news
stringlengths
299
12.4k
class
class label
3 classes
లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు   ముంబై, జనవరి 27: బెంచ్‌మార్క్‌ స్టాక్‌ సూచీలు ఎగువన ముగిసాయి. వరుసగానాలుగోరోజు కూడా లాభాల్లో ముగిసాయి. ఇన్వెస్టర్లు కేంద్ర బడ్జెట్‌పై ఎక్కువ ఆశలతో ఉన్నారు. కార్పొరేట్‌ ఫలితాలు కూడా ఆశించినస్థాయికంటే ఎక్కువగానే రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. నిఫ్టీ మే 27వ తేదీనాటి గరిష్టస్థాయిని నమోదుచేసింది. బ్యాం కింగ్‌, ఆర్థికరంగ స్టాక్స్‌లో ఎక్కువ లాభాలు ఆర్జిం చింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 174 పాయింట్ల ఎగువన 27,882 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి 38 పాయింట్ల ఎగువన 8641 పాయింట్లవద్ద స్థిర పడింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.6 శాతం, 0.5శాతం చొప్పున క్షీణించాయి. ఐసిఐసిఐ బ్యాంకు, భారతి ఎయిర్‌టెల్‌, ఎస్‌బిఐ, ఎన్‌టిపిసి సెన్సెక్స్‌లో ఎక్కువ లాభాలతో ముగిస్తే ఐటిసి విప్రో లూపిన్‌ హిందూస్థాన్‌ యూని లీవర్‌ ఎక్కువ నష్టపోయాయి. ఐటిసి2.8శాతం దిగజారింది. డిసెం బరు త్రైమాసికం ఫలితాలు అంచనాలను అధి గమించాయి. నికరలాభం 5.7శాతం పెరిగి 2650 కోట్లుగా నమోదుచేసింది. అంతకు ముందు ఏడాది 2504 కోట్లకంటే పెరిగి నా షేర్లుతగ్గాయి. ఆర్థికరంగ స్టాక్స్‌ బ్యాంకింగ్‌, ఇతర ఆర్థిక సేవల సంస్థలసూచీలు 1.25శాతం, 1.65శాతం చొప్పున క్షీణించాయి. ఐసిఐసిఐబ్యాంకు లాభాల్లో ఎక్కువ దూసుకుపోగా నిఫ్టీ బ్యాంక్‌ సూచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పిఎన్‌బి, ఎస్‌బిఐ, యాక్సిస్‌బ్యాంకులు కూడా పెరిగాయి. బిఎస్‌ఇలో మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, విద్యుత్‌ సూచీలు ఇందన సూచీలు 52వారాల గరిష్టస్థాయిని తాకాయి. హిందాల్కో ఇండస్ట్రీస్‌, నాల్కో,స్టీల్‌ అథా రిటీ ఆఫ్‌ ఇండియా, మెటల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొ రేషన్‌, భారత్‌పెట్రోలియం కార్పొ రేషన్‌, గెయిల్‌, ఇంద్రప్రస్థగ్యాస్‌ కంపెనీలు, ఆయిల్‌ అండ్‌గ్యాస్‌ రంగ పరంగా పెరిగాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, కెయిర్న్‌ ఇండియా, ఎన్‌ఎల్‌సి ఇండియా ఇంధన రంగపరం గాను, యుటిలిటీ, విద్యుత్‌ సూచీపరంగా ఇంట్రాడేలో 52వారాల గరిష్టస్థాయికి చేరాయి. ఆసియా మార్కెట్ల పరంగా స్వల్పంగా తగ్గాయి. చమురు, డాలర్‌ పటిష్టం కావడం వంటివి కొంతమేర కలిసొచ్చాయి. వీటికితోడు పటిష్టమైన అమెరికా కార్పొరేట్‌ లాభాలు కూడా కొంత తోడయ్యాయి. ఎంఎస్‌సిఐ ఆసియా పసి ఫిక్‌ షేర్లు జపాన్‌ బయటి ప్రాంతంలో 0.1శాతం దిగజారాయి. మార్కెట్లు చాంద్రమాన కొత్తసంవత్సరం కావడంతో సెలవుమూడ్‌లో ఇన్వెస్టర్లు అప్ర మత్తంగా కొనుగోళ్లు జరిపారు. జపాన్‌నిక్కీ 0.3 శాతం పెరిగింది. డిసెంబరు కీలక వినియోగ రంగ ధరలు వార్షికపద్ధతిలోమందగమనంతో ఉన్నా యి. రానున్ననెలల్లో ద్రవ్యోల్బణం పెరుగు తుందన్న సంకేతాలతో మార్కెట్లు అప్రమ త్తంగా వ్యవహరించారు. నిక్కీ 1.7శాతం లాభాల్లో ముగిసింది. చైనామార్కెట్లు చాంద్ర మాన కొత్త సంవత్సరం సందర్భంగా సెల వులో ఉన్నాయి. వచ్చేనెల 3వ తేదీ ప్రారంభం అవుతాయి. హాంకాంగ్‌ షేర్ల పరంగాచూస్తే స్వల్పంగా దిగజారాయి. మధ్యాహ్నం నుంచే మార్కెట్లు మూతపడటమే ఇందుకు కారణం.
1entertainment
హీరో విశాల్ సోదరి ఐశ్వర్య వివాహంలో తమిళ స్టార్స్ సందడి గ్యాలరీ. First Published 28, Aug 2017, 6:53 PM IST హీరో విశాల్ సోదరి ఐశ్వర్య వివాహంలో తమిళ స్టార్స్ సందడి గ్యాల హీరో విశాల్ సోదరి ఐశ్వర్య వివాహంలో తమిళ స్టార్స్ సందడి గ్యాల హీరో విశాల్ సోదరి ఐశ్వర్య వివాహంలో తమిళ స్టార్స్ సందడి గ్యాల హీరో విశాల్ సోదరి ఐశ్వర్య వివాహంలో తమిళ స్టార్స్ సందడి గ్యాల హీరో విశాల్ సోదరి ఐశ్వర్య వివాహంలో తమిళ స్టార్స్ సందడి గ్యాల హీరో విశాల్ సోదరి ఐశ్వర్య వివాహంలో తమిళ స్టార్స్ సందడి గ్యాల హీరో విశాల్ సోదరి ఐశ్వర్య వివాహంలో తమిళ స్టార్స్ సందడి గ్యాల హీరో విశాల్ సోదరి ఐశ్వర్య వివాహంలో తమిళ స్టార్స్ సందడి గ్యాల హీరో విశాల్ సోదరి ఐశ్వర్య వివాహంలో తమిళ స్టార్స్ సందడి గ్యాల హీరో విశాల్ సోదరి ఐశ్వర్య వివాహంలో తమిళ స్టార్స్ సందడి గ్యాల Recent Stories
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV టీ20 ఫైట్: ప్రపంచ జట్టు vs పాకిస్థాన్ జట్టు పాకిస్థాన్‌ జట్టు‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడేందుకు ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టు క్రికెటర్లు సోమవారం లాహోర్ చేరుకున్నారు TNN | Updated: Sep 11, 2017, 03:09PM IST పాకిస్థాన్‌ జట్టు‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడేందుకు ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టు క్రికెటర్లు సోమవారం లాహోర్ చేరుకున్నారు. 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై మిలిటెంట్లు దాడి చేసిన అనంతరం ఏ టెస్టు జట్టు కూడా పాక్‌లో పర్యటించలేదు. దీంతో తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు‌కి తాజాగా ఐసీసీ ఒక టీ20 సిరీస్‌తో మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ సిరీస్‌పై ఆసక్తి కనబర్చిన క్రికెటర్లు వరల్డ్ ఎలెవన్ జట్టుగా ఏర్పడి పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్‌లో తలపడనున్నారు. మంగళవారం నుంచి ఈ సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో తాజాగా క్రికెటర్లు లాహోర్ చేరుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ వరల్డ్ ఎలెవన్ జట్టుకి భారీ భద్రతని కల్పించారు. దాదాపు 9వేల మంది పోలీసులతో రక్షణ కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ జట్టుకి దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ నాయకత్వం వహిస్తుండగా.. ఆ జట్టు ఓపెనర్ హసీమ్ ఆమ్లా, డేవిడ్ మిల్లర్, బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్, న్యూజిలాండ్‌కి చెందిన గ్రాంట్ ఇలియట్, ఇంగ్లాండ్‌‌కి చెందిన పాల్ కాలింగ్‌వుడ్, ఆస్ట్రేలియా జట్టు సభ్యుడు జార్జ్ బెయిలీ, దక్షిణాఫ్రికా బౌలర్లు మోర్నీ మోర్కెల్, స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బెన్ కటింగ్, వెస్టిండీస్ క్రికెటర్లు శ్యామూల్ బద్రి, డారెన్ సామీ వరల్డ్ ఎలెవన్ జట్టు‌లో సభ్యులుగా ఉన్నారు.
2sports
play stopped due to rain ఆసీస్ చివరి ఛాన్స్‌ని వరుణుడు వదల్లేదా..? ప్రస్తుతం 2 పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్ రద్దు ద్వారా ఒక పాయింట్ వస్తే.. బంగ్లాదేశ్ (3)తో సమానంగానిలుస్తుంది. TNN | Updated: Jun 10, 2017, 07:55PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణుడు దెబ్బకి దారుణంగా నష్టపోయిన జట్టు ఆస్ట్రేలియా. ఎంతలా అంటే తాజా టోర్నీలో ఆ జట్టు ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ వర్షం కారణంగా ఫలితం తేలలేదు. దీంతో ప్రత్యర్థితో కలిసి పాయింట్లను పంచుకుంటూ వస్తున్న కంగారూలు.. శనివారం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌కి చేరుతారు. కానీ.. ఈ చివరి ఛాన్స్‌ని కూడా వరుణుడు ఆస్ట్రేలియాకి ఇచ్చేలా కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 6 ఓవర్లు ముగిసే సమయానికే 35/3తో కష్టాల్లో పడింది. తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్ జేసన్ రాయ్ (4), అలెక్స్ హేల్స్ (0) వికెట్లను ఆ జట్టు చేజార్చుకోగా.. ఫామ్‌లో ఉన్న జో రూట్ (15) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయాడు. ఈ దశలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితం ప్రకటించాలంటే.. కనీసం 20 ఓవర్లు పూర్తవ్వాలి. లేదంటే మ్యాచ్‌ రద్దుగానే ప్రకటిస్తారు.
2sports
KP Rangarao , chemistrs &Druggists Ass, leader – ప్రధానమంత్రి కార్యాలయం నుండి సానుకూల లేఖ  – రాష్ట్ర నాయకులు కె.పి.రంగారావు నరసరావుపేట,: రాష్ట్రంలో డ్రగ్‌ లైసెన్స్‌ ఫీజుల పెంపు నిర్ణయం అమలు చేస్తే వినియోగదారులతో పాటు వ్యాపారులు సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని కెమిస్ట్‌ అండ్‌ డ్రగిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు కె.పి.రంగారావు అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో కె.పి.రంగారావు మాట్లాడారు. ఫార్మశి కౌన్సిల్‌ ద్వారా ఇన్‌స్పెక్టర్లు మెడికల్‌షాపులను తనిఖీ చేసే అధికారం వలన సాంకేతికంగా సమస్యలు వస్తున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్‌ సంస్ధలకు ఇచ్చే రాయితీలను రిటైల్‌ వ్యాపారులకు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జన ఔషధి షాపుల ఏర్పాటుకు బదులు ప్రస్తుతం నడుస్తున్న షాపులకు రాయితీలను ఇచ్చి ఎంఆర్‌పి ధరలను నిర్ణయించాలన్నారు. 35శాతం వరకు వ్యాపారులకు మార్జిన్‌ను ఇప్పించాలన్నారు. ఫుడ్‌ లైసెన్స్‌ విధానాన్ని మెడికల్‌ షాపులకు వర్తింపజేయడం తగదన్నారు.అదే విధంగా వే బిల్లులకు సంబంధించి వాహనాల నెంబర్లను ముందుగానే కోడ్‌ చేయడం క్షేత్రస్ధాయిలో సాధ్యంకాదనే విషయాన్ని గమనించి ఆ నిబంధన తొలగించాలన్నారు. ఇప్పటికే కార్పోరేట్‌ సంస్ధల ప్రవేశంతో దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షలు, రాష్ట్రంలో ఆరు లక్షలకు పైగా ఉన్న రిటైల్‌ వ్యాపారుల కుటుంబాల పరిస్ధితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం, సిఎం కార్యాలయం, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెక్రటరీ కార్యాలయం, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రికి సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగిందన్నారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి తమకు నేరుగా పరిశీలిస్తామని సానుకూల నిర్ణయాన్ని తెలియజేయడం జరిగిందని కె.పి.రంగారావు వివరించారు.
1entertainment
Bat slip, good catch, no-ball - All in one https://t.co/tMMnjO70cj via @ipl — gujjubhai (@gujjubhai17) 1557244404000 అసలు ఏం జరిగిందంటే..? మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై టీమ్ తొలుత బ్యాటింగ్ చేయగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌కి వచ్చాడు. అప్పటికే 25 బంతుల్లో 31 పరుగులు చేసిన ధోనీ క్రీజులో ఉండటంతో.. బుమ్రాకి బాదుడు తప్పదని అంతా భావించారు. కానీ.. తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా లో ఫుల్‌టాస్ రూపంలో బుమ్రా విసరగా.. ధోనీ హెలికాప్టర్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ చేజారడంతో ఆ బంతి క్యాచ్‌గా వెళ్లింది. దీంతో.. నిరాశగా ధోనీ పెవిలియన్‌కి వెళ్తుండగా.. బుమ్రా క్రీజు నోబాల్ విసిరినట్లు అనుమానించిన ఫీల్డ్ అంపైర్ ధోనీని ఆపాడు. దీంతో.. రిప్లైని పరిశీలించగా.. క్రీజు వెలుపల పాదం ఉంచి బుమ్రా బంతి విసిరినట్లు తేలింది. దీంతో.. ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత ఆఖరి బంతి వరకూ క్రీజులో ఉన్న ధోనీ.. బుమ్రా ఓవర్‌లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. @imVkohli @msdhoni @Jaspritbumrah93 #MSDhoni #MIvCSK @mipaltan https://t.co/2FKR8gqpEz — Abhijit Jadhav (@abhijit2610) 1557252178000 ఈ మ్యాచ్‌లో తొలుత అంబటి రాయుడు (42: 37 బంతుల్లో 3x4, 1x6), మహేంద్రసింగ్ ధోని (37: 29 బంతుల్లో 3x6) నిలకడగా ఆడటంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (71 నాటౌట్: 54 బంతుల్లో 10x4) బాధ్యతాయుత అర్ధశతకం బాదడంతో ముంబయి జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగానే 132/4తో అలవోక విజయాన్ని అందుకుంది. Dhoni Didn't Hit A Single Boundary In Bumrah's Last Over And Lost His Wicket In Very First Ball Unfortunately That… https://t.co/pIyODSbh0H — HARDY™ | NGK (@Hardy_Offl) 1557244025000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
BSE ట్రేడింగ్‌ ఆసాంతం హెచ్చుతగ్గులే! ముంబై,: ట్రేడింగ్‌ ఆసాంతం స్వల్పస్థాయి హెచ్చుతగ్గులకులోనైన దేశీయస్టాక్‌ మార్కెట్లు చివరికి నామమాత్రపు లాభాలతోనే ముగిసాయి. ట్రేడిం గ్‌ ముగిసేసమయానికి సెన్సెక్స్‌ 14పాయింట్లు లాభపడి 28,240 పాయింట్ల వద్ద స్థిరపడితే నిఫ్టీ ఏడుపాయింట్లుపెరిగి 8741 పాయింట్లవద్ద స్థిరపడింది. బడ్జెట్‌ నేపథ్యంలో గడచిన రెండురోజులు మార్కెట్లు లాభాలతో ర్యాలీ తీయ డంతో శుక్రవారం ట్రేడింగ్‌ మాత్రం పునరేకీకరణ బాటపట్టినట్లు అంచనాలు న్నాయి. అయితే ఈ ధోరణులకు విరుద్ధంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, చిన్న షేర్లకు మంచి డిమాండ్‌ కనిపించింది. ఎన్‌ఎస్‌ఇలో ఆటో, మెటల్‌; ఎఫ్‌ఎంసిజి రంగాలు 0.8 నుంచి రెండుశాతం మధ్య బలహీనపడితే ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సూచి మూడుశాతం పెరిగింది. సన్‌టివి ఆధ్వ ర్యంలో మీడియా షేర్లు పురోగమించడంతో మీడియాసూచి 2.3శాతం పెరిగింది. ఇక ఐటి, రియాల్టీసూచీలు సైతం ఒకటిశాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, టెక్‌ మహీంద్ర, సిప్లా, భెల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ భారతీయస్టేట్‌బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు 5-1.5శాతంమధ్య ముందుకు దూకాయి. అయితే బోష్‌, జీ, ఐషర్‌మోటార్స్‌, టాటామోటార్స్‌,ఐసిఐసిఐ, పవర్‌గ్రిడ్‌, అరవిందో, అంబూజా, ఎసిసి కంపెనీలు 1-2.6శాతంమధ్య నష్టపోయాయి. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్స్‌ సూచి 0.6శాతం పెరిగితే స్మాల్‌క్యాప్‌సూచి 1.1శాతం ముందుకు దూకింది. మొత్తం ట్రేడింగ్‌ జరిగిన షేర్లలో 1624 కంపెనీలు లాభపడితే 1171 కంపెనీలు నష్టపోయాయి. చిన్నక్యాప్‌సూచీలో ఎంటిఎన్‌ఎల్‌ 20శాతం ర్యాలీతీసింది. కెఇఐ, యూనిటెక్‌, ఆర్షియా, మోనెట్‌, ఇస్పాట్‌, సీక్వెంట్‌, స్యూబెక్స్‌, స్టార్‌, టిసిఐ, గ్రాన్యూల్స్‌, రాజ్‌టివి,ఐఎఫ్‌బి, ఆర్బిట్‌ ఇండోరమా, ఏస్‌, కెసిపి, గుడ్‌రిక్‌, టిఎల్‌, ఆర్కిడ్‌ఫార్మా, ఎఫ్‌డిసి తదితర కంపెనీలు 7-17శాతం దూసుకుపోయాయి. ఎక్ఛేంజిల్లో బిఎస్‌ఇ షేర్లు శుక్రవారం భారీర్యాలీతీసాయి. ఇష్యూ ధర రూ.806 కంటే 1085 రూపాయలకు పెరి గింది. ప్రీమియంస్థాయిలో 35శాతం అధికధర లు పలికినట్లు తేలింది. మొత్తంగాచూస్తే ఒకదశ లో 1200 స్థాయికి కూడా చేరింది. 49శాతం పెరిగి రికార్డు నమోదుచేసింది. ఆటోరంగకంపెనీ లు రెండోరోజు కూడా నష్టాల్లోనే ముగిసాయి. జనవరి నెల విక్రయాల గణాంకాలే ఇందుకుకీలకం. టాటామోటార్స్‌ రెండుశాతం క్షీణించి 522గాముగిసింది. ఐటిరంగషేర్లు ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ ఒకటిశాతంచొప్పున క్షీణించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు కొంత మేర పెరిగాయి. ప్రభుత్వరంగంలోని ఆరుబ్యాంకులతోపాటు సిటీ యూని యన్‌బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకులు కూడా 52 వారాల గరిష్ఠస్థాయికి చేరాయి.
1entertainment
పండగల సీజన్‌లో తగ్గిన బిఎస్‌-4 విక్రయాలు bs-6 bike న్యూఢిల్లీ: తెలుగు వారికి పెద్దపండగలైన దసరా, దీపావళి వస్తుందంటే చాలు అందరికి ఇళ్లల్లో ఆనందం వచ్చిపడుతుంది. అయితే దసరా, దీపావళికి ఎదైన ఒక కొత్త వస్తువుగానీ, బైక్‌గానీ, కారుగానీ కొనాలకుంటారు చాలా మంది. అయితే వీరంతా పండగల సీజన్‌లో ఆఫర్లు ఉండాయని కూడా భావిస్తున్నారు. బడ్జెట్‌కు అనుగుణంగా పాత వెహికిళ్ల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలని మధ్యతగగతి వర్గాలు, సొంతకారు కొనుక్కోవాలని ఉద్యోగ వర్గాల వారు ఆలోచిస్తుంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్రేటర్‌లో వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దసరాపండగ అయిపోయింది. దీపావళి వస్తోంది. కానీ విక్రయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా వచ్చే వాహనాల కొనుగోలుపై సిటీజనులు అనాసక్తిగా ఉన్నారు. నచ్చిన కార్లు, బైక్‌లు కొనుక్కోవాలని ఉన్నప్పటికీ వాయిదాలు వేస్తున్నారు. ఏ నెలకానెల ఇలా వాయిదాలతోనే సాగుతోంది. ప్రతీ సంవత్సరం దసరా, దీపావళి పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో షోరూమ్‌ల వద్ద జనాలు బారులుతీరేవారు. కానీ ఇప్పుడు అమ్మకాలు చాలా వరకు మందగించాయి. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/
1entertainment
sumalatha 157 Views BISCUITS , Britannia , gst , Parle Parle G బెంగళూరు: పార్లే కంపెనీ మొనాకో, పార్లేజీ, మేరీ బ్రాండ్ల పేరిట బిస్కెట్లను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశీయంగా ఇది అతిపెద్ద బిస్కెట్ల తయారీ కంపెనీ భారీ సంఖ్యలో కార్మికులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. విక్రయాలు భారీగా పడిపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. దేశీయంగా ఆటోమొబైల్‌, రిటైల్‌తో పాటు దాదాపు అన్ని రంగాలు నేల చూపులు చూస్తున్న వేళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కంపెనీలు ఉత్పత్తి, ఉద్యోగుల నియామకాలను తగ్గింపు దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్లే సైతం అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం సంస్థలో దాదాపు లక్ష మంది కార్మికులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 10 సొంత ఉత్పత్తి కేంద్రాలతో పాటు, 125 థర్డ్‌ పార్టీ బిస్కెట్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. దీనిపై సంస్థ ప్రతినిధి మయాంక్‌ షా మాట్లాడుతూ..ఖఖవిక్రయాల్లో తగ్గుదల నమోదవుతున్న క్రమంలో జీఎస్టీపై కొన్ని వెసులుబాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాం. ఒకవేళ ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే దాదాపు 8 వేల నుంచి 10 వేల మంది కార్మికుల్ని తొలగించడం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదుగగ అని ప్రస్తుత పరిస్థితుల్ని వివరించారు. తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/editorial/
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ప్రపంచకప్‌ జట్టుపై క్లారిటీ.. కానీ..?: రోహిత్ ప్రపంచ‌కప్‌లోపు భారత్ జట్టు 13 వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో ఆడే జట్టే కొంచెం అటూ ఇటుగా వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం ఉంటుంది -రోహిత్ శర్మ Samayam Telugu | Updated: Jan 10, 2019, 07:01PM IST ప్రపంచకప్‌ జట్టుపై క్లారిటీ.. కానీ..?: రోహిత్ ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌‌లో ఆడనున్న జట్టుపై ఇప్పటికే స్పష్టత వచ్చేసిందని భారత ఓపెనర్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో శనివారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ మొదలుకానుండగా.. ఈరోజు మీడియాతో వైస్ కెప్టెన్‌ హోదాలో రోహిత్ శర్మ మాట్లాడాడు. మే చివరి వారంలో ప్రపంచకప్ ఆరంభంకానుండగా.. అప్పటిలోపు భారత్ జట్టు ఆస్ట్రేలియా‌తో మూడు వన్డేలు, న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20లు, మళ్లీ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకూ భారత్ గడ్డపై రెండు టీ20లు, ఐదు వన్డేలను ఆడనుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టుపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేస్తుందన్న రోహిత్.. పేలవ ఫామ్‌ కారణంగా ఆటగాళ్లు చోటు కోల్పోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించాడు. ‘ప్రపంచ‌కప్‌లోపు భారత్ జట్టు 13 వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో ఆడే జట్టే కొంచెం అటూ ఇటుగా వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం ఉంటుంది. గత ఏడాదికాలంగా భారత్ జట్టు చాలా మ్యాచ్‌లు ఆడింది. కాబట్టి.. గాయాల బెడద మామూలే. అయితే.. జట్టులో ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోకపోవచ్చు. కానీ.. పేలవ ఫామ్‌తో జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదమూ ఆటగాళ్లకి లేకపోలేదు’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV అంపైర్లతో గొడవ.. మైదానంలో బంగ్లా రచ్చ ముక్కోణపు టీ20 సిరీస్‌‌లో శుక్రవారం రాత్రి శ్రీలంకని ఓడించి ఫైనల్‌కి చేరిన బంగ్లాదేశ్ మైదానంలో రచ్చరచ్చ చేసింది. TNN | Updated: Mar 17, 2018, 09:45AM IST అంపైర్లతో గొడవ.. మైదానంలో బంగ్లా రచ్చ ముక్కోణపు టీ20 సిరీస్‌‌లో శుక్రవారం రాత్రి శ్రీలంకని ఓడించి ఫైనల్‌కి చేరిన బంగ్లాదేశ్ మైదానంలో రచ్చరచ్చ చేసింది. ఒకానొక దశలో మ్యాచ్‌ నిలిచిపోతుందేమో అనిపించేలా పసికూన జట్టు క్రికెటర్లు వ్యవహరించారు. అయితే.. ఎట్టకేలకి ఆ జట్టు కోచ్, అంపైర్లు చొరవ తీసుకుని ఆటగాళ్లని శాంతపరచడంతో.. మ్యాచ్ కొనసాగగా బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. అసలు ఏం జరిగిందంటే..? బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో మహ్మదుల్లా (43 నాటౌట్: 18 బంతుల్లో 3x4, 2x6) ఒంటరిపోరాటం చేస్తుండంతో ఆ జట్టు విజయంపై నమ్మకంతోనే ఉంది. కానీ చివరి ఓవర్ వేసిన శ్రీలంక బౌలర్ ఉదాన.. తొలి రెండు బంతుల్ని షార్ట్ పిచ్ బంతులుగా విసిరాడు. అయితే.. వాటిని క్రీజులో ఉన్న ముస్తాఫిజుర్ బ్యాట్‌తో తాకించలేకపోయాడు. అయినప్పటికీ.. రెండో బంతికి రన్ కోసం ప్రయత్నించి ముస్తాఫిజుర్ రనౌటయ్యాడు. ఈ సమయంలో మహ్మదుల్లా‌కి డ్రింక్స్ తీసుకొచ్చిన సబ్‌స్టిట్యూడ్ ఫీల్డర్ నూరుల్.. శ్రీలంక కెప్టెన్ తిసార పెరీరాతో గొడవపడ్డాడు. బంతి బ్యాట్స్‌మెన్‌ భుజం కన్నా ఎక్కువ ఎత్తులో వచ్చిందని.. నోబాల్ ఇవ్వాలంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలోని అంపైర్లని డిమాండ్ చేశారు. కానీ.. ఫీల్డ్ అంపైర్లు వారి అభ్యర్థని తిరస్కరించడంతో బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ డగౌట్ నుంచి మైదానంలోని ఆటగాళ్లను మ్యాచ్ నిలిపివేసి వచ్చేయాలంటూ సైగలు చేస్తూ పిలిచాడు. అప్పటికి 4 బంతుల్లో బంగ్లా 12 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్ సూచన మేరకు క్రీజులో ఉన్న మహ్మదుల్లా, రుబెల్ మైదానం వెలుపలకి వచ్చేసేందుకు ప్రయత్నించగా.. అంపైర్లు వారికి సర్దిచెప్పారు. మరోవైపు కెప్టెన్‌కి బంగ్లాదేశ్ కోచ్ సర్దిచెప్పడంతో.. ఆట కొనసాగింది. తర్వాత మహ్మదుల్లా వరుసగా 4, 2, 6 బాది ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. గెలుపు అనంతరం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మైదానంలో సంబరాలతో హోరెత్తించారు. డ్రెస్సింగ్ రూములో ఓ అద్దాన్ని కూడా పగలగొట్టారు. మొదట కుశాల్ పెరీరా (61: 40 బంతుల్లో 7x4, 1x6), తిసార పెరీరా (58: 37 బంతుల్లో 3x4, 3x6) అర్ధశతకాల బాదడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తమీమ్ ఇక్బాల్ (50: 42 బంతుల్లో 4x4, 2x6), మహ్మదుల్లా మెరుపులు మెరిపించడంతో 160 పరుగుల లక్ష్యాన్ని19.5 ఓవర్లలో 160/8తో ఛేదించింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Suresh 102 Views ఫోన్‌7 భారత్‌లోనే మొట్టమొదటి విడుదల! న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: యాపిల్‌ కంపెనీ ఎట్టకేలకు భారత్‌ మార్కెట్‌ ప్రాధాన్యతను గుర్తించింది. మేకిన్‌ ఇండియా ద్వారా భారత్‌ మార్కెట్‌లో పెద్ద ఎత్తున ప్రవేశించేందుకు ఆసక్తితో ఉంది. యాపిల్‌ ఐఫోన్‌7 ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్ణయించింది. కూపర్టినో కేంద్రంగా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అంతర్జాతీయ విడుదకే ప్రాధాన్యం ఇస్తోంది. భారత్‌లో కూడా ఇందుకు సంబంధించి ఉత్పత్తిని ప్రారం భించే లక్ష్యంతో ఉంది. కంపెనీ తాజా ఐప్యాడ్‌లు, ఐఫోన్లు విడుదలచేసేముందు భారత్‌ మార్కెట్‌పై ఎక్కువ అధ్యయనం చేసింది. మేనెలలో భారత్‌ పర్యటించిన సిఇఒ టిమ్‌కూక్‌ తన మొట్టమొదటి ఐఒఎస్‌ యాప్‌ డిజైన్‌, అభివృద్ధి కేంద్రాన్ని బెంగ ళూరులో ప్రారంభించారు. హైదరాబాద్‌లో మ్యాప్‌ రూపకల్పన కేంద్రాన్ని ప్రారం భించారు. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌, యాపిల్‌ వాచ్‌లకు వివిధ ఉత్పత్తులు అందిస్తుంది. ప్రధాని నరేంద్రమోడీ తో చర్చలు జరిపిన కూక్‌ను మేకిన్‌ ఇండియాలో భాగస్వాములు కావాలని ప్రధాని కోరారు. సింగిల్‌బ్రాండ్‌ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులను సడలిం చిన ప్రభుత్వం స్థానిక వనరులసేకరణ నిబంధనలు మూడేళ్ల వరకూ సడలించింది. మరో ఐదేళ్లపాటు అవసరమైతే కొనసాగిస్తుంది. భారత్‌లో రిటైల్‌ స్టోర్‌్‌స ఏర్పాటుచేస్తామని కుక్‌ప్రకటించారు. మొదటి మూడుత్రైమాసికాల్లోనే ఈస్టోర్లుప్రారంభం అవుతాయి. ఐఫోన్‌ భారత్‌ విక్రయాలు వార్షికపద్ధతిలో చూస్తే 51 శాతం పెరిగాయి. కంపెనీ వృద్ధికి భారత్‌మార్కెట్‌ కీలకంగా చెపుతున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం చూస్తే డిసెంబరునాటికి ఐఫోన్‌7 భారత్‌మార్కెట్‌కు వస్తుందని తెలిసింది. పండుగసీజన్‌ సందర్భంగా అక్టో బరునాటికే రావచ్చని కొందరు నిపుణులఅంచనా. యాపిల్‌కు భారత్‌మార్కెట్‌ ఎంతో కీలకం అన్న సంకేతా లను అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు సైతం యాపిల్‌ చేరవేస్తున్నదని కంపెనీ సిఇఒ ధోరణులు స్పష్టంచేస్తున్నాయి.
1entertainment
ajith's film collects rs 160 crore బాగోలేదన్న సినిమా.. రూ.200కోట్ల క్లబ్‌లోకి..! ఈ సినిమా పట్ల రివ్యూయర్లు పెదవి విరిచారు, రేటింగులు కూడా చాలా తక్కువే ఇచ్చారు. అయితే TNN | Updated: Sep 11, 2017, 11:05AM IST ​‘వివేగం’ విడుదల అయిన తొలి రోజున ఈ సినిమా విమర్శనాత్మక రివ్యూలను ఎదుర్కొంది. ఈ సినిమా పట్ల రివ్యూయర్లు పెదవి విరిచారు, రేటింగులు కూడా చాలా తక్కువే ఇచ్చారు. అయితే అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా అలాంటి వాటి ప్రభావాన్ని పెద్దగా ఎదుర్కొన్నట్టుగా కనిపించడం లేదు. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లే అందుకు తార్కాణం. తమిళ ట్రేడ్ ఎనలిస్టుల లెక్కల ప్రకారం.. వివేగం సినిమా ఇప్పటికే రూ.160 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా లెక్కేస్తే ‘వివేగం’ వసూళ్లు నూటా యాభై కోట్ల మార్కును, నూటా అరవై కోట్ల రూపాయల మార్కును దాటేశాయని తమిళ ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. వివేగం తమిళంతో పాటు తెలుగులోకి కూడా అనువాదమై విడుదల అయ్యింది. ఈ సినిమాకు వసూళ్ల ప్రవాహం ఆగడం లేదని.. త్వరలోనే ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయల మార్కును కూడా రీచ్ అయ్యే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.
0business
పెట్రో రిటైలింగ్‌ ప్రయివేటు పరం! Thu 24 Oct 00:16:29.881141 2019 దేశంలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్న మోడీ సర్కారు.. అందుకు గాను ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను ఫణంగా పెడుతోంది. రిటైల్‌ చమురు రంగంలో మేటిగా వెలుగొందుతున్న ప్రయివేటు పెట్టుబడులు పెరగాలి.. Sat 23 Sep 07:08:12.141044 2017 ముంబయి: వృద్ధి రేటును తిరిగి గాడిన పెట్టేందుకు గాను ప్రయివేటు పెట్టుబడులను పునరుద్ధరించడం.. బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేయడం ప్రధాన సవాళ్లని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బినామీ సమాచారమిస్తే కోటి! Sat 23 Sep 07:08:19.694003 2017 న్యూఢిల్లీ: బినామి ఆస్తుల వివరాలను వెలికి తీసేందుకు గాను సర్కారు వినూత్న పథకాన్ని యోచిస్తోంది. భారీగా నగదు నజరానాను ప్రకటించడం ద్వారా బడా బాబులకు చెందిన బినామి ఆస్తులకు స విలీనం దిశగా విజయ-దేనా బ్యాంకులు! Sat 23 Sep 07:08:26.948227 2017 న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తులతో కునారిల్లుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనీకరణ అంశాన్ని పరిశీలిస్తునే.. వీలున్న చోట విత్త సంస్థల విలీనాల్ని సర్కారు పరిశీలిస్తోంది. ఇందులో 2020 నాటికి సెరామిక్‌ వ్యాపారం రెట్టింపు Sat 23 Sep 07:08:33.870203 2017 హైదరాబాద్‌: వచ్చే నెల (నవంబర్‌లో) 16-19 తేదిల్లో గుజరాత్‌లో 'వైబ్రంట్‌ సెరామిక్స్‌' డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని మోర్బి సెరామిక్స్‌ అసోసియేషన్ రెనో 'కాప్చర్‌' బుకింగ్‌లు షురూ! Sat 23 Sep 07:08:40.930644 2017 న్యూఢిల్లీ:ప్రముఖ కార్ల తయారీ కంపెనీ 'రెనో' తన ప్రీమియం ఎస్‌యూవీ 'కాప్చర్‌'ను ఆవిష్కరించింది. వచ్చే నెలలో భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంది. పండగ మైక్రోమ్యాక్స్‌ నుంచి 'సెల్ఫీ 3' స్మార్ట్‌ఫోన్‌ Sat 23 Sep 07:08:48.32466 2017 న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్‌ తాజాగా 'సెల్ఫీ 3' స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించిం ఇంటెక్స్‌ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌ Sat 23 Sep 07:08:56.259787 2017 న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ తాజాగా మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనిని ఆక్వా లయన్స్‌ 2 పేరిట విడుదల చేసింది. డామిట్‌.. కథ అడ్డం తిరిగిందా! Fri 22 Sep 06:48:05.722841 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తాము చేపట్టిన సంస్కరణల కారణంగా దేశం వృద్ధి పథంలో దూసుకుపోతోందని గొప్పలు చెప్పిన సర్కారు.. ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదరువుతుండడంతో డెఫెన్స్‌ టాటా 'నెక్సాన్‌' మార్కెట్లోకి వచ్చేసింది.. Fri 22 Sep 06:48:19.146002 2017 ముంబయి: ప్రముఖ దేశీయ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ తాజాగా కంపాక్ట్‌ ఎస్‌యువీ విభాగంలో నెక్సాన్‌ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ. 5.87లక్షల-ర 'యెస్‌' 2,500 మందికి ఇక ఉద్వాసనే! Fri 22 Sep 06:48:27.758467 2017 న్యూఢిల్లీ: ప్రయివేటు రంగ విత్త సంస్థ యెస్‌ బ్యాంక్‌ వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్టుగా సమాచారం. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 2,500మంది సిబ్బందిని తొలగి స్తున్నట్ట టాటా ప్రయి'వేటు'కు వాటాదారులు సై Fri 22 Sep 06:48:39.919099 2017 ముంబయి : టాటా గ్రూపు సంస్థల ప్రమోటర్‌ టాటాసన్స్‌ను పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీగా మారేందుకు ఇన్వెస్టర్ల ఆమోదం తెలిపారు. గురువారం జరిగిన టాటా 18 నెలల కనిష్టానికి విశ్వాసం Fri 22 Sep 06:48:54.283275 2017 న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వంటి బడా ఆర్థిక సంస్కరణల మూలంగా దేశంలోని ప్రధాన ఆర్థిక వ్యవహారాల అధికారుల్లో (స ఆ బ్యాంకుల చెక్కులు చెల్లవు: ఎస్‌బీఐ Fri 22 Sep 06:49:03.844263 2017 న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఖాతాదారుల నడ్డి విరిచేలా మరో నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల తమ బ్యాంకులో విలీనమైన ఆరు బ్యాంకు త్వరలో ఉద్దీపన.. Thu 21 Sep 03:27:37.8828 2017 న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు తదితర సంస్కరణల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో సర్కారు డెఫెన్స్‌లో పడింది. తాజాగా వృద్ధి రేటు మూడేండ్ల కని టెలికాం సంస్థల షేర్ల విలవిల! Thu 21 Sep 03:27:43.3328 2017 ముంబయి: కాల్‌ టర్మినేషన్‌ చార్జీలను సగానికి పైగా తగ్గించాలన్న ట్రారు ఆదేశాలతో బుధవారం టెల్కోల షేర్లను తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఇంట్రా ట్రేడింగ్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ షేర 7.5 కోట్ల అమ్మకాలు జరిపాం: హీరో Thu 21 Sep 03:27:49.122726 2017 ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటాకార్ప్‌ అమ్మకాల్లో సరికొత్త రికార్డును చేరుకుంది. కంపెనీ మొత్తం అమ్మకాలు 7.5 కోట్ల వాహనాల మార్కును దాటేసినట్టుగా కంపెనీకి రూ.999లకే 'జియోఫై' రూటర్‌! Thu 21 Sep 03:27:54.690236 2017 పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రిలయన్స్‌ జియో సంస్థ 'ఫెస్టివల్‌ సెలబ్రేషన్‌' ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ తమ సొంత వైఫై రూటర్‌ 'జియోఫె'ౖని కేవలం ఫోర్బ్స్‌ మేటి వ్యాపార చతురుల్లో రతన్‌ Thu 21 Sep 03:28:02.95853 2017 ఫోర్బ్స్‌ ప్రకటించిన మేటి వ్యాపార చతురత కలిగిన సమకాలీన వ్యాపా రవేత్తల జాబితాలో మన దేశానికి చెందిన ముగ్గురికి స్థానం లభించింది. ఫోర్బ్స్‌ ప్రారంభించి వందేండ్లు శామ్‌సంగ్‌ 'నెవర్‌ మైండ్‌' ఆఫర్‌! Thu 21 Sep 03:28:09.18496 2017 శామ్‌సంగ్‌ సంస్థ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం కొత్తగా 'నెవర్‌ మైండ్‌' ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన 12 నెలల్లో తె జీఎస్టీతో ఎగుమతులకు కష్టమే! Wed 20 Sep 07:32:08.164278 2017 న్యూఢిల్లీ: తగిన ముందస్తు సన్నద్ధత లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాలపై 'వస్తు, సేవల పన్ను' (జీఎస్టీ) అమలులోకి తేవడాన్ని ఎగుమతిదారుల సంఘాలు మంగళవారం తీవ్రంగా ఆక్షేపించారు. డొల్ల కంపెనీల వేటులో ప్రముఖులు! Wed 20 Sep 07:36:14.948832 2017 న్యూఢిల్లీ: డొల్ల కంపెనీల పని పట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో భాగంగా డొల్ల కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న పలువురు ప్రముఖులతో పాటు మహీంద్రా నుంచి డ్రైవర్‌ రహిత ట్రాక్టర్‌ Wed 20 Sep 07:40:35.086682 2017 ఃన్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా దేశీయ ట్రాక్టర్ల విభాగంలో కొత్త చరిత్రకు తెర తీసింది. మంగళవారం ఆ సంస్థ డ్రైవర్‌ రహిత ట్రాక్టర్‌ను ఆవిష్కరించి రూ.32వేల కోట్ల పెట్టుబడులు: ఎయిర్‌టెల్‌ Wed 20 Sep 07:43:46.014818 2017 న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌ వచ్చే రెండేండ్లలో రూ.32,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొంది. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడాన నేటి నుంచి ఎస్‌బీఐ లైఫ్‌ జంబో ఐపీవో Wed 20 Sep 07:46:15.864291 2017 న్యూఢిల్లీ: ప్రాథమిక మార్కెట్లో మరో భారీ పబ్లిక్‌ ఇష్యూకు నేటి (బుధవారం) నుంచి తెర లేవనుంది. దాదాపు రూ.8,400 కోట్ల (1.3 బిలియన్‌ డాలర్ల) మేర నిధుల సమీకరణ నిమిత్తం ఎస్‌బీఐ గూగుల్‌ 'తేజ్‌'కు భారీ స్పందన Wed 20 Sep 07:48:02.30486 2017 న్యూఢిల్లీ: గూగుల్‌ తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన పేమెంట్‌ యాప్‌ తేజ్‌కు దేశ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ మొబైల్‌ యాప్‌ను విడుదల చేసిన 24 గంటల్లోనే దాదాపు 4,1 స్టాక్‌ మార్కెట్లకు 'ఫెడ్‌' భయాలు Wed 20 Sep 07:50:32.386051 2017 ముంబయి : అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌రల్‌ రిజర్వు పాలసీ సమీక్ష నిర్ణయాలు రానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్పంగా చౌక ఫోన్‌ యుద్ధంలోకి బీఎస్‌ఎన్‌ఎల్‌ Tue 19 Sep 03:34:04.678959 2017 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా చౌక ధరల ఫీచర్‌ ఫోన్‌ యుద్ధంలోకి దిగింది. జియోతో పాటు ఇతర టెల్కోలు తక్కువ ధరకే ఈ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న నేపథ్యం ..అలా డిజిటల్‌ లావాదేవీల వైపు Tue 19 Sep 03:34:11.399533 2017 న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు కారణం గా తప్పని పరిస్థితుల్లో ప్రజలు డిజిటల్‌ లావాదేవీల దిశగా దృష్టి సారించడం మొ దలు పెట్టినప్పటికీ.. తరువాత కాలంలో చాలామంది ప్రజలకు ఇదిఒక అభ అందుకే వృద్ధి రేటు తగ్గుతోంది! Tue 19 Sep 03:34:18.882159 2017 న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానాలు వృద్ధి రేటును గణనీయంగా ప్రభావితం చేస్తున్నట్టుగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆవ మైక్రోమ్యాక్స్‌ నుంచి రెండు బడ్జెట్‌ ఫోన్‌లు Tue 19 Sep 03:34:25.422994 2017 న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్‌ తన భారత్‌ సిరీస్‌ మోడళ్లను విస్తరిస్తుంది. ఇందులో భాగంగా మొదటిసారి స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే వారిని లక్ష్యం చ ఫోర్డుతో జట్టు కట్టిన మహీంద్రా Tue 19 Sep 03:34:31.898168 2017 ముంబయి: విద్యుత్తు వాహనాల తయారీ విషయంలో వ్యూహాత్మకంగా సహకరించుకొనేందుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా, అమెరికా వాహన తయారీ దిగ్గజం ఫోర్డ్‌తో జట్టు కట్టింది. అత్యాధునిక వాహనాల తయ దుమ్మురేపిన డిక్సన్‌ టెక్నాలజీస్‌ లిస్టింగ్‌ Tue 19 Sep 03:34:38.550746 2017 ముంబయి: వినియోగదారు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ సంస్థ డిక్సన్‌ టెక్నాలజీ మార్కెట్లో సోమవారం నమోదు అయ్యాయి. లిస్టింగ్‌ రోజే ఈ స్టాక్‌ మదుపరులకు అనూహ్య లాభాలను పంచింది. ఇష్ ఇన్ఫోసిస్‌కు మరో ఎదురు దెబ్బ! Mon 18 Sep 23:58:45.578434 2017 బెంగళూరు : దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ మధ్య కాలంలోనే ఆ కంపెనీ సీఈవో విశాల్‌ సిక్కా రాజీనామా మర్చిపోకముందే తాజాగా మరో సీన సెన్సెక్స్‌ 151 పాయింట్ల పరుగు Mon 18 Sep 23:57:15.41373 2017 ముంబయి : జాతీయ, అంతర్జాతీయ సానుకూల అంశాల మద్ధతుతో సోమవారం భారత మార్కెట్లు పరుగులు పెట్టాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో సూచీల ర్యాలీతో బీఎస్‌ఈ సెన్సెక్ నేడు గూగుల్‌ పేమెంట్స్‌ యాప్‌ ఆవిష్కరణ.. Mon 18 Sep 06:09:07.60182 2017 న్యూఢిల్లీ : ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ డిజిటల్‌ చెల్లింపుల మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. తేజ్‌ పేరుతో ఆ సంస్థ రూపకల్పన చేసిన పేమెంట్స్‌ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీవో, 'ఫెడ్‌' కీలకం.. Mon 18 Sep 06:09:14.866413 2017 నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష, ఎస్‌బీఐ లైఫ్‌ పబ్లిక్‌ ఇష్యూ ఆఫర్‌, ఉత్తర కొరియా అంశాలు దిశానిర్దేశం చేయనున్నాయన ప్రభుత్వ ఉద్యోగుల డిపాజిట్లపై దృష్టి.. Mon 18 Sep 06:09:23.258884 2017 న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఖాతాల్లో జమ చేసిన డిపాజిట్లపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) చీఫ్‌ కేవీ భారీగా పెరిగిన పసిడి దిగుమతులు! Mon 18 Sep 06:09:36.732835 2017 న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఆగస్టు మధ్య కాలంలో దేశీయంగా బంగారం దిగుమతులు మూడింతలు పెరిగి 15.24 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దేశీయ కరెంట్‌ అకౌెంట త్వరలో ఐపీవోకి ప్రభుత్వ బీమా సంస్థలు.. Mon 18 Sep 06:09:44.987442 2017 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని రెండు సాధారణ బీమా సంస్థలు త్వరలో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)కి రానున్నాయి. తద్వారా రూ.15,000 కోట్ల నిధులు సమీకరించనున్నాయని మర్చంట్‌ బ్యాంకింగ్‌ భారత్‌కూ ప్రత్యేక బిట్‌'కాయిన్‌'! Sun 17 Sep 05:26:57.532013 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: అంతర్జాతీయంగా చలామణిలో ఉన్న డిజిటల్‌ కరెన్సీ బిట్‌కాయిన్‌ మాదిరిగానే.. భారత్‌లోనూ ప్రత్యేక క్రిప్టోకరెన్సీని అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత వేడుకగా బీవోఎం వ్యవస్థాపక దినోత్సవం Sun 17 Sep 05:27:06.59193 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర (బీవోఎం) వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు వేడుకగా జరిగాయి. బ్యాంకు ప్రధాన కార్యాలయంతో పాటు దేశంలోని అన్నిబీవోఎం జోన్‌ కార్యా జీఎస్టీఎన్‌తోనే అసలు సమస్య..! Sun 17 Sep 05:27:16.152466 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విజయవంతంగా అమలు కాకుండా 'గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ నెట్‌వర్క్‌' (జీఎస్టీఎన్‌) నుంచి సమస్యలు ఎదురవుతున్న ప్రమాదంలో 21% ఉద్యోగాలు! Sun 17 Sep 05:27:27.375972 2017 న్యూఢిల్లీ : వివిధ రంగాల్లో పని చేసే వారు తమ నైపుణ్య కొరత కారణంగా వచ్చే ఐదేళ్లలో భారీగా ఉద్యోగాలు కోల్పోనున్నారని ఫిక్కీ ఒక నివేదికలో తెలిపింది. నైపుణ్యం కొరత కారణంగా వచ్ ప్రమాదంలో 21% ఉద్యోగాలు! Sun 17 Sep 05:27:46.84257 2017 న్యూఢిల్లీ : వివిధ రంగాల్లో పని చేసే వారు తమ నైపుణ్య కొరత కారణంగా వచ్చే ఐదేళ్లలో భారీగా ఉద్యోగాలు కోల్పోనున్నారని ఫిక్కీ ఒక నివేదికలో తెలిపింది. నైపుణ్యం కొరత కారణంగా వచ్ గడువు పొడిగించేది లేదు: ఆదియా Sun 17 Sep 05:27:55.405 2017 బెంగళూరు: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రిటర్నుల దాఖలునకు మరింత గడువు పొడిగించే ప్రతిపాదనేది తమ వద్ద లేదని ప్రభుత్వం శనివారం తేల్చి చెప్పింది. పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ ర మహిళలకు 'ఆల్‌ బ్యాంక్‌ శక్తి' Sun 17 Sep 01:13:22.577378 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ అలహాబాద్‌ బ్యాంక్‌ మహిళల సాధికారికతకు పెద్దపీట వేస్తూ 'ఆల్‌ బ్యాంక్‌ శక్తి' పేరుతో కొత్త సేవింగ్స్‌ ఉత్పాదనను అం టాటాలో పబ్లిక్‌-ప్రయివేటు రగడ! Sat 16 Sep 05:02:12.040689 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూపులో సద్దుమణిగిందనుకున్న అంతర్గత విబేధాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. టాటా గ్రూపు సంస్థల ప్రమోటర్‌ టాటా సన్స్‌ తన చట్ కెపాసిట్‌ఈ ఐపీవోకు బంపర్‌ స్పందన Sat 16 Sep 05:02:19.966521 2017 ముంబయి: ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ కెపాసిట్‌ఈ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ పబ్లిక్‌ ఇష్యూకు మదుపరుల నుంచి బంపర్‌ స్పందన లభించింది. శుక్రవారం ఇష్యూ ముగిసే సమయానికి ఈ ఐపీవోకు మదుపరుల ఆగస్టులో పెరిగిన వాణిజ్య లోటు Sat 16 Sep 05:02:26.71209 2017 న్యూఢిల్లీ: గత ఆగస్టు నెలలో వాణిజ్య లోటు పెరిగింది. వాణిజ్య మంత్రి త్వశాఖ శుక్రవారం వెల్లడించిన గణంకాల ప్రకారం ఆగస్టులో ఎగుమతులు 10.29 శాతం పెరిగి 23.81 బిలియన్‌ డాలర్లకు సిండికేట్‌ బ్యాంక్‌కు రాజభాష కీర్తి పురస్కారం Sat 16 Sep 05:02:34.986432 2017 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: రాజభాష హిందీ అమలు ద్వారా భాషా వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నందుకు గాను సిండికేట్‌ బ్యాంక్‌కు అరుదైన గుర్తింపు లభించింది. 2016-17 సంవత్సరానికి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV చరిత్ర సృష్టించిన జిమ్నాస్ట్ దీపా కర్మకార్ దీపా కర్మకార్... భారతదేశం గర్వించదగ్గ జిమ్నాస్ట్ గా నిలిచింది. TNN | Updated: Aug 8, 2016, 09:39AM IST దీపా కర్మకార్... భారతదేశం గర్వించదగ్గ జిమ్నాస్ట్ గా నిలిచింది. ఇంతవరకూ పాశ్చాత్య దేశాల వాళ్లు మాత్రమే నిలుస్తూ... గెలుస్తూ వచ్చిన ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ విభాగంలో... తన సత్తా చాటింది. క్వాలిఫయింగ్ రౌండ్ లో ఎనిమిది రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి ఫైనల్ చేరింది. భారతదేశం తరుపున జిమ్నాస్టిక్ విభాగంలో ఒలింపిక్స్ లో పాల్గొన్న మొట్ట మొదటి మహిళగా ఇప్పటికే దీపా చరిత్ర సృష్టించగా, ఇప్పుడు క్వాలిఫయింగ్ రౌండ్ విజయవంతంగా దాటి ఫైనల్ కి చేరి రికార్డులకెక్కింది. ఆగస్టు 14న తనకి అసలు పరీక్ష ఉంది. ఆ రోజే ఫైనల్ పోటీ. అందుకోసమే దీపా తీవ్రంగా సాధన చేస్తోంది. క్వాలిఫయింగ్ రౌండ్ లో అమెరికాకు చెందిన సిమోన్ బైల్స్ 16.070 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో ఉత్తర కొరియాకు చెందిన జాంగ్ ఉన్ హాంగ్ (15.683), స్విట్జర్లాండ్ కు చెందిన (15.266) నిలిచారు. దీప ఓవరాల్ గా 11.66పాయింట్లు సాధించింది. త్రిపురకు చెందిన ఈ అమ్మాయిపైనే భారత క్రీడాలోకం ఆశలు పెట్టుకుంది. దీపా మెడల్ తెస్తుందో లేదో వేచి చూడాలి.
2sports
it's not my india: rahman on gauri lankesh's killing ఇది కాదు నా భారతదేశం: ఏఆర్ రెహమాన్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య పట్ల ఆవేదనపూర్వకంగా స్పందించాడు TNN | Updated: Sep 8, 2017, 02:37PM IST ​జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య పట్ల ఆవేదనపూర్వకంగా స్పందించాడు ఆస్కార్ అవార్డ్ గ్రహీత అయిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రెహమాన్ ను మీడియా గౌరీ లంకేష్ హత్య పట్ల స్పందనను కోరింది. ఆ జర్నలిస్టు హత్య పట్ల రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రశ్నించే వాళ్లను చంపడం.. భారతదేశ లక్షణం కాదు అని ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యానించాడు. ‘ఆమె హత్య చాలా బాధాకరం. ఇవన్నీ భారతదేశంలో జరగాల్సిన పనులు కావు. ఇలాంటి సంఘటనలే జరిగేటట్టు అయితే ఇది నా భారతదేశం కాదు. ప్రగతివైపు పయనించే, మానవత్వం ఉండే భారతదేశం నాకు కావాలి..’ అని రెహమాన్ వ్యాఖ్యానించారు.
0business
Jatha kalise release date confirmed 'జత కలిసే' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా వారాహి చలన చిత్రం, ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్, యుక్త క్రియేషన్స్ బ్యానర్స్‌పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న చిత్రం ‘జత కలిసే’. | Updated: Dec 9, 2015, 06:26PM IST అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా వారాహి చలన చిత్రం, ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్, యుక్త క్రియేషన్స్ బ్యానర్స్‌పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న చిత్రం ‘జత కలిసే’. ' అలామొదలైంది ' ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు , మాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ' రేపటి దర్శకులు ' అనే కార్యక్రమంలో టాప్ టెన్‌లో ఒకడిగా నిలిచి, పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ వంటి స్టార్ రైటర్స్, రామ్ గోపాల్ వర్మ , గుణశేఖర్ వంటి క్రేజీ డైరెక్టర్స్‌తో వర్క్ చేసిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జర్నీ నేపధ్యంలో సాగే లవ్ స్టోరీ సినిమా ఇది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. పృథ్వీ, షకలక శంకర్, ధనరాజ్, సప్తగిరి, రాజుగారి గది ఫేమ్ విద్యుల్లేఖ రామన్(బుజ్జమ్మ),‘జబర్‌దస్త్’రాంప్రసాద్, సూర్య, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ద్వారా ఇంకొంత మంది కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ కూడా పరిచయమవుతున్నారు.
0business
Hyderabad, First Published 10, Jul 2019, 1:46 PM IST Highlights హిట్టైన సినిమాలను వేరే భాషలోకి రీమేక్ చేస్తూండటం సినిమా పుట్టన నాటి నుంచి జరుగుతున్న ప్రక్రియ.  హిట్టైన సినిమాలను వేరే భాషలోకి రీమేక్ చేస్తూండటం సినిమా పుట్టన నాటి నుంచి జరుగుతున్న ప్రక్రియ. అయితే మనకు తమిళం, హిందీ, మళయాళ పరిశ్రమల నుంచి కథలు తెచ్చుకుని రీమేక్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే తెలుగు పరిశ్రమ తన రూపు మార్చుకుంది. విభిన్నమైన కథాంశాలతో ముందుకు వెళ్తూండటంతో ఇతర భాషల వాళ్లు మన సినిమాలు రీమేక్ చేసుకునే పరిస్దితి వచ్చింది. రీసెంట్ గా అర్జున్ రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేసి కబీర్ సింగ్ గా హిందీలో ఘన విజయం సాధించటంతో ఇక్కడ సినిమాలపై బాలీవుడ్ దృష్టి మరింతగా పెట్టింది. ఇప్పుడు వారి దృష్టిలో సమంత తాజా చిత్రం ఓ బేబి పడింది.  వివాహానంతరం విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న సమంత, తాజాగా చేసిన మరో హీరోయిన్ ఓరియెంటెండ్ చిత్రం ఓ బేబీ. డబ్బై ఏళ్ల వృద్ధురాలైన ఓ మహిళకు తిరిగి యవ్వనం వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌ చెప్పే ప్రయత్నం చేసి విజయం సాధించారు దర్శకురాలు నందిని రెడ్డి. కొరియన్‌ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.బేబీ పాత్రలో సమంత మెప్పించిందంటూ అంతటా ప్రశంసలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యుఎస్ లో ఈ  సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది.  ఈ నేపధ్యంలో  ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు దగ్గుపాటి రానా చర్చలు జరుపుతున్నట్లు చెప్తున్నారు. రానా కు మంచి పరిచయాలు బాలీవుడ్ లో ఉన్నాయి. దాంతో అక్కడ ఓ పెద్ద సంస్దతో టై అప్ అయ్యి రీమేక్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.   హిందీ రీమేక్ తప్పకుండా ఉంటుందని.. తామే ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి తీసుకెళ్తామని చెప్పాడు రానా.  కంగనా రనౌత్, ఆలియా భట్ లాంటి హీరోయిన్స్ లో ఒకరితో  ‘ఓ బేబీ’ హిందీ రీమేక్  చేయబోతున్నారు.  అలాగే రానా కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించే అవకాసం ఉందని చెప్తున్నారు.  అయితే సినిమా చివర్లో కనిపించే గెస్ట్ రోల్ లోనా లేక నాగశౌర్య పాత్రలోనా అనేది తెలియాల్సి ఉంది.  ఓ బేబిలో సమంత.. స్వాతి అనే సింగర్ క్యారెక్టర్‌లో కనిపించగా, నాగశౌర్య ఇంపార్టెంట్ రోల్ చేసాడు.. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి డైలాగ్స్ : లక్ష్మీ భూపాల, కెమెరా : రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్ : జునైద్ సిద్దిఖీ, సంగీతం : మిక్కీ జె.మేయర్, కో-ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభోట్ల, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు, నిర్మాణం : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ క్రాస్ పిక్చర్స్ . Last Updated 10, Jul 2019, 1:46 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ​హీరోయిన్ తల్లి కాబోతోంది.. ఈ సారి కూడా కవలలే! తొలి కాన్పులో ఆమె కవలలకు జన్మనిచ్చింది. TNN | Updated: May 24, 2017, 01:10PM IST ​హీరోయిన్ తల్లి కాబోతోంది.. ఈ సారి కూడా కవలలే! సెలీనా జైట్లీ.. బాలీవుడ్ నటీమణిగానే కాక కొన్ని తెలుగు, దక్షిణాది సినిమాలతో మన దగ్గర గుర్తింపును కలిగిన నటి. సినీ రంగంలో ఆఫర్లు తగ్గుముఖం పట్టాకా ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సెటిలైంది సెలీనా. ఐదేళ్ల కిందట సెలీనా దంపతులు పిల్లలను పొందారు. తొలి కాన్పులో ఆమె కవలలకు జన్మనిచ్చింది. వారికి విన్ స్టన్, విరాజ్ లుగా నామకరణం చేశారు. Visit Site Recommended byColombia ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్ అయిన సెలీనా ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకుంది. తను మళ్లీ తల్లి కాబోతున్న విషయాన్ని చెప్పిన ఈమె.. ఈ సారి కూడా కవలలకు జన్మనివ్వబోతున్నానని అమితానందంతో చెప్పింది. తన కడుపులో ఉన్నది కవల పిల్లలు అని డాక్టర్లు నిర్ధారించారని సెలీనా మురిపెంగా చెప్పారు. మరో ఇద్దరు పిల్లలు కలుగుతున్నందుకు సెలీనా దంపతులు సంభ్రమాశ్చర్యలతో ఉన్నారు. తల్లి కావడం జీవితంలో అనిర్వచనీమైన అనుభూతి అని, స్త్రీకి అంతకు మించిన ఆనందం ఉండదని సెలీనా చెప్పింది. ప్రస్తుతం ఈమె దుబాయ్ లో ఉన్నారు. సినిమాలకు దూరంగానే ఉన్నా అడపాదడపా యాడ్స్ లో నటిస్తున్నారు. అక్టోబర్ లో ప్రసవం జరగనుందని తెలుస్తోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘హలో గురు ప్రేమకోసమే..’ ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది! ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే..’. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Samayam Telugu | Updated: May 13, 2018, 04:50PM IST ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే..’. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రేపు (మే 14న) విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రేపు సాయంత్రం 4 గంటలకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు ట్వీట్ కూడా చేసింది. Unveiling the first look of @ramsayz and @anupamahere starrer #HelloGuruPremaKosame tomorrow at 4PM. Stay tuned.… https://t.co/z0khbGzAGC — S V C (@SVC_official) 1526207406000 ఇదిలా ఉంటే, తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతగా పేరొందిన దిల్ రాజు.. తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శక, నిర్మాతగా తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కించిన ‘మెహబూబా’ సినిమాను దిల్ రాజే విడుదల చేశారు. ఇక తన బ్యానర్‌లో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. వాటిలో రాజ్ తరుణ్‌తో ‘లవర్’, రామ్‌తో ‘హలో గురు ప్రేమకోసమే..’, వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో ఓ మల్టీస్టారర్ ఉన్నాయి. మల్టీస్టారర్ షూటింగ్ ఇంకా ప్రారంభంకాలేదు. వీటితో పాటు మహేష్‌బాబు-వంశీ పైడిపల్లి సినిమాను కూడా దిల్ రాజే నిర్మించనుండటం విశేషం. కిందటేడాది ‘శతమానం భవతి’ సినిమాతో విజయ యాత్రను ప్రారంభించిన దిల్ రాజు.. వరసగా ‘నేను లోకల్’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘ఫిదా’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎంసీఏ’ చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక ఈ ఏడాది కూడా ఇదే విజయ యాత్రను కొనసాగించేలా కనిపిస్తున్నారు. మరోవైపు, రామ్ హీరోగా కిందటేడాది ఒకే ఒక్క సినిమా వచ్చింది. అదే.. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోకపోనప్పటికీ విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. మరి ఈ ఏడాదిని రామ్ హిట్టుతో ప్రారంభిస్తారో లేదో చూడాలి.
0business
WIFI డిజిటల్‌ ఇండియాకు కార్యాచరణ ముంబై,:భారత్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ లు, ట్యాబ్‌పిసిల వాడకం పెరుగుతున్న కొద్దీ ఇం టర్నెట్‌ వినియోగం కూడా పెరుగుతూ వస్తోంది. భారత్‌ టెలికాం రంగంలో నెలకొన్న పోటీతత్వం కారణంగా నెట్‌ వినియోగం మరింతగా మారు మూల ప్రాంతాలకు చేరువచేసే లక్ష్యంతో ట్రా§్‌ు మరింతగా సంస్కరణలు చేపడుతోంది. మొబైల్‌ సేవలను మరింత విస్తృతం చేసేందుకు వైఫైను మరింత పరిధి పెంచాలని అంచనావేస్తున్నారు. అందుబాటులో నెట్‌ ఛార్జిలు తీసుకువచ్చేందుకు ట్రా§్‌ు వన్‌జిబి డేటా ఖరీదు రూ.20కి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం ఎంపి పదిపైసలుగా ఉంది. ఈ మొత్తంరెండుపైసలకు కుదించాలని అంచనా. వైఫైను విస్తృతం చేయడంద్వారా ఎవ్వరైనా వైఫై నిర్వహణ షాపులు పెట్టుకుని వ్యాపారంచేసుకునే అవకాశాలు కూడా పరిశీలిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్‌ నెట్‌ను మరింత చేరువచేసేం దుకు వీలుగా ట్రా§్‌ు పలు సూచనలు చేస్తోంది. మెగాబైట్‌కు రెండుపైసలుగా నిర్ణయించాలని చూస్తోంది. ప్రస్తుతం మొబైల్‌ టెలికాం మార్కెట్‌ లో పదిపైసలుగా ఉంది. గడచిన కొన్నేళ్లుగా టెలికాం కంపెనీల ఛార్జిలపరంగా యుద్ధం నిర్వహి స్తున్నాయి. ఇటీవలికాలంలో జియో పునఃప్రవేశం తో ఈ పోటీ మరింతగాపెరిగింది. వన్‌జిబి డేటాను రూ.10కే అందిస్తున్నట్లు ఆర్‌జియోప్రకటిం చింది. ఇక 349 రూపాయలకే ఎయిర్‌టెల్‌ నెలకు అపరిమిత కాల్స్‌తోపాటు 28 జిబి అందిస్తామని వెల్లడిస్తోంది. అలాగే వోడాఫోన్‌, ఎయిర్‌సెల్‌, ఐడియా ఒకటేమిటి అన్ని సంస్థలు కూడా అవాం ఛిత పోటీధోరణులు ఎదుర్కొంటున్నాయి. ఏ ఒక్క వైఫై హాట్‌స్పాట్‌కైనా వచ్చే వీలు కలిగిస్తోంది ఎలాంటి వన్‌టైమ్‌పాస్‌వర్డ్‌ లేదా క్రెడిట్‌కార్డు చెల్లింపుల సమస్య లేకుండానే వైఫై సమకూర్చుకునే సదుపాయం కల్పిస్తోంది. కస్టమరు తన మొబైల్‌ నెట్‌వర్క్‌నుంచి తక్కువ ఖర్చుతో కూడిన వైఫై హాట్‌స్పాట్‌లకు వెళ్లాల్సి వస్తోంది. ట్రా§్‌ు ఒక ఎంపికి రెండుపైసలుగా సూచించింది. దీనివల్ల వన్‌జిబి డేటాకు రూ.20గా ఉంటుంది. జాతీయ సగటు 20పైసలుగా ఉంది. టెక్‌ ఆధారిత తరాలు పెరుగుతునన కొద్దీ వైఫై మరింతపెరుగుతోంది. వైఫై టెక్నాలజీ హాట్‌స్పాట్స్‌ వంటివి ఇతర దేశాల్లో మరింతగా వృద్ధిచెందుతున్నాయి. 2013-నుంచి 2016 వరకూ చూస్తే వైఫై హాట్‌స్పాట్‌లు ప్రపంచ వ్యాప్తంగా 568శాతం వృద్ధినిసాధించాయి. భారత్‌ లో 12శాతం వృద్ధితో ఉన్నాయి. ప్రతి 150 మందికి ఒక హాట్‌స్పాట్‌ ఉండాలని అంచనావేస్తే భారత్‌లో 8 లక్షల హాట్‌స్పాట్‌లు అదనంగా ఉం డాలని అంచనావేసింది. ట్రా§్‌ు వ్యయనియంత్రణ ప్రతిపాదనల్లో వైఫై మౌలికవనరులఖర్చు తక్కు వగా ఉంటుందని అంచనావేసింది. మొబైల్‌బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్‌లు 2జి, 3జి, 4జి పరంగా చూస్తే టెక్నాలజీ లైసెన్సులు విక్రయించని స్పెక్ట్రమ్‌ నుమరింత చౌకగా వినియోగించుకు నేం దుకు అవకాశం ఉండాలని అంచనా. ప్రతి ఎంబిని రెండుపైసలుకు అందించాలి. ఇంటర్నెట్‌ను ప్రతి ఒక్కరికీ చేరువచేయాలని, నెలకు రూ.303కు మించకుండా చూడాలని వైఫైను వన్‌టైమ్‌పాస్‌వర్డ్‌ లేకుండా ఏర్పాటుచేయా లని క్రెడిట్‌కార్డు చెల్లింపుల సమస్యలేకుండా చూడా లని ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం దేశంలోని ప్ర ధాన టెలికాం కంపెనీల్లో డేటావార్‌ జరుగు తోంది. అత్యంత తక్కువగా 303 రూపాయలకే ఆర్‌జియో నెలకు 28జిబి డేటాను ప్రైమ్‌ వినియోగదారులకు అందిస్తోంది. ఏసంస్థ కూడా ఇంత తక్కువధరలకు డేటాను అందించ డంలేదు. ఏప్రిల్‌ నెలనుంచి ఛార్జిలు వసూలుచేయ డం ప్రారంభిస్తే ఆర్‌జియో తీరుతెన్నులు అర్ధం అవుతా యని ప్రత్యర్ధి కంపెనీలు ఎదురుచూసు న్నాయి. అయినప్పటికీ అనుకున్న సమయానికి తాము లాభనష్టాలులేనిదశకు చేరుకోగలమని బహుశా 2017 చివరినాటికే బ్రేక్‌ ఈవెన్‌కు చేరతామని ఆర్‌జియో ధీమా వ్యక్తంచేస్తోంది.
1entertainment
Oct 26,2018 ఉద్యోగులకు గిఫ్ట్‌గా కార్లు, ఫ్లాట్లు! సూరత్‌: దీపావళి నేపథ్యంలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, హరికృష్ణా డైమండ్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ అధినేత సావ్జి దోలకియా తమ సంస్థ ఉద్యోగుల పట్ల మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. తాజాగా దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ సుమారు 5 వేల మంది ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించారు. వారిలో 1600 మంది డైమండ్‌ పాలిష్‌ నిపుణులను ఎంపిక చేసి కార్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు ఈ మూడింటిలో ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశం కూడా వారికే ఇవ్వడం విశేషం. ఇలా వారి కోరిక మేరకే 600 మందికి కార్లను, మిగతా వారి పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫ్లాట్లను సావ్జీ దోలకియా అందజేశారు. ఈ జాబితాలో ఉన్న ఇద్దరు మహిళా ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గురువారం కార్ల తాళాలను అందజేయింపజేశారు. ఇటీవల తన కంపెనీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు రూ. 3 కోట్ల విలువైన బెంజ్‌ కార్లు బహుమతిగా దోలకియా అందజేసి వారి శ్రమకు తగిన గుర్తింపునిచ్చారు. 1977లో కేవలం రూ.12.5 బస్సు టిక్కెట్‌ పైసలతో సూరత్‌ చేరుకున్న దోలకియా.. అంచెలంచెలుగా ఎదిగి వజ్రాల వ్యాపారిగా ప్రస్తుతం రూ.6000 కోట్ల టర్నోవర్‌ సాధించారు. అయినా తన మూలాలను మర్చిపోకుండా, కేవలం లాభాల కోసమే వెంపర్లాడకుండా.. ఉద్యోగుల బాగోగుల గురించి కూడా ఆలోచిస్తున్న సావ్జీ దోలకియా ప్రతి ఏడాది వారికి లాభాల్లో కొంత బహుమతుల రూపంలో అందజేస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
india vs south africa: sourav ganguly backs virat kohli to continue with shikhar dhawan, rohit sharma కోహ్లీ.. జట్టును మార్చొద్దు: కెప్టెన్‌కు గంగూలీ బాసట రెండో టెస్టులో జట్టు ఎంపిక విషయంలో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ‌ విరాట్ కోహ్లిని సమర్థించాడు. TNN | Updated: Jan 12, 2018, 02:52PM IST తొలి టెస్టులో కోహ్లి సేన ఓటమి తర్వాత భారత జట్టు కూర్పుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. విదేశీ గడ్డపై అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న అజింక్య రహానేను కాదని రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు కల్పించడం, కేఎల్ రాహుల్‌ను పక్కనబెట్టడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇటీవలి ప్రదర్శన ఆధారంగానే రోహిత్‌కు అవకాశం కల్పించామని కోహ్లి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్, అజింక్య రహానేలకు తుది జట్టులో చోటు కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా, జట్టులో ఎలాంటి మార్పులు చేయొద్దని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచిస్తున్నాడు. న్యూలాండ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ అద్భుతంగా సాగిందని, బౌలర్లు అద్భుతంగా రాణించారని గంగూలీ చెప్పుకొచ్చాడు. మిగతా టెస్టుల్లోనూ భారత బౌలర్లు ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేయాలి. భారత్‌ను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోన్న సమస్య బ్యాటింగ్ వైఫల్యం. కాబట్టి బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో ఉండి, పరుగులు చేయడానికి ప్రయత్నించాలి. ఓటమి ఎదురయ్యాక తుది జట్టులో చోటు దక్కని ఆటగాళ్ల విషయం చర్చకు రావడం సాధారణమే. విరాట్ కోహ్లి ఈ విషయాల గురించి చింతించొద్దు. కేఎల్ రాహుల్, రహానేలకు విదేశాల్లో మెరుగైన రికార్డ్ ఉంది. కానీ కోహ్లి ప్రస్తుత ఫామ్‌ను బట్టి జట్టును ఎంపిక చేశాడు. రెండో టెస్టులోనూ అదే కొనసాగించాలని గంగూలీ సూచించాడు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సఫారీ గడ్డపై భారత్ ప్రాక్టీస్.. వీడియో దక్షిణాఫ్రికా గడ్డపై కఠిన సిరీస్‌కి భారత్ సిద్ధమవుతోంది. కేప్‌టౌన్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు ఆరంభంకానున్న నేపథ్యంలో నెట్స్‌లో భారత్ TNN | Updated: Jan 2, 2018, 03:39PM IST దక్షిణాఫ్రికా గడ్డపై కఠిన సిరీస్‌కి భారత్ సిద్ధమవుతోంది. కేప్‌టౌన్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు ఆరంభంకానున్న నేపథ్యంలో నెట్స్‌లో భారత్ జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన వీడియోని బీసీసీఐ విడుదల చేసింది. సుదీర్ఘ టెస్టు చరిత్ర ఉన్న టీమిండియా.. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా గెలవలేకపోయింది. అయితే.. కెప్టెన్‌గా గత ఏడాది ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా చేజార్చుకోని కోహ్లి.. అదే జోరుని ఈ ఏడాది కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
2sports
Sports Minister Rajyavardhan Singh Rathore promises support to Savita Punia గోల్ కీపర్ తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది భారత మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ సవిత పునియా తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది. ఆమెకి అన్నివిధాల సాయం అందిస్తామని కేంద్ర క్రీడల TNN | Updated: Nov 9, 2017, 12:27PM IST భారత మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ సవిత పునియా తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది. ఆమెకి అన్నివిధాల సాయం అందిస్తామని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తాజాగా స్పష్టం చేశారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత మహిళా హాకీ జట్టు ఇటీవల ఆసియా కప్‌‌ విజేతగా నిలవడంలో సవిత క్రియాశీలక పాత్ర పోషించింది. కానీ.. కేంద్రం, హరియాణా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు తనకు ఎలాంటి సాయం అందలేదని సవిత ఆవేదన వ్యక్తం చేయడంపై క్రీడల మంత్రి స్పందించారు. ‘హాకీ ప్రాక్టీస్, మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా నేను ప్రత్యేకంగా ఎలాంటి ఉద్యోగం చేయలేకపోతున్నాను. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగం ఇస్తామని గతంలో హరియాణా ప్రభుత్వం చెప్పింది. కానీ.. పతకాలు తెస్తేనే అనే మెలిక పెట్టింది. తాజాగా ఆసియా కప్‌ గెలిచిన జట్టులో నేను గోల్ కీపర్‌ని. కనీసం ఇకనైనా ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాలి’ అని సవిత ఇటీవల మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పందించారు. ‘గోల్‌ కీపర్ సవిత వివరాలను సేకరించమని సంబంధిత అధికారులను ఇప్పటికే ఆదేశించాను. తప్పకుండా ఆమెకి అన్నివిధాల సాయం చేస్తాం’ అని మంత్రి వివరించారు.
2sports
Vaani Pushpa 124 Views CAC , KAPILDEV , regine kapil dev న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ వంటి దిగ్గజాలకు ఈ అంశంపై నోటీసులు రావడంతో అందరూ విమర్శల వర్షం కురిపించారు. తాజాగా బిసిసిఐ క్రికెట్‌ సలహా మండలి (సిఎసి) సభ్యులకు కూడా ఆ వేడి తగిలింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్‌ 10లోగా వివరణ ఇవ్వాలని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా మండలి (సిఎసి)కి బిసిసిఐ నైతిక విలువల అధికారి జస్టిస్‌ డికె జైన్‌ నోటీసులు పంపారు. ఇప్పటికే తనకు నోటీసులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శాంత రంగస్వామి సిఎసి నుంచి తప్పుకున్నారు. తాజాగా సిఎసి నుంచి కపిల్‌దేవ్‌ కూడా తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిఎసి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కపిల్‌దేవ్‌ బుధవారం ప్రకటించారు. అయితే అందుకు గల కారణాలను వెల్లడించలేదు. కపిల్‌ అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై నోటీసులు రావడంతో కొంచెం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా దీనిపై ఎవరికి సమాధానం చెప్పే ఇష్టం లేకనే తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇక గత జులై నెలలో బిసిసిఐ ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్‌ సలహా మండలిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందమే టీమిండియా హెచ్‌ కోచ్‌, సహాయ సిబ్బందిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక భారత క్రికెట్‌లో ఇదో కొత్త ఫ్యాషన్‌. విరుద్ధ ప్రయోజనాల కింద నోటీసులు ఇవ్వడం…వార్తల్లో నిలవడం. భగవంతుడే భారత క్రికెట్‌ను కాపాడాలి అంటూ మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ బహిరంగంగా విమర్శించాడు. అంతేగాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పదవులు, పనులు చేయకుండా కేవలం క్రికెట్‌ పాలనకు తగిన మాజీ ఆటగాళ్లను ఎంపిక చేయడం బిసిసిఐకి పెద్ద తలపోటుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్న విషయం తెలిసిందే. కపిల్‌ వ్యాఖ్యాతగా, ఫ్లడ్‌లైట్ల సంస్థ అధిపతిగా, భారత క్రికెటర్ల సంఘం సభ్యుడిగా (ఐసిఎ)గా ఉన్నాడు. గైక్వాడ్‌ సొంత అకాడమీతో పాటు బిసిసిఐ అఫిలియేషన్‌ కమిటీలో సభ్యుడు. శాంత కూడా ఐసిఎ సభ్యురాలు. వీటిని పేర్కొంటూ మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV రజినీకాంత్‌కి బీజేపి వార్నింగ్ ? అదేంటి బీజేపీకి రజినీకాంత్ అంటే ఇష్టమే కదా.. మరి ఆయనతో శత్రుత్వం ఎందుకు పెట్టుకుంటుంది ? వార్నింగ్ ఎలా ఇస్తుంది అని ఓ డౌట్ రావచ్చేమో! TNN | Updated: Sep 15, 2015, 12:45PM IST అదేంటి బీజేపీకి రజినీకాంత్ అంటే ఇష్టమే కదా.. ఆయన్ని మంచి చేసుకుని తమిళనాడులో రాజకీయంగా లబ్ధి పొందుదామని ప్రయత్నిస్తున్న బీజేపీ ఆయనతో శత్రుత్వం ఎందుకు పెట్టుకుంటుంది ? వార్నింగ్ ఎందుకు ఇస్తుంది అని ఓ డౌట్ రావచ్చేమో! అయితే అందుకు గల కారణాలు వేరే వున్నాయి. టిప్పు సుల్తాన్ పాత్రలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ సినిమా చేయనున్నాడనే వార్తల నేపథ్యంలో తమిళనాడులోని రాజకీయపార్టీల నుంచి ఆయనకి వ్యతిరేకత వ్యక్తమైంది. టిప్పు సుల్తాన్ సినిమాని నిర్మించాలనే యోచనలో వున్న ఓ కన్నడ నిర్మాత.. ఆ సినిమాలో ప్రధాన పాత్ర కోసం రజినీకాంత్‌ని తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన వినడంతోనే తమ సూపర్ స్టార్ ఆ సినిమాకి ఓకే చెప్పాడేమోనని భావించిన తమిళతంబీలకి ఆయనపై ఆగ్రహం తన్నుకొచ్చింది. టిప్పు సుల్తాన్ అంటేనే ఓ తమిళ వ్యతిరేకి. అందుకే ఆ సినిమాలో రజినీ నటించకూడదంటూ తమిళనాడులోని రాజకీయ పార్టీలు కూడా అభిప్రాయపడినట్లుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇదిలావుంటే, టిప్పు సుల్తాన్ ఓ హంతకుడు. అటువంటి వ్యక్తిని గొప్పగా చూపించే సినిమాలో నటించడం అంటే చరిత్రని అవమానించడమే అవుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఐబీఎన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభిప్రాయాలపై రజినీకాంత్ మీడియా ప్రతినిధి స్పందించారు. రజినీకి స్క్రిప్ట్‌లు వినే తీరికే లేదు. ఇక ఆ సినిమాకి ఎక్కడ సైన్ చేస్తారు అని ప్రశ్నిస్తూనే.. సూపర్ స్టార్ టిప్పు సుల్తాన్ సినిమాకి అంగీకరించలేదని స్పష్టంచేశారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సిక్సుల్లో కింగ్ క్రిస్ గేల్.. అరుదైన రికార్డ్ ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ సిక్సుల మోత మోగించాడు. ఏకంగా 14 సిక్సులు బాదేశాడు. ఈ సిక్సుల సాయంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మైలురాయిని అందుకున్నాడు. Samayam Telugu | Updated: Feb 28, 2019, 03:49PM IST సిక్సుల్లో కింగ్ క్రిస్ గేల్.. అరుదైన రికార్డ్ వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సులు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ కరేబియన్ ప్లేయర్ ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న ఐదు వన్డేల సిరీస్‌లో మరో సెంచరీ బాదాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో వరుసగా 135, 50, 162 పరుగులు సాధించిన క్రిస్ గేల్.. బుధవారం సెయింట్ జార్జ్‌లోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలోనూ చెలరేగిపోయాడు. కేవలం 97 బంతుల్లో 162 పరుగులు సాధించాడు. గేల్ చెలరేగినా ఇంగ్లాండ్ నిర్దేశించిన 419 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఛేదించలేకపోయింది. 29 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ నెగ్గింది. ఈ మ్యాచ్‌లో గేల్ 14 సిక్సులు, 11 ఫోర్లు బాదాడు. ఈ 14 సిక్సులతో కలుపుకుని ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో గేల్ బాదిన సిక్సుల సంఖ్య 506కు చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 అంతకన్నా ఎక్కువ సిక్సులు బాదిన ఏకైక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్. అంతేకాదు వన్డేల్లో 300 అంతకన్నా ఎక్కువ సిక్సులు కొట్టిన రెండో బ్యాట్స్‌మన్ గానూ గేల్ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక సిక్సుల రికార్డు షాహిద్ అఫ్రిది (351) పేరిట ఉంది. 305 సిక్సులతో గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో గేల్ 98 సిక్సులు బాదగా.. టీ20ల్లో 103 సిక్సులు కొట్టాడు. అలాగే, బుధవారం నాటి ఇన్నింగ్స్‌తో వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని గేల్ అందుకున్నాడు. బ్రియాన్ లారా (10,405) తరవాత వెస్టిండీస్ నుంచి ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్ గేల్. అంతే కాకుండా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న 14వ క్రికెటర్‌గా గేల్ (10,074) నిలిచాడు. ఈ క్లబ్‌లో సచిన్ టెండూల్కర్ (18,426), కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), సనత్ జయసూర్య (13,430), మహేళ జయవర్దనే (12,650), ఇంజమాముల్ హక్ (11,739), జాక్వెస్ కలిస్ (11,579), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), విరాట్ కోహ్లీ (10,533), ఎంఎస్ ధోనీ (10,415), లారా (10,405), తిలకరత్నే దిల్షాన్ (10,290) గేల్ కన్నా ముందున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
జనవరి 26న జరగాల్సిన గుంటూరోడు ఆడియో వేడుక వాయిదా Highlights జనవరి 26న విపక్షాల ఆందోళనలకు పిలుపు ఏపీకి ప్రత్యేక హోదా నినాదంతో మిన్నంటుతున్న ఆందోళనలు ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిందేనంటున్న మంచు మనోజ్   మంచు మనోజ్ తాజా చిత్రం గుంటూరోడు. చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఆడియో లాంచ్ జనవరి 26 న జరగనున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ చిత్ర ఆడియో లాంచ్ వాయిదా పడినట్లు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ చిత్ర ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు.మనోజ్ తన సన్నిహితుల సలహా మేరకే ఆడియో లాంచ్ ని వాయిదా వేసినట్లు తెలిపాడు. కాగా ఈ చిత్రంలో మనోజ్ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. జనవరి 26న విపక్షాలన్నీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళన తలపెట్టాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నానని, ప్రేమతో అహింసాత్మక పోరాటం ద్వారా హోదా సాకారం కావాలని భావిస్తున్నానని ఈ సందర్భంగా మనోజ్ అభిప్రాయపడ్డారు. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
What is Suma Kanakala trying hard to learn? ఆ షో చేయడం నిజంగా కష్టమే ఆ ప్రోగ్రాం హ్యాండిల్ చేయడమంటే బాగా హార్డ్‌వర్క్ చేసినంత పనవుతోందంటోంది యాంకర్ సుమ. TNN | Updated: Aug 12, 2015, 07:16PM IST తెలుగునాట బుల్లితెరపై ఫేమస్ ఫీమేల్ యాంకర్ ఎవరు అంటే ఎవరైనా ఇట్టే చెప్పేసే పేరు యాంకర్ సుమ అని. దాదాపు ఛానెళ్లన్నీ కవర్ చేయడమేకాకుండా అనేక సినిమా ఆడియో ఫంక్షన్లు, అవార్డుల ఫంక్షన్లు, సినిమా వేడుకల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించి సుమ యాంకరింగ్ అదుర్స్ అని అనిపించుకుందామె. యాంకరింగ్ విషయంలో ఆమెకి కష్టమంటూ ఏదీ వుండదనే అనుకుంటారంతా. అయితే అటువంటి సుమకి కూడా ఓ ప్రోగ్రాం హ్యాండిల్ చేయడం బాగా కష్టమనిపించిందట. తమిళంలో వస్తున్న జెనిస్ ప్రోగ్రాం డీల్ చేయడమంటే చాలా హార్డ్‌వర్క్ చేసినట్లే అంటోంది సుమ. ఈ ప్రోగ్రాం చేస్తోంటే తనకు మళ్లీ మొదటినుంచి నేర్చుకున్నంత పనవుతోందంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టిందామె. అయినా ఆ హార్డ్‌వర్క్ తనకిష్టమేనని ఆ పోస్ట్‌లో పేర్కొంది సుమ.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఐపీఎల్ ఫైనల్ లో సన్ రైజర్స్ ఐపీఎల్: గుజరాత్ లయన్స్ పై సన్ రైజర్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. TNN | Updated: May 28, 2016, 09:20AM IST ఢిల్లీ: సన్ రైజర్స్ దెబ్బకు గుజరాత్ లయన్స్ ఇంటి బాట పట్టారు. వార్నర్ దూకుడుతో సన్ రైజర్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫిరోషా కోట్ల మైదానం లో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు సాధించింది. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు ఆరంభంలో తడబడింది.. ఒక వైపు సహచరులు వరసగా క్యూకడుతున్నప్పటికీ కెప్టెన్ వార్నర్ దూకుడుగా ఆడుతూ 93 పరుగులు (58 బంతులు) చేసి సన్ రైజర్స్ కు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో సన్ రైజర్స్ జట్టు కు ఫైనల్ బెర్త్ ఖాయమైంది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV IPL 2019 Venue భారత్‌లోనే.. ఎలక్షన్ ఎఫెక్ట్‌తో గత ఏడాది కంటే ముందే ప్రారంభం ఐపీఎల్‌ 2019 భారత్‌లోనే నిర్వహించనున్నారు. ఎన్నికల కారణంగా గత ఏడాది కంటే ముందే లీగ్ ప్రారంభం కానుంది. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేర్స్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. Samayam Telugu | Updated: Jan 8, 2019, 04:44PM IST IPL 2019 Venue భారత్‌లోనే.. ఎలక్షన్ ఎఫెక్ట్‌తో గత ఏడాది కంటే ముందే ప్రారంభం హైలైట్స్ఐపీఎల్‌ 2019 భారత్‌లోనే నిర్వహించనున్నారు. ఎన్నికల కారణంగా గత ఏడాది కంటే ముందే లీగ్ ప్రారంభం కానుంది. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేర్స్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కారణంగా వచ్చే సీజన్లో ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహిస్తారనే వార్తలకు బీసీసీఐ బ్రేక్ వేసింది. 12వ సీజన్ ఐపీఎల్‌ను కూడా భారత్‌లోనే నిర్వహించనున్నట్టు క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో.. టోర్నీని యూఏఈ లేదా దక్షిణాఫ్రికా తరలిస్తారని వార్తలొచ్చాయి. కానీ మన దేశంలోనే టోర్నీ నిర్ణయించాలని బీసీసీఐ నిర్ణయించింది. గత సీజన్‌ను ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించగా.. ఈసారి అంతకు ముందే ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 23 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ వేదికల విషయమై చర్చించేందుకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు. ప్రాథమికంగా చర్చించిన అనంతరం 12వ ఎడిషన్ ఐపీఎల్‌ను స్వదేశంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. విస్తృతమైన చర్చల అనంతరం ఐపీఎల్ 2019 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు బీసీసీఐ తెలిపింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రిటైర్మెంట్‌కి కారణం ఆ ఓటమే: సర్దార్ 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇలాంటి బాధల్ని నేను చాలా అనుభవించా. కానీ.. ఆ ఓటమి బాధని మాత్రం నేను అధిగమించలేకపోయా. Samayam Telugu | Updated: Sep 14, 2018, 01:05PM IST హాకీ ఇండియా ఒత్తిడి మేరకే తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ తాజాగా స్పందించాడు. జాతీయ శిక్షణ శిబిరం కోసం బుధవారం 25 మందితో కూడిన జట్టుని హాకీ ఇండియా ప్రకటించగా.. అందులో సర్దార్ సింగ్‌కి చోటు లభించలేదు. దీంతో.. మనస్థాపానికి గురైన ఈ మిడ్‌ఫీల్డర్ ఆరోజు రాత్రే అంతర్జాతీయ కెరీర్‌కి గుడ్‌బై చెప్పేశాడు. కానీ.. తాను రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయంపై ఆసియా గేమ్స్ ముగిసినప్పటి నుంచి సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్దార్ సింగ్ చెప్పుకొచ్చాడు. ‘ఇండోనేషియా వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా గేమ్స్‌లో భారత హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌‌లో ఓడటం నన్ను బాధించింది. మలేషియా జట్టు చేతిలో ఆ పరాజయాన్ని నేను జీర్ణించుకోలేకపోయా. 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇలాంటి బాధల్ని నేను చాలా అనుభవించా. కానీ.. ఆ ఓటమి బాధని మాత్రం నేను అధిగమించలేకపోయా. దీంతో.. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడి రిటైర్మెంట్‌ తీసుకోవాలనే తుది నిర్ణయానికి వచ్చా. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. హాకీ ఇండియా నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. అంతేకాకుండా.. శిక్షణ శిబిరానికి నన్ను ఎంపిక చేయకపోవడం కూడా ఈ రిటైర్మెంట్‌కి కారణం కాదు’ అని సర్దార్ సింగ్ స్పష్టం చేశాడు.
2sports
Vaani Pushpa 90 Views budget expections , low income fiscal deficit న్యూఢిల్లీ1: దేశ ఆర్ధికలోటు ఆగస్టునెల చివరినాటికి 5.54 లక్షలకోట్లకుచేరింది. బడ్జెట్‌ అంచనాల్లో 78.7శాతానికి చేరిందనిఅంచనా. వ్యయంరాబడుల మధ్య తేడా 5,53,840 కోట్లుగా ఉందని కాగ్‌ హెచ్చరించింది. 2018-19 బడ్జెట్‌ అంచనాల్లో ఆర్ధికలోటు 86.5శాతంగా నిలిచింది. ప్రభుత్వం ఆర్ధికలోటును ఈ ఆర్ధికసంవత్సరానికిగాను 7.03 లక్షలకోట్లుగా నిర్ణయించింది. స్థూల దేశీయోత్పత్తిలో 3.3శాతానికి తీసుకువస్తామని ఆర్ధిక మంత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆర్ధికసేవల కార్యదర్శి అతను చక్రవర్తి మాట్లాడుతూ రుణపరపతి లక్ష్యం 2.68లక్షల కోట్లుగా ఈ ఆర్ధికసంవత్సరం రెండో అర్ధభాగంలో ఉంటుందని వెల్లడించారు. రాబడులు ఏప్రిల్‌ఆగస్టునెలల కాలానికి బడ్జెట్‌ అంచనాల్లోచూపించిన వాటికంటే 30.7శాతం ఎక్కువ ఉన్నాయి. అంతకుముందు ఏడాదితోపోలిస్తే 26.9శాతంగా నిలిచాయి. రాబడి రసీదులపరంగా చూస్తే ఆగస్టు చివరినాటికి 6.03 లక్షలకోట్లుగా ఉనానయి. మొత్తం పూర్తి సంవత్సరానికిగాను రాబడులు 19.62 లక్షలకోట్లుగా అంచనావేసింది.ఇక మూలధన వ్యయం బడ్జెట్‌ అంచనాల్లో 40.3శాతంగా ఉంది. ఏడాదిక్రితం 44.1శాతం కంటే కొంతమేర తగ్గింది. మొత్తం వ్యయం ఏప్రిల్‌ ఆగస్టునెలల మధ్యకాలంలో 11.75 లక్షలకోట్లుగా ఉంది. అంటే బడ్జెట్‌ అంచనాల్లో 42.2శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది బడ్జెట అంచనాల్లోచూపించిన విధంగా 43.8శాతం కంటే కొంతమేర తగ్గింది. ఈ ఆర్ధికసంవత్సరంలో వ్యయాన్ని 27.86 లక్షలకోట్లుగా ప్రభుత్వం అంచనావేసిన సంగతి తెలిసిందే. నెలవారీగా వచ్చిన లోటు గణాంకాలతో పూర్తి సంవత్సరానికి అంచనావేయలేమని ఆర్ధికశాఖ చెపుతోంది. ఇకరుణేతర రాబడులు, వ్యయం మ్యాచ్‌కావడంలేదు. ఆర్ధికసంవత్సరం చివరినాటికి కొంతమేర లోటును కొంతమేర తగ్గించగలమన్న అంచనా వ్యక్తం అవుతోంది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV జడేజా జోరు.. లంచ్‌ బ్రేక్‌కి దక్షిణాఫ్రికా 129/6 రాంచీ టెస్టులో భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ల హవా మొదలైంది. ఈరోజు తొలి సెషన్‌లోనే సఫారీలను ఉక్కిరిబిక్కిరి చేసిన జడేజా, నదీమ్.. మూడు వికెట్లు పడగొట్టగలిగారు. కెరీర్‌లో నదీమ్‌కి ఇదే ఫస్ట్ టెస్టుకాగా.. బవుమా రూపంలో అతనికి మొదటి వికెట్ దక్కింది. Samayam Telugu | Updated: Oct 21, 2019, 11:56AM IST హైలైట్స్ ఈరోజు తొలి సెషన్‌లోనే నాలుగు వికెట్లు చేజార్చుకున్న సఫారీలు ఇందులో మూడు వికెట్లు ఎడమచేతి వాటం స్పిన్నర్ల ఖాతాలో టెస్టు కెరీర్‌లో తొలి వికెట్ అందుకున్న స్పిన్నర్ నదీమ్ ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ పడగొట్టిన ఉమేశ్ యాదవ్ దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్నర్ల హవా మొదలైంది. ఆటలో మూడో రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 9/2తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు తొలి సెషన్ ముగిసే సమయానికి 129/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో జార్జ్ లిండే (10), డానె పైట్ (4) ఉండగా.. ఆ జట్టు ఇంకా భారత్ కంటే 368 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది. IND vs SA 3rd Test Live Score బోర్డు కోసం క్లిక్ చేయండి..! ఈరోజు తొలి సెషన్‌ ఫస్ట్ ఓవర్‌లోనే డుప్లెసిస్ (1) వికెట్ పడగొట్టిన ఉమేశ్ యాదవ్.. సఫారీలకి ఊహించని షాకిచ్చాడు. కానీ.. టీ20 తరహా ఆటతో రెచ్చిపోయిన హజ్మా (62: 79 బంతుల్లో 10x4, 1x6) మెరుపు హాఫ్ సెంచరీ బాది మళ్లీ సఫారీ జట్టుని రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే.. ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేసిన జడేజా తెలివైన బంతితో హజ్మాని క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత తెంబ బవుమా (32: 72 బంతుల్లో 5x4)ని నదీమ్‌ ఔట్ చేయగా.. కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (6)ని జడేజా బోల్తా కొట్టించేశాడు. మరోవైపు ఫస్ట్ టెస్టు మ్యాచ్ ఆడుతున్న నదీమ్‌కి కూడా బవుమానే ఫస్ట్ వికెట్. Read More: రాంచీలో డికాక్ పాదం తాకి.. చెప్పు వదిలిన ఫ్యాన్ రాంచీ పిచ్‌ స్పిన్నర్లకి అనుకూలిస్తుందని గత వారం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఈ పిచ్‌పై ఎక్కువ వికెట్లు తీసి ఉండటంతో.. టీమిండియా తెలివిగా జడేజాతో పాటు నదీమ్‌ రూపంలో ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లని తీసుకుంది. తొలి సెషన్‌లోనే ఈ ఇద్దరూ మూడు వికెట్లు పడగొట్టి సఫారీ బ్యాట్స్‌మెన్‌లను ఒత్తిడిలోకి నెట్టడం సఫలమయ్యారు.
2sports
Hyderabad, First Published 29, Jun 2019, 2:41 PM IST Highlights ఈ మధ్యకాలంలో తెలుగులోకి డబ్ అవుతోన్న హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చెప్పడానికి మన టాలీవుడ్ హీరోలు ముందుకు వస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగులోకి డబ్ అవుతోన్న హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చెప్పడానికి మన టాలీవుడ్ హీరోలు ముందుకు వస్తున్నారు. 'అవెంజర్స్' లాంటి క్రేజ్ ఉన్న సినిమాకి రానా డబ్బింగ్ చెబితే.. ఇటీవల విడుదలైన 'అల్లాదిన్' సినిమాలో రెండు ప్రధాన పాత్రలకు వెంకీ, వరుణ్ లు తమ వాయిస్ అందించారు.  ఇప్పుడు ఈ లిస్ట్ లోకి యంగ్ హీరో నాని కూడా జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే విడుదల కానున్న 'ది లయన్ కింగ్' సినిమాలోని సింబా పాత్రకు నేచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెబుతున్నాడు. డిస్నీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరో పాత్రకు నాని డబ్బింగ్ చెబుతుండడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇదే సినిమాలో ముసాఫా అనే పాత్రకు జగపతి బాబుడబ్బింగ్ చెబుతున్నారు. అలానే మరికొన్ని కీలకపాత్రలకు బ్రహ్మానందం, అలీ, రవిశంకర్ లు డబ్బింగ్ చెబుతున్నారు. 'సింబా' పాత్రకు బాలీవుడ్ లో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెబుతుండగా.. ముసాఫా పాత్రకు షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెబుతున్నారు.
0business
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
సింగీతంతోనే బాలయ్య 100వ సినిమా బాల‌కృష్ణ కెరీర్‌లో ఆదిత్య 369 చిత్రానికి ప్ర‌త్యేక‌మైన స్థాన‌ముంది. TNN | Updated: Dec 10, 2015, 04:38PM IST బాల‌కృష్ణ కెరీర్‌లో ఆదిత్య 369 చిత్రానికి ప్ర‌త్యేక‌మైన స్థాన‌ముంది. టైమ్ మిష‌న్ క‌థాంశానికి జాన‌ప‌ద అంశాల‌ను మేళ‌వించి తెర‌కెక్కించిన ఈ చిత్రం తిరుగులేని విజ‌యాన్ని సాధించింది. 1991లో తొమ్మిది కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో స‌రికొత్త రికార్డుల‌కు వేదిక‌గా నిలిచింది. ఇందులో శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లుగా, ఆధునిక యువ‌కుడిగా బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యంలో న‌టించారు. సింగీతం శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి జంధ్యాల మాట‌ల‌ను అందించారు. ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌మణ్యం ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఇదిలా ఉండ‌గా ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెర‌కెక్కించేందుకు చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ విష‌యాన్ని బాల‌కృష్ణ‌తో పాటు ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు ప‌లుమార్లు ప్ర‌క‌టించారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సీక్వెల్‌ను తెర‌పైకి తీసుకొచ్చేందుకు వీరు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ డిక్టేట‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఆయ‌న న‌టిస్తోన్న 99న చిత్ర‌మిది. వందో సినిమాను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న బాల‌కృష్ణ ఇందుకోసం ఆదిత్య 369 సీక్వెల్‌పై దృష్టిసారించిన‌ట్లు తెలిసింది. ఇటీవ‌లే సింగీతం శ్రీ‌నివాస‌రావుతో సంప్ర‌దింపులు జ‌రిపిన ఆయ‌న‌ ఈ క‌థ‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల్సిందిగా ద‌ర్శ‌కుడిని కోరిన‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం సింగీతం ఆ ప‌నిలోనే ఉన్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రారంభించాల‌నే యోచ‌న‌లో వారు ఉన్న‌ట్లు తెలిసింది.
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV సూపర్ స్టార్ కు వియ్యంకుడి తంటా నన్ను మానసికంగా వేధించి, నా పరువు తీసేందుకు కుట్ర జరుగుతోంది. అందుకే నాపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు. TNN | Updated: Jul 21, 2015, 04:12PM IST నన్ను మానసికంగా వేధించి, నా పరువు తీసేందుకు కుట్ర జరుగుతోంది. అందుకే నాకు సంబంధం లేని అప్పుని తీర్చేందుకు నన్ను బాధ్యుడిగా చూపిస్తున్నారు. అంతేకాకుండా ఆ అప్పుని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టాడంటూ నాపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మద్రాస్ హైకోర్టుకు ఇచ్చిన సమాధానం ఇది. వివరాల్లోకి వెళ్తే, రజినీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా 2012లో వడ్డీ వ్యాపారి అయిన ఎస్ ముకున్ చాంద్ వద్ద రూ.65 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఆ మొత్తాన్ని అతడు తిరిగి చెల్లించకపోవడంతో ముకున్ చాంద్ కోర్టుకు వెళ్లాడు. తన డబ్బుని తిరిగి ఇప్పించాల్సిందిగా వేడుకుంటూ మద్రాస్ హైకోర్టులో కస్తూరి రాజా, అతడికి వియ్యంకుడైన రజినీకాంత్ పైన సివిల్ కేసు పెట్టాడు. ఒకవేళ తాను తిరిగి చెల్లించలేని పక్షంలో తనకు బదులు ఆ మొత్తాన్ని రజినీకాంత్ తిరిగిస్తాడని కస్తూరి రాజా హామీ ఇచ్చినట్లుగా ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. అతడి పిటిషన్ విచారణకు స్వీకరించిన హై కోర్టు... కస్తూరి రాజా, రజినీకాంత్ లకు నోటీసులు జారీచేసింది. కోర్టు నోటీసులకు స్పందించిన రజినీకాంత్... వియ్యంకుడు కస్తూరి రాజా తీసుకున్న అప్పుకు తనకు ఏ సంబంధం లేదని తేల్చిచెప్పాడు. ఆ అప్పు ఇచ్చే సమయంలో కూడా ముకుంద్ కానీ, లేదా కస్తూరి కానీ తనని సంప్రదించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన రజినీ.. తన ప్రమేయం లేకుండానే జరిగిన ఒప్పందానికి తానెలా బాధ్యత వహిస్తానని పిటీషన్ లో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలతో తాను తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నానని, ఇది తనని అప్రతిష్టపాలు చేసేందుకు జరుగుతున్న కుట్ర మాత్రమేనని రజినీ స్పష్టం చేశాడు.
0business
న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ First Published 2, Jul 2017, 1:14 PM IST న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ న్యూజెర్సీలో డిజే టీమ్ మీట్ & గ్రీట్ ఫోటోస్ Recent Stories
0business
వరల్డ్ కప్ ఆడనున్న రణ్ వీర్ సింగ్ Highlights 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నెట్టింట సందడి చేస్తున్న రియల్ అండ్ రీల్ కపిల్ దేవ్ ఫోటోలు బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ వరల్డ్ కప్ ఆడనున్నారు. అందేంటీ ఆయన క్రికెటర్ కాదు కదా.. వరల్డ్ కప్ ఎలా ఆడతాడు అనే కదా డౌట్. ఆయన ఆడేది నిజజీవితంలో కాదండి. సినిమాలో ఆడతారు. టీమ్ ఇండియా లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్  కెప్టెన్సీలో తొలిసారి 1983లో భారత్ వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో  ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కపిల్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటించనున్నారు.   ఈ నేపథ్యంలో ఆనాడు వరల్డ్ కప్ గెలిచిన టీం అంతా ఓ ఈవెంట్ కి హాజరైంది. ఈ టీంతో హీరో రణ్ వీర్, దర్శకుడు కబీర్ ఖాన్ లు కలిసి సందడి చేశారు. రియల్ కపిల్ దేవ్ తో రీల్ కపిల్ దేవ్ దిగిన ఫోటోలు  ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ స్పెషల్ ఈవెంట్‌కు కెప్టెన్ కపిల్‌తోపాటు టీమ్ సభ్యులు వెంగ్‌సర్కార్, మదన్‌లాల్, సందీప్ పాటిల్, మొహిందర్ అమర్‌నాథ్, రోజర్ బిన్నీ కూడా హాజరయ్యారు. Last Updated 26, Mar 2018, 12:00 AM IST
0business
Hyderabad, First Published 1, Feb 2019, 1:10 PM IST Highlights 2017లో వచ్చిన 'స్పైడర్' సినిమా తరువాత రకుల్ మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. అప్పటివరకు టాప్ రేసులో దూసుకుపోయిన ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పడిపోయింది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాలో శ్రీదేవి పాత్ర పోషించినప్పటికీ ఆమె పాత్ర గుర్తుపెట్టుకునే విధంగా అయితే లేదు. 2017లో వచ్చిన 'స్పైడర్' సినిమా తరువాత రకుల్ మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. అప్పటివరకు టాప్ రేసులో దూసుకుపోయిన ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పడిపోయింది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాలో శ్రీదేవి పాత్ర పోషించినప్పటికీ ఆమె పాత్ర గుర్తుపెట్టుకునే విధంగా అయితే లేదు. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళ, హిందీ భాషల్లో మాత్రం కొన్ని సినిమాలు చేస్తోంది. అందులో కార్తి 'దేవ్' సినిమా కూడా ఉంది. గతంలో కార్తితో కలిసి 'ఖాకీ' అనే సినిమాలో నటించింది రకుల్. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు 'దేవ్' సినిమాపైనే రకుల్ ఆశలన్నీ పెట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో అమ్మడు రొమాన్స్ డోస్ కూడా బాగానే పెంచింది. ఈ సినిమా హిట్ అయితే తెలుగు, తమిళ భాషల్లో మరిన్ని అవకాశాలు సంపాదించుకోవచ్చనేది రకుల్ ఆలోచన. అందుకే ఈ సినిమాపైనే తన దృష్టి మొత్తం పెట్టింది. సినిమాను వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్తమ్మాయిల హవా పెరగడంతో రకుల్ జోరు బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. రజత్ రవిశంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV Train టికెట్ క్యాన్సల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి! కొన్ని సందర్భాల్లో ఊహించని కారణంగా ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేయాల్సి రావొచ్చు. అందువల్ల టికెట్ క్యాన్సల్ రూల్స్‌ను ముందుగానే తెలుసుకొని ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. Samayam Telugu | Updated: Oct 26, 2019, 01:10PM IST Train టికెట్ క్యాన్సల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి! హైలైట్స్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారానే ఇ-టికెట్లను రద్దు చేసుకోవచ్చు చార్జీలు మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు కన్ఫార్మ్ అయిన తత్కాల్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ రాదు ట్రైన్ క్యాన్సిల్ అయితే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ట్రైన్ ప్యాసింజర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. ఇ-టికెటింగ్ సేవలు కూడా ఇందులో భాగమే. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు వెళ్లి ట్రైన్ టికెట్లను (తత్కాల్ సహా) బుక్ చేసుకోవచ్చు. టికెట్లను బుక్ చేసుకోవడమే కాకుండా ఆ టికెట్లను క్యాన్సల్ చేసుకునే సదుపాయం కూడా ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. రైల్వే ఇ-టికెట్లకు సంబంధించిన ఐఆర్‌సీటీసీ లేటెస్ట్ క్యాన్సలేషన్ రూల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.. ✺ ఐఆర్‌సీటీసీ ప్రకారం.. ట్రైన్ చార్ట్ ప్రిపేర్ కావడానికి ముందు వరకు ఇ-టికెట్లను క్యాన్సల్ చేసుకోవచ్చు. ✺ ప్యాసింజర్లు టికెట్లను ఇండియన్ రైల్వే కౌంటర్లు, ఇతర టికెట్ బుకింగ్ ఆఫీసుల్లో క్యాన్సల్ చేసుకోవడానికి వీలు లేదు. ✺ టికెట్ క్యాన్సలేషన్ కన్ఫార్మ్ అయిన విషయం ఆన్‌లైన్‌లోనే తెలుస్తుంది. రిఫండ్ అమౌంట్ మీరు ఏ మార్గంలో టికెట్ బుక్ చేశారో ఆ ఖాతాలోనే జమవుతుంది. Also Read: నవంబర్ 1 షాక్ నుంచి ముందే తప్పించుకోండి.. 6 రోజులే మిగిలున్నాయ్! ✺ ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే.. టికెట్లు క్యాన్సల్ చేయమని వారినే కోరవచ్చు. ఏజెంట్లు [email protected]కు మెయిల్ పంపాల్సి ఉంటుంది. ✺ ఏజెంట్లు టీడీఆర్ ఫైల్ చేయాలంటే.. పీఎన్ఆర్ నెంబర్, ట్రాన్సాక్షన్ ఐడీ, ట్రైన్ నెంబర్, సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ సోర్స్, డేట్ ఆఫ్ జర్నీ, సీరియల్ నెంబర్, ప్యాసింజర్ నేమ్, ఏజ్ వంటి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ✺ ఐఆర్‌సీటీసీ టీడీఆర్ క్లెయిమ్‌ను రైల్వేస్‌కు ఫార్వర్డ్ చేస్తుంది. రిఫండ్ అమౌంట్ ఏజెంట్ అకౌంట్‌లో జమవుతుంది. ✺ కన్ఫార్మ్ అయిన తత్కాల్ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటే ప్యాసింజర్లకు ఎలాంటి రిఫండ్ రాదు. ✺ వెయిట్‌లిస్టెడ్ తత్కాల్ టికెట్లను క్యాన్సల్ చేస్తే.. చార్జీలు పట్టుకొని మిగతా డబ్బులు వెనక్కు ఇస్తారు. ✺ ఒకవేళ మీరు వెళ్లాల్సిన ట్రైన్ క్యాన్సల్ అయితే అప్పుడు టికెట్ ఫుల్ అమౌంట్ ప్యాసింజర్లకు తిరిగి చెల్లిస్తారు.
1entertainment
ఈ క్రికెటర్‌ ఎవరో తెలుసా. ? (వీడియో) Highlights క్రికెట్‌ ఆడుతున్న పిల్లల వద్దకు వెళ్లి తాను కూడా చేరనని అడిగి మరీ ఆడాడు.  మారువేషంలో ముంబై వీధుల్లోకి వెళ్లి చిన్నారులతో గల్లీ క్రికెట్‌ ఆడి సందడి చేశాడు. పొడవాటి నెరిసిన జట్టుతో వృద్ధుడిలా మారువేషం వేసుకున్న లీ వీధుల్లో క్రికెట్‌ ఆడుతున్న పిల్లల వద్దకు వెళ్లి తాను కూడా చేరనని అడిగి మరీ ఆడాడు. తొలుత ఆట గురించి తనకేమీ తెలియదన్నట్టు నటించిన లీ.. ఆ తర్వాత బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తన టాలెంట్‌ చూపించి చిన్నారులను సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశాడు. చివరగా తాను ఎవరో చెప్పడంతో చిన్నారులు ఆనందంతో గంతులేశారు. వారికి ఆటోగ్రా్‌ఫలు ఇచ్చి సంతోషపెట్టాడు.
2sports
లక్ష్మీ రాయ్ బికినీతో హీట్ పెంచేసింది Highlights అందచందాలతో రెచ్చగొడుతున్న ఖైదీ భామ లక్ష్మీ రాయ్ గ్లామర్ ప్రియులకు ఈమెతో బాగానే పరిచయం ఉంటుంది. తెలుగు తమిళంలో సినిమాలు తీస్తు కొంచెం బిజీగానే ఉంది. లక్ష్మీ రాయ్ సినిమాల్లో సోకుల ఆరబోయడంలో బాగా దిట్ట. ఇప్పుడీ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ బికినీ పిక్ ను పోస్ట్ చేసింది. సమ్మర్ వెకేషన్ సందర్భంగా దిగిన ఓ సూపర్బ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయినా.. ఇలాంటి టూ పీస్ బికినీ వేసుకుని ఓ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. సౌందర్యాన్ని ఆరాధించకుండా ఉంటారా.? అంతటి ఎండలో కూడా ఈమె వయ్యారాలు ఏ రేంజ్ లో మెరిసిపోతోన్నాయో గమనించారా.. వంకలు పెట్టలేనన్ని వయ్యారాలను కలిగిన వనితలు కాసింత అరుదుగానే ఉంటారు.  Last Updated 19, Apr 2018, 4:55 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV సెలవు రోజులూ ప‌నిచేయ‌నున్న ఐటీ కార్యాల‌యాలు వరుసగా వస్తున్న సెలవు దినాల్లో ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు పని చేయనున్నాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల చీఫ్‌ కమిషనర్‌ తెలిపారు. TNN | Updated: Mar 29, 2018, 03:48PM IST వరుసగా వస్తున్న సెలవు దినాల్లో ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు పని చేయనున్నాయని తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల చీఫ్‌ కమిషనర్‌ తెలిపారు. మహావీర్‌ జయంత్రి సందర్భంగా 29న, గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకొని 30న, ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా 31న సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు సెలవు దినాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు పని చేస్తాయని చీఫ్‌ కమిషనర్‌ వివరించారు. ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసేవారి సౌకర్యార్థం కార్యాలయాలను తెరిచి ఉంచనున్నామని ఆయన తెలిపారు. ఐటీ కార్యాల‌యాలు ఈ మూడు రోజులు తెరిచే ఉంటాయ్ గ‌త రెండు ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు మార్చి 31 వ‌ర‌కూ గ‌డువు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఐటీ కార్యాల‌యాల‌కు వెళ్లి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ సమ‌ర్పించ‌వ‌చ్చు. ప‌న్ను సంక్ర‌మిత ఆదాయం రూ.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఉంటే రిట‌ర్నుల‌ను ఆన్‌లైన్ ద్వారా మాత్ర‌మే స‌మ‌ర్పించాలి.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV టాప్ అథ్లెట్లకు నెలకి రూ.50వేల స్టైఫండ్ కేంద్ర క్రీడల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు TNN | Updated: Sep 16, 2017, 04:41PM IST కేంద్ర క్రీడల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక అథ్లెట్‌గా అంతర్జాతీయ స్థాయిలో పోటీలకి సిద్ధమయ్యే సమయంలో ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలిసిన రాథోడ్.. తాజాగా టాప్ పథకంలో ఉన్న 152 మంది క్రీడాకారులకి ఖర్చుల కింద నెలకి రూ. 50వేలు స్టైఫండ్‌ రూపంలో క్రీడల శాఖ అందజేస్తుందని ప్రకటించారు. రియో ఒలింపిక్స్ అనంతరం అభినవ్ బింద్రా సారథ్యంలోని ఒలింపిక్ టాస్క్‌ఫోర్స్ బృందం 152 మంది క్రీడాకారుల్ని ఒలింపిక్స్, కామెన్‌వెల్త్, ఆసియా క్రీడల కోసం సిద్ధమవుతున్న‘టాప్’ (టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్)‌గా గుర్తించింది. ఈ టాప్‌లో ఉన్న క్రీడాకారులు మాత్రమే స్టైఫండ్‌కి ప్రస్తుతం అర్హులు. అంతర్జాతీయ ఈవెంట్లకి సిద్ధమయ్యే క్రీడాకారులకి అన్ని సౌకర్యాలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని.. సెప్టెంబరు 1 నుంచి ‘పాకెట్ మనీ’ పేరుతో ఈ స్టైఫండ్ క్రీడాకారులకి అందుతుందని రాజ్యవర్ధన్‌సింగ్ స్పష్టం చేశారు.
2sports
- అత్యంత ధనికుడైన భారతీయుడు ఆయనే - రెండో స్థానంలోకి దిలిప్‌ సంఘ్వీ - ఫోర్భ్స్‌ తాజా 'వాస్తవ సమయ ర్యాకింగ్స్‌'లో వెల్లడి          న్యూయార్క్‌: ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా మళ్లీ ముఖేశ్‌ అంబానీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తాజాగా రిలయన్స్‌ అధినేత అంబానీఆస్తుల విలువ 19.6 బిలియన్‌ డాలర్లకు చేరువవడంతో అగ్రస్థానం మళ్లీ అంబానీ వశమైంది. గత ఏడు వారాలుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న సన్‌ ఫార్మా అధినేత దిలిప్‌ సంఘ్వీని రెండో స్థానంలోకి జారుకున్నారు. బలహీన మార్కెట్ల నేపథ్యంలో దిలిప్‌ సంఘ్వీకి చెందిన సన్‌ ఫార్మా కంపెనీ షేరు విలువ దాదాపు రెండు శాతం మేర క్షీణించింది దీంతో ఆయన ఆస్తుల విలువ 4.50 కోట్ల డాలర్ల మేర తగ్గింది. దీంతో సంఘ్వీ తన అగ్రస్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆయన మొత్తం ఆస్తుల విలువ 19.3 బిలియన్లకు చేరింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 50 మంది కుబేరుల జాబితాలో అంబానీ 46 ర్యాంకుతో, సంఘ్వీ 48వ ర్యాంకుతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. మార్చిలో ఫోర్భ్స్‌ వెల్లడించిన వార్షిక కుబేరుల జాబితాలోఅంబానీ 39వ ర్యాంకును, సంఘ్వీ 44వ స్థానాన్ని పొందిన సంగతి తెలిసిందే. ఈ జాబితా వెలువడిన రెండు రోజులకే సన్‌ ఫార్మా షేర్లలో ఏర్పడిన ర్యాలీ కారణంగా సంఘ్వీ ప్రపంచంలోనే అతి ధనికుడైన భారతీయుడిగా అవతరించారు. బిల్‌గేట్స్‌ 80.3 బిలియన్‌ డాలర్ల ఆస్తుల విలువతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. తాజా వాస్తవ సమీకరణల మేరకు అంబానీ, సంఘ్వీల తరువాతి స్థానాలలో అజీం ప్రేమ్‌జీ, లక్ష్మీ మిట్టల్‌, శివ నడార్‌, కుమార మంగళం బిర్లా, ఉదరు కోతక్‌, సనీల్‌ మిట్టల్‌, సైరస్‌ పూనావాలా మరియు గౌతం అదానీలు టాప్‌ టెన్‌ ర్యాంకులలో కొనసాగుతున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
శ్రీనువైట్లకు అండగా నిలిచిన ప్రముఖ హీరో Highlights పరాజయాలతో సతమతమవుతున్న స్టార్ డైరెక్టర్ మిస్టర్ తో మరోసారి దెబ్బతిన్న శ్రీను వైట్ల అండగా నిలిచిన అగ్రహీరో ‘విలన్ ఇంట్లో కి హీరో చేరి.. వారిని బకరాలు చేసి ఆడించి చివరకు విజయం సాధిస్తాడు.’ ఈ లైన్ తో తెలుగులో ఇప్పటికి చాలా సినిమాలో వచ్చాయి. అయితే.. ఆ సినిమాకు మొదట ఆజ్యం పోసిన డైరెక్టర్ శ్రీను వైట్ల. ఈ రకం ట్రెండ్ ని ఆయన రెడీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఆ ఫార్ములాని ఉపయోగించుకొని హిట్లు కొట్టిన హీరోలు, దర్శకులు కూడా ఉన్నారు. అంతేకాదు.. ప్రిన్స్ మహేష్ బాబుకి దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అప్పుడు శ్రీను వైట్లకు బ్రహ్మరథం పట్టారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. తీసిన సినిమాలు డిజాస్టర్ల రూపంలో ఆయనను వెక్కిరించాయి.   బాగా ఆశలు పెట్టుకొని తీసిన మిస్టర్ సినిమా మళ్లీ నిరాశనే మిగిల్చింది. దాంతో అగ్రదర్శకుడిగా ఉన్న శ్రీను వైట్లకు చాలా మంది ముఖం చాటేశారు. కానీ పడిలేచిన కెరటంలా మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. తాజాగా శ్రీనువైట్లకు ప్రముఖ నిర్మాణ సంస్థ, స్టార్ హీరో దన్నుగా నిలిచారనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.   మిస్టర్ సినిమా ప్లాప్ తో.. శ్రీను వైట్ల పరిస్థితి దారుణంగా మారిపోయందని.. ఆస్తులన్నీ అమ్ముకున్నాడనే .. ఆఖరిని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దూకుడు చిత్రం తీసిన 14రీల్స్  ఓ సినిమా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. 2 కోట్లు అడ్వాన్స్ తీసుకొని.. 'దూకుడు' షూటింగ్ సమయంలోనే శ్రీను వైట్ల టాలెంట్ చూసి 14రీల్స్  సంస్థ ఆయన దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి రూ. 2 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారట. కానీ పరిస్థితులకు కారణంగా శ్రీను వైట్ల 14రీల్స్ కి  కాకుండా వేరే నిర్మాణ సంస్థలకు సినిమా చేసి పెట్టాడు. అయితే ఆ సినిమా అలానే పెండింగ్ లో ఉండిపోయింది. శ్రీను వైట్ల తీసిన సినిమాలు డిజాస్టర్లుగా మారడంతో సదరు నిర్మాతలు వెనకడుగు వేశారట.   ప్రస్తుతం ఫెయిల్యూరు రికార్డు ఉన్న శ్రీను వైట్లతో సినిమా తీయడం ఇష్టం లేక అడ్వాన్స్ గా ఇచ్చిన రెండు కోట్లు తిరిగి ఇవ్వాలని 14రీల్స్ అధినేతలు అడిగారట. అందుకు తన పరిస్థితి ఇప్పుడు బాగోలేదని, కావాలంటే మరో సినిమా చేస్తానని నిర్మాతలకు స్పష్టం చేశారంట. శ్రీను వైట్ల పరిస్థితిని అర్థం చేసుకుని నిర్మాతలు సానుకూలంగా స్పందించారనేది తాజా సమాచారం.    అయితే.. హీరోని మాత్రం మీరే వెతుక్కోవాలని14రీల్స్  చెప్పగా.. శ్రీను వైట్లతో సినిమా తీయడానికి ఆయన మిత్రుడు రవితేజ అంగీకరించినట్టు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా కనుక హిట్ అయితే.. శ్రీను వైట్ల మళ్లీ అగ్ర దర్శకుడిగా మారతాడనడంలో సందేహం లేదు. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
Hyd Internet 62 Views stock markets ముంబ‌యిః ఈ రోజు స్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయి లాభాల‌తో ముగిశాయి. 200 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 32,663 వద్ద ముగిసింది. 63 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 10,230 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఎక్కువ‌గా లాభ‌ప‌డిన కంపెనీల్లో జేఎమ్ఫై, నాన్షియ‌ల్ లిమిటెడ్‌, ఒబెరోయి రియాల్టీ, ఫెడెర‌ల్ బ్యాంక్‌, గుజ‌రాత్ గ్యాస్‌, ఐడియా సెల్యూలార్ లిమిటెడ్ ఉన్నాయి. న‌ష్ట‌పోయిన కంపెనీల‌లో స‌న్ ఫార్మ అడ్వాన్స్‌డ్‌, యూనిటెక్ లిమిటెడ్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, రిల‌య‌న్స్ నేవ‌ల్ ఉన్నాయి.
1entertainment
Suresh 119 Views విలీనంతో ఎస్‌బిఐకి 120 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం అనుబంధ బ్యాంకులు, భారతీ య మహిళాబ్యాంకును విలీనం చేసుకోవడం ద్వారా మొత్తం 120 బిలియన్‌ డాలర్ల నిధులు పెంచుకో గలుగుతోంది. ప్రభుత్వరంగ బ్యాంకులు నిరర్ధక ఆస్తులతో సతమతం అవుతున్న తరుణంలో ఈ బ్యాంకుల విలీనంతో ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టినట్లయింది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న 27 ప్రభుత్వరంగ బ్యాంకులను పునరేకీకరణకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఏనాడో అనుమతించింది. వీట న్నింటిని ఏడు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటుచేయా లని ప్రతిపాదించింది. పెద్ద బ్యాంకుల్లో కొన్ని చిన్న బ్యాంకులను విలీనం చేయడం, లాభదాయకత లేని బ్యాంకులను లాభాల్లో ఉన్న బ్యాంకుల్లో కలిపే యడం వంటి చర్యలు చేపట్టాలని గతంలోనే నిర్ణ యించింది. మొట్టమొదటిగా ఎస్‌బిఐ అనుబంధ బ్యాంకుల విలీనం తెరపైకి వచ్చింది. వీటితోపాటే 2013లో కేవలం మహిళలకోసమే స్థాపించిన భార తీయ మహిళాబ్యాంకును కూడా విలీనం చేసుకుం టున్నది. ఆసియా మూడో అతిపెద్ద ఆర్ధ్థికవ్యవస్థ ఉన్న భారత్‌లో పెట్టుబడులతో కూడిన రికవరీలు సాధించేందుకు ఈ విలీనం ప్రతిపాదనలు సహకరి స్తాయని చెపుతున్నారు. భారత్‌లోని 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంకింగ్‌ రంగంలో 70శాతం నిర్వహణాస్తులు కలిగి ఉన్నాయి. వీటిలో సింహ భాగం 120 బిలియన్లు సమస్యాత్మక రుణాల కేట గిరీలోనే ఉన్నాయి. ఎస్‌బిఐ విలీనం ప్రతిపాదన లతో తన ఆస్తులను 36శాతం పెంచుకుని 447 బిలియన్‌ డాలర్లకు వృద్ధిచేసుకోగలదని అంచనా. అదే క్రమంలో భారతీయ స్టేట్‌బ్యాంకుకు విలీనం తర్వాత అనుబంధ బ్యాంకుల రానిబాకీలు, మొండి బకాయిలు కూడా సమస్యాత్మకం అవుతాయి. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు వీటి బాధ్యతలు అప్పగించినా రికవరీల శాతం తక్కువగానే ఉంది. 2017 మార్చికల్లా బ్యాంకులు తమ ఆస్తి అప్పుల పట్టీలను ప్రక్షాళన చేసుకోవా లన్న ఆర్‌బిఐ ఉత్తర్వులమేరకు రానిబాకీ లను ముందుగానే గుర్తించి కేటాయింపులు పెంచుకోవడం వల్ల ప్రభుత్వరంగ బ్యాం కుల త్రైమాసిక ఫలితాల్లో నికరలాభాలు దెబ్బతింటున్న సంగతితెలిసిందే. మొత్తంగా చూస్తే సుమారుగా 5.35 లక్షలకోట్ల మేర కు బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. వీటన్నింటినీ సమ న్వయం చేసుకుంటూ ప్రపంచస్థాయి బ్యాంకింగ్‌ వ్యవస్థను నిర్మించేందుకు ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభు త్వం కృషిచేస్తున్న చర్యల్లో భాగంగానే ఎస్‌బిఐలో అనుబంధ బ్యాంకుల విలీనం ప్రతిపాదనలు అమలులోనికి తెచ్చినట్లు స్పష్టం అవుతోంది.
1entertainment
internet vaartha 294 Views విండీస్‌ బోర్డుపై ఆసక్తికర వ్యాఖ్య కోల్‌కతా : వెస్టిండీస్‌ క్రికెట్‌ స్టార్‌ డ్వేన్‌ బ్రావో సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఇప్పటికే వెస్టిండీస్‌ బోర్డుపై ఆ జట్టు కెప్టెన్‌ డారెన్‌ సమీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనికి తాజాగా డ్వేన్‌ బ్రావో జత కలిశాడని పేర్కొనవచ్చు. డ్వేన్‌ బ్రావో మాట్లాడుతూ తమకు బిసిసి నుంచి మంచి మద్దతు లభించిందని, బిసిసిఐ ఎంతో చేసిందన్నాదని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా వెస్టిండీస్‌ జట్టు తమకు ఏం చేయలేదని బ్రావో మండిప డ్డాడు. కాగా సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్‌ జట్టు బోర్డు సరైన వారి చేతిలో లేదన్నాడు. తమకు ఇప్పటి వరకు ఏ బోర్డు అధికారి నుంచి లేదా డైరెక్టర్‌ నుంచి ఫోన్‌ కాల్‌ రాలేదన్నాడు. ఇది సరైనది కాదని, విమర్శించాడు. మ్యాచ్‌కు ముందు తమకు ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదని,తాము కప్‌ గెలవమని వారు బాగా నమ్మి ఉంటారని ఎద్దేవా చేశాడు.ఇది జట్టు ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకమని,అదే బిసిసిఐ ఎంతో చేసిందన్నాడు. తనను క్రిస్‌ గేల్‌, రస్సెల్‌ వంటి ఆటగాళ్లను వెస్టిండీస్‌ బోర్డు వన్డేలకు పక్కన బెట్టిందని,ఇది సరైన చర్య కాదన్నాడు. కాగా భారత్‌ లో తమకు ఎంతో ప్రేమ దొరికిందని, బిసిసిఐ ఎంతో మద్దతు ఇచ్చిందన్నాడు. కరేబియ న్లను క్రికెట్‌ ఒకటి చేస్తుందని డ్వేన్‌ బ్రావో పేర్కొన్నాడు. డ్వేన్‌ బ్రావోపై ఫైర్‌ తమ జట్టును భారత్‌ పంపించేందుకు తాము ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకున్నామని, అలాంటప్పుడు కప్పు గెలిచినంత మాత్రానా బోర్డుపైన విండీస్‌ కెప్టెన్‌ డారెన్‌ సమీ ఇలా మాట్లాడటం బాధించిందని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంగ్లండ్‌ పైన ప్రపంచ కప్‌ టి20లో డారెన్‌ సమీ గెలుపొందిన సంగతి తెలిసిందే. కాప్‌ గెలిచిన అనంతరం సమీ వెస్టిండీస్‌ బోర్డుపైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై విండీస్‌ బోర్డు వెంటనే స్పందించింది. పోటీలో గెలిచినంత మాత్రానా అవాకులు,చవాకులు మాట్లాడటం సరికాదని హితవు పలికింది. తమ దేశ బోర్డు తమకు గౌరవం ఇవ్వలేదని,సరైన దుస్తులు లేవని, ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు వచ్చామని సమీ పేర్కొన్నాడు.టీమ్‌ మేనేజన్‌గా ఉన్న  వావ్లే లీవిస్‌ గతంలో ఏ జట్టుతోనూ పనిచేయలేదని, అనుభవం లేని వ్యక్తిని ఎంపిక చేసి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాడని విమర్శించాడు.తమకు దేశాధినేతల నుంచి పోన్లు వచ్చినా, బోర్డు నుంచి ఎలాంటి సందేశం రాలేదన్నాడు.సమీ ఆరోపణలు చేసిన అనంతరం వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటన చేసింది.ప్రపంచ కప్‌ టి20 పోటీలను విజయవంతంగా నిర్వహించిన బిసిసిఐకి అభినందనలు తెలిపింది.డారెన్‌ సమీ వ్యాఖ్యలపై వెస్టిండీస్‌ ప్రజలందరి తరపున క్షమాపణలు కోరుకుంటున్నామని,దేశంలోని ప్రజలంతా తం దేశం గెలువాలని కోరుకున్నారని, భారత్‌కు తమ జట్టును పంపేందుకు వ్యయప్రయాసలకు ఓర్చామని, సమీ ఎందుకలా మాట్లాడాడో కనుక్కుంటామని పేర్కొంది.
2sports
శ్రీవళ్లి ఆడియో రిలీజ్ వేడుకలో శ్రీలేఖకు రామ్ చరణ్ కరెంట్ Highlights విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీవళ్లి ఆడియో వేడుకలో  చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ రామ్ చరణ్ తో మగధీరను టచ్  చేస్తే కరెంట్ ఎలా వస్తుందో  చూపాలని సరదాగా అడిగిన శ్రీలేఖ వినమ్రంగా షేక్ హ్యాండ్ ఇచ్చి శ్రీలేఖ మగధీర టచ్ కరెంట్ కోరిక తీర్చిన రామ్ చరణ్   శ్రీవళ్లి ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ కథా రచయిత, శ్రీవళ్లి చిత్ర దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామ్ చరణ్ రావటం చాలా సంతోషంగా వుందని, భారీ ఓపెనింగ్స్ వచ్చినట్టేనని, అది గ్యారంటీ అనిపిస్తోందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. మనసు అనేది ఎలా వుంటుందో చూడాలనుకునే ప్రయత్నం చేస్తూ తీసిన సైంటిఫిక్ థ్రిల్లర్ ఈ శ్రీవళ్లి అన్నారు. యువతకు నచ్చేసినిమా అన్నారు.   ఇక శ్రీవళ్లి ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ మాట్లాడుతూ కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు. గొంతు కూడా బాగోలేదు. అయినా విజయేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ల ఈవెంట్ కి పిలవకపోయినా వచ్చేవాన్ని నేను. కేవలం మిమ్మల్ని కలవడానికి, అలాగే విజయేంద్ర ప్రసాద్ గారి కోసం వచ్చాను. మగధీర కథ నాకు ఇచ్చినందుకు మా ఫ్యామిలీ తరపున థాంక్స్ చెప్తున్నాను. ఆన కథ అంటేనే దేశవ్యాప్తంగా క్రేజ్ వుంటుంది. అలాంటి గొప్ప రచయిత దర్శకుడిగా రావడం గొప్ప విషయం. శ్రీవళ్లి సినిమా గురించి చెప్పాలంటే.. ఇదో వెరైటీ కథాంశం. సాధారణంగా సైన్స్ థ్రిల్లర్ జేనర్ హాలీవుడ్ లో వుంటుంది. అలాంటి కథను తెలుగులో తెరకెక్కించడం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. గొప్ప రైటర్ రాసిన సబ్జెక్ట్ అందునా.. ఆయనే డైరెక్ట్ చేస్తే ఎంత అద్భుతంగా వుంటుందో శ్రీవళ్లి అంతే బాగుంటుంది అనే నమ్మకం వుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవాలి, ఆల్ ద బెస్ట్. ఇక్కడికి వచ్చిన మా అభిమానులకు అందరికీ పేరుపేరున థాంక్స్ అన్నారు రామ్ చరణ్. తాకితే కరెంట్ ఎలా వస్తుందో చూడాలన్న శ్రీలేఖ, రామ్ చరణ్షేక్ హ్యాండ్... ఇక సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ తన సంగీత దర్శకురాలిగా పరిచయం చేసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆ కార్యక్రమానికి వచ్చారని,, ఇక ఇప్పుడు 75వ సినిమా ప్రమోషన్ కోసం రామ్ చరణ్ రావడం సంతోషంగా వుందని ఎంఎం శ్రీలేఖ అన్నారు. రజత్ నేహా హిరోహిరోయిన్లుగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీవళ్లి ఆకట్టుకుంటుందని శ్రీలేఖ అన్నారు. ఈ సందర్భంగా ధీర ధీర పాట పాడిన శ్రీలేఖ.. మగధీరలో హిరోయిన్ కాజల్ తనని తాకితే కరెంట్ వస్తుండే సీన్ తనకెంతో ఇష్టమని.. ఒక్కసారి టచ్ చేసి ఆ కరెంట్ ఎలా వుంటుందో చూడాలని అంది. దాంతో షేక్ హ్యాండ్ ఇచ్చి శ్రీలేఖ సరదా తీర్చారు రామ్ చరణ్. ఇక పాలకొల్లు కు చెందిన తమను ఆశీర్వదించడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం సంతోషకరమని నిర్మాత అన్నారు. Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0business
internet vaartha 155 Views ముంబై : స్వీడిష్‌ రక్షణ సెక్యూరిటీ కంపెనీ సాబ్‌ దేవంలోని కళ్యాణిగ్రూప్‌కు చెందిన కళ్యాణి స్ట్రాజిక్‌ సిస్టమ్స్‌ కంపెనీతో జాయింట్‌ వెంచర్‌లో రక్షణరంగ ఉత్పత్తులను ప్రారంభిస్తోంది. భూమి నుంచి గాలిలోనికి క్షిపణులు తయారీ, స్వల్పఅవధి రక్షణరంగ ఉత్పత్తులను తయారుచేసేందుకు ఈ జాయింట్‌ వెంచర్‌ నెలకొల్పుతున్నట్లు ప్రకటించాయి. ఈ జాయింట్‌ వెంచర్‌ మొత్తం ఉత్పత్తి, డెలివరీలు రెండింటిపైనా దృష్టిపెడుతుంది. భారతీయ కస్టమర్లకు ముందు ఈ ఉత్పత్తులు అందుతాయి. అంటే భారత్‌ రక్షణరంగం కోసమే ఈ జాయింట్‌ వెంచర్‌ పనిచేస్తుంది. స్వల్పలక్ష్యఛేదిత భూమి ఉపరితల క్షిపణితయారీకి ఉపక్రమిస్తాయి. అలాగే తక్కువ దూరనుంచి లక్ష్యం ఛేదించే రక్షణ రంగ ఉత్పత్తులను తయారుచేస్తాయని క్రటించాయి. 2014 ఫిబ్రవరిలోనే సాబ్‌ రవాణారంగంలో నిపుణులైన కంపెనీ అశోక్‌లేలాండ్‌ రెండూ చేతులు కలిపాయి. భారత్‌ ఆర్మీకి సంబంధించి రక్షణరంగ ఉత్పత్తులకు శ్రీకారం చుట్టాయి సాబ్‌, అశోక్‌లేలాండ్‌ రెండూ కూడా ఎస్‌ఆర్‌ఎస్‌ఎఎం అవసరాలను తీర్చేందుకు ఒప్పందం చేసుకున్నాయి. అశోక్‌లేల్యాండ్‌ వాహనాలపై జాయింట్‌ వెంచర్‌, సాబ్‌ రూపొందించే బిఎఎంఎస్‌ఇ క్షిఫణి వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. సాబ్‌ బిజినెస్‌ ఏరియా డైనమిక్స్‌ బిజినెస్‌ హెడ్‌ జార్జిన్‌ జాన్సన్‌ మాట్లాడుతూ మేకిన్‌ ఇండియాలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వైమానిక దళ రక్షణ విభాగాలకు సంబంధించి ఈ జాయింట్‌ వెంచర్‌ మరింత శక్తివంతమైన యుద్ధసామగ్రిని అందిస్తుందని పేర్కొన్నారు ఇందుకు సంబంధించి కళ్యాణి ఎస్‌ఎస్‌ఎల్‌కు ఇప్పటికే క్షిఫని విడిభాగాలకు ఆర్డర్లు జారీ చేసింది. ఈ రెండు కంపెనీలు కూడా టెక్నాలజీ బదిలీ చేసుకుని వివిధ అత్యాధునిక పనిముట్లను తయారుచేస్తాయని తేలింది. హైటెక్నాలజీ రాడార్‌, క్షిఫణి వ్యవస్థలకు సంబంధించిన ఉత్పత్తులు తయారవుతాయి. కళ్యాణిగ్రూప్‌కు ఉన్న ఇంజనీరింగ్‌, ఉత్పత్తి సామర్ధ్యాలను అంచనా వేసుకునే ఒప్పందంచేసుకున్నట్లు సాబ్‌ ప్రకటించింది. కళ్యాణి ఎస్‌ఎస్‌ఎల్‌ నూరుశాతం భారత్‌ఫోర్జ్‌ అనుబంధ కంపెనీగా ఉంది. కళ్యాణి గ్రూప్‌లో ఒకభాగం. ఆటోమోటివ్‌, నాన్‌ ఆటోమోటివ్‌ రంగాల్లోను, ఉక్కు, మౌలికవనరుల రంగంలో అగ్రగామిగా ఉంది. కళ్యాణిగ్రూప్‌లో కళ్యాణి ఎస్‌ఎస్‌ఎల్‌ కీలక కంపెనీగా ఉంది. కేవలం రక్షణరంగం, ఏరోస్పేస్‌ బిజినెస్‌ వ్యవహరాలు చూస్తుంది.
1entertainment
టీ- హబ్‌తో బ్రిటన్‌ సర్కారు ఒప్పందం నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌        తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 'టి-హబ్‌' కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని పంచాయితీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బ్రిటన్‌ సెక్రటరీ పర్‌ బిజినెస్‌ , ఇన్నోవేషన్‌, స్కిల్స్‌ సాజిద్‌ జావిద్‌తో గురువారం మంత్రి టి-హబ్‌ లో సమావేశమయ్యారు. టి-హబ్‌ తో బ్రిటన్‌ ప్రభుత్వం భాగసామ్యం నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. టి-హబ్‌ తోపాటు ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, సైబర్‌ సెక్యూరీటీ, యానిమేషన్‌, గేమింగ్‌ రంగాల్లో కలిసి పనిచేసేందుకు బ్రిటన్‌ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు మంత్రి తెలిపారు. సాజిద్‌ జావేద్‌ తో సమావేశమైన మంత్రి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయనకు తెలియజేశారు. పెట్టుబడులకు ఉతమిచ్చేలా పారిశ్రామిక పాలసీ విధానంలో ఉన్న సెల్ప్‌ సర్టిఫికేషన్‌, అనుమతులను ఆలస్యం చేసే అధికారులకు జరిమానాల వంటి అంశాలను మంత్రికి జావేద్‌కి తెలిపారు. ఇలాంటి విధానాన్ని ప్రపంచంలో తాను ఏక్కడా చూడలేదని, చిన్న రాష్ట్రం అయినా ఇలాంటి గొప్ప పాలసీని ప్రవేశపెట్టినందుకు జావేద్‌ అభినందించారు. టిహబ్‌ లోని సౌకర్యాలను పరిశీలించిన యూకే సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్‌ అప్స్‌ కి ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆభినందించారు. టి హబ్‌ లోని స్టార్టప్‌లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇజ్రాయోల్‌ దేశంలోని స్టార్టప్‌లకుి చేయూతనిచ్చి 30 కంపెనీలను లండన్‌ స్టాక్‌ ఏక్స్జేంజీలో లిస్ట్‌ అయ్యేలా చూశామన్నారు, ఇలాంటి భాగసామ్యాన్ని తెలంగాణాకు అందిస్తామని జావెద్‌ తెలిపారు. ఇక తెలంగాణలోని ఇతర పారిశ్రామిక రంగాల్లో ఉన్న అవకాశాలను తెలుసుకున్న యూకే సెక్రటరీ త్వరలోనే తమ లైఫ్‌ సైన్సెస్‌ కార్యదర్శిని ఇక్కడ పర్యటనకి పంపుతామని తెలిపారు. యూకేలో పర్యటించేందుకు రావాల్సిందిగా మంత్రి కె.తారక రామారావుని ఆయన అహ్వనించారు. యూకేలోని స్టార్టప్‌ మరియు గేమింగ్‌ రంగాల్లో పరిశ్రమలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయిచేందుకు సిద్ధ్దంగా ఉన్నామని యూకే సెక్రటరీ మంత్రి హమీ ఇచ్చారు. యూకే సెక్రటరీ సాజిద్‌ జావిద్‌ తోపాటు మంత్రి కె.తారకరామారావుల సమక్షంలో టి హబ్‌ తో యూకేకి చెందిన లెడ్‌ మ్యాక్‌ లిమిటెడ్‌ తో యంవోయూని కుదుర్చుకున్నారు. ఈ యంవోయో ద్వారా టి హబ్‌ ప్రపంచంలోని ప్రముఖ స్టార్టప్స్‌ లతో సహకారం అందించేందుకు సహయ పడనుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV VVS Laxman: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌లో సూపర్‌ స్టార్స్‌ లేరు..! బాల్ టాంపరింగ్ వివాదం, నిషేధం నేపథ్యంలో.. డేవిడ్ వార్నర్‌కి మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌ ఈ ఏడాదీ కొనసాగనున్నాడు. Samayam Telugu | Updated: Mar 21, 2019, 11:46AM IST VVS Laxman: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌లో సూపర్‌ స్టార్స్‌ లేరు..! హైలైట్స్ శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు మొదలు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం తొలి మ్యాచ్‌ ఆడనున్న హైదరాబాద్ ఏడాది నిషేధం తర్వాత మళ్లీ జట్టులోకి డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా విలియమ్సన్‌ కొనసాగుతాడని స్పష్టీకరణ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో సూపర్‌ స్టార్‌ సంస్కృతి లేదని ఆ జట్టు మెంటార్‌ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు మొదలుకానుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తొలి మ్యాచ్‌లో ఢీకొననుంది. ఈ నేపథ్యంలో.. మీడియాతో మాట్లాడిన వీవీఎస్ లక్ష్మణ్.. జట్టు గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించాడు. గత ఏడాది బాల్‌ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం వేటు పడటంతో.. ఐపీఎల్‌కి దూరమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తాజాగా మళ్లీ సన్‌రైజర్స్ జట్టులోకి పునరాగమనం చేశాడు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Aug 06,2015 హెచ్‌ఆర్‌ సేవల వ్యాపారంలోకి సియోల్‌           హైదరాబాద్‌: మానవ వనరుల (హెచ్‌ఆర్‌) సేవల వ్యాపారంలో గతంలో కీలకంగా ఉన్న పాండియ రాజన్‌ తిరిగి 'సియోల్‌' ఆవిష్కారంతో మళ్లీ ఈ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఒకప్పుడు క్రియాశీలకంగా ఉన్న వ్యాపారంలోకి తిరిగి తాము ప్రవేశించడం ఆనందంగా ఉందని సియోల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ ఛైర్మన్‌ పాండియ రాజన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సియోల్‌లో తాము హెచ్‌ఆర్‌ను మరీ ముఖ్యంగా విశ్లేషణాత్మకంగా శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పునర్‌ నిర్వచించాలని నిర్దేశించుకున్నామన్నారు. ప్రతిభావంతులైన సిబ్బంది నియామకం, అన్వేషణ, ఎంపిక కోసం తాము అత్యుత్తమమైన కొత్త సౌన్సెస్‌లను ఉపయోగించనున్నట్లుగా తెలిపారు. దీనికి తోడు డేటా ఆధారిత ఇన్‌సైట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఉద్యోగం పోయిందా? ఈఎంఐల గండం గట్టెక్కెదెలా? ఇంటి రుణం అంటే ఈఎంఐ ఎక్కువగానే ఉంటుంది. నిధుల కొరతతో ఈఎంఐ చెల్లించలేకపోతే.. ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు కూడా. అయితే ఇలా చేయడం వల్ల రుణ చెల్లింపుల కాలం పెరుగుతుంది. Samayam Telugu | Updated: Jan 19, 2019, 04:31PM IST హైలైట్స్ వాస్తవ పరిస్థితులను బ్యాంక్ వారికి తెలియజేయండి అంతేతప్ప వారి నుంచి తప్పించుకు తిరగొద్దు ఈఎంఐ భారం తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మీ వద్ద డబ్బుల ఉన్నప్పుడు రుణ మొత్తాన్ని తగ్గించుకోండి అతని పేరు రవి. ఐటీ ఉద్యోగి. ఇంటి కోసం రూ.50 లక్షలు రుణం తీసుకున్నాడు. ఈ డబ్బుతో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొన్నాడు. మూడేళ్ల వరకు ఎలాంటి సమస్య లేదు. అయితే అటుపైన రవి ఉద్యోగం పోయింది. ఈఎంఐ కూడా చెల్లించలేకపోయాడు. ఆందోళనకు గురయ్యాడు. బ్యాంక్ అధికారుల ఏమన్నా అంటారేమోనన్న భయంతో వారి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. మరో రెండు, మూడు ఈఎంఐలు చెల్లించలేకపోతే బ్యాంక్ అధికారులు, రవి ప్రాపర్టీని సీజ్ చేస్తారు. ఇలాంటి సమయంలో సమస్యను గట్టేక్కడానికి ఏం చేయవచ్చొ చూద్దాం.. బ్యాంకులు సాధారణంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందు, రుణాన్ని రికవరీ చేసుకోవడానికే ఇష్టపడతాయి. ప్రాపర్టీని సీజ్ చేయడం, దానికి వేలం నిర్వహించడం వంటి వాటికి చాలా పనులు ఉంటాయి. అందువల్ల బ్యాంకులు రుణ గ్రహీతతో చర్చలు సాగిస్తాయి. రవి ఆరు ఈఎంఐలు కట్టకపోతే అప్పడు బ్యాంక్ ఫోర్‌క్లోజర్ ప్రక్రియను ప్రారంభించొచ్చు.
1entertainment
PANTINIG పాంటింగ్‌ ఐపిఎల్‌ బెస్ట్‌ 11 జట్టు న్యూఢిల్లీ: ఐపిఎల్‌ పదవ సీజన్‌లో సుమారు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి.దీంతో ఐపిఎల్‌లో సత్తాచాటుతున్న ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ తన బెస్ట్‌ 11 జట్టునిఎంపిక చేశాడు.42 సంవత్సరాల రికీ పాంటింగ్‌ అంతకు ముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌,ముంబై ఇండియన్స్‌జట్లు తరుపున ఐపిఎల్‌లో ఆడాడు.అంతే కాదు ముంబై ఇండియన్స్‌ జట్టుకు కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.పాంటింగ్‌ ఎంపిక చేసిన జట్టుకు కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను నియమించాడు. ఐపిఎల్‌ పదవ సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.ఏప్రిల్‌ 28 నాటి మ్యాచ్‌తో డేవిడ్‌ వార్నర్‌ 333 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.376 పరుగులతో గంభీర్‌ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. పాంటింగ్‌ ఎంపిక చేసిన జట్టులో నలుగురు భారత క్రికెటర్లకు స్థానంకల్పించాడు. సురేశ్‌ రైనా, నితీశ్‌ రాణా, హర్భజన్‌, భువనేశ్వర్‌ కుమార్‌లకు మాత్రమే చోటు కల్పించాడు.డేవిడ్‌ వార్నర్‌తో ఓపెనర్‌గా గంభీర్‌ను కాదని దక్షిణాప్రికాకు చెందిన హషీం అమ్లాను ఎంచుకున్నాడు.ఐపిఎల్‌ లో గత కొన్ని సీజన్లుగా నిలకడగా సత్తా చాటుతున్న సురేశ్‌ రైనాపై పాంటింగ్‌ ప్రశంసల వర్షం కురిపించా డు.గత 5 లేదా 6 సీజన్ల నుంచి ఐపిఎల్‌ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు.నిలకడగా ఆడుతూ మ్యాచ్‌ విన్నింగ్‌ ప్లేయర్‌గా నిలుస్తున్నాడు అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. పాంటింగ్‌ టీమ్‌ వివరాలు 1. హషీమ్‌ అమ్లా – కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (దక్షిణాఫ్రికా) 2. డేవిడ్‌ వార్నర్‌ – సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌(ఆస్ట్రేలియా) 3. సురేశ్‌ రైనా – గుజరాత్‌ లయన్స్‌(ఇండియా) 4. జోస్‌ బట్లర్‌ – ముంబై ఇండియన్స్‌ (ఇంగ్లండ్‌) 5. నితీశ్‌ రాణా – ముంబై ఇండియన్స్‌ (ఇండియా) 6. గ్లెన్‌మాక్స్‌వెల్‌ – కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌ (ఆస్ట్రేలియా) 7. చారిస్‌ మోరిస్‌ – ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ (దక్షిణాఫ్రికా) 8. హర్భజన్‌ – ముంబై ఇండియన్స్‌ (ఇండియా) 9. రషీద్‌ఖాన్‌ – సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (అప్ఘనిస్థాన్‌) 10. భువనేశ్వర్‌కుమార్‌ – సన్‌ రైజన్స్‌ హైదరాబాద్‌ (ఇండియా) 11. మెక్‌క్లెనగన్‌ – ముంబై ఇండియన్స్‌(న్యూజిలాండ్‌)
2sports
virat kohli thanks this khan for saving his relationship with anushka sharma ఆయన సలహాతోనే విరాట్-అనుష్క బంధం నిలిచింది విరాట్ కోహ్లికి అనుష్క శర్మతో బ్రేకప్ కాకుండా ఓ ఖాన్ కాపాడారట. ఆయనే లేకపోతే వీరిద్దరూ వేరయ్యేవారట. TNN | Updated: Nov 5, 2017, 11:28AM IST టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి , బాలీవుడ్ నటి అనుష్క శర్మ మధ్య ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఓ షాంపు యాడ్‌లో నటించే సందర్భంలో తొలిసారిగా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. క్రమంగా అది కాస్తా.. ప్రేమగా మారింది. ప్రేమలో పడిన కొత్తలో వీరిద్దరూ దాన్ని బయట పెట్టలేదు. గత ఇంగ్లండ్ పర్యటన సమయంలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. అప్పుడు అనుష్క కూడా విరాట్ వెంట వెళ్లడంతో.. అనుష్కతో ప్రేమాయణం కారణంగానే అతడు ఫెయిలయ్యాడనే విమర్శలు వచ్చాయి. గర్ల్ ఫ్రెండ్‌ను టూర్‌కు తీసుకెళ్తే అలానే ఉంటుందంటూ విమర్శించారు. దీంతో కోహ్లి తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడట. ఒకానొక సందర్భంలో ఒత్తిడి పెరిగిపోవడంతో బ్రేకప్ దిశగా ఆలోచించాడట. సరిగ్గా ఆ సమయంలోనే.. ఏం చేస్తే బాగుంటుందని కోహ్లి జహీర్ ఖాన్‌ను సంప్రదించాడట. ఆ సలహాతోనే తమ బంధం నిలిచిందని విరాట్ ఇటీవల తెలిపాడు. ‘మీ బంధం గురించి అస్సలు దాయొద్దు. అలా దాచిపెడితే ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసేదేం నేరం కాదు కదా. ఏ తప్పూ చేయనప్పుడు దాచడం దేనికి’ అని జహీర్ యంగ్ కోహ్లికి చెప్పాడట. అతడి సలహాతోనే తమ బంధం నిలించిందని, జహీర్‌కు చాలా థ్యాంక్స్ అని కోహ్లి చెప్పాడు.
2sports
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
Nestle products are safe says US నెస్లే సంస్థకు అమెరికా ఊరట.. భారత్ లో పరువు పోతే పోయిందేమో కానీ... అమెరికాలో మాత్రం నెస్లే సంస్థకు పెద్ద ఊరటే దక్కింది. PTI | Updated: Aug 13, 2015, 10:48AM IST భారత్ లో పరువు పోతే పోయిందేమో కానీ... అమెరికాలో మాత్రం నెస్లే సంస్థకు పెద్ద ఊరటే దక్కింది. ఆ సంస్థ ఉత్పత్తుల్లో సీసం శాతం నిర్దేశిత పాళ్లలోనే ఉందని అమెరికా ఆరోగ్య ఉత్పత్తుల నాణ్యత పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనను విడుదల చేసారు. అమెరికన్ల ఆరోగ్యానికి హానికరమైన రీతిలో సీసం పాళ్లు ఏమీ లేవని ఆ ప్రకటనలో విస్పష్టంగా తెలిపారు. నెస్లే సంస్థ తక్షణం తయారుచేసుకునే నూడుల్స్ కు ప్రసిద్ధి అనే సంగతి తెలిసిందే. ఇటీవల మన దేశంలో చేసిన పరీక్షల్లో ఆ సంస్థ ఉత్పత్తుల్లో సీసం పాళ్లు మోతాదును మించి ఉన్నాయని తేలడంతో దేశ వ్యాప్తంగా వాటి వాడకాన్ని నిషేధించారు.
1entertainment
sandhya 148 Views 1 lakh crore , Jandhan deposits Jandhan deposits న్యూఢిల్లీ: జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు లక్షకోట్ల రూపాయలను అధిగమించాయి. ఐదేళ్లక్రితంప్రారంభించిన జన్‌ధన్‌ స్కీంలో 50శాతానికి పైగా మహిళలే ఖాతాదారులుగా కలిగి ఉన్నారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను చూస్తే 36.06 కోట్ల లావాదేలు కొనసాగాయి. మొత్తం నిల్వలను చూస్తే 1,00,495.94 కోట్ల వరకూ ఉన్నట్లు తేలింది. డిపాజిట్లు లబ్దిదారులనుంచి గణనీయంగాపెరుగుతున్నాయి. 99,649.84 కోట్లవరకూ ఉన్నాయి. అంతకుముందు వారంలో అంటే జూన్‌ ఆరవ తేదీకి ముందు 99,232.71 కోట్లవరకూ లావాదేవీలు కొనసాగాయి. ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజన 2014 ఆగస్టు 28వ తేదీ ప్రారంభించారు. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌ఖాతాల కింద అదనపు సౌకర్యం రూపే డెబిట్‌కార్డు, ఓవర్‌డ్రాప్టు సౌకర్యం కల్పించింది. ఆర్ధిక మంత్రిత్వవాఖ రాజ్యసభలో జన్‌ధన్‌ వివరాలను వెల్లడిస్తూ 5.10 కోట్లనుంచి 5.7 కోట్లకు తగ్గాయని తెలిపింది 28.44 కోట్ల ఖాతాదారులకు రూపే డెబిట్‌కార్డులుఇచ్చామని వెల్లడించింద.ఇ ప్రభుత్వం ప్రమాదబీమా రెండులక్షలు, లక్షరూపాయలకు ఈ ఖాతాదారులకోసం పెంచింది. ఓవర్‌డ్రాప్టు పరిమితిని కూడా 10వేలకు పెంచింది. అంతే కాకుండాప్రభుత్వ పథకాలను సంక్షేమ లబ్దిని నేరుగా లబ్ది బదిలీపథకం కింద వీరి ఖాతాలకే జమచేసేందుకు జన్‌ధన్‌ను వినియోగిస్తోంది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV తన కల నెరవేరకుండానే శ్రీదేవి వెళ్లిపోయారు: జయప్రద ఆల్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగి అశేష అభిమానులను సంపాదించుకున్న అతిలోక సుందరి హఠాన్మరంపై దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురయ్యింది. TNN | Updated: Feb 25, 2018, 08:33PM IST ఆల్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగి అశేష అభిమానులను సంపాదించుకున్న అతిలోక సుందరి హఠాన్మరంపై దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆమె మృతిపట్ల నటి జయప్రద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తెలియగానే ఏదో పీడకల వచ్చినట్లు భావించానని అన్నారు. శ్రీదేవి మృతి తనను చాలా బాధించిందని తెలిపారు. మొదట దీన్ని పీడకలగా భావించాను. టీవీలో చూసేంత వరకు నమ్మలేదని జయప్రద కన్నీంటి పర్యంతమయ్యారు. తామిద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించామని, శ్రీదేవి అద్భుతమైన నటి, తల్లి అని ప్రశంసలు కురిపించారు. తనలా తన కుమార్తెలు జాన్వి, ఖుషి కూడా వెండితెరపై రాణిస్తే చూడాలన్నది ఆమె కల... కానీ జాన్వి తన తల్లి ని చివరి క్షణాల్లో కలవలేకపోయిందని ఆవేదన చెందారు. పెళ్లి వేడుక కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో అక్కడే మృతి చెందారు. ఈ వేడుకకు ఆమె తన భర్త బోనీ కపూర్‌, రెండో కుమార్తె ఖుషీతో కలిసి వెళ్లారు. జాన్వి ‘దఢక్‌’ సినిమా షూటింగ్‌ కోసం ముంబయిలోనే ఉండిపోయారు. దాదాపు బంధువులంతా పెళ్లి వేడుకల కోసం దుబాయ్‌కు వెళ్లడంతో జాన్వి ఇంట్లో ఒక్కరే ఉన్నారు.తల్లి మరణవార్త విన్న జాన్వి కుప్పకూలిపోయారు. ఈ కష్ట సమయంలో ఆమెకు ధైర్యం చెప్పడానికి దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌ లోఖండ్‌వాలాలోని శ్రీదేవి ఇంటికి వెళ్లి ఆమెను జూహూలోని అనిల్‌ కపూర్‌ ఇంటికి తీసుకెళ్లారు.
0business
వాట్‌ ద F** బూతు పాట తీయించేశారు.. విజయ్ ఏమంటాడో.. Highlights ఈ పాటలో ఉపయోగించిన 'ఎఫ్' అనే పదం ఆంగ్ల బూతుకి సూచన. పైగా పాటలో లిరిక్స్ చాలా అభ్యంతరకరంగా మహిళలను తక్కువగా చేసేవిధంగా ఉన్నాయి. అమెరికా గాళ్‌ అయినా.. అంటూ సాగిన ఈ పాటలో సావిత్రి నుండి సీత వరకూ ఎవర్నీ వదల్లేదు. తన సినిమా ప్రమోషన్స్ విషయంలో నటుడు విజయ్ దేవరకొండ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. యూత్ ని ఆకర్షించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన 'గీత గోవిందం' సినిమాలో 'వాట్ ది ఎఫ్' అంటూ ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్ది గంటల్లో ఈ పాటకు విశేష ఆదరణ లభించింది. అయితే గురువారం(జూలై 26) నాడు విడుదలైన ఈ పాటను ఇప్పుడు యూట్యూబ్ నుండి తొలగించారు. అసలు వివాదం ఏంటంటే.. ఈ పాటలో ఉపయోగించిన 'ఎఫ్' అనే పదం ఆంగ్ల బూతుకి సూచన. పైగా పాటలో లిరిక్స్ చాలా అభ్యంతరకరంగా మహిళలను తక్కువగా చేసేవిధంగా ఉన్నాయి. అమెరికా గాళ్‌ అయినా.. అంటూ సాగిన ఈ పాటలో సావిత్రి నుండి సీత వరకూ ఎవర్నీ వదల్లేదు. ''రాముడు గాని ఇప్పుడు పుట్టి జంగిల్‌కి పోదాం రారమ్మంటే సీతకు కాస్తా సిరాకు లేసి సోలోగే పొమ్మంటే'' ఇలాంటి లైన్స్ కొందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండడంతో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ పాటపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. దీంతో చిత్రబృందం ఈ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు. ఈ పాట రాసిన రచయిత శ్రీమణి 'ఎవరి మనోభావాలు కించపరిచే విధంగా ఈ పాత రాయలేదు. రచయిత భావనను తప్పుగా అర్ధం చేసుకోవడం వలెనే వివాదమయింది. ఈ పాటపై విమర్శలు చేస్తున్నారు. అందరి మనోభావాలు గౌరవించడం మా ధర్మం. అందుకే ఈ పాటను ఎడిట్ చేసి తిరిగి అప్ లోడ్ చేస్తాం' అని వెల్లడించారు. అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.  Last Updated 27, Jul 2018, 3:59 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బంగ్లా ఎన్నికలు.. బంపర్ మెజార్టీతో క్రికెటర్ విజయం బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆ దేశ క్రికెటర్ మష్రాఫే మోర్తజా ఘన విజయం సాధించాడు. బంగ్లా పార్లమెంట్‌కు ఎన్నికైన రెండో క్రికెటర్‌గా మోర్తజా రికార్డ్ క్రియేట్ చేశాడు. మోర్తజా బంగ్లా వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. Samayam Telugu | Updated: Dec 31, 2018, 03:53PM IST బంగ్లా ఎన్నికలు.. బంపర్ మెజార్టీతో క్రికెటర్ విజయం హైలైట్స్ బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆ దేశ క్రికెటర్ మష్రాఫే మోర్తజా ఘన విజయం సాధించాడు. బంగ్లా పార్లమెంట్‌కు ఎన్నికైన రెండో క్రికెటర్‌గా మోర్తజా రికార్డ్ క్రియేట్ చేశాడు. మోర్తజా ప్రస్తుతం బంగ్లా వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశ క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మష్రాఫే మోర్తజా ఘన విజయం సాధించాడు. నరైల్-2 నియోజకవర్గం నుంచి అవామీ లీగ్ పార్టీ తరఫున పోటీ చేసిన మోర్తజాకు 96 శాతం ఓట్లు దక్కాయి. ఈ క్రికెటర్‌కు 274,418 మంది ఓటేయగా.. అతడి ప్రత్యర్థిగా బరిలో దిగిన జతియా ఒయిక్యాకు 8006 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ విజయంతో ఎంపీగా విజయం సాధించిన రెండో బంగ్లా క్రికెటర్‌గా మోర్తజా నిలిచాడు.
2sports
Hyderabad, First Published 3, Sep 2018, 11:54 AM IST Highlights మమ్ముట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు మహి వి రాఘవ 'యాత్ర' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దివంగత వైఎస్సార్ జీవితం ఆధారంగా ఈ సినిమాను  రూపొందిస్తున్నారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు మహి వి రాఘవ 'యాత్ర' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దివంగత వైఎస్సార్ జీవితం ఆధారంగా ఈ సినిమాను  రూపొందిస్తున్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా చిత్రబృందం 'ఈనాటి సుప్రభాత గీతం' అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో మనమ్ముట్టి లుక్ ఆకట్టుకుంటోంది. వైఎస్సార్ పాత్రలో ఆయన ఒదిగిపోయారనే చెప్పాలి. అయితే ఈ పాట చూసిన అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో వైఎస్సార్ పాదయాత్ర చేసింది కాంగ్రెస్ జెండాలతో.. కానీ ఇప్పుడు జగన్ నడుపుతోన్న వైకాపా పార్టీకి ప్రత్యేకంగా మరో జెండా ఉంది. ఈ క్రమంలో సినిమాలో ఏ జెండా గుర్తు వాడితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోనని కొత్తగా ఓ జెండాను డిజైన్ చేశారు. కాంగ్రెస్ రంగుల జెండాపై పిడికిలి బిగించిన చేయి గుర్తుతో ఈ జెండా కనిపిస్తుంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ కొత్త గుర్తు కనిపిస్తున్నట్లు.. జగన్-జనసేన కలిస్తే ఆ కలయిక ఇలానే ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ దాక్కుతోంది. సీతారామశాస్త్రి సాహిత్యం పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  Last Updated 9, Sep 2018, 12:36 PM IST
0business
ఇప్పటికే 130 కోట్లు వసూలు చేసిన రంగస్థలం Highlights ఇప్పటికే 130 కోట్లు వసూలు చేసిన రంగస్థలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తోంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.130 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కేవలం 7 రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తొమ్మిదో తెలుగు చిత్రంగా నిలిచిందని చెప్పారు.   దీంతోపాటు ‘రంగస్థలం’.. అల్లు అర్జున్‌ ‘సరైనోడు’ సినిమా మొత్తం వసూళ్లను కూడా బీట్‌ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బన్నీ సినిమా మొత్తం రూ.115 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలో మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’, పవన్‌కల్యాణ్‌ ‘అత్తారింటికి దారేది’ సినిమాల వసూళ్లను కూడా అధిగమిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   రామ్‌చరణ్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. అనసూయ, జగపతిబాబు, ఆదిపినిశెట్టి, ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 1985 కాలాన్ని తలపిస్తూ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి విమర్శకులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. Last Updated 6, Apr 2018, 3:41 PM IST
0business
Jan 12,2018 రూ.3500 కోట్ల బినామీ ఆస్తుల జప్తు: ఐటీ శాఖ న్యూఢిల్లీ: బినామీ లావాదేవీల విషయంలో ఆదాయపు పన్ను విభాగం (ఐటీ శాఖ) తమ చర్యలను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రూ.3500 కోట్ల విలువ చేసే 900 బినామీ ఆస్తులను జప్తు చేసినట్టు ఐటీ శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో ఫ్లాట్లు, దుకాణాలు, జ్యువెలరీ, వాహనాలు ఉన్నట్టు తెలిపింది. 2016 నవంబర్‌ 1 నుంచి అమలులోకి వచ్చిన ప్రొహిబిషన్‌ ఆఫ్‌ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్‌ యాక్ట్‌ కింద ఈ చర్యలను తీసుకున్నట్టు ఐటీ శాఖ వివరించింది. ఈ యాక్ట్‌ ప్రకారం (స్థిర, చర) బినామీ ఆస్తుల జప్తుకు అవకాశం కల్పిస్తుందని తెలిపింది. ఈ కొత్త చట్టం కింద బినామీగా వ్యవహరించిన వ్యక్తి, ప్రయోజనం పొందే వ్యక్తితో పాటు ఈ లావాదేవీలలో సంబంధం ఉన్న వారికి ఏడేండ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది. అదే సమయంలో బినామీ ఆస్తి మార్కెట్‌ విలువపై 25శాతం వరకు జరిమానా విధించనున్నట్టు ఐటీ శాఖ పేర్కొంది. కాగా ఈ బినామీ ఆస్తుల విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టడానికి 2017 మే నెలలో దేశవ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టరేట్స్‌ కింద 24 ప్రత్యేక బినామీ ప్రొహిబిషన్‌ యూనిట్ల(బీపీయూల)ను కూడా ఐటీ శాఖ ఏర్పాటు చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 141 Views నెట్‌ స్పీడ్‌కోసం ట్రాయి మొబైల్‌ యాప్‌ న్యూఢిల్లీ: నెట్‌స్పీడ్‌ ఎంతమేరకు ఉందో తెలుసుకునేందుకు టెలికాం నియంత్రణ సంఘం (ట్రా§్‌ు) తాజాగా ట్రా§్‌ు మైస్పీడ్‌ పేరిట కొత్త మొబైల్‌ యాప్‌ను విడుదల చేస్తోంది. ఈ యాప్‌ సాయంతో కస్టమర్లు తమ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఎంతస్పీడ్‌తో ఉందో తెలుసుకునే వీలుంది.. మైస్పీడ్‌ మొబైల్‌ యాప్‌ను ప్రభుత్వ పరిధిలోని మొబైల్‌ సేవా యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.. 3జి, 4జి నెట్‌వర్క్‌లు ట్రా§్‌ు విశ్లేషణలు ఈ పోర్టల్‌పై ఉంటాయని ట్రా§్‌ు వివరించింది.. ఆ యాప్‌ ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని పంపించదని ట్రా§్‌ు స్పష్టం చేసింది.. కాల్‌డ్రాప్స్‌పై ట్రా§్‌ు ఆంక్షలను మొబైల్‌ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కొత్త మొబైల్‌ యాప్‌ను అమలులో పెట్టింది.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 2019 Budget for Defence: రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్ల నిధులు రక్షణ రంగాన్ని పటిష్టం చేసుకునేందుకు తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌లో ఆ రంగానికి రూ. 3 లక్షల కోట్ల నిధులను కేటాయించారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చి సైనిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు పీయూష్ గోయల్. Samayam Telugu | Updated: Feb 1, 2019, 12:24PM IST హైలైట్స్ పొరుగు దేశాలు చైనా, పాక్‌లతో ముప్పు పొంచి ఉంటుంది రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలన్న పీయూష్ గోయల్ అవసరమైతే సైనికులకు అలవెన్స్‌లు, ప్రత్యేక నిధులు సమకూర్చుతాం పొరుగుదేశాలు చైనా, పాకిస్థాన్‌లతో ముప్పు పొంచి ఉంటుందని, దేశానికి పటిష్టమైన రక్షణ వ్యవస్థ అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అందులోనూ సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలు కోనుగోలు విషయంలో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు విమర్శలు లేవనెత్తుతున్న తరుణంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లుకు పైగా కేటాయిస్తున్నట్లు తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2018-19 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.2.95 లక్షల కోట్లను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా బడ్జెట్‌లో రూ.3 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. సైనికులకు ప్రత్యేక అలవెన్స్‌లు ఇస్తామన్నారు. దేశ రక్షణకు అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గత 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్‌ మ్యాన్‌ వన్‌ పెన్షన్‌‌ను తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. దేశ రక్షణలో సైనికుల త్యాగం మరువలేనిదని, వారికోసం మరిన్ని నూతన విధానాలు అమలు చేసేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని వివరించారు.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV సారీ.. మా వాళ్లు చేసింది తప్పే: బంగ్లా క్రికెట్ బోర్డ్ శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిచాక బంగ్లా పెద్ద రచ్చే చేసింది. ఈ గొడవపై బంగ్లా క్రికెట్ బోర్డు కూడా స్పందించాల్సి వచ్చింది. జరిగిన ఘటనపై బోర్డు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. Samayam Telugu | Updated: Mar 18, 2018, 12:59PM IST శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిచాక బంగ్లా పెద్ద రచ్చే చేసింది. ఈ గొడవపై బంగ్లా క్రికెట్ బోర్డు కూడా స్పందించాల్సి వచ్చింది. జరిగిన ఘటనపై బోర్డు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ క్రికెటర్లే తప్పు చేశారని... అందుకు క్షమాపణలు చెబతున్నామన్నారు. దీనికి సంబంధించి బీసీబీ శ్రీలంక బోర్డుకు ఓ లేఖ రాసింది. తమ ఆటగాళ్ల దూకుడు, వ్యవహారం శైలి వల్ల విధ్వంసం జరిగింందని... ఇతరుల్ని రెచ్చగొట్టే విధంగా గ్రౌండ్‌లో ప్రవర్తించడాన్ని తమతో పాటూ ఎవరూ సమర్థించరన్నారు. తప్పంతా బంగ్లా క్రికెటర్లదేనని... క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించారని చెప్పారు. బంగ్లా ఆటగాళ్ల ప్రవర్తనకు తాము క్షమాపణలు తెలియజేస్తున్నామని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ పంపింది.
2sports
Hyderabad, First Published 19, Aug 2019, 12:11 PM IST Highlights మిడ్ డే పత్రిక షెర్లిన్ చోప్రాతో చేసిన ఇంటర్వ్యూలో భాగంగా..యాంకర్ రాంగోపాల్ వర్మ  గురించి ప్రస్తావించారు.  మీకు రాంగోపాల్ వర్మ ఏదో ఆఫర్ ఇచ్చాడని విన్నాము నిజమేనా అని ఆయన అడిగితే ఆమె ఇలా స్పందించింది.     ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వచ్చిన మరో ఆరోపణ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో నే కాదు మీడియాలోనూ హాట్ టాపిక్ గానూ మారింది. నాకు మీ సినిమాలో వేషం కావాలంటూ వర్మకు మెసేజ్ చేస్తే..  సెక్స్ వీడియో పంపించాడు నటి షెర్లిన్ చోప్రా కామెంట్స్ చేసారు.  ‘మిడ్ డే' పత్రికతతో ఆమె మాట్లాడుతూ...ఇలా వర్మపై ఆరోపణలు చేసింది. మిడ్ డే పత్రిక షెర్లిన్ చోప్రాతో చేసిన ఇంటర్వ్యూలో భాగంగా..యాంకర్ రాంగోపాల్ వర్మ  గురించి ప్రస్తావించారు.  మీకు రాంగోపాల్ వర్మ ఏదో ఆఫర్ ఇచ్చాడని విన్నాము నిజమేనా అని ఆయన అడిగితే ఆమె ఇలా స్పందించింది.   షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ.. ‘నాకు మొదటి నుంచీ రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టం. ఆయన సినిమాలు బాగా నచ్చుతాయి. వాటిలో హీరోయిన్‌ను బాగా చూపిస్తాడు. అది గమనించి ఆయనకు 2016లో వాట్సాప్‌లో నా ఫొటోలు, నా వివరాలు పంపుతూ... మీ సినిమాలో ఏదైనా వేషం  ఉంటే ఇవ్వండి అని అడిగాను' అని ఆమె చెప్పుకొచ్చింది. అప్పుడు వర్మ తన మెసేజ్‌కు వర్మ రిప్లై ఇస్తూ.... ‘ఓ స్క్రిప్టు పంపిస్తున్నాను. ఇది చదవి చెప్పు. నచ్చితే వెంటనే సినిమా చేద్దాం' అన్నారట. ‘ఏక్‌థా రాజా ఏక్‌థి రాణి' అనే టైటిల్ ఉన్న ఆ స్క్రిప్టు చదివింది. అందులో సెక్స్ సీన్స్ తప్ప కథ ఏమీ కనిపించలేదని షెర్లిన్ చెప్పుకొచ్చింది.  ఆ కథ మొత్తం ఓ రాజు రాణికి మధ్య శృంగారం, అందుకు సంభందించిన సీన్స్ మాత్రమే ఉన్నాయంది. అదే విషయాన్ని వర్మకు రిప్లై చేసానని దానికి ఆయన మాత్రం కూల్ గా..నీకు కథ నచ్చితే చెప్పు లేకపోతే లేదు అన్నాడని వివరించింది. అక్కడితో ఆగకుండా ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తనకు సెక్స్ వీడియో పంపాడని షెర్లిన్ తెలిపింది. ‘ఈ కథేంటి ఇలా ఉందంటూ నేను అడగగా వర్మ నాకో వీడియో పంపాడు.  అందులో ఓ మహిళ కుక్కతో సెక్స్ చేస్తున్న సీన్స్ ఉన్నాయి. అది చూసి నేను షాక్ అయ్యా. వెంటనే కోపంగా నాకెందుకు ఇది పంపారని కోపంగా అడిగా.... దీనికి ఆయన ‘సెక్స్ సీన్స్ ఉన్నాయని నువ్వు సినిమా చేయనంటున్నావు. వాస్తవానికి సెక్స్ అనేది సాధారణ విషయం అది మనుషులకైనా.. పశువులకైనా. అది చెప్పాలనే ఈ వీడియో పంపాను' అని వర్మ చెప్పుకొచ్చారని షెర్లిన్ పేర్కొంది. అయితే ఇన్నాళ్లూ ఈ విషయం బయిట పెట్టకపోవటానికి కారణం.. ‘వర్మ నాకు ఆ వీడియో పంపడంతో  నాకు చాలా కోపం వచ్చిన మాట నిజమే. అయితే ఆయన్ని నేనే ఆఫర్ కావాలని అడగాను. అది నా తప్పు. అందుకే ఆయనను ఏమీ అనలేదు. కానీ, నేను సెక్స్‌లో పీహెచ్‌డీ చేయలేదు అని మాత్రం రిప్లై ఇచ్చానని, అప్పటి నుంచి వర్మకు మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేయలేదు. వ్యక్తిగతంగా కూడా కలవలేదు' అని ఆమె వెల్లడించింది. Last Updated 19, Aug 2019, 2:25 PM IST
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ధోనీని తప్పించి నాకు అవకాశం ఇస్తే..? భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నిర్వహిస్తున్న వికెట్ కీపింగ్ బాధ్యతలు తనకిస్తే.. సత్తా నిరూపించుకుంటానని దినేశ్ TNN | Updated: Oct 17, 2017, 11:59AM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నిర్వహిస్తున్న వికెట్ కీపింగ్ బాధ్యతలు తనకిస్తే.. సత్తా నిరూపించుకుంటానని దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ కోసం ఇటీవల భారత్ సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌ని జట్టులోకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక, ఆస్ట్రేలియాతో సిరీస్‌ల్లో విఫలమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. దినేశ్ కార్తీక్‌ని స్టాండ్ బై వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్‌గా జట్టులోకి ఎంపిక చేశారు. వాంఖడే వేదికగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. ‘భారత్ జట్టుకి నేను స్టాండ్ బై వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాను. ఒక విధంగా చెప్పాలంటే మహేంద్రసింగ్ ధోనీకి నేను బ్యాకప్. దీంతో నేను నెట్స్‌లో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పుడు అవకాశం వచ్చినా నా అత్యుత్తమ ప్రదర్శనతో న్యాయం చేస్తాను. ఒకవేళ వికెట్ కీపింగ్ అవకాశం దొరక్కపోయినా.. మైదానంలో ఏ ప్రదేశంలోనైనా ఫీల్డింగ్ చేసేందుకు నేను రెడీ. ప్రస్తుతం భారత్ జట్టు‌ గొప్పగా రాణిస్తోంది. ఇలాంటి జట్టులో ఆడే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ముఖ్యంగా ప్రతి మ్యాచ్‌ని గెలవాలనే తపనతో ఉండే విరాట్ కోహ్లి నాయకత్వంలో ఆడటం మరిచిపోలేని అనుభూతి’ అని దినేశ్ కార్తీక్ వివరించాడు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ‘కశ్మీర్’ వివాదంలో అమీర్‌ఖాన్ కూతురు! అమీర్‌ఖాన్ కూతురు కొత్త వివాదంలో చిక్కుకుంది. ఆమె చేసిన వ్యాఖ్యలు కశ్మీర్‌లో రాజకీయ చర్చకు తెర తీసింది. అయితే, అమీర్‌ఖాన్ ఆమె అన్న మాటల్లో ఏమీ తప్పులేదంటూ కూతురును వెనకేసుకొచ్చారు. TNN | Updated: Jan 17, 2017, 03:35PM IST అమీర్‌ఖాన్ వెండితెర కూతురు జైరా వసీమ్‌కు కష్టం వచ్చింది. ఈ కష్టానికి కారణం మరెవరో కాదు. కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీయే. ‘దంగల్’ చిత్రంలో గీతా చిన్ననాటి పాత్ర పోషించిన కశ్మీరీ నటి జైరా వసీమ్‌ను ముఖ్యమంత్రి ‘కాశ్మీరీ రోల్ మోడల్’ అని కీర్తించారు. ఆమె మంచిగానే జైరాను కీర్తించినా.. ‘సోషల్ మీడియా’లోని కొంతమంది కశ్మీరీలకు అది నచ్చలేదు. దీంతో, జైరా, ముఫ్తీలిద్దరూ ఇండియాకు ఏజెంట్లంటూ టిట్టర్‌లో తిట్టి పోశారు. దీంతో... కలత చెందిన జైరా, ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ‘‘నన్ను కశ్మీరీ యువతకు రోల్ మోడల్‌గా పేర్కొన్నారు. అయితే, నన్ను ఆదర్శంగా తీసుకుని ఎవరూ నా అడుగు జాడల్లో నడవద్దు. గర్వపడేంత గొప్ప పని నేనేమీ చేయలేదు. నిజమైన రోల్ మోడళ్లు మరెంతో మంది బయట ఉన్నారు. నన్ను రోల్ మోడల్‌గా భావిస్తే వాళ్లను అవమానించినట్లే. వారికి అవమానం జరిగితే, మనకు అవమానం జరిగినట్లే’’ అని జైరా వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు సీఎం ముఫ్తీని నొప్పించినట్లు తెలిసింది. దీంతో, ఈ పోస్టును జైరా ఆమె ఫేస్‌బుక్ ఖాతా నుంచి తొలగించింది.
0business
Hyderabad, First Published 14, May 2019, 11:27 AM IST Highlights ఐపీఎల్ 12వ సీజన్ ముగింపు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో చివరకు అంతిమ విజయం ముంబై ఇండియన్స్‌దే అయింది. ఉ ఐపీఎల్ 12వ సీజన్ ముగింపు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో చివరకు అంతిమ విజయం ముంబై ఇండియన్స్‌దే అయింది. ఉప్పల్‌ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా..ఈ ఐపీఎల్ లో దుమ్మురేపిన కొందరు క్రికెటర్లకు మాత్రం ఐపీఎల్ అవార్డ్స్ అందజేశారు. దీనిలో కింగ్ ఎలెవెన్స్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ కి మోస్ట్ స్టైయిలిష్ బ్యాట్స్ మెన్ అవార్డు దక్కింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎఫ్‌బీబీ స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డుని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ ఎన్నో స్టైలిష్ షాట్లను ఆడాడు. ఈ అవార్డు కింద కేఎల్ రాహుల్‌కు రూ. 10 లక్షలు ప్రైజ్ మనీ లభించింది. కాగా.. ఈ అవార్డును అందజేసే సమయంలో కేఎల్ రాహుల్ అందుబాటులో లేడు. దీంతో... ఆ అవార్డ్ ని ముంబయి ఇండియన్స్ ఆటగాడు, కేఎల్ రాహుల్ ఆప్త మిత్రుడు హార్దిక్ పాండ్యా అందుకున్నాడు. రాహుల్ అవార్డుని పాండ్యా అందుకోవడం ఇప్పుడు నెట్టింట ఓ సంచలనంగా మారింది. ఈ ఇద్దరు మిత్రులపై నెటిజన్లు ఒక రేంజ్ లో జోకులు పేలుస్తున్నారు. కాఫీ విత్ కరణ్ షోకి కూడా వీరిద్దరూ కలిసి పాల్గొని... ఇద్దరూ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.  Last Updated 14, May 2019, 11:27 AM IST
2sports
అగ్లీగా ఉన్నావు, మా పక్కన నిలబడొద్దు అని తోసేశారు : ప్రణవి Highlights నన్ను స్టేజ్ మీద నుంచి తోసేశారు సినీ జీవితం అంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని అందరు అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ల బాధలు ఎవరికి తెలియదు. సింగర్  ప్రణవి కెరీర్‌ ఆరంభంలో చాలా కష్టాలు పడ్డానని  తెలిపింది. అలీతో జాలీగా షోకు భర్తతో పాటు హాజరైన ప్రణవి, కెరీర్ తొలినాళ్లలో అనుభవించిన అవమానాన్ని గుర్తు చేసుకుంది. చాలా సార్లు తాను పాడిన పాటలను తీసేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. అలాగే వేరేవాళ్లు పాడిన పాటలను తనతో పాడించిన సందర్భాలు కూడా ఉన్నాయని ప్రణవి చెప్పింది. ఒకసారి అందరితో కలిసి పాడుతుంటే స్టేజ్‌ పై నుంచి తనను తోసేశారని చెప్పింది. అప్పటికే రెండు మూడు సార్లు అవహేళనగా మాట్లాడారని, 'అగ్లీగా ఉన్నావు, మా పక్కన నిలబడొద్దు' అని ఎద్దేవా చేశారని కన్నీటి పర్యంతమైంది. దీంతో కసిగా ఇకపైన వీరు నా వెనుక నిలబడి పాడాలనే పట్టుదలతో ప్రయత్నించి, డిప్లొమా డిస్టింక్షన్‌ లో పాసయ్యానని తెలిపింది. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుని సింగర్ గా నిరూపించుకున్నానని చెప్పింది. ఆ రోజు తనను అవమానించిన వారు ఇప్పుడు తన వెనుక వుండి పాడుతున్నారని గర్వంగా చెప్పింది.  Last Updated 31, Mar 2018, 4:54 PM IST
0business
పారదర్శకతలేని ప్రపంచ బ్యాంక్‌ నివేదికలు - రాజకీయ జోక్యం మారుతున్న రిపోర్టులు - సోషలిస్ట్‌పార్టీకి చెందిన చిలీ అధ్యక్షురాలి పాలనలో డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంక్‌ 25నుంచి 57కు - వాస్తవ పరిస్థితులు అలా లేవు - నాలుగేండ్ల ర్యాంకులను మళ్లీ లెక్కిస్తాం: ప్రపంచ బ్యాంక్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌ పౌల్‌ రోమర్‌ వాషింగ్టన్‌: ప్రపంచ బ్యాంకు విడుదలచేసే ప్రధాన నివేదికల్లో డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకు ఒకటి. అది ప్రకటించే ఆర్థిక నివేదికలకోసం ప్రపంచవ్యాప్త దేశాలు, మీడియా ఆతృతగా ఎదురుచూస్తుంటాయి. వారి ర్యాంకులను మెరుగుపర్చుకుంటే చాలు అభివృద్ధిని సాధించినట్టే అని ఆలోచించే దేశాలూ ఉన్నాయి. ఈ ఆర్థిక నివేదిక కూర్పు పద్ధతుల్లో కొన్నేండ్ల నుంచి చోటుచేసుకుంటున్న అనేక మార్పుల వల్ల దాని ప్రధాన లక్ష్యమే నీరుగారిపోతోందని ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త పౌల్‌ రోమర్‌ వాపోయారు. అసమగ్రత, తప్పుదోవ పట్టించే నివేదిక ఇచ్చినందుకు ఆయన క్షమాపణలు కోరారు. అయితే, ఈ తప్పిదానికి రాజకీయ జోక్యం కూడా దోహదం చేసిందన్నారు. వివిధ దేశాల మధ్య వ్యాపారాల్లో పోటీనేర్పరిచేందుకు విడుదల చేసే 'డూయింగ్‌ బిజినెస్‌'(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) ర్యాంక్‌లను పున్ణప్రక్షాళన గావిస్తామని తెలిపారు. కనీసం నాలుగేండ్ల ర్యాంకులను మళ్లీ గణిస్తామని, దీంతో, అన్ని దేశాల ర్యాంకులు ప్రభావితమవుతాయని ఆయన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రికకు వెల్లడించారు. పౌల్‌ రోమర్‌ నూతనంగా(2016లో) ప్రపంచబ్యాంక్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రకటనపై ప్రపంచబ్యాంకు వ్యాఖ్యానించబోదని ఆ బ్యాంక్‌ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ నివేదికలకు బాధ్యత వహించాల్సిన మాజీ డైరెక్టర్‌ లోపేజ్‌ క్లారోస్‌ అందుబాటులోకి రాలేదు. 2018 ఏడాదికిగాను ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులో మన దేశానికి 100వ స్థానం వచ్చిన విషయం తెలిసిందే. 100స్థానాల జాబితాలోకి మనదేశం మొదటిసారి చేరింది. ఈ ర్యాంకు సాధించి నందుకు దేశవ్యాప్తంగా పలువురు హర్షించారు. కేంద్ర ప్రభుత్వ సంస్కరణలతో ఈ ర్యాంకును సాధించామని కొందరు అభిప్రాయపడిందీ విదితమే. ర్యాంకును నిర్ణయించే అంశాలు వేరు కావడం వల్ల గత ర్యాంకులను పోల్చలేం. కానీ, ఒకసారి గమనిస్తే 2016కు 130, 2017కు 130 స్థానాలను సాధించిన భారత్‌ 2018కి ఏకంగా 30 స్థానాలు ఎగబాకి 100వ స్థానానికి చేరింది. సోషలిస్టు పార్టీకి చెందిన మిషెల్లీ బ్యాచ్‌లెట్‌ 2014లో చిలీ దేశ అధ్యక్షురాలుగా పదవిలోకి వచ్చినప్పటినుంచి ఈ పక్షపాత నివేదికలు చిలీ దేశ ర్యాంకును తీవ్రంగా ప్రభావితం చేశాయి. అయితే, ఈ నివేదికలకు బాధ్యత వహించాల్సిన లోపెజ్‌ కార్లోస్‌కూడా చిలీ దేశస్థుడు కావడం గమనార్హం. చిలీస్థానం ర్యాంకు మదింపు పద్ధతిలో చోటుచేసుకున్న మార్పుల వల్ల మారింది. కానీ, ఆ దేశంలో వాస్తవ వ్యాపార అనుకూలతకు సంబంధించిన మార్పు కాదని రోమర్‌ విశ్లేషించారు. చిలీ ర్యాంకు దిగజారడంవెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ర్యాంకులు చెబుతున్నట్టు బ్యాచ్‌లెట్‌ పాలనలో వ్యాపార పరిస్థితులేం క్షీణించలేదని ఆయన తెలిపారు. తాను తగిన శ్రద్ధ పెట్టలేదని, ఈ ర్యాంకులు సమగ్రంగా లేవని స్పష్టం చేశారు. ర్యాంకులను మళ్లీ లెక్కించాలన్న తన నిర్ణయంతో ప్రపంచ బ్యాంక్‌పై పలు సందేహాలకు తెరలేపారు. డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకు గణింపులో ఎలాంటి మార్పులు సంభవించాయి? ఒక దేశంలో వ్యాపారం నిర్వహించడానికి మెరుగైన అవకాశాలను బట్టి ప్రపంచ బ్యాంకు డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకును రూపొందిస్తుంది. ఉదాహరణకు ఒక దేశంలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఎన్ని రోజులు పడుతుంది? వ్యాపార నిర్వహణ ఆమోదపత్రాలకు అయ్యే వ్యయమెంత? లాంటి అంశాలపై ఆధారపడి ఈ ర్యాంకును నిర్ణయిస్తుంది. ఒక వేళ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం కల్పించలేకపోతే ఆ దేశ ర్యాంకు దిగజారుతుంది. అయితే, ఈ ర్యాంకు లెక్కింపులో ప్రపంచ బ్యాంకు మార్పులు చేస్తోంది. ర్యాంకు నిర్ణయించేందుకు కొత్త అంశాలు చేరుస్తున్నది. ఉదాహరణకు నిర్మాణ పనుల ఆమోదం అంశంలో విద్యుత్‌ సరఫరా, విద్యుత్‌చార్జీలు, షేర్‌హోల్డర్లకు అందించే న్యాయ సేవల నాణ్యత, పన్నుల పద్ధతి లాంటివి చేర్చింది. ఈ అంశాల్లోని ర్యాంకులతో తుది ర్యాంకును నిర్ణయిస్తుంది. సరళతర పన్ను విధానం అనే అంశంలో 2015లో చిలీ దేశం 33వ ర్యాంకును పొందగా, అదే అంశానికి కొత్తగా పన్ను ఫైల్‌ చేశాక ఎన్నిరోజులు పడుతోందనే విషయాన్ని చేర్చింది. దీంతో, ఈ అంశంలో ఆ దేశ ర్యాంకు 2016లో అత్యల్పంగా 120వ స్థానానికి పడిపోయింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
వీళ్ల స్పీడు చూస్తుంటే.. తొందర్లోనే వారసున్నిస్తారేమో.. Highlights షూటింగులతో బిజీబిజీగా అక్కినేని నాగచైతన్య, సమంత మండు వేసవిలోనూ షూటింగ్ పనులు చకచకా ముగించేస్తున్న హాట్ కపుల్ ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి పీటలెక్కాలని ప్లాన్ చేస్తున్న చే-సామ్ అక్కనేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగ చైతన్య సమంతల ఎంగేజ్ మెంట్ అయ్యిందికానీ చాలా రోజులు కావటంతో ఇక పెళ్లి కోసం తొందరపడుతున్నారు. వచ్చే ఆగస్ట్‌లో ఈ టాలీవుడ్ హాట్ కపుల్ వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వీరిద్దరూ త్వరగా పెళ్లి చేసుకోవాలని ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో చెమటోడుస్తున్నారు.   ప్రస్థుతం నాగచైతన్య హైదరబాద్‌లో కల్యాణకృష్ణ సినిమా ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన వెంటనే చందు మొండేటి సినిమాను కూడా ప్రారంభించేస్తాడు. ఈ రెండు సినిమాల పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని నాగ చైతన్య తెగ కష్ట పడుతున్నాడు.   ఇక మరోవైపు సమంత రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్‌చరణ్‌ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాతోపాటు ‘రాజుగారి గది-2’, ‘మహానటి’ సినిమాలను కూడా లైన్లో పెట్టింది. ఓ పక్క ఎండలు భగ్గుమంటున్నా.. షూటింగులన్నీ ఆగస్టుకల్లా పూర్తి చేసుకోవాలని తెగ కష్టపడుతోంది సామ్. వీళ్లిద్దరి స్పీడు చూస్తుంటే.. ఆగస్ట్‌ నాటికి అంగీకరించిన సినిమాలు పూర్తి చేసేసి పెళ్లిపీటలు ఎక్కేసి... వీలైనంత త్వరలోనే అక్కినేని వారసున్ని కూాడా ఇచ్చేస్తారేమో..అనిపిస్తోంది కదూ. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
- 'ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌'లో రెండో స్థానానికి - నవ్యాంధ్రకు నెంబర్‌వన్‌ ర్యాంక్‌.. - చివరి స్థానంలో నిలిచిన మేఘాలయా - ప్రపంచ బ్యాంక్‌తో కలిసి డీఐపీపీ జాబితా న్యూఢిల్లీ: వ్యపార నిర్వహణ సులభతరంగా (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌) అందుబాటులో ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు మళ్లీ సత్తా చాటాయి. ప్రపంచ బ్యాంకు, భారత పరిశ్రమ విధానం, ప్రోత్సాహక శాఖల (డీఐపీపీ) సంయుక్తంగా రూపొందించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ -2017 జాబితాలో ఏపీ, తెలంగాణా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలవగా.. తెలంగాణ రెండో స్థానానికి జారింది.తెలుగు రాష్ట్రాల తరువాత మూడో స్థానంలో హర్యాణా రాష్ట్రం నిలించిందని డీఐపీపీ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఈ సారి రెండో స్థానానికి దిగ జారింది. నాలుగు విభాగాలుగా ర్యాంకింగ్‌.. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వాణిజ్య సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళికల అమలు ఆధారంగా డీఐపీపీ ఈ ర్యాంకుల జాబితాను రూపొందించింది. సంస్కరణల అమలును బట్టి రాష్ట్రాలను సర్కారు నాలుగు విభాగాలుగా విభజించి ర్యాంకింగ్‌లు ఇచ్చింది. 95శాతం పైబడి సంస్కరణల్ని అమలు చేసిన రాష్ట్రాలను 'టాప్‌ అచీవర్స్‌'గాను.. 90 నుంచి 95 శాతం మేర సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను 'అచీవర్స్‌'గాను.. 80 నుంచి 90 శాతం సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను 'ఫాస్ట్‌మూవర్స్‌'గాను.. 80 శాతం లోపు సంస్కరణలుఅమలు చేసిన రాష్ట్రాలను 'ఆస్పైరర్స్‌'గాను డీఐపీపీ గుర్తించింది. అయిదో స్థానంలో మోడీ సొంత రాష్ట్రం.. సంస్కరణల అమలులో వంద శాతం స్కోర్‌ సాధించిన రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఝార్ఖండ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు నిలిచాయి. ఈ జాబితాలో మూడు నుంచి పదో స్థానం వరకు వరుసగా జార్ఖండ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు నిలిచాయి. కాగా జాబితాలో మేఘాలయా 36 ర్యాంక్‌తో చివరి స్థానంలో నిలిచింది. సంస్కరణల ఆధారిత స్కోర్‌ తక్కువగా నమోదు చేయడంతో మహారాష్ట్ర 13వ ర్యాంక్‌, తమిళనాడు 15వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ పేలవమైన సామర్థ్యం కనబరిచి ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో 23వ స్ధానం సాధించింది. వ్యాపార సంస్కరణల కార్యాచరణలో (బీఆర్‌ఏపీ) భాగంగా డీఐపీపీ ప్రపంచ బ్యాంక్‌ సౌజన్యంతో అధ్యయనాన్ని నిర్వహించి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ జాబితాను రూపొందించింది. బీఆర్‌ఏపిలో నిర్ధేశించిన చాలా సంస్కరణలను అమలు చేసే విషయంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకున్నాయని డీఐపీపీ తెలిపింది. అయితే, టాప్‌ అచీవర్స్‌ జాబితాలో 9 రాష్ట్రాలు, అచీవర్స్‌ జాబితాలో ఆరు, ఫాస్ట్‌ మూవర్స్‌ జాబితాలో మూడు, ఆస్పైరర్స్‌ జాబితాలో 18 రాష్ట్రాలు నిలిచాయని డీఐపీపీ పేర్కొంది. పన్నుల చెల్లింపుల్లో ఒడిశా టాప్‌.. మరోవైపు, సంస్కరణల అమలు స్కోర్‌లో ఎక్కువ పురోగతి సాధించిన రాష్ట్రాల జాబితాలో అసోం, తమిళనాడులకు చోటు లభించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌, నిర్మాణరంగ అనుమతుల్లో రాజస్థాన్‌, కార్మిక చట్టాల్లో పశ్చిమ బెంగాల్‌, పర్యావరణ రిజిస్ట్రేషన్లకు కర్ణాటక, భూమి లభ్యతలో ఉత్తరాఖండ్‌, పన్నుల చెల్లింపులో ఒడిశా, పర్యవేక్షణ అమలులో మధ్యప్రదేశ్‌, ఐటీ పారద ర్శకతలో మహారాష్ట్ర వంద శాతం స్కోర్‌ను సాధించాయని డీఐపీపీ తెలిపింది. మరోవైపు వ్యాపారం నిర్వహించేందుకు అనుకూల దేశాల వార్షిక జాబితా 2017ను వరల్డ్‌ బ్యాంక్‌ ప్రకటించే ముందు రాష్ట్రాల తాజా ర్యాంకింగ్స్‌ వెలువడ్డాయి. గత ఏడాది భారత్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో తన స్ధానాన్ని మెరుగుపరుచుకుని 100వ ర్యాంక్‌కు ఎగబాకింది. అంతకుముందు ఏడాది భారత్‌ ఈ ర్యాంకింగ్స్‌లో అట్టడుగున 130వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 21, Aug 2018, 1:28 PM IST Highlights ఇప్పటికే 'RX100' చిత్ర దర్శకుడు అజయ్ భూపతి.. రష్మీ తొడలపై హాట్ కామెంట్స్ చేశాడు. సినిమా హోర్డింగ్ లో రష్మీ తొడలను చూస్తూ ఉండిపోయానని బోల్డ్ కామెంట్స్ చేశారు. యాంకర్ గా బుల్లితెరపై తన సత్తా చాటుతోన్న రష్మీ గౌతమ్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూ జనాల దృష్టి ఆకర్షించడానికి అందాల ఆరబోత కూడా ఓ రేంజ్ లో చేస్తోంది. తాజాగా ఆమె నటించిన 'అంతకు మించి' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కూడా రష్మీ తన అందాల ఆరబోత ఏమాత్రం మొహమాట పడలేదని సినిమా ప్రోమోలు, ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇప్పటికే 'RX100' చిత్ర దర్శకుడు అజయ్ భూపతి.. రష్మీ తొడలపై హాట్ కామెంట్స్ చేశాడు. సినిమా హోర్డింగ్ లో రష్మీ తొడలను చూస్తూ ఉండిపోయానని బోల్డ్ కామెంట్స్ చేశారు. ఇక అప్పటినుండి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రష్మీకి ఆమెకు తొడలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై బోల్డ్ గా స్పందించింది రష్మీ. ''నాకు ఉన్న వాటి గురించే కదా మాట్లాడుతున్నారు. అందుకే తప్పేముందని'' చెప్పుకొచ్చింది. అయితే సినిమాలో కేవలం ఇదొక్కటే కాకుండా చాలా విషయాలున్నాయని స్పష్టం చేసింది. జానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.  Last Updated 9, Sep 2018, 1:41 PM IST
0business
when ram charan wanted to shelve chiranjeevi's sye raa ఒక దశలో `సైరా` ఆపేద్దామనుకున్నాం: రామ్‌ చరణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్‌ హిస్టారికల్‌ డ్రామా సైరా నరసింహారెడ్డి. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తాజాగా చిత్ర నిర్మాత రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. Samayam Telugu | Updated: Oct 28, 2019, 01:16PM IST రామ్ చరణ్‌ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ నిర్మించిన భారీ హిస్టారికల్‌ మూవీ సైరా నరసింహారెడ్డి . సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించిన సైరా నార్త్‌లో మాత్రం నిరాశపరిచింది. వార్‌, జోకర్‌ సినిమాలతో పోటి పడాల్సి రావటంతో సైరా హిందీలో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. తాజాగా దీపావళి సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత రామ్‌ చరణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా బాలీవుడ్‌లో అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిందన్న విషయాన్ని కూడా అంగీకరించాడు చరణ్. అంతేకాదు ఒక దశలో సైరా సినిమాను ఆపేద్దామా అన్న ఆలోచన కూడా చేసినట్టుగా చెప్పి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. Visit Site Recommended byColombia గ్రాఫిక్స్‌, సెట్స్‌ ఇలా అన్ని కలిపి బడ్జెట్‌ 75 కోట్లకు పైగా ఖర్చు చేసిన తరువాత సినిమా విషయంలో ముందుకెళ్లాలా వద్ద అన్న ఆలోచన కూడా చేశామని తెలిపాడు. అయితే ఆ దశలో ఏ నిర్మాత సినిమాను ఆపే ప్రయత్నం చేయడని అందుకే నేను కూడా మొండి ధైర్యంతో ముందుకెళ్లానని తెలిపాడు. అంతేకాదు సైరా కోసం చిరు, తమన్నాలపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ పాటను సినిమా నిడివి ఎక్కువవుతుందన్న కారణంతో తొలగించారట. Also Read: సౌత్‌లో నెంబర్‌ వన్‌.. రికార్డ్‌లు సృష్టిస్తున్న `రాములో రాములా`! దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సైరా తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ వసూళ్లు సాధించింది. 250 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి నాన్‌ బాహుబలి రికార్డ్‌లు అన్నింటిని చెరిపేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా 275 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా చిత్రయూనిట్ వెళ్లడించారు. దాదాపు అన్ని చోట్ల సినిమా కలెక్షన్లు పడిపోవటంతో ఇదే ఫైనల్‌ కలెక్షన్లు అయ్యే అవకాశం ఉంది. See Photo Story: దీపావళీ వెలుగుల్లో మెరిసిన తారాలోకం..మీకోసం కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌ బచ్చన్‌, కన్నడ నటుడు సుధీప్‌, తమిళ హీరో విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు. రవికిషన్‌లు కీలక పాత్రల్లో నటించారు.
0business
sandhya 111 Views bear in stock market , sensex bear ముంబై: దేశీయ మార్కెట్ల పతనం కొనసాగుతుంది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం ట్రేడింగ్‌లో సూచీలు భారీగా కుదేలవుతున్నాయి. సెన్సెక్స్‌ 869 పాయింట్లు నష్టపోయి 38,664 వద్ద, నిఫ్టీ 276 పాయింట్ల నష్టంతో 11,535 వద్ద ట్రేడ్‌ అయ్యాయి. ప్రస్త్తుతం సెన్సెక్స్‌ 768 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 241 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/
1entertainment
గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విడియో తెరకెక్కించిన వర్మ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నగ్నంగా నటింటిన పోర్న్ స్టార్ మియా మల్కోవా ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎంక్రీమ్(కీరవాణి) తాజాగా వర్మ పిచ్చోడంటూ కామెంట్స్ చేసిన కీరవాణి వివాదాల కేంద్ర బిందువుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అనేక విమర్శల నడుమ జనవరి 27న ఉదయం 9 గంటలకు విడుదలైన ఈ వీడియోలో పోర్న్‌స్టార్ మియా మాల్కొవాను 19 నిమిషాల పాటు పూర్తి నగ్నంగా చూపించాడు వర్మ. స్త్రీ లైంగిక స్వేచ్ఛ స్వాతంత్య్రాలను తెలియజేస్తూ.. అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా నిలిచిందీ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’.కాగా ఈ చిత్రానికి సంగీతం అందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి వర్మ తీసిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’పై ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మతో కలిసి గతంలో చేసిన చిత్రాలను గురించి గుర్తుచేసుకుంటూ... వర్మతో కలిసి 1991లో రొమాన్స్‌కి, 92లో కామెడీకి పనిచేశానని.. ఇప్పడు 2018లో 2018లో సెక్స్‌కు సంగీతం అందించానన్నారు. దీంతో సెల్యులాయిడ్‌పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు నన్నో మెట్టు ఎక్కించాయన్నారు వర్మ. ఇక ఇదే ఏడాదిలో హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతం అందించబోతున్నానన్నారు. సినిమాలను పిచ్చిగా ప్రేమించే పిచ్చి వర్మ... తనను నమ్మినందుకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు కీరవాణి. ఈయన ట్వీట్‌పై ఆర్జీవీ స్పందిస్తూ.. ‘థాంక్యూ కీరూ’అంటూ రీట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ల సంగతి అటుంచితే ఆర్జీవీ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ మూవీపై ఒక వర్గం ప్రశంసలు కురిపిస్తుంటే.. నిరసనలు జ్వాలలు మాత్రం చల్లారడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. Last Updated 25, Mar 2018, 11:51 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV తమిళ సినిమాలో నాగబాబు కూతురు లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం నిహారిక మరో ద్విభాషా చిత్రానికి కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. TNN | Updated: Sep 29, 2015, 12:22PM IST ఇప్పటివరకు టీవీ హోస్ట్‌గా పేరున్న మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొనిదెల త్వరలోనే ఓ తెలుగు సినిమాలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధమైందని ఇటీవలే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం నిహారిక మరో ద్విభాషా చిత్రానికి కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె తొలిపరిచయం సినిమాని మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు దర్శకుడు రామరాజు డైరెక్ట్ చేయనుండగా తాజాగా ఆమె సైన్ చేసిన మరో సినిమాని అయోధ్య కుమార్ డైరెక్ట్ చేయనున్నాడట. మిణుగురులు సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అయోధ్య కుమార్ చెప్పిన కథని తండ్రి నాగబాబుతో కలిసి విన్న నిహారిక ఆ ప్రాజెక్టుకి ఓకే చెప్పిందని తెలుస్తోంది. తెలుగు, తమిళ భషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా నిహారికకి కోలీవుడ్ ఎంట్రీ కూడా జరిగిపోనుంది.
0business
ఉద్రిక్తతలతో మార్కెట్లలో నష్టాలు - 206 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ ముంబయి : భారత సరిహద్దుల సమీపంలోని పాకిస్థాన్‌ పోస్టులపై భారత సైన్యం జరిపిన దాడులతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు అంతర్జాతీయంగా ఇంగ్లాండ్‌ లోని ప్రముఖ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో జరిగిన బాంబుదాడి మదుపర్ల విశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. దీనికి తోడు భారీగా పెరిగిన సూచీల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మదు పర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా భారత సైన్యం ప్రకటనతో చివరి అర్థగంటలో మార్కెట్లు వరుసగా పడిపోయాయి. కాశ్మీర్‌ నౌషేరా సెక్టార్‌లో ని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన పలు సైనిక శిబిరాలు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలిపింది. మార్కెట్లో ట్రేడింగ్‌ ముగి యడానికి అరగంట ముందు ఈ దాడుల విషయాన్ని భారత సైన్యం వెల్లడించడం తో దేశీయ సూచీలు ఒక్క సారిగా నేల చూపులు చూశాయి. అప్పటికే ఔషద, రియాల్టీ స్టాక్స్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడిలో మార్కెట్లు ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయంగానూ మాంచెస్టర్‌ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య బీఎస్‌ఈ సెన్సెక్స్‌్‌ 206 పా యింట్లు పతనమై 30,365 పాయింట్లకు దిగజారింది. ఉదయం 30,553.89 వద్ద మొదలైన సూచీ ఓ స్థాయిలో 30,610 గరిష్ట స్థాయికి చేరిన ప్పటికీ, మరో దశలో 30,316.92 కనిష్ట స్థాయి నమోదయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52 పాయింట్లు కోల్పోయి 9,386 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఒక్క శాతం చొప్పున విలువ కోల్పోయాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Tirumala laddu వెంకన్న లడ్డూ.. నష్టాల కష్టాలు హైదరాబాద్‌: తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూకు నష్టాల కష్టాలు వచ్చిపడ్డాయి. వందేళ్లకుపైబడి తిరుమల దర్శించుకున్న భక్తు లకుప్రసాదంగా పంపిణీచేసే లడ్డూవిక్రయాలు తయారీద్వారా సాలీనా 143కోట్ల రూపాయలునష్టం వాటిల్లుతున్నట్లు టిటిడివర్గాలు ప్రకటిం చాయి. గడచిన మూడేళ్లుగా ఇదేతీరులో నష్టాలు వస్తున్నాయి. సబ్సిడీధరలకు ఇవ్వడమే ఇందుకు కీలకంగా అధికారులు చెపుతున్నారు. నోరూరించే తిరుమల లడ్డు ప్రసాదాన్ని తాము ఆస్వాదించడమే కాకుండా తమ స్వస్థలాల్లో పంచిపెట్టేందుకు వీలుగా అదనపు లడ్డూలు కూడా కొనుగోలుచేస్తారు. టిటిడి దేవస్థానం ఈ లడ్డూల ను రూ.25కు అందిస్తోంది. గడచిన 11ఏళ్లుగా ఇదేధరలు కొనసాగుతున్నాయి. అయితే తయారీ కి వాస్తవంగాఅయ్యేఖర్చు రూ.32.50గా ఉంది. తిరుమల శ్రీవారి ప్రధాన మందిరానికి సమీపం లోనే ఏర్పాటుచేసిన అతిపెద్ద వంటశాలలో ప్రత్యేక సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో వీటిని తయారు చేస్తారు. ఈ లడ్డూలకు దేశవ్యాప్తంగాను, అంతర్జాతీయంగా వచ్చే భక్తుల నుంచి మంచి డిమాండ్‌ ఉంటుంది. 2016లో సుమా రు పదికోట్ల లడ్డూలు తయారుచేసినట్లు అంచనా. సబ్సిడీ భారం అధిగమించలేకపోవడంతో లడ్డూల తయారీలో నష్టాలు తప్పడంలేదు. తక్కువో ఎక్కువో మొత్తంమీద లడ్డూకు పదిరూపాయలు చొప్పున ఉచిత దర్శనం చేసుకునేవారికి అందిస్తున్నారు. గంటలకొద్దీ క్యూలలో నిలుచుని దర్శనం తర్వాత వచ్చేవారికి ఈ లడ్డూలు అందుతాయి. ఈ పంపిణీ కింద సాలీనా 23కోట్లునష్టం వస్తోంది. 11కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చే భక్తుల కోసమని ప్రవేశపెట్టిన ఒక ఉచితలడ్డూ పంపిణీ వల్ల ఏడాదికి 22.7 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు లెక్కలు వేసారు. 2013 అక్టోబరులో ఈస్కీంను ప్రారంభించారు. దీర్ఘకాలికంగా కొనసాగుతు న్న కాలినడకన సుదీర్ఘ ప్రయాణం చేసి దేవుని మందిరానికి చేరుకునే భక్తులకోసమని ఈ ఉచితలడ్డూ ప్రసాదం పంపిణీ అమలుచేసారు. అప్పటినుంచి ఇప్పటివరకూ సగటున 70 లక్షల మంది భక్తులు కాలి నడకన దేవదేవుని దర్శించుకునేందుకు వస్తున్నారు. 70లక్షల మందికి పైగా భక్తులు 300 రూపాయల ప్రత్యేక దర్శనం, 500 రూపాయల విఐపి దర్శన టికెట్లపై వచ్చేవారికి రెండులడ్డూలు ఉచితంగా లభిస్తా యి. రెండువేల ఏళ్లనాటి ఏడుకొండల వాడికి బ్రిటిష్‌ కాలంలోనే అంటే వందేళ్లక్రితమే ఈ ప్రసాదం ఏర్పాటుచేసారు. అంతకు ముందు బెల్లం బియ్యంతో తయారుచేసే పొంగలి వంటి తీపి పదార్ధాన్ని పంపిణీచేసేవారు. బ్రిటిష్‌కాలంలో నియమితులైన విచారణ కర్తలుగా ఉన్న మహంతల కాలంనుంచే లడ్డు ప్రసాదం ప్రవేశపెట్టినట్లు సమాచా రం. అయితేరానురాను ఈలడ్డూలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. వీటికి సంబంధించిన టన్నులకొద్దీ నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్‌ వంటి ముడివనరులను టిటిడి భారీఎత్తున ఏటా సమీకరించుకుంటుంది. అయితే సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్న కారణంగానే లడ్డూల తయారీలో నష్టం వాటిల్లుతున్నదని దేవాలయ అధికారులు చెపుతున్నారు. మొత్తం మీద ఈ భారాన్ని నష్టంగా చూడకుండా దేవాలయాన్ని సందర్శించి దేవదేవుడి దర్శనం పొందిన భక్తులకు కానుకగా ఆదేవుడిచ్చిన ప్రసా దంగానే భావిస్తారని కావున ధరలు పెంచే యోచన కూడా సము చితం కాదన్న వాదన ఆధ్యాత్మిక వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రూ.10 నాణాలు ఇలా ఉంటే చెల్లుతాయి: RBI రూ.10 నాణాలు చెల్లవంటూ వస్తున్న వదంతులు నమ్మవద్దని, అవి తప్పకుండా చెల్లుతాయని RBI స్పష్టత ఇచ్చింది. రంగు, రూపం ఎలా ఉన్న తీసుకోవచ్చని పేర్కొంది. TNN | Updated: Nov 21, 2016, 08:56PM IST మార్కెట్లో నకిలీ రూ.10 నాణాలు చెలామణి అవుతున్నాయనే వదంతులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొట్టిపడేసింది. తప్పకుండా అవి చెల్లుబాటు అవుతాయని, వాటిపై ఎటువంటి ఆందోళన వద్దని స్పష్టం చేసింది. రూ.పది నాణాలు నకిలీవి చెలామణి అవుతున్నాయంటూ సోషల్ మీడియా రూమర్లు రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో, చాలా ప్రాంతాల్లో వాటిని స్వీకరించడం లేదు. అసలే, పెద్ద నోట్ల రద్దుతో చిల్లర సమస్యలను ఎదుర్కంటోన్న ప్రజలకు ఇది కాస్తా గోరు చుట్టుపై రోకటి పోటులా మారింది. ఈ నేపథ్యంలో RBI ఒక స్పష్టత ఇచ్చింది. 2011 ముందు ముద్రించిన నాణాలపై రూపాయి సింబల్ ఉండదని తెలిపింది. జులై 2011 తర్వాత ముద్రించిన నాణాలకు మాత్రమే ఆ గుర్తు ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఎటువంటి నకిలీ రూ.10 నాణాలు లేవని, నిరభ్యంతరంగా వాటిని స్వీకరించవచ్చని స్పష్టం చేసింది. రూ.10 కాయిన్‌లో రెండు లోహాల ఉంటాయి. 27 ఎంఎం వ్యాసం, 7.71 గ్రాముల బరువు ఉంటాయి. అయితే, కాలక్రమేనా ఇవి రంగు, రూపం కోల్పోతాయి.
1entertainment
England, First Published 6, Sep 2018, 11:11 AM IST Highlights భారత్‌తో ఐదో టెస్ట్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నాడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్. ఈ నేపథ్యంలో 11 మందితో కూడిన తన ఆల్‌టైమ్ డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు భారత్‌తో ఐదో టెస్ట్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నాడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్. ఈ నేపథ్యంలో 11 మందితో కూడిన తన ఆల్‌టైమ్ డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు. దిగ్గజాలకు తన టీమ్‌లో స్థానం కల్పించిన కుక్... కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారథి గ్రాహం గూచ్‌ను ఎంచుకున్నాడు. ఓపెనర్స్‌గా గూచ్.. ఆసీస్ స్టార్ మాథ్యూ హేడెన్ ఆడుతారు. మిడిలార్డర్‌లో లారా, పాంటింగ్, డివిలియర్స్, కలిస్ వారికి ఇష్టమైన స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగుతారు. వికెట్ కీపర్‌గా సంగక్కర.. పేసర్లుగా అండర్సన్, మెక్‌గ్రాత్.. స్పిన్నర్లుగా మురళీధరన్, షేన్‌వార్న్‌లకు చోటు కల్పించాడు. అయితే ఇతని డ్రీమ్ టీమ్ ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. అతని తరంలో దిగ్గజాలు అనదగ్గ వారందరినీ ఎంపిక కేసిన కుక్‌కు భారత్ నుంచి ఎవరు కనిపించలేదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, గంగూలి, సెహ్వాగ్‌, కుంబ్లే‌లు దిగ్గజాలుగా కనిపించలేదా అని ప్రశ్నించారు.  Last Updated 9, Sep 2018, 12:04 PM IST
2sports
Shraiyee Equpment Finance CEO Devendra Kumar మూడేళ్లలో నూరుశాతం వృద్ధి సాధిస్తాం హైదరాబాద్‌, జూన్‌ 28: శ్రేయి ఎక్విప్‌మెంట్‌ఫైనాన్స్‌ దక్షిణాదిరాష్ట్రాల్లో విస్తరణపై దృష్టిసారించింది. నిర్మాణరంగం, మైనింగ్‌ యంత్రసామగ్రి కొనుగోలుకు ఫైనాన్స్‌ అందించే సంస్థ దక్షిణ మధ్యప్రాంతంవైపు ఎక్కు వ దృష్టిసారించి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రా లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. వచ్చేమూడేళ్లలో నూరు శాతం వృద్ధిని సాధిస్తామని సంస్థ ప్రకటించింది. కొత్త డిజిటల్‌ కార్యాచరణతో శ్రేయి ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ దక్షిణమధ్య ప్రాంతానికి విస్తరిస్తున్నట్లు సంస్థ ఎండి సిఇఒ దేవేంద్రకుమార్‌ వ్యాస్‌ వెల్లడించారు. నిర్మాణరంగం, మైనింగ్‌ యంత్రసామగ్రి మార్కెట్‌లో ఇప్పటికే 30- 35శాతం మార్కెట్‌ వాటాతో ఉన్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని వరంగల్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌, ఖమ్మం, కడప, రాజమండ్రి, నెల్లూరు, వైజాగ్‌, విజయవాడ, తిరుపతి నగరాల్లో సేవలందుతున్నాయని ఆయన అన్నారు జెసిబి, టాటాహిటాచి, హుండై, ఎల్‌అండ్‌టి కోమట్సు సంస్థల భారీ యంత్రసామగ్రి కొనుగోలుకు శ్రేయి ఎక్విప్‌ మెంట్‌ ఫైనాన్స్‌ రుణపరపతిని అందిస్తోంది. ఈ రెండు తెలుగురాష్ట్రాల ప్రాంతంలోనే 2017-18లో 30శాతం వృదిధని సాధించగలమని దేవేంద్రకుమార్‌ వివరించారు. ప్రాజెక్టు డెవలపర్లు, కాంట్రాక్టులు తమకు ఎంతో కీలకమ ని, వారితో సంబంధాలు, భాగస్వామ్య విధానాలు మంచి వృద్ధిని సాధించేందుకు దోహదం చేసాయన్నారు. దక్షిణ మధ్య ప్రాంతంనుంచే దేశ ఆర్థికవ్యవస్థకు ఎక్కువ వాటా వెళుతోందని, ఆధునిక వ్యవసాయ విధానాలు, పట్టణప్రాంత మౌలికవనరులు పెరగడంతో నిర్మాణరంగం కూడా వృద్ధిదిశగా వెళుతోందనిసిఇఒ వెల్లడించారు.
1entertainment
- గుజరాత్‌లోని 'బయోటెక్‌' సంస్థ భారీ మోసం - ఆర్థికమోసంపై ఈడీ, సీబీఐ విచారణ న్యూఢిల్లీ : గుజరాత్‌లో భారీ ఆర్థిక మోసం బయటపడింది. వడోదర కేంద్రంగా ఉన్న 'స్టెర్లింగ్‌ బయోటెక్‌ లిమిటెడ్‌' సంస్థ డైరెక్టర్లు, వారి కుటుంబసభ్యులు బ్యాంకులకు రూ.5వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్నారు. సంస్థ డైరెక్టర్లుగా ఉన్న నితిన్‌ సందేశరా, సోదరుడు చేతన్‌ సందేశరా, కుటుంబసభ్యురాలు దీప్తీబెన్‌ సందేశరాలపై సీబీఐ, ఈడీ పలు కేసులు నమోదు చేసింది. వీరి ఆధ్వర్యంలో నడుస్తున్న బయోటెక్‌ కంపెనీ బ్యాంకుల నుండి అక్రమపద్ధతుల్లో రూ.5వేల కోట్లు రుణాలుగా సేకరించిందని, విదేశాల్లో 300కుపైగా షెల్‌ కంపెనీలు(దొంగ కంపెనీలు), బినామీ పేర్లతో దేశవిదేశాల్లో వ్యాపార సంస్థలు సృష్టించారని ఈడీ, సీబీఐ ఆరోపణలు నమోదుచేశాయి. నిందితులతా ప్రస్తుతం నైజీరియాకు పారిపోయి తలదాచుకున్నారని ఈడీ, సీబీఐ వర్గాలు అనుమానిస్తున్నాయి. నేరస్తుల అప్పగింత, పరస్పర నేర విచారణలో సహకార ఒప్పందాలు భారత్‌-నైజీరియా మధ్య లేనందున, ఆ దేశం నుంచి వారిని తీసుకురావటం చాలా కష్టసాధ్యమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసు గురించి ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ''దుబారు అధికార వర్గాలు నితిన్‌ సందేశరాను ఆగస్టు రెండోవారంలో నిర్బంధించారన్న సమాచారం మాకందింది. కానీ అది నిజం కాదని తర్వాత తెలిసింది. అయితే సందేశరా కుటుంబసభ్యులంతా నైజీరియా పారిపోయి ఉండవచ్చునని ఈడీ, సీబీఐ వర్గాలు నమ్ముతున్నాయి'' అని చెప్పారు. ఇదిలా ఉండగా, నిందితుల్ని అరెస్టు చేయాలని భారత అధికారులు ఇంటర్‌పోల్‌ను కోరారు. రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయటంపై ప్రయత్నాలు ప్రారంభించారు. ఈకేసులో ఢిల్లీకి చెందిన ఫార్మాస్యూటికల్స్‌ వ్యాపారి గగన్‌ ధావన్‌ను ఈఏడాది జూన్‌లో ఈడీ అరెస్టు చేసింది. నిందితులుగా ఉన్న సందేశరా కుటుంబసభ్యులు, మరికొంతమందిపై క్రిమినల్‌ విచారణ జరపాలని, వారంతా వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారని ఈడీ ఆరోపిస్తున్నది. దేశ విదేశాల్లో ఉన్న బినామీ కంపెనీలతో ఇక్కడ తీసుకున్న రుణాల్ని విదేశాలకు తరలించారని ఈడీ చెబుతోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ మొదలుకానుండగా.. ఇటీవల వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ కూడా ఈ వరల్డ్‌కప్ తర్వాత వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకూ 95 వన్డేలాడిన ఇమ్రాన్ తాహిర్ 156 వికెట్లు పడగొట్టాడు. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఇమ్రాన్ తాహిర్ అనతికాలంలోనే దక్షిణాఫ్రికా అగ్రశ్రేణి స్పిన్నర్‌గా ఎదిగాడు. భాగస్వామ్యాలను విడదీయడంలో తాహిర్‌ది అందివేసిన చేయి. శ్రీలంకతో (నిన్న) ఆదివారం ముగిసిన తొలి వన్డేలోనూ 10 ఓవర్లు బౌలింగ్ చేసిన తాహిర్ 26 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యులర్‌ బౌలర్‌గా కొనసాగుతున్న ఇమ్రాన్‌ తాహిర్‌కి టెస్టుల్లో మాత్రం ఎక్కువ అవకాశం లభించలేదు. కెరీర్‌లో 20 టెస్టులాడిన ఈ స్పిన్నర్ 57 వికెట్లు పడగొట్టగా.. 37 టీ20ల్లో 62 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ సీనియర్ స్పిన్నర్ మెరిశాడు..!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Record opening partnership between Shikhar Dhawan and Rohit Sharma రోహిత్-ధావన్ రికార్డ్ బ్రేక్ భాగస్వామ్యం..! న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ రికార్డు భాగస్వామ్యం‌తో TNN | Updated: Nov 1, 2017, 09:31PM IST న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ రికార్డు భాగస్వామ్యం‌తో జట్టుకి భారీ స్కోరు అందించారు. కివీస్ బౌలర్లపై ఆది నుంచే ఎదురుదాడికి దిగిన రోహిత్ శర్మ (80: 55 బంతుల్లో 6x4, 4x6), శిఖర్ ధావన్ (80: 52 బంతుల్లో 10x4, 2x6) అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కి అభేద్యంగా 16.2 ఓవర్లలో 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20 క్రికెట్‌లో భారత్‌ జట్టుకి ఇప్పటి వరకు ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం 136 పరుగులే. 2007 టీ20 ప్రపంచకప్‌‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్- గౌతమ్ గంభీర్ జోడి ఈ భాగస్వామ్యం నెలకొల్పింది. తాజాగా రోహిత్- ధావన్ జోడి ఈ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు సరికొత్త రికార్డుని నెలకొల్పింది.
2sports
మంచంలో నాకు ఆ యాంగిల్ అంటే ఇష్టం : రాధిక ఆప్టే Highlights మంచంలో నాకు ఆ యాంగిల్ అంటే ఇష్టం రాధికా ఆప్టే కాంట్రవర్సీ కోసమే మాట్లాడుతుందో లేదా ఈమె ఏం మాట్లాడినా అది వివాదం అయిపోతుందో తెలీదు కానీ రాధిక ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. ఈ మధ్యనే నేహా ధూపియా షో కి వచ్చిన ఈ తార హోస్ట్ అడిగిన ఘాటు ప్రశ్నకి ఫన్నీ గా సమధానమిచ్చి తప్పించుకుంది. వచ్చిన గెస్ట్ ఎవరైనా వాళ్ళని తన ప్రశ్నలతో చల్లగా కూపీ లాగడంలో నేహా ధూపియా దిట్ట. ఇప్పటికే ఈమె షో కి విచ్చేసిన చాలా మంది సెలెబ్రెటీలు వివాదాల్లో ఇరుక్కున్నారు. వారి లిస్ట్ లో జాయిన్ అవ్వకుండా రాధిక తెలివిగా తప్పుకుంది. షో లో ఈ లెజెండ్ బ్యూటీ ఎదురుకున్న ప్రశ్నలలో 'మంచంలో మీకు ఇష్టమైన పొజిషన్ ఏంటి?' అని. నిజానికి ఇది నేహా షో కి వచ్చిన అందరినీ అడిగే ప్రశ్నే. ఎదో చెప్పి ఇబ్బందులో ఇరుక్కోకుండా అలా అని ఎక్కువ ఆలోచించకుండా టక్కున తన సమాధానంతో అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. "ఆఫ్ కోర్స్.. నేను ఒక్క దాన్నే పడుకున్నప్పుడు.. మరెవరితోనో పడుకున్నప్పుడు అని మీరు అడగలేదుగా" అంటూ చమత్కరించింది. టాలీవుడ్లో పెద్దగా కనపడకపోయినా బాలీవుడ్లో బాగానే బిజీగా ఉంది. మొన్ననే అక్షయ్ కుమార్ ప్యాడ్ మాన్ సినిమాలో నటించిన రాధిక సైఫ్ అలీ ఖాన్ సరసన బజార్ సినిమాలో కనిపించనుంది.  Last Updated 30, Mar 2018, 5:20 PM IST
0business
Apr 03,2015 రూ.15,480 కోట్లకు హెచ్‌ఎఎల్‌ టర్నోవర్‌             బెంగళూరు : ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌) క్రితం ఆర్ధిక సంవత్సరం 2014-15లో రూ.15,480 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 2013-14లో రూ.15,128 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసుకుంది. మార్చితో ముగిసిన ఏడాదిలో అంచనాలకు తగ్గట్లుగా రూ.900 కోట్ల మూలధనం వ్యయం చేశామని హెచ్‌ఎఎల్‌ సిఎండి సువర్ణ రాజు తెలిపారు. ఈ కాలంలో 2000 ఉత్పత్తులను అందించామని, రూ.100 కోట్లు పొదుపు చేశామని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఇండియాలో నోకియా ఫోన్ ధర రూ.8 వేలు తగ్గిందోచ్! నోకియా 8, నోకియా 5 స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ.8 వేల వరకూ తగ్గాయి. మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా నోకియా కంపెనీ ధరలు తగ్గించింది. TNN | Updated: Feb 2, 2018, 06:50PM IST హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 5, నోకియా 8 స్మార్ట్‌ఫోన్ల ధరలను రూ.8 వేల వరకూ తగ్గించింది. మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా నోకియా కంపెనీ ఫోన్లకు ఆదరణ తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని అంశాలను బేరీజు వేసిన నోకియా.. ఫోన్ల తగ్గింపు దిశగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇండియాలో నోకియా ఫోన్లను అమ్ముతున్న హెచ్ఎండీ సంస్థ భారీగా ఫోన్ల ధరలను తగ్గించింది. నోకియా 8 స్మార్ట్ పోన్ ధర రూ.36,999గా ఉండగా.. దీన్ని రూ.8 వేల వరకూ తగ్గించి రూ.28,999గా నిర్ణయించింది. దీంతోపాటు.. 3 జీబీ స్టోరేజీ కలిగిన నోకియా 5 ఫోన్ ధరను రూ.8 వేలు తగ్గించి రూ. 12,499 ధరకే అందుబాటులో ఉంచింది. 3 జీబీ వేరియంట్ నోకియా ఫోన్ గతేడాది నవంబరులో విడుదలనైప్పుడు చాలా ఎక్కువ ధర ఉండటంతో.. దానికి తగినంత స్పందన లభించలేదు.
1entertainment