news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
మార్కెట్కు జోష్నివ్వని రైల్వే బడ్జెట్.
.- అప్రమత్తతతో మదుపరి వెనుకడుగు
- ప్రభావం చూపిన 'డెరివేటివ్స్' ముగింపు
- వరుసగా మూడో రోజూ కుంగిన మార్కెట్లు
- 7000 పాయింట్ల దిగువకు నిఫ్టీ
ముంబయి: స్టాక్ మార్కుట్లు వరసగా మూడో రోజు నేల చూపులే చూశాయి. రైల్వే మంత్రి గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ చప్పగా సాగడం.. మదుపరులను ఉత్తేజపరచలేక పోయింది. సాధారణ బడ్జెట్కు గడువు దగ్గర పడుతున్నా ప్రోత్సాహకాలపై స్పష్టత లేకపోవడంతో మదుపరులు కొత్తగా షేర్లను కొనేందుకు, పొజిషన్స్ తీసుకొనేందుకు వెనకడుగు వేశారు. దీనికి తోడు ఫ్రిబవరి మాసం డెరివేటివ్్స కాంట్రాక్టుల ముగింపు కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 113 పాయింట్ల మేర కుంగి 22,976 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 48 పాయింట్లు దిగువకు జారి 7000 పాయింట్ల మార్కునకు దిగువన 6971 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది 52 వారాల కనిష్ట ముగింపు విలువ. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు వరుసగా 1.14%, 0.9% మేర తక్కువకు ముగిశాయి. బడ్జెట్ ముందు రోజుల్లో మదుపరులు వేచి చూసే ధోరణితో వ్యవహరించారు.
రైల్వే ఆధారిత స్టాక్స్లో ఒడుదొడుకులు..
రైల్వే బడ్జెట్ స్టాక్ మార్కెట్లలో జోష్ నింపలేకపోయాయి. రైల్వేకు సంబంధించిన స్టాక్లు తీవ్ర ఒడుదొడుకులను నమోదు చేశాయి. వ్యాగన్ల తయారీ కంపెనీలైన కలిందీ రైెల్, టెక్స్మాకో రైెల్, టిటాగర్ వ్యాగన్ షేర్లు 4-6 శాతం మేర పడిపోయాయి. మరోవైపు హింద్ రెక్టిఫైయర్స్, స్టోన్ ఇండియా, సింప్లెక్స్ క్యాస్టింగ్స్, కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్ 1-8 శాతం మేర జారాయి. రైళ్లలో సీసీటీవీల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభు వెల్లడించడంతో రైల్వేకు సంబంధించిన టెక్నాలజీ సంస్థలైన మిక్ ఎలక్ట్రానిక్స్ (3 శాతం), జైకామ్ (7శాతం) లాభపడ్డాయి. రానున్న రెండేళ్లలో 400 స్టేషన్లలో వైఫై సదుపాయాన్ని అందించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించడంతో డీలింక్స్ ఇండియా స్క్రిప్ 4శాతం పెరిగింది. సిమెంట్ కంపెనీల షేరుల 0.1-2శాతం మేర కుంగాయి. ఉక్కు సంస్థ షేర్లు కొంత లాభాలబాటలో నడిచాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 165 Views
ముంబై : దంతధావననానికి అగ్రగామి ఉత్పత్తిగా ఉన్న కోల్గేట్ పామోలివ్ తన యువ నాయుడు బాలివుడ్ నటుడు రణ్వీర్సింగ్ను కోల్గేట్మాక్స్ప్రెష్కు కొత్త రాయబారిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. కోల్గేట్ మాక్స్ఫ్రెష్కు మార్కెట్లో మంచి వాటా ఉందని, ఈ టూత్ పేస్ట్లో కూలింగ్ క్రిస్టల్స్ కలిగి తాజాదనపు పరిమళం అందిస్తుందని, స్పైసీ ఫ్రెష్, పిప్పర్ మెంట్ ఐస్ సిట్రస్ బ్లాస్ట్లలో లభిస్తుందన్నారు. కోల్గేట్ కుటుంబంలో భాగస్వామిగా పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని, బాలి వుడ్ నటుడు రణ్వీర్సింగ్ వెల్లడించారు. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మరో బండారం: బ్యాంకులకు ‘కనిష్క్ గోల్డ్’ రూ. 824 కోట్లు కుచ్చుటోపీ
భారీగా రుణాలు తీసుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టిన సంస్థల జాబితాలో మరొకటి చేరింది. కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.824.15 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. ఎస్బీఐతో పాటు 14 బ్యాంకులకు ఎగనామం పెట్టింది.
TNN | Updated:
Mar 21, 2018, 04:55PM IST
భారీగా రుణాలు తీసుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టిన సంస్థల జాబితాలో మరొకటి చేరింది. కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.824.15 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు మరో 14 బ్యాంకుల ఉన్నాయి. ఈ ఉదంతంపై ఎస్బీఐ గత జనవరి 25వ తేదీనే సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎస్బీఐ నుంచి రూ.215 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 115 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.50 కోట్లు, సిండికేట్ బ్యాంకు నుంచి రూ.50 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 45 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఆంధ్రా బ్యాంక్, ఐసీఐసీఐ, ఐడీబీఐ, యూకో, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్షీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్లు నుంచి కూడా కనిష్క్ రుణాలు తీసుకంది.
చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ‘కనిష్క్ జ్యూయలరీ’.. బంగారు ఆభరణాల అమ్మకాల్లో గుర్తింపు సాధించింది. భూపేష్కుమార్, ఆయన భార్య నీతా జైన్ దీనికి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరిని సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని, ప్రస్తుతం వీరు మారిషస్లో ఉన్నట్లు భావిస్తున్నామని సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. | 1entertainment
|
Suresh 119 Views
మార్కెట్లపై ఫెడ్రిజర్వు మినిట్స్ ఛాయలు
ముంబై, ఆగస్టు 17: అమెరికాఫెడ్రిజర్వు గత సమీక్ష మినిట్స్ వివరాలు వెల్లడవుతాయన్న ఆసక్తితో ఇన్వె స్టర్లు మార్కెట్లలో వేచిచూసేధోరణి అవలంభించారు. దీనితో ఎంపికచేసిన సూచీలన్నీ కూడా దిగువస్థాయిలోనే ట్రేడింగ్ ముగించాయి. న్యూయార్క్ ఫెడ్ అధ్యక్షుడు విలియమ్ డూడ్లీ మాట్లాడుతూ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లను సెప్టెంబరు నుంచి పెంచే అవకాశం ఉందని ప్రకటించారు. దీనితో ఇన్వెస్టర్లు ఈక్వి టీల నుంచి బాండ్లమార్కెట్లవైపు పరుగులుతీసే అవకాశం లేక పోలేదు. మినిట్స్ద్వారా స్పష్టమైన సమాచారం వస్తుందన్న ఆశలతో సెన్సెక్స్ 59 పాయింట్లు దిగువన 28005 వద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి 19 పాయింట్ల దిగువన 8624 పాయింట్లవద్ద స్థిరపడింది. మార్కెట్లలో బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒకటిశాతం చొప్పున క్షీణిం చాయి. ఇక యూరోపియన్ మార్కెట్లపరంగాచూస్తే బుధవారం కొంతమేర మార్పులు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రియన్ సంస్థ వీనర్బెర్గర్, డేనిష్ సంస్థ కార్ల్స్బెర్గ్, యుకె బీమాసంస్థ అడ్మిరల్గ్రూప్ వంటివి అన్నీ ఆర్థిక ఫలితాల తర్వాత నీరసించాయి. చైనాషేర్లు చైనా ఈక్విట ీలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రభుత్వం అనుమ తులు ఆమోదించడంతో కొంతమేర షేర్లు దిగజారాయి. హాంకాంగ్ద్వారా విదేశీషేర్లు చైనా ఈక్విటీల్లోనికి ఆనుమతిస్తు న్నట్లు ప్రకటించింది. మెయిన్ల్యాండ్ చైనా, షాంఘై కాంపోజిట్ సూచి 0.02శాతం హాంకాంగ్, హ్యాంగ్షెంగ్ సూచి 0.48శాతం దిగువన ముగిసాయి. మెటల్కంపెనీల షేర్లు ఆకర్షణీయంగా మారాయి. నిఫ్టీ మెటల్ సూచి, బిఎస్ఇ మెటల్సూచీలు రెండుశాతం చొప్పున పెరిగాయి. టాటాస్టీల్, హిందాల్కోఇండస్ట్రీస్, జెఎస్డబ్ల్యుస్టీల్, ఎపిఎల్ అపోలో ట్యూబ్స్ వంటివి 52వారాల గరిష్టానికి చేరాయి. సెయిల్, కోల్ ఇండియా, ఎన్ఎండిసి సంస్థలు రెండుశాతం చొప్పున పెరిగాయి. టాటాస్టీల్ ఐఐటితో ఒప్పందం చేసుకుంది. ఐఐటి మద్రాస్ రీసెర్చిపార్కులో ఒక కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. మూడుశాతం కంపెనీ షేర్లు పెరి గాయి. హీరోమోటోకార్ప్ రెండుశాతం పెరిగింది. సునీల్ కాంత్ ముంజాల్ పదవీకాలం జెఎండిగా ముగుస్తున్నట్లు ప్రకటించింది. టిసిఎస్, అదాని పోర్టులు, ఇన్ఫోసిస్, ఆసి యన్ పెయింట్స్ విప్రో వంటివి 1-3శాతం వరకూ పెరిగాయి. ఇన్ఫోసిస్ ముందురోజు నష్టాలను తగ్గించు కుంది. రెండుశాతం కీలకంగామారింది. రాయల్బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ప్రాజెక్టును రద్దుచేసుకోవడమే ఇందుకుకీలకం. సిప్లా కంపెనీ షేర్లు కొంత ఊరట నిచ్చాయి. కంపెనీ 200బేసిస్పాయింట్లు పన్నులచెల్లిం పులకు ముందు మార్జిన్ పెరిగిందని ప్రకటించింది. ఇతరత్రా రెలిగేర్ 224 రూపాయలవద్ద ట్రేడింగ్ జరిగిం ది. కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 8శాతం పెరిగింది. కంపెనీ ఇపిసి ఆర్డరుబుక్ 4258 కోట్ల వరకూ ఉందని ప్రకటించింది. రోడ్ల విభాగంలోనే 3528 కోట్లు వరకూ ఉన్నట్లు అంచనా వేసింది. సాగునీటివనరులపరంగా రూ730కోట్లుగాఉంది. ఒసిఎల్ ఇండియా మూడు శాతం పెరిగింది. బిఎస్ఇ నికర లాభాలు 105 కోట్లకు చేరాయి. జీలెర్న్ ట్రీహౌస్ ఎడ్యుకేషన్ యాక్ససరీస్ వంటివి 10-15శాతం పెరిగాయి | 1entertainment
|
IPO
సిడిఎస్ఎల్ ఐపిఒ జోష్లో
ముంబయి,జూన్ 20: సిడిఎస్ఎల్ ఐపిఒ మొదటిరోజు పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. బిడ్డింగ్ ప్రారంభించిన తొలిరోజే సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 45.10శాతంబిడ్లను దాఖలుచేస్తే రిటైల్ ఇన్వెస్టర్లు 247.13శాతం బిడ్లు దాఖలుచేసారు. సంస్థ ఉద్యోగు ల బిడ్లు 8.49శాతంగా ఉన్నాయి. సంస్తాగత ఇన్వెస్టర్ల బిడ్లు మాత్రం ఎంతమొత్తం వచ్చిందీ వివరాలు రావాల్సి ఉంది. మొత్తంగా కొనుగోళ్లు 129.17శాతంగా ఉన్నట్లు తేలింది. రూ.524కోట్ల రూపాయల విలువైన ఈ ఐపిఒ లో 2,48,27,046 షేర్లను కంపెనీ ఆఫర్చేస్తోంది. రూ.10 ముఖవిలువ ఉన్న షేర్లు ఎన్ఎస్ఇలో జాబితా అయ్యాయి. రిటైల్ ఖాతాలకు సంబంధించి 35శాతం వరకూ ఉన్నాయి.సెబి నిబంధనల ప్రకారం స్వీయ జాబితాలపై స్టాక్ఎక్ఛేంజిల్లో కంపెనీలను నిషేధించింది. శుక్రవారం రోజే కంపెనీ 154.07కోట్ల రూపాయలు 1.03కోట్ల ఈక్విటీ వాటాలను 15 మంది యాంకర్ ఇన్వె స్టర్లకు కేటాయించి నిధులు సమీకరించింది. ఎస్బిఐ మాగ్నమ్, ట్యాక్స్గెయిన్ స్కీం, ఐసిఐసిఐప్రుడెన్షియల్, హెచ్ఎస్బిసి ఇండియన్ ఈక్విటీ మదర్ఫండ్, అబూ దాబి ఇన్వెస్ట్మెంట్ అజారిటీ బిహేవ్ ఎఫ్ఐఎల్ ఇన్వెస్ట్ మెంట్స్ మారిషస్, గోల్డ్మాన్శాక్స్ ఇండియా సంస్థలు వీటిని కొనుగోలుచేసాయి. ఎన్ఎస్డిఎల్కు పోటీసంస్థగా సిడిఎస్ఎల్ ఫనిచేస్తోంది. బిఎస్ఇ భారత్లో తొలిజాబితా అయిన ఎక్ఛేంజిగా నిలిచినట్లే సిడిఎస్ఎల్కూడా మొట్ట మొదటి డిపాజిటరీసంస్థగా స్టాక్ఎక్ఛేంజిల్లో నమోదయిం ది. సిడిఎస్ఎల్ 1997లో బిఎస్ఇలో జాబితా అయింది.
50.05 శాతం ఈక్విటీ వాటాలున్నాయి. వీటితోపాటు బిఎస్ఇ, ఎస్బిఐబ్యాంక్ ఆఫ్ బరోడా వంటిసంస్థలు తమ తమ వాటాలను కోల్కతా స్టాక్ఎక్ఛేంజిల్లో తగ్గించుకున్నా యి. పదిలక్షల వాటాలను విక్రయిస్తున్నాయి. బ్రోకరేజి సంస్థలు ప్రస్తుతం సిడిఎస్ఎల్ షేర్లను కొను గోలు చేయవచ్చని ప్రకటించాయి. ఈక్విటీ రిటర్నులు స్థిరంగా ఉన్నాయని చెపుతున్నాయి. కంపెనీ సంఘటిత వృదిధ 3.67శాతంగా గడచిన నాలుగేళ్లుగా కొనసాగుతోంది. గత ఏడాది రాబడులు 139.4 కోట్లుగా ఉన్నాయి. సిడిఎస్ఎల్ లాభాల్లో మరింతగా ముందుకు వస్తున్నట్లు నిపుణుల అంచనా. నికరలాభాలు వార్షికవృద్ధితో చూస్తే 7.59శాతంగా ఉన్నాయి. గత ఏడాది నికరలాభం 74.1 కోట్లుగా ఉంది. కంపెనీ మార్జిన్లు పటిష్టంగా ఉన్నాయి. 34శాతానికి దిగువన ఏనాడూ దిగజారిన సందర్భాలులేవు. కంపెనీకి గత నాలుగేళ్లుగా లాభదాయ కత 53.2శాతంగాఉంది. కంపెనీ వాటాదారులకు సైతం క్రమం తప్పకుండా డివిడెండ్లు చెల్లిస్తోంది. బిఎస్ఇ కూడా తన పెద్ద వాటాదారునిగా కొనసాగుతోంది. అయితే ఈ విధానం త్వరలోనే మారవచ్చన్న అంచనాలున్నాయి. మొత్తం 74.1కోట్ల రూపాయల్లో సిడిఎస్ఎల్31.4 కోట్లు డివిడెండ్ల రూపంలోనే చెల్లించింది. సిడిఎస్ఎల్ డివిడెండ్ రేటు 25శాతంగాఉంది. అంటే ప్రతివాటాకు 2.5 రూపా యలుగా ఉంది. 2015తో పోలిస్తే 22శాతం పెరిగింది. | 1entertainment
|
స్పైస్జెట్ నుంచి మరో 'చౌక' పథకం
- అందుబాటులోకి 'ట్రావెల్
లైట్ సేవ్ మోర్'
ముంబయి: స్పైస్ జెట్ తాజాగా మరో చౌకధరల విమానయాన పథకాన్ని ప్రకటించింది. ఎలాంటి లగేజీ లేకుండా కేవలం చేతి సంచి, పరిమిత లాప్టాప్ బ్యాగ్, మహిళలైతే పర్సుతో ప్రయాణం చేసే వారి కోసం స్పైస్జెట్ 'ట్రావెల్ లైట్ సేవ్ మోర్' పథకాన్ని ప్రకటించింది. తక్కువ లగేజీతో ప్రయాణం చేసే వారికోసం సంస్థ రూ.999 ప్రారంభ ఛార్జీతో వివిధ మార్గాలలో విమానయానాన్ని అందిచనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ను చేజిక్కించుకోవాలనుకునే వారు 29వ తేదీ (బుధవారం) లోపు తమ ప్రయాణాల్ని బుక్ చేసుకోవాలని సంస్థ తెలిపింది. ఇలా ముందుగా బుక్ చేసుకున్న వారు జులై1 నుంచి అక్టోబరు 15 మధ్య కాలంలోనే సంస్థ విమానాల్లో ప్రయాణించే వీలుంటుంది. ఈ పథకం కింద మొత్త 1,50,00 సీట్లను సంస్థ కేటాయించింది. లగేజీతో ప్రయాణం చేయదలచిన వారు అదనంగా మరో రూ.750 చెల్లిస్తే సరిపోతుందని సంస్థ తెలిపింది. ఏవైతే సేవలు, వస్తువులను పొందుతారో వాటికి మాత్రేమే చెల్లింపులు చేసేలా తాము ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ వివరించింది. ఇలా లగేజీ లేకుండా సుఖ ప్రయాణం చేసే వారికోసం తాము ఈ పథకాన్ని తెచ్చామని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ వివరించారు. ఇలా లగేజీ లేకుండా ప్రయాణం చేయడం వల్ల తక్కువ ఇంధనం అవసరమవడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు. ఈ పథకం కింద టికెట్స్ బుక్ చేసుకొనే వారికి అనూహ్యమైన డిసౌంట్ లభిస్తుందని సంస్థ తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 5, Feb 2019, 3:51 PM IST
Highlights
నాగబాబు విడుదల చేస్తున్న వీడియోలకు ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆడవాళ్ళ డ్రెస్సులపై జరుగుతున్న పరిణామాలపై చేసిన కామెంట్స్ కు స్పందిస్తూ తన యూ ట్యూబ్ ఛానెల్లో ఓ వీడియో రిలీజ్ చేశారు నాగబాబు.
నాగబాబు విడుదల చేస్తున్న వీడియోలకు ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆడవాళ్ళ డ్రెస్సులపై జరుగుతున్న పరిణామాలపై చేసిన కామెంట్స్ కు స్పందిస్తూ తన యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియో రిలీజ్ చేశారు నాగబాబు.
దాంతో ఎస్పీబి కామెంట్స్ ఖండించేవే కావచ్చు కానీ, మీరు స్పందించిన విధానం బాగోలేదంటూ సోషల్ మీడియా జనం ఆయనపై విరుచుకుపడుతున్నారు. వరుస ట్రోల్స్ తో నాగబాబునిఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ఇందులో ఆయన పర్శనల్ ఫ్యామిలీ మాటర్స్ ని కూడా తీసుకుని వస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు కూతురు నీహారికను ఈ వివాదంలోకి లాగుతూ ఆమెపై అసభ్యకరమైన
రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆమెతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు.
ఈ వివాదంలో బాలసుబ్రహ్మణ్యంని కొందరు సమర్దిస్తుండగా, నాగబాబుకి కూడా కొందరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ గొడవలోకి నాగబాబు ఇంటి ఆడపిల్లలను లాగడం ఊహించని పరిణామం. మరి దీనిపై కూడా వీడియో వదులుతాడేమో చూడాలి! | 0business
|
Hyderabad, First Published 7, Apr 2019, 10:10 AM IST
Highlights
దర్శకదీరుడు రాజమౌళి వల్ల బాలీవుడ్ సెలెబ్రెటీలు తెలుగు నేర్చుకునే సీన్స్ కనిపిస్తున్నాయి. RRR కోసం ఇప్పుడు హాట్ బ్యూటీ అలియా భట్ తెలుగు నేర్చుకుంటోంది.
టాలీవుడ్ సినిమాలంటే మొన్నటివరకు బాలీవుడ్ ప్రముఖులు అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ బాహుబలి అనంతరం ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాల మార్కెట్ కూడా నార్త్ లో గట్టిగానే పెరుగుతోంది. ఇక బాలీవుడ్ తారలు ఇక్కడ అవకాశాలు వస్తే ఏ మాత్రం వదలడం లేదు.
దర్శకదీరుడు రాజమౌళి వల్ల బాలీవుడ్ సెలెబ్రెటీలు తెలుగు నేర్చుకునే సీన్స్ కనిపిస్తున్నాయి. RRR కోసం ఇప్పుడు హాట్ బ్యూటీ అలియా భట్ తెలుగు నేర్చుకుంటోంది. తెలుగు చాలా గొప్ప బాషా అంటూ.. నేర్చుకోవడం కష్టమైనప్పటికీ భావాలను స్వచ్ఛంగా వ్యక్తపరచడానికి అనుకూలంగా ఉండే బాషా అని తెలిపింది.
ఇక RRR కోసం అమ్మడు సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి డిసైడ్ అయ్యింది. వీలైనంత వరకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని రాజమౌళి గారి మేకింగ్ కి తగ్గట్టుగా నేను సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత ఎంతో ఉందని అలియా వివరణ ఇచ్చింది. ఇక RRRలో అలియా అల్లూరి సీతారామరాజు మరదలి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గాయం కారణంగా ఇటీవల పూణే షెడ్యూల్ ని జక్కన్న వాయిదా వేశారు. ఇక నెక్స్ట్ వీక్ ఆ షెడ్యూల్ మళ్ళీ స్టార్ట్ కానుంది.
Last Updated 7, Apr 2019, 10:10 AM IST | 0business
|
పెరిగిన హిందాల్కో లాభం
- ఖర్చులు తగ్గించుకోవడంతో లాభాల బాట
ముంబయి: ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా హిందాల్కో సంస్థ మార్చితో ముగిసిన త్రైమాసికానికి మెప్పించే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో సంస్థ లాభాలు 123.3 శాతం కంటే ఎక్కువగా పెరిగి రూ.356 కోట్లకు చేరాయి. అల్యూమినియం, రాగి ధరలు బాగా పడిపోయిన నేపథ్యంలో సంస్థ అమ్మకాలు దెబ్బ తిన్నప్పటికీ హిందాల్కో ఈ లాభాలను ప్రకటించడం విశేషం. మార్చితో ముగిసి ఆర్థిక సంవత్సరానికి ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కో సంస్థ ఆదాయం రూ.8,542 కోట్లకు చేరింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7.33 శాతం తక్కువ. ముడి సరుకు ధరలు బాగా తగ్గడానికి తోడు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కూడా సంస్థకు మెరుగైన లాభాలను ఆర్జించడంలో తోడ్పాటునందించాయి. సంస్థ మొత్తం వ్యయం 11 శాతం మేర తగ్గి రూ.7842కు పరిమితమయ్యాయి. ఇది ఏడాది ప్రాతిపదికన నిర్వహణ లాభాలు 35 శాతం మేర పెరిగి రూ.825 కోట్లకు చేరేందుకు ఇది ఎంతగానో దోహదం చేసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Visit Site
Recommended byColombia
వాస్తవానికి ఈ త్రిసభ్య కమిటీ మొదట కిర్స్టన్ను ఎంపిక చేసింది. అయితే పరస్పర విరుద్ధ ప్రయోజనాల రీత్యా ఐపీఎల్ ఫ్రాంచైజీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ పదవిని కిర్స్టన్ వదులుకోవాల్సి ఉంటుంది. అందుకు కిర్స్టన్ అంగీకరించకపోవడంతో మాజీ ఓపెనర్ రామన్ను కీలక పదవి వరించింది. మరోవైపు క్రికెట్పై విశేష పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా రామన్ రెండో ఛాయిస్. స్వదేశీయుడు కావడంతో భారత మహిళల జట్టుపై ఓ అవగాహనా ఉండటంతో పాటు కీలక జట్లకు శిక్షణ ఇవ్వడం కోచ్ పదవి ఆయనను వరించేలా చేసింది.
డబ్ల్యూవీ రామన్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ సలహాదారుగా చేస్తున్నారు. రంజీల్లో తమిళనాడు, బెంగాల్ జట్లతో పాటు భారత అండర్-19 జట్టుకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఆయన సొంతం. దక్షిణాఫ్రికాపై తొలి శతకం బాదిన క్రికెటర్గా రామన్ పేరు మార్మోగింది. ఆటగాడిగా కంటే కోచ్గానే రామన్కు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. భారత్ తరఫున 11 టెస్టులు, 27 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
MIKON
ఏవియేషన్, రక్షణరంగాల్లో కీలకం ‘న్యూకాన్
హైదరాబాద్, ఆగస్టు 20:విమానయానం, అంతరిక్షం, రక్షణరంగాల్లో పూర్తిస్థాయి పరిష్కారాలు అందించేందుకు న్యూకాన్ ఏరోస్పేస్ నగరంలోని ఐటిహబ్లో అతిపెద్ద ప్లాంట్ను ఏర్పాటుచేసింది. తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిరామారావు, హోంమంత్రి నాయినినరసింహారెడ్డి, ఐటిశాఖ కార్యదర్శి జయేష్రంజన్లు సం యుక్తంగా ఈ ఉత్పత్తి హబ్ను ప్రారంభించారు. డిఆర్డిఒ డైరెక్టర్, రక్షామంత్రి సలహాదారు డాక్టర్ జి.సతీష్రెడ్డి, ఎల్పిఎస్సి ఇస్రో డైరెక్టర్ ఎస్సోమనాథ్, భారత్ డైనిమక్స్ డైరెక్టర్ వి.ఉదయభాస్కర్, ఆర్సిఐ ఇమ్రాత్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ బిహెచ్విఎస్ నారాయణమూర్తి, డిఆర్డిఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ జి.చంద్రమౌళి, న్యూకాన్ సిఎండి హేమం త్ జలాన్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదకేంద్రంగా ఉన్న న్యూకాన్ విమానయానరక్షణ రంగ ఉత్పత్తులపరంగాప్రతిష్టాత్మక స్థానం సాధించింది. అంతేకాకుండా పలు కీలకప్రాజెక్టులను సంపాదించి మెగా క్లయింట్లకు పరిష్కారాలు అందిస్తోంది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్, బిఇఎంఎల్, బిడిఎల్, ఇస్రో, డిఆర్డిఒ, బ్రహ్మాస్, రఫీల్, ఐఎఐ,యుటిసి వంటి సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. అంతరిక్ష, రక్షణరంగాల్లో అత్యుత్తమ పనితీరు చూపే ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉన్నందున అదే స్థాయి మెకానిజం విడిభాగాలు కూడా అవసరం అవుతున్నాయి. డిమాండ్ను అందుకోడానికి విప్లవాత్మక ఫలితాలు రాబట్టేందుకు న్యూకాన్ ఎల్లవేళలా ముందుంటుందని సిఎండి జలాన్ పేర్కొన్నారు. మూడుదశాబ్దాల్లో న్యూకాన్ అసలైన గ్లోబల్ లీడర్గా ఎదిగిందని, వృత్తినిబద్ధతతోపాటు ప్రపంచంలో అత్యుత్తమ సాంకేతికతను స్వీకరించడం, అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బంది ఆవిష్కరణలు ప్రోత్సహించడం నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు న్యూకాన్ ప్రయత్నించిందన్నారు. న్యూకాన్ ఉత్పత్తిశ్రేణిలో కంట్రోల్ ఆక్ట్యుయేషన్ సిస్టమ్, అనలాగ్ అండ్ డిజిటల్ కంట్రో లర్స్, రిలే యూనిట్స్, ప్రెసిషన్ మెకానికల్ అసెంబ్లీస్, కంట్రోల్ ఆక్ట్యుయేషన్, ఎలక్ట్రో హైట్రలిర్, ఎలక్ట్రోమెకా నికల్ అండ్ ఎలక్ట్రోన్యుమాటిక్ యాక్ట్యుయేటర్స్, ఇంటిగ్రేటెడ్ మిసైల్ ఎజెక్షన్వ్యవస్థ, కేబుల్లూమ్ అండ్ హార్నెస్ అసెంబ్లీస్ హైప్రెజర్న్యుమాటిక్ సిస్టమ్స్ బిఎల్డిసి మోటార్లు ఉన్నాయని జలాన్ వివరించారు. ఏవియేషన్, రక్షణ రంగానికి సంబంధించి హైదరాబాద్లోన్యూకాన్ కొత్తకేంద్రం ఏర్పాటు ముదావహమనిమంత్రికెటిఆర్ అభినందించారు.
=== | 1entertainment
|
ICC Test, ODI Rankings: భారత్, ఇంగ్లాండ్ మధ్య పోటాపోటీ..!
టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ తర్వాత 262 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ఇంగ్లాండ్ (261), ఆస్ట్రేలియా (261), భారత్ (260) టాప్-5లో నిలిచాయి. ఇక ఆరో స్థానంలో న్యూజిలాండ్ (254) ఆ తర్వాత అఫ్గానిస్థాన్ (241), శ్రీలంక (227), వెస్టిండీస్ (226), బంగ్లాదేశ్ (220) టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. 2016 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్.. ఏకంగా 9వ స్థానానికి పడిపోవడం విశేషం. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది.
ఐసీసీ ఇక నుంచి 80 జట్లకి సంబంధించిన టీ20 ర్యాంకింగ్స్ను ప్రకటించనుంది. ఈ మేరకు జాబితాలో యూఏఈ, నమీబియా, హాంకాంగ్, నెదర్లాండ్స్, గన్యా, నైజీరియా, దక్షిణ కొరియా తదితర జట్లు కూడా చేరాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వాటిపై దిగుమతి సుంకం తగ్గింపు
దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి వీలుగా భారత్కు దిగుమతయ్యే అయ్యే టెలివిజన్ ప్యానెల్స్పై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ప్రకటించింది.
TNN | Updated:
Mar 25, 2018, 11:41AM IST
దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి వీలుగా భారత్కు దిగుమతయ్యే అయ్యే టెలివిజన్ ప్యానెల్స్పై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం జారీ చేసింది. ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల్లో ఉపయోగించే ప్యానెల్స్పై దిగుమతి సుంకాన్ని 5శాతానికి పరిమితం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్లో టీవీ ప్యానెల్స్పై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది. గతంలో 7.5శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం 15శాతానికి చేర్చింది. ప్రస్తుతం ఇది 5 శాతానికి తగ్గింది.
ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల్లో ఉపయోగించే ప్యానెల్స్పై 5శాతానికి దిగుమతి సుంకం
మేక్ ఇన్ ఇండియా విజన్లో భాగంగా టీవీ ప్యానెల్స్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ సవరించడం దేశంలో టెలివిజన్ పరిశ్రమ అభివృద్దికి దోహదం చేస్తుందని పానాసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ చెప్పారు. | 1entertainment
|
Hyderabad, First Published 16, Apr 2019, 2:56 PM IST
Highlights
ఒక ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే రెండు కథలను లైన్ లో పెట్టడం ఈ హీరోకి అలవాటే. ఇకపోతే ఇదివరకే పందెం కోడి సీక్వెల్ తో మెప్పించిన విశాల్ ఇప్పుడు మరో రెండు సీక్వెల్స్ తో సిద్దమవుతున్నాడు.
స్టార్ హీరోలందరు ఏడాదికో సినిమా చేయడానికే చాలా ఆలోచిస్తుండగా విశాల్ మాత్రం ఒక ఏడాదిలో మినిమమ్ రెండు సినిమాలు అయినా రిలీజ్ చేయాల్సిందే అంటున్నాడు. ఒక ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే రెండు కథలను లైన్ లో పెట్టడం ఈ హీరోకి అలవాటే. ఇకపోతే ఇదివరకే పందెం కోడి సీక్వెల్ తో మెప్పించిన విశాల్ ఇప్పుడు మరో రెండు సీక్వెల్స్ తో సిద్దమవుతున్నాడు.
అభిమన్యుడు (ఇరుంబు తిరై) కథకు కొనసాగింపుగా మరో సినిమాను ఇటీవల ఒకే చేసిన విశాల్ డిటెక్టీవ్ (తుప్పరివలాన్) సీక్వెల్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మిస్కిన్ డైరెక్షన్ లో త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ప్రస్తుతం విశాల్ టెంపర్ రీమేక్ అయోగ్య రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
అయోగ్య సినిమాపై కోలీవుడ్ లో ఇప్పుడు పాజిటివ్ బజ్ నెలకొంది. ఎన్టీఆర్ రేంజ్ లో కాకపోయినా విశాల్ తనదైన శైలిలో లుక్స్ తో అదరగొడుతున్నాడని టీజర్ అండ్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.
Last Updated 16, Apr 2019, 2:58 PM IST | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Me Too: అక్షయ్ కుమార్ షాకింగ్ నిర్ణయం!
లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిగి, నిజాలు నిగ్గుతేలే వరకు షూటింగ్ నిలిపివేయాలని ‘హౌస్ఫుల్ 4’ నిర్మాతలను అక్షయ్ కోరారు.
Samayam Telugu | Updated:
Oct 12, 2018, 06:45PM IST
Me Too: అక్షయ్ కుమార్ షాకింగ్ నిర్ణయం!
బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోన్న #MeToo ఉద్యమానికి నటుడు అక్షయ్ కుమార్ మద్దతు తెలిపారు. లైంగిక వేధింపుల కేసులలో ఎవరైనా దోషిగా తేలితే.. అలాంటి వ్యక్తులతో తాను సినిమాలు చేయనని స్పష్టం చేశారు అక్షయ్. దర్శకుడు సాజిద్ ఖాన్పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం తెలేవరకు ‘హౌస్ఫుల్ 4’ నిర్మాతలు షూటింగ్ నిలిపివేయాలని నిర్మాతలను కోరారు. ‘విదేశాల నుంచి నిన్న రాత్రే వచ్చాను. వార్తలు చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఆరోపణలపై విచారణ జరిగి నిజాలు నిగ్గుతేలే వరకు షూటింగ్ నిలిపివేయాలని ‘హౌస్ఫుల్ 4’ నిర్మాతలను కోరుతున్నాను.
https://t.co/deSRvNnkAA
— Akshay Kumar (@akshaykumar) 1539326604000
బాధితులకు న్యాయం జరగాలంటే ఇలా చేయడం తప్పనిసరి. తప్పు చేసినట్లు తేలిన వారితో నేను సినిమాలు చేయను. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తప్పు చేశాడా లేదా అన్నది ప్రపంచానికి తెలియాలి. బాధితులకు కూడా కచ్చితంగా న్యాయం జరగాలని’ కోరుతూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ సాజిద్ ఖాన్ ‘హౌస్ఫుల్ 4’ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read also: MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి
తలుచుకుంటే భయమేస్తోంది: ట్వింకిల్
అక్షయ్ కుమార్ లేటెస్ట్ ప్రాజెక్ట్ హూస్ఫుల్ 4 దర్శకుడు సాజిద్ ఖాన్పై ఇద్దరు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వీటిపై నటుడు అక్షయ్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా స్పందించారు. ‘మహిళలపై జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మహిళలు ఆ వేధింపులను ఎలా ఎదుర్కొన్నారని ఆలోచిస్తేనే భయమేస్తోంది. హౌస్ఫుల్ 4 మూవీ యూనిట్ దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇలాంటి వి వాటిని తేలికగా తీసుకోవద్దని’ ట్వింకిల్ చేసిన ట్వీట్కు విశేష స్పందన వస్తోంది.
Appalled hearing multiple incidents of harassment and it is truly horrific to hear what these women have been throu… https://t.co/xqreerZMsX
— Twinkle Khanna (@mrsfunnybones) 1539325003000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
‘గీత’తో కార్తీ కొత్త సినిమా షురూ
కన్నడ బ్యూటీ రష్మికా.. తమిళ్ హీరో కార్తీ జోడీ కట్టారు. ‘ఖాకీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్కి బుధవారం నాడు కొబ్బరికాయ కొట్టారు.
Samayam Telugu | Updated:
Mar 13, 2019, 11:24PM IST
'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో బుధవారం నాడు ప్రారంభం అయ్యాయి. కార్తీ 19 వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ‘గీత గోవిందం’ ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం సూర్యతో 'ఎన్ జీ కె', కార్తీతో ఖైదీ నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్' బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'రెమో' ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి వివేక్ - మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఇతర టెక్నికల్ విషయానికి వస్తే.. ఎడిటింగ్ - అంతొనీ, సినిమాటోగ్రఫీ - సత్యన్ సూర్యన్లు పనిచేస్తున్నారు. | 0business
|
hero suriya ngk second look poster revealed
సూర్య బర్త్డే గిఫ్ట్: ‘NGK’ కొత్త లుక్ కిర్రాక్
'గజిని', 'సింగం' సిరీస్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకున్నారు హీరో సూర్య. ప్రస్తుతం ఆయన కెరియర్లో 36వ చిత్రంగా రూపొందుతున్న 'NGK' (నంద గోపాలకృష్ణ)తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Samayam Telugu | Updated:
Jul 22, 2018, 08:04PM IST
'గజిని', 'సింగం' సిరీస్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకున్నారు హీరో సూర్య . ప్రస్తుతం ఆయన కెరియర్లో 36వ చిత్రంగా రూపొందుతున్న ' NGK ' (నంద గోపాలకృష్ణ)తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. '7జి బృదావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' వంటి సూపర్హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా 'ఖాకి' వంటి సూపర్హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై 'NGK' (నంద గోపాలకృష్ణ) చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం సెకండ్ లుక్ పోస్టర్ను హీరో సూర్య పుట్టినరోజు (జూలై 23) సందర్భంగా విడుదల చేశారు. సూర్య సరసన సాయి పల్లవి, రకుల్ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఇండియా ఓపెన్: రజతంతో సరిపెట్టుకున్న సింధు
డిఫెండింగ్ ఛాంపియన్గా ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బరిలోకి దిగిన పీవీ సింధు.. టైటిల్ పోరులో వెనుకడుగు వేసింది.
TNN | Updated:
Feb 4, 2018, 09:27PM IST
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ బరిలోకి దిగిన పీవీ సింధు.. టైటిల్ పోరులో వెనుకడుగు వేసింది. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ కాంప్లెక్స్ వేదికగా ఆదివారం జరిగిన ఇండియా ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ 11 బీవెన్ ఝాంగ్ (యూఎస్ఏ) చేతిలో సింధు ఓడిపోయింది. దీంతో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని సింధు చేజార్చుకుంది. ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. ఒక గంటా 9 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుపై ఝాంగ్ 21-18, 11-21, 22-20 తేడాతో గెలుపొందింది. ఐదో సీడ్‌గా ఈ సిరీస్‌లోకి అడుగుపెట్టిన ఝాంగ్‌కు కెరీర్‌లో తొలి మేజర్ టైటిల్ ఇదే కావడం విశేషం.
మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఝాంగ్ తొలి గేమ్‌లో 21-18 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌లో ఝాంగ్‌కు గట్టి పోటీనిచ్చిన సింధు.. రెండో గేమ్‌లో చెలరేగిపోయింది. 21-11 తేడాతో ఝాంగ్‌ను చిత్తు చేసింది. రెండో గేమ్‌లో సింధు దూకుడు చూసి ఈసారి కూడా టైటిల్ ఆమెదే అనుకొని ఉంటారు భారత అభిమానులు. అయితే నిర్ణయాత్మక ఆఖరి గేమ్‌లో ఝాంగ్ అనూహ్యంగా పుంజుకుంది. సింధు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఝాంగ్ చెమటోడ్చి మూడో గేమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో సింధు 20-22 స్వల్ప తేడాతో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. | 2sports
|
GOLD
బులియన్ మార్కెట్లో తగ్గిన పసిడి ధరలు
న్యూఢిల్లీ, జూలై 18: బులియన్మార్కెట్లలో పసిడి ధరలు మరోసారి వందరూపాయలు తగ్గాయి. పది గ్రాముల బంగారం దేశరాజధాని పరిసర మార్కెట్ల లో 28,950లకు పడిపోయింది. వెండిధరలు కొంత పెరిగి కిలో 38,180 రూపాయలుగా చేరా యి. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదా రుల నుంచి కొనుగోళ్లు పెరగడమే ఇందుకు కీలకం. పసిడిరంగపరంగా చూస్తే 0.12శాతం పెరిగి 1229.90 డాలర్లుగా ఔన్స్ధరలు పలికాయి. అమె రికా బాండ్రేట్లపెంపు ఆశలు అడుగంటడంతో డాలరు కొంత దిగజారింది.
అమెరికా ఆర్థిక గణాం కాలు సానుకూలంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు కొంత స్థిరంగా కొనసాగాయని అంచనా. వీటికితోడు వివిధ ప్రాంతాల్లో నెలకొన్న భౌగోళిక పరిస్థితులు కూడా ధరలపైప్రభావం చూపి స్తున్నాయి. వెండిధరలు కూడా 0.19శాతంపెరిగి ఔన్స్ ఒక్కింటికి సింగపూర్మార్కెట్లో 15.98 డాలర్లు పలికింది. దేశరాజధాని పరిసరమార్కెట్లలో 99.9 కేరట్లు, 99.5 కేరట్ల బంగారంరూ.100 చొప్పు న తగ్గి 29,950 రూపాయలు, 28,800 రూపాయలుగా నిలిచింది. శనివారం 190 రూపా యలు పెరిగింది. సవర్లలోచూస్తే బంగారం ధరలు 24,400 రూపాయలుగాఉన్నాయి. ఇక వెండిధరల పరంగాచూస్తే 180 రూపాయలుపెరిగి 38,180కి చేరింది. వారం వారంపంపిణీ కింద చూస్తే 170 పెరిగి 37,170కి చేరింది. వెండినాణేలపరంగా చూస్తే ప్రతి వందనాణేల కొనుగోలుకు 70వేలు, విక్రయాలకు రూ.71వేల చొప్పునధరలు కొనసాగాయి. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
2.0లో ఆ పాత్ర కోసం కమల్హాసన్ను అడిగా: శంకర్
దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘2.0’ సినిమాలోని కీలక పాత్రను కమల్ ఎందుకు వదులుకున్నారో తెలిపిన దర్శకుడు శంకర్.
Samayam Telugu | Updated:
Nov 2, 2018, 10:39AM IST
2.0లో ఆ పాత్ర కోసం కమల్హాసన్ను అడిగా: శంకర్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘2.0’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ప్రతి నాయకుడుగా అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పాత్ర కోసం ముందుగా తాను ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ను ఎంపిక చేయాలని భావించామని, ఈ పాత్ర పోషించడానికి ఆయన కూడా ఆసక్తి చూపారన్నారు. | 0business
|
Hyderabad, First Published 2, Nov 2018, 7:45 PM IST
Highlights
ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు రిలీజైన సౌత్ లో మాత్రం అందరి చూపు జక్కన్న RRRపైనే ఉంటుందని చెప్పవచ్చు. సినిమా ఎప్పుడొచ్చినా పర్వాలేదు గాని ముందు షూటింగ్ మొదలుపెడితే మెగా, నందమూరి అభిమానులు కలిసి సంబరాలను జరుపుకోవాలని అనుకుంటున్నారు.
ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు రిలీజైన సౌత్ లో మాత్రం అందరి చూపు జక్కన్న RRRపైనే ఉంటుందని చెప్పవచ్చు. సినిమా ఎప్పుడొచ్చినా పర్వాలేదు గాని ముందు షూటింగ్ మొదలుపెడితే మెగా, నందమూరి అభిమానులు కలిసి సంబరాలను జరుపుకోవాలని అనుకుంటున్నారు.
అయితే కొన్ని రోజుల క్రితం చిత్ర యూనిట్ నుంచి లాంచింగ్ కి సంబందించిన డేట్స్ వచ్చాయి. అయితే అందులో మార్పులు చేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా చెప్పేశారు. RRR లాంచ్ డేట్ అంటూ.. 11వ రోజు 11వ నెల 11గంటలకు సినిమాను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రముఖులు కూడా సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా లాంచ్ డేట్ రోజు ఇద్దరు హీరోలు ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు ఊహల్లో తేలిపోతున్నారు. దాదాపు 200కోట్ల బారి బడ్జెట్ తో నిర్మాత డివివి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
నీ సైజు, రంగు తెలుసు.. సాక్ష్యాలూ ఉన్నాయ్: శ్రీరెడ్డి
ఏదో ఒక రోజు నన్ను కూడా శ్రీరెడ్డి టార్గెట్ చేస్తుందన్న విశాల్ మాటలను నిజం చేస్తున్న శ్రీరెడ్డి.
Samayam Telugu | Updated:
Oct 29, 2018, 03:53PM IST
నీ సైజు, రంగు తెలుసు.. సాక్ష్యాలూ ఉన్నాయ్: శ్రీరెడ్డి
శ్రీరెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలతో తమిళ సినీ పరిశ్రమను హీటెక్కిస్తోంది. ఈసారి ఏకంగా నడిగర్ సంఘం పెద్దలనే టార్గెట్ చేసుకుంది. ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే హీరో విశాల్ పైనే ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నడిగర్ సంఘంలో ఉన్న పెద్ద సెలబ్రిటీ హీరోయిన్లు, సహాయ నటీమణులను సైతం లైంగికంగా వేధిస్తున్నాడని శ్రీరెడ్డి ఆరోపించింది.
తమిళనాట అడుగుపెట్టిన శ్రీరెడ్డి.. అక్కడ ఓ తమిళ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో, కొరియోగ్రాఫర్ లారెన్స్తో పాటు దర్శకుడు సుందర్.సిలపై శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె వ్యాఖ్యలు అక్కడ సంచలనం రేపడంతో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడైన హీరో విశాల్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హీరో నానిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా విశాల్ స్పందించారు. ఏదో ఒకరోజు శ్రీరెడ్డి తనపై కూడా ఆరోపణలు చేస్తుందని అప్పట్లో వ్యాఖ్యానించారు. శ్రీరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే విశాల్ మాటలు నిజమవుతున్నట్లు తెలుస్తోంది.
‘‘నడిగర్ సంఘంలో ఉన్న పెద్ద సెలబ్రిటీ హీరోయిన్లనే కాదు, సైడ్ ఆర్టిస్టులను కూడా లైంగిక అవసరాల కోసం వేధిస్తున్నాడు. మీడియా ముందు అతను చాలా తెలివిగా మాట్లాడతాడు. గుర్తుంచుకో మిస్టర్ ఫేక్ ఫర్ఫెక్ట్.. నేను నిన్ను విడిచిపెట్టను. నీ సైజ్, కలర్ నాకు తెలుసు. నీ విషయాలన్నీ మీడియాకు, లాయర్లకు ప్రూవ్ చేస్తా. నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అది చేస్కో. బలవంతంగా పడుకోబెట్టుకున్న అమ్మాయిలకు నువ్వు డబ్బులు ఇచ్చావు. నిర్మాతల మండలి, నడిగర్ సంఘం, తమిళ సినీ పరిశ్రమలను ఏలుతున్నా అని నువ్వు అనుకుంటున్నావా? నిర్మాతల మండలి నుంచి నువ్వు ఎంత సంపాదిస్తున్నావనేది నాకు కొంతమంది చెప్పారు. త్వరగా పెళ్లి చేసుకో. నీ విషయాలు తెలిస్తే ఆమె నిన్ను పెళ్లి చేసుకోదు. నువ్వు నెంబర్ వన్ బ్లాక్ మెయిలర్. నీ కౌంట్ డౌన్ స్టార్టైంది. జై జయలలితమ్మ!!’’ అని శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. దీంతో శ్రీరెడ్డి లీక్ చేసే ఆ ఆధారాలు ఏమిటనే ఆసక్తి తమిళ సినీ పరిశ్రమలో నెలకొంది. విశాల్ ఇటీవల ‘అభిమన్యుడు’ సినిమాతో తెలుగులో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ‘పందెం కోడి 2’ సినిమాతో ఆకట్టుకున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘జంబలకిడిపంబ’ టైటిల్కు న్యాయం చేస్తుందా?
90ల నాటి కామెడీ క్లాసిక్ ‘జంబలకిడిపంబ’. ఈవీవీ దర్శకత్వంలో నరేష్ హీరోగా ఆమని హీరోయిన్గా నాటి ప్రధాన హాస్యతారాగణమంతా
Samayam Telugu | Updated:
Jun 22, 2018, 08:59AM IST
90ల నాటి కామెడీ క్లాసిక్ ‘జంబలకిడిపంబ’. ఈవీవీ దర్శకత్వంలో నరేష్ హీరోగా ఆమని హీరోయిన్గా నాటి ప్రధాన హాస్యతారాగణమంతా నటించిన ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆడవాళ్ల అగచాట్లు మగవాళ్లు పడాల్సి వస్తే.. అనే కాన్సెప్ట్తో రూపొందించిన ఆ సినిమా టాలీవుడ్ కామెడీ క్లాసిక్స్లో ఒకటిగా నిలిచింది. ఒక సూపర్ హిట్ సినిమా టైటిల్ను వాడుకోవడం అంటే ఒకింత సాహసమే. అలాంటి సాహసమే చేశారిప్పుడు.
శ్రీనివాసరెడ్డి హీరోగా ‘జంబలకిడిపంబ’ పేరుతో ఈ రోజు ఒక సినిమా విడుదల అవుతోంది. ఇది కూడా జంబలకిడిపంబ తరహా కాన్సెప్టే అని, అయితే కథా,కథనాలు వేరని ఈ సినిమా రూపకర్తలు ప్రకటించారు. దీని టీజర్లు, ట్రైలర్లు కూడా బాగానే ఉన్నాయి కానీ, ఈ సినిమా విడుదల అవుతున్నట్టుగా సరైన ప్రమోషన్ లేదు. ఈ రోజు ఈ సినిమా విడుదల అవుతోందని కూడా ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. సరైన పబ్లిసిటీ లేని వైనం స్పష్టం అవుతోంది.
ఒకవేళ ఈ సినిమా మరీ ఆకట్టుకునేలా ఉంటే.. మౌత్టాక్తో పబ్లిసిటీ లభించే అవకాశాలున్నాయి. ప్రీ రిలీజ్ ప్రమోషన్ మాత్రం పెద్దగా లేదు. ఇక ఈ రోజు ఈ సినిమాతో పాటు అనువాద సినిమా ‘టిక్ టిక్ టిక్’ కూడా విడుదల కాబోతోంది. జయం రవి హీరోగా నటించిన ఈ సినిమా తమిళంలో ఇదే పేరుతో ఈ రోజు విడుదల అవుతోంది. దుల్కల్ సల్మాన్ అనువాద సినిమా ‘అతడే’తో పాటు ఒకటీ రెండు అనామక సినిమాలు కూడా ఈ రోజు విడుదల అవుతున్నట్టుగా ప్రకటనలు వచ్చాయి. | 0business
|
RUPEES
జర్మనీకి భారత్ చెక్
న్యూఢిల్లీ,: ఆర్థికవృద్ధిలో భారత్ 2022 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న జర్మనీదేశాన్ని అధిగమించగలదని అంచనాలు పెరిగాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ (ఐఎంఎఫ్) గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం జరిగినట్లు నిపు ణులు చెపుతున్నారు. అయితే ఈలోపు అనేక సవాళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుందని, రానున్న కాలంలో టాప్ ఐదు దేశాల్లో చేరి బ్రిటన్ను పక్కకు నెట్టివేస్తుందన్న అంతర్జాతీయ నిపుణుల అంచనాలప్రకారం చూస్తే జిఎస్టి అమలుతో మరింత సాధ్యం అవుతుందని పిస్తోంది.
ఇందుకోసం ముందు పన్నులవ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది. సమస్యాత్మక ఆస్తులపరిష్కారం, ఇతర ప్రధాన ఆర్థికవ్యవస్థలతో పోటీగా ఆర్థికవృద్ధికి సంస్కరణలు, మందగమనంగా ఉన్న ఉత్పత్తిరంగాన్ని వృద్ధిచేయడం, ఉపాధికల్పన అవకాశాలను పెంచడం, కార్పొరేట్ పెట్టుబడులను భారీగా ప్రోత్సహించడం వంటివి కీలకంగా అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే మౌలికవనరుల కొరతను పూర్తిగా అధిగమించాలని నిపుణులు సూచిస్తు న్నారు. భారత్ ఆర్థికవ్యవస్థ ఇపుడిపుడే నోట్లరద్దునుంచి కోలు కుంటున్నది. చెలామణిలో ఉన్న 86శాతం కరెన్సీని రద్దుచేయడం ద్వారా ఆర్థికవ్యవస్థ పూర్తిగా స్తంభించి నట్లయింది. అలాగే జిఎస్టి అమలుద్వారా దేశవ్యాప్తం గా కొంతమేర తొలినాళ్లలో విఘాతం కలుగుతుంది. ఇప్పటికే ప్రభు త్వం ఏప్రిల్ గడువును దాటిపోయింది. ప్రస్తుతం జూలై ఒకటినుంచి అమలుచేసేవిధంగా ఖచ్చితమైనప్రణాళికతో ఉంది.
దీర్ఘకాలంలో జిఎస్టి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని అయితే భారత్లోని బ్యాంకింగ్ వ్యవస్థ ఒక్కటే ఆందోళనకరంగా ఉందని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. ప్రభుత్వరంగ రుణపరపతి, బ్యాంకింగ్రంగ ఆర్థికపరిపుష్టి ప్రశ్నార్ధకంగా ఉంది. ఇప్పటికే కొన్ని రేటింగ్ సంస్థలు భారత్ క్రెడిట్ రేటింగ్ను జంక్స్థాయికి ఇచ్చాయి. రానిబాకీలు, లేదా పునర్వ్యవస్థీ కరించిన రుణాలు వంటివి 16.6శాతంగా ఉన్నాయి. రానిబాకీల్లో పెరుగుదలవల్ల బ్యాంకులు వీటిని రికవరీ చేసుకునేందుకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాయి.
దీనివల్ల రుణపరపతి వృద్ధి దిగజారింది. దీనివల్ల ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఆశించిన ఉపాధి కల్పన, పెట్టుబడుల వృద్ధికి విఘాతం కలు గుతుందని నిపుణుల అంచనా. భారత్లో పెట్టుబ డుల మందగమనంతోపాటు భారత్లోని కార్మిక ఉత్పాదకత క్షీనిస్తోంది. దీనివల్ల వృద్ధికి పరిమితులు, ఉపాధి కల్పనలో ఆంక్షలు వంటివి తలెత్తుతున్నాయి. కార్మిక ఉత్పాదకత 2010లో పదిశాతంగా ఉంటే ప్రస్తుతం 4.8శాతానికితగ్గింది.
అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాలప్రకారంచూస్తే ప్రతి కార్మికుని స్థాయి లో ఉత్పత్తి 2017లో భారత్లో 3962 డాలర్లుగా ఉంటుందని అదే జర్మనీలో అయితే 83,385 డాలర్లుగా ఉంటుందని సంస్థ అంచనావేసింది. ఇప్ప టికీ ఆర్థికవృద్ధికి పుష్కల అవకాశాలున్నాయి. ఐఎం ఎఫ్ అంచనాలప్రకారం వివిధ దేశీలు, వివిధ ప్రాం తాలవారీగా వాటి స్థూల దేశీయోత్పత్తి గణాంకాల ఆధారంగా 2017 నుంచి 2022 నాటికి ఉన్న అంచ నాల ప్రకారం భారత్ 9.9శాతం వృద్ధి చెందుతుం దని అంచనా ఉంది. 2022 నాటికి జర్మనీని అధిగమిస్తుందని అంచనా. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా జర్మనీ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే 2017 తర్వాత ప్రస్తుతం ఐదోస్థానంలో ఉన్న బ్రిటన్ను సైతం భారత్ నెట్టివేస్తుందని అంచనాలున్నాయి. | 1entertainment
|
Hyderabad, First Published 8, Sep 2019, 4:42 PM IST
Highlights
తమన్నా ఆల్రెడీ అవుట్, శిల్పా తనేంటో ప్రూవ్ చేసుకునే పనిలో ఉంది కానీ ఇప్పటికి వరకూ సౌండ్ లేదు. దాంతో నెక్ట్స్ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అదిరిపోవాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. అందుకోసం రకరకాల పేర్లను పరిశీలించింది. కానీ ఏది పెద్దగా కిక్ ఇవ్వటం లేదట. ఈ నేపధ్యంలో ఆయనకు రామ్ గోపాల్ వర్మ కనిపించారు.
అవును వింటానికి నమ్మశక్యంగా లేకపోయినా ఈ వార్త నిజం చేయటానికి ప్రయత్నాలు అయితే జరుగుతన్నాయని సమాచారం. బిగ్ బాస్ కు కావాల్సింది టీఆర్పీలు. రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలు. వివాదాలకు కేరాఫ్ ఎడ్రస్ బిగ్ బాస్. అలాంటి చోట వర్మ ప్రత్యక్ష్యమయితే చూసేవారికి పండగే. అయితే వర్మ అందుకు ఒప్పుకుంటాడా లేదా అన్నదే పెద్ద ప్రశ్న. అయితే ఆయన్ని ఒప్పించటానికి ప్రయత్నించకుండానే రారు అని డిసైడ్ అవటం ఎందుకు అని బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు అయితే చేస్తోందట.
తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు కానీ ఫెయిల్ అయ్యారు. పెద్దగా ఫలితం లేదు. తమన్నా ఆల్రెడీ అవుట్, శిల్పా తనేంటో ప్రూవ్ చేసుకునే పనిలో ఉంది కానీ ఇప్పటికి వరకూ సౌండ్ లేదు. దాంతో నెక్ట్స్ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అదిరిపోవాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. అందుకోసం రకరకాల పేర్లను పరిశీలించింది. కానీ ఏది పెద్దగా కిక్ ఇవ్వటం లేదట. ఈ నేపధ్యంలో ఆయనకు రామ్ గోపాల్ వర్మ కనిపించారు. ఆయన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందిట. ఆలోచన వచ్చిన వెంటనే అమలలో పెట్టేసారని సమాచారం.
ఇక వర్మ కనుక బిగ్ బాస్ లోకి వస్తే రచ్చ మామూలుగా ఉండని అంటున్నారు. ఆయన అభిమానులతో టీఆర్పీలు దుమ్ము రేపుతాయి. ఆయన ఆలోచనలు, విలువలు, చర్యలతో బిగ్ హౌస్ ఖచ్చితంగా షాక్ కు గురి అవుతుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే వర్మకు తెలిసినట్లుగా మరెవరికీ ఎలా ఎక్సపోజ్ అవ్వాలి..వివాదం మొదలెట్టాలి అనే విషయాలు తెలియవు. అయితే ట్విట్టర్, వోడ్కా లేకుండా ఓ వారం అయినా వర్మ ఉండగలరా అనేదే పెద్ద ప్రశ్న..సవాల్.
Last Updated 8, Sep 2019, 4:42 PM IST | 0business
|
ప్రతీ పైసా వసూలు చేస్తాం..
- ఎగవేతదారులు ఎవరైన వదలం
- ఎన్పీఏలకు యూపీఏదే బాధ్యత
- 'ఫోన్-ఎ-లోన్' స్కామ్ నడిచింది: మోడీ
- ఐపీపీబీ బ్యాంక్ ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని గత యూపీఏ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. యూపీఏ హయాంలో నేతలు అధికారాన్ని ఉపయోగించుకొని బ్యాంకులకు ఫోన్లు చేయించుకొని మరీ.. విచ్చలవిడిగా రుణాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత బ్యాంకుల దయనీయ స్థితికి యూపీఏ సర్కారు హయాంలో జరిగిన 'ఫోన్-ఎ-లోన్' కుంభకోణాలే కారణమని ఆయన అన్నారు. కొందరు బడా బాబులకు మేలు చేసేలా ఈ తతంగం సాగిందన్నారు. ఆయా రుణ మొత్తాలు తిరిగి వసూలు కాకపోవడంతో సదరు లోన్లు రానురాను 'నిరర్థక ఆస్తులు'గా (ఎన్పీఏ) మారి ఇప్పుడు బ్యాంకింగ్ రంగ మనుగడకే విఘాతంగా మారాయని ఆయన అన్నారు. దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ 'పోస్టల్ పేమెంట్ బ్యాంక్' (ఐపీపీబీ)వ్యవస్థకు శనివారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2008 వరకు బ్యాంకులు రూ.18 లక్షల కోట్ల మేర రుణ వితరణలు జరగగా.. ఆ తరువాత అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు హయాంలోని ఆరేండ్ల కాలంలో బ్యాంకులు దాదాపు రూ.52 లక్షల కోట్ల రుణ వితరణలు జరిపాయని ఆయన అన్నారు. సరళీకరణ పేరుతో యూపీఏ సర్కారు ఎడాపెడ రుణాలు మంజూరు చేయడం వల్లే ప్రస్తుతం బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు పెరిగాయని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం వచ్చి రాగానే దేశ ఆర్థిక పరిస్థితి ఎప్పుడైనా పేలిపోయే మందుప్రాతపై కూర్చొని ఉన్నట్టుగా గమనించామని అన్నారు. వివిధ చర్యల ద్వారా ప్రమాదాన్ని అధిగమస్తూ ముందుకు సాగుతున్నట్టుగా ఆయన తెలిపారు.
దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఆవిర్భావం..
దేశంలోని సుదూర ప్రాంతాలకు వేగంగా బ్యాంకింగ్ సేవలకు తీసుకెళ్లు ప్రణాళికలో భాగంగా ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) ప్రధానం లాంఛనంగా ప్రారంభించినట్టుగా ప్రధాన మంత్రి మోడీ తెలిపారు. మారు మూల న ఉన్న సామాన్యుడిని కూడా ఆర్థిక సమ్మిళితలో భాగం చేసేందుకు గాను ఐపీపీబీ ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ఉత్తరాలు, పా ర్శిళ్లను వారు మాత్రే చేరవేసే పోస్ట్మ్యాన్...ఇపుడిక పోస్ట్మాన్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు వినియోగదారుల ముంగిటకు చేర్చనున్నట్టుగా ఆయన వివరించారు.
విసృత నెట్వర్క్తో భారీ బ్యాం'కింగ్'
దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోస్ట్మెన్ల ద్వారా ఇంటి వద్దే పోస్టల్ బ్యాంకింగ్ సేవల లభిం చనున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఐపీపీబీ నుంచి పొదుపు ఖాతాలు, కరెంట్ ఖాతాలు, నగదు బదిలీలు, ప్రత్యక్ష నగదు బదిలీ, బిల్లులు, యుటిలిటీ చెల్లింపులు, వ్యాపార చెల్లింపులు వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా 650 శాఖలు, 3250 యాక్సెస్ పాయింట్ల ద్వారా ఖాతాదారుల ఇళ్ల వద్దకే బ్యాంకింక్ ఫైనాన్షియల్ సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని 1.55 పోస్టాఫీసు శాఖలను ఐపీపీబీతో అనుసంధాన ప్రక్రియ డిసెంబర్ 31 నాటికి పూర్తికానుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
ఆ హీరోలతో తనకు శారీరక సంబంధం ఉందన్న కంగనా
Highlights
మరోసారి వార్తల్లోకి ఎక్కిన కంగనా
హీరోలతో తనకు శారీరక సంబంధం ఉందన్న కంగనా
హృతిక్ మాటలకు మోసపోయానన్న కంగనా
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలుస్తుంటారు. నిన్న మొన్నటిదాకా.. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో ప్రేమాయణం, తర్వాత బ్రేకప్ గొడవలతో వార్తలకెక్కిన కంగనా.. తాజాగా.. మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ప్రముఖ హిందీ న్యూస్ చానెల్ షోలో మాట్లాడుతూ.. పరిశ్రమలో తాను ఎవరికి భయపడనని.. తన మనసుకు నచ్చింది మాట్లాడుతాను అని చెప్పకొచ్చింది. అంతేకాకుండా పలువురు హీరోలతో తనకు ఉన్న శారీరక సంబంధాలను బయటపెట్టి సంచలనం రేపింది.
హీరోలతో సన్నిహితంగా నటించేటప్పుడు.. ప్రేమలో పడటం సహజమని చెప్పింది. ఒక్కోసారి తోటి హీరోలతో పడక కూడా పంచుకోవాల్సి వస్తుందని.. అలా చేయకపోతే.. వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని కంగనా చెప్పింది. ఇలాంటి పరిస్థితి తనతోపాటు చాలా మంది హీరోయిన్లు ఎదుర్కొన్నారని కంగనా తెలిపింది.
హృతిక్ తన వైవాహిక జీవితం సరిగాలేదని.. తాను తన భార్య వేరువేరు గదుల్లో పడుకుంటున్నామంటూ... తనతో చెప్పి కన్నీరు పెట్టుకున్నాడని తెలిపింది. ఆ మాటలకు తాను కరిగిపోయి హృతిక్ మాయలో పడిపోయానని చెప్పింది. తాను యవ్వనంలో ఉండటంతో వెంటనే హృతిక్ ప్రేమలో పడిపోయానని కంగనా వెల్లడించింది.
ఇక ఆదిత్య పంచోలి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆదిత్య పంచోలి తనను లైంగికంగా వేధించాడని, తనను శారీరికంగా వాడుకొన్నాడని తెలిపింది. ఆ సమయంలో తనకు ఆర్థిక సమస్యలు ఉండటంతో ఆయనకు లొంగిపోవాల్సి వచ్చిందని చెప్పింది.
Last Updated 26, Mar 2018, 12:03 AM IST | 0business
|
Suresh 84 Views kabaddi
pro kabaddi
నాగ్పుర్ః నాగ్పుర్ వేదికగా జరిగిన ప్రొ కబడ్డీ ఐదో సీజన్లో దబాంగ్ ఢిల్లీపై పుణె రిపల్టాన్ విజయం సాధించింది.
దబాంగ్ ఢిల్లీపై పుణె రిపల్టాన్ 26-21 తేడాతో గెలుపొందింది. ప్రథమార్ధంలో రెండు జట్లు హోరాహోరీగా
తలపడ్డాయి. ఐతే రెండో భాగంగా పుణె అనూహ్యంగా పుంజుకొని ఆధిక్యం పెంచుకుంటూ పోయింది. | 2sports
|
Hyderabad, First Published 1, Feb 2019, 7:52 AM IST
Highlights
రామ్ చరణ్ తో రచ్చ వంటి చిత్రం చేసిన సంపత్ నంది కెరీర్ పరుగెడుతుందని అంతా భావించారు. అయితే ఆయన ఆ తర్వాత రవితేజ తో చేసిన బెంగాళ్ టైగర్ కానీ, గోపిచంద్ తో చేసిన ‘గౌతమ్ నంద’వర్కవుట్ కాలేదు
రామ్ చరణ్ తో రచ్చ వంటి చిత్రం చేసిన సంపత్ నంది కెరీర్ పరుగెడుతుందని అంతా భావించారు. అయితే ఆయన ఆ తర్వాత రవితేజ తో చేసిన బెంగాళ్ టైగర్ కానీ, గోపిచంద్ తో చేసిన ‘గౌతమ్ నంద’వర్కవుట్ కాలేదు. బేసిక్ గా రైటర్ అయిన సంపత్ ..స్క్రిప్టులే తడబడ్డాయి. దాంతో ఈ సారి అలాంటి పొరపాటు జరగకూడదనుకున్నారో ఏమో కానీ గౌతమ్ నంద తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు సంపత్ నంది. ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని పట్టాలు ఎక్కిస్తున్నాడు. అయితే ఈ సారి కూడా గోపిచంద్ తోనే చేయనున్నాడు.
అందుతున్న సమాచారం మేరకు రీసెంట్ గా గోపిచంద్ ని కలిసి ఫైనల్ నరేషన్ ఇచ్చాడు ఈ దర్శకుడు. విన్న వెంటనే గోపిచంద్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ఇచ్చాడట. ఈ చిత్రం మే లో సెట్స్ మీదకు వెళ్లనుంది. బెంగాల్ టైగర్ నిర్మాత రాధామోహన్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ కు కూడా ఇటీవల సరైన హిట్ లేదు. దీనితో వీరిద్దరూ ఎలాగైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరో ప్రక్క గోపిచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తన 26వ చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాను ఇటీవలే లాంచ్ చేశారు. టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో గోపీచంద్ పెరిగిన గెడ్డంతో కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఆ లుక్ కి సంబంధించిన స్టిల్ ఒకటి బయటికి వచ్చింది. నిజంగానే ఈ లుక్ లో గోపీచంద్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.
Last Updated 1, Feb 2019, 7:52 AM IST | 0business
|
పవన్ ఫ్యాన్స్ ఏం చేయగలిగారు: వర్మ
Highlights
ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ తన మితిమీరిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ ను
ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ తన మితిమీరిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ ను కామెంట్ చేస్తూనే ఉన్నారు. శ్రీరెడ్డి విషయంలో కూడా పవన్ ను ఆయన అభిమానులను దూషిస్తూ వర్మ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఇంత ధైర్యంగా మరొకరిని దూషిస్తూ మాట్లాడే వర్మ దీనికి భయపడడా..? అనే అనుమానం చాలా మందికి కలుగుతుంటుంది. తాజాగా వర్మ తనను భయపెట్టిన సంఘటనలు, వ్యక్తుల గురించి ప్రస్తావించారు.
''ఇప్పటివరకు నన్ను భయపెట్టిన సంఘటనలు జరగలేదు. ఏ వ్యక్తి కారణంగా నేను భయపడలేదు. మన దగ్గర ఉన్నది పోతున్నప్పుడు మాత్రం భయం కలుగుతుంది. చాలా మంది నన్ను అడుగుతుంటారు ఏం చూసుకొని నీకింత ధైర్యం అని.. నిజానికి అది ధైర్యం కాదు అండర్ స్టాండింగ్'' అని వెల్లడించారు.
అలానే పవన్ అభిమానుల గురించి ప్రస్తావిస్తూ.. ''రాజాకీయ పార్టీలు ఇప్పటివరకు ఏమైనా చేశాయా? ఇదే విధంగా నేను దావూద్ ఇబ్రహీంను అనలేను కదా.. ఆయన్ను అంటే సైలెంట్ గా బుల్లెట్ నా మీదకు వస్తుందని తెలుసు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు నరికేస్తాం.. చంపేస్తాం అన్నారు కానీ ఏం జరిగింది..? కెమెరా ముందు ఉన్నంతవరనే వారి మాటలు. అది ఆఫ్ అవ్వగానే అందరూ మహేష్ బాబు సినిమాను వెళ్లుంటారు అంటూ నవ్వుతూ తెలిపారు.
Last Updated 16, May 2018, 4:31 PM IST | 0business
|
Vijay Goyal
జాతీయ క్రీడా నియమావళి అమలు
న్యూఢిల్లీ: రాష్ట్ర సమాఖ్యల్లో జాతీయ క్రీడా నియ మావళి అమలు చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజ§్ు గోయల్ పేర్కొన్నాడు. కాగా ఈ అంశంపై ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు,కార్యదర్శులను కోరారు.ఎన్ఎస్ఎఫ్తో ఈ మధ్య సమావేశం జరిగిం దన్నారు.రాష్ట్ర సమాఖ్యల్లోనూ క్రీడా నియమావళి అమలు చేయాలని అక్కడి వారికి సూచంచినట్లు తెలిపారు. చర్చల ద్వారా ఏకాభి ప్రాయ సాధనకు మంత్రులు, కార్యదర్శులు కృషిచేయాలని కోరారు. కాగా సుమారు 95 శాతం సమాఖ్యల్లో నియమావళి అమలు చేయా ల్సి ఉందని, ముందుకెళ్లేందుకు హైకోర్టు సైతం అనుమతి ఇచ్చిందని,టోక్యో ఒలింపిక్స్ కోసం క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే పనులు ప్రారం భించిందని పేర్కొన్నారు.టాప్ పథకం గురించి ఫిర్యాదులు రాలేదని,ముందే ఎందుకు చేయలేదని మాత్రమే అడిగారని వివరించాడు.టోక్యో ఒలిం పిక్స్కు జట్టు ఎంపిక,శిక్షణ,భారత కోచ్,విదేశీ కోచ్, ఇతర విషయాలు గురించి రాబోయే రెండు నెలల్లో కసరత్తు ప్రారంభిస్తామని వెల్లడించాడు. క్రీడాకారులు,క్రీడలకు సంబంధించిన వ్యక్తులకు కనీసం 5 శాతం ఉద్యోగాలు కేటాయించాల్సిన అవ సరం ఉందన్నాడు. కాగా విషయంపై అందరు మంత్రులు ఆలో చించాలని కోరారు. పిల్లల్లో క్రీడాసామర్థ్యాన్ని చిన్నితనంలోనే గుర్తించేందుకు ప్రత్యేక ప్రక్రియ అవసరమని గోయల్ పేర్కొ న్నాడు. | 2sports
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి | 1entertainment
|
NANDAN
ఇన్ఫోసిస్కు నందన్ రాక
బెంగళూరు, ఆగస్టు 24: దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు ఇన్ఫోసిస్ యాజమాన్యానికి లేఖరాస్తూ మాజీ సిఇఒ నందన్ నీలకేనిని తిరిగి రప్పించాలని కోరారు. ఆయనరాకతో ఇన్ఫోసిస్ వాటాదారుల్లో కొంతవరకైనా విశ్వాసం పెరుగుతుందని ఆయన అన్నారు. నందన్ నీలేకకని కంపెనీని 2009లో వీడివెళ్లారు. వెను వెంటనే విశిష్టగుర్తింపుప్రాథికార సంస్థ (యుఐడిఎఐ)కు అధిపతిగా ఆధార్ను విజయవంతంగా దేశంలో అమలుచేసారు. దేశంలో పలువురు అగ్రగామి సంస్థాగత ఇన్వెస్టర్లుగా మేం ఈలేఖను రాస్తున్నట్లు ఇన్వెస్టర్లు వాటాదారులు వివరించారు. ఈ సంస్థ ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫోసిస్లో వాటాదారులుగా ఉన్నారు. ఇటీవలిపరిణామాలు తమను ఎంతో కలవరపరిచాయని చెపుతు న్నారు. పరస్పరం చర్చించిన తర్వాత మాజీ సిఇఒ నందన్ నీలేకనిని బోర్డులోకి తీసుకుంటే కొంత విశ్వాసం పెరుగుతుందని, నీలేకనికి ఆయన హోదాకు తగిన పదవిని కల్పించాల్సి ఉంటుందని సంస్థాగత ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు. ఆయన హయాంలో వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగుల విశ్వాసం చూరగొన్న ట్లు సంసఆథగత ఇన్వెస్టర్లు వివరించారు. ఈ సమయంలో నీలేకని వంటి వారి రాక ఎంతో అవసరమని యాజమాన్యం గుర్తించి నందన్ను వెంటనే పిలిపించాలని ఆయనరాకతో ఇన్ఫోసిస్ను పట్టిపీడిస్తున్నసమస్యలన్నీ మటు మాయం అవుతాయన్న ధీమా వ్యక్తంచేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఐడిఎఫ్సి ఎఎంసి, డిఎస్పి బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్మేనేజర్స్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్్స, బిర్లా సన్లైప్ ఎఎంసి, ఐసిఐసిఐప్రుడెన్షియల్ లైఫ్, ఎస్బిఐ ఫండ్స్ మేనేజ్ మెంట్, కోటక్ మహీంద్ర అసెట్ మేనేజ్మెంట్, హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐ సిఐ ప్రుడెన్షియల్ ఎఎంసి, రిలయన్స్ నిప్పన్లైఫ్ ఎఎంసి సంస్థలకుచెందిన సిఇఒలు, ఎగ్జిక్యూటివ్డైరెక్టర్లు, ఛీఫ్ ఇన్ఫ ర్మేషన్ అధికారులు సంతకాలు చేసారు. లాగే దేశీయసంస్థా గత ఇన్వెస్టర్ల పరంగా కూడా బోర్డుకు మరికొందరు లేఖలు రాసినట్లు సమాచారం. ప్రస్తుతం ఇన్ఫోసిస్లో దేశీయ వాటాదారులు మూచ్యువల్ఫండ్స్ 8.96శాతం, బీమా కంపె నీలు 11.02శాతం, ఎల్ఐసి 7.04శాతం, మ్యూచువల్ఫండ్ ఇన్వెస్టర్ హెచ్డిఎఫ్సి ట్రస్టీకంపెనీ 2శాతం, విదేశీ ఇన్వెస్టర్ ఓప్పెన్హీమర్ డెవలపింగ్ మార్కెట్స్ఫండ్ 2.16శాతంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఒ వి.బాల కృష్ణన్ కూడా నందన్ నీలేకని సిఇఒ ఎండిగా రావాలని ఆశిం చారు.
నందన్నీలకేనిని ఇన్ఫోసిస్ ఛైర్మన్గా తీసుకురావాలని ఆయన కోరారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపక బృందంలో ఒకరైన నీలేకకని రాకతో మొత్తం సమస్యలు పరిష్కరించగలరని ఆయన హయాంలో మంచి పనితీరును చూపించిన నీలేకనిని ఛైర్మన్గా తీసుకు రావాలని బాలకృష్ణన్పేర్కొన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఛైర్మన్ఆర్.శేషసాయి, కోఛైర్మన్ రవివెంకటేషన్లు వెంటనే దిగిపోవాలని కూడా ఆయన సూచించారు. వస్తే ఆయన ఛైర్మన్గానే రావాలి. ఒక సమర్ధుడైన సిఇఒను అన్వేషించడం ఆయనవల్లనే సాధ్యం అవుతుంది. ఆయన హయాంలో ఇన్ఫోసిస్లో లెక్కకు మించిన కస్టమర్లు ఉన్నారని ఆయన అన్నారు.
నీలేకని గ్లోబల్ ఇమేజ్ ఉన్న పారిశ్రామికప్రముఖులని అన్నారు. ఆయన పనిచేసిన భారీప్రాజెక్టు లు ఆధార్ వంటివి ఇందుకు నిదర్శనమని, అందుకే ఆయన్ను సరైన తరునంలో బోర్డులోకి తీసుకువస్తే సమస్యలన్నీ పరిష్కారం అవు తాయని ఊహాగానాలకు తెరదించినట్లవుతుందని అన్నారు. అయితే మరో 48 గంటల్లో ఇన్ఫోసిస్కు నీలేకని వచ్చే అంశంపై స్పష్టత వస్తుందని ఐటి వర్గాలుపేర్కొంటున్నాయి. దేశంలోని రెండో అతిపెద్ద ఐటిసేవల కంపెనీగా నిలిచిన ఇన్ఫోసిస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి గట్టెక్కించగలిగే వ్యక్తి ఆధార్ సృష్టికర్త నందన్నీలేకని మాత్రమేనని కంపెనీలోని ఒకవర్గం పేర్కొంటున్నది. నందన్నీలేకని తిరిగి ఇన్ఫోసిస్లోకి రావడం, ఆయనకు అప్పగించే బాధ్యతలపై మరో 48 గంటల్లో స్పష్టత వచ్చేఅ వకాశం ఉందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఇన్వెస్టర్లతో నిర్వహించే సమావేశం వాయిదా పడింది.
మూర్తిఅనారోగ్య కారణాల రీత్యా బుధవారం సాయంత్రం 6.30గంటలకు జరగాల్సిన సమావేశాన్ని ఈ నెల 29కి వాయిదావేసారు. ఈనేపథ్యంలోనే నందన్నీలేకని పునరాగమనంపై వార్తలు వెలువడ్డాయి. నీలేకనివస్తారన్న పుకార్లతో మార్కెట్లలో కంపెనీ షేర్లు 2.8శాతం పెరిగాయి. మరింత సానుకూల పలితాలు వస్తాయనడానికి ఇదే ఉదాహరణ అని పలువురు పేర్కొంటున్నారు. ఇన్ఫోసిస్ను ప్రారంభించిన ఏడుగురు వ్యవస్థాపకుల్లో నీలేకని ఒకరు. ఆయన కంపెనీకి సిఇఒగా 2002 నుంచి 2007 వరకూ బాధ్యతలు నిర్వహించి తర్వాత 2009లో ఆధార్ప్రాజెక్టుకు నియమితులైన సంగతి తెలిసిందే. | 1entertainment
|
Hyderabad, First Published 22, Mar 2019, 5:48 PM IST
Highlights
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథని తమిళ్ లో మళ్ళీ రీ షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆదిత్య వర్మ గా రూపొందుతున్న ఈ బోల్డ్ కంటెంట్ పై చిత్ర యూనిట్ ఇప్పుడిపుడే అంచనాలు పెరిగేలా అడుగులు వేస్తోంది.
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథని తమిళ్ లో మళ్ళీ రీ షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆదిత్య వర్మ గా రూపొందుతున్న ఈ బోల్డ్ కంటెంట్ పై చిత్ర యూనిట్ ఇప్పుడిపుడే అంచనాలు పెరిగేలా అడుగులు వేస్తోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ముందుగా నటి నటుల ఎంపికలో దర్శకుడు ఎవరు ఊహించని విధంగా ఆలోచిస్తున్నారు.
అర్జున్ రెడ్డి రీమేక్ కు బాల తప్పుకోగా ఒరిజినల్ కథకు సహాయ దర్శకుడిగా పని చేసిన గిరీశయ్య కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే సినిమాకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు జనాలను ఆకర్షిస్తోంది. సీనియర్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ హీరో తండ్రిగా కనిపించబోతున్నాడు.
నటుడిగా అప్పుడపుడు గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్న దర్శకుడు గౌతమ్ మీనన్ మొదటి సారి ఒక కీ రోల్ లో నటించడానికి సిద్దమయ్యాడు. తెలుగులో విజయ్ ఫాదర్ పాత్రలో మహేష్ బావ సంజయ్ స్వరూప్ నటించారు. ఇప్పుడు తమిళ్ లో గౌతమ్ మీనన్ ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. మరి ఆయన ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.
Last Updated 22, Mar 2019, 5:48 PM IST | 0business
|
Sep 11,2018
ఆర్బీఐ వద్ద అస్త్రాలున్నాయి..
న్యూఢిల్లీ: దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనాన్ని నియంత్రించడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వద్ద పలు అస్త్రాలు అందుబాటులో ఉన్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ అన్నారు. రూపాయి విలువ సోమవారం గరిష్టస్థాయిలో పతనమై డాలరుతో పోలిస్తే రూ.72.45కు చేరిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆర్బీఐ వెంటనే రంగంలోకి దిగి రూపాయి పతనాన్ని నియంత్రించాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా ద్రవ్యోల్బణ నియంత్రణకు గాను తగు విధంగా వడ్డీరేట్ల పెంపు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు ఈ దిశగా ఆర్బీఐ కృషి చేసిందని.. అయితే ఇదే విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆయన సూచించారు. రూపాయి విలువను కాపాడేందుకు గాను తగిన చర్యలు చేపడుతున్నామన్న సంకేతాలను ఆర్బీఐ వెల్లడించాల్సి అవసరం ఉందని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు గాను ఇప్పటి వరకు తాము పలు చర్యలు చేపట్టామని.. అవసరం మేరకు వడ్డీరేట్లను పెంచుతూ పోతున్నామన్న విషయం వెల్లడించాలని ఆయన అన్నారు. దీనివల్ల మదుపరుల్లో విశ్వాసం పెరగుతుందని ఆయన వివరించారు. ద్రోవ్యల్బణం కట్టడికి పని చేస్తే రూపాయి పతనాన్ని అడుకోవడం సాధ్యపడుతుందని ఆయన అన్నారు. రూపాయి పతనం నేపథ్యంలో భారత్ తమ ద్రవ్యలోటుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ద్రవ్యలోటు పెరిగిపోయిన సంగతితని ఆయన గుర్తు చేశారు. భారత్ వృద్ధి పథంలో సాగుతున్నప్పటికీ కొంత శ్రద్ధ వహించడం అవసరమని ఆయన వివరిచారు. కాగా, సోమవారం అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ మరో 69 పైసలు పతనమై 72.43 కనిష్ట స్థాయికి క్షీణించింది. దీంతో అప్రమత్తమైన సర్కారు ఆర్బీఐ వర్గాలను పిలిచి నియంత్రణ చర్యలు చేపట్టాల్సిందిగా కోరింది. దీంతో పతనం ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 14, Oct 2018, 2:59 PM IST
Highlights
ఎప్పుడైతే కథానాయకుడు దర్శకుడు ఒక పనిలో ఆత్మీయతతో దగ్గరవుతారో వారి బంధం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ గురించి కూడా అందరూ అదే స్థాయిలో చర్చించుకుంటున్నారు. అరవింద సమేత ఘన విజయాన్ని అందుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.
దర్శకులకు హీరోలకు ఉండే రిలేషన్ ను చుస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎప్పుడైతే కథానాయకుడు దర్శకుడు ఒక పనిలో ఆత్మీయతతో దగ్గరవుతారో వారి బంధం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ గురించి కూడా అందరూ అదే స్థాయిలో చర్చించుకుంటున్నారు. అరవింద సమేత ఘన విజయాన్ని అందుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.
అయితే ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులందరు వారి అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ మాటలు మరోసారి అందరిని ఆకట్టుకున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన మొత్తం ప్రేమను అదే సమయంలో చూపించాడు. త్రివిక్రమ్ ను ఎంతగా అభిమానిస్తున్నాడో ఆయన మాటలు వింటే ఎవరికైనా అర్ధమవుతుంది.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'పన్నెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ గారితో సినిమా చేయాలని. ఆయన నా మిత్రుడు, ఆత్మీయుడు, శ్రేయోభిలాషి, అన్న, ఆత్మ బంధువు, మా అమ్మకు ఇంకో కొడుకు, నా పిల్లలకు మావయ్య, నా భార్యకు అన్న, నాకు బావ.. ఇలా ఎన్ని బంధాలతో పిలిచినా పలికే ఆత్మీయుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయనతో ఒక చిత్రం చేయాలి... చేస్తే జీవితాంతం నా గుండె లోతుల్లో ఆ చిత్రం చిరస్థాయిగా మిగిలిపోవాలి.
రేపొద్దున గర్వంగా నా పిల్లలకి ఈ చిత్రాన్ని చూపించుకోవాలి. సమాజానికి ఆ చిత్రాన్ని చూపించి.. నేను కూడా గర్వంగా నిలుచునే స్థాయిలో ఉండాలని కోరుకున్న ఆ తరుణం మూడు రోజుల క్రితం రానే వచ్చింది అదే అరవింద సమేత' అంటూ తారక్ మాట్లాడారు. అదే విధంగా చిత్ర విజయం త్రివిక్రమ్ తన ఖాతాలో వేస్తున్నాడని చెబుతూ.. అది తప్పు ఎందుకంటే త్రివిక్రమ్ ను నమ్మేలా చేసింది ఆయన కథే. త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన విజయం అరవింద సమేత అని ఎన్టీఆర్ తెలియజేశారు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
72 రోజుల నిరీక్షణ, 9 వేల కి.మీ. ప్రయాణం.. ధోనీ@ 10,000 రన్స్
మహేంద్ర సింగ్ ధోనీ భారత్ తరఫున పది వేల పరుగులు పూర్తి చేశాడు. సంగక్కర తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. భారత్ తరఫున ఐదో బ్యాట్స్మెన్గా రికార్డ్.
Samayam Telugu | Updated:
Jan 12, 2019, 01:10PM IST
72 రోజుల నిరీక్షణ, 9 వేల కి.మీ. ప్రయాణం.. ధోనీ@ 10,000 రన్స్
హైలైట్స్
మహేంద్ర సింగ్ ధోనీ భారత్ తరఫున పది వేల పరుగులు పూర్తి చేశాడు.
సంగక్కర తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్.
భారత్ తరఫున ఐదో బ్యాట్స్మెన్గా రికార్డ్.
మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని భారత్ తరఫున వన్డేల్లో పది వేల పరుగులు పూర్తి చేశాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో రిచర్డ్సన్ బౌలింగ్లో స్క్వేర్ లెగ్ దిశగా సింగిల్ తీసి ఈ మైలురాయిని అందుకున్నాడు. 334వ వన్డే ఆడుతున్న ధోనీ .. భారత్ తరఫున పదివేల పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత్ తరఫున ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), విరాట్ కోహ్లీ (10,235) 10 వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పసిడి పతక విజేత ‘స్వప్న’కి స్పెషల్ షూస్
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏడు ఈవెంట్లు కలిపి ఉన్న‘హెప్టాథ్లాన్’లో పోటీపడిన స్వప్న.. బంగారు పతకంతో భారత్ని మురిపించింది.
Samayam Telugu | Updated:
Sep 14, 2018, 04:27PM IST
ఇండోనేషియా వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా గేమ్స్లో పసిడి పతకంతో మెరిసిన స్వప్న బర్మన్ కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) స్పెషల్ షూస్ని తయారు చేయిస్తోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏడు ఈవెంట్లు కలిపి ఉన్న‘హెప్టాథ్లాన్’లో పోటీపడిన స్వప్న.. బంగారు పతకంతో భారత్ని మురిపించింది.
ఆమె రెండు కాళ్లకి ఒక అదనపు వేలు ఉన్నా.. ప్రత్యేక బూట్లని తయారు చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సాధారణ బూట్లనే ధరించి పోటీలో పాల్గొని పోరాట పటిమని చూపింది. దీంతో విషయం తెలుసుకున్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెంటనే స్వప్నకి ప్రత్యేక షూస్ తయారు చేయించడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు ఎస్ఏఐ డైరెక్టర్ జనరల్ నీలమ్ కపూర్ తెలిపారు.
‘స్వప్న షూస్ సమస్య గురించి తెలిసిన వెంటనే క్రీడల మంత్రి ఇండోనేషియా నుంచి మాకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ప్రత్యేక షూస్ రూపొందించడంపై అడిడాస్ కంపెనీని మేము సంప్రదించగా.. వారు అంగీకరించారు’ అని నీలమ్ కపూర్ తాజాగా వెల్లడించారు.
ఆసియా గేమ్స్ కంటే ముందే స్వప్న సమస్య గురించి ఎస్ఏఐకి తాను వెల్లడించినా పట్టించుకోలేదని.. తాజాగా మంత్రి ఆదేశాలు జారీ చేయడంతో కదలిక వచ్చిందని స్వప్న కోచ్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఇటీవల షూస్ సైజ్, డిజైన్ గురించి ఎస్ఏఐ టీమ్ తనని సంప్రదించినట్లు కూడా ఆయన వివరించారు. | 2sports
|
Sardaar Gabbar Singh script took two-and-a-half years: Pawan Kalyan
'సర్ధార్' స్క్రిప్ట్కి రెండున్నరేళ్లు పట్టింది -పవన్
సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా. పవర్ స్టార్ ఫ్యాన్స్ని ఎప్పటినుంచో ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకి ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.
TNN | Updated:
Apr 8, 2016, 05:46PM IST
సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా. పవర్ స్టార్ ఫ్యాన్స్ని ఎప్పటినుంచో ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకి ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పవన్ నటించిన ఓ సినిమా హిందీ వెర్షన్లోనూ రిలీజవడం ఇదే మొదటిసారి. అయితే హిందీ మార్కెట్లో అడుగుపెట్టడానికి పవన్కి ఇంత సమయం ఎందుకు పట్టింది అనే ప్రశ్నకి స్పందిస్తూ... ''అసలు తాను హీరో అవుతాననే అనుకోలేదు. తన దృష్టి ఎంతసేపూ డైరెక్షన్ మీదే వుండింది. కానీ విధి నన్ను హీరోని చేసింది. అటువంటప్పుడు ఇక నేను హిందీలోకి ప్రవేశించాలని ఎలా అనుకుంటాను. ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా అలా అనుకోకుండా జరిగిందే'' అని చెప్పుకొచ్చాడు పవన్. సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా గురించి చెబుతూ.. ఈ కథ, స్క్రీన్ ప్లేని డెవలప్ చేయడం కోసం తాను రెండున్నరేళ్లు శ్రమించాను అని తెలిపాడు. తన సినిమా ద్వారా ఆడియెన్స్కి ఏదో ఓ సందేశం ఇవ్వాలని భావించాను. సినిమాలోని ప్రతీ పాట, ప్రతీ సన్నివేశం ఆడియెన్స్కి ఓ మంచి అభిప్రాయాన్ని కలిగించేలా వుండాలని అని భావించాను అంటూ సర్ధార్ మేకింగ్ వెనుకున్న తన ఐడియాలజీని పంచుకున్నాడు పవన్. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
నాగ్కి విలన్గా చేయాలని ఉందట
హీరో జగపతి బాబు క్లాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా ముద్ర వేయించుకున్నాడు.
TNN | Updated:
Jun 22, 2016, 09:53AM IST
నాగ్కి విలన్గా చేయాలని ఉందట
హీరో జగపతి బాబు క్లాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా ముద్ర వేయించుకున్నాడు. అలాంటిది ఇప్పుడతను తెలుగు సినిమాలకు టాప్ విలన్గా తయారయ్యాడు. రాజశేఖర్, శ్రీకాంత్... అదే బాటలో వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాగా టాప్ హీరోల్లో ఒకరైన నాగార్జునకి కూడా పవర్ ఫుల్ విలన్ గా చేయాలని కోరికగా ఉందట. ఈ మధ్య జరిగిన సాహసం శ్వాసగా సాగిపో ఆడియో వేడకలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. అన్ని రకాల పాత్రల్లోనూ తాను నటించానని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. స్టేజీపై ఉన్న గౌతమ్ మీనన్ కు ఈ విషయం ఆయన స్వయంగా చెప్పడం గమనార్హం. నాగార్జునను విలన్ రోల్ లో చూసే అవకాశం ఇంకెంతో దూరంలో లేదని టాలీవుడ్ టాక్. | 0business
|
Aug 31,2015
ఎపిలో ఒకరోజు పెట్రోల్, డీజిల్ బంకుల బంద్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి 24 గంటలపాటు పెట్రోల్, డీజిల్ బంకులు మూతపడనున్నాయి. ప్రభుత్వం ఈఏడాది ఫిబ్రవరిలో పెట్రోల్, డీజీల్పై పెంచిన వ్యాట్కు వ్యతిరేకంగా పెట్రోల్ డీలర్ల సంఘం బంద్కు పిలుపునిచ్చింది. పెట్రోల్ డీలర్ల సంఘం ఆరు నెలల కాలంలో పలుమార్లు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సానుకూల హామీ రాకపోవటంతో ఒకరోజు బంద్ చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం.. పెంచిన వ్యాట్ కారణంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్తోందని పెట్రోల్ డీలర్లు చెబుతున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
GOPI CHADN ACADEMY
గోపీచంద్ అకాడమీలో శ్రీకాంత్కు అభినందన సభ
హైదరాబాద్: ప్రపంచ టాప్ 10 ర్యాంకింగ్స్లో చేరినం దుకు చాలా సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేతగా నిలిచిన కిదాంబి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్ల విజయం అనంతరం కిదాంబి శ్రీకాంత్ మంగళవారం భారత్కు చేరుకున్నాడు. ఈసందర్భంగా శంషాబాద్ విమా నాశ్రయంలో బంధుమిత్రులు, అభిమానులు శ్రీకాంత్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం గచ్చిబౌలీలోని గోపి చంద్ అకాడమీలో శ్రీకాంత్తో పాటు ప్రణ§్ు, సాయి ప్రణీత్లకు అభినందన సభ ఏర్పాటు చేశారు. వరుసగా రెండు సూపర్ సిరీస్లు గెలిచినందుకు బహుమతి ప్రధానం చేశారు.
అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్య వాదాలు తెలిపాడు. గత రెండు వారాలుగా మంచి ఫలి తాలు సాధించగలిగామని, తనతోపాటు ప్రణ§్ు, సాయి ప్రణీత్ కూడా బాగా రాణించారని అన్నారు. ప్రతి మ్యాచ్ కష్టమైనదే. అయితే ఆత్మ విశ్వాసంతో ఆడేందుకు కృషి చేశానని పేర్కొన్నాడు. ప్రపంచ టాప్10 ర్యాంకింగ్స్లో చేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. గాయం తర్వాత రాణించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. తనతో పోరాడిన వారే తనను మరింత రాటుతేలేలా చేశా రని చెప్పాడు. రాబోయే రోజుల్లో మరింత ప్రతిభ ప్రదర్శి స్తామని ప్రణ§్ు పేర్కొన్నాడు. గోపిచంద్ శిక్షణ లేకుండా ఈ విజయాలు సాధ్యమయ్యేవి కావని శ్రీకాంత్ తెలిపాడు. ఆ తర్వాత మాట్లాడిన గోపిచంద్ తక్కువ సమయంలో ఈ సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లుచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. కిదాంబి శ్రీకాంత్, ప్రణ§్ు, సాయి ప్రణీత్లకు అభినందనలు తెలిపారు. | 2sports
|
Hyderabad, First Published 8, Apr 2019, 1:52 PM IST
Highlights
టీం ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2019లో ఆర్సీబీ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వరసగా ఆరు మ్యాచ్ లు ఓటమిపాలయ్యింది.
టీం ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2019లో ఆర్సీబీ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వరసగా ఆరు మ్యాచ్ లు ఓటమిపాలయ్యింది. టీంలో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ ఓడిపోతోందంటే కారణం.. కేవలం కెప్టెన్సీ వైఫల్యమేననే అభిప్రాయం వెలువడుతోంది.
కాగా.. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఐపీఎల్ ప్రదర్శన ప్రభావం ప్రపంచ కప్ పై పడింది. కోహ్లీ మంచి బ్యాట్స్ మెన్ అయినప్పటికీ... మంచి కెప్టెన్ మాత్రం అవ్వలేకపోతున్నాడంటూ అందరూ విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రభావం ప్రపంచకప్ మీద పడకుండా ఉండాలంటే.. టీం ఇండియాకి కెప్టెన్ మార్చాలంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కోహ్లీకి కాకుండా రోహిత్ కి కెప్టెన్సీ ఇస్తే.. టీం ఇండియా ప్రపంచకప్ లో నెగ్గుకువస్తుందని పలువురు భావిస్తున్నారు. రోహిత్శర్మ ముంబయి జట్టును మూడు సార్లు ఐపీఎల్ విజేతగా, ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలబెట్టాడు. భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం కూడా రోహిత్కు ఉంది అంటున్నారు.
మాజీ క్రికెట్ దిగ్గజం మైఖెల్ వాన్ తన ట్విటర్ ఖాతాలో స్పందిస్తూ.. ‘భారత్ తెలివైన జట్టయితే ప్రపంచకప్లో సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీకి విశ్రాంతి కల్పించాలి’ అని పేర్కొన్నాడు. కొంతమంది అభిమానులు మాత్రం.. కోహ్లీ ఎప్పటికైనా ఉత్తమ కెప్టెన్గా రాణిస్తాడు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే బెంగళూరు జట్టు కూడా విజయాలు సాధిస్తుందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.
Last Updated 8, Apr 2019, 1:52 PM IST | 2sports
|
Oct 23,2016
మహేష్ బ్యాంక్ కొత్త శాఖ ప్రారంభం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ హైదరాబాద్లో మరో శాఖను విస్తరించింది. 43వ శాఖగా గచ్చిబౌలిలో కొత్త శాఖను తెరిచింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బ్రాంచీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ఛైర్మన్ పురుషోత్తందాస్ మందన మాట్లాడుతూ బ్యాంకు వృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. ఇప్పటికే రూ.3000 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని దాటేసినట్లుగా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,500 కోట్ల లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లుగా తెలిపారు. బ్యాంకు ఎండీ, సీఈవో ఉమేష్ చంద్ అసావా మాట్లాడుతూ టెక్నాలజీని వాడుకొని మెరుగైన సేవలను అందించడంతో తమ బ్యాంకు దిగ్గజ బ్యాంకులతో సరిసాటిగా పోటీపడుతోందని అన్నారు. బ్యాంక గౌరవ ఛైర్మన్ రమేష్ కుమార్ బంగ్ మాట్లాడుతూ బ్యాంకు త్వరలోనే బంజారాహిల్స్, కరీంనగర్లలో మరో రెండు శాఖలను తెరవనున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో పని చేస్తున్న 52 కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో మహేష్ బ్యాంకు అతిపెద్దదని ఆయన వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Boyapati Srinu: బోయపాటిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. ఆ నటితో ఎఫైర్స్ అంటూ సంచలన పోస్ట్
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ రెచ్చిపోయింది. అగ్రదర్శకుడు బోయపాటిని టార్గెట్ చేస్తూ వరుస పోస్ట్లను వదిలింది. ఒక నటితో ఆయనకు ఎఫైర్ ఉందంటూ ఆమె ఫొటోలను నెట్టింట్లో పెట్టేసింది.
Samayam Telugu | Updated:
Oct 9, 2019, 05:55PM IST
శ్రీరెడ్డి, బోయపాటి
శ్రీరెడ్డి మళ్లీ టార్గెట్ చేసింది. ఆమె టార్గెట్ చేయకపోతే కదా వార్త.. చేస్తే అందులో విషయం ఏం ఉందని లైట్ తీసుకుంటున్నారనుకుందో ఏమో కాని.. ఈసారి ఇండస్ట్రీ పెద్ద దర్శకుడికే టార్గెట్ పెట్టింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుపై సంచలన కామెంట్స్ చేస్తూ వరుస పోస్ట్లను ఫేస్ బుక్లో షేర్ చేసింది శ్రీరెడ్డి.
బోయపాటి చిత్రాల్లో తరచుగా కనిపించే ఒక నటితో ఆయనకు ఎఫైర్ ఉందంటూ సంచలన పోస్ట్లు వదిలింది శ్రీరెడ్డి. ‘బోయపాటి గారూ.. మీరు ఆమె లేకుండా సినిమాలు కంప్లీట్ చేయరంటకదా’ అంటూ రాయడానికి వీలులేని బూతు పంచాంగం విప్పింది. అంతేకాదు సదరు నటి, ఆమె భర్త ఫొటోలను షేర్ చేసి వారిపై దారుణమైన కామెంట్స్ చేసింది. బోయపాటి గురించి, ఆ నటి గురించి వర్గర్ కామెంట్స్తో కూడిన పోస్ట్లను ఫొటోలతో సహా షేర్ చేసింది శ్రీరెడ్డి.
అయితే శ్రీరెడ్డి ఇలా టార్గెట్ చేయడం కొత్త కాదు.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో అర్ధనగ్న ప్రదర్శనతో హల్ చేసిన చేసిన శ్రీరెడ్డి తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల పర్సనల్ విషయాలను వీధికి లాగుతూ సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది హీరో హీరోయిన్లు, దర్శకులు, సింగర్స్, టీవీ యాక్టర్స్, షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్, మలయాళ, తమిళ చిత్రాలకు చెందిన అనేక మంది ప్రముఖుల పేర్లను అప్పట్లో బయటపెట్టి సంచలనానికి తెరతీసింది.
నాని, లారెన్స్, విశాల్, సుందర్. సి, శ్రీరామ్, రానా, అభిరామ్, త్రిష, రకుల్, తేజ, ఇలియానా.. ఇలా చాలా మందిపై గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. తాజాగా ఈ లిస్ట్లో చేరారు దర్శకుడు బోయపాటి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Visit Site
Recommended byColombia
దర్శకుడు పూరీ జగన్నాథ్తో ప్రేమాయణం తరువాత.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్తో డేటింగ్లో ఉందని.. ఈ ప్రేమపక్షులు ప్రేమలోకంలో విహరిస్తున్నారని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే పెళ్లికి ముందే పెటాకులైంది వీరి ప్రేమవ్యవహారం అంటూ వార్తలు నడిచాయి. అయితే దేవిశ్రీ పేరును ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ.. తాను ప్రేమలో విఫలమైనట్టు మీడియాకి వివరించింది. తాజాగా మరోసారి ప్రేమ, పెళ్లిపై సన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లోకొచ్చింది ఛార్మి.
'పెళ్లిపై నాకు నమ్మకం లేదు. నా విషయంలో అది జరగని పని. ఒక అబ్బాయిని చూసి ఇష్టపడే స్టేజ్లో లేను. నేనేంటో మా నాన్నకు తెలుసు. అందుకే నా తల్లిదండ్రులతోనే ఉండిపోవాలని అనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు ఛార్మి. ఒకవేళ చేసుకున్నా ఆయన కోసం సమయం కేటాయించలేను. ఇంటి పనులు చూసుకోలేను. నేను ఎక్కువగా సినిమా లోకంలోనే గడుపుతాను. ఫ్రెండ్స్తో వెకేషన్స్కు వెళ్తుంటా. సో.. ఎక్కువగా అందుబాటులో ఉండే అవకాశం ఏ మాత్రం లేదు.
ఇక తన లవ్ ఫెయిల్యూర్ గురించి గుర్తు చేసుకుంటూ.. ప్రేమలో ఓడిపోయానని అందుకే నాకు ప్రేమపై అలాగే పెళ్లిపై అంతగా నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది మాజీ హీరోయిన్ ఛార్మి . నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే అతడితో పూర్తికాలం కాపురం చేయలేక విడాకులు తీసుకునే వాళ్లమని ఎందుకంటే అతడు మంచివాడే కానీ నేనే చెడ్డదాన్ని అంటూ బాంబ్ పేల్చింది ఛార్మి . ప్రస్తుతం ఛార్మికి సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో పూరి జగన్నాథ్ ప్రొడక్షన్ టీమ్ లో కో-ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తోంది. పూరి కనెక్ట్స్ ప్రొడక్షన్ లో సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులను ఛార్మి దగ్గరుండి చూసుకుంటోంది. ప్రస్తుతం పూరి కొడుకు ఆకాష్ నటిస్తున్న ‘మెహబూబా’ చిత్ర షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది ఛార్మి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Mumbai, First Published 30, Oct 2018, 4:47 PM IST
Highlights
ముంబయిలో సోమవారం భారత్-వెస్టిండిస్ ల మధ్య నాలుగో వన్డేలో టీంఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియాన్ని కాదని ఈ మ్యాచ్ ను బ్రబౌర్న్ స్టేడియంలో జరగడంపై అభిమానుల్లో పలు సందేహాలు తలెత్తాయి. 23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ స్టేడియంలో ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ నిర్వహించడానికి బిసిసిఐ ఎందుకు మొగ్గు చూపిందో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.
ముంబయిలో సోమవారం భారత్-వెస్టిండిస్ ల మధ్య నాలుగో వన్డేలో టీంఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియాన్ని కాదని ఈ మ్యాచ్ ను బ్రబౌర్న్ స్టేడియంలో జరగడంపై అభిమానుల్లో పలు సందేహాలు తలెత్తాయి. 23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ స్టేడియంలో ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ నిర్వహించడానికి బిసిసిఐ ఎందుకు మొగ్గు చూపిందో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.
మొదట నాలుగో వన్డేను వాంఖడే స్టేడియంలోనే నిర్వహించేందుకు బిసిసిఐ తో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ లు భావించాయి. అయితే ఎంసీఏలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల ఈ మ్యాచ్ ను బ్రబౌర్న్ స్టేడియంకు మార్చారు.
ఎంసిఏ బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు చూసేందుకు ప్రత్యేకంగా అధికారులు లేరు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు మాజీ న్యాయమూర్తులు ఈ వ్యవహారాలను చూసేవారు. అయితే ఇటీవల వీరు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో అసంతృప్తికి లోనై రాజీనామా చేశారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఎంసిఏ ఆర్థిక వ్యవహారలను చూసేవారు మళ్లీ కరువయ్యారు.
అయితే వాంఖడే స్టేడియంలో మ్యాచ్ నిర్వహించాలంటే టికెట్ల అమ్మకాలకు, ప్రకటనలకు టెండర్లు, క్యాటరింగ్కు టెండర్లకు, నిర్వహణ అవసరాలకు డబ్బులు కావాలి. వాటిని చూసుకోడానే ప్రత్యేక అధికారులు అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఈ సందిగ్దం నుండి బైటపడేందుకే బిసిసిఐ ముందున్న ఒకే దారి బ్రబౌర్న స్టేడియం. అందువల్లే నాలుగో వన్డేను బ్రబౌర్న్ స్టేడియంలో నిర్వహించారు.
బ్రబౌర్న మైదానం ఎంసీఏ ఆదీనంలో కాకుండా వేరేవారి ఆదీనంలో ఉంది. దీంతో ఇక్కడ మ్యాచ్ నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో బిసిసిఐ ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్ ఇక్కడికి మార్చింది. దీంతో 23 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ వన్డే మ్యాచ్ చూసే అదృష్టం భారత అభిమానులకు దక్కింది.
మరిన్ని వార్తలు | 2sports
|
ఈ రోమాంటిక్ పిల్ల మళ్లీ వచ్చింది
Highlights
ఈ రోమాంటిక్ పిల్ల మళ్లీ వచ్చింది
ప్రియా వరియర్.. కొన్నాళ్లుగా యూట్యూబ్ లో వినిపిస్తున్న క్రేజీ బ్యూటీ పేరు. కన్నుగీటి కుర్రాళ్ల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ అమ్మడు కనుల తుపాకితో యువత మనసులను దోచేస్తుంది. మలయాళ సినిమా ఒరు ఆదార్ లవ్ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న ప్రియా ప్రకాశ్ వరియర్ తన చూపులతో బాలీవుడ్ స్టార్ రిషి కపూర్ ను సైతం బుట్టలో వేసుకుంది.
ఇక మన స్టైలిష్ స్టార్ కూడా ప్రియా చూపులకు ఇంప్రెస్ అయ్యాడు. ఒరు ఆదార్ లవ్ టీజర్ తోనే ఈ రేంజ్ సంచలనం సృష్టించగా ఇప్పుడు ఆ సినిమాకు సంబందించిన మరో టీజర్ తో మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ప్రియ ప్రకాశ్. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరి హాయ్ అంటూ ఎప్పుడో రవితేజ పాట వచ్చింది.
ప్రియా కనుసైగలను చూస్తే యువత అంతా ఆ పాటని వినక తప్పదు. సినిమా ఎలా ఉంటుందో ఏమో కాని ప్రియాని వాడుకుని మాత్రం బీభత్సమైన పబ్లిసిటీ పొందుతున్నారు దర్శక నిర్మాతలు. ప్రియా క్రేజ్ ను చూసి ఒరు ఆదార్ లవ్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. | 0business
|
internet vaartha 141 Views
పానాజి : భారత్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా రక్షణరంగ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ మంగళవారం నుంచి గోవాలో ప్రారంభంఅవుతోంది. కనీసం 1000కిపైగా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఈఎక్స్పోలో పాల్గొంటు న్నాయి. దేశరాజధానికి బైట ఏర్పాటు చేయడం బహుశా రక్షణరంగ చరిత్రలో ఇదేమొదటిసారి అని నిపుణుల అంచనా. తొమ్మిదవ విడతగా నిర్వహిస్తునన డిఫెక్స్పో ఇండియా ద్వైవార్షిక ఎగ్జిబిషన్ దక్షిణగోవాలోని నాక్వారి క్విటాల్ లో 28-31 తేదీలమధ్య జరుగుతుంది. కంపెనీలు కేవలం భారత్కోసమే కాకుండా ఈ ప్రాంతంలోని ఇతర దేశాల రక్షణ సామగ్రి అవసరాలపై కూడా ఒప్పందాలుచేసుకునే అవకాశంఉంది. దేశీయ కంపెనీలు, చిన్నమధ్యతరహా సంస్థ లు కూడా అనేకం పాల్గొంటున్నాయి. బహుళ విధాల వ్యూహాత్మక ఆయుధ సామగ్రి, క్షిపణులు, అణ్వాయుధ సంపత్తి, జలాంతర్గాములు, ప్రధాన యుధ్ధ ట్యాంకులు, భారీ విధ్వంసక వాహనాలు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు నాలుగో తరం ఫైటర్ఎయిర్క్రాఫ్ట్లు వంటి కీలకంగాప్రదర్శనకు వస్తున్నాయి. ప్రభుత్వ రక్షణ రంగ విధివిధానాలు మారుతుండటంతో మేకిన్ ఇండియా ప్రచారం దేశీయంగా మంచి ప్రభావం తీసుకువచ్చింది. దీనితో రక్షణరంగంలోమేకిన్ ఇండియా కీలకంఅయింది. రక్షణరంగంలో ఎఫ్డిఐ పెట్టుబడుల పరి మితులను కూడా సడలింపులు తీసుకురావడం మరికొంత కలిసొచ్చింది. రక్షణరంగంలోపెట్టుబడులకు భారత్ఎంతో అనుకూలమన్న సంకేతాలు ఈ ఎక్స్పోద్వారా పంపించ వచ్చని రక్షణమంత్రిత్వశాఖ భావిస్తోంది. అంతేకాకుండా ఈ ఎక్స్పోలోనే కొన్ని విదేశీ సంస్థలు స్వదేశీ సంస్థలమధ్య జాయింట్ వెంచర్లు ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంది. భారత్లోని ప్రభుత్వ రక్షణరంగ సంస్థలకు, ప్రైవేటు సంస్థ లు, ఇతర రక్షణరంగ సంబంధిత కంపెనీలకు తమ సామ ర్ధ్యం, డిజైన్ ఉత్పత్తులు ప్రదర్శనకు వేదిక అవుతున్నది. కనీసం వెయ్యికిపైగా కంపెనీలు భారత్; విదేశీ కంపెనీలు వస్తున్నాయి. 2014లో నిర్వహించిన డిఫెక్స్్పో కంటే ఒకటిన్నరరెట్లు ఎక్కువ సంఖ్యాపరంగా పెరిగింది. మొత్తం 510 కంపెనీలు భారతీయ సంస్థలుగా ఉన్నాయి 2014లో కేవలం 256 సంస్థలుమాత్రమే పాల్గొన్నాయి. మొత్తం 490 విదేశీ కంపెనీలు ఈఏడాది వస్తున్నాయి. అదే 2014 ఎక్స్పోకు 368కంపెనీలు హాజరయ్యాయి. మొత్తం 2014 లో 511 ప్రతినిధిబృందాలు వస్తే ఈఏడాది 950 ప్రతి నిధిబృందాలు హాజరవుతున్నాయి. మొత్తం 204 అధికారిక ప్రతినిధి బృందాలు, 44దేశాలనుంచి వస్తున్నాయి. 750 కిపైగా అనధికారిక బిజినెస్ప్రతినిధి బృందాలు కూడా డిఫెన్స్షోకు వస్తున్నాయి మొత్తం 40,725 చదరపు మీటర్ల పరిధిలో ఈఎక్స్పో ఏర్పాటవుతోంది. ఇప్పటివరకూ కేవలంఢిల్లీలోనిప్రగతిమైదాన్లో మాత్రమే నిర్వహించేవారు. | 1entertainment
|
BSUMATI
డాలర్ ఆధారిత ట్రేడింగ్కు ఇరాన్ చెక్!
ముంబై,: ఇరాన్పై ఆమెరికా ఆంక్షలు విధించిననేపథ్యంలో డాలర్ ప్రాతిపదికన ద్వైపాక్షిక వాణిజ్యం నిర్వహించేందుకు ఇరాన్ విముఖత వ్యక్తం చేస్తున్నందున భారత్లోని బాస్మతి బియ్యం ఎగుమతులకు విఘాతం కలుగు తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ 13మంది ఇరాన్ ప్రముఖులు, 12 సంస్థలపైనా ఆంక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో నిర్వహించిన అణ్వేతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలకు మద్దతు ఇవ్వడంతో అమెరికా ఈ ఆంక్షలు విధించింది. దీనితో ఇరాన్ కూడా ఇకపై ద్వైపాక్షిక వాణిజ్యానికి డాలర్గా కాకుండా ఇతర కరెన్సీలతో చేయాలని నిర్ణయించింది. బహుశా యూరో ప్రామాణికంగా తీసుకుంటుందని అంచనా. అయితేరూపాయి కరెన్సీలో ట్రేడింగ్కు ఇరాన్వద్ద తగినంతగా రూపాయి నిల్వలు లేవు. అందువల్ల రానున్న కాలంలో ఆంక్షలు ఉన్నందున డాలర్తో ఇక వాణిజ్యం చేసే అవకాశాలు లేవు. అయితేయూరోపరంగా అధికారిక నిర్ణయంజరగలేదు. కరెన్సీ వివాదం సద్దుమణిగేంతవరకూ భారత్ బాస్మతి ఎగుమ తులకు విఘాతం తప్పదని చెపుతున్నారు.
అయితే పాతకాంట్రాక్టులు మాత్రం కొన సాగుతాయి. ఇరాన్ భారత్తో రూపాయి కరెన్సీలోనే చమురు లావాదేవీలు నిర్వహిస్తోం ది. ముడిచమురు బకాయిలు మాత్రం డాలర్ల లోనే కొనసాగింది. అయితే రూపాయి నిల్వలు మాత్రం తగ్గిపోయాయి. ఇక డాలరుకు ప్రత్యామ్నాయంగా ఇరాన్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం బాస్మతి ఎగుమతులపై ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఈ కరెన్సీ వివాదం సద్దుమణిగేంత వరకూ భారత్ ఎగుమతులు పునరుద్ధరణ కావని కోహినూర్ఫుడ్స్ జాయింట్ ఎండి గుర్నామ్ అరోరా వెల్లడించారు. మొత్తం ఆరునుంచి ఎనిమిది ఇరాన్ ఎగుమతి సంస్థలు టన్నుల బాస్మతికి 850డాలర్లుగా నిర్ణయించారు.
అయితే ట్రేడర్లు మాత్రం ఈ రేట్లు గిట్టుబాటుకావని చెపుతున్నారు. కనీసం 925 నుంచి 950 డాలర్లు టన్నుకు రావాలని కోరుతున్నారు. ఇక వ్యవసాయరంగం ఆహారశుద్ధి ఉత్పత్తులు ఎగుమతుల అభివృద్ధి ప్రాథికార సంస్థ (అపెడా) మాత్రం ఇరాన్ ప్రభ్తువం భారతీయ బాస్మతికి ఎలాంటిధరలు నిర్ణయించలేదని తేలింది. ఇక కొనుగోలుదారులు విక్రేతలమధ్య ఈ కరెన్సీ వివాదం పరిష్కారం జరగాలి. ప్రత్యామ్నాయంగా యూరో, యెన్, లేదా రూపాయి విలువల్లో జరగాల్సి ఉం టుంది. దీనివల్ల నష్టానికి బాస్మతిని ఎగుమతి చేసుకోవద్దని రైతులు, ట్రేడర్లకు విజప్తిచేసినట్లు అపెడా అధికారులు వెల్లడిం చారు. న్యూఢిల్లీ టోకు మార్కెట్లో బాస్మతి ధరలు కిలోకు 72 రూపాయలుగా ఉన్నాయి. అక్టోబరు ఒకటవ తేదీ కిలో48 రూపాయల నుంచి భారీ ఎత్తున ధరలు పెరిగాయి. దీనివల్ల ఎగుమతిదారులు కూడా అదేరీతిలో ధరలు రావాలని కోరుతున్నారు. గడచినరెండు టెండర్ల లో ఇరాన్ టన్నుకు 650-700 డాలర్లుగా నిర్ణయించింది. ఇరాన్ బాస్మతి బియ్యంపై సుం కాన్ని కూడా 40 నుంచి 26శాతానికి తగ్గిం చింది. ఈ తగ్గింపువల్ల పాకిస్తాన్ లాభపడుతుం దని, రవాణా వ్యయం కూడా తక్కువవుతుం దని చెపుతున్నారు. ఇరాన్కు దగ్గరలోనే పాకిస్తాన్ ఉండటం వల్ల పాక్కే లాభమని ఆర్ఎంఎల్ ఆగ్టెక్ ఎండి రాజీవ్తెవ్టీయ వెల్లడించారు. అపెడా గణాంకాలను చూస్తే భారత్ బాస్మతి బియ్యం ఎగుమతులు ఏప్రిల్ డిసెంబరు మధ్యకాలంలో 2.9 మిలియన్ టన్నులకు చేరాయి. అంతకుముందు సంవత్స రంతో పోలిస్తే 0.1 మిలియన్ టన్నులు తగ్గాయి. గత ఆర్థికసంవత్సరం స్థాయి నాలుగు మిలియన్ టన్నుల లక్ష్యం చేరుకోవాలంటే కరెన్సీ వివాదం పరిష్కారం కావాల్సి ఉంటుంది. మొత్తం పది లక్షల టన్నుల వార్షిక దిగుమతుల్లో ఇరాన్ ఐదులక్షల టన్నులను భారత్ నుంచి కొనుగోలు చేసింది. | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Petrol, Diesel Price Today: మరోసారి తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు..
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 43 పైసలు తగ్గి రూ.80.12 ఉండగా.. డీజిల్ ధర 45 పైసలు తగ్గి రూ.76.77 గా ఉంది.
Samayam Telugu | Updated:
Nov 23, 2018, 10:57AM IST
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మరింత తగ్గడంతో.. దేశీయంగా కూడా పెట్రోలు, డీజిల్ ధరలు శుక్రవారం (నవంబరు 23) మరోసారి తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 40 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధర రూ.75.95 కి చేరింది. డీజిల్ ధర 41 పైసలు తగ్గి రూ.70.56 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో 40 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.81.10 కి చేరగా.. డీజిల్ ధర 43 పైసలు తగ్గి రూ. 73.91 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరింత దిగజారి బ్యారెల్ 61.64 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 53.01 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 43 పైసలు తగ్గి రూ.80.12 ఉండగా.. డీజిల్ ధర 45 పైసలు తగ్గి రూ.76.77 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.79.43 ఉండగా.. డీజిల్ ధర రూ.75.65 వద్ద కొనసాగుతోంది.
నవంబరు 23న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళ
భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది.
TNN | Updated:
Apr 18, 2016, 09:27AM IST
భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది. భారత్ తరుపున ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా జిమ్నాస్ట్ గా పేరు సంపాదించింది. ఈ ఏడాది బ్రెజిల్లో జరగబోతున్న రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఆమె అర్హత పొందింది. ఇంతవరకు ఒలింపిక్స్ లో జరిగిన జిమ్నాస్ట్ పోటీలలో భారత్ తరుపు మహిళలు అర్హత సాధించలేదు. దాంతో దీపా కొత్త చరిత్రను సృష్టించినట్టయింది. 22 ఏళ్ల దీపాది త్రిపుర. ఆమె ఇంతకు ముందు కూడా సంచలన విజయాలు అందుకుంది. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని బ్రాంజ్ మెడల్ అందుకుంది. కామన్వెల్త్ లో జిమ్నాస్టిక్స్ విభాగంలో మెడల్ కొట్టిన మొట్టమొదటి భారతీయ మహిళ కూడా దీపానే. అలాగే గతేడాది నవంబర్లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిఫ్ లో ఫైనల్ కు చేరిన మొదటి భారత మహిళ కూడా దీపానే. | 2sports
|
42 క్యారెట్ల వజ్రం.. ఎంతంటే?
- వేలంలో యూపీ వాసికి...
పన్నా: మధ్యప్రదేశ్లో ఓ గనిలో లభ్యమైన 42 క్యారెట్ల బరువున్న వజ్రం వేలానికి పెట్టారు. ఇది 2.55 కోట్ల మేర ధర పలికింది. అక్టోబరులో ఈ వజ్రం దొరికింది. ఇటీవల వేలం నిర్వహించగా.. రెండున్నర కోట్లు వచ్చాయని ఆ రాష్ట్ర గనులశాఖ అధికారి సింగ్ తెలిపారు. మోతీలాల్ ప్రజాపతి అనే వ్యక్తి తన నలుగురు వ్యాపార భాగస్వాములతో కలిసి కృష్ణ కల్యాణ్పూర్ ప్రాంతంలో గనులను లీజుకు తీసుకున్నారు.ఈ గనుల్లో 42.59 క్యారెట్ల వజ్రం దొరికింది. ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో దొరికిన అతి పెద్ద వజ్రం ఇదే కావడం విశేషం. గత శుక్రవారం జరిగిన మొత్తం 203 క్యారెట్ల బరువున్న వజ్రాల వేలంలో.. 42 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం కూడా అమ్ముడైంది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రాహుల్ అగర్వాల్ అనే వ్యక్తి దీన్ని కొన్నారని సింగ్ తెలిపారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు మినహాయించుకొని ప్రజాపతికి సొమ్ము చెల్లించామని అన్నారు. కాగా రాథేశ్యామ్ సోనీ అనే వ్యక్తికి శనివారం కృష్ణా కల్యాణ్పూర్ ప్రాంతంలోనే 18.13 క్యారెట్ల బరువున్న మరో వజ్రం దొరికిందని సింగ్ చెప్పారు. దీన్ని ఆయన గనుల శాఖలో ఉంచారని, ఈ వజ్రాన్ని తర్వాతి వేలంలో ఉంచనున్నామని వివరించారు. పన్నా జిల్లాలో సుమారు 12 లక్షల క్యారెట్ల వజ్రపు నిల్వలున్నట్టు గనుల శాఖ అంచనా వేస్తున్నది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
First Published 24, Oct 2017, 2:23 PM IST
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
ఎన్టీఆర్ 28వ మూవీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఫొటో గ్యాలరి
Recent Stories | 0business
|
మహిళల ప్రపంచకప్ వీక్షణ రికార్డు బ్రేక్
18కోట్ల మంది వీక్షించినట్లు ఐసిసి వెల్లడి
లండన్: ఇంగ్లాండ్లో ఇటీవల ముగిసిన మహిళల ప్రపంచకప్ని రికార్డు స్థాయిలో ప్రేక్షకులు వీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 18కోట్ల మంది ఈ టోర్నీని టివిల్లో తిలకించినట్లు ఐసిసి వెల్లడించింది. వన్డే ఫార్మట్లో జరిగిన ఈమెగా టోర్నీని వీక్షించిన సమయం 2013 ప్రపంచకప్తో పోలిస్తే దాదాపు 300శాతం పెరిగింది. భారత్, దక్షిణాఫ్రికాల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు మ్యాచ్లు వీక్షించారు. టోర్నీ లోని అన్ని మ్యాచ్లను ఐసిసి ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇంటర్నెట్లో చూసేందుకు అవకాశం కల్పిం చింది. దీంతో ఒక్క భారత దేశంలోనే 15.6కోట్ల మంది మ్యాచ్లను చూసినట్లు తెలిసింది. ఇందులో సగానికిపైగా గ్రామీణ ప్రాంతంలో కావడం విశేషం. భారత్లో గతంతో పోలిస్తే, ఈ వీక్షణ సమయం దాదాపు 500శాతం పెరిగిందట. మొత్తంగా ఈటోర్నీలో ఫైనల్ మ్యాచ్ని ఎక్కువ మంది చూశారు.గత ప్రపంచ కప్ ఫైనల్తో పోలిస్తే 300శాతం రెట్టింపు మంది ఈమ్యాచ్ని వీక్షించారు. మహిళల క్రికెట్ను ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే తగినసమయం. ఈ మెగా టోర్నీతో ప్రపంచ వ్యాప్తంగా మహిళల క్రికెట్కి ఆదరణ పెరగింది. దానికి నిదర్శనం ఈ లెక్కనే అని ఐసిసి సిఇఒ డేవిడ్ రిచర్డ్సన్ వెల్లడించారు. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
'ఇంకొక్కడు' తెలుగు ఆడియో, ట్రైలర్
హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 'ఇంకొక్కడు' అఫీషియల్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు...
TNN | Updated:
Aug 15, 2016, 09:10PM IST
X
Bathukamma Song: మంగ్లీ బత...
విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`. నయనతార , నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి `ఇంకొక్కడు` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా హైదరాబాద్లో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 'ఇంకొక్కడు' అఫీషియల్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. | 0business
|
Mumbai, First Published 20, Sep 2018, 11:54 AM IST
Highlights
రుణాల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియా సంస్థను ఒక సమస్య వెంబడి మరొక సమస్య వెంటాడుతున్నది. రూ.50 వేల కోట్ల రుణాలతో అల్లాడుతోంది. మొత్తం సంస్థను వేలం వేయడానికి జరిగిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఒక్కొక్కటి విక్రయించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో రోజువారీగా పెట్రోల్ బిల్లులు చెల్లిస్తే పెట్రోల్ సరఫరా చేస్తామని పెట్రోలియం సంస్థలు ఆల్టిమేటం జారీ చేసింది.
‘మహారాజా’గా పేరొందిన కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా రోజురోజుకో సవాల్ ఎదుర్కొంటోంది. బకాయిల చెల్లింపుల కోసం సంస్థలను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నది. మరోవైపు గ్రూప్ సంస్థలను ఒక్కొక్కటిగా విక్రయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
రూ.50వేల కోట్ల రుణాల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియా సంస్థకు మరో చిక్కు వచ్చి పడింది. ముడి చమురు సంస్థలు ఇక రోజువారీగా చెల్లింపులు జరిపితేనే జెట్ ఫ్యూయల్ సరఫరా చేస్తామని మహారాజా ‘ఎయిర్ఇండియా‘కు తేల్చేశాయని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.
ఎందుకంటే ఇప్పటికే ఫ్యూయల్ ఇంధనం సరఫరా చేసినందుకు చమురు సంస్థలకు ఎయిర్ ఇండియా బకాయిలు రూ.5000 కోట్లు దాటింది మరి. రోజూ ఎయిర్ ఇండియా రూ.20 కోట్ల విలువైన ఫ్యూయల్ కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ముడి చమురు సంస్థలన్నీ ఏకమై రోజువారీగా చెల్లింపులు జరిపితేనే ఆయిల్ సరఫరా చేస్తామని ఆల్టిమేటం జారీ చేసేశాయి.
పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధికారి ఒకరు దీనిపై స్పందిస్తూ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నందు వల్లే రెగ్యులర్గా ఇంధన చార్జీలు చెల్లించలేకపోతోంది’ అని ధ్రువీకరించారు. ఈ విషయమై ఎయిర్ ఇండియా, ముడి చమురు సంస్థలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయని తెలిపారు.
గమ్మత్తేమిటంటే ప్రభుత్వం సమకూర్చిన నిధులతో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రుణ వాయిదాలన్నీ క్లియర్ చేసిన తర్వాత ఎయిర్ఇండియా సంస్థను తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి ముడి చమురు సంస్థలు. ముడి చమురు సంస్థలకు చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి రూ.5000 కోట్లు దాటిందన్న అంచనాలు ఉన్నాయి.
ఏడాదిన్నర నుంచి ఎయిర్ ఇండియా రోజువారీగా ఆయిల్ చెల్లింపులు జరుపడం లేదని ముడి చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం జెట్ ప్యూయల్ ధరల పెరుగుదల కూడా సమస్యకు మరో కారణమని సీనియర్ ఎయిర్ ఇండియా అధికారి చెప్పారు. సదరు ముడి చమురు సంస్థలతో సంప్రదిస్తున్నామని, త్వరలో పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. తమ బకాయిల చెల్లింపు విషయమై స్ఫష్టమైన వైఖరితో ముందుకు రావాలని ఎయిరిండియాను చమురు సంస్థలు కోరుతున్నాయి.
ఎయిరిండియాలో 76 శాతం వాటాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినా, వాటాల కొనుగోలు కోసం ఏ సంస్థ కూడా రాలేదు. దీంతో తాత్కాలికంగా రూ.2000 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎయిరిండియా కోరింది. ఇప్పటికే ప్రభుత్వం రూ.980 కోట్లు ఈక్విటీ రూపంలో విడుదల చేయగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలపై రూ.2000 కోట్ల రుణాలిచ్చింది. ఇవి కాకుండా ఎయిరిండియా స్వయంగా నిధులు సేకరించింది. అదనంగా మరో 500 కోట్లను సేకరించనున్నామని తెలిపింది.
కాగా, ఇంతకుముందు ఎయిర్ ఇండియా అనుబంధ విభాగాలైన ఎయిర్లైన్ అల్లైడ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఎఎస్ ఎల్), హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్సిఐ), ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (ఎఐఎటిఎ్సఎల్), ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఐఈ్సఎల్)లో వ్యూహాత్మక వాటా విక్రయించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్ మెంట్) ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నదని సమాచారం.
ఢిల్లీలోని ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయ భవనం, దేశంలోని పలు ప్రాంతాల్లో సంస్థకున్న భూములు, భవనాలు, గతంలో సంస్థ కొనుగోలు చేసిన ప్రముఖుల పెయింటింగ్స్, ఇతర కళాఖండాలను సైతం విక్రయించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్రం ఇప్పటికే జాబితాను రూపొందిచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వీటితో పాటు దిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయ భవనం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంస్థకు ఉన్న ఇతర స్థిరాస్తులు, విమానయాన సంస్థ భవంతులను విక్రయానికి పెట్టనుంది. విమానయాన సంస్థకు చెందిన ఆస్తుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసిందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలయన్స్ ఎయిర్ పేరు కింద ప్రాంతీయ అనుసంధాన సేవలను ఏఏఎస్ఎల్ అందిస్తోంది. దిల్లీ, శ్రీనగర్, ఇతర ప్రాంతాల్లో హెచ్సీఐ హోటళ్లను నిర్వహిస్తోంది.
ఇక గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో హ్యాండ్లింగ్ సేవలను ఏఐఏటీఎస్ఎల్ నిర్వహిస్తుంటే, ఇంజిన్ల మరమ్మతు,, నిర్వహణ, ఓవర్హాల్ సేవలను ఏఐఈఎస్ఎల్ చూసుకుంటుంది. ప్రధాన కార్యాలయం భవంతితో పాటు ముంబయి, దిల్లీల్లో ఇతర ప్రధాన ఆస్తులను విక్రయించాలని ఎయిరిండియా భావిస్తోంది.
ఆస్తుల విక్రయం ద్వారా సంస్థ రుణాలు తగ్గించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎయిరిండియాలో 76 శాతం వాటా విక్రయానికి బిడ్లు ఆహ్వానించగా.. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎయిరిండియాను పునరుజ్జీవం చేయాలని మంత్రుల బృందం నిర్ణయించిన సంగతి విదితమే.
Last Updated 20, Sep 2018, 11:54 AM IST | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఐఫాలోనూ సత్తా చాటిన శ్రీమంతుడు, బాహుబలి
తెలుగులో శ్రీమంతుడు, కన్నడలో రంగితరంగ చిత్రాలు ఐఫా అవార్డ్సు రేసులో ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నాయి.
| Updated:
Jan 27, 2016, 12:48AM IST
ఐఫాలోనూ సత్తా చాటిన శ్రీమంతుడు, బాహుబలి
ఎప్పుడూ దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో ఘనంగా జరిగే ఐఫా అవార్డుల కార్యక్రమం ఈసారి మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో జరిగింది. జనవరి 25, 26 తేదీలలో రెండు రోజులపాటు జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినీపరిశ్రమలకి చెందిన సినీ ప్రముఖులు పాల్పంచుకున్నారు. మంగళవారం జరిగిన అవార్డుల కార్యక్రమంలో తెలుగు, కన్నడ సినీరంగానికి చెందిన వివిధ కళాకారులకి అవార్డులు అందజేశారు. తెలుగులో శ్రీమంతుడు , కన్నడలో రంగితరంగ చిత్రాలు ఐఫా అవార్డ్సు రేసులో ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నాయి.
Visit Site
Recommended byColombia
2015లో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన శ్రీమంతుడు సినిమా ఐఫా అవార్డులని అందుకోవడంలోనూ తన సత్తా చాటుకుంది. లీడింగ్ మేల్ రోల్, లీడింగ్ ఫీమేల్ రోల్, సపోర్టింగ్ రోల్ మేల్, మ్యూజిక్ డైరెక్షన్, లిరిక్స్, ప్లేబ్యాక్ సింగర్ మేల్ కేటగిరీలలో మొత్తం 6 అవార్డులు కొట్టేసి ఈ జాబితాలో టాప్ పొజిషన్లో నిలిచిందీ సినిమా.
ఇక ఆ తర్వాత 5 అవార్డులతో రెండో స్థానంలో నిలిచింది బాహుబలి సినిమా. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్షన్, సపోర్టింగ్ రోల్ ఫీమేల్ నెగటివ్ రోల్, ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ కేటగిరీలలో అవార్డులు అందుకుంది బాహుబలి చిత్రం.
వివిధ కేటగిరీలలో అవార్డులు అందుకున్న వారి వివరాలు
కేటగిరీ ఎంట్రీ సినిమా
బెస్ట్ పిక్చర్ శోభూ యార్లగడ్డ/ఆర్కా మీడియా బాహుబలి
బెస్ట్ డైరెక్షన్ ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి
లీడింగ్ రోల్ మేల్ మహేష్ బాబు శ్రీమంతుడు
లీడింగ్ రోల్ ఫీమేల్ శృతిహాసన్ శ్రీమంతుడు
సపోర్టింగ్ రోల్ మేల్ జగపతి బాబు శ్రీమంతుడు
సపోర్టింగ్ రోల్ ఫీమేల్ రమ్యక్రిష్ణ బాహుబలి
కామిక్ రోల్ వెన్నెల కిషోర్ భలే భలే మగాడివోయ్
నెగటివ్ రోల్ రానా దగ్గుబాటి బాహుబలి
మ్యూజిక్ డైరెక్షన్ దేవీశ్రీ ప్రసాద్ శ్రీమంతుడు
లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి శ్రీమంతుడు
ప్లేబ్యాక్ సింగర్ మేల్ సాగర్ శ్రీమంతుడు
ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ సత్యయామిని బాహుబలి
మధ్యమధ్యలో అఖిల్ అక్కినేని, రాంచరణ్, తమన్నా, శ్రియ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఐఫా ఉత్సవాన్ని మరింత హుషారెత్తించారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Suresh 88 Views
రెజ్లర్ నర్సింగ్ కేసు సిబిఐకి అప్పగింత
న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్పై డోపింగ్ కుట్ర కేసును ప్రధాన మంత్రి కార్యాలయం సిబిఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ)కు అప్పగించిందని భారత రెజ్లింగ్ సమాఖ్య పేర్కొంది.సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషన్ శరణ్సింగ్ ప్రధాని మోడీని కలిసి సిబిఐ విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు.నర్సింగ్ కేసులో తదుపరి విచారణను పిఎంఓ సిబిఐకి అప్పగించిందని శరణ్సింగ్ వెల్లడించాడు.కాగా రెజ్లర్ నర్సింగ్ యాదవ్ 74 కెజిల విభాగంలో ఒలింపిక్స్కు అర్హత సాధించిన నాటి నుంచి అతని వ్యవ హారం అనూహ్య మలుపులు తిరిగింది. రెండు సార్లు ఒలింపిక్ విజేత సుశీల్కమార్, నర్సింగ్ యాదవ్ బదులు తననే రియోకు పంపాలని అందుకు ట్రయల్స్ నిర్వహించేందుకు ఆదేశిం చాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో నర్సింగ్కు అను కూలంగా తీర్పు వచ్చింది.ఆ తరువాత నాడా నిర్వహించిన పరీక్షల్లోను మె థన్ డైనోస్ అనే ఉత్ప్రేరకం అధిక మోతాదులో తీసుకున్నాడని తేలడంత అతడి భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా రెజ్లింగ్ సమా ఖ్య కుట్ర కోణం ఉందని పేర్కొనడంతో నాడా క్రమ శిక్షణ సంఘం రియోక వెళ్లవచ్చని పేర్కొంది. అయితే వాడా దీనిని సవాల్ చూస్తూ క్రీడల ఆర్బిట్రేషన్ కోర్టును సంప్రదించింది. మరికొన్న గంటల్లో నర్సింగ్ పోటీలో పాల్గొ నాల్సి ఉండగా కోర్టు నాలుగేళ్లు నిషేదం విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఈ కేసును సిబిఐతో విచారణ చేయించాలని రెజ్లింగ్ సమాఖ్య ప్రధాని మోడీని కోరింది. | 2sports
|
ZEN MOBILE
జెన్ మొబైల్స్ నుంచి అడ్మయిర్ కొత్తఫోన్
ముంబయి, మే 27: జెన్మొబైల్స్ నుంచి చేతివేలిముద్రల సెన్సార్ ఉన్న అడ్మయిర్ ఫోన్ను విడుదలచేసింది. రూ.5999లుగాధరలు నిర్ణయించింది. వెగా డిస్ప్లే, 1.3జిహెచ్జడ్ క్వాడ్కోర్, 12.7సిఎం డిస్ప్లే, 5ఎంపి వెనుక కెమేరా, ఐదు ఎంపి ముందు కెమేరాలున్నాయి. 6.0మార్ష్మ్యాల్లో, నెట్ వర్క్ 4జ4 వోల్టేను సపోర్టుచేస్తుంది. 8జిబిరామ్, 32జిబివరకూ పొడిగిం చుకోవచ్చు. బ్యాటరీ 2300 ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుందని కంపెనీ వివ రించింది. కంపెనీ సిఇఒ దీపేష్ గుప్తా మాట్లాడుతూ జెన్మొబైల్స్ విడుదల చేసిన ఈ కొత్తఫోన ్రెండు, మూడోతరం మార్కెట్లకుసైతం ఎక్కువ ఆకర్షిస్తుందన్నారు. అందుబాటు ధరల్లోనే కస్టమర్లకు ప్రీమియం ఫోన్లను అందించ ేలక్ష్యంతోనే అడ్మయిర్ ఫోన్ను తెచ్చామన్నారు. | 1entertainment
|
Hyderabad, First Published 22, Aug 2018, 12:58 PM IST
Highlights
బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణాలు సాగించిన రణబీర్ కపూర్ ప్రస్తుతం అలియా భట్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని రణబీర్ స్వయంగా అంగీకరించాడు
బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణాలు సాగించిన రణబీర్ కపూర్ ప్రస్తుతం అలియా భట్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని రణబీర్ స్వయంగా అంగీకరించాడు. ఇరు కుటుంబ సభ్యులు కూడా సన్నిహితంగా మెలుగుతుండడంతో వీరి వివాహం ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో ఏకంగా వీరికి పెళ్లి కూడా జరిగిపోయిందని అన్నారు.
తాజాగా ఈ విషయాలపై స్పందించాడు రణబీర్. ''ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. కానీ కొంత మంది తమ బిజినెస్ కోసం నా వ్యక్తిగత జీవితాన్ని బయటకి లాగుతున్నారు. ఎవరి వ్యక్తిగత విషయాలైనా.. కొంతవరకు చర్చించవచ్చు కానీ హద్దు దాటకూడదు. అలియాతో పెళ్లి అని వినిపిస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. ప్రస్తుతం నా వయసు 35. ఇది పెళ్లి చేసుకునే వయసే కానీ సిద్ధంగా లేను.
అలియాతో ఉన్న బంధాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు అనేది చెప్పలేను'' అంటూ స్పష్టం చేశాడు. ప్రస్తుతం రణబీర్, అలియా ఇద్దరూ కలిసి 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటిస్తున్నారు. ఆయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అమితాబ్, నాగార్జున వంటి తారలు కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు లో ఈ సినిమా విడుదల కానుంది.
Last Updated 9, Sep 2018, 1:43 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
న్యూజిలాండ్కి స్పిన్ టెన్షన్ మొదలైంది
భారత్తో వన్డే సిరీస్కి ఇంకా వారం వ్యవధి ఉంది. కానీ.. అప్పుడే పర్యాటక న్యూజిలాండ్ జట్టుకి స్పిన్ టెన్షన్
TNN | Updated:
Oct 15, 2017, 07:50PM IST
భారత్‌తో వన్డే సిరీస్‌కి ఇంకా వారం వ్యవధి ఉంది. కానీ.. అప్పుడే పర్యాటక న్యూజిలాండ్‌ జట్టుకి స్పిన్ టెన్షన్ మొదలైపోయింది. ఇటీవల ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెట్టిన మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్‌ని ఎదుర్కోవడం తమకి కష్టమేనని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనుండగా.. తొలి వన్డే వాంఖడే వేదికగా అక్టోబరు 22న జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో విలియమ్సన్ మాట్లాడాడు.
‘కుల్దీప్ యాదవ్, చాహల్ చాలా నైపుణ్యమున్న బౌలర్లు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో భారత్ జట్టు‌కి ఎంపికవగలిగారు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ ఇద్దరూ చక్కగా రాణిస్తున్నారు. వీరి బౌలింగ్‌ని ఎదుర్కోవడం కష్టమని మాకు తెలుసు. కానీ.. మా జట్టు బ్యాట్స్‌మెన్లు వారి జోరుకి కళ్లెం వేయగలరు’ అని విలియమ్సన్ ధీమా వ్యక్తం చేశాడు. సీనియర్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లను పక్కన పెడుతున్న సెలక్టర్లు కుల్దీప్, చాహల్‌కే ఈ మధ్యకాలంలో ఎక్కువ అవకాశాలు ఇస్తున్న విషయం తెలిసిందే. | 2sports
|
భాగమతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుష్క
First Published 22, Jan 2018, 11:32 AM IST
భాగమతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుష్క
భాగమతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుష్క
భాగమతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుష్క
భాగమతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుష్క
భాగమతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుష్క
భాగమతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుష్క
Recent Stories | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మళ్లీ పైసల్లోనే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయ్
కర్ణాటక ఎన్నికలు ముగిశాక వరుసగా 16 రోజులు పెరగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరలు మెల్లగా దిగి వస్తున్నాయి.
Samayam Telugu | Updated:
Jun 4, 2018, 09:43AM IST
కర్ణాటక ఎన్నికలు ముగిశాక వరుసగా 16 రోజులు పెరగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరలు మెల్లగా దిగి వస్తున్నాయి. గత ఆరు రోజులుగా పైసల చొప్పున తగ్గుతూ వచ్చిన పెట్రోల్ ధరలు.. సోమవారం కూడా 15 పైసలు తగ్గాయి. ఈ ఏడు రోజులు కలిపి కూడా పెట్రోల్ ధర అర్ధ రూపాయి కంటే తక్కువగా (రూ. 47 పైసలు) తగ్గడం వాహనదారులను అసంతృప్తికి గురి చేస్తోంది. సోమవారం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.96 పైసలుగా ఉంది. ముంబైలో రూ.85.77 పైసలుగా ఉందని ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ తెలిపింది.
నిన్నటితో పోలిస్తే సోమవారం డీజిల్ ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఢిల్లీలో రూ.69.11 పైసలు ఉన్న డీజిల్ ధర నేడు 14 పైసలు తగ్గి రూ.68.97 పైసలుగా నమోదైంది. హైదరాబాద్లో సోమవారం నాటి ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర రూ.82.59 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.74.97 పైసలుగా ఉంది. | 1entertainment
|
ఒకర్నొకరం చాలా బాధపెట్టుకున్నాం.. విడిపోయాం
మాజీ భర్తతో విడాకుల గురించి మలైకా అరోరా
ముంబయి: తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్తో విడాకులు తీసుకునే విషయంలో ఎంతో ఆలోచించానని బాలీవుడ్ నటి మలైకా అరోరా అన్నారు. అర్బాజ్, మలైకా దాదాపు 15 ఏళ్లు తమ వైవాహిక జీవితాన్ని ఎంతో ఆనందంగా గడిపారు. బాలీవుడ్లో ముచ్చటైన జంట అనిపించుకున్నారు. 2017లో విడాకులు తీసుకుంటున్నాం అంటూ వీరు వెల్లడించినప్పుడు అందరూ షాక్ అయ్యారు.
తాజాగా తన పెళ్లి గురించి మలైకా ఓ రేడియో షోలో మాట్లాడారు. పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘జీవితంలో తీసుకునే అన్ని నిర్ణయాలులాగా దాన్ని (అర్బాజ్ నుంచి విడిపోవడం గురించి) తీసుకోవడం కష్టం. చివరికి ఓ రోజున మనల్నే విమర్శిస్తారు. ఎప్పుడూ మనం ఎదుటి వ్యక్తే దీనికి కారణం అని వారిని చూపిస్తుంటాం. నాకు తెలిసి అది మానవనైజం. నేను, అర్బాజ్ అన్నీ కోణాల్లో ఆలోచించాం. తర్వాతే ఎవరి దారి వారు చూసుకుంటే మంచిదని నిర్ణయించుకున్నాం. మా మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. మేం ఒకర్నొకరం చాలా బాధపెట్టుకున్నాం.. దాని వల్ల మా చుట్టూ ఉన్న వారు కూడా ఎంతో బాధపడ్డారు. కాబట్టి విడిపోయి దూరంగా ఉండటమే మంచిది అనిపించింది’.
‘విడాకులు రావడానికి ముందు రోజు రాత్రి నా కుటుంబ సభ్యులంతా కూర్చుని మాట్లాడారు. నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావా? అని చాలా సార్లు ప్రశ్నించారు. తర్వాత.. ఈ నిర్ణయం తీసుకున్నందుకు నీ పట్ల గర్వంగా ఉంది, నువ్వు నిజంగా శక్తిమంతమైన మహిళవి అన్నారు. ఆ మాటలు నాకు బలాన్నిచ్చాయి’ అని మలైకా పేర్కొన్నారు.
Tags : | 0business
|
Suresh 131 Views NARA BRAHMANI
FICCI
హైదరాబాద్: ఔత్సాహిక వ్యాపార వేత్తలు,పారిశ్రామికవేత్తలు,యువకులకు వ్యాపార అనుభవాలు, ఎదురయ్యే సవాళ్లపై సోదాహరణంగా వివరించేందుకు ఫిక్కీలేడీస్ ఆర్గనైజేషన్ పలువురు సీనియర్ పారిశ్రామికవేత్తలు,యువ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే హెరిటేజ్ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారాబ్రాహ్మణి, రాష్ట్ర పంచాయితీరాజ్ ఐటి శాఖల మంత్రి నారాలోకేష్లతో కలిసి కార్యగోష్టిని నిర్వహించింది. సుమారు 150మందికిపైగా ఫిక్కీలేడీస్ సభ్యులు హాజరైన ఈ సదస్సుకు విశేష స్పందన లభించింది. వ్యాపారం, రాజకీయాల్లో వారి అనుభవాలు, నైపుణ్యాలను స్వయంగా విని తెలుసుకునేందుకు ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యారు. థింకింగ్ రిఫ్రెష్డ్ సందేశంతో ఈ కార్యగోష్టిని ఏర్పాటుచేసామని ఫిక్కీలేడీస్ ఆర్గనైజేషన్ ఛైర్పర్సన్ కామిని షరాఫ్ పేర్కొన్నారు. 25ఏళ్ల చరిత్రకలిగిన
హెరిటేజ్గ్రూప్ను నారాబ్రాహ్మణిఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నారు. స్టాన్ఫోర్టు వర్సిటీలో
ఎంబిఎ పట్టాపొందిన లోకేష్ అటు వ్యాపారపరంగాను, రాజకీయంగా కూడా యువకులకు స్ఫూర్తిగా నిలిచారని ఫిక్కీలేడీస్
ప్రశంసించింది. భార్యాభర్తలిద్దరూ కూడా స్టాన్ఫోర్డ్ వర్సిటీనుంచి వచ్చిన విద్యార్ధులే కావడం, ఇద్దరి అభిప్రాయాలు ఒకేతీరుతో
ఉండటంవల్లనే వారి ఆధ్వర్యంలో ఇటు వ్యాపారం, అటు రాజకీయాల్లో కూడా మరింత వృద్ధిచెందుతున్నట్లు ఫిక్కీలేడీస్ అభివర్ణించింది. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
హిజ్రా పాత్ర చేయడంలేదు
టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్ తన తర్వాతి సినిమాలో ఓ హిజ్రా పాత్ర పోషిస్తున్నాడని అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్లో ఓ ప్రచారం...
TNN | Updated:
Jan 10, 2016, 04:09PM IST
హిజ్రా పాత్ర చేయడంలేదు
టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్ తన తర్వాతి సినిమాలో ఓ హిజ్రా పాత్ర పోషిస్తున్నాడని అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్లో ఓ ప్రచారం జరుగుతోంది. ఏ పాత్రనయినా అవలీలగా చేయగల ధైర్యవంతుడు కనుక అది నిజమే అయి వుండవచ్చని భావించారంతా. కానీ తాజాగా తెలిసింది ఏంటంటే అదంతా నిజం కాదని. అవును హిజ్రా పాత్ర విషయమై విక్రమ్ని వివరణ కోరగా విక్రమ్ నుంచి అటువంటిదేమీ లేదని సమాధానం వచ్చింది. ప్రస్తుతం మలేషియాలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేయనుండగా విక్రమ్ సరసన నయనతార హీరోయిన్గా నటించనుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్తోపాటే మ్యూజిక్ కంపోజింగ్ వర్క్ కూడా పూర్తిచేస్తున్నారు మేకర్స్.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
sp balasubrahmanyam respond about rumours on his health
నేను బాగానే ఉన్నాను.. ఎందుకీ రూమర్లు: ఎస్పీ బాలు
సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం బాగాలేదని, ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
TNN | Updated:
Sep 7, 2017, 09:24AM IST
సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం బాగాలేదని, ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లపై ఎస్పీ బాలు స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించిన ఆయన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశారు. తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని స్వయంగా మాట్లాడుతూ వీడియో పెట్టారు. మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ తన ఆప్తులు యోగక్షేమాలు అడుగుతుంటే షాక్ అయ్యానని చెప్పారు. ఇలాంటి రూమర్లు సోషల్ మీడియాలో ఎందుకు పుట్టిస్తున్నారో అర్థకావడంలేదని వాపోయారు.
‘నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాని సోషల్ మీడియాలో రూమర్‌ను క్రియేట్ చేశారు. దీని వల్లే నా ప్రదర్శనలన్నీ రద్దు చేసుకున్నాని అంటున్నారు. దగ్గు, జలుబు లాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఆ సయంలో నన్ను చూసిన కొందరు నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని అనుకోవడం తెలివితక్కువతనం. నా ప్రదర్శలన్నీ రద్దు చేసుకోవడం వెనుక వేరే కారణం ఉంది. ఆగస్టు 23న నా చెల్లెలు గిరిజ ఆకస్మికంగా కన్నుమూశారు. కాబట్టి 10 నుంచి 12 రోజులు నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత సెప్టెంబర్ 2న బెంగళూరులో ఓ ప్రదర్శన కూడా ఇచ్చాను. దయచేసి అనవసరంగా ఇలాంటి రూమర్లు సృష్టించి మమ్మల్ని బాధపెట్టొద్దు’ అని బాలు చెప్పారు. తాను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ‘స్వరాభిషేకం’ షూటింగ్‌లో ఉన్నానని తెలిపారు. | 0business
|
Hyderabad, First Published 26, Oct 2018, 10:11 AM IST
Highlights
మహేష్ బాబు, దర్శకుడు మెహర్ రమేష్ ల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ ప్రారంభం రోజులు నుంచి అంటే బాబి సినిమా నాటి నుంచి మెహర్ రమేష్ పరిచయం.
మహేష్ బాబు, దర్శకుడు మెహర్ రమేష్ ల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ ప్రారంభం రోజులు నుంచి అంటే బాబి సినిమా నాటి నుంచి మెహర్ రమేష్ పరిచయం. ముఖ్యంగా మెహర్ రమేష్ ..మహేష్ ఫ్యామిలీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ నేఫధ్యంలో రీసెంట్ గా మహేష్ తో ఓ ఈవెంట్ ప్లానింగ్ కు అవకాసం ఇచ్చింది ఆ కుటుంబం.
అయితే ఆ పోగ్రాం చివరి నిముషంలో కాన్సిల్ అయ్యింది. అందుకు కారణం మెహర్ రమేష్ పూర్ ప్లానింగ్ అని తెలుస్తోంది. టిక్కెట్లు అమ్ముడు పోకపోవటం వల్ల పోగ్రాం ఆగిపోయిందని తెలిసి మహేష్ ఫ్యాన్స్ చాలా నిరాశపడ్డారు. మిగతా హీరోల అభిమానులు ఈ విషయం అడ్డం పెట్టి మహేష్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేయటం మొదలెట్టారు. అసలేం జరిగిందీ అంటే..
ఏన్ ఈవెనింగ్ విత్ సూపర్స్టార్ మహేష్బాబు అనే పేరుతో మహేష్బాబుని న్యూయార్క్ లో కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తామంటూ రిత్విక్ క్రియేషన్స్ సంస్థ ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. అక్టోబర్ 27న ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహిస్తామని గత రెండు నెలలుగా చాలా పబ్లిసిటీ చేశారు. టికెట్ సేల్స్ కూడా మొదలెట్టారు. కానీ లాస్ట్ మినిట్ లో సమయం దగ్గరపడ్డాక, పోగ్రాం క్యాన్సిల్ చేశారు.
వేదిక, సెక్యురిటీ అంశాల కారణంగా అక్టోబర్ 27న నిర్వహించాలనుకున్న ఈవెంట్ని వేరే తేదీకి వాయిదా వేస్తున్నాం. టికెట్లు కొన్న వారికి తిరిగి డబ్బు చెల్లిస్తామని రిత్విక్ క్రియేషన్స్ సంస్థ ప్రెస్నోట్ పంపింది.
అయితే ఇలా పోగ్రాం అర్దాంతరంగా ఆగిపోవటానికి కారణం మెహర్ రమేష్ ఆయన టీమ్ ప్రోపర్ ప్లానింగ్ లేకపోవటం, టిక్కెట్ రేట్లు ఎక్కువపెట్టడం అని చెప్తున్నారు. మొదట ఈ ఈవెంట్ ని ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్స్ కు అప్పచెప్దామనుకున్నారు. అయితే మెహర్ రమేష్ వెళ్లి నమ్రత ని కలిసి ఈవెంట్ ని పెద్ద సక్సెస్ చేస్తామని ప్రామిస్ చేసి తనకు ఇమ్మని అడగటం జరిగింది.
వారిని నమ్మిన నమ్రత..మా వాళ్లు చెప్తున్నా వినకుండా మెహర్ రమేష్ అండ్ టీమ్ కు అప్పచెప్పింది. ఈ సంఘటనతో మెహర్ రమేష్ పై నమ్రత చాలా సీరియస్ అయ్యిందని, మహేష్ బాబు రెప్యుటేషన్ పై ఈ ఇంపాక్ట్ పడుతుందని అప్ సెట్ అయ్యారని తెలుస్తోంది. మహేష్బాబు ప్రస్తుతం అమెరికాలో మహర్షి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. నెల రోజుల పాటు షూటింగ్ అక్కడే ఉండనున్నారు.
ఇది కూడా చదవండి.. | 0business
|
యాపిల్ సీఈవోకు ప్రయివేటు విమానం
- భారీగా పెరిగిన వేతనం
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం భారీగా పెరిగింది. ప్రస్తుత ఏడాదిలో దాదాపు 47శాతం పెరిగి 13 మిలియన్ డాలర్లకు (సమారు రూ.83 కోట్లు) చేరింది. గతేడాది టిమ్ కుక్ 8.7 మిలియన్ డాలర్లు మాత్రమే తీసుకున్నారు. ఆయనకు వేతనంతో పాటు భద్రత కూడా అదే స్థాయిలో పెరిగింది. కంపెనీ నిబంధనల ప్రకారం కుక్ వేతనం 13 మిలియన్ డాలర్లకు చేరినందు వల్ల ప్రయివేట్ విమానంలోనే ప్రయాణించాలి. ఇందుకోసం కుక్కు ప్రయివేట్ విమానంలో ప్రయాణించేందుకు కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నుంచి కూడా ఆమోదం లభించింది. 2017లో కుక్ సుమారు 12.8 మిలియన్ డాలర్లు అందుకున్నారు. ఇందులో 3.06 మిలియన్ డాలర్లు(సుమారు రూ.19కోట్లు)వేతనం కాగా 9.3మిలియన్ డాలర్లు బోనస్, ఇతర భత్యాలు ఉన్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
దంబుల్లా వన్డేలో భారత్ దులిపేసింది..!
శ్రీలంకతో దంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో పర్యాటక భారత్ దుమ్ముదులిపేసింది
TNN | Updated:
Aug 20, 2017, 08:44PM IST
శ్రీలంకతో దంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో పర్యాటక భారత్ దుమ్ముదులిపేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (132 నాటౌట్: 90 బంతుల్లో 20x4, 3x6) అజేయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (82 నాటౌట్: 70 బంతుల్లో 10x4, 1x6) దూకుడుగా ఆడటంతో 217 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (4) విఫలమైనా.. కెప్టెన్ కోహ్లితో కలిసి ధావన్ రెండో వికెట్‌కి అభేద్యంగా 143 బంతుల్లో 197 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాకి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఆరో ఓవర్‌లో రనౌట్ రూపంలో తొలి వికెట్‌ తీసి.. విర్రవీగిన శ్రీలంక మ్యాచ్ చివరి వరకూ.. మరో వికెట్ కూడా పడగొట్టలేకపోయింది.
అంతకముందు టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ కోహ్లి తొలుత శ్రీలంకని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత్ బౌలర్లు అక్షర్ పటేల్ (3/34), జస్‌ప్రీత్ బుమ్రా (2/22) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు 43.2 ఓవర్లలోనే 216 పరుగులకు కుప్పకూలిపోయింది. ఓపెనర్ డిక్వెల్లా (64: 74 బంతుల్లో 8x4) ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి పవర్‌ ప్లేలో టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఓపెనర్లు డిక్వెల్లా, గుణతిలక (35: 44 బంతుల్లో 4x4) ఎడాపెడా బౌండరీలు బాదేసి 55 పరుగులు పిండుకున్నారు. అయితే.. జట్టు స్కోరు 74 వద్ద గుణతిలకని ఔట్ చేసి స్పిన్నర్ చాహల్ ఈ ఓపెనింగ్ జోడిని విడదీయగా.. అనంతరం వచ్చిన మెండిస్‌( 36: 37 బంతుల్లో 5x4)తో కలిసి డిక్వెల్లా లంక ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. కానీ.. ఈ సారి మరో స్పిన్నర్ కేదార్ జాదవ్ మెరిశాడు. అర్ధశతకం పూర్తి చేసుకుని జోరుమీదున్న డిక్వెల్లాని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
అనంతరం కొద్దిసేపటికే మెండిస్ (36) ఔటవడంతో శ్రీలంక తడబడింది. వరుసగా కపుగెదర (1), హసరంగ (2) తిసార పెరీరా (0), సండకన్ (5), మలింగ (8), విశ్వ (0) వికెట్లను చేజార్చుకుని తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మాథ్యస్ (36 నాటౌట్: 50 బంతుల్లో 1x4, 1x6) చివరి వరకూ క్రీజులో నిలిచి లంక పరువు నిలిపేందుకు విఫలయత్నం చేశాడు. | 2sports
|
Read More: రోహిత్ శర్మ పవర్.. ‘ఒక్క మాట’తో బంగ్లా ఓటమి
మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయానికి 34 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో భారత ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ క్రమశిక్షణ తప్పాడు. అప్పుడు క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ కెప్టెన్ మమ్మదుల్లాపై స్లెడ్జింగ్కి దిగాడు. బంతిని థర్డ్ మ్యాన్ దిశగా నెట్టి సింగిల్ కోసం నాన్స్ట్రైక్ ఎండ్లోకి మహ్మదుల్లారాగా.. ఖలీల్ అహ్మద్ నోరు జారాడు. దీంతో.. మహ్మదుల్లా కూడా ఘాటుగా బదులివ్వడంతో.. ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం నడిచింది. అయితే.. ఫీల్డ్ అంపైర్ నందన్ కలగజేసుకుని వారిద్దరినీ విడదీశాడు.
IND vs BAN 3rd T20 Trolls: ధోనీ శిష్యుడు మళ్లీ ఫెయిల్.. ఇక చాలు సాగనంపండి
వాస్తవానికి ఖలీల్ అహ్మద్ గొడవ పడుతున్న సమయంలో సమీపంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్నాడు. కానీ.. గొడవపడుతున్న ఖలీల్కి అతను కెప్టెన్గా ఏమాత్రం సర్దిచెప్పే ప్రయత్నం చేయలేదు. అప్పటికి క్రీజులో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా మహ్మదుల్లా మాత్రమే ఉండటంతో.. ఆ స్లెడ్జింగ్ భారత్కి ఉపయోగపడుతుందని రోహిత్ శర్మ ఊహించినట్లున్నాడు. ఆ గొడవ తర్వాత మహ్మదుల్లా స్పిన్నర్ చాహల్ బౌలింగ్లో భారీ షాట్ కోసం ప్రయత్నిస్తూ క్లీన్బౌల్డయ్యాడు. మ్యాచ్లో 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన ఖలీల్ అహ్మద్.. మహ్మదుల్లా ఏకాగ్రతని దెబ్బతీయడంలో మాత్రం సఫలమయ్యాడు. మహ్మదుల్లా ఔట్తో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వచ్చేసింది.
Read More: టీ20లో రోహిత్ శర్మ బద్దకం.. గాల్లోకి ఎగిరిన వికెట్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
భారత క్రికెటర్లు, సెలక్టర్ల మాటల్లో నిజమెంత..?
సెలక్టర్లు లేదా ఆటగాళ్లు ఎవరో ఒక్కరు మాత్రమే ఇక్కడ నిజం చెప్తున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని తొలగించేందుకు బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి చొరవా తీసుకోలేదు
Samayam Telugu | Updated:
Oct 9, 2018, 11:38AM IST
భారత క్రికెటర్లు, సెలక్టర్ల మధ్య చెలరేగిన వివాదం గత పదిరోజులుగా విమర్శ, ప్రతి విమర్శలతో కొనసాగుతూనే ఉంది. జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే తమపై వేటు వేస్తున్నారని ఆటగాళ్లు ఆరోపిస్తుండగా.. వారికి కచ్చితమైన కారణం చెప్పిన తర్వాత జట్టు నుంచి తొలగిస్తున్నామని సెలక్టర్లు చెప్పుకొస్తున్నారు. దీంతో.. ఎవరు నిజం చెప్తున్నారు..? అనే దానిపై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. గత కొద్దిరోజులుగా ఈ వివాదం నడుస్తున్నా.. ఇప్పటికీ ఆటగాళ్లు, సెలక్టర్ల మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ను తొలగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయత్నించకపోవడం విమర్శలకి తావిస్తోంది.
ఇంగ్లాండ్ గడ్డపై గత నెల ముగిసిన టెస్టు సిరీస్ మధ్యలోనే సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్పై సెలక్టర్లు వేటు వేశారు. ఆ తర్వాత గత వారం వెస్టిండీస్తో ఆరంభమైన టెస్టు సిరీస్కి కరుణ్ నాయర్, శిఖర్ ధావన్లను ఎంపిక చేయకుండా వేటు వేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆటగాళ్లతో సెలక్టర్లు హుందాగా వ్యవహరించలేదని.. తమపై వేటు వేస్తున్నట్లు కనీస సమాచారం కూడా ఇవ్వలేదంటూ తొలుత కరుణ్ నాయర్, ఆ తర్వాత మురళీ విజయ్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా మద్దతుగా నిలిచాడు. కానీ.. తాము కరుణ్, విజయ్తో వ్యక్తిగతంగా మాట్లాడి.. కారణం చెప్పిన తర్వాతే జట్టు నుంచి తప్పించామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాలుగు రోజుల ముందు వివరణ ఇచ్చారు. దీంతో.. ఎవరు నిజం చెప్తున్నారో..? ఎవరు అబద్దం చెప్తున్నారో..? కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా బీసీసీఐ ఇప్పటి వరకు చేయలేదు.
‘సెలక్టర్లు లేదా ఆటగాళ్లు ఎవరో ఒక్కరు మాత్రమే ఇక్కడ నిజం చెప్తున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని తొలగించేందుకు బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి చొరవా తీసుకోలేదు. కెప్టెన్ లేదా కోచ్తో మాట్లాడటం లేక ఆటగాళ్లతో, సెలక్టర్లతో కలిసి చర్చించి ఉండాల్సింది. అలా చేసి ఉంటే ఇప్పటికే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. | 2sports
|
దర్శకుల కెరీర్ ని ముంచేసిన చిత్రాలు.. కోలుకోవడం కష్టమే?
First Published 8, Aug 2019, 11:23 AM IST
సినీ రంగాల్లో ప్లాప్ వస్తే కోలుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు సక్సెస్ అందుకున్న దర్శకులకి ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం..
శ్రీను వైట్ల: ఆగడు సినిమా నుంచి ఈ దర్శకుడికి అపజయాలు మొదలయ్యాయి. ఆ సినిమా ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. పైగా గబ్బర్ సింగ్ ఫార్మాట్ ని ఫాలో అయ్యారని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అనంతరం శ్రీను వైట్ల చేసిన ఏ సినిమా కూడా యూ టర్న్ ఇవ్వలేకపోయింది.
గుణశేఖర్: 2003లో ఒక్కడు సినిమా తరువాత చేసిన సినిమాలేవీ ఈ డైరెక్టర్ కి అనుకున్నంతగా గుర్తింపు తీసుకురాలేదు. ముఖ్యంగా నిప్పు సినిమా గుణశేఖర్ కి ఉన్న కాస్త క్రేజ్ ని కూడా చెడగొట్టేసింది. ఆ తరువాత రుద్రమదేవి చేసినప్పటికీ నష్టాలూ రాకుండా సేవ్ అయ్యారే గాని అనుకున్నంతగా లాభాలు అందుకోలేకపోయారు.
వివి.వినాయక్: మాస్ చిత్రాలతో యూత్ కి బాగా కనెక్ట్ అయిన వినాయక్ ఖైదీ నెంబర్ 150తో సెట్టయ్యాడు అనుకునేలోపే సాయి ధరమ్ తో చేసిన ఇంటిలిజెంట్ గట్టి దెబ్బె కొట్టింది. ఆ తరువాత ఆఫర్స్ రావడమే కష్టంగా మారింది. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు.
శ్రీకాంత్ అడ్డాల: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో ఈ తరానికి మల్టీస్టారర్ ట్రెండ్ ని స్టార్ట్ చేసిన శ్రీకాంత్ ని బ్రహ్మోత్సవం సినిమా గట్టి దెబ్బె కొట్టింది. ఆ తరువాత మరో అవకాశం ఇవ్వడానికి ఎవరు దైర్యం చేయడం లేదు.
బి.గోపాల్: నరసింహుడు సినిమా తరువాత ఈ దర్శకుడు కోలుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. ఆ సినిమా ఎఫెక్ట్ ఇప్పటికి ఎవరు మర్చిపోలేరు. ఆ తరువాత మస్కా సినిమా చేసిన అది వర్కౌట్ కాలేదు. అలాగే గోపీచంద్ తో తీసిన ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ కాకుండానే అటకెక్కింది.
మెహర్ రమేషే: బిల్లా సినిమాతో బారి ప్రాజెక్టులను డీల్ చేయగల సత్తా ఉన్న దర్శకుడని రమేష్ ని నమ్మిన నిర్మాతలు కోలుకొని దెబ్బ తిన్నారు. ముఖ్యంగా శక్తి సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడికి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తరువాత ఎదో కష్టపడి చేసిన షాడో కూడా మరింత పెద్ద దెబ్బ కొట్టగానే ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.
కృష్ణ వంశీ: మహాత్మ సినిమా ముందు వరకు కృష్ణ వంశీకి ఉన్న క్రేజ్ వేరు. కానీ మొగుడు సినిమా తరువాత ఆయన స్టామినా తగ్గిందనే కామెంట్స్ జోరుగా వినిపించాయి. ఇక గోవిందుడు అందరివాడే - నక్షత్రం సినిమాలు మరింత దెబ్బ కొట్టాయి
దశరథ్ : సంతోషం - మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దశరథ్ గ్రీకు వీరుడు సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన శౌర్య కూడా ప్లాప్ కావడంతో మరో అవకాశం దక్కలేదు.
కరుణాకరన్: తొలిప్రేమ సినిమాతో టాలీవుడ్ కి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ దర్శకుడు డార్లింగ్ వరకు బాగానే మెప్పించాడు. కానీ ఆ తరువాత చేసిన ఎందుకంటె ప్రేమంట సినిమా బెడిసికొట్టింది. అలాగే చిన్నదాన నీ కోసం - తేజ్ ఐ లవ్ యూ సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో అవకాశాలు రావడం లేదు.
సంకల్ప్ రెడ్డి: మొదటి సినిమా ఘాజి తోనే నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ ఆ తరువాత అంతరిక్షం అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఏ మాత్రం ఆకట్టుకోకపోవడంతో అంతకుముందు వచ్చిన ఆఫర్స్ కూడా సంకల్ప్ కి దూరమయ్యాయి.
Recent Stories | 0business
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
Root, Buttler, Hales' fifties guide ENG to 310
ఇంగ్లాండ్ను 310కి ఆలౌట్ చేసిన కివీస్
ఓపెనర్ జేసన్ రాయ్ (13) పేలవ షాట్ కోసం ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నా.. హేల్స్, రూట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ని
TNN | Updated:
Jun 6, 2017, 07:55PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ రెండో మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. న్యూజిలాండ్‌తో మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో జో రూట్ (64: 65 బంతుల్లో 4x4, 2x6), బట్లర్ (61 నాటౌట్: 48 బంతుల్లో 2x4, 2x6), అలెక్స్ హేల్స్ (56: 62 బంతుల్లో 3x4, 2x6) అర్ధ శతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 310 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలో నిరాశపరిచిన కివీస్ బౌలర్లు.. చివర్లో కట్టుదిట్టంగా బంతులేస్తూ ఇంగ్లాండ్‌ని కట్టడి చేశారు. ఆడమ్ మిల్నే, కోరె అండర్సన్ చెరో మూడు వికెట్లు తీయగా.. టిమ్ సౌథీ రెండు, బౌల్ట్, శాంట్నర్ చెరో వికెట్ తీశారు.
ఓపెనర్ జేసన్ రాయ్ (13) పేలవ షాట్‌ కోసం ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నా.. హేల్స్‌, రూట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ని నిలబెట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 118 వద్ద హేల్స్ ఔటైనా.. బెన్ స్టోక్స్ (48: 53 బంతుల్లో 4x4, 2x6) దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. ప్రమాదకరంగా మారుతున్న స్టోక్స్‌ని బౌల్ట్ పెవిలియన్‌కి పంపగా.. తర్వాత వచ్చిన బట్లర్ చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టుకి మెరుగైన స్కోరు అందించాడు. కెప్టెన్ మోర్గాన్ (13), మొయిన్ అలీ (12) కీలక సమయంలో ఔటై నిరాశపరిచారు. | 2sports
|
భారత కుబేరుల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్
Mukesh Ambani
న్యూఢిల్లీ: భారత్ లో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ఫోర్బ్స్ మ్యాగజైన్ భారత కుబేరుల జాబితా వెలువరించింది. ఈ జాబితాలో ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలవడం వరుసగా 12వ సారి. తద్వారా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తున్న తీరు విశదమవుతోంది. ముఖేశ్ తర్వాత రెండోస్థానంలో అదానీ పోర్ట్స్ యజమాని గౌతమ్ అదానీ నిలిచారు. ముఖేశ్ సంపద విలువను 51.4 బిలియన్ డాలర్లుగా పేర్కొన్న ఫోర్బ్స్, రెండోస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఆదాయాన్ని 15.7 బిలియన్ డాలర్లుగా చూపింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కిందటేడాది రెండోస్థానంలో ఉన్న విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ ఈసారి 17వ స్థానానికి జారిపోయారు. అందుకు కారణం, ఆయన తన సంపదలో చాలాభాగం దాతృత్వ సేవలకు విరాళంగా ఇవ్వడమే. ఇక ఫోర్బ్స్ జాబితాలో అశోక్ లేలాండ్ అధినేతలు హిందూజా బ్రదర్స్ మూడో స్థానంలో, పల్లోంజీ గ్రూప్ యజమాని పల్లోంజీ మిస్త్రీ నాలుగో స్థానంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్ కోటక్ ఐదో స్థానంలో ఉన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/ | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘పెళ్ళి చూపులు’ మోషన్ పోస్టర్ విడుదల చేసిన నాని
విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'పెళ్ళి చూపులు'...
TNN | Updated:
Jun 27, 2016, 07:25PM IST
X
Bathukamma Song: మంగ్లీ బత...
విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ స్టూడియోస్, వినూత్నగీత బ్యానర్స్ పై రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ' పెళ్ళి చూపులు '. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న నిర్మాత రాజ్ కందుకూరి, యస్ రాగినేనితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. నేచురల్ స్టార్ నాని ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశాడు. సినిమా టీజర్, పోస్టర్లను చూసి చాలా బాగున్నాయని యూనిట్ ను నాని అభినందించాడు. | 0business
|
సిసిఎల్-6 ఫైనల్లో
తెలుగు వారియర్స్ విజయం
హైదరాబాద్ : సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో డిఫెండింగ్ చాంపియన్ తెలుగు వారియర్స్ ఫైనల్లో కర్ణాటక బుల్డోజర్స్పై విజయం సాధించింది. దీంతో తెలుగు వారియర్స్ రెండవ సారి విజేతగా నిలిచింది. ఉప్పల్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 208 పరుగుల భారీ టార్గెట్ ఛేదనకు దిగిన అఖిల్ అక్కినేని సారథ్యంలోని తెలుగు వారియర్స్ జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలో 211 పరుగుల టార్గెట్ను ఛేదించింది. ఓపెనర్లు సచిన్ జోషి 49 బంతులు ఆడి 114 పరుగులతో సెంచరీ చేయగా, ప్రిన్స్ 43 బంతులు ఆడి 61 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి బాటలు వేశారు. చివరిలో సచిన్ జోషీ ఔట్ కాగా కెప్టెన్ అఖిల్ 25 పరుగులతో ఆడి గెలుపు లాంఛనాన్ని బౌండరీతో పూర్తి చేశాడు. కర్ణాటక బుల్డోజర్స్ జట్టు మొదట బ్యాటింగ్కు దిగి ఒక పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది.అనంతరం ధ్రువ్ శర్మ భారీ షాట్లతో తెలుగు వారియర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కాగా 50 బంతుల్లో ధ్రువ్శర్మ 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనితో పాటు కార్తీక్ 39 పరుగులు,ప్రదీప్ 17 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో కర్ణాటక జట్టు 6 వికెట్లు కోల్పోఇయ 207 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ బౌలర్లలో నంద కిషోర్ 3 వికెట్లు,రఘు 2 వికెట్లు, సామ్రాట్ ఒక వికెట్ తీశారు.
మ్యాచ్ వీక్షించిన కెటిఆర్
సిసిఎల్ మ్యాచ్ను తెలంగాణ మంత్రి కెటిఆర్ వీక్షించారు. కాగా తెలుగు వారియర్స్ మెంటార్ వెంకటేష్, నాగార్జున, రానా, రెజీనా, ఆదా శర్మ, తాప్సి, రకుల్ ప్రీతిసింగ్ సందడి చేశారు. | 2sports
|
India Cricket Team
టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా నంబర్ వన్
దుబా§్ు: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం టెస్టు ర్యాంకింగ్స్ను ప్రకటించింది.కాగా ఈ జాబితాలో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.115 పాయింట్లతో భారత్ నంబర్ వన్ స్థానంలో నిలువగా,111 పాయింట్లలో పాకిస్థాన్ రెండవ స్థానంలో కొనసాగుతుంది.కాగా 108 పాయింట్లలో ఆస్ట్రేలియా మూడవ స్థానంలో నిలువగా, ఆ తరువాతి స్థానాల్లో ఇంగ్లండ్,దక్షిణాఫ్రికా,శ్రీలంక, న్యూజిలాండ్,వెస్టిండీస్,బంగ్లాదేశ్లు ఉన్నాయి.ఇక బౌలర్ల జాబితాలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ తన నంబర్ వన్ ర్యాంకును కాపాడుకున్నాడు.ఇటీవల న్యూజిలాండ్తో ముగిసిన సిరీస్లో సత్తా చాటి 200 వికెట్ల క్లబ్లో చేరిన అశ్విన్ 900 పాయింట్లతో టెస్టు బౌలర్లలో అగ్ర స్థానంలో కొనసాగు తున్నాడు. కాగా 878 పాయింట్లతో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.ఇక ఆలౌరౌండర్ల జాబితాలోనూ అశ్విన్ టాప్ ఉండగా రెండవ స్థానంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హసన్ ఉండగా,మూడవ స్థానంలో జడేజా కొనసాగుతున్నాడు.బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొదటి స్థానంలోనూ,పాక్ సీనియర్ ప్లేయర్ యూనిస్ ఖాన్ రెండవ స్థానంలో,ఇంగ్లండ్ ఆటగాడు రూటూ మూడవ స్థానంలో ఉన్నారు.కాగా 825 పాయింట్లతో భారత ఆటగాడు రహానే ఆరవ స్థానంలో నిలిచాడు. ఛటేశ్వర్ పుజారా,కోహ్లీ వరుసగా 15,17 స్థానాల్లో ఉన్నారు. | 2sports
|
శ్రీదేవి మృతి పై దుబాయ్ ఇన్వెస్టిగేషన్ లో రేకెత్తిన పలు సందేహాలు?
Highlights
శ్రీదేవి మరణంపై పలు సందేహాలు .
దుబాయ్ అధికార వర్గాలు సందేహాలు.
శ్రీదేవి మరణంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ఆమె మరణానికి దారి తీసిన అంశాలపై పలు సందేహాలు వస్తున్నాయి. బయటకు వచ్చిన సమాచారం.. దుబాయ్ అధికార వర్గాలు.. మీడియా కథనాల్ని చూసినప్పుడు కలిగే సందేహాలు చూస్తే..
1. శ్రీదేవి మరణాన్ని బోనీ తమ్ముడు ఎందుకు చెప్పారు?
2. బాత్రూంలో శ్రీదేవి అచేతనంగా పడి ఉండటాన్ని చూసిన బోనీ తొలుత హోటల్ సిబ్బందికి ఫోన్ చేయకుండా తన స్నేహితుడికి ఎందుకు ఫోన్ చేశారు?
3. శ్రీదేవిని దుబాయ్ లో ఉంచి బోనీకపూర్ ఎందుకు వెళ్లారు?
4. ముంబయికి తిరిగి వచ్చిన మూడు రోజులకు బోనీ మళ్లీ ఎందుకు వెళ్లారు?
5. శ్రీదేవికి రెండు రోజుల పాటు పదే పదే ఫోన్ చేసిందెవరు?
6. సర్ ప్రైజ్ డిన్నర్ అంటూ బోనీ వెళ్లిన సమయంలోనే శ్రీ మరణించారా? అంతకు ముందేనా?
7. అసలు శ్రీదేవికి సర్ ప్రైజ్ విజిట్ ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు?
8. హోటల్ గదిలో నుంచి శ్రీదేవి రెండు రోజుల పాటు ఎందుకు బయటకు రాలేదు?
9. హోటల్ గదిలో నుంచి శ్రీ రావటం లేదని తెలిసే బోనీ దుబాయ్ కి మళ్లీ వెళ్లారా?
10. మర్వా పెళ్లిలో బోనీ మొదటి భార్య బంధువులతో గొడవ జరిగిందా?
11. ఆస్తి వివాదమే గొడవకు కారణమా?
12. తన పిల్లల కంటే ఎక్కువగా మొదటి భార్య పిల్లల విషయంలో బోనీ శ్రద్ధ చూపిస్తున్నారని శ్రీ ఆరోపించారా?
13. ఈ విషయం మీద భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందా?
14. బాత్ టబ్ లో శ్రీదేవిని మొదట చూసింది బోనీనా? హోటల్ సిబ్బందా?
15. బాత్రూం తలుపుల్ని బోనీ తెరిచి వెళ్లారని చెబుతున్నారు? బోనీ ఆ పని చేసే అవకాశం ఉందా?
16. శ్రీదేవి మరణించిన సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో ఏం జరిగింది?
17. దుబాయ్ లోని విధానాల ప్రకారం ప్రాణాలతో ఉన్న వారిని మాత్రమే ఆసుపత్రికి తరలిస్తారు. ఒకవేళ అంబులెన్స్ లో వెళ్లే సమయంలో ప్రాణాలు పోయినా.. వెంటనే పోలీసుల వద్దకు తీసుకెళతారే కానీ ఆసుపత్రికి తీసుకెళ్లరు. ఈ నేపథ్యంలో శ్రీ ను ఆసుపత్రికి తరలించే సమయంలో ఆమె ప్రాణాలతో ఉన్నారా? చట్టాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండే దుబాయ్ లో శ్రీ ను ఆసుపత్రికి తరలించే విషయంలోనే తప్పు జరిగిందా?
18. సాయంత్రం 6.30 గంటలకు బాత్ టబ్ లో శ్రీదేవిని చూసినప్పుడు రాత్రి 9 గంటల వరకూ పోలీసులకు ఎందుకు చెప్పనట్లు?
19. ఒకవేళ ప్రమాదవశాత్తు మరణించి ఉంటే.. ఆ విషయాన్ని చెప్పకుండా కార్డిక్ అరెస్ట్ అన్న మాటను ఎందుకు చెప్పినట్లు?
20. హోటల్లో అందుబాటులో ఉన్న అత్యవసర వైద్య సేవల్ని ఎందుకు పొందలేదు?
21. ఎలా మరణించారన్న విషయాన్ని వైద్యులు చెప్పాల్సింది పోయి.. బోనీకపూర్ తమ్ముడు ఎందుకు చెప్పినట్లు?
22. సందేహాల నివృతి కోసం బోనీని విచారించిన అధికారులు సంతృప్తి చెందకపోవటానికి కారణం ఏమిటి?
Last Updated 25, Mar 2018, 11:59 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అల్లు అర్జున్కు కేరళ సీఎం ఆహ్వానం
మన ‘మల్లు’ అర్జున్కు అరుదైన ఆహ్వానం అందింది. ముఖ్య అతిథిగా పాల్గోవాలంటూ కేరళ సీఎం నుంచి పిలుపు.
Samayam Telugu | Updated:
Nov 6, 2018, 04:07PM IST
అల్లు అర్జున్కు కేరళ సీఎం ఆహ్వానం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు కేరళలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. కానీ, స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ఆయన్ని ఆహ్వానించేంత అభిమానం అక్కడ ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంతకీ బన్నీని ఎందుకు పిలిచారంటే.. ఏటా కేరళలోని అలప్పుజలోని పున్నందా సరస్సులో పడవ పోటీలు నిర్వహిస్తారు. ఈసారి నవంబరు 10న ఈ పోటీలు జరుగుతున్నాయి.
సుమారు 65 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పోటీలను ‘నెహ్రూ ట్రోపీ బోట్ రేస్’ పేరిట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ పోటీలకు గౌరవ అతిథిగా పాల్గోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లు అర్జున్ను ఆహ్వానించారు. దీంతో బన్నీ అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు. తమ అభిమాన నటుడుకు కేరళలోనూ క్రేజ్ ఉండటం, అక్కడి ప్రతిష్టాత్మక పోటీలకు ఆయన్ను అతిథిగా ఆహ్వానించడాన్ని గొప్పగా భావిస్తున్నారు.
మల్లు అభిమానులు బన్నీని ఎంతగా ఇష్టపడతారో.. బన్నీ కూడా వారిని అంతగానే అభిమానిస్తారు. ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు ఆయన రూ.25 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చారు. అల్లు అర్జున్ నటించిన దాదాపు అన్ని చిత్రాలు అక్కడ విడుదలై మంచి విజయం సాధించాయి. దీంతో మన అల్లు.. అక్కడ ‘మల్లు’ అర్జున్గా అభిమానులను సంపాదించుకున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బన్నీ కోసం బాలీవుడ్ నుంచి లేడీ కొరియోగ్రాఫర్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటేనే ఇరగదీసే డ్యాన్సులకి పెట్టింది పేరు. బన్నీ సినిమాలో అతడి అభిమానులు ఆశించే...
TNN | Updated:
Dec 2, 2017, 02:13PM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటేనే ఇరగదీసే డ్యాన్సులకి పెట్టింది పేరు. బన్నీ సినిమాలో అతడి అభిమానులు ఆశించే అంశాల్లో యాక్షన్ సీన్స్ కన్నా ముందుండేది అతడు వేసే వెరైటీ స్టెప్పులే. అందుకే బన్నీ అప్‌కమింగ్ సినిమా కోసం ఓ బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్‌ని రంగంలోకి దింపుతున్నారట.
ప్రస్తుతం బన్నీ హీరోగా తెరకెక్కుతున్న నా పేరు సూర్య సినిమాలో ఓ స్పెషల్ నెంబర్‌కి స్టెప్స్ కంపోజ్ చేసేందుకు బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్స్‌లో ఒకరైన వైభవి మర్చంట్‌ని టాలీవుడ్‌కి రప్పించినట్టు సమాచారం. | 0business
|
ఎన్టీఆర్ బయోపిక్: వెన్నుపోటు ఎపిసోడ్ ఎలా చూపిస్తారో?
Highlights
నందమూరి బాలకృష్ణ తన తండ్రి దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందిస్తోన్న సంగతి
నందమూరి బాలకృష్ణ తన తండ్రి దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాకు దర్శకుడిగా తేజను అనుకుంటే ఇప్పుడు ఆ స్థానంలోకి క్రిష్ వచ్చి చేరాడు. ప్రస్తుతం క్రిష్ ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో మునిగిపోయాడు. అయితే ఈ సినిమాలో తమ పాత్రలను నెగెటివ్ గా చూపించబోతున్నారంటూ కొందరు రాజకీయ నాయకులు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన అనుమానాలు అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సినిమా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన వస్తే అందులో నారా చంద్రబాబు నాయుడు టాపిక్ రావడం గ్యారంటీ. ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబు అంటే ముందుగా గుర్తొచ్చేది వెన్నుపోటు ఎపిసోడ్. మరి ఈ సినిమాలో క్రిష్ ఆ ఎపిసోడ్ ను ఎలా డీల్ చేస్తాడో చూడాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతోంది.
ఇటీవల క్రిష్.. చంద్రబాబుతో రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ కు సంబంధించి చంద్రబాబు చెప్పినట్లుగా చూపించడం అంత కన్విన్సింగ్ గా ఉండదని క్రిష్ భావించాడట. బాలకృష్ణతో కూడా దీనికి సంబంధించి చర్చలు జరిపారట. అటు చంద్రబాబు హర్ట్ అవ్వకుండా ఇటు కథకు న్యాయం జరిగేలా క్రిష్ ఈ ఎపిసోడ్ ను ఎలా చూపిస్తాడో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడక తప్పదు! | 0business
|
Hyderabad, First Published 25, Sep 2018, 2:10 PM IST
Highlights
ఇటీవల మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంచు మనోజ్ స్పందించారు. దీనికి సంబంధించి నిన్న ఓ వీడియాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇటీవల మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంచు మనోజ్ స్పందించారు. దీనికి సంబంధించి నిన్న ఓ వీడియాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోని తప్పుగా అర్ధం చేసుకున్న కొందరు నెటిజన్లు తనను తప్పుబడుతూ వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటూ మంచు మనోజ్ ఓ పోస్ట్ పెట్టాడు.
''డియర్ థింకర్స్.. నేను వీడియోలో మాట్లాడిన విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోండి. మీ సొంతంగా ఏవేవో ఊహించుకోకండి. పదో తరగతిలో జాతి, కులం అనే విషయాల గురించి ఆలోచించరని వీడియోలో అన్నాను. దీన్ని తప్పుగా అనుకోకండి. పరువు హత్యకి మద్దతు తెలుపుతున్నవారిని చూసి నేను ఉద్వేగానికి లోనయ్యాను. మనుషులం అయివుండి సాటి మనుషులను చంపలేం.
అది ఓ యువతీయువకుల ప్రేమ విషయం కావొచ్చు.. లేదా తల్లితండ్రుల ప్రేమ కావొచ్చు.. తెలిసి తెలియని వయసులో ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే.. వారిని అర్ధం చేసుకోవాలే తప్ప హింసని ప్రోత్సహించకూడదు. ఇదే అందరికీ నా విన్నపం. నేనేం చెప్పినా పాజిటివ్ గా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఆలోచించి ఏదేదో ఊహించుకోకండి.
ఇలా చేస్తూ మిమ్మల్ని మీరు ఇడియట్స్ గా మార్చుకుంటూ నన్ను ఇడియట్ గా మార్చొద్దు. మానవత్వం స్థానంలో కులం, మతం, జాతి అనేవి ఉండకూడదు. నన్ను, నా కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తున్న వారికి ఒక రిక్వెస్ట్.. నన్ను గౌరవించకపోయినా పర్లేదు.. కనీసం మహిళలను గౌరవించండి. మీకు కూడా ఓ అమ్మ, అక్క, భార్య, కూతురు ఉన్నారని గుర్తుంచుకోండి'' అంటూ రాసుకొచ్చారు.
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) September 25, 2018
ఇవి కూడా చదవండి.. | 0business
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
Jan 22,2019
యమహా నుంచి కొత్త ప్రీమియం బైక్లు
బెంగళూరు: యమహా ఇండియా మోటార్ గ్రూపు ప్రీమియం శ్రేణిలో కొత్త బైక్లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లో ఎఫ్జెడ్-ఎఫ్1, ఎఫ్జెడ్ఎస్-ఎఫ్1 మోడళ్లను సోమవారం బెంగళూరులో ఇండియా యమహా మోటార్ గ్రూపు ఛైర్మన్ మోటోఫుమి షిటరా ఆవిష్కరించారు. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)తో వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీ ఎక్స్షోరూం వద్ద వీటి ధరలను వరుసగా రూ.95,000, రూ.97,000గా కంపెనీ నిర్ణరుంచింది. 149 సీసీ, 4 స్ట్రోక్ ఇంజిన్తో అడ్వాన్సుడ్ బ్రేకింగ్ సిస్టమ్స్తో వీటిని సంస్థ రూపొందించినట్టుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
First Published 15, Nov 2017, 12:09 PM IST
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
ఖాకి మూవీ లేటెస్ట్ స్టిల్స్
Recent Stories | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కంగారొద్దు.. ఈడెన్లో మ్యాచ్ పక్కా: గంగూలీ
కోల్కతాలో గత కొద్దిరోజులుగా భారీ వర్షం పడుతున్నా.. ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని చక్కగా సంరక్షిస్తున్నామని భారత మాజీ కెప్టెన్
TNN | Updated:
Sep 7, 2017, 07:19PM IST
కోల్‌కతాలో గత కొద్దిరోజులుగా భారీ వర్షం పడుతున్నా.. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాన్ని చక్కగా సంరక్షిస్తున్నామని భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. భారత్ , ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 21న ఈడెన్ గార్డెన్స్‌లో రెండో వన్డే జరగాల్సి ఉంది. కానీ.. భారీ వర్షాల కారణంగా మైదానం పాడయిందంటూ వస్తున్న వార్తల్ని ఖండించిన గంగూలీ.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
‘ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం మునుపటి రూపు రేఖల్ని ఏమీ కోల్పోలేదు. రెండో వన్డే కోసం మేము పిచ్‌, మైదానాన్ని సిద్ధం చేయగలం. గత కొద్ది రోజులుగా భారీ వర్షం పడుతున్న మాట వాస్తవమే. కానీ.. మైదానాన్ని చక్కగా కవర్లతో కప్పి ఉంచి సంరక్షిస్తున్నాం’ అని వివరించాడు. శ్రీలంకతో బుధవారం ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో వరుస విజయాలు సాధించిన భారత్ జట్టు నూతనుత్తేజంతో సొంతగడ్డపై ఆస్ట్రేలియాని ఢీకొట్టబోతోంది. సెప్టెంబరు 17న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. | 2sports
|
Apr 17,2015
రాణించిన ఇండస్ఇండ్ బ్యాంకు
న్యూఢిల్లీ : క్రితం ఆర్ధిక సంవత్సరం (2014-15) జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(క్యూ4)లో ఇండుస్ ఇండ్ బ్యాంకు నికర లాభాలు 25.1శాతం వృద్ధితో రూ.495.27 కోట్లకు చేరాయి. 2014 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ఈ బ్యాంకు రూ.396.05 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. క్రితం క్యూ3లో మొత్తం ఆదాయం రూ.2,702.19 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో బ్యాంకు నికర నిరర్ధక ఆస్తులు 0.31 శాతంగా నమోదయ్యియి. గతేడాది ఇదే త్రైమాసికంలో 0.33 శాతంగా ఉన్నాయి. 2014-15లో మొత్తంగా బ్యాంకు నికర లాభాలు రూ.1,793.72 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరంలో రూ.1,408.02 కోట్లుగా నమోదయ్యింది. క్రితం మార్చితో ముగిసిన ఏడాదిలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.10,144.06 కోట్ల నుంచి రూ.12,095.84 కోట్లకు పెరిగింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మరికాసేపట్లోనే ప్రతీకార టెస్టు.. విశేషాలు
ఆటతోనే కాకుండా మాటలతోను భారత్ చేతిలో ఘోరంగా దెబ్బతిన్న ఆసీస్ ప్రస్తుతం ప్రతీకారంతో రగిలిపోతోంది.
TNN | Updated:
Mar 16, 2017, 06:04AM IST
భారత్, ఆస్ట్రేలియా మధ్య మరికాసేపట్లోనే రాంచీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ఆరంభంకానుంది. పుణెలో జరిగిన తొలి టెస్టులో 333 పరుగుల భారీ తేడాతో ఓడిన భారత్.. రెండో టెస్టులో పుంజుకుని కంగారూలను 75 పరుగుల తేడాతో ఓడించి బదులు తీర్చుకుంది. దీంతో ఆధిక్యం అందించే మూడో టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగళూరు టెస్టులో ఆటతోనే కాకుండా మాటలతోను భారత్ చేతిలో ఘోరంగా దెబ్బతిన్న ఆసీస్ ప్రస్తుతం ప్రతీకారంతో రగిలిపోతోంది. మరోవైపు బెంగళూరు విజయం అనంతరం టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. గాయం కారణంగా పేసర్ మిచెల్ స్టార్క్, ఆల్ రౌండర్ షాన్ మార్ష్ జట్టుకి దూరమవడం ఆసీస్‌కి గట్టి ఎదురుదెబ్బ. రాంచీ టెస్టులోనైనా ఓపెనర్లు కుదురుకుంటే భారత్‌కి తిరుగుండదు. కెప్టెన్ విరాట్ కోహ్లి సిరీస్‌లో వైఫల్యాల బాట వీడటం లేదు. రాంచీలో అతని నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.
విశేషాలు | 2sports
|
Nov 02,2015
హౌసింగ్ డాట్ కామ్ మార్కెటింగ్ చీఫ్గా నిఖిల్ రుంగ్ట
న్యూఢిల్లీ : కంపెనీ నిర్వహణ బృందాన్ని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా మార్కెటింగ్ చీఫ్గా నిఖిల్ రుంగ్టను నియమించినట్లు హౌసింగ్ డాట్ కామ్ వెల్లడించింది. ఈ బాధ్యతలకు ముందు ఆయన రిలయన్స్ జెఐఓలో మార్కెటింగ్ సీనియర్ ఉపాధ్యక్షులుగా, గూగుల్కు ఇండియాలో మొదటి సిఎంఓగా నాలుగు సంవత్సరాలు వ్యవహరించారు. రుంగ్ట యెభీ, యాత్ర లాంటి సంస్థల్లో 20 సంవత్సరాలుగా కీలక వ్యాపార నాయకత్వం వహించారు. ఈ సంస్థ జులై 1 నుంచి పలు ప్రధాన పదవుల్లో మార్పులు చేసింది. ఈ మార్పుల్లో సహ వ్యవస్థాపకులైన అప్పటి సిఈఓ రాహుల్ యాదవ్ ఉన్నారు. ఆ స్థానంలో రిషబ్గుప్తా నియామకమయ్యారు. కంపెనీని అభివృద్ధి చేయడం కోసం జాసన్ కొఠారి చీఫ్ బిజినెస్ అధికారిగా ఆగస్టులో నియమితులయ్యారు. రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధిని సాధించేందుకు కీర్తి కిరణ్ ఉపాధ్యక్షులుగా సెప్టెంబర్లో నియమితులయ్యారు. గత నెలలో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ( సిఎఫ్ఓ)గా మణి రంగరాజన్, జనరల్ కౌన్సెల్గా నందిని మెహతా నియామకమయ్యారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధర్మశాల వన్డేలో ధోనీ సిక్సర్లే హైలైట్
శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అర్ధశతక ఇన్నింగ్స్ ప్రత్యేక
TNN | Updated:
Dec 10, 2017, 03:54PM IST
ధర్మశాల వన్డేలో ధోనీ సిక్సర్లే హైలైట్
శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అర్ధశతక ఇన్నింగ్స్ ప్రత్యేక ఆకర్షణ‌గా నిలిచింది. ముఖ్యంగా భారత్ 16/4తో పీకల్లోతు కష్టాల్లో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన ధోనీ.. తొలుత నెమ్మదిగా ఆడినా.. చివర్లో మాత్రం తన మార్క్ షాట్లతో విరుచుకుపడ్డాడు. ధోనీ (65: 87 బంతుల్లో 10x4, 2x6) సమయోచిత అర్ధశతకం బాదడంతో టీమిండియా 38.2 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ప్రారంభోత్సవానికి ఐపీఎల్ కెప్టెన్లు దూరం..?
ఐపీఎల్ 2018 ప్రారంభోత్సవానికి సగానికిపైగా కెప్టెన్లు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా
TNN | Updated:
Mar 14, 2018, 02:37PM IST
ప్రారంభోత్సవానికి ఐపీఎల్ కెప్టెన్లు దూరం..?
ఐపీఎల్ 2018 ప్రారంభోత్సవానికి సగానికిపైగా కెప్టెన్లు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌ 7న వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుండగా.. ఈ మ్యాచ్‌ కంటే కొద్దిసేపు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. వాస్తవానికి ఆరంభోత్సవ వేడుకల్ని ఏప్రిల్ 6న నిర్వహించాలని బీసీసీఐ తొలుత నిర్ణయించి.. దీని కోసం రూ. 50 కోట్ల బడ్జెట్‌ని కూడా కేటాయించింది. కానీ.. బీసీసీఐ పాలకుల కమిటీ ఈ బడ్జెట్‌లో రూ. 20 కోట్లు కోత వేయడంతో పాటు.. వేడుకల్ని ఏప్రిల్ 7న నిర్వహించాలని ఆదేశించింది. దీంతో.. ఈ వేడుకలకి చెన్నై, ముంబయి జట్ల కెప్టెన్స్ మినహా.. ఇతర జట్ల కెప్టెన్లు హాజరయ్యే అవకాశాలు కన్పించడం లేదు.
Visit Site
Recommended byColombia
సాధారణంగా టోర్నీ ఆరంభానికి ముందు రోజు అన్ని జట్ల కెప్టెన్లూ ఒకే వేదికపై నిలబడి క్రీడాస్ఫూర్తితో ఆడతామని ప్రతిజ్ఞ‌ చేయడం 2008 నుంచి సంప్రదాయంగా వస్తోంది. అయితే.. తాజాగా షెడ్యూల్ మార్పుతో ఈ ప్రతిజ్ఞ‌ కార్యక్రమం జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. ఏప్రిల్ 8న మ్యాచ్‌లు ఉండటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు.. ఒక్క రోజు ముందుగానే వేదికల వద్దకు వెళ్లనున్నాయి.
ఐపీఎల్‌లో అన్ని ఫ్రాంఛైజీల కెప్టెన్ల పేర్లని ఓ సారి పరిశీలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ (మహేంద్రసింగ్ ధోని), ముంబయి ఇండియన్స్ (రోహిత్ శర్మ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (విరాట్ కోహ్లి), ఢిల్లీ డేర్‌డెవిల్స్ (గౌతమ్ గంభీర్), కోల్‌కతా నైట్‌రైడర్స్ (దినేశ్ కార్తీక్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (డేవిడ్ వార్నర్), రాజస్థాన్ రాయల్స్ (స్టీవ్‌ స్మిత్), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (రవిచంద్రన్ అశ్విన్).
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Suresh 94 Views
ఫిట్నెస్ మెరుగుపర్చుకుంటున్న కోహ్లీ
కాన్పూర్: త్వరలో న్యూజిలాండ్తో జరుగనున్న సిరీస్ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ తన ఫిట్నెస్ను మరింత మెరుగుపర్చుకునే పనిలో ఉన్నాడు.కాగా తన ఫిట్ నెస్ సక్సెస్ మంత్రంగా భావించే కోహ్లీ అతని ఇంటి వద్ద జిమ్లో పలు రకాల కసరత్తులు చేస్తూ బిజిగా గడుపుతున్నాడు.దీనిలో భాగంగా ముందుకు 15 నిముషాల పాటు సైక్లింగ్ చేసిన కోహ్లీ ఆ తరువాత ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా ట్రేడ్ మిల్ వ్యాయా మం చేశాడు.కాగా సుమారు నిముషానికి 120 రౌండ్ల పాటు సైక్లింగ్ చేసిన తరువాత ఎటువంటి విరామం తీసుకోకుండా ట్రేడ్ మిల్ వ్యాయామం చేసినట్లు కోహ్లీ స్పష్టం చేశాడు. ఈ మేరకు ప్రతి 20 సెకండ్లకు 10 స్ట్రైడ్స్ చేయడమే కాకుండా,ప్రతి స్ట్రైడ్కు కేవలం 10సెకండ్ల విశ్రాంతి మాత్రమే తీసుకున్నట్లు ఈ స్టైలిష్ ఆటగాడు వెల్లడించాడు. కాగా ఈ నెల 22న కాన్పూర్లో జరిగే మొదటి మ్యాచ్తో ఈ మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. కోహ్లీ నాయకత్వంలో స్వదేశంలో జరిగే సుదీర్ఘ క్రికెట్ సిరీస్లో న్యూజిలాండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతుంది. | 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.