news
stringlengths
299
12.4k
class
class label
3 classes
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ​ హనీమూన్‌లో కోహ్లి-అనుష్క లేటెస్ట్ ఫొటోస్ ఇటలీలోని విలాసవంతమైన విల్లాలో గత సోమవారం వివాహం చేసుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క TNN | Updated: Dec 18, 2017, 04:23PM IST ​ హనీమూన్‌లో కోహ్లి-అనుష్క లేటెస్ట్ ఫొటోస్ ఇటలీలోని విలాసవంతమైన విల్లాలో గత సోమవారం వివాహం చేసుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి , బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్నారు. రెండు రోజుల క్రితం మంచుకొండల్లో విహరిస్తున్న ఫొటోని అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. తాజాగా మరో రెండు ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. మంచుకొండల్లో విరాట్ కోహ్లి పక్కన ఉంటే ‘ స్వర్గంలో ఉన్నట్లుంది’ అంటూ అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో కాప్షన్ రాసిన విషయం తెలిసిందే. ఈ నూతన జంట.. రాజకీయ ప్రముఖులకి డిసెంబరు 21న గ్రాండ్‌గా ఢిల్లీలో వివాహ విందు ఇవ్వనుంది. అనంతరం భారత క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులకి డిసెంబరు 26న ముంబయిలో ప్రత్యేక రిషప్షన్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటన కోసం మళ్లీ విరాట్ కోహ్లి భారత జట్టుతో చేరనున్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
eng;ander డ్యూరోఫ్లెక్స్‌ నుంచి కొత్త డిజైన్‌ పరుపులు హైదరాబాద్‌, మే 26: విశ్రాంతి ఉత్పత్తుల తయా రీ అగ్రగామి సంస్థ డ్యూరోఫ్లెక్స్‌ కొత్తగా రాయల్‌ ఛాలెంజర్స్‌ భాగస్వామ్యంతో ఎనర్జైస్‌ స్థాయి పరుపులను మార్కెట్‌లోనికి తెచ్చింది. ఈ కొత్త పరుపులను ఫోలే డిజైన్స్‌తో రూపొందించినట్లు ప్రకటించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ క్రీడాకారులు క్రిస్‌ గేల్‌, టమాల్‌మిల్స్‌, మన్‌దీప్‌సింగ్‌, కేదార్‌ జాదవ్‌, యుజువేంద్ర చహాల్‌, షానే వాట్సన్‌ వంటివారు ఈ కొత్త డిజైన్‌ పరుపులను విడుదల చేసారు. తమ టి20 సీజన్‌లో డ్యూరోఫ్లెక్స్‌తో భాగస్వామ్యం ఎంతో ఆహ్లాదాన్నిస్తుందని, స్వేఛ్ఛాయుత నిద్రకు డ్యూరోఫ్లెక్స్‌ పరుపులు ఎంతోమేలు చేస్తాయని క్రీడాకారులు వెల్లడిం చారు. కంపెనీ ఎండి మాథ్యూ చాంది మాట్లా డుతూ తమ కొత్త పరుపులు ఎనర్జైస్‌ పరుపుల రంగంలో విప్లవాత్మక ఉత్పత్తి అని అన్నారు. కస్టమర్ల అవసరాలు అభిరుచులకు అనుగుణం గా డ్యూరోఫ్లెక్స్‌ఉత్పత్తులు ఎల్లవేళలా ఉంటా యనడానికి ఇదే నిదర్శనమన్నారు. అన్ని రిటైల్‌ ఔట్‌లెట్లలోను వచ్చేనెల 15వ తేదీ నుంచి ఈ పరుపులు అందుబాటులో ఉంటాయని అన్నా రు. ఎన్‌ఆర్‌జి40, ఎన్‌ఆర్‌జి 20, రివైవ్‌ యాక్టివ్‌, ఎవోక్‌, ఎండ్యూర్‌, వెలాసిటీ కేటగిరీ లన్నీ కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV అఖిల్ ముచ్చటగా మూడోసారి ‘తొలిప్రేమా...?’ ‘అఖిల్’, ‘హలో’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశారు అక్కినేని అఖిల్. అయితే రెండు చిత్రాలు ఆశించిన స్థాయి విజయాల్ని అందుకోకపోవడంతో తన మూడో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నారు. Samayam Telugu | Updated: Mar 27, 2018, 07:11PM IST ‘అఖిల్’, ‘హలో’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశారు అక్కినేని అఖిల్ . అయితే రెండు చిత్రాలు ఆశించిన స్థాయి విజయాల్ని అందుకోకపోవడంతో తన మూడో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నారు. అఖిల్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై తొలి సినిమా 'తొలిప్రేమ'తో సూపర్‌ హిట్‌ సాధించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్తమూవీకి కొబ్బరికాయ కొట్టేశాడు అక్కినేని హీరో. ప్రొడక్షన్‌ నెం.25గా ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. దేవుని పటాలకు నమస్కరిస్తున్న అఖిల్‌పై ఫస్ట్‌ షాట్‌ను చిత్రీకరించారు. ఈ ఫస్ట్‌షాట్‌కి కింగ్‌ నాగార్జున క్లాప్‌ నివ్వగా, హీరో దుల్కర్‌ సల్మాన్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ ప్రారంభోత్సవానికి అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ హాజరయ్యారు. మే నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌‌కి ప్లాన్ చేసుకున్నారు చిత్ర యూనిట్. తాజా మూవీకి ‘తొలిప్రేమ’ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించిన తమన్ స్వరాలను సమకూర్చుతున్నారు. ‘తొలిప్రేమ’ చిత్రంతో హిట్ తొలి హిట్ అందుకున్న వెంకీ అట్లూరి.. అఖిల్‌ను హిట్ ట్రాక్ ఎక్కిస్తాడేమో చూడాలి. And another journey begins. Akhil#3 shall do our best :) https://t.co/FEF6z6QABe — Akhil Akkineni (@AkhilAkkineni8) 1522072651000
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV టెస్టుల్లో అలిస్టర్‌ కుక్ అరుదైన రికార్డ్..! ఇంగ్లాండ్ వెటరన్ ఓపెనర్ అలిస్టర్ కుక్ టెస్టుల్లో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేలు, టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించి కేవలం ఐదు రోజుల Samayam Telugu | Updated: Jun 1, 2018, 05:51PM IST టెస్టుల్లో అలిస్టర్‌ కుక్ అరుదైన రికార్డ్..! ఇంగ్లాండ్ వెటరన్ ఓపెనర్ అలిస్టర్ కుక్ టెస్టుల్లో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేలు, టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించి కేవలం ఐదు రోజుల ఫార్మాట్‌‌లో మాత్రమే ఆడుతున్న కుక్.. మధ్యలో ఒక మ్యాచ్‌ కూడా మిస్ అవ్వకుండా వరుసగా 154 టెస్టులాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 1979 నుంచి 1994 వరకు ఆస్ట్రేలియా తరఫున టెస్టులాడిన అలెన్ బోర్డర్‌ వరుసగా 153 టెస్టులాడి అప్పట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. తాజాగా ఆ రికార్డుని అలిస్టర్ కుక్ కనుమరుగు చేశాడు. ఈ జాబితాలో భారత్ తరఫున 106 టెస్టులతో సునీల్ గవాస్కర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్ ఆరంభమైన విషయం తెలిసిందే.
2sports
బిజెపిలోకి మహావీర్, బబితలకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు   Babita Phogat joins BJP, her father న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో ఫోగట్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి మహావీర్ సింగ్ ఫోగాట్, ఆయన కుమార్తెలు గీత, బబిత, రీతూ, సంగీత ప్రముఖ రెజ్లర్లుగా పేరుపొందారు. దంగల్ సినిమాతో వారి విజయప్రస్థానం యావత్ భారతదేశానికి తెలిసింది. ఈ క్రమంలో బబితా ఫోగట్ తాజాగా రాజకీయాల్లో ప్రవేశించారు. తండ్రి మహావీర్ తో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఇప్పటివరకు హర్యానా స్టేట్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన బబిత తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/andhra-pradesh/
2sports
internet vaartha 218 Views న్యూఢిల్లీ : అంతర్జాతీయ పుట్‌ బాల్‌ ఫెడరేషన్‌ (ఫిఫా) వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా సత్తా చాటింది.గత కొన్ని నెలలుగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ టుగా కొనసాగుతున్న అర్జెంటీనా వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయింగ్‌ మూడు మ్యాచ్‌లలో విజయం సాధించడంతో నెంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకింది.దీంతో ఇంతవరకు నెంబర్‌ వన్‌గా ఉన్న బెల్జియం నెంబర్‌ టు స్థానానికి పడిపోయింది.అయిదవ ర్యాంకులో కొనసాగిన చిలీ రెండు స్థానాలు ఎగబాకి మూడవ ర్యాంకును కైవసం చేసుకుంది. నాలుగు ర్యాంకులు ఎగబాకిన కొలంబియా నాలుగో ర్యాంకు దక్కించుకుంది.అయిదవ ర్యాంకు లో జర్మనీ,ఆరవ ర్యాంకులో రెండు స్థానాలు దిగజారిన స్పెయిన్‌,ఏడవ ర్యాంకులో బ్రిజిల్‌,ఎనిమిదవ ర్యాంకులో పోర్చుగల్‌,పదవ ర్యాంకులో ఇంగ్లండ్‌ దేశాలు ఉండగా,భారత్‌ రెండు ర్యాంకులు దిగజారి 162వ ర్యాంకులో నిలిచింది.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV జియోకు పోటీగా ఎయిర్‌టెల్ '3 జీబీ డేటా' ప్లాన్‌! సంచలన టెల్కో 'జియో'ను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. జియో అందిస్తున్న రూ.509 ప్లాన్‌కు పోటీగా రూ.558తో కొత్త ప్లానును ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. TNN | Updated: May 20, 2018, 04:52PM IST జియోకు పోటీగా ఎయిర్‌టెల్ '3 జీబీ డేటా' ప్లాన్‌! సంచలన టెల్కో 'జియో'ను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. జియో అందిస్తున్న రూ.509 ప్లాన్‌కు పోటీగా రూ.558తో కొత్త ప్లానును ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటాతోపాటు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియో రూ.509 ప్లాను కాలపరిమితి 28 రోజులు కాగా... ఎయిర్‌టెల్ 82 రోజుల కాలపరిమితితో ఈ కొత్తప్లానును తీసుకొచ్చింది. జియో ఆఫర్‌లో రోజుకు 3 జీబీ డేటాతోపాటు, 100 మెసేజ్‌లు అందుతున్నాయి.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రెమ్యునరేషన్ పెంచేసిన వరుణ్ తేజ్! ‘F2’ సినిమా వరకు వరుణ్ రూ.4 నుంచి రూ.4.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. అయితే ‘F2’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడం, రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడంతో వరుణ్ తన పారితోషికాన్ని పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. Samayam Telugu | Updated: May 14, 2019, 04:55PM IST మెగా ప్రిన్స్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘F2’.. ఇలా వరుస హిట్లతో మంచి జోరుమీదున్నారు. ప్రస్తుతం ఆయన ‘వాల్మీకి’ ప్రాజెక్టుతో బిజీగా గడుపుతున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా వరుణ్ కనిపించనున్నారు. ఒక గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న వ్యక్తి సినీ రచయితగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా. తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ‘జిగర్తాండ’కు ఇది రీమేక్. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు వరుణ్ తేజ్ పారితోషికం బాగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్ రూ.6.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ‘F2’ సినిమా వరకు వరుణ్ రూ.4 నుంచి రూ.4.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. అయితే ‘F2’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడం, రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడంతో వరుణ్ తన పారితోషికాన్ని పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. కెరీర్ ప్రారంభంలో కోటి రూపాయల నుంచి రూ.2.5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న వరుణ్ ఆ తరవాత రూ.4 కోట్లకు పెంచారని అంటారు. ఇప్పుడు దాన్ని రూ.6.5 కోట్లు చేశారని తెలుస్తోంది.
0business
కోల్‌ ఇండియాలో వాటా విక్రయం -  కొచ్చిన్‌ ఐపీఓకు పచ్చజెండా.. -  ఎగుమతులకు 3 శాతం వడ్డీ సబ్సిడీ -  8000 కోట్ల విలువైన రైల్వేలైన్‌ పనులకు సై.. -  ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషాలకు మేలు -  సంస్కరణపు బాటలోనే మంత్రివర్గ నిర్ణయాలు    న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ సంస్కరణల పంథాను కొనసాగిస్తోంది. ఈ దిశగా బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక ఆర్థిక అంశాలకు పచ్చజెండా ఊపింది. కోల్‌ ఇండియాలో (సీఐఎల్‌లో)మరో 10 శాతం వాటా విక్రయం, కొచ్చిన్‌ షిప్‌యార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు సమ్మతి తెలపడంతో పాటు ఎగుమతులకు 3 శాతం వడ్డీ సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించింది. దీనికి తోడు బిడ్డర్లు ఇతర సమస్యల కారణంగా నిలిచిపోయిన దాదాపు 34 భారీ రహదారుల ప్రాజెక్టులను వీలైనంత త్వరగా తిరిగి మొదలుపెట్టేలా చూసేందుకు రహదారుల శాఖకు అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.8000 కోట్ల విలువైన పలు రైల్వే ప్రాజెక్టులకు కూడా లైన్‌ క్లియర్‌ చేసింది. మొట్టమొదటి సారిగా రైతులకు నేరుగా ఉత్పత్తి సబ్సిడీని అందించే విధానానికి కూడా మంత్రివర్గం సమ్మతి తెలపడం విశేషం. సీఐఎల్‌లో వాటా విక్రయం..    పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను అందుకోవడంలో విఫలమైన కేంద్రం తన పరువు నిలుపుకొనేందుకు కోల్‌ ఇండియాపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆ సంస్థలో 10 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. తాజాగా ప్రతిపాదిత కోల్‌ ఇండియా వాటా విక్రయం వల్ల ప్రస్తుత మార్కెట్‌ ధర వద్ద ప్రభుత్వానికి దాదాపు రూ.20,000 కోట్ల మేర నిధులు సమకూరనున్నాయి. ఎగుమతులకు ఊతం ఇచ్చేలా ప్రి-షిప్‌మెంట్‌, పోస్ట్‌-షిప్‌మెంట్‌ రుణాలపై 3 శాతం సబ్సిడీ అందించే పథకం పునరుద్ధరణకు కూడా మంత్రివర్గం సమ్మతి తెలిపింది. ఈ సౌలభ్యం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలులోకి తీసుకోనున్నారు. చక్కెర మిల్లులకు చెరకును విక్రయించే రైతులకు నేరుగా సబ్సిడీని ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయించింది. తాజా నిర్ణయం మేరకు క్విటాలుకు రూ.4.5 ఉత్పత్తి సబ్సిడీని అన్నదాతకు అందిచనుంది. మరోవైపు రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో దాదాపు రూ.83451 కోట్ల విలువైన నాలుగు రైల్వే లైన్‌ ప్రాజెక్టులకు సమ్మతి తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు మేలు జరగనుంది. ప్రధాని నేతృత్వంలోని 'ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ' కొత్తగా దాదాపు 189.278 కి.మి. రైల్వే లైన్‌ ఏర్పాటుకు తమ సమ్మతి తెలిపింది. ఇందులో రూ.2977.64 కోట్ల విలువైన కొత్తవలస-కోరాపుట్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులతో పాటు.. కోరాపుట్‌-సింగాపూర్‌ (రూ.164.56 కోట్లు) డబ్లింగ్‌ పనులు, జగ్దాల్‌పూర్‌-కోరాపుట్‌ రైల్వే లైన్‌(రూ.1839 కోట్లు) నిర్మాణ పనులు ఉన్నాయి. ఈ మార్గంలో వస్తు రవాణా డిమాండ్‌ బాగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులు ఏడేళ్ల కాలంలో పూర్తి కానున్నాయి. ఈ కొత్త రైల్వే పనుల కారణంగా ఒడిషాలోని కోరాపుట్‌ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు మేలు జరగనుంది. భగ్గుమన్న కార్మిక సంఘాలు..    కోల్‌ ఇండియా (సీఐఎల్‌) సంస్థలో 10 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. సంస్థలో వాటా విక్రయపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ త్వరలోనే సమ్మె బాట పట్టాలని కొన్ని సంఘాలు యోచిస్తున్నాయి. సీఐఎల్‌లో 10 శాతం వాటా విక్రయం ద్వారా దాదాపు మరో రూ.20,000 కోట్లను సమీకరించనున్నట్లు బొగ్గు, విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ వెల్లడించారు. ఈ ప్రకటనకు కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందిచాయి. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా 'ఇండియన్‌ నేషనల్‌ మైన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌' కార్యదర్శి ఎస్‌.క్యు. జమా తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె బాట పట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే కార్మిక సంఘాల వారితో సమావేశమై ప్రభుత్వ నిర్ణయంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసిముందుకు సాగనున్నట్లు తెలిపారు. సీఐఎల్‌లో వాటా విక్రయంతో పాటు బొగ్గు పరిశ్రమకు సంబంధించి తీసుకుంటున్న వివిధ విధానపర నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నట్లుగా ఏఐటీయూసీ అధ్యక్షుడు రామేంద్ర కుమార్‌ తెలిపారు. అయితే ఈ విషయంలో సమ్మెకు వెళ్లే యోచనపై తాము వెంటనే ఎటువంటి ప్రకటన చేయలేమని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అఖిల భారత బొగ్గు కార్మికుల ఫెడరేషన్‌కు చెందిన జోబిన్‌ రారు తెలిపారు. వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేయనున్నట్లు తెలిపారు. ఇందుకు పలు మార్గాలు ఉన్నాయన్నారు. సీఐఎల్‌లో వాటా విక్రయాన్ని వ్యతిరేకిస్తూ గత జనవరిలో కూడా కార్మిక సంఘాలు అయిదు రోజుల సమ్మె రూపంలో నిరసనకు దిగారు. అయితే రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి సీఐఎల్‌ను ప్రయివేటీకరించమనీ.. కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామని నిర్ధిష్టమైన హామీ లభించడంతో సమ్మెను విరమించిన సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 13, Sep 2019, 8:21 PM IST Highlights హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ ని పెంచి సినిమాకు మరింత హైప్ ని క్రియేట్ చేయాలనీ దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ ని పెంచి సినిమాకు మరింత హైప్ ని క్రియేట్ చేయాలనీ దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 15న నిర్వహించనున్నారు.  శిల్పకళా వేదికలో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానున్న ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేష్ రానున్నారు. చిత్ర యూనిట్ ఈ విషయాన్నీ అధికారికంగా తెలియజేసింది. ఇదివరకే వరుణ్ తేజ్ వెంకటేష్ తో F2 సినిమా ద్వారా దగ్గరయ్యాడు. ఆ సినిమా అత్యధిక లాభాలను అందించి హీరోల కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది.  ఇక ఈ నెల వాల్మీకి సినిమాతో రాబోతున్న వరుణ్ కోసం వెంకటేష్ తనవంతు సహకారాన్ని అందిస్తున్నాడు. పూజా హెగ్డే నటిస్తున్న వాల్మీకి సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా అథర్వ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు .
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అలా చేయడం వల్ల రూ.5 కోట్లు మిగిలాయట రజినీకాంత్ ఇచ్చిన ఓ సలహా వల్ల కబాలి యూనిట్ కి రూ.5 కోట్లు మిగిలాయట. TNN | Updated: Jun 13, 2016, 03:09PM IST రజినీకాంత్ ఇచ్చిన ఓ సలహా వల్ల కబాలి యూనిట్ కి రూ.5 కోట్లు మిగిలాయట. భారీ తారాగణంతో, బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కబాలి. రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా తెరకెక్కుతోంది. రజినీ కన్నా అక్షయ్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కాగా కబాలి ఆడియో ఫంక్షన్ కొన్ని రోజులుగా వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ , మళయాళం భాషల్లో ఆడియో ఫంక్షన్లు నిర్వహించాలని తొలుత చిత్ర యూనిట్ భావించింది. దానికి దాదాపు రూ.5 కోట్ల రూపాయలు ఖర్చుగా తేల్చారు. అయితే మేకప్ టెస్టుల కోసం అమెరికాలో ఉన్న రజినీ కాంత్... టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయని, ఇక ఆడియో ఫంక్షన్లు భారీగా నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పారట. దాంతో అన్ని ఆడియో ఫంక్షన్లు రద్దు చేసి నేరుగా ఆన్ లైన్లోనే పాటలు విడుదల చేశారు. దీంతో చిత్ర నిర్మాతలకు రూ. 5కోట్లు ఖర్చు తగ్గింది.
0business
శ్రీవల్లికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి వాయిస్‌ఓవర్! Highlights ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో శ్రీవళ్లి శ్రీవళ్లి చిత్రం మాంటి ఎరోటిక్ థ్రిల్లర్ అంటున్న విజయేంద్ర ప్రసాద్ తండ్రి దర్శకత్వం వహించిన సినిమాకు తనయుడు రాజమౌళి వాయిస్ ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, విజయేంద్రప్రసాద్ తనయుడు రాజమౌళి వాయిస్‌ఓవర్ చెప్పడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ తండ్రి దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి తనయుడు వాయిస్‌ఓవర్ ఇవ్వడం ఎంతో ఆనందంగా వుంది. ఓ వైవిధ్యమైన కథతో విజయేంద్రప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు.   విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రమిది. పేరున్న నటీనటులు వారి ఇమేజ్‌ను పక్కనపెట్టి  కొత్త తరహా సినిమాలు చేసినా అవి ఆకట్టుకోవడం కష్టం. ప్రేక్షకులకు తొందరగా  రుచించవు.  ఎలాంటి ఇమేజ్‌లేని కొత్త నటీనటులయితే పాత్రల కంటే కథపైనే దృష్టిపెట్టి  సినిమాను బలంగా తెరపై చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నూతన తారలతో ఈ సినిమా చేశాను. ప్రోటాన్స్, న్యూట్రన్స్‌తో పాటు విశ్వాంతరాలలో లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న  ఖగోళాలను మనసుతో చూడగలుగుతున్నాం. అలాంటి మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. పుట్టుకతో ఏ మనిషి దొంగ, వ్యసనపరుడు కాడు. పరిస్థితులే వారిని అలా మారుస్తాయి.  ఆ మార్పును సరిదిద్ది వారిని  స్వచ్ఛమైన మనస్కులుగా మళ్లీ మార్చగలిగితే ఎలా ఉంటుందనే అంశాన్ని సినిమాలో చూపించాం.  ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగం కారణంగా ఆమెకు గతజన్మలోని ప్రియుడితో పాటు  స్మృతులు గుర్తుకువస్తాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది అని తెలిపారు. రాజీవ్‌కనకాల, సత్యకృష్ణ, హేమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్ శ్రీలేఖ, కెమెరా: రాజశేఖర్. --
0business
Suresh 139 Views వేడుకలా 500వ టెస్ట్‌ మ్యాచ్‌ న్యూఢిల్లీ: టెస్టుల్లో టీమిండియా అరుదైన మైలు రాయిని అందుకోనుంది.కాగా 500 టెస్ట్‌కు భారత్‌ సిద్దమైంది.ఈనెల 22న కాన్పూర్‌లో న్యూజి లాండ్‌తో జరిగే తొలి టెస్టు భారత్‌కు 500వ టెస్టు మ్యాచ్‌.దీంతో ఈ చారిత్రక సందర్భాన్ని వేడుకలా నిర్వహించేందుకు బిసిసిఐ ప్రణాళిక రచిస్తుంది. ఇందులో భాగంగా ఈ చారిత్రక మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బిసిసిఐ భారత జట్టు మాజీ కెప్టెన్లను ఆహ్వానించాలని నిర్ణయించింది.ఈ మ్యాచ్‌ కోసం 500వ టెస్టు అని ముద్రించిన ప్రత్యేక వెండి నాణెంతో టాస్‌ వేయనున్నారు.ఇది గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్త రప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం(యుపిసిఎ) అధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా పేర్కొన్నాడు. కాగా యుపిసిఎతో కలిసి బిసిసిఐ మాజీ కెప్టెన్లకు విందు ఏర్పాటు చేస్తుందన్నారు.న్యూజిలాండ్‌,భారత జట్లు కూడా ఇందులో పాల్గొంటాయని ఆయన పేర్కొన్నాడు.ఈ మ్యాచ్‌ సందర్భంగా భారత మాజీ కెప్టెన్లను సన్మానించాలని బోర్డు భావిస్తుందని వెల్లడిం చాడు.ఈ మ్యాచ్‌కి టీమిండియా మాజీ కెప్టెన్లు నారీ కాంట్రాక్టర్‌,చందూ బోర్డే,దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌,కపిల్‌దేవ్‌, రవిశాస్త్రి, గవాస్కర్‌, గంగూలీ, సచిన్‌,సెహ్వాగ్‌,శ్రీకాంత్‌ తదితరులు వేడుకకు హాజ రుకానున్నారు.ఇక బోర్డు,యుపిసిఎ 500వ టెస్టు అని ముద్రించిన టి-షర్టులను మ్యాచ్‌కు హాజరయ్యే పేద చిన్నారులకు పంచనున్నారు. అజరుద్దీన్‌కు మొండిచేయి టెస్టుల్లో టీమిండియా అరుదైన మైలురాయి అం దుకోనుంది.కాగా ఈనెల 22న కాన్పూర్‌లో న్యూజి లాండ్‌తో జరిగే తొలి టెస్టు భారత్‌కు 500వ టెస్టు మ్యాచ్‌.దీంతో ఈ చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భాన్ని ఒక వేడుకలా నిర్వహిం చేందుకు బిసిసిఐ ప్రణాళిక రచిస్తుంది. కాగా ఈ టెస్టు మ్యా చ్‌ కోసం బిసిసిఐ భారీ ఏర్పాట్లు చేస్తుంది. భారత్‌కు 500వ టెస్టు మ్యాచ్‌ కావడంతో దీనికి ఒక ప్రత్యేకతను కల్పించాలని ఉద్దేశంతో బిసిసిఐ స్వయంగా రంగంలోకి దిగి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ టెస్టు మ్యాచ్‌ కోసం ఉపయోగించే టాస్‌ కోసం ప్రత్యేకంగా ఒక వెండి నాణాన్ని రూపొం దించింది.ఈ వెండి నాణెంపై 500వ టెస్టు అని ముద్రించనుంది.అలాగే ఈ చారిత్రక మ్యాచ్‌ సమయంలో బిసిసిఐ జట్టు మాజీ కెప్టెన్లను ఆహ్వా నించాలని నిర్ణయించింది. అంతేకా కుండా మాజీ కెప్టెన్లను సన్మానించాలని బోర్డుభావిస్తుంది. అయితే భారత్‌కు ఘనమైన విజయాలు అందిం చిన మాజీ కెప్టెన్‌ అజహ రుద్దీన్‌ను మాత్రం ఈ వేడుకలకు పిలవడం లేదు. కాగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో కోర్టు అజహర్‌ను నిర్దోషి అని ప్రకటించినా బిసిసిఐమాత్రం ఇంకా వివక్ష చూపుతుండటం పలు విమర్శలకు దాని తీస్తుంది.గతంలో చాలా మంది బోర్డుకు వ్యతి రేకంగా ప్రవర్తించినా ఆ తరువాత కాలంలో క్షమించి అక్కున చేర్చుకున్న బిసిసిఐ అజ హరుద్దీన్‌ విష యంలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంభిస్తుంది. కాగా ఈ చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌కు పలువురు కెప్టెన్లు హాజరవుతున్నారు.
2sports
వ్యవసాయంలో భారీ సంస్కరణలు! -  తయారీలో ఉపాధిని పెంచాలి -  బడ్జెట్‌కు ముందస్తు సూచనలు -  రాజన్‌ ఇతర విధానకర్తలతో జైట్లీ భేటీ   న్యూఢిల్లీ : దేశ ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మలా ఉన్న వ్యవసాయరంగంపై విధానకర్తలు, ఆర్ధికవేత్తల దృష్టి పడింది. ఈ రంగంలో భారీ సంస్కరణలకు తెర లేపాలని ప్రభుత్వానికి వారు సూచించారని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపుల సమావేశంలో భాగంగా బుధవారం పలువురు విధానకర్తలతో ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ భేటీ అయ్యారు. ఆర్ధిక రోడ్‌మ్యాప్‌పై వారితో మంత్రి చర్చలు జరిపారు. ఏడో వేతన సంఘం సిపార్సుల అమలు, ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌ (ఒఆర్‌ఒపి) వ్యయ భారంపై వారు సమీక్షించారు. వివిధ రంగాల నుంచి హాజరైన ప్రతినిధులు వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని, తయారీ రంగంలో ఉపాధి రేటును పెంచాలని సూచించారని సమాచారం. ఈ సందర్బంగా జైట్లీ మాట్లాడుతూ భారత ఆర్ధిక వ్యవస్థ సరైన దిశలోనే కొనసాగుతుందన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్‌ ముందకు సాగుతుందన్నారు. వచ్చే త్రైమాసికాల్లో మరిన్ని సంస్థాగత సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు.   ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు అర్వింద్‌ సుభ్రమణ్యం మధ్యంతర ఏడాది ఆర్ధిక విశ్లేషణ చేశారు. 2016-17కు గాను లక్ష్యాలను తిరిగి అంచనా వేశారు. ఒకే ర్యాంకుకు ఒకే పెన్షన్‌, ఏడో వేతన సంఘం సిఫార్సుల ద్వారా ప్రభుత్వంపై అదనంగా లక్ష కోట్ల భారం పడనుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ అధికారులు ఆర్ధిక ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకున్నారని, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇది సవాల్‌గా మారనుందన్నారు. వ్యవసాయానికి మద్దతు ఇవ్వాలని సుభ్రమణ్యం సూచించారు. ప్రధాన మంత్రి క్రిషి సంచాయి యోజన, రాష్ట్రీయా క్రిషి వికాస్‌ యోజన, ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన తదితర వాటికి 2016-17లో నిధులు పెంచనున్నట్లు ప్రభుత్వం ఇది వరకే సంకేతాలు ఇచ్చింది.     మౌలిక వసతుల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలని ఈ విధానకర్తలు సూచించారు. ఈ రంగంలో ప్రభుత్వం సబ్సీడీ భారీన్ని కూడా తగ్గించుకోవాలని పేర్కొన్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం వివిధ మౌలిక వసతులను ఉపయోగించుకునే వారి నుంచి రుసుం వసూళ్లను పెంచాలి.ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా, ఫైనాన్స్‌ సెక్రటరీ రతన్‌ పి వతల్‌, ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్‌, రెవెన్యూ కార్యదర్శి హస్ముక్‌ ఆదియా, ఆర్ధిక సేవల కార్యదర్శి అంజులి చిబ్‌ దుగ్గల్‌, డిజిన్వెస్ట్‌మెంట్‌ శాఖ కార్యదర్శి నీరజ్‌ కుమార్‌ గుప్తా, సెబీ ఛైర్మన్‌ యుకె సిన్హా, ఐఆర్‌డిఎ ఛైర్మన్‌ టి విజయన్‌, పిపిఆర్‌డిఎ ఛైర్మన్‌ హేమంత్‌ జి కాంట్రాక్టర్‌ ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలోకి అరుసెన్‌ అరంగేట్రం - వివిధ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ఆవిష్కరణ - పండుగల సీజన్‌కు ఆఫర్లతో ముస్తాబు నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ అరుసెన్‌ తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. వైశాలి వీడియో అండ్‌ అప్లియాన్సెస్‌కు (వీవీఏపీఎల్‌)మాతృ సంస్థగా అరుసెన్‌ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. తమ సంస్థ తాజాగా తెలంగాణలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని సంస్థ వీవీఏపీఎల్‌ సంస్థ డైరెక్టర్‌ వినిత్‌ అగర్వాల్‌ తెలిపారు. 2014లో తమ సంస్థ మొదట ఉత్తర్‌ప్రదేశ్‌లో అరుసెన్‌ ఎయిర్‌ కూలర్‌ ఉత్పత్తులను అందుబాటులో తేవడం ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టిందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. అక్కడి నుంచి సంస్థ విజయవంతంగా విస్తరిస్తూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు విస్తరించి ఉందని ఆయన అన్నారు.2018లో కొత్తగా వాషింగ్‌ మిషన్‌లను తమ బ్రాండ్‌ కింద అందుబాటులోకి తెచ్చినట్టుగా ఆయన వివరించారు. రానున్న పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని తమ సంస్థ పలు ఆకర్షణీయమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానుందని ఆయన అన్నారు. సంస్థ హైదరాబాద్‌లో సేల్స్‌ నెట్‌వర్క్‌ మీట్‌ను నిర్వహించింది. విస్తరణ క్రమంలో భాగంగా వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో తాము ఎయిర్‌ కండీషనింగ్‌ ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్నట్టుగా తెలిపారు. తెలంగాణ అరంగేట్రంలో భాగంగా సంస్థ వాషింగ్‌ మెషిన్లను, స్పీకర్‌ సిస్టమ్‌లను, హీటింగ్‌ ఉత్పత్తులను, కొత్త తరహా ఎల్‌ఈడీ టీవీలను మార్కెట్లోకి ఆవిష్కరించింది. తమ సంస్థ ఎయిర్‌ కూలర్లపై రెండేండ్ల వారంటీని, ఎల్‌ఈడీ టీవీలపై మూడేండ్ల వారంటీని అందిస్తున్నట్టుగా ప్రకటించింది. తమ సంస్థకు ఎకనామిక్‌ టైమ్స్‌ అందించే మోస్ట్‌ ప్రామిసింగ్‌ బ్రాండ్‌ అవార్డు (2018) లభించినట్టుగా అరుసెన్‌ తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
అక్కినేని వారి కోడలు సమంత ఇంటి పేరు మార్చేసుకుంది Highlights ఏం మాయ చేసావె సినిమా నుంచే నాగచైతన్యతో సమంత ప్రేమాయణం ఈ అక్టోబర్ 6న వివాహం చేసుకున్న సమంత, నాగచైతన్య సమంత అక్కినేని గా పేరు మార్చుకున్న సమంత రుత్ ప్రభు  అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత తన సోషల్ మీడియా ఎకౌంట్స్ నుంచి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ తన లైఫ్ లో జరిగే హాపెనింగ్స్ అన్నీ.. తాను అప్ డేట్ చేస్తూ తన ఫాలోవర్స్ అందరితోనూ షేర్ చేసుకునేది. ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ ప్లాట్ ఫామ్స్ లో తన విడియోలు, ఫొటోలు, మంచి విశేషాలు అన్నీ పంచుకుంటుంది సామ్.   తాజాగా అక్టోబర్ 6న నాగచైతన్యను పెళ్లిచేసుకుంది సమంత. గోవాలో ఇటు హిందూ సంప్రదాయం, అటు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిన తర్వాత సమంత వివాహానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని కాస్త ఫ్రీ అయినట్లు కనిపిస్తోంది. తాజాగా రాజుగారి గది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సమంత. ఈ చిత్ర విశేశాలను మీడియాతో పంచుకుంది. ఇక త్వరలో హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగార్జున కూడా 15న రిసెప్షన్ నిర్వహిస్తామని ప్రకటించారు కూడా.   మరోవైపు అక్కినేని వారింట కోడలుగా అడుగుపెట్టిన సమంత ఇప్పటి వరకు తన పేరు సమంత రుత్ ప్రభు అని చెప్పుకుంటు ఉండేది. అంతే కాక సోషల్ మీడియా ఎకౌంట్స్ లో కూడా... సమంత రుత్ ప్రభు అని పెట్టుకుంది. కానీ ఇప్పుడు సమంత తన పేరు మార్చేసింది. సమంత అక్కినేనిగా పేరు మార్చుకుని సోషల్ మీడియా సైట్స్ ట్విటర్, ఫెస్ బుక్ లలో “సమంత అక్కినేని” అని పేరు మార్చుకుంది. మొత్తానికి సమంత పెళ్లి తర్వాత చాలా హాపీగా వున్నట్లు కనిపిస్తోంది. Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
England, First Published 10, Sep 2018, 1:54 PM IST Highlights క్రికెట్ అంటే పిచ్చిని కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మరోసారి బయటపెట్టు్కున్నాడు. భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టును వీక్షించేందుకు మాల్యా స్టేడియానికి వచ్చాడు. క్రికెట్ అంటే పిచ్చిని కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మరోసారి బయటపెట్టు్కున్నాడు. భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టును వీక్షించేందుకు మాల్యా స్టేడియానికి వచ్చాడు. తొలి రోజు మ్యాచ్‌ను చూసేందుకు వస్తున్న మాల్యా కారు దిగి లోపలికి వస్తుండగా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మూడో రోజు ఆదివారం కూడా మాల్యా మైదానానికి వెళ్లాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియాను కలిసేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ భారత ప్రభుత్వాన్ని మాల్యా కోరాడు. అయితే విజయ్ మాల్యా అభ్యర్థనను కేంద్రప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై నిరాశ చెందిన మాల్యా చివరి టెస్టు మ్యాచ్‌ను చూసేందుకు వస్తున్నాడు.  Last Updated 19, Sep 2018, 9:19 AM IST
2sports
Visit Site Recommended byColombia బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ, క్రికెట్‌ ఆపరేషన్స్‌ జీఎం సాబా కరీమ్‌కు రాసిన లేఖలో క్రికెట్ అభిమానులు నివ్వెరపోయే విషయాలను మిథాలీ వెల్లడించింది. తనపై వేటు వేసేందుకు సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ తన అధికారాన్ని ప్రయోగించిందని లేఖలో పేర్కొంది. తనపై జరిగిన కుట్రనంతా వివరిస్తూ.. ఆవేదన వ్యక్తం చేసింది. ‘20 ఏళ్ల నా సుదీర్ఘ కెరీర్‌లో తొలిసారి కుంగిపోయా. ఆత్మవిశ్వాసం కోల్పోయా.. ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. అధికారంలో ఉండి నన్ను నాశనం చేయాలని, నా ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టాలని చూసిన కొందరు దేశానికి నేను చేసిన సేవలకు విలువ ఇస్తున్నారా అని ఆలోచించాల్సి వచ్చింది’ అని మిథాలీ వెల్లడించింది. ‘నా దేశానికి ప్రపంచ కప్‌ అందించాలని కోరుకున్నా. సువర్ణావకాశం చేజారినందుకు ఎంతో నిరాశ చెందా.. బాధపడ్డా. సీవోఏ సభ్యురాలిగా డయానా ఎడుల్జీని ఎంతో గౌరవించా. కరీబియన్‌ దీవుల్లోని వాస్తవాలను వివరించిన తర్వాత ఆమె తన అధికారాన్ని ఇలా నాకు వ్యతిరేకంగా ఉపయోగిస్తుందని ఊహించలేదు. నన్ను రిజర్వు బెంచీపై కూర్చోబెట్టడాన్ని ఆమె మీడియాలో సమర్థించడం మరింత ఆవేదనకు గురిచేసింది. అన్ని నిజాలు తెలిసిన తర్వాత కూడా అలా మాట్లాడటం కచ్చితంగా వివక్ష చూపించడమే’ అని మిథాలీ రాసుకొచ్చింది. కోచ్ పొవార్ తీరు నన్నెంతో బాధించింది.. కోచ్‌ రమేశ్‌ పొవార్‌ తనను అవమానించారని మిథాలీ ఆరోపించింది. ఇతరులు నెట్స్‌లో సాధన చేస్తుంటే పొవార్ చూసేవారని, తాను చేస్తుంటే పక్కకు వెళ్లిపోయేవారని తెలిపింది. ఏదైనా మాట్లాడటానికి ఆయన వద్దకు వెళ్తే సెల్‌ఫోన్‌ చూస్తూ నడుచుకుంటూ వెళ్లిపోయేవారని చెప్పింది. ‘ఇది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. నన్ను అవమానించారు. అయినప్పటికీ నేను ప్రశాంతంగానే ఉన్నా’ అని మిథాలీ తన లేఖలో పేర్కొంది. మిథాలీ రాజ్ వెస్టిండీస్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచే కోచ్‌‌తో సమస్య మొదలైందని మిథాలీ వెల్లడించింది. ‘ఆయన నాతో వ్యవహరించే తీరులో వివక్షకు సంబంధించిన గుర్తులు కనిపించాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని గ్రహించా. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సమస్య పరిష్కారం కోసం జట్టు మేనేజర్‌ను కలిసి విషయం చెప్పా. ఈ వ్యవహారం తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఆ తర్వాత పొవార్ నన్ను గుర్తించడమే మానేశాడు’ అని మిథాలీ వెల్లడించింది. మీడియాతో మాట్లాడొద్దని ఆంక్షలు పెట్టారు.. పొవార్ దృష్టిలో జట్టులో తన ఉనికి లేనేలేదని మిథాలీ చెప్పింది. అతడిని పలకరిద్దామన్నా చూపులు పక్కకు తిప్పుకొనే వాడని తెలిపింది. ‘నేను జట్టు మేనేజర్‌ను కలవడంతో ఆయన అహం దెబ్బతిన్నట్టుంది. ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు సాయంత్రం జట్టు సమావేశం ముగిసిన తర్వాత పవార్‌ నా గదికి వచ్చారు. బయట మీడియా ఉండటంతో అక్కడికి రావొద్దని ఆదేశించారు’ అని మిథాలీ వెల్లడించింది. ‘నేను జట్టులో ఉంటే మీడియా ఏం చేస్తుందో అర్థంకాలేదు. చాలా పెద్ద మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు నా సొంత జట్టుతో నన్ను కలవొద్దని పొవార్ చెప్పాడు. అప్పుడు నేను హతాశురాలినయ్యా. నా 20 ఏళ్ల జీవితాన్ని జట్టుకు అంకింతం చేశా. నా కృషికి విలువ లేదా అని ఆలోచిస్తుండగా.. కన్నీరు ఆగలేదు’ అని మిథాలీ ఆవేదన వ్యక్తం చేసింది. హర్మన్‌ప్రీత్‌పై ఏమందంటే.. కోచ్ పొవార్, ఎడుల్జీపై సంచలన ఆరోపణలు చేసిన మిథాలీ రాజ్.. టీ20 జట్టు సారథి హర్మన్‌ప్రీత్‌పై తనకెలాంటి వ్యతిరేకత లేదని తెలిపింది. అయితే తనను జట్టు నుంచి తొలగించాలని చెప్పిన కోచ్‌ నిర్ణయానికి ఆమె మద్దతు ఇవ్వడమే తనకు ఎంతో బాధకలిగించిదని చెప్పింది. హర్మన్ తీరు క్షోభకు గురిచేసిందని మిథాలీ తన లేఖలో రాసింది. మిథాలీ
2sports
Jan 10,2019 కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌లోకి హీరో.. న్యూఢిల్లీ : హీరో గ్రూపునకు చెందిన ఎలక్ట్రానిక్స్‌, టెక్నలాజీ ఉత్పత్తుల సంస్థ హీరో ఎలక్ట్రానిక్స్‌ తాజాగా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సెగ్మెంట్‌లో వచ్చే ఐదేళ్లలో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ (ఎఐ) ఆధారిత 10 ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు హీరో ఎలక్ట్రానిక్స్‌ ఫౌండర్‌, డైరెక్టర్‌ ఉజ్జ్వల్‌ ముంజల్‌ తెలిపారు. ఇందులో హోమ్‌ ఆటోమేషన్‌, ఆటోమోటివ్‌, వైద్య, ఎంటర్‌టైన్‌మెంట్‌ డొమైన్లకు సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయన్నారు. లాస్‌వేగస్‌లో సెస్‌ 2019లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. గ్లోబల్‌ టెక్నలాజీ సంస్థలు అమెజాన్‌, క్వాల్‌కోమ్‌ల భాగస్వామ్యంతో వీటిని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
`ఓం న‌మో వేంక‌టేశాయ‌`నాగార్జున కెరీర్‌లో క‌లికితురాయి - చిరంజీవి Highlights ఓం నమో వెంకటేశాయ సినిమాపై నాగార్జునకు ప్రశంసల జల్లు చిత్రం నాగార్జున కెరీర్ లో కలికితురాయి అని కితాబిచ్చిన మెగాస్టార్ ప్రీమియర్ షో అనంతరం ప్రముఖుల ప్రశంసలు అక్కినేని నాగార్జున ` దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ‘శిరిడిసాయి’ నిర్మాత ఎ. మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సంగీత ప్రియుల‌ను విశేషంగా అల‌రిస్తోంది. కొన్ని వందల‌ సంవత్సరాల క్రితం వేంకటేశ్వర స్వామి, . ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌ అవుతున్న సందర్భంగా . సినీ ప్ర‌ముఖుల కోసం స్పెష‌ల్ షోను ప్ర‌ద‌ర్శించారు. ఈ షో అనంత‌రం.... దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఓం న‌మో వేంక‌టేశాయ ఒక అద్భుతం. సినిమా చివ‌రి అర్ద‌గంట క‌న్నీళ్ళు ఆగ‌లేదు. అన్న‌మ‌య్య త‌ర్వాత అలాంటి గొప్ప వెంక‌టేశ్వ‌ర‌స్వామి సినిమాను అందించిన నాగార్జున‌గారికి, రాఘ‌వేంద్ర‌రావుగారికి, మ‌హేష్ అన్న‌కు థాంక్స్‌`` అన్నారు.  వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ - ``మాట‌ల్లేవ్‌..అన్న‌మ‌య్య త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావుగారు, నాగార్జుగారు అద్భుతాన్ని క్రియేట్ చేసిన సినిమా అవుతుంది. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా`` అన్నారు.  పివిపి మాట్లాడుతూ - ఓం న‌మో వెంక‌టేశాయ ఒక గొప్ప దృశ్య కావ్యం. ఇలాంటి సినిమా చూసే అవ‌కాశం జ‌న్మ‌కు ఒక‌సారి మాత్ర‌మే వ‌స్తుంది. అద్భుతంగా ఉంది. నాగార్జున‌గారు, రాఘవేంద్ర‌రావుగారు, మ‌హేష్‌గారు స‌హా టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.  హీరో సుశాంత్ మాట్లాడుతూ - ``సినిమా చూడ‌గానే ఎమోష‌నల్‌గా అనిపించింది. నాకు తెలియ‌ని విష‌యాలు చాలా నేర్చుకున్నాను. అంద‌రినీ క‌ద‌లించే చిత్ర‌మ‌వుతుంది. అంద‌రూ త‌ప్ప‌కుండా చూడండి`` అన్నారు.  మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``ఓం న‌మో వేంక‌టేశాయ సినిమా చూడ‌ట‌మే వండ‌ర్ ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. భ‌క్తి పార‌వ‌శ్యాలు పెల్లుబుకుతాయి. సెకండాఫ్ హృధ్యంగా ఉండ‌ట‌మే కాదు, సెకండాఫ్ అంతా క‌ళ్ళు చెమ‌ర్చాయి. ప్రతి స‌న్నివేశం అద్భుతంగా ఉంది. సినిమా చూడ‌టం భ‌క్తితో కూడిన ప్ర‌యాణం చేసిన‌ట్టు అనిపించింది. ఇలాంటి సినిమా తీయాలంటే రాఘ‌వేంద్ర‌రావుగారు, చెయ్యాలంటే నా మిత్రుడు నాగార్జున‌, తెర‌కెక్కించాలంటే నిర్మాత మ‌హేష్‌రెడ్డికే చెల్లుతుంది. గ‌తంలో అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడీసాయి చిత్రాల‌కు ధీటుగా ఉండే చిత్రం. నాగార్జున కెరీర్‌లో క‌లికుతురాయిలాంటి చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ. రాఘ‌వేంద్ర‌రావుగారు అద్భుతంగా తీస్తే..న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఇంకా గొప్ప‌గా చేశారు. సినిమా చూస్తే దివ్యానుభూతికి లోన‌వుతారు`` అన్నారు.  పి.వి.సింధు మాట్లాడుతూ - ``సినిమా చాలా గొప్ప‌గా ఉంది. నాగార్జున‌గారు, రాఘవేంద్ర‌రావుగారు స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌. ప్ర‌తి ఒక క్యారెక్ట‌ర్ చాలా బాగా చేశారు. సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ అవుతుంది`` అన్నారు.  నిర్మాత ఎ.మ‌హేష్ రెడ్డి మాట్లాడుతూ - ``ఈ సినిమా గోవిందుడి ప్ర‌యాణం. నాగార్జున‌గారు హ‌థీరాంబావాజీగా ఒదిగిపోయి గోవిందుడిని మై మ‌ర‌పించారు. తిరుమ‌ల‌లో త‌ప్పు చేయ‌కూడ‌ద‌ని, అస‌లు వెంక‌టేశ్వ‌ర‌స్వామికి బాలాజీ అనే పేరు ఎందుకు వ‌చ్చింద‌ని ఇలా ఎన్నో ర‌కాల మెసేజ్‌ల‌ను ఇచ్చారు. రాఘ‌వేంద్ర‌రావుగారు చేసిన అద్భుతం, నాగార్జున‌గారి యాక్టింగ్, కీర‌వాణిగారు సంగీతం, గోపాల్‌రెడ్డిగారి కెమెరా వ‌ర్క్‌, భార‌విగారి క‌థ ఇలా అన్ని ఉన్న సినిమా చూడ‌గానే నా జ‌న్మ ధ‌న్య‌మైపోయింద‌నుకున్నాను`` అన్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఎ.నాగ‌సుశీల‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌, దానం కిషోర్‌, ర‌ఘ‌రామ‌రాజు త‌దితరులు పాల్గొన్నారు. Last Updated 25, Mar 2018, 11:41 PM IST
0business
25వ వ‌సంతంలోకి `మా`...  సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు! Highlights `మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఏర్పాటై 25వ వ‌సంతం సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి రంగం సిద్ధం చిరంజీవి గారు నేను విమానంలో కలిసి చేసిన ఆలోచనే మా అన్న మురళిమోహన్ `మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఏర్పాటై 25వ వ‌సంతంలోకి అడుగు పెట్టిన  సంద‌ర్భంగా `మా` టీమ్ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ఫిలి ఛాంబ‌ర్ లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది.   తొలుత `మా` మాజీ అధ్య‌క్షులు, ఎంపీ ముర‌ళీ మోహ‌న్ చేతుల మీదుగా  ఈ వారంతంలో బ‌ర్త్ డేలు జ‌రుపుకుంటోన్న‌ మా టీమ్ స‌భ్యుల‌కు మెమోంటో లు అంద‌జేశారు. అక్టోబ‌ర్ 4 నుంచి వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ ఈ విధానం కొన‌సాగ‌నుంది.    అనంత‌రం ముర‌ళీ మోహ‌న్ మాట్లాడుతూ, `  25 సంవ‌త్స‌రాలు క్రితం  ఓ ఛారిటీ కార్యక్రమం కోసం వెళ్లి విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి నేను , చిరంజీవి గారు  తిరిగి వ‌స్తుండ‌గా విమానంలో మ‌న‌కంటు ఒక అసోసియేష‌న్ ఏర్పాటు చేసుకుంటే మంచిద‌ని  గాల్లో ప్ర‌యాణిస్తూ తీసుకున్న నిర్ణ‌యం నుంచి పుట్టిందే  `మా`.  అసోసియేష‌న్ ద్వారా ఇన్నేళ్ల పాటు చాలా మంది క‌ళాకారుల‌కు ప‌లు విధాలుగా ల‌బ్ది పొందారు. `మా` ప‌ద‌వులో కొన‌సాగిన వారంతా ఆ ప‌ద‌వికి మ‌రింత‌క క‌ళ‌ను తీసుకొచ్చారు. ఈసారి శివాజీరాజా వంతు వ‌చ్చింది. అది ఆయ‌న ప‌ద‌విలో ఉండ‌గా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు రావ‌డం చాలా సంతోషంగా ఉంది. `మా` పండుగ‌ను మనంద‌రి పండ‌గ గా ఘ‌నంగా చేద్దాం. ఏపీ ప్ర‌భుత్వం `చంద్ర‌న్న భీమా` ప‌థ‌కం స్టార్ట్ చేసింది. అంద‌లో `మా` స‌భ్యులంతా చేరి ఇన్సురెన్స్ స్కీమ్ ను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నా` అని అన్నారు.   `మా` అధ్య‌క్షుడు శివాజీరాజా మాట్లాడుతూ, ` ముర‌ళీ మోహ‌న్ గారు `మా` కు స‌రైన ఆఫీస్ లేక‌పోవ‌డంతో ఆయ‌న ఇంటిలోనే కొన్నాళ్ల పాటు ఆఫీస్ ర‌న్ చేశారు. `మా` ఎంతో మందికి నీడ‌నిచ్చింది. మ‌రెంతో మందికి స‌హాయం గా నిలుస్తుంది. `మా` త‌రుపున‌ న‌రేష్ అధ్య‌క్ష‌త‌న ఇప్ప‌టికే ఒక స‌ర్వే క‌మిటీ ఏర్పాటు చేసి ఎంతో మందికి అన్ని ర‌కాలుగా స‌హాయం అందించ‌డం జ‌రిగింది.  35 మందికి 2500 రూపాయ‌ల‌ను అందించ‌డం, ఉచితంగా ఆరోగ్య కార్డుల‌ను ఇవ్వ‌డం జ‌రిగింది. ఈరోజు రెండ‌వ స‌ర్వే క‌మిటీ కూడా జెండా ఊపి ప్రారంభిస్తున్నాం. `మా` లో ఉన్న ప్ర‌తి ఆర్టిస్ట్ ద‌గ్గ‌ర‌కు నేరుగా వెళ్లి వాళ్ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటిని తీర్చేందుకు ఈ క‌మిటీ ప‌నిచేస్తుంది. మొద‌టి స‌ర్వే క‌మిటీలో  ల‌బ్ది పోందిన వారికి ఈ క‌మిటీ ఉప‌యుక్తంగా ఉండ‌దు.  అలాగే ఎస్. వి. కృష్టారెడ్డిగా రు చైర్మ‌న్ గా ఓల్డేజ్ హోమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. `మా`  అధ్య‌క్ష ప‌ద‌విలో ఎవ‌రున్నా ఐదేళ్లు మాత్రం ఓల్డేజ్ హోమ్ బాధ్య‌త‌ల్నీ ఆయ‌నే నిర్వ‌ర్తిస్తారు. అలాగే ఈ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌ను చిరంజీవి గారు, బాల‌కృష్ణ గారు, వెంక‌టేష్ గారు, నాగార్జున గారు, మోహ‌న్ బాబు గారు మెంట‌ర్స్ గా ఉండ‌టానికి అంగీక‌రించారు. నాగార్జున గారు త‌మ స్టూడియో ల‌ను ఉచితంగా వినియోగించుకోమ‌ని అనుమ‌తి కూడా ఇచ్చారు. ఈరోజు నుంచి ఈనెల 30వ తేదీ వ‌ర‌కూ మా మెంబ‌ర్ షిప్ డ్రైవ్ చేప‌డుతుంది. ల‌క్ష‌ల్లో పారితోషికం తీసుకేనే వాళ్లంతా మెంబ‌ర్ షిప్ తీసుకోవాలి. లేక‌పోతే `మా` నుంచి ఎలాంటి స‌హ‌కారం అంద‌దు. ఇది హె చ్చ‌రిక కాదు. విన్న‌పం మాత్ర‌మే`` అని అన్నారు.   ఎస్. వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ` నాకు అప్ప‌గించిన ఓల్డేజ్ హోమ్  బాధ్య‌త‌ను సంతృప్తిగా స్వీక‌రిస్తున్నా. ఓల్డేజ్ హోమ్ కాదు. గోల్టేజ్ హో మ్ ఇది.  శివాజీ  క‌మిట్ మెంట్, రెస్పాన్స్ బిలిటీ ఈ గ‌ల వ్య‌క్తి. `మా`కోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. `మా` ను మ‌రింత ముందుకు తీసుకెళ్లాలి` అని అన్నారు.   అలాగే సినిమా ఆర్టిస్టుల పై అస‌భ్య‌క‌రంగా రాసిన వెబ్ సైట్ల గురించి `మా` త‌రుపున‌  సైబ‌ర్ క్రైమ్ ఎస్. పి. రామ్మోహ‌న‌రావుకు వినతి ప‌త్రం అందించారు. ఎస్. పి. రామ్మోహ‌న‌రావు మాట్లాడుతూ, ` కొన్ని వెబ్ సైట్ల‌లో సినిమా వాళ్ల గురించి మ‌రీ నీచంగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి.  అది పైశాచిక ఆనందం మాత్ర‌మే. అలాం టి వాళ్ల‌పై త‌ప్ప‌కుండా సైబ‌ర్ క్రైమ్ క‌ఠిన మైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని` హెచ్చ‌రించారు.   అలాగే `మా` స‌హాయ నిధికి న‌టి సూర్య ప్ర‌భ  25000 రూపాయ‌ల చె క్ ను అందించారు. అలాగే  ఇటీవ‌ల చ‌నిపోయిన ప్రొడ‌క్ష‌న్ చీఫ్ చిరంజీవి కుటుంబానికి తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ `మా` ఆధ్వ‌ర్యంలో 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను అందించారు.   ఈ కార్య‌క్ర‌మంలో `మా` వైస్ ప్రెసిడెంట్ బెన‌ర్జీ, జాయింట్ సెక్ర‌టరీ ఏడిద శ్రీరామ్, హేమ‌, ట్రెజ‌ర‌ర్ ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, మెడీ క్లైమ్ చైర్మ‌న్ నాగీనీడు, గౌతంరాజు, అనితా చౌద‌రి త‌దిత‌రులు పాల్గున్నారు Last Updated 26, Mar 2018, 12:02 AM IST
0business
internet vaartha 103 Views హైదరాబాద్‌ : దేశంలో అత్యంతప్రాచుర్యం పొందిన రియల్‌ఎస్టేట్‌ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన అశోకా డెలవపర్స్‌ అండ్‌ బిల్డర్స్‌ చేరింది. ఆలిండియా స్థాయిలో 20వ ర్యాంకు దక్కించుకుంది. డిఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, లోథాగ్రూప్‌లు దేశంలో అత్యంత ప్రాచుర్యంపొందిన సంస్థల్లోనిలిచాయి. ట్రా రీసెర్చ్‌ సహకారంతో బ్లూబైట్స్‌ నిర్వహించిన అధ్యయన నివేదికలో తేలింది. గుర్‌గావ్‌ కేంద్రంగా ఉన్న డిఎల్‌ఎఫ్‌ అత్యంతప్రముఖ రియల్‌ఎస్టేట్‌బ్రాండ్‌గా నిలిచింది. తర్వాతస్థానం ముంబై కేంద్రంగా ఉన్న గోద్రెజ్‌ప్రాపర్టీస్‌ సొంతం చేసుకుంది. మరో రియల్‌ఎస్టేట్‌ డెవలపర్‌ లోథాగ్రూప్‌ మూడోస్థానంలో నిలిచింది. హీరానందాని నాలుగోస్థానంలో ఉన్నట్లు బ్లూబౌట్స్‌ ప్రకటించింది. టాటా హౌసింగ్‌ ఐదోర్యాంక్‌తో నిలిచింది. బెంగళూరుకు చెందిన ప్రెస్టిజ్‌ ఎస్టేట్స్‌ ఆరోస్థానంలో నిలిచింది. ముంబై బయటి ప్రాంతాల్లో కేంద్రీకృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండోసంస్థగా ఈ జాబితాలో చేరింది. టాప్‌ పదిస్థానాల్లో ఎనిమిది రిలయ్ ఎస్టేట్‌ డెవపర్లు ముంబైకేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారే.కె.రహేజాకార్ప్‌ ఏడోర్యాంక్‌లోను, షాపూర్జీ పల్లోంజీ ఎనిమిదోర్యాంక్‌లోఉంది. ఓబరాయ్ రియాల్టీ తొమ్మిదోర్యాంక్‌లో ఉంది. ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ పదోర్యాంక్‌లో నిలిచింది. మొత్తం మీద 57రియల్‌ఎస్టేట్‌ బ్రాండ్లుఈదేశంలో అత్యంత ప్రముఖమైన రియల్‌ఎస్టేట్‌ బ్రాండ్స్‌ జాబితాలోఉన్నాయి. వీటిలో 28బ్రాండ్లు ముంబుకు చెందినవే కావడం గమనార్హం. 14 బ్రాండ్లు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పని చేస్తుంటే మరో 10 బెంగళూరు, మూడు పుణె, చైన్నె, హైదరాబాద్‌ల నుంచి ఒక్కొక్క బ్రాండ్‌ ఉన్నాయి.
1entertainment
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కీల‌క రేట్లను య‌థాత‌థంగా ఉంచిన ఆర్బీఐ అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆర్బీఐ పాల‌సీ స‌మీక్ష‌లో ఎటువంటి సానుకూల నిర్ణ‌యం లేదు. కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను య‌థాతథంగా ఉంచుతూ రిజ‌ర్వ్ బ్యాంక్ నిర్ణ‌యం తీసుకుంది. రెపో రేటును 6%, రివ‌ర్స్ రెపో రేటు 5.75%గా ఉంచారు. న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ నెల‌ల్లో ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం, ద్ర‌వ్య లోటు ల‌క్ష్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పెంచిన నేప‌థ్యంలో కేంద్ర బ్యాంకు రేట్ల మార్పుకు సిద్ధ‌ప‌డ‌లేదు. TNN | Updated: Feb 7, 2018, 03:50PM IST అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆర్బీఐ పాల‌సీ స‌మీక్ష‌లో ఎటువంటి సానుకూల నిర్ణ‌యం లేదు. కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను య‌థాతథంగా ఉంచుతూ రిజ‌ర్వ్ బ్యాంక్ నిర్ణ‌యం తీసుకుంది. రెపో రేటును 6%, రివ‌ర్స్ రెపో రేటు 5.75%గా ఉంచారు. న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ నెల‌ల్లో ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం, ద్ర‌వ్య లోటు ల‌క్ష్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పెంచిన నేప‌థ్యంలో కేంద్ర బ్యాంకు రేట్ల మార్పుకు సిద్ధ‌ప‌డ‌లేదు. *ప్ర‌స్తుతం రెపో రేటు 6.0శాతంగా ఉంది. *రివ‌ర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉంది * మార్జిన‌ల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 6.25%
1entertainment
చివరి రెండు వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు టి20లకు టెయిట్‌,వాట్సన్‌ మెల్బోర్న్‌: టీమిండియాతో మిగిలిన రెండు వన్డేలు ఆడే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది.కాగా స్పిన్నర్‌ లియోన్‌కు చోటు దక్కిగా,పేసర్‌ పారిస్‌ స్థానంలో లియోన్‌ 13 మంది సభ్యుల జట్టులోకి వచ్చాడు.చివరిసారిగా 2014లో వన్డే ఆడిన లియోన్‌, ప్రస్తుత సీజన్‌ బిగ్‌బాష్‌లో బౌలింగ్‌లో తన సత్తా కనబర్చడంతో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.కాగా 20,23 తేదీల్లో చివరి రెండు వన్డేలు జరుగుతాయి.వన్డే జట్టులో స్థానం కోల్పోయిన షేన్‌ వాట్సన్‌తో పాటు షాన్‌ టెయిట్‌ కూడా ఆస్ట్రేలియా టి20 జట్టులోకి ఎంపికయ్యారు.టీమిండియాతో సిరీస్‌కు అనేక కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసిన సెలక్టర్లు బెయిలీ,మిషెల్‌ మార్ష్‌లను ఎంపిక చేయలేదు.కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఏకంగా 17 మందితో జట్టును ప్రకటించడం విశేషం. ఆస్ట్రేలియా టి20 జట్టు. : ఫించ్‌ (కెప్టెన్‌),బొలాండ్‌,బోయేస్‌, ఫాల్కనర్‌,షేస్టింగ్స్‌,హెడ్‌,నాథన్‌ లియోన్‌,క్రిస్‌ లిన్‌,మ్యాక్స్‌ వెల్‌,షాన్‌ మార్ష్‌,స్టీవ్‌ స్మిత్‌,కేస్‌ రిచర్డ్‌్‌సన్‌,షాన్‌ టెయిట్‌,ఆండ్రూ టై,మ్యాథ్యూ వేడ్‌,డేవిడ్‌ వార్నర్‌,షేన్‌ వాట్సన్‌.
2sports
Jan 12,2017 స్టాక్‌ మార్కెట్ల దూకుడు.. ముంబయి: వరుసగా రెండో సెషన్‌లోనూ స్టాక్‌ మార్కెట్లు రాణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంపు వ్యాపార సానుకూల విధానాలను ప్రకటించనున్నారనే అంచనాల్లో బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు రెండు మాసాల గరిష్ట స్థాయికి చేరాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 240.85 పాయింట్లు పెరిగి 27,140.41 పాయింట్లకు చేరువైంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 92.05 పాయింట్లు రాణించి 8,380.65 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబర్‌ 11 తర్వాత తొలిసారి మార్కెట్లు ఈ స్థాయికి చేరాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌ 1.4 శాతం, స్మాల్‌క్యాప్‌ 0.9శాతం చొప్పున పెరిగాయి. మొత్తంగా మదుపర్ల మద్దతుతో 1,079 స్టాక్స్‌ లాభాల్లో ముగియగా, 1,727 స్టాక్స్‌ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. 164 స్టాక్స్‌ యథాతథ స్థాయిలోనే నమోదయ్యాయి. ఐటీి రంగం మినహా మిగితా రంగాలు అన్నీ లాభాల్లోనే ముగిశాయి. లోహ సూచీ అత్యధికంగా 4.42 శాతం పెరిగింది. బ్యాంకింగ్‌ 2.4 శాతం, పీిఎస్‌యూ 1.72 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 1.39 శాతం చొప్పున రాణించాయి. కాగా ఐటీ సూచీ స్వల్పంగా 0.02 శాతం నష్టపోయింది. సెన్సెక్స్‌లో కోల్‌ ఇండియా 5.41 శాతం, టాటా స్టీల్‌ 3.99 శాతం, ల్యూపిన్‌ 2.2 శాతం, ఎల్‌అండ్‌టీ 1.91 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.79 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు బజాజ్‌ ఆటో 0.85 శాతం, ఐటీసీ 0.56 శాతం, రిలయన్స్‌ 0.28 శాతం, ఓఎన్‌జీసీ 0.18 శాతం, ఇన్ఫోసిస్‌ 0.16 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. నాస్‌డాక్‌ సూచీలు రికార్డు స్థాయిలో పెరగడం ఆసియా మార్కెట్లలో విశ్వాసాన్ని నింపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jul 15,2018 తప్పుడు లెక్కలకు ఇక చెల్లు..! ముంబయి: స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ లిస్టెడ్‌ కంపెనీల ఆర్ధిక ఫలితాల ఆడిట్‌, థర్డ్‌పార్టీ నియామ కాలపై నిబంధనలను కఠనత రం చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి సంస్థ ప్రతిపాదనలరను రూపొందిస్తోంది. ఈ నిబంధనల తయారీ కోసం కోటక్‌ కమిటీ సెబీకి కొన్ని సిఫార్సులు చేసినట్లు సమాచారం. కొత్త నిబంధనలను అందుబాటులోకి వస్తే తప్పుడు నివేదికలు ఇచ్చే ఆడిటర్లు, థర్డ్‌పార్టీ వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సెబీకి అధికారులు దక్కనున్నాయి. ఆడిటర్లు కంపెనీ ఆడిట్‌ కమిటీకి రాతపూర్వకంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలపై సెబీ అభిప్రాయసేకరణ ప్రారంభించింది. మరో 30 రోజుల్లో ఈ అభిప్రాయసేకరణ ముగుస్తుంది. ప్రస్తుతం మర్చెంట్‌ బ్యాంకర్లు, క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు, కస్టోడియన్స్‌ తదితర సంస్థలు సెబీ వద్ద రిజిస్టర్‌ చేయించుకోవాల్సి వుంటుంది. కాగా ఆడిటర్లు, కంపెనీ సెక్రటరీలు, ఆర్ధిక అంశాల విలువ కట్టేవారు నేరుగా సెబీ పరిధిలోకి రారు. కంపెనీకి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు నివేదికలు ఇచ్చే వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం కంపెనీ బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్స్‌కు ఉండాలనేది సెబీ ప్రతిపాదనల్లో ఒక్కటి. పైగా కంపెనీలకు సంబంధించి ఆడిటర్లు తాము ఇచ్చిన నివేదకలోని అన్ని అంశాలు పూర్తి స్థాయిలో పరిశీలించి ఇచ్చినవే అని హామీ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.13,500 కోట్ల పైగా మోసం వెలుగు చూసిన నేపథంయలో ఆడిటింగ్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఎట్టకేలకు మార్కెట్లోకి గెలాక్సీ నోట్‌-9 -  పెద్ద తెర, అత్యధిక మెమోరీతో లభ్యం న్యూయార్క్‌: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తోన్న శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ -9 ఫోన్‌ ఎట్టకేలకు విడుదలైంది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో శాంసంగ్‌ ఈ ఫోన్‌ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. నోట్‌ సిరీస్‌లో ఇప్పటివరకు ఉన్న మోడళ్ల కంటే అతిపెద్ద బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే కలిగి ఉండటం నోట్‌ 9 ప్రత్యేకత. అంతేగాక.. ఈ ఫోన్‌ మొత్తం 1 టెరాబైట్‌ మెమోరీని సపోర్ట్‌ చేయగలగడం అదనపు ప్రత్యేకత. అంటే.. నోట్‌ 9లో 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో పాటు మెమొరీ కార్డు ద్వారా మరో 512 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే సదుపాయం ఉంటుంది. అమెరికా మార్కెట్లో నోట్‌ 9 ప్రారంభ ధర 999డాలర్లుగా ఉంది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 999డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 68,700), 8జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 1,250డాలర్లు (దాదాపు రూ. 85,900)గా ఉంది. అయితే ఈ ఫోన్‌ భారత్‌కు ఎప్పుడు వస్తుందన్న దానిపై శామ్‌సంగ్‌ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ కొత్త నోట్‌9 ఫోన్‌ 1440ఐ2960 క్వాడ్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌తో 6.4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేతో లభించనుంది. నోట్‌ సిరీస్‌లో ఇప్పటి వరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లేలతో పోలిస్తే నోట్‌ 9 డిస్‌ప్లేనే పెద్దది. నోట్‌ 9 బ్యాటరీ 4000ఎంఏహెచ్‌ సామర్థ్యంతో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్‌కు 40 సెకన్ల పాటు ఛార్జింగ్‌ పెడితే 30 నిమిషాలు వినియోగించుకోవచ్చని శామ్‌సంగ్‌ తెలిపింది. వెనుకవైపు రెండు 12 మెగాపిక్సెల్‌ , ముందు 8 ఎంపీ కెమెరాలను ఇందులో అమర్చారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 26, Aug 2018, 12:34 AM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2 శనివారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. కౌశల్, తనీష్ గొడవ పడడం.. దీప్తిని కెప్టెన్ గా తొలగించడం వంటి విషయాలతో షో ఆసక్తికరంగా నడిచింది. కౌశల్, తనీష్ లు గొడవ పడ్డందుకు నాని వారికి చురకలు అంటించారు.  బిగ్ బాస్ సీజన్ 2 శనివారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. కౌశల్, తనీష్ గొడవ పడడం.. దీప్తిని కెప్టెన్ గా తొలగించడం వంటి విషయాలతో షో ఆసక్తికరంగా నడిచింది. కౌశల్, తనీష్ లు గొడవ పడ్డందుకు నాని వారికి చురకలు అంటించారు. గీతామాధురితో మాట్లాడిన నాని ఆమెకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందంటూ కామెంట్స్ చేశారు. గత రెండు వారాలుగా హౌస్ లో గీతామాధురి ప్రవర్తన పట్ల ప్రేక్షకుల్లో వస్తోన్న విమర్శలపై పరోక్షంగా ఆమెపై విరుచుకుపడ్డాడు నాని. గతంతో పోల్చుకుంటే నీలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని.. మహా అయితే ఏం చేస్తారులే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావంటూ, దీనివల్ల నష్టపోయే ఛాన్స్ ఉందంటూ చెప్పాడు నాని. ఆ తరువాత గీతా.. కౌశల్ గురించి నానితో చెబుతూ.. అతడి నుండి తప్పించుకొని తిరగాల్సి వస్తుందని, అతడు నాలాగే ఆడాలి, నాలాగే ఉండాలని చెప్పడం తనకు నచ్చలేదంటూ గీతా వెల్లడించింది. కామన్ మ్యాన్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన గణేశ్ ని టార్గెట్ చేసిన నాని.. దీప్తి ఎలిమినేట్ కావడానికి, కౌశల్-తనీష్ గొడవ పడడానికి మెయిన్ రీజన్ నువ్వు పడుకోవడమని దీనిపై వివరణ ఇవ్వాలని నాని గణేష్ ని అడిగారు. నువ్వు కామన్ మ్యాన్ అనే ఒక్క కారణంతోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావని, లేదంటే నీ పెర్ఫార్మన్స్ కి ఎప్పుడు ఎలిమినేట్ అయ్యేవాడివంటూ అతడిపై ఫైర్ అయ్యాడు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారే విషయాన్ని నాని రివీల్ చేయకుండా సస్పెన్స్ కొనసాగించారు.  Last Updated 9, Sep 2018, 1:51 PM IST
0business
Hyderabad, First Published 26, Sep 2018, 11:27 AM IST Highlights బాలీవుడ్ లో పేరున్న నటుల్లో నానాపటేకర్ ఒకరు. హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లో నటించడమే కాకుండా.. నేషనల్ లెవెల్ లో అవార్డులను సైతం దక్కించుకున్న నానా పటేకర్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని, మహిళలను కొడతాడని షాకింగ్ కామెంట్స్ చేసింది నటి తనుశ్రీ దత్తా. బాలీవుడ్ లో పేరున్న నటుల్లో నానాపటేకర్ ఒకరు. హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లో నటించడమే కాకుండా.. నేషనల్ లెవెల్ లో అవార్డులను సైతం దక్కించుకున్న నానా పటేకర్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని, మహిళలను కొడతాడని షాకింగ్ కామెంట్స్ చేసింది నటి తనుశ్రీ దత్తా. 2009లో 'హార్న్ ఒకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాన్ని వెల్లడించింది. ''నానా పటేకర్ గొప్ప నటుడు కావొచ్చు.. కానీ అతడికి మహిళల పట్ల కనీసపు గౌరవం ఉండదు. అతను నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. కానీ ఎవరూ మాట్లాడరు. కనీసం అతడిని సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్ కూడా చేయరు. అక్షయ్ కుమార్, రజినీకాంత్ లాంటి పెద్ద పెద్ద హీరోలు నానాపటేకర్ లాంటి నేరస్తులతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చినా ఫలితం ఉండదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. ''జనాలు ఈ విషయాల గురించి గుసగుసలాడుతారే తప్ప ధైర్యంగా బయటకి మాట్లాడలేరు. ఇలాంటి దారుణాలు చేసే వ్యక్తులను వదిలేసి మా గురించి తప్పుగా మాట్లాడతారు'' అంటూ బాధను వ్యక్తం చేసింది.     సంబంధిత వార్త..
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ఫండ్ల నుంచి త‌ర‌లిపోతున్న సంప‌ద‌ మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి సంప‌ద త‌ర‌లిపోతూనే ఉంది. ఒక్క మే నెల‌లోనే మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి ఇన్వెస్ట‌ర్ల రూ.66,000 కోట్ల మేర‌కు త‌మ సొమ్మును వెనక్కు తీసుకున్నారు. Samayam Telugu | Updated: Jun 9, 2018, 10:13AM IST మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి సంప‌ద త‌ర‌లిపోతూనే ఉంది. మే నెల‌లో మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పరిశ్రమ నిర్వహణ ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.66,000 కోట్లు తగ్గి రూ.22.6 లక్షల కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా ఇన్‌కమ్‌, లిక్విడ్‌ పథకాల నుంచి మదుపర్లు ఎక్కువగా పెట్టుబడులు వాపసు తీసుకున్నారు. ఎంఎఫ్‌ పరిశ్రమలో ఉన్న మొత్తం 42 సంస్థల ఏయూఎం ఏప్రిల్‌లో రూ.23.25 లక్షలు ఉన్నట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫి) దగ్గరున్న సమాచారం. మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను (ఎల్‌టీసీజీ) విధించడంతో మార్చిలో ఎంఎఫ్‌ల నుంచి మదుపర్లు రూ.50,752 కోట్లు వెనక్కు తీసుకున్నారు. అయితే ఏప్రిల్‌లో రూ.1,40,000 కోట్లు మళ్లీ పెట్టుబడులు పెట్టారు. మేలో లిక్విడ్‌ ఫండ్ల నుంచి రూ.46,724 కోట్లు, ఇన్‌కమ్‌ ఫండ్ల నుంచి రూ.20,000 కోట్లకుపైగా నిధులు వెనక్కు తీసుకున్నారు.
1entertainment
May 10,2015 జీఎస్‌టీ ఆర్థిక సమగ్రతను చాటుతుంది : జైట్లీ              న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) దేశ ఆర్థిక సమగ్రతను చాటుతుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. జీఎస్‌టీ వల్ల దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పన్ను విధానం అమలులోకి వస్తుందని అన్నారు. దీంతో భారతావని అంతా ఒకే మార్కెట్‌ అనే భావన కలుగుతుందన్నారు. ఇది ఆర్థిక సమగ్రతకు దారి తీస్తుందని ఆయన వివరించారు. జీఎస్‌టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా కొన్ని పార్టీలు దేశ ప్రగతికి అడ్డుపడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇక్కడ సామాజిక భద్రతలో భాగంగా ప్రవేశపెట్టిన మూడు కొత్త పథకాలను ఆయన ఇక్కడ ప్రారంభించారు. ఎక్సైస్‌, సేవా, వస్తువులపై పన్ను వంటి పలు ప్రత్యక్ష పన్నులకు స్థానంలో ప్రతిపాదించిన జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకొనేందుకు వారి వద్ద సంఖ్యా బలం లేదని పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తుసేవల పన్ను విధానాన్ని సమర్థిస్తున్నట్లు ఆయన వివరించారు. జీఎస్‌టీని వ్యతిరేకించిన వారు అందులో సఫలం కామని తెలిసి జీఎస్‌టీ రాజ్యాంగ సవరణనలో జాప్యం చేసేలా పన్నాగాలు పన్నుతున్నట్లు ఆయన ఆరోపించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
“గ్యాంగ్ లీడర్” మూవీ రివ్యూ First Published 13, Sep 2019, 1:12 PM IST నాని సినిమా అంటే ఓ కొత్త తరహా కథ, దానికి కామెడీ ట్రీట్మెంట్, ఓ మోస్టరు ఎమోషన్ కలగలిపిన ప్యాకేజి. డైరక్టర్ విక్రమ్ కే కుమార్ ది ఓ డిఫరెంట్ స్కూల్. కొత్త నేపధ్యం, వెరైటీ ట్విస్ట్ లు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగలిగిన లగేజి. (Review By --సూర్య ప్రకాష్ జోశ్యుల) నాని సినిమా అంటే ఓ కొత్త తరహా కథ, దానికి కామెడీ ట్రీట్మెంట్, ఓ మోస్టరు ఎమోషన్ కలగలిపిన ప్యాకేజి. డైరక్టర్ విక్రమ్ కే కుమార్ ది ఓ డిఫరెంట్ స్కూల్. కొత్త నేపధ్యం, వెరైటీ ట్విస్ట్ లు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగలిగిన లగేజి. వీరిద్దరూ కలిస్తే ఖచ్చితంగా అంతకు మించి అన్న ప్రొడక్ట్ ఎక్సెపెక్ట్ చేస్తాం. దానికి తోడు మెగాస్టార్ సూపర్ హిట్ టైటిల్ ని సైతం సొంతం చేసుకుని ఆద్యంతం నవ్విస్తామంటూ హామీ ఇస్తూ మన ముందుకు వచ్చారు. వీళ్ల హామీలను నెరవేర్చారా,ఫన్ తో సినిమాని నింపేసారా, అసలు కథేంటి..కొరియా సినిమా నుంచి కాన్సెప్ట్ లేపారనే టాక్ నిజమేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. కథేంటి : ఐదుగురు మెంబర్స్ టీమ్ గా కలిసి ఓ బ్యాంక్ ను దొంగతనం చేస్తారు. అయితే ఆ దొంగతనం సక్సెస్ ఫుల్ గా పూర్తికాగానే ఒకడు వాళ్లని లేపేసి ఆ దోచిన మొత్తం 300 కోట్లు లేపేసి పారిపోతాడు. పోలీస్ లు కూడా ఆ దొంగ ఎవరనేది ట్రేస్ చేయలేకపోతారు. ఓ 14 నెలల తర్వాత వేర్వేరు వయస్సులలో ఉన్న ఐదుగురు ఆడవాళ్లు కలుస్తారు. వాళ్ళంతా ఆ దొంగతనం లో చనిపోయిన వాళ్లకు చెందిన వాళ్లు. వాళ్లంతా ఓ టీమ్ గా ఏర్పడి ఆ డబ్బు కొట్టేసి పారిపోయిన ద్రోహిపై పగ తీర్చుకోవాలనుకుని, ఆ డబ్బు సొంతం చేసుకోవాలనుకుంటారు. అయితే తమకు ఓ తెలివైన బుర్ర తోడు ఉంటే బెస్ట్ అని ది బెస్ట్ క్రైమ్ రైటర్ రివేంజ్ నవలా స్పెషలిస్ట్ ...పెన్సిల్ పార్ధసారధి (నాని)ని కలుస్తారు. నువ్వే మా గ్యాంగ్ కు లీడర్ గా ఉండాలని అడుగుతారు. పెన్సిల్ పార్దసారధి (నాని) ఓ పెద్ద నవలా రచయిత అవ్వాలని జీవితాశయం. ఎవరు సలహా ఇచ్చారో ఏమో కానీ హాలీవుడ్ క్రైమ్ సినిమాలను తెలుగులో నవలలుగా రాస్తూంటాడు. (అఫ్ కోర్స్ తెలుగులో నవల రచయితలకు మార్కెట్ పడిపోయిందనే విషయం గమనించినట్లు లేడు. లేకపోతే ఆ హాలీవుడ్ సినిమాలనే తెలుగు సినిమా కథలుగా మార్చి అమ్ముకుందుడేమో). అయితే అతని నవలలు ఏవీ క్లిక్ కాకపోవటంతో ..తన స్నేహితుడు (ప్రియదర్శి) సలహాపై వాళ్లకు సాయిం చేయటానికి ఒప్పుకుంటాడు. వాళ్లతో చేసే రియల్ క్రైమ్ ఇన్విస్టిగేషన్ జర్నీని ఆ తర్వాత నవలగా రాసి ఫేమస్ అవ్వపోవచ్చని స్కెచ్ వేస్తాడు. అలా నాని ఆ కేసుని ఇన్విస్టిగేట్ చేస్తూ మెల్లిగా ఆ గ్యాంగ్ మెంబర్స్ లో ఒకరైన ప్రియ (ప్రియాంక మోహన్) తో ప్రేమలో పడతాడు. ఆమె చనిపోయిన వాళ్లలో ఒకతనికి ఫియాన్సి. ఆమెతో నిన్ను చూసిన అందంలో అంటూ పాట కూడా పాడుకుంటాడు. ఇలా ఈ రైటర్ గారు అటు లవ్ ని ఇటు క్రైమ్ ఇన్విస్టిగేషన్ ని బాలెన్స్ చేస్తూంటాడు. అప్పుడు సీన్ లోకి దేవ్ (కార్తికేయ)వస్తాడు. అతను ఆలిండియా లో నెంబర్ వన్ రేసర్. డబ్బు కోసం ఎంతదైనా తెగించే మనస్తత్వం.. తన తండ్రిని కూడా డబ్బు కోసం లేపేసే క్రూరత్వం ఉంటాయి. అతనే ఈ బ్యాంక్ దొంగతనం కేసులో అసలైన ద్రోహి అని కనిపెట్టి ..వీళ్లంతా కలిసి నాని నేతృత్వంలో పగ తీర్చుకోవాలనుకుంటారు. అప్పుడు ఏమైంది.. ఈ క్ర‌మంలో ఎలాంటి ట్విస్ట్‌లు వ‌చ్చాయి..? మొదట బ్యాంక్ దొంగతనం చేసిన ఆ ఐదుగురు ఎవరు...నాని చివరకు సక్సెస్ ఫుల్ రైటర్ గా అవ్వగలిగారా, అతని లవ్ స్టోరి ఓ కొలిక్కి వచ్చిందా వంటి విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమాను చూడాల్సిందే. కథ,కథనం ఎలా ఉన్నాయంటే.. : మొదటగా నాని లాంటి హీరో దొరికాడు కదా అని ....ఏదో రెగ్యులర్ కమర్షియల్ కామెడీ సినిమా చేయాలనుకోకుండా కొత్త తరహా కథ చెప్పాలన్న ఆలోచన వచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ని అభినందించాలి. ఇదొక మిక్సెడ్ జానర్ ఫిలిం. ఫన్, క్రైమ్, సెంటిమెంట్, యాక్షన్ అన్ని కలగాపులగంగా వస్తూంటాయి. సినిమా ప్రారంభం బ్యాంక్ దొంగతనం బ్లాక్ చాలా స్టైలిష్ గా ఇంట్రస్టింగ్ తీయటంతో మనం హుక్ అయ్యిపోతాం. అయితే అప్పుడు పెరిగిన ఎక్సెపెక్టేషన్స్ తర్వాత వచ్చే సీన్స్ రీచ్ కాలేదు. చాలా ప్లాట్ గా ఉందనిపిస్తుంది. ట్రైలర్ లో చెప్పిన కథతోనే దాదాపు ఫస్టాఫ్ మొత్తం నడుస్తుంది. దాంతో పెద్దగా కథేమీ జరిగినట్లు అనిపించదు. తెలిసిన విషయం మళ్లీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే నాని కామెడీ ...పగలబడి నవ్వేలా ఉండదు. దానికి తోడు స్లో నేరేషన్ తో కదులుతూంటుంది. అంటే కాంప్లిక్ట్ లేని కథా సెటప్ ఇంట్రస్ట్ కలిగించలేదన్నమాట. అయితే ఎప్పుడైతే కార్తికేయ పాత్ర ఎంటరైందో అప్పుడు కథలో వేడి పుడుతుంది. ఆ పాత్ర తో జర్నీ పెద్దగా లేకుండా ఇంటర్వెల్ వస్తుంది. సెటప్ అంతసేపు కాకుండా కాస్త తగ్గించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ కథ లో ట్విస్ట్ లు వచ్చినట్లు అనిపించినా అవీ పెద్దగా కిక్ ఇవ్వవు. ఎందుకంటే అవన్నీ ప్రెడిక్టుబుల్ గానే ఉంటాయి. అయితే జెన్యూన్ గా నవ్వులు అక్కడే ఉన్నాయి. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ హై ఇవ్వలేకపోయాయి. చివరి ఇరవై నిముషాలు జస్ట్ ఓకే..ఈ కథ ఇక ఇలాగే ముగిస్తారు అన్నట్లుగా సీన్స్ నడుస్తూంటాయి. ఎమోషనల్ డెప్త్ మిస్ : ఎంత కామెడీ సినిమా అయినా ఎక్కడో చోట గుండెలను స్పృశించకపోతే ఏవో నాలుగు జోక్స్ చూసి బయిటకు వచ్చినట్లు అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది. కాసేపు నవ్వుకున్నా...సినిమా పట్టి ఉంచి నిలబెట్టే ఎమోషనల్ బ్లాక్స్ మిస్సయ్యాయి. రైటర్ పార్దసారధితో మనం ఎందుకు జర్నీ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే అతనేమీ కష్టంలో పడలేదు. కష్టాల్లో ఉన్నవాళ్లను సాయిం చేయాలి అనుకోలేదు. రివేంజ్ తీర్చుకునే వాళ్లకు సాయిం చేయాలనుకుంటాడు. దాంతో ఆ పాత్రను మనం లైట్ తీసుకుంటాం కానీ ఓన్ చేసుకోము. తీసిపారేసే సినిమా కాదు : అలాగని ఈ సినిమా మరీ ఒక్కసారి కూడా చూడటం వేస్ట్ అనుకునే వ్యవహారం కాదు. సరదాగా ఓ వీకెండ్ కాలక్షేపానికి లోటు ఉండదు. డీసెంట్ గా ఉండే సినిమా...అదీ నానీ హీరో కాబట్టి ఫ్యామిలీలకు కూడా కదలచ్చు. హైలెట్స్ : ఈ సినిమాకు కొత్త తరహా స్టోరీ లైన్, నాని, కార్తికేయ కలిసి నటించటం, చిన్న చిన్న ట్విస్ట్ లు, సెకండాఫ్ లో వచ్చే ఫన్. అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమా మొత్తాన్ని భుజంపై మోసిన నాని సామర్ధ్యం. ప్రొడక్షన్ వ్యాల్యూస్. కొరియా సినిమా తో పోలిక :ఈ సినిమాకు 2008లో వచ్చిన యాక్షన్ కామెడీ Girl Scouts కు థీమ్ లో మాత్రమే పోలిక ఉంది. Girl Scoutsలో నలుగు ఆడవాళ్లు సూపర్ బజార్ పెడదామని దాచుకున్న డబ్బుని క్రెడిట్ యూనియన్ సీఈవో లేపేస్తే , మోసపోయిన వాళ్లంతా ఓ గ్యాంగ్ గా ఏర్పడి ట్రాక్ చేసి పట్టుకుని ఆ డబ్బుని ఎలా వెనక్కి రికవరీ చేసుకున్నారనే పాయింట్ చుట్టూ ఫన్ గా తిరుగుతుంది. గ్యాంగ్ లీడర్ లో ఆ పాయింట్ అంతర్గతంగా కనపడుతుంది కానీ ఆ ట్రీట్మెంట్ వేరు..ఈ సినిమా వేరు. ప్రేరణ పొందారేమో కానీ కాపీ అయితే కాదు. ఫైనల్ థాట్: అల్లరి నరేష్ సినిమాని నాని చేసినట్లుంది. Rating: 2.5 / 5
0business
Questions about Aamir Khan irk nephew Imran FOLLOW US ON 1 View | ఆ ప్రశ్నలడిగితే వీళ్ళకు నచ్చదుట?! బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ వారసత్వంతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అతని మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తరువాత్తరువాత తనంటే ఏమిటో నిరూపించుకున్నాడు. నటుడిగా మెప్పించాడు. అయితే, చాలామంది తనను ఇంకా ఆమీర్ ఖాన్ మేనల్లుడిగానే చూస్తుండటం ఇమ్రాన్ కు నచ్చడంలేదుట. ఆ విషయాన్ని అతగాడే స్వయంగా చెప్పాడు. నన్ను కలిసినప్పుడల్లా మేనమామ ఆమీర్ ఖాన్ గురించి ఎవరయినా ప్రశ్నలడగడం ప్రారంభిస్తే వెంటనే వారి చెంపలు వాయించేసి అక్కడి నుండి వెళ్లిపోవాలనేంత చిరాకొస్తుందని హిందూస్తాన్ టైమ్స్.కామ్ ఇంటర్వ్యూలో తెలిపాడు. అలాగే కంగనా రనౌత్ కూడా ఇటీవలి కాలంలో తాను చిరాకు పడిన సందర్భాన్ని షేర్ చేసుకుంది. సెల్ఫీలు తీసుకునే నెపంతో ఎవరయినా తన శరీరానికి తమ శరీరాన్ని ఆనించేసి నడుం చుట్టూ చేతులేసేసినపుడు తన ఒళ్లంతా తేళ్లు జర్రులు పాకినట్లనిపిస్తుందని చెప్పుకొచ్చింది. Press CTRL+C to copyX <iframe src="//tvid.in/0_oa5txtz8/lang?autoplay=false" style="height: 100%; width: 100%; max-height: 100%; max-width: 100%; visibility: visible;" border="0" frameborder="0" seamless="" scrolling="no" allowfullscreen="true" mozallowfullscreen="true" allowtransparency="true"></iframe> Facebook
0business
Hyderabad, First Published 2, Oct 2019, 8:56 AM IST Highlights సాహాకి గాయం అవ్వడం కారణంగానే అప్పుడు పంత్ కి చోటు దక్కింది. అయితే... పంత్ అనుకున్నస్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతని ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. గత నెలలోజరిగిన విండీస్ పర్యటనలో అనవసరపు షాట్లు ఆడి పంత్ మరింత విమర్శలు ఎదుర్కొన్నాడు. టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ని దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు మ్యాచ్ కి దూరం పెట్టేశారు. ఈ విషయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వయంగా వెల్లడించారు. పంత్ స్థానంలో సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహాను తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. గతేడాది జనవరిలో గాయం కారణంగా సాహా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. శస్త్ర చికిత్స అనంతరం సాహా ఇంతకాలం రెస్టు తీసుకున్నాడు. సాహాకి గాయం అవ్వడం కారణంగానే అప్పుడు పంత్ కి చోటు దక్కింది. అయితే... పంత్ అనుకున్నస్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతని ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. గత నెలలోజరిగిన విండీస్ పర్యటనలో అనవసరపు షాట్లు ఆడి పంత్ మరింత విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ కి అతనిని దూరం చేసినట్లు తెలుస్తోంది. అయితే... పంత్ ని పక్కన పెడుతూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారంటూ అభిమానులు ట్విట్టర్ లో పేర్కొనడం విశేషం. పంత్ కన్నా సాహానే అద్భుతమైన కీపర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. పంత్ తన ఆటను మెరుగుపరుచుకోవాలని కొందరు సూచిస్తుండటం విశేషం. ఇంకొందరేమో పంత్ కి ఇచ్చి గుణపాఠం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  Last Updated 2, Oct 2019, 8:56 AM IST
2sports
Suresh 196 Views women cricket భారత్‌ మహిళల టి20 కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌కౌర్‌ న్యూఢిల్లీ: భారత మహిళల టి20 జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంపికైంది.చాలా కాలంగా జట్టు సారథిగా ఉన్న మిథాలీ రాజ్‌ను వన్డేలకు మాత్రమే పరిమితం చేశారు.కాగా ఆమె టి20 జట్టులో స్థానం సంపాదించింది.నవంబర్‌ 10 నుంచి వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది.నవంబర్‌ 27 నుంచి థా§్‌ులాండ్‌లో ఆసియా కప్‌ జరుగనున్న సమయంలో బిసిసిఐజట్టును ప్రకటించింది. మూడు వన్డేలు,మూడు టి20ల విండీస్‌పర్యటకు విజయవాడ వేదిక కానుంది.
2sports
Hyd Internet 84 Views GOOGLE google హైదరాబాద్‌: గూగుల్‌ తన వెబ్‌ రేంజర్స్‌ పోటీ మూడో ఎడిషన్‌ను ప్రకటించింది. ఇంటర్నెట్‌ సురక్షితపై మరియు డిజిటల్‌ సిటిజన్‌షిప్‌పై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. టీనేజర్లు తమ దాగిన నింజాస్‌ను కనుగొనేలా వారిని ప్రోత్సహించడం ఈ పోటీ లక్ష్యం. సైబర్‌ సురక్షిత ప్రాధాన్యాన్ని చాటిచెబుతూ వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది తోడ్పడుతుంది. వచ్చిన వేలాది ఎంట్రీలను పరిశీలించిన తరువాత, స్మార్ట్‌గా, సురక్షితంగా, ఆన్‌లైన్‌ సావీగా ఉండే ఏడు మంది వెబ్‌రేంజర్లకు గూగుల్‌ రివార్డులందిస్తుంది. దేశవ్యాప్తంగా 10 నుంచి 17ఏళ్లలోపు విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. తమకు నచ్చిన విభాగంలో పాల్గొని తమ సృజనాత్మకతను, నైపుణ్యాలను పరీక్షించుకోవచ్చు.
1entertainment
Hyderabad, First Published 11, Sep 2018, 5:24 PM IST Highlights 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్నా.. 'గీత గోవిందం' చిత్రంతో తెలుగులో టాప్ లీగ్ లోకి వెళ్లిపోయింది. నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని రెమ్యునరేషన్ గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్నా.. 'గీత గోవిందం' చిత్రంతో తెలుగులో టాప్ లీగ్ లోకి వెళ్లిపోయింది. నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని రెమ్యునరేషన్ గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగులో అంతగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఇదివరకే నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయింది. అయితే తన కెరీర్ దృష్ట్యా ఇప్పుడు ఆ నిశ్చితార్దాన్ని రద్దు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయంపై రక్షిత్ శెట్టికి సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎక్కువవుతుండంతో తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. తన అభిమానులు సోషల్ మీడియాలో తరచూ పెళ్లి గురించి అడుగుతుండడంతో రక్షిత్ వారికి సమాధానాలు చెప్పలేక సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడు. అదే విషయాన్ని అభిమానులకు చెబుతూ.. ఇన్నాళ్లు ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాకి గుడ్ బై చెబుతూ పోస్ట్ పెట్టాడు. దీంతో రష్మికతో బ్రేకప్ అయిన కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఉంటే పదే పదే అవే ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి.  Last Updated 19, Sep 2018, 9:23 AM IST
0business
Visit Site Recommended byColombia సిడ్నీ టెస్టు నుంచి ఓపెనర్ అరోన్ ఫించ్‌ని తప్పించి అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్‌తో ఓపెనింగ్ చేయించాలని స్టీవ్‌ వా.. ఆస్ట్రేలియా టీమ్‌కి సూచించాడు. ఇక షాన్ మార్ష్ ఆడుతున్న 4వ స్థానంలో ట్రావిస్ హెడ్‌ని ఆడించాలని.. అతని తర్వాత కెప్టెన్ టిమ్‌పైన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఒక స్థానం ముందుకొస్తే మంచిదని స్టీవ్‌ వా అభిప్రాయపడ్డాడు. ఇక ఫించ్‌ స్థానంలో తుది జట్టులోకి యువ ఆల్‌రౌండర్ మార్నస్‌‌కి చోటిస్తే టీమ్‌లో సమతూకం ఏర్పడుతుందని సూచించిన ఈ దిగ్గజ క్రికెటర్.. హారిస్, షాన్ మార్ష్ ఓపెనింగ్ జోడీ సత్తాచాటగలదని ధీమా వ్యక్తం చేశాడు. భారత జట్టులోనూ మూడో టెస్టుకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌పై వేటు పడింది. వారి స్థానంలో మయాంక్ అగర్వాల్, హనుమ విహారిని మెల్‌బోర్న్ టెస్టులో ఆడించగా.. మయాంక్ విలువైన అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
రిజర్వుల విలువను నిర్ధారించటంలో జాగ్రత్త వహించాలి Duvvuri Subbarao న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు మిగులు నిధులను కాజేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బాధకరమని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావ్‌ అన్నారు. ఈ నిధుల పట్ల చాలా జాగురుకత, బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సిఎఫ్‌ఎ సొసైటీ ఇండియా కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడుతూ సావరిన్‌ బాండ్ల ద్వారా విదేశీ కరెన్సీని సమీకరించడం సరైందే కాని పదే పదే అదే పని చేస్తే ప్రమాదమని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ దేశ సెంట్రల్‌ బ్యాంకులోని నిధులను అయినా ఆ దేశ ప్రభుత్వం కాజేయాలని చూడటం మంచి పరిణామం కాదన్నారు. అలా చేస్తే ప్రభుత్వం నిరాశ, నిస్రృహలో ఉన్నట్లు అవుతుందని అన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అటు ప్రభుత్వ, ఇటు సెంట్రల్‌ బ్యాంకు నిధుల పరపతి (బ్యాలెన్స్‌ షీట్‌)ని చూస్తారని దువ్వూరి పేర్కొన్నారు. అదే విధంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) దీన్నే పరిగణలోకి తీసుకుం టుందన్నారు. ఈ నేపథ్యంలో మిగులు నిధుల బదిలీకి ముందు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. ఆర్‌బిఐ స్వతంత్రను కాపాడాల్సిన అవసరం ఉందని సుబ్బారావు పేర్కొన్నారు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV వామ్మో.. వచ్చే 2 నెలల్లో రూ.4,000కు పైగా పెరగనున్న బంగారం ధర.. ఎందుకంటే? బంగారం ధర భారీగా పెరిగే అవకాశముంది. ఈ మాట నేను చెబుతున్నది కాదు. రానున్న రోజుల్లో పసిడి పరుగు తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.42,000 చేరొచ్చని పేర్కొంటున్నారు. Samayam Telugu | Updated: Oct 29, 2019, 12:14PM IST వామ్మో.. వచ్చే 2 నెలల్లో రూ.4,000కు పైగా పెరగనున్న బంగారం ధర.. ఎందుకంటే? హైలైట్స్ భారీగా పెరగనున్న బంగారం ధర డిసెంబర్ చివరి నాటికి రూ.4 వేలకు పైగా పరుగు ఇప్పుడు రూ.38 వేలకు సమీపంలో పసిడి ఏడాది చివరకు రూ.42,000 చేరొచ్చంటున్న నిపుణులు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఎందుకంటారేమో వచ్చే రెండు నెలల కాలలంలో బంగారం ధర ఏకంగా రూ.42,000 స్థాయికి చేరొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. భౌగోళిక రాజకీయ అస్థిరతలు, ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తూ వెళ్లడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం వంటి పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ చివరకు 10 గ్రాముల బంగారం ధర రూ.42,000 స్థాయికి చేరొచ్చని అనలిస్ట్‌లు అంచనా వేశారు. Visit Site Recommended byColombia ‘‘మధ్య ప్రాచ్య ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితులు కొనసాగవచ్చు. దీంతో రానున్న రోజుల్లో కామెక్స్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,650 డాలర్లకు చేరొచ్చు. ఎంసీఎక్స్ మార్కెట్‌లో రూ.42,000లకు పెరగొచ్చు’’ అని కామ్‌ట్రెండ్జ్ రీసెర్చ్ కోఫౌండర్, సీఈవో జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. బంగారం ధర ఈ ఏడాది బుల్లిష్‌గానే ఉండొచ్చని ఆయన తెలిపారు. కేంద్ర బ్యాంకులు బంగారం కొంటూ వెళ్లడం కూడా ఇందుకు దోహదపడొచ్చని పేర్కొన్నారు. అలాగే ఈక్విటీస్‌లో ఇయర్ ఎండ్ స్కైరఫ్‌లు కూడా బంగారం డిమాండ్ పెరగటానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.37,900 సమీపంలో, కామెక్స్‌లో ఔన్స్‌కు 1,494 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం.. ఈ ఏడాది బంగారం మంచి రాబడిని అందించిందని, ధర ఏకంగా 15 శాతం మేర పెరిగిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ రీసెర్చ్) నవ్‌నీత్ దమానీ తెలిపారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి 1.4 శాతం పడిపోవడం కూడా పసిడి పరుగుకు కలిసొచ్చిందని పేర్కొన్నారు. Also Read: నెలకు కేవలం రూ.2,000తో చేతికి ఏకంగా రూ.50 లక్షలు..! భవిష్యత్‌లోనూ బంగారం ధర పరుగులు పెట్టొచ్చని ఈయన అంచనా వేశారు. వాణిజ్య ఉద్రిక్తతలు కొంత మేర తగ్గడం వల్ల బంగారం ధరలో కొద్దిగా కరెక్షన్ ఉండొచ్చని ,అయితే ధర మాత్రం బుల్లిష్‌గానే ఉంటుందని అంచాన వేశారు. ఈ ఏడాది చివరకు బంగారం ధర రూ.39,500 స్థాయికి చేరొచ్చని తెలిపారు.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ-బోయపాటి కాంబో ? పైసా వసూల్ సినిమాతో రేపే ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న బాలయ్య బాబు ముచ్చటగా మూడోసారి బోయపాటి శ్రీను... TNN | Updated: Aug 31, 2017, 09:15PM IST పైసా వసూల్ సినిమాతో రేపే ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న బాలయ్య బాబు ముచ్చటగా మూడోసారి బోయపాటి శ్రీను డైరెక్షన్&zwnj;లో నటించనున్నాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బోయపాటి డైరెక్షన్&zwnj;లో వచ్చిన సింహ సినిమా బాలయ్య బాబు కెరీర్&zwnj;కి కొత్త జోష్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్&zwnj;లో వచ్చిన లెజెండ్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఇక ఇప్పుడు సింహ, లెజెండ్ వంటి చిత్రాల తరహాలోనే ఈ ఇద్దరూ మరో సినిమాకు రెడీ అవుతున్నారనేది ఫిలింనగర్ లేటెస్ట్ టాక్. వచ్చే ఏడాది జూన్&zwnj;లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్య బాబు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తవగానే మళ్లీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇంకో సినిమా వుందని సమాచారం. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది జూన్&zwnj;లో బాలయ్య బాబు-బోయపాటి సినిమా వుండే అవకాశం వుందంటున్నాయి సినీవర్గాలు. అదేకానీ నిజమైతే, బాలయ్య బాబు ఫ్యాన్స్&zwnj;కి అంతకన్నా ఆనందం ఇంకొకటుండదు. సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ఉత్సాహమే అందుకు నిదర్శనం.
0business
గోపీచంద్ కొత్త సినిమా ఓపెనింగ్ స్టిల్స్! First Published 27, Mar 2019, 2:44 PM IST గోపీచంద్-బివిఎస్ఎన్ ప్రసాద్ మూవీ ఓపెనింగ్ ఫోటోలు  గోపీచంద్-బివిఎస్ఎన్ ప్రసాద్ మూవీ ఓపెనింగ్ ఫోటోలు గోపీచంద్-బివిఎస్ఎన్ ప్రసాద్ మూవీ ఓపెనింగ్ ఫోటోలు గోపీచంద్-బివిఎస్ఎన్ ప్రసాద్ మూవీ ఓపెనింగ్ ఫోటోలు గోపీచంద్-బివిఎస్ఎన్ ప్రసాద్ మూవీ ఓపెనింగ్ ఫోటోలు గోపీచంద్-బివిఎస్ఎన్ ప్రసాద్ మూవీ ఓపెనింగ్ ఫోటోలు గోపీచంద్-బివిఎస్ఎన్ ప్రసాద్ మూవీ ఓపెనింగ్ ఫోటోలు Recent Stories
0business
లీటర్ పెట్రోల్ పై 10 పైసల తగ్గింపు 15 పైసలు తగ్గిన డీజిల్ ధర Petrol prices న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గుతూనే ఉండటంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా దిగివచ్చాయి. శనివారం నాడు లీటర్ పెట్రోల్ పై 10 పైసలు, డీజిల్ పై 15 పైసల మేరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ తగ్గుదల తరువాత హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.99కు చేరగా, డీజిల్ ధర రూ. 72.47కు తగ్గింది. అమరావతిలో పెట్రోల్ ధర రూ. 77.58కి, డీజిల్ ధర రూ. 71.75కు చేరింది. విజయవాడలోనూ ధరలు దాదాపు ఇదే విధంగా ఉన్నాయి. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీ విషయానికి వస్తే, నిన్నటితో పోలిస్తే 10 పైసల మేరకు తగ్గిన లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 73.32కు 14 పైసలు తగ్గిన డీజిల్ ధర రూ. 66.46కు చేరుకుంది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
1entertainment
jio తొమ్మిదేళ్ల గరిష్టానికి రిలయన్స్‌ షేర్లు ముంబై: రిలయన్స్‌ ఇండ స్ట్రీస్‌ తొమ్మిదేళ్లగరిష్టస్థాయికి వాటాలు పెరిగాయి. అనుబంధ విభాగం ఆర్‌జియో ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచి వాణిజ్యసేవలు ప్రారంభిస్తుండ టంతో ప్రైమ్‌చందాదారులకు మాత్రం ఏడాదికాలం పాటు సేవలు పొడిగిస్తున్నట్లు ప్రకటించడం వాటా లకు జోష్‌నిచ్చింది. రిలయన్స్‌ షేర్లు బిఎస్‌ఇ లో 1326.1 రూపాయలుగాట్రేడింగ్‌ జరిగిం ది. 4.5శాతం పెరిగాయి. రిలయన్స్‌ ఇండ స్ట్రీస్‌కు టెలికాం వ్యాపారం ద్వారా గరిష్టస్థాయి లో రాబడులు వస్తాయన్న అంచనాలతో షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటివరకూ భారీ పెట్టుబడులు పెట్టిన సంస్థ ఇకపై రికవరీకి కసరత్తులు ప్రారంభించింది. ఒకటవ తేదీ నుంచి మొబైల్‌ టెలిఫోని సేవల చందా దారులకు ఛార్జీలు వసూలుచేస్తామని వివరిం చారు. కంపెనీ ఉచిత సేవలు శుక్రవారంతో ముగుస్తున్నాయి. ప్రైమ్‌ ప్రణాళికలో ఇప్పటికే ఐదుకోట్ల మందిని చేర్చుకున్న కంపెనీ మొత్తం పదికోట్ల చందాదారుల్లో 65శాతం వరకూ మరింతగా పెరుగుతారని ప్రకటించింది. 99 రూపాయలతో రిజిస్ట్రేషన్‌ చేసుకుని నెలసరి 303 రూపాయలు రీఛార్జిచేసుకున్నవారికి 12నెలలపాటు ఉచిత డేటా చెందుతుంది. అంతేకాకుండా కంపెనీ మరింతగా పోటీ ఆఫర్లను జారీచేసేందుకు యోచి స్తోంది. బ్రోకరేజి సంస్థలు ఇటీవలే తమ రిలయన్స్‌ షేరుధరలపై ఎంతో విశ్వాసం ప్రకటించాయి. కంపె నీ పెట్టుబడులు కేవలం టెలికాంలోనే కాకుండా సాంప్రదాయంగా ఉన్న ఇంధన, పెట్రోకెమికల్స్‌ బిజినెస్‌లో కూడా ఉన్నాయని వీటిపై కూఆ రాబడు లు పెరుగుతాయని అంచనావేస్తున్నారు. గ్లోబల్‌ బ్రోకరేజి సంస్థ సిఎల్‌ఎస్‌ఎ ఇటీవలే రిలయన్స్‌ షేర్లు రూ.1350 నుంచి రూ.1500కు పెరుగుతా యని అంచనావేసింది. స్టాక్స్‌ కొనుగోలు చేయవచ్చ ని సూచించింది. కంపెనీ మేనేజ్‌మెంట్‌ టెఇకాం వెంచర్‌ ఆర్‌జియోపై ఆశాభావంతో ఉందని అందువల్ల విలువలు కూడా బహుళరెట్టు పెరుగుతాయని చమురుశుద్ధి వ్యాపారంలో కూడా మార్జిన్లు పెరుగుతాయని అంచనావేస్తున్నారు. ఎడెల్విసిస్‌ కేపిటల్‌ సర్వీసెస్‌ సీనియర్‌ ఉపాధ్య క్షుడు జాల్‌ఇరాని మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో రిల్స్‌కు మంచి రేటింగ్‌ ఉందని వెల్లడించారు. మొత్తం 40 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నా యని దీనివల్ల రిల్‌ ఉత్పాదక ఆస్తులు రెట్టింపు అవుతాయని అంచనా వేసారు. వచ్చే ఏడాది నుంచి స్వేఛ్ఛా యుత నగదు పెరుగుతుందని త్రైమా సిక మూలధన వ్యయం కూడా తగ్గు తుందని అంచనావేసారు. ఏంజెల్‌ బ్రోకింగ్‌ మాత్రం కంపెనీ పెట్టుబడు లపై రిటర్నులు సాధిస్తుందని వెల్లడిం చింది. తక్కువధరలే కీలకం కాకుండా రిటర్న్‌ ఆన్‌ ఇంటరెస్ట్‌పై కూడా మరింత ఆశాజన కంగా ఉంది. రిలయన్స్‌జియో ట్యారిఫ్‌ ప్లాన్లు అందుకున్న తర్వాత2018 మధ్యస్థానికి ఆర్‌జియో ఎబిడిటా పునాదులు పటిష్టం అవుతాయని కంపెనీ కి ఇదొక మైలురాయి వంటిదని వెల్లడించింది.
1entertainment
Hyderabad, First Published 17, Oct 2018, 5:06 PM IST Highlights మూడేళ్ళుగా కష్టపడి చేసిన చెన్నై వడ అనే సినిమా రిలీజ్ కోసం నానా తంటాలు పడుతున్న ధనుష్ ఎట్టకేలకు నేడు ఆ సినిమాను రిలీజ్ చేశాడు.  డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. అతను ఇప్పటివరకు చేసిన సినిమాల రిజల్ట్ ఎల్లా ఉన్నా కూడా నటనలో ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ అందుకోలేదు. ఇక మూడేళ్ళుగా కష్టపడి చేసిన చెన్నై వడ అనే సినిమా రిలీజ్ కోసం నానా తంటాలు పడుతున్న ధనుష్ ఎట్టకేలకు నేడు ఆ సినిమాను రిలీజ్ చేశాడు.  వివాదస్పద అంశాలతో కూడుకున్న సినిమా కావడంతో సినిమా రిలీజవ్వడం కష్టమని అంతా అనుకున్నారు. ధనుష్ వడ మాడిపోయినట్లే అనే టాక్ కూడా వచ్చింది. కానీ కల్ట్ మూవీస్ దర్శకుడిగా పేరున్న వెట్రిమారన్ సినిమాను తెరక్కించిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు.  చెన్నై ప్రాంతంలో బెస్తవారి వర్గం చాలా వెనుకబడినది. అయితే ఆ నేపథ్యంలో దర్శకుడు రీసెర్చ్ చేసి మరి కథను రాసుకున్నాడు. పేదవారి స్థావరాలను ఆక్రమించుకొని విదేశీ ఉన్నత కంపెనీలకు అందించడం. వారు చేసే అరాచకమైన పనులు. అప్పుడు పేదల జీవన వ్యవస్థ ఏ విధంగా మారింది అనే అంశాలను దర్శకుడు రియలిస్టిక్ గా చూపించాడు.  ఇక ధనుష్ చేసిన అన్బు పాత్ర సినిమాలో హైలెట్ గా నిలిచింది. గ్యాంగ్ స్టర్స్ మధ్య జరిగే పోరులో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా మొత్తంగా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా ఉండడంతో తెలుగులో రీమేక్ చేయలేదు. ఇక ఈ సినిమాను మూడు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు.  మొదటి భాగం వర్కౌట్ కావడంతో మిగతా రెండు పార్ట్స్ పై అంచనాలు పెరుగనున్నాయి. వడ చెన్నై సినిమాలో 1980 నుంచి 2003వరకు జరిగిన పరిణామాలను ప్రధానంగా చూపించారు. గ్యాంగ్ స్టర్స్ గా సముతిరఖని-కిషోర్-పవన్-దీనా కనిపించగా ఐశ్వర్య రాజేష్-ఆండ్రియా జేరిమియా వారి నటనతో న్యాచురల్ గా మెప్పించారు. Last Updated 17, Oct 2018, 5:06 PM IST
0business
హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 First Published 11, Dec 2017, 10:35 AM IST హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 హలో మూవీ ఆడియో లాంచ్ గ్యాలరీ -1 Recent Stories
0business
sumalatha 568 Views New-Jerseys , Team India , World Cup 2019 Team-India-New-Jerseys లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన కొత్త జెర్సీలను ధరించనుంది. అయితే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లూ నీలిరంగు జెర్సీలను ధరిస్తూ ఆడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ రెండు జట్లు తలపడే మ్యాచ్‌లో టీమిండియా జెర్సీలు మారాయి. ఇందులో ముదురు నీలం రంగుతో పాటు నారింజ రంగు కూడా జోడించారు. కాగా కొత్తగా ఆ జెర్సీలను ధరిస్తూ కోహ్లీసేన తాజాగా ఫొటోలకు ఫోజులిచ్చింది. రేపు జరగబోయే మ్యాచ్‌లో ఎలా కనిపిస్తారో తెలియజేస్తూ క్రికెట్‌ ప్రపంచకప్‌ ట్విటర్‌లో ఈ ఫొటోలను షేర్‌ చేసింది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
2sports
Bengaluru, First Published 1, Oct 2018, 12:15 PM IST Highlights టీమిండియాలో తనకు స్థానం దక్కడం పట్ల మయాంక్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశాడు. దీని వెనుక రాహుల్ ద్రవిడ్ ప్రొత్సాహమే కారణమని మయాంక్ అన్నాడు. టీమిండియాలో తనకు స్థానం దక్కడం పట్ల మయాంక్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశాడు. దీని వెనుక రాహుల్ ద్రవిడ్ ప్రొత్సాహమే కారణమని మయాంక్ అన్నాడు. భారత్- ఏ జట్టు కోచ్‌గా ‘‘ ఏం జరిగినా.. జరగబోతున్నా.. పరుగులు చేయడానికే కట్టుబడి ఉండు’’ అని ద్రవిడ్ ఇచ్చిన సలహాతోనే తాను దేశవాళీ క్రికెట్‌లో రాణించానని మయాంక్ అన్నాడు. ఒక ఆటగాడిగా పరుగులు చేయడమే నా బాధ్యత.. అంతే తప్ప ఇతర వ్యవహారాల గురించి తాను ఆలోచించనన్నాడు.. నా ఆటను ఇలాగే కొనసాగించడం.. ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేస్తూ ఆటతీరును మెరుగుపరుచుకోవడమే తన బాధ్యతని మయాంక్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో త్వరలో జరగబోతున్న రెండు టెస్టుల సిరీస్‌కు 15 మంది జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్‌, విజయ్‌ల వరుస వైఫల్యాల నేపథ్యంలో బోర్డు వారిపై వేటు వేసి.. భారత- ఏ జట్టు తరపున అద్బుతంగా రాణిస్తున్న మయాంక్‌కు అవకాశం ఇచ్చారు.
2sports
వీడియో అసిస్టెంట్ రిఫరీ రెడీ Highlights వీడియో అసిస్టెంట్ రిఫరీ రెడీ హైదరాబాద్: ఎట్టకేలకు వీడియో అసిస్టెంట్ రిఫరీలను(వీఏఆర్) వాడుకోవడానికి ఫుట్‌బాల్ గేమ్ రెడీ అయిపోయింది. ఆటతీరును అంచనా వేయడంలో రిఫరీలను హెల్ప్ చేసే ఈ టెక్నాలజీకల్ రిఫరీలను రష్యాలో జరిగే వరల్డ్ కప్‌లో తొలిసారిగా వినియోగిస్తున్నారు. వీఏఆర్‌ను బరిలోకి దింపాలని మార్చి మూడవ తేదీన ఫిఫా డిసైడ్ కావడంతో వీటి గురించి చర్చలు మొదలయ్యాయి. 1,000కి పైగా మ్యాచ్‌ల్లో టెస్ట్ చేసిన తర్వాత వీటి వినియోగానికి ఫిఫా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా చూసినప్పుడు రీప్లేలను రివ్యూ చేయడంలో గేమ్‌కు యావరే‌జ్‌గా 55 సెకండ్లు మాత్రమే లాస్ అవుతున్నది. అయితే ఫౌల్స్ (8 నిముషాల 51 సెకండ్లు), కార్నర్ కిక్‌లు(3 నిముషాల 57 సెకండ్లు), ప్లేయర్ల సబ్‌స్టిట్యూషన్(2 నిముషాల 57 సెకండ్ల) తో పోల్చినప్పుడు వీఏఆర్ వల్ల కోల్పోయే టైమ్ చాలా తక్కువే మరి. అయితే వీటి వల్ల గేమ్‌లో మజా పోతుందంటున్నారు ఫుట్‌బాల్ వీరాభిమానులు.  Last Updated 15, Jun 2018, 10:32 AM IST
2sports
Visit Site Recommended byColombia అయితే ఈ మధ్య కాలంలో అనసూయ, రష్మి, శ్రీముఖిల నుండి గట్టి పోటీ ఉండటంతో అప్పుడప్పుడూ వాళ్ల దారిలో వెళ్తూ డబుల్ మీనింగ్ డైలాగ్‌‌లనూ వదులుతూ కొత్త మార్క్ కోసం తాపత్రయ పడుతోంది. తాను యాంకరింగ్ చేసే కార్యక్రమాలను టాప్‌లో నిలబెట్టడమే కాకుండా.. టాప్ షోలలో సైతం స్పెషల్ గెస్ట్‌గా వెళ్లే రేంజ్‌కి వెళ్లింది సుమ. ఇటీవల బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి సందడి చేసిన సుమ తాజాగా ఓంకార్ సిక్స్త్ సెన్స్ కార్యక్రమంలో సందడి చేస్తుంది. ఓకాంర్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 3 ఈ నెల 9 నుండి ప్రసారం కానుంది. నవంబర్ 9 నుండి స్టార్ మాలో 9 గంటలకు ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సుమ హడావిడి మామూలుగా లేదు. ఓంకార్ తలకు గన్‌ను గురిపెట్టి ఓ రేంజ్‌లో బిల్డప్ ఇస్తుండగా.. ఆమెతో పాటు అలీ, బ్రహ్మాజీ, మంచులక్ష్మి, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, ముక్కు అవినాష్‌లు ఫుల్ ఫన్ కామెడీతో రచ్చ రచ్చ చేస్తున్నారు. వాళ్లతో ఫన్నీ టాస్క్‌‌లు ఆడిస్తున్న ఓంకార్.. వన్ సెకన్ అనడంతో ‘ఎవడైనా ఫస్ట్‌ నైట్‌కి గదిలోకి వెళ్లేటప్పుడు వన్ సెకెన్.. ఆల్ ది బెస్ట్ అంటాడా వాడికి’ అంటూ పంచ్‌లేస్తుంది సుమ. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 3 ముగియడంతో స్టార్ మా అదే టైంలో సిక్స్త్ సెన్స్ సీజన్ 3ని మొదలుపెట్టారు. మరి ఈ షో ప్రేక్షకులకు ఎంతవరకూ చేరువౌతుందో చూడాలి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సార్క్ దేశాల మధ్య వీసా ఫ్రీ వ్యవస్థను ప్రతిపాదించిన పాక్ PNR| Last Modified గురువారం, 10 నవంబరు 2011 (17:50 IST) సార్క్ దేశాల మధ్య వీసా ఫ్రీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం కోరింది. దీనివల్ల దక్షిణాసియా దేశాలన్నీ ప్రయోజనం పొందుతాయని ముఖ్యంగా భారత్ పాకిస్థాన్‌ దేశాలకు బహుళ ప్రయోజనాలు ఉంటాయని అభిప్రాయపడింది. ఈ తరహా వ్యవస్థ ఇప్పటికే ఐరోపా దేశాల్లో అమలులో ఉందని గుర్తు చేసింది. అందువల్ల సార్క్ దేశాల మధ్య వన్ వీసా వ్యవస్థను ప్రవేశపెట్టాలని పాక్ త్రిసభ్య బృందం సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందంలో పాకిస్థాన్ సుప్రీంకోర్టుకు చెందిన మాజీ న్యాయమూర్తి నాసీర్ అస్లామ్, ఆ దేశ న్యాయశాఖ మాజీ మంత్రి ఇక్బాల్ హైదర్, పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లేబర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్స్ డైరక్టర్ కరామత్ ఆలీలు ఉన్నట్టు పాక్ వర్గాల సమాచారం. ఈ ప్రతినిధి బృందం పాకిస్థాన్ విడుదల చేసిన భారత జాలర్లతో కలిసి న్యూఢిల్లీకి వచ్చి, ఎన్జీవో షర్హాద్ ఆధ్వర్యంలో నడుపుతున్న పాఠశాల విద్యార్థులతో సంభాషించింది. సంబంధిత వార్తలు
1entertainment
Sunny Leone celebrates her anniversary with husband in Bengaluru బెంగుళూరులో సన్నిలియోన్‌ స్పెషల్ డే ఏ క్షణాన ఇండియాలో అడుగుపెట్టిందో తెలియదు కానీ వచ్చిన అతికొద్ది కాలంలోనే ఎనలేని పాపులారిటీని మూటగట్టుకుంది సన్నిలియోన్. TNN | Updated: Apr 9, 2016, 07:30PM IST ఏ క్షణాన ఇండియాలో అడుగుపెట్టిందో తెలియదు కానీ వచ్చిన అతికొద్ది కాలంలోనే ఎనలేని పాపులారిటీని మూటగట్టుకుంది సన్నిలియోన్. సన్నీ ఎక్కడికెళ్లినా యూత్ ఆమె వెంట పడుతున్నారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సన్నిలియోన్ ప్రస్తుతం తాను నటించిన లేటెస్ట్ మూవీ 'వన్ నైడ్ స్టాండ్' ప్రమోషన్స్‌లో బిజీగా వుంది. తనుజ్ విర్వానీతో కలిసి సన్నీ చేసిన ఈ సినిమాపై యంగ్ ఆడియెన్స్‌కి మాంచి ఎక్స్‌పెక్టేషన్సే వున్నాయి. త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బెంగుళూరు వెళ్లిన సన్నిలియోన్ అక్కడే తన 5వ పెళ్లి రోజు వేడుకల్ని కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందట.
0business
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
Hyderabad, First Published 10, Sep 2018, 1:17 PM IST Highlights సీనియర్ హీరో రాజశేఖర్ నటుడిగా వరుస పరాజయాలు అందుకోవడంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని 'గరుడ వేగ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సీనియర్ హీరో రాజశేఖర్ నటుడిగా వరుస పరాజయాలు అందుకోవడంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని 'గరుడ వేగ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా    తరువాత దర్శకనిర్మాతలకు రాజశేఖర్ పై నమ్మకం పెరిగింది. ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాతలు ముంచుకొచ్చారు. అయితే రాజశేఖర్ మాత్రం ఏరి కోరి 'అ!' సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు 'కల్కి' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. 1980ల కాలంలో జరిగే పీరియాడిక్ డ్రామాతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నెల 19 నుండి హైదరాబాద్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు రూ.2 కోట్ల బడ్జెట్ తో భారీ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ పటాన్ చెరువు దగ్గరలో ఈ సెట్ ను నిర్మించనున్నారు. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ సెట్ లో తీయనున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రాజశేఖర్ కుమార్తెలతో కలిసి నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  Last Updated 19, Sep 2018, 9:18 AM IST
0business
జెమినీ గనేశణ్ ఏడుగురు కూతుర్లు ఒకే ఫ్రేములో! Highlights 'మహానటి' సినిమా తరువాత సావిత్రి, జెమినీ గనేషన్ ల గురించి మరిన్ని  'మహానటి' సినిమా తరువాత సావిత్రి, జెమినీ గనేశణ్ ల గురించి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సావిత్రి మరణం తరువాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయనే తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. దీనికి సంబంధించి ఆన్ లైన్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో దర్శనమిస్తోంది. అందులో జెమినీ గనేశణ్ ఏడుగురు కూతుర్లు ఒకే ఫ్రేములో కనిపిస్తుండడంతో ఆ ఫోటో కాస్త వైరల్ అయింది.  జెమినీ గనేశణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొత్తం ఆయనకు ఏడుగురు కూతుర్లు, ఒక కొడుకు. సావిత్రి ఆయనకు మూడవ భార్య ఆమెకు పుట్టినవారే విజయ ఛాముండేశ్వరి, సతీష్ లు. రెండవభార్య పుష్పవల్లికి ఇద్దరు కుమార్తెలు. అందులో బాలీవుడ్ తార రేఖ ఒకరు. మొత్తం ఏడుగురు అక్కజెల్లెల్లు ఒక ఈవెంట్ లో పాల్గొని కలిసి ఫోటో తీసుకున్నారు. వారి మధ్య ఉన్న అనుబంధానికి ఈ ఫోటో అద్దం పడుతోంది. కమల సెల్వరాజ్, రేఖా, నారాయణి, రేవతి, రాధ, విజయ ఛాముండేశ్వరి, జయ శ్రీధర్ అందరూ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.   Last Updated 19, May 2018, 2:38 PM IST
0business
May 19,2015 ప్రజలకు చేరువైన 'ప్రచార్‌'          న్యూఢిల్లీ: ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా పలు ప్రభుత్వ పథకాలకు ప్రాచుర్యాన్ని కల్పిస్తోంది ప్రచార్‌ కమ్యూనికేషన్స్‌. ప్రధాని మోడీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జన్‌ధన్‌ యోజనా విజయవంతం అయ్యేలా ప్రచారం చేసి ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలకు చేరువైంది ఈ సంస్థ. తాజాగా ప్రచార్‌ సంస్థకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొత్తగా ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతీ బీమా యోజనా (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనా (పీఎంఎస్‌బీవై), అటల్‌ బిహారీ పెన్షన్‌ యోజనా (ఏపీఐ) పథకాల ప్రచార బాధ్యతలు కూడా దక్కాయి. దీంతో 10 రొజుల పాటు ఈ సంస్థ బృందం రాత్రింబవళ్లు కష్టపడి క్యాంపైనింగ్‌లను డిజైన్‌ చేసింది. కేవలం అనతి కాలంలోనే రెండు దఫాలుగా దాదాపు 134 టీవీ ఛానెళ్లలో, ఎనభై నగరాలలోని 20 రేడియో స్టేషన్లలో, దాదాపు100 పబ్లికేషన్లలో సంస్థ ఈ పథకాలను ప్రచారం చేసినట్లు సంస్థ డైరెక్టర్‌ వనితా జైన్‌ తెలిపారు. దీనికితోడు ఆయా పథకాలకు సంబంధించిన విషయాలను వెల్లడించేలా పాకెట్‌ బుక్‌లెట్‌లను, లీఫ్‌లెట్‌లను కూడా ప్రచార్‌ తయారు చేసి అందుబాటులోకి తెచ్చినట్లు జైన్‌ వివరించారు. కేవలం అందరికీ ప్రచారం చేయడమే కాదు ఆ ప్రచారమే ఆదర్శంగా తమ సంస్థలో పని చేస్తున్న అందరు ఉద్యోగులను ఈ పథకాలలో చేర్పించింది ప్రచార్‌. ఈ పథకాలకు చెందిన క్యాంపెయిన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు జైన్‌ తమ సంస్థ బృందం సభ్యులను అభినందించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఇండియాకు హెచ్ఎస్బీసీ ప్రైవేట్ బ్యాంకింగ్ బైబై! హెచ్.ఎస్.బి.సి., హోల్డింగ్స్ సంస్థ ఇండియాలో ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపారానికి స్వస్థిపలకనుంది. TNN | Updated: Nov 27, 2015, 06:47PM IST హెచ్.ఎస్.బి.సి., హోల్డింగ్స్ సంస్థ ఇండియాలో ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపారానికి స్వస్థిపలకనుంది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థల్లో ఇది మూడోది. ఇటీవలే రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ , మోర్గాన్ స్టాన్లీ సంస్థలు భారత్ లో తమ ప్రైవేట్ బ్యాంకింగ్ యూనిట్లను విక్రయించేసుకున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఆపరేషన్లపై ఇటీవల జరిపిన విశ్లేషణాత్మక సమీక్ష అనంతరం భారత్ లో తమ వ్యాపారాన్ని నిలిపివేయదలచుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి శుక్రవారం నాడు తెలిపారు. హెచ్ఎస్బిసీ గ్రూపు కార్యకలాపాలను సమగ్రంగా అందించే యోచనలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు.
1entertainment
tharun bhascker excusive interview about meeku maathrame chepta movie FOLLOW US ON పెళ్ళిచూపులు సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న తరుణ్ భాస్కర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యి నేషనల్ అవార్డు సైతం అందుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా మారుతున్నాడు.ఈ సినిమాని ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పై నిర్మించాడు. షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనసూయ, వాణి భోజన్,అభినవ్ గోమటం కీలకపాత్రలు పోషించారు.ఈ సినిమా ఈ నవంబర్ 2 న రిలీజ్ కాబోతుంది.ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ సమయం తెలుగుకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ మీకోసం. Press CTRL+C to copyX <iframe id="ytplayer" src="https://www.youtube.com/embed/KztyfaUJU4g?autoplay=1&origin=//telugu.samayam.com" type="text/html" width="640" height="390" frameborder="0"></iframe> Facebook
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సెన్సార్ షాక్: పొగతాగారో A సర్టిఫికేట్ ఇచ్చేస్తాం సెంట్రల్ సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రహ్లీజ్ నిహ్లీనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల్లో ధూమపానం, మద్యపానం చేసే సీన్‌‌లకు కత్తెరేస్తామని.. ఒకవేళ కాదు కూడదు అంటే ఆ సినిమాలకు A సర్టిఫికెట్ ఇస్తామంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. TNN | Updated: Jul 25, 2017, 06:28PM IST సెంట్రల్ సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రహ్లీజ్ నిహ్లీనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల్లో ధూమపానం, మద్యపానం చేసే సీన్&zwnj;&zwnj;లకు కత్తెరేస్తామని.. ఒకవేళ కాదు కూడదు అంటే ఆ సినిమాలకు A సర్టిఫికెట్ ఇస్తామంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సినిమాల్లో హీరోయిజం బాగా పండాలంటే మందు, సిగరెట్&zwnj;ను తప్పనిసరి అన్నట్టుగా సీన్స్ ఉండటంతో అవి యువతపై ప్రభావం చూపేవిధంగా ఉండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు సెన్సార్ సభ్యులు. ఇప్పటివరకూ సినిమా ప్రారంభంలో &lsquo;పొగతాగడం, మద్యం సేవించడం హానికరం&rsquo;అంటూ ప్రేక్షకులకు కనీ కనిపించనీ డిస్&zwnj;క్లైమర్స్&zwnj;తో మాత్రమే సరిపెట్టేస్తున్నామని.. వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. నిజంగా ప్రజల మేలు కోరేవారైతే సిగరెట్, మద్యం సీన్స్&zwnj;ను సాధ్యమైనంత మేర తీయకూడదన్నారు. స్టార్ హీరోలకు దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉంటారు. వాళ్లల్లో చాలామంది తమ అభిమాన హీరోని ఎంత స్టైలిష్&zwnj;గా మందు తాగాడు.. ఎంత స్టైల్&zwnj;గా సిగరెట్ పీల్చుతూ పొగ వదిలాడో గమనిస్తూ వాళ్లని అనుకరించే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారన్నారన్నారు. ఇలా ఒకసారి అలవాటు అయితే వాటికి బానిసలుగా మారిపోయే ప్రమాదం ఉందంటూ ధూమపానం, మద్యపానం సీన్&zwnj;లపై ప్రహ్లాజ్ నిహ్లాని సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఇలా సపోర్ట్ చేస్తే.. ప్రాణాలైనా ఇస్తాం: ఛెత్రీ భావోద్వేగం మమ్మల్ని తిట్టండి కానీ మేం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు మాత్రం రండంటూ పిలుపునిచ్చి ఛెత్రీ ప్రేక్షకుల మద్దతుతో పులకరించిపోయాడు. Samayam Telugu | Updated: Jun 5, 2018, 09:49AM IST ఇలా సపోర్ట్ చేస్తే.. ప్రాణాలైనా ఇస్తాం: ఛెత్రీ భావోద్వేగం మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ ఆట చూడండని భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఆవేదనతో ఇచ్చిన పిలుపునకు అద్భుత స్పందన లభించింది. ఈ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడికి సచిన్, కోహ్లి లాంటి క్రికెటర్లతోపాటు కేటీఆర్ లాంటి రాజకీయ నాయకులు కూడా మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఛెత్రీ పిలుపుతో దేశం స్పందించింది. సోమవారం ముంబై వేదికగా కెన్యాతో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు జనం పోటెత్తారు. స్టేడియం మొత్తం ప్రేక్షకులతో కిటకిటలాడింది. భారత్ తరఫున వందో మ్యాచ్ ఆడిన సునీల్ ఛెత్రి రెండు గోల్స్‌ చేయడంతో భారత్ 3-0 తేడాతో కెన్యాను మట్టి కరిపించింది. ఈ విజయంతో ఇంటర్ కాంటినెంటల్ ట్రోఫీలో భారత్ ఫైనల్ చేరింది. బైచుంగ్ భూటియా తర్వాత భారత్ తరఫున వంద ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన రెండో ఆటగాడిగా ఛెత్రి రికార్డ్ నెలకొల్పాడు. We promise you that if that’s the kind of support we get every time we play for the country, we will give our live… https://t.co/ZEbAQTN1Gu &mdash; Sunil Chhetri (@chetrisunil11) 1528134427000 ఈ స్థాయిలో ప్రేక్షకుల మద్దతు లభించడం పట్ల భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆనందం వ్యక్తం చేశాడు. ‘దేశం తరఫున మేం ఆడేటప్పుడు ప్రతీసారి మీరు ఇలాగే మాకు మద్దతుగా నిలిస్తే.. పిచ్ మీద మా ప్రాణాలైనా ఇస్తాం. ఈ రాత్రి ఎంతో ప్రత్యేకం. అరుపులు, కేకలతో మమ్మల్ని ఉత్సాహపరుస్తూ.. మ్యాచ్ చూడటానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు’ అని ఛెత్రీ ట్వీట్ చేశాడు. .@chetrisunil11 came up with a double on a special night for the @IndianFootball team skipper, that saw the Blue Ti… https://t.co/quDiiPm47H &mdash; Indian Super League (@IndSuperLeague) 1528137193000 టీమిండియా కెప్టెన్ చేసిన ఈ భావోద్వేగ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఆ ట్వీట్‌ను 10 గంటల్లోనే 23 వేల మందికిపైగా రీట్వీట్ చేయగా.. 62 వేల మందికిపైగా లైక్ చేశారు. భారతావని మీకు అండగా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేశారు. గత శుక్రవారం నాలుగు దేశాల టోర్నీ ప్రారంభం కాగా.. మొదటి మ్యాచ్‌లో భారత్ 5-0 తేడాతో చైనీస్‌ తైపీపై గెలుపొందింది. కానీ ఈ మ్యాచ్‌కి ఆదరణ కరువైంది. కేవలం 2569 మంది ప్రేక్షకులే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. దీంతో మమ్మల్ని తిట్టండి, కానీ మ్యాచ్ చూసేందుకు రండని సునీల్ ఛెత్రీ ఆవేదనతో ట్వీట్ చేశాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కమల్ పార్టీ ప్రచారానికి వెళతా : షకీలా Highlights మంచి చేయాలనే ఉద్దేశంతోనే కమల్ రాజకీయ పార్టీ   ప్రజలను విద్యావంతులను చేయడం ద్వారా సమాజంలో మార్పు తేవచ్చని కమల్ అంటుంటారు ఆ విషయాన్ని నేను సమర్థిస్తా : షకీలా ప్రముఖ రాజకీయనేత, నటుడు కమలహాసన్ తన సొంత పార్టీ ప్రచారం నిమిత్తం రావాలని ఆహ్వానిస్తే తాను తప్పకుండా వెళతానని శృంగార తార షకీలా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రజలను  విద్యావంతులను, చైతన్య వంతులను చేయాలని కమల్ హాసన్ తరచుగా చెబుతుంటారని అన్నారు. ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిచండం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తేవచ్చనే కమల్ ఉద్దేశ్యాన్ని తాను సమర్థిస్తానని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే కమల్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా, ఆయనపై విమర్శలు గుప్పించడం తగదని అన్నారు. కాగా, షకీలా నటించిన 250వ చిత్రం ‘శీలవతి’. ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. కేరళలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. మేలో విడుదల కానున్న ఈ చిత్రానికి దర్శకుడు సాయిరామ్ దాసరి, నిర్మాత వీరు బాసింశెట్టి. Last Updated 25, Mar 2018, 11:54 PM IST
0business
internet vaartha 167 Views ముంబై : డిజిటైజేషన్‌ పరంగా బ్యాంకు ఖాతాలను మరింత కంప్యూటరీకరించి కస్టమర్లకు మరింతగా చేరువయ్యేందుకువీలుగా హెచ్‌డి ఎఫ్‌సి బ్యాంకు ఐదు స్టార్టప్‌ కంపెనీలను ఎంపికచేసుకుంది. మార్కెటింగ్‌, నాణ్యతా హామీ, మొబైల్‌, బయోమెట్రిక్‌ పేమెంట్స్‌ రంగాల్లో ఐదు ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ కంపెనీలను ఎంపికచేసారు. సెన్సెఫోర్త్‌ టెక్నాలజీస్‌, ట్యాగ్‌ఎన్‌పిన్‌, నెట్‌విజిల్‌ సాఫ్ట్‌వేర్‌, బగ్‌క్లిపర్‌ టెక్నాలజీస్‌, టాపిట్స్‌ టెక్నాలజీస్‌ వంటి స్టార్టప్‌ కంపెనీలను ఎంపిక చేసినట్లు బ్యాంకు డిజిటల్‌ హెడ్‌ నితిన్‌ చుగ్‌ తెలిపారు.దేశంలో బ్యాంకింగ్‌ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్సూరెన్స్‌రంగంలో మొట్టమొదటిదైన హెచ్‌డి ఎఫ్‌సి బ్యాంకు డిజిటల్‌ ఇన్నొవేషన్‌ సదస్సుకు దేశవ్యాప్తంగా 100కుపైగా స్టార్టప్‌ కంపెనీలు ఎంట్రీలు వచ్చాయి. వీటిలో ఎంపికచేసిన ఐదింటికి హెచ్‌డిఎఫ్‌సి తన బ్యాంకింగ్‌ కార్యకలాపాలు అందిస్తుంది. బ్యాంకుడిజిటల్‌ కార్యాచరణకుతోడుగా దేశవ్యాప్త పంపిణీ నెట్‌వర్క్‌తోప్రజలను చేరుకుంటున్నదని డిసెం బరు 31నాటికి 2505 నగరాల్లో 4281 శాఖలు, 11,843 ఎటిఎంలను కలిగి ఉన్నట్లు వెల్లడించారు.
1entertainment
RBI ఆర్‌బిఐలో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ముంబై,: భారతీయ రిజర్వుబ్యాంకు నిర్దే శించిన నిబంధనలు, చట్టాలు సక్రమంగా అమలు చేయని వాటిపై క్రమశిక్షణ కార్యాచరణకు ఒక ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటుచేయా లని నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వివిధ నిబంధనలు, చట్టాలు సక్రమంగా విధిగా పాటించేందుకు అనువుగా ఈ సంస్థ పర్య వేక్షణ చేస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాచరణకు నిబంధనల రూపకల్పన కూడా జరుగుతున్నట్లు ఆర్‌బిఐ వెల్లడించింది. అన్నీ సక్రమంగా పూర్తయితే కొత్త విభాగం వచ్చే ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచే ప్రారంభం అవుతుందని వెల్లడించింది. ఆర్‌బిఐ కొత్తగా క్రమబద్ధీకరణ, నిఘావ్యవస్థ, సునిశిత పరి శీలన చట్టాల అమలు వంటి మూడు కీలక అంశాల పై పనిచేస్తున్నది. అలాగే పనితీరులో పారదర్శకత కూడా అవసరమని అందుకోసమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. అలాగు సైబర్‌ సెక్యూరిటీకోసం ఆర్‌బిఐ ప్రత్యేక ప్యానెల్‌ను కూడా ఏర్పాటుచేసింది. నగదు రహిత లావాదేవీ లు మరింత పెరుగుతున్నందున రిజర్వుబ్యాంకు అంతర్‌క్రమశిక్షణ ప్యానెల్‌ను ఏర్పాటుచేసి సైబర్‌ భద్రతను మరింతగా పెంచేందుకు ఏర్పాట్లు చేసింది. బ్యాంకింగ్‌ చరిత్రలోనే అతిపెద్ద డెబిట్‌ కార్డు డేటా ఉల్లంఘనలు జరగడంతో వీటన్నింటి పైనా దృష్టిపెట్టింది. గతఏడాది 32.14 లక్షల కార్డులు తిరిగి జారీచేయడం వల్ల 19 బ్యాంకుల్లోని 641మంది కస్టమర్లు ఖాతాల్లోని 1.3కోట్ల సొమ్ము తస్కరణకు దురయినట్లు అంచనా. మొత్తం 75 కోట్ల డెబిట్‌కార్డులు దేశంలో చెలామణిలో ఉన్నా యి. 19 కోట్ల మంది ఖాతాదారులకు భారత్‌లోనే పొందుపరిచిన రూపే డెబిట్‌కార్డులుంటే వాటిలో మిగిలినవి వీసా మాస్టర్‌కార్డు ఆధారితమైనవి ఉన్నాయి. 26.5 లక్షల కార్డులు వీసా మాస్టర్‌ కార్డు ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తున్నవి గత ఏడాది గణాంకాల చోరీకి గురయ్యాయి. మరో ఆరులక్షల కార్డులు రూపే కార్డులున్నాయి. 90 ఎటిఎంలలో జరిగిందని గత ఏడాది ప్రభుత్వానికి నివేదిక అందింది. ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల్లోని 32 లక్షల డెబిట్‌కార్డులను రీకాల్‌చేసి కస్టమర్లకు కొత్తకార్డులు జారీచేసి భద్రతను పెంచాయి.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రియోలో హాకీ గోల్ కీపర్‌గా తెలుగమ్మాయి రియో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత హాకీ జట్టులో ఓ తెలుగమ్మాయి చోటు దక్కించుకుంది. ఆమె ఎవరో తెలుసా? TNN | Updated: Jul 26, 2016, 06:10PM IST రియో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత హాకీ జట్టులో ఓ తెలుగమ్మాయి చోటు దక్కించుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన నీరజ రెండో గోల్ కీపర్‌గా రియో ఒలింపిక్స్‌‌కు ఎంపికైంది. విశ్వ క్రీడలైన ఒలింపిక్స్‌కు దక్షిణ భారతదేశం నుంచి ఓ హాకీ క్రీడాకారిణి ఎంపిక కావడం ఇదే తొలిసారి. తలకోన అటవీ ప్రాంతంలోని ఎర్రవారిపాలెం గ్రామానికి చెందిన నీరజ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పాఠశాల పీఈటీ ప్రోత్సాహంతో హాకీపై ఇష్టాన్ని పెంచుకున్న ఆమె కష్టపడి భారత జట్టులో స్థానం సంపాదించింది. తర్వాత తిరుపతి అకాడమీలో శిక్షణ పొందుతూ విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌ టీంలకు గోల్‌ కీపర్‌ బాధ్యతలు నిర్వర్తించింది. నాలుగున్నరేళ్ల పాటు అక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత హైదరాబాద్‌లో శిక్షణ పొందింది. ఆరు అడుగుల ఎత్తుండటం రజనీకి కలిసి వచ్చింది. ఆమె ఇప్పటివరకు 49 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రధాన గోల్‌ కీపర్‌గా వ్యవహరించింది. పంజాబ్‌‌కు చెందిన సవిత ఒలింపిక్స్‌కు ప్రధాన గోల్‌ కీపర్‌గా ఎంపికైంది. ఆమెకు రెండొందల అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఏ కారణాల వల్లనైనా ప్రధాన గోల్‌కీపర్‌ తప్పుకుంటే ఆ స్థానాన్ని రజని భర్తీ చేస్తుంది. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగం సాధించిన రజనీ ముంబైలో టీసీగా ఉద్యోగం చేస్తోంది. రైల్వే హాకీ మహిళా జాతీయ జట్టుకు గోల్‌కీపర్‌గానూ ప్రాతినిధ్యం వహిస్తోంది.
2sports
భాగ్యనగరిలోనే గూగుల్‌ క్యాంపస్‌ అంతర్జాతీయంగా  పెరగనున్న నగర ప్రతిష్ఠ - అమెరికా తరువాత  హైదరాబాద్‌లోనే ఏర్పాటు - ఆసియాలోనే మొట్టమొదటిది - రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మాణం - దాదాపు 14 వేల మందికి ఉపాధి - మంత్రి కేటీఆర్‌ పర్యటనలో కుదిరిన ఒప్పందం              కాలీఫోర్నియా (అమెరికా): హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇంటర్‌నెట్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ అమెరికా అవల ఏర్పాటు చేయదలచిన క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఆసియాలోని పలు దేశాలతో పాటు దేశీయంగా పలు దిగ్గజ నగరాలు కూడా పోటీ పడినప్పటికీ చివరకు హైదరాబాద్‌కే ఆ 'భాగ్యం' దక్కింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌), ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌లు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న మౌంట్‌ వ్యూలోని గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గూగుల్‌ సంస్థ ఉపాధ్యక్షుడు డెవిడ్‌ రాడ్‌క్లిఫ్‌, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌లు హైదరాబద్‌లో క్యాంపస్‌ ఏర్పాటు విషయమై అవగాహన ఒప్పంద పత్రాలపై సంతాకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా గూగుల్‌ సంస్థ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అతిపెద్ద ప్రాంగణాన్ని (క్యాంపస్‌ను) నిర్మించనుంది. సుమారు రూ. వెయ్యి కోట్ల వ్యయంతో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. 2016 మార్చి నాటికి క్యాంపస్‌ నిర్మాణ పనులను చేపట్టునున్నట్లు గూగుల్‌ ఉపాధ్యక్షుడు డేవిడ్‌ ర్యాక్లిఫ్‌ తెలిపారు. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తికాగలదని కంపెనీ భావిస్తోంది. 2019 నుంచి గూగుల్‌ హైదరాబాద్‌ కేంద్రంలో సేవలు ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. గూగుల్‌ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సారిగా తన తొలి ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం గూగుల్‌ హైదరాబాద్‌లోని ఒక అద్దె భవనంలో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 7000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కొత్త క్యాంపస్‌ కేంద్రంగా సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తే దాదాపు 13వేల మందికి ఉపాధి కలుగనుంది. ఇంటింటికీ ఇంటర్‌నెట్‌ కోసం త్వరలో అధ్యయనం...              అమెరికాలోని కన్సాస్‌ నగరం, ఆస్టిన్‌తో పాటు ఎనిమిది నగరాలలో గూగుల్‌ ఫైబర్‌ పేరుతో ఇంటింటికీ అంతర్జాలాన్ని (ఇంటర్‌నెట్‌ను) అందిస్తున్న మాదిరిగానే తెలంగాణలో కూడా ఇలాంటి వ్యవస్థ ఏర్పాటునకు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్‌ గూగుల్‌ కంపెనీ ప్రతినిధులను కోరారు. ఇందుకు సానుకూ లంగా స్పందించిన కంపెనీ అధికారులు ప్రాజెక్టు అమలు సాధ్యాసాధ్యాల పరిశీలించేం దుకు త్వరలోనే ఒక ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు పంపనున్నట్లు తెలిపింది. ఈ వ్యవస్థ అమలునకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని ఆయన తెలిపారు. మొదటి స్ట్రీట్‌ వ్యూ రాష్ట్రంగా తెలంగాణ..              మంత్రి కేటీఆర్‌ అధ్వర్యంలోని అధికారుల బృందం గూగుల్‌ స్ట్రీట్‌ టీమ్‌ డైరెక్టర్‌ మానిక్‌ గుప్తాతో బృందంతో కూడా సమావేశమైంది. ఈ సందర్బంగా ఇరు బృందాలు తెలంగాణలో గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ ను అమలులోకి తెచ్చే అంశంపై చర్చించాయి. ఈ చర్యలో భాగంగా మంత్రి కేటీఆర్‌ కోరిన మేరకు తెలంగాణ మొట్టమొదటి స్ట్రీట్‌ వ్యూ రాష్ట్రంగా చేసేందుకు కంపెనీ బృందం అంగీకరించింది. భవన నిర్మాణాల నమూనాలను విచనలం కోరకు ఆస్తి పన్ను వసూలునకు, రాష్ట్రంలోని వివిద ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక భూ బ్యాంకుకు చెందిన భూములను మ్యాపింగ్‌ చేయడంలో సహకరించేందుకు గూగుల్‌ అంగీకరించింది. విద్యావ్యాప్తికి సహకారం..              గూగుల్‌ క్యాంపస్‌ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ గూగుల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ బ్రామ్‌ బౌట్‌, ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ అండ్రాయిడ్‌ అండ్‌ క్రోమ్‌ ఫర్‌ వర్క్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సీనియర్‌ డైరెక్టర్‌ రాజేన్‌ సేథ్‌తో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సాంకేతికతను జోడించడం ద్వారా విద్యా ప్రమాణాల పెంపుకు గల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల స్కూలు విద్యార్థుల కోసం చేపట్టిన డిజిటల్‌ లిటరసీ కార్యక్రమానికి తగిన చేయూతనందించాలని మంత్రి ఈ సందర్భంగా గూగుల్‌ ప్రతినిధులను కోరారు. ఇందుకోసం కంపెనీ సీఎస్‌ఆర్‌ కాంపొనెంట్‌తో రూపొందించిన హర్డ్‌వేర్‌ ఇన్‌ఫ్రాను రూపొందించుకోవాలని గూగుల్‌ ప్రతినిధులు ఐటీ కార్యదర్శికి అధికారులకు సూచించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 4 రోజుల టెస్టుకి స్టార్‌ క్రికెటర్లు నో..! నాలుగు రోజుల ఐసీసీ టెస్టు ప్రతిపాదనని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తిరస్కరించారు. ఇటీవల TNN | Updated: Oct 25, 2017, 06:27PM IST నాలుగు రోజుల ఐసీసీ టెస్టు ప్రతిపాదనని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్&zwnj;స్మిత్, డేవిడ్ వార్నర్&zwnj;లు తిరస్కరించారు. ఇటీవల ఆక్లాండ్&zwnj;లో జరిగిన ఐసీసీ సమావేశంలో ప్రేక్షకుల నుంచి టెస్టులకి ఆదరణ తగ్గుతుండటంతో ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకి మ్యాచ్&zwnj;ని కుదించాలని ప్రతిపాదించారు. దీనిపై టెస్టు హోదా ఉన్న సభ్య దేశాల అభిప్రాయాలను కూడా సేకరించారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా డిసెంబరులో దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య జరగనున్న నాలుగు రోజుల టెస్టుని కూడా నిర్వహించాలని నిర్ణయించారు. &lsquo;వ్యక్తిగతంగా చెప్పాలంటే.. నాకు ఐదు రోజుల టెస్టు మ్యాచ్&zwnj; అంటేనే ఇష్టం. భవిష్యత్&zwnj;లో కూడా ఈ తరహా టెస్టులే ఆడాలని కోరుకుంటున్నా&rsquo; అని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ &zwnj;స్మిత్ అభిప్రాయపడ్డాడు. &lsquo;టెస్టు క్రికెట్ బాగా సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. ఒక మ్యాచ్&zwnj; ఐదో రోజుకి చేరిందంటే అదో గొప్ప విషయం. ముఖ్యంగా.. ఆ రోజు చివరి గంట ఎంత కీలకమో..? నాకు తెలిసి ఆ చివరి నిమిషాలే ఆటలో ఎక్కువ మజా ఇస్తాయి&rsquo; అని డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. నవంబరు చివరి వారంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ జరగనుంది.
2sports
సమ్మర్‌ కానుకగా వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రారండోయ్‌ వేడుక చూద్దాం'  - కింగ్‌ నాగార్జున Highlights సమ్మర్‌ కానుకగా వస్తోన్న గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'రారండోయ్‌ వేడుక చూద్దాం-నాగార్జున  యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'రారండోయ్‌ వేడుక చూద్దాం'. ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు, సంపత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే మూడవ వారంలో ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ప్రోగ్రెస్‌ను తెలియ చేయడానికి ఏప్రిల్‌ 20న హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌లో ప్రెస్‌ మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత అక్కినేని నాగార్జున, జగపతిబాబు, యువసామ్రాట్‌ నాగచైతన్య, హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల పాల్గొన్నారు.  నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ''ఒక అమ్మాయి తనకొచ్చే భర్త రాకుమారుడిలా ఉండాలి అని కలలు కంటుంది. ఆ రాకుమారుడు ఎవరు? ఎలా ఉంటాడు ఆ అమ్మాయి కన్న కల నెరవేరిందా లేదా అనేది చిత్ర కథ. నాకు బాగా నచ్చిన రొమాంటిక్‌ ఫిలింస్‌ నిన్నే పెళ్లాడతా, మన్మధుడు. ఫ్యామిలీ లవ్‌, ఎమోషన్స్‌ సీన్స్‌ 'నిన్నే పెళ్లాడతా'లో చూపించాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సెన్సిటివ్‌ లవ్‌ని 'మన్మధుడు'లో చూపించాం. ఆ రెండు మిక్స్‌చేసి సినిమా చేస్తే బాగుంటుందని కళ్యాణ్‌తో చెప్పాను. ఫెంటాస్టిక్‌ సబ్జెక్ట్‌ చెప్పాడు. నేను ఏదైతే అనుకున్నానో కరెక్ట్‌గా ఆ రేంజ్‌లో కథ రెడీ చేశాడు. కథ వినగానే బాగా నచ్చింది. వెరీ హ్యాపీ. జగపతిబాబు చైతన్య ఫాదర్‌గా నటించారు. వారిద్దరి మధ్య వచ్చే ఫాదర్‌ అండ్‌ సన్‌ రిలేషన్‌షిప్‌ ఎలా ఉంటుందో అద్భుతంగా తెరకెక్కించారు. రియల్‌ లైఫ్‌లో నేను, చైతు ఎలా ఉంటామో ఈ చిత్రంలో జగపతిబాబు- చైతు క్యారెక్టర్స్‌ సేమ్‌ అలాగే ఉంటాయి. అలాగే సంపత్‌ కూతురిగా రకుల్‌ నటించింది. ఒకరంటే ఒకరికి ప్రాణం. అంత బాగా వారిద్దరి క్యారెక్టర్స్‌ ఉంటాయి. ఈ నాలుగు క్యారెక్టర్స్‌ సినిమాకి మెయిన్‌ పిల్లర్స్‌గా హైలైట్‌ అవుతాయి.   దేవి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎప్పటిలాగే ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చాడు. విశ్వేశ్వరరావు కెమెరా విజువల్స్‌ సూపర్‌గా వచ్చాయి. కొత్త కెమెరామెన్‌ అయినా ప్యాషన్‌తో వర్క్‌ చేశాడు. కళ్యాణ్‌ ఆర్టిస్టులందర్నీ బాగా అందంగా చూపించాడు. చెప్పింది చెప్పినట్లుగానే తీశాడు. ఎమోషన్స్‌ బాగా కనబడాలి అప్పుడే సినిమా పండుతుంది. డైరెక్టర్‌గా కంటే కళ్యాణ్‌ మంచి రైటర్‌. అతని రైటింగ్‌ స్కిల్స్‌ చూసి 'సోగ్గాడే చిన్నినాయనా'కి తీసుకున్నాం. నాకు పెద్ద హిట్‌ ఇచ్చాడు. బంగార్రాజు క్యారెక్టర్‌ని బాగా డిజైన్‌ చేశాడు. చాలా మంచి పేరు వచ్చింది. తెలుగుదనం, నేటివిటీ గురించి కళ్యాణ్‌కి బాగా తెలుసు. సినిమా బాగా వచ్చింది. మేమంతా శాటిస్‌ఫాక్షన్‌ అయ్యాకే ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్తున్నా. మాకు నచ్చకుండా సినిమా రిలీజ్‌ చేయం. ఒక పాట తప్ప సినిమా అంతా కంప్లీట్‌ అయింది. మే మూడవ వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం. లెజెండ్‌లో యాంగ్రీ సాల్ట్‌ పెప్పర్‌ క్యారెక్టర్‌లో కనిపించిన జగపతిబాబు ఈ చిత్రంలో మోడరన్‌ స్టైలిష్‌ ఫాదర్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. రకుల్‌ బ్రమరాంబ క్యారెక్టర్‌లో నటించింది. డిఫరెంట్‌గా చాలా బాగా చేసింది. తెలుగు నేర్చుకుని క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్‌ అయి బ్యూటిఫుల్‌గా చేసింది. సినిమా చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాను. ఈ సినిమాతో రకుల్‌కి చాలా మంచి పేరు వస్తుంది. చైతు తన క్యారెక్టర్‌కి జస్టిస్‌ చేశాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సమ్మర్‌లో వస్తోన్న గుడ్‌ ఫ్యామిలీ లవ్‌, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ఫిలిం ఇది'' అన్నారు.  ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు మాట్లాడుతూ - ''ఈ సినిమా షూటింగ్‌ అయిపోయాక అప్పుడే షూటింగ్‌ ఫినిష్‌ అయిందా అనే ఫీలింగ్‌ కలిగింది. ఎంజాయ్‌ చేస్తూ కూల్‌గా వర్క్‌చేశాం. వెరీ వెరీ నైస్‌ ఫిలిం. స్టార్టింగ్‌ నుండి నాగార్జున సినిమా బాగా వస్తుందా లేదా అని ఫాలోఅప్‌ చేస్తున్నారు. చైతన్య నా కళ్ల ముందు పెరిగాడు. ఫస్ట్‌టైం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వర్క్‌ చేస్తున్నాను. చై, నేను కలిసి నటించడం చాలా హ్యాపీగా వుంది. మా ఇద్దరి మధ్య చిత్రీకరించిన సీన్స్‌ ఫెంటాస్టిక్‌గా వచ్చాయి. మా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. చై వెరీ స్వీట్‌ బోయ్‌. అద్భుతంగా నటించాడు. రకుల్‌ ఎనర్జీ లెవల్స్‌ ఎక్స్‌లెంట్‌. బాగా కాన్‌సన్‌ట్రేట్‌ చేసి ఈ సినిమాలో నటించింది. మామూలుగా నాకు ఇరిటేషన్‌ ఎక్కువ. అలాంటిది నాకు ఇరిటేషన్‌ రాకుండా స్మూత్‌గా, కూల్‌గా వర్క్‌ చేశాడు కళ్యాణ్‌. సినిమాని బాగా తెరకెక్కించాడు. చాలా డిఫరెంట్‌ ఫిలిం. తప్పకుండా మంచి సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను'' అన్నారు.  దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ - ''అన్నపూర్ణ స్టూడియోస్‌లో మళ్లీ సెకండ్‌ ఫిలిం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాగార్జున గారికి థాంక్స్‌. అన్నివేళలా నాకు సపోర్ట్‌ చేస్తూ ఎంకరేజ్‌ చేసిన సుప్రియ గారికి నా ధన్యవాదాలు. ఫ్యామిలీ ఎమోషన్స్‌, రిలేషన్స్‌ వున్న కథ ఇది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ప్రేమ. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న రిలేషన్‌. ఫాదర్‌ అండ్‌ డాటర్‌ మధ్య ప్రేమ. ఫ్రెండ్‌షిప్‌ రిలేషన్స్‌ ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎమోషన్‌ సీన్స్‌ ఎంత బాగుంటాయో, అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కూడా అంతే బాగుంటాయి. ఈ చిత్రంలో నాగచైతన్య పెర్ఫామెన్స్‌ కొత్త యాంగిల్‌లో చూస్తారు. నేను ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికన్నా అత్యద్భుతంగా చేశారు. రకుల్‌ క్యారెక్టర్‌ చాలా కొత్తగా ఉంటుంది. బ్యూటిఫుల్‌ పర్ఫామెన్స్‌ చేసింది. జగపతిబాబుగారి లాంటి సీనియర్‌ యాక్టర్‌తో వర్క్‌ చేయడం నా అదృష్టం. సెట్‌లో చాలా సరదాగా ఫన్నీగా వుంటారు ఆయన. అందరికీ నచ్చే క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది'' అన్నారు.  యువసామ్రాట్‌ నాగచైతన్య మాట్లాడుతూ - ''ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. బాలెన్స్‌ ఉన్న పాటని నెలాఖరుకు ఫినిష్‌ చేసి మే థర్డ్‌ వీక్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా చేశాక యాక్టర్‌గా నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాలంటే కళ్యాణ్‌కృష్ణతో ఒక సినిమా చేయాలి అనుకున్నాను. కళ్యాణ్‌ మంచి స్క్రిప్ట్‌ రెడీ చేశారు. నాన్న సినిమా చూసి చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. సీనియర్‌ ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాకి వర్క్‌ చేశారు. నా కెరీర్‌కి ఈ సినిమా చాలా బాగా హెల్ప్‌ అవుతుంది. ఫీల్‌గుడ్‌ లవ్‌, ఎమోషన్స్‌, రిలేషన్‌షిప్‌ ఉన్న చిత్రాలను తెలుగు ఆడియన్స్‌ బాగా ఆదరిస్తారు. ఇట్స్‌ ఎ ట్రమండస్‌ ఫిలిం. ఈ చిత్రంలో ఎమోషన్స్‌, రిలేషన్స్‌ సీన్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి. వెరీ వెరీ పాజిటివ్‌ ఫీల్‌గుడ్‌ ఫిలిం. 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాన్ని ఎలాగైతే సపోర్ట్‌ చేసి ఆదరించారో ఈ చిత్రాన్ని కూడా అలాగే సపోర్ట్‌చేసి ఆదరించాలి'' అన్నారు.  హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ - ''ఎప్పటి నుంచో ప్యూర్‌ లవ్‌స్టోరీ ఫిలిం చేయాలని వెయిట్‌ చేస్తున్నాను. కళ్యాణ్‌ ఈ స్టోరీ నెరేట్‌ చేయగానే బాగా ఎగ్జైట్‌ అయ్యాను. ఈ క్యారెక్టర్‌ నేనే చేస్తాను అని ఎంతో ఇష్టపడి చేశాను. సచ్‌ ఎ లవబుల్‌ ఇన్నోసెంట్‌ లవ్‌ స్టోరీ. మన కల్చర్‌ తెలుగు నేటివిటీకి దగ్గరగా ఈ చిత్రం ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్స్‌, ఎమోషన్స్‌ ఏవిధంగా ఉంటాయో ఈ చిత్రంలో క్లియర్‌గా చూపించారు. భ్రమరాంబ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్‌ అయి నటించాను. సినిమా ఫినిష్‌ అయ్యాక ఇంకా భ్రమరాంబలాగే బిహేవ్‌ చేస్తున్నాను. అంతలా ఆ క్యారెక్టర్‌ నన్ను వెంటాడుతంది. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్‌ జర్నీ. చై శివ క్యారెక్టర్‌లో నటించారు. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్‌ యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతాయి. ప్రతి ఒక్కరికీ నచ్చే వెరీ వెరీ క్యూట్‌ ఫిలిం. నా మనసుకి దగ్గరగా వున్న చిత్రం ఇది'' అన్నారు.  అక్కినేని నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, వెన్నెల కిషోర్‌, కౌసల్య, ఇర్షాద్‌, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్‌, సప్తగిరి, రఘుబాబు, పృధ్వీరాజ్‌, చలపతిరావు, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: విశ్వేశ్వరరావు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కళ్యాణ్‌ కృష్ణ కురసాల Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
New Delhi, First Published 2, Apr 2019, 10:43 AM IST Highlights ఎనిమిది కీలక రంగాల పరిశ్రమల్లో ఫిబ్రవరిలో కేవలం 2.1 శాతం వ్రుద్ది మాత్రమే నమోదైంది. గతేడాది ఇదే నెలలో 5.4 శాతం పురోగతి నమోదు చేసుకోవడం గమనార్హం.   కీలక రంగాల్లో మళ్లీ నీరసం ఆవరించింది. క్రూడాయిల్, రిఫైనరీ ఉత్పత్తుల్లో నెలకొన్న మందకొడి వల్ల ఫిబ్రవరి నెలకు కీలక రంగాల్లో వృద్ధి 2.1 శాతానికి పరిమితమైంది. కేంద్ర వాణిజ్య, మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ఈ సంగతి తేల్చి చెప్పింది. బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ కలిగిన ఈ ఎనిమిది కీలక రంగాలు అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.4 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా తగ్గింది.  క్రూడాయిల్ ఉత్పత్తి 6.1 శాతానికి పరిమితమవగా, రిఫైనరీ ఉత్పత్తి 0.8 శాతంగా నమోదైంది. ఎరువుల్లో వృద్ధి 2.5 శాతంగా ఉండగా, స్టీల్‌లో 4.9 శాతం, సిమెంట్‌లో 8 శాతం, విద్యుత్ 0.7 శాతంతో సరిపెట్టుకున్నది. గతేడాది నమోదైన గణాంకాలతో పోలిస్తే భారీగా తగ్గాయి. కానీ, బొగ్గు ఉత్పత్తి 7.3 శాతానికి పెరుగగా, సహజ వాయువు ఉత్పత్తి 3.8 శాతంగా నమోదైంది. కీలక రంగాల్లో నెలకొన్న నిస్తేజంతో పారిశ్రామిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్యకాలానికి కీలక రంగాల్లో వృద్ధి 4.3 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఎస్ఎఫ్ఐఓ అదుపులో ఐఎల్ఎఫ్ఎస్ మాజీ చైర్మన్ సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక సేవల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ మాజీ చైర్మన్ హరి శంకరన్ అరెస్ట్ అయ్యారు. మోసపూరిత చర్యలకు పాల్పడి నందుకు, సంస్థకు ఆర్థికంగా నష్టాలు కలిగించినందుకు ఆయనను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్‌గేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐవో) వర్గాలు తెలిపాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసులో అరస్టైన తొలి వ్యక్తి శంకరన్. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న శంకరన్..ఈ నెల 4 వరకు కస్టడీలో ఉంటారు.  Last Updated 2, Apr 2019, 10:43 AM IST
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV పిల్లల్ని కనడంపై సమంత షాకింగ్ కామెంట్స్.. ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు! సుమారు ఏడేళ్లపాటు ప్రేమించుకున్న సమంత, నాగచైతన్య 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2017 అక్టోబర్‌లో గోవాలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ తరవాత టాలీవుడ్‌లోని అందమైన జంటల్లో ఒకటిగా గుర్తింపుతెచ్చుకున్నారు. Samayam Telugu | Updated: Mar 19, 2019, 04:23PM IST పిల్లల్ని కనడంపై సమంత షాకింగ్ కామెంట్స్.. ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు! అక్కినేని సమంత ప్రస్తుతం ‘మజిలీ’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెళ్లి తరవాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన తొలి చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు ప్రచారం కల్పిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత తాను తల్లి కావడంపై స్పందించారు. Visit Site Recommended byColombia ‘ఒకవేళ నేను తల్లిని అయితే, నటన నుంచి విరామం తీసుకుంటాను. అప్పుడు నా బిడ్డే నాకు ప్రపంచం అవుతుంది. నా చిన్నతనంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వాటిని ఇప్పుడు నా బిడ్డ ఎదుర్కోకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే బిడ్డ పుడితే నేను నటనను పక్కన పెడతాను’ అని సమంత చెప్పుకొచ్చారు. తల్లితనం గురించి మాట్లాడిన సమంత.. తాను ఎప్పుడు తల్లికావాలనుకుంటున్నారో మాత్రం చెప్పలేదు. అంటే అసలు ఈ మధ్య కాలంలో ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా అనే విషయాన్ని ప్రస్తావించలేదు. సుమారు ఏడేళ్లపాటు ప్రేమించుకున్న సమంత, నాగచైతన్య 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2017 అక్టోబర్‌లో గోవాలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ తరవాత టాలీవుడ్‌లోని అందమైన జంటల్లో ఒకటిగా గుర్తింపుతెచ్చుకున్నారు. కిందటేడాది సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాపాయి కోసం తాను ఒక టైమ్‌లైన్‌ను సెట్ చేసుకున్నామని చెప్పారు. ‘నాకు బిడ్డ ఎప్పుడు కావాలో నిర్ణయించుకున్నాను. తేదీ కూడా ఖరారు చేసుకున్నాను. కానీ, ఆయన అనుకున్న తేదీకే బిడ్డ పుట్టాలని నాగచైతన్య భావిస్తున్నారు’ అని సమంత అప్పుడు వెల్లడించారు. ఇంతకీ సమంత ఏ తేదీ అనుకున్నారో తెలీదు కానీ.. అప్పటి నుంచి ఆమె నటనకు దూరం కావడం మాత్రం ఖాయం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
gilessy బెంగళూరు టెస్టుకు మాక్స్‌వెల్‌ను తీసుకోండి: గిలెస్సీ న్యూఢిల్లీ: బెంగళూరులో 4 నుంచి జరిగే రెండవ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టులోకి మిచల్‌ మార్ష్‌ స్థానంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ గ్లేన్‌ మాక్స్‌వెల్‌ను తీసుకోవడమే మంచిదని ఈ దేశ మాజీ పేసర్‌ జాసన్‌ గిలెస్సీ పేర్కొన్నాడు. తద్వారా భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇంకా బలంగా ఉంటుందని గిలెస్సీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.నాలుగు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోపీలో భాగంగా ఇంకా మూడు టెస్టులు ఆడాల్సిన సమయంలో తుది జట్టులోకి మాక్స్‌వెల్‌ను తీసుకోవాలని సెలక్టర్లకు ఆయన సూచించాడు. భారత పర్యటనలో ఉన్న ఆసీస్‌ జట్టు ఏమైనా మార్పులు చేయాలనుకుంటే మిగతా టెస్టు మ్యాచ్‌లకు మాక్స్‌వెల్‌ను తుది జట్టులోకి తీసుకోండి.మ్యాక్సీని జట్టులో తీసుకుంటే ఆసీస్‌ ఇంకా బలపడుతుంది. భారత్‌లో స్పిన్‌ను ధైర్యంగా ఎదుర్కొనే ఆటగాళ్లలో మాక్స్‌వెల్‌ ఒకడు అని వివరించాడు.ఇద్దరు సీమర్ల తో ఆడాలిన భావిస్తే మిచెల్‌ మార్ష్‌ స్థానంలో అతని తీసుకుంటే మంచిది.ఆసీస్‌ మరింత సమర్థవంతంగా సిరీస్‌లో ముందు కెళుతుంది అని గిలెస్సీ సెలక్టర్లనకు సూచించాడు.నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా పుణేలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ విజయం సాధించడంతో సిరీస్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.తద్వారా 12 సంవత్సరాల తరువాత భారత్‌తో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ని గెలిచింది.అంతేకాదు 19 వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేన విజయపరంపరకుకూడా ఆస్ట్రేలియా బ్రేక్‌ వేసింది.
2sports
internet vaartha 219 Views ముంబై : చైనా ఇ-కామర్స్‌ దిగ్గజం ఆలిబాబా భారత్‌ మార్కెట్‌లోనికి ఈ ఏడాదే ప్రవేశించాలని తహతహలాడుతోంది. ఇప్పటికే స్నాప్‌డీల్‌, వన్‌97 కమ్యూనికేషన్స్‌ పేటిఎం వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఆలిబాబా తాజాగా ఇ-కామర్స్‌ రంగంలోనికి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్‌ ఇండియా తో పోటీపడేందుకువీలుగా ఆలిబాబా జాక్‌మా ప్రణాళికలు వేస్తు న్నట్లు అంచనా. ఆలిబాబా ప్రవేశించినపక్షంలో దేశంలోని ఫ్లిప్‌ కార్ట్‌, అమెజాన్‌లు కూడా తమ పరిస్థితిని పునఃసమీక్షించుకుంటా యనడంలో సందేహంలేదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇ-కామర్స్‌సంస్థగా ఆలిబాబా నమోదయింది. 15బిలియన్‌ డాలర్ల విలువైన భారత్‌ ఇ-కామర్స్‌రంగం 69 బిలియన్‌ డాలర్లకు పెరు గుతుందని, అదే 2020 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ వంటివి ముందుగానే అంచనా వేసాయి. ఆలిబాబాగ్రూప్‌ అధ్యక్షుడు జె మైఖైల్‌ ఇవాన్స్‌ ఢిల్లీలో మాట్లాడుతూ కమ్యూనికేషన్స్‌ ఐటి మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ణు కలిసామని 2016లోనే భారత్‌లో ఇ-కామర్స్‌ వ్యాపారం ప్రారం భించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్‌ ఇండియాకు పెరిగిన ప్రాధాన్యం దృష్ట్యా భారత్‌లో ఇ-కామర్స్‌రంగం మరింత వృద్ధిచెందుతుందన్నారు. కంపెనీ తానే సొంతంగా ఇ-కామర్స్‌ ప్లేయర్‌గా రావాలని చూస్తోంది. లేదా భారతీయ భాగస్వామితో రావాలని చూస్తోంది. కేంద్రమంత్రి కూడా ఆలిబాబా భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉందని ఇందుకు తగిన వాతావరణం ఉందన్నారు. విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు ఇ-కామర్స్‌రంగంలోనికి అనుమతించడంలేదు. అయితే ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ అయిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, పేటిఎం వంటి వాటిలో విదేశీ నిధులపై ఎటువంటి ఆంక్షలు లేవు. తన పెట్టుబడులతో ఆలి బాబా ఇప్పటికే పటిష్టమైన ఉనికిని కలిగిఉంది. వన్‌97 కమ్యూ నికేషన్స్‌లో భారీ పెట్టుబడులు పెట్టింది. స్నాప్‌డీల్‌లో 500 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. అలాగే జపాన్‌ సాప్ట్‌ బ్యాంకు కూడా స్నాప్‌డీల్‌లో పెట్టుబడులు పెట్టింది. వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవలే ఆలిబాబాతో సంప్రదింపులు జరిగాయి. ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, పేటిఎం వంటి సంస్థల్లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది. ఫ్లిప్‌కార్ట్‌ విలువలు 11 బిలియన్‌ డాలర్లతో ఉన్నాయి. ఆలిబాబా ఈసంస్థల విలు వలు 15 బిలియన్‌ డాలర్లకంటే తక్కువ అంచనావేయడంతో కొంత రుణపరపతి వెనక్కి వెళ్లింది. వన్‌97 కమ్యూనికేషన్స్‌లో అతిపెద్ద వాటాదారుగా ఆలిబాబానిలిచింది. స్నాప్‌డీల్‌లో, ఫాక్స్‌ కాన్‌, సాప్ట్‌బ్యాంకులు పెట్టుబడులు పెట్టాయి. ఆలిబాబా ఫ్లిప్‌ కార్ట్‌లో వాటా కొనుగోలుకు ప్రయత్నిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఖండించింది. ప్రస్తుతం ఆలిబాబా అధినేత జాక్‌మాకు 24 బిలి యన్‌డాలర్ల టర్వోనర్‌ ఉంది. అమెజాన్‌ జెఫ్‌బిజోస్‌ భారత్‌లో అగ్ర శ్రేణి మార్కెట్‌ ప్లేస్‌గాఉంది. అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్‌తోనే గట్టిపోటీ. అమెజాన్‌ గతఏడాది రెండుబిలియన్‌ డాలర్లు పెట్టుబడులు ప్రకటిం చింది. అమెజాన్‌ జెఫ్‌బిజోస్‌ సంపద 49బిలియన్‌ డాలర్లుగా ఉంది.
1entertainment
thirimanne gets monkey off his back with the help of dhawan తిరిమాన్నె రెండేళ్ల కష్టాలు తీర్చిన సాటి లెఫ్ట్ హ్యాండర్! కోల్‌కతా టెస్టుతో తిరిమాన్నెను రెండేళ్లుగా వేధిస్తోన్న సమస్యలకు సాటి లెఫ్ట్ హ్యాండర్ పరిష్కారం చూపాడు. TNN | Updated: Nov 18, 2017, 07:21PM IST కోల్&zwnj;కతా టెస్టులో తొలి ఇన్నింగ్స్&zwnj;లో అష్ట కష్టాలు పడి భారత్ 172 పరుగులు చేసింది. బదులుగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్&zwnj;లో 34 పరుగులకే భువీ లంక ఓపెనర్లను పెవిలియన్ చేర్చి భారత్&zwnj;కు శుభారంభం ఇచ్చాడు. కానీ తర్వాత లాహిరు తిరిమాన్నె , ఏంజెలో మాథ్యూస్ అర్ధ శతకాలతో ఆదుకున్నారు. మూడో వికెట్&zwnj;కు 99 పరుగులు జోడించారు. దీంతో లంక కోలుకుంది. మళ్లీ ఉమేశ్ యాదవ్ వరుస ఓవర్లలో వీరిద్దర్నీ పెవిలియన్ చేర్చే వరకు ఆధిపత్యం చెలాయించింది. వాస్తవానికి ఈ మ్యాచ్&zwnj;లో తిరిమాన్నె ఇచ్చిన ఈజీ క్యాచ్&zwnj;ను శిఖర్ ధావన్ వదిలేశాడు. 27 పరుగుల వద్ద అవుట్ కావాల్సినవాడు 8 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. తిరిమాన్నె అర్ధసెంచరీ సాధించడం 2015 తర్వాత ఇదే తొలిసారి. ఆ ఏడాది ఆగష్టు చివరి వారంలో కొలంబో టెస్టు తొలి ఇన్నింగ్స్&zwnj;లో భారత్&zwnj;పై ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్&zwnj;మెన్ 269 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి దాకా 13 టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ సెంచరీ కాదు కదా.. పాతిక పరుగులు కూడా చేయలేకపోయాడు. గత ఏడాది లీడ్స్&zwnj;లో ఇంగ్లండ్&zwnj;పై చేసిన 22 పరుగులే అత్యధికం. టెస్టు క్రికెట్లో నిలదొక్కుకోవడానికి రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తిరిమాన్నె ధావన్ పుణ్యామని మళ్లీ అర్ధ సెంచరీతో ఫామ్&zwnj;లోకి వచ్చాడు. ఇటీవలి కాలంలో తన అతిపెద్ద సమస్యను పరిష్కరించుకోవడంలో సహకరించిన తోటి ఎడమ చేతి వాటం బ్యాట్స్&zwnj;మెన్&zwnj;కు తిరిమాన్నె థ్యాంక్స్ చెప్పాల్సిందే.
2sports
ఫింగర్ స్పిన్నర్ ని, వేళ్లతోనే..: రషీద్ ఖాన్ Highlights అఫ్గినిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. డెహ్రాడూన్‌: అఫ్గినిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ఆయనను అందరూ అద్భుతమైన మణికట్టు స్పిన్నర్ అని పిలుస్తున్నారు. అయితే, తాను ఫింగర్ స్పిన్నర్ ని అని చెప్పుకుంటున్నాడు.  తాను మణికట్టు కన్నా ఎక్కువగా చేతివేళ్లను బంతిని తిప్పడానికి వాడుతానని చెబుతున్నారు.  వేలి కొనలతో బంతిని తిప్పడం వల్ల వేగంగా విసరడానికి అవకాశం లభిస్తుందని అంటున్నాడు. లెగ్ స్పిన్ ఎలా వేయాలో తనకు ఎవరూ చెప్పలేదని, ఆ అవకాశం కూడా తనకు లేదని అన్నాడు. అయితే ఐదారేళ్ల క్రితం షాహిద్ అఫ్రిది, అనిల్ కుంబ్లేల వీడియోలను చూసేవాణ్ని అని చెప్పాడు. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో కుంబ్లే బౌలింగ్ వీడియోలను చూస్తుంటానని అన్నాడు.  లెగ్‌ స్సిన్‌లో ఎప్పటికప‍్పుడు కొత్త విషయాల‍ను తెలుసుకుంటూ ముందుకు సాగుతానని, ఎక్కువగా మణికట్టును ఉపయోగించబోనని, వేళ్లతోనే బంతిని తిప్పడానికి ప్రయత్నిస్తానని అన్నాడు.  లెగ్‌స్పిన్నర్‌ ఇలా బౌలింగ్‌ వేయడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందని అతను అన్నాడు. Last Updated 5, Jun 2018, 6:53 PM IST
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV శతకంతో శివాలెత్తిన ధావన్.. హాంకాంగ్ టార్గెట్ 286 జట్టు స్కోరు బోర్డు నడిపించే బాధ్యత తీసుకున్న వైస్‌ కెప్టెన్ శిఖర్ ధావన్.. అంబటి రాయుడితో కలిసి రెండో వికెట్‌కి అభేద్యంగా 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. Samayam Telugu | Updated: Sep 18, 2018, 09:06PM IST ఆసియా కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత బ్యాట్స్‌మెన్ జట్టుకి మెరుగైన స్కోరు అందించారు. హాంకాంగ్‌తో మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (127: 120 బంతుల్లో 15x4, 2x6) శతకం బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ధావన్‌తో పాటు అంబటి రాయుడు (60: 70 బంతుల్లో 3x4, 2x6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ డకౌటవడం భారత అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ‌కి సెలక్టర్లు ఈ టోర్నీ నుంచి విశ్రాంతినివ్వడంతో జట్టు పగ్గాలు అందుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ (23: 22 బంతుల్లో 4x4) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయాడు. దీంతో.. జట్టు స్కోరు బోర్డు నడిపించే బాధ్యత తీసుకున్న వైస్‌ కెప్టెన్ శిఖర్ ధావన్.. అంబటి రాయుడితో కలిసి రెండో వికెట్‌కి అభేద్యంగా 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకోగా.. జట్టు స్కోరు 161 వద్ద రాయుడు ఔటైపోయాడు. అయినప్పటికీ.. జోరు తగ్గించని ధావన్ కెరీర్‌లో 14వ శతకాన్ని అందుకుని భారత్‌కి 300+ స్కోరు అందించేలా కనిపించాడు.
2sports
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
Oct 10,2016 జియో ప్రపంచ రికార్డు! ముంబయి : ప్రపంచ రికార్డు నెలకొల్పిన రిలయన్స్‌ జియో. మార్కెట్లో సేవలు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 16 మిలియన్ల (1.6 కోట్లు) మంది చందాదారులను సొంతం చేసుకుని జియో వరల్డ్‌ రికార్డు సృష్టించిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. 4జీ విపణిలోకి వచ్చిన తక్కువ సమయంలోనే అత్యంత వేగంగా వినియోగదారులను ఆకర్షించినట్టు సంస్థ వెల్లడించింది. ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, స్కైప్‌ లాంటి సోషల్‌ మీడియా నెట్‌వర్స్‌తో పాటు టెలికాం ఆఫరేటర్స్‌, స్టార్టప్స్‌ లాంటి సంస్థలు కూడా ఈ స్థాయిలో యూజర్లను ఇంత తక్కువ సమయంలో నమోదు చేయలేకపోయాయని రిలయన్స్‌ జియో తెలిపింది. ఇటివల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఎజీఎం) ముఖేశ్‌ అంబానీ మాట్లాడుతూ..వంద మిలియన్‌ చందాదారులను ఆకర్షించడమే తమ లక్ష్యమని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జియో వెలకమ్‌ ఆఫర్‌కు వచ్చిన అద్భుత స్పందన పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ప్రతి భారతీయుడికీ ఇంటర్నెట్‌ డేటా అందుబాటులోకి తీసుకురావడామే తమ ఉద్దేశమని అంబానీ తెలియజేశారు. కస్టమర్లకు తాము అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు లభించిందని ఆయన హార్షం వ్యక్తం చేశారు. అలాగే కంపెనీ 3,100 నగరాలు, పట్టణాలలో ఆధార్‌-ఆధారిత కాగిత-రహిత జియో సిమ్‌ ఆక్టివేషన్‌ను ప్రవేశపెట్టినట్టు తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia తాజా మీడియా క‌థ‌నాల‌ప్రకారం భారత్‌లో ఫీచర్ ఫోన్‌ల వినియోగం గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యింది. గతేడాది 1.8-1.9 కోట్లుగాఉన్న ఫీచర్ ఫోన్ షిప్‌మెంట్స్ ఈ సంవ‌త్స‌రం ఏకంగా 40 మిలియన్లకు పెరిగినట్లు తెలుస్తోంది. 4జీ తో విడుదలైన మొట్టమొదటి ఫీచర్ ఫోన్‌గా జియోఫోన్ గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ ఫోన్‌కు మొబైల్ ప్రియులు బ్రహ్మరథం పట్టారు. అంతేకాకుండా ఈ ఫోన్ కోసం జియో పరిచయం చేసిన రూ.49 ప్లాన్‌కు యూజర్స్ బాగా ఆక‌ర్షితుల‌వుతున్నారు. షియోమి లాస్ట్ డే ఆఫర్స్,డీల్స్ ,డిస్కౌంట్లు మీకోసం.. ఇదే సమయంలో జియోఫోన్‌లకు ధీటుగా నోకియా ఫీచర్ ఫోన్‌లు కూడా అమ్ముడవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా విడుదలైన మరో రిపోర్ట్ ప్రకారం నోకియా ఫీచర్ ఫోన్‌ల విక్రయాల సంఖ్య 2.07 కోట్ల‌కు పెరిగినట్లు తెలుస్తోంది. 2017 చివరి త్రైమాసికానికి గాను సామ్‌సంగ్ ఫీచర్ ఫోన్ మార్కెట్ షేర్ 15 శాతంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ జొల్లా ఇంత‌వ‌ర‌కూ లాభాల‌ను చ‌విచూడ‌లేదు. అయితే గ‌త కొద్ది నెల‌ల్లో వ‌రుస‌గా లాభాలు సాధించిన కార‌ణంగా కంపెనీ లాభాల్లోకి వ‌స్తుంద‌ని కంపెనీ ప్ర‌తినిధి చెప్పారు. ''మేము ఇప్ప‌టికీ కొద్దిగా పెట్టుబ‌డిదారుల డ‌బ్బుపై ఆధార‌ప‌డుతున్నాం. ఏడాది చివ‌రికి మేము పూర్తి లాభాల్లోకి వ‌స్తాం. 2019 క‌ల్లా ప్ర‌తి నెలా లాభాలు సాధించే స్థితికి వ‌స్తాం. ర‌ష్యా దేశంలో ఈ సంవత్స‌రం, వ‌చ్చే ఏడాది ఎక్కువ అమ్మ‌కాలు చేప‌ట్టేందుకు అవ‌కాశాలు ఉన్నాయి. కాబ‌ట్టి ఆయా మార్కెట్ల నుంచి రాయ‌ల్టీ రూపంలో ఎక్కువ డ‌బ్బు సంపాదించ‌గ‌లం'' అని అత‌డు చెప్పాడు. 'జోల్లా' (Jolla) .. సెయిల్ ఫిష్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన తన రెండవ హ్యాండ్‌సెట్‌   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Rohit బ్యాడ్‌లక్.. ఆసీస్ గడ్డపై శతకాల రికార్డ్, కానీ! సిడ్నీ వన్డేలో శతకం బాదిన రోహిత్.. ఆసీస్‌ గడ్డ మీద నాలుగో వన్డే శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరే బ్యాట్స్‌మెన్ కూడా ఆస్ట్రేలియా గడ్డ మీద 4 సెంచరీలు చేయలేదు. కానీ ఈ నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. Samayam Telugu | Updated: Jan 12, 2019, 04:31PM IST Rohit బ్యాడ్‌లక్.. ఆసీస్ గడ్డపై శతకాల రికార్డ్, కానీ! హైలైట్స్ సిడ్నీ వన్డేలో శతకం బాదిన రోహిత్.. ఆసీస్‌ గడ్డ మీద నాలుగో వన్డే శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరే బ్యాట్స్‌మెన్ కూడా ఆస్ట్రేలియా గడ్డ మీద 4 సెంచరీలు చేయలేదు. కానీ ఈ నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ అద్భుత శతకంతో భారత్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. ధోనీ అవుటయ్యాక అవతలి ఎండ్‌లో మరో బ్యాట్స్‌మెన్ అండగా నిలవకపోవడంతో.. ఒత్తిడి పెరిగి చివర్లో అవుటయ్యాడు. 4 రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను 254/9తో మ్యాచ్‌ను ముగించిందంటే అందుకు కారణం రోహితే. భారత్ గెలిపించలేక పోయినప్పటికీ.. అద్భుత శతకంతో రోహిత్ అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.
2sports
internet vaartha 185 Views 642 కంపెనీల్లో 6.1శాతం పెరుగుదల ముంబై : భారత్‌ కార్పొరేట్‌ రంగం నాలుగో త్రైమాసికంలో కొంత రికవరీ జరిగి రాబడులు, లాభాలపరంగా మెరుగుపడింది. ఎక్ఛేంజిల్లో జాబితా అయిన టాప్‌ కంపెనీల ఫలితాలు చూస్తే నికర లాభాల్లో భారీ వృద్ధిని సాధించింది. జనవరి మార్చి త్రైమాసికంలో 40శాతం నికరలాభాలు పెరిగినట్లు అంచనా. గడచిన 11 త్రైమాసికాల పరంగాచూస్తే వార్షిక పద్ధతిన 40శాతం పెరిగిందని నిపుణుల అంచనా. క్రిసిల్‌ సర్వేప్రకారం చూసినా 642 కంపెనీల రాబడులు 6.1శాతం పెరిగాయి. గడచిన ఐదు త్రైమాసికాలతో పోలిస్తే ఇదే సత్వరం ప్రగతి అని తెలుస్తోంది. ఇక పన్నుల చెల్లింపులకు ముందు రాబడుల వృద్ధి కూడా ఆరు త్రైమాసికాల గరిష్టస్థాయిలో అంటే 15.2 శాతంగా ఉంది. నాలుగోత్రైమాసికంలో కంపెనీల వృద్ధి పనితీరు, అనూహ్యలాభాల సంఘటిత వృద్ధి అని తెలుస్తోంది. మొత్తం క్షేత్రస్థాయిలో ప్రగతిని చూస్తే 17.3శాతంగా ఉందని క్రిసిల్‌ రీసెర్చి సీనియర్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ కోపార్కర్‌ వివరించారు. టాప్‌లైన్‌ వృద్ధి 6,.1శాతంగా ఉందని, పన్నుల చెల్లింపులకు ముందు వృద్ధి 15.2 శాతంగా ఉందని ఆరుత్రైమాసికాల గరిష్టంగా ఉందని, తక్కువ ఉత్పత్తులధరలే ఇందుకు దోహదం చేసినట్లు కోపార్కర్‌ వివరించారు. నాలుగోత్రైమాసి కంలో ఈ 642 కంపెనీల ధరలు చూస్తే మొత్తం ఎన్‌ఎస్‌ఇ మార్కెట్‌ విలువల్లో 72శాతంగా ఉంది. నికరలాభం మొత్తంగాచూస్తే 49,349కోట్లు రూపాయలుగా ఉంది. మొత్తం రాబడులపరంగా చూస్తే 6.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. వార్షిక పద్ధతిలో చూస్తే ఈ కంపెనీలు గరిష్టంగా నికరలాభాలను 1.79 లక్షలకోట్లు ఆర్జించినట్లు తేలింది. 16.7శాతం పెరిగాయి. 2015 ఆర్థికసంవత్సరంలో రాబడులు 22.98 లక్షలకోట్లుగా ఉన్నాయి. 2.5శాతం పెరిగి నట్లు తేలింది. ఆర్థికరంగం, చమురుకంపెనీల విలువలు వీటిలోజతకాలేదు. వేదాంత, టిసిఎస్‌ కంపెనీ లును కూడ ాపోల్చలేదు. నాలుగోత్రైమాసికంలో కంపెనీల రాబడులు 6,18,018కోట్లుగా ఉన్నాయి. ఏటికేడాది చొప్పున 6.1శాతం పెరిగాయి. పూర్తి ఆర్ధిక సంవత్సరానికిగాను 22,98,030 కోట్లుగా ఉన్నాయి. ఏటికేడాది చొప్పున 2.5శాతం పెరిగా యి. పన్నుల చెల్లింపులకు ముందు రాబడులు 1,13,760 కోట్లుగా ఉంటే 15.2శాతం వృద్ధిని సాధించాయి. ఇక పూర్తి సంవత్సరానికిగాను పన్నుల చెల్లింపులకు ముందు 4,13,526 కోట్లుగా ఉన్నాయి. వార్షికపద్ధతిలో 8.4శాతంగా ఉన్నాయి. నికర లాభాలపరంగాచూస్తే 49,439 కోట్లుగా ఉన్నాయి. 39.9శాతం వృద్ధిని సాధించింది. పూర్తిఆర్థిక సంవ త్సరానికిగాను 1,78,833 కోట్లుగా ఉన్నాయి. వార్షికపద్ధతిలో చూస్తే 16.7శాతం వృద్ధిని సాధించి నట్లు కార్పొరేట్‌ సర్వేలు తేటతెల్లంచేస్తున్నాయి. ఇక వివిధ రంగాలపరంగాచూస్తే విద్యుత్‌,ఎయిర్‌లైన్స్‌, ఐటి,చక్కెర, ఆటో విడిభాగాలు కంపెనీలు నికర లాభాల్లో భారీ వృద్ధిని సాధించాయి. టెలికాం, ప్యాసింజర్‌కార్‌ల సంస్థలు వెనుకబడ్డాయి. పన్నుల చెల్లింపులకు ముందు వచ్చినరాబడులు లాభాల్లో ఐటి, విద్యుత్‌, ఎయిర్‌లైన్స్‌, చక్కెర పరిశ్రమలు పటిష్టమైన వృద్ధిని సాధించాయి. ఎయిర్‌లైన్స్‌, ఐటి, ఆటో విడిభాగాలు అనూహ్య ఫలితాలతో భారీ గా లాభపడినట్లు క్రిసిల్‌ సర్వే తేటతెల్లంచేస్తోంది. నికరలాభాలను 39.9శాతం పెంచింది. ఈ కంపెనీల గరిష్టనికరలాభం మొత్తంగాచూస్తే 17.3 శాతంగాఉంది. ఇక ఫార్మాకంపెనీల పరంగాచూస్తే 14శాతం రాబడుల్లో వృద్ధిని సాధించాయి. 200 బేసిస్‌ పాయింట్లకు పెరిగింది. బహుళ ఉత్పత్తుల విడుదల, తక్కువ ముడిసరుకు వ్యయాలు కారణంగా ఫార్మా కంపెనీలు కొంతమేర పొదుపు చేసుకోగలిగాయి. ఈ కంపెనీలతోపాటు టెలికాం కంపెనీలు కూడా 09.5శాతం రాబడుల్లో వృద్ధిని సాధించాయి. ఇదిలాఉంటే నికరలాభాల మార్జిన్‌ 108బేసిస్‌ పాయింట్లుతగ్గింది. ఎక్కువవడ్డీ ఖర్చులు స్పెక్ట్రమ్‌కోసం తీసుకున్న రుణాలకు భారీ వడ్డీలు చెల్లించాల్సి రావడమే ఇందుకుక ఈలకంగా ఉంది. ఆటోమొబైల్‌రంగంపరంగా మారుతి సుజుకి మంచి వృద్ధిని సాధించింది. రాబడులపరంగా 12.3శాతం వృద్ధిని నమోదుచేసింది. ఎగుమతులు మాత్రం 8.6శాతం దిగజారాయి. నిర్వహణ మారి ్జన్‌ 50 బేసిస్‌ పాయింట్లు దిగజారాయి. ఇక పన్నులు, తరుగుదలలో ఎక్కువ కావడం కూడా కొంత కారణం అయ్యాయి. ఇతర ఆదాయ వనరుల్లో తగ్గుదల, నికర లాభాలను ప్రభావితం చేసింది. నికరలాభం మార్జిన్‌ 200 బేసిస్‌ పాయింట్లను కుదించిందని క్రిసిల్‌ వివరించింది.
1entertainment
Mar 08,2017 రేడియో సిటీ ఐపీఓకు అద్భుత స్పందన ముంబయి: జాగరన్‌ గ్రూపునకు చెందిన మ్యూజిక్‌ బ్రాడ్‌క్యాస్ట్‌ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు అద్భుత స్పందన లభిస్తోంది. మ్యూజిక్‌ బ్రాడ్‌క్యాస్ట్‌ సంస్థ 'రేడియో సిటీ ఎఫ్‌ఎం' పేరుతో ప్రత్యేక మ్యూజిక్‌ ఆడియో ఛానెల్‌ను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇష్యూ రెండో రోజైన మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ ఐపీవోకు ఓవర్‌ సబ్‌స్క్రైబ్షిన్‌ లభించింది. ఇష్యూకు సైజ్‌ 1,04,80,784 షేర్లు కాగా 1,05,34,230 మంగళవారం నాటికి బిడ్లు లభించాయి. అంటే దాదాపు 1.01 రెట్ట మేర సబ్‌స్క్రిప్షన్‌ లభించిన ట్లయింది. దాదాపు రూ.400 కోట్ల మేర నిధుల సమీకరణ ధ్యేయంతో మ్యూజిక్‌ బ్రాడ్‌క్యాస్ట్‌ సంస్థ ప్రాథమిక మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 16, Sep 2018, 3:22 PM IST Highlights తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్.. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుపై స్టేజ్ మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో అతడిని టార్గెట్ చేయడంతో క్షమాపణలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు. తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్.. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుపై స్టేజ్ మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో  మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో అతడిని టార్గెట్ చేయడంతో క్షమాపణలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు. అయినప్పటికీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం అతడిని విడిచిపెట్టలేదు.  ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా స్పందించి తమ హీరోని అవమానించినందుకు మనోజ్ పై చర్యలు తీసుకోవాలని నరేశ్-శివాజీరాజాలు నడిఘర్ సంఘానికి లేఖ రాశారు. అయితే ఈ వివాదాన్ని లైట్ తీసుకోమని నడిఘర్ సంఘం సభ్యులు చెప్పినట్లు సమాచారం.  మహేష్ బాబు గురించి అందరికీ తెలుసని అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అలాంటిది అతడి గురించి ముక్కూ మొహం తెలియని వాళ్లు కామెంట్ చేస్తే స్పందించాలని అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. నిజానికి మనోజ్ రెగ్యులర్ సినిమా ఆర్టిస్ట్ కాదు.. స్టేజ్ షోలకి మాత్రమే పరిమితమయిన అతడిపై నడిఘర్ సంఘం చర్యలు తీసుకోవడం కుదరదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా.. అనవసరమైన పబ్లిసిటీ ఇచ్చినట్లవుతుందని, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తే మంచిదని సూచించినట్లు తెలుస్తోంది.  Last Updated 19, Sep 2018, 9:27 AM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV షారుక్ ‘జీరో’: పొట్టి అవతారం! బాలీవుడ్‌లో బాద్‌షా షారుక్ ఖాన్ ఈ సారి సరికొత్త లుక్‌లో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు. తన తదుపరి చిత్రంలో మరుగుజ్జు వ్యక్తిగా కనిపిస్తూ వినోదం పంచేందుకు సిద్ధమైపోతున్నాడు. TNN | Updated: Jan 2, 2018, 04:41PM IST బాలీవుడ్&zwnj;లో బాద్&zwnj;షా షారుక్ ఖాన్ ఈ సారి సరికొత్త లుక్&zwnj;లో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు. తన తదుపరి చిత్రంలో మరుగుజ్జు వ్యక్తిగా కనిపిస్తూ వినోదం పంచేందుకు సిద్ధమైపోతున్నాడు. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన టీజర్&zwnj;, సినిమా టైటిల్&zwnj;ను ఒకేసారి విడుదల చేసి... ఆశ్చర్యపరిచారు. ఇందులో షారుక్ ఖాన్ పొట్టిగా కనిపించడమే కాదు, కాసేపు సూటు, మోడ్రన్ డ్రస్సు, చివరికి.. చెడ్డీతో కూడా దర్శనమిచ్చాడు. షారుక్ పాత్రను పరిచయం చేయడానికి ముందు... అతని పాత్రకు సరిపడా టైటిళ్లు చాలానే పరిశీలించామని చెప్పేందుకు రకరకాల టైటిళ్లను ముందుగా చూపించారు. షారుక్ పరిచయం తర్వాత.. &lsquo;జీరో&rsquo; టైటిల్&zwnj;తో టీజర్ ముగిసింది. ఈ సినిమాలో షారుక్ సరసన పొడుగు కాళ్ల సుందరి కత్రినా కైఫ్ , అనుష్క శర్మ కనిపించనున్నారు. ఈ సినిమా 2018, డిసెంబరు 21న విడుదల కానుంది. షారుక్ &lsquo;జీరో&rsquo; టీజర్&zwnj;ను మీరు కూడా చూసి ఆనందించండి మరి.
0business
మెగాస్టార్ తో కొరటాల శివ? Highlights ఇప్పుడు కొరటాలకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు దర్శకుడిగా కొరటాల శివ డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. 'మిర్చి'తో మొదలైన ఆయన ప్రయాణం వరుస విజయాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన 'భరత్ అనే నేను' సినిమా వంద కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసింది. ఆయన తదుపరి సినిమా మెగాహీరో అల్లు అర్జున్ తో ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. నిజానికి కొరటాల గతంలోనే మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టాల్సివుంది. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా కూడా మొదలుపెట్టారు. కానీ ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు కొరటాలకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. ఇటీవల మెగాస్టార్ ను కలిసి కొరటాల ఒక లైన్ ను వినిపించినట్లు తెలుస్తోంది. ఆ లైన్ ఆసక్తికరంగా అనిపించడంతో చిరు పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని చెప్పాడట. ప్రస్తుతం కొరటాల మూడు నెలల పాటు బ్రేక్ తీసుకోనున్నారు. అదే సమయంలో చిరు కోసం కథను కూడా సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ కథ గనుక చిరుకి నచ్చితే ఇక ఈ కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమంటున్నారు.  Last Updated 7, May 2018, 4:36 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV జై లవకుశ టీజర్ 2: లవకుమార్ వస్తున్నాడు! ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా మరో టీజర్‌తో ముందుకు వస్తున్నాడు. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న ‘జై లవకుశ’ రెండో టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయ్యింది. TNN | Updated: Aug 16, 2017, 06:03PM IST ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా మరో టీజర్&zwnj;తో ముందుకు వస్తున్నాడు. బాబీ డైరెక్షన్&zwnj;లో వస్తున్న &lsquo;జై లవకుశ&rsquo; రెండో టీజర్&zwnj;ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయ్యింది. ఈ మూవీలో ఎన్టీఆర్ తారక్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్&zwnj;&zwnj;, టీజర్&zwnj;కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో &lsquo;జై లవకుశ&rsquo;లోని ఎన్టీఆర్ మూడు పాత్రలకు సంబంధించి మూడు టీజర్&zwnj;&zwnj;లు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే &lsquo;జై&rsquo; టీజర్ విడుదలై యూ ట్యూబ్&zwnj;ను షేక్ చేసేసింది. దీంతో తరువాత లవకుమార్ టీజర్ ఎలా ఉంటుందనే ఆసక్తిప్రేక్షకుల్లో ఏర్పడింది. తాజాగా లవకుమార్ ఫస్ట్ లుక్&zwnj;&zwnj;లో చాలా సాఫ్ట్&zwnj;గా కనిపిస్తున్న ఎన్టీఆర్ టీజర్&zwnj;లో ఎలా కనిపిస్తాడా అంటూ నందమూరి అభిమానులు లవకుమార్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమాలో రెండో పాత్ర లవ కుమార్ కు సంబంధించిన టీజర్&zwnj;ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 25న వినాయక చవితి సందర్భంగా లవ కుమార్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత, నటుడు కళ్యాణ్ రామ్ త్వరలోనే లవకుమార్ టీజర్ ఉంటుందని ప్రకటించడంతో వినాయక చవితినాడు &lsquo;లవకుమార్&rsquo; సందడి చేయంటం ఖాయంగానే కనిపిస్తుంది. రాశిఖ&zwnj;న్నా, నివేదా థామ&zwnj;స్&zwnj;లు ఎన్టీఆర్&zwnj;కు జోడీగా నటిస్తుండగా.. బాలీవుడ్&zwnj; నటుడు రోనిత్ రాయ్ ఈ మూవీలో విలన్&zwnj; నటిస్తుండగా.. సెప్టెంబ&zwnj;ర్ 21న ప్రపంచ వ్యాప్తంగా &lsquo;జై లవకుశ&rsquo; విడుదల కానుంది.
0business
మిలిమిల మెరిసిన కోల్గేట్‌ - లాభాల్లో 24 శాతం వృద్ధి             న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ కోల్గేట్‌ క్రితం ఆర్ధిక సంవత్సరం (2014-15) జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 23.68 శాతం వృద్ధితో రూ.163.63 కోట్ల నికర నికర లాభాన్ని సాధించింది. 2013-14 ఇదే క్యూ4లో రూ.132.30 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. గత క్యూ4లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,028 కోట్లకు చేరింది. 2015 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ నికర లాభాలు రూ.558.98 కోట్లుగా నమోదయ్యింది. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరంలో రూ.539.87 కోట్ల లాభాలు ఆర్జించింది. గత మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.3,578.81 కోట్ల నుంచి రూ.3,981.94 కోట్లకు చేరింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jun 08,2018 30న ఆకాశ్‌ అంబానీ నిశ్చితార్థం ముంబయి: రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ నిశ్చితార్థానికి రంగం సిద్ధమైంది. రోజీ బ్లూ డైమండ్స్‌ అధినేత రసెల్‌ మెహతా- మోనాల కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాశ్‌ నిశ్చితార్థాన్ని ఈనెల 30న నిర్వహించునన్నారు. ముకేశ్‌ నివాసం యాంటెలా ఈ వేడుకకు వేదిక కానుంది. ప్రముఖులు, బంధువుల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోనున్నారని అంబానీ కుటుంబీకులు చెబుతున్నారు. దేశంలోని అత్యంత ప్రముఖులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు. ఇందులో భాగంగా వివాహ నిశ్చితార్థ మొదటి ఆహ్వాన పత్రికను నీతా అంబానీ ముంబయిలోని వరసిద్ధి వినాయక స్వామికి సమర్పించారు. అంబానీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇంటిల్లిపాదీ వరసిద్ధి వినాయక దేవాలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
MEDICME భారత్‌ ఫార్మా కంపెనీలకు ఎఫ్‌డిఎ ఝలక్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ భారతీయ ఔషధరంగం మరింతగా ఉన్నత నాణ్యతాప్రమాణాలు పెంపొందిం చుకోవాలని హెచ్చరిస్తోంది. ఎఫ్‌డిఎ ఇండియా కార్యాలయ డైరెక్టర్‌ మాథ్యూ థామస్‌ భారత ఫార్మా కూటమిపై కొంతమేర ఆందోళన వ్యక్తంచేసారు. ఇటీవలే కొన్ని నమూనాలను పరిశీలించామని, వీటిలో కొన్ని బ్లిస్టర్‌ ప్యాకింగ్‌లు కూడా ఉన్నాయని అయితే అందులో నిర్దేశిం చిన పారాసిటమాల్‌ మాత్రం లేదని ఆయన విస్మయం ప్రకటించారు. ర్యాపిడ్‌టెస్ట్‌టూల్‌తో వీటిని పరీక్షలుచేస్తామని పారాసిటమాల్‌ అని రాసిన బ్లిస్టర్‌ప్యాక్‌లో ఇంతకూ పారాసిటమాల్‌ లేదని అన్నారు. తమ కు ఢిల్లీలో ఉన్న అమెరికా రాయభార కార్యాలయం ఆరోగ్యవిభాగం నుంచి నమూనాలు కొన్ని వస్తుంటాయని, ఎక్కువశాతం ఈ మందు లు ఆశించిన ఫలితాలివ్వడంలేదన్న ఫిర్యాదులే అధికంగా ఉన్నాయని అన్నారు. సమర్ధతనాణ్యతలేని ఔసధాలను మనలో ఎవరైనా తీసుకు నేందుకు ఇష్టపడతామనా అని ప్రశ్నించారు. ఈ మందులు ప్రమాణా లు ఎలా ఉన్నాయన్న అంశంపై వాటిని య్రోగశాలలకు పంపించాల్సి ఉంటుందని అన్నారు. భారతీయ కంపెనీలు ఇప్పకయినా స్పందించి అత్యుత్తమ ప్రమాణాలున్న మందులను ఉత్పత్తిచేయాలని ఫిర్యాదు లపై విచారణ జరిపి తదుపరిచర్యలు తీసుకోవాలని సూచించారు. వీటిపై కేడిలా కంపెనీ ఛైర్మన్‌ పంకజ్‌పటేల్‌ స్పందిస్తూ విభిన్న ప్రమాణాలున్న మందులు ఉత్పత్తి కాబోవని, అంతర్జాతీయ ప్రమాణా లున్న కంపెనీలనే తమ సంస్థ ఉత్పత్తిచేస్తుందని, అవే మందులను అమెరికాకు కూడా ఎగుమతులు చేస్తామన్నారు. ఒకేవిధమైన ప్రమా ణాలను అమలుచేసేందుకు భారతీయ ప్రభుత్వ సంస్థలు ఇందుకు నిబంధనలు అమలుచేయాల్సి ఉంటుందన్నారు. ఐపిఎ ప్రధాన కార్య దర్శి డిజి షా మాట్లాడుతూ ఎఫ్‌డిఎ చేసిన పరిశీలనలు కేవలం ఫిర్యా దుల్లో విచారణ ఎలా ఉంటుందన్న అంశంపై ఉదాహరణగా పేర్కొన్న దేనన్నారు. ఇది ఎంతమాత్రం భారతీయ ఫార్మారంగంపై రపభావం ఉండదన్నారు. లూపిన్‌ ఎండి నీలేష్‌ గుప్తా వ్యాఖ్యానించేందుకు నిరాకరిం చారు. నాణ్యతాప్రమాణాల సమస్యలుంటాయి. అయితే వీటిని ఎలా అధి గమిస్తామన్నదే ముందున్న కరత్వ్యమనిఅన్నారు. లూపిన్‌ వరకూ ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసి మందులపై అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు విచారణ జరిపిస్తామన్నారు. భారత్‌పరంగా అమెరికాకు మూడోవంతు జనరిక్‌మందులను ఎగుమతిచేస్తుంది. అంతేకాకుండా భారతీయ ఫార్మా సంస్థలు సైతం ఎఫ్‌డిఎ నుంచి అనేకసార్లు హెచ్చరికలేఖలు సైతం అందు కున్నాయి. ఉత్పత్తుల ఆమోదం జాప్యం వంటి వాటికిపైగా ఎఫ్‌డిఎ పలు సూచనలు చేస్తుంది. 2011నుంచి 2016 మధ్యకాలంలో మొత్తం 27 ఉత్పత్తి ప్లాంట్లు ఎఫ్‌డిఎ హెచ్చరికలను అందుకున్నాయి. వీటిలో 15 సంస్థలు దిగుమతి హెచ్చరికలు అందుకున్నాయి. ఇప్పటికీ ఈహెచ్చరికల ను ఎఫ్‌డిఎ ఉపసంహరించుకోలేదు. రెండేళ్లక్రితం ఆరు మందులకంపెనీ లు తమ నాణ్యతాప్రమాణాలు పెంపొందించుకునేందుకు కార్యాచరణ ప్రారంభించాయి. వివిధ నియంత్రణ సంస్థలు ఎత్తిచూపినలోపాలు సర్దు బాటు చేసుకుంటున్నాయి. యాంత్రీకరణతోపాటు ఉన్న సిబ్బందికిశిక్షణ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఎక్కువకంపెనీలు కాగితరహిత కార్య కలాపాలతో ఆన్‌లైన్‌ కంప్యూటరీకరణలకు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలోనే ప్రతిప్లాంట్‌ వద్ద టీమ్‌లను ఏర్పాటుచేసి లోపాలుఎక్కడ ఉన్నాయో తెలు సుకుంటున్నా మని, క్షేత్రస్థాయిలోనే వీటిని పరిష్కరిస్తున్నట్లు కేడిలా గ్లోబల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉమాంగ్‌ వోహ్రా అన్నారు. కేడిల్లా ఛైర్‌పర్సన్‌ పటేల్‌ మాట్లాడుతూ మార్కెటింగ్‌ బృందాలు, ప్లాంట్లు నేరుగా సంప్రదిం పులు జరుపుకునే విధానం నిలిపివేసామని, అనవసర, అర్ధరహితమైన ఒత్తిడిఉద్యోగులపై ఉండకూడదనే ఈనిర్ణయం తీసుకున్నట్లు వివరించారు
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పుణే పిచ్ ట్యాంపరింగ్.. క్యురేటర్ సస్పెండ్ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో పుణఏలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం క్యురేటర్‌ను బీసీసీఐ సస్పెండ్ చేసింది. | Updated: Oct 25, 2017, 03:09PM IST పుణేలోని మహారాష్ట్ర క్రికెట్&zwnj; అసోసియేషన్&zwnj; స్టేడియం క్యురేటర్&zwnj;ను బీసీసీఐ సస్పెండ్ చేసింది. న్యూజిలాండ్&zwnj;-భారత్ మధ్య రెండో వన్డే&zwnj; ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్&zwnj;లో నివ్వెర పరిచే నిజాలు బయటపడ్డాయి. పిచ్ క్యూరేటర్ పాండురంగ్ సాల్గావ్&zwnj;కర్ బుకీలతో కలిసి ఫిక్సింగ్&zwnj;కు పాల్పడినట్లు ఆ స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైంది. అండర్ కవర్ రిపోర్ట్&zwnj;ను బుకీగా భావించిన క్యురేటర్ పిచ్ ట్యాపరింగ్ విషయాన్ని బయటపెట్టాడు. దీంతో బీసీసీఐ పాండురంగ్&zwnj;ను వెంటనే సస్పెండ్ చేసింది. ఇలాంటి విషయాలను బీసీసీఐ ఎంతమాత్రం ఉపేక్షించదని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్&zwnj; చౌదరి స్పష్టం చేశారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియన్ కూడా అతణ్ని అన్ని బాధ్యతల నుంచి తప్పించింది. అనంతరం న్యూట్రల్ క్యూరేటర్ ఒకరు పిచ్&zwnj;ను పరిశీలించి మ్యాచ్&zwnj; జరపొచ్చని చెప్పారు. ఆ తర్వాత ఐసీసీ కూడా మ్యాచ్ జరిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనకు తాను బుకీగా పరిచయం చేసుకున్న రిపోర్టర్&zwnj;కు క్యురేటర్ పాండురంగ్ సాల్గావ్&zwnj;కర్ పిచ్ సమాచారం ఇచ్చాడు. మైదానంలోకి తీసుకెళ్లి పిచ్&zwnj;ను చూపించాడు. ఈ తతంగం మొత్తాన్ని రహస్య కెమెరా ద్వారా చిత్రీకరించారు. మీకు కావాల్సిన విధంగా పిచ్&zwnj;ను సిద్ధం చేస్తానని క్యురేటర్ చెప్పడం అందులో స్పష్టంగా కనిపించింది. ఈ పిచ్&zwnj;పై 337 పరుగులను చేధించడం కూడా తేలికే అని ఆయన చెప్పాడు. పాండురంగ 1971-82 మధ్య మహారాష్ట్ర టీమ్ ఫాస్ట్ బౌలర్&zwnj;గా వ్యవహరించాడు. రిటైర్ అయిన తర్వాత ఎంసీఏ మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుత అధ్యక్షుడు అభయ్ అప్టేలు అతడికి సహకరించారు. ప్రస్తుతం పాండురంగకు ఎంసీఏ నెలకు రూ. 65 వేల వేతనం ఇస్తోంది. బీసీసీఐ పెన్షన్ కూడా అందిస్తోంది. బీసీసీఐ ఇండిపెండెంట్ క్యురెటర్లలో సాల్గావ్&zwnj;కర్ ఒకరిగా ఉన్నాడు. కానీ అతడికి సహకరించిన వారు తలదించుకునేలా పాండురంగ వ్యవహరించాడని బీసీసీఐ తత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా తెలిపారు.
2sports
parineeti chopra opens up about rumours linking her with cricketer hardik pandya హార్థిక్ పాండ్యతో ఎఫైర్‌పై స్పందించిన పరిణీతి చోప్రా ప్రముఖ క్రికెటర్ హార్ధిక్ పాండ్యతో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రేమలో పడిందని ఇటీవల పలు పుకార్లు షికార్లు చేశాయి. TNN | Updated: Sep 7, 2017, 07:35PM IST ప్రముఖ క్రికెటర్ హార్ధిక్ పాండ్యతో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రేమలో పడిందని ఇటీవల పలు పుకార్లు షికార్లు చేశాయి. సోషల్ మీడియాలో పరిణీతి, హార్థిక్ పాండ్య మధ్య జరిగిన సంభాషణే ఈ పుకార్లకి కారణమైంది. తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్ లో ప్రత్యక్షమైన పరిణీతిని మీడియా ఇదే ప్రశ్న అడిగింది. ప్రస్తుతానికి సింగిల్ గానే వున్నావా లేక హార్థిక్ పాండ్యతో మింగిల్ అవుతున్నావా అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన పరిణీతి.. &quot;ప్రస్తుతానికి తాను సింగిల్ గా వున్నానా లేదా అనేది అనవసరం కానీ చాలామంది భావిస్తున్నట్టుగా హర్థిక్ పాండ్యతో డేటింగ్ లో మాత్రం లేను&quot; అని క్లారిటీ ఇచ్చింది. యశ్&zwnj;రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ హౌజ్&zwnj;లో పీఆర్ కన్సల్టెంట్&zwnj;గా చేస్తున్న సమయంలోనే నటిగా కెరీర్ ఆరంభించాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోకి వచ్చిన పరిణీతి అప్పటినుంచి వరుసగా చిత్రాలు చేస్తూ హీరోయిన్&zwnj;గా బిజీ అయిపోయింది. కానీ పరిణీతికి కెరీర్&zwnj;లో ఇంకా సరైన బ్రేక్ మాత్రం లభించలేదు.
0business
అన్ని దేశాల్లో నిపుణులు కరవే మాన్‌ పవర్‌ గ్రూప్‌ సర్వే న్యూఢిల్లీ, నవంబరు 1: అంతర్జాతీయ ఆర్థికవృద్ధి మందగమనం కార ణంగా ప్రపంచ వ్యాప్తంగా 40శాతం యాజమాన్యాలు నిపుణులైన ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉన్నతస్థాయి హోదాలను భర్తీచేసుకోలేకపోతున్నాయి. మాన్‌పవర్‌గ్రూప్‌ నిర్వహించిన సర్వేలో గత ఏడాది కంటే 200 బేసిస్‌ పాయింట్లు పెరిగినా ఎక్కువశాతం యాజమాన్యాలు 2007 నుంచి తమకు నిపుణులైన అధికారుల కొరత ఎక్కువఉందని చెపుతున్నారు. 43 దేశాల్లోని 42,300 యాజమా న్యాలు వృత్తిపరమైన నిపుణుల కొరత ఎక్కువ ఉందని వెల్లడించాయి. 2006లో 40శాతం కొరత ఉంటే 2016 నాటికి కూడా అదేస్థాయిలో కొరత ఉందని సర్వేలో తేటతెల్లంఅయింది. 2007లో అయితే 41 శాతం కొరత ఉన్నట్లు తేలింది. నైపుణ్యంతో కూడిన రంగాలు అంటే విద్యుత్‌మెన్‌లు, కార్పెంటర్లు, వెల్డర్లు, బ్రిక్‌లేయర్లు, ప్లాస్టరర్స్‌, ప్లం బర్లు, తాపీమేస్త్రీలు వంటివారు. ఐటి సిబ్బంది పరంగా డెవలపర్లు, ప్రోగ్రామర్లు, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్లు, ఐటి లీడర్లు,మేనేజర్లు ఎక్కువ మంది ఉన్నారు. సేల్స్‌ రిప్రజెంటేటివ్‌లు, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు, సేల్స్‌అడ్వయిజర్లు, రిటైల్‌సేల్స్‌ సిబ్బంది ఇంజనీర్లపరంగా మెకానిక ల్‌, విద్యుత్‌, సివిల్‌ ఇంజనీర్ల కొరత ఎక్కువ. టెక్నిషియన్లపరంగాచస్తే ఉత్పత్తి, కార్యకలాపాలు, పర్యవేక్షణ టెక్నిషియన్స్‌కు కొరత ఎక్కువ. ఒక డ్రైవర్లపరంగా ట్రక్కు, లారీ, హెవీగూడ్స్‌, డెలివరీ, భారీ యంత్ర సామగ్రి, నిర్మాణరంగడ్రైవర్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఇక అకౌం టింగ్‌లో ఫైనాన్స్‌ సిబ్బంది, బుక్‌కీపర్లు, సర్టిఫైడ్‌ అకౌంటెంట్లు, ఆర్ధిక అనలిస్టుల కొరత ఎక్కువే. మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఎగ్జిక్యూటివ్‌లు సీనియర్లు, బోర్డుస్థాయి మేనేజర్లు కొరత ఎక్కువే. ఉత్పత్తిపరంగా మెషిన్‌ ఆపరేషన్స్‌ ప్రత్యేక ఆపరేటర్లకు డిమాండ్‌ఎక్కువ. ఆఫీస్‌ సపోర్టు స్టాఫ్‌ అంటే సెక్రటరీలు, వ్యక్తిగత సహాయకులు, అసిస్టెంట్లు, రిసిప్షనిస్టులు పిరపాలనలో సహాయకులకు కొరత ఎక్కువగా ఉంది. సర్వేలో ఎక్కువగా జపాన్‌లో నైపుణ్యంకలిగిన వారిని అందిపుచ్చుకోవ డం కష్టంగాఉంది. జపాన్‌లో 86శాతంమంది యాజమాన్యాలు ప్రతి భావంతుల కొరతను ఎదుర్కొంటున్నాయి. తదనంతరం తైవాన్‌ 73 శాతం, రొమేనియా 72శాతం కొరత ఎదుర్కొంటున్నాయి. ఇక హాం కాంగ్‌లో 69శాతం, టర్కీలో 66శాతం, బల్గేరియా 62శాతం, అర్జంటైనా 59శాతం, గ్రీస్‌లో59శాతం, హంగరీ 57శాతం, ఇజ్రా యిల్‌లో 56శాతం వృత్తినిపుణుల కొరత ఉంది. ప్రతినెలా మిలియన్ల కొద్దీ ఉపాధిరం గంలోనికి వస్తున్నా భారత్‌లో వృత్తినైపుణ్యా ల కొరత కూడా ఎక్కువగానే ఉంది. 48 శాతం మంది యాజమాన్యాలు భారత్‌లో ప్రతిభావంతుల కొరత వల్ల నిపుణులైన కొలువుల్లో భర్తీకష్టం అవుతోందని, ప్రపం చ సగటు 40గా ఉంటే భారత్‌లో ఈ కొరత 48శాతంగా ఉంది. అత్యధికంగా భారత్‌లో నైపుణ్య కరొత ఐటి, అకౌంటింగ్‌, ఆర్థికరంగాల్లో ఉన్నట్లు తేలింది. భారత్‌లో ఎక్కువగా ఐటిసిబ్బంది, అకౌంటింగ్‌, ప్రాజ ెక్టు మేనేజర్లు, సేల్స్‌మేనేజర్లు, కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌లు, టెక్నిషియన్లు, క్వాలిటీ కంట్రోలర్లు, టెక్నిషియన్లు, క్వాలిటీ కంట్రోలర్లు, కొను గోళ్లు, ప్రొక్యూర్‌మెంట్‌ సిబ్బంది విభాగాల్లో భారీ కొరత ఉన్నట్లు అంచనా.
1entertainment
సమంత సంతోషానికి కారణమైన ఆ మూడు! Highlights పెళ్లి చేసుకుంటే ఇక హీరోయిన్లుగా సినిమా అవకాశాలు రావడం కష్టమని పెళ్లి చేసుకుంటే ఇక హీరోయిన్లుగా సినిమా అవకాశాలు రావడం కష్టమని, కెరీర్ అక్కడితో ఆగిపోతుందనే నిర్ణయానికి వచ్చేస్తారు. అవన్నీ కేవలం అపోహలు మాత్రమే.. ప్రతిభకు పెళ్ళితో సంబంధమే లేదని నిరూపించింది నటి సమంత అక్కినేని. గతేడాది నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత ఓ పక్క నటిగా సినిమాలు చేస్తూనే మరోపక్క తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తోంది. అంతేకాదు తన భర్తతో ఎంతో సంతోషంగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మూడు ఘన విజయాలను సొంతం చేసుకొని మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన 'రంగస్థలం' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది సమంత. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. లేటెస్ట్ గా విడుదలైన 'మహానటి' సినిమాలో సమంత జర్నలిస్ట్ పాత్రలో సరికొత్త లుక్ తో ఆకట్టుకుంది. తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం 'ఇరుంబు తిరై' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయింది చిత్రబృందం. సమంత పాత్రకు సైతం మంచి గుర్తిపు వచ్చింది. ఈ మూడు విజయాలతో ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసింది సమంత. తనకు ఉత్తమమైన వేసవిని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పవర్ స్టార్‌తో కన్నడస్టార్! పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో పవన్ సినిమా మొదలుపెట్టడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. TNN | Updated: Dec 21, 2016, 07:14PM IST పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్&zwnj;లో పవన్ సినిమా మొదలుపెట్టడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం బొమన్ ఇరానిని ఎంపిక చేసుకున్నారు. అలానే పవన్&zwnj;కు జంటగా కీర్తి సురేష్ కనిపించనుంది. మరొక హీరోయిన్&zwnj;గా అను ఇమాన్యుయల్&zwnj;ను సెలక్ట్ చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం కన్నడ స్టార్ హీరోను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. 'రా, ఏ, ఉపేంద్ర ' వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన నటుడు ఉపేంద్ర. రీసెంట్&zwnj;గా 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో అల్లు అర్జున్&zwnj;తో కలిపి స్నేహతో కలసి సందడి చేసిన తెలిసిందే. ఆ చిత్రానికి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు పవన్ సినిమాలో కూడా ఆయను దృష్టిలో పెట్టుకొని ఓ పాత్ర డిజైన్ చేశారట త్రివిక్రమ్. ఈ పాత్ర గురించి ఉపేంద్రకు చెప్పగానే ఉత్సాహంగా అంగీకరించినట్లు సమాచారం. ఫిబ్రవరి నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’.. దీపావళికి రచ్చ చేయనున్న వర్మ ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అప్‌డేట్‌తో రామ్ గోపాల్ వర్మ వచ్చారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ మేరకు తేదీని ప్రకటించారు. Samayam Telugu | Updated: Oct 23, 2019, 09:56PM IST సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న మరో వివాదాస్పద చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఆంధ్రప్రదేశ్‌కు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో వర్మ ఈ సినిమాను ప్రకటించారు. వివాదాస్పద పాత్రలతో అస్సలు వివాదాస్పదం కాని సినిమా ఇదంటూ ఇప్పటికే వర్మ ప్రచారం చేశారు. రెండు నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లుక్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఆ లుక్ బాగా వైరల్ అయ్యింది. Also Read: సినీ నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు వర్మ. దీపావళి సందర్భంగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 27న ఉదయం 9.36 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ కూడా వదిలారు. ఈ పోస్టర్‌లో జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ పాత్రలు ఉన్నాయి. మొత్తం మీద దీపావళి రోజు వర్మ రచ్చ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ మరెన్ని వివాదాలకు తెరలేపుతుందో చూడాలి. వివాదాస్పద పాత్రలతో అస్సలు వివాదం కాని సినిమా అని చెబుతున్నా వర్మ అంత ఈజీగా వదుతులుతారని అనుకోకూడదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కేసులు, కోర్టుల చుట్టూ ఈ సినిమా తిరిగింది. మొత్తానికి ఎన్నికలు అయిపోయిన తరవాత విడుదలైంది. ఈ సినిమాలో ప్రధానంగా చంద్రబాబు నాయుడిని విలన్‌గా చూపించారు వర్మ. మరి ఈ ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో ఏం చూపించబోతున్నారో. ఈ సినిమాను అజయ్ మైసూర్ ప్రొడక్షన్, టైగర్ కంపెనీ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. On eve of Diwali 27th October.. Trailer release at 9.36 AM ..It is a non controversial film with controversial char… https://t.co/Kf8RExOKz6 &mdash; Ram Gopal Varma (@RGVzoomin) 1571837359000
0business
ఆ నిర్ణయాలే కీలకం వచ్చే ఏడాది మార్కెట్ల తీరుతెన్నులపై ఆర్థికవేత్తల విశ్లేషణ ముంబై, అక్టోబరు 22: అంతర్జాతీయ స్థాయిలో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ట్రంప్‌ గెలవడం, ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్ల పెంపు నిర్ణయం వంటివి ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ సెంటి మెంట్‌ను దెబ్బతీసాయనే చెప్పాలి. అయితే ప్రభుత్వం నల్ల ధనంపై ప్రకటించిన యుద్ధం, పోద్దనోట్ల చెలామణి రద్దు, ఇండోమారిషస్‌ పన్ను ఒప్పందానికి సవరణలు, జిఎస్‌టిబిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం, పాకిస్తాన్‌పై మెరుపు దాడులు, రఘురామ్‌రాజన్‌ ఆకస్మికంగా బ్యాంకు గవర్నర్‌గా వైదొలగడం వంటి సంఘటనలు మార్కెట్లలో తీవ్రస్పందనలకు కారణం అయ్యాయి. ఈ ఏడాది బడ్జెట్‌ ప్రకటించిన తర్వాత మార్కెట్లు భారీ ర్యాలీని నమోదుచేసినా పతనం కూడా అంతే వేగంగా జరిగింది. బెంచ్‌మార్క్‌ సూచీలు ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌, నిఫ్టీ 50 సూచీలు రెండుశాతం మాత్రమే ఈ కేలం డర్‌ సంవత్సరంలో పెరిగాయి. అయితే రానున్న కేలండర్‌ సంవత్సరంలో మార్కెట్లకు ఏఏ అంశాలు ఊతం ఇస్తాయన్న వాటిపై ఇన్వెస్టర్లు, మార్కెట్‌నిపుణులు ఇపుడిపుడే అంచనాలు వేస్తున్నారు. కార్పొరేట్‌ ఫలితాలను పెద్దనోట్లరద్దు భారీ ప్రభా వం చూపిస్తుందని అంచనా. ప్రభుత్వ కార్యాచరణతో జిడిపి వృద్ధి 2017, 2018సంవత్సరాల్లో కొంత మార్పులకు లోనవు తుంది. భారత్‌కార్పొరేట్‌ ఆర్థికఫలితాలే ఇందుకుకీలకం. అంత ర్జాతీయ సంస్థక్రెడిట్‌ స్యూస్సీ ఇటీవలే జిడిపివృద్ధిని 7.8శాతం నుంచి 6.9శాతానికి తగ్గించింది. పెద్దనోట్లరద్దు, సరఫరా వైపు ఉన్న అంతరాయాలు మూడు, నాలుగుత్రైమాసికాల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తాయని అంచనా. మార్కెట్లు వచ్చే మూడు నుంచి ఆరునెలల్లో రికవరీ అవుతాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ కార్యాచరణ జాప్యం అయ్యేకొద్దీ మార్కెట్లు మరింత మార్పులు చేర్పులకు లోనవుతాయి. అక్టోబరు నుంచి ఇప్పటివరకూ వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి 23 బిలియన్‌ డాలర్లు అంటే 2300 కోట్ల డాలర్ల నిధులు ఇతర మార్కెట్లకు తరలివెళ్లాయి. మోర్గాన్‌ స్టాన్లీ అంచనాలను చూస్తే సెన్సెక్స్‌ రాబడుల వృద్ధి 2.5 శాతంగా ఉంటుందని, ఏటికేడాది వార్షిక వృద్ధిని చూస్తే 18శాతంగా ఉంటుందని అంచనా. ఈక్విటీలు, బాండ్లలో కూడా 2013 నాటి కనిష్టస్థాయి విలువలకు కొంత అటూ ఇటూగా ఉంటాయని అంచనావేస్తోంది. 2017లో మార్కెట్లు 14శాతం రిటర్నులు తెస్తాయన్న అంచనాలను మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో ఉటంకించింది. ఇక మార్కెట్లు కొత్త అధ్యక్ష అభ్యర్ధి చేపడుతున్న కీలక నియామకాలపై కూడా దృష్టిపెట్టాయి. ఆయన విధివిధానాల కార్యాచరణ, జనవరిలో ఆఫీసుకు వచ్చిప్పటినుంచి చేపట్టే కార్యాచరణ ఏమిటన్న అం శంపై ఇన్వెస్టర్లు గురిపెట్టారు. వీటికితోడు అమెరికా ఫెడ్‌రిజర్వువడ్డీరేట్లను పెంచుతామని, ఆర్థిక వ్యవస్థ క్రమేపీ రికవరీ అవుతుందన్న అంచనాలు వేస్తోంది. దీని వల్ల వర్ధమాన మార్కెట్ల నుంచి డాలర్‌ పెట్టుబడులన్నీ అమె రికా బాండ్లమార్కెట్‌వైపు తరలుతా యన్న అంచనాలున్నాయి. భారత్‌ తో పాటు ఇతరయూరోప్‌, ఆసియా మార్కెట్లపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఇక భారత్‌ మార్కెట్ల పరంగా చూస్తే కీలకమైన భారత రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాదే జరుగుతున్నాయి. పంజా బ్‌, ఉత్తరప్రదేశ్‌, గోవా, ఉత్తరా ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌; మణిపూర్‌ రాష్ట్రాల్లో 2017లో ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రా ల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీల కూటమి జయా పజయాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయనడంలో సందే హం లేదు. ప్రత్యేకించి గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలపైనే దేశీయ అంతర్జాతీయ ఇన్వెస్టర్ల విశ్లేష ణలు జోరుగాఉన్నాయి. బిజెపి విజయంసాధిస్తే మార్కెట్లకు సానుకూలంగా ఉంటుందని నిపుణుల అంచనా. గత ద్వైమా సిక మానిటరీపాలసీ సమీక్షలో రిజర్వుబ్యాంకు యధాతథస్థితినే అనుసరించింది. వడ్డీరేట్ల పెంపుజోలికి వెళ్లలేదు. అయితే ఫిబ్రవరిలో మరొకసారి పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. అప్పటికి దేశంలో పెద్దనోట్ల రద్దు ప్రభావాన్ని ఆర్‌బిఐ సమగ్ర స్థాయిలో అధ్యయనం చేస్తుందని అంచనా. వీటికితోడు అమెరికా ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్ల పెంపుప్రభావం కూడా మదింపు చేయవచ్చనరి ఇన్వెస్టర్లు చెపుతున్నారు. ఆర్‌బిఐ వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లను ఫిబ్రవరి 8వ తేదీ జరిగే సమీక్షలో తగ్గి స్తుందని, తిరిగి ఏప్రిల్‌లో మరో 50 బేసిస్‌ పాయింట్లు తగ్గి స్తుందని అంచనాలు వేస్తున్నారు. నవంబరు రిటైల్‌ద్రవ్యోల్బణం 3.6శాతంగా ఉంది. బ్యాంక్‌ఆఫ్‌అమెరికా 4శాతం అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. ఆర్థికనిపుణుల అంచనాలు 3.9 శాతంగా ఉన్నాయి. ఇక రెండోది పారిశ్రామిక ఉత్పత్తిపరంగా 1.9శాతం తగ్గింది. వీటికితోడు పెద్దనోట్ల రద్దు షాక్‌ కూడా జనవరి నాటికిప్రభావంచూపిస్తుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ అభిప్రాయం వ్యక్తంచేసింది. ఇక అంతర్జాతీయం గా ముడిచమురుధరలు కీలకం అవుతున్నాయి. 2008 తర్వా త మొదటిసారిగా పెట్రోలియం ఎగుమతిదేశాల సమాఖ్య ఉత్ప త్తిని రోజుకు మిలియన్‌బ్యారెళ్లకు తగ్గించేందుకు నిర్ణయించింది. రోజుకు ఏడులక్షలబ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించి సగటున 32.5 నుంచి 33 మిలియన్‌ డ్యారెళ్లను ఉత్పత్తిచేయాలని నిర్ణయిం చింది. గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనాలప్రకారంచూస్తే చమురు ధరలు ఏడు నుంచి పది డాలర్లు బ్యారెల్‌కు పెరుగుతాయని, వచ్చే ఏడాది మొదటి అర్ధసంవత్సరంలోనే ధరలు పెరుగుతాయని అంచనావేస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులు భారీగా దిగుమతి చేసు కునే భారత్‌కు ఈ ధరల పెంపు భారంఅవుతుంది. చమురుధరలు పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్‌బిఐ వడ్డీరేట్ల నిర్ణయం వాయిదా వేయక తప్పదన్న అంచనాలు కూడా లేకపోలేదు.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ముంబై భామలకు వర్షం దెబ్బ భారీ వర్షాలతో ముంబై ఒక్కసారిగా పూర్తిగా నీటితో నిండిపోయింది. అసలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారిపోయాయి. TNN | Updated: Aug 30, 2017, 08:55PM IST భారీ వర్షాలతో ముంబై ఒక్కసారిగా పూర్తిగా నీటితో నిండిపోయింది. అసలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారిపోయాయి. దీంతో సామాన్య ప్రజలతో పాటు బాలీవుడ్ తారలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బాలయ్య 'పైసా వసూల్' సినిమాలో నటించిన కైరా దత్ ఎయిర్ పోర్ట్&zwnj;లోనే చిక్కుకుపోయింది. ఆమెతో పాటు చాలా మంది ప్రయాణికులు ఇరుక్కుపోయారని ట్వీట్ చేసింది. అలానే మరో బ్యూటీ ఇలియానా తన సినిమా షూటింగ్స్, కొత్త సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా రద్దు చేసేసుకుంది. ఇక కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ అయితే తన కారుతో పాటు రోడ్డు మధ్యలో నీటిలో మునిగిపోయిన వీడియోను షేర్ చేసింది. కాజల్, హన్సిక తాప్సీ వంటి హీరోయిన్లు వర్షాల్లో చిక్కుకున్న వారందరూ జాగ్రత్తగా ఉండమని సందేశాలు పంపుతూ.. హెల్ప్ లైన్ నెంబర్లు ట్వీట్ చేస్తున్నారు. సిటీ మొత్తం కరెంట్ పోవడంతో నటి సోనాక్షి సిన్హా తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ముంబై వెళ్లాల్సిన నటి శ్రియ తన ప్రయాణం మానుకొని హైదరాబాద్&zwnj;లోనే ఉండిపోయింది. మొత్తానికి వర్షాల కారణంగా ముంబై భామలు బాగా ఇబ్బంది పడుతున్నారు.
0business
- లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు - షార్ట్‌కవరింగ్‌తో హఠాత్తుగా నష్టాల్లోకి.. - తొమ్మిదో సెషన్‌లోనూ కొనసాగిన పతనం ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మదుపరులకు చుక్కలు చూపించాయి. దాదాపు గత ఎనిమిది సెషన్లుగా నష్టాలను నమోదు చేస్తూ వచ్చిన స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. తక్కువ ధరల వద్ద వివిధ స్టాక్స్‌ అందుబాటులోకి రావడంతో తాజాగా మెరుగైన కొనుగోళ్లు నమోదు అయ్యాయి. దీంతో ఇన్వెష్టర్ల కొనుగోళ్లతో ఆరంభంలో 250 పాయింట్లకు పైగా ఎగిసిన సూచీలు.. మిడ్‌ సెషన్‌ తరువాత అనూహ్య అమ్మకాలతో నష్టాల బాట పట్టాయి. దీంతో సెన్సెక్స్‌ 146 పాయింట్లు కుంగి 35,353 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు పడిపోయి 10,605 వద్ద ముగిశాయి. మధ్యాహ్నం 2.00 గంటల ప్రాతం నుంచి అనూహ్యంగా మార్కెట్లలో అమ్మకాలు నమోదు అయ్యాయి. దీంతో సూచీలు ఒక్కసారిగా నష్టాల బాట పట్టాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీనికి తోడు పలు బ్లూచిప్‌ స్టాక్స్‌ల పతనం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. గత తొమ్మిది సెషన్లుగా నష్టాలను భరిస్తున్న బ్రోకర్లు.. కావాలనే మార్కెట్‌లో లాభాల హల్‌చల్‌ సృష్టించి షార్ట్‌ కవరింగ్‌ కోసం మార్కెట్‌ చివర్లో అమ్మకాలకు దిగారని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. హైప్‌ను సృష్టించి సాయంత్రానికి మార్కెట్లను పడేయడం వెనుక లాభాల స్వీకరణే ప్రధాన కారణంగా కనిపిస్తోందని వారంటున్నారు. ఈ ట్రెండ్‌లో సాధారణ మదుపరులు చాలా మంది చేతులు కాల్చుకున్నట్టుగా మార్కెట్‌ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఫార్మా సూచీ కూడా నష్టాల్లో ముగిసింది. ఇమామీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో భారీగా లాభపడ్డాయి. దాదాపు 17.6శాతం పెరిగి రూ.417.7 వద్ద ముగిశాయి. కావేరీ సీడ్స్‌ షేర్లు 14.7శాతం కుంగాయి. 52 వారాల్లో ఇదే అత్యధికం. డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికానికి బలహీనమైన ఫలితాలు వెల్లడించడంతో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.51%, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.33 శాతం మేర కుంగింది. బీఎస్‌ఈలో 1363 షేర్లు లాభాల్లో నడవగా.. 1186 స్టాక్స్‌ నష్టాల బాట పట్టాయి. మార్కెట్‌ విస్తృతి ఆరోగ్యకరంగా నమోదు అయింది. నిఫ్టీ ఐటీ సూచీ 2శాతం నష్టపోయింది. ముఖ్యంగా టీసీఎస్‌, విప్రో షేర్లు పడిపోవడం దీనికి కారణమైంది. ఫార్మా సూచీ కూడా నష్టాల్లో ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, కోల్‌ ఇండియా, టీసీఎస్‌ భారీగా నష్టపోయాయి. ఇంకా ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐబీ హౌసింగ్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, యూపీఎల్‌లు నష్టాల బాట పట్టాయి. దీంతోపాటు ప్రయివేటు సెక్టార్‌ బ్యాంకులు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. దేశీయ సూక్ష్య గణాంకాలు సరిగా లేని నేపథ్యం కారణంగానే మార్కెట్లు కుంగుతూ వస్తున్నాయని.. దీనికి తోడు కాశ్మీర్‌ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ చేపట్టనున్న చర్యలపై ఊహాగానాలు కూడా మార్కెట్‌ ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Vaani Pushpa 141 Views STEVE HARMISON , stevesmith STEVE HARMISON లండన్‌: ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌స్మిత్‌పై ఇంగ్లాండ్‌ మాజీ పేసర్‌ స్టీవ్‌ హార్మిసన్‌ నోరు పారేసుకున్నాడు. అతననెప్పటికీ మోసగాడిగానే గుర్తుండి పోతాడని వెల్లడించాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో విజయాల్ల స్మిత్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొదటి టెస్టులో రెండు శతకాలు, నాలుగో టెస్టులో ద్విశతకం బాదేశాడు. ఈరెండు మ్యాచుల్లో కంగారూలు విజయం సాధించారు. తన అద్వితీయ బ్యాటింగ్‌తో ఇంగ్లీష్‌ బౌలర్లకు స్మిత్‌ కొరకరాని కొయ్యగా మారాడు. ఇప్పటివరకు 134.20 సగటుతో 671 పరుగులు చేశాడు. అతడి అద్భుత బ్యాటింగ్‌ను అందరూ ప్రశంసిస్తుండగా హార్మిసన్‌ మాత్రం విరుద్ధంగా స్పందించాడు. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడంతో నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అతడిని క్షమిస్తారని అనుకోను. ఒక వ్యక్తి మోసగాడని తెలిశాక నేను తియ్యగా మాట్లాడలేను. ఆ ముగ్గురూ మోసం చేశారు. వారి క్రికెట్‌ జీవితంలో అది ఎప్పటికీ కనిపిస్తుంది. వారెంత బాగా ఆడినా మంచి పేరు తెచ్చుకోలేదు. స్మిత్‌ ఏం చేసినప్పటికీ దక్షిణాఫ్రికాలో జరిగిందనానికి అతనెప్పుడూ మోసగాడిగానే గుర్తుంటాడు. స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌పై ఎవరైనా అభిప్రాయం మార్చుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే వారు ఆటకు అపప్రద తీసుకొచ్చారని హార్మిసన్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌ జట్టుకు హార్మిసన్‌ 63 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఐదు యాషెస్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/
2sports
Ilaiyaraja loses cool and shouts at reporter ఇళయరాజాకు కోపమొచ్చింది! స్వరజ్ఞాని ఇళయరాజాకు కూడా కోపమొచ్చింది. TNN | Updated: Dec 18, 2015, 08:37PM IST స్వరజ్ఞాని ఇళయరాజాకు కూడా కోపమొచ్చింది. చెన్నై వరద బాధితుల సహాయార్థం స్వచ్చందంగా ముందుకొచ్చి అహర్నిశలు పనిచేసిన వ్యక్తులకు కృతజ్ఞత తెలిపే కార్యక్రమాన్ని శుక్రవారం నాడు చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా కూడా పాల్గొన్నారు. ఆయన కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం ఒక విలేకరి.. మహిళలను కించపరిచేలా శింబు , అనిరుథ్ కలిసి రాసిన వివాదాస్పద గీతం గురించి మీ అభిప్రాయం ఏమిటని ఆయనను ప్రశ్నించారు. దాంతో ఆయనకు ఒక్కసారిగా కోపం వచ్చింది. కాస్త గట్టిదైన స్వరంతో ఆయన విలేకరికి బదులిస్తూ.. ఆ పాట గురించి మాట్లాడేందుకు తాను ఆ కార్యక్రమానికి రాలేదన్నారు. అది మినహాయించి కార్యక్రమం మొత్తం ఎటువంటి వివాదాలు లేకుండానే పూర్తయ్యింది. ఇళయరాజాకు కోపం వచ్చిందని తెలియగానే సత్వరమే స్పందించిన కార్యక్రమ నిర్వాహకులు జోక్యం చేసుకుని ఆయన వేదిక నుండి లోపలి గదికి తీసుకెళ్లారు.
0business
చచ్చిపోతున్నా.. అంటూ ట్వీట్ చేసిన సమంత Highlights ఈ చిన్నారి డాన్స్ కు ఫిదా అయిన సమంత ఇటివల విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగోడుతుంది.ఈ క్రమంలో ఈ మూవీలో రంగమ్మ మంగమ్మ అనే పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెల్సిందే .ఈ పాట మీద సూప్స్ కూడా వస్తున్నాయి.అందులో భాగంగా ఒక చిన్న పాప రంగమ్మ మంగమ్మ అనే పాటకు స్టెప్పులు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోను షేర్ చేస్తూ సమంతా ఈ చిట్టి రామలక్ష్మీకి ఫిదా అయి హర్ట్‌ సింబల్స్‌తో రిప్లై ఇస్తూ చిన్నారి వేసిన స్టెప్పులకు చచ్చిపోతున్న అంటూ ట్వీట్ చేసింది .
0business