news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
టీమిండియా 316, 263 పరుగులు
న్యూజిలాండ్ 204, 197 పరుగులు
178 పరుగులతో సిరీస్ కైవసం
సత్తాచాటిన భారత్ బౌలర్లు
కోల్కతా : న్యూజిలాండ్తో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది.కాగా 376 పరు గులు టార్గెట్తో సోమవారం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను భారత బౌలర్లు కకావికలు చేసి 178 పరుగుల విజయాన్ని అందుకున్నారు. దీంతో మూడు టెస్టుల సిరీస్ను భారత్ 2-0తో సాధించింది.కాగా నాలుగవ రోజు ఆటలో టీ విరామ సమయానికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి కొంత ఫర్వాలేదనిపించిన కివీస్ ఆ తరువాత మూడవ సెషన్లో వరుసగా వికెట్లను కోల్పోయి పరాజయం చెందింది. ప్రత్యేకంగా ఈ సిరీస్లో అరవై మూడు పరుగుల వ్యవధిలో అయిదు వికెట్లను నష్టపోవడంతో న్యూజిలాండ్ ఓడిపోక తప్పలేదు.దీంతో కివీస్ 81.1 ఓవర్లలో 197 పరుగులు మాత్రమే చేసి పరాజయం చెందింది.రెండవ సెషన్ సగం భాగం పూర్తి నిలకడగా ఆడిన న్యూజిలాండ్ ఒక్కసారిగా కీలక వికెట్లను చేజార్చుకుంది.ఆటలో భాగంగా లంచ్ తరువాత గుప్టిల్ 24 పరుగుల వద్ద వికెట్ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుకు లాథమ్ -నికోలస్లు మరమ్మత్తులు చేపట్టారు.అయితే నికోలస్ 24 పరుగుల వద్ద రెండవ వికెట్గా కోల్పోయిన తరువాత కెప్టెన్ రాస్ టేలర్ 4 పరుగులు చేసి చాలా సేపు క్రీజులో నిలు వలేకపోయాడు.కాగా లాథమ్ హాఫ్ సెంచరీతో క్రీజులో నిలబడి భారత్ బౌలర్లక కొద్దిసేపు పరీక్ష పెట్టాడు. అయితే లాథమ్ 74 పరుగుల వద్ద నాలుగవ వికెట్గా ఔటైన తరువాత కివీస్ ఆటగాళ్లు వరుసగా క్యూకట్టారు.సాంట్నార్ 9పరుగులు, వాట్లింగ్ 1 పరుగు స్వల్ప వ్యవధిలో నిష్క్రమించగా రోంచీ 32 పరుగులు చేసి కొద్ది సేపు పోరాడాడు. అపై జీతన్ పటేల్ 1 పరుగు, హెన్రీ 18 పరుగులు,బౌల్ట్ 4 పరుగుల వద్ద ఔట్ కావడంతో కివీస్కు మరో ఘోర పరాజయం ఎదురైంది.భారత్ బౌలర్లలో షమీ, అశ్విన్, జడేజాలు ఒక్కొక్కరు మూడు వికెట్లు తీసుకోగా భువనేశ్వర్కు ఒక వికెట్ దక్కింది.అంతకు ముందు 9 వికెట్లకు 227 పరుగులు ఓవర్ నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ కొన సాగించిన భారత్ జట్టు మరో 36 పరుగులు చేసి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది.దీంతో కివీస్కు భారత్ భారీ టార్గెట్ను నిర్దేశించింది.కాగా ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ వృద్ది మాన్ సాహా 120 బంతులు ఆడి 6 బౌండరీలతో 120 బం తులతో హాఫ్ సెంచరీ చేశాడు.మరోవైపు ఓవర్ నైట్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ 23 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడాడు.అయితే భువనేశ్వర్ తొమ్మిదవ వికెట్గా ఔటైన తరువాత షమీ 1 పరుగు చేసి చాలా సేపు క్రీజులో నిలువలేకపోవడంతో భారత్ రెండవ ఇన్నింగ్స్ ముగిసింది.
న్యూజిలాండ్ ఘనంగా ప్రారంభించినా
కాన్పూర్ టెస్టును సునాయాసంగా గెలుచుకున్న టీమిండియా రెండవ టెస్టును కూడా అదే తరహాలో ఈడెన్ గార్డెన్స్లో కూడా
గెలుచుకుంది.వాస్తవానికి రెండు టెస్టులను న్యూజిలాండ్ జట్టు ఘనంగా ప్రారంభించింది.బ్యాటింగ్,బౌలింగ్లో గట్టి పోటీ ఇచ్చింది. అయితే ప్రపంచ స్థాయి జట్టుపై కివీస్ ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు.దీంతో కివీస్కు చేదు అనుభవం ఎదురైంది.తొలి టెస్టులో అశ్విన్,జడేజాలు భారత్కు విజయాన్ని కట్టబెడితే రెండవ టెస్టులో భువనేశ్వర్కుమార్,షమీ భారత్కు విజయాన్ని బహుమతిగా అందజేశారు.వీరిద్దరూ స్వింగ్ బౌలింగ్ తో న్యూజిలాండ్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు.దీంతో లాంథమ్ 74 పరుగులు,గుప్టిల్ 24 పరుగులు,నికోలాస్ 24 పరుగులు, రోంచీ 24 పరుగులు,హెన్రీ 18 పరుగులతో ఆకట్టు కున్నప్పటికీ టీమిండియాను ఓడించే ఆట తీరు ప్రదర్శించలేక పోయారు.ఇదే సమయంలో భారత్ బౌలర్లు కివీస్ బ్యాట్స్ మెన్పై పూర్తిస్థాయి ఆదిపత్యం ప్రదర్శించారు.దీంతో రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 316 పరుగులు చేయగా, సమాధానంగా న్యూజిలాండ్ 204 పరుగులు చేసింది.కాగా రెండవ ఇన్నింగ్స్లో భారత్ 263 పరుగులు చేయగా కివీస్ కేవలం 197 పరుగులకే చేయగలిగింది.దీంతో టీమిండియా వరుసగా రెండవ టెస్టును కూడా గెలుచుకుంది.టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 6 వికెట్లు,షమీ 5 వికెట్లు,అశ్విన్ 4 వికెట్లు,జడేజా 4 వికెట్ల తమ సత్తాచాటారు.దీంతో న్యూజి లాండ్కు రెండుటెస్టుల్లో కూడా పరాజయమే దక్కింది.కాగా టీ మిండియా ఆటగాళ్లు ఈడెన్ను మళ్లీ ఏలారు. దీంతో 179 పరు గులు తేడాతో టీమిండియా రెండవ టెస్టును గెలుచుకుంది. | 2sports
|
Hyderabad, First Published 5, Jul 2019, 4:35 PM IST
Highlights
మొబైల్ ఫోన్లు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
మొబైల్ ఫోన్లు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా...ఈ బడ్జెట్ లో మొబైల్ ఫోన్స్ ప్రియం అయ్యాయి. ఇప్పటికే పలు కంపెనీలు అతి తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నాయి. తాజా బడ్జెట్ తో వీటి ధర మరింత తగ్గనుంది.
సెల్యులార్ మొబైల్ ఫోన్స్లోని కెమెరా మాడ్యూల్, చార్జర్, అడాప్టర్లపై కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా శుక్రవారంనాడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.
ఇండియాలో స్మార్ట్ఫోన్ల మార్గెట్ అనూహ్యరీతిలో పెరుగుతూ వస్తోంది. ఇది 2018లో 14.5 శాతం పెరగగా, 2019లో 15 శాతానికి పెరగనుందని, 2021 నాటికి ఇండియాలో మొబైల్ సబ్స్క్రిప్షన్ 1.4 బిలియన్లకు పెరగనుందని అంచనా.
Last Updated 5, Jul 2019, 4:35 PM IST | 1entertainment
|
2018 ఐపిఎల్లో గుజరాత్, పుణే
కనుమరుగుపునఃప్రవేశం చేయనున్న చెన్నై, రాజస్థాన్ జట్లు
న్యూఢిల్లీ: ఐపిఎల్ 2018 సీజన్లో గుజరాత్ లయన్స్,రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్లు కనుమరుగు కానున్నాయి.ఈ విషయాన్ని గుజరాత్ లయన్స్ ప్రాంచైజీ యజమాని కేశవ్ బన్సాల్ వెల్లడించాడు.బుధవారం ఆయన ఒక ఇం టర్వ్యూలో మాట్లాడాడు.ఒప్పందం ప్రకారం 2018 ఐపిఎల్లో కొత్తగా వచ్చిన గుజరాత్, పుణే జట్ల స్థానంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రెండు సంవత్సరాల పాటు నిషేదానికి గురైన రాజస్థాన్ రాయల్స్,చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తిరిగి వసా ్తయని ఆయన వివరించాడు.అయితే వచ్చే సీజన ్లో తమ జట్టు కొనసాగే అవకాశం ఉంటే సంతోషిస్తానన్నాడు.స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా రాజస్థాన్ రాయల్స్,చెన్నై సూపర్ కింగ్స్జట్లును రెండు సంవత్సరాల పాటు బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రెండు జట్లపై విధించిన నిషేదం ఈ సంవత్సరంతో పూర్తి కావడంతో వచ్చే సీజన్ నుంచి ఆ రెండు జట్లు తిరిగి ఐపిఎల్ పదకొండవ సీజన్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.ఇదిలా ఉంటే ఐపిఎల్లో జట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) స్పష్టం చేసింది. ఇప్పుడున్న తరహాలోనే వచ్చే సం వత్సరం కూడా ఎనిమిది జట్లే కొనసాగుతాయని బోర్డు సిఇఒ రాహుల్ జోహ్రీ వెల్లడించాడు.ఈ సంవత్సరంతో చెన్నై,రాజస్థాన్ జట్లపై నిషేధం ముగుస్తున్నందున వచ్చే సీజన్లో ఈ రెండు పునఃప్రవేశిస్తాయని ఆయన పేర్కొన్నాడు. ఫలితంగా రెండు సంవత్స రాల పాటు ఐపి ఎల్లో ఉన్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్, గుజరాత్ లయన్స్ జట్లను తప్పి స్తామన్నాడు. నిషేధం ముగిసిపోతుంది కాబట్టి ఆ రెండు జట్లు యధావిధిగా మళ్లీ వచ్చే స్తాయి.జట్ల సంఖ్యను పదికి పెంచాల్సిన అవసరం లేదని బిసిసిఐ భావిస్తుంది.ఇక ముందు గుజరాత్, పుణే జట్లు కొనసాగవని జోహ్రీ వివరించాడు. | 2sports
|
CASH
మ్యాజిక్బ్రిక్స్ రాబడులు రూ.13.26 కోట్లు
నోయిడా, జూన్ 19: ఆన్లైన్ ప్రాపర్టీ డాట్కామ్ మాజిక్బ్రిక్స్ 30శాతం వార్షిక వృద్ధితో నడుస్తు న్నట్లు ప్రకటించింది. నాలుగోత్రైమాసికంలో మ్యాజిక్బ్రిక్స్ రాబడులు 132.6 కోట్లుగా ఉన్నా యి. వార్షికవృద్ధిపరంగా 20శాతం వృద్ధితో ఉందని కంపెనీ వివరించింది. ఆన్లైన్ప్రాపర్టీ కొనుగోళ్ల రంగంలో తన నాయకత్వ స్థాయిని నిలదొక్కుకుంటున్నది. పెద్దనోట్ల రద్దుకారణంగా కొంత ఒత్తిడి ఎదుర్కొన్నది. జనవరి మార్చి త్రైమాసికంలో కొంత సెంటిమెంట్ పునరుద్ధరణ జరిగి కొనుగోళ్లు పెరిగాయి.
ఉత్పత్తి, ఛానల్ కార్యాచరణ, భాగస్వామ్య ఒప్పందాలతో కంపెనీ ఆర్ధికపరిపుష్టి పెరిగిందని సిఇఒ సుధీర్పా§్ు వెల్లడించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కొత్త బిజినెస్ సిరీస్ను ప్రారంభించేయోచనలో ఉంది. వాణిజ్యరియల్ఎస్టేట్, అద్దె విభాగం, విలా సవంతమైన ఎన్ఆర్ఐ విభాగాలకు విస్తరించేందు కు యోచిస్తోంది. గృహరుణాలు, ఎక్స్పీరియన్స్ సెంటర్లు, వంటివి ఎక్కువఉన్నాయి. కంపెనీ ఇతర పోటీసంస్థలకంటే రాబడులపరంగా 20శాతం అధి కంగా ఉన్నట్లు విశ్వసిస్తోంది. కామ్స్కోర్ గణాం కాలను పరిశీలిస్తే మ్యాజిక్బ్రిక్స్ 43శాతం మార్కె ట్ వాటాతోఉంది. మ్యాజిక్బ్రిక్స్ 74 శాతం మంది సందర్శకులతో నంబర్ 2 స్థానంలో నిలిచింది. | 1entertainment
|
EDJoyce
కౌంటీజట్టుకు జాయిస్ గుడ్బై
హైదరాబాద్: ఇంగ్లండ్ కౌంటీ జట్టుకు చెందిన ఎడ్ జాయిస్ తాను దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకుంటు న్నట్లు ప్రకటించాడు. ససెక్స్ జట్టు కెప్టెన్గా వున్న జాయిస్కు ఇప్పుడు 38ఏళ్లు నిండాయి. ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు టెస్ట్ క్రికెట్ ఆడాలన్న కోరికతో తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించాడు. 2006-07 మధ్య కాలంలో ఇంగ్లండ్ జట్టుకు 17 వన్డేలు ఆడిన అతడు, సిడ్నీలో ఆస్ట్రేలియాపై సెంచరి చేసాడు. వెస్టిండీస్లో జరిగిన వరల్డ్కప్లో ఇంగ్లండ్ జట్టుకు సభ్యుడుగా వున్నాడు. 18ఏండ్లుగా దేశవాళీకి ఆడిన అనుభవం వున్న తాను ఇటీవలే మోకాలి గాయానికి చికిత్స చేయించుకున్నానని, తన ఆటతీరుపై ఇది ఏమాత్రం ప్రభావం చూపబోదని పేర్కొన్నాడు. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
‘తల్వార్’ సినిమాగా... ఆరుషి కథ
మర్డర్ కేసు... ఇప్పుడు సినిమాగా రాబోతోంది. దానికి తల్వార్ అని పేరు పెట్టారు.
TNN | Updated:
Aug 27, 2015, 06:21PM IST
తల్లిదండ్రుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది పద్నాలుగేళ్ల ఆరుషి తల్వార్. 2008లో నోయిడాలో జరిగిన దారుణ హత్య అది. ఆరుషితో పాటూ, ఇంటి పనిమనిషిని కూడా ఆమె తల్లిదండ్రులు చంపేశారు. అప్పట్లో ఈ కేసు దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. ఆ కేసులో ప్రస్తుతం ఆరుషి తల్లిదండ్రులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఆ మర్డర్ కేసు... ఇప్పుడు సినిమాగా రాబోతోంది. దానికి తల్వార్ అని పేరు పెట్టారు. మేఘనా గుల్జార్ ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో కొంకణా శర్మ , నీరజ్ కబి ఆరుషి తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. ఇర్ఫాన్ ఖాన్ సీబీఏ అధికారిగా నటిస్తున్నాడు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ మాట్లాడుతూ ఈ సినిమా తీయడానికి ఆరుషి తల్లిదండ్రుల అంగీకారం అవసరం లేదని అన్నారు. వారిని కోర్టు దోషులుగా తేల్చిందని అన్నారు. ఈ సినిమాను అక్టోబర్ 2న, గాంధీ జయంతి రోజు విడుదల చేయనున్నారు. | 0business
|
సంస్థ సిఇఒ గగన్ భల్లా
వచ్చే మూడేళ్లలో 300 అపోలో షుగర్ క్లినిక్లు
సంస్థ సిఇఒ గగన్ భల్లా
హైదరాబాద్,జనవరి 24: మధుమేహం స్క్రీనింగ్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్వాగతిం చదగినవేనని అపోలోషుగర్ వెల్లడించింది. దేశవ్యాప్తం గా అపోలోషుగర్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా వచ్చే మూడేళ్లలో 300క్లినిక్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తా మని సిఇఒ గగన్భల్లా వివరించారు. ప్రస్తుతం అపోలో షుగర్కు 52 క్లినిక్స్ ఉన్నాయని, వీటిలో పది క్లినిక్స్ హైదరాబాద్లోనే ఉన్నట్లు వివరించారు. విజయవాడ లో ఆంధ్రహాస్పిటల్స్ భాగస్వామ్యంతో అపోలోషుగర్ పనిచేస్తుందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్య ధిక వేగంతో విస్తరిస్తున్న మధుమేహరోగులకుమరింత ఉన్నతసేవలందించగలమని ఆయన వెల్లడించారు మొత్తం వందకుపైగా డయాలెక్టోలాజిస్టులు, ఎండో క్రినాలజిస్ట్లతోపాటు 150కిపైగా డైటీషియన్లతో భారీ నెట్వర్క్ ఏర్పాటుచేసామని, రెండులక్షలమందికిపైగా మధుమేహరోగులకు సేవలందించగలిగామని గగన్ భల్లా వివరించారు. 300కొత్త క్లినిక్స్లో 1500 నుంచి 2500 మందివరకూ ఎంబిబిఎస్, ఎండిజనరల్ ప్రాక్టీ షనర్లతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. రెండో తరం నగరాలు, గ్రామీణప్రాంతాలకు సైతం విస్తరి స్తామన్నారు. దేశసగటుతో పోలిస్తే ఎపి,తెలంగాణల్లోనే ఎక్కువగా షుగర్కేసులు నమోదవుతున్నాయని, జాతీయ సగటు 18శాతం అయితే ఈరెండు రాష్ట్రాల్లో 25శాతం ఉందని అపోలో షుగర్ సిఇఒ వెల్లడించారు. | 1entertainment
|
SOLAR11
భారీగా తగ్గిన సౌరవిద్యుత్ ధరలు
న్యూఢిల్లీ, మే 11: సౌరవిద్యుత్ ట్యారిఫ్లు రికార్డు స్థాయికి తగ్గాయి. యూనిట్కు 2.62 రూపాయ లుగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల వేలం నిర్వహించిన భాద్లా సోలార్ పార్క్ వేలంలోనే ఈ ధరలు బైటపడ్డాయి. ఎన్టిపిసి సగటుబొగ్గు ఆధా రిత విద్యుత్ టారిఫ్ 3.20 రూపాయలకంటే కూడ ఆసౌరవిద్యుత్ ధరలు తక్కువగా ఉన్నాయి. భాద్లా పిహెచ్-4 సోలార్ పార్క్ ఫలితాలు ఈ ట్యారిఫ్ ధరలు మరింతగా తగ్గించాయి. ఫెలాన్ ఎనర్జీ 50 మెగావాట్లు, ఆవాడా పవర్ 100 మెగావాట్లుతో రెండు ప్రాజెక్టులు చేపట్టాయి. వీటిధరలు 2.62 యూనిట్ ధరలుగా నిర్ణయించింది. సాఫ్ట్బ్యాంక్ క్లీన్టెక్ 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో యూనిట్ధర 2.63ల చొప్పున చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్లోని కడప జిల్లాలో చేపట్టిన 250 మెగావాట్ల ప్రాజెక్టులో ధరలు ఆల్టైమ్ తక్కువస్థాయి అంటే 3.15 రూపాయలకు పడిపోయాయి.
మూలధన వ్యయం తక్కువగా ఉండటం, తక్కువ వడ్డీరేట్లకే రుణాలు వంటివి సౌరవిద్యుత్ ట్యారిఫ్ను తగ్గించి నట్లు తెలుస్తోంది. 2.97రూపాయలకు తగ్గింది. మధ్యప్రదేశ్లోని రేవా సోలార్పార్క్ 750 మెగా వాట్ల ప్రాజెక్టులో ఈయూనిట్ధరలు ప్రకటించారు. అయితే స్థిరీకరించిన టారిఫ్గా చివరకు రేవా ధరలు యూనిట్కు 3.30గా నిర్ణయించినట్లు సమాచారం. గత ఏడాది జనవరిలో సోలార్ విద్యుత్ టారిఫ్లు కొత్త కనిష్టస్థాయికి చేరాయి. ఫిన్నిష్ విద్యుత్ సంస్థ ఫోర్టమ్ ఫిన్సూర్య ఎనర్జీ వంటివి 4.34 యూనిట్ చొప్పున ప్రాజెక్టును సాధించింది. ఎన్టిపిసి బాద్లా సోలార్ పార్క్ టెండరులోనే 70 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను చేపడుతున్నది. 2015 నవంబరులో సౌరవిద్యుత్ టారిఫ్లు యూనిట్ కు 4.63లుగా నిర్ణయించారు. అమెరికా కేం ద్రంగా ఉన్న సన్ ఎడిషన్సంస్థ పునరుద్పత్తి విద్యుత్లో ఎక్కువ బిడ్లు దాఖలుచేయడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అప్పటి నుంచి క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం స్వఛ్ఛ విద్యుత్ పేరిట కాలుష్యరహిత కారకమైన సౌర, పవన విద్యుత్కు ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తూ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. సోలార్మిషన్ద్వారా 2022 నాటికి లక్ష మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తిచేసే లక్ష్యంతో భారత్విదేశీ సంస్థ ల పెట్టుబడులకు సైతం ద్వారాలు తెరిచింది. అందువల్లనే దేశీయసంస్థల్లో విదేశీ సంస్థల పెట్టుబ డులు సైతం గణనీయంగా పెరిగాయని చెప్పాలి. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
12రోజులు పడుకుంటే.. సినిమా ఛాన్స్!
సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలను ట్రీట్ చేసే విధానం గురించి చెబుతున్న మాటలతో వార్తల్లో నిలుస్తున్న
TNN | Updated:
Dec 13, 2017, 04:51PM IST
సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలను ట్రీట్ చేసే విధానం గురించి చెబుతున్న మాటలతో వార్తల్లో నిలుస్తున్న ఫిదా నటి గాయత్రి.. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒకింత సంచలన వ్యాఖ్యలే చేసింది. తనకు వచ్చిన ఒక సినీ ఆఫర్ గురించి ఆమె ఆసక్తిదాయక విషయాలను బయటపెట్టింది. తను ఫిదాకు ముందు అనేక సినిమాలు చేశాను అని.. అయితే వాటితో రాని గుర్తింపు ఫిదాతో వచ్చిందని ఈమె చెప్పింది.
‘ఇంతకు ముందు కొన్నాళ్ల కిందట ఒక బాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చింది. అందులో నటించడానికి సంబంధించి ఒక మేనేజర్ నాతో మాట్లాడాడు. పన్నెండు రోజుల పాటు కమిట్ అయితే.. ఒక ఫ్లాట్, కారు, పది లక్షల రూపాయల డబ్బు.. సినిమాలో అవకాశం ఇస్తాం..అని ఆయన అన్నాడు...’ అని గాయత్రి వివరించింది. పన్నెండు రోజుల పాటు కమిట్ కావడం ఏమిటి? అంటే.. ‘పడుకోవడం..’ అని బదులు ఇచ్చింది ఈ నటీమణి.
ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అమ్మాయిల ప్రతిభను చూడరు అని, ‘పడుకోవడం..’ అనే మాటే ప్రధానంగా వినిపిస్తుంది అని, ఆ ఉద్దేశం ఉందా? లేదా? అనే విషయాన్ని మొహమాటం లేకుండా అడుగతారని... ఓకే చెబితే అవకాశం, లేకపోతే లేదు.. అనే కండిషన్ ఉండనే ఉంటుందని గాయత్రి వివరించింది. పన్నెండు రోజుల పాటు కమిట్ మెంట్ అడిగిన మేనేజర్ తో తను ఇంకేం అడగలేదని.. ఆ సినిమా అవకాశాన్ని వదిలేసుకున్నానని ఈమె చెప్పింది. | 0business
|
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ...
రెండేళ్ల వయస్సులో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటున్న ధోనీ కూతురు జీవా. ఇప్పుడు ఏకంగా పాటే పాడేసింది. అది కూడా మలయాళం పాట. సాధారణంగా మలయాళం భాషా రానివారికి.. ఆ పదాలను పలకడం అంత సులభం కాదు. అయితే, ఈ బుల్లి ధోనీ ఎంతో అవలీలగా, గుక్క తిప్పకుండా మలయాళం పాట పాడేసింది. మోహన్ లాల్ నటించిన ‘అద్వైతం’ సినిమాలోని ‘‘అంబాల పూజై ఉన్నికన్నానండూ నీ’’ అనే పాటను ఎంతో చక్కగా ఆలపించింది.
అక్షరం పొల్లుపోకుండా ఆమె పాడిన పాట విని ధోనీ అభిమానులు మురిసిపోతున్నారు. ఇటీవల ‘‘నాన్న ధోనీకి నీళ్లు తాగిస్తూ.. లడ్డు కోసం పోట్లాడుతూ’’ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారిన జీవా ఈ పాటతో మరోసారి అబ్బో అనిపిస్తోంది. ఆ పాటను ఈ వీడియోలో చూడొచ్చు. | 2sports
|
కొండదిగి వస్తున్న బంగారం ధరలు : 10 గ్రాముల ధర రూ.23530
PNR| Last Updated: సోమవారం, 1 డిశెంబరు 2014 (11:11 IST)
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. దీంతో ఈ ధరలు సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి వచ్చేలా కనిపిస్తున్నాయి. సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వివరాల మేరకు.. పది గ్రాముల బంగారం ధర రూ.23530 వద్ద ఉంది.
ఒక వైపు ముడి చమురు ధరలు ఐదేళ్ళ కనిష్ట స్థాయికి పడిపోగా, మరోవైపు లోహాల ధరలు కూడా అదే దారిలో సాగుతున్నాయి. సోమవారం నాటి ఇంటర్నేషనల్ మార్కెట్ సెషన్లో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 1,442.90 డాలర్ల (సుమారు రూ.70,825) వద్ద కొనసాగింది. అంటే 10 గ్రాముల బంగారం ధర 23,530 రూపాయలకు చేరింది. వాస్తవానికి దేశవాళీ మార్కెట్లో సోమవారం 25,300 రూపాయల వద్ద (ఉదయం 10:30 గంటల సమయంలో) ట్రేడ్ అవుతోంది.
మార్కెట్ నిపుణుల అంచనా మేరకు.. మార్కెట్లో ట్రేడింగ్ ఇదే విధంగా ట్రేడ్ అయితే.. మరో 2 వేల రూపాయల వరకు బంగారం ధర తగ్గే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ ట్రేడింగ్ తో పోలిస్తే దిగుమతి సుంకాలు, ఇతర పన్నులు, మార్కెట్ కమిషన్లు వగైరాలు బంగారం స్పాట్ రేటుకు కలపాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు | 1entertainment
|
internet vaartha 191 Views
ముంబై : భారతీయ స్టేట్బ్యాంకుతోపాటు మరో నాలుగు కొత్త విదేశీ బ్యాంకులకు మైన్మార్లో సొంతంగా శాఖలు ఏర్పాటుచేసుకుని కార్యకలాపాలు సాగించేందుకు అవకాశం లభించింది. నూరుశాతం సొంతంగా ఏర్పాటైన శాఖలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు లభించింది. ఆగ్నేయాసియా దేశం మైన్మార్దేశంలోని సెంట్రల్బ్యాంకు ముందుగా ప్రాథమిక ఆమోదంలభించింది. మైన్మార్ కేంద్రబ్యాంకు, వియత్నామ్ బ్యాంక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్, తైవాన్స్ ఇ ఎస్యుఎన్ కమర్షియల్ బ్యాంకు, దక్షిణకొరియా సిన్హాన్ బ్యాంకులు కూడా మైన్మార్లో శాఖలు ఏర్పాటుచేస్తాయి. సుదీర్ఘక పరిశీలన తర్వాత మా లైసెన్సింగ్ కమిటీ ఈ బ్యాంకులకు అనుమ తులు మంజూరుచేస్తున్నట్లు వెల్లడించారు. 12నెలల కాల వ్యవధిలోపు బ్యాంకులు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. మొత్తం మైన్మార్ కేంద్రబ్యాంకు మార్గదర్శకాలు పాటించిన తర్వాత తుదివిడత లైసెన్సులు జారీచేస్తామని వెల్లడిం చారు. గత ఏడాది అక్టోబరులో తొమ్మిది విదేశీ బ్యాంకులు మైన్మార్లో శాఖలు ఏర్పాటుచేసేందు అనుమతులు జారీ చేసింది. ఐదుదశాబ్దాల తర్వాత విదేశీబ్యాంకులకు మైన్మార్ లో అనుమతులు లభించాయి. గత ఏడాది ఏప్రిల్లోనే జపాన్ టోక్యో మిత్సుబిషి యుఎఫ్జె మైన్మార్లో మొట్టమొదటి విదేశీబ్యాంకును ఏర్పాటుచేసింది. 1962లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న మైన్మార్ మిలిటరీ మొత్తం బ్యాంకులను జాతీయకరణ చేసింది. అధికార యంత్రాంగం రాజకీయ, ఆర్థిక సంస్కరణలను అమలుచేస్తూ ఎక్కువ ఆంక్షలను ఎత్తివేశారు. వైదొలుగుతున్న బిలిటరీ ఆధిపత్యంలోని ప్రభుత్వం, నోబెల్లారేట్ ఆంగ్సాన్ సూక్యీ కొత్త జాతీయ ప్రజాసామ్య సంఘటన ప్రభుత్వం మూలధన వనరులు మరింతగా పెరిగి పెట్టుబడులు పెంచుకోవాలని తద్వారా ఆర్థిక వృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించింది. భారతీయ స్టేట్బ్యాంకు ప్రపంచంలోని అనేక దేశాల రాజధానుల్లో వీటి శాఖలు ఏర్పాటు చేయడంతోపాటు అనేక ముఖ్యనగరాల్లో కూడా ఎస్బిఐ తన శాఖలను ఏర్పాటు చేసింది. | 1entertainment
|
Hyderabad, First Published 13, May 2019, 1:27 PM IST
Highlights
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘మహర్షి’ సినిమా మంచి టాక్తో థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘మహర్షి’ సినిమా మంచి టాక్తో థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం విడుదలైన ఈ చిత్రం ఈ వీకెండ్ లో బాక్సాఫీసు వద్ద సక్సెస్ ఫుల్ గా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే వేవ్ కంటిన్యూ అయితే వందకోట్ల మార్క్ ని ఈజీగా రీచ్ అవుతుందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు. మహేష్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమాని ఆయన పేర్కొన్నారు.
అయితే అదే సమయంలో టీమ్ అంతా ఈ రోజు కలెక్షన్స్ వైపు ఆసక్తిగా ఒకింత టెన్షన్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు కలెక్షన్స్ డ్రాప్ అవకుండా నిలబడితే ఇంక తిరుగులేదు. నిజమైన పరీక్ష ఈ రోజే. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి కానీ లెక్కలు తెలియవు. దాన్ని బట్టే ప్రమోషన్స్ పెంచాలా...ట్రైలర్స్ మార్చాలా ..వాట్ నెక్ట్స్ అనేది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ రూపొందింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్రాజు, ప్రసాద్ వి పొట్లూరి, అశ్వినీదత్ నిర్మాతలుగా వ్యవహరించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. మహేష్ నటన, కథ, వంశీ టేకింగ్ అద్భుతంగా ఉన్నాయని చిత్రం టీమ్ ని ప్రముఖులతోపాటు నెటిజన్లు ప్రశంసించారు. | 0business
|
Mar 01,2017
ఎయిర్ ఇండియా ప్రయివేటుపరం..!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రయివేటుపరం చేయడానికి మోడీ ప్రభుత్వం పావులు కదుపుతోందని సమాచారం. నష్టాల సాకుతో సంస్థలోని 51 శాతం వాటాను ప్రయివేటుకు విక్రయించడానికి కసరత్తు జరుగుతుందని బ్లూమ్బర్గ్ ఒక కథనం వెల్లడించింది. ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. వాటాల విక్రయానికి వీలుగా ఆర్థిక మంత్రిత్వశాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం నేరుగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందని తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో దాదాపు 51శాతం వాటాలను విక్రయించాలని యోచిస్తున్నారు. ఎఐలో మెజార్టీ వాటాల విక్రయంపై ఆర్థిక శాఖ ప్రతినిధి, ఎయిర్ ఇండియా ప్రతినిధి మాట్లాడేందుకు నిరాకరించారు. గత పదేళ్లలో ఎఐకి రూ.30,231 కోట్ల మూలధనం సమకూర్చారు. కాగా 2015-16లో రూ.3,587 కోట్ల నష్టాలు చవి చూసింది. రూ.105 కోట్ల నిర్వహణ లాభాలు నమోదు చేసుకుంది. ప్రభుత్వ విధానాల వల్ల 2014లో దేశీయంగా 18.4 శాతం మార్కెట్ వాటా కలిగిన ఎఐ 2016లో 14.6 శాతానికి కోల్పోయింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
డిజిటల్ లావాదేవీలు అంతంతే..
- నోట్ల రద్దు తర్వాత.. కార్డుల ద్వారా 7% మాత్రమే..
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత డెబిట్ , క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీలు కేవలం 7శాతమే నమోదయ్యాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించేందుకు శతవిధాలుగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోని ప్రజలు డిజిటల్ లావాదేవీలపై అంతగా ఆసక్తి చూపించడం లేదని మరోసారి తేటతెల్లమైంది. నోట్ల రద్దు తర్వాత.. మొత్తంగా 23శాతం మేర డిజిటల్ లావాదేవీలు పెరగ్గా, అందులో కేవలం 7శాతం మాత్రమే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగాయని ప్రభుత్వ అధికారులు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి వివరించారు. 'పెద్దనోట్ల రద్దు డిజిటల్ ఎకానమీకి మారిన తీరు'పై పలు మంత్రిత్వశాఖ అధికారులు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ప్రజెంటేషన్ ఇచ్చారు. 2016 నవంబర్ నుంచి మే 2017 వరకూ వివిధ పద్ధతుల్లో 23 శాతం మేర డిజిటల్ లావాదేవీలు పెరగడం ద్వారా 27.5 మిలియన్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని తెలిపారు. అత్యధిక మంది యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా ఈ లావాదేవీలు జరిపారు. నవంబర్ 2016లో 10 లక్షలమంది వినియోగించగా, మే 2017 నాటికి ఈ సంఖ్య 30 లక్షలకు చేరింది. ఇక ఇదే సమయంలో ఐఎంపీఎస్(తక్షణ పేమెంట్ సర్వీస్) ద్వారా ఈ సంఖ్య 1.2 మిలియన్ నుంచి 2.2 మిలియన్కు పెరిగింది. ఇక అతి తక్కువగా డిజిటల్ లావాదేవీలు జరిగిన విభాగం క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారానేనని అధికారులు వెల్లడించారు. గతేడాది నవంబర్లో 6.8మిలియన్ల మంది కార్డులను వినియోగించగా, ఈ ఏడాది మే నాటికి ఆ సంఖ్య 7.3 మిలియన్లుగా మాత్రమే ఉంది. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
విరాట్ కోహ్లికి మరో అరుదైన గుర్తింపు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Samayam Telugu | Updated:
Mar 28, 2018, 05:09PM IST
విరాట్ కోహ్లికి మరో అరుదైన గుర్తింపు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు బొమ్మను ఉంచనున్నారు. సచిన్, కపిల్ దేవ్, ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోల విగ్రహాల సరసన విరాట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఉంచడం పట్ల కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. జీవితాంతం గుర్తుండిపోయేలా తన బొమ్మను అక్కడ ఉంచేందుకు వీలుగా ఓపిగ్గా కొలతలు తీసుకున్న టుస్సాడ్స్ మ్యూజియం సిబ్బందికి విరాట్ ధన్యవాదాలు తెలిపాడు.
కోహ్లి శరీర కొలతలు తీసుకోవడం కోసం లండన్ టూస్సాడ్స్ మ్యూజియం నుంచి నిపుణులైన ఆర్టిస్టులు ఇండియాకు వచ్చారు. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గ్లామర్, స్పోర్ట్స్, హిస్టరీ, రాజకీయాలు తదితర రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖు మైనపు విగ్రహాలు ఉన్నాయి. లండన్, న్యూయార్క్, ఓర్లాండో, ఆమ్స్టర్డం, బెర్లిన్, వియన్నా, బ్యాంగ్కాక్, హాంగ్ కాంగ్, టోక్యో, సింగపూర్, సిడ్నీ తదితర నగరాల్లో టుస్సాడ్స్ మ్యూజియంలు ఉన్నాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
పి.ఎస్.వి. గరుడవేగ సెన్సార్ రిపోర్ట్
Highlights
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడ వేగ
గరుడ వేగ మూవీలో సన్నీ లియోని స్పెషల్ సాంగ్
భారీ బడ్జట్ తో తెరకెక్కిన ఈ మూవీలో భారీ యాక్షన్ వుందంటున్న సెన్సార్
తెలుగు సినీ పరిశ్రమలో గత కొంత కాలంగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కు... సంబందించినంత వరకూ గత కొన్నేళ్లుగా ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ సినిమా లేనే లేదు. గరుడ వేగ చిత్రం ప్రస్తుతం ఆయన ఫ్యూచర్ ని నిర్ణయించే చిత్రంగా ఉంది. రాజశేఖర్ భవిష్యత్తు కంటే డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు భవిష్యత్తు కి ఈ సినిమా కీలకం అని చెప్పాలి. చందమామ కథలు లాంటి ఒక సాధారణ కథతో నేషనల్ అవార్డ్ సైతం గెలుచుకున్న డైరెక్టర్ ప్రవీణ్ రెండో సినిమాగా గుంటూర్ టాకీస్ తీసాడు.
అది కూడా చిన్న కథ తక్కువ బడ్జెట్ సినిమా అయితే గరుడ వేగ సినిమా కి వచ్చే సరికి ఒక మార్కెట్ లేని రాజశేఖర్ లాంటి హీరోని పెట్టుకుని భారీ బడ్జెట్ తో వచ్చాడు ప్రవీణ్. ఈ సినిమా సెన్సార్ తాజాగా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
సెన్సార్ వారి నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే ఈ సినిమాలో ఖచ్చితంగా విషయం ఉంది అంటున్నారు. రాజశేఖర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. నక్షత్ర తాబేళ్ల చుట్టూరా ఈ సినిమా కథ నడుస్తుంది. వాటి స్మగ్లింగ్ దగ్గర నుంచీ వాటికోసం ఎన్నో మర్డర్ లూ, యాక్షన్ సన్నివేశాలూ జరుగుతూ ఉంటాయి. వీటికి అంత సీన్ ఏముంది వాటికోసం అంత హడావిడి ఏంటి అనేది థియేటర్ లో చూడాల్సిందే నట.
అయితే సినిమా ఫస్ట్ హాఫ్ సైలెంట్ గా స్లో గా స్టార్ట్ అవుతూ సూపర్ యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది, సెకండ్ హాఫ్ లో నక్షత్ర తాబేళ్ల గురించీ వాటితో హీరోకి ఉన అనుబంధం, అతని గతం ఏంటి అనేవి ఉంటాయి. క్లైమాక్స్ కి చేరుకునే సరికి సినిమా కాస్త డౌన్ ఫాల్ కి వచ్చింది అనీ ప్రవీణ్ సత్తారు చేస్తున్న అతిపెద్ద రిస్క్ ఈ సినిమా అనీ అంటున్నారు. భారీ బడ్జెట్ పెట్టేసి రాజశేఖర్ లాంటి హీరోని నమ్ముకున్నారు నిర్మాతలు. మరి చివరికి నిర్మాతలకు చివరకు సినిమా ఏం ఇస్తుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST | 0business
|
- ఈ ఏడాది రూ.లక్ష కోట్లకు..
- సేవలకు అధిక గిరాకీ
- ప్రయాణాలదే ప్రథమ స్థానం
- 'క్యాష్ ఆన్ డెలివరీ'కి ప్రాధాన్యం
ముంబయి: ఇంటర్నెట్ రాకతో దేశీయంగా దుకాణాలకు వెళ్లి కొనుగోళ్లు జరిపే సంస్కృతి కమ్రంగా తగ్గిపోతోంది. ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య పెరగడం, ఆన్లైన్ కొనుగోళ్లకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఏడాది దేశీయ ఆన్లైన్ విపణి రూ.లక్ష కోట్ల మార్కును దాటనున్నట్లు ఐఏఎంఏఐ మరియు ఐఎంఆర్బీ సంస్థలు సంయుక్తంగా ఒక నివేదికలో వెల్లడించాయి. 2014లో 'ఈ' విపణి 53 శాతం వృద్ధి చెంది రూ.81,525 కోట్లుకు చేరింది.'ఈ' వాణిజ్యం 2015 చివరి నాటికి 33% మేర పెరిగి రూ.లక్ష కోట్లకు చేరవకావచ్చని సంస్థలు తమ నివేదికలో తెలిపాయి.
ఈ నివేదికలోని ఇతర ప్రధాన అంశాలు..
- అన్లైన్ వ్యాపారానికి ఆదరణ క్రమంగా పెరుగుతోంది. దీంతో 'ఈ' విపణి లావాదేవీలు 2010లో రూ.26,263 కోట్లు, 2012లో రూ.47,349 కోట్లు, 2013లో రూ.53,301 కోట్లుగా నమాదు అయ్యాయి.
- 2013తో పోలిస్తే 2014లో ఆన్లైన్లో ట్రావెల్స్ బుకింగ్లు 61% మేర పెరిగి రూ.50,050 కోట్లుగా నమోదు అయ్యాయి. ఈ-టెయిలింగ్ విభాగం 29% వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది.
- అన్లైన్లో మొబైల్ ఫోన్లు వాటికి సంబంధించిన పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ-టెయిలింగ్ విభాగంలో ఈ రంగం వాటా 41% వృద్ధి చెంది రూ.9,346 కోట్లుగా నిలిచింది.
- ట్యాబ్లు, లాప్టాప్ల కొనుగోళ్లు వరుసగా రూ.1059కోట్లు, రూ.2780 కోట్లుగా రికార్డయ్యాయి. గృహాలంకరణ వస్తువుల విక్రయాలు రూ.648 కోట్లుగా నమోదు అయ్యాయి.
- కొనుగోళ్లు జరిపిన వారిలో 45% మంది, వస్తువులు ఇంటికి చేరాకే డబ్బు చెల్లించే అంశాన్ని ఎంచుకొన్నారు. 21% మంది డెబిట్ కార్డుల ద్వారా, 16% మంది క్రెడిట్ కార్డుల ద్వారా, 10% మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్లో.. మరో ఎనిమిది శాతం ఇతర మార్గాల ద్వారా కొనుగోళ్లు జరిపారు.
- ఆన్లైన్ ద్వారా ఆహారాన్ని ఇంటికి తెప్పించుకొనే వారి సంఖ్య 2014లో 40% మేర పెరిగింది. దీని విలువ రూ.350 కోట్లు.
- విత్తమార్కెట్కు సంబంధించిన ఆన్లైన్ వ్యాపారపు సమ్మేళిత వార్షిక వృద్ధి రేటు 2010 నుంచి 20% మేర వృద్ధి చెందుతూ వస్తోంది.
- మరోవైపు సేవారంగాలకు చెందిన మార్కెట్ వృద్ధి 70%గా ఉంది.
- క్లాసిఫైడ్ విభాగం కూడా గణనీయంగా వృద్ధి చెంది రూ.896 కోట్లకు చేరుకుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
టీమిండియాకి సవాల్ ఆ బౌలర్లే: భజ్జీ
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ నుంచే భారత బ్యాట్స్మెన్కి ఎక్కువ సవాల్ ఎదురుకానుందని వెటరన్ స్పిన్నర్ హర్భజన్
TNN | Updated:
Dec 25, 2017, 05:41PM IST
టీమిండియాకి సవాల్ ఆ బౌలర్లే: భజ్జీ
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు డేల్ స్టెయిన్ , మోర్నీ మోర్కెల్‌ నుంచే భారత బ్యాట్స్‌మెన్‌కి ఎక్కువ సవాల్ ఎదురుకానుందని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించాడు. జనవరి 5 నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ తీరుపై మీడియాతో భజ్జీ సోమవారం మాట్లాడాడు. భుజం గాయం కారణంగా ఏడాది నుంచి జట్టుకి దూరంగా ఉన్న స్టెయిన్.. ఇటీవల మళ్లీ పునరాగమనం చేశాడు. దీంతో అతను మళ్లీ మైదానంలో తనని తాను నిరూపించుకుకోవడానికి నిప్పులు చెరుగుతాడని హర్భజన్ వివరించాడు.
‘దశాబ్దకాలంగా డేల్ స్టెయిన్ బెస్ట్‌ బౌలర్‌గా కొనసాగాడు. ఏ క్రికెటర్‌కైనా గాయం నుంచి కోలుకుని జట్టులోకి పునరాగమనం చేయడం అంత సులువు కాదు. జింబాబ్వేతో మంగళవారం నుంచి ఆరంభంకానున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా తరఫున స్టెయిన్ మళ్లీ బంతిని అందుకోబోతున్నాడు. ఈ మ్యాచ్‌‌తోనే అతను భారత్‌కి గట్టి సంకేతాలు ఇవ్వనున్నాడు. అయితే.. భారత్ బ్యాటింగ్ లైనప్ మురళీ విజయ్, పుజారా, విరాట్ కోహ్లి, రహానె, రోహిత్ శర్మతో పటిష్టంగా ఉంది. కానీ.. వీరికి స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌ టెస్టు సిరీస్‌లో సవాల్ విసరగలరు’ అని భజ్జీ వివరించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Soft Ware
మూడేళ్ల కనిష్టస్థాయికి నెట్ కంపెనీల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ, జనవరి 10: భారత్లోని ప్రైవేటు ఇంటర్నెట్ కంపెనీల నిధుల సమీ కరణ మూడేళ్ల కనిష్టస్థాయికి చేరింది. డిసెంబరుతో ముగిసిన చివరి త్రైమా సికంలో 300మిలియన్ డాలర్లు మాత్రమే సేకరించినట్లు జెఫరీస్ నివేదిక విశ్లేషిం చింది. ఇంటర్నెట్ కంపెనీల నిధుల సమీ కరణ మందగమనంతోనే ఉందని, డిసెం బరు త్రైమాసికంచూస్తే మూడేళ్ల కనిష్ట స్థాయిలో ఉందని, 2013 జూన్నాటి నిధు ల సమీకరణ గుర్తుకుతెచ్చిందని విశ్లేషిం చింది. 2015లో 5.8 బిలియన్ డాలర్లు సమీకరిస్తే 2016లో కేవలం 2.7 బిలియన్ డాలర్లు నిధులు మాత్రమే సెరించగలిగాయి. ఇ-టెయలింగ్ విభాగం ఎక్కువ వాటాతో ఉంది. 74శాతం వాటా ఈసంస్థలకే దక్కిం ది. రవాణారంగంపరంగా మేక్మైట్రిప్, ఐబిబో, యాత్రా డాట్కామ్లు నిధులు సమీకరించాయి
. బైజు, సోషల్నెట్వర్క్ హైక్ క్లాసిఫైడ్స్ కార్ట్రేడ్, ఫిన్టెక్ మొబిక్విక్ వంటివి నిధుల సేకరణలో కొంతముందున్నాయి. 2017 తీరుతెన్ను లు కూడా లాభదాయకత, పునరేకీకరణ ఆధారంగా నిధులు అందుబాటు లోనికి వస్తాయని జెఫెరీస్ అంచనావేసారు. భారత ఇంటర్నెట్రంగం గడచిన 12నెలల్లో వృద్ధిపథంగానే ఉందని, మరింతగా 2017లో వృద్ధి అవసరమవుతుందని అభిప్రాయపడ్డారు. ఎక్కువగా ఫిన్టెక్ కంపెనీలు నిధులు సమీ కరణ సాధించుకోగలుగుతాయని, ఎక్కువ మంది ఇన్వెస్టర్లను ఆకర్షించగలవని అంచనా. ఆన్లైన్ డిజిటల్ కంటెంట్, వినోదరంగం, విద్య వంటివాటిలో ఎక్కువ ఉంటాయి. 4జి రంగంలోని రావడం డేటా ట్యారిఫ్ల తగ్గు ముఖం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వడీఇయో, రిలయన్స్జయో వంటి యాప్ వ్యాపారాలు, మౌలికవనరులు ఇంటర్నెట్ కంపెనీల వృద్ధికి మరింత దోహదం చేస్తాయని అందుకు అనుగుణంగానే నిధుల సమీకరణ ఉంటుందని అంచనా. | 1entertainment
|
NOKIA3310
భారత్మార్కెట్కు రానున్న నోకియా 3310
ముంబై: మార్పులుచేర్పులతో కూడిన నోకియా 3310 కొత్తఫోన్ మార్కెట్కు వస్తోంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో మొదటిసారిప్రదర్శించిన అనంతరం వాణిజ్యమార్కెట్కు రానున్నది. ఈ ఫోన్ ధర 49 యూరోలు 52 డాలర్లుగాను, రూపాయిల్లో చూస్తే 3468 రూపాయలుగా ఉంటుందని అంచనా. అయితే భారత్ మార్కెట్లో ఎప్పటినుంచి అందుబాటు లో ఉంటుందనేది కంపెనీ స్పష్టంచేయలేదు. 2.4 అంగుళాల డిస్ప్లేతో వస్తున్న ఈఫోన్ పరిమిత ఇంటర్నెట్ సౌకర్యంతో పనిచేస్తుంది. 2.5జి కనెక్టివిటీ ఎస్30 ఆపరేటింగ్ వ్యవస్థతో ఉంటుంది. 1200 ఎం ఎహెచ్ బ్యాటరీ, 22 గంటల టాక్టైమ్ అందిస్తుంది. నెలరోజుల సుదీర్ఘ స్టాండ్బై టైమ్ ఇస్తుంది. నోకియా 3310 గతంలో స్నేక్గేమ్ పాపులర్ అయింది. అదే గేమ్ను ముందుగా లోడ్చేసి మరికొన్ని కొత్తఫీచర్లతో అందిస్తున్నది. 2017మోడల్ మైక్రో యుఎస్బి పోర్టుద్వారా రీఛార్జి చేసుకునే వీలుంటుంది. 2ఎంపి కెమేరాకూడా ఉంది. 51 గంటలపాటు ఎంపి3 ప్లేబ్యాక్, 39 గంటలపాటు నిర్విరామంగా ఎఫ్ఎం రేడియో ప్లేబాక్కూడా వినే సౌకర్యం ఉంది. 2000వ సంవత్సరంలో మొదటిసారి విడుదలయిన 3310 ఫోన్ సుమారు 120 మిలియన్ల యూనిట్లు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోయాయి. ఆ తర్వాత 2005లో ఉత్పత్తి నిలిపివేసింది. 1998 నుంచి 2011వరకూ నోకియా ప్రపంచంలోనే టాప్ మొబైల్ తయారీ సంస్థగా నిలిచింది. శాంసంగ్, యాపిల్ వంటి కంపెనీలు వచ్చిన తర్వాత స్మార్ట్ఫోన్ కేటగిరీలో కంపెనీ తన ఉనికిని కోల్పోయింది. నోకియా బ్రాండ్ను మైక్రోసాప్ట్ కొనుగోలుచేసింది. బేసిక్ ఫోన్లను నోకియా పేరుమీద లూమియా స్మార్ట్ఫోన్లును తన సొంత బ్రాండ్పేరిట విక్రయిస్తోంది. హెచ్ఎండి గ్లోబల్ కొన్ని నోకియా బేసిక్ఫోన్లను గతనెలలో విడుదలచేసింది. ఈ ఏడాదిలోనే కొత్తఫోన్లను మరిన్ని విడుదల చేస్తామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నోకియా3310వచ్చిన పేరు దృష్ట్యా ఫిన్ల్యాండ్ప్రభుత్వం అప్పట్లో ఈ ఫోన్ను దేశవ్యాప్తంగా ఎంపికచేసిన మూడు ఎమోజిల్లో ఒకటిగా ఎంపికచేసింది. | 1entertainment
|
రేపు ఎస్బీఐలో 'కిసాన్ మేళా'
నవతెలంగాణ - వాణిజ్య విభాగం
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 1150 గ్రామీణ, పట్టణ శాఖలలో కిసాన్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. రైతు ఖాతాదారులకు మరింత చేరువ కావడానికి బుధవారం (18న) ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటుగా వారి హక్కులు, బ్యాంకు చేపట్టిన పలు కార్యక్రమాల గురించి అవగాహన కల్పించనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని 1.5 కోట్ల మంది రైతులు తమ ఖాతాదారులుగా ఉన్నారని పేర్కొంది. జాతీయ స్థాయిలో 14వేల శాఖల్లో జరిగే ఈ కిసాన్మేళా ద్వారా కనీసం 10 లక్షల మంది రైతులను చేరుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపింది. ఎస్బీఐ ఇటీవలనే దేశ వ్యాప్తంగా పలు చోట్ల కిసాన్మేళాలను నిర్వహించి 6 లక్షల మందికి పైగా రైతులను కొత్తగా చేరువైంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Shernwa
రిచర్డ్స్, సచిన్, లారాల కలియిక కోహ్లీ: షేన్వార్న్
పూణే: ఆధునిక క్రికెట్ ప్రపంచంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్గా ఆస్ట్రేలియాకు చెందిన లెజెండరీ స్పిన్నర్ షేన్వార్న్ ప్రశంసించాడు.దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డివిలియర్స్ కంటే కోహ్లీనే అత్యుత్తమ క్రికెటర్ అని కొనియాడాడు.ఈ మధ్య కాలంలో కోహ్లీ సృష్టించిన రికార్డులే అగ్రస్థానంలో నిలిపాయని షేన్ వార్న్ పేర్కొన్నాడు.ఫార్మాట్ ఏదైనా సరే వరుస సెంచరీలతో సత్తా చాటుతున్న కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో నంబర్్ వన్ ఆటగాడని కితాబునిచ్చాడు. బ్యాటింగ్ దిగ్గజాలు వివ్ రిచర్డ్స్,సచిన్,బ్రియాన్ లారాల కలయికే కోహ్లీ అని పూణేలో స్పోర్ట్ టేల్ కార్యక్రమానికి హాజరైన వార్న్ పేర్కొన్నాడు. కోహ్లీ నెంబర్ వన్ ఆట గాడు చాలా వేగంగా సెంచరీలు చేస్తూ దూసుకు పోతు న్నాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్, సచిన్ లతో పోల్చదగిన ఒకే ఒక్క క్రికెటర్ కోహ్లీ అని వార్న్ పేర్కొన్నాడు. 2016లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ముందున్నాడు. దీంతో పాటు వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించి క్రికెట్ దిగ్గజాలైన సర్ డాన్ బ్రాడ్మన్,రాహుల్ ద్రావిడ్ల రికార్డులను అధిగమించిన సంగతి తెలిసిందే. నేను కోహ్లీకి పెద్ద అభిమానిని.అతని బ్యాటింగ్ చూడటం నాకు చాలా ఇష్టం.కెప్టెన్గా కోహ్లీ దూకుడును కూడా ఇష్టపడతా, ఒక క్రికెటర్గా కోహ్లీఅంటే నాకు అభిమానం. అతనొక భిన్నమైన ఆటగాడు అని వార్న్ వివరిం చాడు.నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో భారత క్రికెట్ జట్టే ఫెవరేట్ అని వార్నర్ జోస్యం చెప్పాడు. టీమిండియాను స్వదేశంలో ఓడించడం ఆస్ట్రేలియాకు అంత సులువు కాదన్నాడు.ఈ సిరీస్ ఖచ్చితంగా స్టీవ్ స్మిత్సేకు పరీక్ష లాంటిదేనిన షేన్ వార్న్ పేర్కొన్నాడు. పిచ్పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన వార్న్ నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో భాగంగా భారత్,ఆస్ట్రేలిఆయ మధ్య తొలి టెస్టు పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గురవారం ప్రారంభమైంది.తొలిసారిగా ఒ టెస్టు మ్యాచ్కు ఈ స్టేడియం ఆథిత్యమిస్తుంది. ఈ క్రమంలో పిచ్ బాగా పొడిగా ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతు న్నారు.ముంబైలోని వాంఖడే స్టేడియం మాదిరి ఈ స్టేడి యంలోని పిచ్పైనా పగుళ్లుకనిపిస్తున్నాయి.
తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.పిచ్ బాగా డ్రైగా ఉందని, బౌన్స్కు అవకాశం ఉండదన్న ఉద్ధే శ్యంతో బ్యాటింగ్ తీసుకున్నామని టాస్ గెలిచిన అనంతరం స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.టి20 మ్యాచ్లకు, టెస్టు మ్యాచ్లకు తేడా ఉందని,ఈ టెస్టు సిరీస్కు బాగా ప్రాక్టీస్ చేశామన్నాడు.ఆసీస్ తరుపున ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఆల్రౌండర్లలో బరిలోకి దిగుతున్నట్లు పేర్కొ న్నాడు.టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ ఎటు వంటి అవచనాలు లేకుండానే టాస్కు వచ్చానన్నాడు. కోహ్లీ కూడా స్లోపిచ్నుంచి స్పిన్ ఆశిస్తున్నట్లు వివరిం చాడు. అయితే ఇక్కడ రివర్స్ స్వింగ్కు కూడా అవకాశా లున్నాయి.టాస్ అనంతరం కామెంట్రేటర్ రవిశాస్త్రి మాట్లాడుతూ ఉపఖండంలో ఇటువంటి పిచ్ను తానెన్నడు చూడలేదన్నాడు. టాస్ కీలక పాత్ర పోషించనుంది ఇక స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.టెస్టు తొలి రోజునే అయిదవ రోజు పిచ్ మాదిరి కనిపిస్తుంది.ఈ టెస్టులో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది.టాస్ గెలిచిన వారికి పిచ్ లాభిస్తుంది అని షేన్ వార్న్ పేర్కొన్నాడు. భారత్లో స్పిన్కు అనుకూలంగా ఉండే పిచ్లను చూశాం కానీ,ఈ తరహా పిచ్లను తానెన్నడు చూడలేదని కామెంట్రేటర్ సంజ§్ు మంజ్రేకర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చైతూ.. రాఖీ స్పెషల్ సాంగ్తో వచ్చేశాడు
నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ ‘యుద్ధం శరణం’.
TNN | Updated:
Aug 7, 2017, 05:52PM IST
నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ ‘యుద్ధం శరణం’.ఇటీవల విడుదలైన టీజర్‌లో ‘నాకు తెలిసిన ప్రపంచం ఇదికాదు.. మనం బ్రతకాలంటే.. వాడికి ఎదురు వెళ్లాలి. ఇది ధైర్యం కాదు తెగింపు అంటూ’ యుద్ధం మొదలు పెట్టిన నాగ చైతన్య తాజాగా.. రాఖీ శుభాకాంక్షలను తెలియజేస్తూ మరో వండర్ ఫుల్ గిఫ్ట్ ఇచ్చాడు. రాఖీ ప్రాముఖ్యతను తెలిపే లిరిక్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే.. పులకించే బంధాలన్నీ ఒకటై’ అంటూ సాగిన ఈ సాంగ్ హార్ట్ టచ్చింగ్ లైన్స్‌తో అద్భుతంగా ఉంది. ప్రదీప్ కుమార్ ఆలపించిన ఈ సాంగ్‌కు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.
Here you go guys Enno enno bhavala from #YuddhamSharanam https://t.co/Dhte4EOQ0g thank you for this @viveksagar2
— chaitanya akkineni (@chay_akkineni) August 7, 2017
'అక్కా చెల్లెల్లు రాఖీ ఎందుకు కడతారో తెలుసా.. అమ్మా నాన్నల తరువాత వాళ్ల బాధ్యత అన్నా తమ్ముళ్లదే అని' అంటూ రేవతి చెప్పిన హార్ట్ టచింగ్ డైలాగ్స్‌తో మొదలైన ఈసాంగ్‌లో మధ్య తరగతి కుటుంబంలో ఉండే ప్రేమానురాగాలను కళ్లకు కట్టినట్లు చూపించారు యువ దర్శకుడు. వారాహీ చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ‘యుద్ధం శరణం’ మూవీతో కృష్ణ మరిముత్తు అనే ఓ కొత్త డైరెక్టర్‌ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శ్రీకాంత్ విలన్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో రేవతి, రావు రమేష్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. | 0business
|
Srilanka Batting1
జింబాబ్వేపై శ్రీలంక గెలుపు
కొలంబో: సొంతగడ్డపై శ్రీలంక జోరు కొనసాగుతోంది. జింబాబ్వేతో గురువారం జరిగిన మూడో వన్డేలో ఆ జట్టు 310 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేసి 8వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందు కుంది. ఓపెనర్ మసకద్ధ 98బంతుల్లో 15ఫోర్లు, ఒక సిక్స ర్తో 111పరుగులతో శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 8వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఓపెనర్లు డిక్వెల్లా 116 బంతుల్లో 14ఫోర్లతో 102 పరుగులు, గుణతిలక 111బంతుల్లో 15ఫోర్లు, ఒక సిక్స్తో 116పరుగు లతో శతకాలు బాదడంతో శ్రీలంక 47.2 ఓవర్లలోనే 312/2 విజయాన్ని అందుకుంది. ఛేదనలో తొలి వికెట్కి అభేద్యంగా 37ఓవర్లలోనే 229 పరుగుల భాగస్వామ్యాన్ని శ్రీలంక ఓపెనర్లు నెలకొల్పారు. దీంతో మ్యాచ్పై శ్రీలంక పట్టు బిగించేసింది. కానీ…8పరుగుల వ్యవధిలోనే ఓపెనర్లు ఔటైనా తర్వాత కుశాల్ మెండిస్ (28 నాటౌట్), ఉపుల్ తరంగ 32బంతుల్లో 44నాటౌట్తో గెలుపును లాంఛనంగా పూర్తి చేశారు. తొలి వన్డేలో జింబాబ్వే గెలవగా…తర్వాత రెండు వన్డేల్లోనూ గెలిచిన శ్రీలంక ఐదు వన్డేల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే శనివారం జరగనుంది. | 2sports
|
Apr 05,2015
టాటా అమ్మకాలు భేష్
ముంబయి: టాటా మోటార్స్ ప్రతిష్ఠకు అద్దంపట్టే ఉన్నత శ్రేణి జాగ్వర్, ల్యాండ్ రోవర్ వాహనాల అమ్మకాలలో మంచి వృద్ధి నమోదు అయినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాది ఇదే కాలపు అమ్మకాలతో పోలిస్తే అమెరికాలో ఈ రెండ బ్రాండ్ల వాహనాల అమ్మకాలలో 35.8 శాతం మేర వృద్ధి నమోదు అయినట్లు టాటా మోటార్స్ వివరించింది. ల్యాండ్రోవర్ అమ్మకాలలో విశేషంగా 54% వృద్ధి నమోదు అయినట్లు సంస్థ వెల్లడించింది. గత ఏడాది మొత్తం 1,660 వాహనాలు అమ్ముడవగా ఈ ఏడాది వీటి అమ్మకాలు 6,778కి చేరినట్లు సంస్థ వివరించింది. అమ్మకాల వృద్ధి నేపథ్యంలో సంస్థ షేరు బుధవారం రెండు శాతం మేర ఎగసి రూ.338.05 వద్ద స్థిరపడింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బంగ్లాతో మ్యాచ్ని రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
సుదీర్ఘకాలం తర్వాత బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఆదిలోనే ఆతిథ్య దేశానికి షాకిచ్చింది
TNN | Updated:
Aug 22, 2017, 05:01PM IST
సుదీర్ఘకాలం తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఆదిలోనే ఆతిథ్య దేశానికి షాకిచ్చింది. ఫతుల్లా వేదికగా బంగ్లాదేశ్‌తో మంగళవారం జరగాల్సిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ని రద్దు చేసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. గత కొద్దిరోజుల నుంచి బంగ్లాదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా ఎడతెరపిలేని వర్షం కారణంగా ఫతుల్లా మైదానం చిత్తడిగా మారింది. అయితే.. మరో స్టేడియం సిద్ధం చేస్తామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెప్పినా.. భద్రతా కారణాల
దృష్ట్యా ఆస్ట్రేలియా జట్టు నిరాకరించింది.
‘మ్యాచ్‌ని నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ.. వర్షం వారి ఆశల్ని వమ్ముచేసింది. ఢాకా‌‌లో ఆసీస్ జట్టు కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షం కారణంగా చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసి చాలా బాధేసింది’ అని ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ వెల్లడించాడు. 2006 నుంచి భద్రత కారణాలతో ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించలేదు. ఈ రెండు జట్ల మధ్య ఆగస్టు 27 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో ఆరంభంకానుంది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చైతూ లేకపోతే సమంతకు ట్రై చేసేవాడ్ని..
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తాజాగా అక్కినేని వారింటికి కాబోయే కోడలు సమంత గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
TNN | Updated:
Aug 15, 2017, 07:56PM IST
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తాజాగా అక్కినేని వారింటికి కాబోయే కోడలు సమంత గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. హీరోయిన్ సమంత అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమె చాలా అందంగా ఉంటుందని తెగ పొగిడేశాడు ఈ మెగా హీరో. మరో అడుగు ముందుకు వేసి ఒకవేళ చైతు లేకుంటే సామ్‌కు నేను ట్రై చేసేవాడినని సరదాగా వ్యాఖ్యానించాడు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్ లోని సీఆర్ క్వార్టర్స్‌ బెటాలియన్‌తో సాయిధరమ్ తేజ్ ముచ్చటించారు. అక్కడ మహిళా పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు తేజు. తనకు ఇష్టమైన స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని అన్నారు. అలానే తనకు ఇష్టమైన హీరోల్లో ముందుగా తన మావయ్య చిరంజీవి గారి పేరు చెప్పి ఆయన తరువాత రవితేజ, ప్రభాస్ వంటి హీరోలంటే ఇష్టమని అన్నారు. అవకాశం వస్తే రవితేజతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలనుందని అన్నారు. ఇక పెళ్లెప్పుడు అంటే ఇంకో ఐదు సంవత్సరాలు పట్టొచ్చనిఅన్నారు. ఎవర్నైనా ప్రేమించారా? మీకు లవ్ ప్రపోజ్‌లు వచ్చాయా? లాంటి ప్రశ్నలకు ఫన్నీగా ఆన్సర్స్ ఇస్తూ వాళ్లతో ఆడిపాడారు సాయి.
ఇక తన అప్ కమింగ్ మూవీలో జవాన్‌గా నటిస్తున్నట్లు ఆ మూవీ విశేషాలను తెలియజేశారు. విన్నర్, నక్షత్రం సినిమాలతో డీలా పడ్డ తేజు ప్రస్తుతం తను నటిస్తోన్న 'జవాన్' సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిఉండగా.. నవంబర్‌కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
శతకాలతో చెలరేగిన రోహిత్, కోహ్లి.. భారత్ 337/6
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (147), కెప్టెన్ విరాట్ కోహ్లి (113) శతకాలతో చేలరేగిన వేళ.. టీమిండియా భారీ స్కోరు సాధించింది.
TNN | Updated:
Oct 29, 2017, 05:14PM IST
కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (147), కెప్టెన్ విరాట్ కోహ్లి (113) శతకాలతో చేలరేగిన వేళ.. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 29 పరుగుల వద్ద శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. కానీ రోహిత్‌తో జత కలిసిన కోహ్లి రెండో వికెట్‌కు 230 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ వన్డేల్లో 15వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాన్పూర్‌లో రోహిత్‌కు ఇది వరుసగా రెండో భారీ సెంచరీ కావడం విశేషం. ఇదే తరుణంలో విరాట్ కూడా వన్డేల్లో 9000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
కోహ్లి సెంచరీ ముంగిట ఉన్న సమయంలో భారీ షాట్‌కు యత్నించిన రోహిత్ అవుటయ్యాడు. 147 పరుగుల వద్ద శాంట్నర్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత కోహ్లి వన్డేల్లో 32వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ కాసేపటికే పాండ్య కూడా 8 రన్స్‌కే అవుటై నిరాశ పరిచాడు. సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన విరాట్ విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఆఖరి ఓవర్లలో ధోనీ (16 బంతుల్లో 25), జాదవ్ (18) ధాటిగా ఆడటంతో భారత్ భారీ లక్ష్యాన్ని కివీస్‌కు నిర్దేశించింది. కివీస్ బౌలర్లలో సౌథీ, మిల్నే, శాంట్నర్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘సాక్ష్యం’ టీజర్: హిట్టుకొట్టేలానే ఉంది!
సాయిమాధవ్ బుర్రా మరోసారి తన కలం పవర్ చూపించారు. ఈ సినిమా టీజర్లో ప్రధాన ఆకర్షణ సాయిమాధవ్ డైలాగులే అని చెప్పాలి.
Samayam Telugu | Updated:
Apr 18, 2018, 02:26PM IST
‘జయ జానకి నాయక’ సినిమాతో బెల్లకొండ సాయి శ్రీనివాస్ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో పక్కా కమర్షియల్ హీరోగా మారాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ‘సాక్ష్యం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైవిధ్యభరితమైన యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ను ఈరోజు (ఏప్రిల్ 18న) విడుదల చేశారు.
టీజర్ చూస్తుంటే బెల్లకొండ శ్రీనివాస్ హిట్టుకొట్టేలానే కనిపిస్తున్నాడు. అదిరిపోయే విజువల్స్తో, అద్భుతమైన నేపథ్య సంగీతంతో టీజర్ ఆకట్టుకునేలా ఉంది. గత సినిమాలోలానే ‘సాక్ష్యం’లోనూ శ్రీనివాస్ కండలు తిరిగిన బాడీతో ఆకట్టుకుంటున్నాడు. ఇక హీరోయిన్ పూజా హెగ్డే మరో ఆకర్షణ. అయితే సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సాయిమాధవ్ బుర్రా డైలాగులు గురించి. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో సాయిమాధవ్ తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు ‘సాక్ష్యం’లో కూడా సాయిమాధవ్ తన కలం పవర్ చూపించారు అనిపిస్తోంది. | 0business
|
Hyderabad, First Published 30, Mar 2019, 10:42 AM IST
Highlights
నటుడు చిరంజీవి సర్జా నటిస్తోన్న 'రణం' సినిమా షూటింగ్ లో సిలిండర్ పేలడంతో ఇద్దరు తల్లీకూతుళ్లు మరణించారు.
నటుడు చిరంజీవి సర్జా నటిస్తోన్న 'రణం' సినిమా షూటింగ్ లో సిలిండర్ పేలడంతో ఇద్దరు తల్లీకూతుళ్లు మరణించారు. మృతులను చిన్నారి అయిషా ఖాన్(5), తల్లి సుయేరా భానుగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు నగరంలోని బాగాలూరు వద్ద 'రణం' సినిమా షూటింగ్ జరుగుతోంది. సుయేరా భాను తన ఐదేళ్ల చిన్నారితో కలిసి షూటింగ్ చూడడానికి వెళ్లింది. ఆ సమయంలో కారును బ్లాస్ట్ చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ క్రమంలో సడెన్ గా సిలిండర్ పేలింది. దీంతో అక్కడే ఉన్న తల్లీకూతుళ్లు మరణించగా, మరో చిన్నారి తీవ్రగాయాలపాలైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన తరువాత షూటింగ్ ఆపేసి చిత్రబృందం అక్కడ నుండి పారిపోయింది.
ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్న చిరంజీవి మరో సినిమా షూటింగ్ కోసం మైసూరుకి వెళ్లారు. మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న చేతన్ కుమార్ విషయం తెలుసుకొని తన ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు తన సహాయం ఉంటుందని చెప్పారు.
Last Updated 30, Mar 2019, 10:42 AM IST | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
కోహ్లీ.. శంకర్పై వేటు వద్దు: పీటర్సన్
ప్రపంచకప్లో భాగంగా భారత్ జట్టు ఆదివారం మధ్యాహ్నం ఇంగ్లాండ్తో తర్వాత మ్యాచ్లో ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ విజయ్ శంకర్పై వేటు వేసి.. పంత్కి ఛాన్స్ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.
Samayam Telugu | Updated:
Jun 29, 2019, 04:58PM IST
హైలైట్స్
ఇంగ్లాండ్తో ఆదివారం మ్యాచ్ ఆడనున్న భారత్ జట్టు
టోర్నీలో వరుసగా విఫలమవుతున్న విజయ్ శంకర్
ఇంగ్లాండ్పై మ్యాచ్లో పంత్కి ఛాన్స్ ఇవ్వాలని నెటిజన్స్ డిమాండ్
శంకర్పై వేటు వేయద్దని సూచించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత ఆల్రౌండర్ విజయ్ శంకర్కి ఊహించని మద్దతు లభించింది. టోర్నీలో భాగంగా భారత్ జట్టు ఆదివారం మధ్యాహ్నం ఇంగ్లాండ్తో ఢీకొననుండగా.. ఈ మ్యాచ్లో విజయ్ శంకర్పై వేటు పడనుందని వార్తలు వస్తున్నాయి.
ప్రపంచకప్లో నెం.4లో బ్యాటింగ్ చేస్తున్న శంకర్ ఇప్పటి వరకూ చేసిన పరుగులు 58 మాత్రమేకాగా.. బౌలింగ్లోనూ పాకిస్థాన్పై మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో.. ఇంగ్లాండ్పై మ్యాచ్లో శంకర్కి బదులుగా రిషబ్ పంత్ని ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. సెలక్షన్ సమయంలో.. శంకర్ మూడు కోణాల్లో (బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్) భారత్ జట్టుకి ఉపయోగపడతాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. | 2sports
|
Visit Site
Recommended byColombia
అయితే ఖైదీ చిత్రంకంటే ముందే మెగాస్టార్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథతో సినిమా చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆ కథను డీల్ చేయాలంటే కాస్ట్ అండ్ క్రూ కీలకం కావడంతో చిరు చిరకాల స్వప్నం వాయిదా పడుతూ వచ్చింది. అయితే చిరు కలను రామ్ చరణ్ భుజాలపై వేసుకుని ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రాన్ని పట్టాలిక్కించాడు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా టైటిల్‌ లోగోను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను జాతీయస్థాయిలో తెరకెక్కించేందుకు రామ్ చరణ్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయా ప్రాంతాలకు సంబంధించిన స్టార్ నటులు ‘సైరా’ మూవీలో నటిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ను ఈ మూవీతో రంగంలోకి దింపడంతో ఈ చిత్రం ఏ స్థాయిలో వుండబోతుందనే దానికి హింట్‌ ‘సైరా’ మోషన్‌ పోస్టర్‌‌తో దొరికేసింది.
— Pavan Tej (@iPavanTej) August 22, 2017
అమితాబ్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, కన్నడస్టార్ సుధీప్, జగపతిబాబు, నయనతారా లాంటి స్టార్స్‌తో పాటు సాంకేతిక విభాగంలో సుప్రసిద్ధులైన లెజెండ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఈమూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. రవివర్మ ఛాయాగ్రహణం సమకూర్చుతున్నారు. రాజీవన్‌ కళాదర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రచన సహకారం పరుచూరి సోదరులు అందిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వ బాధ్యతను చూస్తున్నారు.
భారీ కాస్ట్ అండ్ క్రూ‌తో రంగంలోకి దిగుతున్న ‘సైరా’ నరసింహారెడ్డి సుమారు రెండు వందలకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అయితే ఈస్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన బాహుబలి చిత్రం అదే రేంజ్‌లో మిగతాభాషల్లోనూ సేల్ అయ్యి భారీగా వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ ఇండియన్ హిట్ మూవీ లిస్ట్‌లో చేరింది. మరి అదే రేంజ్‌లో ‘సైరా’ సేల్ అవుతుందా అన్నది ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది.
అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా స్టామినాను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే మిగతా రాష్ట్రాలు తమిళనాడు,కన్నడలలోనూ మెగాఫ్యాన్స్ బాగానే ఉండటంతో పాటు కన్నడ హీరో సుధీప్ ఈ మూవీలో నటిస్తుండటంతో ఒక రకంగా ప్లస్ అనే చెప్పాలి. అయితే సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ‘సైరా’ బాహుబలి స్థాయిలో హైస్సా రుద్రస్సా హేసరభద్ర సముద్రస్సా అనాలనే టార్గెట్ చాలా పెద్దదే అనేది మార్కెట్ పండితుల అంచనా.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ 68-2
చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య ఇక్కడ జరుగుతున్న 5వ టెస్టులో తొలుత టాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ ్జట్టు లంచ్ విరామసమయానికి 29 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన రూట్ 44,మొయిన్ ఆలీ 7 పరుగులతో ఉన్నారు. ఇషాంత్శర్మ 7 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. | 2sports
|
ఫ్యాన్సీ రేటుకు `పిఎస్వి గరుడ వేగ 126.18 ఎం` ఓవర్సీస్ హక్కులు
Highlights
రాజశేఖర్ కెరీర్ బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా రూ.25కోట్లతో పీఎస్వి గరుడవేగ
పూజా కుమార్ గృహిణి పాత్ర, సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ , శ్రద్ధాదాస్ జర్నలిస్ట్ పాత్ర
ఓవర్సీస్ హక్కులను ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్న వాల్పోస్టర్ సినిమా
యాంగ్రీ యంగ్ మెన్ డా.రాజశేఖర్ కెరీర్లోనే 25 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నారు. గతంలో రాజశేఖర్ అంకుశం, మగాడు వంటి చిత్రాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన మెప్పించడంతో ఈ సినిమాపై ప్రారంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాపై పలువురు డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. ఓవర్సీస్లో వాల్పోస్టర్ సినిమా అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫ్యాన్సీ రేటుతో హక్కులను సొంతం చేసుకుంది.
పూజా కుమార్ గృహిణి పాత్రలో నటిస్తుండగా, సన్నిలియోన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేసింది. శ్రద్ధాదాస్ జర్నలిస్ట్ పాత్రలో నటించింది. అదిత్ ఈ చిత్రంలో టెక్నిషియన్ పాత్రలో నటిస్తున్నాడు. మెయిన్ విలన్గా కిషోర్ నటిస్తున్నాడు. నాజర్, పోసాని కృష్ణమురళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శత్రు, సంజయ్ స్వరూప్, రవివర్మ, ఆదర్శ్, చరణ్ దీప్, రవి రాజ్ తది తరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేకప్ః ప్రశాంత్, ప్రొడక్షన్ మేనేజర్స్ః శ్రీనివాసరావు పలాటి, సాయి శివన్ జంపన, లైన్ ప్రొడ్యూసర్ః మురళి శ్రీనివాస్, కాస్ట్యూమ్స్ డిజైనర్ః బాబీ అంగార, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజన్ః సి.వి.రావ్(అన్నపూర్ణ స్టూడియోస్), స్టంట్స్ః సతీష్, నుంగ్, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫర్ః విష్ణుదేవా, ఎడిటర్ః ధర్మేంద్ర కాకరాల, రచనః ప్రవీణ్ సత్తారు, నిరంజన్ రామిరెడ్డి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ః శ్రీచరణ్ పాకాల, సమర్పణః శివాని శివాత్మిక ఫిలింస్, నిర్మాణంః జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్రఫీః అంజి, సురేష్ రగుతు, శ్యామ్ ప్రసాద్, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచరణ్ పాకాల, ప్రొడ్యూసర్ః ఎం.కోటేశ్వర్ రాజు, కథ, కథనం, దర్శకత్వంః ప్రవీణ్ సత్తారు.
Last Updated 26, Mar 2018, 12:03 AM IST | 0business
|
Mar 14,2017
రూపాయి మరింత పుంజుకోవచ్చు..!
ముంబయి: ఉత్తర ప్రదేశ్లో బీజేపీ విజయంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు మద్దతు పెరుగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో డాలర్తో రూపాయి మారకం విలువ పుంజుకోవచ్చని ఎకనామిక్స్ టైమ్స్ సర్వేలో వెల్లడయ్యింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్లో బీజేపీ విజయం స్టాక్ మార్కెట్లను కొత్త శిఖరాలకు చేర్చవచ్చని బ్రోకర్లు అంచనా వేస్తున్నారు. మోడీ విజయంతో దేశంలో సంస్కరణల అమలుకు మార్గం మరింత సుగుమ మైందని భావిస్తున్నారు. తాజా పరిణామాలతో ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఉన్న స్వల్ప ఆంక్షలు కూడా ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మోడీ సర్కార్ భవిష్యత్ విధానాల వల్ల ఎఫ్డీఐలు భారీగా రావచ్చని అనుకుంటున్నారు. దీంతో రూపాయి విలువ బలపడటానికి దోహదం చేయవచ్చని పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా డాలర్ విలువ భారీగా బలపడుతూ, రూపాయిపై ఒత్తిడి నెలకొన్న విషయం తెలిసిందే. అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మోడీ హవా అనంతరం రూపాయి విలువ మరింత బలపడి డాలరుతో రూపాయి విలువ తిరిగి రూ.66లకు వచ్చి చేరుతుందని ఎకనామిక్ టైమ్స్ పోల్లో తెలిపింది. ఎన్నికల ఫలితాల విడుదలకు ముందు అంటే శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి విలువ రూ.66.61వద్ద ముగిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఉదయ్ కిరణ్ స్మారక అవార్డ్లు 2018
తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరో రేంజ్కి ఎదిగిన ఉదయ్ కిరణ్ జీవితం అర్ధాంతరంగా ముగిసిన సంగతి తెలిసిందే.
Samayam Telugu | Updated:
Jun 27, 2018, 06:52PM IST
తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరో రేంజ్కి ఎదిగిన ఉదయ్ కిరణ్ జీవితం అర్ధాంతరంగా ముగిసిన సంగతి తెలిసిందే. వరుస పరాజయాలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక సంఘర్షణలను తట్టుకోలేక 37 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్నారు ఉదయ్ కిరణ్.
జూన్ 26న ఉదయ్ కిరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరబాద్లోని ప్రసాద్ లాబ్స్లో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కిరణ్ అక్క శ్రీమతి శ్రీదేవి, అభిమానులు మరియు మిత్రులందరూ కలిసి ఉత్తమ లఘ చిత్రాలకు అవార్డుల ప్రదానం చేశారు.
ఈ లఘు చిత్ర అవార్డుల్లో భాగంగా.. ఉత్తమ లఘ చిత్ర దర్శకుడిగా డాక్టర్ ఆనంద్ ఎంపిక అయ్యారు. 9 సంవత్సరాల గిరిజన బాలిక కథ ఆధారంగా డాక్టర్ ఆనంద్ దర్శకత్వంలో యన్ యస్ నాయక్ నిర్మించిన‘చిరు తేజ్ సింగ్’ చిత్రానికి గానూ ఈ అవార్డ్ లభించింది. ఈ మూవీతో పాటు.. అశోక్ రెడ్డి (మిస్టర్ అంద్ మిసెస్ ) ,ఉత్తమ చిత్రంగా మంగమ్మ గారి మనవడు మరియు సమాప్తం, ఉత్తమ నటిగా ప్రియ, ఉత్తమ నటుడిగా కళా రంగం ఉత్తమ బాల నటిగా చిరు తేజ్ సింగ్, ఉత్తమ సహాయ నటిగా సౌమ్య వేణు గోపాల్, ప్రత్యేక జ్యూరీ అవార్డ్ను ఆర్ పి పట్నాయక్ (తథాస్తు) , మరెందరో వివిధ కేటగిరీలలో అవార్డ్ లను అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి శ్రీ వేణు గోపాల చారి ( తెలంగాణా రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి,ఢిల్లీ ), నిర్మాత , దర్శకులు సాయి వెంకట్, సంగీత దర్శకులు ఆర్.పి పట్నాయక్, దర్శకులు వి.యన్.ఆదిత్య, దర్శకులు యన్.శంకర్ , హాస్య నటులు హరీష్, మరియు మరెందరో సినీ రాజకీయ ప్రతినిధులు , అభిమానులు పాల్గొన్నారు. | 0business
|
WINNERS
ప్రీక్వార్టర్స్లో విజయం సాధించిన వీనస్, ముగురుజా, కొంటా, కుజెనెత్సోవా
లండన్: వింబుల్డన్ టోర్నీలో 7వరోజు మూడో రౌండ్ పోటల్లో పలు సంచనాలు నమోదయ్యాయి. టాప్ సీడ్లు ఇంటిదారిపట్టారు. ఫ్రీక్వార్టర్స్లో కెర్బర్, స్విటిలోనా, వొజినియాకి ఓటమి పాలయ్యారు. వీనస్, ముగురుజా, కొంటా, కుజెనెత్సోవాలు క్వార్టర్స్లోకి అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్లో టాప్ సీడ్ జర్మనీ క్రీడాకారిణి అంజెలిక్యూ కెర్బర్ ఇంటిదారిపట్టింది. 14వ ర్యాంకర్ స్పెయిన్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజా చేతిలో ఓటమి పాలైంది. ముగురుజా 4-6, 6-4,6-4 తేడాతో కెర్బర్పై విజయం సాధించింది. మరో గేమ్లో 10వ ర్యాంకర్ అమెరికా క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ క్రోషియా క్రీడాకారిణి అనా కొంజుహ్పై 6-3,6-2తో వరుస సెట్లలో సునాయాస విజయం సాధించింది.
7వర్యాంకర్ రష్యా క్రీడాకారిణి స్వెట్లనా కుజెనెత్సోవా 9వ ర్యాంకర్ పోలెండ్ క్రీడాకారిణి అగ్నీసెజ్కా రద్వాన్స్కాపై 6-2, 6-4 స్కోరుతో గెలుపొందింది. 6వ ర్యాంకర్ ఇంగ్లాండ్ క్రీడాకారిణి జొహన్నా కొంటా ఫ్రాన్స్ క్రీడాకారిణి కారోలిన్ గర్కియాపై 7-6(7-3), 4-6, 6-4తో జయకేతనం ఎగురవేసింది. 4వ ర్యాంకర్ ఉక్రెయిన్ క్రీడాకారిణి స్విటిలోనా 16వ ర్యాంకర్ లాత్వియా క్రీడాకారిణి జెలినా ఆస్టోపెంకో చేతిలో 6-3, 7-6(8-6)తో ఓటమి పాలైంది. 5వర్యాంకర్ డెన్మార్క్ క్రీడాకారిణి కార్లోని వొజినియాకిపై 25వర్యాంకర్ అమెరికా క్రీడాకారిణి కోకో వందేవేగ్ 7-6(7-4), 6-4తో విజయం సాధించింది. పురుషుల డబుల్స్లో టాప్సీడ్లు పోలాండ్ క్రీడాకారుడు హెన్రీ కొంటినెన్-ఆస్ట్రేలియా క్రీడాకారుడు జాన్ ఫీర్స్ల జంట మూడో రౌండ్లో ఫ్రాన్స్ క్రీడాకారుడు హ్యూగో నిస్-క్రొయేటియా క్రీడాకారుడు ఆంటోనియో శాన్కిక్ల జంటపై 6-3,3-6, 6-1, 6-4తో విజయం సాధించింది. మహిళల డబుల్స్లో రెండో ర్యాంకర్లు రష్యా క్రీడాకారిణి ఎక్తరినా మకరోవా- రష్యా క్రీడాకారిణి ఎలినా వెస్నినాల జంట 15వ ర్యాంకర్లు స్లొవేనియా క్రీడాకారిణి అండ్రెజా క్లెపాక్-స్పెయిన్ క్రీడాకారిణి మరియా జోస్మార్టినెజ్సాంచెజ్ల జంటపై మూడో రౌండ్లో 6-4,6-4తో సునాయాస విజయం సాధించింది. | 2sports
|
నన్ను బహిష్కరించకండి.. కేసీఆర్ కు శ్రీరెడ్డి విన్నపం!
Highlights
మా అసోసియేషన్ లో కొందరు సినీ పెద్దలు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. మీరు ఈ రాష్ట్రానికి కింగ్. మీరు అర్ధం చేసుకొని సమస్యని పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నాను. హైదరాబాద్ నుండి నన్ను బహిష్కరించకండి
హైదరాబాద్ రాష్ట్రం నుండి తనను బహిష్కరించవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతోంది నటి శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సెలబ్రిటీల మీద ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. తాజాగా కోలివుడ్ నటులపై కూడా కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది. సినిమా ఇండస్ట్రీలోని అమ్మాయిలను వాడుకున్న వారిలో నటులే కాదు.. రాజకీయనాయకులు కూడా ఉన్నారని తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చింది.
గత కొన్నాళ్లుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన ఫేస్ బుక్ ద్వారా కాస్టింగ్ కౌచ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతోన్న శ్రీరెడ్డి మరొకసారి ఆయనను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాసింది. ''గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి.. సార్ ఇకనైనా స్పందించండి. ఎన్నిరోజులు మేము ఈ బాధలు పడాలి. డ్రగ్స్ తీసుకుంటూ.. హీరోయిన్స్ ను వాడుకునే వాళ్లలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ వారి గురించి నేను మాట్లడదలుచుకోలేదు.
ఒకవేళ మాట్లాడినా న్యాయం జరగదని నాకు తెలుసు. నన్ను చంపినా చంపేయొచ్చు. డ్రగ్స్, సెక్స్ రాకెట్ లో మీ సన్నిహితులు కూడా ఉన్నారు కాబట్టి నేను పొలిటికల్ సైడ్ రాదలచుకోలేదు. మా అసోసియేషన్ లో కొందరు సినీ పెద్దలు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. మీరు ఈ రాష్ట్రానికి కింగ్. మీరు అర్ధం చేసుకొని సమస్యని పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నాను. హైదరాబాద్ నుండి నన్ను బహిష్కరించకండి. నేను చెప్పేవన్నీ నిజాలే'' అని వెల్లడించింది. | 0business
|
TEAM INDIA
టీమిండియా అరుదైన రికార్డు
మొహాలీ: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.కాగా 6 వికెట్లకు 271 పరుగులతో ఓవర్నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు 417 పరుగులు వద్ద ఆటౌటై మ్యాచ్పై పట్టు కొనసాగించింది.ఇదే క్రమంలో ఒక మైలురాయిని కూడా భారత క్రికెట్ సాధించింది.బ్యాటింగ్ ఆర్డర్లో 7,అంతకంటే కింద వచ్చిన ఆటగాళ్లు మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఘనతను భారత్ తొలిసారి సొంతం చేసుకుంది.ఏడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అశ్విన్ 113 బంతుల్లో 11 బౌండరీలతో 72 పరుగులతో హాఫ్ సెంచరీ చేయగా,ఎనిమిదవ స్థానంలో వచ్చిన జడేజా 170 బంతులు ఆడి 10 బౌండరీలు,1 సిక్సర్తో 90 పరుగులు సాధించాడు.కాగా మరోవైపు తన కెరీర్లో రెండవ టెస్టు ఆడుతున్న జయంత్ యాదవ్ 141 బంతుల్లో 4 బౌండరీలతో 55 పరుగులు చేసి తొమ్మిదవ స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ చేశాడు.టీమిండియా తరపున ఒక టెస్టులో ఇలా ముగ్గురు కింద స్థాయి ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చి హాఫ్ సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి.ఇంగండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ జడేజా తృటిలో సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు.కానీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో జడేజా అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అంతకు ముందు జడేజా అత్యధిక టెస్టు స్కోరు 68 కాగా,వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 87 పరుగులు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Shoaib Akhtar: అక్తర్ నాకు బుర్ర లేదంటాడా..? సర్ఫరాజ్ ఫైర్
అక్తర్ వ్యాఖ్యలపై స్పందిస్తే..? అతను మరోసారి తిట్లదండకం అందుకుంటాడు. అతని దృష్టిలో మేము అసలు క్రికెటర్లమే కాదు. కానీ.. మేము ఏంటో..? నిరూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. -పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్
Samayam Telugu | Updated:
Jun 24, 2019, 01:00PM IST
హైలైట్స్
భారత్ చేతిలో ఓడిన అనంతరం పాక్ కెప్టెన్పై మండిపడిన అక్తర్
సర్ఫరాజ్ బుర్రలేని నిర్ణయం తీసుకున్నాడంటూ ఇటీవల విమర్శ
దక్షిణాఫ్రికాపై ఆదివారం మ్యాచ్ గెలిచిన పాకిస్థాన్ టీమ్
ఆ వ్యాఖ్యలపై స్పందిస్తే.. తిట్ట దండకం పెరుగుతుందని పాక్ కెప్టెన్ వెల్లడి
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తనని బుర్రలేని కెప్టెన్ అని విమర్శించడంపై సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్లో 49 పరుగుల తేడాతో పాకిస్థాన్ టీమ్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన సర్ఫరాజ్ అహ్మద్.. టీవీల ముందు కూర్చున్న వారు దేవుళ్లుగా భ్రమిస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇటీవల భారత్తో ముగిసిన మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఛేదనలో తడబడిన పాక్ జట్టు పేలవంగా 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో.. సర్ఫరాజ్ టాస్ నిర్ణయంపై అక్తర్ ఘాటుగా విమర్శలు గుప్పించాడు.
‘సర్ఫరాజ్ అహ్మద్ అంత బుర్ర తక్కువగా ఎలా ఆలోచించాడో..? నాకు అర్థం కావడం లేదు. పాకిస్థాన్ జట్టు ఛేదనలో బలహీనమని అతనికి తెలియదా..? పాక్ ప్రధాన బలం బౌలింగ్. భారత్పై మ్యాచ్లో టాస్ గెలవడం ద్వారా దాదాపు సగం మ్యాచ్ని పాక్ గెలిచేసింది. కానీ.. మ్యాచ్ని చేజార్చుకోవడానికే సర్ఫరాజ్ ఫీల్డింగ్ నిర్ణయం తీసుకున్నట్లున్నాడు.’ అని అక్తర్ ఇటీవల మండిపడ్డాడు.
అక్తర్ మాటల్ని తాజాగా సర్ఫరాజ్ ముందు ప్రస్తావించగా.. ‘ఆ వ్యాఖ్యలపై స్పందిస్తే..? అతను మరోసారి తిట్లదండకం అందుకుంటాడు. అతని దృష్టిలో మేము అసలు క్రికెటర్లమే కాదు. కానీ.. మేము ఏంటో..? నిరూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. అయితే.. మేము ఏది మాట్లాడినా అందులో జట్టు ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. కొంత మంది టీవీల ముందు కూర్చుని.. తామే దేవుళ్లమని భ్రమిస్తుంటారు’ అని పాక్ కెప్టెన్ మండిపడ్డాడు.
దక్షిణాఫ్రికాపై ఆదివారం మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని.. 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 259/9కే పరిమితమైంది. దీంతో.. అక్తర్ మాటలే నిజమయ్యాయి. | 2sports
|
Suresh 146 Views Harbajan Singh
Harbajan Singh
చండీగఢ్: ‘ఖేల్ రత్న అవార్డు కోసం టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ పెట్టుకున్న నామినేషన్ను ఇటీవల కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. హర్భజన్ నామినేషన్ పత్రాలు ఆలస్యంగా రావడంతో ఆయన నామినేషన ్ను కేంద్రం తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 39ఏళ్ల ఈ క్రికెటర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశాడు. పంజాబ్ ప్రభుత్వంపై టీమిండియా సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. ఖేల్రత్న పురస్కారానికి తన నామినేషన్ను పంపడంలో అమరీందర్ సర్కార్ జాప్యం చేసిందని ఆరోపించాడు. ఈ మేరకు ఓ వీడియోను చిత్రీకరించి తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశాడు. రాజీవ్గాంధీ ఖేల్రత్న పురస్కారానికి నా పేరును సూచిస్తూ పంజాబ్ ప్రభుత్వం వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైందని మీడియా వర్గాల ద్వారా తెలిసింది. నామినేషన్ పంపడంలో ప్రభుత్వం జాప్యం చేసినందుకు గాను కేంద్రం దాన్ని వెనక్కి పంపింది. నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని రాష్ట్ర క్రీడాశాఖామంత్రిని కోరుకుంటున్నాను. ఈఅంశాన్ని మరోసారి పరిశీలించాలని పంజాబ్ క్రీడాశాఖామంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధీని భజ్జీ ఈ వీడియోలో కోరారు. నామినేషన్ పంపడంలో ఎక్కడ జాప్యం జరిగిందో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మార్చి 20 నాటికి నా నామినేషన్ తాలూకు వివరాలన్నీ ఇచ్చేశాను. ప్రతి ఆటగాడికి ప్రోత్సాహమనేది చాలా ముఖ్యం. ఇలాంటి ఘటనల వల్ల క్రీడల మీద ఆసక్తి తగ్గడంతో పాటు ప్రభుత్వంపై నమ్మకం పోతుందని వీడియోలో తెలిపాడు. తమ సేవలను గుర్తించి అవార్డులు ఇవ్వడం…క్రీడాకారులకు గొప్ప ప్రోత్సాహం కల్పిస్తుందని, పంజాబ్ క్రీడాశాఖ ఇప్పటికైనా తన పత్రాలను కేంద్రానికి పంపాలని కోరారు. హర్భజన్ సింగ్తో పాటు, ఒడిశాకు చెందిన స్ప్రింటర్ ద్యుతిచంద్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఎన్నికలు వర్షాల కారణంగా ద్యుతి నామినేషన్ ఆలస్యమైందని, ఇందుకుగాను తనకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చినట్లు ద్యుతి పేర్కొంది. | 2sports
|
Ahmedabad, First Published 14, Aug 2019, 9:54 PM IST
Highlights
సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ గుజరాత్ ఫార్చ్యూన్ జాయింట్స్ ఓటమిపాలయ్యింది. బెంగాల్ వారియర్స్ జట్టుతో చివరివరకు పోరాడినా విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో బెంగాల్ వారియర్స్ మరో విజయాన్ని అందుకుంది. గుజరాత్ ఫార్చ్యూన్ జాయింట్స్ ను వారి సొంత గడ్డపైనే ఓడించి సత్తా చాటింది. గుజరాత్ కూడా చివరి వరకు ఓటమిని అంగీకరించకుండా పోరాడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు 28-26 పాయింట్ల తేడాతో బెంగాల్ విజేతగా నిలిచింది.
బెంగాల్ జట్టు స్టార్ రైడర్ ప్రబంజన్ 8 పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆ జట్టులోని మిగతా ఆటగాళ్లలో ఇస్మాయిల్ 5, మణిందర్ సింగ్ 5 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఇలా రైడింగ్ లో 16, ట్యాకిల్స్ లో 7,ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్ట్రాల రూపంలో మరో 3 ఇలా బెంగాల్ మొత్తం 28 పాయింట్లు సాధించింది.
గుజరాత్ ఆటగాళ్లలో సోను 8, సచిన్ 6, సునీల్ 6 పాయింట్లతో చెలరేగినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. గుజరాత్ రైడింగ్ లో 15, ట్యాకిల్స్ లో 11 పాయింట్లతో బెంగాల్ కంటే మెరుగ్గానే ఆడారు. అయితే ఒక్కసారి కూడా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోవడం, ఎక్స్ట్రాల రూపంలో పాయింట్లు లభించకపోవడం గుజరాత్ జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. ఇలా కేవలం 2 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ విజయాన్ని అందుకుంది. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘కార్తీకదీపం’ నవంబర్ 15 ఎపిసోడ్ : సౌందర్య ప్రయత్నం ఫలించింది! ‘మా నాన్నకీ, మీ అమ్మకీ పెళ్లి!?’
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 652 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. 653 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
Samayam Telugu | Updated:
Nov 16, 2019, 08:01AM IST
కార్తీకదీపం నవంబర్ 15
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (నవంబర్ 15) రాత్రి ఎపిసోడ్లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నాన్న ఆచూకీ కోసం సౌర్య విహారీ ఇంటికి వెళ్తుంది. అక్కడ విహారీ భార్య తులసి.. సౌర్యను చాలా ప్రేమగా చూసుకుంటుంది. అయితే ‘మా నాన్న గురించి మీకు తెలుసా? విహారీ మావయ్యకు తెలుసా? అని అడుగుతుంది. తెలియదని తులసి చెప్పడంతో తిరిగి ఇంటికి బయలుదేరుతుంది సౌర్య. వెళ్తూ వెళ్తూ.. గోడ మీద ఉన్న దీప ఫొటో వచ్చేలా సెల్ఫీ తీయనమని తులసిని అడిగి.. సెల్ఫీ తీసుకుని.. ‘మా అమ్మకు పంపించండి’అని చెప్పి వెళ్లిపోతుంది. దీప కార్తీకదీపాలు వెలిగిస్తుంది. వెలిగిచిన కాసేపటికి ఆపిపోతాయి. వెంటనే బాధతో... ‘కార్తీకదీపాలుగా ఇవి.. ఈ దీప వెలిగిస్తే ఆరిపోకుండా ఉంటాయా? పేరులో కార్తీక్ ఉందిగా.. ఆరిపోతాయి.. ఇక ఈ జీవితం ఇలా గడిచిపోవాల్సిందేనా’ అనుకుంటూ ‘ఆరనీకుమా దీపం కార్తీకదీపం’ అంటూ పాడుతూ ఏడుస్తుంది.
653 ఎపిసోడ్లో హైలైట్స్..
దీప బాధతో పాట పాడుకుంటూ.. ఏడుస్తూ.. తిరిగి దీపం వైపు చూసేసరికి అది వెలుగుతుంది. ఆ దీపాన్ని సౌర్య వెలిగిస్తుంది. దాంతో దీప చాలా సంతోషిస్తుంది. తర్వాత సౌర్యని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది. ‘అమ్మా నాన్న వచ్చే వరకూ కార్తీకదీపాలు వెలిగిస్తానమ్మా’ అంటుంది సౌర్య. దీప వద్దని వారించినా.. నాన్న గురించి మరిచిపోమని సర్దిచెప్పినా సౌర్య వినదు. సౌర్య మాటలకు కాస్త బాధపడుతుంది దీప. తర్వాత.. ‘తులసి, విహారీల ఇంటికి వెళ్లి వచ్చావని నాకు తెలుసులే.. తులసి ఫొటో పంపించింది..’ అంటుంది దీప. ‘కోపం వచ్చిందా అమ్మా?’ అంటుంది సౌర్య అమాయకంగా.. ‘లేదమ్మా.. కోపం నా మీదే.. నా తలరాత మీదే’ అంటూ సౌర్యకు అర్థం కాకుండా మాట్లాడుతుంది దీప.
Read Also: మీరు ‘కార్తీకదీపం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్లు ఒక్క క్లిక్తో!
అయితే సౌర్య అదంతా పట్టించుకోకుండా.. ‘నాన్న వచ్చేదాకా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అమ్మా’ అనడంతో.. దీప మనసులో ‘ఈ దీపం వెలిగించినంత సులువు కాదమ్మా’ అనుకుంటుంది. సౌందర్య ఓ చోట కూర్చుని సౌర్య మాటలు తలుచుకుంటుంది. ‘ఈ విహారీ మావయ్య ఇక్కడే ఉన్నాడని నాకు ఎందుకు చెప్పలేదు’ అంటూ దీపని నిలదీసిన మాటలు తలుచుకుని తలపట్టుకుని కూర్చుంటుంది. ఇంతలో హిమ వచ్చి.. ‘నాన్నమ్మా.. మా డాడీ చెప్పింది నిజమేనా? సౌర్య వాళ్ల డాడీ నిజంగానే రానా? లేదంటే వంటలక్క సౌర్యకు అబ్దదం చెప్పిందా?’ అంటూ ప్రశ్నిస్తుంది టెక్షన్గా.
Read Also: ‘ఆమె’తో పెళ్లి.. ఈమెతో శృంగారం! బిగ్ బాస్ ‘మంచోడు’ మంచి రసికుడే!
వెంటనే సౌందర్యకు.. గతంలో హిమ మాటలు గుర్తుకొస్తాయి. (మౌనితని డాక్టర్ అమ్మా అని కాకుండా ఆంటీ అని పిలిచిన రోజు.. ‘ఏమైందే నీ కొత్త అమ్మ ప్రయత్నం?’ అని సౌందర్య అడిగినప్పుడు.. ‘లేదు నాన్నమ్మా నేను ఒకరు(మౌనిత) అనుకున్నాను.. కానీ వాళ్లు డాడీకి సరికాదని వదిలేశాను’ అంటుంది కదా.. ఆ మాటలు తలుచుకుంటుంది సౌందర్య) ఇంతలో హిమ మనసులో.. ‘నేను ఏం అడిగినా ఎవ్వరూ సరిగా సమాధానం చెప్పరు’ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
వెంటనే సౌందర్య మనసులో.. ‘బగవంతుడా.. అబద్దం చెప్పాల్సి వస్తుంది..’ అనుకుంటూ.. హిమని వెనక్కి పిలిచి.. ‘సౌర్య వాళ్ల నాన్న రాడు..’ అని ఒక్క క్షణం ఆగి.. ‘అని మీ నాన్న చెప్పాడుగా.. అది నిజమే అయ్యుంటుంది’ అంటుంది. వెంటనే హిమ చాలా హ్యాపీగా నవ్వుతూ లోపలికి పరుగుతీస్తుంది. వెంటనే సౌందర్య.. ‘బగవంతుడా.. హిమకు అమ్మ వయసు ఉన్నవాళ్లు ఇద్దరే.. ఒకటి మౌనిత, రెండు నా కోడలు దీప.. నేను కోరుకున్నదే జరగాలి..’ అనుకుంటుంది ధీనంగా. ఆదిత్య శ్రావ్య ఇంటికి వెళ్తున్నాను అనడంతో.. ‘నేను వస్తాను బాబాయ్’ అంటూ వెంట బయలుదేరుతుంది హిమ.
శ్రావ్య ఇంటికి వెళ్లిన తర్వాత.. హిమ, శ్రావ్య, ఆదిత్య, భాగ్యం, మురళీ కృష్ణ.. అంతా కలిసి కూర్చుని ఉంటారు. హిమ శ్రావ్యతో.. ‘శ్రావ్యా పిన్నీ.. నువ్వు చెబుతే మా డాడీ వింటారటగా?’ అంటుంది. ‘ఎప్పుడూ నేను ఏం చెప్పలేదు. ఆయన వినలేదు.. కానీ నీ కోసం చెబుతానులే.. ఏం చెప్పాలి?’ అంటుంది శ్రావ్య. ‘అయితే మా డాడీని త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పు ప్లీజ్’అంటుంది హిమ. దాంతో అంతా పెద్దగా నవ్వుతారు. వెంటనే హిమా.. ‘ప్లీజ్ పిన్నీ.. నువ్వు.. వంటలక్కనే పెళ్లి చేసుకోమని మా డాడీకి చెప్పు’ అంటుంది. అంతా షాక్ అవుతారు. భాగ్యం కళ్లు తిరిగినట్లు కూర్చున్నచోటే వెనక్కి పడిపోతుంది.
కమింగ్ అప్లో...
సీన్ కట్ చేస్తే.. హిమ, సౌర్య స్కూల్లో కలుస్తారు. హిమ కాస్త అనుమాన పడుతూ.. భయపడుతూ.. సౌర్యతో ఇలా అంటుంది.. ‘మా డాడీని అడిగితే.. మీ డాడీ రాడని చెప్పాడు కదా..?’ అంటూ హిమ చెబుతుంటే.. సౌర్య కాస్త కోపంగా.. ‘అందుకనీ?’ అంటూ ప్రశ్నిస్తుంది. ‘నాకు అమ్మ లేదు.. నీకు నాన్న లేడు.. అందుకుని.. మా నాన్నకు మీ అమ్మకు పెళ్లి చేసేద్దాం’ అంటుంది హిమ. వెంటనే సౌర్య కోపంగా.. ‘ఏం అన్నావ్?’ అంటూ గట్టిగా అరుస్తుంది. హిమ కోరిక ప్రకారం సౌర్య మారుతుందా? దీప, కార్తీక్ల పెళ్లికి ఒప్పుకుంటుందా ఆనేది ఆసక్తిగా మారింది. పిల్లలు ఒప్పుకున్నా కార్తీక్ ఒప్పుకోవాలి. అయితే గతంలో కార్తీక్ హిమకు మాట ఇచ్చి ఉండటం ప్లెస్ కావచ్చు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.. కార్తీకదీపం కొనసాగుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Visit Site
Recommended byColombia
ఇక బిగ్ బాస్ గత నెల 21 ప్రారంభమై రెండు వారాలను కంప్లీట్ చేస్తున్న తరుణంలో మరోసారి మీడియా ముందుకు వచ్చి.. హోస్ట్ నాగార్జునపై వ్యక్తిగత దూషణకు దిగింది. అంతేకాదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ను పశువుల్లా ట్రీట్ చేస్తున్నారంటూ మండిపండింది శ్వేతారెడ్డి.
Read Also: బిగ్ బాస్ సీజన్ 3 అన్ని ఎపిసోడ్ల పూర్తి సమాచారం ఒక్క క్లిక్తో
శుక్రవారం నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో బిగ్ బాస్ రియాలిటీ షోని వ్యతిరేకించే కొంత మంది వ్యక్తులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన శ్వేతా రెడ్డి నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసింది.
టాస్క్ల పేరుతో కంటెస్టెంట్స్ సైకిలాజికల్ స్టేటస్తో ఆడుకుంటున్న బిగ్ బాస్ను ప్రశ్నించే బాధ్యత తనపై ఉందని అందుకు ఈ ప్రెస్ మీట్ నిర్వహించానన్నారు శ్వేతా రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ హౌస్లో ఉన్న 15 మంది కంటెస్టెంట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆడుకుంటున్నారు. వాళ్లను మానసికంగా హింసిస్తున్నారు. జంతువలపై ఏదైనా ప్రయోగం చేయాలంటేనే అది చట్ట విరుద్ధం అంటున్నారు.
Read Also: పునర్నవి లవ్ స్టోరీస్: మొదటి వాడు కొట్టేవాడు.. రెండోవాడు చనిపోయాడు!
ఇప్పుడు 15 మంది ఓ ఇంటిలో బంధించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారా? నాగార్జున గారూ. దీన్ని వినోదం అంటారా? అయితే అమలను బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపించండి. సమంతని పంపించండి. అలాచేస్తే బిగ్ బాస్ ఇమేజ్ పెరుగుతుంది కదా.. మీకో నాలుగు కోట్లు.. అమలకు నాలుగు కోట్లు.. సమంతకు గంటకు నాలుగు కోట్లు ఇస్తారు కదా.. వాళ్లను లోపలికి పంపిన తరువాత ఆ పైశాచిక ఆనందం రుచి చూడండి. అలా మీరు చూడగలరా? ఆ ధైర్యం మీరు చేయగలరా?
మన్మథుడు 2 ట్రైలర్ ప్రమోషన్స్ అంటూ వస్తున్నారే.. మేం ఇంతిలా పోరాటం చేస్తుంటే స్పందించకుండా.. 60 ఏళ్లు వచ్చిన తరువాత కూడా లిప్ లాక్ల గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు.
పైగా పోరాటం చేసే వాళ్లను గాలిబుడగలు అంటారా? ఎవరివి గాలి బుడగలు? సమాజానికి సేవ చేయాలని నా సొంత ఖర్చులు పెట్టుకుని పోరాటం చేస్తుంటే మేం గాలి వాళ్లం అయ్యామా? మీ వాళ్లు తప్పుచేయకపోతే ముందే ఎందుకు బెయిల్కి అప్లై చేస్తారు? మీరు ఎదవల్ని కాపాడుతున్నారు.
ఎప్పుడూ బిజినెస్ మైండ్తో తప్ప సమాజానికి ఏమైనా చేయాలని మీ కుటుంబానికి ఉండదా? కోట్లు కోట్లు సంపాదించి ఏం చేస్తారు? ఎంతోకొంత సామాజిక బాధ్యత ఉండాలి కదా? మీరు ఇలాగే నా ఉద్యమాన్ని గాలిబుడగలు అని తీసిపారేస్తూ ఉండండి.. ఇది ఎంతలా తీవ్రరూపం దాల్చుతుందో చేసి చూపిస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్వేతారెడ్డి.
Read Also: రేయ్ అలీ.. ఛీ! నువ్ తినేది అన్నమేనా?: రెచ్చిపోయిన తమన్నా
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అమీర్ ఖాన్ తర్వాతి సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?
దంగల్ మూవీ షూటింగ్ ముగియడంతో వచ్చే ఏడాది ఆ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రావడానికి ఏర్పాట్లు..
TNN | Updated:
Dec 16, 2016, 05:47AM IST
దంగల్ మూవీ షూటింగ్ ముగియడంతో వచ్చే ఏడాది ఆ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న అమీర్ ఖాన్ అప్పుడే మరో కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ అయ్యాడు. దంగల్ మూవీలో భారతీయ రెజ్లర్ మహవీర్ ఫోగట్ పాత్రలో దర్శనం ఇవ్వనున్న అమీర్ ఖాన్ తర్వాతి సినిమా కూడా మరో బయోపిక్ అవనుండటం విశేషం.
ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌కి అమీర్ ఖాన్ సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ఓ వ్యోమగామి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న సినిమా కావడంతో అందుకు తగినట్టుగానే 'సారే జహా సే అచ్చా' అనే టైటిల్‌ని ఎంపిక చేసుకున్నారు మూవీ మేకర్స్. | 0business
|
Visit Site
Recommended byColombia
‘ప్రాక్టీస్ సెషన్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు మధ్య వికెట్‌ని లక్ష్యంగా చేసుకుని బంతులు విసురుతుండగా.. బ్యాట్స్‌మెన్లు మ్యాచ్ తరహా బ్యాటింగ్ ఆర్డర్‌లోనే వచ్చి వాటిని ఎదుర్కొంటున్నారు. ఇలా చేస్తుండటంతో పిచ్, వాతావరణంపై వేగంగా అవగాహన వచ్చే అవకాశముంది. జట్టు మొత్తం నెట్స్‌లో చాలా కష్టపడుతోంది. నా వరకు.. టెస్టు జట్టుతో ఇదే తొలి పర్యటన. వన్డే, టీ20 జట్టుతో కలిసి చాలా రోజుల నుంచి ప్రయాణిస్తున్నాను. కానీ.. టెస్టు జట్టులో ఉండే వాతావరణం నాకు బాగా నచ్చింది. సీనియర్ బౌలర్ల నుంచి చాలా నేర్చుకుంటున్నాను’ అని బుమ్రా వివరించాడు. కేప్‌ టౌన్ టెస్టుతో బుమ్రా టెస్టు ఫార్మాట్‌లోకి ఆరంగేట్రం చేయనున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
India vs WI, 2nd Test: హైదరాబాద్ టెస్టుకి భారత్ జట్టు ప్రకటన..!
Samayam Telugu| Oct 11, 2018, 12.48 PM IST
వెస్టిండీస్తో హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ కోసం సెలక్టర్లు ఈరోజు భారత జట్టుని ప్రకటించారు. రాజ్కోట్లో గత శనివారం ముగిసిన తొలి టెస్టులో ఆడిన 11 మందిని అలానే కొనసాగించిన సెలక్టర్లు.. 12వ ఆటగాడిగా ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ని తాజాగా జట్టులోకి చేర్చారు. దీంతో.. కనీసం రెండో టెస్టులోనైనా అవకాశం దక్కుతుందని ఆశించిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి, యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్కి నిరాశ తప్పలేదు.
రాజ్కోట్ టెస్టులో శతకం బాదిన ఓపెనర్ పృథ్వీ షా జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. డకౌటైనప్పటికీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్కి మరో అవకాశం దక్కింది. అయితే.. తొలి టెస్టులో విఫలమైన ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలో ఒకరిపై వేటు పడుతుందని అంతా భావించారు. కానీ.. వారిని అలానే కొనసాగించిన సెలక్టర్లు.. శార్ధూల్ ఠాకూర్ని కూడా జట్టులోకి చేర్చారు. దీంతో.. రేపు తుది జట్టులో మార్పులు ఉండే అవకాశాలూ లేకపోలేదు..! తొలి టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ టెస్టు కోసం ప్రకటించిన భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ | 2sports
|
CALL HEALTH
ఫోనిక్స్గ్రూప్తో ‘కాల్హెల్త్ భాగస్వామ్యం
హైదరాబాద్, ఆగస్టు 19: హెల్త్కేర్రంగంలో స్టార్టప్కంపెనీగా ఉన్నకాల్ హెల్త్కంపెనీ ఫోనిక్స్గ్రూప్తో భాగస్వామ్యం చేసుకుంది. మొదటిసారిగా కాల్హెల్త్ లాంజ్ను ఏర్పాటుచేసింది. వెల్నెస్, నివారణ, చికిత్స సంరక్షణపరంగా సింగిల్పాయింట్ హెల్త్కేర్ కేంద్రంగా కాల్హెల్త్ నిలిచింది. ఐటి, ఐటిసేవల వ్యాపారకేంద్రం ఫోనిక్స్ అవాన్స్సెజ్ గచ్చిబౌలిలో ప్రారంభించింది. పలు కంపెనీల్లో పనిచేస్తున్న 20 వేల మందికిపైగా ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఆరోగ్యసంరక్షణ సేవలుఅ ందిస్తోంది. ఫోనిక్స్గ్రూప్ చుక్క పల్లి సురేష్, సినీనటులు అక్కినేని నాగార్జున, అమల అక్కినేనితోపాటు కాల్హెల్త్సిఇఒ హరిథలపల్లి పాల్గొన్నారు.
కంపెనీలు ఉద్యోగులపై చేసే ఖర్చుమొత్తంలో రెండుశాతం అతితీవ్రమైన రోగాలకారణంగా కలిగే వైకల్యం విధులకు హాజరుకాకపోవడం వంటివాటివల్ల నష్టపోతున్నారు. 35-64 సం వత్సరాలవ ుధ్య వయసులవారిలో కార్డియో వాస్క్యులర్ రోగాలకారణంగా మరణిస్తున్నట్లు కాల్హెల్త్ సిఇఒ వివరించారు. 2030 నాటికి 17.9 మిలియన్ సంవత్సరాలు ఈ విధంగా నష్టపోతుందని హెల్త్కేర్ సంస్థలు అంచనావేసా యన్నారు. ముందస్తు చికిత్సల ప్యాకేజ్లను ఐటి సెజ్ ఉద్యోగకలు అందిస్తున్నారు. రక్త పోటు, ఎత్తు, బరువు, బిఎంఐ, బ్లడ్షుగర్ వంటివి నిర్వహిస్తారు.
ఫోనిక్స్ సెజ్ ఉద్యోగు లకు మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగుల కుటుంబసభ్యులకు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఉద్యోగులుకు 50శాతం వరకూ ఆరోగ్యఖర్చులు ఆదాచేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఫోనిక్స్గ్రూప్ ఛైర్మన్ సురేష్ చుక్కపల్లి మాట్లాడుతూ సెజ్ ఉద్యోగులకు మరింత సేవ లందించేందుకు వీలుగా ఈ భాగస్వామ్యం చేసుకున్నట్లు వివరించారు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ అన్ని మార్గాలకు కాల్హెల్త్ ఒక్కటే మార్గమని భావించి ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. | 1entertainment
|
శ్రీదేవి హత్యలో దావూద్ హ్యాండ్?
Highlights
నటి శ్రీదేవి మరణం ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. ఆమె సహజంగానే మరణించారా..?
నటి శ్రీదేవి మరణం ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. ఆమె సహజంగానే మరణించారా..? లేక ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసి చంపారా..? శ్రీదేవి మరణం విషయంలో సుప్రీం కోర్టు సమగ్ర విచారణ జరపాలని నిర్మాత సునీల్ సింగ్ వేసిన పిటిషన్ ను కోర్టు ఎందుకు కొట్టేసింది..? ఆయన వేసిన పిటిషన్ లో కొన్ని అంశాలు సంచలనంగా మారాయి. సునీల్ సింగ్ పిటీషన్ ప్రకారం శ్రీదేవి తన పేరు మీద రూ.240 కోట్లకు ఇన్సూరన్స్ పాలసీ చేయించారు.
అది కూడా ఒమన్ లో కాబట్టి దుబాయ్ లో ఉండగానే ఆమె మరణిస్తే ఆ డబ్బు తన కుటుంబానికి దక్కుతుందని అదొక నిబంధన అని ఆయన అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం ఏ ఇన్సూరన్స్ కంపెనీ కూడా ఇలాంటి రూల్స్ పెట్టదని చెబుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చాలా సంతోషంగా ఉండే శ్రీదేవి సడెన్ గా బాత్ టబ్ లో ఎలా మరణిస్తుందనేది ప్రతి ఒక్కరిలో అనుమానాలను కలిగిస్తోంది.
రీసెంట్ గా శ్రీదేవి మరణంపై పెర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేసిన రిటైర్డ్ ఏసీపీ అరివేద్ భూషణ్ మాత్రం శ్రీదేవి మరణంలో ముంబై డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉండొచ్చని అంటున్నారు. పోలీసులు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ నమ్మే విధంగా లేదని.. ప్లాన్ ప్రకారమే ఆమెను చంపేసి ఉంటారని వేద్ భూషణ్ అంటున్నారు. శ్రీదేవి మరణించిన జుమైరా టవర్స్ దావూద్ కు సంబంధించినది కావడంతో ఈ వార్తలకుమరింత బలం చేకూరుతుంది.
ఇస్లామిక్ దేశాల్లో దావూద్ ప్రభావితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన చట్టాన్ని, పోలీసుల్ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందని ఆరోపిస్తున్నారు. శ్రీదేవికి బ్లడ్ టెస్ట్ చేయాలని దరఖాస్తూ చేసుకున్నా కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చి మిగిలిన వివరాలు ఇవ్వడానికి దుబాయ్ పోలీసులు ఎందుకు నిరాకరించారని వేద్ భూషణ్ అంటున్నారు.
Last Updated 23, May 2018, 12:43 PM IST | 0business
|
Hyd Internet 110 Views Mathews
mathews
కోల్కత్తా: ఈడెన్లో భారత్-శ్రీలంక ల మధ్య జరుగతున్న తొలి టెస్టు, మెదటి ఇన్నింగ్స్ మ్యాచ్లో లంక బ్యాట్స్మెన్లు విజృంభించి ఆడుతున్నారు.
శ్రీలంక స్కోరు 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. సమరవిక్రమ 23 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్లో సాహా క్యాచ్ పట్టడంతో
ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లహిరు తిరుమన్నె (2), మాథ్యూస్ (1) లు ఉన్నారు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అజారుద్దీన్ను వెనక్కి నెట్టిన ధోనీ!
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మరో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ను వెనక్కి నెట్టాడు.
TNN | Updated:
Aug 28, 2017, 08:29AM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మరో మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను వెనక్కి నెట్టాడు. పరుగుల వేటలో అజారుద్దీన్‌ను ధోనీ దాటేశాడు. ఆదివారం పల్లెకెలెలో శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడిన ధోనీ.. వన్డే కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు అజారుద్దీన్ తరవాత ఐదో స్థానంలో ఉన్న ధోనీ.. ఈ వన్డేలో 62 పరుగులు చేసి మొత్తం 9419 పరుగులతో నాలుగో స్థానానికి దూసుకెళ్లాడు. 9378 పరుగులతో అజారుద్దీన్ ఐదో స్థానానికి పడిపోయాడు.
భారత్‌ నుంచి అత్యధిక పరుగుల జాబితాలో 18426 పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక సౌరబ్ గంగూలీ 11221 పరుగులతో రెండో స్థానంలోనూ, 10768 పరుగులతో ద్రవిడ్ మూడో స్థానంలోనూ ఉన్నారు. మరోవైపు ధోనీకిది 299వ వన్డే మ్యాచ్. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తుంటే 2019 వరల్డ్ కప్ వరకు ధోనీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే ధోనీ.. ద్రవిడ్‌ను కూడా దాటే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. వన్డేల్లో అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన బ్యాట్స్‌మెన్‌గా చమిందా వాస్, షాన్ పొల్లాక్ సరసన ధోనీ నిలిచాడు. ధోనీ ఇప్పటి వరకు 72 ఇన్నింగ్సుల్లో నాటౌట్‌గా నిలవడం విశేషం. వాస్, పొల్లాక్ ఇప్పటికే రిటైర్ అయ్యారు. కాబట్టి ఈ రికార్డు కూడా భవిష్యత్తులో ధోనీ పేరిటే ఉండబోతుంది. | 2sports
|
internet vaartha 163 Views
మొహాలీ : స్టార్ క్రికెటర్ కోహ్లీకి కోపం వచ్చింది. ఆయన సోషల్ మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాలీవుడ్ నటి, తన ప్రియురాలు అనుష్క శర్మను సోషల్ మీడియాలో పదే పదే టార్గెట్ చేసుకోవడంపై కోహ్లీ మండిపడ్డాడు. కోహ్లీ ఇటీవల అనుష్కశర్మకు దూరమైనట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కోహ్లీ బాగా ఆడుతున్నాడు. అనుష్క ప్రేమలో ఉన్నప్పుడు కోహ్లా బాగా ఆడలేదని, ఇప్పుడు బాగా ఆడతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా స్పందిస్తున్నారు. అనుష్కశర్మ లేకపోవడం వల్లే కోహ్లీ బాగా ఆడుతున్నాడని సెటైర్లు వేస్తున్నారు. దీనిపై కోహ్లీ ఈ రోజు ఘాటుగా స్పందించాడు. అదే పనిగా అనుష్క శర్మను టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు. కొంతైనా దయ ఉండాలి. ఆమె తనకు ఎప్పుడూ పాజిటివ్ అని ట్వీట్ చేశాడు. అంతేకాదు,అనుష్కను టార్గెట్ చేసుకుంటున్నందు వల్ల షేమ్ అంటూ ఒక ఇమేజ్ పోస్ట్ చేశాడు. అనుష్కపట్ల సోషల్ మీడియాలో ఇష్టారీతిలో మాట్లాడే వారు కొంచమైనా దయ, జాలి కలిగి ఉండాలని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇలా ఇష్టం వచ్చినట్లు అంటే వారి కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారో ఆలోచించాలని సూచించాడు. అనుష్కశర్మను పదే పదే టార్గెట్ చేసుకోవడం సరికాదని పేర్కొన్నాడు. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
YS Jagan: దాసరి స్థానం చిరంజీవిదా? మూర్ఖత్వం అంటూ మండిపడ్డ తమ్మారెడ్డి
Sye Raa Narasimha Reddy: మెగాస్టార్ చిరంజీవి జగన్ను కలవడం వెనుకు వ్యూహం ఏంటి? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడ్ని కూడా కలిశారు. రేపో మాపో ప్రధానికి కూడా కలుస్తారు. దాసరి స్థానం ఆక్రమించడం కోసం వాళ్లను కలుస్తున్నారా? వాళ్లది మూర్ఖత్వమా? అమాయకత్వమా?
Samayam Telugu | Updated:
Oct 24, 2019, 08:18PM IST
చిరంజీవి
టాలీవుడ్ సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి అంటే మెగాఫ్యాన్స్కి అసలే మంట. ఖైదీ 150 అప్పుడు కాని.. రీసెంట్గా ‘సైరా’ కలెక్షన్స్ విషయంలో ఆయన చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. అయితే ఎంతమంది ఎన్ని అన్నా.. ఆయన మాత్రం చెప్పాల్సింది చెబుతూనే ఉన్నారు. నన్ను అనుకుంటే అనుకోండి మీ కర్మ అంటూనే మెగాఫ్యాన్స్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి .. వైఎస్ జగన్ను కలవడంపై వస్తున్న రూమర్స్ను ఖండిస్తూ పాజిటివ్గా స్పందించారు తమ్మారెడ్డి.
ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ ‘నా ఆలోచన’ ద్వారా మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చూస్తుంటే మంచి కామెడీగా అనిపిస్తుంది. అందులో వాళ్ల జోక్లు కామెడీ చూస్తుంటే.. సీరియస్గా కూడా జోక్లు వేయొచ్చు అని. అందులో ఒకటి ఏంటంటే.. ఇటీవల చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు, అలానే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు దగ్గరకు వెళ్లి సైరా చూపించారు.
ప్రధానమంత్రిని కూడా కలిసి సైరా సినిమా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిరంజీవి. అయితే వీటిపై యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ ఏంటంటే.. ఇండస్ట్రీలో స్వర్గీయ దాసరి నారాయణ రావుగారి ప్లేస్ను భర్తీ చేసేందుకు చిరంజీవి ఇవన్నీ చేస్తున్నారు అని. ఇది నాకు కామెడీ చేయడానికి పరాకాష్టగా అనిపించింది.
ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్లలో చిరంజీవి పెద్ద ఆర్టిస్ట్. ఆయన తలచుకుంటే ఏ స్థానమైనా తీసుకోవచ్చు. ఆయన కావాలనుకుంటే.. దాసరి పొజీషన్ అనేది అఫీషియల్ పోస్ట్ కాదు. ఏ పదవి లేదు అక్కడ. దాసరి పెద్ద మనిషిగా ఉన్నారు. అందరితో కలిసి మాట్లాడేవారు. అలాగే చిరంజీవి గారు చేయాలంటే చేయొచ్చు. ఆయన్ని చేయమని నేను రెండు మూడు సార్లు అడిగా. మా ఇష్యూలో కూడా గతంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి పరిష్కరించారు.
సో ఇండస్ట్రీలో ఏదైనా చేయాలి అనుకుంటే.. చిరంజీవి.. జగన్ దగ్గరకు ఎందుకు వెళ్తారు. జగన్ ఏమైనా చెప్తారా? ఆయనేమైనా పదవి ఇస్తారా? ముఖ్యమంత్రి ఏమైనా పదవి ఇస్తారా? దీని కోసం చిరంజీవి ఆయన దగ్గరకు ఎందుకు వెళ్తారు. వీళ్లకు తెలిసి మాట్లాడతారో తెలియకమాట్లాడతారో.. లేక అమాయకత్వంతో మూర్ఖత్వమో నాకు తెలియడం లేదు. చిరంజీవి పేరు చెప్తే మనకు ఏదోటి వస్తుందని అనుకోవడమో నాకు అర్ధం కాలేదు. ఇది పెద్ద జోకు.
మరోవైపు గంటా శ్రీనివాసరావుని వైసీపీలోకి తీసుకువెళ్లేందుకు చిరు మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గంటా అనుకుంటే ఏ పార్టీలోకైనా వెళ్లగలడు. డబ్బు ఉంది కాబట్టి చిరంజీవి తీసుకువెళ్లి వేరే పార్టీలో చేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ల బతుకు వాళ్లు చూసుకుంటున్నారు. వాళ్లను బయటకు లాగడం వల్ల వీళ్లకు వచ్చేదేమిటో నాకు అర్ధం కావడం లేదు. సోషల్ మీడియాను పిచ్చి పిచ్చి వాటికి ఉపయోగించడం కరెక్ట్ కాదు’ అంటూ చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఐసీఐసీఐ సెక్యూరిటీస్కి పేలవమైన ఆరంభం
ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు చెందిన బ్రోకింగ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ నష్టాలతో తన ప్రస్థానం ప్రారంభించింది.
Samayam Telugu | Updated:
Apr 4, 2018, 01:00PM IST
ఐసీఐసీఐ సెక్యూరిటీస్కి పేలవమైన ఆరంభం
ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు చెందిన బ్రోకింగ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ నష్టాలతో తన ప్రస్థానం ప్రారంభించింది. ఇష్యూ ధర రూ. 520కాగా.. బీఎస్ఈలో రూ. 431 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 17 శాతం(రూ. 89) నష్టంకాగా.. ప్రస్తుతం 13 శాతం తక్కువగా రూ. 453 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఇష్యూకి 78 శాతమే సబ్స్క్రిప్షన్ లభించింది. యాంకర్ విభాగంతో కలుపుకుంటే ఇష్యూ 88 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. యాంకర్ పోర్షన్తో కలిపి ఇష్యూ ద్వారా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రూ. 3500 కోట్లను సమీకరించింది. వెరసి ఇష్యూ పరిణామాన్ని రూ. 4017 కోట్ల నుంచి రూ. 3500కు తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
బిడ్లు వచ్చింది ఇలా.. స్పందన అలా...
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఐపీవోకు సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం నుంచి పూర్తిస్థాయిలో(1 శాతం) బిడ్స్ దాఖలుకాగా.. సంపన్న వర్గాల కోటాలో స్వల్పంగా 33 శాతమే స్పందన కనిపించింది. ఇక రిటైల్ పెట్టుబడిదార్ల నుంచి సైతం 88 శాతం దరఖాస్తులు లభించాయి. కంపెనీ 4.42 కోట్ల షేర్లను అమ్మకానికి సిద్దంగా ఉంచగా.. 3.46 కోట్ల షేర్ల కోసం మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో 3.3 కోట్ల షేర్లను 28 సంస్థలకు కేటాయించింది. షేరుకి రూ. 520 ధరలో వీటిని జారీ చేయడం ద్వారా రూ. 1717 కోట్లను సమీకరించగలిగింది.
నిరాశ కలిగించిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిస్టింగ్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
‘నాలుగో టెస్టుని చూసేందుకు స్టేడియానికి తొలి రోజు వచ్చిన సుమారు 90,000 మంది అభిమానులు.. చివరికి 244/3 స్కోరు చూసి నిరాశ చెంది ఉంటారు. ప్రేక్షకులకి కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్.. ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్టు నుంచి వారు మరింత ఆనందాన్ని కోరుకుంటారు. మ్యాచ్ తొలి సెషన్‌లో ఇంగ్లాండ్ మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయింది.. ఒప్పుకుంటాను. కానీ.. రెండో సెషన్‌ నుంచి బాగా బౌలింగ్ చేశాం. కానీ.. పిచ్‌ నుంచి మాత్రం మాకు సహకారం లభించలేదు. నిజాయతీగా చెప్పాలంటే.. నాకు మ్యాచ్ ఆడుతున్న ఫీలింగే కలగలేదు’ అని అండర్సన్ వివరించాడు. ఇప్పటికే వరుసగా మూడు టెస్టుల్లోనూ ఓడిపోయి యాషెస్‌ను ఇంగ్లాండ్‌ చేజార్చుకున్న విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మా నిర్మాతకు చెవుడు.. సెక్స్ సినిమాతో సెన్సారోళ్లకు చుక్కలు: ‘ఏడు చేపల కథ’ హీరో
‘ఏడు చేపల కథ’ హీరో అభిషేక్ రెడ్డి అస్సలు సిగ్గుపడకుండా చాాలా నిజాయతీ మాట్లాడారు. ఒక ప్రెస్ మీట్లోలా కాకుండా ఫ్రెండ్స్ మాట్లాడినట్టు సినిమా గురించి చెప్పుకొచ్చారు.
Samayam Telugu | Updated:
Nov 7, 2019, 04:59PM IST
‘ఏడు చేపల కథ’ హీరో అభిషేక్ రెడ్డి
పచ్చి అడల్ట్ కామెడీతో, ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమా ‘ఏడు చేపల కథ’. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్తో విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ట్రైలర్ చూసిన చాలామంది దానిలోని మసాలా కంటెంట్ చూసి అసలు ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వస్తుందా అని అనుమానపడ్డారు. కానీ, మొత్తానికి సెన్సార్ చేసి ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాగా రేపు (నవంబర్ 7న) విడుదల చేస్తున్నారు. అభిషేక్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేం భాను శ్రీ, ఆయేషా సింగ్, నగరం సునీల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే, సినిమా విడుదలకు ఒక్కరోజు ఉందనగా బుధవారం చిత్ర హీరో అభిషేక్ మీడియా ముందుకు వచ్చారు. నిర్మాత శేఖర్ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజుతో కలిసి హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేక్ చాలా నిజాయతీ మాట్లాడారు. తాము తీసింది బూతు సినిమానే అయినా అందులో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఒక ఎమోషన్ ఉందన్నారు. మసాలా డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుందని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఏదైనా గట్టిగా కొట్టాలనే ఉద్దేశంతో ఈ కంటెంట్ ఎంపిక చేసుకున్నామని వెల్లడించారు.
Also Read: బాలకృష్ణకు విలన్గా బాలీవుడ్ హీరో.. బోయపాటి భారీ ప్లాన్
‘‘2015లో నేను ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి’ అనే సినిమా చేశాను. చాలా నీట్గా, అమ్మాయిలను చాలా చక్కగా చూపించి తీస్తే మా గుడ్డలు ఊడదీసేశారు. ఆ సినిమా రిలీజ్ అయిన తరవాత ఆడలేదు. సంకనాకిపోయాం. ఆ తరవాత అదే డైరెక్టర్, అదే కెమెరామేన్, అదే హీరోతో.. అంటే సేమ్ క్రూతో ఈ సినిమా చేశాం. కాకపోతే నిర్మాత మారారు. ఈసారి ఏ జోనర్ తీసుకున్నా చాలా గట్టిగా, బలంగా కొడదాం అని నిర్ణయించుకున్నాం. ఆ కసిలో నుంచి వచ్చిన స్క్రిప్టే ఈ ‘ఏడు చేపల కథ’.
డైరెక్టర్ నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు మొత్తం చదివితే అంతా మసాలానే ఇంకేం లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే రెండే పాత్రలు. ఒకటి టెంప్ట్ రవి. ఇంకోటి వీడు బాబు ఉన్నాడు.. వాడి పేరు సుందర్. వాడే విలన్. ఒకడు చచ్చేలోపు మసాలా కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకొకడు ఈ మసాలా ఎందుకు తగులుతుందో తెలియక తిరుగుతూ ఉంటాడు. ఈ స్క్రిప్ట్ నేను చదివిన తరవాత దీనిలో నేను హీరో ఏంటండి అని అడిగాను. కానీ, కొత్తోళ్లు సక్సెస్ అవ్వాలి అంటే అడల్ట్ కామెడీ అయినా గట్టిగా కొట్టాలని మా డైరెక్టర్ ధైర్యం చెప్పారు.
ఇలాంటి స్క్రిప్ట్ చెప్తే ఏ నిర్మాత అయినా భయపడిపోతారు. కానీ, శేఖర్ రెడ్డి గారు మాత్రం ఓకే, అద్భుతం అన్నారు. నిజానికి ఈరోజుకి కూడా మా నిర్మాతకు ఈ సినిమా కథ తెలీదు. ఎవరైనా అడిగితే అద్భుతమైన లవ్ స్టోరీ, అద్భుతమైన సెంటిమెంట్ స్టోరీ అని చెబుతుంటాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు మా నిర్మాత కాసేపు అలా నిద్రలోకి జారుకున్నాడు. డైరెక్టర్ అదీ ఇదీ అని మొత్తం చెప్పేశాడు. కాసేపు పోయాక లేచి అద్భుతం, సినిమా సూపర్, దీనికి అద్భుతమైన టైటిల్ చెప్తా.. ‘తుమ్మెద’ పెట్టేసుకోండి అన్నాడు.
ఆ తరవాత నిర్మాత సరితా రెడ్డి గారు అసలు విషయం చెప్పారు. శేఖర్ రెడ్డి గారికి చెవుడు, ఏమీ వినపడదు అని చెప్పారు. నిజంగానే ఆయనకు వినపడదండి. ఏదో కొంచెం కొంచెం వినపడొచ్చు. కానీ, సినిమా కథ చెప్పినప్పుడు ఆయనకు ఏమీ వినపడలేదు. మొత్తానికి సినిమా సెట్స్మీదికి వెళ్లింది.. పూర్తిచేశాం. మీ అందరి ద్వారానే యూట్యూబ్లో వైరల్ అయ్యింది. ఆ తరవాత మా నిర్మాత మీద పెట్టకూడని పిటిషన్లు అన్నీ పెట్టారు. నానా ఇబ్బందులు పెట్టి సెన్సార్ ఆఫీసులో డ్రాయర్ మీద నిలబెట్టారు.
సెన్సార్ ఆఫీసర్ రాజశేఖర్ ఐఏఎస్ సినిమా చూసిన తరవాత ఒణికిపోయారు. ఈ సినిమాను వదిలితే నా పరిస్థితి ఏంటి? అన్నారు. కానీ, మా నిర్మాత మాత్రం సార్.. సినిమా అద్భుతం, ఎక్స్లెంట్ అని ఆయనతోనే అన్నారు. ఈయన సంబంధం లేకుండా నాన్ సింక్లో కూడా మాట్లాడుతుంటాడు. సెన్సార్ ఆఫీసులో ముగ్గురు లేడీస్ ఉన్నారు. వాళ్లకు ఈ సినిమా చూపించాడు. బ్లర్లు కూడా లేకుండా అలాగే వేసి చూపించాడు. సినిమా అయిపోయిన తరవాత ఈయన లోపలికి వెళ్లి వాళ్లకు నమస్కారం పెడుతుంటే.. వాళ్లు పైట్లు కప్పుకున్నారు.
వాళ్లతో మాది డాక్టర్స్ కుటుంబం అండి.. నేను పొలిటీషియన్ని, నా కొడుకు డాక్టర్, నా అల్లుడు డాక్టర్ అని చెబుతున్నాడు. ఓరినీ.. నువ్వు డాక్టర్ ఫ్యామిలీ నుంచి అయితే సెక్స్ సినిమా తీస్తావా? నువ్వు మాట్లాడే మాటలకి సినిమాకి సంబంధం ఉందా అని అన్నారు వాళ్లు. కానీ, ఈయనకు వినపడదు. మేడం మీరు కూడా చాలా బాగున్నారు.. నెక్ట్స్ సినిమాలో మీకు అవకాశం ఇస్తా అంటున్నాడు సెన్సార్ ఆఫీసులో ఒకామెతో. ఈయన అమాయకత్వానికి వాళ్లకు తిట్టాలో, బాధపడాలో అర్థం కాలేదు’’ అని తమ ప్రయాణం గురించి వివరించారు హీరో అభిషేక్.
ఏడు చేపల కథ సినిమా గురించి అన్ని విషయాలు బయటపెట్టిన హీరో
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
స్టార్టప్లకు ప్రభుత్వ మద్దతు
- ఐటీ సలహాదారు జేఏ చౌదరి
అమరావతి : స్టార్టప్లను నెలకొల్పడానికి రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐటీ అడ్వైజర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఏ చౌదరి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఆసియా ఐఎన్సీ 500 ఆధ్వ ర్యంలో జరిగిన 'వాల్డ్ క్వాలిటీ సమ్మిట్ వాట్స్ట్రీట్'లో ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక వేత్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్స హిస్తుందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ (ఔత్సాహికవేత్త) కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజన్ అని అన్నారు. స్టార్టప్ల కోసం రాష్ట్ర ప్రభు త్వం రూ.500 కోట్లు కేటాయించిందన్నారు. ఉచిత ఆఫీసు స్థలం, విద్యుత్, ఇంటర్నెట్ ఇవ్వడానికి ముందుకు వచ్చిం దన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఫిన్టెక్ వ్యాలీలో ప్రపంచ దేశాల నుంచి 50 స్టార్టప్లు వచ్చాయ న్నారు. వర్థమాన దేశాలన్నీ డిజిటలైజ్ అయ్యా యని.. ఇప్పుడి ప్పుడే భారత్ ఈ రంగంలో పుంజుకుంటుంద న్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జా తీయ స్టారప్ సంస్థలు భారత్పై దృష్టి పెట్టాయన్నారు. అందులోనూ ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం విశేషమని పేర్కొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Every Batting Record in Danger Says Gilchrist
ప్రమాదంలో బ్యాటింగ్ రికార్డులు..!
మైదానంలో విరాట్ కోహ్లి జోరుతో క్రికెట్ ప్రపంచంలోని బ్యాటింగ్ రికార్డులన్నీ ప్రమాదంలో పడ్డాయని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్
TNN | Updated:
Nov 3, 2017, 03:48PM IST
మైదానంలో విరాట్ కోహ్లి జోరుతో క్రికెట్ ప్రపంచంలోని బ్యాటింగ్ రికార్డులన్నీ ప్రమాదంలో పడ్డాయని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. గత కొంతకాలంగా విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలోనూ అసాధారణ రీతిలో శతకాలు బాదుతున్నాడని గుర్తు చేసిన ఈ మాజీ వికెట్ కీపర్.. అసాధ్యమని భావించిన సచిన్ బ్యాటింగ్ రికార్డులని కూడా అతను అధిగమించగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు శతకాలు బాదిన విరాట్ కోహ్లి 32 శతకాల మార్క్‌ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శతకాల జాబితాలో కోహ్లి కంటే ముందు 49 శతకాలతో సచిన్ తెందుల్కర్ మాత్రమే ఉన్నాడు.
‘బ్యాటింగ్ రికార్డులన్నీ ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయి. విరాట్ కోహ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎదుగుతున్నాడు. ఇప్పుడున్న బ్యాటింగ్ రికార్డులన్నింటినీ అతను బద్దలుకొట్టలేకపోవచ్చు. కానీ.. కచ్చితంగా అన్ని రికార్డులకి మాత్రం అతను చేరువవుతాడు’ అని గిల్‌క్రిస్ట్ ప్రశంసించాడు. న్యూజిలాండ్‌తో గత బుధవారం ముగిసిన తొలి టీ20లో 53 పరుగుల తేడాతో గెలిచిన భారత్ జట్టు.. రాజ్‌కోట్ వేదికగా శనివారం రెండో టీ20 ఆడనుంది. | 2sports
|
Hyderabad, First Published 9, Apr 2019, 11:03 AM IST
Highlights
నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాతో బరువు బాగా తగ్గినట్లు చెప్పాడు నాని. కావాలని బరువు తగ్గలేదని.. క్రికెట్ ఆడి. దానికి సంబంధించిన కసరత్తులు చేయడం వల్ల తనకు తెలియకుండానే బరువు తగ్గినట్లు వెల్లడించాడు. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 20 సార్లు చూశానని.. స్క్రీన్ మీద ఉన్నది తను కాదన్నట్లు మైమరిచిపోయి మరీ సినిమా చూడడం ఇదే మొదటిసారి అంటూ చెప్పుకొచ్చాడు.
ఎప్పుడు ఏ సినిమా చూసినా.. ఎక్కడో ఒకచోట నాని బయటకి వచ్చాడని అనిపించేదని.. కానీ ఈ సినిమాలో కేవలం అర్జున్ ని మాత్రమే చూస్తారని, నటుడిగా ఈ సినిమా ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపాడు.
ఈ సినిమా తన లైఫ్ లో మోస్ట్ ఎమోషనల్ జర్నీ అని.. ఏ సినిమా విషయంలో కూడా ఇంత ఎమోషనల్ ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చాడు. 'జెర్సీ'లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు లైఫ్ లో చూసిన ఫీలింగ్ కలుగుతుందని వెల్లడించాడు. | 0business
|
internet vaartha 151 Views
న్యూఢిల్లీ : పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆశను వ్యక్తం చేశాడు. దేశ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని అనిపిస్తుందని ఆయన పేర్కొన్నాడు. కాగా తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, అయితే కొంత మంది శ్రేయెభిలాషులు వద్దని సలహా ఇస్తున్నారని, తన దృష్టిలో రాజకీయ నాయకుడు ప్రజా సేవకుడని, ప్రజలకు సేవచేయాలని ఆయన వివరించాడు.
ఇక పాకిస్థాన్ తరపున టి20 మ్యాచ్ల్లో ఆడతానని వెల్లడించాడు. జాతీయ, దేశీయ లేదా లీగ్ స్థాయిల్లో పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతానని, తాను ఇంకా ఫిట్గానే ఉన్నానని ఆయన వెల్లడించాడు. కాగా షాహిద్ ఆప్రిది ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థుల కోసం పాఠశాలను ప్రారంభిస్తానని ఆప్రిది పేర్కొన్నాడు. | 2sports
|
స్పైడర్ మిషన్ 500 కోట్లు.. సక్సెస్ అవుతుందా
Highlights
స్పైడర్ మూవీ విడుదల కొద్ది గంటల్లోనే..
ఓవర్సీస్ రికార్డులు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం
రూ.500 కోట్లు వసూళ్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న స్పైడర్ టీమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం స్పైడర్. విడుదలకు ముందే భారీ హైప్ను క్రియేట్ చేస్తున్న స్పైడర్ కేవలం స్వదేశంలోనే కాకుండా ఓవర్సీస్లోనూ అత్యధిక కేంద్రాల్లో విడుదలవుతున్నది. బాహుబలి చిత్రం తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ కానున్న చిత్రంగా రికార్డును సొంతం చేసుకొంది స్పైడర్.
స్పైడర్ చిత్రం అమెరికా పంపిణీలో హక్కులను ఆట్మస్, ఏజెడ్ ఇండియా మీడియా దాదాపు రూ.8 కోట్లు చెల్లించి దక్కించుకొన్నాయి. ఈ చిత్ర ప్రమోషన్లో ఏటీ అండ్ టీ, సినీమార్క్ థియేటర్స్, ఏంఎమ్సీ, ఫాండాగో ఇతర సంస్థలు పాలుపంచుకొంటున్నాయి. టికెట్లపై రాయితీలను కూడా ప్రకటించాయి. తెలుగు, తమిళ రాష్రాల్లో కంటే ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 26నే ఈ చిత్రం విడుదల అవుతున్నది.
అమెరికాలో స్పైడర్ చిత్రం సుమారు 300 స్కీన్లలో రిలీజ్ అవుతోందట. ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలు దిల్వాలే, దంగల్, బాహుబలి2 చిత్రాలు మాత్రమే 300 స్కీన్లలో విడుదలయ్యాయి. ఆ తర్వాత అదే స్థాయిలో విడుదలవుతున్న చిత్రంగా స్పైడర్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.
స్పైడర్ అడ్వాన్స్ బుకింగ్ కు అమెరికాలో విశేష స్పందన లభిస్తున్నది. శుక్రవారం నాటికి 5 లక్షల డాలర్ల మేర టికెట్లు అమ్ముడుపోయాయి. చాలా హాళ్లలో అడ్వాన్స్ బుకింగ్ క్లోజ్ అయింది. పలు స్క్రీన్ల వద్ద టికెట్స్ సోల్డ్ అవుట్ అనే బోర్డులు దర్శనమివ్వడం ఈ చిత్రంపై ఉన్న క్రేజ్కు అద్దం పట్టింది. అమెరికాలో ప్రీమియర్ షో పడే 26వ తేదీ రాత్రి వరకే స్పైడర్ ఒక మిలియన్ డాలర్ల మార్కును సులభంగా దాటేస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రిన్స్ మహేశ్ బాబు కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా స్పైడర్ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, అరబిక్ భాషల్లో విడుదలవుతున్నది. తమిళ, మలయాళంలో నేరుగా మహేశ్ బాబు సినిమా రిలీజ్ కావడం ఇదే ప్రథమం.
స్పైడర్పై భారీ అంచనాలు ఉండటం 27న బుధవారం స్పైడర్ రిలీజ్ కావడం, ఆ తర్వాత అక్టోబర్ 2 వరకు అన్నీ సెలవు దినాలు ఉండటం ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశం. స్పైడర్ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల పరంగా దుమ్ము రేపడం ఖాయమనే మాట వినిపిస్తోంది. తమిళ, మలయాళం, హిందీలో దర్శకుడు మురుగదాస్కు మంచి మార్కెట్ ఉంది. ఆయన రూపొందించిన హిందీ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మలేషియా, సింగపూర్, మస్కట్, ఇతర ప్రదేశాల్లో తమిళ, తెలుగు ప్రేక్షకులు భారీగానే ఉన్నారు.
ఒకవేళ స్పైడర్ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొంటే దాదాపు రూ.500 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో కలిపి సుమారు 800 స్క్రీన్లలో విడుదల కానుంది. బాహుబలి2 చిత్రం 1000 స్క్రీన్లలో రిలీజైన సంగతి తెలిసిందే. అంతేకాక ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్లలో నాన్ బాహుబలి రికార్డులను స్పైడర్ బ్రేక్ చేసి.. మహేశ్ కెరీర్లోనే నెం.1 సినిమాగా నిలవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్బస్టర్ సినిమా ఖైదీ నెం.150 కూడా ఓవర్సీస్లో జనవరి 10న మంగళవారమే విడుదలయింది. తద్వారా ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ల ద్వారానే 12,70,29 డాలర్లు (8 కోట్ల 65 లక్షలు) కొల్లగొట్టింది. ఈ రికార్డును స్పైడర్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ఓవర్సీస్ విశ్లేషకులు చెబుతున్నారు. | 0business
|
Read Also: బిగ్ బాస్ విన్నర్ పోల్ రిజల్ట్: అలీ ఆశలు గల్లంతు.. విజేత ‘ఆమెతో అతడు’?
రాహుల్ పాత వీడియోలను ఇప్పుడెందుకు బయటపెడుతున్నారు?
‘రాహుల్ ఫైనల్కి వెళ్లిన తరువాత సడెన్గా అతని పాత వీడియోలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. వీడు ఇలా చేశాడు.. అలా చేశాడు అంటూ టార్గెట్ చేస్తున్నారు. ఇంకానయం చిన్నప్పుడు డైపర్లో చుస్సూ పోశాడని పెట్టలేదు. అతను హౌస్లో ఎలా ఉన్నాడు? దాని మీద ఇప్పుడు ఓటింగ్ జరుగుతోంది దానిపై కదా స్పందించాలి.
Read Also: ‘అలీకే మీ ఓటు’.. రవి తమ్ముడితో జ్యోతక్క ప్రచారం
ఇన్నాళ్లు సైలెంట్గా ఉండి ఇప్పుడే ఆ వీడియోలు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఎవరు బయటపెడుతున్నారన్నది తెలుసుకోండి. ఎందుకు బయటపెట్టిస్తున్నారు? ఒక గేమ్ కోసం మరీ ఇంత చేయాలా? కామెడీ కాకపోతే అనిపిస్తుంది. వాళ్లు అంత ఎక్కువ చేస్తుంటే మనం ఎందుకు సైలెంట్గా ఊరుకోవాలనే నేను కూడా గట్టిగా సపోర్ట్ చేస్తున్నా.
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ వీడియో.. బండ బూతులు
X
నేను గొర్రెల బ్యాచ్ లీడర్నే
కొంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. రాహుల్ని సపోర్ట్ చేసేవాళ్లు గొర్రెలని.. నేను గొర్రెల బ్యాచ్ లీడర్ అని అంటున్నారు. వాళ్లకు తెలియనిది ఏంటంటే.. గొర్రెలకు ఒక పాజిటివ్ నెస్ ఉంది. అవి ఎక్కడికి వెళ్లినా ఒక మందలాగే వెళ్తాయి. ఎవడిపడితే వాడి వెనుక పోవు. ఎవరైతే గొర్రెల కాపరో అతని వెనకాలే వెళ్తాయి.
మేం గొర్రెలమైతే వాళ్లు నక్కలు, కుక్కలు
వాళ్లలా నక్కలు కాదు మేం. కొంచెం సేపు అక్కడ కొంచెం సేపు ఇక్కడ ఉండము మేం. అయినా గొర్రెలతో చాలా లాభాలు ఉన్నాయి. నక్కలు, కుక్కలతో ఏం లాభం ఉందో చెప్పండి. ట్రోల్ చేసేముందు ఆలోచించండి. మీకు పిచ్చ కాకపోతే పర్సనల్ విషయాలు మీకెందుకు. మీకు నిజంగా శ్రీముఖికి సపోర్ట్ చేయాలనిపిస్తే చేసుకోండి. అనవసరమైన నెగిటివిటీ ఎందుకు?
శ్రీముఖి బోలెడు సంపాదించింది.. ఈ రూ. 50 లక్షలు అవసరమా?
నేను రాహుల్కి సపోర్ట్ చేస్తున్నానంటే వాడి వ్యక్తిత్వం నాకు తెలుసు. చాలా పాజిటివ్గా ఉంటాడు. వాడు కెరియర్లో చాలా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాడు. బిగ్ బాస్ చిచ్చాకి మంచి ప్లాట్ ఫాంలా దొరికింది. అతనికి బిగ్ బాస్ విన్నర్ అవ్వడం.. రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ అందుకోవడం అతనికి అవసరం. శ్రీముఖి ఇప్పటికే చాలా నేమ్ అండ్ ఫేమ్తో పాటు డబ్బు కూడా సంపాదించింది. ఆమెకు ఈ రూ. 50 లక్షలు పెద్ద లెక్క కాదు. ప్లీజ్ సపోర్ట్ రాహుల్ చిచ్చా’ అంటూ శ్రీముఖి ఫ్యాన్స్పై ఫైర్ అయ్యాడు సింగర్ నోయల్. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండూ 1.4శాతం పైగా లాభపడ్డాయి. యూరోపియన్ మార్కెట్ల, ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో మార్కెట్లు పురోగమించాయి.
Samayam Telugu | Updated:
Mar 26, 2018, 04:13PM IST
470 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
దేశీయ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండూ 1.4శాతం పైగా లాభపడ్డాయి. యూరోపియన్ మార్కెట్ల, ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో మార్కెట్లు పురోగమించాయి. వరుస నష్టాల నుంచి గట్టెక్కి భారీ లాభాల దిశగా సాగాయి. గత వారం అమెరికా-చైనా ట్రేడ్ వార్ కారణంగా ప్రతికూలంగా సాగిన మార్కెట్లు వారం ప్రారంభంలోనే పాజిటివ్గా మొదలయ్యాయి. మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 469.87(1.44%) పాయింట్లు పుంజుకుని 32,066.41 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 132.60(1.33%) పాయింట్లు లాభపడి 10130 వద్ద స్థిరపడింది.
నష్టాల్లోంచి... లాభాల్లోకి వచ్చిన మార్కెట్ సూచీలు | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
India vs Australia 2nd T20: మ్యాక్సీ సిక్స్లు.. ఆసీస్దే సిరీస్
బెంగళూరు టీ20లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కోహ్లి 38 బంతుల్లోనే 72 పరుగులు బాదగా.. ధోనీ (40), రాహుల్ (42) రాణించారు. కోహ్లి రికార్డుల మోత మోగించాడు.
Samayam Telugu | Updated:
Feb 27, 2019, 10:51PM IST
India vs Australia 2nd T20: మ్యాక్సీ సిక్స్లు.. ఆసీస్దే సిరీస్
హైలైట్స్
బెంగళూరు టీ20లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
కోహ్లి 38 బంతుల్లోనే 72 పరుగులు బాదగా.. ధోనీ (40), రాహుల్ (42) రాణించారు.
కోహ్లి రికార్డుల మోత మోగించాడు.
బెంగళూరు: భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా దూకుడుగా ఆట మొదలుపెట్టింది. విజయ్ శంకర్ వేసిన తొలి ఓవర్లో 9 పరుగులు రాబట్టింది. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 4 పరుగులు మాాత్రమే వచ్చాయి. మరుసటి ఓవర్లో సిద్ధార్థ్ కౌల్ స్టోయినిస్ 7(11)ను బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ జోరు తగ్గింది. తొలి ఓవర్లో 9 పరుగులు ఇచ్చుకున్న శంకర్.. మలి ఓవర్లో ఫించ్(8)ను ఔట్ చేసి సత్తా చాటాడు. 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను షార్ట్, మ్యాక్స్వెల్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు 50 పరుగులు జోడించడంతో ఆసీస్ కోలుకుంది. దూకుడుగా ఆడిన వీరిద్దరూ ఆసీస్ను లక్ష్యం దిశగా నడిపారు. ఈ దశలో విజయ్ శంకర్ తెలివైన బంతితో షార్ట్ (28 బంతుల్లో 40)ను బోల్తా కొట్టించాడు.
షార్ట్ ఔటైనప్పటికీ మ్యాక్స్వెల్ మాత్రం దూకుడు కనబరిచాడు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాక్సీకి ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. షార్ట్ స్థానంలో వచ్చిన హ్యాండ్స్కంబ్ మ్యాక్స్వెల్కు చక్కటి సహకారం అందించాడు. కృనాల్ పాండ్య వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో సిక్స్ కొట్టిన మ్యాక్స్వెల్.. చాహల్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్లు బాదాడు. 17 ఓవర్లలో ఆస్ట్రేలియా 158/3తో నిలిచింది. అదే దూకుడుతో మ్యాక్స్వెల్ 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఆసీస్ సునాయాసంగా గెలుపొంది.
చదవండి: చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి రికార్డుల మోత..
భారత్ ఇన్నింగ్స్:
చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టీ20లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆరంభంలో లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 47) దూకుడుగా ఆడగా.. కెప్టెన్ కోహ్లి (38 బంతుల్లో 72 నాటౌట్), ధోనీ (23 బంతుల్లో 40) సిక్స్ల మోత మోగించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఒకరితో మరొకరు పోటీ పడి సిక్స్లు బాదిన ధోనీ, కోహ్లి.. చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో భారత స్కోరు బోర్డ్ పరుగులు పెట్టింది.
ఆరంభంలో ఓపెనర్లు రాహుల్, ధావన్ ఇన్నింగ్స్ను మెల్లగా మొదలుపెట్టారు. లోకల్ బాయ్ రాహుల్ ఫోర్లు, సిక్స్లు బాది టచ్లోకి వచ్చాడు. 3 ఫోర్లు, 4 సిక్స్లు బాదిన రాహుల్ దూకుడు ఆడుతున్న తరుణంలో కౌల్టర్ నైల్ బౌలింగ్లో రిచర్డ్సన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన ధావన్.. 24 బంతుల్లో 14 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కూడా కాసేపటికే పెవిలియన్ చేరడంతో భారత్ 74 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. పంత్ భారీ షాట్ ఆడబోగా.. బౌండరీ లైన్ దగ్గరున్న డార్సీ షార్ట్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
పంత్ స్థానంలో క్రీజ్లో వచ్చిన ధోనీ.. దూకుడు కనబరిచాడు. గత మ్యాచ్లో నెమ్మదిగా ఆడిన మహీ.. బౌండరీలతో చెలరేగాడు. కోహ్లి సిక్స్లతో చెలరేగాడు. వీరిద్దరూ 52 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరి ఓవర్లో భారీ షాట్కు యత్నించిన ధోనీ (23 బంతుల్లో 40) ఫించ్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బ్యాట్స్మెన్ దూకుడుతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆఖరి 6 ఓవర్లలో భారత్ 81 పరుగులు పిండుకుంది.
హ్యాట్రిక్ సిక్స్లు:
16వ ఓవర్లో కోహ్లి దూకుడు చూపాడు. నైల్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్స్లు బాది 50 సిక్స్ల క్లబ్లో చేరాడు. కోహ్లి దూకుడుతో 16 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 135/3తో నిలిచింది. అనంతరం కోహ్లి 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ సరసన నిలిచాడు. 17వ ఓవర్లో ధోనీ బౌండరీల మోత మోగించాడు. రెండు సిక్స్లు, ఒక ఫోర్ బాది 19 పరుగులు రాబట్టాడు. 20వ ఓవర్లో భారీ షాట్కు యత్నించిన ధోనీ (23 బంతుల్లో 40) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
Kohli in T20s @ Chinnaswamy 77 innings 2447 runs - most runs by a player at a venue in T20 cricket Avg 36.52 SR 13… https://t.co/mWR0S4ogSd
— Cricbuzz (@cricbuzz) 1551276469000
మ్యాచ్ ప్రివ్యూ:
తొలి టీ20లో 126 పరుగులు మాత్రమే చేసిన భారత్.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆఖరి బంతి వరకూ ప్రయత్నించింది. 19వ ఓవర్లో బుమ్రా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో ఉమేశ్ యాదవ్ 14 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ భారత్ చేజారింది. దీంతో బెంగళూరు మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే కసితో కోహ్లి సేన బరిలో దిగుతోంది.
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ ఇదే కావడం విశేషం. 2008లో జరిగిన ఏకైక టీ20 ఓడిన భారత్.. ఆసీస్కు సిరీస్ కోల్పోయింది. అప్పటి నుంచి కంగారూలకు టీమిండియా టీ20 సిరీస్ కోల్పోలేదు.
2nd T20I. Australia XI: D Short, M Stoinis, A Finch, G Maxwell, P Handscomb, A Turner, N Coulter-Nile, P Cummins, J… https://t.co/qc5e7stNaA
— BCCI (@BCCI) 1551272822000
సొంత గడ్డ మీద పొట్టి ఫార్మాట్లో నాలుగేళ్లుగా భారత్కు తిరుగులేదు. చివరిగా 2015లో దక్షిణాఫ్రికాకు టీ20 సిరీస్ కోల్పోయింది. ఈ రికార్డును మరింత మెరుగు పర్చుకోవాలని భారత్ భావిస్తోంది.
2nd T20I. India XI: S Dhawan, L Rahul, V Kohli, R Pant, MS Dhoni, V Shankar, D Karthik, K Pandya, Y Chahal, J Bumra… https://t.co/FM3PalDImf
— BCCI (@BCCI) 1551272822000
మరో రెండు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా బుమ్రా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. ప్రస్తుతం అశ్విన్ (52) వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 50 సిక్స్ల క్లబ్లో చేరడానికి కోహ్లి రెండు సిక్స్ల దూరంలో ఉండగా.. ధోనీ ఒక్క సిక్స్ దూరంలో ఉన్నాడు.
రోహిత్ శర్మ మరో సిక్స్ కొడితే అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. రోహిత్ 86 ఇన్నింగ్స్ల్లో 102 సిక్స్లు బాదగా.. గప్టిల్ (74 ఇన్నింగ్స్ల్లో 103 సిక్స్లు), క్రిస్ గేల్ (52 ఇన్నింగ్స్ల్లో 103 సిక్స్లు) ఈ జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Suresh 77 Views
ఇండియాబుల్స్ బాండ్లకు అనూహ్య స్పందన
ముంబై, సెప్టెంబరు 18: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ జారీచేసిన బాండ్లకు విపరీత స్పందన లభించింది. 3500 కోట్లకు బాండ్లు జారీచేయా లని నిర్ణయించిన ఇండియాబుల్స్ అవసరమైతే 7200 కోట్లవరకూ పెంచుకునే ఆప్షన్ను ప్రకటిం చింది. తొలిదశలోనే రెండురెట్లు అధికంగా కొను గోళ్లు జరిగాయి. కేర్ట్రిపుల్ఎ రేటింగ్, బిడబ్ల్యు ఆర్ ట్రిపుల్ఎ, బ్రిక్విక్ రేటింగ్తో ఉన్న ఈ బాండ్లకు ఇన్వెస్టర్ల మార్కెట్ నుంచి మంచి గిరాకీ వచ్చిందన్నారు. వడ్డీరేట్లు కూడా 8.55శాతం నుంచి ఉన్నట్లు ప్రకటించారు. కంపెనీ వైస్ ఛైర్మన్ ఎండి గగన్ బంగా మాట్లాడుతూ ఎన్సిడి ల జారీ విజయవంతం అయిందని, కంపెనీ తద నంతరం మరింతగా నిధుల సమీకరణకు తోడ్ప డిందన్నారు. ఇన్వెస్టర్లకు తమ కంపెనీపై ఎంతో విశ్వాసం పెరిగిందని రుజువయిందన్నారు.ఎస్ సెక్యూరిటీస్, ఎడెల్విసిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎకెకేపిటల్ సర్వీసెస్, యకాక్సిస్బ్యాంకు, ఐఐఎఫ్ ఎల్ హోల్డింగ్స్, ఇండస్ ఇండ్బ్యాంకు, ఎస్బిఐ కేపిటల్ మార్కెట్స్, ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్ లీడ్మేనేజర్లుగా వ్యవహరించారు. | 1entertainment
|
WOMEN ASIA CP11
అంతర్జాతీయ క్రికెట్లో రికార్డు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఒక రికార్డు నమోదైంది.కాగా కేవలం 23 పరుగుల అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయిన నేపాల్ మహిళా జట్టు రికార్డుల కెక్కింది.వివరాలను పరిశీలిస్తే మహిళల ఆసియా కప్లో భాగంగా శ్రీలంక మహిళా జట్టు బౌలర్లు నిప్పులు చేరిగారు.వారి ధాటికి ఏడుగురు బ్యాట్స్ ఉమెన్ డకౌట్ కాగా,ఓక బ్యాట్స్ఉమెన్ పరుగులేమి చేయకుండా క్రీజులో నాటౌట్గా నిలవడం విశేషం.జ్యోతి పాండే 16 మాత్రమే డబుల్ డిజిట్ చేయడం విశేషం.దీంతో కేవలం 16.2 ఓవర్లలోనే 23 పరుగులకే ఆలౌటైంది.శ్రీలంక బౌలర్లలో సుగంధి కుమారి,రణవీరా ఒక్కొక్కరు మూడు వికెట్లు తీయగా,రంగ సింఘే రెండు వికెట్లు తీసి ఆకట్టుకుంది.కాగా ఈ టార్గెట్ను కేవలం 4.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సాధించింది.కాగా మరో మ్యాచ్లో బంగ్లా మహిళా జట్టు 89 పరుగులు టార్గెట్ను చేధించే క్రమంలో థా§్ులాండ్ మహిళా జట్టు 53 పరుగులకే ఆలౌట్ అయింది. | 2sports
|
Hyderabad, First Published 13, Mar 2019, 4:40 PM IST
Highlights
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి తెలుగుతో పాటు తమిళంలో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో బైలింగ్యువల్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి తెలుగుతో పాటు తమిళంలో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో బైలింగ్యువల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా విజయ్ తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో బహు భాషా సినిమా చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశాడు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి 'హీరో' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ అన్ని భాషలకు కామన్ గా ఉంటుందని భావించారు.
అయితే ఇప్పుడు తమిళంలో అదే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కింది. శివ కార్తికేయన్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. దీనికి 'హీరో' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. షూటింగ్ కూడా ముందుగానే మొదలైంది కాబట్టి ఈ సినిమానే ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చిత్ర యూనిట్ కూడా తమిళ నిర్మాతల మండలిలో టైటిల్ తాము రిజిస్టర్ చేసుకున్నట్లుగా సాక్ష్యాలను బయటపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ ఏం చేస్తాడో చూడాలి!
Last Updated 13, Mar 2019, 4:40 PM IST | 0business
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
Hyderabad, First Published 22, Oct 2018, 2:37 PM IST
Highlights
నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య పలు గెటప్స్ ని విడుదల చేసింది చిత్రబృండం. తాజాగా 'వేటగాడు' సినిమాలో ఎన్టీఆర్ లుక్ లో బాలయ్యని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ని వదిలింది చిత్రబృందం.
నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య పలు గెటప్స్ ని విడుదల చేసింది చిత్రబృందం.
తాజాగా 'వేటగాడు' సినిమాలో ఎన్టీఆర్ లుక్ లో బాలయ్యని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ని వదిలింది చిత్రబృందం. అచ్చం తన తండ్రిలానే ఆ గెటప్ లో దర్శనమిచ్చాడు బాలయ్య. దివంగత ఎన్టీఆర్ కెరీర్ లో 'వేటగాడు' సినిమా కీలకపాత్ర పోషించింది.
అప్పట్లో ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఆ కారణంగానే ఈ బయోపిక్ లో వేటగాడు గెటప్ ని చూపించబోతున్నారు.ఇప్పటికే రకుల్, బాలయ్య కాంబినేషన్ లో ఆకుచాటు పిందె తడిసే పాటని చిత్రీకరించారు.
అలానే సినిమాలో 'వేటగాడు'కి సంబంధించి మరికొన్ని సీన్లు కూడా చిత్రీకరించబోతున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నందమూరి అందగాడు చిందులేయగా..
తెలుగువాడి నరనరమూ నాట్యమాడగా..
— NBK FILMS (@NBKFilms_) October 22, 2018
సంబంధిత వార్త.. | 0business
|
sandhya 111 Views stock market
stock market
ముంబై: అమ్మకాల ఒత్తిడితో సోమవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బిఎస్ఈ ప్రస్తుతం 600 పాయింట్లకు దిగజారింది. 2018 డిసెంబరు తర్వాత ఇంత భారీ స్థాయిలో నష్టపోవడం మళ్లీ ఇప్పుడే. నిఫ్టీ కూడా 200 పాయింట్లకు దిగజారి నష్టంతో ట్రేడవుతుంది. సెన్సెక్స్ 590 పాయింట్లు దిగజారి 38,923 వద్ద, నిఫ్టీ పాయింట్ల నష్టంతో 11,627 వద్ద కొనసాగుతున్నాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: h ttps://www.vaartha.com/news/international-news/ | 1entertainment
|
బ్రేకింగ్ న్యూస్ : శ్రీదేవి మృతదేహాన్ని తరలింపు ఇవాళ కూడ కష్టమే..
Highlights
శ్రీదేవి మృతదేహాన్ని తరలింపు ఇవాళ కూడ కష్టమే..
దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసే నివేదిక గురించి శ్రీదేవి కుటుంబ సభ్యులు వేచిచూస్తున్నారు.
ప్రముఖ నటి శ్రీదేవి మృతదేహాన్ని స్వదేశానికి తరలింపుకు అన్ని రకాల ప్రక్రియలు పూర్తయితే తప్ప ఆమె దేహాన్ని అప్పగించలేమని దుబాయ్ అధికారులు వెల్లడిస్తున్నారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసే నివేదిక గురించి శ్రీదేవి కుటుంబ సభ్యులు వేచిచూస్తున్నారు.దర్యాప్తు ప్రక్రియ తీరు గురించి మాట్లాడటానికి దుబాయ్ అధికారులు నిరాకరిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకు మించి తాము ఏమీ చెప్పలేము అని వారు పేర్కొంటున్నారు. శ్రీదేవి మృతదేహం అప్పగింత వ్యవహారంలో మంగళవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి పురోగతి కనిపించకపోవడం బంధువులను వేదనకు గురిచేస్తున్నది.దుబాయ్ పోలీసులు సాధారణంగా అనుసరించే పద్దతులనే పాటిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరుగడం లేదు. హాస్పిటల్లో చనిపోతే ఈ ప్రక్రియ మరింత సులభం అయ్యేది. హోటల్లో చనిపోవడం వల్ల అనేక రకాలుగా దర్యాప్తు చేయాల్సి వస్తున్నది అని భారతీయ అధికారులు పేర్కొన్నారు.శ్రీదేవి మృతదేహం దుబాయ్ మార్చురిలో ఉంచారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్లియరెన్స్ లభిస్తే గానీ, ముహైస్నాలోని ఎంబాల్మింగ్ యూనిట్కు తరలిస్తాం అని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. అయితే శ్రీదేవి మృతదేహాన్ని మంగళవారం ముంబైకి తరలించే అవకాశాలు చాలా కష్టంగానే ఉన్నట్టు అధికారులు వెల్లడిస్తున్న. దుబాయ్ ప్రాసిక్యూషన్ కేసులో తీవ్రత ఉన్నట్టు భావిస్తే తరలింపు ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.అన్ని ప్రక్రియలు ముగిసిపోయిన అనంతరం ఆమె భౌతికకాయాన్ని ఛార్టర్డ్ విమానంలో ముంబయికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ జెట్ విమానాన్ని పంపిన సంగతి తెలిసిందే.
Last Updated 25, Mar 2018, 11:55 PM IST | 0business
|
రకుల్ చికాగోలో కోట్లు సంపాదించుకుంది: మాధవిలత
Highlights
రకుల్ క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది
తెలుగు చిత్రసీమలో కాస్టింగ్ కౌచ్ వివాదం ఇంకా సద్దుమణగముందే.. చికాగో సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. అమెరికాలో తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్, చంద్రకళ నడిపిస్తున్న వ్యభిచారం ఉదంతం వెలుగులోకి రావడంతో చిత్రసీమ మరోసారి కలవరపాటుకి గురైంది. సెక్స్ రాకెట్ గుట్టు రట్టయినప్పటి నుంచి అమెరికా పోలీసులు సినిమా తారలు, సినిమాలతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ స్థిరపడిన వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గతంలో జరిగిన కార్యక్రమాలు, అందులో పాల్గొన్న నటీమణుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ఆ చీకటి బాగోతంతో సంబంధం ఉన్న తారలతో పాటు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన వారు కూడా హడలిపోతున్నారు.
ఇదిలా ఉండగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవీలత మాట్లాడుతూ.. చికాగోలో తెలుగు వారు నిర్వహించిన అనేక కార్యక్రమాలకు రకుల్ ప్రీత్ సింగ్కు ఆహ్వానం అందిందని, చాలామార్లు అమెరికా వెళ్లిందని చెప్పింది. అటువంటి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో, బాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపింది. నాకు సక్సెక్ వచ్చింది కాబట్టి.. నాకు అలాంటి అనుభవం ఎదురవలేదు అని చెప్పాలే కానీ, అస్సలు క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటో కూడా తెలియని రీతిలో మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆఖరికి బాలీవుడ్ తారలు కంగనా రనౌత్, రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్య వంటి వారు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఒప్పుకుంటే.. రకుల్ ప్రీత్ సింగ్ క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
Last Updated 20, Jun 2018, 3:14 PM IST | 0business
|
Ashes 2017: Stuart Broad Sees David Warner as Danger Man
యాషెస్లో ఫస్ట్ టార్గెట్ డేవిడ్ వార్నర్..!
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎక్కువ ప్రమాదకర ఆటగాడని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్
TNN | Updated:
Nov 9, 2017, 01:45PM IST
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎక్కువ ప్రమాదకర ఆటగాడని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్‌ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. నవంబరు 23 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ టోర్నీని యుద్ధంతో పోల్చి.. డేవిడ్ వార్నర్ ఇంగ్లాండ్ బౌలర్లకి హెచ్చరికలు పంపాడు. గొడవ కేసు కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ జట్టుకి దూరమవడంతో ప్రస్తుతం ఇంగ్లాండ్‌ కూడా కొంచెం ఒత్తిడిలోనే సిరీస్‌‌కి సిద్ధమవుతోంది.
‘డేవిడ్ వార్నర్‌లాంటి దూకుడైన బ్యాట్స్‌మెన్‌కి ఆరంభంలోనే కొత్తబంతితో సాధ్యమైన ఎక్కువ బంతులు విసరాలి. అలా అయితేనే.. అతను క్రీజులో కుదురుకోకముందే ఔట్ చేయగలం. ఒకవేళ ఈ వ్యూహం విఫలమైతే.. ప్లాన్‌ బి కూడా మన దగ్గర ఉన్నప్పుడే వార్నర్‌ని కట్టడి చేయగలుగుతాం. అతను కాసేపు క్రీజులో నిలవగలిగితే చాలు.. జట్టు భారాన్నంతా ఒక్కడే మోస్తూ స్కోరు బోర్డుని ముందుకు తీసుకెళ్లగలడు. అతనికి బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నదే.. కానీ.. అలాంటి బ్యాట్స్‌మెన్ మన జట్టులో ఉంటే మాత్రం బాగా ఆస్వాదించవచ్చు’ అని స్టువర్ట్‌ బ్రాడ్ వివరించాడు. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కోహ్లీసేన ఆధిపత్యాన్ని ముందే ఊహించా: కుంబ్లే
భారత్ గడ్డపై ఇటీవల దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్లో చిత్తుగా ఓడించిన టీమిండియా.. సొంతగడ్డపై వరుసగా 11 టెస్టు సిరీస్లు గెలిచిన ఏకైక జట్టుగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
Samayam Telugu | Updated:
Oct 26, 2019, 05:45PM IST
Team India
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత్ జట్టు క్రికెట్ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించగలదని తాను ముందే ఊహించినట్లు దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు. వరల్డ్కప్ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లని టెస్టుల్లో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నెం.1 స్థానాన్ని కాపాడుకుంటూ టెస్టు ఛాంపియన్షిప్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎంతలా అంటే.. ఛాంపియన్షిప్లో భారత్ జట్టు వరుసగా ఆరు టెస్టు విజయాలతో 240 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఖాతాలో ఉన్నవి 60 పాయింట్లే కావడం విశేషం.
‘భారత్ జట్టు ఆధిపత్యాన్ని నేను మూడేళ్ల ముందే ఊహించాను. 2016-17లో నేను కోచ్గా ఉన్న సమయంలోనే వరల్డ్ క్రికెట్లో కోహ్లీసేన ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పా. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ మాట నేను కేవలం తుది జట్టులో ఆడే 11 మందిని చూసి చెప్పలేదు. రిజర్వ్ బెంచ్లో ఉన్న నాణ్యమైన క్రికెటర్లని చూసి అంచనా వేశా. ఇప్పుడు కోహ్లీసేన భారత్ గడ్డపైనే కాదు.. విదేశాల్లోనూ విజయాల్ని సాధించగలదు’ అని అనిల్ కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు. | 2sports
|
Fans manufacturing
ఫ్యాన్ల ఉత్పత్తిరంగానికి పెనుభారం జిఎస్టి
న్యూఢిల్లీ,జూన్ 17: దేశంలో ఆరువేల కోట్ల టర్నోవర్ తో ఉన్న విద్యుత్ ఫాన్ల ఉత్పత్తి రంగం జిఎస్టి పన్ను ప్రభావంతో కొంత నష్టాలపాలయ్యే అవకాశం ఉందని ఉత్పత్తిదారులు భయపడుతున్నారు. విని యోగరంగ ఉత్పత్తుల్లో కీలక కేటగిరీ అయిన సీలింగ్, వివిధ కేటగిరీల ఫ్యాన్ల ఉత్పత్తులపై కేంద్రం జిఎస్టిని 28శాతం శ్లాబ్లోకి తెచ్చింది. ఉత్పత్తిదారులు దీనివల్ల నిర్వహణ ఉత్పత్తివ్యయం కూడా పెరుగుతుందని ఫలితంగా ధరలు పెంచు కోకతప్పదని అంతిమంగా ప్రజలపైనే భారం పడు తుందని చెపుతున్నారు. అందువల్ల జిఎస్టిని ఫ్యాన్లపై 12శాతానికి తగ్గించాలని కోరుతున్నా రు. దేశంలో ఫ్యాన్లను విరివిగా వినియోగిస్తా రని, విలాస వస్తువులుకాదని ఉత్పత్తిదారులు చెపు తున్నారు. విలాసవస్తువుగా భావించి కేంద్రం 28 శాతం పన్నుశ్లాబ్లో ఉంచింది. ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లను కూడా ఇదే బ్రాకెట్లో ఉంచింది. ఇక ప్రీమియం మొబైల్ఫోన్లను 12శాతం పన్నుశ్లాబ్లో ఉంచిన కేంద్రం ఫ్యాన్లను 28శాతం పన్నుశ్లాబ్ లోకి తీసుకురావడంపై ఆందోళన వ్యక్తంచేస్తోంది.
భారతీయ ఫ్యాన్ల ఉత్పత్తిదారులసంఘం ఛైర్మన్ రోహిత్ మాధుర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థికశాఖను జిఎస్టి మండలి ప్రతినిధులను కలిసి వివరించింది. దేశంలోని అగ్రశ్రేణి ఫ్యాన్ బ్రాండ్లు ఉషా, బజాజ్, క్రాంప్టన్, హ్యావెల్స్, ఓరి యంట్, యాంకర్, ఓర్టెమ్, సూర్య, లూమినస్, పోలార్, యాంకర్ బ్రాండ్లు ఉన్నాయి. జిఎస్టి పన్నురేట్ వల్ల తక్షణమే భారం మూడునుంచి ఎని మిదిశాతంగా ఉంటుంది. ఉత్పత్తి యూనిట్ ఉన్న ప్రాంతం ఆధారంగా పన్ను పెరుగుతుంది. లేదా ఎక్సైజ్ప్రీజోన్స్లో కూడా జిఎస్టిని సడలించని పక్షంలో ప్రత్యేక మండళ్ల ప్రయోజనం కూడా నెర వేరదని సంఘం ప్రతినిధులు చెపుతున్నారు. కనీ సం 50శాతం ఉత్పత్తి యూనిట్లు ప్రత్యేకమండళ్ల లోనే ఉన్నాయి. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్యరాష్ట్రాల్లో ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఎక్సైజ్ ఉచిత జోన్లలో పన్నుభారం 20శాంగా ఉంది.
అదే సుంకం వసూలుచేసే ప్రాంతాల్లో అయితే 26 శాతంగా ఉంటున్నది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఫ్యాన్లధరలు తగ్గించాలంటే ముందు జిఎస్టితగ్గించాలని చెపుతున్నారు.దేశంలోని ఫ్యాన్ ఉత్పత్తిరంగం రూ.9వేల కోట్లుగా ఉంది. సంఘటిత రంగంలోనే రూ.6వేల కోట్ల వరకూ ఉన్నట్లు అంచనా. అలాగే నూలుదుస్తులట్రేడర్లు కూడా దేశ వ్యాప్తంగా సమ్మెను చేసారు. జిఎస్టి రేట్ ఐదు శాతం విధించడంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఓపక్క ఖాదీ వస్త్రాలను దరించాలని ప్రోత్సహిస్తూ కాటన్దుస్తులపై జిఎస్టిని విధించడంపై వ్యాపా రులు మండిపడుతున్నారు. సుమారు పదిలక్షలక ుపైగా చిన్న మధ్యతరహా యూనిట్లు ఇప్పటివరకూ ఎటువంటి సుంకాలను చెల్లించడంలేదు. జిఎస్టితో ఇపుడు ఐదుశాతం సుంకం చెల్లించాల్సివస్తోంది. ఈ యూనిట్లు పన్నులు ఎగవేసినా గార్మంట్ తయారీదారుల నుంచి కూడా పన్నులకు ప్రభుత్వం సూచించింది. దీనిలో 100మిలియన్ ప్రజలు ప్రత్య క్షంగాను, పరోక్షంగాను లబ్ధి పొందుతు న్నారు.
టెక్స్టైల్ఫ్యాబ్రిక్స్ ఇప్పటి వరకూ ఈ రంగానికి వెన్నెముకగా ఉంద ని మొత్తం దేశంలో 2.7 మిలియన్ల పవర్లూమ్స్ ఉన్నాయి. చిన్న, మధ్య తరహా రంగంలోనే ఇవన్నీ కొనసాగుతు న్నాయని జిఎస్టి ఐదుశాతం విధింపు వల్ల ఇవన్నీ మూతపడే పరిస్థితి ఉందని వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తు న్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం12శాతం విధించడంతో జిఎస్టి 18శాతం చేతితోచేసిన నూలుపైనా విధించింది. జిఎస్టిని కాటన్ దుస్తుల పై ఉపసంహరించినా ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉండదని అందువల్ల ప్రభుత్వం పునరాలో చనచేసి జిఎస్టిని వెంటనే తొలగించాలని డిమాం డ్ వ్యక్తం అవుతోంది. ఈనెల 18వ తేదీ జిఎస్టి మండలి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఇక అమలుకు ముందు ఇదేచివరి సమావేశంగా భావి స్తున్నారు. ప్రస్తుతం జిఎస్టి పన్నురేట్ సంక్లిష్టం గా ఉందని భావిస్తున్న వర్గాలను శాంతింపచేయడా నికి ఈ సమావేశంలో కొన్న ఉత్పత్తుల పన్నురేట్ల ను సవరిస్తారని అంచనా. ఇప్పటికే పౌరవిమానయా న మంత్రిత్వశాఖ జిఎస్టి అమలును రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఆర్థికశాఖను కోరింది. | 1entertainment
|
Highlights
లుకాకు దెబ్బకు పనామా చిత్తు చిత్తు
హైదరాబాద్: కేవలం ఆరు నిముషాల వ్యవధిలో రొమేలు లుకాకు చేసిన రెండు గోల్స్ బెల్జియంకు ఘన విజయాన్ని తెచ్చి పెట్టింది. సోచిలోని ఫిస్ట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జి మ్యాచ్లో 3-0 గోల్స్ తేడాతో పనామాను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇంతటి ఘనతకు కారణమైన రొమేలు లుకాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ఫస్టాఫ్లో రెండు టీమ్స్లో ఏ ఒక్కటీ ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. సెకండాఫ్ వచ్చేసరికి మొదటి నిముషంలోనే తొలి గోల్ చేయడం ద్వారా బెల్జియం టీమ్ మ్యాచ్కు ఊపు తెచ్చి పెట్టింది. 47వ నిమిషంలో మెర్టెన్స్ గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యతను సంపాదించిపెట్టాడు. పెనాల్టీ కార్నర్ నుంచి విక్టర్ కైవెన్లో కొట్టిన బంతిని డ్రైస్ మెర్టెన్స్ తలతో బంతిని చాకచక్యంగా గోల్లోకి పంపి ఆ జట్టుకు ఆధిక్యతను చేకూర్చాడు.
65వ నిమిషంలో పనామా డిఫెండర్ హజార్డ్ ప్రమాదకరంగా బెల్జియం డిఫెండర్ డి బ్రుయినేను ఢీకొన్నాడు. దీంతో బెల్జియం జట్టుకు రిఫరీ పెనాల్టీ కిక్ కేటాయించగా, బెల్జియం మిడ్ఫీల్డర్ లుకాకు 69వ నిమిషంలో దానిని అద్భుతమైన గోల్గా మలిచాడు. మరో 6 నిముషాల్లో అంటే 75వ నిముషం వద్ద మరో గోల్ చేసిన లుకాకు.. బెల్జియంకు తిరుగులేని 3-0 ఆధిక్యతను సంపాదించి పెట్టాడు. ఈడెన్ హజార్డ్ అందించిన బంతిని చాకచక్యంగా అందుకున్న లుకాకో ఎంతో నైపుణ్యంతో పనామా గోల్కీపర్ను తప్పించి బంతిని గోల్పోస్టులోకి పంపిచాడు. ఈ గోల్స్తో బెల్జియం జట్టు పనామాపై తిరుగులేని 3-0 గోల్స్ ఆధిక్యతను సంపాదించింది.
Last Updated 19, Jun 2018, 10:40 AM IST | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పాతికేళ్ల నాటి ఫొటోను బయటపెట్టిన సచిన్
అందరూ నిద్రపోతుంటే.. సచిన్ ఒంటరిగా ప్రాక్టీస్ చేసేవాడట..
TNN | Updated:
Feb 16, 2017, 07:37PM IST
మైదానంలో క్రమశిక్షణకు.. మైదానం వెలుపల కఠోర శ్రమకు ప్రతిరూపంగా నిలిచిన సచిన్ తెందుల్కర్ దాదాపు 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. క్రికెటర్‌గా ఉన్నంతకాలం మ్యాచ్‌లు ఉన్నా లేకపోయినా.. ప్రతి రోజూ సచిన్ అరంగేట్రం ఆటగాడిలా ప్రాక్టీస్ చేసేవాడట. ఎంతలా అంటే భారత జట్టు ఓ విదేశీ పర్యటనలో మరుసటి రోజు మ్యాచ్ అనగా.. అనివార్య కారణాల వల్ల ముందు రోజు రాత్రి స్టేడియానికి సమీపంలోని హోటల్‌కు చేరుకుందట. ప్రయాణంతో అలసిపోయిన క్రికెటర్లందరూ వెంటనే నిద్రలోని జారుకుంటే.. అర్ధరాత్రి ఓ రూము నుంచి బంతిని బ్యాట్‌తో కొడుతున్న శబ్ధం వినిపించిందట. ఏమిటా.. అని చూస్తే సచిన్ తెందుల్కర్ రూములోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడట. అంతలా అలుపెరగకుండా నిత్యం కష్టపడ్డాడు కాబట్టే క్రికెట్ ప్రపంచంలోనే వంద శతకాలు బాది.. నేటికీ రికార్డుల రారాజుగా అభిమానులతో ముద్దుగా పిలిపించుకుంటున్నాడు.
2013లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ అనంతరం ఎక్కువగా కుటుంబానికే సమయం కేటాయిస్తూ.. విహారయాత్రలతో ఎంజాయ్ చేస్తున్నాడు. గతంలో క్రికెటర్‌గా ఎదిగేందుకు తను కష్టపడిన రోజులు సచిన్‌కు తాజాగా గుర్తుకు వచ్చినట్లున్నాయి. వెంటనే పాతికేళ్ల క్రితం తను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోతో ప్రస్తుత ఫొటోను జతచేసి ‘ప్రాక్టీస్ ఎప్పుడు చేసినా.. ఎక్కడ చేసినా.. వృథా‌ కాదు. ప్రతి రోజు గెలుపు మీదే’ అంటూ క్రికెట్ భాషలో చెప్పుకొచ్చాడు. మరోవైపు సచిన్ మళ్లీ బ్యాట్ పట్టుకోవడంతో ఆనందం వ్యక్తం చేసిన అభిమానులు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లతో మ్యాచ్‌లు ఏర్పాటు చేయాలంటూ ఏకంగా ఐసీసీనే కామెంట్ల రూపంలో కోరుతున్నారు. సచిన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం
‘సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ ’ మే 26న థియేటర్లలోకి రానుంది. | 2sports
|
News Room 365 WATCH LIVE TV
సల్మాన్ ఖాన్ పిటిషన్ విచారణ వాయిదా
సల్మాన్ ఖాన్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణని ముంబై హై కోర్టు వాయిదా వేసింది.
TNN | Updated:
Jul 27, 2015, 06:30PM IST
తనకి ముంబై సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల కారాగార శిక్షని సవాల్ చేస్తూ సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణని ముంబై హై కోర్టు జులై 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుకి సంబంధించి కింది కోర్టుల్లో సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు దాఖలు చేసిన పిటిషన్లు, సాక్ష్యాధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లన్ని మరాఠీలో వుండటంతో ఆయా దస్ర్తాలని ఇంగ్లీష్ లో కి తర్జుమా చేసి పెట్టారు. దీంతో ఇక జులై 30వ తేదీ నుంచి సల్మాన్ పిటిషన్ పై విచారణ ప్రారంభం కానున్నట్లు హైకోర్టువర్గాలు తెలిపాయి.
ముంబైలో 2002, సెప్టెంబర్ లో నమోదైన హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న సల్మాన్ కి ముంబై సెషన్స్ కోర్టు శిక్ష విధించినప్పటికీ .. అదే రోజు ముంబై హై కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. | 0business
|
రాజీ లేకుంటే జీవితమే లేదంటున్న బ్యూటీ
Highlights
బంధం నిలబడాలంటే కాంప్రమైజ్ కావాల్సిందేనంటున్న శృతీహాసన్
ఇద్దరి మధ్య రాజీ లేకుంటే జీవితమే లేదంటున్న సుందరి
తన తండ్రి కమల్ హాసన్ తో గౌతమి బంధం విడిపోయినందుకు ఫీలైందో లేక గుస్సా అయిందో తెలియట్లేదు కానీ శృతీ హాసన్ రిలేషన్ షిప్స్ గురించి తెగ లెక్చర్ పీకుతోంది. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్. చటుక్కున తినేయాలి.. చిటుక్కున పనుల్లో పడిపోవాలి. అంతా వేగం. బంధాలకు ప్రాధాన్యం ఇవ్వలేనంత బిజీ బిజీగా కొంతమంది ఉంటున్నారు. చిన్న చిన్న మనస్పర్థలకే విడిపోవడం... బంధాలకు విలువ లేకుండాపోతోంది. ‘రిలేషన్షిప్స్’ గురించి శ్రుతీహాసన్ కూడా ఇలానే మంచి మాట చెప్పారు.
‘‘కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తమే. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే జీవితం బాగుంటుంది. ముఖ్యంగా బంధాలను కాపాడుకోవాల్సిన విషయంలో రాజీ పడాల్సిందే. అక్కడ లేనిపోని గొప్పలకు పోతే ఆ బంధం తెగిపోతుంది. ఒకప్పుడు స్నేహంలో అయినా, వివాహ బంధంలో అయినా రాజీ అనేది ఉండేది. సర్దుకుపోయేవాళ్లు. ఇప్పుడలా ఇష్టపడటంలేదు. రాజీపడటం తగ్గింది కాబట్టి.. విడిపోవడాలు ఎక్కువైపోయాయి. చిన్నపాటి రాజీవల్ల ఓ బంధం నిలబడుతుందనుకున్నప్పుడు సర్దుకుపోవాలి. ఒకవేళ ఆ బంధం వల్ల జీవితాంతం ఇబ్బందులపాలు కావల్సి వస్తుందనిపిస్తే అప్పుడు రాజీ పడకూడదు’’ అంటోంది శృతి.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
జీడీపీ గణాంకాలపై మార్కెట్ చూపు!
- ఎఫ్అండ్వో సిరీస్ ముగింపు కీలకం
- ఆటో కంపెనీల ఫలితాలపై దృష్టి
- ఎస్అండ్పీ రేటింగ్ ప్రభావం..
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ వారం జీడీపీ గణాంకాలు, నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు కీలకంగా మారనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల గమనం, డాలరుతో రూపాయి కదలికలు, దేశీ, విదేశీ పెట్టుబడుల సరళి, ఐటీ కంపెనీల బై బ్యాక్ ఆఫర్, ఆటో కంపెనీల ఫలితాలతో పాటు పీఎంఐ తయారీ రంగ గణాంకాలు వంటి అంశాలు ప్రధాన స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక గత వారంలో దేశీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు ఏడు సెషన్లుగా లాభాల్లో పయనించాయి. దీనికితోడు వారాంతంలో ఐటీ షేర్ల జోరుతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 91 పాయింట్ల లాభంతో 33,679 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిప్టీ 41 పాయింట్లు పెరిగి 10,390 పాయింట్ల వద్ద నిలిచింది. కాగా వారాంతపు ప్రాతిపదికన రెండు ప్రధాన సూచీలు 1శాతం మేర లాభపడినాయి. ఈ నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లు బుల్లిష్ కొనసాగిస్తాయో లేదో వేచి చూడాల్సిన అంశం..
జీడీపీ డేటా..
ఈ వారం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు దిక్సూచిగా నిలువనున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రసుత్త ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన దిత్వీయ త్రైమాసికానికి చెందిన జీడీపీ గణాంకాలు నవంబర్ (30న) వెల్లడికానున్నాయి. 2017 జూన్తో ముగిసిన త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 5.7శాతానికి దిగజారిన సంగతి తెలిసిందే. జులై 1న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రావడంతో వృద్ధి రేటు పడిపోవడానికి కారణమైనట్టు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఈఏడాది రెండో త్రైమాసికంలో మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయనుందని వెల్లడించింది. వచ్చే ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికం వరకు జీఎస్టీపై స్పష్టత, మెరుగైన వర్షాభావ పరిస్థితులతో భారత జీడీపీ వృద్ధి రేటు 7.-7.5శాతం వద్ద నమోదు కావచ్చని నితి అమోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇదే సమయంలో మౌలిక రంగ అవుట్పుట్ డేటా నవంబర్ 30న మార్కెట్ ముగిసిన అనంతరం వెల్లడి కానుంది. మరోవైపు భారత తయారీ పీఎంఐ గణాంకాలు శుక్రవారం (డిసెంబర్ 1న) మార్కిట్ ఎకనామిక్స్ వెల్లడించనుంది. అలాగే అక్టోబర్ నెలలో నిక్కి ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం 2017 సెప్టెం బర్లో ఈ సూచీ 51.2 వద్ద ఉండగా..అక్టోబర్లో ఈ సూచీ 50.3శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ గణాంకాల నేపథ్యంలో మదుపర్లు అచితూచి వ్యవహరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డెరివేటివ్ సిరీస్..
నవంబర్ నెల ప్యూచర్స్ అండ్ అప్షన్స్ (ఎఫ్అండ్వో) ముగింపు గురువారం (30న) ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు నవంబర్ కాంట్రాక్టులను డిసెంబర్ సిరీస్కు రోల్వర్ చేసుకుంటారని.. ఈ క్రమంలో ప్రధాన సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గులకు లోను కావచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎస్అండ్పీ రేటింగ్పై నజర్
ప్రముఖ రేటింగ్ సంస్థ 'స్టాండర్డ్స్ అండ్ పూర్' (ఎస్అండ్పీ) భారత సావరిన్ రేటింగ్ను యథాతథ స్థానంలోనే ఉంచుతున్నట్టు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికితోడు ప్రస్తుతం భారత్కు ఎస్అండ్పీ రేటింగ్స్లో 'బీబీబీ-' విభాగంలో కొనసాగుతోంది. మరోవైపు భారత్పై తన అవుట్లుక్ను కూడా ఎస్అండ్పీ స్థిరంగానే ఉంచుతున్నట్టు వెల్లడించింది. మూడీస్ భారత రేటింగ్ను అప్గ్రేడ్ చేసిన అనంతరం ఎస్అండ్పీ కూడా భారత రేటింగ్ను అప్గ్రేడ్ చేస్తుందని పలువురు అంచనా వేశారు. అయితే దేశంలోని వాస్తవ పరిస్థితులను దగ్గరగా విశ్లేషించిన ఎస్అండ్పీ సంస్థ భారత రేటింగ్ను ఇప్పటికిప్పుడు మెరుగ్గా ప్రకటించే పరిస్థితులు దేశంలో పెద్దగా కనిపించడం లేదని వివరించింది. అంతకంతకు పెరుగుతున్న ద్రవ్యలోటు, తగ్గుతున్న తలసరి ఆదాయం, ప్రభుత్వం రుణాలు, ప్రభుత్వంపై రుణ భారం చాలా బలహీనమైనవిగా ఉన్నట్టు ఎస్అండ్పీ తెలిపింది. గత రెండు త్రైమాసికాలుగా అంచనాల కంటే కూడా దేశ వృద్ధి రేటు పడిపోతుండడాన్ని ఎస్అండ్పీ ఈ నివేదికలో ప్రధా నంగా ప్రస్తావించింది. ఎస్అండ్పీ రేటింగ్ నేపథ్యంలో వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అంచనా.
రూ.24వేల కోట్ల ఐటీ బైబ్యాక్ ఆఫర్..
ఐటీ కంపెనీల షేర్ బైబ్యాక్ ఆఫర్ ఈ వారంలో మొదలుకానుంది. ఇందులో భాగంగా విప్రో సంస్థ రూ.11వేల కోట్ల షేర్ల బైబ్యాక్ ఆఫర్ను ఈ నెల 29న ప్రారంభించి డిసెంబరు 13 వరకు కొనసాగించనుంది. ఈ బైబ్యాక్లో ఒక్కో షేర్ను రూ.320 చొప్పున కొనుగోలు చేయనున్నట్టు విప్రో పేర్కొంది. మరోవైపు భారత రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ రూ.13,000 కోట్ల షేర్ల బై బ్యాక్ ఆఫర్ను ఈ నెల 30న ప్రారంభించనుంది. వచ్చే నెల 14 ముగిసే ఈ బైబ్యాక్లో ఒక్కో షేర్ను రూ.1.150 చొప్పున 11.30 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు 36 ఏండ్ల కంపెనీ చరిత్రలో ఇన్ఫీ తొలిసారి బైబ్యాక్ ఆఫర్ను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ వారం విప్రో, ఇన్ఫోసిస్ స్టాక్స్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
వాహన విక్రయ గణాంకాలు..
నవంబర్ నెలకు చెందిన వాహన విక్రయ గణాంకాలను ఆటో రంగ కంపెనీలు శుక్రవారం(డిసెంబర్ 1న) వెల్లడించనున్నాయి. కాగా అక్టోబర్లో వాహన విక్రయ గణాంకాలు మిశ్రమంగా నమోదు అయ్యాయి. దీంట్లో ప్రధానంగా దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, టయోటా కంపెనీలు ప్యా సింజర్ వాహనాల్లో భారీ వృద్ధిని నమోదు చేయగా..ఇదే సమయంలో మ హీం ద్రా అండ్ మహీందా (ఎంఅండ్ఎం), పోర్డ్ సంస్థలు విక్రయాలు క్షీణిం చా యి. ఈ గణాంకాల నేపథ్యంలో ఆటో రంగ షేర్లు వెలుగులోకి రానున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Jan 30,2016
హార్లీ కొత్త బైక్ వచ్చేసింది
న్యూఢిల్లీ: విలాసవంతమైన బైక్స్ తయారీ సంస్థ హార్లీ-డేవిడ్సన్ '2016 స్పోర్ట్స్టార్ 1200 కస్టమ్' మోడల్ వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర దాదాపు రూ.8.9 లక్షలు (ఎక్స్ -షోరూమ్, న్యూఢిల్లీ). 1200 సీసీ ఎయిర్కూల్డ్ రబ్బర్ మౌంటెడ్ ఇంజిన్, పుల్ బ్యాక్ హ్యాండిల్, సమీకృత విద్యుత్తు వ్యవస్థ, ఆడో మీటర్పై టైమ్ ఆఫ్ డే క్లాక్, తక్కువ చమురు పీడనం, ఇంజిన్ ఆరోగ్య పరిస్థితిని తెలిపే వ్యవస్థతో పాటు గేర్ ఇండికేటర్, పౌడర్ కోటెడ్ ఇంజిన్, క్రోమ్ ట్రీట్మెంట్ కవర్స్, స్టీల్ లేస్డ్ చక్రాలు, క్రోమ్ హెడ్ల్యాంప్ బకెట్, క్రోమ్హెడ్లైట్ ఐబ్రౌ సౌకర్యాలతో ఈ కొత్త వాహనాన్ని హార్లీ-డేవిడ్ సన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త వాహనాన్ని హర్యానాలోకి కంపెనీ తయారీ యూనిట్లో రూపొందించనున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
హిట్ కాంబినేషన్ మరోసారి జతకలిసే
యువ నటుడు జై,నటి అంజలిలది హిట్ కాంబినేషన్ అని అందరికీ తెలిసిందే.
TNN | Updated:
Jun 17, 2016, 12:34PM IST
తెలుగింటి సంప్రదాయలతో తీసే సినిమాలో అచ్చ తెలుగమ్మాయిలానైనా .. హారర్ సినిమాలో బాగా భయపెట్టే పాత్రలోనైనా .. యూత్ మనస్సు కొల్లగొట్టే స్పెషల్ సాంగ్ లోనైనా.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు.. నటి అంజలి. ఆమె నటనకు ఒక ప్రత్యేకత ఉంది. యువ నటుడు జై , నటి అంజలిలది హిట్ కాంబినేషన్ అని అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన ఎంగేయమ్ ఎప్పోదుమ్ చిత్రం బ్లాక్ బస్టర్.ఆ చిత్రంలో జై, అంజలిల నటన సూపర్. 2011లో విడుదలైన ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో స్థానం నిలుపుకుంది. ఐదేళ్ల తరువాత మళ్లీ జై, అంజలి కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ద్వారా సినీష్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. జై, అంజలి జంట ఒక రొమాంటిక్ లవ్, హారర్ థ్రిల్లర్ కథను తెరకెక్కించనున్నట్లు సినీష్ వెల్లడించారు. ముఖ్యంగా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలితో నటించి మెప్పించగల సత్తా ఉన్న అంజలి తమ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందన్నారు. సినిమాలో ఆమెది కీలక పాత్ర అన్నారు. ఆమె తప్ప ఆ పాత్రకు ఎవరూ న్యాయం చేయాలన్నారు. ఈ చిత్రానికి కెమెరామన్ గా ఆర్.శరవణన్, ఫైట్స్ మాస్టర్ గా దిలీప్ సుబ్బరాయన్ ఉంటారన్నారు. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రముఖ నటిగా రాణిస్తున్న అంజలికి ఈ చిత్రం మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మహానటి: కీర్తి సురేష్ గురించి ఆసక్తికర విషయాలు!
Web Title:Keerthy Suresh: Interesting facts about the ‘Mahanati’ actress
( Telugu News from Samayam Telugu , TIL Network)
1/10
మహానటి: కీర్తి సురేష్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు!
మీ కామెంట్ రాయండి
సావిత్రి జీవిత గాధతో తెరకెక్కిన ‘మహానటి’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించిందని కితాబిస్తున్నారు. అందంతోనే కాకుండా అభినయంతోనూ నూటికి నూరు మార్కులు కొట్టేస్తున్న కీర్తి సురేష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సమయం తెలుగు న్యూస్ అలెర్ట్కు సబ్స్క్రైబ్ అవ్వండి
సమయం తెలుగు నుంచి బ్రేకింగ్ న్యూస్, టాప్ స్టోరీల నోటిఫికేషన్లను తక్షణమే పొందండి
ఇప్పుడు వద్దు | 0business
|
internet vaartha 312 Views
కరాచీ : ప్రపంచ టి20 టోర్నీలో భాగంగా భారత్తో మార్చి 19న ధర్మశాలలో జరిగే మ్యాచ్లో ఆడించవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ ఇషాన్ మనీ పేర్కొన్నాడు.ఒక న్యూస్ ఛానల్తో ఇషాన్ మాట్లాడుతూ ధర్మశాలలో పాకిస్థాన్ జట్టు ఆడేందుకు భద్రత కల్పించలేమని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశాడు.ఈ నేపథ్యంలో ధర్మశాలలో మ్యాచ్ కోసం పాక్ జట్టును పంపడం సరికాదన్నాడు. ఇప్పుడు వస్తున్న బెదిరింపులను పాకిస్థాన్ సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మన ఆటగాళ్లు,అధికారులు,ప్రజలు,మీడియా రక్షణకు సంబంధించిన విషయం అని ఇషాన్ వివరించాడు.పాకిస్థాన్ జట్టు స్థానంలో ఆస్ట్రేలియా ఉండి ఉంటే ధర్మశాల మ్యాచ్ నుంచి విరమించుకుని ఉండేదని, భారత్-పాక్ మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో భారత్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని పేర్కొన్నాడు. ధర్మశాలలో పాక్ ఆడట మంటే రిస్క్ చేయడమేనని వెల్లడించాడు.
శశాంక్ మనోహర్ భరోసా
పాకిస్థాన్ ఆటగాళ్లకు అధికారుల బృందానికి కావాల్సిన రక్షణ చర్యలు తీసుకుంటామని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు శశాంక్ మనోహర్ భరోసా ఇచ్చాడు.అయితే పాక్ జట్టుకు తాము భద్రత కల్పించలేమని హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. | 2sports
|
Hyderabad, First Published 1, May 2019, 9:27 AM IST
Highlights
ఓ హిట్ కొట్టినప్పుడు ఆ దర్శకుడు, ఆ హీరో నెక్ట్స్ ఏ సినిమా చేస్తారా అని సినీ అభిమానులు ఎదురుచూస్తూండటం సహజం. దాంతో అలాంటి వార్తలనే వండి వడ్డిస్తూంటారు మీడియా జనం.
ఓ హిట్ కొట్టినప్పుడు ఆ దర్శకుడు, ఆ హీరో నెక్ట్స్ ఏ సినిమా చేస్తారా అని సినీ అభిమానులు ఎదురుచూస్తూండటం సహజం. దాంతో అలాంటి వార్తలనే వండి వడ్డిస్తూంటారు మీడియా జనం. ఫలానా హీరోతో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడట... ఫలానా నిర్మాత ఈ దర్శకుడుతో సినిమా చేస్తున్నాడంటూ వార్తలు రాస్తూంటారు. ఇవేమీ ఎవరి కెరీర్ ని నష్టపరిచేవి కాకపోవటంతో లైట్ తీసుకుంటూంటారు. కానీ ఆర్ ఎక్స్ 100 చిత్రంలో హిట్ కొట్టిన అజయ్ భూపతి మాత్రం విసుక్కుంటున్నాడు. చిరాకు పడుతున్నాడు. దాన్ని తన సోషల్ మీడియా పేజీలో వ్యక్తం చేసారు.
ఆర్ ఎక్స్ 100 వంటి హిట్ సినిమాను తీసి ఓవర్ నైట్ లో టాలీవుడ్ దృష్టిలో పడ్డాడు దర్శకుడు అజయ్ భూపతి. అడల్ట్ కంటెంట్ ఉందని పేరు తెచ్చుకున్నా సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్స్ రావటంతో అందరి దృష్టీ ఇదే దర్శకుడుపై ఉంది. ఈ దర్శకుడుకి తరువాత ప్రాజెక్టునే అంత సులువుగా సెట్ కావడంలేదు. పెద్ద పెద్ద బ్యానర్లు, రామ్, నితిన్,బెల్లంకొండ శ్రీను హీరోల పేర్లు వినిపించినా... ఏదీ ఫైనల్ కాలేదు.
తాజాగా నాగచైతన్యను-సమంతను కాంబోలో సినిమా ఈ దర్శకుడు చేస్తున్నాడంటూ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించింది. మరికొందరు అదేమీ కాదు రవితేజతో సినిమా చెయ్యబోతున్నారు అన్నారు. ఈ వార్తలన్ని చూసిన అజయ్ భూపతి ట్విట్టర్ లో తన అసహనం వ్యక్తం చేసారు. “నా రెండో సినిమా ఎప్పుడు, ఎవరితో, ఎలా తియ్యాలో నాకు తెలుసు ప్లీజ్ స్టార్ రూమర్స్ ,” అంటూ పోస్ట్ చేసారు.
Naa rendo cinema eppudu,evaritho,elaa teeyalo naaku telusu
Plz stop the rumors
— Ajay Bhupathi (@DirAjayBhupathi) April 30, 2019
Last Updated 1, May 2019, 9:27 AM IST | 0business
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
sandhya 321 Views bairstow , bangladesh vs england , Jason roy , joy root
bangladesh vs england
కార్డిఫ్: ఇంగ్లాండ్ ఓపెనర్లు రా§్ు, బెయిర్ స్టో చెలరేగి ఆడి జట్టుకు మెరుపు వేగాన్ని అందించారు. జట్టుకు బలమైన పునాది వేసిన జోడిని 20వ ఓవర్లో మొర్తజా విడదీశాడు. ఆ ఓవర్తొలి బంతిని బెయిర్స్టో షాట్ ఆడగా తక్కువ ఎత్తులో వెళ్లిన బంతిని మెహిదీ హసన్ అద్భుత క్యాచ్కు బెయిర్స్టో వెనుదిరిగాడు. వన్డేల్లో ఈ జోడి ఎనిమిదోసారి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వికెట్ తీసేందుకు బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 150 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో జాసన్ రా§్ు(89), జా§్ు రూట్ (7)లు ఉన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/ | 2sports
|
ఖరీఫ్లో జోరందుకున్న సాగు
130 లక్షల హెక్టార్లకు పెరిగిన ఆయకట్టు
న్యూఢిల్లీ, జూన్ 26: రుతుపవనాలు సకాలంలో రావడం దేశవ్యాప్తంగా వర్షాలు విస్తరించడంతో ఖరీఫ్సాగు ఆశించినస్థాయిలో పెరిగిందని వ్యవసాయరంగ నిపుణులు అంచనా లు వేస్తున్నారు. అన్ని పంటలు కొన్నిరకాల పప్పుదినుసులుసైతం నాట్లపరంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగయినట్లు తేలింది. కేంద్ర వ్యవసాయ శాఖ విడుదలచేసిన గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటివరకూ సాగయని ఆయకట్టు పదిశాతం పెరిగిందని, 130.74 లక్షల హెక్టార్లలో సాగయినట్లు ప్రకటించింది. గత ఏడాది ఖరీఫ్కు 119.28 లక్షల హెక్టార్లు సాగయిందని వ్యవసాయ అధికారులు చెపుతున్నారు. నూనెగింజలు, పత్తి, చెరకు వంటి రంగాల్లో ఎక్కువ సాగు జరిగింది. ఇక పప్పుదినుసులయితే భారీ ఆయకట్టులో సాగయింది. అయితే ఈ పంటలకు ధరలు సన్నగిల్లాయి. వరిపరంగా ఆయకట్టుపెరిగింది. తృణధాన్యాలు కూడాగతఏడాదితో పోలిస్తే పెరిగాయి. నూనెగింజలపరంగా చూస్తే 55శాతం పెరిగింది. 7.23 లక్షల హెక్టార్ల నుంచి 11.24 లక్షల హెక్టార్లకు చేరింది. గుజరాత్, రాజస్థాన్లలో ఎక్కువ సాగయిం ది. ఇక పత్తిసాగు విస్తీర్ణంపరంగా 30శాతంపెరిగి 24.70లక్షల హక్టార్లకు చేరింది. గత ఏడాది 19.07 లక్షల హెక్టార్లతోపోలిస్తే భారీవృద్ధి ఉంది. రాజ స్థాన్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువ సాగుచేసారు. ఈ వారంలోనే పదిలక్షల హెక్టార్లు పెరిగింది. ఇక పప్పుదినుసులపరంగా చూస్తే తొమ్మిది లక్షల హెక్టార్ల నుంచి 5.97 లక్షల హెక్టార్లకు తగ్గింది. పంజాబ్, ఉత్తరా ఖండ్ వరిసాగుపరంగా 0.75 లక్షల హెక్టార్లు పెరిగింది. 15.97లక్షల హెక్టార్ల నుంచి 16.70లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇక చక్కెర ఆయకట్టు కూడా స్వల్పంగా పెరిగింది. 44.82 లక్షల హెక్టార్ల నుంచి 47.52 లక్షల హెక్టార్లకు సాగు ఆయకట్టు పెరిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇక పప్పుదినుసులపరంగాచూస్తే కందులు 1.25 లక్షల హెక్టార్లు, మినుములు 1.15 లక్షల హెక్టార్లు, పెసలు 1.89 లక్షల హెక్టార్లు ఇతర పప్పుదినుసులు 1.66 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి.
తృణధాన్యాలపరంగా చూస్తే జొన్నలు 1.42లక్షల హెక్టార్లు, రాగులు 4.66 లక్షల హెక్టార్లు, రాగులు 1.12 లక్షల హెక్టార్లు, చిరుధాన్యాలు 1.078 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 9.44 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. ఇక నూనెగింజలపరంగాచూస్తే వేరెశెనగ 4.7లక్షల హెక్టార్లు, సోయాబీన్ 5.67లక్షల హెక్టార్లు పొద్దుతిరుగుడు 0.16లక్షల హెక్టార్లు, నువ్వులు 0.63 లక్షల హెక్టార్లు, ఆముదం 0.08 హెక్టార్లలో సాగయింది. ఇక చెరకు పరంగాచూస్తే 44.82 లక్షల హెక్టార్ల నుంచి 47.52 లక్షల హెక్టార్లకు పెరిగితే జనపనార, గోగునార వంటివి 6.91 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. మొత్తంగాచూస్తే 119.28 లక్షల హెక్టార్ల నుంచి 130.74 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరిగినట్లు అంచనా. గత ఏడాది కంటే 9.61శాతం ఆయకట్టు పెరిగింది. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఎన్టీఆర్ బయోపిక్ మూవీపై బాలయ్య క్లారిటీ
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీపై క్లారిటీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ.
TNN | Updated:
Feb 6, 2017, 03:01PM IST
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీపై క్లారిటీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. త్వరలోనే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీస్తానని అందులో ఎన్టీఆర్ పాత్రను నేనే పోషిస్తానంటూ నందమూరి అభిమానుల్లో జోష్ నింపారు.
నందమూరి తారక రామారావు స్వస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో 30 పడకల ప్రభుత్వాసుపత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌ సినిమాను ఎప్పటినుండో తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నానని, ఈ సినిమాకి దర్శకుడిగా ఇంకా ఎవర్నీ డిసైడ్ చేయలేదని త్వరలోనే అన్ని విషయాలను తెలియజేస్తానన్నారు. కేవలం ఎన్టీఆర్ బయోపిక్ మాత్రమే కాకుండా ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడానికి ప్రయత్నిస్తానన్నారు బాలయ్య. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
భారత్తో తొలి టెస్టుకి స్టెయిన్ దూరం
భారత్తో కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం
TNN | Updated:
Jan 7, 2018, 05:31PM IST
భారత్‌తో కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న డేల్ స్టెయిన్ .. పునరాగమనం చేసిన తొలి టెస్టులోనే మళ్లీ గాయపడ్డాడు. ఆటలో రెండో రోజైన శనివారం బౌలింగ్ చేస్తుండగా.. స్టెయిన్ ఎడమకాలి మడమకి గాయమైంది. దీంతో మైదానంలోనే కాసేపు ఇబ్బందిగా కదిలిన స్టెయిన్ అనంతరం ఓవర్ మధ్యలో బంతిని మరో ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్‌కిచ్చి డగౌట్‌కి వెళ్లిపోయాడు. స్టెయిన్‌ గాయానికి వైద్యులు స్కానింగ్ నిర్వహించారని.. గాయం తీవ్రతని త్వరలోనే వెల్లడించనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది.
తొలి టెస్టులో మొత్తం 17.3 ఓవర్లు వేసిన డేల్ స్టెయిన్ 51 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. గంటకి 140కి.మీ వేగంతో బంతులు విసిరే ఈ స్పీడ్‌స్టర్ బౌలింగ్‌లో ఆడేందుకు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చాలా ఇబ్బంది పడ్డాడు. స్టెయిన్ విసిరిన బౌన్సర్‌ని హిట్ చేసే ప్రయత్నంలో శిఖర్ ధావన్ అతనికే క్యాచ్‌ ఇచ్చి ఔటవగా.. సాహా పరుగుల ఖాతా తెరకుండానే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకి ఆలౌటవగా.. అంతకముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసింది. గాయం కారణంగా స్టెయిన్ జట్టుకి దూరమవడంతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇక ముగ్గురు పేసర్లతోనే సరిపెట్టుకోనుంది. | 2sports
|
Hyderabad, First Published 21, Sep 2018, 12:25 PM IST
Highlights
'సమ్మోహనం' చిత్రంతో హిట్ అందుకున్న తరువాత హీరో సుధీర్ బాబు నటించిన నూతన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ చిత్రంతో ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. ఈ కథ బాగా నచ్చడంతో సుధీర్ బాబు స్వయంగా నిర్మాతగా మారి సినిమాను తెరకెక్కించాడు.
నటీనటులు: సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు తదితరులు
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్: అజనీష్ బి లోకనాథ్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
నిర్మాత: సుధీర్ బాబు
స్టోరీ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: ఆర్.ఎస్.నాయుడు
'సమ్మోహనం' చిత్రంతో హిట్ అందుకున్న తరువాత హీరో సుధీర్ బాబు నటించిన నూతన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ చిత్రంతో ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. ఈ కథ బాగా నచ్చడంతో సుధీర్ బాబు స్వయంగా నిర్మాతగా మారి సినిమాను తెరకెక్కించాడు. విడుదలకు ముందు ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
కార్తిక్(సుధీర్ బాబు) హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మ్యానేజర్ గా పని చేస్తుంటాడు. అతడు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో.. తన కింద పనిచేసేవారు కూడా పని విషయంలో అలానే ఉండాలని కోరుకుంటాడు. దీంతో ఆఫీస్ లో అందరూ అతడిని విలన్ లా చూస్తుంటారు. ప్రమోషన్ సంపాదించి అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనేది కార్తిక్ లక్ష్యం. దానికోసం చాలా కష్టపడుతుంటాడు. ఫ్రెండ్స్, తిరగడం వంటి వ్యవహారాలకు అతడు చాలా దూరం. ఇంట్లో వాళ్లు కార్తిక్ కి తన మరదలితో పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఆ పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేకపోవడంతో కార్తిక్ తను సిరి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు, ఆమెనే పెళ్లి చేసుకుంటానని తన తండ్రి(నాజర్)కి చెబుతాడు. దీంతో సిరిని చూడడానికి హైదరాబాద్ వస్తున్నట్లు చెబుతారు.
లేని సిరిని ఎలా తీసుకురావాలో తెలియక మేఘన(నభా నటేశ్) అనే షార్ట్ ఫిలిం నటిని తన గర్ల్ ఫ్రెండ్ గా నటించడానికి డీల్ మాట్లాడతాడు. మొదట దీనికి అంగీకరించకపోయినా.. డబ్బు అవసరం ఉండడంతో మేఘన కూడా ఒప్పుకుంటుంది. ఆమె మాటలు ప్రవర్తన నచ్చడంతో కార్తిక్ కి ఆమె సరైన జోడి అని నమ్ముతాడు అతడి తండ్రి. రెండు రోజులు నటిస్తే చాలని అనుకున్న మేఘనకి సిరి అనే క్యారెక్టర్ ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఈ క్రమంలో కార్తిక్, మేఘన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు..? వీరు నిజంగా ప్రేమికులు కాదనే విషయం కార్తిక్ ఇంట్లో వాళ్లకి తెలుస్తుందా..? లేక వీరిద్దరూ నిజంగానే ఒకరినొకరు ఇష్టపడతారా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
కథగా చెప్పాలంటే మహా అయితే రెండు లైన్ల స్టోరీ ఇది. పెళ్లి నుండి తప్పించుకోవడానికి హీరో చెప్పిన అబద్ధం కారణంగా అతడి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే చిన్న పాయింట్ ని కథగా ఎన్నుకున్నాడు దర్శకుడు. ఆ కథకి హాస్యం జోడించి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాడు. అసలు అమ్మాయిలకే దూరంగా ఉండే హీరో.. హీరోయిన్ కోసం షార్ట్ ఫిలిమ్స్ లో నటించాలనుకోవడం, ఆమె కోసం తన సమయం మొత్తం కేటాయించడం వంటివి రొటీన్ అయినప్పటికీ తెరపై మాత్రం కొత్తగా ఆవిష్కరించారు. అప్పటివరకు సీరియస్ గా తన పని తాను చేసుకుంటూ ఉండే హీరో లైఫ్ లోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కలర్ ఫుల్ గా మారిపోతుంది. నటించడానికి వచ్చిన అమ్మాయి నిజంగానే హీరోతో ప్రేమలో పడిపోతుంది.
హీరోకి కూడా ఆమెపై ప్రేమ ఉన్నప్పటికీ చెప్పలేని పరిస్థితుల్లో ఆమెను దూరం చేసుకుంటాడు. ఇలాంటి సన్నివేశాలను ఎమోషనల్ గానే కాకుండా లైట్ వేలో చూపించడం బాగుంది. దీంతో హీరో చేసేది కరెక్టే కదా అని అనిపించకమానదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పిస్తుంది. సుధీర్ బాబు, నభా నటేశ్, వైవా హర్షల మధ్య చిత్రీకరించిన కామెడీ ఎపిసోడ్ సినిమాకే హైలైట్. 'బిస్కెట్' అనే షార్ట్ ఫిలింలో హీరోగా సుధీర్ ని ఎంపిక చేస్తే అతడు డైలాగ్ ని సరిగ్గా చెప్పలేక రకరకాల వెర్షన్స్ లో చెప్పడం ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ ఒక్క సీన్ కోసం సినిమా చూడొచ్చు. ఈ సన్నివేశంలో సుధీర్ బాబు నటన హిలారియస్.
అలానే హీరోతో.. శ్యామల అనే జూనియర్ ఆర్టిస్ట్ వేసే వేషాలు కూడా నవ్విస్తాయి. సీరియస్ లవ్ ట్రాక్ మాదిరి కాకుండా కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయడం బాగుంది. పరిస్థితుల కారణంగా ప్రేమ పుట్టినట్లు కాకుండా నిజంగా ఒకరినొకరు ఇష్టపడినట్లు చూపించారు. పతాక సన్నివేశాల్లో సుధీర్ బాబు, నాజర్ ల మధ్య ఎమోషన్ సరిగ్గా పండలేదు. అయితే ఆ తరువాత హీరోయిన్ పెళ్లి ఎపిసోడ్ పెడుతూ అక్కడ కూడా కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. కామెడీ లవ్ స్టోరీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం సంతృప్తినిస్తుంది. మరీ నిదానంగా నడిపించకుండా, మిడిల్ పార్ట్ని మరీ అంత రొటీన్గా మలచకుండా వున్నట్టయితే సినిమా సూపర్ హిట్ అయ్యేది కానీ ఇప్పటికి దీనికున్న ఆకర్షణలతో ఒకసారి నిక్షేపంగా చూసి రావచ్చు. నవ్వించే హాస్యానికి తోడు మెప్పించే అనుభూతులకి కూడా ఇందులో లోటు లేదు.
సుధీర్బాబు నటుడిగా ఎంత పరిణితి చెందాడనేది తెలియడానికి ఇందులో చాలానే సన్నివేశాలున్నాయి. కామెడీ, ఎమోషన్, లవ్ ఇలా చాలా సన్నివేశాల్లో చక్కటి నటన కనబరిచారు. హీరోయిన్ నభా నటేశ్ తెరపై అల్లరి చేస్తూ బొమ్మరిల్లులో జెనీలియాని గుర్తు చేసింది. ఆమె నటనతో ఆడియన్స్ ని మెప్పించింది. నాజర్, తులసి తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి వెన్నెముక అయ్యారు. అజనీష్ బి లోకనాథ్ సంగీతం ఈ చిత్రానికే ప్రధానాకర్షణ కాగా, సురేష్ రగుతు ఛాయాగ్రహణం కథలోని ఛార్మ్ని ఫ్రేమ్స్లో నింపగలిగింది. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ వహించాల్సి వుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా మొదటి సినిమా అయినప్పటికీ ఆర్.ఎస్.నాయుడు తన ప్రతిభతో సక్సెస్ అందుకున్నాడు.
రేటింగ్: 2.75/5 | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కటక్ టీ20లో ధోనీ ప్రపంచ రికార్డు..!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కటక్ వేదికగా శ్రీలంకతో బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో రెండు
TNN | Updated:
Dec 21, 2017, 09:14AM IST
కటక్ టీ20లో ధోనీ ప్రపంచ రికార్డు..!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కటక్ వేదికగా శ్రీలంకతో బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకుని, కళ్లు చెదిరే రీతిలో రెండు స్టంపౌట్‌‌లు చేసిన ధోనీ.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్‌ కీపర్/ ఫీల్డర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మ్యాచ్‌కి ముందు 68 ఔట్లతో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ (72) కంటే వెనకబడి ఉన్న ధోనీ.. మ్యాచ్‌ ముగిసే సమయానికి 74తో నెం.1గా నిలిచాడు.
ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్ వేసిన మణికట్టు స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో ఉపుల్ తరంగ క్యాచ్‌ని అందుకోవడంతో జోరు ఆరంభించిన ధోనీ.. వరుస ఓవర్లలో గుణరత్నె, తిసార పెరీరా‌లను స్టంపౌట్‌ల రూపంలో పెవిలియన్‌కి పంపాడు. ఈ రెండు స్టంపౌట్స్‌ చాహల్ బౌలింగ్‌లోనే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు 93 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyderabad, First Published 3, Sep 2019, 4:47 PM IST
Highlights
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు RRR సినిమాలో అలియా పాత్ర చాలా చిన్నగా ఉంటుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో చెప్పింది. మీడియా వారు ఆమె పాత్ర గురించి, సినిమాలో ఆ పాత్ర ప్రాముఖ్యత, హీరోలతో సమానంగా క్యారక్టర్ లెంగ్త్ ఉంటుందా ప్రస్తావించినప్పుడు ఆ విషయం బయిటకు వచ్చింది.
ఎన్నో ఎక్సపెక్టేషన్స్ మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్నతాజా చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలాగే 'ఆర్.ఆర్.ఆర్'లో చెర్రీ సతీమణిగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె పాత్ర గురించి రకరకాల టాక్స్ వినపడుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ అయితే తెగ ఎగ్జైట్ అవుతున్నారు. కానీ అంత సీన్ ఏమీ లేదని, సినిమాలో అంత పెద్ద పాత్రమీ కాదని మీడియా వర్గాల సమాచారం.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా చిన్నగా ఉంటుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో చెప్పింది. మీడియా వారు ఆమె పాత్ర గురించి, సినిమాలో ఆ పాత్ర ప్రాముఖ్యత, హీరోలతో సమానంగా క్యారక్టర్ లెంగ్త్ ఉంటుందా ప్రస్తావించినప్పుడు ఆ విషయం బయిటకు వచ్చింది.
అలియా మాట్లాడుతూ...నాకు ఇద్దరి దర్శకత్వంలో చేయాలనేది కల, వారిలో ఒకరు రాజమౌళి, మరొకరు సంజయ్ లీలా భన్సాలీ. వాళ్లద్దరూ నా డ్రీమ్ డైరక్టర్స్. ఆర్ ఆర్ ఆర్ తో నా ఒక కోరిక తీరుతోంది. ఇలాంటప్పుడు నేను నా పాత్ర లెంగ్త్ ఎంతనేది ఎప్పుడూ పట్టించుకోను అంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని అని చెప్పుకొచ్చింది ఆలియా భట్. ఇది విన్న మీడియా వారు గస్ట్ కన్నా కొద్దిగా పెద్ద క్యారక్టర్ అని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
అలాగే ఈ సినిమాపై ఎంత ప్రేమ పెంచుకుందంటే...తెలుగు నేర్చుకోవడానికి ఆలియా ట్యూటర్ను నియమించుకున్నారు. ఈ విషయం గురించి ఆలియా ఓ మీడియా తో మాట్లాడుతూ.. ‘తెలుగు నేర్చుకోవడం నాకో ఛాలెంజ్ అనే చెప్పాలి. భాష నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ అన్ని భావాలను పండించగలిగే చక్కని భాష ఇది. ఆ పదాన్ని అలా ఎందుకు పలుకుతారు? ఇలా ఎందుకు అంటారు?వాటి అర్థమేంటి?వంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను.
అప్పుడే నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలను. ఈ సినిమాను ఒప్పుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే ముగ్గురు దర్శకులతో తప్పకుండా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. వారిలో కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి ఉన్నారు. కరణ్ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు భన్సాలీ, రాజమౌళి సర్లతో పనిచేస్తున్నాను’ అని వెల్లడించారు ఆలియా.
భారీ బడ్జెట్తో నిర్మాత డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. 2020 జులై 30 ‘ఆర్ ఆర్ ఆర్’ అన్ని భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated 3, Sep 2019, 4:47 PM IST | 0business
|
Hyderabad, First Published 22, Mar 2019, 8:56 PM IST
Highlights
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ పత్రాలకు జత చేసిన అఫిడవిట్ లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆయన గురువారంనాడు గాజువాక శాసనసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ పత్రాలకు జత చేసిన అఫిడవిట్ లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆయన గురువారంనాడు గాజువాక శాసనసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
నామినేషన్ పత్రాలకు జత చేసిన ఎన్నికల అఫిడవిట్లో పవన్ తన ఆస్తులు, అప్పుల గురించి తెలియజేశారు. తన అన్నయ్య భార్య సురేఖకు కోటి రూపాయలు బాకీ పడ్డట్టు ఆయన తెలిపారు. అదే విధంగా దర్శకుడు త్రివిక్రమ్కు రూ.2.4 కోట్లు అప్పు కట్టాల్సి ఉన్నట్లు అఫిడవిట్లో పవన్ తెలిపారు.
తనకున్న మొత్తం అప్పు రూ.33 కోట్లుగా జనసేన అధినేత వెల్లడించారు. స్థిర, చరాస్థులు కలిపి మొత్తం తన ఆస్తి రూ.52కోట్లుగా పవన్ కల్యాణ్ చెప్పారు. తనకు ఐదు ఖరీదైన కార్లు ఉన్నట్లు పవన్ తెలిపారు.
కోటి రూపాయల ఖరీదైన వోల్వో ఎక్స్సీ 90, 72లక్షల విలువైన మెర్సెడ్స్ బెంజ్ ఆర్ కారు, టయోటా ఫార్చునర్, స్కోడా ర్యాపిడ్, మహీంద్ర స్కార్పియో కార్లు, 32లక్షల ఖరీదైన హార్లీడేవిడ్సన్ హెరిటేజ్ సాఫ్టైల్ బైక్ ఉన్నట్లు ఆయన అఫిడవిట్లో తెలిపారు.
అలాగే సినీ ప్రొడక్షన్ హౌస్ ల నుంచి సినీ ప్రముఖుల నుంచి పవన్ చేసిన అప్పులు విధంగా ఉన్నాయి.
హారిక హాసిని ప్రొడక్షన్స్: 1.25కోట్లు
M ప్రవీణ్ కుమార్ - 3కోట్లు
MVRS ప్రసాద్: 2 కోట్లు
శ్రీ బాలాజీ సినీ చిత్ర మీడియా: 2 కోట్లు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్: 0.27కోట్లు
వై.నవీన్ కుమార్ - 5.50కోట్లు | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వైడ్ బాల్ని వెంటాడి.. ధావన్ ఔట్..!
శ్రీలంకతో కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్
TNN | Updated:
Aug 31, 2017, 03:05PM IST
శ్రీలంకతో కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ (4) ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నాడు. సిరీస్ మొదట నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న ధావన్.. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్ వేసిన విశ్వ బౌలింగ్‌‌లో వైడ్ రూపంలో వెళ్తున్న బంతిని వెంటాడి బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ పుష్పకుమార చేతికి చిక్కాడు. దీంతో భారత్ 6 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది.
ఆఫ్‌ స్టంప్‌కి దూరంగా వెళ్తున్న బంతిని.. థర్డ్ మ్యాన్ దిశగా తరలించేందుకు ధావన్ ప్రయత్నించాడు. అయితే.. విశ్వ బంతికి ఔట్‌ స్వింగ్‌ కూడా జోడించడంతో ధావన్‌ బంతిని సరిగా బ్యాట్‌కి మిడిల్ చేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి.. థర్డ్ మ్యాన్‌ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న పుష్పకుమార ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా క్యాచ్ అందుకున్నాడు. ధావన్ వికెట్ అనంతరం విశ్వ.. బిగ్గరగా అరుస్తూ మైదానంలో సంబరాలు చేసుకున్నాడు. | 2sports
|
Read Also: Bigg Boss రాహుల్ బూతు పురాణం.. వైరల్ అవుతున్న వీడియో
కంటెస్టెంట్స్కి ర్యాంప్ వాక్.. 10 వేల గిఫ్ట్
నేటి టాస్క్లో భాగంగా కంటెస్టెంట్స్కి KLM ఫ్యాషన్స్ వాళ్లు ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి మిస్టర్ అండ్ మిస్ బిగ్ బాస్ హౌస్గా నిలిచిన వాళ్లకు KLM ఫ్యాషన్స్ తరుపున పదివేల గిఫ్ట్ ఓచర్ ప్రకటించారు బిగ్ బాస్.
అయితే ఈ ఫ్యాషన్ షోలో పెర్ఫామెన్స్ పక్కన పెట్టేసి తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్ను విజేతలుగా ప్రకటించుకున్నారు. పురుషుల్లో అలీ, వరుణ్, బాబా, రాహుల్లు పెర్ఫామ్ చేయగా.. వీళ్లలో అలీ, వరుణ్లు స్టైలిష్ లుక్లో ఆకట్టుకున్నారు. అయితే వీళ్లలో విజేతను ప్రకటించేది మహిళను కాబట్టి ఈ ఇద్దర్నీ కాకుండా తమకు ఇష్టమైన బాబా భాస్కర్ని మిస్టర్ కేఎల్ఎమ్ ఫ్యాషన్గా ఎంపిక చేశారు.
ఇక మహిళల్లో శ్రీముఖి మంచి పెర్ఫామెన్స్ ఇవ్వగా.. శివజ్యోతిని విన్నర్గా ప్రకటించి ఆమెను మిస్ కేఎల్ఎమ్ ఫ్యాషన్గా ఎంపిక చేశారు బాబా, అలీ, రాహుల్, వరుణ్లు. మొత్తంగా ఈ టాస్క్లో బాబా, శివజ్యోతిలు మిస్ అండ్ మిస్టర్ కేఎల్ఎమ్ ఫ్యాషన్గా నిలిచి పదేసి వేల చొప్పున గిఫ్ట్ను అందుకున్నారు.
పబ్లిక్ టాక్: శ్రీముఖి ఓవరాక్షన్.. రాహులే విన్నర్
X
నామినేషన్స్లో ఉన్న వాళ్లకు చుక్కలు చూపిస్తున్న బిగ్ బాస్
ఈవారం నామినేషన్స్లో ఉన్న శ్రీముఖి, అలీ, బాబా భాస్కర్, వరుణ్, శివజ్యోతిలకు ఫైనల్ వార్లో మజా చూపిస్తున్నారు బిగ్ బాస్ అర్ధరాత్రి పూట సైరన్ను మోగించి.. ఈ ఐదుగుర్ని బ్యాగ్లు సర్ది గార్డెన్ ఏరియాలోకి రావాల్సిందిగా ఆదేశించారు బిగ్ బాస్. దీంతో షాకైన కంటెస్టెంట్స్ శని, ఆదివారాల్లో కదా ఎలిమినేట్ చేసేది ఎప్పుడేంటి? అనుకుంటూ భారంగా బ్యాగ్లు సర్ధి గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ పై జోక్లు పేల్చారు బాబా. ఎందుకు ఇప్పుడు బ్యాగ్లు సర్ధమంటున్నారని వరుణ్ అడిగితే బయటకు పిలిచి ఆటోకి డబ్బులు ఇస్తారంట అన్నాడు. మరి మీకేం కావాలి అంటే.. ఫ్లైట్ టికెట్తో పాటు ఓ పది లక్షలు ఇస్తే హ్యాపీగా బయటకు వెళిపోతా అన్నాడు. మరి ఓ బిర్యానీ ప్యాకెట్, మందు బాటిల్ వద్దా అని వరుణ్ పంచ్ వేస్తే.. ఇంత ఉదయాన్నే వద్దులే అంటూ జోక్లు పేల్చారు.
బ్యాగ్లు సర్దేసిన కంటెస్టెంట్స్.. ఎమోషనల్గా బిగ్ బాస్ జర్నీ
అనంతరం గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ నిర్ధేశించిన స్థలాలో నిలబడి బిగ్ బాస్ హౌస్లో వాళ్ల జర్నీ గురించి చెప్పమని ఆదేశించారు బిగ్ బాస్. మీరు బిగ్ బాస్ ఫైనల్ చేరడం అనేది ఆడియన్స్ చేతిలో ఉంది. హౌస్లో చివరిసారిగా మీ తోటి కంటెస్టెంట్స్ చెప్పుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. మీరు బిగ్ బాస్ హౌస్కి రావడం ద్వారా ఎలాంటి అనుభవాలను పొందుకున్నారు. ఇక్కడకు వచ్చి మీరు ఏం నేర్చుకున్నారు? ఇక్కడ నుండి మీరే ఇంటి తీసుకుని వెళ్తున్న గొప్ప అనుభవాలను షేర్ చేయాలని కోరారు బిగ్ బాస్. దీంతో ఒక్కొక్కరూ తమ తమ జర్నీని ఎమోషనల్గా షేర్ చేసుకున్నారు.
బిగ్ బాస్
ఫైనల్లో బాబా భాస్కర్.. రక్షించిన ప్రేక్షకులు
వరుణ్, శ్రీముఖి, అలీ, శివజ్యోతి, బాబాలు తమ బిగ్ బాస్ జర్నీని గురించి తెలియజేస్తూ ఎమోషన్ అయ్యారు. అయితే వారి వారి జర్నీ చెప్పడం ముగిసిన తరువాత అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఈవారం నామినేషన్స్లో ఉన్న బాబా భాస్కర్ని ప్రేక్షకులు తమ ఓట్లు ద్వారా రక్షించారని అతన్ని సేవ్ చేస్తూ టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్గా ప్రకటించారు. అనంతరం కన్ఫెషన్ రూంకి పిలిచి బాబాకి టికెట్ టు ఫినాలేను అందించారు బిగ్ బాస్. దీంతో ఈ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ తనను గెలిపించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ.. టికెట్ టు ఫినాలేను ఆడియన్స్ని డెడికేట్ చేశారు బాబా భాస్కర్. అనంతరం తన టికెట్ టు ఫినాలే మెమెంటోను డైరెక్ట్గా తీసుకుని వెళ్లి శ్రీముఖి చేతులో పెట్టారు బాబా. బిగ్ బాస్ దీన్ని నీకు ఇవ్వమన్నారు అంటూ ఆటపట్టించారు. ఇవీ నేటి ఎపిసోడ్ హైలైట్స్ మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.
బిగ్ బాస్ ఫైనల్లో బాబా భాస్కర్ | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
దక్షిణాఫ్రికా గడ్డపై శ్రీలంక చారిత్రక విజయం
తొలి ఇన్నింగ్స్లో 68 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్లో పేలవంగా విఫలమైంది. ఆ జట్టులో కెప్టెన్ డుప్లెసిస్ (50 నాటౌట్: 70 బంతుల్లో 7x4) అజేయ అర్ధశతకంతో క్రీజులో నిలిచినా.. అతనికి సహకరించే వారే కరవయ్యారు. దీంతో.. ఆ జట్టు 128 పరుగులకే ఆలౌటైంది.
Samayam Telugu | Updated:
Feb 23, 2019, 06:55PM IST
దక్షిణాఫ్రికా గడ్డపై శ్రీలంక చారిత్రక విజయం
హైలైట్స్
దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన శ్రీలంక జట్టు
మూడు రోజుల్లోనే ముగిసిన టెస్టు మ్యాచ్
197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేసిన లంకేయులు
సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా శ్రీలంక రికార్డ్
దక్షిణాఫ్రికా గడ్డపై శ్రీలంక జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. పోర్ట్ ఎలిజబిత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న శ్రీలంక జట్టు రెండు టెస్టుల సిరీస్ని 2-0తో చేజిక్కించుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఓ ఆసియా జట్టు టెస్టు సిరీస్ గెలుపొందడం ఇదే తొలిసారి. గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో శ్రీలంక ఒక వికెట్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే..!
గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్లో 222 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో డికాక్ (86:87 బంతుల్లో 12x4), మకరమ్ (60: 116 బంతుల్లో 9x4) అర్ధశతకాలు సాధించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక జట్టు పేలవంగా 154 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 68 పరుగుల ఆధిక్యం సఫారీలకి లభించింది.
తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం లభించినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్లో పేలవంగా విఫలమైంది. ఆ జట్టులో కెప్టెన్ డుప్లెసిస్ (50 నాటౌట్: 70 బంతుల్లో 7x4) అజేయ అర్ధశతకంతో క్రీజులో నిలిచినా.. అతనికి సహకరించే వారే కరవయ్యారు. దీంతో.. ఆ జట్టు 128 పరుగులకే ఆలౌటైంది.
197 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. ఫెర్నాండో (75 నాటౌట్: 106 బంతుల్లో 10x4, 2x6), కుశాల్ మెండిస్ (84 నాటౌట్: 110 బంతుల్లో 13x4) అజేయ అర్ధశతకాలు సాధించడంతో 45.4 ఓవర్లోనే 197/2తో విజయాన్ని అందుకుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
33,000కు దిగువన సెన్సెక్స్
దేశంలో ఒక పక్క రాజకీయంగా వేడెక్కిన వాతావరణం, మరో వైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ప్రతికూలంగా సాగింది.
| Updated:
Mar 19, 2018, 04:05PM IST
దేశంలో ఒక ప‌క్క రాజకీయంగా వేడెక్కిన వాతావ‌ర‌ణం, మ‌రో వైపు యూఎస్ ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ పాల‌సీ స‌మీక్ష నేప‌థ్యంలో నేటి ట్రేడింగ్ ప్ర‌తికూలంగా సాగింది. దీంతో అన్ని రంగాల్లోనూ అమ్మ‌కాల ఒత్తిడి కొన‌సాగింది. లోహం, వినియోగ‌దారు వ‌స్తువులు, బ్యాంకింగ్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో అధికంగా అమ్మకాల జోరు సాగింది. మార్కెట్లు ముగిసే స‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ 253 పాయింట్లు దిగ‌జారి 32,923 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిఫ్టీ 101 పాయింట్లు కోల్పోయి 10,094 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఈ రోజు ట్రేడింగ్ స‌మ‌యంలో టాటా స్టీల్, హెచ్సీఎల్ 4 శాతం మేర న‌ష్ట‌పోయాయి. టాటా స్టీల్, ఎస్బీఐ షేర్ల అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం సెన్సెక్స్ ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేలా చేసింది. ఎల్ అండ్ టీ సైతం ఇందుకు మ‌రింత దోహ‌దం చేసింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డ్డ‌, న‌ష్ట‌పోయిన కంపెనీల వివ‌రాలు ఇలా ఉన్నాయి. లాభ‌ప‌డిన వాటిలో ప‌వ‌ర్ గ్రిడ్(1.12%), ఎన్టీపీసీ(1.03%), ఎల్ అండ్ టీ(0.95%), మారుతి(0.80%), హిందుస్తాన్ యూనిలీవ‌ర్(0.69%), టీసీఎస్(0.12%) ముందుండ‌గా, మ‌రో వైపు టాటా స్టీల్(4.24%), భార‌తీ ఎయిర్టెల్(4.16%), విప్రో(2.60%), యెస్ బ్యాంక్(2.57%), కోల్ ఇండియా(2.51%), ఇన్ఫీ(2.16%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి. | 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.