news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Jan 10,2019 మూడో అతిపెద్ద మార్కెట్‌గా.. ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద వినియోగదారు మార్కెట్‌గా అవతరించనుందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యుఈఎఫ్‌) అంచనా కట్టింది. 2030 నాటికి భారత్‌ మేటి వినియోగదారు డిమాండ్‌తో అమెరికా, చైనాల సరసన మూడో స్థానంలో నిలువనుందని డబ్ల్యుఈఎఫ్‌ తాజా నివేదికలో తెలిపింది. ప్రస్తుతం 1.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత్‌ వినియోగదారు వ్యయం 2030 నాటికి 6 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది తెలిపింది. 7.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత్‌ ప్రస్తుతం ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని డబ్ల్యుఈఎఫ్‌ తెలిపింది. 2030 భారత్‌కు దేశీయ ప్రయివేటు డిమాండ్‌ పెద్ద ఆసరాగా నిలువనుందని వివరించింది. దేశ జీడీపీలో దీని వాటా 60 శాతం వరకు ఉండనుందని గ్లోబల్‌ సంస్థ అభిప్రాయపడింది. 'ఫ్యూచర్‌ ఆఫ్‌ కంజప్షన్‌ ఇన్‌ ఫాస్ట్‌-గ్రోత్‌ కన్జూమర్‌ మార్కెట్‌-ఇండియా' నివేదికలో డబ్ల్యుఈఎఫ్‌ తెలిపింది. ఈ వృద్ధి కారణంగా దాదాపు 2.5 కోట్ల మంది భారతీయులు పెదరికం నుంచి బయటపడే అవకాశం ఉందని డబ్ల్యుఈఎఫ్‌ విశ్లేషించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 21, Apr 2019, 3:53 PM IST Highlights నేచురల్ స్టార్ నాని చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంది. 'ఎవడే సుబ్రమణ్యం', 'భలే భలే మగాడివోయ్' వంటి సినిమాలతో అక్కడ నానికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.  నేచురల్ స్టార్ నాని చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంది. 'ఎవడే సుబ్రమణ్యం', 'భలే భలే మగాడివోయ్' వంటి సినిమాలతో అక్కడ నానికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. పెద్ద హీరోలు సైతం ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ చేరుకోవడానికి కష్టపడుతున్న రోజుల్లో నాని అవలీలగా మిలియన్ మార్క్ ని అందుకున్నాడు. తాజాగా నాని నటించిన 'జెర్సీ' సినిమాకి కూడా ఓవర్సీస్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈసారి వీకెండ్ లోనే సినిమా మిలియన్ డాలర్ల మార్క్ ని అందుకునేలా కనిపిస్తోంది. గురువారం నాడు ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 1.45 లక్షల డాలర్లను వసూలు చేసింది. శుక్రవారం నాడు 2.6 లక్షల డాలర్లను కొల్లగొట్టింది. దీంతో ప్రీమియర్లతో కలిపి ఈ సినిమా 4 లక్షల డాలర్ల మార్క్ దాటేసింది. శుక్రవారంతో పోల్చుకుంటే శని, ఆదివారాలు ఆ క్రేజ్ మరింతగా ఉంటుంది. రోజుకి మూడు మిలియన్లు వసూలు చేసినా.. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్ ని చేరుకోవడం ఖాయమనిపిస్తుంది. ఓవర్సీస్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉండడంతో అక్కడ ప్రేక్షకాదరణ దక్కుతోంది. లాంగ్ రన్ లో ఇంకెంత వసూలు చేస్తుందో చూడాలి!
0business
udayanidhi ready to political entry మరో రాజకీయ వారసుడొస్తున్నాడు..! వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అని అంటున్నాడు TNN | Updated: Jan 25, 2018, 10:46AM IST వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అని అంటున్నాడు ఉదయనిధి స్టాలిన్ . అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఉదయనిధి ప్రకటించాడు. తను రాజకీయ రంగ ప్రవేశం చేసే సమయం వచ్చేసిందని ఇటీవలే వ్యాఖ్యానించిన ఈ సినీనటుడు.. ఇప్పుడు పోటీకి కూడా సై అంటున్నాడు. అయితే అధిష్టానం ఆదేశించాలని అంటున్నాడు. ఒకవైపు.. తమిళనాట రాజకీయాల్లో సినీనటుల హడావుడి ఎక్కువ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే సినీ హీరోగా, నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్న ఉదయనిధి కూడా రాజకీయాల్లోకి వస్తానని అంటున్నాడు. రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్ ల రాజకీయ ప్రవేశంపై తను ఏం స్పందిచనని ఉదయనిధి చెప్పాడు.
0business
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
1entertainment
Suresh 155 Views nissan Nissan నిస్సాన్‌ కంపెనీ కొత్తగా ఆధునీకరించిన మిక్రాను భారత్‌ మార్కెట్‌కు విడుదలచేసింది. ఆటోహెడల్‌ ల్యాంప్‌, వర్షపునీతిని తొలగించే వైపర్లు మూడేళ్లపాటు అద నపు వారంటీ కూడా ఇస్తున్నట్లు కంపనీ ప్రకటించింది. అందుబాటు ధరల్లోని రూ.6.09లక్షల రూపాయలు హైదరాబాద్‌ ఎక్స్‌షోరూంధరలుగా ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్‌ అరుణ్‌మల్హోత్రా నిసాన్‌ కొత్తమిక్రాను విడుదల చేసా రు. కొత్త మిక్రాకు మూడేళ్ల వారంటీ లేదా 50వేల కిలో మీటర్ల వరకూ వారంటీ లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం ధరలు మిక్రా ఎక్స్‌ఎల్‌ సివిటి 6,09,649 రూపాయల నుంచి మిక్రా డిసిఐ ఎక్సెల్‌ కంఫర్ట్‌ ధరలు 7,35,853 ఎక్స్‌షోరూం ధరలుగా ఉన్నాయి. ఈ నెల మొదటితేదీ నుంచే దేశవ్యాప్తంగా నిస్సాన్‌షోరూంలలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. అలాగేప్రపంచ వ్యాప్తంగా వంద దేశాల్లో కూడా నిస్సాన్‌ వివిధ కేటగిరీల వాహనాలు అందుబాటులో ఉంటున్నట్లు అరున్‌ వివరించారు. నిస్సాన్‌ కంపెనీ కొత్తగా ప్రపంచ వ్యాప్తంగా ఆరు మిలియన్ల వాహనాలకుపైబడి విక్రయించినట్లు తేలింది. నిస్సాన్‌ ఎక్స్‌ట్రానిక్‌ సివిటి ఆటోమేటిక్‌ వేరియంట్‌ 19.34 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. డీజిల్‌ వేరియంట్‌లో 23.08 కిలోమీటర్లుగా ఉంటుంది.
1entertainment
Hyderabad, First Published 12, May 2019, 12:41 PM IST Highlights స్టార్స్ చేసే సినిమాలు ఎక్కువ మందికి చేరుతాయి. అందులో విషయం ఎప్పుడూ చర్చనీయాంసంగా మారుతుంది.  ఏదన్నా సందేశం ఉంటే అది జనాలకు రీచ్ అవుతుంది. గతంలో మహేష్ బాబు చేసిన శ్రీమంతుడు సమయంలో ఆ సినమా నుంచి ఉత్తేజం పొందిన వారు ఊళ్లను దత్తత తీసుకున్నారు. స్టార్స్ చేసే సినిమాలు ఎక్కువ మందికి చేరుతాయి. అందులో విషయం ఎప్పుడూ చర్చనీయాంసంగా మారుతుంది.  ఏదన్నా సందేశం ఉంటే అది జనాలకు రీచ్ అవుతుంది. గతంలో మహేష్ బాబు చేసిన శ్రీమంతుడు సమయంలో ఆ సినమా నుంచి ఉత్తేజం పొందిన వారు ఊళ్లను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మహర్షి సినిమా నుంచి  చాలా మంది ప్రేరణ పొంది వీకెండ్ వ్యవసాయాలు మొదలెడుతున్నారు. ఇది ఆనందకరపరిణామం. మహేష్ బాబు చాలా ఆనందపడుతున్నారు.  ‘బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. కానీ వాటిలోని సందేశాన్ని ప్రేక్షకులు అర్థంచేసుకుని పాటించినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. వీకెండ్‌ వ్యవసాయానికి మంచి స్పందన వస్తోంది. బంగారు భవిష్యత్తుకు ఇది గొప్ప ప్రారంభం. మన తరానికే కాదు భావితరాలకు కూడా. ఇంతటి గొప్ప బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నందుకు మధుర శ్రీధర్‌, అమిత్‌ సజానేలను అభినందించాలి’ అని పేర్కొన్నారు.    సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రం రీసెంట్ గా విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. సినిమాలో రైతుల విలువను తెలియజేస్తూ  చూసేవారిలో మంచి ఆలోచన రేకెత్తేలా తెరకెక్కించారు దర్శకుడు వంశీ పైడిపల్లి.  ఈ సినిమా నుంచి స్ఫూర్తిపొంది ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి పొలంలోకి అడుగుపెట్టటం జరగింది.  ‘రైతులకు సానుభూతి అవసరం లేదు. వారికి మన గౌరవం దక్కాలి. ‘మహర్షి’ సినిమా ఓ మంచి ఆలోచనను కలిగించింది. రైతుల కష్టాలను తెరపై నిజాయతీగా చూపించినందుకు మహేశ్‌, వంశీ, దిల్‌రాజును అభినందించాలి. నాకు వీకెండ్‌ వ్యవసాయం అన్న కాన్సెప్ట్‌ చాలా నచ్చింది. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి’ అని ట్వీట్‌ చేస్తూ పొలం దున్నుతున్న ఫొటోను పంచుకున్నారు.  అలాగే ఈ సిసిమాని చూసి అమిత్‌ సజానే అనే నెటిజన్‌ కూడా స్ఫూర్తి పొందారు. పొలం పనులు చేస్తున్న ఫొటోను మహేశ్‌కు, ‘మహర్షి’ చిత్రబృందానికి ట్యాగ్‌ చేస్తూ.. ‘పుడిమికి మనిషికి మధ్య ఉన్న గొప్ప అనుబంధమే వ్యవసాయం. ‘మహర్షి’ సినిమా నుంచి స్ఫూర్తిపొందాను’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్స్‌ చూసిన మహేష్  వారిని అభినందించారు. Last Updated 12, May 2019, 12:41 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సచిన్‌కి అప్పట్లో సెలక్టర్ల నుంచి చేదు అనుభవం కెరీర్‌లో ఫస్ట్‌ సెలక్షన్‌ టైమ్‌లో‌నే సచిన్‌కి నిరాశ ఎదరైందట. ఆటని మరింత మెరుగు పర్చుకోవాలని సూచిస్తూ అతడ్ని కనీసం జట్టులోకి కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదట. Samayam Telugu | Updated: Oct 26, 2019, 01:22PM IST Sachin Tendulkar కెరీర్‌లో ఫస్ట్ సెలక్షన్ ట్రయల్స్‌ని గుర్తు చేసుకున్న సచిన్ బాగా ఆడుతున్నా.. సెలక్టర్లు పక్కన పెట్టడంతో నిరాశకి గురైనట్లు వెల్లడి 24 ఏళ్లపాటు భారత్ జట్టుకి ఆడి 100 శతకాలు బాదిన సచిన్ విజయం సాధించాలంటే కష్టపడాలి తప్ప.. అడ్డదారులు వద్దని సూచన సచిన్ టెండూల్కర్ రికార్డుల రారాజు.. క్రికెట్ ప్రపంచంలోనే వంద శతకాల మార్క్‌ని అందుకున్న ఏకైక క్రికెటర్. కానీ.. కెరీర్‌ తొలినాళ్లలోనే సెలక్టర్ల నుంచి సచిన్‌కి చేదు అనుభవం ఎదురైందట. జట్టులోకి అతడ్ని ఎంపిక చేయని సెలక్టర్లు.. ఇంకా ఆటని మెరుగు పర్చుకోవాలని సూచించినట్లు సచినే స్వయంగా వెల్లడించాడు. ముంబయిలోని ఓ స్కూల్ విద్యార్థులతో సచిన్ మాట్లాడుతూ ‘పదకొండేళ్ల వయసులో నా క్రికెట్ జర్నీ ప్రారంభమైంది. అప్పట్లో నా మైండ్‌లో ఒక్కటే ఉండేది. అది భారత్ జట్టుకి ఆడాలని. నా ఫస్ట్ సెలక్షన్స్ ట్రయల్స్‌ ఇంకా నాకు గుర్తుంది. జట్టులో‌కి నన్ను ఎంపిక చేయకుండా పక్కన పెట్టిన సెలక్టర్లు.. ఆటని ఇంకా మెరుగు పర్చుకోవాలని సూచించారు. వాస్తవానికి అప్పటికి నేను చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. అయినప్పటికీ.. సెలక్టర్లు అలా నన్ను పక్కన పెట్టడంతో నిరాశకి గురయ్యా. కానీ.. ఆ తర్వాత కష్టపడి నా ఆటని మరింత మెరుగుపర్చుకున్నా. మీ కలని నెరవేర్చుకోవాలంటే కష్టపడాలి తప్ప.. అడ్డదారులు ఏమాత్రం సాయపడవు’ అని విద్యార్థులకి సచిన్ ఉపదేశించాడు.
2sports
Visit Site Recommended byColombia పిల్లి ఫొటోలు తీసిన అమితాబ్ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి ఆయన ఇచ్చిన క్యాప్షన్ చదివితే పడి పడి నవ్వుకుంటారు. ‘ఏయ్ పిల్లి. ఈ షోలో నువ్వు కూడా ఆడతావా? ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ రాగానే అలసిపోయి నిద్రపోయింది’ అని కామెంట్ చేశారు. ఈ పోస్ట్‌కి చాలా మంది రియాక్ట్ అయ్యారు. ‘పిల్లి చాలా క్యూట్‌గా ఉంది. దానిని కూడా మీ షోలో ఉంచుకోండి సర్’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల అమితాబ్ అనారోగ్యంతో లీలావతి హాస్పిటిల్‌లో చేరారు. మూడు రోజుల చికిత్స అనంతరం వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నారు. ట్రీట్‌మెంట్ కారణంగా ఆయన ఐదు కిలోల బరువు తగ్గారు. కేబీసీ షో READ ALSO: వాటిలో సెక్స్ కాకుండా ఇంకేముంది: తాప్సి అయినప్పటికీ ఆయన తాను ఇచ్చిన డేట్ల ప్రకారం అన్ని షూటింగ్‌లలో చురుగ్గా పాల్గొంటున్నారు. అమితాబ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ‘బ్రహ్మాస్త్ర’, ‘ఝండ్’, ‘ఉయర్నద మణిదాన్’, ‘బటర్‌ఫ్లై’, ‘ఏబీ ఆని సీడీ’, ‘చెహరే’, ‘గులాబో సితాబో’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఎంత అనారోగ్యంగా ఉన్నా కెమెరా ముందుకు రాగానే అంతా బాగైపోతుంది అనిపిస్తుందని అమితాబ్ చెబుతుంటారు. తనకు అసలు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నచ్చదని, ఓపిక ఉన్నంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని తెలిపారు.
0business
sumalatha 191 Views indian cricketers , New-Jerseys indian-cricketers అంటిగ్వా : భారత క్రికెటర్లు కొత్త జెర్సీల్లో మెరిశారు. టెస్టు క్రికెట్‌లో ఐసిసి కొత్తగా అమలు చేస్తున్న నిబంధనల్లో భాగంగా భారత ఆటగాళ్లకు కూడా కొత్త జెర్సీలను కేటాయించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం భారత్‌వెస్టిండీస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇక, ఐసిసి కొత్త నిబంధనల ప్రకారం జెర్సీలపై నంబర్లతో పాటు ఆటగాళ్ల పేర్లను ముద్రిస్తున్నారు. యాషెస్ సిరీస్‌తో దీనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే న్యూజిలాండ్, శ్రీలంక జట్లు కూడా ఈ విధానానికి తెరలేపాయి. తాజాగా భారత్, విండీస్ జట్లు కూడా కొత్త జెర్సీలతో మెరువనున్నాయి. మొదటి టెస్టును పురస్కరించుకుని భారత క్రికెట్ బోర్డు క్రికెటర్ల కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. తెల్లని జెర్సీల వెనక క్రికెటర్ల పేర్లు ముద్రించారు. వీటిని ధరించిన టీమిండియా క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఫొటో షూట్‌లో సరదాగా పాల్గొన్నారు. క్రికెటర్లు కొత్త జెర్సీల్లో దిగిన చిత్రాలను వెంటనే తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
2sports
Feb 11,2016 లక్ష్యం దిశగానే పన్ను వసూళ్లు న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల వసూళ్ల దన్నుతో ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్దేశించుకున్న 'పన్ను వసూళ్ల' లక్ష్యాలను అందుకొనే దిశగా ముందుకు సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో పన్ను వసూళ్లు రూ.10.66 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. బడ్జెట్‌లో నిర్దేశించుకున్న రూ.14.49 లక్షల కోట్ల లక్ష్యంలో ఇది 73.5 శాతం కావడం గమనార్హం. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కొంత వెనకబాటు కనిపిస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాలను అందుకొనే దిశలో సాగేందుకు పరోక్ష పన్నులు ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చాయి. పరోక్ష పన్నుల ద్వారా అదనంగా మరో రూ.40,000 కోట్ల మేర ఆదాయం ఖజానాకు వచ్చి చేరనుంది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో జనవరి వరకు 10.9శాతం వృద్ధి కనిపించిందని ఇది రూ.5.2 లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక శాఖ రెవెన్యూ కార్యదర్శి హష్‌ముఖ్‌ ఆదియా తన యూట్యూబ్‌ అప్‌లోడ్‌లో తెలిపారు. పరోక్ష పన్నుల వసూళ్లు 33 శాతం మేర పెరిగి రూ.5.44 లక్షల కోట్లుగా నిలిచాయని అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ First Published 18, Sep 2018, 12:50 PM IST యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ యూటర్న్ మూవీ సక్సెస్ మీట్ ఫోటో గ్యాలరీ Recent Stories
0business
Oct 12,2018 ఓలాలో సచిన్‌ బన్సాల్‌ భారీ పెట్టుబడులు న్యూఢిల్లీ: దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో సచిన్‌ బన్సల్‌ క్యాబ్‌ సేవలను అందించే ఓలా సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో 5.5శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించిన అనంతరం సచిన్‌.. బహుముఖ విస్తరణలో భాగంగా ఓలాలో 100 మిలియన్‌ డాలర్లను (రూ.740కోట్ల నిధులను) ఇన్వెస్ట్‌ చేయనున్నట్టుగా సమచారం. దీంతో ఓలాలో భారత్‌ నుంచి అతిపెద్ద పెట్టుబడులకు తెర లేచినట్టయింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి స్టాక్‌ మార్కెట్లు కుదేల్‌ Thu 10 Nov 06:51:23.435594 2016 ముంబయి: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మదుపరులకు కనీళ్లు తెప్పించాయి. అంచానాలను తారుమారు చేస్తూ అమెరికా తదుపరి అధ్యక్షుడి రేసులో ట్రంప్‌ అధిపత్యం నేపథ్యంలో ఉదయం నుంచే దే లాభం కంటే నష్టమే ఎక్కువ..! Thu 10 Nov 06:51:29.464219 2016 న్యూఢిల్లీ: దేశంలో నల్లధనంతో పాటు దొంగనోట్ల చెలామణిని అరికట్టేందుకు గాను మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియా పన్ను వసూళ్లు పెరుగుతాయి.. Thu 10 Nov 06:51:34.906612 2016 న్యూఢిల్లీ: వ్యవస్థ నుంచి పెద్ద నోట్ల రద్దు చర్య దేశాన్ని 'నగదు రహిత ఆర్థిక వ్యవస్థ' దిశగా తీసుకుపోయేందుకు దోహదం చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. దే 10 గ్రాముల పసిడి రూ.40 వేలు! Thu 10 Nov 06:51:41.677516 2016 న్యూఢిల్లీ,హైదరాబాద్‌: పెద్దనోట్లను రద్దుతో బుధవారం బులియన్‌ మార్కెట్‌ బుధవారం దగదగలాడింది. పెద్దమొత్తంలో రూ.500, రూ.1000 నోట్లు కలిగిన వారు వాటిని పసిడి రూపంలోకి మార్చుక యూఎస్‌లో ఓట్ల దడ.. భారత్‌లో నోట్ల దడ! Wed 09 Nov 06:03:43.707566 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రపంచమంతా అమెరికా అధ్యక్ష ఓట్లపై ఉత్కంఠగా దృష్టి సారించి ఎవరు గెలుస్తారోనని తహతహలాడుతున్న సమయంలో.. దేశీయంగా అతిపెద్ద ఆర్థిక సంస్కరణకు ప్రధాని ఈ బైక్‌ ధర రూ.32.81 లక్షలు! Wed 09 Nov 06:03:48.657639 2016 న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన విలాసవంతమైన బైక్‌ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ మరో రెండు ఖరీదైన బైక్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 'రోడ్‌స్టార్‌', 'రోడ్‌ గ్లైడ్‌ ఎల్‌ఐసీలో విజిలెన్స్‌ వారోత్సవాలు Wed 09 Nov 06:03:54.219877 2016 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ఎల్‌ఐసీ జోనల్‌ విజిలెన్స్‌ డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో విజిలెన్స్‌ వారోత్సవాలను ఘనంగా నిర్వహించింది. వారంపాటు జరిగిన ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ అవగ ఔషధ రంగంలోకి మైహోమ్‌ గ్రూపు Tue 08 Nov 06:39:26.298439 2016 హైదరాబాద్‌ కేంద్రంగా వివిధ వ్యాపారాల్లో విస్తరించి ఉన్న 'మై హోమ్‌ గ్రూపు' తాజాగా ఫార్మా, బల్క్‌ డ్రగ్స్‌ విభాగంలోనూ అడుగుపెట్టనుంది. ఈ వ్యాపారంలో తమ సత్తా చాటేందుకు గాను ఫ్యూచర్‌ గ్రూపు చేతిలోకి 'హెరిటేజ్‌' Tue 08 Nov 06:39:35.394725 2016 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ రిటైల్‌ను దేశీయ రిటైల్‌ దిగ్గజం ఫ్యూచర్‌ గ్రూపు సొంతం చేసుకొంది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు చెందిన రిటైల్ మార్కెట్లోకి సరికొత్త ఫార్ఛూనర్‌ Tue 08 Nov 06:39:47.591647 2016 న్యూఢిల్లీ: జపాన్‌ ఆటో దిగ్గజ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ రెండో తరం సరికొత్త ఫార్ఛూనర్‌ వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను సంస్థ రూ.25.92 లక్షలుగా (ఎక్స్‌ 'బ్లోమ్‌'ను కొనుగోలు చేసిన సైయంట్‌ Tue 08 Nov 06:40:00.895244 2016 నవతెలంగాణ-వాణిజ్య విభాగం: బ్రిటన్‌కు చెందిన డిజిటల్‌ మ్యాపింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ 'బ్లోమ్‌ ఎయిరోఫిలిమ్స్‌'ను తాము కొనుగోలు చేయనున్నట్టుగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తు ఐసీఐసీఐ బ్యాంకు లాభం రూ.3,102 కోట్లు Tue 08 Nov 06:40:07.616215 2016 న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రయివేటు విత్త సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు ఫలితాలకు మొండి బాకీలు గండి కొట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త నాలుగు రోజుల నష్టాలకు తెర Tue 08 Nov 06:40:39.142929 2016 ముంబయి: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలో హిల్లరీ క్లింటన్‌ గెలిచేందుకు అవకాశాలు పెరిగాయన్న అంచనాలు సోమవారం మార్కెట్లకు మద్దతునిచ్చాయి. మరోవైపు హిల్లరీకి ఎఫ్‌బీఐ తాత్కాలికంగ నిద్రలేని రాత్రులు..! Mon 07 Nov 06:04:58.672001 2016 నవతెలంగాణ-వాణిజ్య విభాగం అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున బ్రిటన్‌-తెలంగాణ వాణిజ్యంలో కొత్త అధ్యాయం Mon 07 Nov 06:05:06.578063 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్రిటన్‌తో తెలంగాణ వాణిజ్య సంబంధాలు మెరుగుపరిచే దిశగా కొత్త అడుగుప డనుంది. బ్రిటన్‌లో స్వయం ప్రతిపత్తి గల 'యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలంగాణ బిజినెస ఉర్జిత్‌ ఎంపిక పత్రాలను వెల్లడించలేం: కేంద్రం Mon 07 Nov 06:05:15.90743 2016 న్యూఢిల్లీ: 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ) కొత్త గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నియామకానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఉర్జిత్ ఎక్కువ సమయమివ్వం: జైట్లీ Sun 06 Nov 06:26:15.868372 2016 న్యూఢిల్లీ: దేశంలో ప్రయివేటు రంగం మరింత వేగంగా విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అభిప్రాయపడ్డారు. బ్యాంకుల నుంచి రుణాలను తీసుకొని బకాయిపడ్డ వ అవిర‌క్త‌పాతం లేని యుధ్ధా‌లు Sun 06 Nov 06:26:22.523428 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మానవ జీవితంలో అంతర్భాగంగా మారిన ఇంటర్‌నెట్‌ను మరింత సురక్షితంగా ప్రపంచానికి అందించే దిశగా కృషి జరగాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి ర తెలంగాణ టూరిజం ఆకర్షణీయం Sun 06 Nov 06:26:29.510448 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' ఆధ్వర్యాన సిక్కింలోని గ్యాంగ్‌టాక్‌లో జరుగుతున్న 'ఎక్స్‌ప్రెస్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ ఎక్స్‌పో'లో తెలంగాణ జరిమానా చెల్లించండి..! Sat 05 Nov 05:37:02.352343 2016 న్యూఢిల్లీ: 'రిలయన్స్‌ ఇండిస్టీస్‌' (ఆర్‌ఐఎల్‌)కు కేంద్ర ప్రభుత్వం అనూహ్య రీతిలో షాకిచ్చింది. కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ చమురు క్షేత్రాల నుంచి ఆర్‌ఐఎల్‌ అక్రమంగా గ్యాస్‌ను Sat 05 Nov 05:37:08.856651 2016 వాణిజ్య విభాగం పెట్రోలియం డీలర్ల నిరసన వాయిదా Sat 05 Nov 05:37:16.494689 2016 ముంబయి: డిమాండ్ల సాధన కోరుతూ పెట్రోలియం డీలర్లు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు తెర పడింది. కమీషన్‌ చెల్లింపు విషయమై పెట్రోలియం డీలర్లు చమురు కంపెనీలకు మధ్య శుక్రవారం జరిగి Sat 05 Nov 05:37:24.928188 2016 వాణిజ్య Sat 05 Nov 05:37:31.93222 2016 వాణిజ్య ఐదు నెలల కనిష్టానికి సెన్సెక్స్‌ Sat 05 Nov 05:37:42.297697 2016 ముంబయి: అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీయడం.. ఫార్మా రంగ షేర్లు కుదేలవడం వంటి అంశాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ దేశీయ మార్కెట్ దురుసుగా ప్రవర్తించిన మిస్త్రీ సెక్యూరిటీ Sat 05 Nov 05:06:26.65377 2016 ముంబయి : టాటా సన్స్‌ బోర్డు వేటుకు గురైన సైరెస్‌ మిస్త్రీ సెక్యూరిటీకి, మీడియాకు మధ్య శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్ టాటాలో సంస్థాగత మార్పులు Sat 05 Nov 05:05:48.084132 2016 ముంబయి : టాటా సన్స్‌ చైర్మెన్‌గా సైరస్‌ మిస్త్రీని ఉద్వాసన పలికిన అనంతరం గ్రూపులోని కంపెనీల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంస్థలోని పలు విభాగాలకు అధిపతులను మారుస జీఎస్‌టీ రేటు కుదిరింది! Fri 04 Nov 06:48:23.980981 2016 దేశంలో ప్రత్యక్ష పన్ను సంస్కరణల దిశగా గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. నాలుగు అంచెల 'వస్తు సేవల పన్ను' (జీఎస్‌టీ) రేట్లకు జీఎస్‌టీ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. పన్ను సరికొత్త రూపంలో స్కోడా ర్యాపిడ్‌ Fri 04 Nov 06:48:30.203228 2016 న్యూఢిల్లీ: ఫోక్స్‌వ్యాగన్‌ అనుబంధ సంస్థ స్కోడా సరికొత్త రూపంలో ర్యాపిడ్‌ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. కాంప్యాక్ట్‌ సెడాన్‌గా మార్కెట్లోకి వచ్చిన ఈ కారు బేస్‌ ధరను అయినా.. నేనే చైర్మెన్‌! Fri 04 Nov 06:48:35.800833 2016 ముంబయి/రాయపూర్‌: టాటా సన్స్‌ చైర్మెన్‌ బాధ్యతల నుంచి తనను తప్పించినప్పటికీ గ్రూపులోని కొన్ని కీలకమైన కంపెనీలకు తానే ఇప్పటికీ చైర్మెన్‌గా ఉన్నట్లు సైరస్‌ మిస్త్రీ తన వర్గా విదేశీ బ్రాండ్లే ఆకర్షణీయమట! Fri 04 Nov 06:48:40.824859 2016 న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో విదేశీ బ్రాండ్ల హవా కొనసాగుతోంది. తా జాగా 'ట్రస్ట్‌ రీసెర్చ్‌ అడ్వైజరీ' (టీఆర్‌ఏ) నిర్వహించిన ఒక పరిశో ధనలో ఈ విషయం మరోమారు నిరూపితమైంది. దేశ మూడున్నర నెలల కనిష్టానికి మార్కెట్లు Fri 04 Nov 06:48:54.317145 2016 ముంబయి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఆధిక్యం పెరిగిందన్న అంచనాలు గురువారం కూడా ప్రపంచ మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడు రోజ బ్యాంకుల నుంచీ 'మసాలా' బాండ్లు: ఆర్‌బీఐ Fri 04 Nov 06:48:48.780773 2016 న్యూఢిల్లీ: దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు విదేశీ మార్కెట్లలో రూపాయి విలువత దేశంలో పెరుగుతున్న కోటీశ్వరులు! Thu 03 Nov 07:04:33.508375 2016 ముంబయి: దేశంలో కోటీశ్వరుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఏడాదికి రూ.కోటికి పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్న వారి సంఖ్య 45000కు పైమాటేననని తాజాగా విడదలైన ఆదాయపు పన్ను శాఖ ( మెచ్చుకుంటే చాలు 'బాస్‌'! Thu 03 Nov 07:04:39.388877 2016 న్యూఢిల్లీ: భారత్‌లో ఎక్కువ మంది ఉద్యోగులు తాము చేస్తున్న పనికి జీతభత్యాల కంటే కూడా మెచ్చుకోలును ఎక్కువగా ఆశిస్తున్నట్టుగా ఒక సర్వేలో తేలింది. ఉద్యోగిగా తాము చేసే పనినియా 'అమెరికా' భయాలకు ఆగమాగం.. Thu 03 Nov 07:04:47.288897 2016 ముంబయి: తదుపరి అమెరికా అధ్యక్షులు ఎవరన్న విషయమై రోజురోజుకు అంచనాలు మారుతుండడంతో అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ట్రంపుకు ఆధిక్యం భారత రేటింగ్‌ యథాతథం: ఎస్‌అండ్‌పీ Thu 03 Nov 07:04:53.251295 2016 న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థికాభివృద్ధి దిశగా మోడీ సర్కారు చేపట్టిన ఎజెండా మెప్పించే స్థాయిలో లేదని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ 'స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌' (ఎస్‌అండ్‌పీ) తేల్చిం ఆ చెల్లింపులు వేగవంతం : ఈపీఎఫ్‌ఓ Thu 03 Nov 07:05:04.138483 2016 న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఖాతాదారు మరణించిన నేపథ్యంలో కేవలం ఏడు రోజుల్లోనే పీఎఫ్‌ సొమ్ము చెల్లింపు జరిగేలా సర్కారు చర్యలు చేపట్టింది. దరఖాస్తు చేసుకున్న రో విజయా బ్యాంకు లాభాల్లో 34% వృద్ధి Thu 03 Nov 07:05:12.418888 2016 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్‌ అయిన విజయా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలను ప్రకటించింది. బ్ తక్కువ వడ్డీకి గృహ రుణాలు: ఎస్‌బీఐ Thu 03 Nov 06:48:09.742016 2016 న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద విత్త సంస్థ 'భారతీయ స్టేట్‌ బ్యాంక్‌' (ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గృహ రుణాల వడ్డీ రేటును ప్రస్తుత ఉద్యోగులకు ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం: ఐసీఐసీఐ Thu 03 Nov 06:47:39.038611 2016 న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ను అందిపుచ్చుకోవడానికి బ్యాంకులు పోటీ పడుతున్నాయి. దీపావళికి ముందు పలు ఆఫర్లను అందించిన బ్యాంకర్లు పండుగ తర్వాత కూడా కొత్త పథకాలను ప్రకటిస్తూ ఖాతా నిర్ణయాలన్నీ టాటా ఆమోదంతోనే.. Wed 02 Nov 06:00:33.546735 2016 ముంబయి : టాటా గ్రూపు సైరస్‌ మిస్త్రీల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. జపనీస్‌ టెలికం సంస్థ డొకొమో ఒప్పందంపై మిస్త్రీ సోమవారం టాటాపై విరుచుకుపడ్డారు. రెండు రోజులు ఐటీ షేర్ల వెలవెల Wed 02 Nov 06:00:41.117626 2016 ముంబయి : అంతర్జాతీయ, జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లలో పండుగ వెలుగులను నింపలేకపోతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు రెండు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్షకు తోడు ఐటీ ఆంధ్రా బ్యాంకులో విజిలెన్స్‌ వారోత్సవాలు Wed 02 Nov 06:00:46.414032 2016 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు విజిలెన్స్‌ వారోత్సవాలను నిర్వహిస్తోంది. సోమవారం హైదరాబాద్‌లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఆంధ్ ఎస్‌బీహెచ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు Wed 02 Nov 06:00:52.85966 2016 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) స్వల్పంగా వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రామాణిక రుణ రేటుకు 0.10 శాతం మేర కోత పెట్టింది. దీంతో ఈ ఏడాద ఆర్‌బీఐ డీజీ పదవికి 90 దరఖాస్తులు Wed 02 Nov 06:00:58.300349 2016 న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ (డీజీ) పదవికి వివిధ స్థాయిల నుంచి 90 దరఖాస్తులు వచ్చాయి. ఇది వరకు డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్‌ ప ట్విట్టర్‌ ఇండియా హెడ్‌ రాజీనామా Wed 02 Nov 06:01:03.438449 2016 న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ట్విట్టర్‌ ఇండియా హెడ్‌ రిషి జైట్లీ వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అయితే ఎందుకు మురిపించని ముహూరత్‌! Tue 01 Nov 03:56:06.576806 2016 దీపావళి నాడు నిర్వహించిన 'ముహూరత్‌ ట్రేడింగ్‌' మదపరులను మురిపించ లేకపోయింది. ప్రతికూల అంశాల ప్రభావం, పండగ రోజు లాభాలను ఆర్జించాలనే సెంటిమెంట్‌ తదితర కారణంగా ఆదివారం నిర్ నిర్వహణలేని ఖాతాలకూ వడ్డీ Tue 01 Nov 03:56:11.664858 2016 'ఎంపా ్లయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌' (ఈపీఎఫ్‌ఓ) ఖాతాదారులకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తీపి కబురు వినిపించారు. నిర్వహణలో లేని ఎస్‌బీహెచ్‌లో విజిలెన్స్‌ వారోత్సవాలు Tue 01 Nov 03:56:16.096489 2016 'కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌' (సీవీసీ) నిర్దేశకాల మేరకు 'స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌' (ఎస్‌బీహెచ్‌) విజిలెన్స్‌ వారోత్సవ నిర్వహణకు శ్రీకారం చుట్టింది.
1entertainment
బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్.. రాగానే దీప్తి సునైనాను ఏడిపించాడు Highlights అలా అడుగుపెట్టాడో లేదో.. ఇలా అందరినీ ఏడిపించేశాడు. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్2 రాను రాను మరింత ఆసక్తిగా మారుతోంది. సీజన్ 1 ఎంత హిట్ అయ్యిందో.. సీజన్ 2 కూడా అదే రేంజ్ లో హిట్ చేసేందుకు స్టార్ మా టీం బాగానే ట్రై చేస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో ఇచ్చిన ‘ బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమా’ కాన్సెప్ట్ తో ఇంటి సభ్యులు చేసిన హంగామా వీక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా.. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్ అడుగుపెట్టాడు. అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రదీప్ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.  ప్రదీప్ ఇంట్లోకి అడుగుపెట్టిన వీడియో ప్రోమోని స్టార్ మా విడుదల చేసింది. ప్రదీప్ హౌజ్ లోకి అడుగుపెట్టిన వెంటనే సందడి మొదలైంది.    ప్రదీప్ చెప్పిన పలు విషయాలకు ముందుగా దీప్తి సునైనా కంట తడి పెట్టుకుంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కన్నీరు పెట్టుకున్నారు. అయితే.. ఆనందంతో వారు ఏడ్చినట్లు అర్థమౌతోంది.  Last Updated 19, Jul 2018, 1:33 PM IST
0business
Kohli విజయావకాశాలు కోహ్లీపైనే ఆధారపడి లేవు న్యూఢిల్లీ: చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా విజయావకాశలు కెప్టెన్‌ కోహ్లీ ఒక్కడిపైనే ఆధారపడి లేవని మాజీ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ వ్యాఖ్యానించారు.గురువారం ఢిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో తమ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత కపిల్‌ మీడియాతో మాట్లాడాడు.ఈ సమావేశంలో చాంపియన్స్‌ ట్రోఫీలో కోహ్లీ ఫామ్‌ భారత అవకాశాలపై ప్రభావం చూపిస్తుందా? అన్న ప్రశ్నకు కపిల్‌దేవ్‌ సమాధానమిచ్చారు. ధర్మశాలలో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ చూశారా? అప్పుడంతా కోహ్లీ ఆడకపోతే టీమిండియా ఓడిపోతుందన్నారు. కానీ ఎం జరిగిందో మనందరికి తెలుసు అని కపిల్‌ దేవ్‌ పేర్కొన్నాడు.టీమిండియా విజయం కోహ్లీపైనే ఆధారపడిందని అంచనాలు పెంచేసి ఇతర ఆటగాళ్లను దిగజార్చడం సమంజసం కాదు.జట్టులో కోహ్లీ కూడా ముఖ్యమైన ఆటగాడు.అతడికి ఎప్పుడు,ఎలా ఆడాలో తెలుసన్నాడు.ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేసినపుడే చాంపియన్స్‌ ట్రోఫీలో కోహ్లీ సేన గెలుపు అవకాశాలు ఉంటాయని కపిల్‌ దేవ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం టీమిండియా యువ ఆటగాళ్లతో నిండి ఉందని,గత అయిదారు సంవత్సరాలుగా సత్తా చాటుతుందన్నాడు.ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీకి సెలక్టర్లు ఎంపిక చేసిన భారత జట్టు పై కూడా కపిల్‌ స్పందించారు.సెలక్టర్లు జట్టు ఎంపికలో అనుభవానికి పెద్ద పీట వేయడం మంచిదన్నాడు.సెలక్టర్లతో పోలిస్తే తన అభిప్రాయం వేరుగా ఉండవచ్చని అయితే వారిని విమర్శించడం తన పని కాదని కపిల్‌ పేర్కొన్నాడు.చాంపియన్స్‌ ట్రోఫీలో ఏ బౌలర్‌్‌ సత్తా చాటు తాడో చెప్పలేమని అందరూ సమిష్టిగా బౌలింగ్‌ చేయాల్సిన ఉంటుందని కపిల్‌ వివరించాడు.భారత్‌లో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు లేరని అయితే దేశం తనకన్నా మెరుగైన 100 మందని కపిల్‌దేవ్‌లను తయారు చేయాలని కోరుకుంటున్నట్లు కపిల్‌ దేవ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్ల విషయానికి పక్కన బెడితే అశ్విన్‌, జడేజా మంచి ఆల్‌రౌండర్లుగా ఎదిగారని కపిల్‌ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే ఛాంపియన్స్‌ ట్రోఫీలో జూన్‌ 4న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.దీంతో పాటు గ్రూప్‌ బిలో దక్షిణాఫ్రికా,శ్రీలంకతో జట్లతో భారత్‌ ఆడనుంది.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Hyderabad, First Published 11, Aug 2019, 4:24 PM IST Highlights శర్వానంద్  నటించిన రణరంగం సినిమా ఆగస్ట్ 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో పాజిటివ్ గా దూసుకుపోతోంది. ఫైనల్ గా సౌండ్ కౌంట్ పేరుతో ట్రైలర్ ను కూడా వదిలారు. శర్వానంద్  నటించిన రణరంగం సినిమా ఆగస్ట్ 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో పాజిటివ్ గా దూసుకుపోతోంది. ఫైనల్ గా సౌండ్ కౌంట్ పేరుతో ట్రైలర్ ను కూడా వదిలారు. చిత్ర యూనిట్ కోరిక మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశాడు.  టీజర్ తోనే సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు స్ట్రాంగ్ గా పెరుగుతుండగా ఇప్పుడు సౌండ్ కట్ కూడా మోత మోగిస్తోంది. సౌండ్ మిక్సింగ్ తో డిఫరెంట్ మ్యాజిక్ చేశారనిపిస్తోంది. శర్వా డిఫరెంట్ లుక్స్ తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. యాక్షన్ మోడ్ ని అలాగే ఎమోషన్ ని దర్శకుడు సుధీర్ కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడనిపిస్తోంది.  సినిమా క్లిక్కయితే శర్వానంద్ కెరీర్ కి బాగా ప్లస్సవుతుంది. పడి పడి లేచే మనసు సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఈ హీరో రణరంగం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శిని - కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
0business
Jan 10,2019 సార్వత్రిక సమ్మెతో స్తంభించిన బ్యాంకింగ్‌ చెన్నై: కేంద్ర ప్రభుత్వపు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ట్రేడ్‌ యూనియన్లు చేపట్టిన సార్వత్రిక సమ్మె ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని కనబరిచింది. బ్యాంకుల ఉద్యోగుల సమ్మె కారణంగా దాదాపు రూ.20,000 కోట్ల విలువైన చెక్కుల క్లియరెన్స్‌ నిలిచిపోయిందని 'ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌' (ఏఐబీఈఏ) వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను వ్యతిరేకిస్తూ మంగళ, బుధవారాల్లో (జనవరి 8, 9 తేదీల్లో )ఉద్యోగులు ఈ సమ్మెను తలపెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న క్లియరింగ్‌ హౌస్‌లలో రూ. 20 వేల కోట్ల చెక్కుల లావాదేవీలు నిలిచిపోయాయని ఓ ప్రకటనలో ఏఐబీఈఏ వెల్లడించింది. 'బ్యాంకు అధికారులు సమ్మెలో పాల్గొనకపోయినా మాకు మద్దతు తెలిపారు. దాంతో బ్యాంకులు తెరిచి ఉన్నా..నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్సులు, గవర్నమెంటు ట్రెజరీ ఆపరేషన్లు, విదేశీ మారక లావాదేవీలు వంటి తదితర సేవల మీద ప్రభావం పడింది' అని తెలిపింది. రూ.13లక్షల కోట్ల మొండి బకాయిలే బ్యాంకులకు అతిపెద్ద సమస్య అని ఆ యూనియన్‌ వెల్లడించింది. 21 బ్యాంకుల్లో 19 బ్యాంకులు నెట్‌ లాసెస్‌తో ఇబ్బంది పడుతున్నాయని సంఘం తెలిపింది. ప్రభుత్వ ఇప్పటికైన మేలుకొని ప్రజా సమ్మతి మేరకు చర్యలు చేపడుతూ ముందుకు సాగాలని ఏఐబీఈఏ సూచించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సల్మాన్ కు రామ్ చరణ్ డబ్బింగ్ సల్మాన్ ఖాన్, రాంచరణ్ తేజలు మంచి స్నేహితులని సినీరంగంలో అందరికీ తెలిసిందే. TNN | Updated: Oct 20, 2015, 02:35PM IST హైదరాబాద్: సల్మాన్ ఖాన్ , రాంచరణ్ తేజలు మంచి స్నేహితులని సినీరంగంలో అందరికీ తెలిసిందే. చరణ్ హిందీలో జంజీర్ సినిమా చేసినప్పటినుంచి ఇద్దరూ క్లోజ్ అయ్యారు. సల్మాన్ హైదరాబాద్ వచ్చినా, చరణ్ ముంబై వెళ్లినా ఒకరినొకరు కలవకుండా రారు. అదే స్నేహంతో ఇప్పుడు చరణ్ సల్మాన్ కు డబ్బింగ్ చెబుతున్నాడు. సల్మాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగులో సల్మాన్ పాత్రకు రాంచరణ్ డబ్బింగ్ చెబుతున్నాడు. సోనమ్ కపూర్ సినిమా హీరోయిన్
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆసీస్ గడ్డపై భారత్ ఫేవరెట్ కాదు: గిల్‌క్రిస్ట్ 2003-04లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత్ జట్టు సిరీస్‌ని డ్రాగా ముగించగా.. 2003-04లో ధోనీ నాయకత్వంలో సిరీస్‌ని 1-2తో చేజార్చుకుంది. Samayam Telugu | Updated: Nov 29, 2018, 01:16PM IST ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు టెస్టు సిరీస్‌‌ని గెలిచే అవకాశాలు తక్కువేనని ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. డిసెంబరు 6 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ జట్టు తలపడనుండగా.. సుదీర్ఘకాలంగా ఇప్పటి వరకూ ఆ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా టీమిండియా గెలవలేకపోయింది. అయితే.. మునుపటితో పోలిస్తే ఇప్పుడు భారత్ జట్టు మంచి సమతూకంతో ఉండటం, మరోవైపు డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ లేకపోవడంతో ఆసీస్ జట్టు బలహీనంగా కనిపిస్తుండటతో.. కోహ్లీసేన కచ్చితంగా టెస్టు సిరీస్ గెలుస్తుందని భారత మాజీ క్రికెటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో భారత్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే..! 2003-04లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత్ జట్టు సిరీస్‌ని డ్రాగా ముగించగా.. 2003-04లో ధోనీ నాయకత్వంలో సిరీస్‌ని 1-2తో చేజార్చుకుంది. అలానే 2014-15లో విరాట్ కోహ్లి ఏకంగా 4 శతకాలు బాదినా.. భారత్ జట్టు‌కి మాత్రం 0-2తో ఓటమి తప్పలేదు. తాజాగా ఈ రికార్డుల్ని ప్రస్తావించిన గిల్‌క్రిస్ట్.. సిరీస్‌లో భారత్ ఫేవరెట్ కాదని తేల్చేశాడు.
2sports
sumalatha 323 Views bse , NSE , stock market sensex ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినప్పటికీ… ఆ నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరచలేక పోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు పతనమై 37,673కు పడిపోయింది. నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయి 11,174కి దిగజారింది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/
1entertainment
శ్రీదేవి సోదరి శ్రీలత భర్త సంజయ్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు Highlights శ్రీదేవి మృతిపై ఇప్పటివరకు స్పందించని ఆమె సోదరి శ్రీదేవి సోదరి శ్రీలతపై రకరకాల కథనాలు తాజాగా సంచలన ప్రకటన విడుదల చేసిన శ్రీలత భర్త సంజయ్ రామస్వామి ప్రముఖ నటి శ్రీదేవి ఫిబ్రవరి 24న మరణించిన అనంతరం తిరుపతికి చెందిన ఆమె బంధువు వేణు గోపాల్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి శ్రీదేవి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శ్రీదేవికి తాను బాబాయ్ అవుతానని చెప్పడంతో పాటు శ్రీదేవి చిన్న తనం నుండి ఎలా పెరిగింది, ఎలాంటి కష్టాలు పడింది అనే విషయాలు వెల్లడించారు. శ్రీదేవి, ఆమె సోదరి శ్రీలత, భర్త బోనీ కపూర్‌కు సంబంధించిన విషయాలతో పాటు శ్రీదేవి కాస్మొటిక్ సర్జరీల గురించి తెలిపారు.   శ్రీదేవి మరణం అనంతరం ఆమె సోదరి శ్రీలత ఇప్పటి వరకు మీడియాకు కనిపించలేదు, ఎలాంటి స్టేట్మెంటు కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా శ్రీలత భర్త సంజయ్ రామస్వామి ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. శ్రీదేవి సోదరి శ్రీలతను వివాహం చేసుకుని 28 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్ల కాలంలో తాను వేణు గోపాల్ రెడ్డి అనే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని, ఎప్పుడు కలవలేదని సంజయ్ రామస్వామి వెల్లడించారు. వేణు గోపాల్ రెడ్డి చెప్పిన ఏ విషయంలోనూ నిజం లేదని సంజయ్ తెలిపారు. శ్రీదేవి మరణంతో కుటుంబం మొత్తం శోక సముద్రంలో ఉంది. ఇలాంటి బాధాకరమైన సమయంలో ఎలాంటి కామెంట్స్ వద్దని సంజయ్ రామస్వామి సూచించారు.   ఫ్యామిలీ మొత్తం బోనీ కపూర్ కు సపోర్టుగా ఉందని, ఇలాంటి సమయంలో తామంతా ఆయన వెంటే ఉన్నామని సంజయ్ తెలిపారు. మీడియాలోని కొన్ని వర్గాలు నా భార్య(శ్రీలత) నిశ్శబ్దాన్ని ప్రశ్నిస్తున్నాయి. అన్నిరకాల ఆరోపణలను ఆపాదించాయి. నా భార్య తన సోదరి పోగొట్టుకున్న బాధలో ఉంది. ఇలాంటి సయమంలో గోడమీద నిలబడి అరవమంటారా? మేమెంతగానో విచారిస్తున్నాం. అలాగని ఎలాంటి పబ్లిసిటీ కోసం ప్రయత్నించడం లేదు. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని సంజయ్ రామస్వామి సూచించారు.   మేము చాలా సన్నిహితంగా మెలిగే కుటుంబ సభ్యులం. శ్రీదేవి మాకు అందరికి ఒక ప్రేరణగా ఉండేది, కుటుంబంలోని అందరూ ఆమెను ఎంతగానో ఇష్టపడతారు అని సంజయ్ రామస్వామి తెలిపారు. శ్రీదేవి మరణం అనంతరం ఇప్పటివరకు బయటకు రాని శ్రీదేవి సోదరి శ్రీలత, ఆమె భర్త సంజయ్ రామస్వామి... కేవలం తమపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకే తాజాగా మీడియా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. Last Updated 25, Mar 2018, 11:40 PM IST
0business
బెయిల్ పై వచ్చి పెళ్లి చేసుకున్న హీరో! Highlights ఈ క్రమంలో మహాక్షాయ్ వివాహం జరగాల్సిన రోజే పోలీసులు విచారణకు వెళ్లడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అయితే నేడు వారి పెళ్లి ఊటీలో జరిగింది. మిథున్ చక్రవర్తికి చెందిన ఒక హోటల్ లో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య మహాక్షాయ్.. మదాలస శర్మను వివాహం చేసుకున్నారు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షాయ్ ఒక యువతిని మోసం చేసిన ఆరోపణలతో గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. జూలై 7న నటి మదాలస శర్మతో జరగాల్సిన మహాక్షాయ్ వివాహం ఈ విషయం కారణంగా ఆగిపోయింది. భోజ్ పూరికి చెందిన ఒక నటి మహాక్షాయ్ తనను మోసం చేశాడని, అతడి కారణంగా గర్భం దాల్చడంతో అబార్షన్ కూడా చేయించాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మహాక్షాయ్ తల్లి యోగితా బాలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో వీరిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మహాక్షాయ్ వివాహం జరగాల్సిన రోజే పోలీసులు విచారణకు వెళ్లడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అయితే నేడు వారి పెళ్లి ఊటీలో జరిగింది. మిథున్ చక్రవర్తికి చెందిన ఒక హోటల్ లో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య మహాక్షాయ్.. మదాలస శర్మను వివాహం చేసుకున్నారు. సోమవారం సంగీత్ ప్రోగ్రామ్ ను నిర్వహించనున్నారని సమాచారం.   Last Updated 10, Jul 2018, 4:26 PM IST
0business
Banned 500 Currency పెద్దనోట్ల రద్దుతో గ్రేట్‌బాంబే సర్కస్‌కు గడ్డుకాలం! హైదరాబాద్‌, డిసెంబరు 3: పెద్దనోట్ల చెలామణి రద్దుతో అత్యంతప్రాచీనమైన గ్రేట్‌బాంబేసర్కస్‌ సమస్యల్లో చిక్కుకుంది. 15 ఏళ్లపాటు నిర్వి రామంగా కొనసాగిన గ్రేట్‌ బాంబేసర్కస్‌ట్రూప్‌ చిట్టచివరికి హైదరాబాద్‌కు చేరుకుంది. పనితీరు పై ఆసర్కస్‌కు విశేషాదరణ ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుకారణంగా వెలవెలబోతోంది. నగదుకొరత, మార్పులు కూడా బిజినెస్‌ తగ్గడానికి కారణం అయిందని అంచనా. వివిధ ప్రాంతాలను పర్య టిస్తూ సర్కస్‌ ప్రదర్శనలిచ్చే ఈట్రూప్‌ ప్రస్తుతం ఆర్థికసంక్షోభానికి గురయినట్లేననిపిస్తోంది. అందువల్లనే ఈ సర్కస్‌ టీం సభ్యులు తమ పర్యాటక షెడ్యూలును కుదించుకుంటున్నారు. కంపెనీ యాజమాన్యం కూడా ఆర్థిక విఘాతానికి తట్టుకోలేక సర్కస్‌ను కొనసాగించాలా లేక వదిలి వేయాలా అన్న నిర్ణయానికి వచ్చిందన్న వదం తులు పెరిగిపోయాయి. ఎందుకంటే జంతువు లకు పసుగ్రాసం, ఆహారాన్ని సైతం అందించడం కష్టంగా మారుతోందని సర్కస్‌గ్రూప్‌ సభ్యులు చెపుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ గతనెల 8వ తేదీ ప్రకటించిన నోట్లరద్దు అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. పాతనోట్లను ఎక్కడా చెల్లుబాటు లోనికి లేవు. అంతేకాకుండా సర్కస్‌కు వచ్చే ప్రజలు కూడా తగ్గిపోయారు. బ్యాంకుల్లో కూడా కొత్తకరెన్సీ కొరత ఎక్కువగాఉంది. ఈ సమస్య జాతిమొత్తాన్నే కుదిపేసిందని సర్కస్‌ మేనేజర్‌ పాండురంగజాదవ్‌ వెల్లడించారు. సర్కస్‌లో పనిచేసే టికెట్‌ కలెక్టర్‌ రామ్‌బరోసా మాట్లాడు తూ అంతకుముందుతో పోలిస్తే టికెట్ల అమ్మకం కూడా పడిపోయింది. స్థూలంగా చెప్పాలంటే పెద్దనోట్లరద్దు సర్కస్‌ కంపెనీని కుదిపేసిందని చెప్పాలి. కేవలం పది నుంచి 15శాతం మాత్రమే ప్రజలు సర్కస్‌కు వస్తున్నారు. ఇటీవలికాలంలో సర్కస్‌ను వీక్షించే ప్రజలే తగ్గిపోయారు. దీనికి తోడు నెలరోజులుగా పెఓద్దనోట్ల రద్దు కూడా మరొక సమస్యగా ఉంది. టికెట్ల విక్రయాలు పూర్తిగా పడిపోయాయని నగదు కారణంగా సర్కస్‌ పూర్తిగా దెబ్బతిన్నట్లు ఆ ప్రాంగణంలోని పాప్‌కార్న్‌ విక్రేత కుర్బన్‌ ఆలీ వెల్లడించారు.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఒక్క దోమ ఇషాంత్ అరుదైన అవకాశాన్ని దెబ్బతీసింది! ఈ హెడ్డింగ్ చదవగానే ఏదో యాడ్‌లో చూసినట్టుందే అనిపిస్తుందా! ఇది నిజంగా నిజం. దోమ కారణంగానే భారత బౌలర్ ఇషాంత్ శర్మ అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు. TNN | Updated: Sep 21, 2016, 10:21AM IST చికన్‌గున్యా.. ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్న వ్యాధి ఇది. తాజాగా భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా దీని బారినపడి అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు. దోమ కాటు కారణంగా ఇషాంత్ శర్మ చారిత్రాత్మక 500వ టెస్టులో ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టుల సిరీస్‌లో అతడు 8 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరగనున్న తొలి టెస్ట్ టీమిండియాకు 500వ టెస్టు మ్యాచ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జట్టులో భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ ఉండటంతో మరో బౌలర్ కావాలని కెప్టెన్ కోహ్లీ సెలెక్టర్లను అడగలేదు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నిషామ్‌ కూడా కాన్పూర్ టెస్టులో ఆడటం లేదు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ​ అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఇప్పటికే కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. 500వ టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మ్యాచ్‌కు భారత మాజీ క్రికెటర్లందర్నీ ఆహ్వానిస్తోంది. గురువారం ప్రారంభం కాబోయే ఈ టెస్టు కోసం ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అజహర్ సహా సచిన్, కపిల్, గంగూలీ, రవిశాస్త్రి తదితర మాజీ క్రికెటర్లందరికీ ఆహ్వానం అందింది.
2sports
Sep 20,2015 ఇండియన్‌ బ్యాంక్‌లో ఎంఎస్‌ఎంఈ మేళా    నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు తగిన తోడ్పాటును అందించేందుకు గాను 'ఇండియన్‌ బ్యాంక్‌' హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో శనివారం ఎంఎస్‌ఎం మేళాను నిర్వహి ంచింది. జోన్‌లోని మొత్తం 46 శాఖలలో ఈ మేళా అందుబాటులో ఉండే లా మొత్తం పది క్లస్టర్లలో మేళాను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇండియన్‌ బ్యాంకు జనరల్‌ మేనేజరు, జోనల్‌ మేనేజర్‌ జి.లక్ష్మీపతి రెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ విభాగంలో తమ బ్యాంక్‌ ఇప్పటి వరకు సుమారు రూ.16196 కోట్ల మేర ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు. ఈ విభాగంలో అమలులో ఉన్న పలు పథకాలను గురించి ఆయన వినియోగదారులకు వివరించారు. క్లస్టర్‌ బ్రాంచీ మేనేజరు, హైదరాబాద్‌ ప్రధాన శాఖ డీజీఎం లక్ష్మీ నారాయణ ఎంఎస్‌ఎంఈ పథకం విశేషాలను గురించి తెలిపారు. మేళాలో భాగంగా జోన్‌ మొత్తంగా బ్యాంకు రూ.50.19 కోట్ల మేర రుణాలను మంజూరు చేసింది. ఇందులో సుమారు రూ.31.43 కోట్ల రుణాలకు సూత్రప్రాయ అంగీకారం తెలపగా.. మిగతా రుణాలను జారీ చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ​ ప్రపంచ ఛాంపియన్లతో పోటీకి ధోని గ్యాంగ్ రెడీ! వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను ఏకపక్షంగా ముగించిన భారత క్రికెట్ జట్టుకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. టీ20 సిరీస్‌లో విండీస్ జట్టు నుంచి TNN | Updated: Aug 27, 2016, 12:28AM IST వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను ఏకపక్షంగా ముగించిన భారత క్రికెట్ జట్టుకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. టీ20 సిరీస్‌లో విండీస్ జట్టు నుంచి ధోనీ సేన తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొననుంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన విండీస్ జట్టుతో తొలి టీ20 మ్యాచ్ శనివారం ఫ్లోరిడాలో జరగనుంది. అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా భారత్, విండీస్ మధ్య రెండు టీ20ల సిరీస్‌ను ఆ దేశంలో నిర్వహిస్తున్నారు. టీ20 సిరీస్ కోసం భారత్ జట్టులోకి కొత్తగా కెప్టెన్ ధోనీ, బౌలర్ బుమ్రా రానున్నారు. టెస్టు క్రికెట్ ఆడిన మిగతా అందరూ జట్టుతోనే కొనసాగనున్నారు. వెస్టిండీస్ విషయానికి వస్తే క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, జాన్సన్ ఛార్లెస్‌లు జట్టులోకి రానున్నారు. ఈ ఏడాది ముగిసిన కరేబియన్ క్రికెట్ లీగ్‌లో గేల్, ఛార్లెస్‌లు 400 కంటే ఎక్కువ పరుగులు చేసి సత్తా చాటారు. మరోవైపు భారత బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు కూడా పటిష్టంగా ఉన్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరి తప్పనిసరి కానుంది. విండీస్ జట్టుకు కార్లొస్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.
2sports
internet vaartha 158 Views న్యూఢిల్లీ : పానసోనిక్‌ కంపెనీ ఎలూగా 12ను మరిన్ని ఫీచర్లతో విడుదల చేసింది. ఎలూగా స్మార్ట్‌ఫోన్లు 2జిబి, 3జిబి రామ్‌లతో కూడా ప్రస్తుతం అందుబాటులోనికి వచ్చాయి. ఐదు అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే, 16జిబి, 32జిబి వేరియంట్లు అందుబాటులోనికి వచ్చాయి. 8 ఎంపి వెనుక కెమే రా,5ఎంపి ముందు కెమేరాలున్నాయి. లెడ్‌ఫ్లాష్‌తో పాటు 4జివోల్టే టెక్నాలజి కనెక్టివిటీని ఏర్పాటు చేసింది. ఎలూగా ధరలు రూ. 7990 లు, రూ.8,990 లుగా ప్రకటించింది. 2000 ఎంఎహెచ్‌ బ్యాటరీతో పని చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్‌ షాపుల్లోను అందుబాటులోనికి వచ్చిందని బిజినెస్‌ హెడ్‌ పంకజ్‌ రాణా వివరించారు. డ్యూయల్‌సిమ్‌ టెక్నాలజీలో 4జి/3జి, ప్లస్‌ టుజి కూడా అందు బాటులో ఉంటుంది. ఇతర అన్ని స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లను జోడించినట్లు రాణా వివరించారు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV వన్డేల్లో నాటౌట్‌గా ధోనీ ‘నెం.1’ రికార్డు..! భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. TNN | Updated: Aug 31, 2017, 07:59PM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. కెరీర్‌లో 300వ వన్డే ఆడుతున్న ధోనీ అత్యధికంగా 73 సార్లు క్రీజులో అజేయంగా నిలిచాడు. కొలంబో వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో 42 బంతుల్లో ధోనీ 5x4, 1x6 సాయంతో 49 పరుగులు చేసి చివరి వరకూ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇప్పటి వరకు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా), చమిందా వాస్ పేరిట ఉన్న 72 సార్లు నాటౌట్ రికార్డును ధోనీ బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. 2004లో కెరీర్ ఆరంభించిన ధోనీ.. మొదట్లో నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. క్రమంగా హిట్టర్ లేని లోటు తీర్చేందుకు ఆరోస్థానానికి మారిపోయాడు. ఈ క్రమంలోనే చివరి వరకూ క్రీజులో ఉంటూ ఎన్నో మ్యాచ్‌ల్ని విజయాలుగా ముగించి ప్రపంచంలోనే బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా కీర్తిగడించాడు. మ్యాచ్ ఉత్కంఠలో ఉన్నా.. ఆఖరి ఓవర్లలో భీకర హిట్టింగ్‌తో లక్ష్యాల్ని ఛేదించడం ధోనీ స్టైల్. అందుకే అతను క్రీజులో ఉంటే భారత్ విజయం పక్కా అనేంతలా ముద్రపడిపోయింది.
2sports
Suresh 96 Views athlets usen bolt లండన్‌: ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ లండన్‌లో శుక్రవారం నుండి జరగబోతుంది. వాటిలో పాల్గొనడానికి వచ్చిన ప్రపంచ అథ్లెట్‌, జమైకా చిరుత ఉసేన్‌బోల్ట్‌ డోపింగ్‌కు పాల్పడిన వారిపై విరుచుకుపడ్డారు. డోపింగ్‌కు పాల్పడితే వారి జీవితాన్ని వారే చేజేతులా నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇంతకంటే నీచమేన పని మరొకటి లేదుఅని, డోపింగ్‌ను నిరోధిస్తే, క్రీడలకు మేలు చేసినవారమవుతాము అని, ఈ విషయాన్ని అథ్లెట్లు అర్ధం చేసుకోవాలని ఆయన విన్నవించాడు. ఈ ఛాంపియన్‌ షిప్‌ తర్వాత ఆయన తన కెరీర్‌కు స్వస్థి చెప్పనున్నారు.
2sports
Vaani Pushpa 171 Views Staff , thomson airways thomson staff న్యూఢిల్లీ: యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ట్రావెల్‌ దిగ్గజం థామస్‌కుక్‌ పిఎల్‌సి కుప్పకూలింది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సంస్థ అదనపు నిధుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో గత వారం దివాలాకు సంబంధించి చాప్టర్‌ 15 ప్రొసిడింగ్స్‌ను పైల్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం యూకేలోని అత్యుత్తమ బ్రాండ్లలో ఒకటైన ఈ సంస్థ దివాలా తీయడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కంపెనీకి సంబంధించిన దివాలా పిటిషన్‌ లండర్‌ హైకోర్టులో విచారణకు రానుంది. చివరి వరకు వచ్చిన డీల్‌కు అదనంగా మరికొంత కోరడంతో చర్చలు ఫలప్రదం కాలేదు అని కంపెనీ సిఇఒ పీటర్‌ ఫాంక్‌ హాసర్‌ వెల్లడించారు. 178 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థ దివాలా ప్రకటించడంతో వేలాది మంది ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చివరి నిమిషంలో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో థామస్‌ కుక్‌ దివాలా తీసింది. ప్రపంచవ్యాప్తంగా థామస్‌కుక్‌ తన విమాన సేవలను నిలిపివేసినట్లుగా బ్రిటిష్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ప్రకటించింది. థామస్‌కుక్‌కు చెందిన విమాన, హాలిడే బుకింగ్స్‌లను రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
UPPAL Stadium ఉప్పల్‌ వేదికగా బంగ్లాదేశ్‌ టెస్టు న్యూఢిల్లీ: బంగ్లా టెస్టుకు ఉప్పల్‌ మైదానం వేదిక కానుంది. ఫిబ్రవరి 13న మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వలేమంటూ హైదారాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సిఎ) బిసిసిఐకి లేఖ రాసినట్లు వచ్చిన వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇవన్నీపుకార్లేనని వాటిలో ఏ మాత్రం నిజం లేదని హెచ్‌సిఎ కార్యదర్శి జాన్‌ మనోజ్‌ పేర్కొన్నారు. షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌ ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశాడు. టెస్టు నిర్వహణకు హెచ్‌సిఎ ఎప్పుడు వెనుకడుగు వేయలేదన్నారు. నిధుల కొరత గురించి ఆయన మాట్లాడాడు. ప్రతి సంఘానికి సుప్రీం కోర్టు అనుమతి తప్పనిసరి. న్యాయ స్థానం ఆమోదం మేరకు నిధుల కేటాయింపులు ఉంటాయి. నిధుల కొరతతో ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్‌ అయినా నిలిచి పోయిందా? మ్యాచ్‌ నిర్వహణకు అవసరమైన నిధులు స్టేడియం హక్కుల కింద సేకరించాం అని పేర్కొన్నాడు. బంగ్లదేశ్‌ ముందుకు వచ్చినందున మూడు రోజలు వార్మప్‌ మ్యాచ్‌ ఆడేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నాడు. ఇందుకు తమ వద్ద నిధులున్నాయని వెల్లడించాడు. సుప్రీం ఆదేశాల ప్రకారం అర్హత కోల్పోయిన కొందరు బిసిసిఐ పెద్దలు ఇలాంటి నిరాధార పుకార్లు వ్యాపింపజేస్తున్నారని మనోజ్‌ పేర్కొన్నాడు.
2sports
internet vaartha 127 Views భారీ కంపెనీలన్నింటిలోను షేర్ల పతనమే ముంబై : జపాన్‌ మార్కెట్లలో నెలకొన్న క్షీణత దేశీయ మార్కెట్లపై చూపించింది. జపాన్‌ నిక్కీ మూడేళ్ల కనిష్టస్థాయికి దిగజారింది. యెన్‌ మారకం విలువలు పటిష్టంకావడం ఎగుమతి దారుల రాబడులను దెబ్బతీయడం వంటి అంశాలు ఆసియాలోని అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌ మార్కెట్లపై కూడా చూపించింది. వీటికితోడు కాగ్ని జెంట్‌ నీరసించిన లాభాలు ఐటిరంగాన్ని ప్రభావి తం చేసాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 266 పాయింట్లు క్షీణించి 24,021 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50 89పాయింట్లు క్షీణించి 7298 పాయింట్లవద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.2నుంచి 2శాతం చొప్పున దిగజారాయి.అంతర్జాతీయ మార్కెట్లలోని పతనం భారత్‌ మార్కె ట్లపై చూపింది. ముడిచమురుధరలు కూడా మరికొంత ప్రభావంచూపించినట్లు సామ్‌కో సెక్యూరిటీస్‌ సిఇఒ జిమీత్‌ మోడి వెల్లడించారు. ఐటిరంగ షేర్లు కూడా ఎక్కు వ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నాస్‌ డాక్‌లో జరిగిన ఎక్కువ అమ్మకాలే ఇందుకు కీలకం. టెక్నాలజీ సూచి 52వారాల కనిష్ట స్థాయికి చేరింది. ఈ అంశాలన్నీ దేశీయంగా 86 పాయింట్లు దిగజారిచేసేందుకు దోహదం చేసాయి. ముందురోజే దేశ ఆర్థికవృద్ధి 7.3శాతంగా ఉంటుం దని, అంతకుముందు త్రైమాసికాలతో పోలిస్తే మరికొంత సవరించిన అంచనాలను కేంద్రంప్రకటిం చడం కీలక రంగ షేర్లను ప్రభావితం చేసింది. జపాన్‌ బెంచ్‌మార్క్‌ సూచి నిక్కీ మూడేళ్ల కనిష్ట స్థాయిని నమోదుచేసింది. ఎక్కువ బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల వత్తిడికి లోనయ్యాయి. నిక్కీ 5.4శాతం దిగువన 16,085.44 పాయింట్లవద్ద ముగిసింది. జనవరి 21నాటి కనిష్టస్థాయిలో ఉంది. యూరోపియన్‌ ఈక్విటీ మార్కెట్లు కూడా ఇటీవలి నష్టాలనే కొనసాగించాయి. జపా న్‌ స్టాక్స్‌క్షీణత ప్రభావం కొంత ఉంది. ఫ్రాన్స్‌ సిఎసి, లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ, జర్మనీ డాక్స్‌ వంటివి 0.1 నుంచి 5శాతం క్షీణిం చాయి. ఐటి కంపెనీల షేర్లు నాలుగుశాతం వరకూ దెబ్బతిన్నాయి. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ప్రభావమే ఎక్కువ ఉంది. టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌వమీంద్ర, మైండ్‌ట్రీ వంటివి నాలుగుశాతం వరకూ క్షీణించాయి. ఇక మార్కెట్లలో కీలకంగా మారుతిసుజుకి రెండుశాతం దిగజారింది. ఉత్పత్తి 4.6శాతం దెబ్బతినడమే ఇందుకుకీలకం. లూపిన్‌ కంపనీ 4.5 శాతం ఎక్కువ ట్రేడింగ్‌ జరిగింది. కంపెనీ నికర లాభం 601 కోట్లుకు చేరడమే ఇందుకు కీలకం. సన్‌ఫార్మా రెండుశాతం, డా.రెడ్డీస్‌ 3శాతం, దిగువన ముగిసాయి. డా.రెడ్డీస్‌ ఆర్థిక ఫలితాలు మంగళవారం ప్రకటించింది. గెయిల్‌ రెండుశాతం లాభపడింది. నికర లాభం 664 కోట్లుగా ప్రకటించింది. భారత్‌ ఫోర్జ్‌ నిలకడగా ముగిసింది. డిసెంబరు త్రైమాసికంలో 15శాతం నికరలాభం క్షీణించడం ఒక కారణం అని చెప్పాలి. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నిఫ్టీలో భారీగా పతనం అయింది. ఏడుశాతం క్షీణించింది. నికరలాభం 93శాతం క్షీణించి 51కోట్లుగా రావడమే ఇందుకు కీలకం. ఏడాదిక్రితం 774కోట్లుఉన్న బ్యాంకు లాభాలు భారీ గా దెబ్బతిన్నాయి. ఎన్‌పిఎలు పెరగడమే ఇందుకు కీలకం. ఇక మదర్‌సన్‌షుమి 11శాతం దెబ్బతిన్నది. నికరలాభం 21శాతం పెరిగి 307 కోట్లకు చేరినా షేర్లు క్షీణించాయి. ఇతరత్రా చూస్తే సెన్సెక్స్‌లో కోల్‌ ఇండియా, టాటామోటార్స్‌, ఎస్‌బిఐ, సిప్లా వంటివి రెండునుంచి ఐదుశాతం క్షీణించాయి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆడిషన్‌కి వెళ్తే రేప్‌ సీన్‌ చేయాలన్నారు: నటి ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టారు బాలీవుడ్ నటి మాన్వి గగ్రూ. ఓ ఆఫీస్‌కు రమ్మని చెప్పి రేప్ సీన్‌లో నటించాలని చెప్పారట. Samayam Telugu | Updated: Nov 14, 2019, 11:18AM IST మాన్వి గగ్రూ స్టార్ కిడ్స్‌కి అవకాశాలు అడగకుండానే వచ్చేస్తాయి. కానీ ఎన్నో ఆశలతో బయటి నుంచి ఇండస్ట్రీకి వచ్చేవారికి ఎదురయ్యే అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. లక్ ఉంటే ఆడిషన్స్‌లో పాల్గొని సినిమాలకు సెలెక్ట్ అయిపోతారు. లేకపోతే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. బాలీవుడ్ నటి మాన్వి గగ్రూకు కెరీర్‌ తొలినాళ్లలో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందట. ఈ విషయాన్ని ఆమె మీడియా ద్వారా వెల్లడించారు. సినిమాల్లో ప్రయత్నించాలని అనుకున్న మాన్వి ఓసారి ఆడిషన్స్ కోసం ముంబయి వెళ్లారట. ఆ సమయంలో క్యాస్టింగ్ డైరెక్టర్ ఒకరు మాన్విని ఆఫీస్‌లోనే రేప్ సీన్‌లో నటించి చూపించాలని డిమాండ్ చేశాడట. దాంతో భయపడిన మాన్వి ఆఫీస్‌ నుంచి పరుగులు తీశారట. READ ALSO: మద్యం సీసాలు కూడా చూపించరా?: హీరో ఆగ్రహం ‘నాకు ఇప్పటికీ గుర్తు. ఓసారి ఆడిషన్‌కి వెళ్తే రేప్ సీన్‌లో నటించాలని చెప్పారు. ఆ రూంలో కేవలం ఇద్దరు మగాళ్లు ఉన్నారు. వారి ముందు నన్ను రేప్ సీన్‌లో నటించమన్నారు. ఆ గదే వారి ఆఫీసట. అందులో ఓ బెడ్ కూడా ఉంది. భయంతో బయటికి పరుగులు తీశాను. మళ్లీ వారు పిలిచినా కూడా వెళ్లలేదు. వారు చెప్పినట్లు నేను రేప్ సీన్‌లో నటించి ఉంటే నా పరిస్థితేంటో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఆడిషన్ పేరిట వారు నన్ను ఏదైనా చేసి ఉండొచ్చు’ అని వెల్లడించారు. కానీ లక్కీగా మాన్వి ట్యాలెంట్‌ను గుర్తించి ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆమె ‘ట్రిప్లింగ్ 3’, ‘ఫోర్ మోర్ షాట్స్’, ‘ఉజ్బా చమన్’ సినిమాల్లో నటించారు. ఈ మూడిట్లో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ‘2019 నాకు ఎన్నో మంచి అనుభవాలను ఇచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాల్లో నటించడం వల్ల నేను ఎన్నో విదేశాలకు వెళ్లగలుగుతున్నాను. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే నా సొంత డబ్బులతో ఇన్ని ప్రాంతాలకు తిరిగేదాన్ని కాదు’ అని వెల్లడించింది మాన్వి.
0business
హోమ్ క్రీడలు తొలి టీ-20 మ్యాచ్ లో భారత్ గెలుపు తొలి టీ-20 మ్యాచ్ లో భారత్ గెలుపు August 03, 2019,   11:54 PM IST Share on: విండీస్ గడ్డపై జరిగిన తొలి టీ20లో భారత్ 4వికెట్ల తేడాతో గెలిచి శుభారంభాన్ని నమోదు చేసింది. ఫ్లోరిడా గడ్డపై జరిగిన మ్యాచ్ లో భారత్ అంత సులువుగా గెలవలేకపోయింది. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ చేధన చాలా క్లిష్టంగా మారింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 96 పరుగుల టార్గెట్ నిర్దేశించడంతో చేధన సులువేననిపించింది. భారత్ బ్యాట్స్ మెన్ అంతగా రాణించకపోయినప్పటికీ సమష్టి ప్రదర్శనతో గట్టెక్కగలిగింది. రోహిత్ శర్మ(24)కు తోడుగా కోహ్లీ(19)పరుగులు చేయడంతో ఆరంభంలో నిలదొక్కుకోగలిగింది. రోహిత్ తో పాటుగా దిగిన మరో ఓపెనర్ ధావన్(1)పరుగుతో సరిపెట్టుకున్నాడు. రిషబ్ పంత్(0) డకౌట్ అయినప్పటికీ మనీశ్ పాండే(19), కృనాల్ పాండ్యా(12)లు చేయగా రవీంద్ర జడేజా(10), వాషింగ్టన్ సుందర్(8)చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, నరైన్, పాల్ తలో 2వికెట్లు తీయగలిగారు. విండీస్ బ్యాట్స్ మన్ లో కీరన్ పొలార్డ్(49)పరుగులతో జట్టును ముందుకునడిపాడు.  సంబంధిత వార్తలు
2sports
మాస్ మహారాజా ర‌వితేజ `రాజా ది గ్రేట్` లోగో విడుద‌ల Highlights మాస్ మహారాజా ర‌వితేజ `రాజా ది గ్రేట్` లోగో మాస్ మ‌హారాజా ర‌వితేజ...ఇడియ‌ట్ నుండి బెంగాల్ టైగ‌ర్ వ‌ర‌కు త‌న‌కే సొంత‌మైన‌ డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో ఆడియెన్స్‌లో త‌న‌దైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో. మాస్ కు స‌రికొత్త అర్థం చెప్పిన ఈ హీరోను కుర్ర‌కారు ముద్దుగా మాస్ మ‌హారాజా ర‌వితేజ అని పిలుచుకుంటారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న కొత్త చిత్రం `రాజా ది గ్రేట్`. `వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌` క్యాప్ష‌న్‌. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ అంటేనే నాటి దిల్ నుండి నేటి శ‌త‌మానం భ‌వ‌తి వ‌ర‌కు ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న నిర్మాణ సంస్థగా ప్రేక్ష‌కుల్లో మంచి పేరుంది.     ఇటువంటి స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ప‌టాస్‌, సుప్రీమ్ వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా `రాజా ది గ్రేట్` సినిమా రూపొందుతుంది. ఈ సినిమా లోగో పోస్ట‌ర్‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ పుట్టిన రోజు జ‌న‌వ‌రి 26  రిప‌బ్లిక్‌ డే సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ఫేమ్ మెహ‌రిన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.    ఈ సంద‌ర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ - ``ముందు ర‌వితేజ‌కు హ్య‌పీ బ‌ర్త్‌డే. గ‌తంలో నేను, రవితేజ క‌లిసి చేసిన భ‌ద్ర సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అందిరికీ తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి మా కాంబినేష‌న్‌లో `రాజా ది గ్రేట్‌` సినిమా తెర‌కెక్క‌నుంది. తొలి చిత్రం ప‌టాస్‌తో సూప‌ర్‌హిట్ సాధించి, మా బ్యాన‌ర్‌లో సుప్రీమ్ వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాన్ని అందించిన అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. హీరోల‌ను స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేసే అనిల్ ఈ సినిమాలో మన మాస్ మ‌హారాజా ర‌వితేజను కొత్త‌గా చూపించ‌బోతున్నాడు.    ఈ సినిమా లోగో పోస్ట‌ర్‌ను ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసేలా ఉండ‌ట‌మే కాదు మా బ్యాన‌ర్‌లో మ‌రో స‌క్సెస్‌ఫుల్ మూవీ అవుతుంది. త్వ‌ర‌లోనే ఇత‌ర నటీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం`` అన్నారు. Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
Hyderabad, First Published 11, Oct 2018, 4:12 PM IST Highlights వెస్టిండీస్‌ హోరాహోరీగా పోటీనిస్తున్న జట్టేమీ కాదు. కనీసం ఐదు రోజులు ఆడేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి టీమిండియాను బరిలోకి దింపాల్సిన అవసరం ఏముందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ వేదికగా భారత్-విండీస్ ల మధ్య జరగనున్న రెండో టెస్టుకి జట్టుని ఎంపిక చేశారు. ఈ జట్టులో విహారి, మయాంక్, మహ్మద్ సిరాజ్ లకు చోటు దక్కలేదు. మయాంక్‌ రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. పరుగుల వరద పారించాడు. సెలక్టర్లు ఎన్నిసార్లు తనను నిరాశ పరిచినా అద్భుత ప్రదర్శనతో మళ్లీ మళ్లీ తననెందుకు ఎంపిక చేయరని ప్రశ్నించాడు. సిరాజ్‌ సైతం భారత్‌-ఏ తరఫున అద్భుతాలు సృష్టించాడు. ఇక హనుమ విహారి ప్రతిభేంటో అందరికీ తెలిసిందే. వెస్టిండీస్‌ హోరాహోరీగా పోటీనిస్తున్న జట్టేమీ కాదు. కనీసం ఐదు రోజులు ఆడేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి టీమిండియాను బరిలోకి దింపాల్సిన అవసరం ఏముందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ‘కొత్తవారికి తగినన్ని అవకాశాలు ఇవ్వొచ్చు కదా’ అని అంటున్నారు.  దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి పెద్ద జట్లపై పూర్తిస్థాయి జట్టును బరిలోకి దించాలి. అప్పుడు సీనియర్లను పక్కనపెట్టే అవకాశం ఉండదు. నిజానికి మహ్మద్‌ షమి తొలి టెస్టులో కాస్త ఇబ్బంది పడ్డాడు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు కనిపించడం లేదు. అతడి స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేస్తే బాగుండేదని ట్విటర్‌లో ప్రశ్నల వర్షం కురుస్తోంది.  ఇక మయాంక్‌ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. విండీస్‌పైనే అవకాశం ఇవ్వకపోతే కఠిన జట్టుపై అరంగేట్రం చేయించగలరా వీరు? అని ప్రశ్నిస్తున్నారు. మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం టీమిండియా ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. read more news
2sports
బాత్ టబ్ లో తెలుగమ్మాయి బోల్డ్ ఫోటోలు! First Published 7, May 2019, 12:44 PM IST సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ మొదలుపెట్టిన తేజస్వి మదివాడ ఆ తరువాత హీరోయిన్ గా నిలబడాలని ట్రై చేసింది కానీ వర్కవుట్ కాలేదు.  (Photo Courtesy: Instagram) సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ మొదలుపెట్టిన తేజస్వి మదివాడ ఆ తరువాత హీరోయిన్ గా నిలబడాలని ట్రై చేసింది కానీ వర్కవుట్ కాలేదు. (Photo Courtesy: Instagram) కెరీర్ పూర్తిగా స్లో అయిపోతుందనుకున్న సమయంలో బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని మళ్లీ వార్తల్లోకెక్కింది. (Photo Courtesy: Instagram) అయితే ఆ షో ఈమెకి అవకాశాలను తీసుకురాలేకపోయింది. (Photo Courtesy: Instagram) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. (Photo Courtesy: Instagram) తాజాగా బాత్ టబ్ లో తీసుకున్న ఫోటోలు పోస్ట్ చేసింది. (Photo Courtesy: Instagram) మోకాళ్ళపై కూర్చొని ఎడమ చేతిని వెనక్కు పెట్టి పర్ఫెక్ట్ షేప్ లో ఉన్న వీపు భాగాన్ని ప్రదర్శించింది. (Photo Courtesy: Instagram) ఆ ఫోటోకి.. ''బ్యాక్ వర్క్ అవుట్ పని చేస్తోంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.. నో ఫిల్టర్.. నో ఎడిటింగ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Photo Courtesy: Instagram) మొత్తానికి తెలుగమ్మాయి అయినప్పటికీ అందాల ప్రదర్శనలో తనకు ఎలాంటి మొహమాటం లేదని నిరూపిస్తుంది. Recent Stories
0business
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
హోమ్ క్రీడలు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన సింధు August 26, 2019,   10:08 AM IST Share on: భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పివి సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ 2019 మహిళల సింగిల్స్‌ ఫైనల్లో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై సింధు అద్భుత ఆటతో 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు నిలిచింది. 2017, 2018 ఫైనల్లో ఓటమిపాలైన సింధు, తాజాగా జరిగిన ఫైనల్లో ప్రత్యర్థికి చెమటలు పట్టించి ఛాంపియన్‌గా తన కలను నెరవేర్చుకుంది.తొలి రౌండ్‌ను కేవలం 16 నిమిషాల్లోనే ముగించిన సింధు… రెండో రెండో రౌండ్‌లోనూ అదరగొట్టింది. మొత్తంగా 38 నిమిషాల్లో ఈ గేమ్‌ను ముగించి టైటిల్ ను సొంతం చేసుకుంది. రూ.20 లక్షల రివార్డ్ ప్రకటించిన బాయ్‌… టోర్నీలో పతకాలు సాధించిన సింధు, సాయిప్రణీత్‌కు భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌) నజరానా ప్రకటించింది. గోల్డ్ మెడల్ కొల్లగొట్టిన సింధుకు రూ.20 లక్షల రివార్డ్, సాయిప్రణీత్‌కు రూ.5 లక్షల రివార్డ్‌ ప్రకటించింది. కర్ణాటక సిఎం యడియూరప్ప, సింధుకు రూ.5లక్షల బహుమానం ప్రకటించారు.  ప్రముఖుల అభినందన పరంపర ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణం గెలిచిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం సింధుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ గవర్నర్ నరసింహన్, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, స్వీకర్ పోచారం, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, తదితరులు అభినందనలు తెలియజేశారు. సంబంధిత వార్తలు
2sports
వారంలో తేలనున్న ల్యాంకో భవితవ్యం -  ఆస్తుల లిక్విడేషన్‌పై ఎన్‌సీిఎల్‌టీి తుది తీర్పు..! -  కొనుగోలుకు పవర్‌ మేక్‌ ఆసక్తి..! హైదరాబాద్‌ : వేల కోట్ల అప్పుల్లో చిక్కుకున్న ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ దివాలా ప్రక్రియ తుది తీర్పును నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆగస్టు 27న వెల్లడించే అవకాశం ఉంది. ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు తమిళనాడు కేంద్రంగా పని చేస్తోన్న త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ చేసిన ప్రతిపాదనకు ల్యాంకోకు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ అంగీకరించలేదు. ఆగస్టు 23న మరోమారు హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీలో ల్యాంకో లిక్విడేషన్‌పై చర్చించనుందని తెలుస్తోంది. ఈ కంపెనీ స్వాధీనానికి తాజాగా పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్సు లిమిటెడ్‌ ఆసక్తిగా ఉంది. ఆగస్టు 27న ఇరు పార్టీల వాదోపవాదనలను బెంచ్‌ విననుంది. అనంతరం దీనిపై తుది తీర్పు రానుంది. వాస్తవానికి త్రివేనీ ప్రతిపాదనను రుణదాతల కమిటీ (సీఓసీ) తిరస్కరణ తర్వాత మరో సారి అవకాశం ఉండదని సమాచారం. త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ రెండు సార్లు ప్రతిపాదించిన ప్రణాళికను సీఓసీ ఆమోదించలేదు. ట్రిబ్యునల్‌ ఎందుకు ఈ ప్రతిపాదన ప్రణాళికలను విభేదించిందో తెలుపాలంటూ ల్యాంకో, ఎంప్లాయిస్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ల్యాంకో రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో కోరింది. వచ్చే దఫా స్పష్టత రాకపోతే ల్యాంకోను మూసివేసి, మిగిలిన ఆస్తుల విక్రయానికి (లిక్విడేషన్‌) అవసరమైన దరఖాస్తును ఎన్‌సిఎల్‌టిలో దాఖలు చేయనున్నారు. రూ.45వేల కోట్ల బకాయిలు.. ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ 2017 ఆగస్టులో ల్యాంకో బోర్డు అధికారాలను రద్దు చేసి, దివాలా ప్రక్రియకు సావన్‌ గోదియావాలాను నిపుణుడిగా నియమించింది. ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన 270 రోజుల గడువు మే4తోనే ముగిసింది. దీంతో లిక్విడేషన్‌ లేదా ఇతర పరిష్కారానికి నిపుణుడు ఎన్‌సీఎల్‌టీ ఆశ్రయించనున్నట్టు ల్యాంకో ఇది వరకే ఎక్స్ఛేంజీలకు తెలిపింది. అప్పుల్లో మునిగిన 12 అతి పెద్ద కంపెనీల్లో ల్యాంకో ఒకటి. రూ.45,000 కోట్లు పలు బ్యాంకులకు బకాయి పడింది. వీటిలో ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.7,380 కోట్లు, ఐడీబీఐకి రూ.3,680 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి ఐడీబీఐ కన్సోరియంగా వ్యవహారిస్తోంది. ల్యాంకో లిక్విడేషన్‌ ప్రక్రియ మొదలై ఒక్కో ఆస్తినీ విక్రయించాల్సి వస్తే.. బ్యాంకులకు ఈ కంపెనీ బకాయి పడ్డ మొత్తంలో 25 శాతమే తిరిగి రావచ్చన్నది అంచనా. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV 125 కోట్ల‌తో హైటెక్స్ వ‌ద్ద అతిపెద్ద ఎగ్జిబిషన్‌ – కన్వెన్షన్‌సెంట‌ర్ దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో స్తంభాలు లేకుండా అతిపెద్ద ఎగ్జిబిషన్‌ – కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయను న్నారు. Samayam Telugu | Updated: May 11, 2018, 09:35AM IST హైటెక్స్ వ‌ద్ద అతిపెద్ద‌ ఎగ్జిబిషన్‌ – కన్వెన్షన్‌ సెంటర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో స్తంభాలు లేకుండా అతిపెద్ద ఎగ్జిబిషన్‌ – కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయను న్నారు. హైటెక్స్‌ ప్రాంగణంలో రూ.125 కోట్ల వ్యయంతో 8వేల మంది కూర్చునే సమావేశ మందిరం, ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను నిర్మించనున్నామని, ఈ ఏడాది డిసెం బర్‌లోగా దీన్ని పూర్తిచేస్తామని రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక టేశం వెల్ల‌డించారు. నగర శివారులోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో 8వ ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎగ్జిబిషన్స్‌ అండ్‌ ఈవెంట్స్‌ (ఐఏఈఈ) ఓపెన్‌ సెమినార్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. హైటెక్స్‌ సీవోవో కేవీ నాగేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, కొత్తగా నిర్మించే ఎగ్జి బిషన్‌ కం కన్వెన్సన్‌ సెంటర్‌ దేశ నిర్మాణ రంగంలోనే మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ కన్వెన్షన్‌ హాల్‌ అన్ని రకాల ఈవెంట్స్‌కు అనుకూలంగా ఉంటుందని, స్పోర్ట్స్‌ నిర్వహణకు కూడా ఇది అనువుగా ఉంటుందని ఆయన చెప్పారు. హైటె క్స్‌లో కూడా ఈ ఏడాది చివరి నాటికి మౌలిక సదుపాయాలు మరింత పెంచను న్నట్లు ఆయన చెప్పారు.
1entertainment
Visit Site Recommended byColombia ప్రస్తుతం చిరంజీవి వయసు 64 సంవత్సరాలు. నిజం చెప్పాలంటే ఈ వయసులో జిమ్‌కి వెళ్లి వర్కౌట్స్ చేయడాలు, కండలు పెంచడాలు చాలా కష్టం. కానీ, చిరంజీవి చేస్తున్నారు. సినిమాలో తాను చేసే పాత్ర కోసం బాడీలో మాడ్యులేషన్‌ను తీసుకురావడానికి కష్టపడుతున్నారు. అదీ చిరంజీవి డెడికేషన్. Also Read: చిరంజీవి, కొరటాల సినిమాకు ఆసక్తికర టైటిల్! ‘సైరా నరసింహారెడ్డి’తో హిట్టుకొట్టిన చిరంజీవి.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబరులో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ చిత్రంలో చిరంజీవి రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ఈ సినిమా కోసం సన్నద్ధమవుతోన్న చిరంజీవి తన శరీరాన్ని పాత్రకు తగ్గట్టుగా మలుచుకునే పనిలో ఉన్నారు. జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టారు. Also Read: ‘వెంకీ మామ’ టైటిల్ సాంగ్ లిరిక్స్.. రామ్‌జో సాహిత్యాన్ని మీరూ అందుకోండి! జిమ్‌లో చిరంజీవి డంబెల్స్ ఎత్తుతోన్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 64 ఏళ్ల వయసులోనూ వృత్తి ధర్మం కోసం జిమ్‌లో కష్టపడుతోన్న చిరంజీవిని చూసైనా నేటి యువత స్ఫూర్తి పొందాలి. తాము చేసే పనిపై గౌరవాన్ని పెంచుకోవాలి. మరోవైపు, చిరంజీవి జిమ్‌లో కష్టపడుతోన్న ఫొటో చూసి మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తన హీరో డెడికేషన్ చూసి మురిసిపోతున్నారు. కాగా, ఈ సినిమా శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇప్పటికే బయటికి వచ్చిన సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో నక్సలైట్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన ఒక నడివయస్కుడి పాత్రలో చిరంజీవి కనిపిస్తారట. ఇతను దేవాదాయ శాఖలో జరుగుతోన్న అక్రమాలపై గొంతెత్తుతాడని సమాచారం. అయితే, ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటించనుందని టాక్. గతంలో ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Nov 30,2016 80,000 కోట్ల మొండి బకాయిలు.. - కేవలం మూడు మాసాల్లోనే..ొ పీఎస్‌బీలకు రాని బాకీల దెబ్బ ొ ఇనుము,ఉక్కు రంగంలోనే అధికం: మంత్రి సంతోష్‌ కుమార్‌ వెల్లడి న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.80వేల కోట్ల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) పెరిగాయి. క్రితం సెప్టెంబర్‌ 30 నాటికి పీిఎస్‌బీల స్థూల ఎన్‌పీఏలు రూ.6,30,323 కోట్లకు ఎగిశాయి. జూన్‌ ముగింపు నాటికి ఈ పారు బకాయిలు 5,50,346 కోట్లుగా ఉన్నాయి. కాగా గత త్రైమాసికంలో 79,977 కోట్ల మొండి బాకీలు పెరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. మొండి బాకీల నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రధానంగా మౌలిక వసతులు, విద్యుత్‌, టెక్స్‌టైల్‌, స్టీల్‌ రంగాల నుంచి అత్యధికంగా మొండి బాకీల బెడద ఉందన్నారు. బ్యాంకులు, విత్త సంస్థల రికవరీ సామర్థ్యాన్ని పెంచడానికి బ్యాంకుల దివాల కోడ్‌ (ఐబీసీ) మరియు సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రికన్‌స్ట్రక్చన్‌ ఆఫ్‌ ఫైనాన్సీయల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇంటరెస్ట్‌ (సర్పేసీి)లో సవరణలు చేపడుతున్నామన్నారు. కార్పొరేట్‌ మొండి బాకీల పునరుద్దరణ కోసం ఆర్‌బీఐ సంయుక్త ఫోరమ్‌, స్ట్రటజిక్‌ డెట్‌ రికన్‌స్ట్రక్చరింగ్‌ స్కీమ్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. మరో ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ గత జూన్‌ ముగింపు నాటికి ఇనుము, స్టీల్‌ రంగాలకు రూ.2.80 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయబడ్డాయని తెలిపారు. ఇందులో 1.24 లక్షల కోట్లు లేదా 44.54 శాతం మొండి బాకీలుగా మారాయన్నారు. ఇప్పటి వరకు కార్పొరేట్‌ రుణాల మాఫీ ఏది జరగలేదన్నారు. ఆర్‌బీఐ విధివిధానాల ప్రకారమే మొండి బాకీలు రద్దు జరుగుతుందన్నారు. 2016 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.15,163 కోట్ల మొండి బాకీలను పలు బ్యాంకులు రద్దు చేశాయి. క్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తంగా రూ.59,547 కోట్లు రద్దు చేయగా, ప్రయివేటు విత్త సంస్థలు రూ.12,017 కోట్లను రద్దు చేశాయి. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) లిక్కర్‌ డాన్‌ విజయ మాల్యాకు చెందిన రూ.1200 కోట్లు రద్దు చేసిందని ఈ మధ్య కాలంలోనే వార్తలు వచ్చాయి. 63 మందికి చెందిన సుమారు రూ.7వేల కోట్ల పైగా రద్దు చేసిందని సమాచారం. ఇక 2013, 2015 ఆర్థిక సంవత్సరాల్లో 29 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 1.14 లక్షల కోట్లను రాని బాకీలుగా తేల్చి రద్దు చేశాయి. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఎస్‌బీఐకి రూ 40,084 కోట్ల మొండి బాకీలు గండి కొట్టాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
TIAGO లక్ష బుకింగ్స్‌ దాటిన టియాగో ముంబయి, జూలై 5: టాటాగ్రూప్‌ సంస్థల్లోని ఆటో మొబైల్‌ నుంచి కొత్తగా వస్తున్న టియాగోకు లక్ష బుకింగ్స్‌ పైగా వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. దేశీయ మార్కెట్లనుంచే ఎక్కువ స్పందన ఉందని వెల్లడించింది. కంపెనీ ప్యాసింజర్‌ వాహనాల విక్ర యాల్లో 23.5శాతం పెరిగాయి. అంతేకాకుండా కంపెనీ సనంద్‌ప్లాంట్‌ను సామర్ధ్యం పెంచుతోంది. 25,042 యూనిట్ల ఉత్పత్తి నుంచి 158శాతం వృద్ధిని పెంచింది. 64,780 వాహనాల ఉత్పత్తిని చేస్తున్నది. టియాగోహ్యాచ్‌బ్యాక్‌ 56,475 యూని ట్లు ఉత్పత్తిచేసినట్లు అంచనా. ఇప్పటికే సుమారు 65 వేల వరకూ కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి. మరో లక్షకుపైగా బుకింగ్స్‌ వచ్చినట్లు కంపెనీ వెల్ల డించింది. కొత్తగా ఎఎంటి వేరియంట్‌ను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్యాసింజర్‌సేల్స్‌ అధ్యక్షుడు మాయాంక్‌ పరీక్‌ మాట్లాడుతూ టియాగో ఉత్పత్తులు భారత్‌లో మరింతగా పెరు గుతాయని, అన్నింటికంటే మంచిమార్కెట్‌ సాధి స్తుందని చెపుతున్నారు. పుణె,యుకె, ఇటలీ డిజైన్‌ స్టూడియోలనుంచి వస్తున్న సమాచారం మేరకు టియాగో భారతీయ అభిరుచులకు అనుగుణంగా కొత్త డిజైన్‌చేసినట్లు వివరించారు. అబ్దుల్‌ మాజిద్‌ ప్రైస్‌వాటర్‌కూపర్స్‌్‌ప్రతినిధి మాట్లాడతూ టియాగో టాటామోటార్స్‌కు బ్రాండ్‌ఇమేజ్‌ మరింత పెంచు తుందన్నారు. టాటామోటార్స్‌ మొత్తం ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 66శాతంనుంచి 82 శాతా నికి పెరిగాయి. టియాగో మరింత వృద్ధిని సాధిం చింది. జూన్‌నెలలో టాటామోటార్స్‌ వాహనాలు 11,176 విక్రయిస్తే పదిశాతం తగ్గాయి. మేనెలలో 10,855 యూనిట్లు విక్రయించి గత ఏడాదితో పోలిస్తే 27శాతం వృద్ధిని సాధించింది. అలాగే ఏప్రిల్‌నెలలో కూడా గత ఏడాది కంటే 23శాతం వృద్ధితో 12,827 యూనిట్లను వృద్ధి చేసింది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV వృద్ధునిపై చేయి చేసుకున్న అంబటి రాయుడు భారత క్రికెటర్ అంబటి రాయుడు సహనం కోల్పోయాడు. ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోల్పోయిన ఈ మిడిలార్డర్ TNN | Updated: Aug 31, 2017, 07:12PM IST భారత క్రికెటర్ అంబటి రాయుడు సహనం కోల్పోయాడు. ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోల్పోయిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ త్వరలో జరగనున్న రంజీ మ్యాచ్‌ల కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో గత కొద్దిరోజులుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్న రాయుడు.. తాజాగా ఓ వృద్ధునిపై చేయి చేసుకుని వార్తల్లో నిలిచాడు. స్టేడియంలోకి వస్తూ.. అక్కడే వాకింగ్ కోసం వచ్చిన ఓ వృద్ధునికి సమీపంలో రాయుడు కారుని పోనిచ్చాడు. దీంతో భయాందోళనకి గురైన ఆ వృద్ధుడు.. రాయుడు తీరుని నిరసిస్తూ గట్టిగా ప్రశ్నించాడు. ఆ సమయంలో కారును స్వయంగా నడుపుతున్న రాయుడు వెంటనే దిగి అతనిపై చేయి చేసుకున్నాడు. అక్కడ ఉన్నవారు రాయుడికి సర్దిచెప్పి పంపించడంతో గొడవ సర్దుమణిగింది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు గతంలో కూడా హర్భజన్ సింగ్‌తో మైదానంలోనే గొడవపడిన విషయం తెలిసిందే.
2sports
తెలుగులో జాకీ చాన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'కుంగ్‌ ఫూ యోగ' Highlights కల్పన చిత్ర పతాకంపై  తెలుగులో జాకీ చాన్‌ మూవీ నటీనటులు సోనూ సూద్‌, దిశా పటాని, అమైరా దస్తూర్‌ ఫిబ్రవరి 3న ఈ చిత్రం తెలుగులో విడుదల   కల్పన చిత్ర పతాకంపై మంచి విజయవంతమైన చిత్రాలను అందించిన శ్రీమతి కోనేరు కల్పన హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో జాకీ చాన్‌ లేటెస్ట్‌ మూవీ 'కుంగ్‌ ఫూ యోగ' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రంలో సోనూసూద్‌, దిశ పటాని, అమైరా దస్తూర్‌ కూడా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న తెలుగులో విడుదల చేస్తున్నారు.  ఈ సందర్భంగా కల్పన చిత్ర అధినేత్రి కోనేరు కల్పన మాట్లాడుతూ - ''జాకీ చాన్‌ సినిమాలను అందరూ ఇష్టపడతారు. గతంలో వచ్చిన జాకీచాన్‌ చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'కుంగ్‌ ఫూ యోగ' చిత్రంతో మరోసారి అందర్నీ ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి వస్తున్నారు జాకీ చాన్‌. ఈ చిత్రానికి స్టాన్‌లీ టాంగ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్‌ నటీనటులు సోనూ సూద్‌, దిశా పటాని, అమైరా దస్తూర్‌ ముఖ్యపాత్రలు పోషించడం విశేషం. గతంలో జాకీ చాన్‌, స్టాన్‌లీ టాంగ్‌ కాంబినేషన్‌లో రూపొందిన రంబుల్‌ ఇన్‌ ది బ్రాంక్స్‌, ది మిత్‌, చైనీస్‌ జోడియాక్‌ వంటి చిత్రాలు కలెక్షన్‌ పరంగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించాయి. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న 'కుంగ్‌ ఫూ యోగ' చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి. జాకీ చాన్‌ మార్క్‌ యాక్షన్‌ కామెడీయే కాకుండా ఈ చిత్రంలో ఎన్నో ఫ్రెష్‌ ఎలిమెంట్స్‌ వున్నాయి. జాకీ చాన్‌, ఆరిఫ్‌ లీ, లే జాంగ్‌ పాల్గొన్న కార్‌ ఛేజ్‌ సినిమాకి పెద్ద హైలైట్‌ కాబోతోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రం రూపొందింది. ముఖ్యంగా రకరకాల జంతువులు పిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం. మా కల్పన చిత్ర బేనర్‌లో ఈ చిత్రం మరో సూపర్‌హిట్‌ చిత్రమవుతుంది'' అన్నారు Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0business
బాలీవుడ్ లోకి క్రికెటర్ షమీ భార్య.. హాట్ లుక్ తో ఫోటోషూట్ Highlights ఐపీఎల్‌ చీర్‌ గర్ల్‌ అయిన ఈ మాజీ మోడల్‌.. అంజాద్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఫత్వా’ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్నారు.  టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఐపీఎల్‌ చీర్‌ గర్ల్‌ అయిన ఈ మాజీ మోడల్‌.. అంజాద్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఫత్వా’ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఈ మూవీ అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ‘ నా కూతురిని పోషించడానికి కొంత సంపాదించాలనే ఉద్దేశంతో  సినిమాల్లో నటించాలనుకున్నాను. నాకు వేరే అవకాశం లేదు. దీంతోనే డైరెక్టర్‌ అంజాద్‌ ఖాన్‌ కలిసి సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇక న్యాయంగా షమీ నుంచి రావాల్సిన భరణం గురించి పోరాడుతాను’అని జహాన్‌ మీడియాకు తెలిపారు. ఈ చిత్రం కోసం ఫొటో షూట్‌ నిర్వహించగా.. ఆ ఫొటోలను ఈ మాజీ మోడల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.    — Hasin Jahan (@HasinJahan4) July 7, 2018 తన భర్త, క్రికెటర్ షమీ.. తనను హింసించాడంటూ గతంలో హసీన్ పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు షమీపై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకి ఎక్కిన హసీన్.. తాజాగా సినిమాలు చేస్తున్నానంటూ ప్రకటించి వార్తల్లో నిలిచారు. Last Updated 10, Jul 2018, 3:31 PM IST
2sports
Hyderabad, First Published 6, Sep 2019, 9:34 PM IST Highlights విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మరచిపోలేరు. మొదటి నుంచి చివరి వరకు వినోదాన్ని అందించే క్లాసిక్ గా ఆ చిత్రం నిలిచిపోతుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2001లో విడుదలైంది. నేటికి ఆ చిత్రం విడుదలైన 18 ఏళ్ళు పూర్తవుతోంది.  కడుపుబ్బా నవ్వించే కామెడీ.. వెంకీ, ఆర్తి అగర్వాల్ మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ.. ప్రకాష్ రాజ్ అద్భుత నటన, వినసొంపైన సంగీత ఇలా అన్ని అంశాలతో నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ఎవర్గ్రీన్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై 18 ఏళ్ళు పూర్తయ్యాయి.  నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్. ప్రకాష్ రాజ్ డైనింగ్ టేబుల్ వద్ద చదివే కవిత, వెంకటేష్ దేవుడా ఓ మంచి దేవుడా అంటూ చేసే పూజకు ప్రతి ఒక్కరి పొట్ట చెక్కలు కావాల్సిందే. త్రివిక్రమ్ రాసిన అద్భుతమైన కామెడీ డైలాగ్స్ ని వెంకటేష్ తన టైమింగ్ తో అంతే అద్భుతంగా పండించారు.  కేవలం కామెడీ మాత్రమే కాదు కుటుంబ బంధాలు, వాటి విలువలు, ప్రేమ గొప్పతనం గురించి ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ తో పాటు ఈ చిత్రంలో నటి సుధ, హేమ , ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, సుహాసిని నటించారు.  Last Updated 6, Sep 2019, 9:34 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ‘ఏ మంత్రం వేసావె’ టాక్: సబ్జెక్ట్ ఉంది కానీ..! ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా సూపర్ హిట్ తరవాత విజయ్‌కు అవకాశాలు బాగా పెరిగిపోయాయి. TNN | Updated: Mar 9, 2018, 09:40AM IST ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా సూపర్ హిట్ తరవాత విజయ్‌కు అవకాశాలు బాగా పెరిగిపోయాయి. వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. విజయ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు కొత్త కథల కోసం అన్వేషిస్తున్నారు. దర్శకులు స్క్రిప్టులతో విజయ్ ముందు వాలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘అర్జున్‌రెడ్డి’ సినిమా కంటే ముందు విజయ్ నటించిన ఓ చిత్రం బయటికి వచ్చింది. అదే ‘ఏ మంత్రం వేసావె’. ఐదేళ్ల క్రితం తీసిన సినిమా అది. శ్రీధర్ మర్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేడు (మార్చి 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి ‘ఏ మంత్రం వేసావె’ ట్రైలర్ చూసినప్పుడే విజయ్ అభిమానులు పెదవి విరిచారు. దీని కన్నా షార్ట్ ఫిల్మే బాగుంటుందని చాలా మంది కామెంట్లు చేశారు. ఇలాంటి సినిమాను విజయ్ ఎందుకు ఒప్పుకున్నాడని అడిగారు. నిజానికి ఈ సినిమాను విజయ్ కూడా అస్సులు ఇష్టపడలేదట. అందుకే తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పలేదట. డిజిటల్ గేమింగ్‌ని అమితంగా ఇష్టపడే కుర్రాడి పాత్రలో విజయ్ కనిపించాడు. గాడ్జెట్స్ తన జీవితంగా భావిస్తాడు. అస్సలు బాధ్యత లేకుండా బతుకుతాడు. తనకు ఎంతో ఇష్టమైన గేమింగ్‌ను ఉపయోగించి తను ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకున్నాడనేదే కాన్సెప్ట్. రొమాన్స్‌తో కూడిన థ్రిల్లర్ ఈ మూవీ.
0business
Apr 10,2016 ఎల్‌ఐసీితో చేతులు కలిపిన సిడ్బీ ముంబయి: అంకుర సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు (ఎంఎస్‌ఎంఇ) మద్దతు ఇచ్చేందుకు ఎల్‌ఐసీతో 'స్మాల్‌ ఇండిస్టీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా' (సిడ్బీ) ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఎల్‌ఐసీతో కలిసి ఒక నిధిని ఏర్పాటు చేస్తామని సిడ్బీ సంస్థ సీఎండీ శివాజీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా సమక్షంలో జరిగిందన్నారు. ఔత్సాహికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి 'ఇండియా యాస్పిరేషన్‌ ఫండ్‌' (ఐఎఎఫ్‌)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐఏఎఫ్‌లో ఎల్‌ఐసీి పది శాతం వాటా కలిగి ఉంటుందని వివరించారు. 2015 బడ్జెట్‌లో ఐఏఎఫ్‌ కోసం రూ.2,000 కోట్ల కార్పస్‌ ఫండ్‌ సమకూర్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 98 Views 3 కంపెనీలు కొనుగోలు చేస్తున్న మోస్‌చిప్‌ హైదరాబాద్‌, సెప్టెంబరు 13: తెలంగాణ రాజధాని కేంద్రంగా పనిచేస్తున్న సెమికండక్టర్‌ కంపెనీ మోస్‌ చిప్‌ మూడు కంపెనీలు కొనుగోలుచేస్తున్నట్లు ప్రక టించింది. ఎలైట్‌ ప్లస్‌సెమికండక్టర్‌ టెక్నాలజీస్‌, ఆరంజ్‌ సెమి కండక్టర్స్‌ కంపెనీలను కొనుగోలు చేస్తోంది. ఈ రెండుకంపెనీలు బెంగళూరుకు చెంది నవే. అలాగే పుణెకు చెందిన మావెన్‌ సిస్టమ్స్‌ను కూడా కొనుగోలుచేస్తున్నట్లు మోస్‌చిప్‌ వెల్లడిం చింది. అయితే ఎంతమొత్తం వెచ్చిస్తున్నదన్న అంశాలు వెల్లడికాలేదు. ఇందుకు సంంధించి వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాలను అధిగమించగల మని మోస్‌చిప్‌ బోర్డు ఆమోదంకూడా పొందిం దని కంపెనీ వెల్లడించింది. అదనంగా 41.25 కోట్ల నిధులను సమీకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదించింది. అలాగే షేర్లు, వారంట్లను టెక్‌ వేవ్‌ పిటిఇ సంస్థకు జారీచేసి ఈనిధులు సమీక రిస్తుంది. కంపెనీ వృద్ధిప్రణాళికల్లో భాగంగానే మోస్‌చిప్‌ ఈ కొనుగోళ్లు నిర్వహిస్తోంది. ఇంట ర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఒటి) విభాగంలో సెమికం డక్టర్‌ పరిశ్రమ రంగపరంగాను విస్తరించేయోచన తో ఉంది. ఉత్తర అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, ఎపిఎసి ప్రాంతాల దేశాల్లో మార్కె ట్‌ను విస్తరించేయోచనతో ఉంది. బెంగళూరుకు చెందిన ఎలైట్‌ప్లస్‌, ఆరంజ్‌ కంపెనీలు మోస్‌చిప్‌ ను మరింత పటిష్టంచేస్తాయని చెపుతున్నారు. బెంగళూరులో ఇప్పటికే విఎల్‌ఎస్‌ఐ సేవలసంస్థ పరంగా 75 నిపుణులైన వారిని నియమించుకుం టున్నది. మావెన్‌ సిస్టమ్స్‌ ఇప్పటికే పలు ఉత్ప త్తులు, సేవల్లో బిజీగా ఉంది. రిమోట్‌ పర్యవేక్షణ, స్మార్ట్‌ లైటింగ్‌, స్మార్ట్‌ మీటరింగ్‌, స్మార్ట్‌ సిటీస్‌, అనలిటిక్స్‌ క్లయింట్లపరంగా 20దేశాల నుంచి ఉన్నట్లు అంచనా. మావెన్‌ సిస్టమ్స్‌ మోస్‌చిప్‌ మరింతగా వృద్ధి చెందుతుందని నిపుణుల అంచనా. ఇప్పటికే కంపెనీకి 250మందికిపైగా నిపుణులైన ఇంజినీర్లు పనిచేస్తున్నారు. హైదరా బాద్‌, బెంగళూరు, పుణెలతోపాటు విదేశాల్లోని లండన్‌, సితలికాన్‌ వ్యాలీల్లో కూడాకంపెనీ సేవలు న్నాయి. మోస్‌చిప్‌ మరో 150-200 మంది ఇంజి నీర్లను నియమించే లక్ష్యంతో ఉంది. మోస్‌చిప్‌ సిఇఒ రామ్‌రెడ్డిమాట్లాడుతూ టెక్‌వేవ్‌ పెట్టుబడు లతో పాటు ఇటీవల వ్యూహాత్మక నిధుల సమీకరణ సానుకూల ఫలితాలిచ్చాయన్నారు. 2016-17 తొలి త్రైమాసికంలోనే కంపెనీ కోలుకున్నదని లాభా ల దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఐఒటితో పాటు, ఐపి, విఎల్‌ఎస్‌ఐ సేవలపరంగా అంతర్జాతీ యంగా విస్తరించే లక్ష్యంతో మోస్‌చిప్‌ ఉంది.
1entertainment
Pulses పప్పు దినుసుల మార్కెట్లలో మిశ్రమ ధరలు! ఇండోర్‌, నవంబరు 6: భారత్‌ పప్పుదినుసుల మార్కెట్లలో ధరలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ముహూరత్‌ట్రేడింగ్‌లోనే కందిపప్పు ధరలు క్వింటాలుకు 5800కు తగ్గాయి. పెద్దసైజు కందులు 5900 రూపాయలుగా నిలిచాయి. ఇక మధ్యప్రదేశ్‌పరంగాకందులు 5000 నుంచి క్వింటాలు 5200గా నడుస్తున్నాయి. కందిపప్పుపరంగాచూస్తే క్వింటాలు 9200 నుంచి 9300 రూపాయలుగా నడుస్తోంది. పూర్తిస్థాయి నాణ్యతకలిగిన కందిపప్పు క్వింటాలు 10,200 నుంచి 11,300వరకూ నడిచింది. ఇక పెసలపరం గా పెద్దవి క్వింటాలుకు 4900 నుంచి 5100 రూపాయలుగా ఉంది. మధ్యస్తంగా ఉన్న పెసలు క్వింటాలుకు రూ.4200గా కొనసాగాయి. ఇక పెసరపప్పు మధ్యరకం క్వింటాలు రూ.599నుంచి ఆరువేల రూపాయలవరకూ నడిచింది. ఇక పెద్ద సైజు పెసరపప్పు క్వింటాలుకు ఆరునుంచి 6100 రూపాయలుగా నడిచింది. ఇక మినుములు పెద్దవి 6800 నుంచి 7000 వరకూ నడుస్తున్నాయి. ఇకమినుములు మధ్యరకం క్వింటాలు 6వేల నుంచి రూ.6200గా ఉన్నాయి. మినపపప్పు మద్యరకం క్వింటాలుకు 8500 నుంచి రూ.8700 వరకూ ఉంటే పెద్దసజు మినప పప్పు క్వింటాలుకు రూ.9వేల నుంచి రూ.9200 వరకూ నడుస్తోంది.
1entertainment
అనుమతి తప్పనిసరి..! - పసిడి దిగుమతులపై ప్రభుత్వ నిర్ణయం ముంబయి: దక్షిణ కొరియా నుంచి అంతకంతకు పెరిగిపోతున్న పసిడి, వెండి దిగుమతులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంక్షలు విధించింది. ఇక ముందు వీటి దిగుమతులపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఈ ఉత్పత్తులను పరిమిత కేటగిరీలోకి చేర్చింది. జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు మధ్య కాలంలో దక్షిణ కొరియా నుంచి దేశంలోకి దాదాపు 1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే బంగారం దిగుమతులు జరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. కాగా నాణేలు, ఆభరణాలతో సహా అన్ని రకాల బంగారం, వెండి వస్తువులపై ఈ పరిమితి వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దక్షిణ కొరియాకు, భారత్‌కు మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమల్లో ఉంది. దీంతో ఆ దేశం నుంచి వచ్చే బంగారం దిగుమతిపై ప్రాథమిక కస్టమ్‌ సుంకం విధించడానికి వీల్లేదు. ప్రస్తుతం సమీకత జీఎస్టీ కింద బంగారంపై 3 శాతం పన్ను మాత్రమే అమల్లో ఉంది. ఉచిత వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం ఉత్పత్తులపై 10 శాతం కస్టమ్‌ డ్యూటీ అమల్లో ఉంది. దక్షిణ కొరియాతో ఉన్న ఎఫ్‌టీఏను ఉపయోగించుకుని పలువురు వాణిజ్య వ్యాపారులు పన్ను ఎగొట్టేందుకు ఆ దేశం నుంచి భారీగా పసిడి దిగుమతులు చేసుకుంటున్నారు. దీంతో జులైలో బంగారం దిగుమతులు 95 శాతం పెరిగాయని తెలుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బంగారం, వెండిని దిగుమతి చేసుకోవాలంటే దిగుమతిదారులు ముందస్తుగా ప్రభుత్వం వద్ద నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. చైనా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగదారునిగా భారత్‌ ఉంది. ప్రస్తుతం 400 ప్లస్‌ ఉత్పత్తులు నియంత్రిత దిగుమతుల జాబితాలో ఉన్నాయి. వాటిలో జంతువులు, కొన్ని విత్తనాలు, యూరేనియం, పేలుడు పదార్థాలున్నాయి. డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగానే ఈ నిషేధం ఉందని, ఎఫ్‌టీఏ నిబంధనలను ఇది ఉల్లంఘించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అనుపమ నా మేనకోడలు: అల్లు అరవింద్ ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం విజయవంతం కావడంతో సోమవారం రాత్రి సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. Samayam Telugu | Updated: Oct 23, 2018, 12:15PM IST అనుపమ నా మేనకోడలు: అల్లు అరవింద్ రామ్ హీరోగా నటించిన ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రామ్ కెరీర్‌లోని తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం దసరా బ్లాక్‌బస్టర్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. చిత్రం విజయవంతం కావడంతో సోమవారం రాత్రి ‘హలో గురు ప్రేమకోసమే’ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజుకి నేను పెద్దన్న లాంటి వాడిని. నాకు కుటుంబసభ్యుడు. అమెరికా నుంచి ఫోన్ చేసి.. అన్న సక్సెస్ మీట్ జరుగుతోంది, నేను లేను, నువ్వు వెళ్లాలి అన్నాడు. నాకు దిల్ రాజు మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కాంబినేషన్ల మీద కొట్టుకుపోదం అనుకునే డైరెక్టర్లే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ హీరో, ఈ డైరెక్టర్ కాంబినేషన్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంత వచ్చేస్తుంది అనుకునే నిర్మాతలున్నారు. అలా కాకుండా కథను మాత్రమే నమ్ముకుని, ఈ కథకు ఎవరైతే బాగుంటారు అని ఆలోచించి ప్రయాణించే కొద్ది మంది నిర్మాతల్లో రాజు ఒకరు’ అని అరవింద్ కొనియాడారు. దర్శకుడు త్రినాథరావు గురించి మాట్లాడుతూ.. ‘ఇతను చూడటానికి ఇలా ఉన్నాడు, కానీ సినిమా ఎంత చక్కగా తీశాడు’ అని అనిపించిందని చెప్పారు. ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా, వైబ్రెంట్‌గా చేసే రామ్.. ఈ సినిమాలో మాత్రం చాలా ప్రశాంతంగా చేశాడని అరవింద్ అన్నారు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించాడని ప్రశంసించారు. తొలిసారి రామ్ నటనకు తాను ముగ్దుడనయ్యానని చెప్పారు. అనుపమా పరమేశ్వర్ గురించి మాట్లాడుతూ.. ‘ఈ అమ్మాయి ఎక్కువగా నవ్వేస్తుంది. నాకు కూతుళ్లు లేరు కానీ అందరూ మేన కోడళ్లే. ఈ అమ్మాయి నా మేనకోడలిలానే ఉంది’ అని నవ్వుతూ అన్నారు. ఇక ప్రణీత కళ్ల గురించి రాసేవాళ్లందరూ తెగ పొగిడేస్తుంటారని నవ్వుతూ చెప్పారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV India vs Bangladesh: రోహిత్ శర్మ నాలుగో శతకం.. అరుదైన ఘనత ఓపెనర్ కేఎల్ రాహుల్ (77: 92 బంతుల్లో 6x4, 1x6)తో కలిసి తొలి వికెట్‌కి 180 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ.. భారత్ జట్టు భారీ స్కోరుకి బాటలు వేశాడు. తాజా ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మకి ఇది నాలుగో శతకంకాగా.. ఆదివారం ఇంగ్లాండ్‌పైనా ఈ ఓపెనర్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. Samayam Telugu | Updated: Jul 2, 2019, 08:12PM IST హైలైట్స్ బంగ్లాదేశ్‌పై సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ తాజా ప్రపంచకప్‌లో రోహిత్‌కి ఇది నాలుగో శతకం వరల్డ్‌కప్‌ సింగిల్ ఎడిషన్‌లో నాలుగు శతకాలు బాదిన ఏకైక భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ చోటు బంగ్లాదేశ్‌తో ఈరోజు బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో శతకం బాదిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ (104: 92 బంతుల్లో 7x4, 5x6) అరుదైన రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్‌ తొలి ఓవర్‌లోనే సిక్స్‌ బాది బంగ్లాదేశ్ బౌలర్లకి హెచ్చరికలు జారీ చేసిన రోహిత్ శర్మ ఔటయ్యే వరకూ టాప్ గేర్‌లోనే కొనసాగాడు. ఈ క్రమంలో 45 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్న రోహిత్.. ఆ తర్వాత సరిగ్గా 90 బంతుల్లో సెంచరీని చేరుకోవడం విశేషం. తాజా ప్రపంచకప్‌లో రోహిత్‌కి ఇది నాలుగో శతకంకాగా.. వన్డే కెరీర్‌లో 26వ సెంచరీ. ప్రపంచకప్‌ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో శ్రీలంకకి చెందిన కుమార సంగక్కర 4 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా రోహిత్ శర్మ అతని సరసన నిలిచాడు. ఈ రికార్డుతో పాటు ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలోనూ రోహిత్ శర్మ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకూ ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాని ఓ సారి పరిశీలిస్తే..? భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 6 శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత రికీ పాంటింగ్ (5 సెంచరీలు), కుమార్ సంగక్కర (5), రోహిత్ శర్మ (5) టాప్‌-4లో కొనసాగుతున్నారు. అయితే.. అందరి కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్ శర్మ ఈ మార్క్‌ని చేరుకోవడం విశేషం.
2sports
బిగ్ బాస్2: నూతన్ నాయుడు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్నాడు.. సంజన కామెంట్స్ Highlights బిగ్ బాస్ సీజన్ 2 పై ప్రేక్షకుల్లో రోజురోజుకి ఆసక్తి పెరిగిపోతుంది. దానికి తగ్గట్లే గేమ్ లో టాస్క్ లను కూడా డిజైన్ చేస్తున్నారు నిర్వాహకులు బిగ్ బాస్ సీజన్ 2 పై ప్రేక్షకుల్లో రోజురోజుకి ఆసక్తి పెరిగిపోతుంది. దానికి తగ్గట్లే గేమ్ లో టాస్క్ లను కూడా డిజైన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఎన్నడూ లేని విధంగా ఈవారంలో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్ లను హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చేలా చేశారు. నిజానికి ముందుగా ఒకరితో రీఎంట్రీ ఇప్పించాలని అనుకున్నా.. ఊహించని విధంగా శ్యామల, నూతన్ నాయుడు ఇద్దరికీ ఓట్లు సమానంగా రావడంతో ఇద్దరికీ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఇచ్చారు. అయితే నూతన్ నాయుడు హౌస్ లోకి వెళ్లడం వెనుక పెద్ద స్కామ్ ఉందని తేల్చేసింది సంజన. సామాన్యురాలిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సంజన మొదటివారంలోనే బయటకు వచ్చేసింది. రీఎంట్రీకి ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కాంపెయిన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఆమె నూతన్ నాయుడుపై సంచలన కామెంట్స్ చేసింది. ''నూతన్ నాయుడు ఫోన్ చేసి నాకు ఫోన్ నేను 100% వెళ్తున్నాను అని చెప్పారు. డబ్బులిచ్చి పబ్లిసిటీ చేయించుకుంటున్నారంటే ఎవరూ నమ్మడం లేదు. అందుకే ఈ రికార్డింగ్స్ వినిపిస్తున్నాను'' అంటూ కొన్ని ప్లే చేసింది. అందులో నూతన్ నాయుడు ఒక యూట్యూబ్ ఛానెల్ కు ప్రమోషన్స్ కోసం రూ.18800 ఒకసారి అలానే రూ.25000 మరోసారి ఇచ్చినట్లు వెల్లడించారు. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుంటున్నారనే విషయం ప్రజలకు తెలియజెప్పడం కోసమే ఈ వీడియో ప్లే వినిపించినట్లు సంజన వెల్లడించారు. అంతేకాదు ఓట్ల విషయంలో చాలా రాజకీయాలు జరిగాయని ఆమె అన్నారు. ఈ విషయం చెబుతున్నందుకు తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దని వెల్లడించారు.  Last Updated 31, Jul 2018, 5:24 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV యువరాజ్‌ సింగ్‌పై గృహ హింస కేసు క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహహింస చట్టం కింద కేసు నమోదైంది. యువరాజ్ సోదరుడు జోరావార్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. యువీతో పాటు అతడి సోదరుడు జోరావార్, తల్లి షబనమ్ సింగ్‌పై ఆమె గృహ హింస కేసు ఫైల్ చేశారు. అక్టోబర్ 21న ఈ కేసు విచారణకు రానుంది. TNN | Updated: Oct 18, 2017, 12:30PM IST క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహహింస చట్టం కింద కేసు నమోదైంది. యువరాజ్ సోదరుడు జోరావార్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. యువీతో పాటు అతడి సోదరుడు జోరావార్, తల్లి షబనమ్ సింగ్‌పై ఆమె గృహ హింస కేసు ఫైల్ చేశారు. అక్టోబర్ 21న ఈ కేసు విచారణకు రానుంది. ఆకాంక్ష శర్మ తరఫు లాయర్ స్వాతి సింగ్ మాలిక్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. యువీ తల్లి షబనమ్ కూడా ఆకాంక్షపై ఫిర్యాదు చేశారని, ఆభరణాలు వెనక్కి ఇచ్చేయాలని ఆమె కేసు వేశారని స్వాతి తెలిపారు. బిడ్డను కనాలంటూ ఆకాంక్షపై యువీ తల్లి షబనమ్ పదేపదే ఒత్తిడి చేశారని, యువీ కూడా తన తల్లికి వత్తాసు పలికాడని ఆకాంక్ష ఆరోపించారు. ‘గృహ హింస అంటే.. కేవలం శారీరక హింస మాత్రమే కాదు. అది మానసిక, ఆర్థిక ఒత్తిడి కూడా.. నా క్లయింట్ ఆకాంక్ష వేదనకు గురవుతుంటే.. క్రికెటర్ యువీ ఓ మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయారు’ అని లాయర్ స్వాతి అన్నారు. ఆకాంక్ష పట్ల అత్త షబనమ్ చాలా డామినెంట్‌గా వ్యవహరించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆకాంక్ష.. బిగ్‌ బాస్‌-10లో కంటెస్టెంట్‌‌గా చేశారు.
2sports
మహేష్‌ 25వ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ Highlights మహేష్‌ 25వ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ డాన్, తలాష్, రయూస్ లవంటి చిత్రాలకు పనిచేసిన కె.యు.మోహనన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దిల్ రాజు, అశ్వినిదత్ సూపర్‌స్టార్‌ మహేష్‌ కథానాయకుడుగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ మరియు వైజయంతీ మూవీస్‌ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ కె.యు.మోహనన్‌ పనిచేయనున్నారు.   బాలీవుడ్‌లో 2006లో వచ్చిన డాన్‌ చిత్రానికి, తలాష్‌, రయీస్‌ వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్‌ని అందించిన కె.యు.మోహనన్‌... సూపర్‌స్టార్‌ మహేష్‌ నటిస్తున్న 25వ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేయనున్నారు.    మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్‌, నిర్మాతలు: సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
Cook praises Sachin సచిన్ ఓ జీనియస్ బ్యాట్స్‌మన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో తనను తాను పోల్చుకోవడానికి నిరాకరించాడు ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్. TNN | Updated: Jun 9, 2016, 06:06PM IST మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో తనను తాను పోల్చుకోవడానికి నిరాకరించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్. అత్యంత చిన్న వయసులో టెస్టుల్లో పది వేల పరుగుల మార్క్ దాటిన ప్లేయర్‌గా సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కుక్... సచిన్ ఓ జీనియస్ బ్యాట్స్‌మన్ అని, తాను కాదని చెప్పాడు. సచిన్ రికార్డును అధిగమించాలంటే ఇంకా సుమారు ఆరు వేల పరుగులు చేయాలని, అది చాలా ఎక్కువని కుక్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్‌ కంటే తక్కువ వయసులోనే 10వేల పరుగుల మైలురాయిని అందుకుని సరికొత్త రికార్డును కుక్‌ సృష్టించాడు. కెరీర్‌లో 200 టెస్టు మ్యాచ్‌లాడిన సచిన్‌ 51 శతకాలతో మొత్తం 15,921 పరుగులు చేశాడు. అయితే ఇప్పటికే 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న 31 ఏళ్ల కుక్‌ ఇంకా టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండటంతో సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డును కూడా అధిగమిస్తాడని భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. ఫిక్సింగ్ కు పాల్పడితే జీవితకాలం నిషేధించండి క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ స్పష్టం చేశాడు. ఏ స్థాయి క్రికెటరైనా ఫిక్సింగ్కు పాల్పడినట్లు రుజువైతే జీవిత కాలం నిషేధం ఒక్కటే తగిన పరిష్కారమని సూచించాడు. ఎవరైనా ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడినట్లైతే ఆ క్రికెటర్కు వేసే శిక్ష చాలా కఠినంగా ఉండాలనేది తన అభిప్రాయంగా కుక్ తెలిపాడు. ఆ రకంగా చేసినప్పుడు క్రికెటర్లు నిజాయితీతో గేమ్ను ఆస్వాదిస్తారన్నాడు. అయితే ఫిక్సింగ్ పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న తరువాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు రాబోతున్న మొహ్మద్ ఆమిర్ కు, తాను మాట్లాడే దానికి ఎటువంటి సంబంధం లేదన్నాడు. అప్పటి నిబంధనలు భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఆమిర్ పునరాగమనం గురించి మాట్లాడటం సబబు కాదని కుక్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తాము ఆమిర్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కుక్ తెలిపాడు. అతనితో ఆడటానికి ఇంగ్లండ్ జట్టుకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నాడు.
2sports
-  ఇంటివద్దే పని చేసి ఫలితాలను చూపండి -  ఉచితంగా మెట్రో పాస్‌లు, కార్‌ పూలింగ్‌లు -  నగర వ్యాప్తంగా చిన్నచిన్న కార్యాలయాల ఏర్పాటు -  ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కార్పొరెట్‌ల కొత్త ఆలోచనలు -  వినూత్న చర్యలతో ముందుకు వస్తున్న సంస్థలు      న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు గాను సరి-బేసి విధానంలో వాహనాలను అనుమతించే విధానం నేటి నుంచి అమలులోకి రానుంది. ప్రభుత్వం తన వంతుగా పలు కాలుష్య నియంత్రణ చర్యలను చేపడుతున్న నేపథ్యంలో.. స్థానిక కార్పొరెట్‌ సంస్థలకు కూడా ఈ దిశగా దృష్టి సారించాయి. తమ వంతుగా ఢిల్లీని కాల్యుష్య భూతం నుంచి కాపాండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో నివేదికలను సమర్పించాల్సిందిగా పలు కంపెనీలు 'మానవ వనరుల శాఖ' అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. ఇందులో చాలా కంపెనీల యాజమాన్యాలకు నివేదికలు కూడా అందాయి. సరి-బేసి విధానం వల్ల ఉద్యోగులు కంపెనీలకు చేరుకోవడంలో పలు ఇబ్బందులు ఎదురు కానున్న నేపథ్యంలో వీటిని కనిష్ఠస్థాయికి తగ్గించేలా కార్పొరేట్లు తమ భవిష్యత్తు విధానాలను రూపొందిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే ఇప్పటికే ఇందుకు సంబంధించిన పలు మార్గదర్శకాలను కూడా కంపెనీ ఉద్యోగులకు జారీ చేశాయి. కొన్ని సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లను చేశాయి. ప్రయాణాలు తగ్గించేలా ప్రణాళికలు..    అంతకంతకు పెరిగిపోతున్న ఢిల్లీ కాలుష్యాన్ని వీలైనంత మేర తగ్గించేందుకు గాను 'మాస్‌ ట్రాన్స్‌పోర్ట్‌' వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్ని కంపెనీలు నిర్ణయించాయి. సంస్థలోని ఉద్యోగులు విడివిడిగా తలా ఒక్క కారుతో ఆఫీసుకు రావడాన్ని నియంత్రించడం కోసం 'కార్‌ పూలింగ్‌'ను ప్రోత్సహించాలని నిర్ణయించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కంపెనీ తరఫునే 'పూలింగ్‌' వాహనాలను ఏర్పాటు చేసే ఆలోచనలో చేస్తున్నాయి. దీనికి తోడు టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగి ఆఫీసుకు రాకుండానే ఇంటివద్ద నుంచి ఆన్‌లైన్‌ ద్వారా కార్యాలయ పనులను చక్కదిద్దేలా 'వర్క్‌ ఫ్రం హోమ్‌' విధానాన్ని కూడా వీలైనంత గరిష్ఠస్థాయిలో అందుబాటులోకి తేనున్నాయి. 'ఎంతో ముఖ్యమైన పనుంటే గానీ ఆఫీసులకు రండి' అంటున్నాయి. కొన్ని సంస్థలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. మరికొన్ని సంస్థలైతే ఉద్యోగులు నగర శివార్లలో కార్యాలయాలకు రాకుండా నరగంలోనే వివిధ ప్రాంతాలలో ఉద్యోగులు వచ్చి పని చేసుకొనేలా 'ప్లగ్‌ అండ్‌ ప్లే' కేంద్రాలను (తాత్కాలిక కార్యాలయాలను )ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. సామూహిక ప్రయాణాలను ప్రోత్సహించేందుకు గాను ఉచితంగా మోట్రో పాస్‌లను అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాయి. 'కార్పొరెట్‌ల సామాజిక బాధ్యత' (సీఎస్‌ఆర్‌) కార్యక్రమం కింద ఈ కార్యక్రమాలను చేపట్టాలని సంస్థలు యోచిస్తున్నాయి. సీఎస్‌ఆర్‌ కింద బడా సంస్థలు లాభాల్లో కొంత శాతాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా సీఎస్‌ఆర్‌ నిధులను వినియోగించి ఢిల్లీని కాపాడుకోవాలని ఆయా సంస్థలు యోచిస్తున్నాయి. చర్యలను మొదలు పెట్టిన కంపెనీలు..    కోకాకోలా, జబాంగ్‌, ప్రైయిస్‌ వాటర్‌కూపర్‌ (పీడబ్ల్యూసీ), కేపీఎంజీ, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, పేటీఎంతో పాటు పలు బడా కంపెనీలు 'కార్ల ఉమ్మడి వాడకం', 'సామూహిక ప్రయాణాలు' వంటి కాలుష్య నియంత్రణ చర్యల్లో పాలు పంచుకోనేలా తమ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. పీడబ్ల్యూసీ ఇండియా సంస్థ తమ ఉద్యోగులకు 'మెట్రోకార్డు'లను అందించి స్థానిక రైళ్లలో ఆఫీసులకు రావాల్సిందిగా కోరుతోంది. దీనికి తోడు వీలైనంత మంది ఉద్యోగులు ఆఫీసులకు రాకుండానే ఇంటివద్ద నుంచే పనులు చక్కబెట్టేలా చర్యలు చేపటింది. ప్రభుత్వ చర్యలకు ఊతం ఇచ్చేందుకు తాము ఈ దిశగా ముందుకు సాగుతున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనికతో తోడు ఉద్యోగులు సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న గుర్‌గావ్‌కు రాకుండా నగరంలో తమకు అనువైన చోటే పని చేసుకొనేలా 'ప్లగ్‌ అండ్‌ ప్లే' కార్యాలయాలను కూడా త్వరలోనే ఏర్పాటు చేయనుంది. కపీఎంజీ సంస్థ కూడా కాలుష్య నియంత్రణకు గాను దాదాపు ఇలాంటి చర్యలనే చేపడుతోంది. పేటీఎం సంస్థ ఉద్యోగులకు ఇప్పటికే అనధికారికంగా 'ఇంటి వద్ద నుండి పని' విధానాన్ని ఉద్యోగులకు విచక్షణ ఆధారంగా అందించాలని నిర్ణయించింది. ఇంటి వద్ద నుంచే పని చేసి ఫలితాలను చూపమనడం మంచి అవకాశమని సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇది అన్ని రకాల ఉద్యోగాలకు సరిపోదని ఢిల్లీ కంపెనీలు అంటున్నాయి. సీట్లో కదలకుండా కూర్చొని కార్యాలయాల్లోని పనులను చక్కబెట్టేవారికి ఇది సరిపోతుందన్నది ఢల్లీీ కేంద్రంగా పని చేస్తున్న పలు టెక్నాలజీ కంపెనీల వాదన. కార్యాలయాలకు వచ్చేందుకు 'ఉమ్మడి కారు' ప్రయాణాలు బాగా ఉపకరిస్తాయని చాలా కంపెనీలు నమ్ముతున్నాయి. ఇందులో భాగంగా ఆయా సంస్థలు తమ సీనియర్‌ అధికారులకు ఈ దిశగా ఆదేశాలను జారీ చేశాయి. పెద్ద ఉద్యోగులు ఈ తరహా చర్యలను చేపడితే కింది స్థాయి ఉద్యోగులు దానిని స్ఫూర్తిగా ముందుకు వస్తారంటూ ప్రచారాలను కూడా మొదలు పెట్లాయి. మెట్రో స్టేషన్ల నుంచి వాహన సదుపాయాలు..    కొన్ని కంపెనీలు ఉచిత మెట్రో పాస్‌లను అందించడంతో పోటు ఉద్యోగులు మెట్రో స్టేషన్లలో రైలు దిగాక నిమిషాల్లో వారిని ఆఫీసులకు చేర్చేలా కార్లను, బస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ విషయంలో పేటీఎం సంస్థ అందరికంటే ముందుంది. విధి నిర్వహణ కోసం ఆఫీసులకు వచ్చే వారికోసం సంస్థ ఇప్పటికే పికప్స్‌, డ్రాపింగ్‌లను పెంచింది. పలు టెక్నాలజీ సంస్థలు కూడా ఈ విధానాన్ని అమలులోకి తెచ్చాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV జక్కన్నతో మహేష్.. ఇదిగో క్లారిటీ దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే ప్రచారం గత కొన్నిరోజులుగా జరుగుతోంది. TNN | Updated: Sep 24, 2017, 03:08PM IST దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే ప్రచారం గత కొన్నిరోజులుగా జరుగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి వీరి కాంబోలో సినిమా సెట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. బాహుబలి2 తరువాత చాలా కాలంగా విరామం తీసుకుంటున్న రాజమౌళి ఇప్పటివరకు తన తదుపరి సినిమా హీరో ఎవరనే విషయంలో ఓ క్లారిటీకు రాలేదు. అయితే రాజమౌళితో తన సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయంపై మహేష్ తాజాగా స్పందించాడు. ప్రస్తుతం మహేష్ బాబు నటించిన 'స్పైడర్' మూవీ సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్నాడు మహేష్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మహేష్‌కు రాజమౌళితో సినిమా ప్రస్తావన ఎదురవ్వగా.. 'రాజమౌళితో సినిమా తప్పకుండా ఉంది. అయితే ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేను. బహుశా వచ్చే ఏడాది చివరిలో ఆ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని' స్పష్ఠం చేశాడు. ఇప్పుడు మహేష్.. తన స్పైడర్ రిలీజ్ కాకముందే కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు. ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయిన తరువాతే రాజమౌళితో సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా.. విజయేంద్రప్రసాద్ రెడీ చేసిన ఓ కాప్ స్టోరీ రాజమౌళికి బాగా నచ్చిందని ఇటీవల ఆయన వెల్లడించారు. మరి రాజమౌళి ఆ కాప్ స్టోరీ ఏ హీరోతో తెరకెక్కిస్తాడో చూడాలి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV జనసేన పార్టీ గురించి జయసుధ ఎంత మాటన్నారు! 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన సినీనటి జయసుధ 2014 ఎన్నికల్లో మాత్రం... | Updated: Jan 28, 2017, 04:01PM IST 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన సినీనటి జయసుధ 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. ఆ తర్వాతి కాలంలో పార్టీ పట్ల కొంత అసంతృప్తితో వున్న ఆమె రాజకీయాల్లో అంత చురుకైన పాత్ర పోషించడం లేదు. ఓటమి అనంతరం టీడీపీ వైపు మొగ్గు చూపారామె. ఇదిలావుండగానే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసేందుకు జయసుధ ప్రయత్నిస్తున్నారనే టాక్ కూడా వినిపించింది. తాజాగా జయసుధ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ ఇదే విషయమై ప్రశ్నిస్తూ, "మీరు జనసేన పార్టీలో చేరుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అది నిజమేనా" అని అడగ్గా... ఆమె నుంచి షాకింగ్ ఆన్సర్ వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ పేరు వినడంతోనే ఏదో కన్‌ఫ్యూజింగ్ ఫేస్ పెట్టిన జయసుధ.. " జనసేన పార్టీనా ? అదెవ్వరి పార్టీ" అని అడిగారట. అనంతరం ఇంకొత వివరణ ఇస్తూ... 'పవన్ పెట్టింది పవన్ కల్యాణ్ పార్టీ అని తెలుసు కానీ జనసేన పార్టీ అని తెలీదు' అని అన్నారట ఆమె. అంతేకాకుండా జనసేన పార్టీలో చేరే ఆలోచనేమీ లేదని, ఎప్పుడూ టీడీపీలోనే కొనసాగుతాను అని జయసుధ చెప్పినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే అయిన జయసుధకు ఎన్నో సందర్భాల్లో వార్తల్లోకెక్కిన జనసేన పార్టీ పేరు తెలీకపోవడం ఏంటంటూ సోషల్ మీడియా చర్చించుకుంటోంది.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సానియా-మార్టినా జోడీదే బ్రిస్బేన్ టైటిల్! ఇండో స్విస్ టెన్నిస్ జోడీ సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడీ 2016ను ఘనంగా ప్రారంభించింది. TNN | Updated: Jan 9, 2016, 10:35PM IST ఇండో స్విస్ టెన్నిస్ జోడీ సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడీ 2016ను ఘనంగా ప్రారంభించింది. డబ్ల్యూటిఏ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ట్రోఫీని గెలుచుకుని సంచలనం సృష్టించారు. వారి జోడీ కెరీర్లో వరుసగా ఇది ఆరో టైటిల్ కావడం విశేషం. శనివారం బ్రిస్బేన్లో జరిగిన ఫైనల్స్ లో జర్మనీకి చెందిన టాప్ సీడ్స్ ఏంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ పై 7-5, 6-1 తేడాతో ఘన విజయం సాధించింది. సానియా జోడీ ఈ మ్యాచ్ ను కేవలం 69 నిమిషాల్లోనే ముగించడం విశేషం. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ గా ఉన్న సానియా, మార్టినాల కెరీర్లో మొత్తం 26 టోర్నీల్లో విజయం సాధించారు. యూఎస్ ఓపెన్, గువాన్జూ, వుహాన్, బీజింగ్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో వరుసగా విజయం సాధించి రికార్డ్ నెలకొల్పారు. ఈ విజయంతో వారి జోడి ప్రపంచంలో సుదీర్ఘకాలంగా విజయాల బాటలో పయనిస్తున్న టెన్నిస్ జోడీగా నిలవడం విశేషం. వారికి ముందు సారా, రాబర్టా పేరిట ఆ రికార్డ్ ఉంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆ సీన్లంటే నాకేందుకు సిగ్గు, భయం?! న్యూడ్ సీన్లలో నటించడంలో తనకేలాంటి భయాలు లేవని నటి రాధిక ఆప్టే స్పష్టం చేశారు. | Updated: Sep 17, 2016, 04:16PM IST న్యూడ్ సీన్లలో నటించడంలో తనకేలాంటి భయాలు లేవని నటి రాధిక ఆప్టే స్పష్టం చేశారు. రాధిక తాజా చిత్రం పార్చ్‌ డ్’ సెప్టెంబర్ 23న విడుదల కానుంది. సామాన్య మహిళల జీవితాలే ఇతివృత్తంగా సాగనున్న ఈ చిత్రంలో అదిల్ హుస్సేన్ సరసన రాధిక నటించింది. సనాతన సంప్రదాయాలు బద్ధలు కొట్టేందుకు మహిళలు చేసిన సామాజిక పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయని ఆమె చెబుతోంది. ఈచిత్రంలోని కొన్ని సీన్లలో రాధిక ఆప్టే న్యూడ్ గా నటించిందని ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని సీన్లు బుధవారం ఆన్ లైన్ లో లీకయ్యాయి. దీనిపై స్పందించిన రాధిక.. ‘నాపై వస్తున్న విమర్శలు పట్టించుకోను. లీకైనవాటి గురించి ఆలోచించను. సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తున్నా. నటనా ప్రతిభను ప్రదర్శించడానికి నా శరీరమే ఒక ఆయుధం. అలాంటప్పుడు నేనెందుకు సిగ్గుపడాలి? అలాంటి (న్యూడ్)సీన్లలో నటించేందుకు నాకు ఏలాంటి సంకోచం లేదు. మంచి చిత్రంలో నటించాననే ఫీలింగ్ లో ఉన్నా,’ నని స్పష్టం చేసింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగానని రాధిక చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ నిర్మించారు.
0business
శశికపూర్ చెప్పిన ఈ డైలాగ్ ఎవర్ గ్రీన్ Highlights బాలీవుడ్ లెజెండరీ నటుడు శశికపూర్ మరణం అమితాబ్ తో కలిసి పలు చిత్రాల్లో నటించిన శశికపూర్ వీటిలో దీవార్ సినిమాలోని మేరేపాస్ మా హై డైలాగ్ ఎవర్ గ్రీన్ బాలీవుడ్ లెజెండరీ హీరో శశికపూర్‌ మరణం బాలీవుడ్ కు తీరని లోటు. అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్య, కరీనా, సైఫ్, రాణి ముఖర్జీ, రణబీర్ కపూర్, కాజోల్ తదితరులు శశికపూర్ మృతదేహాన్ని సందర్శించిన వారిలో వున్నారు. ఇక శశికపూర్ బాలీవుడ్ కెరీర్ లో ఎన్నో మైలురాళ్లున్నా తాను పలికిన ఎవర్‌గ్రీన్‌ డైలాగ్‌ ‘మేరే పాస్‌ మా హై’ కు మాత్రం విశిష్ట వుంది. అమితాబ్‌ బచ్చన్‌-శశికపూర్‌ సోదరులుగా పలు చిత్రాల్లో నటించగా.. వాటిలో ‘దీవార్‌’ చిత్రం చాలా ప్రత్యేకమైనది. అందులో శశికపూర్‌ పలికిన ఈ డైలాగ్‌ ఇంకా ప్రత్యేకమైంది. యశ్‌చోప్రా దర్శకత్వంలో 1975లో వచ్చిన ‘దీవార్‌’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సలీమ్‌-జావెద్‌ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.   ఇందులో విజయ్‌, రవి పాత్రలను అమితాబ్‌, శశికపూర్‌లు పోషించారు. ఇద్దరూ భిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు. విజయ్‌(అమితాబ్‌) డాన్‌గా ఎదుగుతాడు. అదే సమయంలో రవి(శశికపూర్‌) నిజాయతీ కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌ అవుతాడు. ఓ సన్నివేశంలో వీరిద్దరూ ఎదురు పడినప్పుడు నా వద్ద మేడలు.. ఆస్తిపాస్తులు.. బ్యాంక్‌ బ్యాలెన్స్‌.. బంగ్లాలు.. కార్లు ఉన్నాయి.. నీ వద్ద ఏమున్నాయి? అంటూ విజయ్‌(అమితాబ్‌) ప్రశ్నించగా, పోలీస్‌ ఆఫీసర్‌ అయిన రవి(శశికపూర్‌) ‘నా వద్ద అమ్మ ఉంది’( మేరే పాస్‌ మా హై) అంటూ చెప్పిన డైలాగ్‌కు థియేటర్లు చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయాయి.   ‘దీవార్‌’ విడుదలై దాదాపు 40ఏళ్లు పూర్తయినా, ఈ డైలాగ్‌కు క్రేజ్‌ తగ్గలేదు. ఈ డైలాగ్‌తో చాలా పేరడీలు కూడా వచ్చాయి. ‘దీవార్‌’ చిత్రం అనేక భాషల్లో రిమేక్‌ కూడా అయింది. తెలుగులో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ‘మగాడు’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. తప్పనిసరిగా చూడాల్సిన టాప్‌ 25 బాలీవుడ్‌ చిత్రాల్లో ‘దీవార్‌’ ఒకటి. 23వ ఫిలింఫేర్‌ అవార్డుల్లో ఈ చిత్రం ఏడు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా శశికపూర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. అయితే తనది సహాయ నటుడి పాత్ర కాదని, కథానాయకుడితో సమానమైన పాత్రని అవార్డును తిరస్కరించారు శశికపూర్‌. Last Updated 25, Mar 2018, 11:54 PM IST
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV డిపార్ట్‌మెంట్‌కి 'మెంటల్ పోలీస్' టీమ్ విజ్ఞప్తి శ్రీకాంత్, అక్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మెంటల్ పోలీస్ మూవీ టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సినిమా విడుదల నిలిపివేయాలని | Updated: Apr 27, 2016, 08:16PM IST శ్రీకాంత్, అక్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మెంటల్ పోలీస్ మూవీ టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు హై కోర్టుకి వెళ్లడం... వారి విజ్ఞప్తిపై స్పందించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధించడం వెనువెంటనే జరిగిపోయాయి. అయితే, హై కోర్టు స్టే ఉత్తర్వులపై స్పందించిన మెంటల్ పోలీస్ మూవీ మేకర్స్... పోలీస్ డిపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘం ప్రతినిథులకి ఓ విజ్ఞప్తి చేశారు. "పోలీస్ డిపార్ట్‌మెంట్ గర్వించదగిన విధంగా ఈ సినిమాని తెరకెక్కించాం. అందుకే ముందుగా మీరు ఈ సినిమాని చూడండి. అప్పటికీ మీకు అభ్యంతరకరంగా ఉందని అనిపించినట్టయితే, టైటిల్ మార్చడానికి మాకు ఏ అభ్యంతరం లేదు" అంటూ పోలీస్ డిపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘం ప్రతినిథులని కోరింది మూవీ యూనిట్. మూవీ యూనిట్ విజ్ఞప్తిపై పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిథులు ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!
0business
రాజమౌళికి ఏఆర్ రెహమాన్ ప్రశంసల జల్లు Highlights రాజమౌళికి ఏఆర్ రెహమాన్ ప్రశంసలు బాహుబలి చిత్రంతో రాజమౌళి  దక్షిణాది సినీ పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లారన్న రెహమాన్ రెహమాన్ అభినందనలకు తిరిగి థాంక్స్ చెప్పిన రాజమౌలి భారతదేశం గర్వించదగిన సంగీత దర్శకులలో ఏ.ఆర్. రెహ్మాన్ ఒకరు. భాష ఏదైనా .. ప్రాంతమేదైనా యూత్ లో ఆయనకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి రెహ్మాన్ చాలా అరుదుగా మాత్రమే తాజా సినిమాలపై స్పందిస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆయన 'బాహుబలి 2'పై స్పందించడం విశేషం. చెన్నైలో ఆయన 'బాహుబలి 2' సినిమా చూసిన వెంటనే స్పందించారు. ఈ సినిమాను అద్భుతమైన దృశ్యకావ్యంగా మలిచిన రాజమౌళికి, మంత్రముగ్ధులను చేసే సంగీతాన్ని అందించిన కీరవాణికి ఆయన అభినందనలు తెలియజేశారు. సౌత్ ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారంటూ ప్రశంసలు కురిపించారు. అందుకు వెంటనే రాజమౌళి ప్రతిస్పందిస్తూ .. ఆయన అభినందనలు తమకి ఎంతో ప్రత్యేకమైనవంటూ కృతజ్ఞతలు తెలిపారు.      Last Updated 25, Mar 2018, 11:51 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV వామ్మో.. వచ్చే 2 నెలల్లో రూ.4,000కు పైగా పెరగనున్న బంగారం ధర.. ఎందుకంటే? బంగారం ధర భారీగా పెరిగే అవకాశముంది. ఈ మాట నేను చెబుతున్నది కాదు. రానున్న రోజుల్లో పసిడి పరుగు తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.42,000 చేరొచ్చని పేర్కొంటున్నారు. Samayam Telugu | Updated: Oct 29, 2019, 12:14PM IST వామ్మో.. వచ్చే 2 నెలల్లో రూ.4,000కు పైగా పెరగనున్న బంగారం ధర.. ఎందుకంటే? హైలైట్స్ భారీగా పెరగనున్న బంగారం ధర డిసెంబర్ చివరి నాటికి రూ.4 వేలకు పైగా పరుగు ఇప్పుడు రూ.38 వేలకు సమీపంలో పసిడి ఏడాది చివరకు రూ.42,000 చేరొచ్చంటున్న నిపుణులు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఎందుకంటారేమో వచ్చే రెండు నెలల కాలలంలో బంగారం ధర ఏకంగా రూ.42,000 స్థాయికి చేరొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. భౌగోళిక రాజకీయ అస్థిరతలు, ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తూ వెళ్లడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం వంటి పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ చివరకు 10 గ్రాముల బంగారం ధర రూ.42,000 స్థాయికి చేరొచ్చని అనలిస్ట్‌లు అంచనా వేశారు. Visit Site Recommended byColombia ‘‘మధ్య ప్రాచ్య ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితులు కొనసాగవచ్చు. దీంతో రానున్న రోజుల్లో కామెక్స్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,650 డాలర్లకు చేరొచ్చు. ఎంసీఎక్స్ మార్కెట్‌లో రూ.42,000లకు పెరగొచ్చు’’ అని కామ్‌ట్రెండ్జ్ రీసెర్చ్ కోఫౌండర్, సీఈవో జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. బంగారం ధర ఈ ఏడాది బుల్లిష్‌గానే ఉండొచ్చని ఆయన తెలిపారు. కేంద్ర బ్యాంకులు బంగారం కొంటూ వెళ్లడం కూడా ఇందుకు దోహదపడొచ్చని పేర్కొన్నారు. అలాగే ఈక్విటీస్‌లో ఇయర్ ఎండ్ స్కైరఫ్‌లు కూడా బంగారం డిమాండ్ పెరగటానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.37,900 సమీపంలో, కామెక్స్‌లో ఔన్స్‌కు 1,494 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం.. ఈ ఏడాది బంగారం మంచి రాబడిని అందించిందని, ధర ఏకంగా 15 శాతం మేర పెరిగిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ రీసెర్చ్) నవ్‌నీత్ దమానీ తెలిపారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి 1.4 శాతం పడిపోవడం కూడా పసిడి పరుగుకు కలిసొచ్చిందని పేర్కొన్నారు. Also Read: నెలకు కేవలం రూ.2,000తో చేతికి ఏకంగా రూ.50 లక్షలు..! భవిష్యత్‌లోనూ బంగారం ధర పరుగులు పెట్టొచ్చని ఈయన అంచనా వేశారు. వాణిజ్య ఉద్రిక్తతలు కొంత మేర తగ్గడం వల్ల బంగారం ధరలో కొద్దిగా కరెక్షన్ ఉండొచ్చని ,అయితే ధర మాత్రం బుల్లిష్‌గానే ఉంటుందని అంచాన వేశారు. ఈ ఏడాది చివరకు బంగారం ధర రూ.39,500 స్థాయికి చేరొచ్చని తెలిపారు.
1entertainment
Hyderabad, First Published 12, Oct 2018, 3:20 PM IST Highlights ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా మొదటి రోజు నుంచే రికార్డుల కోతను మొదలుపెట్టింది. ఇప్పటికే బాహుబలి 2 తరువాత అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలిచిన ఈ చిత్రం కొన్ని ఏరియాల్లో తారక్ కు మంచి మార్కెట్ ఉన్నట్లు రుజువుచేసింది.  ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా మొదటి రోజు నుంచే రికార్డుల కోతను మొదలుపెట్టింది. ఇప్పటికే బాహుబలి 2 తరువాత అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలిచిన ఈ చిత్రం కొన్ని ఏరియాల్లో తారక్ కు మంచి మార్కెట్ ఉన్నట్లు రుజువుచేసింది.  ఇక సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అభిమానులు కోరుకునే యాక్షన్ ఎమోషన్ మాటలు ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్న త్రివిక్రమ్ ఎట్టకేలకు కమర్షియల్ హిట్ కొట్టినట్లు క్లారిటీ వచ్చేసింది. మీడియా నుంచి రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. అసలు మ్యాటర్లోకి వస్తే.. అరవింద సమేత శాటిలైట్ హక్కులను ప్రముఖ జీ తెలుగు చానెల్ 23.50కోట్లకు పోటీపడి కొనుగోలు చేసినట్లు సమాచారం.  ఎన్టీఆర్ కెరీర్ లోనే శాటిలైట్స్ హక్కులు ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. యూఎస్ లో ఇప్పటికే సినిమా 1 మిలియన్ మార్క్ ను ఈజీగా దాటేసింది. ప్రస్తుతం పెద్ద సినిమాలు లేకపోవడం హాలిడేస్ ఉండడంతో సినిమాకు మరింత లాభం చేకూరే అవకాశం ఉంది.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV హాఫ్ ఇయర్‌లో 26 శాతం పెరిగిన పరోక్ష పన్నులు 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పరోక్ష పన్నుల విలువ సుమారు 26 శాతం మేర పెరిగిందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఏప్రిల్ -సెప్టెంబరు మధ్య రూ.4.08 లక్షల పన్నుల రూపంలో వసూలయ్యాయి. TNN | Updated: Oct 10, 2016, 08:20PM IST తొలి అర్థభాగమైన ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు పరోక్ష పన్నులు విలువ 25.9 శాతం మేర పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య రూ.4.08 లక్షల కోట్లు పరోక్ష పన్ను రూపంలో వసూలయ్యాయని తెలిపింది. వీటిలో ఎక్సైజ్ డ్యూటీ 46 శాతం మేర పెరుగుదలను నమోదు చేసింది. 2016-17 బడ్జెట్‌లో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో నికర పరోక్ష పన్నుల వాటా 52.5 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. సెంట్రల్ ఎక్సైజ్ నికర పన్ను వసూళ్లు ఏప్రిల్-సెప్టెంబరు మధ్య 46.3 శాతానికి పెరిగి రూ 1.83 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది తొలి అర్థభాగంలోని ఈ వసూళ్లు రూ .1.25 లక్షల కోట్ల మాత్రమే. అటు సేవల రంగంలో కూడా పన్నుల విలువ 22.1 శాతం పెరిగి రూ.1.16 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది ఈ అర్థభాగంలో రూ.97,780 కోట్ల మాత్రమే పన్నులు రూపంలో వచ్చాయి. కస్టమ్స్ విభాగంలో కూడా 4.8 శాతం వృద్ధి రేటు నమోదైంది. దీని విలువ రూ.1.08 లక్షల కోట్లు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.8.47 లక్షల కోట్లు, పరోక్ష పన్నులు రూపంలో రూ.7.79 లక్షల కోట్లు వసూలు అవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
1entertainment
బక్కచిక్కిన రూపాయి: ట్రేడ్ వార్‌తో మనకూ ముప్పేనన్న బిర్లా Highlights దేశ చరిత్రలో అమెరికా డాలర్‌తో రూపాయి విలువ మరింత బక్కచిక్కింది. మార్కెట్ లో ఒకానొక దశలో 69.07 స్థాయికి చేరినా వ్యాపారులు డాలర్లు కొని అడ్డుకోవడంతో 69.05 వద్ద స్థిరపడింది. చైనా - అమెరికా వాణిజ్య యుద్ధంతో ముప్పేనని ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా హెచ్చరించారు. ముంబై: డాలర్‌తో రూపాయి మారకం రేటు కుదేలవుతోంది. అమెరికా కరెన్సీతో రూపాయి మారకం రేటు గురువారం 69.05 వద్ద ముగిసింది. బుధవారంతో పోలిస్తే ఇది 43 పైసలు ఎక్కువ. డాలర్‌తో రూపాయి మారకం రేటు ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం కూడా ఇదే తొలిసారి. గురువారం ఒక దశలో డాలర్‌తో రూపాయి మారకం రేటు 69.07 స్థాయికి కూడా పడిపోయింది. దిగుమతిదారులు, స్థానిక బ్యాంకుల నుంచి డాలర్లకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడడం, రూపాయి మారకం రేటును నిలబెట్టేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. మే 29వ తేదీ తర్వాత రూపాయి మారకం విలువ అత్యధికంగా, కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా ఇదే మొదటిసారి.  తొలి త్రైమాసికంలో సీఏడీ 2.5 శాతం? తొలి త్రైమాసికంలో జీడీపీలో కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) 2.5 శాతానికి చేరే అవకాశం ఉందన్న ఇక్రా అంచనాలు, అమెరికాలో వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాల మధ్య ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం రేటుని దెబ్బతీస్తున్నాయి. వివిధ దేశాల ప్రధాన కరెన్సీలతో డాలర్‌ మారకం రేటు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరడమూ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. చమురు సెగ ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్‌లోనే డాలర్‌తో రూపాయి మారకం రేటు 72కు కూడా చేరే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నదని అంచనాలు ఈ నేపథ్యంలో వచ్చేనెల ఒకటో తేదీన జరిగే సమావేశంలో ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లు మరింత పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రావడానికి ఒకరోజు ముందే రూపాయి విలువ బలహీన పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు మార్కెట్ సెంటిమెంట్‌పై చైనా - అమెరికా వాణిజ్య యుద్ధం ప్రభావం చూపుతున్నదన్న ఆందోళన ఇన్వెస్టర్లు, వ్యాపారుల్లో ఉన్నది. వాణిజ్య యుద్ధంతో మనకూ ముప్పే: బిర్లా భారత ఆర్థిక వ్యవస్థకు స్వల్ప కాలంలో పలు రకాల ముప్పులు పొంచి ఉన్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా హెచ్చరించారు. పెరుగుతున్న చమురు సెగ, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, కోరలు చాస్తున్న కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) తీవ్ర ఆందోళన కలిగించే అంశాలన్నారు. వెంటనే వీటిని కట్టడి చేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. గ్రూపులోని అల్ట్రా టెక్‌ కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశం(ఎజిఎం)లో బిర్లా మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. అభివృద్ధి చెందిన దేశాల స్వీయ వాణిజ్య రక్షణ విధానాలు, ద్రవ్య చలామణిని తగ్గించే విధానాలపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ‘అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముసురుతోంది. ఆ ప్రతికూల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపైనా పడుతుంది’ అన్నారు.   మనకున్న సానుకూలతలు ఇవి.. కొన్ని సమస్యలున్నా మన ఆర్థిక వ్యవస్థ ముందుకు పోయేందుకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నట్టు బిర్లా చెప్పారు. ముఖ్యంగా భారతమాల, కొత్త విమానాశ్రయాలు, మెట్రో నగరాల నిర్మాణం, స్మార్ట్‌ నగరాలు, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం వంటి ప్రాజెక్టులు భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకు పోతాయన్నారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా పెద్ద నోట్ల రద్దు, జిఎ్‌సటితో ఎదురైన కుదుపులను మన ఆర్థిక వ్యవస్థ సరిగానే ఎదుర్కొని బయట పడిందన్నారు. భయపెడుతున్న కరెంట్‌ ఖాతా లోటు కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) మళ్లీ కోరలు చాస్తోంది. చమురు సెగతో ఈ ఆర్థిక సంవత్సరం (2018-19)ముగిసే సరికి సీఏడీ జీడీపీలో 2.5 శాతానికి చేరుకుంటుందని పరపతి రేటింగ్‌ సంస్థ ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం జిడిపిలో సీఏడీ 1.9 శాతం మాత్రమే. రెడీమేడ్‌ దుస్తులు, జెమ్స్‌ అండ్‌ జువెలరీ, ఇనుప ఖనిజం వంటి ప్రధాన ఎగుమతులు తగ్గి విలువైన లోహాలు, రాళ్లు, యంత్రాలు, ఎలకా్ట్రనిక్‌ వస్తువుల దిగుమతులు పెరగడం ఇందుకు ప్రధాన కారణమని ఇక్రా ఆర్థికవేత్త అదితి నాయర్‌ చెప్పారు. Last Updated 20, Jul 2018, 8:39 AM IST
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Nadiminti Narsinga Rao ‘శీలంతో సాయం’.. వేశ్యకథను కళ్లకు కట్టిన రచయిత రతీదేవిలా ఉన్న వెన్నల అందాన్ని చూసి మైమరచిపోతాడు అతడు. అతని కోరికను కాదనలేకపోతుంది వెన్నెల. ఆదివారం నాడు అతన్ని ఇంటికి పిలుస్తోంది. హార్ట్ ఫుల్‌గా రిసీవ్ చేసుకుని.. ఇక్కడ కూర్చోండి.. స్నానం చేసి వస్తానని చెప్తోంది. Samayam Telugu | Updated: Nov 8, 2019, 07:35PM IST నడిమింటి నరసింగరావు వాడొక ప్లే బాయ్. ఒక ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. అమ్మాయిల్ని పటాయించడమే వాడి పని. ఆడది అంటే అనుభవించడానికే అనేది వాడి దృఢ నిశ్చయం. వాడి ఆఫీస్‌లో వెన్నెల అనే అమ్మాయి ఉంటుంది. అచ్చం వెన్నెల మాదిరిగానే ఉంటుంది. అమ్మాయి అలా నడిచి వస్తుంటే.. నయనతార, శ్రీదేవిలను చూసినట్టు చూస్తారు. వీడి కన్ను ఆ అమ్మాయిపై పడుతుంది. ఏంటి ఈ అమ్మాయిలో ఉన్న గమ్మత్తు? ఈమె ఎప్పుడు ఆఫీస్‌కి వస్తుందో తెలియదు. ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఎప్పుడు వచ్చినా వెళ్లినా ఎవరూ ఎందుకు మాట్లాడరు. బాస్ కూడా సైలెంట్‌గానే ఉంటారు. ఇలా వివిధ ఆలోచనలతో నలిగిపోతూ.. నేను ఎంతో మందిని పటాయించా.. దీన్ని ఎందుకు పటాయించకూడదనే ఆలోచన వస్తుంది. Visit Site Recommended byColombia వాడి పక్కన బృహస్పతి అనే ముదురు అకౌంటెంట్ ఉంటాడు. వాడు వీడి బాధను చూసి ఏంటయ్యా తెగ నలిగిపోతున్నావ్ అంటాడు. ఏం లేదు.. వెన్నెలను చూస్తుంటే!! తన ఆలోచన చెప్తాడు. దీనికి ఆలోచించడం ఎందుకు అడిగెయ్ ఓకే అంటుంది అని సలహా ఇస్తాడు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది.. ఏది జరిగినా శరీరానికే కాని ఆత్మకు కాదనుకుంటే ఎన్ని పక్కలైనా మారొచ్చండ అని చెప్పేసరికి.. మనోడికి పక్కలు అనేసరికి తెగ ఉత్సాహం చూపిస్తాడు. మర్నాడు వీడు వెళ్లి వెన్నెలను అడిగేస్తాడు. ఆ అమ్మాయి చిన్న నవ్వు నవ్వి ఎందుకు ఇంత లేటు చేశారు. ఎప్పుడో అడగొచ్చు కదా అని.. ఎప్పుడొస్తారని ఆమె అడిగే సరికి. సండే వస్తానని చెప్తాడు. ఆదివారం రానే వచ్చింది. మనోడు వెన్నెల ఇంటికి వెళ్లాడు. ఆమె హార్ట్ ఫుల్‌గా రిసీవ్ చేసుకుంది. మీరు కూర్చోండి నేను స్నానం చేసి వస్తాను. ఈలోపు మీరు ఈ మందు తాగండి.. ఫారిన్ సరుకు కూడా ఉంది. మందులోకి మంచింగ్ కూడా ఉంది తీసుకోండి అని చెప్పి స్నానానికి వెళ్తుంది. అయితే వెన్నెలను అనుభవిద్ధాం అని వచ్చిన వీడికి చిన్న అనుమానం మొదలౌతుంది. కొంపతీసి ఇది పుట్టుకతోనే వ్యభిచారా? అయినా పర్లేదులే.. ఆమె కండోమ్స్ లేకుండా పోతాయా? మనం సేఫ్‌లే అనుకుంటాడు. ఈ లోపు వెన్నెల తెల్లటి చీరలో రతీదేవిలా తయారైవస్తోంది. అతన్ని చేయి పట్టుకుని బెడ్ రూంలోకి తీసుకుని వెళ్తుంది. ఆ గది చూడగానే అతడు షాక్ అవుతాడు. ఆ గది అంతా ఫస్ట్ నైట్ డెకరేషన్ ఉంటుంది. ఇందేంటి.. నాకు ఇప్పుడు శోభనం ఏంటి.. నేను దీన్ని అనుభవించడానికి వస్తే ఇక్కడ శోభనం డెకరేషన్ ఉందని బాగా థ్రిల్ అవుతాడు. ఇద్దరూ కలిసి బెడ్ మీదికి వెళ్తారు. ఆ టైంలో మీరు నాకు ఒక చిన్న సాయం చేయాలని అంటోంది. దానికి ఓకే అంటే మనం కార్యక్రమం మొదలుపెట్టేయొచ్చు అంటోంది. వీడు ఇలాంటి వాటికి బాగా అలవాటు పడి ఉంటాడు కదా.. వీళ్లు వేశ్యలు డబ్బులు ఎప్పుడు అడిగితే బాగుంటుందో బాగా తెలుసు. ఇదీ అంతే అనుకుని ఓకే అంటాడు. మీరు ఏమీ అనుకోకపోతే.. మీకు మూడ్ వచ్చే వరకూ ఓ చిన్న కథ చెబుతా అని అంటోంది. హా.. సరే చెప్పు అంటాడు. నేను చిన్నప్పటి నుండి మా మావయ్య ఇంట్లో పెరిగాను. మా మావయ్య నాపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. మావయ్య స్కూల్ టీచర్ కదా అని నేను అతని దగ్గర ఉంటే.. బాగా చదువుకుంటానని నన్ను ఇక్కడికి పంపించారు మా అమ్మా నాన్నలు. ఇక్కడ మా మావయ్య చిన్నదానికి పెద్దదానికి పెళ్లాన్ని పుట్టింటికి పంపించేసి.. నాతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. నాకు చాలా అసహ్యంగా అనిపించేది. వయసుతో పాటు అతని చేష్టలు కూడా పెరుగుతూ వచ్చాయి. వీడి ఇంకా ఏం చేస్తాడో అని విషయం అమ్మతో చెబితే.. నోర్ముయ్!! ఏంటా వెధవ వేషాలు. మావయ్య దేవుడు అంది. సరే తండ్రితో చెప్పినా.. లాభం లేకపోయింది. మావయ్య అలాంటి వాడు కాదు.. ఎలా చెబితే అలా విను అని తిట్టాడు. ఇది విన్న మావయ్యకు లిబర్టీ వచ్చేసింది. పెళ్లాన్ని పుట్టింటికి పంపించేసి ఇక్కడ ఈ అమ్మాయిని చిత్ర హింసలు పెట్టేవాడు. అనుభవించడం మొదలు పెట్టాడు. మావయ్యా.. నొప్పిగా ఉంది. వద్దు మావయ్యా.. వద్దు మావయ్యా అని వేడుకున్నా వదల్లేదు. కనికరించలేదు. చిన్నదైతే ఏంటి? పెద్దదైతే ఏంటి అని అనుభవించాడు. అయితే ఈ విషయం వాడి భార్యకు తెలుస్తోంది. ఏమే..! ఇంట్లో ఉంచుకున్నందుకు మా ఆయన్నే మరిగావా? నీకు కృత‌జ్ఞత లేదా? నువ్ చెడిపోయినదానివే కాకుండా.. మా ఆయన్ని కూడా చెడిపేశావ్ అనే ముద్రవేసి రోడ్డుమీదకి నెట్టేసింది. రోడ్డు మీదికి వచ్చిన ఆమెను వేశ్య వేశ్య అని అంటుంటే.. ఆమె నా పరిస్థితి ఏంటి? అని ఆలోచనలో పడుతుంది. చెడిపోయిన నన్ను ఇప్పుడు ఎవడు పెళ్లి చేసుకుంటాడని బాధ పడుతుంది. అసలు చెడిపోవడం అంటే ఏమిటి? అన్నదానిపై ఒక ఆలోచనకు వస్తుంది. ద్రౌపతి ఐదుగుర్ని చేసుకుంది ఆమె చెడిపోయినట్టా..? భార్య చనిపోయినప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే చెడిపోయినట్టా? అని ఆలోచించి ఓ బోల్డ్ డెసిషన్ తీసుకుంటుంది. ఏ శీలం అయితే ఇది పోగొట్టుకుంది.. చెడిపోయిందని అంటున్నారో. అదే శీలాన్ని అడ్డుపెట్టుకుని నేనెందుకు పదిమందికి సాయం చేయకూడదనే నిర్ణయానికి వస్తుంది. అక్కడ నుండి నేను ఈ పని చేయడం మొదలుపెట్టా. మీరు రోజూ నేనెందుకు రోజూ ఆఫీస్‌కి లేటుగా వస్తున్నానని మీకు అనుమానం వస్తుందికదా.. నేను పడుకుంటేనే మన బాస్ కొడుక్కి అమెరికా వీసా వచ్చింది. మన అటెండర్ కూతురి గుండె ఆపరేషన్‌ డబ్బులు కోసం నేను ఒకడి దగ్గర పడుకుంటేనే ఆమె బతికింది. ఇందులో పాపం పుణ్యం అంటే నాకు అర్ధం తెలియదు. ప్రజాసేవ చేయాలంటే నాయకులం కానక్కర్లేదు. నేను ఈ రకంగా ప్రజాసేవ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుండి ఇదే దారిలో వెళ్తున్నా. రేపొక అర్జెంట్ ఆపరేషన్ ఉంది. ఒకరికి కిడ్నీ ఆపరేషన్ జరగాల్సి ఉంది. నేను మీకు కావాలా? అయితే సాయం చేయండి. మీకు ఓకే అంటే నేను లైట్ ఆర్పేస్తా అంది. వెంటనే వాడు జేబులో నుండి పదివేలు తీసి ఆ మంచం మీద పెట్టేస్తి ఈ మాట అంటాడు.. ‘సీతాకోకచిలుకను అనుభవించడానికి వచ్చిన నేను.. ఈ వెన్నెల వ్యక్తిత్వానికి సిగ్గు పడి, తలదించుకుని గొంగలి పురుగునై బయటకు నడిచాను’. ‘అనుభవించడానికే ఆడది అనుకునే ప్రతి మగాడికి ఈ కథ అంకితం’ అని సినీ రచయిత నడిమింటి నరసింగరావు ఐ డ్రీమ్స్ టీఎన్ఆర్‌కి ఈ బోల్డ్ కథను కళ్లకు కట్టినట్టు చెప్పారు. X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 14, Apr 2019, 12:21 PM IST Highlights ఒకప్పటి సౌత్ హీరోయిన్ సంగీత ప్రస్తుతం ఊహించని వివాదంతో అందరిని ఆశ్చర్యపరిచారు. తల్లితో గత కొంత కాలంగా విబెధాలు రావడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో సంగీత సోషల్ మీడియాలో తల్లి గురించి వివరణ ఇచ్చారు.  ఒకప్పటి సౌత్ హీరోయిన్ సంగీత ప్రస్తుతం ఊహించని వివాదంతో అందరిని ఆశ్చర్యపరిచారు. తల్లితో గత కొంత కాలంగా విబెధాలు రావడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో సంగీత సోషల్ మీడియాలో తల్లి గురించి వివరణ ఇచ్చారు.  ఏ తల్లి కూడా చేయనివన్నీ నువ్ చేసావ్.. నన్ను ఎంతో బాధపెట్టిన నీకు దండం అని సంగీత పలు విషయాలను పేర్కొన్నారు. తన కూతురు సంగీత నా ఇంటిని ఆక్రమించింది అంటూ భారతి ఇటీవల మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా సంగీత ఈ విధంగా స్పందించారు.  ఇష్టం వచ్చినప్పుడు నీ అవసరాలకు నన్ను అడ్డా దారులు తొక్కించావ్. అవసరమైనప్పుడు ఖాళి చెక్కులపై సంతకాలు పెట్టించుకున్నావ్. 13 ఏళ్లకే నా చదువును ఆపేయించావ్. అందుకు కృతజ్ఞతలు. నీ కొడుకులు తాగి తప్పు దారిలో నటిస్తుంటే ప్రశ్నించినందుకు ఇంట్లో బంధించావ్. బయటకు నెట్టేశావ్. నా భర్తపై ఒత్తిడి చేశావ్. నా ఫ్యామిలీకి సంతోషాన్ని లేకుండా చేశావ్. దానికి కూడా కృతజ్ఞతలు.  ఒక తల్లి ఏదైతే చేయకూడదో అలానే నువ్ అన్ని చేసి నాపై అసత్య ప్రచారాన్ని మోపావ్. చివరికి నీ ద్వారా నేను మరింత బలంగా మారి పోరాట యోధురాల్ని అయ్యేలా చేసావ్. ఈ  విషయాన్నీ ఎప్పటికి మకరచిపోలేను. ఎదో ఒకరోజు నన్ను చూసి నువ్వే గర్వపడతావ్ అని సంగీత సోషల్ మీడియా ద్వారా తన వివరణ ఇచ్చింది.  Last Updated 14, Apr 2019, 12:21 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఐపీఎల్‌కి ముందు చిక్కుల్లో నరైన్.. కోల్‌కతాకు కష్టాలేనా? ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి భారీ ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ వచ్చే ఐపీఎల్ సీజన్లో బరిలో దిగడం అనుమానంగా మారింది. Samayam Telugu | Updated: Mar 16, 2018, 06:26PM IST <br /> <br /> <br /> ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్&zwnj;కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి భారీ ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ వచ్చే ఐపీఎల్ సీజన్లో బరిలో దిగడం అనుమానంగా మారింది. విండీస్ స్పిన్నర్ అయిన నరైన్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్&zwnj;లో ఆడుతున్నాడు. లాహోర్ క్వాలాండర్స్ తరఫున బరిలో దిగుతున్న నరైన్ బౌలింగ్ యాక్షన్&zwnj;పై అనుమానం వ్యక్తమైంది. దీంతో బౌలింగ్ యాక్షన్ సరిచేసుకోవాలని అధికారులు హెచ్చరించారు. కానీ మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇచ్చారు. Visit Site Recommended byColombia బుధవారం క్వెట్టా గ్లేడియేటర్స్&zwnj;తో షార్జాలో జరిగిన మ్యాచ్&zwnj;లో నరైన్ బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అతడి బౌలింగ్ యాక్షన్&zwnj;ను విండీస్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పారు. కోల్&zwnj;కతా కెప్టెన్&zwnj;గా కొనసాగిన గంభీర్ ఈ ఏడాది ఢిల్లీకి మారడంతో.. కేకేఆర్ జట్టు నరైన్&zwnj;ను తమతో అట్టిపెట్టుకుంది. గతేడాది బౌలింగ్&zwnj;తోనే కాకుండా.. ఓపెనర్&zwnj;గా నరైన్ అద్భుత ఆటతీరు కనబర్చాడు. నరైన్ బౌలింగ్ వివాదాస్పదం కావడం ఇదే తొలిసారి కాదు. 2014లో భారత్&zwnj;లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ సమయంలో మొదటిసారి నరైన్ బౌలింగ్ వివాదాస్పదమైంది. దీంతో అతడు 2015 వరల్డ్ కప్&zwnj;కి దూరమయ్యాడు. బౌలింగ్ యాక్షన్ మార్చుకున్నాకే తిరిగి జట్టులోకి వచ్చాడు. 2016 నవంబర్లో నిర్వహించిన బయో మెకానికల్ టెస్టులో నరైన్ 15 డిగ్రీల పరిమితికి మించి మోచేతిని వంచుతున్నాడని తేలింది. దీంతో సస్పెన్షన్&zwnj;కు గురయ్యాడు. 2016 ఐపీఎల్ నాటికి నరైన్ బౌలింగ్ యాక్షన్ సరి చేసుకొని కోల్&zwnj;కతా తరఫున బరిలో దిగాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
దుమ్మురేపిన ఎస్‌బీఐ.. Sat 26 Oct 00:34:31.900383 2019 దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) అదిరిపోయే ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో మూడు రెట్ల వృద్ధితో రూ.3,011.73 కోట్ల నికర లాభాలు చిన్నారులకూ పొదుపు ఖాతాలు: ఎస్‌బీఐ Sun 15 Apr 04:22:03.525575 2018 ముంబయి: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) చిన్నపిల్లలు కూడా బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతాలు తెరిచే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.పెహల ఇన్ఫోసిస్‌ భారీ బోనంజా Sat 14 Apr 05:12:35.908708 2018 బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ తమ వాటాదారులకు భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. భారీ నగదు నిల్వలు కలిగిన ఈ ఐటి కంపెనీ 2018 మార్చి 31 ఆర్ధిక సంవత్స రూ.20 కోట్ల బిట్‌కాయిన్లు దొంగతనం Sat 14 Apr 05:12:41.343018 2018 న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ కాయిన్‌ సెక్యూర్‌ నుంచి రూ. 20కోట్ల విలువైన 438 బిట్‌కాయిన్లు చోరీకి గురైయ్యాయి. దీనిపై ఢిల్లీకి చెందిన ఈ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛ రూ.350 తగ్గిన పసిడి Sat 14 Apr 05:12:47.362963 2018 న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధర శుక్రవారం ఒకే సెషన్‌లో రూ.350 తగ్గి రూ.32వేల దిగువన చోటు చేసుకుంది. అదే విధంగా కిలో వెండి ధర కూడా రూ.40,000 దిగువ పారిశ్రామికోత్పత్తి నేల చూపులు.. Fri 13 Apr 03:28:52.818871 2018 న్యూఢిల్లీ: వరుసగా గత నాలుగు నెలలుగా వృద్ధిపథంలో కొనసాగిన దేశ పారిశ్రామికత్పోత్తి ఫిబ్రవరిలో మళ్లీ మందగించింది. దీంతీ ఆ మాసంలో దేశ పారిశ్రామికోత్పత్తి 7.1% వృద్ధిని మాత్ర మార్కెట్లో భగ్గుమంటున్న బంగారం ధరలు Fri 13 Apr 03:28:58.183859 2018 న్యూఢిల్లీ: వివాహాల సీజన్‌కు తోడు అక్షయ తృతీయ పర్వదినం దగ్గర పడుతున్న నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో తాజాగా పది గ్రాముల బంగారం ధర రూ.31వేల మార్కును అధిగమిం జియో నుంచి సిమ్‌కార్డు ల్యాప్‌టాప్‌లు Fri 13 Apr 03:29:04.482205 2018 ముంబయి: దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో మార్కెట్లో తన విస్తృతిని మరింతగా విస్తరించుకోవాలని యోచి స్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉచిత సిమ్‌ కార్డులు.. తక్కువ ధరలకే అపర చిన్న నగరాలపైనా దృష్టి: టైటాన్‌ Fri 13 Apr 03:29:09.902325 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విస్తరించడంపై తాము దృష్టి సారిస్తున్నట్టుగా టైటాన్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ భట్‌ తెలిపారు. హై ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లోకి ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రా Fri 13 Apr 03:29:17.862164 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎస్‌.ఎస్‌. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కన్సెల్టెన్సీ (ఎస్‌ఎస్‌ఇన్‌ఫ్రా) సంస్థ గురువారం నేషనల్‌ స్టాక్‌ బీబీబీ కొత్త చైర్మెన్‌గా భాను ప్రతాప్‌ శర్మ Fri 13 Apr 03:29:25.690392 2018 న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ 'బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో'ను (బీబీబీ) పునర్‌వ్యవస్థీకరించింది.బీబీబీ ప్రస్తుత చైర్మెన్‌గా వ్యవహరిస్తున్న మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జన వేడుకగా పీఎన్‌బీ వ్యవస్థాక దినోత్సవం Fri 13 Apr 00:23:29.988831 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) వ్యవస్థాప దినోత్సవం వేడుకలు పీఎన్‌బీ తెలంగాణ సర్కిల్‌లో ఘనంగా జరిగాయి. పీఎన్‌బీ ప్రతీ ఏడాది ఏప్రిల్‌ 12ను వ తడబడి.. నిలబడిన మార్కెట్లు! Fri 13 Apr 00:23:01.53733 2018 ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరసగా ఆరో సెషన్‌లోనూ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతయ సానుకూలత నేపథ్యంలో గురువారం ఉదయం స్టాక్‌మార్కెట్లు ఉత్సా హంగా ప్రారంభ మయ్యాయి. అయితే పుట్టింటోళ్లు వదిలేశారా..! Thu 12 Apr 04:54:46.839597 2018 ముంబయి: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో కీలక వాటా కొనుగోలుకు తొలత ఆసక్తి కనబరిచిన సంస్థలన్నీ.. క్రమంగా రేసు నుంచి తప్పుకుంటున్నాయి. ఎయిరిండియాలో కీలక వాటా కొనుగో భారతలోకి సౌదీ ఆరామ్‌కో Thu 12 Apr 04:55:45.178622 2018 న్యూఢిల్లీ: భారత ఇంధన చరిత్రలో బుధవారం అతిపెద్ద అడుగు పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు సంస్థ సౌదీ ఆరామ్‌కో తాజాగా భారత్‌లో విస్తరించనున్నట్టుగా ప్రకటించింద ఎయిర్‌టెల్‌ నుంచి రూ.249 ప్లాన్‌ Thu 12 Apr 04:55:51.686751 2018 ముంబయి: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌ టెల్‌ మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటించింది. మార్కెట్లో తన ఆధిపత్యాను నిలపుకొనేం దుకు గాను ఎయిర్‌టెల్‌ సంస్థ దూకుడుగా వ్యవహరిస జారిన చమురు రంగపు షేర్లు.. Thu 12 Apr 04:55:59.17805 2018 ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. అంతరా ్జతీయం గా మిశ్రమ పవనాలు కనిపిం చినప్పటికీ బుధవారం కూడా స్టాక్‌ మార్కెట్లు లాభాలలో ముగి శాయి. తొలత ఆసియా భారత్‌ వృద్ధి7.3 శాతం: ఏడీబీ Thu 12 Apr 04:56:05.657012 2018 న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19) గానూ భారత్‌ వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదయ్యే అవకాశముందని 'ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌' (ఏడీబీ) అంచనా కట్టింది. జీఎస్‌ట బికారీగా.. మహారాజా! Wed 11 Apr 06:36:27.724016 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా పరిస్థితి దారుణంగా తయారైంది. దేశీయ విమానయాన రంగంలో మహారాజాగా వెలుగొందిన ఎయిరిండియా .. ప్రస్తుతం ప్రభుత్వ నాస్కామ్‌ కొత్త చైర్మెన్‌గా రిషద్‌ ప్రేమ్‌జీ Wed 11 Apr 06:36:34.529524 2018 బెంగళూరు: ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ కంపెనీల సంఘం 'నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌' (నాస్కామ్‌) కొత్త చైర్మెన్‌గా విప్రో సంస్థ స్ట్రాటెజీ ఆఫ రూ.90,000 కోట్లకు చేరువైన డీ-మార్ట్‌ Wed 11 Apr 06:36:40.703298 2018 ముంబయి: డీ-మార్ట్‌ బ్రాండ్‌తో దేశ వ్యాప్తంగా సూపర్‌ మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ సంస్థ షేర్లు స్టాక్‌ మార్కెట్లలో దూసుకుపోతున్నాయి. దీంతో ఆ కంపెనీ మ ఆద్యంతం ఊగిసలాటలో మార్కెట్లు Wed 11 Apr 06:36:46.624076 2018 ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతరా ్జతీయ అనుకూల పవనాలు, దేశీయంగా సానుకూలత నేపథ్యంలో మంగళవారం స్టాక్‌ మార్కెట్లు ఉదయం నుంచే జోరంద ఎయిర్‌టెల్‌ నుంచి ఐపీఎల్‌ 'ప్లాన్‌' Wed 11 Apr 06:36:52.518564 2018 న్యూఢిల్లీ: జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో టారీఫ్‌ యుద్ధం అంతకంతకు తీవ్రతరమవుతోం ది.ముఖ్యంగా జియో వరుస ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో మిగతా సంస్థలూ ఆ దిశ 15 నుంచి రాష్ట్రంలో ఈ-వే బిల్‌ అమలు Wed 11 Apr 06:37:02.443457 2018 న్యూఢిల్లీ: కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన వస్తుసేవల పన్నులో (జీఎస్టీ) భాగంగా అంతరాష్ట్ర సరుకు రవాణాపై అమలులోకి తేచ్చిన ఈ-వే బిల్లు విధానం వచ్చే ఆదివారం (15వ తేదీ) నుంచి త కొచ్చర్‌ పదవికి ఎసరు..! Tue 10 Apr 04:40:55.659677 2018 ముంబయి: వీడియోకాన్‌ రుణ మంజూరీ విషయం రోజురోజుకు వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ అధినేత్రి చందాకొచ్చర్‌ భవితవ్యంపై నీలి మేఘాలు అలుముకుంటున్నాయి. రుణ మంజూరీలో పీఎన్‌బీలో మోడీ మోసం మూడ్రోజుల వడ్డీతో సమానం.. Tue 10 Apr 04:41:01.508611 2018 ముంబయి: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో (పీఎన్‌బీ) వెలుగు చూసిన స్కామ్‌ దేశీయ బ్యాంకింగ్‌ రంగాన్ని కుదేలు చేసేంత పెద్దదేమీ కాదని.. దీని కోసం పెద్దగా చింతించాల్సిన పని లేదంటున్ మదుపరి మురిసే... Tue 10 Apr 04:41:08.142744 2018 ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు, దేశీయ అనుకూలతల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌ను శుభారంభం చేశాయి. మార్ లాభాల్ని పంచిన 'లెమన్‌ ట్రీ' Tue 10 Apr 04:41:13.928886 2018 ముంబయి: ఆతిథ్య రంగ సంస్థ లెమన్‌ ట్రీ హోటల్స్‌ స్టాక్‌ మార్కెట్లలోకి అదిరిపోయే ఎంట్రీని చ్చింది. మొట్టమొదటి ట్రేడింగ్‌లోనే లాభాల మోతమోగించింది. ఇష్యూ ధర రూ.56 కాగా స్టాక్‌ శిఖా పదవీకాలం కుదింపు Tue 10 Apr 04:41:19.575334 2018 ముంబయి: దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ యాక్సిస్‌ బ్యాంక్‌ అధినేత్రి పదవి నుంచి తనను ముందుగానే తప్పిం చాలంటూ ఆ బ్యాంక్‌ సీఎండీ శిఖాశర్మ చేసుకున్న విజ్ఞప్తికి బోర్డ ఐసీఐసీఐ బ్యాంక్‌పై సర్కారు నజర్‌ Sun 08 Apr 06:54:40.357192 2018 న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐలో లుకలుకలు వెలుగు చూస్తున్న వేళ.. సర్కారు అప్రమత్తమైంది. ఆ బ్యాంక్‌ బోర్డులో ప్రభుత్వం తరఫు నామినీని మార్చుతూ ఆరు నెలల్లో పుంజుకుంటాం.. Sun 08 Apr 06:54:46.935386 2018 న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో అతిపెద్ద స్కామ్‌ వెలుగులోకి వచ్చి ఆ బ్యాంక్‌ ప్రతిష్ట మసకబారినప్పటికీ తాము కేవలం ఆరు నెలల కాలంలోనే తిరిగి పుంజుకొన్ని పూర్వ వైభవాన్ నేడు అరుణ్‌ జైట్లీకి కిడ్నీ శస్త్రచికిత్స! Sun 08 Apr 06:54:53.649055 2018 న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ (65) 'ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌'లో (ఎయిమ్స్‌) చేరారు. శనివారం మూడేండ్లలో మార్కెట్లోకి ఏయిరిండియా Sun 08 Apr 06:55:00.092077 2018 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని విమానయాన సంస్థ ఎయిరిండి యాలో కీలక వాటాను కొనుగోలు చేయనున్న సంస్థకు సర్కారు కొత్త ట్విస్ట్‌ ఇవ్వనుంది. సంస్థలో కీలక వాటాను కొనుగోలు చేసేందుకు నష్టపోయింది సామాన్యుడే..! Sat 07 Apr 11:15:12.220511 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. పేరుకు ఈ సమావేశాలు బడ్జెట్‌-2018 పద్దుపై సమాలోచనలు జరిపేందుకు ఉద్దేశించిన బడ్జెట్‌ సమావేశా ఆర్‌బీఐ అధికారులపై సీబీఐ విచారణ Sat 07 Apr 11:15:19.725046 2018 న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) స్కామ్‌ భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మెడకూ చుట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ మోసంలో కేంద్ర బ్యాంకు ప్రాతపై ఆరా తీస్త ప్రయివేటీకరణకు ఇది సమయం కాదు.. Sat 07 Apr 11:15:25.634477 2018 న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో (పీఎన్‌బీ) వెలుగు చూసిన భారీ స్కామ్‌ నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగం ప్రయివేటీకరణపై దేశ వ్యాప్తంగా చర్చ జరగుతోంది. ఈ విషయంపై భారతీయ స్టే ప్రయివేటు బ్యాంకుల్నీ జాతీయం చేయాలి Sat 07 Apr 11:15:32.847522 2018 న్యూఢిల్లీ: రోజుకో స్కామ్‌ వెలుగులోకి వచ్చి దేశీయ బ్యాంకింగ్‌ రంగం మసకబారుతున్న వేళ 'ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్‌ఫెడరేషన్‌' (ఏఐబీఓసీ) వినూత్న డిమాండ్‌ను లేవనెత్తి హాంకాంగ్‌లో స్కామ్‌స్టార్‌ మోడీ: సర్కారు Sat 07 Apr 11:15:39.307731 2018 న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) స్కామ్‌కు పాల్పడి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ హాంకాంగ్‌లో ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ప సవరణకు ససేమిరా.. Fri 06 Apr 06:36:08.214004 2018 న్యూఢిల్లీ/ ముంబయి: ఊహించిందే జరిగింది. భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలో గురువారం సమావేశమ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి తీవ్ర అస్వస్థత! Fri 06 Apr 06:38:51.772146 2018 న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (65) మూత్రపిండాల సంబంధిత తీవ్ర అనారోగ్యంతో భాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటి వద్ద నుంచే ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తు స్టాక్‌ మార్కెట్లకు ఆర్‌బీఐ పాలసీ 'కిక్‌' Fri 06 Apr 06:39:21.781344 2018 ముంబయి: దేశీయ మార్కెట్లు గురువారం ధగధగలాడాయి. అంతర్జా తీయంగా సానుకూల సంకేతాలు, ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు ఉరకలేసిన ఉత్సాహంతో పరుగులు పెట్టాయి. ఆర్‌బీఐ వడ్డ ట్రేడ్‌వార్‌ టెన్షన్‌..! Thu 05 Apr 06:40:41.221333 2018 అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది. ఇరు దేశాలు పరస్పరం దిగుమతి చేసుకునే వస్తువులపై పోటాపోటీగా సుంకాన్ని పెంచుకుంటూ బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రతిపాదన లేదు Thu 05 Apr 06:40:46.431093 2018 న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో వెలుగు చూస్తున్న అనుచిత కార్యకలాపాల నియంత్రణకు గాను సర్కారు బ్యాంకులను ప్రయివేటికరించనుందని వస్తున్న వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది.
1entertainment
England, First Published 3, Sep 2018, 5:02 PM IST Highlights అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ వీడ్కోలు పలికాడు.. ఈ నెల 7వ తేదీన భారత్‌తో  జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన క్రికెట్ జీవితంలో చివరి మ్యాచ్‌గా కుక్ ప్రకటించాడు.  అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ వీడ్కోలు పలికాడు.. ఈ నెల 7వ తేదీన భారత్‌తో  జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన క్రికెట్ జీవితంలో చివరి మ్యాచ్‌గా కుక్ ప్రకటించాడు. ఇంగ్లాండ్‌ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా కుక్ చరిత్ర లిఖించాడు. రెండు దశాబ్ధాలకు పైగా క్రికెట్ ఆడిన కుక్ తన క్రీడా జీవితంలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.. అత్యంత పిన్న వయస్సులో టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాడిగా కుక్ సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. సచిన్ 31 ఏళ్ల 326 రోజుల వద్ద ఈ మైలురాయిని బద్ధలు కొడితే.. కుక్ 31 సంవత్సరాల 157 రోజుల్లోనే ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు ఇంగ్లాండ్ తరపున పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు అతనే.  సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి:
2sports
విజయ్ అట్లి,  తెన్నాండల్ స్టూడియోస్, శరత్ మరార్ " అదిరింది" షూటింగ్ పూర్తి Highlights విజయ్ హీరోగా తెలుగులో విడుదలౌతున్న ‘ అదిరింది’ దర్శకత్వం వహిస్తున్న స్టార్  డైరెక్టర్ అట్లీ  హీరోయిన్లుగా సమంత, కాజల్, నిత్యామీనన్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు మూడు రాష్ట్రాల్లో  అద్భుతమైన స్పందన లభించింది. అటు విజయ్ అభిమానులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు, సినీ వర్గాలు అదిరింది టైటిల్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెన్నాండల్ బ్యానర్లో నిర్మిస్తున్న వందో చిత్రం కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరాలందిస్తున్నారు. తెన్నాండల్ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి తెలుగులో అదిరింది చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.    మురళీ రామస్వామి మాట్లాడుతూ… నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ అధినేత శరత్ మరార్ తో కలిసి తెన్నాండల్ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నాం.  ప్ర‌ముఖ నిర్మాత శరత్ మరార్ గారు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో ఈ దీపావ‌ళి కి గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి భారీ చిత్రాలు నిర్మించిన శరత్ మరార్ గారికి టీవీ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి పేరుంది. ఆయనతో అసోసియేట్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.  అని అన్నారు.    శరత్ మరార్ మాట్లాడుతూ… విజయ్ 61వ చిత్రం, తెన్నాండల్ స్టూడియోస్ వందో చిత్రం అదిరింది సినిమాతో అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తెలుగులో దీపావ‌ళి కి  గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. విజయ్ కు తెన్నాండల్ స్టూడియోస్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. అని అన్నారు.    ప్రపంచం గర్వించదగ్గ చిత్రం బాహుబలి, సల్మాన్ ఖాన్ కు భారీ హిట్ అందించిన భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ అదిరింది చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ తో పాటు ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఈచిత్ర షూటింగ్ జరిగింది. ఆగస్ట్ లో ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ మొదలు పెట్టారు. అక్టోబర్ లో ఈచిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.    నటీనటులు - విజయ్, ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్.    సాంకేతిక నిపుణులు సంగీతం - ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం - వివేక్ సినిమాటోగ్రాఫర్ - జి.కె.విష్ణు ఎడిటర్ - రుబన్ యాక్షన్ - అనల్ అరసు కొరియోగ్రఫి - శోభి స్టోరీ - విజయేంద్రప్రసాద్ స్క్రీన్ ప్లే - విజయేంద్ర ప్రసాద్ నిర్మాతలు - మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - అట్లీ Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV హిజ్రా పాత్ర చేయడంలేదు టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్ తన తర్వాతి సినిమాలో ఓ హిజ్రా పాత్ర పోషిస్తున్నాడని అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో ఓ ప్రచారం... TNN | Updated: Jan 10, 2016, 04:09PM IST హిజ్రా పాత్ర చేయడంలేదు టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్ తన తర్వాతి సినిమాలో ఓ హిజ్రా పాత్ర పోషిస్తున్నాడని అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో ఓ ప్రచారం జరుగుతోంది. ఏ పాత్రనయినా అవలీలగా చేయగల ధైర్యవంతుడు కనుక అది నిజమే అయి వుండవచ్చని భావించారంతా. కానీ తాజాగా తెలిసింది ఏంటంటే అదంతా నిజం కాదని. అవును హిజ్రా పాత్ర విషయమై విక్రమ్‌ని వివరణ కోరగా విక్రమ్ నుంచి అటువంటిదేమీ లేదని సమాధానం వచ్చింది. ప్రస్తుతం మలేషియాలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేయనుండగా విక్రమ్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించనుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తోపాటే మ్యూజిక్ కంపోజింగ్ వర్క్ కూడా పూర్తిచేస్తున్నారు మేకర్స్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
కె.రాఘవేంద్రరావు టీటీడీ బోర్డు చైర్మన్.. నిజం లేదు Highlights గత కొంత కాలంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు టీటీడీ చైర్మన్ అంటూ పుకార్లు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లతో రాఘవేంద్రరావుకు అభినందనల వెల్లువ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదన్న దర్శకేంద్రుడు  ఎస్వీబీసీ ఛానెల్లో శ్రీవారి పై కొత్త ప్రోగ్రామ్స్ రూపొందించడం తనకెంతో ఆనందమన్న దర్శకేంద్రుడు గత రెండు,మూడు రోజులుగా కొన్ని పత్రికలలో, సోషల్ మీడియా లో 'దర్శకేంద్రుడు' కె.రాఘవేంద్ర రావు తి.తి.దే చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు రావడంతో వేలాది మంది ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కె.రాఘవేంద్ర రావు ఖండించారు. ఎస్.వి.ఎస్.సి ఛానల్ ద్వారా స్వామివారి సేవ చేస్తున్న తాను ఈ ఛానల్ లో స్వామివారి పై మరిన్ని కొత్త ప్రోగ్రామ్స్ ని వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటి ని అలరిస్తూ స్వామివారి సేవ లో తరించాలన్నది ఒకటే తన కోరిక అని 'దర్శకేంద్రుడు' కె.రాఘవేంద్ర రావు స్పష్టం చేశారు. Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0business
ram gopal varma intresting tweet on gautamiputra satakarni శాతకర్ణి భేష్ అంటూనే వర్మ సెటైర్లు వివాదాల వర్మ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా రిలీజ్ కావడంతో ట్వీట్ చేశాడు. తన తీర్పు నిజమైందని అంటూనే మరో సినిమాపై సెటైర్స్ వేయడంతో హాట్ టాపిక్‌గా మారాడు. TNN | Updated: Jan 12, 2017, 03:03PM IST వివాదాల వర్మ సాధారణంగా పలానా సినిమా బాగుందని అనడు. నాకు నా సినిమాలే నచ్చవు ఇంకో సినిమా బాగుందని ఎలా చెప్తా అని పలు సందర్భాలలో తెలిపాడు. కాని నందమూరి బాలకృష్ణ వందో చిత్రం &lsquo;గౌతమిపుత్ర శాతకర్ణి&rsquo; చిత్రంపై మొదటినుండి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్న వర్మ తాజాగా ఆ సినిమా రిలీజ్ కావడంతో బాలయ్యపై ప్రశంసల జల్లు కురిపించారు. తన తీర్పు నిజం కావడం చాలా థ్రిల్&zwnj;గా ఉందన్నారు. యదార్థ కథతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఆకాశానికి తీసుకెళ్లారని ఇందుకు దర్శకుడు క్రిష్&zwnj;, బాలయ్యకు తాను సెల్యూట్&zwnj; చేస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు క్రిష్&zwnj;కు, బాలయ్యకు 100 చీర్స్&zwnj; అని ట్వీట్&zwnj; చేశారు.
0business
రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే Highlights రజినీ కాంత్, శంకర్ ల రోబో 2.0 చిత్రం విడుదల వచ్చే ఏప్రిల్ లో.. ఏప్రిల్ లో  రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన బాహుబలి రిలీజైన ఏప్రిల్ 27నే రోబో 2.0 కూడా.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.   ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తెలియజేశారు.   ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కూడా ఈ సినిమా అన్ని హంగులూ పూర్తి చేసుకుని ఏప్రిల్ 27న విడుదలవుతుందని ట్వీట్ చేశాడు. బాహుబలి ఏప్రిల్ 27,2017న రిలీజై సంచలన విజయం నమోదు చేసిందని, 2.0 కూడా అదే రోజు ఈ సంవత్సరం విడుదలై చరిత్ర సృష్టించబోతుందా అంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇక ఇదే రోజున బాలీవుడ్ మూవీ ఎవెంజర్స్ కూడా భారత్ లో రిలీజ్ కానుంది. మొత్తానికి హాలీవుడ్ మూవీతో పోటీపడి సత్తా చాటేందుకు రజినీ,శంకర్ ల రోబో ముస్తాబవుతోందని తెలుస్తోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌. Last Updated 25, Mar 2018, 11:56 PM IST
0business
Lamborgi లాంబోర్గిని నుంచి సూపర్‌ఫాస్ట్‌ కారు న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ కంపెనీలాంబోర్గిని తాజాదా తన సూపర్‌ఫాస్ట్‌ కారు హురాకాన్‌ పెర్ఫార్మెంట్‌ను భారత్‌కు విడుదలచేస్తోంది. లాంబోర్గిని ఆధునిక ఫీచర్లన్నింటితోను ఉన్న ఈ సూపర్‌ స్పోర్ట్స్‌కారు డైనమిక్‌ రోడ్‌డ్రైవింగ్‌కు ఎంతో అనువుగాఉంటుంది. ఈకారు 0-100 కిలో మీటర్లకు 2.9సెకన్లలోస్పీడు అందుకుంటుం ది. 8.9సెకన్లలో 0-200 కిలోమీటర్లకు వేగం పెరుగుతుంది. లాంబోర్గినిహెడ్‌ శరద్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ లాంబోర్గిని వి10 అత్యాధునిక పనితీరు ప్రపంచంలోనే గరిష్ట స్థాయిలో ఉంటుందని, ఆరునిమిషాల 52 సెకన్ల వ్యవధిలో నిర్ణీత లక్ష్యాన్నిఛేదించింది. జర్మనీలోని నర్‌బర్గ్‌రింగ్‌ రోడ్డులో ప్రయోగా త్మక పరీక్షల్లోనే తేలిందన్నారు. ఎక్స్‌షోరూంధరల్లో ఈ హురాకాన్‌ పర్‌ఫార్మెంట్‌ రూ.3.97 కోట్లుగా ఉంది. స్ట్రాడా, స్పోర్ట్‌ ఆర్‌ కోర్సా వంటి డ్రైవింగ్‌ విధానాల్లో కూడా యాక్టివేటెడ్‌ లాంబోర్గిని ఏరోడైనమిక్స్‌ లాంబోర్గిని పర్‌ఫార్మెంట్‌లో అధికంగా ఉన్నాయి.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఒరిజినల్ రూ.2000 నోటు ఇలా ఉంటుంది! పాత పెద్ద నోట్లు రద్దై.. కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వీటికి నకల్లు తయారు చేయడంలో నిత్యం బిజీగా ఉండే డూప్లి‘కేటుగాళ్లు’.. ప్రస్తుతానికి కలర్ జిరాక్స్ కాగితాలను అటూ ఇటుగా మార్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు. TNN | Updated: Nov 23, 2016, 07:37PM IST పాత పెద్ద నోట్లు రద్దై.. కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వీటికి నకల్లు తయారు చేయడంలో నిత్యం బిజీగా ఉండే డూప్లి&lsquo;కేటుగాళ్లు&rsquo;.. ప్రస్తుతానికి కలర్ జిరాక్స్ కాగితాలను అటూ ఇటుగా మార్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా విడుదలైన రూ.2000 నోటుపై వీరి కన్నుపడింది. అయితే, ప్రజలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని RBI భరోసా ఇస్తోంది. ఈ సందర్భంగా రూ.2000 నోటు సెక్యూరిటీ ఫీచర్స్&zwnj;ను వివరించింది. అవేంటో చూడండి...
1entertainment
stock market లాభాలతో కొనసాగుతున్న మార్కెట్లు ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.. ఉదయం మదుపర్ల లాభాల సేకరణకు మొగ్గుచూపటంతో నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు ఆ తర్వాత కోలుకుని స్వలపంగా లాభపడ్డాయి.. తాజాగా సెన్సెక్స్‌ 46 పాయింట్ల లాభంతో 27928 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.. నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 9,656 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
1entertainment
ఏడాదిన్నర కనిష్టానికి మార్కెట్లు - సెన్సెక్స్‌ 109 పాయింట్లు పతనం ముంబయి : జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను ప్రతికూలతలోకి నెట్టేస్తున్నాయి. చైనా మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగడానికి తోడు ఈ వారంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీని కేంద్ర గణంకాల శాఖ వెల్లడించనున్న నేపధ్యంలో మార్కెట్లు తాజాగా 19 మాసాల కనిష్టానికి పడిపోయాయి. సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 109.29 పాయింట్లు లేదా 0.44 శాతం కోల్పోయి 24,825.04కు దిగజారింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 37.05 పాయింట్లు లేదా 0.49 శాతం పతనమై 7,563.85 వద్ద ముగిసింది. ఇంట్రా ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 335 పాయింట్లు కోల్పోయి 19 మాసాల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. నిఫ్టీ కూడా ఒ దశలో 7,500 దిగువన చోటు చేసుకుంది. 2014 జూన్‌ 4న మార్కెట్లు ఈ స్థాయిలో ట్రేడింగ్‌ అయ్యాయి. రంగాల వారిగా బిఎస్‌ఇలో రియాల్టీ, ఆటో సూచీలు మినహా అన్ని నష్టాలు చవి చూశాయి. వైద్య సూచీ అత్యధికంగా 1.37 నష్టపోయింది. ఇదే క్రమంలో ఐటి 1.1 శాతం, టెక్‌ 1.06 శాతం, పిఎస్‌యు 0.98 శాతం చొప్పున అధికంగా తగ్గాయి. మరోవైపు రియాల్టీ 0.25 శాతం, ఆటో 0.1 శాతం చొప్పున రాణించాయి. బిఎస్‌ఇ-30లో మహీంద్రా అండ్‌ మహీంద్రా 3.4 శాతం, విప్రో 3.27 శాతం, అదాని పోర్ట్స్‌ 3.13 శాతం, భెల్‌ 2.57 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 2.26 శాతం చొప్పున అధిక నష్టాల పాలయ్యాయి. మరోవైపు రిలయన్స్‌ 2.69 శాతం, టాటా మోటార్స్‌ 2.04 శాతం, మారుతి సుజుకి 1.51 శాతం, ఎన్‌టిపిసి 1.47 శాతం, ఐటిసి 0.85 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బిఎస్‌ఇ 30 సూచీల్లో 22 కూడా ప్రతికూలతలోనే నమోదయ్యాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉన్న చైనాలో స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. క్రితం మాసంలో భారత్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ పెరగవచ్చన్న మదుపర్ల అంచనాల ఆందోళన సూచీల అమ్మకాలకు మొగ్గు చూపేలా చేసింది. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌ సూచీ 0.95 శాతం, స్మాల్‌క్యాప్‌ 0.47 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. ప్రపంచ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు తగ్గి 66.80కు చేరింది.యూరోపియన్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగియగా, ఆసియన్‌ మార్కెట్లు ఒత్తిడిలోనే నమోదయ్యాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 15, Mar 2019, 3:03 PM IST Highlights ఎలక్షన్స్ మూమెంట్ లో ఈ ఏడాది బయోపిక్ లతో టాలీవుడ్ బాగానే హల్చల్ చేస్తోంది. అయితే ఏ పొలిటికల్ బయోపిక్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోతోంది. యాత్ర - ఎన్టీఆర్ అనంతరం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి బయోపిక్ ఉద్యమసింహంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఎలక్షన్స్ మూమెంట్ లో ఈ ఏడాది బయోపిక్ లతో టాలీవుడ్ బాగానే హల్చల్ చేస్తోంది. అయితే ఏ పొలిటికల్ బయోపిక్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోతోంది. యాత్ర - ఎన్టీఆర్ అనంతరం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి బయోపిక్ ఉద్యమసింహంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  కొన్ని నెలల క్రితమే సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక మొన్నటివరకు అనుకోని విధంగా సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది.  ఫైనల్ గా ఇప్పుడు సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర రావ్. మార్చ్ 29న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.  కేసీఆర్ పాత్రలో నూతన నటుడు నటరాజన్ నటించిన ఈ సినిమాలో కేసీఆర్ చేసిన తెలంగాణ ఉద్యమాన్ని మెయిన్ గా చూపించనఉన్నట్లు తెలుస్తోంది. ఇక  అల్లూరి కృష్ణం రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాలో పలువురి రాజకీయ నాయకుల కుట్రలను కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాను జనాలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.   Last Updated 15, Mar 2019, 3:03 PM IST
0business
చరణ్ సుకుమార్ ల చిత్రం శాటిలైట్ రైట్స్ 16 కోట్లు? Highlights చరణ్ సుకుమార్ ల చిత్రం శాటిలైట్ రైట్స్ 16 కోట్లు? 70 కోట్ల వరకు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థం 1985 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 సినిమా శాటిలైట్ బేరాలు స్టార్ట్ అయ్యాయి. చాలా పెద్ద రేటే పలికినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 16 కోట్లకు శాటిలైట్ రైట్స్ ఫిక్స్ అయ్యాయని, ఇంకా అగ్రిమెంట్ మాత్రం కాలేదని తెలుస్తోంది.   రామ్ చరణ్ సినిమాకు 16 కోట్లు అంటే అది చాలా పెద్ద మొత్తమే. అయితే సుకుమార్ డైరక్టర్ కావడం, గ్రామీణ నేఫథ్యంలో, డిఫరెంట్ మూవీగా తయారు చేస్తుండడంతో ఈ రేటు పలికినట్లు తెలుస్తోంది. మరోవైపు రంగస్థలం 1985 సినిమాకు ఖర్చు కాస్త భారీగానే అవుతోందని తెలుస్తోంది. ప్రస్థుతం రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లో అక్కడి షెడ్యూల్ పూర్తి చేేసుకోనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో వేసే భారీ సెట్ లో నే షూటింగ్ జరుగుతుందట. ఈ సెట్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. ఇక రెమ్యూనిరేషన్ కూడా భారీగానే వుంది. సుకుమార్, రామ్ చరణ్, సమంత, దేవీ శ్రీ ప్రసాద్ ఇలా అంతా టాప్ స్టార్స్ కావటంతో పేమెంట్ కూడా కాస్తా భారీ ఖర్చే.   అందుకే సినిమాకు 70 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మైత్రీ మూవీస్ సంస్థ అధినేతలు మాత్రం చాలా ధీమాగా వున్నారు. ఈ సినిమా సుకుమార్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని, కథలో ఆ రిచ్ నెస్ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే మరిన్ని వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాలి. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
rmi బ్యాంకు రుణాల ఇఎంఐలు తగ్గే అవకాశం న్యూఢిల్లీ, నవంబరు 10: ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన రూ.500, రూ.1000 పాతనోట్ల చెలామణీ రద్దువల్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారి కి ఇఎంఐలు స్వల్పంగా తగ్గే ప్రయోజనం ఉన్నట్లు నిపుణుల అంచనా. బ్యాం కులు వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉన్నందున ఇఎంఐలు కూడా తగ్గుతాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలోనికి భారీ మొత్తంలో డిపా జిట్లు తరలివచ్చే అవకాశం ఉంది. 2.5 లక్షలకుపైబడిన డిపాజిట్లపై పన్నులు ఉంటాయని ఐటి, ఆర్థికశాఖలు స్పష్టంచేసినా రెండు లక్షలలోపు ఉన్న డిపా జిట్లు భారీసంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వడ్డీరేట్లు కూడా తగ్గే అవ కాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పాతనోట్లను ప్రజలు బ్యాంకుల్లో డిపా జిట్‌చేస్తారు. ఇకపై ఎంతమాత్రం చెల్లుబాటు కానందున వీటిని విధిగా డిపాజిట్‌ చేయాల్సిందే. బ్యాంకుల్లోనికి నగదు డిపాజిట్‌చేసిన తర్వాత బ్యాంకుల్లో నగదు లావాదేవీలు అనుకోకుండానే పెరుగుతాయి. నగదు నిల్వలు పెరగడంతో రుణా లపై వడ్డీరేట్లు, డిపాజిట్లపై వడ్డీరేట్లు కూడా తగ్గుతాయని ఫెలిక్స్‌ అడ్వయిజరీ సంస్థ భాగస్వామి అమిత్‌ జిందాల్‌ వెల్లడించారు. ప్రభుత్వంప్రకటించిన ఆదా య వనరుల వెల్లడిపథకం కింద ప్రభుత్వానికి 29,362 కోట్లు అందాయి. ఇక లెక్కలు తేలని నల్లధనం 65,620 కోట్లు చట్టబద్ధం అయిందని అంచనా. ప్రస్తుత చర్యలకారణంగా డిపాజిట్‌ల రూపంలో బ్యాంకులకు వచ్చిన నగదు బహుళవిధా లుగా రెట్టింపు మొత్తంలో ఉంటుందని ఆయన అంచనావేసారు. జిందాల్‌ అంచ నాల ప్రకారం చూస్తే పాత వెయ్యి, ఐదు వందలనోట్లు రద్దువల్లనగదు లావాదేవీలు క్రమేపీ తగ్గుతాయి. సమీపభవిష్యత్తు లో తిరిగి రికవరీ అవుతాయి. స్థిరాస్థి ధరలు తగ్గుతాయి. చిన్నమొత్తాలపొదుపు కుటుంబాలు కూడా బ్యాంకింగ్‌ వ్యవస్థకు అనుసంధానం కావాల్సి వస్తుంది. జన్‌ధన్‌యోజన అసలు స్ఫూర్తిఇదే. ఇక రిటైల్‌ట్రేడర్లు విధిగా రిజిష్టరు అవు తారు. పన్నురాబడులు పెరుగుతాయి లావాదేవీలు అత్యధికంగా పన్ను యంత్రాంగం పరిశీలన కిందికి వస్తాయి. జిడిపి వృద్ధి కనిపిస్తుంది. నగదు లావాదేవీలు బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా జరగడం వల్ల చట్టబద్ధత పెరుగుతుంది. వ్యవస్థలో అవినీతిని అరికట్టేందుకు సైతం ఈ చర్యలు ఉపకరిస్తాయని జిందాల్‌ వంటి నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కొత్తనోట్లు తీసుకునేందుకు వచ్చేవారికి ఉపకరించేందుకుగాను బ్యాంకులు సాయంత్రం వేళల్లో పనిగంటలు పొడిగిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి రూ.4వేలు చొప్పున కొత్తనోట్లను మార్పిడిచేస్తు న్నారు. ఆర్‌బిఐ మార్గదర్శకాలను అనుసరించి కస్టమర్లు ఏదో ఒక ఐడి కార్డును చూపించి పాతనోట్లు జమచేసి కొత్త నోట్లను తీసుకెళ్లవచ్చు. శని ఆదివారాల్లో కూడా అన్ని బ్యాంకులు పనిచేయాలని రిజర్వుబ్యాంకు ఆదేశాలు జారీచేయడం పనిగంటలు పెంచడం వంటి వాటితో మొత్తం బ్యాంకులన్నింటివద్దా క్యూలు పెరిగిపోయాయి. కొన్ని బ్యాంకులు సోమవారం కూడా ఎక్కువ గంటలు పని చేసేందుకు నిర్ణయించాయి. భారతీయ స్టేట్‌బ్యాంకు పనిగంటలను సాయంత్రం ఆరుగంటల వరకూ పొడిగించింది. వాటితోపాటు అన్నిశాఖల్లోను ప్రత్యేక మార్పిడి కౌంటర్లను ఏర్పాటుచేసి కస్టమర్లకు మరిన్ని సేవలు పొడిగించింది. అనుబంధ బ్యాంకుల్లో కూడా ఇదే విధానం అనుసరిస్తున్నారు. అయితే కొత్త రూ.500 నోట్లు, రూ.2వేల నోట్లు రావడం జరిగిందేకానీ బ్యాంకుల్లో మాత్రమే తీసుకోవాలి. ఇక శుక్రవారం నుంచి ఎటిఎంలు పనిచేస్తుండటంతో విపరీతమైన ఆర్థిక ఒత్తిడి వీటికి ఉంటుందని అంచనా. బ్యాంకుల నుంచి క్యూలన్నీ ఎటిఎం ల వైపునకు మళ్లుతాయి. అయితే చాలా బ్యాంకుల్లో రూ.100 నోట్ల కొరత ఎక్కువగాఉంది. కొన్ని బ్యాంకుల్లో అయితే కేవలం కొత్త నోట్లు మాత్రమే ఇస్తు న్నారు. రూ.100 నోట్లు అడిగితే చేతులెత్తేస్తున్నారు. ప్రైవేటురంగ బ్యాంకింగ్‌ దిగ్గజం అయితే పది మార్గదర్శకాలను జారీచేసింది. వాటికి అదనంగా క్యాష్‌ కౌంటర్లు కూడా ఏర్పాటుచేసింది. వీటితోపాటు పొదుపుఖాతాలపైనా, డిపాజిట్ల పైనా ఛార్జీలను నవంబరు 30వ తేదీవరకూ రద్దుచేస్తున్నట్లుప్రకటించింది. తమ ఖాతాదారులైతే బ్యాంకు ఎటిఎంలలో డిఎంబరు 31వ తేదీవరకూ నిర్వహిం చుకునే అవకాశం ఉంటుంది. రోజువారి డెబిట్‌కార్డు వినియోగాన్ని రెట్టింపు చేసింది. ఆన్‌లైన్‌ లావాదేవీలు, పాయింట్‌ఆఫ్‌ సేల్‌ మెషిన్‌ లావాదేవీలు కూడా రెట్టింపుచేసింది. ఎస్‌బిఐ పరంగా రూ.100 నోట్లకు కొరతలేదని చెపుతున్నా బ్యాంకుల్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బ్యాంకు ఎటిఎంలలో శుక్ర వారం నుంచే కొత్త నోట్లు లభిస్తాయని ప్రభుత్వం, ఆర్‌బిఐ ప్రకటించినా బ్యాంక ర్లు మాత్రం ఒకే ఒక్కరోజులోనే అన్ని ఎటిఎంలలో కొత్త నోట్లు భర్తీచేయడం కష్టం అని చెపుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం రెండు లక్షల ఒకవేయి 861 ఎటిఎంలలో కొత్తనోట్లను భర్తీచేయడం ఒక్కరోజులో అయ్యేపనికాదని బ్యాంకర్లు సైతం అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు చేయకతప్పదని అంచనా. గడచిన 12నెలల్లో నగదు లావాదేవీలు చెలామణి కూడా విపరీతంగా పెరిగింది. ఐదేళ్ల సగటుతో వృద్ధిరేటు కూడా పెరిగింది. ప్రభుత్వ ఎన్నికలు, పండుగసీజన్‌ ఆధారిత లావాదేవీలు, జ్యుయెలర్ల సమ్మె అనంతర కొనుగోళ్లతో నగదు చెలామణీ 17.2 శాతం వార్షిక వృద్ధి చొప్పున పెరిగింది. ఐదేళ్ల సగటు అయితే కేవలం 12.1శాతంగా మాత్రమే ఉంది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV గ్యాస్ బాదుడు మొదలైంది.. సిలిండర్ ధర పెరిగింది..! Gas Cylinder | ఒకటో తారీఖు రోజునే సామాన్యులకు షాక్. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. గ్యాస్ ధరను కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీనే సమీక్షిస్తూ ఉంటాయి. ఇకపోతే గ్యాస్ సిలిండర్ ధర గత రెండు నెలల్లోనూ దిగొచ్చింది. Samayam Telugu | Updated: Sep 2, 2019, 03:14PM IST హైలైట్స్ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ఒక్కో సిలిండర్ ధర రూ.16 పైకి సెప్టెంబర్ 1 నుంచే నిర్ణయం అమలులోకి దీంతో సామాన్యులకు షాక్ వామ్మో ఒకటో తారీఖు వచ్చేసిందని ఎవరనుకుంటారు? మీ నోటి నుంచి వచ్చే సమాధానం మధ్యతరగతి ప్రజలు. అవును మరి 1వ తేదీ వస్తే చాలు కట్టాల్సిన బిల్లులు, చెల్లించాల్సిన ఈఎంఐలు కళ్లముందు అలా గిర్రున్న తిరుగుతాయ్. ఇప్పుడు వీళ్లకు మరో షాక్. గ్యాస్ సిలిండర్ లేదా ఎల్‌పీజీ లేదా వంట గ్యాస్ ధర పెరిగింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.16 వరకు పైకి కదిలింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రాంతాల్లోని 14.2 కేజీల సిలిండర్‌కు ఈ ధర పెంపు వర్తిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ధరను పెంచుతున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి కన్సూమర్లు సిలిండర్‌కు రూ.590 చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్ట్‌లో ఈ ధర రూ.574.5గా ఉంది. ఇండేన్ బ్రాండ్ కింద ఐఓసీ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే జూలై, ఆగస్ట్ నెలల్లో నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర మొత్తంగా రూ.163 దిగొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తోంది. వీటిని అదనంగా సిలిండర్ కావాలంటే మార్కెట్ ధర చెల్లించాలి. ఇకపోతే గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ఎల్‌పీజీ సిలిండర్ రేట్లను సమీక్షిస్తూ ఉంటాయి. సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ రేట్లు, అమెరికా డాలర్-ఇండియన్ రూపాయి మారకపు విలువ వంటి అంశాలు ప్రాతిపదికన ధరను మారుస్తూ ఉంటాయి. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఇలా..
1entertainment
ఆర్టీఈ నిబంధనలు అమలు చేయండి నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో         విద్యాహక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని 'కోవా' ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శి మహ్మద్‌ తురబ్‌ కోరారు. రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలల్లో తప్పని సరిగా 25 శాతం సీట్లను పేద విద్యార్ధులకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీఈ నిబంధనలు అమలు చేయాలని కోరుతూ పాతబస్తీలో ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెస్తే పేద విద్యార్ధులకు కార్పొరేట్‌ కళాశాలల్లో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
- రూ.1074 కోట్ల సంపదతో రికార్డు - దేశ 'రిచెస్ట్‌ ప్రొఫెషనల్‌'గా ఖ్యాతికి నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో సంపన్న జీతగాడిగా నవిల్‌ నోరోన్హా వెలుగులోకి వచ్చారు. డి-మార్డ్‌ పేరుతో రిటైల్‌ స్టోర్స్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌ సంస్థకు ఆయన ఎండీ, సీఈవోగా సేవలందిస్తున్నారు. డి-మార్ట్‌ సంస్థ స్టాక్స్‌ మార్కెట్లో లిస్టవడంతో పాటు వేగంగా పరుగులు పెడుతున్న వేళ.. నవిల్‌ సంపద కూడా అంతే దినదిన ప్రవర్థమానకంగా పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం (ఈ నెల 15 నాటికి..) నవిల్‌ మొత్తం సంపద రూ.1074 కోట్ల (జీతం, ఈక్విటీ హోల్డింగ్స్‌) ఎగువకు చేరువైంది. దీంతో దేశంలోనే అత్యంత ధనిక ప్రొఫెషనల్‌గా నవిల్‌ రికార్డు సొంతం చేసుకున్నారు. 2004లో అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌లో చేరిన నవిల్‌ తనదైన రీతిలో సంస్థను వృద్ధి పథంలో నడిపిస్తూ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా అవెన్యూ దేశంలోనే అతిపెద్ద రిటైల్‌ సంస్థ స్థాయికి తీసుకుపోయారు. సాధారణ స్థాయి నుంచి.. కర్ణాటక తీర ప్రాంత జిల్లాకు చెందిన నవిల్‌ విద్యాభ్యాసాన్ని ముంబయిలో కొనసాగించారు. నార్సీ మాంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ నుంచి నవిల్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఆ తరువాత హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా కొలువుకు కుదిరాడు. అక్కడ ఆయన మార్కెట్ల పరిశోధన, అమ్మకాలు, అత్యాధునిక మార్కెట్లలో వాణిజ్య తదితర ఆంశాలపై విశ్లేణ జరుపుతూ మేనేజ్‌మెంట్‌కు విలువైన సూచనలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నారు. ఆ తరువాత హెచ్‌యూఎల్‌లో కొలువుకు రాజీనామా చేసి 2004లో అవెన్యూ సూపర్‌ మార్కెట్లో చేరారు. 2001లో పురుడుపోసుకున్న అవెన్యూ సూపర్‌ మార్కెట్‌ సంస్థ పగ్గాలను చేపట్టిన నవిల్‌ ఆ తరువాత తనదైనన స్టైల్‌లో డి-మార్ట్‌ను దేశ వ్యాప్తంగా విస్తరిస్తూ పోతున్నారు. మార్కెట్లో లిస్టింగ్‌కు రాక ముందు నుంచి ఒక వ్యూహం ప్రకా రం సంస్థను ముందుకు తీసుకుపోతూ లాభాల బాట పట్టించారు. డి-మార్ట్‌ ప్రమోటర్‌ అయిన రాధాకృష్ణ దామని కేవలం సంస్థలో పెట్టుబడి పెట్టడం తప్ప అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌కు చెందిన వ్యాపారాంశాలను ఏ మాత్రం జోక్యం చేసుకోరు. కేవలం నవిల్‌ మాత్రమే సంస్థలోని ప్రతీ అంశాన్ని దగ్గరుండి నడిపిస్తారని మార్కెట్‌ వర్గాలు చెబుతుంటాయి. నవిల్‌ కారణంగా రాధాకృష్ణ దామనికి అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌లో ఉన్న 82.2 శాతం వాటా విలువ రూ.50,000 కోట్లకు చేరిందనడంలో సందేహం లేదు. వెయ్యి కోట్లు ఎలా వచ్చాయంటే.. డి-మార్ట్‌ రిటైల్‌ చైన్‌ బాధ్యతలు తీసుకున్న నవిల్‌ మొదట్లో తక్కువ జీతానికే కొలువుకు కుది రాడు. ఆ తరువాత గ్రూపును వృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న కొద్ది ఆయనకు యాజ మాన్యం చెల్లించే మొత్తం కూడా క్రమంగా పెరుగు తూ వచ్చింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.18 కోట్ల జీతభత్యాలను అందుకున్నారు. అయితే ఆ తరువాత కంపెనీ మార్కెట్లో లిస్టవ డంతో ఆయన దశే తిరిగిపోయింది. సంస్థలో యాజమాన్యం ఆయనకు దాదాపు 2.2 శాతం వాటాను కేటాయించింది. దీని విలువ క్రమంగా పెరు గుతూ ఇప్పుడు దాదాపు రూ.1074 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం ఆయన ఇంటికి తీసుకు పోయే వార్షిక జీతభత్యాలకు అదనం. ఇవి కాకుండా కంపెనీ ఆయన మొత్తం నిర్వహణ ఖర్చులను, ఇంటి పోషణను కూడా చూసుకుంటుంది. మృధు స్వభావిగా పేరున్న నవిల్‌ మేనజ్‌మెంట్‌ నిర్ణయా లను తీసుకోవడం.. వాటిని అమలు చేయడంలో మాత్రం అంతే కఠినంగా వ్యవహరిస్తారు. తాను నమ్మిన అంశాలకు కట్టుబడి ముందుకు సాగడం నవిల్‌ ప్రత్యేకత.. దీనిని అర్థకం చేసుకున్న దామని డి-మార్ట్‌ నిర్వహణ మొత్తాన్ని ఆయన చేతుల్లో పెట్టి.. కంపెనీ నడిపించడంలో ఎలాంటి జోక్యం చేసుకోరు. దిగ్గజాలను వెనక్కినెట్టి.. ప్రైమ్‌డాటా సంస్థ విశ్లేషణ మేరకు రూ.10,000 కోట్లకు పైబడి మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీల నాన్‌-ప్రమోటర్‌ ఎండీ, సీఈవోల జాబితాలో సంపన్న జీతగాడిగా నవిల్‌ ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ ఆదిత్య పురి సంపద (జీతం, ఈక్విటీ మొత్తం)కంటే కూడా నవిల్‌ సంపద రెండు రెట్లకు పెరిగింది. 2015-16 నాటికి పూరి సంపద రూ.449.5 కోట్లు. ఇప్పుడు నవిల్‌ ఆ రికార్డును తిరగరాశారు. పూరి తరువాత స్థానంలో రేణు సుద్‌కార్నడ్‌ ఉన్నారు. ఈమె సంపద రూ.379.5 కోట్లు. ఆ తరువాత స్థానాల్లో బయోకాన్‌కు చెందిన అరుణ్‌ సురేష్‌ చంద్రవార్కర్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు చెందిన గగన్‌ బంగాలు నిలిచారు. వీరు వారి వార్షికంగా తీసుకొనే జీతం ఈక్విటీ హోల్డింగ్స్‌ మొత్తం వరుసగా రూ.245 కోట్లు, రూ.237 కోట్లుగా ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 2, Jul 2019, 9:19 AM IST Highlights బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాక్టర్  రానా మల్టీస్టారర్ కథలకుగ్యాప్ లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. కథలో పాత్ర నచ్చితే భాషాబేధం లేకుండా సినిమాలను ఒకే చేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే.    బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాక్టర్  రానా మల్టీస్టారర్ కథలకుగ్యాప్ లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. కథలో పాత్ర నచ్చితే భాషాబేధం లేకుండా సినిమాలను ఒకే చేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే.  ఇక నెక్స్ట్ కోలీవుడ్ లో కూడా మరో స్టార్ హీరోతో రానా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ప్రముఖ స్వాతంత్య్ర పోరాటయోధుడు బిర్సా ముండా జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌ కు పా.రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు. కాలా - కబాలి సినిమాల అనంతరం పా.రంజిత్ చేస్తోన్న డిఫరెంట్ మూవీ ఇది. అయితే ఈ హిస్టారికల్ మూవీలో ఇదివరకే ఆర్య ఒక హీరోగా సెట్టయ్యాడు.  ఇక మారో ప్రధాన పాత్ర కోసం దర్శకుడు రానాను సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడు. ఈ ద్విభాషా మల్టీస్టారర్ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.    Last Updated 2, Jul 2019, 9:19 AM IST
0business
internet vaartha 150 Views న్యూఢిల్లీ : టి20 క్రికెట్‌తో బౌలర్ల కంటే బ్యాట్స్‌ మెన్‌ ఎక్కువ లాభపడుతున్నారని మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. మైదానంలో వినూత్నమైన షాట్లను ఎంపిక చేసుకుంటూ గత దశాబ్దంలో బ్యాట్స్‌మెన్‌ తమ నైపుణ్యాలను బాగా మెరుగుపర్చుకున్నారని వివరించాడు. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో బ్యాట్స్‌మెన్‌ బౌలింగ్‌ మిషన్‌ విసిరే బంతులను వినూత్నమైన షాట్లను ప్రాక్టీస్‌ చేసే అవకాశం ఉంటుంది. అలా వారు రెండు లేదా మూడు గంటలకు పైగా ప్రాక్టీస్‌ చేసినా పెద్దగా శ్రమ అనిపించదు. ఇలా ప్రాక్టీస్‌ చేస్తూ గాయాల బారిన పడుతున్నారు. బ్యాట్‌, బంతికి మధ్య టి20లో సమతూకం పెం చడం కూడా ప్రస్తుతం ఓక సవాల్‌ అని ద్రవిడ్‌ వివరించాడు.
2sports
Suresh 320 Views రాయల్‌ బెంగళూరు టార్గెట్‌ 195 ఐపిఎల్‌ 9 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు 195 పరుగుల విజయలక్ష్యాన్ని విధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ 92 పరుగులు, కేన్‌ విలియమ్స్‌ 50 పరుగులతో రాణించగా, చివర్లో మోసిన్‌ హన్రిక్వీన్‌ 31 (14) పరుగులు చేయటంతో నిర్ణీత 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 194 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.
2sports
internet vaartha 135 Views లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు ముంబై : చివరి నిమిషంలో జరిగినట్రేడింగ్‌ ఈక్విటీ మార్కెట్లకు సాను కూలం అయింది. మార్కెట్ల పరంగా నిఫ్టీ 8550 మార్కును ధాటించింది. బ్యాంకుల షేర్లు ఎక్కువ లాభాలు ఆర్జించాయి. ఐసిఐసిఐబ్యాంకు గరిష్టంగా లాభపడింది. రెండుశాతం పెరిగింది. ట్రిబుల్‌బి రేటింగ్‌తో బాండ్ల విడుదలకు కసరత్తులు చేయడమే ఇందుకు కీలకం. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ యూనిటెక్‌ 52వారాల గరిష్టస్థాయిని దాటి 8.30కి చేరాయి. ఆటోమొబైల్‌పరంగా టాటామోటార్స్‌ లాభాల్లో ముగిసింది. ఆయిల్‌ ఇండియా, ఎన్‌జిసి ప్రభు త్వ సంస్థలు కూడా లాభాల్లోనే నడిచాయి. ఏడో వేతన సంఘం సిఫారసులు, రుతుపవ నాల ప్రభావం కొంతమేర కరువు ఆందోళనల ను పారద్రోలినట్లు ఇన్వెస్టర్లు భావించారు. ఈక్విటీమార్కెట్లపరంగా చూస్తే బుల్లిష్‌రన్‌ కొనసాగింది. ఆగస్టు 2015నాటి స్థాయిని నిఫ్టీ నమోదుచేసింది. జెఎం ఫైనాన్షియల్‌, శోభా లిమిటెడ్‌ 365రూపాయలకు చేరాయి. ఇక ఒఎన్‌జిసి ప్రభుత్వం కంపెనీలు కిరోసిన్‌ ధర లు పెంచుకునేందుకు అనుమతించడంతో కొంత పెరిగింది. ప్రతినెలా 25 పైసలు పెరిగి తే ఎగువస్థాయి ఆయిల్‌ కంపెనీలను పటిష్టంచేసి నట్లవుతుందని కంపెనీల ప్రభావం. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు పరంగా నికరలాభం 661.38 కోట్లు ఆర్జిం చింది. హెచ్‌పిసిఎల్‌ నికరలాభం 1800 కోట్లుగా ఉంది. వాటాలధరలు కూడా 1359 రూపాయలు గా ట్రేడింగ్‌జరిగింది. బిఎస్‌ఇసెన్సెక్స్‌ 127 పాయిం ట్లు లాభపడింది. వినియోగరంగ ఉత్పత్తులు, బ్యాంకింగ్‌, ప్రభుత్వరంగ సంస్థల సూచీ, కేపి టల్‌గూడ్స్‌ షేర్లు ఎక్కువ కొనుగోళ్లు జరిగాయి. అంతర్జాతీయధోరణులు కూడా ఇందుకు దోహదం చేసాయి. అలాగే ఆర్‌బిఐ తదుపరి గవర్నర్‌పై ప్రభు త్వ ప్రకటనతోపాటు, కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు మరికొంత కీలకం అయ్యాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 126.93పాయింట్లు పెరిగి 27,942.11 పాయింట్ల వద్ద స్థిరపడితే ఎన్‌ఎస్‌ఇ సూచి 45.5 పాయింట్లు పెరిగి 8565 పాయింట్లవద్ద నిలిచింది. బిఎస్‌ఇ సూచీల్లో వినియోగరంగ వస్తువులు 2.16శాతం పెరిగాయి. బ్యాంకింగ్‌ 1.48శాతం, పిఎస్‌యు సూచి 1.12శాతం, కేపిటల్‌గూడ్స్‌ 1.01శాతం పెరి గాయి. ఇతరత్రా హెల్త్‌కేర్‌సూచి 0.28శాతం, ఐటి 0.17శాతం రియాల్టీ 0.16శాతం దిగజారా యి. ఇక సెన్సెక్స్‌లో మొదటి ఐదు సంస్థలు లాభా లు పొందినవాటిలో ఐసిఐసిఐబ్యాంకు 2.72శాతం, మారుతిసుజుకి ఇండియా 2.44శాతం, బారతీయ స్టేట్‌ బ్యాంకు 2శాతం, పవర్‌గ్రిడ్‌ 1.82శాతం, గెయిల్‌ 1.45శాతం పెరిగాయి. భారీనష్టాలు పొంది న సంస్థల్లో ఒఎన్‌జిసి1.53శాతం, ఇన్ఫోసిస్‌ 1.45 శాతం,ఎంఅండ్‌ఎం 1.26శాతం, సన్‌ఫార్మా 1.05 శాతం, సిప్లాకంపెనీలు 0.84శాతం చొప్పున నష్ట పోయాయి. బ్యాంకింగ్‌రంగ షేర్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 5.3శాతం, యెస్‌బ్యాంకు 0.8శాతం చొప్పున పెరిగాయి. జ్యుయెలరీ తయారీ కంపెనీలు టైటాన్‌ కంపెనీ గీతాం జలి జెమ్స్‌ వంటివి ఎక్సైజ్‌సుంకం సడలిం పులతో కొంతపెరిగాయి. టిసిఎస్‌ స్వల్పం గా పెరిగింది. ఈరోజు ఫలితాలను ప్రకటిం చాల్సిఉంది. ఇన్ఫోసిస్‌ 1.2శాతం క్షీణించిం ది. మహీంద్ర అండ్‌ మహీంద్ర 2.4శాతం పెరిగింది. ఆర్‌బిఐ కొత్తగవర్నర్‌ ఎంపికపై ప్రధాని మోడీ తన సీనియర్లు, సహచరు లతో చర్చిస్తున్నారన్నసమాచారం మార్కెట్ల కు కొత్త ఉత్తేజంతెచ్చింది. పార్లమెంటు సమావేశాలకు ముందే ఆర్‌బిఐ కొత్తగవర్నర్‌పేరు ప్రకటిస్తారని అంచనా. టోకుధరలసూచి ద్రవ్యోల్బ ణం, రిటైల్‌ ద్రవ్యోల్బణాలు జూన్‌నెలలో పెరగడం తో ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గించకపోవచ్చన్న అంచనాలు కనిపిస్తున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో ఆర్‌బిఐ వడ్డీరేట్ల జోలికి వెళ్లే సూచనలు లేవు.
1entertainment
'ఇంటిలిజెంట్‌' సెన్సార్‌ పూర్తి - ఫిబ్రవరి 9 విడుదల Highlights ఇంటిలిజెంట్‌' సెన్సార్‌ పూర్తి ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.  సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లి. అధినేత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.  నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''సాయిధరమ్‌ తేజ్‌, వినాయక్‌ తొలి కాంబినేషన్‌లో రూపొందిన మా 'ఇంటిలిజెంట్‌' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అందర్నీ ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. సాయిధరమ్‌తేజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా వినాయక్‌ ఎక్స్‌ట్రార్డినరీ టేకింగ్‌తో రూపొందిననీ సినిమా డెఫినెట్‌గా సూపర్‌హిట్‌ అవుతుంది'' అన్నారు.  సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.  Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
Hyderabad, First Published 8, Apr 2019, 4:55 PM IST Highlights బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి రౌటేలా ఈ మధ్య హాట్ ఫొటోస్ గ్లామర్ డోస్ మరింత పెంచేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బేబీ బికినీ వేసినట్టే వేసి మళ్ళీ ట్రెడిషినల్ లుక్ లో షిఫ్ట్ అవుతోంది బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి రౌటేలా ఈ మధ్య హాట్ ఫొటోస్ గ్లామర్ డోస్ మరింత పెంచేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బేబీ బికినీ వేసినట్టే వేసి మళ్ళీ ట్రెడిషినల్ లుక్ లో షిఫ్ట్ అవుతోంది. రీసెంట్ గా మ్యాగ్జిమ్ కవర్ కోసం ఊర్వశి ఇచ్చిన స్టిల్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.  100 కోట్ల బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న అమ్మడు తన హాట్ అందాలతో షూటింగ్ మొదలవ్వకముందే సినిమాలపై అంచనాలను పెంచేస్తోంది. జస్ట్ ఉర్వశి ఒక సినిమాలో సెలెక్ట్ అయినట్లు రూమర్స్ వస్తే చాలు బాలీవుడ్ మీడియాలో అదే హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే హెట్ స్టోరీ 4 సినిమాలో ఈ బ్యూటి చేసిన రచ్చ మాములుగా లేదు.  అందుకే అప్పటి నుంచి ఏ సినిమాలో నటించిన బేబీ వల్ల ఎంతో కొంత ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం జాన్ అబ్రహం నటిస్తోన్న బారి బడ్జెట్ మూవీ పాగల్ పాంటీ అనే సినిమాలో ఊర్వశి హీరోయిన్ గా నటిస్తోంది.   Last Updated 8, Apr 2019, 4:57 PM IST
0business
వర్మకు ఏమైందో ఏమో.. సడెన్ గా ఇలా రూటు మార్చాడు Highlights గతంలో ట్విట్టర్ వేదికగా మెగా ఫ్యామిలీ పై విరుచుకుపడ్డ రామ్ గోపాల్ వర్మ వర్మకు ఏమైందో ఏమో.. సడెన్ గా రూటు మార్చాడు నాగబాబుకు సారీ అని ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదం. శివ నుంచి వంగవీటి దాకా హిట్టుతో సంబంధం లేకుండా వర్మ ప్రతి సినిమా ఓ సెన్సేషనే. సినిమాలేకాదు వర్మ ట్వీట్లతో చంపేస్తూ ఉంటాడు కూడా. సోషల్ మీడియాలో తనదైన పోస్ట్ లతో ఎప్పటికప్పుడు వివాదాలకు అగ్గి రాజేసే వర్మ సడెన్ గా రూటు మార్చాడు. అదేంటో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు మారిపోయాడు. ఇన్నాళ్లూ ట్వీట్స్‌తో హీరోలకు తలనొప్పిగా మారి... వారిని తీవ్ర అసహనానికి గురిచేసిన వర్మ తన పంథాను మార్చుకున్నాడు. ఇటీవల వర్మ తన తల్లిపై, బిగ్ బీ అమితాబ్‌పై, హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‌పై ఒట్టేసి తన వైఖరిని మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు.   అంతేకాదు, పవన్ ఫ్యాన్స్‌కు, గణపతి భక్తులకు క్షమాపణలు చెబుతున్నట్లు కూడా ట్వీట్ చేశాడు. అయితే తాజాగా రాంగోపాల్ వర్మ చేసిన ఒక ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. మెగా బ్రదర్ నాగబాబుపై తాను చేసిన కామెంట్స్‌కు వర్మ క్షమాపణలు కోరాడు. దీంతో విస్తుపోవడం సినీ జనం వంతైంది. నిజంగా ఈ ట్వీట్ చేసింది వర్మేనా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, వర్మ తన ట్వీట్‌లో ‘చిరంజీవి గారి లాంటి అన్నయ్య నాకుంటే, నేను మాట్లాడిన మాటలకి కొట్టేవాడిని. నాగబాబు గారు మాటలతో వదిలేశారు.రియల్ సారీ హిమ్’ అని ట్వీట్ చేశాడు.   వర్మ చేసిన ఈ ట్వీట్స్‌తో మెగా అభిమానులు శాంతించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నందుకు సంతోషం అంటున్నారు. కొందరైతే ఇది నిజమా కాదా అని గిల్లి చూసుకుంటున్నారు. వర్మలో వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందో, లేక అంతా తూచ్ ఆ ట్వీట్స్ చేసింది తాను కాదని మళ్లీ ట్వీట్ చేస్తాడోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్మ ఇలా రివర్స్ గేర్ వేసిన సందర్భాలూ లేకపోలేదు. ఖైదీ నెం.150 ఫంక్షన్‌లో మెగాబ్రదర్ నాగబాబు వర్మపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వర్మను అక్కుపక్షి అంటూ నాగబాబు సంబోధించాడు. ఈ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్ రూపంలో నాగబాబుపై యుద్ధం ప్రకటించాడు. చిరంజీవి లేకపోతే నాగబాబుకు గుర్తింపే లేదని వర్మ ట్వీట్ చేశాడు. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఓ ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్‌తో నా ట్వీట్స్ అర్థం ఏంటో చెప్పించుకోండి అంటూ వర్మ ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్స్ పెను దుమారాన్నే రేపాయి. chiranjeevigaari laanti annayya naakunte nenu matladina maatalaki kottevaadini .naga babu gaaru maataltho vadilesaru ..real sorry to him — Ram Gopal Varma (@RGVzoomin) 14 April 2017 Last Updated 25, Mar 2018, 11:40 PM IST
0business
Jun 13,2018 మార్కెట్లోకి సుజుకీ కొత్త ఎస్‌యూవీ జిమ్నీ టోక్యో: జపాన్‌ ఆటో దిగ్గజం సుజుకీ వచ్చే నెల తదుపరి తరం మినీ స్పోర్ట్స్‌ యుటిలిటీ (ఎస్‌యూవీ) వాహనాన్ని మార్కెట్లోకి తీసుకు రానుంది. గతంలో విజయ వంతంగా నిలిచిన మారుతీ జిప్సీకి కొనసాగింపుగా.. జిమ్మీ బ్రాండ్‌తో ఈ కొత్త వాహనాన్ని సుజుకీ మార్కెట్లోకి తేనుంది. వచ్చే నెల 5న ఇక్కడ జరగనున్న ఒక కార్యక్రమంలో కొత్త వాహన కంపెనీ మార్కెట్లోకి విడుదల చేయనుంది. తొలత జపాన్‌లో విడుదల కానున్న ఈ వాహనం తరువాత కొద్ది కాలానికే భారత్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జిప్సీతో పోలిస్తే పెద్ద వీల్‌బేస్‌తో ఈ వాహనం మార్కెట్లోకి రానుంది. రెండు డోర్లతో ఈ కొత్త వాహనం ఆటోమెటిక్‌ క్లయిమేట్‌ కంట్రోల్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ సిస్టమ్‌, ఆటోలైట్‌, ఆటో వైపర్‌తో మార్కెట్లోకి రానుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment