందాకొచ్చర్ పనితీరుపై బ్యాంకు వాటాదారుల వార్షిక సమావేశంలో పలువురు వాటాదారులు ప్రశ్నించారు. అసలు బ్యాంకులో సుపరిపాలన అమలవుతున్నదా? అని ప్రశ్నించారు. ఇప్పటిదాక ఆమెను బ్యాంక్ సీఈఓ, ఎండీగా ఎందుకు కొనసాగించారని నిలదీశారు. దేశంలోనే అతిపెద్ద ప్రయివేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చంద్రా కొచ్చర్‌ పట్ల బ్యాంక్‌ వాటాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోకాన్‌ రుణ కేసులో చందా కొచ్చర్‌ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ఐసిఐసిఐ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవాలను వెల్లడించేందుకు చందాకొచ్చర్‌ను వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఏజీఎం) రప్పించి ఆమె వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఒకవైపు ఆమె హయాంలో బ్యాంకు లావాదేవీలపై విచారణ జరుగుతుండగా, అదే పదవిలో కొనసాగించడంపైనా సందేహాలు వ్యక్తం చేశారు.  దీనికి తోడు బ్యాంకు ప్రయోజనాలను కాపాడే విషయంలో బోర్డు పారదర్శకంగా వ్యవహరించడం లేదని వాటాదారులు మండిపడ్డారు. సుపరిపాలనను కూడా ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు పట్టించుకోవడం లేదన్న విమర్శ వచ్చింది. వీడియోకాన్‌ రుణ వివాద విచారణ పూర్తయ్యే వరకు చందా కొచ్చర్‌ను సెలవులోనే కొనసాగించాలని బోర్డు ఇది వరకే నిర్ణయించింది. దీంతో కొచ్చర్‌ బుధవారం జరిగిన 24వ వార్షిక సాధారణ సమావేశానికి హాజరు కాలేదు.  వాస్తవానికి ఐసీఐసీ బ్యాంక్‌ తన ఏజీఎం గత నెల 10నే జరగాల్సి ఉంది. కానీ బ్యాంకు సీఈవోపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర విచారణకు ఆదేశించేందుకు గాను ఈ సమావేశాన్ని దాదాపు నెల పాటు యాజమాన్యం ఏజీఎం సమావేశాన్ని వాయిదా వేసింది. బుధవారం తొలిసారిగా ఐసిఐసిఐ బ్యాంకు నూతన చైర్మన్‌ చతుర్వేది ఆధ్వర్యంలో తొలిసారి ఈ సమావేశం జరిగింది. కొచ్చర్‌ కేసులో తమ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం దొరకడం లేదని వాటాదారుల మండిపడ్డారు. బ్యాంక్‌లో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని వారు బోర్డును హెచ్చరించారు.. కొచర్‌ పనిని బోర్డు నిర్వహించలేదని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. వాటాదారుల ప్రశ్నలపై బ్యాంక్ సీఓఓ, తాత్కాలిక సీఈఓ సందీప్ బక్షి స్పందిస్తూ వివాదం నుంచి బ్యాంకు బయట పడుతుందని వివరణ ఇచ్చారు. చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు లబ్ది చేకూరేలా క్విడ్‌ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీచేసిట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి. 2008లో వీడియోకాన్‌ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌, దీపక్‌ కొచ్చర్‌, మరో ఇద్దరు కలిసి న్యూపవర్‌ రెన్యువబుల్స్‌ సంస్థను ఏర్పా టు చేశారు. ఐసీఐసీఐ నుంచి రూ.3250 కోట్ల రుణం అందుకున్నారు. కొన్ని నెలలకే నూపవర్‌లోని రూ.64 కోట్ల విలువ చేసే షేర్లను ధూత్‌ కేవలం రూ.9 లక్షలకే దీపక్‌కు ఇచ్చేసి ఆయనకే అన్ని బాధ్యతలను అప్పగించేశారు. దీంతో అనుమానాలు పెలుబుకాయి. ధూత్‌కు కొచ్చర్‌ ఐసీఐసీఐ నుంచి రుణ మంజూరు విషయంలో మేలు చేసినందునే.. దూత్‌ కొచ్చర్‌ కుటుంబానికి మేలు చేసేలా షేర్ల బదిలీ జరిపినట్టుగా వాటాదారులు ప్రధానంగా ఆరోపించారు. సమావేశంలో ఎక్కువ భాగం ఈ అంశంపైనే చర్చ జరిగింది. దీనిపై ఇప్పటికే సెబీ కూడా వివరణ కోరింది. కేవలం 15 నిమిషాల్లో ఎలా క్లీన్ చిట్ ఇస్తారని, ఇప్పుడు సుదీర్ఘ కాలంగా విచారణ సాగుతున్నదని గుర్తు చేసిన వాటాదారులు సీఈఓ చందాకొచ్చర్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారని వాటాదారులు నిలదీశారు. మార్చి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చందాకొచ్చర్ కు మద్దతుగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు పట్ల తమకు విశ్వాసం పోయిందని పేర్కొన్నారు. గమ్మత్తేమిటంటే ఈ ఏజీఎంకు ప్రభుత్వం నియమించిన స్వతంత్ర డైరెక్టర్ కూడా హాజరు కాలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్ నే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థ డైరెక్టర్ల బోర్డులో చేర్చడమేమిటని వాటాదారులు సందేహం వ్యక్తం చేశారు.  Last Updated 19, Sep 2018, 9:24 AM IST
1entertainment
అప్పటి ముచ్చట్లు క్యారేజ్‌ ముట్టుకుంటే నా మీద ఒట్టే.. ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు అలనాటి నటులు ఎన్టీఆర్‌, రావుగోపాల్‌ రావు.. వీరంతా సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో సరదాగా ఉండేవారు. ఓసారి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సెట్స్‌కు వెళ్లి సీన్స్‌ చదివి వినిపిస్తున్నారు. అదే సమయంలో గోపాలకృష్ణ ఇంటి నుంచి భోజనం వచ్చింది. ఆయన సతీమణి తొక్కు పచ్చళ్లు ఎక్కువగా పెడుతుండేవారు. ఓసారి రావుగోపాల్‌ రావు ఆ వంటలను రుచిచూశారు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా గోపాలకృష్ణ ఇంటి నుంచి క్యారేజ్‌ వచ్చింది. దాన్ని చూసిన వెంటనే రావుగోపాల్‌ రావు..‘ఆ క్యారేజ్‌ని గోపాలకృష్ణతో పాటు ఎవరు ముట్టుకున్నా నా మీద ఒట్టే’ అని అరిచేశారట. ఇందుకు గోపాలకృష్ణ కూడా ఒప్పుకోక తప్పలేదు. రావుగోపాల్‌ రావు స్వయంగా భోజనం వడ్డించుకుని ఒక్కో ముద్ద తింటూ..‘ఈ ముద్ద జస్టిస్‌ చౌదరి, ఈ ముద్ద కొండవీటి సింహం, ఈ ముద్ద ఖైదీ..’ అంటూ లొట్టలేసుకుని తినేవారట. Tags :
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆర్‌వీఎన్‌ఎల్ ఐపీవోకు గ్రీన్ సిగ్న‌ల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌(ఆర్‌వీఎన్‌ఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. Samayam Telugu | Updated: Jun 3, 2018, 11:00AM IST కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌(ఆర్‌వీఎన్‌ఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఐపీవోకు అనుమతించాల్సిందిగా సెబీకి మార్చి 28న ఆర్‌వీఎన్‌ఎల్‌ దరఖాస్తు చేసుకుంది. దేశీ కంపెనీలు ఐపీవో, ఎఫ్‌పీవో, రైట్స్‌ తదితర ఇష్యూలు చేపట్టేందుకు సెబీ అనుమతి తప్పనిసరన్న సంగతి తెలిసిందే. కాగా.. హైస్పీడ్‌ రైళ్ల కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే ఆర్‌వీఎన్‌ఎల్‌ ఐపీవోలో భాగంగా 10 శాతం వాటాకు సమానమైన 2.08 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా ప్రభుత్వం 10 శాతం వాటాను డిజిన్వెస్ట్‌ చేయనుంది. 2003లో ఆర్‌వీఎన్‌ఎల్ సంస్థ‌ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాక ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేశారు. కొత్త రైల్వే మార్గాలు ఏర్పాటు చేయ‌డం, గేజ్ మార్పిడి, విద్యుద్ధీక‌ర‌ణ వంటి ప‌నుల‌ను ఆర్‌వీఎన్ఎల్ చేప‌డుతుంది. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో కంపెనీ రూ.443.5 కోట్ల నిక‌ర లాభంతో పాటు రూ. 5915 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఫిబ్ర‌వ‌రి 2018 నాటికి కంపెనీ చేతిలో రూ.68,683.6 కోట్ల విలువైన ఆర్డ‌ర్లు ఉన్నాయి.
1entertainment
sourav ganguly banks on bhuvneshwar kumar to come good against lankan batsmen లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను భువీ వణికిస్తాడు: దాదా శ్రీలంక బ్యాటింగ్‌ లైనప్‌ను భువనేశ్వర్ కుమార్ ఇబ్బందులకు గురి చేస్తాడని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జోస్యం చెప్పాడు. TNN | Updated: Nov 15, 2017, 06:04PM IST శ్రీలంక బ్యాటింగ్‌ లైనప్‌ను భువనేశ్వర్ కుమార్ ఇబ్బందులకు గురి చేస్తాడని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జోస్యం చెప్పాడు. ముఖ్యంగా కోల్‌కతాలో భువీతో లంక బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవని దాదా చెప్పాడు. బంతి చక్కగా స్వింగ్ అవుతుంది. పచ్చికతో కూడిన ఇలాంటి వికెట్ మీద భువీని ఎదుర్కోవడం చాలా కష్టం. అతడు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. భువనేశ్వర్ కీలక బౌలర్ అని మాజీ కెప్టెన్ తెలిపాడు. నేనైతే కోల్‌కతా పిచ్ మీద ముగ్గురు పేసర్లతో బౌలింగ్ చేయిస్తా. భువీతోపాటు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌తో కూడిన పేస్ బౌలింగ్ దళం లంకను ఇబ్బంది పెడుతుందని దాదా చెప్పాడు. ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టు మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ తెలిపాడు. చివరిసారిగా 2009-10లో భారత్‌లో టెస్టు సిరీస్ ఆడిన లంక జట్టు 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. భారత గడ్డ మీద ఇప్పటి వరకూ లంకేయులు ఒక్క టెస్టు కూడా నెగ్గలేదు.
2sports
internet vaartha 222 Views హైదరాబాద్‌ : ఎయిర్‌ ఇండియా తాజాగా అలాఫ్‌కోతో 14 కొత్త ఎ 320 నియో విమానాల కొనుగోలుకు ఒప్పందంచేసుకుంది. బేగంపేట్‌లో జరిగిన ఇండియా ఏవియేషన్‌షో సందర్భంగా ఎయిర్‌ ఇండియా సిఎండి అశ్వని లోహాని, అలాఫ్‌కో సిఇఒ ఎండి అహ్మద్‌ ఆల్‌ జబిన్‌లు ఈమేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు. అలాగే సిఎఫ్‌ఎం సిఇఒ పాల్‌ అబంగా ఉపాధ్యక్షుడు ఫిలిఆప్‌ కాంబెట్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎయిర్‌ ఇండియా సామర్ధ్యం ఈ ఒప్పందంతో మరింత పెరుగుతుందని, ఇప్పటికే ఎయిర్‌ ఇండియా మౌలికవనరులపరంగా నిర్వహణ వసతులు ఎయిర్‌బస్‌ ఎ 320 కుటుంబంతో ఒప్పందంచేసుకుందన్నారు. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌బస్‌ 1989లో భారత వైమానిక సంస్థ కొత్తగా ఎయిర్‌బస్‌ ఎ320 ని అప్పట్లోనే ప్రవేశపెట్టిందన్నారు. ఎయిర్‌ ఇండియా సిఎండి అశ్వనిలోహాని మాట్లాడుతూ ఎయిర్‌ఇండియాకు ఇదొక అత్యం త ప్రాధాన్యతకలిగిన భాగస్వామ్య ఒప్పందం అని పేర్కొ న్నారు. ఎ320ఎయిర్‌క్రాప్ట్‌ తమ ప్రస్తుత విమానాల సంఖ్య కు అదనంగా తోడవుతుందని, దీనితో ఎయిర్‌ఇండియా దేశీయ మార్కెట్‌లో కీలకంగా నిలుస్తుందన్నారు. సిఎఫ్‌ఎం లీప్‌ ఇంజన్లతో ఎ320 నియో వస్తోంది. శబ్దకాలుష్యం, ఉద్గారాలు తక్కువ విడుదల చేస్తుందని, నిర్వహణ సామర్ధ్యం పెంచుతుందని, 15శాతం ఇంధనం ఆదా చేస్తుందని ఎయిర్‌ ఇండియా వెల్లడించింది. ప్రస్తుత ఎ320 విమానాలకు సిఎఫ్‌ఎం ఇంజన్లే పనిచేస్తున్నాయని రెండు కంపెనీల మధ్య మరింత భాగస్వామ్యం నడుస్తున్నదన్నారు.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV 'బాహుబలి'కన్నా ఈ సినిమానే బెస్ట్ అంటున్న దాసరి ఇటీవలే విడుదలైన ఓ కొత్త సినిమా ప్రముధ దర్శకనిర్మాత దాసరి నారాయణ రావుని 'బాహుబలి'కన్నా ఎక్కువగా ఆకర్షించింది. | Updated: Aug 1, 2016, 02:26PM IST రీసెంట్‌గా విడుదలయ్యి పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న చిత్రం 'పెళ్ళిచూపులు'. ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఈ చిత్రాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఈ తరుణంలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ చిత్రాన్ని కొనియాడుతూ మాట్లాడడం విశేషం. ''గత ఐదారేళ్లుగా సినిమా ఇండస్ట్రీ నాశనమైపోతుందనే భావనలోకి వచ్చేశాను. తమిళం, హిందీ ఇలా మిగిలిన బాషల్లో మంచి మంచి చిత్రాలు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి ఏమైందో.. నాకు అర్ధం కావట్లేదు. ఒకప్పుడు తెలుగు చిత్రాలను తమిళం, హిందీలలోకి రీమేక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మనమే వారి చిత్రాలను రీమేక్ చేసుకునే పరిస్థితి కలుగుతోంది. దానికి కారణం క్రియేటివిటీ లేని దర్శకులు లేకపోవడమే. ఈ నేపధ్యంలో 'పెళ్ళిచూపులు' వంటి చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం. ఈ సినిమాలో స్కిన్ షో లేదు, ఫైట్స్, మసాలా, వెటకారం ఏదిలేదు. నిజాయితీ ఉన్న సినిమా ఇది. నిజజీవితాలకు దగ్గరగా ఉన్న సినిమా. చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ఆయువు పట్టు. భారీ అంచనాలతో విడుదలయిన 'బాహుబలి' మంచి చిత్రమే. కానీ నన్ను ఎవరైనా బాహుబలికి ఓటేస్తారా..? పెళ్ళిచూపులకు ఓటేస్తారా..? అనడిగితే పెళ్ళిచూపులకే నా ఓ‌టని చెప్తాను. ఈరోజు చిత్రానికి ఇంత మంచి పేరొస్తుందంటే దానికి కారణం దర్శకుడి ప్రతిభే'' అని అభిప్రాయపడ్డారు దాసరి.
0business
Mumbai, First Published 2, Aug 2019, 9:52 PM IST Highlights సొంత మైదానంలో ముంబై ప్రేక్షకుల ముందు జరుగుతున్న ప్రో కబడ్డి సీజన్ 7 చివరి లీగ్ మ్యాచ్ యూ ముంబా అదరగొట్టింది. గుజరాత్ పై ఏకంగా 12 పాయింట్ల ఆధిక్యంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.    ప్రో కబడ్డి సీజన్ 7 లీగ్ దశలో భాగంగా సొంత మైదానంలో జరిగిన చివరి మ్యాచ్ లో యూ ముంబా అదరగొట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో ముంబై ప్రేక్షకుల సమక్షంలో గుజరాత్ ఫార్చూన్ జాయింట్స్ జట్టును మట్టికరిపించింది. గుజరాత్ కంటే ఏకంగా  12 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించిన ముంబై సొంత గడ్డపై తనకు తిరుగులేదని నిరూపించుకుంది.  ముంబై టీంలో అత్యధికంగా 9 పాయింట్లు సాధించి సురీందర్  సింగ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక అభిషేక్ సింగ్ 6, యంగ్ చాంగ్ 3, రోహిత్ 3, ఫజల్ 2, లీ డాంగ్ 2, అర్జున్ 1 పాయింట్లు సాధించారు. ఇలా ఆటగాళ్లందరు సమిష్టిగా రాణించి ముంబైకి  విజయాన్ని అందించారు. ముంబై రైడింగ్ లో 17, ట్యాకిల్స్ లో 11, ప్రత్యర్ధిని ఆలౌట్ చేయడం ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 2 పాయింట్లు సాధించింది.  ఇక గుజరాత్ ఫార్చూన్ జాయింట్స్ టీంలో ఏ ఒక్కరు ఆకట్టుకోలేకపోయారు హర్మజిత్ సింగ్ 4, మోరె 3, అంకిత్ 3, సోను 3 పాయింట్లతో పరవాలేదనిపించినా జట్టను విజయాన్ని అందించలేకపోయారు.  ఆ జట్టు రైండింగ్ లో10, ట్యాకిల్స్ లో 8, ఎక్స్‌ట్రాల రూపంలో 2 పాయింట్లతో కేవలం 20 పాయింట్లతోనే సరిపెట్టకుంది. దీంతో ముంబై 32-20 తేడాతో  ఘన విజయాన్ని సాధించింది.
2sports
తీన్మార్ దరువుకు రాహుల్ స్... అడివి శేషు, అదా శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్షణం మూవీ ట్రైలర్ బుధవారం మహేష్ బాబు , సమంత చేతులమీదుగా లాంచ్ అయింది. పీవీపీ సినిమా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని మార్చి 4వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు తెలిపారు. ప్రముఖ యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. క్షణం మూవీ ట్రైలర్ లాంచింగ్‌లో మహేష్ బాబు, సమంత   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సెన్సార్ పూర్తిచేసుకున్న వరుణ్ తేజ్ 'కంచె' వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైశ్వాల్ జంటగా నటించిన కంచె మూవీ రిలీజ్‌కన్నా ఓ నెలరోజులు ముందుగానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. TNN | Updated: Oct 6, 2015, 07:04PM IST X Bathukamma Song: మంగ్లీ బత... వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైశ్వాల్ జంటగా నటించిన కంచె మూవీ రిలీజ్‌కన్నా ఓ నెలరోజులు ముందుగానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. వరల్డ్ వార్-2 నేపథ్యంతో కూడిన కథాంశంతో క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్స్‌పై రాజీవ్ రెడ్డి నిర్మించిన కంచె నవంబర్‌లో రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ కెరీర్‌లో ముకుంద తర్వాత రెండో సినిమాగా వస్తున్న 'కంచె'పై ఆడియెన్స్‌లోనూ భారీ అంచనాలే వున్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూసిన రాంగోపాల్ వర్మ కూడా వరుణ్ తేజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ బెస్ట్ అని కితాబిస్తూ ట్వీట్స్ చేశాడు వర్మ. వరుణ్ తేజ్ పర్ ఫార్మెన్స్ కి వర్మ చేసిన ట్వీట్స్ ఓ కొలమానం కాకపోయినా.. పరిశ్రమలో ఆ ట్వీట్స్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైశ్వాల్ కంచె సినిమాలో వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైశ్వాల్ కంచె సినిమాలో వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైశ్వాల్
0business
Apr 12,2018 భారత్‌ వృద్ధి7.3 శాతం: ఏడీబీ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19) గానూ భారత్‌ వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదయ్యే అవకాశముందని 'ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌' (ఏడీబీ) అంచనా కట్టింది. జీఎస్‌టీ స్థిరీకరణ, బ్యాంకింగ్‌ సంస్కరణలు మూలంగా ఇండియాలో పెట్టుబడులు ఆశాజనకంగా ఉండొచ్చని ఏడీబీ తెలిపింది. దీంతో భారత వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఏడీబీ పేర్కొంది. అనుకూలతల నేపథ్యంలో వచ్చే ఏడాదిలో (2019-20) వృద్ధిరేటు మరింతగా పెరిగి 7.6 శాతానికి చేరువయ్యే అవకాశం ఉందంటూ తాజా అంచనాలను వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తొలినాళ్లలో వ్యాపారాల్లో కొంత మేర ఒడుదొడుకుల నమోదయ్యాయని తెలిపింది. ఈ కారణంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 6.6 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జీఎస్‌టీ ప్రభావం సానుకూలంగా ఉందని ఏడీబీ తెలిపింది. అంతేగాక బ్యాంకింగ్‌ సంస్కరణలు, కార్పొరేట్‌ సంస్థల పెత్తనం తగ్గడంతో పెట్టుబడులు మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయని ఏడీబీ విశ్వసిస్తోంది. తద్వారా భారత ఆర్థిక వృద్ధి మరింతగా మెరుగుపడొచ్చని అంచనా వేస్తోంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటు 4.6 శాతంగా నమోదు కావొచ్చని ఏడీబీ భావిస్తోంది. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 5.0 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. కాగా.. ఏడీబీ నివేదిక రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ అంచనాలకు సారూప్యంగా ఉండగా.. ఆర్‌బీఐ అంచనాలకు మాత్రం కాస్త తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.4శాతం వృద్ధిరేటు నమోదు అయ్యే అవకాశాలున్నాయని ఆర్‌బీఐ అంచనా వేసిన సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ​ ఇషాంత్ పొడవున్నావ్.. బలాల్ని గుర్తించు దక్షిణాఫ్రికా పర్యటనలో ఇషాంత్ శర్మ తన బలాల్ని గుర్తిస్తే.. టెస్టు సిరీస్‌లో భారత్ మరింత మెరుగైన ప్రదర్శన చేయగలదని మాజీ ఫాస్ట్ బౌలర్ TNN | Updated: Dec 27, 2017, 01:51PM IST ​ ఇషాంత్ పొడవున్నావ్.. బలాల్ని గుర్తించు దక్షిణాఫ్రికా పర్యటనలో ఇషాంత్ శర్మ తన బలాల్ని గుర్తిస్తే.. టెస్టు సిరీస్‌లో భారత్ మరింత మెరుగైన ప్రదర్శన చేయగలదని మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. జనవరి 5 నుంచి మూడు టెస్టుల సిరీస్‌ని సఫారీ గడ్డపై భారత్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ తీరుపై మీడియాతో ప్రసాద్ బుధవారం మాట్లాడారు. ఈ పర్యటన కోసం భారత సెలక్టర్లు ఐదుగురు పేసర్లని జట్టులోకి తీసుకున్నారు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ‌లు ఇప్పటికే టెస్టు జట్టులో తమ సత్తా నిరూపించుకోగా.. వన్డే, టీ20ల్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరొందిన జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. ‘దశాబ్ద కాలంగా ఇషాంత్ శర్మ జట్టులో ఉన్నాడు. ఓ ఫాస్ట్ బౌలర్‌కి ఇది చాలా ఎక్కువ సమయమనే చెప్పాలి. కానీ.. అత్యుత్తమ ప్రదర్శన మాత్రం ఈ పొడగరి ఇవ్వలేకపోతున్నాడు. అతని సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎత్తు ఉన్నాడు.. పిచ్‌ నుంచి పేస్ రాబట్టగలడు.. మైదానంలో దూకుడుగానూ ఉంటాడు. కానీ.. అతను తన బలాల్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. గతంలో ఇవే అర్హతలున్న జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, కపిల్ దేవ్ జట్టు తరఫున అద్భుతాలు చేశారు. వారి స్థాయి ప్రదర్శన చేసేందుకు ఇషాంత్ ఇకనైనా ప్రయత్నించాలి’ అని వెంకటేశ్ ప్రసాద్ సూచించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 8, Aug 2019, 7:41 AM IST Highlights టీ20ల్లో భారత్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు బాదిన వికెట్‌కీపర్‌గా ధోనీ పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు. నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగులు సాధించి ఈ ఘనత సాధించాడు. టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.... టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు. వికెట్ కీపింగ్ లో ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకుంటున్న పంత్.... అప్పుడే ధోనీ రికార్డుని బ్రేక్ చేయడం విశేషం.  టీ20ల్లో భారత్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు బాదిన వికెట్‌కీపర్‌గా ధోనీ పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు. నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగులు సాధించి ఈ ఘనత సాధించాడు. 2017లో ఇంగ్లాండ్‌పై ధోనీ చేసిన 56 పరుగులే భారత వికెట్‌ కీపర్‌ అత్యుత్తమ స్కోరుగా గతంలో ఉండేది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో నిరాశ పరిచిన పంత్ ఆఖరి టీ20లో అదరగొట్టాడు. 42 బంతుల్లో అజేయంగా 65 పరుగులు సాధించాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 27 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. కోహ్లీ (59), పంత్ కలిసి మూడో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. గురువారం నుంచి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. Last Updated 8, Aug 2019, 7:41 AM IST
2sports
హీరోయిన్ శివాణి సింగ్ హాట్ ఫోటో గ్యాలరీ First Published 7, Mar 2018, 5:13 PM IST హీరోయిన్ శివాణి సింగ్ హాట్ ఫోటో గ్యాలరీ హీరోయిన్ శివాణి సింగ్ హాట్ ఫోటో గ్యాలరీ హీరోయిన్ శివాణి సింగ్ హాట్ ఫోటో గ్యాలరీ హీరోయిన్ శివాణి సింగ్ హాట్ ఫోటో గ్యాలరీ హీరోయిన్ శివాణి సింగ్ హాట్ ఫోటో గ్యాలరీ హీరోయిన్ శివాణి సింగ్ హాట్ ఫోటో గ్యాలరీ హీరోయిన్ శివాణి సింగ్ హాట్ ఫోటో గ్యాలరీ హీరోయిన్ శివాణి సింగ్ హాట్ ఫోటో గ్యాలరీ హీరోయిన్ శివాణి సింగ్ హాట్ ఫోటో గ్యాలరీ హీరోయిన్ శివాణి సింగ్ హాట్ ఫోటో గ్యాలరీ Recent Stories
0business
Hyderabad, First Published 20, Aug 2018, 6:08 PM IST Highlights బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పటివరకు హీరోయిన్ గానే అందరికీ తెలుసు. ఇప్పుడు మెగాఫోన్ పట్టుకొని దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తోందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పటివరకు హీరోయిన్ గానే అందరికీ తెలుసు. ఇప్పుడు మెగాఫోన్ పట్టుకొని దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తోందని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో కంగనా హీరోయిన్ గా 'మణికర్ణిక' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసేసిన క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం సెట్స్ పైకి వెళ్లిపోయాడు. అయితే 'మణికర్ణిక' సినిమాకు సంబంధించిన కొంత ప్యాచ్ వర్క్ అలానే మిగిలివుంది. దీనికోసం క్రిష్ 'ఎన్టీఆర్' సెట్స్ నుండి రాలేకపోవడంతో కంగనా ఆ ప్యాచ్ వర్క్ కు డైరెక్టర్ గా పనిచేస్తోంది. అది కూడా దర్శకుడు క్రిష్ అనుమతి తీసుకొనే అని తెలుస్తోంది. ప్రస్తతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. క్రిష్ ప్రతిరోజు ఆమెతో మాట్లాడుతూ పెండింగ్ వర్క్ ని పూర్తి చేయిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు నటిగా జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన కంగనా ఇప్పుడు డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించి తన సత్తా చాటుతోంది. విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ సినిమాలో కంగనా.. ఝాన్సీ లక్ష్మీభాయ్ గా కనిపించనుంది. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది.   ఇది కూడా చదవండి..
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మెగాస్టార్ వర్కౌట్స్ మొదలెట్టేశాడు సినిమా చేసి పదేళ్ళు అయినప్పటికీ 'ఖైదీ నెంబర్ 150' చిత్రంతో బంపర్ విక్టరీ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. అదే జోరు ఇప్పుడు కంటిన్యూ చేయనున్నారు TNN | Updated: Jan 23, 2017, 09:09PM IST సినిమా చేసి పదేళ్ళు అయినప్పటికీ 'ఖైదీ నెంబర్ 150' చిత్రంతో బంపర్ విక్టరీ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. అదే జోరు ఇప్పుడు కంటిన్యూ చేయనున్నారు. ఈ ఏడాది రెండు సినిమాలు పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అలానే అల్లు అరవింద్ నిర్మాతగా మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల కోసం కొత్తగా కనిపించాలని చిరంజీవి ఇప్పటికే వర్కవుట్స్ మొదలు పెట్టేశారు. 150 సినిమా కోసం ఆయన పడ్డ కష్టం తెర మీద కనిపించింది. డాన్సుల్లో గ్రేస్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. కానీ కొన్ని చోట్ల బొద్దుగా కనిపించారు. తన తదుపరి సినిమాలో మాత్రం అలా అనిపించకుండా ఉండానికి మరింత బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారట. స్లిమ్ కావాలని ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను నియమించుకొని డైట్ పాటిస్తున్నారట. ఈ వయసులో బరువు తగ్గాలనే ఆలోచన రావడం, దాన్ని వెంటనే అమలు చేయడం చిరంజీవికే చెల్లింది. ఇక ఆయన మొదలు పెట్టారంటే ఖచ్చితంగా తన ఫిజిక్‌ను మార్చుకోవడం ఖాయం. ఇక అభిమానులు కూడా చిరుని కొత్త లుక్‌లో చూడడానికి రెడీ అయిపోవచ్చు. మార్చిలో సురేందర్ రెడ్డితో చిరు సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.
0business
sandhya 134 Views commentator , Sachin Tendulkar , World Cup 2019 sachin tendulkar లండన్‌: ఇవాళ నుండి ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌కు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో సచిన్‌ ఓపెన్స్‌ అగేన్‌ అన్న షో ప్రసారం కానున్నది. ఈ రోజు జరిగే ఇంగ్లండ్‌, సౌతాఫ్రికాల మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు సచిన్‌ కామెంట్రీ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి ఆ షో ప్రారంభం కానుంది. ఈ షోలో మాజీ మేటి క్రికెటర్లు కూడా ప్యానెల్‌లో ఉంటారు. ఆరు సార్లు ప్రపంచకప్‌ ఆడిన సచిన్‌ మొత్తం 2278 పరుగులు చేశాడు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 2వ వన్డేలో ఇండియా గెలుపు మొదటి వన్డే మ్యాచ్ ఓడిన కసితో వున్న భారత్ రెండో వన్డేలో తన ప్రతాపాన్ని చూపించుకుంది. TNN | Updated: Oct 14, 2015, 10:03PM IST మొదటి వన్డే మ్యాచ్ ఓడిన కసితో వున్న భారత్ రెండో వన్డేలో తన ప్రతాపాన్ని చూపించుకుంది. సఫారీలతో ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 86 బంతుల్లో 92 పరుగులు రాబట్టిన ఎంఎస్ ధోని మినహా మిగతా అందరూ బ్యాటింగ్‌లో వెనకబడటంతో 247 పరుగులకే ఇండియా ఆలౌట్ అయింది. ఈ మాత్రం లక్ష్యాన్ని ఛేదించడం సఫారీలకి పెద్ద పనేం కాదు కనుక ఇక ఈ మ్యాచ్ కూడా ఓడినట్లే అని భావించారంతా. కానీ అక్సర్ విసిరన బంతులు సఫారీల పరుగులకి అడ్డం పడ్డాయి. అంతేకాదు.. మూడు కీలకమైన వికెట్లు కూడా తీసుకుని బౌలింగ్ పరంగా భారత్‌కి విజయం అందించాడు అక్సర్. వ్యూహాత్మకమైన బౌలింగ్, కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో మొత్తానికి 22 పరుగుల తేడాతో సఫారీలని ఓడించింది భారత్. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో చెరో విజయంతో భారత్, సౌతాఫ్రికాలు సమానంగా వున్నాయి.
2sports
AFRIDI టీ20ల్లో ఎట్టకేలకు సెంచరీ బాదిన అఫ్రిది ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదీ 37ఏళ్ల వయసులో టీ20ల్లో తొలి సెంచరీ సాధించాడు. టీ20 బ్లాస్ట్‌లో హాంప్‌షైర్‌ తరుపున ఆడుతున్న అఫ్రిదీ.. క్వార్టర్‌ ఫైనల్లో 42బంతుల్లో శతకం బాదాడు. 10 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన అఫ్రిది 43 బంతుల్లో 101 పరుగులు చేశాడు. దీంతో హాంప్‌షైర్‌ జట్టు 8వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో 101 రన్స్‌ తేడాతో డెబ్రిషైర్‌ఫై విజయం సాధించింది. ఈ సీజన్‌లో అఫ్రిదీ చేసిన శతకమే…టీ20 బ్లాస్ట్‌ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కావడం విశేషం. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో 50 పరుగులు మాత్రమే చేసిన అఫ్రిదీ…క్వార్టర్‌ ఫైనల్లో సెంచరీ చేసి టచ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో 7 సిక్సర్లు బాదిన అఫ్రిదీ టీ20ల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి పాకిస్తానీ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో అత్యధికంగా సిక్సర్లు బాదిన ఆటగాడు క్రిస్‌ గేల్‌ అనే సంగతి తెలిసిందే. ఈ విండీస్‌ ప్లేయర్‌ టీ20ల్లో 752 సిక్సర్లు బాదాడు. టీ20ల్లో సెంచరీ చేయడానికి అఫ్రిధీ 222 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. శతకం బాదడానికి ఇంత సుదీర్ఘకాలం వేచిచూసిన ఆటగాడు అఫ్రిదీ మాత్రమే. 42బంతుల్లో సెంచరీ చేసిన షాహిద్‌… టీ20ల్లో పాకిస్తాన్‌ తరుపున రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. అహ్మద్‌ షెహజాజ్‌ గతంలో 40 బంతుల్లో శతకం బాదాడు. టీ20ల్లో సెంచరీ సాధించిన పెద్ద వయస్కుడైన పాకిస్తానీ ప్లేయర్‌ అఫ్రిదీనే. ఓవరాల్‌గా ఆరోఆటగాడు కాలింగ్‌వుడ్‌ 41ఏళ్లవయసులో శతకం బాదాడు.
2sports
Hyderabad, First Published 2, Sep 2019, 8:10 AM IST Highlights టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా ఖ్యాతికెక్కాడు. మొత్తం 99 వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా పాక్ బౌలర్ షాహిద్ ఆఫ్రిది పేరిట అత్యధికంగా 98 వికెట్లు తీసిన రికార్డు ఉండేది. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో కొలిన్ గ్రాండ్‌హోమ్ వికెట్ తీయడం ద్వారా మలింగ 99 వికెట్లు తీసిన క్రికెటర్‌గా నిలిచాడు.  యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులను భయపెట్టే శ్రీలంక పేసర్‌ మలింగ.. మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2011లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన మలింగ ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.  ప్రస్తుతం టీ20లు మాత్రమే ఆడుతున్న మలింగ... సరికొత్త రికార్డును సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా ఖ్యాతికెక్కాడు. మొత్తం 99 వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా పాక్ బౌలర్ షాహిద్ ఆఫ్రిది పేరిట అత్యధికంగా 98 వికెట్లు తీసిన రికార్డు ఉండేది. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో కొలిన్ గ్రాండ్‌హోమ్ వికెట్ తీయడం ద్వారా మలింగ 99 వికెట్లు తీసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇంకొక్క వికెట్ తీస్తే... ముచ్చటగా.. 100 వికెట్లు తీసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు.  కాగా.. 35 ఏళ్ల మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో మూడు సార్లు హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక ఆటగాడిగా మలింగ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా, కెన్యా, ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించాడు. వీటిలో రెండు హ్యాట్రిక్‌లను ప్రపంచకప్‌లోనే సాధించడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు హ్యాట్రిక్‌లు చేసిన ఆటగాళ్లు మలింగ, వసీమ్‌ అక్రమ్‌ మాత్రమే. వన్డే మ్యాచుల్లో వండర్లు సృష్టించిన మలింగ.. వాటికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. మరి టీ20ల్లో ఇంకెన్ని వండర్స్ సృష్టిస్తాడో చూడాలి. Last Updated 2, Sep 2019, 8:10 AM IST
2sports
జియో జోరు తగ్గింది! - డేటా వేగంలో ఐదో స్థానానికి : ట్రాయ్‌ ఖండించిన జియో న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనంగా దూసుకు వచ్చిన రిలయన్స్‌ జియో సంస్థ జోరు తగ్గిందట! దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు అందిస్తున్న డేటా వేగంతో పోలిస్తే జియో అయిదో స్థానంలో నిలుస్తున్నట్లుగా టెలికాం నియంత్రణ సంస్థ ట్రారు వెల్లడించింది. ట్రారు వివరాల ప్రకారం ఇతర టెలికాం కంపెనీలు ఆఫర్‌ చేసే నెట్‌ స్పీడ్‌లతో పోలిస్తే జియో వేగం చాలా తక్కువగా ఉందని తెలిపింది. ఎయిర్‌టెల్‌ అత్యధికంగా 11.4 మెగాబైట్స్‌ ఫర్‌ సెకండ్‌ (ఎంబీపీఎస్‌)తో వేగంతో నెట్‌ అందిస్తోంది. కాగా అనీల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 7.9 ఎంబీపీఎస్‌ , ఐడియా 7.6 ఎంబీపీఎస్‌, వొడాఫోన్‌ 7.3 ఎంబీపీఎస్‌ చొప్పున డేటా వేగాన్ని అందిస్తున్నాయి. కాగా 4జీ సేవలతో అందుబాటులోకి వచ్చిన జియో సెకనుకు కేవలం 6.2 ఎంబీపీఎస్‌ వేగంతో తమ వినియోగదారులకు డేటా అందిస్తున్నట్లు విశ్లేషించింది. కాగా ఈ నివేదికను రిలయన్స్‌ జియో వర్గాలు తోచిపుచ్చాయి. వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకునే 4జీబీ డేటా ఫేర్‌ యూసేజ్‌ పాలసీ (ఎఫ్‌˜యూపీ) పరిమితి మొత్తాన్ని వినియోగదారులు వాడేశాక ట్రారు నెట్‌ వేగాన్ని గణించిందని జియో పేర్కొంది. ఒక్కసారి వినియోగదారు ఎఫ్‌యూపీ పరిమితి మొత్తాన్ని వాడుకున్నాక, వేగం 256 కేబీపీఎస్‌ వరకు పడిపోతుందని తెలిపింది. వేగం తగ్గిందనడంలో వాస్తవం పేర్కొంది. రూ.3,050 కోట్ల జరిమానా విధించండి.. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ సంస్థకు చాలినన్ని అంతర్గత కనెక్షన్‌ పాయింట్లను అందజేయనందుకు గాను మూడు ప్రధాన టెలికాం సంస్థలకు సంయుక్తంగా దాదాపు రూ.3,050 కోట్ల జరిమానా విధించాలని ట్రారు నిర్ణయించింది. భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌ సంస్థలు ప్రజాప్రయోజనాలకు గండి కొడుతున్నాయని పేర్కొంది. ఈ అంశంపై సీరియస్‌ అయిన ట్రారు టెలికాం సంస్థల చర్య లైసెన్స్‌ నిబంధనల ఉల్లంఘన అని వ్యాఖ్యానించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
క్రీడాకారులను వదిలేసి ఎగిరిపోయిన ఎయిరిండియా.. బాధితుల్లో స్వర్ణపతక విజేత Highlights భారత ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి  వివాదంలో ఇరుక్కుంది. ఏడుగురు టేబుల్ టెన్నిస్ క్రీడాకారులను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం ఎక్కించుకోకుండా వదిలి వెళ్లిపోవడం వివాదానికి కారణమైంది భారత ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి  వివాదంలో ఇరుక్కుంది. ఏడుగురు టేబుల్ టెన్నిస్ క్రీడాకారులను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం ఎక్కించుకోకుండా వదిలి వెళ్లిపోవడం వివాదానికి కారణమైంది. ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు భారత్ నుంచి 17మంది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు, అధికారుల బృందం ఆదివారం మెల్‌బోర్న్‌కు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే సదరు విమానం ఓవర్ బుకింగ్ అయ్యిందంటూ వీరిలో 10 మందిని మాత్రమే ఫ్లైట్‌లోకి ఎక్కించుకుని మిగిలిన ఏడుగురిని ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలి వెళ్లిపోయింది. బాధితుల్లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్, కామన్‌వెల్త్ గేమ్స్ స్వర్ణపతక విజేత మనికా బత్రా కూడా ఉన్నారు. తన బృందానికి జరిగిన అవమానంపై వెంటనే ఆమె ట్విట్టర్ ద్వారా కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్, పీఎంవోల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.. ‘‘ నాతో పాటు మరో ఏడుగురిని ఎయిరిండియా విమానం ఏఐ 0308 ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలి వెళ్లిపోయిందని.. అందువల్ల తాము టోర్నీకి వెళ్లలేకపోతున్నామంటూ’’ బత్రా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఎయిరిండియా తాము క్రీడలను, క్రీడాకారులను గౌరవిస్తామని. అయితే క్రీడాకారుల బృందం వేరు వేరు పీఎన్ఆర్‌ల కింద బుక్ చేసుకున్నారని.. వీటిలో కొన్ని ఓవర్‌బుక్ అయ్యాయని.. అంతేకాకుండా క్రీడాకారుల్లో కొందరు ఆలస్యంగా వచ్చారని వివరణ ఇచ్చింది. ఫ్లైట్ మిస్సయిన వారందరికి వసతి కల్పించామని.. వీరిని సోమవారం మెల్‌బోర్న్‌కు పంపుతామని  స్పష్టం చేసింది. కాగా, జరిగిన ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఇఫ్ ఇండియా శాఖా పరమైన విచారణకు ఆదేశించింది.    Contd- On reaching Air India counter we were told dat flight is overbooked &only 10 members of TT team can fly which left us in a shock.7 of us are still unable to fly.All the tickets were booked by Balmer Lawrie. @Ra_THORe @PMOIndia Shocked at such mismanagement by @airindiain — Manika Batra (@manikabatra_TT) 22 July 2018 Last Updated 23, Jul 2018, 1:28 PM IST
2sports
భారీ యాక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేసుకున్న కిక్ శ్యామ్ "వాడు వస్తాడు" Highlights కిక్ ఫేమ్ శ్యామ్ తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం "కవియాన్" తెలుగులో ఈ చిత్రానికి "వాడు వస్తాడు" అనే టైటిల్ ఖరారు లాస్ వేగాస్ లోని బిజీ రోడ్ల పై ఒక భారీ యాక్షన్ సీన్ ని చిత్రీకరణ కిక్ ఫేమ్ శ్యామ్ తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం "కవియాన్". ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. తెలుగులో ఈ చిత్రానికి "వాడు వస్తాడు" అనే పేరుని ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కెవి శబరీష్ మాట్లాడుతూ "లాస్ వేగాస్ లోని బిజీ రోడ్ల పై ఒక భారీ యాక్షన్ సీన్ ని చిత్రీకరించడం జరిగింది. ప్రముఖ స్టంట్ మాస్టర్ స్టన్ శివ ఆధ్వర్యంలో హీరో శ్యామ్ పాల్గొనగా ఈ ఫైట్ ని ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించాము. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జస్టిన్ వికాజ్ విలన్ గా నటిస్తున్నారు. దర్శకుడు సారథి కి ఇది తొలి సినిమా అయినా విభిన్నమైన కథాంశాన్ని తీసుకున్నారు" అని పేర్కొన్నారు.  దర్శకుడు సారథి మాట్లాడుతూ "ఇది నా తొలిచిత్రమే అయినా యూనిట్ సహకారంతో బాగా తీయగలుగుతున్నాను. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో లాస్ వేగాస్ వీధుల్లో కిక్ శ్యామ్ గారి మీద ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించాము. చాలా బాగా వచ్చింది. సినిమా హైలైట్స్ లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. కోలీవుడ్, హాలీవుడ్ నుండి ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. త్వరలోనే భారీ ఎత్తున ఆడియో వేడుక నిర్వహిస్తాం" అని తెలిపారు.  శ్రీదేవి కుమార్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మనం కొత్తి పారవై ఫేమ్ ఆత్మీయ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఎన్ ఎస్ రాజేష్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తోన్న ఈ సినిమాకి సంగీతాన్ని శ్యామ్ మోహన్ అందిస్తున్నారు. Last Updated 26, Mar 2018, 12:01 AM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పుణెలో కివీస్ ఓటమికి కారణమిదే..? పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను TNN | Updated: Oct 26, 2017, 12:10PM IST పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను చేజార్చుకోవడమేనని కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ అభిప్రాయపడ్డాడు. పిచ్ నుంచి సహకారం లభించడంతో భారత ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా వరుసగా మార్టిన్ గప్తిల్ (11), విలియమ్సన్ (3), కోలిన్ మున్రో (10) వికెట్లను పడగొట్టారు. దీంతో 7 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 27/3తో కష్టాల్లో పడింది. ఇలా వికెట్లు చేజార్చుకోవడంతోనే ఎక్కువ స్కోరుని భారత్‌ ముందు ఉంచలేకపోయామని.. ఇదే కివీస్‌ విజయావకాశాల్ని దెబ్బతీసిందని శాంట్నర్ వివరించాడు. ‘మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్టు తొలి 10 ఓవర్లలోనే మూడు ప్రధాన వికెట్లను చేజార్చుకుని.. తిరిగి మ్యాచ్‌లో పుంజుకోవడం చాలా కష్టం. పుణె వన్డే ఆరంభంలోనే 27/3తో మా జట్టు ప్రదర్శన చాలా నిరాశ కలిగింది. ఇక్కడ ఘనత అంతా భారత పేసర్లకే దక్కాలి. పదునైన బౌలింగ్‌తో వారు కివీస్‌ని ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో మా జట్టు చివరికి 230 పరుగులకే పరిమితమయ్యింది. ఇక్కడే దాదాపు మ్యాచ్ చేజారినట్లే. ఇక ఛేదనలో శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్ చివరి వరకూ క్రీజులో నిలిచి కివీస్‌కి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పని పూర్తి చేశారు’ అని శాంట్నర్ వివరించాడు. భారత్ జట్టు ఈ వన్డే విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. విజేత నిర్ణయాత్మక వన్డే ఆదివారం కాన్పూర్ వేదికగా జరగనుంది.
2sports
bse డెరివేటివ్‌ కాంట్రాక్టుల సిరీస్‌ కీలకం ముంబై, సెప్టెంబరు 25: దేశీయ స్టాక్‌ మార్కెట్లపై సెప్టెంబరునెల డెరివేటివ్స్‌ సిరీస్‌ ముగింపుప్రభావం కనిపించను న్నది. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ గురువాంర 29వ తేదీతో ముగుస్తాయి. దీనితోట్రేడర్లు అక్టోబరు సిరీస్‌ కు తమతమ స్థాయిలను బదలాయించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల మార్కెట్లు హెచ్చు తగ్గులకులోనయ్యే అవకాశంఉంది. ప్రపంచ వ్యాప్తం గా ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తి చూపిన ఫెడ్‌రిజర్వు, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ సమీక్షలు స్థిరంగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లపరిస్థితులు కూడా దేశీయంగా మార్కెట్‌ ధోరణులను ప్రభావితం చేయవచ్చునని నిపుణుల అంచనా. మరోపక్క విదేశీ సంస్థాగత పెట్టుబడులకు ప్రాధాన్యం ఉందని నిపుణుల అంచ నా. ఇటీవల దేశీయ స్టాక్స్‌లో నిరంతరంగా పెట్టుబ డులు పెడుతూ వచ్చిన ఎఫ్‌ఐఐలు గత వారం చివ ర్లో అమ్మకాలు చేపట్టారు. అంటే తమ పెట్టుబడు లను కొంత వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే కరెన్సీ విభాగంలో 300 కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కితీసుకుంటే దేశీయ ఫండ్స్‌ మాత్రం 496 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ఇక 28వ తేదీ బుధవారం అల్జీరియాలో నాన్‌ఒపెక్‌ దేశం రష్యావంటి దేశాలతో ఒపెక్‌ దేశాలు నిర్వ హించే సమావేశం కీలకంగా మారుతోంది. రెండేళ్లు గా పతనంలో ఉన్న ముడిచమురు ధరలకు స్థిర త్వం కల్పించేందుకు సౌదీ అరేబియా, రష్యాలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందుకు చమురు ఉత్పత్తిపై నియంత్రణ విధించాలని వెల్లడించాయి. ఇందుకువీలుగా చమురు ఉత్పత్తిలో ప్రధాన దేశాల న్నింటినీ సమావేశపరుస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఇలాంటిప్రనయత్నాలు జరిగినప్పటికీ విజయవంతం కాలేదు. సరిగ్గా ఇవే అంచనాలు తాజాగా బలపడటంతో ఉన్నట్టుండి చమురు ధరలు శుక్రవారం నాలుగుశాతం పతనం అయ్యాయి. ఈ నేపథ్యంలో ముడిచమురుధరలు కూడా దేశీయ మార్కెట్‌ధోరణులను నిర్ణయిస్తాయి. ఇక వర్షపాతం జోరుగా ఉంది. వాతావరణశాఖ అంచనాల ప్రకారం సాధారణ సగటుకంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది. దీనివల్ల వ్యవసాయ రంగానికి ఎంతోమేలు జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో వినిమయ శక్తి పెరుగుతుందని అంచనా. అందువల్ల వినియోగరంగ ఉత్పత్తి కంపెనీలకు ఆటోమొబైల్‌, జ్యుయెలరీ రంగా నికి మంచి భవిష్యత్తు ఉంటుందని అంచనా. అలాగే అంతర్జాతీయంగా చూస్తే ఈ వారం అమెరికా కొత్త గృహాల విక్రయాలు, వినియోగ దారుల సూచి వంటి గణాంకాలు వెలువడుతు న్నాయి. రెండోత్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిపెట్టే అవకాశం ఉంది. వీటితోపాటు డాలరుతో రూపాయి మారకం విలువలు ప్రభుత్వపరంగా స్థూల ఆర్థికవ్యవస్థలో చోటు చేసుకునే పరిణా మాలు, భారత్‌ పాక్‌ అనిశ్చితి ధోరణులు వంటివి మార్కె ట్లపై ప్రభావం చూపిస్తాయని అంచనా.
1entertainment
మా 'సినిమావాళ్ళ జీవితాలు' అద్దాలమేడలు.. - వై వి ఎస్ చౌదరి Highlights మేము అడుక్కున్నా అతిశయమే, అడుక్కోకున్నా అతిశయమే, మేము కొంచెం చేసినా 'అతి'శయమే, కొంచెమే చేసినా 'అతి'శయమే, అస్సలు మేమేంచేసినా, చేయకున్నా ప్రతివాడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే/స్పందిస్తూనే ఉంటాం. ప్రతీ శుక్రవారం మా జీవనరేఖలు, జీవనసూత్రాలు, మా జీవితగమ్యాలు మారుతూనే ఉంటాయి. అలా ప్రతీ సంవత్సరంలో 52 సార్లు మార్పులకు, చేర్పులకు, కూర్పులకు అలవాటుపడ్డవాళ్ళం. ధైర్యసాహసాలను, కుట్రలూకుతంత్రాలను రచించగల/ప్రదర్శించగల కధానాయకులం, ప్రతినాయకులం. దానధర్మాలు, త్యాగాలు చేయగల మానవతావాదులం. మంచీ-చెడులు, గెలుపూ-ఓటమిలు, పొగడ్తలూ-ప్రశంసలు, నిందాపనిందలు మమ్మల్నెప్పుడూ వెంటాడే 'నీడ'లాంటి నేస్తాలు.    మేము అందరికీ కావాల్సినవాళ్ళం, మా అవసరాలకి మాత్రం అందరికీ కానివాళ్ళం. ఏ మాధ్యమాలకైనా, ఏ విషయానికైనా మేమే అవసరం, మేమే ప్రధమలం. మేము 'అల'లాంటి వాళ్ళం. 'అల'లాగా నిశ్చింతగా నిశ్చలంగా బతకడం చేతకానివాళ్ళం. కానీ, 'అల'లాగా పడినా లేవగల సత్తా ఉన్నవాళ్ళం. మేము దేనినైనా స్వీకరించగలం, దేనినైనా భరించగలం. దేనికైనా వెనకాడని దమ్ముగలవాళ్ళం.   ఎంత మంది ఎన్ని అన్నా, అనుకున్నా 'కళ' పట్ల, 'కళాకారుల' పట్ల వ్యామోహాన్ని ఆపలేరు, 'కళాకారులు' లోని తృష్ణని తగ్గించలేరు. ప్రపంచం ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతుకుతుంది తప్ప, గతాన్ని గుర్తుకు తెచ్చుకునే ఓపికా ఉండదు, భవిష్యత్తు గురించి బెంగపడే తీరికా ఉండదు. కాలప్రవాహంలో ఇప్పడు సంచరిస్తున్న వార్తలన్నీ రేపటికి సద్దికూడు. ఎల్లుండికి విసిరేసిన విస్తరాకు. క్లుప్తంగా.. ఈ వర్తమానమంతా రేపటికి ఇంగువ కలిపిన కమ్మని పులిహోర (Exaggerated News), ఎల్లుండికి అందరూ వదిలించుకుందామనే అశుద్ధం. ఇప్పుడు తెలుగు 'వెండితెర'పై కమ్మిన కారుమబ్బుల గురించి, నా ఈ గోడు మీ అందరికీ అర్ధమయ్యుంటుందని ఆశిస్తూ.. మీ
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV క్యాష్‌కు బై బై.. డెబిట్‌కు హాయ్ హాయ్ దేశంలో డెబిట్ కార్డులతో షాపింగ్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని గణంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో వీరి సంఖ్య ఐదింతలు పెరిగిందట... TNN | Updated: Nov 1, 2016, 01:30PM IST ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి.. విత్ డ్రా దరఖాస్తు ఇచ్చి నగదు తీసుకునేవాళ్లం. ఏటీఎంల దయవల్ల ఇప్పుడు ఎప్పుడైనా, ఎక్కడైనా క్యాష్ తీసుకునేందుకు సదుపాయం లభించింది. అంతే కాదు, ఈ రోజుల్లో షాపింగ్ చేయడం కూడా ఎంతో సులభమైపోయింది. చేతిలో నగదు లేకున్నా.. డెబిట్ కార్డు (మీ ఖాతాలో డబ్బులు ఉండాలి సుమా) ఉంటే చాలు ఎక్కడైనా షాపింగ్ చేసుకోవచ్చు. వ్యాపారులు కూడా ఇందుకు అనుగుణంగా మారిపోయారు. డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు పేటీఎం‌ల ద్వారా డబ్బులు చెల్లింపులను కూడా వ్యాపారులు స్వీకరిస్తున్నారు. ఒకప్పటిలా కార్డు మీద అదనంగా వసూళ్లు చేయడం ఇప్పుడు లేదు. దీంతో, డెబిట్ కార్డులతో షాపింగ్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 2011-2015 మధ్య కాలంలో ఈ లావాదేవీల సంఖ్య ఐదు రెట్లు పెరిగడం గమనార్హం. బ్యాంకులు సైతం డెబిట్ కార్డులతో షాపింగ్ చేసేవారికి రివార్డు పాయింట్లు, రాయితీలు కల్పించడం ఫలితంగా కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. మరి, ఐదేళ్ల వ్యవధిలో డెబిట్ కార్డుల కొనుగోళ్ల పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దామా...
1entertainment
Kohli, Sachin కోహ్లీ బ్యాట్‌పై సచిన్‌ వ్యాఖ్య న్యూఢిల్లీ: టెస్టుల్లో వరుసగా నాలుగు డబుల్‌ సెం చరీలు సాధించిన కెప్టెన్‌ కోహ్లీపై క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ ప్రశంసలు కురిపించాడు.ఉప్పల్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో 240 బంతులు ఆడి 24 బౌండరీల సాయంతో కోహ్లీ డబుల్‌ సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.ఉప్పలో లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో డబుల్‌ సెంచరీ సాధించిన అనంతరం కోహ్లీ తన బ్యాట్‌తో ప్రేక్షకులకు అభి వాదం చేశాడు. ఈ సందర్భంగా సచిన్‌ కోహ్లీ బ్యాట్‌పై ఒక స్పాట్‌ని పరిశీలనగా గమనించాడు. ఈ విషయాన్ని సచిన్‌ ట్విటర్‌లో తెలియ జేశాడు.సచిన్‌ ట్విటర్‌లో నువ్వు అద్భుతమని నీ బ్యాట్‌పై ఉన్న స్వీట్‌ బ్యాట్‌ చెబుతుంది.స్కోరు బోర్డు అవసరం లేదు. దేవుడు ఎల్లప్పుడు నీ బ్యాట్‌ని మాట్లాడేలా చేయాలి అని ట్విట్‌ చేశాడు. 28 సంవత్సరాల కోహ్లీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.టెస్టుల్లో కోహ్లీ వరుసగా నాలుగవ డబుల్‌ సెంచరీని సాధించాడు.తద్వారా టెస్టు క్రికెట్‌ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్‌లలో నాలుగు డబుల్‌ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌ మెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.అంతకు ముందు వెస్టిండీస్‌పై 200 పరుగులు, న్యూజిలాండ్‌పై 211 పరుగులు,ఇంగ్లండ్‌పై 235 ఇలా వరుసగా మూడు డబుల్‌ సెంచరీలు చేశాడు.ఈ క్రమంలో క్రికెట్‌ దిగ్గజాలు డాన్‌ బ్రాడ్‌మన్‌,ద్రవిడ్‌ల రికార్డును కోహ్లీ చెరిపివేశాడు.డాన్‌ బ్రాడ్‌మెన్‌,ద్రవిడ్‌లు మాత్రమే వరుసగా మూడు సిరీస్‌లలో మూడు డబుల్‌ సెంచరీ సాధించారు. 2011లో అంతర్జా తీయ టెస్టు అరంగేట్రం చేసిన కోహ్లీకి బంగ్లా టెస్టు 54వది కావడం విశేషం.టెస్టుల్లో కోహ్లీ ఇప్పటి వరకు 16 సెంచరీలు,14 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు.బంగ్లాదేశ్‌తో జరగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులు చేసిన కోహ్లీ తైజుల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో ఎల్‌డిడబ్ల్యూగా వెనుదిరిగాడు.
2sports
will ntr biopic do rs 100 crore? ఎన్టీఆర్ బయోపిక్.. భారీ వ్యాపారం? ఒకవైపు బయోపిక్స్ సీజన్ నడుస్తోంది. ప్రముఖుల బయోపిక్స్ థియేటర్ల వద్ద ప్రేక్షకులను ఆకట్టుకొంటూ కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తున్నాయి. Samayam Telugu | Updated: Jul 22, 2018, 04:00PM IST ఒకవైపు బయోపిక్స్ సీజన్ నడుస్తోంది. ప్రముఖుల బయోపిక్స్ థియేటర్ల వద్ద ప్రేక్షకులను ఆకట్టుకొంటూ కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తున్నాయి. దక్షిణాదిన ‘మహానటి’, ఉత్తరాదిన ‘సంజూ’ సినిమాలు ఇటీవల వచ్చిన సినిమా స్టార్ల బయోపిక్స్. సావిత్రి బయోపిక్ భారీ వసూళ్లను సాధించుకోగా, సంజయ్ దత్ బయోపిక్ వసూళ్ల రికార్డులను తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రముఖుల బయోపిక్స్ రూపకర్తలకు కొత్త ఉత్సాహం వస్తోంది. వీటి వ్యాపారం కూడా భారీగా జరుగుతోందని సమాచారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ వ్యాపారం గురించి ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి. థియేటరికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి మొత్తంగా వంద కోట్ల రూపాయల వ్యాపారం దిశగా సాగుతోందట ఈ సినిమా. ఇలా భారీ స్థాయి వ్యాపారం చేయబోతోందట.
0business
రకుల్ హాట్ లిప్ లాక్ వీడియో హల్చల్! Highlights 'కెరటం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో బ్రేక్ అందుకుంది. ఆ తరువాత కొన్నాళ్లకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది 'కెరటం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో బ్రేక్ అందుకుంది. ఆ తరువాత కొన్నాళ్లకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన రకుల్ ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. నిజానికి ఎప్పుడూ తెలుగు సినిమాలతో బిజీగా ఉండే రకుల్ చేతుల్లో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో అమ్మడు కొన్ని గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొని దర్శకనిర్మాతల దృష్టిలో పడే ప్లాన్ చేస్తోంది. నిజానికి సినిమాలలో పెద్దగా గ్లామర్ రసం ఒలికించని రకుల్ ఈ విధమైన ఫోటో షూట్ లలో పాల్గొనడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆమె లిప్ లాక్ వీడియో ఒకటి ఆన్ లైన్ లో కనిపించడంతో ఇందులో కనిపిస్తున్నది రకులేనా అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.  కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన ఓ లిప్ లాక్ సీన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన తోటి ఆర్టిస్ట్ తో కలిసి రకుల్ పాల్గొన్న ఈ లిప్ లాక్ సీన్ ఎవరూ చూసిన షాక్ అవ్వాల్సిందే. అంతగా ఇన్వాల్వ్ అయిపోయి మరీ నటించింది. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి!
0business
కాపీరైట్ వివాదంలో పవన్ "అజ్ఞాతవాసి".. ఎంటరైన రానా Highlights పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి తాజాగా కాపీరైట్స్ వివాదంలో అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ మూవీ కాపీ అంటూ నోటీసులు పంపిన టీ సిరీస్ సంస్థ వివాదం పరిష్కారానికి రానాను రంగంలోకి దింపిన అజ్ఞాతవాసి టీమ్? సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ కూడా పొందిన ఈ మూవీ.. మరో పది రోజుల్లో రిలీజ్ కు సిద్ధంగా వుండగా.. అనుకోని వివాదం అజ్ఞాతవాసిని చుట్టుముట్టినట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.   అజ్ఞాతవాసి సినిమాకు కాపీరైట్ ఇష్యూ వచ్చిందని, టీ సిరీస్ సంస్థ నుండి దర్శక నిర్మాతలకు నోటీసులు అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘లార్గో వించ్' అనే సినిమా స్పూర్తితో ‘అజ్ఞాతవాసి' తెరకెక్కించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ‘టి-సిరీస్' అలర్ట్ అయిందని, ఆ ఫ్రెంచి మూవీ హిందీ రీమేక్ రైట్స్ ఈ సంస్థ దక్కించుకోవడంతో.. ఈ వార్తలు విని  మేల్కొందని అంటున్నారు.   ‘అజ్ఞాతవాసి' సినిమా ఫ్రెంచి సినిమాకు కాపీ అని ప్రచారం జరుగుతున్నా.. నిర్మాత చినబాబుగానీ, దర్శకుడు త్రివిక్రమ్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు, ఖండించలేదు. దీంతో దర్శకనిర్మాతలకు టీ సిరీస్ సంస్థ నోటీసులు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. తమకు ‘అజ్ఞాతవాసి' సెన్సార్ కాపీ చూపించాలని, ఓసారి చెక్ చేసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.   ఈ కాపీ రైట్స్ వివాదం నేపథ్యంలో టాలీవుడ్ హీరో రానా రంగంలోకి దిగారు. టి సిరీస్ ఓనర్‌కు రానా చాలా క్లోజ్ కావడంతో... అజ్ఞాతవాసి నిర్మాతలు అతడి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒక వేళ ‘అజ్ఞాతవాసి' సినిమా.. టి-సిరీస్ దక్కించుకున్న ఫ్రెంచి సినిమాకు కాపీ అని తేలితే సినిమా భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య ఏదైనా తేడా వస్తే విషయం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది.   అయితే ఈ కాపీ వివాదాన్ని ఇరు వర్గాలు గుట్టు చప్పుడు కాకుండా.. మీడియాకు లీక్ కాకుండా నడిపిస్తున్నారట. విషయం మీడియా వరకు వస్తే డ్యామేజ్ జరిగే ఛాన్స్ వున్నందున అంతా సిక్రెట్ గా నడిపిస్తున్నారట. మరి ఇందులో నిజం ఎంత? అనే విషయంలో ‘అజ్ఞాతవాసి' టీమ్ నుండి ఓ క్లారిటీ వస్తే బావుంటుంది.   పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. అనిరుధ్ రవించదర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మాత. Last Updated 25, Mar 2018, 11:56 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV లంకతో చివరి వన్డేకి శిఖర్ ధావన్ దూరం..? శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నాడు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి TNN | Updated: Sep 2, 2017, 07:27PM IST శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నాడు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శ్రీలంక నుంచి ఈ ఓపెనర్ భారత్‌కి పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల టెస్టులతో పాటు వన్డేల్లోనూ పరుగుల వరద పారించిన ధావన్.. ప్రస్తుతం జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ చివరి వన్డే అనంతరం భారత్ బుధవారం ఏకైక టీ20 మ్యాచ్‌ కూడా లంకతో ఆడనుంది. ధావన్ దూరమైతే.. అతని స్థానంలో అజింక్య రహానె తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. అతను ఓపెనర్‌గా వస్తాడా..? లేదా మిడిలార్డర్‌లో కెప్టెన్ కోహ్లి అవకాశమిస్తాడో చూడాలి. ఎందుకంటే.. ఈ సిరీస్ ముందు వరకు ఓపెనర్‌గా ఉన్న కేఎల్ రాహుల్.. గత నాలుగు వన్డేల్లోనూ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. కానీ.. ఒకటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేకపోవడంతో ఐదో వన్డేలో ధావన్ స్థానంలో రాహుల్ మళ్లీ ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్‌లున్నాయి. ఒకవేళ రహానెకి అవకాశం దక్కకపోతే.. కేదార్ జాదవ్‌ తుది జట్టులోకి రావొచ్చు..!
2sports
ARCHIVES ఇంటి ఆతిథ్య  సేవల్లోకి తాజ్‌ ముంబయి: కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు హోటళ్లలో బస చేయడం సర్వసాధారణం. అయితే స్థానికంగా అతిథ్యం తీసుకునే సంస్కృతి ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. హోటళ్లకు దూరంగా, స్థానికులతో మమేకం కావడం కోసం పర్యాటకులు వీటిని ఇష్టపడుతున్నారు. అందుకే తాజ్‌ వంటి దిగ్గజ హోటల్‌ బ్రాండ్లు స్థానికంగా ఆతిథ్యం ఇచ్చే సేవలు (హోమ్‌ స్టే)కు శ్రీకారం చుడుతున్నాయి. కొత్త బ్రాండ్‌ ‘అమా ట్రయల్స్‌ అండ్‌ స్టేస్‌’ను తాజ్‌ బ్రాండ్‌ హోటళ్లను నిర్వహిస్తున్న ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ (ఐహెచ్‌సీఎల్‌) ఆవిష్కరించింది. దేశంలో హోమ్‌ స్టే విపణిలో మొట్టమొదటి బ్రాండెడ్‌ ఉత్పత్తిని విడుదల చేసిన అతిపెద్ద హోటల్‌ సంస్థ తమదేనని కంపెనీ తెలిపింది. కొత్త బ్రాండ్‌ కింద రెండు ఉప బ్రాండ్‌లు- అమా ప్లాంటేషన్‌ ట్రయల్స్‌, అమా ఫైన్‌ హోమ్‌స్టేస్‌ ఉన్నాయి. కర్ణాటకలోని చిక్‌మగ్లూర్‌, కూర్గ్‌ల్లో 9 విలాస బంగ్లాల కోసం టాటా కాఫీతో మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్ట్‌ను కంపెనీ కుదుర్చుకుంది. వచ్చే ఏడాది జూన్‌ నాటికి రెండు సొంత బంగ్లాలను అమా గూటి కిందకు తెస్తామని సంస్థ తెలిపింది. ‘ఈ రోజు మరో కొత్త వ్యాపారాన్ని ప్రకటిస్తున్నాం. మా గ్రూప్‌ సంస్థలకు చాలా గెస్ట్‌ హౌస్‌లు ఉన్నాయి. అమా ప్లాంటేషన్‌ ట్రయల్‌తో ప్రారంభిస్తున్నాం’ అని ఐహెచ్‌సీఎల్‌ ఎండీ, సీఈఓ పునీత్‌ చట్వాల్‌ పేర్కొన్నారు. ప్లాంటేషన్‌ ట్రయల్‌ బుకింగ్‌లు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గ్రూప్‌ బంగ్లాలతో ప్రారంభిస్తున్నామని, 2020కి వీటి సంఖ్యను 100కు పెంచుతామని పునీత్‌ అన్నారు. ఐహెచ్‌సీఎల్‌ 12 దేశాల్లో 178 హోటళ్లను నిర్వహిస్తోంది. ప్రధానాంశాలు
1entertainment
Suresh 127 Views స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రచారకర్తలుగా సింధు, సాక్షి న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వఛ్చభారత్‌ మిషన్‌ ప్రచారకర్తలుగా రియో ఒలింపిక్‌ విజేతలు సింధు, సాక్షిలతో పాటు దీపా కర్మాకర్‌లను భాగస్వాములుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాగునీరు, పారిశుద్ధ్య కార్యదర్శి పరమేశ్వరన్‌ అయ్యర్‌ వెల్లడించారు.కాగా ఈ క్రీడాకారులు ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.ఈ బృహత్తర కార్యక్రమంలో క్రీడాకారిణులను భాగస్వా ములను చేసేందుకు క్రీడాశాఖని సంప్రదిస్తామని వివరించారు.స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం గురించి ప్రచారం చేసేందుకు 27 మంది ప్రముఖులను మోడీ ఎంచుకున్నారు. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌, రామ్‌దేవ్‌, సచిన్‌,అనిల్‌ అంబానీలతోపాటు పలువురు ఈ కార్యక్ర మానికి ప్రచారకర్తలుగా ఉన్నారు.
2sports
ఈడెన్‌లో గులాబీ పోరు! -బంగ్లా బోర్డుతో బీసీసీఐ చర్చలు -తొలి డే నైట్‌ టెస్టుకు రంగం సిద్ధం నవతెలంగాణ-ముంబయి సాంకేతికతను అంగీకరించటంలో భారత క్రికెట్‌ బోర్డు ఎప్పుడూ వెనుక వరుసలోనే ఉంటోంది. అంపైర్‌ నిర్ణయ సమీక్ష (డీఆర్‌ఎస్‌)ను అన్ని దేశాలు అంగీకరించినా, బీసీసీఐ తమ మ్యాచుల్లో ఒప్పుకోలేదు. చివరకు అనిల్‌ కుంబ్లే చీఫ్‌ కోచ్‌గా వచ్చిన తర్వాతనే భారత్‌ డీఆర్‌ఎస్‌కు జై కొట్టింది. అదే పరిస్థితి ఇప్పుడు డే నైట్‌ (గులాబీ బంతి) టెస్టుల విషయంలోనూ పునరావృతం అవుతోంది. టెస్టులు ఆడే అగ్ర జట్లలో భారత్‌ మాత్రమే ఇప్పటి వరకూ ఒక్క గులాబీ టెస్టు కూడా ఆడలేదు. బంగ్లాదేశ్‌ సహా రెండు కొత్త టెస్టు జట్లు ఐర్లాండ్‌, అఫ్గనిస్థాన్‌లు తొలి డే నైట్‌ ఆడాల్సి ఉంది. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ రాకతో డే నైట్‌ టెస్టుల విషయంలో భారత్‌ వైఖరి మారిపోయింది. అన్నీ కుదిరితే నవంబర్‌ 22 నుంచి ఆరంభం కానున్న ఈడెన్‌ గార్డెన్స్‌ టెస్టులో బంగ్లాదేశ్‌తో భారత్‌ తొలి డే నైట్‌ టెస్టు ఆడటం ఖాయం. దాదా చొరవతోనే.. : ' డే నైట్‌ టెస్టులకు నేను వీరాభిమానిని. క్రికెట్‌ అభిమానులు ఆఫీస్‌ పని ముగించుకుని సాయంత్రం చాంపియన్స్‌ ఆట చూసేందుకు స్టేడియానికి రావాలి. ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేను, కానీ కచ్చితంగా చూస్తాం' అని బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్టు క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు డే నైట్‌ గులాబీ బంతి పోరు అద్భుత అవకాశంగా దాదా అభివర్ణించాడు. ప్రపంచ క్రికెట్‌లోకి గులాబీ టెస్టు వచ్చిన తరుణంలో.. భారత క్రికెట్‌లోనూ ఆ ప్రయోగానికి తెరదీశాడు గంగూలీ. బీసీసీఐ టెక్నికల్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో దేశవాళీ దులీప్‌ ట్రోఫీ (టెస్టు ఫార్మాట్‌) మ్యాచులను ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో ఆడించాడు. డే నైట్‌ టెస్టులపై అవగాహన, అనుభవం కోసం ఇక నుంచి దులీప్‌ ట్రోఫీని డే నైట్‌ లోనే నిర్వహించాలని గంగూలీ సూచించాడు. 2016లో దులీప్‌ ట్రోఫీ గులాబీ బంతితో జరిగినా.. ఆ తర్వాత చివరి నిమిషంలో బీసీసీఐ మనసు మార్చుకుంది. తిరిగి సంప్రదాయ పద్దతిలో సూర్యుడి వెలుతురులోనే నిర్వహించింది. గంగూలీ తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకోవటంతో గులాబీ టెస్టు మళ్లీ తెరపైకి వచ్చింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితోనూ డే నైట్‌ టెస్టు విషయమై చర్చించిన దాదా నాయకుడి మనసులోని మాట తెలుసుకున్నాడు. సాధ్యమైనంత త్వరగా భారత్‌ డే నైట్‌ టెస్టు ఆడేందుకు దాదా రంగం సిద్ధం చేస్తున్నారు. బంగ్లాకు ఆహ్వానం : టీమ్‌ ఇండియా గత ఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలు ఆడిలైడ్‌ టెస్టును డే నైట్‌ పద్దతిలో షెడ్యూల్‌ చేశారు. కొంత కాలంగా ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను గులాబీ బంతితో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడుతోంది. దీంతో భారత్‌తో సిరీస్‌లోనూ ఓ డే నైట్‌ మ్యాచ్‌ను షెడ్యూల్‌ చేశారు. ఎవరి అనుమతితో డే నైట్‌ టెస్టుకు షెడ్యూల్‌ విడుదల చేశారని బీసీసీఐ మండిపడింది. భారత క్రికెట్‌ బోర్డు ఆగ్రహంతో ఆస్ట్రేలియా డే నైట్‌ టెస్టును షెడ్యూల్‌ నుంచి తొలగించింది. మరో వారంలో బంగ్లాదేశ్‌ జట్టు భారత పర్యటన ఆరంభం కానుంది. నవంబర్‌ 14 నుంచి ఇండోర్‌లో తొలి టెస్టు, నవంబర్‌ 22 నుంచి కోల్‌కతలో రెండో జట్టు జరుగనున్నాయి. గంగూలీ చొరవతో షెడ్యూల్‌లో డే నైట్‌ గులాబీ బంతి మ్యాచ్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ)కి బీసీసీఐ ఈ మేరకు సమాచారం అందించింది. ' డే నైట్‌ టెస్టుపై చర్చలు జరుగుతున్నాయి. గులాబీ బంతి టెస్టుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. క్రికెటర్లు, జట్టు మేనేజ్‌మెంట్‌తో చర్చించిన తర్వాత దీనిపై బోర్డు ఓ నిర్ణయం తీసుకుంటుంది' అని బీసీబీ సీఈవో నిజాముద్దీన్‌ చౌదరి పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ సైతం గులాబీ బంతితో ఇప్పటివరకూ ఆడలేదు. సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడాన్ని బంగ్లా బోర్డు సాకుగా చెప్పే అవకాశం లేకపోలేదు. పిచ్‌ సిద్ధమవుతోంది! : మరోవైపు ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం డే నైట్‌ గులాబీ టెస్టుకు ముస్తాబవుతోంది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) నుంచి సానుకూల స్పందన అంచనా వేస్తోన్న బీసీసీఐ ఇప్పటికే మైదాన సిబ్బందికి సూచనలు చేసింది. గులాబీ టెస్టు కోసం పిచ్‌ను తయారు చేయాలని ఆదేశాలు అందించింది. ఈ మేరకు ఈడెన్‌ గార్డెన్స్‌ క్యూరేటర్‌ సుజన్‌ ముఖర్జీ ధ్రువీకరించారు. ' డే నైట్‌ టెస్టుపై అంతిమ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. అయినా, గులాబీ బంతి మ్యాచ్‌పై నమ్మకంగా ఉన్నాం. పిచ్‌ రూపకల్పనలో మాకు పెద్ద తేడా ఉండదు. ఏ మ్యాచ్‌ అయినా పిచ్‌ పిచే. క్రీడాస్ఫూర్తితో చూపే పిచ్‌ను సిద్ధం చేయనున్నాం. పేసర్లకు కొంత ఎక్కువ వెసులుబాటు ఉండనుంది' అని సుజన్‌ వెల్లడించారు. తొలి డే నైట్‌ టెస్టుకు వర్షంతో పాటు మంచు ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. కొద్ది రోజులుగా కోల్‌కతలో వర్షాలు కురుస్తున్నాయి. పిచ్‌ రూపకల్పనలో సిబ్బందికి నిరంతర వర్షం ఇబ్బందికి మారుతోంది. డే నైట్‌ మ్యాచ్‌ జరిగితే మంచు ప్రభావం ఉండనుంది. నవంబర్‌లో సాయంత్రం వేళత మంచు ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అవాంతరాలు ఉన్నప్పటికీ టెస్టుల్లో పసికూన బంగ్లాదేశ్‌తో తొలి డే నైట్‌ ప్రయోగానికి భారత్‌ సిద్ధంగా ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
2sports
భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు పెరగవని చెప్పలేను : మన్మోహన్ PNR| Last Modified గురువారం, 10 నవంబరు 2011 (11:04 IST) పెట్రోల్ ధరల తగ్గింపుపై పునఃపరిశీలన చేసే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తేల్చి చెప్పారు. అలాగే, భవిష్యత్‌లో కూడా పెట్రోల్ ధరలను పెంచబోమని కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేమన్నారు. గతవారం పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల బృందం ప్రధానిని కలిసి తన నిరసనను వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. మరోమారు పెట్రోల్ ధరలు పెంచినట్టయితే, ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటామని తెగేసి చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు పెంచకుండా చూడాలని విన్నవించిన హామీపై తానేమీ స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. కానీ భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు పెరగవనే తాను చెప్పలేనన్నారు. సంబంధిత వార్తలు
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Rohit Sharma- ధావన్ జోరుకి సచిన్-సెహ్వాగ్ రికార్డ్ బ్రేక్ భారత్‌కి మెరుగైన ఆరంభమిచ్చిన ఈ ఓపెనింగ్ జోడీ.. ఏళ్లనాటి సచిన్ టెండూల్కర్- వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్‌ను ఈరోజు బ్రేక్ చేసింది. వన్డేల్లో సుదీర్ఘకాలం ఓపెనర్లుగా ఆడిన సచిన్, సెహ్వాగ్.. 4,387 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. తాాజాగా ఆ రికార్డ్ బ్రేక్ అయ్యింది. Samayam Telugu | Updated: Mar 10, 2019, 02:52PM IST Rohit Sharma- ధావన్ జోరుకి సచిన్-సెహ్వాగ్ రికార్డ్ బ్రేక్ హైలైట్స్ ఆస్ట్రేలియాపై ఈరోజు శతక భాగస్వామ్యం నెలకొల్పిన శిఖర్ ధావన్- రోహిత్ శర్మ జోడీ ఏళ్లనాటి సచిన్ టెండూల్కర్ -వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్ బ్రేక్ జాబితాలో సచిన్ - గంగూలీ జోడీ‌కి అగ్రస్థానం మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలు ఆస్ట్రేలియాతో మొహాలి వేదికగా ఆదివారం జరుగుతున్న నాలుగో వన్డేలో దూకుడుగా ఆడిన శిఖర్ ధావన్- రోహిత్ శర్మ జోడీ.. వన్డేల్లో సచిన్- సెహ్వాగ్ అరుదైన ఓపెనింగ్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఈరోజు మ్యాచ్‌లో ఆరంభ ఓవర్ నుంచే శిఖర్ ధావన్ (60 నాటౌట్: 56 బంతుల్లో 9x4) బౌండరీల మోత మోగించగా.. తొలుత నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ (41 నాటౌట్: 52 బంతుల్లో 3x4, 1x6) తొలి పవర్‌ప్లే ముగుస్తున్న దశలో గేర్ మార్చాడు. దీంతో.. 18 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. భారత్‌కి మెరుగైన ఆరంభమిచ్చిన ఈ ఓపెనింగ్ జోడీ.. ఏళ్లనాటి సచిన్ టెండూల్కర్- వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్‌ను ఈరోజు బ్రేక్ చేసింది. వన్డేల్లో సుదీర్ఘకాలం ఓపెనర్లుగా ఆడిన సచిన్, సెహ్వాగ్.. 4,387 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. తాజాగా 4,389 పరుగులతో ఆ రికార్డ్‌ను రోహిత్- ధావన్ జోడీ బ్రేక్ చేసింది. అయితే.. భారత్ తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా సచిన్- సౌరవ్ గంగూలీ జోడీ 8,227 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Dear Comrade Day 1 Collections: అర్జున్ రెడ్డిని మించి ‘డియర్ కామ్రేడ్’.. ఫస్ట్ డే ఫసక్ Dear Comrade Box Office Collections: విజయ్ దేవరకొండ, రష్మిక మందన జోడీగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ తొలిరోజే మంచి ఓపెనింగ్స్‌ రాబట్టింది. Samayam Telugu | Updated: Jul 26, 2019, 03:39PM IST Dear Comrade Day 1 Collections: అర్జున్ రెడ్డిని మించి ‘డియర్ కామ్రేడ్’.. ఫస్ట్... హైలైట్స్ నేడు భారీగా విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ రెండోసారి జోడీ కట్టిన రష్మిక, విజయ్ దేవరకొండ దర్శకుడిగా పరిచయమైన భరత్ కమ్మ తొలిరోజు మంచి కలెక్షన్లు రాబట్టిన ‘డియర్ కామ్రేడ్’ అర్జున్ రెడ్డి చిత్రాన్ని బీట్ చేసిన ‘డియర్ కామ్రేడ్’ ‘కష్టపడు.. ఫలితం ఆశించు’.. ఈ సూత్రాన్ని విజయ్ దేవరకొండ తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. స్టార్ ఇమేజ్ వచ్చాక.. మన రెమ్యూనరేషన్ మనకు వస్తుంది కదా అని సైలెంట్‌ అయిపోతుంటారు మన హీరోలు. అయితే విజయ్ దేవరకొండ ఆ టైప్ కాదు.. కథ విన్నప్పటి నుండే సినిమా నాది అనుకుంటారు. నా అనుకున్న సినిమాను నిర్మాతలు, దర్శకులపై వదిలేయకుండా సినిమా ప్రమోషన్స్‌ భూజాలపై వేసుకుని శక్తివంచన లేకుండా కష్టపడతాడు.. ఆ కష్టానికి తగ్గ ఫలితమే ఈ ‘డియర్ కామ్రేడ్’ కలెక్షన్లు. ‘గీతగోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన జోడీ టాలీవుడ్‌లోనే బెస్ట్ రొమాంటిక్ జోడీగా మారింది. ఈ ఇద్దరూ మళ్లీ కలిసి నటింస్తే బావుండు అనేంతగా కెమెస్ట్రీని వర్కౌట్ చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో యువ దర్శకుడు భరత్ కమ్మ ‘డియర్ కామ్రేడ్’ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంతో భరత్ కమ్మ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం భారీ అంచనాలతో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. విడుదలకు ముందు ఈ నాలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్స్ విరివిగా నిర్వహించి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు. గీత, గోవిందంగా వెండితెరపై రొమాన్స్ పండించిన విజయ్ దేవరకొండ, రష్మికలు.. ఈ చిత్రంలో బాబీ, లిల్లీగా మెస్మరైజ్ చేస్తున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో డియర్ కామ్రేడ్ భారీగా విడుదల కాగా.. ఓవర్సీస్‌లో సైతం అత్యధిక థియేటర్స్‌లో విడుదలై కాసుల వర్షం కురిపిస్తోంది. యూఎస్‌లో గురువారం నాడు (నిన్న) 171 పైగా స్క్రీన్స్‌లలో విడుదలైన ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరియర్‌లోనే బెస్ట్ త్రీ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రీమియర్ షోల ద్వారా 2,05,066 డాలర్లు రాబట్టి అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, నోటా చిత్రాలను బీట్ చేసింది. మొత్తంగా 3,00,066 డాలర్లులకు చేరువైనట్టు తెలుస్తోంది. అయితే శుక్రవారం నాడు కూడా భారీగా ఈ చిత్రానికి ఆక్యుపెన్సీ ఉండటంతో ఈ కలెక్షన్లు రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టాక్ పరంగా డియర్ కామ్రేడ్‌కి మిశ్రమ స్పందన లభిస్తోంది. విజయ్ గత చిత్రాలు... టాక్సీవాలా, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలకంటే బెటర్ అనేలా ‘డియర్ కామ్రేడ్’ లేదని. థియేటర్స్ వచ్చిన ప్రేక్షకుడ్ని నిరుత్సాహ పరచకుండా చేశారు తప్ప.. అంచనాలను ‘డియర్ కామ్రేడ్’ అందుకోలేకపోయాడనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండ కెరియర్ బెస్ట్ ప్రీమియర్ కలెక్షన్లు, సినిమాలు ఇలా ఉన్నాయి. 1. గీత గోవిందం 377,930 డాలర్లు 2. మహానటి 303,456 డాలర్లు 3. డియర్ కామ్రేడ్ 273,000 డాలర్లు 4. అర్జున్ రెడ్డి 194,051 డాలర్లు 5 నోటా 128,760 డాలర్లు 6. టాక్సీవాలా 94,270 డాలర్లు. #DearComrade hourly gross for premieres is $205,066 from 171 locations at 4 pm PST in USA. What’s your expectations… https://t.co/bw56kOjF1d — idlebrain jeevi (@idlebrainjeevi) 1564103055000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మోదీపై బన్నీ కామెంట్స్: తిట్టిపోస్తున్న నెటిజన్స్ రాంగ్ టైమ్‌లో... రాంగ్ డైలాగ్స్ అంటూ అల్లు అర్జున్‌పై అంతా గుర్రుగా ఉన్నారు. ఇంతకీ బన్నీ చేసిన కామెంట్స్ ఏమిటో తెలుసా? Samayam Telugu | Updated: Apr 7, 2018, 12:06AM IST ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండుపై రాష్ట్రమంతా అట్టుడుకుతుంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాని నరేంద్ర మోదీ గురించి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఓ ప్రముఖ మ్యాగ్జైన్‌.. అల్లు అర్జున్ ఫోటోను కవర్ పేజీపై ప్రచురించడంతో పాటు ఆయన ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా అర్జున్ ప్రధాని మోదీ గురించి మాట్లాడారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో నేను ముందుకు సాగుతా’’ అని ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఏపీ మొత్తం మోదీపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. బన్నీ ఆయనకు సానుకూలంగా వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చని వ్యక్తి తనకు ఆదర్శమని ఎలా చెబుతాడంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.
0business
May 22,2015 స్వల్ప నష్టాల్లో మార్కెట్లు                ముంబయి : వివిధ కారణాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను యథాతథంగా ముగిసేలా చేశాయి. క్రితం త్రైమాసికంలో చైనీస్‌ ఫ్యాక్టరీ డాటా నిరుత్సాహకరంగా చోటు చేసుకోవడానికి తోడు టాటా స్టీల్‌ నష్టాలు పెరగడం, శుక్రవారం ఐటిసి, ఎస్‌బిఐ ఆర్ధిక ఫలితాలు వెల్లడించనున్న నేపధ్యంలో మార్కెట్లు ఒత్తిడికి గురి అయ్యాయి. ఈ నేపధ్యంలోనే గురువారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 28 పాయింట్లు కోల్పోయి 27,809 వద్ద నమోదయ్యింది. ఇంట్రా ట్రేడింగ్‌లో 27,712.73-27,809.35 మధ్య ట్రేడింగ్‌ అయ్యింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 2 పాయింట్లు తగ్గి రూ.8,421 వద్ద స్థిరపడింది. నిప్టీ గరిష్టంగా 8,446.35, కనిష్టంగా 8,320.50 వద్ద ట్రేడింగ్‌ అయ్యింది.            బిఎస్‌ఇలో రంగాల వారిగా రియాల్టీ సూచీ అత్యధికంగా 0.96 శాతం పెరిగింది. ఇదే క్రమంలో ఆటో సూచీ 0.8 శాతం, కాపిటల్‌ గూడ్స్‌ 0.53 శాతం, ఐటి 0.27 శాతం చొప్పున రాణించాయి. మరోవైపు మౌలిక వసతుల సూచీ 0.88 శాతం పడిపోయింది. ఎఫ్‌ఎంసిజి 0.76 శాతం, విద్యుత్‌ 0.61 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.46 శాతం చొప్పున తగ్గాయి. సెన్సెక్స్‌లో 14 సూచీలు నష్టాలు, 15 పెరగ్గా, టిసిఎస్‌ సూచీ యథాతథంగా ముగిశాయి.బిఎస్‌ఇలో బజాజ్‌ ఆటో 6.94 శాతం, కోల్‌ ఇండియా 3.51 శాతం, యాక్సిస్‌ బ్యాంకు 2.19 శాతం, సన్‌ఫార్మా 1.52 శాతం, ఎల్‌అండ్‌టి 1.5 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు టాటా స్టీల్‌ 5.11 శాతం, విఇడిఎల్‌ 3.29 శాతం, సిప్లా 1.98 శాతం, ఐసిఐసిఐ బ్యాంకు 1.68 శాతం, ఐటిసి 1.53 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు పటిష్టమై 63.64 వద్ద నమోదయ్యింది. బిఎస్‌ఇలో స్మాల్‌క్యాప్‌ సూచీ స్వల్పంగా నష్టపోయింది. మిడ్‌క్యాప్‌ సూచీ 0.4 శాతం పడిపోయింది. మొత్తంగా మదుపర్ల మద్దతుతో 1,183 షేర్లు లాభాల్లో ముగియగా, మరోవైపు 1,507 స్టాక్స్‌ నష్టాలు చవి చూశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రెండో వన్డే నిర్వహణ ద్వారా డీడీసీఏకు 6.8 కోట్ల లాభం! ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలవడం అందరికీ బాధను కలిగించగా, డీడీసీఏకు మాత్రం ఆ మ్యాచ్ నిర్వహణ లాభాల్ని తెచ్చి పెట్టింది. TNN | Updated: Oct 25, 2016, 12:25PM IST రెండో వన్డే నిర్వహణ ద్వారా డీడీసీఏకు 6.8 కోట్ల లాభం! ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ విషయం సగటు అభిమానికి బాధను కలిగించింది. మొహాలీలో జరిగిన మూడో వన్డేలో ధోనీ సేన దీనికి ప్రతీకారం తీర్చుకుంది కూడా. ఢిల్లీ వన్డేలో భారత్ ఓటమి పాలవడం వల్ల క్రికెట్ అభిమానులంతా బాధలో ఉంటే ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) మాత్రం మ్యాచ్ నిర్వహించినందుకు తెగ హ్యాపీగా ఉందట. ఎందుకంటే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ నిర్వహణ ద్వారా ఆ అసోసియేషన్ ఏకంగా రూ.6.81 కోట్లను ఆర్జించింది. Visit Site Recommended byColombia ఈ మ్యాచ్‌ను 30 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించగా, టిక్కెట్ల అమ్మకాల ద్వారా 3.09 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. తమ అసోసియేషన్ చరిత్రలో టికెట్ల అమ్మకం ద్వారా వసూలైన భారీ మొత్తాల్లో ఇదొకటని డీడీసీఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చేతన్ చౌహాన్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. నిర్వహణ ఖర్చులను తీసేసినప్పటికీ తమకు తప్పకుండా లాభాలు వస్తాయని ఆయన తెలిపారు. లాభనష్టాల నివేదికను త్వరలోనే జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీకి నివేదిస్తామని చౌహాన్ తెలిపారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కివీస్ వార్మప్ మ్యాచ్‌కు కూడా ఫిరోజ్ షా కోట్ల స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. Delhi & District Cricket Association (DDCA) has earned Rs 6.81 crore from the second One-day International between India and New Zealand at the Feroz Shah Kotla. “DDCA earned Rs 6.81 crore from the ODI match. 30,000 people watched the game. Earnings from ticket sales is Rs 3.09 crore, one of the highest in history of DDCA,” senior vice president Chetan Chauhan told PTI.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
rohith and satya nadella ఢిల్లీ: భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ ఆటను చూడటం అంటే తనకు ఎంతో ఇష్టమని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. ‘రోహిత్‌ శర్మ ఆడుతుంటే చూడటం నాకెంతో ఇష్టం. అతని కవర్‌ డ్రైవ్స్‌ చూస్తే నాకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుర్తుకొస్తాడు. రోహిత్‌ అద్భుత ఫామ్‌తో ఆడుతుంటే మరింత అందంగా కనిపిస్తాడు’ అని అన్నారు.‘కోహ్లీ ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు. ఆటపట్ల అతని ఫ్రొఫెషనలిజం, ఫీల్డింగ్‌ చేసే తీరు ఇంకా ఎన్నో నన్ను ఆకట్టుకున్నాయి. రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ కూడా నాకు చాలా ఇష్టం. ఒకే ఓవర్లో అతడు ఆరు బంతుల్ని ఆరు రకాలుగా వేయగలడు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియన్లలా చాలా బాగా ఆడుతున్నారు. నాకు క్రికెట్‌ చూసేందుకు ఎక్కువ సమయం దొరకదు. కానీ, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. స్కోరు బోర్డులు చూస్తుంటాను. నాకు టెస్టు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం’ అని స‌త్య తెలిపారు.
2sports
sumalatha 166 Views bse , NSE , stock market Sensex ముంబయి: దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9:19 గంటల సమయానికి సెన్సెక్స్‌ 173 పాయింట్లు లాభపడి 36,863 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 10,902 వద్ద కొనసాగుతోంది. 363 కంపెనీల షేర్లు లాభాల బాట పట్టగా..165 కంపెనీల షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/
1entertainment
గుడ్లల్లో నీళ్లు తిరిగాయి-మహేష్ బాబు Highlights స్పైడర్ రిలీజ్ కు మరి కొద్ది గంటలు ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ తమిళనాడు రిలీజ్ పై మహేష్ భావోద్వేగం స్పైడర్ చిత్రం రిలీజ్ మరి కొన్ని గంటల్లోనే.. ఇప్పటికే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. తెలుగులోనే కాక తమిళంలోనూ స్పైడర్ రిలీజ్ అవుతోంది. రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. మురుగదాస్ దర్శకత్వంలో తమిళ ఆడియెన్స్‌కి పరిచయం అవడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. రేపే స్పైడర్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇవాళ రాత్రి మహేష్ బాబు స్పైడర్ యూనిట్ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడాడు.   ఈ సందర్భంగా మహేష్ బాబు స్పైడర్ సినిమా గురించి చెబుతూ.. ''తమిళనాడుకి స్పైడర్ సినిమా ప్రమోషన్స్‌కి వెళ్లినప్పుడు అక్కడి ఆడియెన్స్ నుంచి తనకి లభించిన ఘన స్వాగతం చూశాకా నిజంగానే కళ్లలో నీళ్లు తిరిగాయి" అని ఆనందం వ్యక్తంచేశాడు. స్పైడర్ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ ఎలా ఎదురుచూస్తున్నారో తమిళ ఆడియెన్స్ కూడా అలాగే ఎదురుచూస్తున్నారని చెబుతూ మహేష్ బాబు ఈ వ్యాఖ్యలు చేశాడు. తమిళ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే దర్శకులలో ఒకరైన మురుగదాస్ తో కలిసి పనిచేయడం తనకి మరిచిపోలేని అనుభవం అని, మురుగదాస్ తో కలిసి పనిచేసే క్రమంలో తాను ఎంతో నేర్చుకున్నానని మహేష్ బాబు అభిప్రాయపడ్డాడు. Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భారత్‌కి ‘గిల్‌క్రిస్ట్’ తరహా హిట్టర్ దొరికేశాడు..! సాధారణంగా ఎక్కువ సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నించే పంత్.. సిడ్నీలో 159 పరుగులు చేసినా కేవలం ఒక సిక్సరే కొట్టడం నన్ను ఆశ్చర్యపరిచింది. -అజహరుద్దీన్ Samayam Telugu | Updated: Jan 5, 2019, 09:46AM IST భారత్‌కి ‘గిల్‌క్రిస్ట్’ తరహా హిట్టర్ దొరికేశాడు..! ఆస్ట్రేలియా గడ్డపై భారీ శతకం నమోదు చేసిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ (159: 189 బంతుల్లో 15x4, 1x6) కెరీర్‌ బెస్ట్ స్కోరు అందుకుని.. ఆస్ట్రేలియాలో టెస్టు శతకం నమోదు చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డులు నెలకొల్పాడు. అంతేకాకుండా ఆసియా వెలుపల టెస్టుల్లో రెండు శతకాలు సాధించిన ఏకైక భారత వికెట్ కీపర్‌గా నిలిచిన పంత్.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. పంత్ సెంచరీ ఇన్నింగ్స్‌ గురించి తాజాగా అజహరుద్దీన్ మాట్లాడుతూ.. అతడిని ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్‌తో పోల్చాడు. A moment to remember for Rishabh Pant! #AUSvIND | @Domaincomau https://t.co/J8uK3gQPJh — cricket.com.au (@cricketcomau) 1546577427000 ‘సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అయితే.. అతను ఇంకా వికెట్ కీపింగ్‌లో మెరుగవ్వాల్సి ఉంది. సాధారణంగా ఎక్కువ సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నించే పంత్.. సిడ్నీలో 159 పరుగులు చేసినా కేవలం ఒక సిక్సరే కొట్టడం నన్ను ఆశ్చర్యపరిచింది. అయితే.. అతను చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తానికి భారత్ జట్టు ఆడమ్ గిల్‌క్రిస్ట్ తరహాలో ఓ బ్యాట్స్‌మెన్‌ని కనుక్కోగలిగింది’ అని అజహరుద్దీన్ వెల్లడించాడు. Just a casual reverse sweep for four by @RishabPant777 https://t.co/IDNy7daa2f #AUSvIND https://t.co/JGGosJDvrq — Telegraph Sport (@telegraph_sport) 1546573863000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV దీపిక 20వ స్థానంలో.. భారత్ ఏడో స్థానంలో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం మొదలయ్యేది మన కాలమాన ప్రకారం శనివారం తెల్లవారు జామునే అయినా భారత ఆర్చరీ జట్టు విశ్వక్రీడల పోరాటం శుక్రవారమే ప్రారంభించింది. BCCL | Updated: Aug 6, 2016, 01:31AM IST రియో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం మొదలయ్యేది మన కాలమాన ప్రకారం శనివారం తెల్లవారు జామునే అయినా భారత ఆర్చరీ జట్టు విశ్వక్రీడల పోరాటం శుక్రవారమే ప్రారంభించింది. రాత్రి 9.30 గంటలకు మొదలైన మహిళల ఆర్చరీ టీమ్ వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో దీపికా కుమారి, బొంబ్యాల దేవి, లక్ష్మీరాణి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో దీపికా కుమారి 640 పాయింట్లు సాధించి 20వ స్థానంలో నిలవగా.. బాంబేలా దేవి 638 పాయింట్లతో 24వ స్థానంలో నిలిచింది. లక్ష్మీరాణి 614 పాయింట్లతో 43వ స్థానంతో సరిపెట్టుకుంది. టీమ్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో భారత్‌ మొత్తం 1892 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌కి అర్హత సాధించింది. కాగా దక్షిణ కొరియాకు చెందిన ముగ్గురు ఆర్చర్లు మొదటి మూడు స్థానాల్లో నిలవడం విశేషం. అంతకుమందు సాయంత్రం ఐదు గంటలకు మొదలైన పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో భారత ఆర్చర్‌ అతాను దాస్‌ 683 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
2sports
అందలమెక్కించిన అంచనాలు.. - రంకేసిన బుల్‌ - సెన్సెక్స్‌లో 777 పాయింట్ల ర్యాలీ -  గత ఏడేండ్లలో తొలి భారీ ర్యాలీ -  కీలకమైన 'వడ్డీ రేట్ల' అంచనాలతో పైకి -  ఆ మూడు సూచీలదేే సగం వాటా.. ముంబయి: పలు అనుకూలతల నడుమ దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం పరుగులు పెట్టాయి. రానున్న కాలంలో వడ్డీ రేట్లు తగ్గొచ్చన్న అంచనాలతో అన్ని రంగాల సూచీలు రాణించాయి. గత ఏడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒక్క రోజుర్యాలీని నమోదు చేశాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరుకుంటామని ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌లో పేర్కొనడం మదుపర్లలో విశ్వాసాన్ని నింపింది. ద్రవ్యలోటును నియంత్రిస్తామని తెలుపడంతో 'రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా' వడ్డీ రేట్లను తగ్గించడానికి ఎక్కువగా ఆస్కారం ఉందన్న ఊహాలు మార్కెట్లకు కొత్త ఊపిరినూదాయి. మరోవైపు చైనా సానుకూల పరిణామాలు పెరిగిన ఆసియన్‌ మార్కెట్ల నుంచి లభించిన జోష్‌ మదుపరులను మరింత ఉత్సాహ పరిచాయి. ఈ నేపధ్యంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 777.35 పాయింట్లు రాణించి 23,779.35 పాయింట్ల వద్ద హుందాగా నిలబడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2009 మే తర్వాత ఒక సెషన్లో ఏకంగా 777 పాయింట్ల ర్యాలీని నమోదు చేసింది. ఏడేండ్ల తరువాత ఇదే తొలిసారి. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 235.25 పాయింట్లు పెరిగి 7,222.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయ అంశాలకు తోడు విదేశీ సంస్థాగత మదుపర్లు భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం మార్కెట్లలో కొత్త విశ్వాసాన్ని నింపాయి. ఇంట్రా ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 1,284 పాయింట్లు పెరిగింది. మొత్తం ర్యాలీలో ఐటీసీ, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు జోరు కనిపించింది. ఇవే ర్యాలీకి 370 పాయింట్లతో 50 శాతం వాటాను మద్దతునిచ్చాయి. ఒకే రోజు మదుపర్లు రూ.2.50 కోట్లు విలువను పెంచుకున్నారు. బీఎస్‌ఇ క్యాపిటల్‌ విలువ 88.35 లక్షల కోట్ల నుంచి రూ.85.83 లక్షల కోట్లకు చేరింది. బీఎస్‌ఈ సూచీలలో కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌ 4.19 శాతం, ఐటీి 4.21 శాతం, ఆటో 4.19 శాతం చొప్పున అధికంగా పెరిగాయి. మిగితా అన్ని రంగాల షేర్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈలో మొత్తంగా మదుపర్ల మద్దతుతో 1,885 స్టాక్స్‌ లాభాల్లో ముగియగా, మరోవైపు 574 స్టాక్స్‌ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. నిఫ్టీలో 47 స్టాక్స్‌ లాభాల్లో ముగియగా, 3 స్టాక్స్‌ మాత్రమే నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్‌లో ఐటీసీ అత్యధికంగా 9.91 శాతం రాణించింది. ఇదేక్రమంలో ఐసీఐసీఐ బ్యాంకు 7.95 శాతం, మారుతీ సుజుకీ 7.8 శాతం, హీరో మోటో కార్ప్‌ 6.07 శాతం, అదాని పోర్ట్స్‌ 5.30 శాతం, గెయిల్‌ 5.04 శాతం, టాటా మోటార్స్‌ 5.01 శాతం, యాక్సిస్‌ బ్యాంకు 4.4 శాతం, టీసీఎస్‌ 4.27 శాతం, ఎల్‌అండ్‌టీ 4.12 శాతం చొప్పున పెరిగాయి. ప్రపంచ మార్కెట్లు  మంగళవారం ఉదయం అత్యధిక ఆసియన్‌ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అయ్యాయి. జపాన్‌కు నిక్కీ 0.70 శాతం తగ్గింది. చైనాకు చెందిన సీిఐఎస్‌ 0.60 శాతం పెరిగింది. హాంగ్‌కాంగ్‌ సెంగ్‌ 0.6 శాతం, సౌత్‌ కొరియాకు చెందిన కోస్పి 0.1 శాతం పడింది. తైవాన్‌ టిడబ్ల్యుఎస్‌ఈ 0.48 శాతం పెరిగింది. అమెరికన్‌ మార్కెట్లలో వాల్‌స్ట్రీట్‌ సోమవారం నష్టపోయింది. గృహాల అమ్మకాలు తగ్గాయన్న వార్తల నేపథ్యంలో డొజోన్స్‌ సూచీ 0.74 శాతం తగ్గింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 56 పైసలు పుంజుకుని 67.86 వద్ద నమోదయ్యింది. బడ్జెట్‌లో ప్రతిపాదనలను మార్కెట్‌ కొంత ఆలస్యంగా అర్థం చేసుకొందనీ ఈ పరిణామమే మార్కెట్లలో మదుపర్లను కొనుగోళ్లకు పురిగొల్పిందని బ్రోకర్లు పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 8, May 2019, 3:04 PM IST Highlights బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ఇటీవల అర్భాజ్ ఖాన్ నిర్వహిస్తోన్న 'పించ్' అనే టీవీ షోలో పాల్గొంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ఇటీవల అర్భాజ్ ఖాన్ నిర్వహిస్తోన్న 'పించ్' అనే టీవీ షోలో పాల్గొంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే కామెంట్లు, ట్రోలింగ్ లను వారికి చదివి వినిపించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ క్రమంలో కత్రినాని కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. 'కత్రినా... నేను నిన్ను ఎంతగానే ప్రేమిస్తున్నాను. నువ్ లేకపోతే చచ్చిపోతాను.. నన్ను పెళ్లి చేసుకో.. నీ నెంబర్ ఇవ్వు'  అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ని కత్రినాకు చూపించగా ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈరోజుల్లో కూడా ఇంతటి బలమైన భావోద్వేగాలు గల మనుషులు ఉన్నారని తెలియడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. ఈరోజుల్లో అందరూ పరిస్థితులకు అనుగుణంగా ఉండిపోతూ.. ఏదీ సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నారు. ఈ సందర్భంలో కత్రినా తన పెళ్లిపై కూడా స్పందించింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తెలియదు కానీ కచ్చితంగా చేసుకుంటాను. జీవితంలో ఏది ఊహించలేమని.. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదని చెప్పుకొచ్చింది.  Last Updated 8, May 2019, 3:04 PM IST
0business
Team India నేడు ఆసీస్‌తో రెండవ టెస్టు బెంగళూరు: నాలుగు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా,ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం రెండవ టెస్టు ప్రారంభం కానుంది.తొలి టెస్టులో 333 పరుగులు తేడాతో పరాజయం చెందిన కోహ్లీ సేన రెండవ టెస్టుని సీరియస్‌గా తీసుకుంది.రెండవ టెస్టుల విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని యోచనలో కోహ్లీ సేన ఉంది.ఇందులో భాగంగా బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా ఆట గాళ్లు శుక్రవారం తీవ్రంగా ప్రాక్టీస్‌ చేశారు. పూణే లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఫీల్డింగ్‌లో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే.దీంతో టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్‌పైనే ఎక్కువ దృష్టిసారించారు.ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా బం తిని ఎలా పట్టుకోవాలి.ఎలా అడ్డుకోవాలని అనే దానిపై ప్రాక్టీస్‌ చేశారు.ముఖ్యంగా బౌండరీ లైన్‌ వద్ద బంతిని క్యాచ్‌ పట్టడం ఎలా అనే అంశంపై క్రికెటర్లు కాన్ఫిడెన్స్‌ డ్రిల్‌ నిర్వహించారు.క్రికెటర్లు క్యాచింగ్‌ డ్రిల్‌కు సంబంధించిన వీడియాను బిసిసిఐ ట్విటర్‌లో పోస్టు చేసింది.పుణే టెస్టులో భారత్‌పై విజయం సాధించడం ద్వారా ఆసీస్‌ భారత్‌లో 12 సంవత్సరాల తరువాత ఒక టెస్టు మ్యాచ్‌ను నెగ్గింది. వరుసగా 19 టెస్టుల్లో విజయం సాధించి దూకుడు మీదున్న కోహ్లీ సేనకు కూడా స్మిత్‌ నేతృత్వంలోని ఆసీస్‌ బ్రేక్‌ కూడా వేసింది. దీంతో స్వదేశంలో పరాజయం ఎరుగని భారత్‌కు ఆసీస్‌ రూపంలో గట్టి షాక్‌ ఎదురైందనే పేర్కొనాలి. మరోవైపు బెంగళూరు టెస్టులో విజ యం సాధించి ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవా లని ఆస్ట్రేలియా భావిస్తుంది.అందుకు తగిన విధం గా ఆసీస్‌ వ్యూహాలు సిద్దం చేస్తుంది.ఓపెనర్లు దగ్గర్నుంచి,టెయిలెండర్ల వరకు ఏ సమయాల్లో ఎలా ఆడాలిఅనే దానిపై ఆస్ట్రేలియా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.ఇక బెంగళూరు పిచ్‌ స్పిన్న ర్లకు అనుకూలించే విధంగా కనిపిస్తుండటంతో టీమిండియా ప్రధాన స్పిన్నర్లు అశ్విన్‌,జడేజాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఇక పుణే టెస్టులో సత్తా చాటిన ఆసీస్‌ స్పిన్నర్‌ ఓకీప్‌పై టీమిండియా సరైన ప్రణాళికలను సిద్ధం చేసింది.రెండవ టెస్టు లో ఎలాగైనా సరే ఓకీప్‌ను అధిగమించాలని చూస్తుంది.తొలి టెస్టులో నిరాశపరిచిన కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది.వరుసగా టెస్టుల్లో నాలు గు డబుల్‌సెంచరీలు చేసి కోహ్లీ అరుదైన రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే.ఆసీస్‌తో పుణేలో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు.రెండవ ఇన్నిం గ్స్‌లో 13 పరుగులు మాత్రమే చేశాడు.తద్వారా కోహ్లీ స్వదేశంలో తొలిసారి సరిగా ఆడలేకపో యాడు. ఇదిలా ఉంటే బెంగళూరులో ఇప్పటి వరకు 21 టెస్టులు జరిగాయి.ఇందులో టీమిం డియా ఆరింటిలో విజయం సాధించగా,మరో ఆరింటిలో పరాజయం చెందింది. మిగతా తొమ్మిది టెస్టులు డ్రాగా ముగిశాయి.చివరిసారి 2015 నవంబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. పిచ్‌పై మరోసారి చర్చ భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఆటకు ముందే పిచ్‌ ఎలా ఉండబోతుంది అనే చర్చ మరో సారి మొదలైంది. అయితే ఈసారి సీన్‌ రివర్స్‌గా ఉంది. ఎప్పుడైనా ప్రత్యర్థి జట్టు పిచ్‌ గురించి ఆం దోళన చెందేవి.భారత్‌ మాత్రం అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు.కానీ పుణే టెస్టు మ్యాచ్‌ ఫలితంతో టీమిండియా కూడా వికెట్‌పై దృష్టి పెడుతుంది.ఇంగ్లండ్‌ సిరీస్‌లో భారత్‌ 4-0తో గెలిచినా పిచ్‌ల ఏర్పాటు విష యంలో ఎలాంటి వివాదం లేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ ఎవరికి అనుకూలిస్తుందనే.ఇదే విషయం ఆసక్తి కరంగా మారింది. నేడు ప్రారంభం కానున్న టీమిండియా,ఆస్ట్రేలియా రెండవ టెస్టుకు మూడు రోజల ముందు ప్రధాన వికెట్‌పై చాలా ఎక్కువగా పచ్చిక కనిపించింది.అదే సమయంలో ఒక ఎండ్‌లో ఆఫ్‌ స్టంప్‌కే చేరువలో వికెట్‌ కొంత ఎత్తుపల్లాలతో ఉంది.ఇది భారత స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాలకు అనుకూలంగా మారవచ్చని భావి స్తున్నారు. అయితే మరోవైపు అదనపు పేస్‌తో ఇది ఆసీస్‌ స్టార్‌ మిషెల్‌ స్లార్క్‌ కూడ కలిసి వచ్చే ప్రమాదం కూడా ఉంది.దీంతో గురవారం నాటికే పిచ్‌ మారిపోయింది. పిచ్‌పై ఉన్న పచ్చికను సుమారు పూర్తిగా తొలగించారు.ఇప్పుడు ఇది సాధారణ ఉపఖండపు వికెట్‌లా కనిపించడం విశేషం. అంటే తొలి రోజుల్లో బ్యాటింగ్‌కు బాగా అనుకూలించి ఆ తరువాత మెల్లగా స్పిన్‌కు సహ కరించవచ్చు.ఈ సీజన్‌లో టీమిండియా ఇంగ్లం డ్‌తో ఆడిన ఐదు టెస్టులు,బంగ్లాదేశ్‌తో ఆడిన ఏకైక టెస్టులో ఇలాంటి పిచ్‌లపైనే ముందుగా భారీ స్కోరు సాధించి ఆ తరువాత ప్రత్యర్థిని చుట్టే సింది.ఈ ఆరు టెస్టుల తొలి ఇన్నింగ్స్‌లలో భారత్‌ వరుసగా 488 పరుగులు,455 పరు గులు, 417 పరుగులు,631 పరుగులు,7 వికెట్లకు 759 పరుగులు,6 వికెట్లకు 687 పరుగులు చేయడం విశేషం. కాబట్టి ఈసారి కూడా టాస్‌ కీలకం కానుంది.పూర్తి స్పిన్‌ పిచ్‌ లేదా పేస్‌ వికెట్‌ ఉపయోగించి సాహసం చేసే పరిస్థితిలో భారత్‌్‌ ప్రస్తుతం లేదు. కాబట్టి ముందుగా తమ బలమైన బ్యాటిం గ్‌నే నమ్ముకోవాలని జట్టు భావిస్తుంది.ముందుగా బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరు గనుక చేయగలిగితే జట్టుకు టెస్టుపై పట్టు లభించవచ్చు. భారత గడ్డపై స్టార్క్‌ లాంటి పేస్‌ బౌలర్‌ ప్రభావం చూపించడం మంచి పరిణామమని అతని సహచరుడు,ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్లలో ఒక రకమైన ఆందో ళనను స్టార్క్‌ పెంచాడన్నాడు.స్టార్క్‌ ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. స్పిన్నర్ల గురించి చర్చ జరిగే భారత్‌లో స్టార్క్‌ మా ప్రధాన ఆయు ద్ధం.భారత్‌ బ్యాట్స్‌మెన్‌లో భయం పుట్టించి అతను మరిన్ని వికెట్లు తీస్తాడని నమ్ముతున్నా. స్టార్క్‌తో పాటు హాజల్‌వుడ్‌,రివర్స స్వింగ కలిస్తే మాకు తిరుగుండదని మార్ష్‌ విశ్వాసం ప్రక టించాడు. టీమిండియాకు ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ కావ డంతో ప్రధాన ఆటగాళ్లంతా సెషన్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు మాత్రం పూర్తి స్థాయిలో సాధన చేసింది
2sports
ipo రెట్టింపు రిటర్నుల వృద్ధితో ఐపిఒలు ముంబై: స్టాక్‌ మార్కెట్లకు జారీఅయిన పది ఐపిఒలలో ఐదు ఐపిఒ లు రెట్టింపు ధరలకు కొనుగోళ్లు జరిగా యి. మరికొన్ని కంపెనీల్లో అయితే 30 రెట్లు పెరిగినట్లు అంచనా. నూరుశాతం ఐపిఒలు విజయవంతం అయ్యాయనిఅంచనా. ఇటీవలే బిఎస్‌ఇలో జాబితా అయిన మ్యూజిక్‌బ్రాడ్‌కాస్ట్‌ 7-16శాతం ఐపిఒద్వారా వృద్ధిని నమోదుచేసింది. అవెన్యూ సూపర్‌మార్కెట్స్‌ మంగళవారం మెగా విజయం నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ స్టాక్‌ 114శాతంరెట్టింపయింది. ఇష్యూధర రూ.299 అయితే ముగింపుధర రూ.641గా సాగింది. కంపెనీ ఐపిఒకు మంచి స్పందనవచ్చింది. 104రెట్లు కొనుగోళ్లు జరిగాయి. గత ఏడాదికాలంగా మొత్తం 10 ఐపిఒలు జారీ అయితే ఇవన్నీ కూడా 30 రెట్లు కొనుగోళ్లు జరిగా యి. ఐదు కంపెనీ లమార్కెట్‌ విలువలు ఇష్యూ ధరకంటే రెట్టింపుస్థాయికి కొనుగోళ్లు జరిగాయి. అవెన్యూ సూపర్‌మార్కెట్స్‌తోపాటు అడాన్సుడ్‌ ఎంజైమ్‌ టెక్నాలజీస్‌, ఆర్‌బిఎల్‌ బ్యాంకు, క్వెస్‌ కార్ప్‌, మహానగర్‌ గ్యాస్‌ వంటివి బహుళస్థాయి విజయాలు నమోదుచేసాయి. వాటి మార్కెట్‌ విలువలు నూరుశాతం కంటే ఎక్కువ ధరలకు అమ్ముడయ్యాయి. థైరోకేర్‌ టెక్నాలజీస్‌, ఎండ్యూ రెన్స్‌ టెక్నాలజీస్‌ 58శాతం, 48శాతం చొప్పున లాభపడ్డాయి. ఇటీవలే జాబితా అయిన మ్యూజిక్‌బ్రాడ్‌కాస్ట్‌ అయితే 7-16శాతం లాభపడింది. జిఎన్‌ఎ యాక్సిల్స్‌ ఏడుశాతం దిగువన ముగిసింది. మొదటిసారి జాబితాలో 18శాతం లాభపడిన తర్వాత కొంత దిగువన ముగిసింది. ఈ 10 ఐపిఒలు సగటున 72శాతం రిటర్నులు ఇస్తున్నాయి. మిగిలిన 14 కంపె నీలు నగటున 36శాతం వృద్ధిని నమోదుచేస్తే ఈ పది కంపెనీల ఐపిఒలు మాత్రం 72శాతం వృద్ధిలో ఉన్నా యి. రిటర్నులు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. 14కంపెనీలు ఈఆర్థిక సంవత్సరంలో మార్కెట్లకు వచ్చాయి.
1entertainment
why aishwarya rai bachchan said no to chiranjeevi`s 151 అందుకే ఐశ్వర్యా రాయ్ చిరుకి నో చెప్పిందా ? తాము అవతలి వాళ్ల మనసు నొప్పించకుండా ఏదైనా సినిమాకు నో చెప్పాలంటే, కొన్నిసార్లు హీరోయిన్స్... TNN | Updated: Sep 4, 2017, 09:31PM IST తాము అవతలి వాళ్ల మనసు నొప్పించకుండా ఏదైనా సినిమాకు నో చెప్పాలంటే, కొన్నిసార్లు హీరోయిన్స్ ముందుండే మార్గాల్లో ఒకటి ఉన్నట్టుండి పారితోషికం పెంచడమేనట. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా 'సైరా నరసింహా రెడ్డి' విషయంలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూడా అదే ఎత్తుగడ ప్రయోగించినట్టుంది అంటున్నాయి సినీవర్గాలు. కెరీర్ ఊపుమీదున్నప్పుడు రజినీకాంత్‌తో రోబో సినిమా చేసిన ఐష్ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంచుకుంటున్న సినిమాలనిబట్టి చూస్తే, ఆమెకి సీనియర్ హీరోల సరసన నటించడం ఇష్టం లేదని అర్థమవుతోంది అంటున్నారు కొంతమంది. మాధవన్‌తో ఓ సినిమా సైన్ చేయడానికి నో చెప్పిన ఐష్ అదే సమయంలో రాజ్ కుమార్ రావ్, రణ్‌బీర్ కపూర్ లాంటి యంగ్ హీరోలతో సినిమాలకి సైన్ చేయడం వెనుక వున్న మతలబు ఆ ఏజ్ ఫ్యాక్టరే అనేది వారి అభిప్రాయం. అందుకే మెగాస్టార్ లాంటి స్టార్ హీరోకి అలా నో చెబితే బాగుండదనుకుందో ఏమో కానీ తెలివిగా రూ. 9 కోట్ల పారితోషికం డిమాండ్ చేసి మరీ వారితోనే నో చెప్పించుకునేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
0business