news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
sandhya 319 Views rain fall , WI vs SA
rain fall
సౌతాంప్టన్: ప్రపంచకప్ మ్యాచ్లకు వర్షం తీవ్ర అంతరాయం కలిగిస్తున్నది. తాజాగా వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్ ఆరంభమైన 7 ఓవర్ల తర్వాత అకస్మాత్తుగా చిరుజల్లులు రావడంతో అంపైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. 7.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. జోష్లో ఉన్న కరీబియన్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచాడు. డికాక్(17), డుప్లెసిస్(0) క్రీజులో ఉన్నారు.
వార్త ఈ పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/ | 2sports
|
దక్షిణాఫ్రికా 137 4 (52 ఓవర్లు)
కాంప్టన్, టేలర్ హాఫ్ సెంచరీ
డర్బన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్లో 303 పరుగులకు ఆలౌటైంది.కాగా నాలుగు టెస్ట్ల సిరీస్లో భాగంగా టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇంగ్లండ్ 4 వికెట్లకు 179 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండవ రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించి మరో 124 పరుగులు చేసి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో కాంప్టన్ 85 పరుగులు, జేమ్స్ టేలర్ 70 పరుగులతో ఆకట్టుకోగా ఆ తరువాత బెయిర్ స్టో 41 పరుగులు చేశాడు. కాగా 267 పరుగులకే తొమ్మిది వికెట్లను చేజార్చుకున్న తరుణంలో స్టువర్ట్ బ్రాడ్-ఫిన్ల జోడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లే యత్నం చేశారు. కాగా ఈ క్రమంలోనే బ్రాడ్ 32 పరుగులతో నాటౌట్గా నిలువగా పిన్ 12 పరుగులు చేసి సహకారం అందించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరును చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్,మోర్నీ మార్కెల్లు ఒక్కొక్కరు నాలుగు వికెట్లు సాధించగా,అబాట్,పీడ్త్లకు చెరొ వికెట్ దక్కింది.ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జిల్ జిరో పరుగులు,హషీమ్ ఆమ్లా 7 పరుగులతో నిరాశ పరిచారు. | 2sports
|
Jan 20,2017
మూడేండ్లలో విండోస్7కు గుడ్బై
న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్కు చెందిన ప్రముఖ ఆపరేటింగ్ సిస్టం మరో మూడేళ్ల తర్వాత కనుమరుగు కానుంది. విండోస్ 7 తర్వాత వచ్చిన విండోస్ 8, విండోస్ 10 వెర్షన్లు వచ్చాయి. అయినా ఇప్పటికీ విండోస్కు 7కు భారీగా వినియోగదారులున్నారు. ఆ ఆపరేటింగ్ సిస్టం సులభతరంగా ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం సెక్యూరిటీ పరంగా విండోస్ 7 ప్రమాదంలో ఉందని, దీంతో వచ్చే మూడేళ్లలో సెక్యూరిటీ సపోర్ట్ నిలిపివేయనున్నటు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. రోజురోజుకీ కొత్తరకం మాల్వేర్ దాడులు పెరిగిపోతుయని, వాటిని ఎదుర్కోవాలంటే వినియోగదారులకు ఎప్పుడూ ఒఎస్లో మార్పులు చేస్తూ కొత్త అప్డేట్లు అవసరమని ఆ సంస్థ పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
SAI PRANEETH
చరిత్ర సృష్టించిన తెలుగు తేజం
థాయిలాండ్ ఓపెన్లో టైటిల్ సాధించిన సాయి ప్రణీత్ హైదరాబాద్: థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీగోల్ట్ టోర్నీలో హైద్రాబాద్కు చెందిన తెలుగు తేజం సాయి ప్రణీత్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ఫైనల్స్లో జొనాథన్ క్రిస్టీపై 17-21, 21-18, 21-19తేడాతో విజయం సాధించి టైటిల్ను స్వంతం చేసుకున్నాడు. థాయిలాండ్ ఓపెన్ టోర్నీలో సాయి ప్రణీత్ అంచనాలను అందుకుంటూ ఫైనల్లో ప్రవేశించాడు.ఈటోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో శనివారం సెమీస్లో తలపడిన సాయిప్రణీత్ థాయిలాండ్ క్రీడాకారుడు పనావిత్ తోంగ్నున్ను ఓడించి ఫైనల్స్కు దూసుకెళ్లాడు. ఫైనల్స్లో తన అద్భుతమైన ఆటతీరుతో టైటిల్ను స్వం తం చేసుకున్నాడు. ఈ ఏడాది సయ్యద్మోడీ ఇంటర్నేషనల్ గ్రాండ్ ఫ్రీలో రన్నరప్గా నిలిచాడు.ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్సిరీస్ కైవసం చేసుకున్న సాయి ప్రణీత్కు ఇది మూడో గ్రాండ్ ఫ్రీపైనల్. దీని లో కూడా విజయంసాధించాడు. దీంతో 43ఏళ్ల ఈటోర్నమెంట్ చరిత్రలో పురుషుల సింగిల్స్లో టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపుపొందాడు. 2013లో కిడాంబి శ్రీకాంత్ ఈటైటిల్ను సా ధించాడు. మహిళల సింగిల్స్విభాగంలో సైనా 2011లోవిజేతగా నిలిచింది. కానీ ఈసారి సైనా నెహ్వాల్ కు ఊహించని విధంగా షాక్ తగిలి ఇంటిదారి పట్టింది. సైనానెహ్వాల్ ప్రపంచ 13వ ర్యాంకర్ బుసానన్ బంగ్బామ్రుంగ్పన్(థాయిలాండ్)తో జరిగిన సెమీఫైనల్ల్లో 19-21, 18-21తో ఓటమి పాలైంది. | 2sports
|
RBI Governer Urgit patel
నేడు ఆర్బిఐ పరపతి సమీక్ష
ముంబై: ఇవాళ జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో 0.25శాతం వడ్డీరేట్లు తగ్గిస్తారని రాయటర్స్ నిర్వహించిన పోల్స్లో ఆర్థిక వేత్తలు తెలిపారు. బుధవారం ఆర్బిఐ నిర్వహించనున్న సమీక్షలో గవర్నర్ ఉర్జిత్ పటేల్ పలు నిర్ణయాలు వెల్లడించనున్నారు.మరికొంత 0.50శాతం వరకు వడ్డీరేట్లు తగ్గవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ కిడ్నీ మార్పిడి నిమిత్తం ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. గత వారం పీయూష్ గోయల్కు ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. తాను జైట్లీని కలిసి చర్చించానని, కొన్ని అంశాలపై స్పష్టత ఇచ్చారని చెప్పారు. బ్యాంకింగ్ రంగం ఆర్థికంగా స్థిరపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులు అనేక కంపెనీలకు ఎడాపెడా రుణాలు ఇచ్చాయన్నారు. ఆర్థిక పరిస్థితి మందగించడంతో, రుణ గ్రహీతలు రుణాలు చెల్లించలేకపోయారన్నారు. బ్యాంకుల ప్రతిష్ట దెబ్బతినే విధంగా అనేక కుంభకోణాలు బయటపడుతున్నాయన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో బ్యాంకులను సరైన దారిలో నడిపిస్తామని, ఉద్యోగులు, కస్టమర్ల సహకారంతో ఆర్థికాభివృద్ధిని సాధిస్తామన్నారు. ఇష్టం వచ్చినట్లు రుణాలు ఇవ్వడం వల్లనే బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ పెరిగిందన్నారు. రుణాల పునర్ వ్యవస్థీకరణ పథకాలను అమలు చేయకుండా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. విద్యుత్, నిర్మాణం, వౌలిక సదుపాయాల రంగాలకు చెందిన సంస్థలు 2009 సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున బ్యాంకులకు రుణాలను బకాయి పడ్డాయని ఆయన చెప్పారు. బ్యాంకుల ఇమేజిని పెంచే వీటి ఆర్థిక స్థితిని పటిష్టంచేయడమే తమ ముందున్న లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Hyderabad, First Published 24, Aug 2018, 3:23 PM IST
Highlights
'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత టాలీవుడ్ కి ముద్దుల ఫీవర్ పట్టుకుంది. కథ ఏదైనా, కంటెంట్ ఏమున్నా.. జోనర్ తో సంబంధం లేకుండా సినిమాలో ముద్దు సీన్లకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో లిప్ లాక్ సీన్స్ లేకుండా విడుదలయ్యే సినిమాల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోంది
'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత టాలీవుడ్ కి ముద్దుల ఫీవర్ పట్టుకుంది. కథ ఏదైనా, కంటెంట్ ఏమున్నా.. జోనర్ తో సంబంధం లేకుండా సినిమాలో ముద్దు సీన్లకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో లిప్ లాక్ సీన్స్ లేకుండా విడుదలయ్యే సినిమాల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోంది. పైగా ఈ ముద్దు సీన్లతో సినిమాపై హైప్ పెరిగే విధంగా చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
టీజర్, ట్రైలర్ ద్వారా లిప్ లాక్స్ సీన్స్ ఉన్నాయని చెబుతూ యూత్ ని ఆకర్షిస్తున్నారు. తాజాగా విడుదలైన '24 కిస్సెస్' సినిమా ట్రైలర్ కూడా లిప్ లాక్స్ తో నింపేశారు. టైటిల్ కి తగ్గట్లే ట్రైలర్ లో కిస్సెస్ లెక్కకు మించి ఉన్నాయి. అసలు కథ ఏంటి అనేది ట్రైలర్ ద్వారా చెప్పకుండా డీప్ కిస్సులుంటాయని మాత్రం చెబుతున్నారు. పైగా ఆ ముద్దు సీన్లలో యూత్ ఫేవరెట్ హీరోయిన్ హెబ్బా పటేల్ నటించడం విశేషం.
ఈ ఇంటిమేటెడ్ సీన్స్ లో హెబ్బా చెలరేగిపోయింది. 'మిణుగురులు' వంటి నేషనల్ అవార్డు సినిమాను రూపొందించిన దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణం శెట్టి ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. అదిత్ అరుణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రావు రమేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మరి ఈ లిప్ లాక్స్ సినిమాను ఎంతవరకు కాపాడతాయో చూడాలి! | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఏడు జాతీయ అవార్డులు.. పవన్, ఎన్టీఆర్, రాజమౌళి, నాని స్పందన ఇది!
‘మహానటి’లో నటనకు గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కీర్తి సురేష్ నటన అవార్డుకు అర్హమైనదేనన్నారు.
Samayam Telugu | Updated:
Aug 9, 2019, 09:19PM IST
ఏడు జాతీయ అవార్డులు.. పవన్, ఎన్టీఆర్, రాజమౌళి, నాని స్పందన ఇది!
ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాలు మెరిశాయి. ఏడు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. టాలీవుడ్ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’ ఎంపికైంది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్కు ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ ‘మహానటి’ అవార్డు సొంతం చేసుకుంది.
అలాగే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ప్లే విభాగంలో ‘చి.ల.సౌ’కు.. మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అ!’ చిత్రానికి అవార్డులు దక్కాయి. తెలుగు సినిమాలకు ఈ స్థాయిలో అవార్డులు రావడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజేతలకు అభినందనలు తెలుపుతున్నారు.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజేతలకు అభినందనలు తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైన కీర్తి సురేష్ గారికి నా తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు. సావిత్రి గారి జీవితం ఆధారంగా వచ్చిన ‘మహానటి’లో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేష్ గారి నటన అవార్డుకు అర్హమైనదే. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి నిలిచినందున చిత్ర బృందానికి.. ‘రంగస్థలం, అ!, చి.ల.సా.’ చిత్రాలకు సాంకేతిక విభాగాల్లో అవార్డులకు ఎంపికైనవారికి అభినందనలు. ఏడు పురస్కారాలు దక్కించుకున్నందున ఈ స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలి’’ అని పవన్ పేర్కొన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా విజేతలకు అభినందనలు తెలిపారు. ‘‘తెలుగు సినిమా అంతెత్తులో ప్రయాణిస్తోంది. జాతీయ అవార్డులు గెలుచుకున్న మహానటి, రంగస్థలం, ఆ!, చి.ల.సౌ చిత్ర బృందాలకు అభినందనలు’’ అని ట్వీట్ చేశారు.
Telugu cinema is flying high! Congratulations to the teams of #Mahanati, #Rangasthalam, #Awe and #ChiLaSow for winn… https://t.co/68Ljh1WCBM
— Jr NTR (@tarak9999) 1565354119000
పలు విభాగాల్లో తెలుగు సినిమాలు జాతీయ అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. విజేతలకు అభినందనలు తెలిపారు.
Very happy to see Telugu films winning several National Awards. Congratulations to the teams of #Mahanati,… https://t.co/UZ0r5UWZU7
— rajamouli ss (@ssrajamouli) 1565352299000
‘అ!’ చిత్ర నిర్మాత నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘వాల్ పోస్టర్ సినిమా టీమ్ నేడు చాలా గర్వపడుతోంది. మా ఆరంగేట్ర ప్రొడక్షన్కు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంత కన్నా ఎక్కువ మేం ఏమి అడగగలం. మా కాస్ట్ అండ్ క్రూ మొత్తానికి కృతజ్ఞతలు. థాంక్యూ జూరీ. అవార్డులు గెలుచుకున్న విజేతలకు అభినందనలు’’ అని నాని ట్వీట్ చేశారు.
Wall poster cinema team is very proud today. 2 national awards for our debut production. what more can we ask. Than… https://t.co/FfllqpZMYU
— Nani (@NameisNani) 1565355340000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఎన్టీఆర్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్
జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై మరింత హైప్..
| Updated:
Jan 18, 2017, 03:20PM IST
జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై మరింత హైప్ నెలకొని వుంది. 'జనతా గ్యారేజ్' రిలీజైన తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటుండం కూడా తారక్ ఫ్యాన్స్‌ని ఇంకొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాబీ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన లాంచ్ అవనుంది. జై లవకుశ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో వున్న ఈ సినిమా తారక్ కెరీర్‌లో 27వ మూవీ అవుతుంది.
తారక్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న 'జై లవకుశ'లో తారక్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఆగస్టు 11న మూవీని రిలీజ్ చేద్దామనే ఆలోచనలో యూనిట్ వున్నట్టు ప్రచారం జరుగుతోంది కానీ దీనిపై ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఆర్మీ స్కూల్ పిల్లల్ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ స్కూల్ విద్యార్థులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో శ్రీనగర్లో విద్యార్థులను కలిశాడు.
TNN | Updated:
Nov 23, 2017, 07:17PM IST
టీమిండియా కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ స్కూల్ విద్యార్థుల‌కు స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో శ్రీనగర్‌లో విద్యార్థులను కలిశాడు. మ‌హీ మూడేళ్ల క్రితం టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. శ్రీలంక‌తో భార‌త జ‌ట్టు టెస్టుల్లో త‌ల‌ప‌డుతుండ‌గా.. ఖాళీ టైంలో మిస్ట‌ర్ కూల్ చిన్నారుల‌తో గ‌డిపాడు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌తో మాట్లాడుతూ.. చదువులు, క్రీడల పట్ల శ్రద్ధ పెట్టాలని సూచించాడు. ధోనీ విద్యార్థులను కలిసిన ఫోటోలను భార‌త‌ ఆర్మీ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. | 2sports
|
Pak Cricket Team
వెస్టిండీస్పై చరిత్ర సృష్టించనున్న పాకిస్థాన్
న్యూఢిల్లీ: క్రికెట్లో పాకిస్థాన్ జట్టు కొత్త చరిత్రను సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది.ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న మూడవ టెస్టులో పాక్ గెలిస్తే ఆ జట్టు కొత్త రికార్డుని సృష్టించనుంది.ఇప్పటికే ముగిసిన టి20,వన్డే సిరీస్లలో వెస్టిండీస్ జట్టుని పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది.ఆ తరువాత ఆడిన రెండు టెస్టుల్లో కూడా వెస్టిండీస్పై ఘన విజయం సాధించింది.ఇక మూడవ టెస్టులో కూడా పాకిస్థాన్ విజయం సాధిస్తే కొత్త చరిత్ర సృష్టించినట్లు అవుతుంది.ఇప్పటి వరకు ఏ జట్టు కూడా పర్యాటక జట్టుపై 9-0 తేడాతో గెలిచిన దాఖలా లేదు.అయితే ఇప్పుడు ఈ అవకాశం పాకిస్థాన్కు అడుగు దూరంలో ఉంది.మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా దుబా§్ులో జరిగిన తొలి టెస్టులో పాక్ 56 పరుగుల తేడాతో విజయం సాధించగా,అబుదాబిలో జరిగిన రెండవ టెస్టులో 133 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.కాగా మరోవైపు వెస్టిండీస్ కీలక ఆటగాళ్లు ఈ సిరీస్కు దూరమయ్యారు.పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్్ కూడా పటిష్టంగా ఉంది.ఇటీవలే జట్టులోకి వచ్చిన పాక స్పిన్నర్ యాసిర్ షా జటుట విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.షార్జాలో నేడు మూడవ టెస్టు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్లో కూడా వెస్టిండీస్ పాక్ చేతిలో ఓడిపోతే చరిత్రలో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న జట్టుగా అవతరిస్తుంది. | 2sports
|
May 31,2015
స్మార్ట్విలేజ్లో గెర్డావ్ భాగస్వామ్యం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి మండలంలో స్మార్ట్విలేజ్ పథకంలో గెర్డావ్ భాగస్వామ్యం అవుతున్నట్లు ప్రకటించింది. తన భాగస్వాములతో కలిసి గ్రామాల్లో మెరుగైన సౌకర్యాల రూపకల్పనకు క్రీయశీలక పాత్ర పోశిస్తామని గెర్డావ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కృష్ణమూర్తి తెలిపారు. మరుగుదొడ్డి సదుపాయం, సురక్షిత మంచినీరు, పాఠశాలల్లో పిల్లలకు సదుపాయాలు, క్రమబద్దమైన విద్యుత్ సరఫరా హామీ తదితరాలకు కలిసి పని చేస్తుందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 12, Apr 2019, 6:02 PM IST
Highlights
బాలీవుడ్ లో ఖాన్ త్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాయాలంటే సల్మాన్ - అమీర్ - షారుక్ లకె సాధ్యం. అయితే ఈ విషయం గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ వివరణ ఇచ్చారు.
బాలీవుడ్ లో ఖాన్ త్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాయాలంటే సల్మాన్ - అమీర్ - షారుక్ లకె సాధ్యం. అయితే ఈ విషయం గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ వివరణ ఇచ్చారు.
ఖాన్ త్రయం మంచిదే కానీ ఆ విషయంలో నేను కంగారుపడే విషయం ఒకటి ఉంది. నేను చేసిన సినిమాల్లో సక్సెస్ లే ఎక్కువ. కమర్షియల్ ఫెయిల్యూర్స్ చాలా తక్కువ. అయితే అమీర్ - షారుక్ లకు ప్లాప్స్ ఉన్నప్పటికీ వారు ఈజీగా సక్సెస్ అందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వారి టాలెంట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
నేను మాత్రం ఆ విధంగా సక్సెస్ కొట్టలేను. నేను సాధారణ నటుడిని. అదృష్టం కొద్దీ దేవుడి దయ వల్ల ఫ్యాన్స్ ఎక్కువ ఉండడంతో ఇలా సక్సెస్ అందుకుంటున్నా అని సల్మాన్ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ బాక్స్ ఆఫీస్ హీరో భరత్ - దబాంగ్ 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలో ఈ ఏడాది చివర్లో రానున్నాయి.
Last Updated 12, Apr 2019, 6:06 PM IST | 0business
|
sandhya 273 Views SRILANKA vs AUSTRALIA , World Cup 2019
SRILANKA vs AUSTRALIA
లండన్: ప్రపంచకప్ క్రికెట్లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య ఆసక్తికర పోరు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఫీల్డింగ్ ఎంచుకున్నారు. లక్మల్ స్థానంలో సిరివర్ధనకు అవకాశం ఇచ్చినట్లు వివరించాడు. మరోవైపు గాయంతో బాధపడుతున్న కౌల్టర్ నైల్ స్థానంలో బెహ్రెండార్ఫ్ను ఎంపిక చేసినట్లు ఆసీస్ సారథి ఫించ్ వెల్లడించాడు.
శ్రీలంకపై సునాయాసంగా గెలిచిపాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలవాలని ఆసీస్ భావిస్తుంది. రెండు మ్యాచులు వర్షం కారణంగా మైదానంలోకి అడుగుపెట్టలేదు శ్రీలంక. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన లంక ఆఫ్ఘనిస్తాన్పై మాత్రమే నెగ్గింది. మరోవైపు పాక్పై విజయంతో జోష్లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాడిలో పడ్డారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/ | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Suresh Raina: ఒక్క ఓవర్లో 33 పరుగులు.. అది రైనాకే సాధ్యం
నేడు సురేష్ రైనా పుట్టినరోజు. నేటితో రైనా 31 ఏళ్లు పూర్తిచేసుకుని 32 ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మైదానంలో రైనా అద్భుత ప్రదర్శన ఒకదానిని గుర్తుచేసుకుందాం.
Samayam Telugu | Updated:
Nov 27, 2018, 12:58PM IST
భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన అత్యుత్తమ ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్లో సురేష్ రైనా ఒకరు. టీమిండియా జెర్సీతో ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు. ప్రస్తుతం రైనా జట్టుకు దూరమైనా 2019 ప్రపంచకప్లో అతడిని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీమిండియాకు మూడు ఫార్మట్లలోనూ విశేష సేవలందించిన రైనాకు అభిమాన గణం ఎక్కువే. దీనికి తోడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి అక్కడి క్రికెట్ అభిమానులకు రైనా బాగా చేరువైపోయాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ 12లోనూ ఈ సూపర్ బ్యాట్స్మన్ చెన్నై తరఫునే ఆడనున్నాడు.
ఇదిలా ఉంటే, నేడు సురేష్ రైనా పుట్టినరోజు . నేటితో రైనా 31 ఏళ్లు పూర్తిచేసుకుని 32 ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మైదానంలో రైనా అద్భుత ప్రదర్శన ఒకదానిని గుర్తుచేసుకుందాం. ఐపీఎల్ చరిత్రలోనే ఇదో మరపురాని ప్రదర్శన. 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రైనా తన విశ్వరూపాన్ని చూపించాడు. 2014 ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో క్వాలిఫయర్ 2 మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. పంజాబ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (58 బంతుల్లో 122) చెలరేగి ఆడటంతో ఆ జట్టు 226 పరుగుల చేసింది. | 2sports
|
Suresh 107 Views
ఈవారంలోనే ఆర్బిఐ కొత్తగవర్నర్ పేరు
న్యూఢిల్లీ, ఆగస్టు 18: కేంద్రప్రభుత్వం రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురామ్రాజన్ స్థానంలో రానున్న కొత్త వ్యక్తిపేరును ఈవారంలోనే ప్రకటించనున్నట్లు తెలు స్తోంది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ మంత్రి, ప్రధాని నరేంద్రమోడీలు కూడా చర్చించినట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఆర్బిఐ గవర్నర్ నియామకం విషయమై ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్రమోడీని కలిసి చర్చలు జరిపా రు. అయితే గవర్నర్ పేరును త్వరలోనే ప్రకటిస్తా మని, ఇంకా కొలిక్కిరాలేదని జైట్లీ ప్రకటించారు. రాజన్ స్థానంలో మాజీ డిఫ్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్ణ్్, ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్లు గవర్నర్ పదవిరేసులో ఉన్నట్లు సమాచారం. వీటికితోడు ఇటీవలే మాజీ డిప్యూటి సుబీర్గోకర్ణ్ ప్రస్తుత గవర్నర్ రఘురామ్రాజన్ను ఇటీవల కలిసి నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. గోకర్ణ్ ఆర్థికసేవల కార్యదర్శి శక్తికాంతదాస్ను కూడా కలిసారు. బ్రూకింగ్స్ ఇండియాకు 2015 నవంబరువరకూ గోకర్ణ్ రీసెర్జి డైరె క్టర్గా పనిచేసారు. తదనంతరం ఐఎంఎఫ్ ఇండియా విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆర్థికశాస్త్రంలో పిహెచ్డి చేసారు. కేస్వెస్టర్న్ రిజర్వు వర్సిటీ నుంచి ఆయన పిహెచ్డి పట్టాపొందారు. ఆర్బిఐ డిఫ్యూటీ గవర్నర్గా రాక ముందు గోకర్ణ్ సాండర్డ్ అండ్ పూర్ ఆసియా పసి ఫిక్ విభాగానికి ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేసారు. ఇతరప్రముఖుల పేర్లపరంగా చూస్తే ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్, ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బసు, నీతి ఆయోగ్ వైస్ఛైర్మన్ అరవింద్ పనగారియా, ఆర్బిఐ మాజీ డిఫ్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్, ఎస్బిఐ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్యల పేర్లు కూడా ప్రముఖంగావినిపిస్తున్నాయి. ఆయనతోపాటు బ్రిక్స్ బ్యాంకు ఛైర్మన్ కెవికామత్ పేరు కూడా తాజాగా ప్రచారంలోనికి వచ్చింది. భారత్ ఆర్థిక వ్యవస్థను సునిశితంగా అవగాహన చేసుకున్న బ్యాంకింగ్ ప్రముఖులకే ఎన్డిఎ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోం ది. సెప్టెంబరు 4వ తేదీనే ఆర్బిఐ గవర్నర్ రాజన్ వైదొలుగుతారు. ప్రభుత్వం రాజన్పై విమర్శలు చేస్తున్న సుబ్రహ్మణ్యస్వామిని కట్టడిచేయలేక పోవడం వల్లనే రాజన్ రెండోసారి కొనసాగేందుకు విముఖత వ్యక్తంచేశారన్న భావన కూడా బ్యాం కింగ్ వర్గాల్లో వినవస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ మాత్రం రాజన్ను వేనోళ్ల కొనియాడారు. ఒక మంచి ఉపాధ్యాయుడని రాజన్ను ప్రశంసించారు. అయితే రాజన్ మాత్రం తన బ్యాంకు సిబ్బందికి రాసిన లేఖలో తాను రెండోసారి కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేయకపోగా తనకు ముందు నుంచి ఇష్టపడుతున్న బోధనారంగానికే తిరిగి వెళ తానని స్పష్టంచేసారు. ఇప్పటివరకూ రిజర్వు బ్యాంకుపరంగా రఘురామ్రాజన్, బిమల్ జలాన్లు మాత్రమే రెండోసారి కొనసాగేందుకు ముందుకు రానివారుగా ఉన్నారు. అంటే ఐదేళ్ల కాలాన్ని కొనసాగించలేకపోయారు. తన మూడేళ్ల కాలంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళనకు రాజన్ విశేష కృషిచేశారు. బ్యాంకుల్లో పెరిగిపోతు న్న నిరర్ధక ఆస్తులను కట్టడి చేసేందుకుగాను 2017 మార్చినాటికల్లా ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఆస్తిఅప్పుల పట్టీలను ప్రక్షాళన చేసుకోవాలని ఆదేశించారు. ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా రెండంకెల దిగువస్థాయికి తీసుకురావడంలో రాజన్ కృషి కీలకం అని చెప్పకతప్పదు. | 1entertainment
|
Hyderabad, First Published 13, Sep 2019, 3:52 PM IST
Highlights
రజనీకాంత్ నటిస్తున్న ‘దర్బార్’ సినిమా సెకండ్ లుక్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫొటోలో రియల్ రజనీకాంత్ను చూపించలేదని ఆయన కండరాలు చూపించడానికి ఫొటోషాప్ చేశారని పలువురు నెటిజన్లు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న నూతన చిత్రం 'దర్బార్'. తాజాగా సినిమా సెకండ్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో రజినీ బ్లాక్ కలర్ బనియన్ లో రెండు చేతులతో రాడ్ను పట్టుకుని కోపంగా పైకిలేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే అరవై ఏళ్ల వయసులో అంతటి టోన్డ్ కండరాలు ఎవ్వరికీ ఉండవని, ఆయనకు లేని మజిల్స్ చూపించాలని లుక్ను ఫొటోషాప్ చేసి అభిమానులను మోసం చేస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు ఫోటోని మార్ఫ్ చేసి ఉంటారని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారికి రజినీకాంత్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో ఘర్షణ మొదలైంది. ఒకరినొకరు దూషించుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా రజినీకాంత్ సినిమాకు సంబంధించి ఎలాంటి లుక్ విడుదలైనా తలైవాని పొగిడేస్తుంటారు.
కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు సరికదా.. రజినీకాంత్ మీద కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఫోటోలో కనిపిస్తున్నట్లు అవి తలైవా మజిల్సేనా..? లేక ఫోటోషాప్ చేశారా..? అనే విషయాలపై దర్శకుడు మురుగదాస్ స్పందించాల్సివుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం ఆదిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated 13, Sep 2019, 3:52 PM IST | 0business
|
ఫ్రాన్స్ విజయం.. అర్జెంటీనా అంతర్దానం
Highlights
3-4 తేడాతో మెస్సీ టీమ్ ఇంటికి
రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో అర్జెంటీనా కథ ముగిసింది. ఫ్రాన్స్, అర్జెంటీనా జట్ల మధ్య శనివారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన తొలి ప్రీ క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ అర్జెంటీనాపై 4-3 తేడాతో గెలుపొందింది. విజయంలో కీలమైన రెండు గోల్స్ చేసిన కైలియాన్ ఎంబాప్పే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ఆట ఆరంభం నుంచే అదిరిపోయేలా సాగింది. ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగిన మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠపరిచింది. ఆ హోరాహోరీ పోరు ఎంతదాకా వెళ్లిందంటే.. 11వ నిముషంలో అర్జెంటీనా ప్లేయర్ రోగో.. ఫ్రాన్స్ టీనేజర్ ఎంబాప్పేను కావాలనే తోసేసేదాకా. దాంతో ఫ్రాన్స్కు లభించిన పెనాల్టీని గ్రీజ్మన్ గోల్గా మార్చాడు. జట్టుకు 1-0 ఆధిక్యాన్ని కట్టబెట్టాడు.
అక్కడి నుంచి 41వ నిముషం దాకా మ్యాచ్ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించింది. అప్పుడే అర్జెంటీనా ప్లేయర్ అంజెల్ డి మారియా గోల్ చేశాడు. ఫస్టాఫ్ ముగిసేసరికి 1-1తో ఇరు జట్లు స్కోరును సమం చేశాయి.
సెకండాఫ్ మొదలైన మూడు నిముషాలకే అంటే 48వ నిముషంలో గాబ్రియల్ మెర్కాడో చేసిన గోల్తో ఆటపై అర్జెంటీనా ఆధిక్యం 2-1కు చేరుకుంది. దీంతో ఎంబాప్పే చెలరేగిపోయాడు. 64, 68 నిముషాల్లో రెండు గోల్స్ చేశాడు. 4-2 తేడాతో గేమ్పై ఫ్రాన్స్కు గ్రిప్ వచ్చేలా దూకుడు పెంచాడు.
ఆ తర్వాత అర్జెంటీనా ప్లేయర్స్ గోల్ చేయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఫ్రాన్స్ ఆటగాళ్ళు అడుగడుగునా అడ్డు తగులుతూ ఆటను రక్తి కట్టించారు. అర్జెంటీనా ప్లేయర్ సెర్గియో అగురియో అదనపు సమయంలో గోల్ చేసి జట్టుకు మూడో గోల్ అందించాడు. ఆట ముగిసే సమయానికి ఫ్రాన్స్ 4-3తో అర్జెంటీనాపై విజయం సాధించింది.
Last Updated 1, Jul 2018, 1:06 PM IST | 2sports
|
icc test rankings: steve smith closes in on don bradman, cheteshwar pujara climbs to no. 3
టెస్ట్ ర్యాంకింగ్స్: బ్రాడ్మ్యాన్కు మరింత చేరువగా స్మిత్
యాషెస్ సిరీస్లో అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్న స్టీవ్ స్మిత్ డాన్ బ్రాడ్మ్యాన్ నెలకొల్పిన అత్యధిక రేటింగ్ పాయింట్ల రికార్డుకు మరింత చేరువ అయ్యాడు.
TNN | Updated:
Dec 19, 2017, 04:29PM IST
యాషెస్ సిరీస్‌లో అజేయ సెంచరీ, డబుల్ సెంచరీతో సత్తా చాటిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌తో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. మూడో టెస్టులో 239 పరుగులు చేసిన స్మిత్ ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో బ్యాటింగ్ ర్యాంకుల్లో దిగ్గజ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మ్యాన్ సాధించిన అత్యధిక పాయింట్లకు స్మిత్ మరింత చేరువయ్యాడు.
మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో స్మిత్ 945 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రికీ పాంటింగ్ (942), పీటర్ మే, జాక్ హోబ్స్ (942)ను అధిగమించిన స్మిత్ బ్రాడ్‌మ్యాన్ సాధించిన ఆల్ టైం హై స్థాయికి కేవలం 16 పాయింట్ల దూరంలో నిలిచాడు. 1948లో బ్రాడ్‌మ్యాన్ 961 పాయింట్లు సాధించగా.. స్మిత్ రోజు రోజుకూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ.. బ్రాడ్‌మ్యాన్ రికార్డుకు చేరువ అవుతున్నాడు. టెస్టుల్లో స్మిత్ సగటు 62.32గా ఉంది. బ్రాడ్‌మ్యాన్ (99.94) తర్వాత ఇదే అత్యధిక కావడం గమనార్హం. | 2sports
|
తెలంగాణ లీడ్బ్యాంకు స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 77వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన
ఎస్బిహెచ్ పతంగుల పండుగ!
హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ లీడ్బ్యాంకు స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 77వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్లో పతం గుల పండుగ నిర్వహించింది. బ్యాంకు సిజిఎం ఒఎస్డి పల్వేశన్ పాఠశాల విద్యార్ధులకు స్కూలు బ్యాగ్లు, పతంగులను అందచేసారు. బ్యాంకుపరంగా గడచిన కొన్నేళ్లుగా ఈ సాంప్రదాయం పాటిస్తోందని పల్వేశన్ వెల్లడించారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా బ్యాంకు తన స్టాల్ను ఎగ్జి బిషన్గ్రౌండ్స్లో ఏర్పాటు చేసింది. ఎటిఎం, నాణేలకొనుగోలు మిషన్ వంటి వాటిని ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేసింది. ఎగ్జిబిషన్కు వచ్చే సందర్శకులకు నగదుపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్బిహెచ్ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో సిజిఎం డివిసురేష్కుమార్, ఇతర సీనియర్ అధికారులు పలువురు పాల్గొన్నారు. | 1entertainment
|
Hyderabad, First Published 11, Sep 2019, 6:10 PM IST
Highlights
సెలబ్రెటీ లకు హాలిడేస్ దొరికితే అంతకంటే గొప్ప స్వేచ్ఛ మరోటి ఉండదేమో? ఏ మాత్రం గ్యాప్ దొరికినా పక్షుల్లా ఖండాలు దాటేస్తారు. ఇక అందుకు ప్రతిసారి ఉదాహరణగా నిలిచే కపుల్స్ వీరుష్క. హాలిడేస్ ని ఈ జంట ఏ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
సెలబ్రెటీ లకు హాలిడేస్ దొరికితే అంతకంటే గొప్ప స్వేచ్ఛ మరోటి ఉండదేమో? ఏ మాత్రం గ్యాప్ దొరికినా పక్షుల్లా ఖండాలు దాటేస్తారు. ఇక అందుకు ప్రతిసారి ఉదాహరణగా నిలిచే కపుల్స్ వీరుష్క. హాలిడేస్ ని ఏ జంట ఏ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
రీసెంట్ గా బీచ్ లో విరాట్ అనుష్క సరదాగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుంగమూతితో కనిపిస్తున్న విరాట్ ను అనుష్క గట్టిగా హత్తుకొని ఫోటోకి స్టిల్ ఇచ్చింది. ఈ జంట చాలా బావుంది అంటూ నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక వీరిద్దరి కెరీర్ లు మరికొన్ని రోజుల్లో స్పీడందుకోనున్నాయి. ప్రస్తుతం అనుష్క నాలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇక విరాట్ ఆదివారం స్టార్ట్ కానున్న సౌత్ ఆఫ్రికా టి20 సిరీస్ తో బిజీగా మారనున్నాడు. | 0business
|
sumalatha 127 Views cricket , election , hca
HCA Elections
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సిఎ) ఎన్నికలు శుక్రవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో ప్రశాంతంగా జరిగాయి. 227 ఓట్లు ఉండగా, 224 మంది ఓటు వేశారు. ఎన్నికల ఫలితాలను ఈ సాయంత్రం ఐదు గంటలకు ప్రకటిస్తారు. ఈ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరిగింది. భారత మాజీ కెప్టెన్ అజరుద్దీన్, ప్రకాశ్చంద్ జైన్, దిలీప్ కుమార్ మధ్య త్రిముఖ పోటీ నెలకొనడంతో ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది. ఎలాగైనా హెచ్సిఎ అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని అజర్ పట్టుదలతో ఉన్నారు. మాజీ అధ్యక్షుడు వివేక్ మద్దతు ఉన్న జైన్ తానే విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాతిరి బాబురావు సాగర్ ప్యానెల్ అవినీతి నిర్మూలనే ప్రధాన ఏజెండాగా బరిలోకి దిగింది. ఈ ఎన్నికలో 155 ప్రైవేట్ క్లబ్లకు చెందిన ప్రతినిధులతో పాటు 51 ఆయా సంస్థల క్లబ్లు, తొమ్మిది జిల్లా క్రికెట్ సంఘాలు, 11 మంది మాజీ క్రికెటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హెచ్సిఎ అధ్యక్ష పదవికి అజరుద్దీన్ తీవ్ర పోటీ ఇస్తున్నట్టు ఎన్నికల పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. శివలాల్ యాదవ్, వెంకటపతి రాజు, అర్షద్ అయూబ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎంపి హన్మంతరావు తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/ | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్
భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
TNN | Updated:
Oct 29, 2016, 06:32PM IST
భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో దక్షిణ కొరియాపై షూటౌట్‌లో 5-4 తేడాతో విజయం సాధించింది. ఆట మొత్తం సమయంలో భారత్, దక్షిణ కొరియా సమానంగా గోల్స్ (2-2) చేయడంతో షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించారు.
తల్వీందర్ సింగ్ తొలి గోల్ చేయడంతో భారత్ 1-0 లీడింగ్‌లోకి వెళ్లింది. ఆ తరవాత వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని దక్షిణ కొరియా చేజార్చుకుంది. అయితే సియో ఇన్వూ గోల్ చేయడంతో స్కోరు సమానమైంది. ఆట తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇరు జట్లు ఒక్కో గోల్‌తో సమానంగా నిలిచాయి. రెండో అర్ధభాగంలో దక్షిణ కొరియాకు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. దీన్ని యాంగ్ జిహున్ సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో కొరియా 2-1తో పైచేయి సాధించింది. అయితే రమణ్‌దీప్ సింగ్ అద్భుతమైన గోల్‌తో స్కోరును సమం చేశాడు. మ్యాచ్ సమయం ముగిసే సరికి ఇరు జట్లు చెరో రెండు గోల్స్‌తో సమానంగా ఉండటంతో డ్రాగా ముగిసింది. దీంతో షూటౌట్ అనివార్యమైంది.
భారత్ తరఫున ఐదుగురు ఆటగాళ్లు బంతిని గోల్ పోస్టులోకి పంపడంలో సఫలమయ్యారు. దక్షిణ కొరియా కూడా తమ నాలుగు అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. అయితే ఆఖరి గోల్ చేయడంలో విఫలమవడంతో భారత్ 5-4 తేడాతో ఫైనల్‌కి చేరింది. దక్షిణ కొరియా ఆటగాడు డెయోల్ లీ చేసిన ఆఖరి గోల్‌ను భారత కెప్టెన్, గోల్ కీపర్ శ్రీజేష్ అద్భుతంగా కట్టడిచేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. మరికాసేపట్లో పాకిస్థాన్, మలేసియా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనిలో గెలుపొందిన జట్టుతో భారత్ ఫైనల్ ఆడుతుంది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మహేష్, మురుగదాస్ మూవీ ఫస్ట్లుక్ ఇదే!
శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బ్లస్టర్ కొట్టిన మహేష్బాబు బ్రహ్మెత్సవం సినిమాతో నిరాశ పరచడంతో అప్ కమింగ్ మూవీపై మహేష్బాబు అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.
TNN | Updated:
Oct 22, 2016, 12:08PM IST
శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బ్లస్టర్ కొట్టిన మహేష్‌బాబు బ్రహ్మెత్సవం సినిమాతో నిరాశ పరచడంతో అప్ కమింగ్ మూవీ‌పై మహేష్‌బాబు అభిమానులకు ‌భారీ అంచనాలే ఉన్నాయి. మురుగదాస్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ద్విబాషా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే మురుగదాస్ సినిమా విషయాలు బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
అయితే తాజాగా సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకి సౌత్ పాపులర్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పని చేస్తున్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫస్ట్‌లుక్ ని షేర్ చేశారు. మహేష్ బాబుతో పని చేయడం హ్యాపీగా ఉందనన్నారు. మహేష్ బాబు స్టార్ పవర్ అపారం, అపరిమితం అని సంతోష్ శివన్ పొగలతో ముంచెత్తారు. మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు ఈ లుక్‌ని షేర్ చేసారు. మురుగదాస్ సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ బయటకు రావడం ఇదే తొలిసారి కావడంతో సోషల్ ‌మీడియాలో ఫస్ట్‌లుక్ వైరల్ అవుతుంది. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
India ODI Squad Australia: భారత్ జట్టులోకి ధోనీ రీఎంట్రీ..?
ఈ ఏడాది 13 ఇన్నింగ్స్ల్లో ధోనీ కనీసం ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ఎంతలా అంటే..? అతని సగటు 25కిలోపు పడిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇంత పేలవంగా ధోనీ ఎప్పుడూ ఆడలేదని గణాంకాలు చెప్తున్నాయి.
Samayam Telugu | Updated:
Dec 24, 2018, 06:05PM IST
India ODI Squad Australia: భారత్ జట్టులోకి ధోనీ రీఎంట్రీ..?
భారత జట్టులోకి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పునరాగమం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పేలవ ఫామ్ కారణంగా ఇటీవల వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్ల నుంచి ధోనీని తప్పించిన సెలక్టర్లు.. అతని స్థానంలో రిషబ్ పంత్కి వికెట్ కీపర్గా అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. అతని టీ20 కెరీర్ ముగిసిపోయిందని కొంత మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడగా.. వన్డే కెరీర్ కూడా ప్రమాదంలో ఉందని మరికొందరు చెప్పుకొచ్చారు. అయితే.. ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్తో పాటు.. ఆ తర్వాత న్యూజిలాండ్తో జరగనున్న సిరీస్కి భారత సెలక్టర్లు ధోనీకి అవకాశమివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సెలక్టర్ల మధ్య ఇప్పటికే చర్చలు ముగిశాయని.. ఇక అధికార ప్రకటన వెలువడాల్సి ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో సిరీస్లకి భారత్ జట్టు ప్రకటన
ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది 2019 వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి టీమ్ వికెట్ కీపర్గా ధోనీనే ఉంటాడని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ప్రకటించేశారు. కానీ.. రెండో వికెట్ కీపర్ అన్వేషణలో భాగంగా దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్కి అవకాశాలిచ్చినట్లు రెండు నెలల క్రితం చెప్పుకొచ్చిన సెలక్టర్లు.. తమ మాటకి కట్టుబడి ధోనీ పునరాగమనానికి తాజాగా మార్గం సుగమం చేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఈ ఏడాది వన్డే, టీ20ల్లో ధోనీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. 13 ఇన్నింగ్స్ల్లో కనీసం ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ఎంతలా అంటే..? అతని సగటు 25కిలోపు పడిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇంత పేలవంగా ధోనీ ఎప్పుడూ ఆడలేదని గణాంకాలు చెప్తున్నాయి. కానీ.. వికెట్ల వెనుక అతని నైపుణ్యం, వ్యూహాల్లో అతని అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు.. ప్రపంచకప్ వరకూ టీమ్లో కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెండో వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ టీమిండియా తరఫున ధోనీ మైదానంలోకి రానున్నాడు.
ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత్ .. ఆ తర్వాత జనవరి 23 నుంచి న్యూజిలాండ్తో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఐసీసీ వన్డే జట్టు కెప్టెన్ ఆఫ్ ది ఇయర్గా విరాట్ కోహ్లి
ఈ ఏడాదికిగానూ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన వన్డే జట్టును ఐసీసీ గురువారం ప్రకటించింది.
TNN | Updated:
Dec 22, 2016, 12:51PM IST
ఈ ఏడాదికిగానూ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన వన్డే జట్టును ఐసీసీ గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని కెప్టెన్‌గా ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. ఆసీస్ ఓపెనర్‌గా సెంచరీల మీద సెంచరీలు బాదిన డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్విటన్ డీకాక్‌లకు కూడా చోటు లభించింది. దక్షిణాఫ్రికా నుంచి డివిలియర్స్ సహా నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత్, ఆస్ట్రేలియాల నుంచి ముగ్గురు చొప్పున ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల నుంచి ఒక్కరు చొప్పున ఈ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంక, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల నుంచి ఒక్క ఆటగాడికి కూడా జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. గతేడాది వన్డే టీం కెప్టెన్‌గా డివిలియర్స్‌ను ప్రకటించిన ఐసీసీ ఈ ఏడాది కోహ్లిని ప్రకటించడం విశేషం. అంతకు ముందు వరుసగా నాలుగేళ్లపాటు, ఓవరాల్‌గా ఐదేళ్లపాటు ఎంస్ ధోనీ ఐసీసీ వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
జటు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, డేవిడ్ వార్నర్, క్వింటన్ డికాక్, ఏబీ డివిలియర్స్, జాస్ బట్లర్ (ఇంగ్లండ్), మిషెల్ మార్ష్, మిషెల్ స్టార్క్ (ఆసీస్), రబడ, ఇమ్రాన్ తాహీర్ (దక్షిణాఫ్రికా), సునీల్ నరైన్ (వెస్టిండీస్) | 2sports
|
మాజీ భార్య ఎంగేజ్ మెంట్ పై స్పందించిన పవన్
Highlights
రేణుని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసిన పవన్
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ ఇటీవలే మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎంగేజ్ మెంట్ ఫోటోలను కూడా రేణు సోషల్ మీడియాలో అభిమానులకు పంచుకున్నారు కూడా. తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆమె గత కొంతకాలం క్రితమే ప్రకటించారు.
కాగా.. పవన్ అభిమానులు మాత్రం ఈ విషయంలో రేణు పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు. వారి మాటల దాడికి ఆమె కూడా సమాధానాలతో ఎదురుదాడి కూడా చేశారు. అంతేకాదు.. తాను అనుకున్నట్టుగానే తన మనసుకు నచ్చిన మరో వ్యక్తితో ఆమె నిశ్చితార్థం జరుపుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా.. రేణూ నిశ్చితార్థం జరిగిన సందర్భంగా.. పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
‘కొత్త జీవితం ప్రారంభించబోతున్న రేణూ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు పవన్.
My wholehearted wishes to Ms.Renu garu for entering a new phase of happiness.I wish and pray Almighty & the Mother Nature to bestow upon her abundant health, peace and prosperity.
— Pawan Kalyan (@PawanKalyan) June 26, 2018
తెలుగులో పవన్కు జోడీగా ‘జానీ’, ‘బద్రీ’ చిత్రాల్లో నటించిన రేణూ 2009లో పవన్ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల 2012లో రేణూ, పవన్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్..ఆన్నా లెజ్నోవా అనే రష్యా యువతిని పెళ్లిచేసుకున్నారు. రేణూ తన పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పుణెలో ఉంటున్నారు.
Last Updated 26, Jun 2018, 10:38 AM IST | 0business
|
మార్కెట్లలో ఏకీకృత లైసెన్స్ విధానం
- ఎన్బీఎఫ్సీలకు 'క్విబ్' హోదా
- విదేశీ మదుపరులకు సులభ రిజిస్ట్రేషన్
- బోర్డు సమావేశంలో 'సెబీ'కీలక ప్రతిపాదనలు
ముంబయి: స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిర్వహించే బ్రోకర్లకు ఇకపై ఏకీకృత లైసెన్స్లను జారీ చేయాలని 'మార్కెట్ నియంత్రణ' సంస్థ సెబీ నిర్ణయించింది. బుధవారం ఇక్కడ సమావేశమైన సెబీ బోర్డు మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకుంది. ఏకీకృత లైసెన్స్ను జారీ చేయడం ద్వారా బ్రోకర్లు ఒకే లైసెన్స్తో అటు ఈక్విటీలతో పాటు ఇటు కమోడిటీ మార్కెట్లలో పాల్గొనేందుకు వీలు కలుగుతుంది. బ్రోకర్ల వ్యవస్థలో సమానత్వం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కొన్ని క్యాటగిరీలకు సంబంధించిన 'నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్'లకు (ఎన్బీఎఫ్సీలకు) 'అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారు' (క్విబ్) హోదాను కల్పించే అంశాన్ని సెబీ ఈ సమావేశంలో ప్రతిపాదించింది. దీంతో ఎన్బీఎఫ్పీలు రానున్న రోజుల్లో పబ్లిక్ ఇష్యూల్లో క్విబ్ హోదాలో ఈ విభాగానికి కేటాయించిన షేర్లకు దరఖాస్తు చేసుకొనేందుకు వీలుపడనుంది. ఈ మార్పులు అమలులోకి వచ్చే విధంగా రానున్న రోజుల్లో మార్కెట్ నిబంధనల్లో మార్పులు తీసుకురానున్నట్టుగా సెబీ తెలిపింది. ఈ కొత్త విధానం మూలంగా బ్రోకర్లందరికీ ఏకరూప రిజిస్ట్రేషన్ నంబరు లభించనుంది. సెబీ చైర్మెన్గా గత మార్చిలో అజరు త్యాగీ బాధ్యతలు స్వీకరించిన ఆయన నేతృత్వంలో బోర్డు సమావేశం కావడం ఇదే తొలిసారి. సెబీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు ఇవి... కమోడిటీస్ ఎక్స్ఛేంజీలు ఆఫ్షన్స్ను కూడా నిర్వహించేలా ఎస్ఈసీసీ నిబంధనలను సవరించనున్నారు. బ్యాంకులకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపుల్లో అనుసరిస్తున్న విధానంలో కొన్ని మినహాయింపులనూ ప్రకటించింది. విదేశీ మదుపరులకు సులభమైన రిజిస్ట్రేషన్ విధానాన్ని సూచించింది. ఎన్ఆర్ఐ పెట్టుబడులకు సంబంధించి మరింత స్పష్టతను వెలువరి ంచింది. ఈష్యూ అనంతరం నిర్వహణ ఆవశ్యకతను రూ.500 కోట్లకు తక్కువగా ఉండే పబ్లిక్ ఇష్యూలకు విస్తరించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఐజిఎస్టిలో ఎగుమతిదారులనిర్వాకం
GST
న్యూఢిల్లీ: ఎగుమతుల పరంగా జిఎస్టి రాయితీలను అక్రమంగా లబ్దిపొందుతున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. మొత్తం 5106 మంది సమస్యాత్మక ఎగుమతిదారులు తమతమ క్లెయింలు అక్రమంగా చేసి రీఫండ్స్ పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. సమీకృత జిఎస్టి రీఫండ్స్లో ఎగుమతిదారులు సుమారు 1000 కోట్లవరకూ లబ్దిపొందినట్లు తేలింది. మొత్తం 5106 మంది ఎగుమతిదారులు ఈ అవకతవకలకు పాల్పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. బోగస్ ఇన్వాయిస్లను దాకలుచేసి జిఎస్టి రీఫండ్లు పొందారని గుర్తించింది. కేంద్ర పరోక్షపన్నులబోర్డు కస్టమ్స్ బోర్డు సహేతుకమైన ఎగుమతిదారులకే రీఫండ్ క్లెయిలు వెళతాయని, ఆటోమేటెడ్ యంత్రాంగంలో వాటిని ప్రాసెస్చేయడం జరుగుతుందని వీటిని సమయానుకూలంగా రీఫండ్ ఇవ్వడంజరుగుతుందని వెల్లడించింది.
సిబిఐసి కస్టమ్స్, జిఎస్టి అధికారులకు ఈ ఎగవేత, బోగస్ క్లెయింలపై అప్రమత్తంచేస్తూ ఇన్పుట్ట్యాక్స్క్రెడిట్ను కొందరు ఎగుమతిదారులు అక్రమ మార్గాల్లో లబ్దిపొందుతున్నారనిచ వెంటనే కార్యాచరణ షురూచేయాలని సూచించింది. మొత్తం 5106మంది సమస్యాత్మక ఎగుమతిదారులను సైతం గుర్తించి ఆయా సర్కిళ్లకు పంపించింది. సుమారు 1.42 లక్షలమంది దేశంలో ఎగుమతిదారులు రీఫండ్ క్లెయిలు చేస్తుంటే వీరిలో ఐదువేలకుపైగా బోగస్ క్లెయిమ్లు చేస్తున్నట్లు తేలింది. బోగస్ క్లెయిమ్లు చేసినా వీరి ఎగుమతులను అనుమతిస్తూ వచ్చారు.
ఐటిసిని గరిష్టంగా 30రోజులపాటు పరిశీలించినతర్వాత మాత్రమే రీఫండ్ విడుదలవుతుందని వెల్లడించింది. కేవలం ఆటోమెటెడ్ విధానంలోనే కాకుండా దస్త్రాలవారీగా కూడా ఐజిఎస్టి రీఫండ్స్ఉ పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. జూన్17,18 తేదీల్లోనే 1436 షిపింగ్ బిల్లులు దాఖలయ్యాయని మొత్తం 925 మంది ఎగుమతిదారులు వీటిని దాఖలుచేసినట్లు తేలింది. సుమారు 20వేలకుపైగా షిప్పింగ్ బిల్లులు ఇప్పటివరకూ తొమ్మిదివేలమంది ఎగుమతిదారులు రోజువారి పద్దతిలో దాఖలుచేసారు. అయితే అధికారులపరిశీలన నిర్లక్ష్యంగా ఉందని సిబిఐసి హెచ్చరించింది.
కొత్తగా తనిఖీ విధానం ఎగుమతిదారులు ప్రభుత్వ సొమ్మును బోగస్ క్లెయిమ్లద్వారా సాధించేందుకు వీలులేని విధంగా జరుగుతుందని వెల్లడించింది. సిబిఐసి సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ వెంటనే ఇలాంటి సమస్యాత్మక ఎగుమతిదారులను గుర్తించి వారివివరాలను కేంద్రపన్నులవిభాగం చీఫ్ కమిషనర్కు పంపించాలని, అంతకుముందు జరిగిన ఐజిఎస్టి రీఫండ్స్ను కూడా పరిశీలించాలని ఆదేశించింది. కస్టమ్స్శాఖలో ఉన్న నష్టనివారణ కేంద్రం(ఆర్ఎంసిసి) ఎప్పటికప్పుడు ఈ రిస్క్ ఎగుమతిదారులగురించి హెచ్చరికలుచేస్తుందని, వీరి ఎగుమతులను నూరుశాతంప రిశీలించాలని ఆదేశించింది.
అవసరమైతే ఐజిఎస్టి రీఫండ్లను సైతం నిలిపివేసేందుకు హెచ్చరికలు జారీచేస్తుందని సిబిఐసి వివరించింది. ఎగుమతిదారులు ఐజిఎస్టి రీఫండ్స్ను రెండుమార్గాల్లో క్లెయిమ్చేస్తారు. బాండ్ లేదా ఎల్ఒయులసాయంతో చేసుకుంటారు. ఎగుమతుల సమయంలోనే వీటిని పూర్తిచేస్తారు. అంతేకాకుండా పేరుకుపోతున్న ఐటిసి అంటే ఇన్పుట్ట్యాక్స్ క్రెడిట్ను రీఫండ్చేయాలనికోరాతారు.
తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/ | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రెజీనా ‘స్కిన్ షో’ అందుకోసమేనా?
ఐఫా అవార్డుల ఉత్సవం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
TNN | Updated:
Jan 29, 2016, 11:32AM IST
రెజీనా ‘స్కిన్ షో’ అందుకోసమేనా?
ఐఫా అవార్డుల ఉత్సవం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది తారలంతా ఉత్సవంలో బాగానే సందడిచేశారు. ఇక హీరోయిన్ల సంగతి చెప్పక్కర్లేదు. పొడవాటి గౌన్లతో డీప్ నెక్ లతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. అయితే వీరందరిలో మనం చెప్పుకోవాల్సింది రెజీనా గురించే. ఆమె వేసుకున్న డ్రెస్ చూస్తే వేదిక టాలీవుడ్ ఐఫాలా కాకుండా, హాలీవుడ్ ఐఫాలా అనిపిస్తుంది. శరీరంలో కేవలం పావు వంతు భాగాన్ని మాత్రమే ఆ డ్రెస్ కప్పగలిగింది. మిగతా భాగమంతా పారదర్శకంగా ఉండే నెట్ వస్త్రంతో చేసినది కావడంతో... చూపులన్నీ రెజీనా మీదే పడ్డాయి. అయితే రెజీనా మరీ ఇంతగా రెచ్చిపోయి స్కిన్ షో ఎందుకు చేసింది... ఇంకెందుకు తాను ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా సిద్ధమే అని ఇండస్ట్రీలో ఉన్నవారికి చెప్పడం కోసమే అంటున్నారు సినీ జనాలు. సినిమాల్లోకి వచ్చి ఆరేళ్లు అవుతున్న ఇంతవరకు స్థిరపడలేదు. ఆమె సినిమాలేవీ పెద్దగా హిట్ కాలేదు. ఆమె తరువాత వచ్చిన రకుల్, రాశి ఖన్నా లాంటి వారు మాత్రం అవకాశాలని ఎగరేసుకుపోతున్నారు. అందుకే ఇక తప్పదని ఎక్స్ పోజింగ్ కు సిద్ధమైనట్టుంది రెజీనా. | 0business
|
sandhya 152 Views ENG vs PAK , Pak Batting
pak batting
తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్..పాక్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్లు స్కోరు బోర్డును కొంత సేపు పరుగు పెట్టించారు. మొయీన్ బౌలింగ్లో ఇమామ్ ఉల్ హక్(44) క్రిస్ వోకస్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫకర్ జమాన్(36) మొయీన్ బౌలింగ్ స్టంపౌట్ అయ్యాడు. పాక్ జట్టు 21 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో బాబర్ అజామ్(25), మహ్మద్ హఫీజ్(7)లు ఉన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/ | 2sports
|
Hyderabad, First Published 9, Oct 2018, 12:53 PM IST
Highlights
విండీస్ జట్టు ఆట తీరు చూస్తుంటే వారు కనీసం రంజీ ట్రోఫీ క్వార్టర్స్కు కూడా చేరేటట్టు కనిపించడం లేదని, అందరినీ ఇప్పుడిదే ప్రశ్న వేధిస్తోందని వ్యంగ్యాస్త్రం విసారారు.
రాజ్ కోట్ తొలి టెస్టు మ్యాచులో వెస్టిండీస్ బ్యాటింగ్ పై హర్భజన్ సింగ్ చేసిన ట్వీట్ పై విండీస్ మాజీ పేసర్ టీనో బెస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రాజ్ కోట్ లో భారత్ కి విండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ పేలవ ప్రదర్శన కారణంగా భారత్ అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే.. ఈ నేపథ్యంలో విండీస్ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ.. హర్బజన్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. విండీస్ జట్టు ఆట తీరు చూస్తుంటే వారు కనీసం రంజీ ట్రోఫీ క్వార్టర్స్కు కూడా చేరేటట్టు కనిపించడం లేదని, అందరినీ ఇప్పుడిదే ప్రశ్న వేధిస్తోందని వ్యంగ్యాస్త్రం విసారారు. ఈ కామెంట్ పై క్రికెట్ అభిమానులు ఫైర్ అయ్యారు.
కేవలం వెస్ట్ ఇండీస్ క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా.. ఇండిన్స్ కూడా బజ్జీ ట్వీట్ పై విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో బజ్జీ చేసిన ట్వీట్ విండీస్ మాజీ పేసర్ టీనో బెస్ట్ కి ఆగ్రహం తెప్పించినట్లు తెలిసింది.
read more news | 2sports
|
Visit Site
Recommended byColombia
‘హేయ్.. కోహ్లి. మునివేళ్లపై నిలబెట్టే ఉత్కంఠ మ్యాచ్ల్ని త్వరలో మేము చూడబోతున్నాం. మైదానంలో ఆ ఆసక్తికరమైన పోరుకి ముందు.. మైదానం వెలుపల ఓ చిన్న సాహసం చేస్తే ఎలా ఉంటుంది...? ఒక్కసారి వచ్చి.. హెర్మనస్లోని షార్క్ డైవింగ్ చేయ్. టీమిండియా ఈ సవాల్కి సిద్ధమేనా..?’ అని దక్షిణాఫ్రికా టూరిజం ట్వీట్ చేసింది. దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేకపోయిన భారత్.. ఈ సారి రిక్తహస్తాలతో వెళ్లకూడదనే పట్టుదలతో ఉంది. సుదీర్ఘ సిరీస్లో భాగంగా సఫారీలతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లను కోహ్లిసేన ఆడనుంది.
Hey @imVKohli we're looking forward to some nail-biting Cricket. Before the on-field action begins, how about some off-beat adventure with the team! Come, seek the adrenaline rush of shark-cage diving in Hermanus. Are the men in blue up for the challenge.
— GoToSouthAfrica (@GoToSouthAfrica) December 28, 2017
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Rehena11
శ్రీలంకలో టెస్ట్ సిరీస్ లో బాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ఆరంభంలోనే భారత్ రహానే వికెట్ కోల్పోయింది. షహానా బౌలింగ్ లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రహానే స్థానంలో రవిచంద్ర అశ్విన్ బ్యాటింగ్ కు దిగాడు. కడపటి వార్తలందేసరికి భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి 39 పరుగులు చేసింది. పుజారా 22 పరుగులతోనూ, అశ్విన్ నాలుగు పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. | 2sports
|
Bathukamma Song: మంగ్లీ బత...
తమిళ స్టార్ హీరో తలా అజిత్ కుమార్‌కి సినిమా షూటింగ్‌లో గాయాలయ్యాయి. ప్రస్తుతం తలా హీరోగా వివేగం సినిమా సెట్స్‌పై వుంది. ఇటీవల వివేగం షూటింగ్‌లో కొన్ని స్టంట్స్ తెరకెక్కిస్తుండగా అజిత్‌కి గాయాలయ్యాయి. కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పి అభిమానులని కలవరపెట్టడం ఇష్టం లేని అజిత్ అండ్ టీమ్ అసలు సంగతిని రహస్యంగానే దాచిపెట్టారట. అజిత్ కూడా గాయమైన తర్వాత కొద్దిగా బ్రేక్ తీసుకుని మళ్లీ వెంటనే షూటింగ్ స్టార్ట్ చేశాడట. అప్పుడు దాచిపెట్టిన ఈ విషయం తాజాగా మూవీ యూనిట్ ద్వారా బయటికి పొక్కింది.
అజిత్ కుమార్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజైంది. మే 10వ తేదీన రిలీజైన ఈ ట్రైలర్‌ని ఇప్పటికే 14 మిలియన్స్ వ్యూయర్స్ చూశారంటే అజిత్‌కి వున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో అజిత్ ఎన్ని రిస్కీ స్టంట్స్ చేశాడనేది ఈ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది.
అజిత్‌కి షూటింగ్‌లో గాయాలవడం ఇదేం కొత్త కాదు. సాహసోపేతమైన స్టంట్స్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడని అజిత్‌కి గతంలో కూడా పలు చిత్రాల షూటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడి కోలుకున్నాడు. గతేడాదే అజిత్ ఓ సర్జరీ కారణంగా దాదాపు 9 నెలలపాటు ఏ షూటింగ్‌కి హాజరవకుండా రెస్ట్ తీసుకున్నాడు. ఏదేమైనా తమ అభిమాన హీరో రిస్కీ స్టంట్స్‌కి కొద్దిగా డిస్టెన్స్ మెయింటెన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు తలా ఫ్యాన్స్.
వివేగం సినిమాలో అజిత్ కుమార్
Ajith kumar in Vivegam | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఐపీఎల్ తరహాలో బోట్ రేస్.. విజేతకు 10 లక్షలు
భారత్లో ఐపీఎల్కు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. నెల రోజులకు పైగా జరిగే ఈ ఐపీఎల్ సంబరాన్ని కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు.
Samayam Telugu | Updated:
Jun 12, 2018, 03:29PM IST
ఐపీఎల్ తరహాలో బోట్ రేస్.. విజేతకు 10 లక్షలు
భారత్లో ఐపీఎల్కు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. నెల రోజులకు పైగా జరిగే ఈ ఐపీఎల్ సంబరాన్ని కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే తరహాలో పడవ పోటీలు రాబోతున్నాయి. కేరళ రాష్ట్రం పడవ పోటీలకు పెట్టింది పేరు. ఏటా అక్కడ స్నేక్ బోట్ రేస్లు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ తరహాలో స్నేక్ బోట్ రేస్ టోర్నమెంట్ నిర్వహించాలని కేరళ టూరిజం శాఖ నిర్ణయించింది. ఆగస్టు నుంచి ఈ పోటీలు ప్రారంభంకానున్నాయి. ‘కేరళ బోట్ రేస్ లీగ్ (కేబీఆర్ఎల్)’ పేరిట ఈ పడవ పోటీలను నిర్వహించనున్నారు. అలప్పుజలోని పున్నమడక్కాయల్లో జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్, కొల్లాంలో జరిగే ప్రెసిడెంట్స్ ట్రోఫీ బోట్ రేస్లను ఈ లీగ్ కిందకు తీసుకురానున్నారు.
కేరళ బోట్ రేస్ లీగ్ ఈ ఏడాది ఆగస్టు 11న ప్రారంభమై నవంబర్ 1న ముగుస్తుంది. కేరళ టూరిజం మంత్రి కొడకంపల్లి సురేంద్రన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ను క్వాలిఫయర్ రేస్గా పరిగణించనున్నారు. ఇందులో అర్హత సాధించిన జట్లు కేరళ బోట్ రేస్ లీగ్లో పాల్గొంటాయి. ఈ లీగ్లో మొత్తం 12 మ్యాచ్లు ఉంటాయి. నెహ్రూ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తొమ్మిది స్నేక్ బోట్ పెర్ఫార్మర్లను లీగ్కు ఎంపిక చేస్తారు. పున్నమాడ, పులింకున్ను, కైనకరి, కరువట్ట, మావెలిక్కర, కయాంకుళం, పిరవోం, పూతొట్ట, కొట్టాపురం, తళతంగడి, కలాల్డా, కొల్లాం వేదికలుగా ఈ పోటీలు జరగనున్నాయి.
ఈ లీగ్కు అర్హత సాధించిన తొమ్మి జట్లకు ప్రతి వేదిక నుంచి బోనస్గా రూ.4 లక్షలు అందజేస్తారు. ప్రతి లీగ్ మ్యాచ్లో తొలి ముగ్గురు విజేతలకు రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షల ఇస్తారు. ఇక మొత్తం లీగ్ విజేతలకు రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షలు నగదు బహుమతి అందుతుంది. కాగా, ఈ లీగ్ వల్ల రాష్ట్రంలోని సంప్రదాయ పడవ పోటీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని కేరళ టూరిజం శాఖ స్పష్టం చేసింది. మూలం, నీరేట్టుపురం, అరాన్ముల, పాయిపట్టు, ఇతర ప్రాంతాల్లో జరిగే పోటీలను లీగ్ కిందకు తీసుకురాలేదని వెల్లడించింది. ఆ పోటీలన్నీ ఎప్పటిలానే జరుగుతాయని ప్రకటించింది.
Read this news in Malayalam
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
అర్చన అవకాశాలు రాకపోవడంతో మేనేజర్లను నిందిస్తోంది
Highlights
మంచి సినిమా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న అర్చన వేద
రీసెంట్ గా బిగ్ బాస్ షోతో నెగటివో,పాజిటివో గానీబాగా పాపులరైన అర్చన
తనకు సినిమా అవకాశాలు రాకపోవడానికి మేనేజర్లే కారణమని నిందలు
బిగ్ బాస్ రియాల్టీ షోలో ఫైనల్ వరకు చేరుకున్న అర్చన.. బిగ్ బాస్ ఇంట్లో నుండి బయకు వెళ్లిన వారిలో చాలా మంది అర్చన మీద రకరకాల కంప్లయింట్స్ చేసిన విషయం తెలిసిందే. తన యాటిట్యూడ్ ప్రాబ్లెమ్ తో ప్రతి ఒక్కరిని నొప్పించేలా బిహేవ్ చేసిన అర్చన ముఖ్యంగా దీక్షను మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది.
బిగ్ బాస్ ఇంట్లో అత్యధిక సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయి, ఇంట్లో వస పిట్టగా పేరు తెచ్చుకున్న ఆమె తన సినిమాలతో పెద్దగా గుర్తింపు రాకున్నా బిగ్ బాస్ తో కాస్తో కూస్తో ప్రచారం పొందింది. అయితే ఆ షో తర్వాత కూడా పెద్దగా సినిమా అవకాశాలు అర్చనను పలకరించింది లేదు. అయితే తనకు అవకాశాలు రాకపోవటానికి కారణం తన మేనేజర్లేనని ఆరోపిస్తోంది అర్చన అలియాస్ వేద.
‘నా మేనేజర్ల వల్లే నేను ఇబ్బందిపడ్డా. నేను తీసుకునే పారితోషికం గురించి ఇతర హీరోయిన్లకు చెబుతుండేవారు. దీంతో, అంతకన్నా తక్కువ పారితోషికానికి ఆయా నటీమణులు నాకు రావాల్సిన అవకాశాలను దక్కించుకునే వారు. నా ఫోన్ నెంబర్లు అవసరమైన వ్యక్తులకు నా మేనేజర్లు ఇచ్చేవారు కాదని నాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత నా మేనేజర్లను మందలించినా కూడా వారు దులిపేసుకునేవారు. పారితోషికం కన్నా స్క్రిప్ట్ బాగుంటే చేస్తానని నా మేనేజర్లకు నేను చెబుతుండేదానిని. మేనేజర్ల వల్లనే సినిమాల్లో అవకాశాలు రాకుండా నష్టపోయాను. అందుకే కొన్నేళ్లుగా, నాకు మేనేజర్ ఎవరూ లేరు. నేనే డైరెక్టుగా మాట్లాడుకుంటున్నాను' అంది అర్చన.
సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ప్రపోజ్ చేయలేదని, వాస్తవం చెప్పాలంటే, నాకెవరైనా నచ్చితే వాళ్లకు ఇంకా దూరంగా ఉంటాను. ఇండస్ట్రీకి చెందిన వాళ్లే నాకు ప్రపోజ్ చేశారు కానీ, వాళ్ల నిజాయతీ, నిబద్ధత గురించి అనుమానం వచ్చింది. నేను ఒప్పుకోలేదు' అని చెప్పుకొచ్చింది.
నిజానికి సరైన ప్లానింగ్ లేకపోవటం, మంచి పాత్రలను చూసుకోకపోవటం వల్లనే వెనుకబడిపోయిందన్నది నిజం. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మేనేజర్లపై నెపం వేస్తే పోయిన అవకాశాలు వస్తాయా. మరి మేనేజర్ లేకుండా చాలా రోజులైంది కదా. ఏవీ మరి.
Last Updated 25, Mar 2018, 11:58 PM IST | 0business
|
internet vaartha 133 Views
హైదరాబాద్ : రెడ్డిలాబ్స్ ఆధ్వర్యంలో 25 మంది నిరుపేద విద్యా ర్థినీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందచేశారు. తెలంగాణలోని 22 జిల్లాపరిషత్ హైస్కూళ్లలోని విద్యార్థులకు మెరుగైన గ్రేడ్లతో పదోతరగతి పూర్తి చేసుకున్న వారికి రూ.25లక్షల ఉపకారవేతనాలు అందించినట్లు రెడ్డి స్లాబ్స్ ప్రకటించింది. కంపెనీ ఉత్పత్తికేంద్రాల సమీపంలోని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్నారని ప్రతివిద్యార్థి నాణ్యమైన విద్యను పొందడం హక్కు అనిడాక్టర్ రెడ్డీస్లాబ్స్ ఛైర్మన్ కె.సతీష్రెడ్డి, ఫౌండేషన్ మేనేజింగ్ట్రస్టీ అనూరాధా ప్రసాద్లు పేర్కొన్నారు. మదీనాగూడలోని కల్లం అంజిరెడ్డి విద్యాలయ (కార్వ్)లో ఈ ఉపకార వేతనాలు అందించారు. | 1entertainment
|
Hyderabad, First Published 10, May 2019, 1:59 PM IST
Highlights
ఈ నెలఖారుకి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే.. మ్యాచ్ మొదలు కాకముందే క్రికెటర్లపై ట్రోల్స్ మొదలుపెట్టారు.
ఈ నెలఖారుకి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే.. మ్యాచ్ మొదలు కాకముందే క్రికెటర్లపై ట్రోల్స్ మొదలుపెట్టారు. ఆసీస్ ఆటగాళ్లే లక్ష్యంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు... సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు ఆటకు దూరమైన డెవిడ్ వార్నర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో స్యాండ్పేపర్తో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడిన కామెరూన్ బెన్క్రాఫ్ట్ను గుర్తు చేస్తూ... ఆసీస్ స్టార్ బౌలర్లు మిచెల్ స్టార్క్, లియాన్ నాథన్లు చేతిలో బంతితో పాటు సాండ్ పేపర్ కూడా పట్టుకున్నట్లు ఫొటో షాప్ చేశారు.
అంతేగాక ట్యాంపరింగ్కు మూలకారకుడిగా భావించిన డేవిడ్ వార్నర్ జెర్సీపై ఆస్ట్రేలియాకు బదులుగా చీట్స్ అనే పేరు ముద్రించినట్లు పొట్రేట్స్ సృష్టిస్తున్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్.. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు, విమర్శలకు తన టీమ్ భయపడదని పేర్కొన్నాడు. అన్నింటికీ ఆటతో సమాధానం చెబుతామని వ్యాఖ్యానించాడు.
‘ త్వరలోనే ఇంగ్లండ్కు పయనమవుతున్నాం. వరల్డ్ కప్ కంటే కూడా యాషెస్ మొదలైన తర్వాతే ఇలాంటి కామెంట్లు మరెన్నో వినాల్సి వస్తుంది. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాం’ అని చెప్పుకొచ్చాడు.
Last Updated 10, May 2019, 1:59 PM IST | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
స్మృతి మందాన ఔట్.. ఒత్తిడిలో భారత్
బంతి ఊహించిన దానికంటే.. అనూహ్యంగా నెమ్మదించి తక్కువ ఎత్తులో రావడంతో స్మృతి మందాన బ్యాట్కి అది అందలేదు
TNN | Updated:
Jul 2, 2017, 03:40PM IST
స్మృతి మందాన ఔట్.. ఒత్తిడిలో భారత్
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్ ఓపెనర్ స్మృతి మందాన పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో నిరాశపరిచింది. ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో స్మృతి మందాన (2) ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే పెవిలియన్ చేరిపోయింది. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ దిన్నా వేసిన ఆ ఓవర్‌లో గుడ్ లెంగ్త్ బంతిని మిడ్ వికెట్‌ దిశగా తరలిచేందుకు ప్రయత్నించిన స్మృతి మందాన వికెట్లు ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయింది. బంతి ఊహించిన దానికంటే.. అనూహ్యంగా నెమ్మదించి తక్కువ ఎత్తులో రావడంతో స్మృతి మందాన బ్యాట్‌కి అది అందలేదు. దీంతో భారత్ 7 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. | 2sports
|
Hyderabad, First Published 21, Aug 2019, 1:09 PM IST
Highlights
తాజాగా విడుదలైన 'సై రా' టీజర్ గురించి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడారు. టీజర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
సినిమా ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ యూనిటీ గురించి తెలిసిందే. మెగా బ్రదర్స్, కజిన్స్ అందరూ కలిసే ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటారు. అయితే అల్లు బ్రదర్స్ మాత్రం సెపరేట్ గా కనిపిస్తుంటారు. ఎంత మెగాఫ్యామిలీ మెంబర్స్ అయినప్పటికీ తమ ప్రత్యేకతను చాటడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా విడుదలైన 'సై రా' టీజర్ గురించి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడారు.
టీజర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మెగాఫ్యామిలీ సభ్యులు వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, నీహారిక, కళ్యాణ్ దేవ్, ఉపాసన ఇలా అందరూ తమ ట్విట్టర్ అకౌంట్లలో టీజర్ ని షేర్ చేస్తూ సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. కానీ అల్లు ఫ్యామిలీ నుండి ఒక్క ట్వీట్ కూడా కనిపించకపోవడం అభిమానులకు షాక్ ఇస్తోంది.
అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, స్నేహా రెడ్డి వీరెవరూ కూడా సినిమా టీజర్ పై ఒక్క ట్వీట్ కానీ పోస్ట్ కానీ చేయలేదు. అల్లు అర్జున్ తప్పించి మిగిలిన వారంతా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అన్ని విషయాలపై స్పందించే వీరు చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన 'సై రా' సినిమా టీజర్ విడుదలైతే ఒక్క కామెంట్ కూడా చేయలేదు.
పోనీ వారంతా బిజీగా ఉండి స్పందించలేదని అనుకుందాం.. అలా అయితే వరుణ్ తేజ్ ప్రస్తుతం హాలిడేలో ఉన్నాడు. ధరం తేజ్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఉపాసన తన బిజినెస్ పని మీద గ్రీస్ వెళ్లింది. వీరంతా ఎంత బిజీగా ఉన్నా.. చిరు మీద ప్రేమతో ఒక ట్వీట్ పెట్టడానికి టైమ్ ఇచ్చుకున్నారు. కానీ అల్లు బ్రదర్స్ ఆ విధంగా చేయకపోవడంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు.
Last Updated 21, Aug 2019, 2:04 PM IST | 0business
|
Hyderabad, First Published 22, Oct 2018, 8:46 PM IST
Highlights
మీటూ ఉద్యమం వేడి అన్ని ఇండస్త్రీలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రోజుకో న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయటపడక తప్పదు అనే రేంజ్ లో సీన్స్ దర్శనమిస్తున్నాయి.
మీటూ ఉద్యమం వేడి అన్ని ఇండస్త్రీలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రోజుకో న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయటపడక తప్పదు అనే రేంజ్ లో సీన్స్ దర్శనమిస్తున్నాయి. గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను నటీమణులు దైర్యంగా బయటకి చెబుతున్నారు.
దీంతో చాలా మంది సెలబ్రెటీలు తమ పేరు ఎక్కడ బయటపడుతుందో అని ఆందోళన చెందుతున్నట్లు కథనాలు కూడా వెలువడ్డాయి. అసలు విషయంలోకి వస్తే.. ఇప్పుడు కోలీవుడ్ లో శింబు పేరు కూడా ఈ వివాదంలో వినిపిస్తోంది. తమిళ హీరోయిన్ లేఖ చేసిన ఒక ట్వీట్ కొత్త ఊహాగానాలకు తావిస్తోంది. వాషింగ్టన్ ట్విట్టర్ లో మీటూ హ్యాష్ ట్యాగ్ తో ఆమె కెట్టవన్ అంటూ ట్వీట్ చేసింది.
కెట్టవన్ అనేది శింబుతో లేఖ నటించిన సినిమా. దీంతో ఆమెను శింబు ఏమైనా వేధించాడా అని కోలీవుడ్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే వెంటనే ఈ విషయంపై శింబు ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. కెట్టవన్ షూటింగ్ సమయంలో ఎలాంటి సంఘటనలు జరగలేదని ఆమె ఎందుకు అలా చేసిందో తెలియదని చెబుతూ ఆమె క్లారిటీ ఇవ్వకుండా శింబు పేరుతో తప్పుడు కథనాలను వ్రాయడం కరెక్ట్ కాదని ప్రకటన ద్వారా తెలియజేశారు
Last Updated 22, Oct 2018, 8:46 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Prithvi Shaw: దురదృష్టం.. ఆసీస్తో తొలి టెస్ట్కు పృథ్వీ షా దూరం
చీలమండకు బలమైన గాయం కావడంతో తొలి టెస్టుకు పృథ్వీ షా దూరమైనట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
Samayam Telugu | Updated:
Nov 30, 2018, 12:42PM IST
ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటడానికి వెళ్లిన భారత యువ బ్యాట్స్మన్ పృథ్వీ షాను దురదృష్టం వెంటాడింది. ఫీల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలికి బలమైన గాయం కావడంతో తొలి టెస్టుకు షా దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. సిడ్నీలో జరుగుతోన్న ఈ మ్యాచ్లో రెండో రోజైన శుక్రవారం పృథ్వీ షా .. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ కోసం ప్రయత్నించి పడిపోయాడు. ఈ సమయంలో తన ఎడమ కాలి చీలమండ (యాంకిల్) బెనికింది. లేవలేని పరిస్థితులో ఉన్న పృథ్వీ షాను మెడికల్ టీం మైదానంలో నుంచి తీసుకెళ్లారు.
అయితే చీలమండకు బలమైన గాయం కావడంతో తొలి టెస్టుకు పృథ్వీ షా దూరమైనట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. షా ఎడమ కాలికి స్కాన్ చేయడానికి హాస్పటల్కు తరలించామని, చీలమండకు బలమైన గాయం కావడంతో తొలి టెస్టుకు ఆడటం వీలుపడదని బీసీసీఐ స్పష్టం చేసింది. స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్తో ఆరంగేట్రం చేసిన పృథ్వీ షా.. తొలి టెస్టులోనే సెంచరీ బాది సత్తా చాటాడు. ఇప్పుడు విదేశీ గడ్డపై అవకాశం వచ్చినా దురదృష్టవశాత్తు తొలి టెస్టుకు దూరమయ్యాడు. షా వీలైనంత త్వరగా కోలుకుని రెండో టెస్టుకి అందుబాటులోకి వస్తే జట్టుకు ఎంతో మేలవుతుంది.
UPDATE - Prithvi Shaw ruled out of First Test against Australia in Adelaide. https://t.co/bOB8e6Ijrv
— BCCI (@BCCI) 1543553895000
ఇదిలా ఉంటే, ప్రస్తుతం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా ఎలెవన్తో జరుగుతోన్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పృథ్వీ షా 66 పరుగులు చేశాడు. ఛటేశ్వర పుజారా(54), విరాట్ కోహ్లీ(64), ఆజింక్య రహానే(56 రిటౌర్డ్ హర్ట్), హనుమ విహారి(53), రోహిత్ శర్మ(40) రాణించారు. ఆస్ట్రేలియా ఎలెవన్ కూడా దీటుగా ఆడుతోంది. ప్రస్తుతానికి 6 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. కాగా.. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్లో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. | 2sports
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
Hyderabad, First Published 7, May 2019, 7:45 PM IST
Highlights
ఈ వారం రిలీజ్ అవుతున్న మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి లో అల్లరి నరేష్ పాత్ర కీలకం కానున్న సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వచ్చన మల్టి మిలియనీర్ మహేష్ ..ఓ సాధారణ రైతుగా టర్న్ తీసుకోవటానికి నరేష్ పాత్రే కేటలిస్ట్ గా పనిచేస్తుంది.
ఈ వారం రిలీజ్ అవుతున్న మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి లో అల్లరి నరేష్ పాత్ర కీలకం కానున్న సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వచ్చన మల్టి మిలియనీర్ మహేష్ ..ఓ సాధారణ రైతుగా టర్న్ తీసుకోవటానికి నరేష్ పాత్రే కేటలిస్ట్ గా పనిచేస్తుంది. దాంతో సినిమాని మలుపు తిప్పే ఆ పాత్ర తన కెరీర్ ని కూడా మలుపు తిప్పుతుందని నరేష్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా రిలీజ్ కాకమందే అతనికి వరసపెట్టి క్యారక్టర్ ఆర్టిస్ట్ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.
దాంతో ఇప్పుడే పరిస్దితి ఇలా ఉంటే మహర్షి రిలీజ్ అయ్యాక తనకు కంటిన్యూగా అవే ఆఫర్స్ వస్తాయోమో అని నరేష్ కంగారుపడుతున్నారట. కమిడియన్ గా నరేష్ ఈ మధ్యన వెనకబడ్డారు. దాంతో రూట్ మార్చారు. ఈ సినిమా ప్రభావంతో తనకు మళ్లీ పాత వైభవం వచ్చి కామెడీ సినిమాల్లో బిజీ అవుతానేమో అని ఆశపడ్డాడట. ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనకు ఆఫర్స్ వస్తే ఏం చేయాలి..నో చెప్పాలా..కాదనాలా అనే డైలమోలో ఉన్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
మరో ప్రక్క నరేష్ గత కొద్ది రోజులుగా కథలు వింటున్నారని, త్వరలోనే నరేష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం కావచ్చు అని టాక్. ఓ కొత్త డైరక్టర్ కు, తనతో గతంలో సినిమాలు చేసి హిట్ ఇచ్చిన డైరక్టర్ తోనూ సినిమాలు చేసేందుకు నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే వీటిలో ఏది ముందు మొదలవుతుందనేది తెలియాల్సి ఉంది.
Last Updated 7, May 2019, 7:45 PM IST | 0business
|
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
First Published 3, Mar 2019, 10:09 PM IST
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్
Recent Stories | 0business
|
Hyderabad, First Published 10, Apr 2019, 12:15 PM IST
Highlights
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన 'బద్లా' సినిమా విడుదలై ఘన విజయం నమోదు చేసింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన 'బద్లా' సినిమా విడుదలై ఘన విజయం నమోదు చేసింది. లాంగ్ రన్ లో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేసింది. తాప్సీ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు సంజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు.
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరినప్పటికీ ఎవరూ దీని గురించి మాట్లాడకపోవడంపై అమితాబ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
చిత్ర నిర్మాత కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, సినిమా పరిశ్రమకి చెందిన ఏ ఒక్కరూ కూడా బద్లా విజయం గురించి మాట్లాడడానికి ఒక్క క్షణం తీరిక కూడా లేదంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
ఏదైతేనేం సినిమా మంచి హిట్ అయిందని.. ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఇది చూసిన షారుక్.. మీరెప్పుడు పార్టీ ఇస్తారా..? అని ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు. రోజూ రాత్రిళ్లు మీ ఇంటి బయటే వేచి చూస్తున్నామని అమితాబ్ ని సముదాయించే ప్రయత్నం చేశారు.
... about time someone started talking about this silent success .. !! because neither the Producer, nor the distributor, nor the on line Producer, or any else in the Industry, in general .. has even spent a nano second to compliment the success of this film #Badla .. thk u https://t.co/nglxm4f9bH
— Amitabh Bachchan (@SrBachchan) April 9, 2019
Last Updated 10, Apr 2019, 12:15 PM IST | 0business
|
sumalatha 222 Views BCCI , RAVI SHASTRI , team india coach , Virat Kohli
Ravi Shastri- Virat Kohli
ముంబయి: బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఐదుగురిని ఇంటర్వ్యూ చేసి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రీనే కొనసాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా కోచ్గా రవిశాస్త్రిని నాలుగోసారి ఎంపిక చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. కపిల్దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతరంగస్వామి కమిటీ ఏకగ్రీవ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖఈ మాత్రం దానికి ఇంత హైరానా ఎందుకు. అతన్నే ఎంపిక చేయాలనుకున్నప్పుడు మిగిలిన వారికి ఇంటర్వ్యూలు చేయడం ఎందుకు?. ముందే ప్రకటించేస్తే సరిపోయేది కదాగ అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఈ నిర్ణయాన్నిజీర్ణించుకోలేకపోతున్న అభిమానులు ఘాటైన విమర్శలు చెస్తున్నారు. ఖటీమ్ ఇండియా 2015 వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్ కోల్పోయింది. ఇకపై 2020, 2021లలో జరిగే టీ20 ప్రపంచకప్లూ హుష్ కాకి అన్నమాట’ అని వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/national/ | 2sports
|
Vaani Pushpa 94 Views factory , Investment
factory
న్యూఢిల్లీ: ఫ్యాక్టరీ పెట్టుబడుల రేట్ 17 ఏళ్ల కనిష్టానికి చేరింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఈ రంగంలో పెట్టుబడులు మరింతగా క్షీణించినట్లు తేలింది. ఉపాధికార్మికుల వేతనాలు ఫ్యాక్టరీల్లోపెరిగాయి. అయితే కీలకరంగాల్లో ఉద్యోగాలు నష్టపోతున్నారు. జిఎస్టి ప్రవేశపెట్టిన సంవత్సరం నుంచి దేశంలోని ఫ్యాక్టరీలరంగంలో పెట్టుబడులు 22.4శాతం క్షీణించింది. స్థూల విలువల జోడింపులో ఈ మొత్తం తగ్గిందని అంచనా వేసారు. అయితే గత ఏడాది 2016-17 సంవత్సరంలో 27శాతంగా నమోదయింది. గడచిన 30 ఏళ్లలో స్థూల స్థిరమైన మూలదన కల్పన ఈ స్థాయినుంచి మొట్టమొదటిసారిగా క్షీణించిందని పరిశ్రమల వార్షికసర్వేలో వెల్లడి అయింది. స్థూలస్థిరమైన మూలధన కల్పన కింద ఫ్యాక్టరీల్లో పెట్టుబడులు 10.3శాతంగా ఉంది. 2016-17లో అత్యంత దారుణంగా పడిపోయింది. 2002-03తర్వాత ఇదే అతిపెద్ద క్షీణతగా చెపుతున్నారు. ఇక కార్మికులకు చెల్లించిన వేతనాల వాటా 13.1శాతం జివిఎలో పెరిగింది. 2017-18కి ముందు సంవత్సరంలో అయితే 12.7 శాతం నుంచి కొంతపెరిగింది. ఇక ఫ్యాక్టరీల్లో ఉపాధికల్పన 4.5నుంచి 5శాతంగా మాత్రమే ఉంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
యువరాజ్.. ఈ ఫొటోకు సమాధానం చెప్పు!
యువరాజ్ సింగ్... నువ్వు చెప్పింది ఓకేగానీ ఈ ఫొటోకు బదులివ్వు అంటూ నెటిజన్లు క్రికెటర్పై ఫైర్ అవుతున్నారు.
TNN | Updated:
Oct 15, 2017, 03:28PM IST
దీపావళి సందర్భంగా దేశ రాజధానిలో టపాసులు విక్రయించొద్దంటూ గతవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. టపాసుల అమ్మకాలపై నిషేధం విధించింది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దీనికి క్రికెటర్ యువరాజ్ సహా పలువురు సెలబ్రిటీలు మద్దతు పలికారు. కాలుష్య రహిత దీపావళిని జరుపుకుందామంటూ.. యువీ ఓ వీడియో‌ను ట్విట్టర్లో ఉంచి అభిమానులను అభ్యర్థించాడు.
ఈ విషయంలో చాలా మంది నెటిజన్లు యువరాజ్‌ను ప్రశంసించగా.. కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. అతడి పెళ్లి వేడుకల సందర్భంగా కాల్చిన టపాసుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. దీపావళికి మాత్రమే టపాసులు కాలుష్యాన్ని పెంచుతాయా? పెళ్లికి కాలిస్తే పొల్యూషన్ ఉండదా అంటూ.. ప్రశ్నలు సంధిస్తున్నారు. వివాహ రిసెప్షన్ సందర్భంగా చుట్టూ చిచ్చు బుడ్ల నుంచి వెలుగులు విరజిమ్ముతుండగా.. యువీ దంపతులు దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ.. క్రికెటర్ తీరును విమర్శిస్తున్నారు.
అదే సమయంలో యువీకి సన్నిహితుడైన వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం టపాసులు కాల్చడానికి మద్దతు పలికాడు. ఈ దీపావళి సంబరాలు మరింత ధూమ్ ధామ్‌గా హోరెత్తాలని భావించేవారు.. నా ట్వీట్‌ను రీ ట్వీట్ చేయడంటూ నెటిజన్లు పిలుపునిచ్చాడు. సెహ్వాగ్ పిలుపునకు స్పందనగా.. దాదాపు 30 వేల మంది ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. 39 వేల మందికిపైగా లైక్ కొట్టారు. యువరాజ్ ట్వీట్ కంటే దీనికి భారీ స్థాయిల స్పందన రావడాన్ని బట్టి.. ఢిల్లీ ప్రజలు ఈ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకోనున్నారో అర్థమవుతోంది కదూ. | 2sports
|
Hyderabad, First Published 16, Aug 2018, 11:34 AM IST
Highlights
బిగ్ బాస్ హౌస్ అనేది సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్. అందులో మనం బతకగలమా..? లేదా..? అనేది షోకి వెళ్లిన ప్రతి ఒక్కరికీ తెలుసుకునే ఛాన్స్ ఉంది. అక్కడ సరిగ్గా ఆహారం ఉండదు. నిద్ర సరిపోదు
బిగ్ బాస్ హౌస్ నుండి గత వారం బయటకి వచ్చేసిన బాబు గోగినేని ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బిగ్ బాస్ షోపై అలానే పరోక్షంగా కౌశల్ ఆర్మీపై కామెంట్స్ చేశారు. ఆర్మీ మీద ఇంట్రెస్ట్ ఉంటే భారత సైనిక దళంలో చేరమని సలహాలు ఇచ్చారు. ''బిగ్ బాస్ హౌస్ అనేది సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్. అందులో మనం బతకగలమా..? లేదా..? అనేది షోకి వెళ్లిన ప్రతి ఒక్కరికీ తెలుసుకునే ఛాన్స్ ఉంది.
అక్కడ సరిగ్గా ఆహారం ఉండదు. నిద్ర సరిపోదు. అక్కడకి వెళ్లిన వారందరూ కూడా బరువు తగ్గారు. మగాళ్లకు ఎమోషన్స్ ఉండవని అందరూ అనుకుంటారని దానికోసం బిగ్ బాస్ నలుగురిని ఏడవమన్నారు. అది విని నాకు నవ్వొచ్చింది. హౌస్ మేట్స్ లో కొందరిని అడాప్ట్ చేసుకొని వారినే గెలిపించడానికి ఆర్మీలు తయారయ్యాయి. అంత ఆసక్తిగా ఉంటే భారత సైన్యంలో చేరి సేవలు చేయొచ్చు కదా..
దేశానికి ఉపయోగపడుతుంది. ఇదొక షో.. అందులో ఎవరు గెలిస్తే ఏంటి..? వ్యక్తిగత దూషణలు ఎందుకు..? ఒకరినొకరు విమర్శించుకోవచ్చు. అవతలి వ్యక్తి నచ్చకపోతే చెప్పొచ్చు. తప్పులు చేస్తే ఎక్కడ చేశామో తెలుసుకోవాలి. ప్రెషర్ లో కూడా తప్పులు చేయకపోతే చప్పట్లు కొడతాం'' అంటూ చెప్పుకొచ్చారు.
Last Updated 9, Sep 2018, 12:23 PM IST | 0business
|
సీఐఐ నూతన ఛైర్మన్ ఉత్పల్ సేన్
Sdhamani| Last Modified గురువారం, 3 ఏప్రియల్ 2008 (15:22 IST)
భారతీయ పారిశ్రామిక సమాఖ్య-ఆంధ్రప్రదేశ్ (,సీఐఐ-ఏపీ) విభాగానికి ఛైర్మన్గా ఉత్పల్ సేన్ గుప్తా మరియు వైస్ ఛైర్మన్గా హరీష్ చంద్ర ప్రసాద్ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.
సీఐఐ-ఏపీ విభాగంలో ఏప్రిల్ ఒకటవ తేదీన జరిగిన వార్షిక సమావేశంలో ఉత్పల్ సేన్ గుప్తా, హరీష్ ప్రసాద్లు ఈ పదవులకు ఎన్నుకోబడ్డారు. ఛైర్మన్ పదవికి ఎన్నికవక ముందు ఉత్పల్ సేన్ ఆగ్రో టెక్ ఫుడ్స్ లిమిటెడ్కు ప్రెసిడెంట్గా కొనసాగారు. ఖరగ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న ఇతను దేశంలోని పలు పారిశ్రామిక సంస్థలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అంతేకాకుండా ఇతను రెండు దశాబ్దాల పాటు ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందూస్థాన్ లీవర్లో పనిచేశారు.
సీఐఐ-ఏపీకి వైస్ ఛైర్మన్గా ఎంపికైన హరీష్ ప్రసాద్ విద్యుత్తు, మౌలిక రంగాల్లో దిట్ట. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ ఉస్మానియాలో అభ్యసించారు. అనంతరం ఆయన న్యూయార్క్లోని బ్రూక్లిన్ కాలేజీలో మాస్టర్ డిగ్రీ పట్టా కూడా పొందారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
Suresh 104 Views
అశ్విన్పై విమర్శల వెల్లువ
న్యూఢిల్లీ: భారత సీనియర్ బౌలర్ అశ్విన్ మైదా నంలోనే సహచర క్రికెటర్తో గొడవకు దిగి ఏకం గా భౌతిక దాడికి ప్రయత్నించడం క్రికెట్ వర్గాల్లో సం చలనం కలిగిస్తుంది. కాగా తమిళనాడు ప్రీమి యర్లీగ్లో భాగంగా చెపాక్ సూపర్ గిల్లీస్, దిం డిగల్ డ్రాగన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వికెట్ తీసిన చెపాక్ బౌలర్ సాయి కిషోర్ పెవిలియన్కు వెళ్తున్న బ్యాట్స్మెన్ జగ దీశ్ను ఉద్దేశించి అసందర్భ వ్యాఖ్యలు చేశాడు. దీంతో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న దిండిగల్ కెప్టెన్ అశ్విన్ కోపంతో సాయి కిషోర్ను మైదానంలోనే గట్టిగావెనక్కి నెట్టుతూ కొట్టేంత పనిచేశాడు. అయితే అంపైర్లు, సహచర క్రికెటర్లు మధ్యలో కలుగజేసుకోవడంతో అశ్విన్ వెనక్కి తగ్గాడు.
కాగా ఈ మ్యాచ్లో చివరికి అశ్విన్ జట్టు ఆరు పరుగుల తేడాతోఓడిపోయింది. సీనియర్ క్రికెటర్ అశ్విన్ ఇలా యువఆటగాడితో గొడవకు దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. | 2sports
|
England, First Published 9, Sep 2018, 5:16 PM IST
Highlights
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆంధ్రా కుర్రాడు హనుమ విహారి అర్థశతకం సాధించాడు. 104 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్తో విహారి హాఫ్ సెంచరీ చేశాడు.
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆంధ్రా కుర్రాడు హనుమ విహారి అర్థశతకం సాధించాడు. 104 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్తో విహారి హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్లోనే అర్థశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు.
ఓవల్లో జరుగనున్న చివరి మ్యాచ్ కోసం పాండ్యాపై వేటు వేసి విహారికి అవకాశం ఇచ్చింది టీమ్ ఇండియా. దీంతో భారత్ తరపున టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన 292వ క్రికెటర్గా విహారి నిలిచాడు. అంతేకాకుండా ఆంధ్రా తరపున జాతీయ టెస్టు జట్టుకి ఆడుతున్న మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకు సీకే నాయుడు, ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్రా నుంచి ఎంపికయ్యారు.
Last Updated 9, Sep 2018, 5:17 PM IST | 2sports
|
అమెరికా సెక్స్ రాకెట్: పూనమ్ షాకింగ్ కామెంట్స్
Highlights
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్, సెక్స్ రాకెట్ వంటి విషయాలు హాట్ టాపిక్ గా మారాయి
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్, సెక్స్ రాకెట్ వంటి విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వహించిన భారతీయ జంట కిషన్, అతడి సతీమణి చంద్రకలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో అధికారులు కొందరు టాలీవుడ్ హీరోయిన్లను కూడా విచారించారు. ఈ విషయంపై ప్రముఖులు ఒక్కొక్కరుగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ కూడా ఈ విషయంపై స్పందించింది. అసలు కిషన్, చంద్రలు భార్యభర్తలే కాదని చెప్పింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించిన పూనమ్.. 'అమెరికాలో ఓ ఈవెంట్ కోసం వెళ్లగా.. నేను హోటల్ లో ఒంటరిగా ఉన్న సమయంలో కిషన్ కు చెందిన ఓ వ్యక్తి నా దగ్గరకి వచ్చాడు. నాకు తెలుగు అర్ధం కాదనుకొని ఎక్కువ మాట్లాడాడు. ఆ సమయంలో అతడి చెంప పగలగొట్టాను. డబ్బు ఎర చూపించడం, భయపెట్టడం వంటివి చేసి అమెరికాలో లొంగదీసుకుంటారు' అంటూ చెప్పుకొచ్చింది.
Last Updated 28, Jun 2018, 2:05 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఇంత చెత్తగానా.. మన బ్యాంకుల సేవలు!
ఆర్బీఐ వద్దకు కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి ఆర్టీఐ యాక్ట్ ద్వారా.. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలుసుకునే ప్రయత్నం చేయగా.. విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకింగ్ సేవల్లో నాణ్యత నానాటికీ దిగజారుతోందని, తమ గురించి అవి ఏమాత్రం పట్టించుకోవడంలేదనేది వినియోగదారుల ప్రధాన ఆరోపణ..
TNN | Updated:
Sep 18, 2017, 05:04PM IST
ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఆ సేవలూ.. ఈ సేవలూ అంటూ ఊదరగొడుతున్న బ్యాంకులు.. కస్టమర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఆ బ్యాంకూ.. ఈ బ్యాంకూ అని కాకుండా.. దేశంలోని అన్ని బ్యాంకుల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ఆర్‌బీఐ వద్దకు కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి ఆర్‌టీఐ యాక్ట్ ద్వారా.. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలుసుకునే ప్రయత్నం చేయగా.. విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకింగ్ సేవల్లో నాణ్యత నానాటికీ దిగజారుతోందని, తమ గురించి అవి ఏమాత్రం పట్టించుకోవడంలేదనేది వినియోగదారుల ప్రధాన ఆరోపణ.
2016 జనవరి 1 నుంచి 2017 జనవరి 1 వరకు దేశంలోని వివిధ బ్యాంక్ ఖాతాదారుల నుంచి ఆర్‌బీఐకి మొత్తం 1,24,477 ఫిర్యాదులు అందాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో 77,162 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినవి కాగా.. 47,315 ప్రైవేట్ బ్యాంక్‌లకు చెందినవి. | 1entertainment
|
Nov 09,2018
భారత్ వృద్ధిరేటు తగ్గొచ్చు: మూడీస్
న్యూఢిల్లీ: రుణ లభ్యత భారం, వడ్డీరేట్లలో పెరుగు దల కారణంగా సమీప భవిష్య త్తులో భారత వృద్ధి రేటు కుంగే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెష్టర్ సర్వీస్ సంస్థ అభిప్రాయ పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ంలో భారత్ 7.4 శాతం వృద్ధిని అందుకోవచ్చన్న సంస్థ.. రానున్న సంవత్సరాల్లో ఇది 7.3 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. రుణాల లభ్యత వ్యయంలో వృద్ధి పాటు.. పెరుగు తున్న వృడ్డీరేట్ల కారణంగా ఆర్థిక వ్యవస్థ తగిన డిమాండ్ను అందుకో వడంలో వెనుకబడొచ్చని మూడీస్ తెలిపింది. 'గ్లోబల్ మైక్రో అవుట్ లుక్-2019-20' పేరుతో విడుదల చేసిన తాజా నివేదికలో సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాంగంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.9 శాతం వృద్ధితో రాణించిందని పేర్కొంది. నోట్లరద్దు వల్ల ఏర్పడిన తక్కువ బేస్ వల్లే మెరుగైన వృద్ధి కనిపిస్తోన్నట్టుగా వెల్లడించింది. ఈ వృద్ధి రెండో అర్ధభాగంలోనూ కనిపించే ఆస్కారం ఉందని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 7.3 శాతానికి, 2020కి వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదు కావచ్చొని విశ్లేషించింది. భారత ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకుల నుంచి ప్రధానంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టుగా మూడీస్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, వేగంగా తగ్గిపోతున్న రూపాయి మారకపు విలువలు దేశంలో సగటు వ్యక్తి జీవన వ్యయాన్ని పెంచుతున్నాయని మూడీస్ తెలిపింది. దీని ప్రభావం కారణంగా ఇతర రంగాలపై భారతీయులు పెట్టే వ్యయం తగ్గొచ్చని అభిప్రాయపడింది. కఠినమైన పరపతి విధానం వల్ల రుణాలు భారంగా మారుతున్నాయని తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
రేవంత్ బాహుబలి ఫోటోకు సాహోరే అంటున్న వర్మ
Highlights
రేవంత్ పార్టీ ఫిరాయింపుపై వర్మ స్పందన
రేవంత్ కాంగ్రెస్ కు ఓట్ల వర్షం కురిపించే బాహుబలి అంటున్న వర్మ
తాజాగా రేవంత్ బాహుబలి మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేసిన వర్మ
రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలను నిషితంగా గమనిస్తున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే రేవంత్ చేరికతో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం మరింత పెరిగిందన్న వర్మ.. ఏకంగా రేవంత్ ను బాహుబలితో పోల్చిన సంగతి తెలిసిందే. వర్మ తాజాగా బాహుబలి గెటప్ లో మార్ఫింగ్ చేయించిన రేవంత్ రెడ్డి ఫోటోను తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో పోస్ట్ చేసి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు. సాహోరే బాహుబలి రేవంత్ రెడ్డి అంటున్నాడు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
MS Dhoni రోల్ టీ20 వరల్డ్కప్లో నాకివ్వండి: దినేశ్ కార్తీక్
టీ20 వరల్డ్కప్లో ధోనీ ఆడే అవకాశాలు లేకపోవడంతో టీమ్ ఫినిషర్ బాధ్యతని తాను తీసుకుంటానని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. వరల్డ్కప్ తర్వాత భారత్ జట్టులోకి రీఎంట్రీ కోసం కార్తీక్ ఎదురుచూస్తున్నాడు.
Samayam Telugu | Updated:
Nov 7, 2019, 03:29PM IST
MS Dhoni రోల్ టీ20 వరల్డ్కప్లో నాకివ్వండి: దినేశ్ కార్తీక్
ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్లో ఫినిషర్ రోల్ని తాను పోషిస్తానని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జట్టుకి దూరమైపోయిన దినేశ్ కార్తీక్ ఇటీవల దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించాడు. తాజాగా ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 59.71 సగటుతో 418 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్ తమిళనాడు టీమ్ టోర్నీ ఫైనల్కి చేరడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.
Read More: ఐపీఎల్లో KXIP కెప్టెన్ అశ్విన్ వేరొక టీమ్కి బదిలీ
వరల్డ్కప్ తర్వాత మహేంద్రసింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్లను పూర్తిగా పక్కన పెట్టేసిన భారత సెలక్టర్లు వరుసగా రిషబ్ పంత్ (వన్డే, టీ20), సాహా (టెస్టు)కి అవకాశాలిస్తున్నారు. తాజాగా రేసులోకి సంజు శాంసన్ కూడా రావడంతో దినేశ్ కార్తీక్ మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయడం కష్టంగా కనిపిస్తోంది. కానీ.. వచ్చే ఏడాదిలోపు మళ్లీ తాను జట్టులోకి రీఎంట్రీ ఇస్తానని దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు.
Read More: రనౌట్.. తల బాదుకున్న పాకిస్థాన్ టీ20 కెప్టెన్
‘టీ20 ప్రపంచకప్ జట్టులో నాకు తప్పకుండా అవకాశం లభిస్తుంది. ఆ టోర్నీలో ఫినిషర్ రోల్ని నేను పోషిస్తా. జట్టు మెరుగైన స్కోరుకి తోడ్పాటుని అందించడంతో పాటు మిడిలార్డర్ బలోపేతానికి ప్రయత్నిస్తా’ అని దినేశ్ కార్తీక్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకూ భారత క్రికెట్లో ఫినిషర్ అంటే మహేంద్రసింగ్ ధోనీనే గుర్తుకు వస్తాడు. కానీ.. టీ20 ప్రపంచకప్లో అతను ఆడటంపై అనుమానాలు నెలకొనడంతో.. దినేశ్ కార్తీక్ ఆ రోల్పై కన్నేసినట్లు తెలుస్తోంది.
Read More: ధోనీ వివాదంతో ఐపీఎల్లో ఇక ‘నోబాల్’ అంపైర్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Rahul Bigg Boss 3 Winner: బిగ్ బాస్ విజేతగా రాహుల్.. శ్రీముఖికి బిగ్ షాక్
బిగ్ బాస్ సీజన్ 3 విజేత ఎవరన్న ఉత్కంఠకు తెరపడినట్టే. సీజన్ మొత్తం టైటిల్ ఫేవరేట్గా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీముఖి వెనక్కినెట్టి విన్నర్గా అవతరించాడు రాహుల్.
Samayam Telugu | Updated:
Nov 3, 2019, 10:32PM IST
రాహుల్ సిప్లిగంజ్
105 రోజుల బిగ్ బాస్ ఆటకు నేటి రాత్రితో తెరపడనుంది. నాగార్జున హోస్ట్గా 17 మంది కంటెస్టెంట్స్తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో ఆదివారం నాడు విజేతను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఫైనల్లో రాహుల్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీలు ఉండగా.. శ్రీముఖి, రాహుల్ల మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే అనూహ్యంగా చివర్లో శ్రీముఖికి గట్టి షాక్ ఇచ్చి.. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్ అవతరించినట్టు తెలుస్తోంది. నేటి రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ షూట్ పూర్తి కావడంతో విన్నర్ ఎవరన్న లీక్ బయటకు వచ్చేసింది. శ్రీముఖి రన్నరప్ టైటిల్తో సరిపెట్టుకోగా రాహుల్ని విజేతగా ప్రకటించనున్నట్టు సమాచారం.
Read Also: రాహుల్ విన్నర్.. ‘బిగ్ బాస్’ చేతుల మీదుగా టైటిల్
యాంకర్ శ్రీముఖి తొలి నుండి టాస్క్లతో పాటు పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకుంటూ టైటిల్ రేస్లో తానే నంబర్గా నిలుస్తోంది. ఇక ఆమెకు బయట కూడా అభిమానగనం ఘనంగా ఉండటంతో ఆమెదే టైటిల్ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. అయితే ఏ మాత్రం అంచనాలు లేకుండా ఫైనల్లోకి వచ్చిన రాహుల్ అనూహ్యంగా చివరి వారాల్లో పుంజుకున్నారు.
Read Also: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లైవ్ అప్డేట్స్: వాళ్ల లైఫ్ సెటిల్
శ్రీముఖితో వైరం.. పాతబస్తీ పోరడు.. ఎక్కువ సార్లు నామినేట్ అయిన కంటెస్టెంట్గా ఆడియన్స్లో సింపథీ గెయిన్ చేసుకున్నారు రాహుల్. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 14 వారాల్లో (15 వారంలో నామినేషన్స్ లేవు) 11 సార్లు నామినేషన్లోకి వెళ్లి.. ఈ సీజన్లో ఎక్కువ సార్లు నామినేట్ అయ్యి సేవ్ అయిన కంటెస్టెంట్ అయ్యాడు. టాస్క్లు ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల కెప్టెన్ కూడా కాలేకపోయాడు రాహుల్. అయితే విన్నర్ కావడానికి ఇవేమీ అవసరం లేదని రుజువుచేశాడు రాహుల్. తన నేటివిటీని ఒరిజినాలిటీని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ తను బార్బర్ అనే విషయాన్ని ప్రమోట్ చేసుకుని సెంటిమెంట్ వర్కౌట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్. బిగ్ బాస్ విన్నర్ అయితే వచ్చిన రూ. 50 లక్షలతో ఏం చేస్తావ్ అంటే.. ఓ బార్బర్ షాప్ పెడతా.. నా కుల వృత్తిని నేను వదులు కోను. అది చేయడానికి గర్వపడతా అంటూ రాహుల్ చెప్పిన మాటలు ఆ వర్గం వారికి బాగా కనెక్ట్ అయ్యింది.
Read Also: బిగ్ బాస్ ఫైనల్: అలీ రెజా ఔట్.. ‘11’తో పనికాలేదు
దీంతో పాటు శ్రీముఖిని విజేతను చేసేందుకు బిగ్ బాస్ వాళ్లతో కుమ్మక్కు అయ్యారనే విషయం జనంలోకి బాగా వెళ్లిపోవడంతో రాహుల్కి బాగా కలిసి వచ్చింది. వాళ్లు విజేతను ప్రకటించడం ఏంటి? ఓట్లు వేయాల్సింది మేం కదా.. అని ఆడియన్స్ గంపగుత్తగా ఓట్లు రాహుల్కి గుద్దేశారు. ఇంకా బాబా భాస్కర్, వరుణ్, అలీలు ఉన్నారు కదా.. వాళ్లకు ఎందుకు ఓట్లు పడలేదు అంటే.. రాహుల్కి శ్రీముఖితో ఉన్న వైరం అతనికి వరంలా మారింది. 11 వారాలు వరుస నామినేషన్స్తో పడుతూ లేస్తూ వస్తున్న రాహుల్కే జనం జై కొట్టారు.
Read Also: బిగ్ బాస్ నుంచి బాబా ఔట్.. రూ.25 లక్షలు పాయే
ఇదిలా ఉంటే తెలుగు సమయం నిర్వహించిన పోల్లోనూ శ్రీముఖి కంటే రాహుల్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. నిన్నటి వరకూ ఈ ఇద్దరికీ టై కాగా.. చివరి రోజున రాహుల్ పుంజుకుని కేవలం ఒక్క శాతం ఓట్లుతో ముందంజలో ఉన్నారు. రాహుల్ సిప్లిజంగ్ 32 శాతం ఓట్లు సాధించి తొలి స్థానంలో ఉండగా.. శ్రీముఖి 31 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక బాబా భాస్కర్ 19 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉండగా.. వరుణ్ సందేశ్ నాలుగో స్థానంలో ఉన్నారు. అలీ రెజా 4 శాతం ఓట్లతో చివరి స్థానంతో సరిపెట్టుకున్నారు.
Note: ఈ రిజల్ట్ పోల్ ఆధారంగా, బిగ్ బాస్ లీక్ల ఆధారంగా ఇచ్చింది మాత్రమే. అధికారికంగా విజేత ఎవరో తెలియాలంటే మరికొన్నిగంటలు ఆగాల్సిందే.
Read Also: బిగ్ బాస్ విన్నర్పై వదంతులు నమ్మొద్దు: నాగ్ షాకింగ్ ట్వీట్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
కోహ్లీ తీరు ఆసీస్ ఆటగాళ్లతో పోలి ఉందా ?
కోహ్లీ ఆటతీరుపై మరో ఆసీస్ క్రికెటర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
TNN | Updated:
May 31, 2016, 04:43PM IST
ముంబై: కోహ్లీ ఆటతీరుపై మరో ఆసీస్ క్రికెటర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ లో వ్యాఖ్యతగా వ్యవహరించిన ఆసీస్ మాజీ ఓపెనర్ హెడెన్ మాట్లాడుతూ కోహ్లీ ఆటతీరు ఆసీస్ ఆటగాళ్లను పోలి ఉంటుందన్నాడు. కోహ్లీ ఆడుతున్న తీరులో దూకుడు, టెక్నిక్, పవర్, నిలకడ కలగలిపి ఉంటాయని హెడెన్ కితాబిచ్చాడు. అదే అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందన్నాడు. ఆసీస్ అటగాళ్లు కూడా ఇదే రకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారని .. అందుకే కోహ్లీ ఆటతీరును తామంతా ఇష్టపడతామని హెడెన్ తన మనసులో మాటను బయటపెట్టాడు. అంతకు ముందు ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా కోహ్లీని డివిలియర్స్ తో పోల్చుతూ ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు కోహ్లీయే అని ప్రశంసించిన విషయం తెలిసిందే. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కూతురి ఫొటోతో అల్లు అర్జున్ రిపబ్లిక్ డే ట్వీట్
అల్లు అర్జున్ తనదైన స్టయిల్లో అభిమానులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
TNN | Updated:
Jan 26, 2017, 10:45AM IST
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్టయిల్లో అభిమానులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. తన కుమార్తె అర్హను జాతీయ పతాకం పక్కన పడుకోబెట్టి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. అల్లు అర్హ నుంచి ప్రత్యేకంగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు పాజిటివ్‌గా రియాక్ట్ కాగా.. కొందరు మాత్రం అనూహ్యంగా షాకిచ్చారు. ఈ రోజు ఆంధ్ర ప్రజలు నిజంగా ఆనందంగా రిపబ్లిక్ డే వేడులకు జరుపుకొంటున్నారని మీరు అనుకుంటున్నారా అంటూ అల్లు అర్జున్‌ను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదని విమర్శించారు.
Happy Republic Day ! Spl wishes from ALLU ARHA ! pic.twitter.com/tUs4MvwIkt
— Allu Arjun (@alluarjun) January 26, 2017
తన పేరు, తన భార్య పేరు కలిసి వచ్చేలా తన కుమార్తెకు అర్హ అని పేరు పెట్టినట్లు అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందు మతం ప్రకారం అర్హ అంటే శివుడు అని, ఇస్లాం ప్రకారం.. ప్రశాంతమైన, నిర్మలమైన అని అర్థమని డిసెంబర్ 25 స్టయిల్ స్టార్ చెప్పుకొచ్చారు. | 0business
|
First Published 14, Mar 2019, 1:28 PM IST
RRR: భారీ తారాగణం వీరే
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్
కొమరం భీం గా ఎన్టీఆర్
ఎన్టీఆర్ కి జంటగా.. విదేశీ భామ డైసీ ఎడ్గర్ జోన్స్
చరణ్ కి జోడీగా సీత పాత్రలో అలియా భట్
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అజయ్ దేవగన్
కీలక పాత్రలో తమిళ నటుడు సముద్రఖని
నిర్మాత దానయ్య | 0business
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
ఫోటోస్: శ్రీదేవి మృతికి సినీ తారల నివాళి
First Published 28, Feb 2018, 1:16 PM IST
ఫోటోస్: శ్రీదేవి మృతికి సినీ తారల నివాళి
ఫోటోస్: శ్రీదేవి మృతికి సినీ తారల నివాళి
ఫోటోస్: శ్రీదేవి మృతికి సినీ తారల నివాళి
ఫోటోస్: శ్రీదేవి మృతికి సినీ తారల నివాళి
ఫోటోస్: శ్రీదేవి మృతికి సినీ తారల నివాళి
ఫోటోస్: శ్రీదేవి మృతికి సినీ తారల నివాళి
ఫోటోస్: శ్రీదేవి మృతికి సినీ తారల నివాళి
ఫోటోస్: శ్రీదేవి మృతికి సినీ తారల నివాళి
ఫోటోస్: శ్రీదేవి మృతికి సినీ తారల నివాళి
Recent Stories | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
తెలుగు టైటాన్స్ తొలిపోరు రేపే
దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ప్రొ కబడ్డీ రేపటి నుంచే ప్రారంభం కానుంది.
TNN | Updated:
Jun 24, 2016, 01:18PM IST
దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ప్రొ కబడ్డీ రేపటి నుంచే ప్రారంభం కానుంది. వారం రోజులపాటు ఎనిమిది జట్లు అసలైన కబడ్డీ మజా పంచనున్నాయి. శనివారం రాత్రి 8 గంటలకు ముంబయిలో ప్రారంభం కానున్న తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు పుణేరి పల్టాన్ను ఢీకొట్టనుంది. 2014లో ప్రొకబడ్డీ లీగ్ ఆరంభమైన నాటి నుంచే అత్యధిక వ్యూయర్షిప్ సాధించింది. ఐపీఎల్ తర్వాత దేశంలో ఎక్కువ మంది వీక్షించే లీగ్గా ప్రొకబడ్డీ గుర్తింపు పొందింది. 2014లో మూడో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ జట్టు ఈసారి టైటిల్ సాధిస్తామనే ధీమాతో ఉంది. తొలి రెండు సంవత్సరాల్లో ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ లీగ్ను నిర్వహించగా, ఈ ఏడాది నుంచి సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
MS Dhoniకి విశ్రాంతి.. భారత్లో ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడా?
ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు వన్డేలకు ధోనీకి విశ్రాంతి కల్పించారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ తర్వాత మహీ రిటైరైతే.. భారత్లో చివరి వన్డే ఆడేశాడని భావించొచు.
| Updated:
Mar 8, 2019, 10:30PM IST
MS Dhoniకి విశ్రాంతి.. భారత్లో ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడా?
హైలైట్స్
ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు వన్డేలకు ధోనీకి విశ్రాంతి కల్పించారు.
బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.
వరల్డ్ కప్ తర్వాత మహీ రిటైరైతే.. భారత్లో చివరి వన్డే ఆడేశాడని భావించొచు.
ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు వన్డేల్లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడబోవడం లేదు. మహీకి విశ్రాంతి ఇస్తున్నట్టు భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. రాంచీ వన్డేలో ఆసీస్ చేతిలో భారత్ 32 పరుగులతో ఓడాక.. మీడియాతో మాట్లాడిన బంగర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. మహీ స్థానంలో రిషబ్ పంత్ చివరి రెండు వన్డేల్లో ఆడనున్నాడు. వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్న సంగతి తెలిసిందే. పని భారం వల్ల ఒత్తిడి లేకుండా చూడటం కోసం ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని కోహ్లి బోర్డుకు గతంలో సూచించాడు.
గత ఏడాది 20 మ్యాచ్ల్లో 275 పరుగులు మాత్రమే చేసిన ధోనీ.. 2019ని ఘనంగా ఆరంభించాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి.. ఆసీస్ గడ్డ భారత్ తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు.
న్యూజిలాండ్ టూర్లో ధోనీకి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కివీస్ టూర్లో బుమ్రాకి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. ఆ జట్టుతో జరిగిన చివరి రెండు వన్డేలు, టీ20 సిరీస్ నుంచి కోహ్లికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
MS Dhoni won’t be featuring in the final two ODIs. Hope this is not the final time we’ve seen MSD playing internat… https://t.co/Cs86nS3C37
— Sarang Bhalerao (@bhaleraosarang) 1552063129000
వరల్డ్ కప్ తర్వాత ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్ భారత గడ్డపై మహీకి చివరి వన్డే అయ్యే అవకాశం ఉంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyd Internet 88 Views Chahal
Chahal
చెన్నై: టీమిండియా జట్టు సారథి విరాట్కోహ్లి లాంటి వేగవంతమైన ఆటతీరు ప్రదర్శించే వ్యక్తి నేతృత్వంలో ఆడడం తనకు చాలా ఆనందంగా ఉందని భారత లెగ్స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ అన్నాడు. కానీ దూకుడు ఎక్కువున్న కెప్టెన్ నాయకత్వంలో ఆడుతున్నపుడు తాము కూడా అదే తీరులో దూసుకుపోగలమని ఆయన అన్నారు. ధోని, పాండ్య అద్భుతంగా బ్యాటింగ్ చేశారని చాహల్ చెప్పారు. | 2sports
|
త్వరలోనే నోటిఫికేషన్
Santosh Kumar Gangwar
న్యూఢిల్లీ: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8.65 శాతానికి పెంచనున్నట్టు ఆ శాఖా మంత్రి సంతోశ్ అగర్వాల్ పేర్కొన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. 2018-19 సంవత్సరానికి గాను పీఎఫ్పై 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్లోనే ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సుముఖత వ్యక్తం చేసింది. ఆదాయ పన్ను విభాగం, కార్మిక శాఖ సంయుక్తంగా నోటిఫై చేస్తే ఇది అమల్లోకి వస్తుంది. ప్రకటన విడుదలైన వెంటనే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అవుతుంది. కాగా, ప్రస్తుతం పీఎఫ్పై 8.55 శాతం వడ్డీ లభిస్తుండగా, ఇకపై 8.65 శాతం లభించనుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/sports/ | 1entertainment
|
internet vaartha 153 Views
ముంబై : టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు మరోసారి కలుసుకున్నారు. వీరు ముంబై విమానాశ్రయంలో కనిపించారని వార్తలు గుప్పుమన్నాయి. విమానాశ్రయంలో ఉన్న అనుష్కను కలుసుకునేందుకు కోహ్లీ ప్రత్యేకంగా వచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు, వీరిద్దరు గుడ్ బై కిస్ ఇచ్చుకున్నారు. ఇరువురు కూడా విడిపోయేటప్పుడు గుడ్ బై చెప్పుకుని ముద్దులు కురిపించుకున్నారు. కోహ్లీ, అనుష్క చాలా కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులక్రితం ఇరువురి మధ్య విభేదాలువచ్చినట్లు కనిపించింది. ఆ తరువాత మళ్లీ ఒకటయ్యారు. ఇప్పుడు ఇరువురు ముద్దులు ఇచ్చుకోవడంపై మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. | 2sports
|
జూన్ 30న గంటా రవి, జయంత్ సి.పరాన్జీల 'జయదేవ్'
Highlights
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా 'జయదేవ్'
జూన్ 30న గంటా రవి, జయంత్ సి.పరాన్జీల 'జయదేవ్' చిత్రం విడుదలకు ఏర్పాట్లు
డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా రవి ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటున్న నిర్మాత అశోక్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం 'జయదేవ్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కె.అశోక్కుమార్ మాట్లాడుతూ - ''గంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ మా బేనర్లో నిర్మిస్తున్న 'జయదేవ్' చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నాం. డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా రవి ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. జయంత్ ప్రతి సీన్ని అద్భుతంగా తీశారు. ఎమోషనల్ సీన్స్గానీ, ఫైట్స్గానీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. మా 'జయదేవ్' చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధించి మా అందరికీ మంచి పేరు తెస్తుంది'' అన్నారు.
దర్శకుడు జయంత్ సి. పరాన్జీ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో ఆడియన్స్ని థ్రిల్ చేసే పది భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వున్నాయి. యాక్షన్ సీన్స్లో రవి పెర్ఫార్మెన్స్ అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమాతో గంటా రవి హీరోగా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు'' అన్నారు.
హీరో గంటా రవి మాట్లాడుతూ - ''నా మొదటి సినిమానే జయంత్గారులాంటి పెద్ద డైరెక్టర్తో చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. అన్ని విషయాల్లోనూ నన్ను సపోర్ట్చేసి సినిమా బాగా రావడానికి జయంత్గారు సహకరించారు. నేను బాగా పెర్ఫార్మ్ చేసానంటే అది జయంత్గారి గొప్పతనమే. ఈ సినిమా నాకు హీరోగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్, హరితేజ, శ్రావణ్, సుప్రీత్, కోమటి జయరామ్, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్, అరవింద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్రెడ్డి, మూల కథ: అరుణ్కుమార్, రచన: పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: కృష్ణమాయ, స్టిల్స్ నారాయణ, కో-డైరెక్టర్: ప్రభాకర్ నాగ్, ప్రొడక్షన్ కంట్రోలర్: పి.రామమోహన్రావు, నిర్మాత: కె.అశోక్కుమార్, దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ.
Last Updated 25, Mar 2018, 11:45 PM IST | 0business
|
Hyderabad, First Published 1, Apr 2019, 12:59 PM IST
Highlights
పీకలదాకా మద్యం తాగి... వాహనం నడుపుతూ పోలీసులకు అడ్డంకా బుక్కయ్యాడు ఓ క్రికెటర్.
పీకలదాకా మద్యం తాగి... వాహనం నడుపుతూ పోలీసులకు అడ్డంకా బుక్కయ్యాడు ఓ క్రికెటర్. టీం శ్రీకలంక కెప్టెన్ దిముత్ కరుణారతనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్టు అయ్యారు. ఆదివారం ఆయన మద్యం తాగి.. వాహనం నడుపుతూ యాక్సిడెంట్ చేశారు. ఈ క్రమంలో ఒకరు తీవ్రగాయాలపాలయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కరుణారతన్ ని అరెస్టు చేశారు.
కాగా.. ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు అయ్యిందని పోలీసులు చెప్పారు. సోమవారం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆయనపై ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలసారి. ఈ విషయం గురించి స్పందిచడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. కాగా.. కరుణాతరన్ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి లీగల్ ప్రాసెస్ లో బిజీగా ఉన్నారు.
కెప్టెన్ గా కరుణారతనేకి మంచి పేరు ఉంది. ఆయన సారథ్యంలో శ్రీలంక జట్టు గత నెలలో దక్షిణాఫ్రికా జట్టు మీద రెండు టెస్టు సిరీస్ లు కైవసం చేసుకుంది. ఆఫ్రికా నేషన్ లో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఏషియన్ టీంగా కరుణారతనే సారథ్యం వహించిన శ్రీలంక జట్టు నిలిచింది. ఈయన ఇప్పటి వరకు 60 టెస్టు మ్యాచ్ లు ఆడారు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఐపీఎల్ ప్రసారాలను అడ్డుకోనున్న పాకిస్థాన్..!
పీఎస్ఎల్ సమయంలో భారత్కి చెందిన ప్రసార కంపెనీలు, ప్రభుత్వం పాకిస్థాన్ క్రికెట్పై వివక్ష చూపాయి. ఇప్పుడు మేము ఎందుకు ఐపీఎల్ని ఉపేక్షించాలి. మేము రాజకీయాల్ని, క్రికెట్ను కలపకూడదని అనుకున్నాం. కానీ.. ? -పాక్ మంత్రి
Samayam Telugu | Updated:
Mar 21, 2019, 06:36PM IST
ఐపీఎల్ ప్రసారాలను అడ్డుకోనున్న పాకిస్థాన్..!
హైలైట్స్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్లో పీఎస్ఎల్ మ్యాచ్ ప్రసారాలు నిలిపివేత
ఐపీఎల్ మ్యాచ్ ప్రసారాలను పాక్లో అడ్డుకుంటామని పాక్ మంత్రి తాజాగా ప్రకటన
రాజకీయాలు, క్రీడల్ని తొలుత కలిపింది భారత్ అంటూ ఆరోపణలు
పాక్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడుకున్నా.. భారీగా ఆ దేశం నుంచి వీక్షకులు
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మ్యాచ్ ప్రసారాలను డీస్పోర్ట్స్ నిలిపివేయగా.. తాజాగా పాకిస్థాన్ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. ఈ టోర్నీ మ్యాచ్లు పాక్లో ప్రసారం చేయడానికి వీల్లేదని ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్ అహ్మద్ చౌదరీ హుకం జారీ చేశాడు.
ఐపీఎల్ 2019 సీజన్ పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి..!
ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అసువులు బాసిన నేపథ్యంలో ఆ రోజు నుంచి టోర్నీ ముగిసే వరకూ అంటే మార్చి 17 వరకూ పీఎస్ఎల్ మ్యాచ్లను భారత్లో డీస్పోర్ట్స్, ఐఎంజీ రిలయన్స్ ప్రసారం చేయలేదు. దీంతో.. అప్పట్లో ఘాటు విమర్శలు గుప్పించిన పాకిస్థాన్.. ఇప్పుడు బదులు తీర్చుకోవడానికి సిద్ధపడుతోంది. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో పాకిస్థాన్ క్రికెటర్లను టోర్నీలో ఆడేందుకు అనుమతిచ్చిన భారత్.. ముంబయి దాడుల తర్వాత వారిని ఐపీఎల్లోకి అనుమతించడం లేదు. దీంతో.. గత పదేళ్లుగా ఐపీఎల్కి దూరంగానే పాక్ క్రికెటర్లు ఉంటున్నారు.
‘పీఎస్ఎల్ సమయంలో భారత్కి చెందిన ప్రసార కంపెనీలు, ప్రభుత్వం పాకిస్థాన్ క్రికెట్పై వివక్ష చూపాయి. ఇప్పుడు మేము ఎందుకు ఐపీఎల్ని ఉపేక్షించాలి. మేము రాజకీయాల్ని, క్రికెట్ను కలపకూడదని అనుకున్నాం. కానీ.. భారత్ జట్టు ఆస్ట్రేలియాపై ఆర్మీ క్యాప్లు ధరించి మరీ మ్యాచ్ ఆడింది. దీనిపై ఐసీసీ నుంచి ఎలాంటి చర్యలూ లేవు. ఐపీఎల్ను పాకిస్థాన్లో ప్రసారం చేయనివ్వకపోతే.. అది కచ్చితంగా భారత క్రికెట్కి నష్టం చేకూరుస్తుంది. అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ ఓ సూపర్ పవర్’ అని చౌదరీ వెల్లడించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
today 22ct 24ct gold silver price in hyderabad 20th september 2019
Today Gold Rate: గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర!
బంగారం ధర పడిపోతూనే వస్తోంది. పసిడి ధర దిగొస్తే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. దేశీ మార్కెట్లో బంగారం ధర తగ్గితే గ్లోబల్ మార్కెట్లో మాత్రం రేట్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి.
Samayam Telugu | Updated:
Sep 20, 2019, 07:38AM IST
హైలైట్స్
వెండి ధర మాత్రం స్థిరం
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పైకి
1,509 డాలర్ల సమీపంలో కదలిక
పసిడి ధర మళ్లీ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 తగ్గుదలతో రూ.39,040కు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లో బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.320 తగ్గుదలతో రూ.35,790కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.48,765 వద్దనే నిలకడగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. | 1entertainment
|
Suresh 194 Views
ముంబై ఇండియన్స్ స్కోరు 189
మొహలీలో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్లో పంజాబ్ జట్టు విజయం సాధించాలంటే 190 పరుగులు చేయాల్సి ఉంది. తొలుత టాస్గెలిచిన పంజాబ్జట్టు ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ విజయలక్ష్యం 190 పరుగుల చేయాల్సి ఉంది. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL 2019: కోల్కతా నైట్రైడర్స్ ప్రయోగం.. మళ్లీ ఓపెనర్గా మిస్టరీ స్పిన్నర్..?
శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్లు మొదలుకానుండగా.. కోల్కతా నైట్రైడర్స్ ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో తొలి మ్యాచ్ ఆడనుంది. గత ఏడాది ప్రయోగాత్మక ఓపెనర్గా ఆడిన సునీల్ నరైన్ ఏకంగా 357 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
Samayam Telugu | Updated:
Mar 21, 2019, 02:25PM IST
IPL 2019: కోల్కతా నైట్రైడర్స్ ప్రయోగం.. మళ్లీ ఓపెనర్గా మిస్టరీ స్పిన్నర్..?
హైలైట్స్
ఐపీఎల్ 2018 సీజన్లో ఓపెనర్ అవతారమెత్తిన సునీల్ నరైన్
క్రిస్లిన్ గాయపడటంతో దక్కిన అవకాశం.. పవర్ ప్లేలో బౌండరీల మోత
బౌలింగ్లోనూ 17 వికెట్లు పడగొట్టిన మిస్టరీ స్పిన్నర్
2019 ఐపీఎల్ సీజన్లోనూ సునీల్ నరైన్ ఓపెనర్గా కొనసాగే అవకాశం
ఐపీఎల్ 2019 సీజన్లోనూ కోల్కతా నైట్రైడర్స్ టీమ్ తమ ఓపెనింగ్ జోడీలో ప్రయోగాలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 2018 సీజన్లో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ను ప్రయోగాత్మక ఓపెనర్గా కోల్కతా ఆడించగా.. అతను ప్రొఫెషనల్ ఓపెనర్ కంటే మెరుగ్గా రాణించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తొలి పవర్ప్లేలో ఫీల్డర్ల పరిమితుల్ని సొమ్ము చేసుకున్న సునీల్ నరైన్ తనదైన హిట్టింగ్తో బౌండరీల మోత మోగించాడు. ఎంతలా అంటే.. అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్కి పోటీనిస్తూ సీజన్లో ఏకంగా 357 పరుగులు చేశాడు. బ్యాట్తోనే కాదు.. బంతితోనూ రాణించిన ఈ మిస్టరీ స్పిన్నర్ 17 వికెట్లు పడగొట్టి.. ఆల్రౌండర్గా ఎదిగాడు. శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్లు మొదలుకానుండగా.. కోల్కతా నైట్రైడర్స్ ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో తొలి మ్యాచ్ ఆడనుంది. | 2sports
|
M S Dhoni
పల్లెకలె: పల్లెకలె రెండో వన్డేలో 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత తుది జట్టు వరకూ పోరాడి శ్రీలంకపై విజయం సాధించింది. బారత్ నిర్ణీత 44.2 ఒవర్లో 7 వికెట్ట నష్టానికి 231 పరుగులు చేసి శ్రీలంకపై విజయాన్ని సొంతం చేసుకుంది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో శ్రీలంకపై భారత్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు వన్డేత సిరీస్లో భారత్ 2-0 అధిక్యంలో ఉంది. | 2sports
|
Visit Site
Recommended byColombia
‘ఢీ షో’ అనగానే డాన్స్ల కంటే ఎక్కవుగా స్కిట్ల కోసమే చూసే కామెడీ లవర్స్కి.. సుడిగాలి సుధీర్ చేసే కామెడీ అంటే భలే క్రేజ్ ఉంటుంది. అందరితో కలిసి అతడు గోల చేసినా.. అంతా కలిసి అతడిని గేలి చేసినా.. చూడటానికి భలే కామెడీగా ఉంటుంది. అందులో భాగంగానే నవంబర్ 13న రాబోయే ‘ఢీ ఛాంపియన్’ షోకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందుకు కారణం.. సుడిగాలి సుదీర్ జడ్జ్గా జడ్జ్మెంట్ ఇవ్వడమే..! సుధీర్, రష్మీ ఇద్దరూ.. ‘బొమ్మాళీ’ సాంగ్తో ఎంట్రీ ఇస్తారు.
Read Also: ‘కార్తీకదీపం’ నవంబర్ 11 ఎపిసోడ్ : కంటతడి పెట్టించిన సీన్! దీపతోనే సౌర్య సవాల్?
వెంటనే సుధీర్ రష్మీతో.. ‘చూశావా రష్మీ? మనం డాన్స్ చేస్తూ వస్తుంటే ఆ వర్షిణి ఏమో అసూయపడుతుంది. రవిగాడేమో భయపడుతున్నాడు’ అంటాడు నవ్వుతూ. వెంటనే శేఖర్ మాస్టర్ ‘మాకేమో వాంతులు వస్తున్నాయి’ అంటూ పంచ్ వేయడంతో నవ్వులు పూశాయి. టాస్క్ ఏంటంటే.. ‘ఇక్కడో పర్ఫామెన్స్ అయ్యింది.. నీలోనే శేఖర్ మాస్టర్.. నీలోనే ప్రియమణి, నీలోనే పూర్ణా గారు ఉంటే నువ్వు ఎలా చేస్తావ్?’ అంటూ రవి సుధీర్ని అడగడంతో అసలు కామెడీ స్టార్ట్ అయ్యింది.
Read Also: డబ్బు ఉండి అనుభవించలేనోడు దరిద్రుడు - రోజా
సుధీర్ జడ్జ్ సీట్లో కూర్చుని ఉండగా.. రవి, వర్షిణీలు చాలా ఫన్నీగా డాన్స్ పర్ఫామెన్స్ ఇస్తారు. ఆ పర్షామెన్స్ చూసిన సుధీర్.. శేఖర్ మాస్టార్లా.. ఆ మూమెంట్ అసలు అబ్బా.. అంటూ ‘సూపర్.. సూపర్.. సూపర్’ అంటూ శేఖర్ మాస్టర్లా చేసి... శేఖర్ మాస్టర్నే పడి పడి నవ్వేలా చేశాడు. ఇక ప్రియమణిలా నటిస్తూ.. మధ్యలో టచప్ చేయించుకుని.. మేకప్ మ్యాన్ని అదే బల్ల కింద దాచి పెట్టడం.. భలే కామెడీగా ఉంది. ఇక మరో జడ్జ్ పూర్ణలా అయితే.. పర్ఫామెన్స్ చూడకుండా నిద్రపోతున్నట్లుగా.. మధ్యలో లేచి జడ్జ్మెంట్ ఇచ్చి మళ్లీ నిద్రపోతున్నట్లుగా నటించి హిలేరియస్ కామెడీ చేస్తాడు సుధీర్. దాంతో జడ్జెస్ ముగ్గురు పడి పడి నవ్వుతున్నారు.
ఈ ప్రోమో చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి..
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
internet vaartha 359 Views
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో గతఏడాది ప్రతిపాదించిన జాతీయ మౌలికవనరులనిధి తరహాలోనే ఈ ఏడాది బడ్జెట్లో బాండ్ గారంటీ ఫండ్ ఆఫ్ ఇండియా (బిజిఎఫ్ఐ)ను ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదిస్తోంది. బాండ్ మార్కెట్, ఇన్ఫ్రా సంస్థల్లో నెలకొన్న మందగమనాన్ని పారద్రోలేందుకు ప్రభుత్వ పరంగా ఇతోధిక ప్రోత్సాహం కల్పించాలని ఆర్ధిక మంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్లో ఈ కొత్త అంశం ప్రతి పాదిస్తున్నారు. ప్రాథమికంగా రూ.5వేల నుంచి రూ.10 వేల కోట్ల వరకూ కార్పస్ నిధిని ఏర్పాటుచేసి బిజిఎఫ్ఐను ప్రారంభిస్తారు. ప్రభుత్వం 49శాతం వాటా కలిగి ఉంటుంది. ఎక్కువగా ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం కల్పించేందుకుగాను బిజిఎఫ్ఐ లో ప్రైవేటు సంస్థలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు ఆసియా అభివృద్ధిబ్యాంకు వంటిప్రభుత్వరంగ సంస్థలకు కూడా అవకాశం ఉంది. బడ్జెట్లో కొత్తగా ప్రతిపాదిస్తున్న బిజిఎఫ్ఐలో అన్ని వర్గాల అభిప్రాయాలను కూడా సేకరించాలని నిర్ణయించారు. తక్కువ రేటింగ్ ఉన్న స్కీంలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ విధివిధానాల కారణంగా బాండ్ల ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. డబుల్ ఏరేటింగ్ కంటే తక్కువస్థాయి లోనే ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఉండటమే ఇందుకు కారణం. ప్రాథ మిక స్థాయిలో ఈ రేటింగ్ వల్ల ఇన్వెస్టర్లు బాండ్ల మార్కెట్కు రావడంలేదు. ఈవిధానం నుంచి బైటపడేందుకుగాను ఆసియా అభివృద్ధి బ్యాంకు బాండ్ గ్యారంటీఫండ్ను ప్రతిపాదించింది. వివిధ సంస్థలు జారీచేసే దీర్ఘకాలిక బాండ్లకు గ్యారటీ ఇవ్వడమే ఈనిధి లక్ష్యం. డబుల్ ఏ రేటిం గ్ను మరింత మెరుగుపరిచి జాతీయ మౌలిక వనరుల నిధి తరహాలోనే బిజిఎఫ్ఐను కూడా వృద్ధి చేయాలని నిర్ణయించారు. ఎన్ఐఐఎఫ్ను రూ.40 వేలకోట్ల రూపాయల కార్పస్నిధితో ప్రారంభిం చారు. వాణిజ్యపరంగా గిట్టుబాటయ్యే ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు రగీన్ఫీల్డ్ అండ్బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టులు, స్తంభించిన ప్రాజెక్టులను కూడా వృద్ధి చేసే లక్ష్యంతో ఈనిధిని ఏర్పాటుచేసారు. ఇన్ఫ్రా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చినమోడీ ప్రభు త్వం ఆర్థికవృద్దిని పెంచుకునేదిశగా పలు సంస్క రణలు ప్రవేశపెట్టింది. మౌలికవనరుల పెట్టుబడుల పరంగా భారత్కు 67 లక్షల కోట్ల రూపాయలు అవ సరం అవుతాయని రానున్న ఐదేళ్లలో ఈ గ్యాప్ భర్తీ చేసు కోవాల్సి ఉందని ముందు నుంచీ మోడీ ప్రభుత్వం భావిస్తోంది. 2017 మార్చినాటికి ఈ నిధులు 12 లక్షల కోట్ల లోటు ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్ఎల్) అంచనాల ప్రకారం కొన్ని రంగాలకు సంబంధించి ఆస్తి అప్పుల పట్టీలు సమతుల్యం కాకపోవడం, రుణపరపతి రికార్డులు నీరసించడం వంటి వాటికారణంగా దేశీయ బాండ్ మార్కెట్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అంచనా వేసింది. ఐఐఎఫ్సిఎల్ రుణపరపతిని అందిస్తున్నప్పటికీ ఆర్బిఐ బ్యాంకులకు స్పష్టమైన మార్గ దర్శకాలు జారీచేసినా బిజిఎఫ్ఐ లాంటి సంస్థను ప్రోత్స హించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్ధిక మంత్రిత్వ శాఖప్రకటించింది. ఐఐఎఫ్సిఎల్ బాండ్ మొత్తంలో 50శాతం గ్యారంటీ ఇస్తుంది. బ్యాంకులు 20శాతం గ్యారంటీ ఇస్తాయి. డబుల్ఏ రేటింగ్ సాధించాలంటే ఎక్కువ మౌలికవనరుల రంగ ప్రాజెక్టులు 20శాతం రుణపరపతికి మించి అందుకోలేకపోతున్నాయి. ట్రిపుల్ ఏరేటింగ్రావాలంటే ఈ రంగంలోని ప్రాజె క్టులకు నూరు శాతం పరపతి అవసరం అవుతుంది. సంస్థాగత ఇన్వెస్టర్ల కు ఈ విధానం మరింత తప్పనిసరి అవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు సీనియర్ ఆర్థిక నిపుణులు డాన్ లాంబర్ట్ వెల్లడించారు. బాండ్లపరంగా ఇన్ఫ్రా రంగాన్ని మరింత పటిష్టపరచాలంటే ప్రభుత్వపరంగా జారీచేసే బాండ్లకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉన్నందున ప్రభుత్వం ఈదిశగా వ్యూహరచన చేసి బడ్జెట్లో కొత్త బాండ్ గ్యారంటీ ఫండ్ ఆఫ్ఇండియా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2016-17 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఈ సంస్థను ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
MS Dhoni: ధోనీ కెరీర్ని మీరెలా డిసైడ్ చేస్తారు..?: బ్రావో
మహేంద్రసింగ్ ధోనీ లాంటి క్రికెటర్ కెరీర్.. స్వయంగా అతను నిర్ణయించుకుంటే తప్ప ముగియదు. విమర్శకులు ఎప్పుడూ ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటారు - డ్వేన్ బ్రావో
Samayam Telugu | Updated:
Nov 29, 2018, 03:53PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టీ20 కెరీర్ని ఎవరూ డిసైడ్ చేయలేరని వెస్టిండీస్ మాజీ క్రికెటర్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్లో మెరుగ్గా రాణించిన ధోనీ.. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో, వెస్టిండీస్తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో పేలవంగా విఫలమయ్యాడు. ఈ కారణంగా.. ఆస్ట్రేలియాతో టీ20లకి అతడ్ని పక్కన పెట్టిన సెలక్టర్లు.. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ని ఎంపిక చేశారు. దీంతో.. ధోనీ టీ20 కెరీర్ ఇక ముగిసిపోయిందని మాజీ క్రికెటర్లు కొంత మంది అభిప్రాయపడ్డారు.
ధోనీ టీ20 కెరీర్పై వస్తున్న అభిప్రాయాలపై తాజాగా డ్వేన్ బ్రావో స్పందించాడు. ‘మహేంద్రసింగ్ ధోనీ లాంటి క్రికెటర్ కెరీర్.. స్వయంగా అతను నిర్ణయించుకుంటే తప్ప ముగియదు. విమర్శకులు ఎప్పుడూ ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటారు. ఆటగాళ్ల స్థాయిని బట్టి.. దాని ప్రభావం ఉంటుంది. కానీ.. ధోనీ ఇప్పటికే తన సత్తా ఏంటో..? నిరూపించుకున్న ఆటగాడు. ఈ ఏడాది ఐపీఎల్లోనూ అతను విమర్శకులకి బదులిస్తూ బ్యాట్తో రాణించాడు. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ ధోని. కాబట్టి.. రిటైర్మెంట్పై అతనే ఓ నిర్ణయం తీసుకుంటాడు. అంతేతప్ప.. ఎవరూ అతని టీ20 కెరీర్ని డిసైడ్ చేయలేరు’ అని డ్వేన్ బ్రావో వెల్లడించాడు. | 2sports
|
Hyderabad, First Published 21, Aug 2019, 5:38 PM IST
Highlights
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రద్దా కపూర్ నటిస్తున్న తొలి సౌత్ ఇండియన్ సినిమా ఇదే.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రద్దా కపూర్ నటిస్తున్న తొలి సౌత్ ఇండియన్ సినిమా ఇదే.
విడుదల సమయం దగ్గరపడుతుండటంతో హైదరాబాద్, ముంబై, చెన్నై ఇలా ప్రధాన నగరాల్లో ప్రభాస్, శ్రద్దా కపూర్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. శ్రద్దా కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తొలి సారి తాను మద్యం సేవించిన అనుభవాన్ని పంచుకుంది.
ఫ్రెండ్స్ తో పార్టీలో ఉన్నప్పుడు తొలిసారి ఆల్కహాల్ తీసుకున్నా. ఇంట్లో తెలియకుండా ఉండడానికి చాలా ప్రయత్నించా. కానీ మొదటిసారి కావడంతో కిక్కు బాగా ఎక్కేసింది. దీనితో వెకిలిగా నవ్వుతూ, పిచ్చి చేష్టలు చేస్తూ అమ్మకు కనిపించా. నేను తాగేసి వచ్చానని అమ్మ కనిపెట్టేసింది. నేను ఇంకా ఎలాంటి వెధవ వేషాలు వేస్తానో అని నన్ను గమనిస్తూ ఉండిపోయింది అని శ్రద్దా కపూర్ తెలిపింది. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రకుల్కి హ్యాండిచ్చేశాడు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో దూకుడు చూపించిన రకుల్ ప్రీత్ సింగ్...
TNN | Updated:
Nov 17, 2017, 04:22PM IST
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో దూకుడు చూపించిన రకుల్ ప్రీత్ సింగ్ . ఈ ఏడాదిలో ఆమె నటించిన 'రా రండోయ్ వేడుక చూద్దాం' తప్ప మరే సినిమా సక్సెస్ కాలేదు. ‘స్పైడర్’ సినిమాతో కోలీవుడ్‌లో పాగా వేద్దామనుకుంది. అది కూడా వర్కవుట్ కాలేదు. దీంతో తమిళంలో విజయం అందుకోవాలనే ఆశ అలానే ఉండిపోయింది. ప్రస్తుతం కార్తీ సరసన ఆమె నటించిన 'ఖాకీ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో అటు తమిళంలో ఇటు తెలుగులో విజయం అందుకుంటాననే నమ్మకంతో ఉంది. అయితే గత కొద్దిరోజులుగా రకుల్‌కు మురుగదాస్ మరో సినిమా అవకాశం ఇచ్చాడని వార్తలు వినిపించాయి.
విజయ్ హీరోగా మురుగదాస్ డైరెక్ట్ చేయనున్న సినిమాలో రకుల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఇప్పుడు రకుల్ స్థానంలో నయనతారను తీసుకోవాలని అనుకుంటున్నారట. తాజాగా 'అరామ్' సినిమాతో విజయం అందుకున్న నయన్‌ను విజయ్ సినిమాలో తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. అదే గనుక జరిగితే ఓ క్రేజీ ఆఫర్ రకుల్ పోగొట్టుకున్నట్లే అవుతుంది. మరి ఈ సినిమాలో నయన్‌తో పాటు రకుల్ కూడా నటిస్తుందా..? లేక నిజంగానే రకుల్‌ను తప్పించి నయన్‌ను తీసుకున్నారా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఐపీఎల్ అనుభవమే వారి ధైర్యం: కార్తీక్
శ్రీలంకతో కటక్ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో భారత యువ క్రికెటర్లకి ఐపీఎల్ అనుభవం కలిసొస్తుందని
TNN | Updated:
Dec 19, 2017, 05:21PM IST
ఐపీఎల్ అనుభవమే వారి ధైర్యం: కార్తీక్
శ్రీలంకతో కటక్ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్లకి ఐపీఎల్ అనుభవం కలిసొస్తుందని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు. సీనియర్ క్రికెటర్లు కోహ్లి, శిఖర్ ధావన్, రహానె, భువనేశ్వర్‌లకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు శ్రేయాస్, దీపక్ హుడా, మహ్మద్ షిరాజ్, థంపీ‌లకి ఈ టీ20 సిరీస్‌లో అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించిన ఈ క్రికెటర్లు.. దొరికిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని కార్తీక్ విశ్వాసం కనబర్చాడు.
‘టీ20 జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్లందరికీ ఐపీఎల్ అనుభవం ఉంది. కొంత మంది 20-30 మ్యాచ్‌లు వరకూ ఆడారు. టీమిండియాలో కుదురుకునేందుకు వారికి ఈ అనుభవమే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని నా నమ్మకం. సీనియర్లు ఎక్కువ మంది జట్టులో లేని నేపథ్యంలో గెలిపించే ప్రదర్శనతో సెలక్టర్లని ఆకట్టుకునేందుకు వారికిదే సువర్ణావకాశం. ఒక సీనియర్ క్రికెటర్‌‌గా మైదానంలో వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నేను సిద్ధం. జట్టులో కూడా ఇదే భావన ఉంది’ అని కార్తీక్ వివరించాడు. బుధవారం రాత్రి 7 గంటలకి మ్యాచ్ జరగనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyd Internet 208 Views BSNL
BSNL
ఢిల్లీ: దీపావళిని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ‘లక్ష్మీ ప్రమోషనల్’ పేరిట అదనపు టాక్టైమ్ అందించే రీఛార్జి వోచర్లను తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది. రూ.290, రూ.390, రూ.590 టాప్ అప్ రీఛార్జిపై 50 శాతం అదనపు టాక్టైమ్ను అందిస్తోంది.ఈ ఆఫర్ కేవలం ఈ మూడు టాప్అప్లకు మాత్రమే వర్తిస్తుందని, రూ.290తో రీఛార్జిపై రూ.435, రూ.390 రీఛార్జిపై రూ.585, రూ.590 రీఛార్జిపై రూ.885 టాక్టైమ్ను అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా అక్టోబర్ 16 నుంచి 21 మధ్య రీఛార్జి చేసుకునే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. | 1entertainment
|
సకుటుంబ సపరివార సమేతంగా.. ఫైనల్స్కు..!
Highlights
2-1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్పై క్రొయేషియా విజయం
హైదరాబాద్: ఎక్స్ట్రా టైమ్లో మరియో మాండ్జుకిక్ చేసిన గోల్ 40 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రొయేషియా టీమ్ను 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించేలా చేసింది. ఫైనల్స్కు పంపించింది. ఈ సారి కప్ మాదే అని ధీమాగా ప్రకటించిన ఇంగ్లండ్ గర్వాతిశయాన్ని భంగపరిచింది. కలలను ఛిద్రం చేసింది. స్వదేశానికి సాగనంపించింది. క్రొయేషియా దేశ చరిత్రలో సరికొత్త పేజీని రాస్తున్నట్టుగా బుధవారం నాటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆ దేశాన్ని ఫైనల్స్కు చేర్చింది. ఇవాన్ పెరిసిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
కానీ క్రొయేషియా అంత తేలిగ్గా విజయం సాధించలేదు. అడుగడుగునా ఇంగ్లండ్తో హోరాహోరీగా పోరాడాల్సి వచ్చింది. ఫస్టాఫ్ అంతా ఇంగ్లండ్ కలల ప్రపంచాన్ని కళ్ళ ముందు ఉంచింది. ఆట మొదలైన ఐదు నిముషాలకే కెయిరన్ ట్రిప్పెర్ ఫ్రీ కిక్తో తొలి గోల్ చేసి ఇంగ్లండ్ టీమ్కు 1-0 తేడాతో ఆధిక్యాన్ని అందించాడు. అక్కడ్నుంచి క్రొయేషియా కష్టాలు మొదలయ్యాయి. స్టేడియం అంతా ఇంగ్లండ్కు మద్దతు ఇస్తున్న వాతావరణం కనిపించింది. అయినా కానీ క్రొయేషియా ప్లేయర్లు టీమ్ స్పిరిట్తో ఆటను రక్తి కట్టించారు. అయినప్పటికీ ఫస్టాఫ్లో స్కోరు సమం చేయాలన్న క్రొయేషియా ప్రయత్నాలను ఇంగ్లండ్ అడ్డుకుంది. ఇంగ్లండ్ ఆధిపత్యానికి పట్టం కడుతూ 1-0 తేడాతో ఫస్టాఫ్ ముగిసింది.
సెకండాఫ్లో పెరిసిక్ పుణ్యమాని క్రొయేషియా ఒక గోల్ చేసి, స్కోరును 1-1తో సమం చేసింది. ఇక్కడ్నుంచి ఆట రసకందాయంలో పడింది. అప్పటి దాకా ఇంగ్లండ్దే పై చేయి అనుకుంటున్న ప్రేక్షకులకు ఒక్కసారిగా ఆట తలకిందులు అయినట్టు అగుపించింది. ఇరు జట్లలో ఫైనల్స్కు చేరుకునేదెవరు అనే ఉత్కంఠ నెలకొంది. మొత్తం టైమ్ అయిపోయినా కానీ ఆట తేలలేదు. పోనీ డ్రా అని డిక్లేర్ చేద్దామంటే ఇది సెమీ ఫైనల్ మ్యాచ్ అయిపోయింది.
అందుకే ప్లేయర్స్కు ఎక్స్ట్రా టైమ్ ఇచ్చారు. అలా అందివచ్చిన అవకాశాన్ని క్రొయేషియా సద్వినియోగం చేసుకుంది. మరియో మాండ్జుకిక్ చేసిన గోల్ గేమ్ను 2-1 తేడాతో ఆట కట్టించింది. క్రొయేషియాను ఫైనల్స్కు ఇంగ్లండ్ను ఇంటికి సాగనంపింది. కనివినీ ఎరుగని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి స్టేడియంను మించిన వేదిక మరొకటి లేదనిపించింది క్రొయేషియా ప్లేయర్స్కు. అందుకే చిన్నా పెద్దా ఇలా అందరూ కలిసి ఆనందోత్సాహాలతో కెమెరాలకు పోజులిచ్చారు. ఆ తర్వాత ఫ్రాన్స్తో ఎటూ ఫైనల్ మ్యాచ్ ఉండనే ఉంది కదా. అప్పటిదాకా ఈ విజయోత్సాహాన్ని ఇలాగే కొనసాగిస్తే క్రొయేషియా ఫుట్ బాల్ హిస్టరీలో మరో చరిత్ర సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Last Updated 12, Jul 2018, 4:06 PM IST | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లంక కెప్టెన్పై రెండు మ్యాచ్ల నిషేధం
అసలే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిన బాధలో ఉన్న లంక జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా..
TNN | Updated:
Aug 25, 2017, 01:41PM IST
పల్లకెలె వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో విజయం వాకిట నిలిచి అనూహ్యంగా ఓటమిపాలైన ఆతిథ్య జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా లంక కెప్టెన్ ఉపుల్ తరంగపై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. 12 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు తీసిన లంక జట్టు మరో 3 వికెట్లు తీయలేకపోవడంతో మ్యాచ్‌లో ఓడటంతోపాటు... కెప్టెన్‌పై వేటు కూడా పడింది. దీంతో మిగతా మూడు వన్డేల కోసం టెస్టు కెప్టెన్ దినేశ్ చండీమల్‌, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తిరిమన్నెలకు లంక సెలక్టర్ల నుంచి పిలుపు అందింది. తరంగ గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ‌లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
తర్వాతి రెండు మ్యాచ్‌లకు ఓపెనర్ దన్షుక గుణతిలక కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో అతడి భుజానికి గాయమైంది. అతడి స్థానంలో తిరుమన్నె ఓపెనర్‌గా బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. చండీమల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. తరంగ స్థానంలో తాత్కాలికంగా ఎవరు కెప్టెన్ పగ్గాలు చేపట్టాలనే విషయమై లంక సెలక్టర్లు క్యాండీలో సమావేశమయ్యారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చమర కపుగెదెరను తాత్కాలిక కెప్టెన్‌‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. | 2sports
|
- ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదమున్నది
- ఖాతాదారుకు తెలియకుండానే లావాదేవీలు
- బ్యాంకులు వీటిపై ఒక కన్నేసి ఉంచాలి
- 'పేమెంట్ లైసెన్స్'ల విషయం బాధాకరం
కొత్త ఖాతాకు ఒకే రకమైన దరఖాస్తుతో మేలు : ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా
ముంబయి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలో అత్యధికులు బ్యాంకుల్లో తెరిచిన 'జన్ధన్' ఖాతాల మూలంగా ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదం పొంచి ఉన్నట్టుగా 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్బీఐ) సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఖాతాదారు ప్రమేయం లేకుండానే కొందరు మోసగాళ్లు జన్ధన్ ఖాతాలను వినియోగించుకొని నగదు బదిలీలకు ఆర్థిక మోసాలకు దిగే ప్రమాదం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా తెలిపారు. బ్యాంకులు ఈ విషయంలో జాగురుకతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. జన్ధన్ ఖాతాల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు గాను బ్యాంకులు సొంత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఖాతాదారులకు తెలియకుండానే మూడో పార్టీవారు వారి ఖాతాల ద్వారా భారీ నగదు బదిలీలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలిపారు. ఇందుకు ఇటీవల పంజాబ్లో జరిగిన ఒక సంఘటనను ఉదహరించారు. పంజాబ్లో ఒక రోజువారీ కూలీ బ్యాంక్ ఖాతాలో గత కొన్ని రోజులుగా చాలా తక్కువ మొత్తంలో లావాదేవీలు నమోదవుతూ వచ్చాయని.. ఇటీవల ఒక్కసారిగా ఆయన ఖాతాలో రూ.కోటి లావాదేవీలు వెలుగు చూసిన విషయాన్ని వివరించారు. ఖాతాలల్లో జరిగే లావాదేవీల విషయంలో నిఘా లోపించినట్టుగా అభిప్రాయపడ్డారు. ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడే విషయంలో బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ దిశగా చర్యలను చేపట్టడంలో బ్యాంకుల విఫలమైతే ఆర్బీఐ ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పేమెంట్ బ్యాంకుల లైసెన్స్లు వెనక్కా...
పేమెంట్ బ్యాంకుల లైసెన్స్లు పొందిన సంస్థలు తాజాగా అనుమతులు వచ్చాక వెనక్కి తగ్గుతుండడం పట్ల ముంద్రా విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా తెలిపారు. ఇలాంటి సంస్థల నుంచి అధిక మొత్తంలో అపరాధ రుసుములను వసూలు చేయాలని యోచిస్తున్నట్టుగా ఆయన సంకేతాలిచ్చారు. లైసెన్సులు లభించిన తరువాత కూడా బ్యాంకులను ఏర్పాటు చేసే విషయంలో చోళమండలం సంస్థ వెనక్కి తగ్గగా.. తాజాగా దిలీప్ సంఘ్వీకి చెందిన ఐడీఎఫ్సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఎలాంటి కారణం చూపకుండానే బ్యాంకులు తెరిచేందుకు నిరాసక్తతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయా సంస్థలకు లైసెన్స్లను జారీ చేసేందుకు గాను ఆర్బీఐ ఎంతో శ్రమించాల్సి వచ్చిందని వివరించారు. తీరా అనుమతులు లభించాక అవి వెనక్కి మళ్లడం సబబు కాదన్నారు. ఇది పెద్ద నేరం కాదన్న ఆయన ప్రస్తుతమున్న నిబంధనల మేరకు వాటిపై జరిమానా విధించేందుకు అనుమతించేలా లేవని తెలిపారు. దేశంలో ఏ బ్యాంకులో ఖాతా తెరవాలన్నా ఒకే రకమైన దరఖాస్తు సమాచారం కోరేలా ఫారం ఉండాలని ముంద్రా అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చర్యలు తీసుకొనే విషయమై యోచిస్తున్నట్టుగా తెలిపారు. దేశంలో అంతకంతకు పెరుగుతున్న బ్యాంకు మోసాలను వీలైనంత మేర తగ్గించాలని ఆర్బీఐ యోచిస్తోందన్నారు. ఇందులో భాగంగా వినియోగదారుల రుణ పరిధిని ఒకస్థాయి వరకు మాత్రమే పరిమితం చేయాలని భావిస్తోంది. ఆన్లైన్ లావాదేవీలు పెరగడం మూలంగా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, అనధికారిక నిధుల మళ్లింపు వంటి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలిపారు. నకిలీ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేయడం, ఫిషింగ్ ఈ-మెయిల్స్ లాంటి వల్ల జరుగుతున్న మోసాల నుంచి వినియోగదారు అధిక మొత్తంలో నగదు మోసపోకుండా ఉండేలా పరిమితి విధించాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ 80 పైసలు, డీజిల్ రూ. 1.30 తగ్గింపు..!
CVR| Last Updated: గురువారం, 16 ఏప్రియల్ 2015 (17:09 IST)
పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు మరో సారి తగ్గించాయి. పెట్రోల్ ధర 80 పైసలు, డీజిల్ ధర రూ. 1.30
తగ్గింది. పన్నులు కూడా కలుపుకుంటే ఈ ధరల తగ్గుదల ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. తగ్గించిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
ప్రస్తుతం 59 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర స్వల్పంగా తగ్గడంతో ఆ స్థాయిలో నూనె సంస్థలు రిటైల్ ధరలను తగ్గించాయి. ఏప్రిల్ 2న పెట్రోల్, డీజల్ ధరలు తగ్గగా, తాజాగా మరో సారి తగ్గడంతో ఒకే నెలలో రెండు సార్లు ధరలు తగ్గాయి.
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై రూ. 90 పైసలు తగ్గింది. లీటర్ పెట్రోల్పై కొత్త ధర రూ. 66.88. లీటర్ డీజిల్పై రూ. 1.47 పైసలు తగ్గింది. లీటర్ డీజిల్పై కొత్త ధర రూ. 53.45గా ఉంది.
సంబంధిత వార్తలు | 1entertainment
|
శివం దుబెకు పిలుపు
Fri 25 Oct 03:06:50.753822 2019
ముంబయి ఆల్రౌండర్ శివం దుబెకు భారత జట్టు పిలుపు అందింది. దేశవాళీ, ఐపీఎల్లో భయమెరుగుని క్రికెట్ ఆడుతున్న శివం దుబె సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టిని ఆకర్షించాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు భారత జట్టుకు ఎంపికయ్యాడు. 2015లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేసిన కేరళ యువ సంచలనం సంజూ శాంసన్కు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. | 2sports
|
sandhya 291 Views stock market
stock market
ముంబై: దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 39,652 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 11868 వద్ద కొనసాగుతుంది. 360 కంపెనీల షేర్లు లాభపడగా, 216 కంపెనీలు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/latest-news/ | 1entertainment
|
Hyderabad, First Published 25, Sep 2018, 9:52 AM IST
Highlights
బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే హడావిడి మొదలైపోయింది. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో ఐదుగురు కంటెస్టెంట్స్ ఫినాలేకి చేరుకున్నారు. సామ్రాట్, కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్ లలో ఎవరు బిగ్ బాస్ టైల్ గెలుస్తారనే విషయం ఆసక్తిగా మారింది.
బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే హడావిడి మొదలైపోయింది. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో ఐదుగురు కంటెస్టెంట్స్ ఫినాలేకి చేరుకున్నారు. సామ్రాట్, కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్ లలో ఎవరు బిగ్ బాస్ టైల్ గెలుస్తారనే విషయం ఆసక్తిగా మారింది.
ఇక సోమవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ మరోసారి కౌశల్ ని టార్గెట్ చేశారు. నిన్నటి టాస్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టే టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం ఫినాలేకి చేరిన ఐదుగురిని ఫైనల్ తో మీతో పాటు ఎవరు ఉండాలనుకుంటున్నారు..? ఎవరు ఉండకూడదనుకుంటున్నారు..? అనే విషయాలను తెలియజేస్తూ.. బోర్డుపై ఉంచిన ఫోటోలు ఎదురుగా ఇష్టమైన వ్యక్తి ఎదురుగా హార్ట్ సింబల్ పెట్టాలని, అలానే ఇష్టం లేని వ్యక్తి ఎదురుగా డిస్ లైక్ సింబల్ పెట్టాలని సూచించారు బిగ్ బాస్.
ఈ టాస్క్ లో కౌశల్ ఫైనల్స్ లో తమతో పాటు ఉండకూడదని భావిస్తున్నట్లు తనీష్, గీతా, దీప్తి, సామ్రాట్ లు అతడికి డిస్ లైక్ కొట్టారు. ఈ నలుగురు రకరకాల కారణాలతో కౌశల్ కి డిస్ లైక్ కొట్టగా.. కౌశల్ టర్న్ వచ్చేసరికి ఆయన తనతో పాటు గీతామాధురి ఫైనల్స్ కి రావొచ్చని, సామ్రాట్ తన దృష్టిలో వీక్ కంటెస్టెంట్ అని అతడి ఫైనల్ లో చూడాలనుకోవడం లేదని అన్నారు. | 0business
|
డైరెక్టర్గా డా.మషేల్కర్
హైదరాబాద్: యాక్సెస్ హెల్త్ ఇంట ర్నేషనల్ బోర్డులో ప్రముఖ శాస్త్రవేత్త రఘునాత్ అనంత్ మషేల్కర్ చేరారు. సంస్థ రఘునాధ్ను కొత్తడైరెక్టర్గా నియమిస్తున్నట్లు వెల్లడించింది. హెల్త్కేర్ వ్యవస్థల్లో అధునాతన పరిశోధనలు నిర్వహించే మేధావి గ్రూప్కు చెందిన సంస్థ యాక్సెస్ హెల్త్ అంతర్జా తీయంగా సేవలందిస్తోంది. డా.మషేల్కర్ ప్రస్తుతం భారత్ నూతన ఒరవడి పరిశోధన వేదికకు ఛైర్మన్గా వ్యవహఱిస్తున్నారు. యఅంతేకాకుండా అంతర్జాతీయ పరిశోధన కూటమికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గతంలో బ్రిటన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్కు భారతీయ విభాగం అధ్యక్ష/నిగాను, భారత జాతీయ శాస్త్రీయ అకాడమికి అధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్నారు. | 1entertainment
|
Hyderabad, First Published 21, Mar 2019, 3:29 PM IST
Highlights
రీసెంట్ గా KGF సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యాష్ కన్నడ పొలిటికల్ ఫైట్ లోకి దిగాడు. ఎలక్షన్స్ లో కాంటెస్ట్ చేయకుండా సీనియర్ నటి సుమలతకు మద్దతు పలుకుతూ మరో హీరోకి గట్టిపోటీని ఇస్తున్నాడు. అతనెవరో కాదు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ.
రీసెంట్ గా KGF సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యాష్ కన్నడ పొలిటికల్ ఫైట్ లోకి దిగాడు. ఎలక్షన్స్ లో కాంటెస్ట్ చేయకుండా సీనియర్ నటి సుమలతకు మద్దతు పలుకుతూ మరో హీరోకి గట్టిపోటీని ఇస్తున్నాడు. అతనెవరో కాదు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ.
రీసెంట్ గా ఒక హిట్ అందుకొని పాపులర్ అయిన ఈ జాగ్వార్ హీరో మాండ్యా లోక్ సభ స్థానానికి జేడీఎస్ పార్టీ నుంచి ఎన్నికల రంగంలో దిగుతున్నాడు. ఈ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు ఈ స్థానం నుంచి అవకాశం దక్కుతుందని అంతా భావించారు. సుమలతకు రావాల్సిన అవకాశాన్ని కుమారస్వామి కొడుకు కోసం ప్రణాళికలు రచించారని టాక్ వస్తోంది.
ఈ తరుణంలో kgf యాష్ సుమలతకు అండగా నిలిచారు. ఆమె ఇండిపెండెట్ గా పోటీ చేస్తుండగా ఎన్నికల ప్రచారంలో తనవంతు సహాయం చేయనున్నాడు. దీంతో కన్నడ సినీ ఫైట్ రాజకీయాల వరకు వెళ్ళింది. యాష్ కి అభిమానులు చాలా మందే ఉన్నారు. నిఖిల్ గౌడకి అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమి లేదు గాని ఆ నియోజక వర్గంలో పార్టీ బలంగా ఉండటం సుమలత విజయం దక్కడం కష్టమని అంటున్నారు.
అందుకే యాష్ ప్రచారంలో దిగి ప్రత్యర్థి హీరో నిఖిల్ ను ఓడించాలని సిద్దమవుతున్నాడు. గతంలో యష్ పలు ప్రాంతాల్లో పేదవారికి ఆర్థిక సహాయాన్ని అందించిన మంచి గుర్తింపు ఉండడంతో యాష్ ప్రచారం చేస్తే సుమలతకు గెలుపు దక్కడం పెద్ద కష్టమేమి కాదు అనే విధంగా మరో టాక్ వైరల్ అవుతోంది. ఈ తరుణంలో నిఖిల్ గౌడ - యష్ అభిమానుల మధ్య శత్రుత్వం గట్టిగానే నెలకొంది. మరి మాండ్యాలో ఏ హీరోకి జనాలు మద్దతు పలుకుతారో చూడాలి.
Last Updated 21, Mar 2019, 3:29 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మ్యూచువల్ ఫండ్ల నుంచి వైదొలగుతున్నారా? అయితే ఇవి మీ కోసమే..
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు నష్టభయాలు, రాబడి గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో వీటిపై మదుపర్లు ఎంత అదనపు ఖర్చు పెట్టాల్సి ఉంటుందో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం
Samayam Telugu | Updated:
Jun 18, 2018, 03:31PM IST
చాలా మందికి మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఎక్కువ లాభాలు రాబట్టుకోవాలని ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో పోల్చి చూసుకుని మార్కెటు పెట్టుబడుల్లో రిస్క్ ఉందని భావిస్తారు. నేరుగా మూలధన మార్కెట్లో పెట్టుబడి పెట్టడంతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లు అనేవి తక్కువ రిస్క్; తక్కువ ఖర్చుతో పెట్టుబడి పెట్టే విధానం. ఎందుకంటే బ్రోకరేజీ, స్వాధీనానికి సంబంధించిన ఫీజులు, ఇతర రుసుములు తగ్గడం వల్ల పెట్టుబడిదారుల ఖర్చు తగ్గుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్లలో ఒకసారి పెట్టుబడి పెట్టి మధ్యలో నిష్ర్ర్కమించడం మాత్రం మంచిది కాదు. అది ఎందుకో తెలుసుకుందాం.
1. భారీ నిష్క్రమణ ఛార్జీలు:
మెచ్యూరిటీ తేదీ కన్నా ముందే ఫండ్లను తిరిగి కొనేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అవకాశం ఇచ్చినా భారీ నిష్క్రమణ ఛార్జీల భరించక తప్పదు. ఇది ఒక్కోసారి 4నుంచి 5శాతం వరకు ఉంటుంది.
2.మ్యూచువల్ ఫండ్పై వర్తించే ఛార్జీలు
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు నష్టభయాలు, రాబడి గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో వీటిపై మదుపర్లు ఎంత అదనపు ఖర్చు పెట్టాల్సి ఉంటుందో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. మ్యూచువల్ ఫండ్లలో ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్ వంటివి ఉంటాయి.
3. ప్రారంభ ఛార్జీలు (ఎంట్రీ లోడ్):
పెట్టుబడి ప్రారంభించేటప్పుడు చెల్లించే ఛార్జీలను ఎంట్రీ లోడ్ అంటారు. ఆగస్టు 2009 నుంచి సెబీ అన్ని ఎంట్రీ లోడ్లు ప్రస్తుతం అమల్లో లేవు
4.నిష్క్రమణ ఛార్జీలు (ఎగ్జిట్ లోడ్):
పెట్టుబడిదారు పథకం నుంచి అనుకున్న సమయం కంటే ముందే నిష్క్రమిస్తే ఫండ్ సంస్థలు నిష్క్రమణ ఛార్జీలు వేస్తారు. చాలా లిక్విడ్ పథకాలు నిష్క్రమణ ఛార్జీలను వర్తింపజేయరు ఎందుకంటే వీటి ప్రధాన లక్షణం మదుపర్లకు అవసరమైనప్పుడు నగదును అందించడం. ఇతర పథకాల్లో నిష్క్రమణ ఛార్జీలు 1నుంచి 3శాతం దాకా ఉంటాయి. పథకంలో కొనసాగిన సమయంపై ఆధారపడుతుంది. సెబీ నిర్దేశాల ప్రకారం నిష్క్రమణల ద్వారా తక్కువైన సొమ్ము మొత్తాన్ని ఫండ్లో తిరిగి క్రెడిట్ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఫండ్ సంస్థలదని తెలిపింది. ఇందుకు నష్టపోయిన సొమ్మును సమాంతరం చేసుకునేందుకు నిష్క్రమించే మదుపర్లపై ఛార్జీ వేస్తారు ( 20బేసిస్ పాయింట్లకు)
5.లావాదేవీల ఛార్జీలు:
* పెట్టుబడిదారులు లావాదేవీ ఛార్జీగా రూ.100 చెల్లించాలి.
* రూ.10వేలు అంతకన్నా తక్కువ పెట్టుబడులకు ఛార్జీ లేదు.
* రూ.10వేల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు రూ.150 ఫీజు కింద తీసుకోవచ్చు.
* సిప్ విధానంలో మదుపు చేసేటట్టయితే మొత్తం పథకం రూ.10వేలకు మించినట్టయితే రూ.100 రుసుమును నాలుగు దఫాలుగా వసూలు చేస్తారు.
6.ఫండ్ పెట్టుబడులకు సంబంధించిన పన్నులు
మ్యూచువల్ ఫండ్లలో లిక్విడ్, డెట్ , ఈక్విటీ అనే కేటగిరీలు ఉంటాయి.
ఈక్విటీ ఫండ్లలోనుంచి ఏడాది కంటే ముందే పెట్టుబడులను వెనక్కు తీసుకోవాలని భావిస్తే మూలధన రాబడులపై 15% పన్ను చెల్లించాల్సి వస్తుంది.
ఏప్రిల్ 1,2018 నుంచి రూ.1లక్షకు మించిన ఈక్విటీ ఫండ్ల పెట్టుబడులపైన దీర్ఘకాలిక మూలధన రాబడి పన్ను 10 శాతం అమలవుతోంది. | 1entertainment
|
త్వరలో పసిడి లావాదేవీలపై కొత్త పరిమితులు!
- కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హాస్ముఖ్ ఆథియా
న్యూఢిల్లీ: త్వరలో బంగారం, ఇతర విలువైన ఆభరణాల కొనుగోళ్లకు సంబంధించిన లావా దేవీలను అధికారులు గుర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. బులియన్లో మారిపోతున్న నల్లధ నాన్ని అరికట్టడంతో పాటు ఇందుకు సంబంధించిన ప్రతీ లావాదేవీ ఆ వర్గాలు గుర్తించేలా సరికొత్త మార్గాన్ని గుర్తించనున్నట్టు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అథియా తెలిపారు. అయితే ఇటీవల ప్రభుత్వం జెమ్స్ అండ్ జ్యువెలరీ డీలర్లను మనీలాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) కిందకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా అథియా మాట్లాడుతూ.. ఆగస్టు 23న తెచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాల్సి ఉందని, అది చాలా గందరగోళాన్ని సష్టించడంతో పాటు, వ్యతిరేకతను తీసుకొచ్చిందని ఆయన వివరించారు. అయితే లావాదేవీలకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదని తెలిపారు. కాగా 'దేశంలో తొలిసారి జ్యువెలర్స్ను పీఎంఎల్ఏ కిందకు తీసుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు. అయితే వారు ఎలాంటి నివేదికలు సమర్పించాలనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సన్నీ లియోన్కు పోటీగా కత్రినా.. కొత్త బిజినెస్ స్టార్ట్!
Sunny Leone | హీరోయిన్ల మధ్య పోటీ నడుస్తోంది. సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇప్పుడు ఇతర రంగంలోనూ వీళ్లు పోటీపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ భామ కత్రినా బ్యూటీ ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. సన్నీ లియోన్ ఇప్పటికే ఈ వ్యాపారంలో జోరు మీదున్నారు.
Samayam Telugu | Updated:
Oct 26, 2019, 04:50PM IST
హైలైట్స్
సినిమాల్లో కాదండోయ్.. బిజినెస్లో..
వ్యాపారం బాట పట్టిన బాలీవుడ్ భామలు
కత్రినా, సన్నీ మధ్య వ్యాపార పోటీ
కత్రినా కైఫ్.. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతున్నారు. ఆమెకున్న ఫాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కత్రినా డాన్స్కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. సినిమాలు తీస్తూ బాలీవుడ్ను ఏలుతున్న ఈ అమ్మడు ఇప్పుడు బిజినెస్ రంగంపై కూడా కన్నేశారు.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. క్రతినా కైఫ్.. సన్నీ లియోన్తో పోటీపడబోతోంది. ఎందులో అనుకుంటున్నారా? కత్రినా కైఫ్ తాజాగా కే బ్యూటీ పేరుతో బ్యూటీ బ్రాండ్ ప్రారంభించారు. దీని కోసం ఇండియా బ్యూటీ రిటైలర్ నైకాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కే బ్యూటీ బ్రాండ్ ప్రస్తుతం 48 ప్రొడక్టులతో కూడిన కలెక్షన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.
Also Read: ట్రైన్ టికెట్ క్యాన్సల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
ఈ కలెక్షన్లో లిప్, కాజల్, ఐ, బ్రౌ సంబంధిత ప్రొడక్టులు ఉన్నాయి. నైకా స్టోర్లలో, నైక వెబ్సైట్, నైకా యాప్లో ఈ ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. ‘రెండేళ్ల నుంచి వ్యాపార ప్రణాళికలు నడుస్తూ వచ్చాయి. బ్యూటీ, స్కిన్ అనేవి మహిళలకు ఎంతో ముఖ్యం. నా కెరీర్లోని అనుభవంతో ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాను. కే బ్యూటీ వెనుకు పెద్ద టీమ్ ఉంది. మా ప్రొడక్టులు కస్టమర్లను ఆకర్షిస్తాయని భావిస్తున్నా’ అంటూ కత్రినా కైఫ్ జీ బిజినెస్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ అదిరే ఆఫర్లు.. బంగారం కొనుగోలుపై రూ.10,000 డిస్కౌంట్..!
తాము ఎప్పుడు కెమెరా ముందు ఉంటామని, అందుకని మేకప్లో ఎప్పటికప్పుడు టచింగ్-అప్ అవసమని తెలిపారు. అయితే తాను మాత్రం ఎక్కువ కాలం నిలిచిపోయే బ్రాండ్ను తీసుకురావాలని భావించానని, ఇప్పుడు అది సాధ్యమైందని తెలిపారు. కొన్ని నెలలపాటు టెస్టింగ్ తర్వాత ఈ ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
Also Read: నెలకు కేవలం రూ.2,000తో చేతికి ఏకంగా రూ.50 లక్షలు..!
వివిధ రకాల స్కిన్ టోన్స్, వయసు, ఎమోషన్స్ కలిగిన వారి కోసం కే బ్యూటీ ప్రొడక్టులు ఆవిష్కరించారి కత్రినా తెలిపారు. మహిళలు అందరికీ తమ ప్రొడక్టులు అనువుగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే కత్రినా కైఫ్ ఇప్పుడు ఈ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తే.. సన్నీ లియోన్ ఎప్పుడో ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చారు. సన్సిటీస్టోర్స్ పేరుతో ఇప్పటికే ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. రానున్న కాలంలో ఇద్దరి మధ్య వ్యాపారం రంగంలో ఎలాంటి పోటీ ఉంటుందో చూడాలి. | 1entertainment
|
Gold
రూ.31వేలకు చేరిన 10గ్రా.బంగారం
న్యూఢిల్లీ, నవంబరు 3: బంగారంధరలు తిరిగి 31 వేల రూపాయలను దాటిపోయాయి. పదిగ్రాముల బంగారం రూ.50 పెరిగి బులియన్ మార్కెట్లలో 31వేలను అధిగమించింది. అదేవిధంగా వెండి ధరల్లో మాత్రం 40 రూపాయలు తగ్గి కిలో వెండి రూ.44,060లవద్ద నిలిచింది. బులియన్ట్రేడర్ల అంచనాల ప్రకారంచూస్తే బంగారం వరుసగా ఆరోరోజు కూడా ఔన్స్ ఒక్కింటికి అంతర్జాతీయ మార్కెట్లలో 1300 డాలర్లుగా నిలిచింది. ఈక్విటీ మార్కెట్లు క్షీణించడంతో పెట్టుబడులు పసిడి మార్కెట్వైపునకు వచ్చాయి. అంతేకాకుండా ఫెడ్ రిజర్వు పాలకవర్గ సమీక్షలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం కూడా ఒకింత కార ణం అయింది. అంతర్జాతీయంగా 0.39శాతం పెరిగి ఔన్స్ ఒక్కింటికి 1301.50 డాలర్లుగా నడిచింది. సింగపూర్ మార్కెట్లో ఈ ధరలు కొనసాగాయి. గరి ష్టంగా ఒకదశలో 1308.02 డాలర్లుగా కూడా నడి చింది. ఇకదేశ రాజధాని పరిసర మార్కెట్లలో 99.9 కేరట్లు, 99.5 కేరట్ల బంగారం రూ.50 చొప్పున పెరిగి కిలో 31వేలు, 30,850 రూపాయలవద్ద నడి చింది. గడచిన రెండురోజుల్లోనే రూ.300వరకూ లాభపడింది. ఇక సవర్లలో చూస్తే పసిడి ధరలు 200 పెరిగి 24,600గా నడిచింది. వెండిధరలు రూ.40 క్షీణించి కిలో ఒక్కింటికి రూ.44,060గా నడిచింది. వారంవారం పంపిణీ కింది రూ.105గా 43,620లుగా నడిచింది. వెండి నాణేలపరంగా చూస్తే ప్రతి వంద నాణేల కొనుగోలుకు 75 వేలు విక్రయాలకు 76వేల రూపాయల వంతున నడిచింది. | 1entertainment
|
తక్కువ ధరకే కంప్యూటర్ల విక్రయం: లెనోవో
Hanumantha Reddy|
అతి తక్కువ ధరకే కంప్యూటర్లను విక్రయించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవో వెల్లడించింది. తాము రూపొందించే ఈ కంప్యూటర్ 200 డాలర్ల మేర ధరను నిర్ణయించడంపై పరిశీలిస్తున్నామని సంస్థ తెలిపింది.
భారత ఆర్థిక శిగరాగ్ర సదస్సులో పాల్గొన్న లెనోవో గ్రూపు అమెరికా సీఈఓ విలియం జె అమెలియో మాట్లాడుతూ సగటు మనిషికి కూడా కంప్యూటర్ అందుబాటులో ఉండేందుకే తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తక్కువ ధర గల ఈ కంప్యూటర్ను ముందుగా చైనాలో విడుదల చేయాలనకుంటున్నట్లు చెప్పారు.
చైనాలో విడుదల చేసిన అనంతరం భారత ప్రజలకు కూడా ఇది అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కంప్యూటర్ వివరాలను తెలుపుతూ ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసేలా రూపొందించనున్నట్లు చెప్పారు. అయితే ఎప్పుడు ఈ కంప్యూటర్ మార్కెట్లోకి వచ్చే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
దక్షిణాఫ్రికాతో వన్డేలకి భారత్ జట్టు ఎంపిక
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత సెలక్టర్లు జట్టుని శనివారం రాత్రి ప్రకటించారు. జనవరి 5 నుంచి సఫారీలతో మూడు టెస్టుల సిరీస్లో
TNN | Updated:
Dec 23, 2017, 08:49PM IST
దక్షిణాఫ్రికాతో వన్డేలకి భారత్ జట్టు ఎంపిక
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు జట్టుని శనివారం రాత్రి ప్రకటించారు. జనవరి 5 నుంచి సఫారీలతో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనున్న టీమిండియా.. అనంతరం ఫిబ్రవరి 1 నుంచి ఆరు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే టెస్టుల్లో పోటీపడే జట్టుని ప్రకటించిన సెలక్టర్లు.. తాజాగా వన్డే సిరీస్ కోసం 17 మందితో కూడిన జట్టుని ఎంపిక చేశారు.
తొడకండరాల గాయం కారణంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కి దూరమైన కేదార్ జాదవ్ మళ్లీ జట్టులో చోటు సంపాదించగా.. ముంబయి పేసర్ శార్ధూల్ ఠాకూర్‌‌పై కూడా సెలక్టర్లు నమ్మకం ఉంచారు. దీంతో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌పై వేటు పడింది. ఇటీవల యో-యో టెస్టులో పాసైన సురేశ్ రైనా, యువరాజ్ సింగ్‌కి మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపారు.
వన్డే జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ధోని, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్ధూల్ ఠాకూర్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyderabad, First Published 2, Oct 2018, 1:51 PM IST
Highlights
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఈ షో ఎలా ఉండబోతుందనే విషయంపై కొన్ని వివరాలు బయటకి వచ్చాయి.
రెండుగంటల పాటు సాగే ఈ ఫంక్షన్ ఎలాంటి హడావిడి, గోల లేకుండా క్లాస్ గా జరుగుతుందని అంటున్నారు. దలేర్ మహెంది, శివమణి, ఆర్మాన్ మాలిక్, కైలాష్ ఖేర్ లైవ్ షో లు వుంటాయి. సిరివెన్నెల, రామజోగయ్య, ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల స్పీచ్ లు స్పెషల్ గా ఉంటాయని చెబుతున్నారు.
మెడ్లీలు, ఎవీల హడావిడి లేకుండా టోటల్ గా ఫంక్షన్ మొత్తం మంచి ఫీల్ ని కలిగించే విధంగా వుంటుదని తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో హారికాహాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ రూపొందించింది.
సంబంధిత వార్తలు.. | 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.