news
stringlengths
299
12.4k
class
class label
3 classes
డర్టీ పిక్చర్ ను మించేలా షకీలా బయోపిక్. ఒకే చేసిన హాట్ హీరోయిన్ Highlights సౌత్ ఇండియాని మొత్తం ఒక ఊపు ఊపిన శృంగార తార షకీలా ఆమె జీవితంపై కూడా బయోపిక్ కు వస్తుంది శృంగార తారగా షకిలా క్రేజ్ స్టార్ హీరోలను మించింది                                                                   సౌత్ ఇండియాని మొత్తం ఒక ఊపు ఊపిన శృంగార తార షకీలా జీవితంపై కూడా బయోపిక్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. 90లో తెలుగు, తమిళం, మలయాళం భాషలో షకీలా పలు అడల్ట్ చిత్రాలలో నటించింది. శృంగార తారగా షకిలా క్రేజ్ స్టార్ హీరోలను మించింది. షకీలా జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. షకీలా పాత్రలో నటించడానికి బాలీవుడ్ హాట్ భామ రిచా చద్దా సై అన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.  16 ఏళ్ల నుంచే సినీరంగ ప్రవేశం చేసిన షకీలా శృంగార తారగా ఎదిగిన వైనాన్ని సినిమాగా చూపించబోతున్నారు.ఈ చిత్రంలో షకీలా పాత్రలో నటించడానికి రిచా చద్దా సై అనేసింది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో కుర్ర కారుని హీటెక్కించడం ఈ అమ్మడికి అలవాటే. పలు కమర్షియల్ చిత్రాలలో సైతం షకీలా నటించింది. సిల్క్ స్మిత జీవిత గాధగా వచ్చిన డర్టీ పిక్చర్ ఎంతటి ఘనవిజయం సాదించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రంలో విద్యాబాలన్ బోల్డ్ పెర్ఫామెన్స్ కు ప్రశంసలతో పాటు రివార్డులు కూడా దక్కాయి. ఈ చిత్రానికి ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించనున్నాడు.ఏప్రిల్ లో చిత్రీకరణ ప్రారంభించి వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. Last Updated 25, Mar 2018, 11:58 PM IST
0business
Visit Site Recommended byColombia తాజాగా ఈయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో మరో వివాదాస్పద సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టిన తదనంతర పరిణామాలను వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ‌లుక్‌ను 2017 సెప్టెంబర్‌లో విడుదల చేసిన వర్మ.. తాజాగా అక్టోబర్ 19న తిరుపతిలో ఈ సినిమాకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. ఇక ఈ సినిమా పాత్రల అన్వేషణ కోసం వర్మ సోషల్ మీడియాను విరివిగా వాడేస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును పోలిన వ్యక్తి ఓ హోటల్‌లో పనిచేస్తూ ఉన్న వీడియో వర్మ కంట పడటంతో ఈ వ్యక్తిని పట్టి ఇచ్చిన వారికి రూ. 1లక్ష నజరానా ప్రకటించారు. వర్మ ప్రకటించారో లేదో.. నెటిజన్లు డూప్ సీఎం కోసం వెతుకలాట మొదలుపెట్టారు. చివరికి రోహిత్ అనే యువకుడు చంద్రబాబుని పోలిన వ్యక్తిని వెతికిపట్టడంతో ఆయన అకౌంట్‌లో రూ.లక్ష జమా చేస్తున్నట్టు బ్యాంక్ అకౌండ్ వివరాలను అడిగితెలుసుకున్నారు వర్మ. ఈ వెతుకులాట పద్దతి బాగా వర్కౌట్ కావడంతో ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు వర్మ. ఈ సినిమాలో కీలకమైన ఎన్టీఆర్ పాత్ర కోసం ముగ్గుర్ని షార్ట్ లిస్ట్ చేశానని.. అయితే తనకు ఇంకా ఉత్తమమైన వ్యక్తి కావాలన్నారు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని కలిసినప్పుడు ఎలా ఉండేవారో.. అదే వయసున్న వ్యక్తి తనకు కావాలన్నారు. ఎన్టీఆర్ పోలికలతో ఉండి ఆయనలా మాట్లాడే వ్యక్తి కనపడితే వీడియోను [email protected]కు పంపాలన్నారు వర్మ. తాను వెతికే వ్యక్తిని అందించిన వారికి రూ.10 లక్షలు బహుమతి ఇస్తానంటూ ప్రకటించారు వర్మ. మరి వర్మ కోరినట్టు ఎన్టీఆర్ పోలికలతో ఉన్న వ్యక్తిని పట్టిచ్చి రూ. 10 లక్షల్ని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. 3 actors short listed for NTR but i want very best..Open offer is to get NTR look alike at age he met Lakshmi ..any… https://t.co/beS1Gl48hv — Ram Gopal Varma (@RGVzoomin) 1539620846000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆ కాళ్లు కట్టప్పవి బ్రహ్మోత్సవం పోస్టర్ ఒకటి విడుదలవ్వగానే అందరూ దాని గురించి చర్చించుకున్నారు. TNN | Updated: Apr 14, 2016, 08:53AM IST బ్రహ్మోత్సవం పోస్టర్ ఒకటి విడుదలవ్వగానే అందరూ దాని గురించి చర్చించుకున్నారు. ఆ పోస్టర్లో మహేష్ బాబు ఓ వ్యక్తికి చెప్పులు తొడుగుతున్నట్టు ఉంది. టాప్ హీరో చేత చెప్పులు తొడిగించుకుంటున్న ఆ వ్యక్తి ఎవరా అని కొన్ని రోజులు చర్చలు జరిగాయి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. బాహుబలి సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న కట్టప్ప కాళ్లే అవి. అవును నటుడు సత్యరాజ్ బ్రహ్మోత్సవం సినిమాలోనూ నటిస్తున్నారు. అతను ప్రిన్స్‌కి తండ్రిగా నటిస్తున్నారు. అందుకే మహేష్ కట్టప్ప కాళ్లకి చెప్పులు తొడిగే సీన్ పెట్టారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత మహేష్ - శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
0business
"నిన్నుకోరి" మూవీ రివ్యూ.. ఇదోరకం ప్రేమ సంఘర్షణ Highlights తారాగణం : నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్, మురళీ శర్మ, పృథ్వీ సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : శివ నిర్వాణ ఆసియానెట్ రేటింగ్-2.5/5 కథ : ఉమా మహేశ్వరరావు (నాని), వైజాగ్ ఆంధ్రయూనివర్సిటీలో పి.హెచ్.డీ చేసే అనాథ కుర్రాడు. ప్రొఫెసర్ మూర్తి సాయంతో చదువుకునే ఉమా.. గీతమ్స్ కాలేజ్ లో చదువుకునే పల్లవి(నివేదా థామస్) తో ప్రేమలో పడతాడు. పల్లవి ఇంట్లోనే పెంట్ హౌస్ లో అద్దెకు దిగుతాడు. కెరీర్‌ కోసం ఢిల్లీ వెళ్ళానుకున్న సమయంలో లేచిపోదామని నానిని ఒత్తిడి చేస్తుంది పల్లవి. ఆమె తండ్రి తత్త్వం తెలిసి తాను ఢిల్లీ వెళ్లొచ్చి సెటిలయ్యాకే పెళ్లి చేసుకుంటానంటాడు. పల్లవి తండ్రి(మురళీ శర్మ) జీవితంలో సెటిల్ అవ్వని వాళ్లకు ఏ తండ్రీ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడు అని చెప్పిన మాటలతో.. ఎలాగైన జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని పల్లవిని ఓప్పించే ప్రయత్నం చేస్తాడు. తన కెరీర్ లో సెటిలవడం కోసం ఉమా పిహెచ్డీ చదువుకు ఢిల్లీ వెళ్లిపోతాడు. అనంతరం పల్లవి తన పేరెంట్స్ చూసిన అరుణ్ (ఆది పినిశెట్టి)ని పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అవుతుంది. ఏడాది తర్వాత తిరిగి వచ్చిన నానికి విషయం తెలిసి.. దేవదాసులా మారతాడు. విషయం గ్రహించిన నాని గురువు భరణి.. నానికి లండన్‌లో ఓ ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. ఈ విషయాన్ని పల్లవికి చెబుతాడు. ఆ తర్వాత ఆమె నానిని కలుస్తుంది. అంతా మరిచిపోయి హాయిగా జీవిస్తున్న పల్లవి జీవితంలోకి ఉమా ఎలా తిరిగొచ్చాడు..? పల్లవి దూరమయ్యాక ఉమా ఏమయ్యాడు..? ఉమాని తిరిగి కలిశాక పల్లవి అరుణ్‑కు దూరమైందా..? లేక ఉమానే పల్లవికి దూరమయ్యాడా...? అన్నదే మిగతా కథ.  విశ్లేషణ : ఓ ప్రేమికుడు.. పెళ్ళయిన తన ప్రేయసి సుఖంగా వుందా! లేదా! అనేది తెలియాలంటే పదిరోజులు ఆమె ఇంట్లో వుంటే సరిపోతుందనే కాన్సెప్ట్‌ ను దర్శకుడు శివ ఎంచుకున్నాడు. ఇలాంటి కథలో పాత్రల మధ్య జరిగేస సంఘర్షణ ఇలానే వుండాలని అనిపించినా అది జడ్జ్ చేయడం కష్టం. అందునా ఈ కథ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుంది. విదేశాల్లో మైండ్ సెట్ కు, లోకల్ మైండ్ సెట్ కు మధ్య సంఘర్షణ కూడా వేరు. మొదటి భాగంలో కొంత వైజాగ్‌లో హీరోహారోయిన్ల లవ్‌ ట్రాక్‌ నడిపి ఆ తర్వాత విదేశాల్లోకి వెళుతుంది. పిల్ల తండ్రిగా మురళీశర్మ పడే తపన ప్రతి తెలుగువాడు పడేదే. అయితే తన కూతుర్ని విదేశాలకు పంపాక అక్కడ విచిత్రంగా అనిపిస్తుంది. అక్కడ కల్చర్‌ అంతా రివర్స్‌.  ఇలా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను మరిచి పాశ్చాత్య కల్చర్‌ ఎలా కొనసాగుతుందో చూపించాడు. ఇదంతా అక్కడి వారికి బాగానే వుంటుంది. కానీ ఇప్పటికే పాశ్చాత్య కల్చర్‌ మనవారిని పాడుచేస్తున్న తరుణంలో.. సినిమా పరంగా నిన్నుకోరి మరో ముందడుగు వేసిందనడంలో సందేహమే లేదు. ఏది ఏమైనా.. చిత్రంలో ఏడాదిపాటు ప్రేమించిన పల్లవి... తాను పెండ్లి చేసుకుంటున్నాననే విషయాన్ని నానికి ఆ తర్వాత కూడా చెప్పకపోవడం చిత్రమే. పదిరోజుల పాటు తన ఇంట్లో ఉండమని ఆహ్వానించడం చిత్రంగా అనిపిస్తుంది. దీనికి ఆమె భర్త ఆది కూడా.. అంగీకరిస్తాడు. సినిమాని సినిమాలాగా చూడాలి కానీ.. అనే కౌంటర్ ఇవ్వచ్చనే ధీమాతో ఇలా కానిచ్చేశారు. అయితే చివర్లో ఆది.. తాను ప్రేమించిన జెన్నీ అనే అమ్మాయి.. ఆత్మహత్య చేసుకుందనీ.. అలా నువ్వు చేసుకోకూడదనే నిన్ను ఇంటికి రమ్మన్నానని ఆది.. నానితో చెప్పడం చూస్తే.. అన్నిటికన్నా మిన్నగా ప్రాణం విలువను గుర్తించే ఆది కేరక్టర్... ప్రేమించిన అమ్మాయిల మొగుళ్లంతా ప్రాణాలను గౌరవిస్తే.. మాట్లాడుకుని కాంప్రమైజ్ చేసుకుంటే.. ఓ అండస్టాండింగ్ కు వస్తే... అసలు హింస అనే పదమే వుండదేమో అనిపిస్తుంది. మొత్తానికి రకరకాల సన్నివేశాలు కలిపి..  ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు.. పెండ్లయ్యాక కూడా వేరే పార్ట్ నర్ వున్నా మళ్లీ ప్రేమించుకోవచ్చని చాలా గొప్ప నీతిని బోధించారు. ఇది తెలుగువారి సంస్కృతీ,సంప్రదాయాలను పక్కనబెట్టి ఒళ్లు బలిసి కొట్టుకునే వారి కోసం తీసిన సినిమాలా అనిపిస్తుంది. నటీనటులు : నేచురల్ స్టార్ నాని నటుడిగా మరోసారి తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తన స్టైల్ అల్లరి సీన్స్ గిలిగింతలు పెట్టిన నాని, చాలా సీన్స్ లో ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు. విలన్ లేని సినిమాలో అక్కడక్కడే తానే విలన్ బాధ్యత తీసుకొని కథను ముందుకు నడిపించాడు. మరో హీరో ఆది ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తక్కువ మాటలతో సెటిల్ ఫర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఆది నటన సూపర్బ్. హీరోగా నివేదా బెస్ట్ చాయిస్ అనిపించుకుంది. ఇప్పటికే జెంటిల్‑మేన్ సినిమాతో నానికి జోడిగా నటించిన నివేదా మరోసారి మంచి కెమిస్ట్రీతో అలరించింది. ఫస్ట్ హాఫ్ లో అల్లరి అమ్మాయిగా కనిపించిన నివేదా, సెకండ్ హాఫ్ లో హుందాగా కనిపించి మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ లో నివేదా నటన ప్రతీ ఒక్కరి గుండె బరువెక్కిస్తుంది. తండ్రి పాత్రలో మురళి శర్మ మరోసారి ఆకట్టుకోగా, తనికెళ్ల భరణి, పృథ్వి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : తొలి సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ అందరి దృష్టిని ఆకర్షించాడు. కథా ,కథనాలను అతను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ ట్రయాంగులర్ లవ్ స్టోరిని మూడు గంటలపాటు కదల కుండా కూర్చో బెట్టే ఎమోషనల్ జర్నీగా మార్చటంలో శివ సక్సెస్ సాధించాడు. సినిమా అంతా ఎంతో జాగ్రత్తగా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ మాత్రం హడావిడిగా ముగించినట్టుగా అనిపించింది. కాకుంటే కథ మన కల్చర్ కు పూర్తి విరుద్ధంగా వుండటం ఆలోచించాల్సిన అంశం. ఈ సినిమాకు సహ నిర్మాతగాను వ్యవహరించిన కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే సినిమా స్థాయిని పెంచింది. దర్శకుడు శివతో కలిసి కోన అందించిన మాటలు సినిమాకు మరో ఎసెట్. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి, వైజాగ్ అందాలతో పాటు ఫారిన్ లోకేషన్స్ ను అద్భుతంగా చూపించాడు కార్తీక్. గోపిసుందర్ సంగీతం ప్రతీ సీన్‑లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే చేసింది. సంగీతపరంగా శేఖర్‌ చంద్ర బాణీలు పర్వాలేదు. కానీ రీరికార్డింగ్‌ మరీ దారుణంగా వుంది. ప్రతి సీన్‌కు బ్యాక్‌గ్రౌడ్‌ డిస్టబ్‌గా వుంది. కెమెరా పనితనం ఓకే. ప్లస్ పాయింట్స్ :
0business
RBI కార్పొరేట్‌, ఇన్వెస్టర్లకు ఝలక్‌ ముంబై, డిసెంబరు 7: కార్పొరేట్‌ రంగం, ఆర్థికనిపుణులు, ఇన్వె స్టర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన తరుణంలో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ అందరికీ షాక్‌ ఇచ్చారు. రెపోరేట్లను 6.25 శాతం వద్దనే స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జరిగిన మొట్టమొదటి మానిటరీపాలసీ కమిటీ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓపక్క దేశవిదేశాల ఆర్థికవేత్తలు, ప్రభుత్వాలు పెద్దనోట్లరద్దును మెచ్చుకుంటున్న తరుణంలో ఆర్ధికవ్యవస్థ వృద్ధికి మరింతూతం ఇచ్చేవిధంగా పటేల్‌ వడ్డీరేట్లను ఆరుశాతానికి తెస్తారని అంచనా వేసారు. అయితే ఆర్‌బిఐ ఆధ్వర్యంలోని మానిటరీపాలసీ కమిటీ నిర్ణయాలను యధాతథంగా అమలుచేస్తూ స్థిరంగానే కొనసాగి స్తున్నట్లు పటేల్‌ మీడియాకు వివరించారు. ఇప్పటికే అనేక బ్రోక రేజి సంస్థలు జిడిపివృద్ధి కొంతమేర తగ్గుతుందని అంచనావేసా యి. ప్రధాని నరేంద్రమోడీ రూ.500, రూ1000 నోట్లు రద్దు ద్వారా భారత్‌ను విస్మయానికి గురిచేసారు. చెలామణిలో ఉన్న 86శాతం కరెన్సీని రద్దుచేసి నల్లధనం, లెక్కలుతేలని గుప్తధనం, నకిలీ కరెన్సీని వెలికితీసే లక్ష్యంతోనే ఈ విధానానికి తెరతీసినట్లు ప్రకటించి మరింత సంచలనానికి తెరలేపినసంగతి తెలిసిందే. ఆర్‌బిఐ ఆర్ధ్థి వృద్ధి పరంగా స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు ఈ ఆర్ధిక సంవత్సరానికి 7.6శాతం నుంచి 7.1శాతంగా ఉంటుందని అంచనావేసింది. అయితే నోట్లరద్దు ఆర్థిక వ్యవస్థను అంచనాలకు మించి దెబ్బతీసిందనే చెప్పాలి. ఆటోమొబైల్‌ విక్రయాలు దిగజారి పోయాయి. సేవలరంగ కార్యకలాపాలు మందగించాయి. గడచిన రెండేళ్లతో పోలిస్తే మరింతగా క్షీణించాయి. రెపోరేట్లు ఖచ్చితంగా తగ్గుతాయని భావించిన అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ యధాతథంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించి నిరాశనేమిగిల్చినట్లు చెప్పాలి. మిజుహో బ్యాంకు వ్యూహకర్త తీర్ధాంకర్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ ప్రస్తుత ఎంపిసి ప్రకటన తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని, పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత వాటి ప్రభావాన్ని పరిగణనలోనికి తీసుకుని రేట్లు తగ్గిస్తుందని ఆశించిన ఇన్వెస్టర్లకు అసంతృప్తిని మిగిల్చిందని అన్నారు. ఆర్‌బిఐ ఛీఫ్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఆధ్వర్యంలోని మానిటరీ పాలసీ కమిటీ ఆరుగురుసభ్యులు కూడా రేట్లను తగ్గించేందుకు వ్యతిరేక ఓటువేసారు. దీనితో వడ్డీరేట్లు స్థిరంగానే కొనసాగించాల్సి వచ్చింది. స్టాక్‌ మార్కెట్లు ఆర్‌బిఐ నిర్ణయంతో దిగజారాయి. సెన్సెక్స్‌156 పాయింట్లునష్టపోతే నిఫ్టీ 50సూచి 0.5శాతం దిగజారింది. అయితే బ్యాంకింగ్‌రంగానికి కొంత ఉపశమనం కలిగించింది. ఆర్‌బిఐ ఇటీవల ప్రకటించిన ఇంక్రిమెంటల్‌ క్యాష్‌రిజర్వు రేషియోను ఉపసంహరించింది. డిపా జిట్‌లపై ఐసిఆర్‌ఆర్‌ 100శాతం కొనసాగించాలన్న తాత్కాలిక ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది. నగదునిల్వల నిష్పత్తిపరంగాచూస్తే బ్యాంకు డిపాజిట్లు పరంగాచూస్తే 4శాతంగా ఆర్‌బిఐ కొనసాగి స్తుంది. అంతర్జాతీయంగా ముడిచమురుధరల పెరుగుదల సూచి స్తోందని, అలాగే మరికొన్ని కేటగిరీల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకా శం ఉన్నందువల్లనే రెపోరేట్లను యధాతథంగా కొనసాగించినట్లు పటేల్‌ వివరించారు. అయితే ద్రవ్యసర్దుబాటు సౌకర్యం (ఎల్‌ఎఎఫ్‌)ను మాత్రం యధాతథంగా 5.75శాతంవద్దనే కొన సాగించారు. ఇక ఎంఎస్‌ఎఫ్‌ రేట్‌ను కూడా 6.75శాతంగా కొన సాగించారు. అలాగే కొన్ని కేటగిరీల ఉత్పత్తులపరంగా ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల చర ఉత్పత్తులు కొన్నింట తగ్గినా మరికొన్ని పెరుగుతాయని అంచనా వేసింది. నాలుగోత్రైమాసికంలో ద్రవ్యోల్బణం ఐదుశాతం గా ఉంటుందని కూడా ఆర్‌బిఐ అంచనావేసింది. హౌసింగ్‌, ఇంధ నం, కరెంటు, ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్‌; పాన్‌, పొగా కు, ఇతర మాదకద్రవ్యాల ఉత్పత్తులు విద్యపరంగా కూడా విని యోగరంగ ధరలసూచీలో 38శాతం వాటాతో ఉంటాయి. డిసెం బరు, ఫిబ్రవరినెలల్లో కొంత ప్రతికూల వాతావరణం ఉన్నందున ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనావేసిన ఆర్‌బిఐ రెపోరేటును స్థిరంగా కొనసాగించింది. ఇక అంతర్జాతీయగా చూస్తే అమెరికా ద్రవ్యవిధాన పరపతి సమీక్ష కొంత ఒత్తిడిపెంచుతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఒపెక్‌ దేశాల ఇటీవలి సమావేశ నిర్ణయం వల్ల ముడిచమురుధరలు పెరిగి ఇంధన సూచీపై వత్తిడి తప్పదని అంచనావేసింది. అందువల్లనే రెపోరేట్లను యధాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు రూ.11.5లక్షల కోట్ల డిపాజిట్లు పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి వాణిజ్యబ్యాంకులకు నవంబరు 8వ తేదీనుంచి నేటివరకూ సుమారు 11.5 లక్షలకోట్ల పాతనోట్లు డిపాజిట్లుగా వచ్చాయని ఆర్‌బిఐ గుర్తించింది. మొత్తంచెలామణి లో ఉన్న సోట్లు 15.44 లక్షల కోట్లు కాగా వాటిలో 11.5 లక్షల కోట్లు పాతనోట్లు డిపాజిట్‌ అయ్యాయని అంచనావేసింది. డిసెం బరు 30వ తేదీవరకూ పాతనోట్లను డిపాజిట్‌ చేసుకునే అవకాశం ఉందని డిఫ్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ వెల్లడించారు. అలాగే కొత్త నోట్లపరంగా ఇప్పటివరకూ నాలుగు లక్షలకోట్లు పంపిణీచేసామని వివరించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనాలోచితమని, అర్ధరహి తమని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. పెద్దనోట్ల రద్దు తాత్కాలికంగా స్వల్పకాలికంగా కొంత ప్రభావం చూపిస్తుందని, నగదు ఆధారిత రంగాలైన రిటైల్‌, హోటల్‌, రెస్టారెంట్లు, ట్రాన్స్‌ పోర్టు రంగాలపై తీవ్రప్రభావం ఉంటుందని అంచనా వేసింది. సమగ్ర తర్జనభర్జనల తర్వాతనే పెద్దనోట్ల రద్దును నిర్ణయించా మని ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ మీడియాకు వివరించారు. అయితే వీటివల్ల ఎదురయ్యే చిక్కులను సాధ్యమైనంతగా తగ్గిం చేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. ఈ పెద్దనోట్ల రద్దుకారణం గా ద్రవ్యోల్బణంలో 10నుంచి 15 బేసిస్‌ పాయింట్లు మూడో త్రైమాసికంలో తగ్గుతాయని డిఫ్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ వివరిం చారు. మొత్తంమీద ఆర్థికవ్యవస్థలో చెలామణిలో ఉన్న రూ.15.5 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహ రించడం వల్ల స్వల్పకాలికంగా మాత్రమే సమస్యలు ఎదురవు తాయని ఆర్‌బిఐ గరవ్నర్‌ భరోసా కల్పించే యత్నం చేసారు.
1entertainment
internet vaartha 142 Views ముంబై : బిఎస్‌ఇ 500 జాబితాలో ప్రత్యేకించి జూన్‌ మాసంలో 105 కంపెనీలషేర్లు 20శాతం పెరిగినట్లు స్పష్టం అయింది. ఐటిసి, గ్రాసిమ్‌, హీరోమోటోకార్ప్‌, ఎసిసి, బయో కాన్‌, బిపిసిఎల్‌, ఎన్‌టిపిసి, పెట్రోనెట్‌ గ్యాస్‌, వంటి 33 స్టాక్స్‌ బిఎస్‌ఇ ఏగ్రూప్‌లో 52వారాల గరిష్టస్థాయిని చేరాయి. హిందాల్కో, వేదాంత, డిఎల్‌ఎప్‌, పంజాబ్‌నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ఆఫ్‌ఇండియా వంటి 174 కంపెనీల షేర్లు చిన్న, మధ్యతరహా క్యాప్‌ సూచీల్లో 15శాతంపెరిగాయి. ఈక్విటీ మార్కెట్లలో గడచిన నాలుగురోజులుగా పెరుగుతున్న నేపథ్యం లో ఈ స్టాక్స్‌కు కాలం కలిసొచ్చింది. మొత్తం 105 కంపెనీల షేర్లు 20శాతం పెరిగినట్లు అంచనా. ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ ఒకటిశాతంపెరిగి 259 పాయిట్లవద్ద నిలిచింది. గురువారం 27 వేల పాయింట్లకు చేరింది. సూచి 2.2శాతం పెరి గింది. సోమవారం నుంచి 602 పాయింట్లుపెరిగి 26,398 పాయింట్లకు చేరింది.యూరోపియన్‌ యూనియన్‌నుంచి బ్రిటన్‌ నిష్క్రమించాలన్న నిర్ణయం తర్వాత మార్కెట్లు క్రమేపీ కోలుకు న్నాయి. మొత్తంగా బిఎస్‌ఇ ఎగ్రూప్‌లో 33 కంపెనీల షేర్లు 52 వారాల గరిష్టస్థాయికి చేరాయి. ఇంట్రాడేలో అనూహ్య ఫలితాలిచ్చాయి. వీటిలో టాప్‌ 10 బ్లూచిప్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. కేంద్ర కేబినెట్‌ బుధవారం ఏడోవేతన సంఘం సిఫా రసులు ఆమోదించడంవల్ల ప్రభుత్వం 84,900 కోట్లు భారం చవిచూడాల్సి వస్తోంది. చెల్లింపులు, పెన్షనర్ల రూపంలో చెల్లిం పులు అవసరం అవుతాయి. పట్టణప్రాంతం లో వినియోగసామర్ధ్యం పెరగడానికి ఇదొక నిదర్శనమని నిపుణులు చెపుతున్నారు సాధా రణ స్థాయి నుంచి, మరింతగా వర్షపాతం పెరగడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. ప్రత్యే కించి ఎఫ్‌ఎంసిజి కంపెనీలకు మంచి ఊతం ఇచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో మంచి ఆర్థిక వ్యవస్థ లేదా మరింత పటిష్టం అవుతుందనడానికి ఇదొక నిదర్శనమని కోటక్‌ సంస్థాగత ఈక్విటీ రీసెర్చి నివేదిక వెల్లడిం చింది. ఏంజెల్‌ బ్రోకింగ్‌ ప్రకారం చూస్తే సిపిసితోపాటు సానుకూల రుతుపవన వాతా వరణం వినియోగరంగ ఉత్పత్తులతో కలిపితే కొంతమేర ఆదుకుంటుందని అంచనా. వీటితోపాటే ఇండియన్‌ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌, అండ్‌ జైపూర్‌, పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు, దేనా బ్యాంకు, అలహాబాద్‌బ్యాంకు, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ట్రావన్కోర్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ వంటివి 30శాతం చొప్పున ర్యాలీతీసాయి.అంతకుముందు ఈనెలలోనే రిజర్వు బ్యాంకు సమస్యాత్మక రుణాల పునర్‌వ్యవస్థీకరణకు మార్గదర్శ కాలు సడలించింది. దీనివల్ల బ్యాంకరులు రానిబాకీలు, మొండి బకాయిలపై మరింత సమర్ధవంతమైన కార్యాచరణకు పూను కోగలవన్నది అంచనా.  బిర్లా కార్పొరేషన్‌, దాల్మియా భారత్‌, డెక్కన్‌ సిమెంట్స్‌, సాగర్‌ షిమెంట్స్‌, ఇండియా సిమెంట్స్‌, కోశోరామ్‌ ఇండస్ట్రీస్‌, హీడెల్‌బర్గ్‌ సిమెంట్‌ ఇండియా, ప్రిస్మ్‌ సిమెంట్‌ సంస్థలు సిమెంట్‌ రంగపరంగా 35శాతం పెరిగాయి. రుతుపవనాల ప్రభావమే కాకుండా ప్రభుత్వం మౌలికవనరుల వృద్ధిపై దృష్టి కేంద్రీకరించడంతో ఈ కంపెనీల షేర్లు భారీ గా పెరిగాయి. బ్రెగ్జిట్‌ ప్రభావంతో ముందు కొంతకొంత నష్టాలపాలయ్యాయి. స్టాక్‌ మార్కెట్లలో రెండులక్షల కోట్ల రూపాయలకుపైబడిన నష్టం వాటిల్లినప్పటికీ రానురాను కోలుకున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ కూడా బ్రిటన్‌ వైదొలిగే ప్రణాళిక తక్షణమే అమలుచేయాలని కోరడం, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నుంచి ఆంగ్లభాషను తొలగించాలన్న నిర్ణయం తీసుకోవడం వంటివి కూడా మార్కెట్లపై ప్రభావం చూపించాయి. వీటికితోడు దేశీయంగా ఆర్థికవ్యవస్థ పరంగా తీసుకున్న సంస్కరణలు కూడా లాభించాయి. టెక్స్‌టైల్‌ రంగానికి 6000 కోట్ల ప్యాకేజి, కార్మికరంగపరంగా కొత్త సంస్కరణలు, జాతీయ గనుల విధానానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేయడం వంటివి మార్కెట్లకు లాభించాయి. అన్నింటికంటే ముఖ్యంగా వేత నాల పెంపుతో ఉద్యోగవర్గాల్లో వ్యయసామర్ధ్యం పెరుగు తుందని ఫలితంగా ఆటోమొబైల్‌ రంగం మరింత లాభ పడుతుందని అంచనా. ద్విచక్రవాహనాలు, కార్లు వంటి వాటి మార్కెట్‌ భారీ ఎత్తున సాగుతుందని నిపు ణులు అంచనాలు వేసారు. మొత్తం మీద జూన్‌నెలలో ఒడి దుడుకులు తీవ్రస్థాయిలో ఎదుర్కొన్నప్పటికీ మార్కెట్లలో 105 కంపెనీల షేర్లు భారీ ఎత్తున పెరిగాయి. వీటిలో ఏ గ్రూప్‌ షేర్లు అయితే 52 వారాల గరిష్టస్థాయిని తాకాయి.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 139 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌..! దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఓ మోస్త‌రు లాభాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండో రోజు కూడా స్వల్ప పెరుగుదలను నమోదుచేశాయి. TNN | Updated: Mar 21, 2018, 05:09PM IST దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఓ మోస్త‌రు లాభాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండో రోజు కూడా స్వల్ప పెరుగుదలను నమోదుచేశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 139 పాయింట్లు లాభపడి.. 33,136 వద్ద నిలిచింది. మరోవైపు నిఫ్టీ కూడా 31 పాయింట్లు పుంజుకుని 10,155 వద్ద స్థిరపడింది. ఈ ఉదయం ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 120 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగబాకింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఆరంభం నుంచే సూచీలు జోరు సాగించాయి. అయితే చివర్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్‌ ఒడుదొడుకులకు లోనుకావడంతో.. ఆరంభ లాభాలతో సరిపెట్టుకున్నట్లయింది. ఎన్‌ఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌, భారత్‌ పెట్రోలియం, బజాజ్‌ఫైనాన్స్‌, ఎన్టీపీసీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ లిమిటెడ్‌ షేర్లు లాభాలు చవిచూడగా... టాటాస్టీల్‌, బోష్‌ లిమిటెడ్‌, ఐషర్‌మోటార్స్‌, అదానీపోర్ట్స్‌, హీరోమోటార్స్‌షేర్లు కొద్దిపాటి నష్టాలతో నిలిచాయి.
1entertainment
internet vaartha 129 Views న్యూఢిల్లీ : ఐపిఒ మార్కెట్‌కు మరో కంపెనీ రాబోతోంది. అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ టెక్నాలజీస్‌ బుధ వారం స్టాక్‌ మార్కెట్లకు వస్తోంది. రూ.411 కోట్ల రూపాయలు ఐపిఒ జారీ చేస్తోంది. రూ.50 కోట్ల ఈక్విటీని ఆఫర్‌ఫర్‌సేల్‌ పద్ధతిలో విక్రయించాలని నిర్ణయించింది. 40,34,470 వాటాలను ప్రమోటర్‌గ్రూప్‌ షేర్‌ హోల్డర్లు విక్రయిస్తారు. కోటక్‌ ఎంప్లాయీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ట్రస్ట్‌, కోటక్‌ ఇండియా వెంచర్‌ఫండ్‌, కోటక్‌ఇండియా వెంచర్‌ ఫండ్‌లకు వాటాలు విక్రయి స్తుంది. ఐపిఒధరను 880నుంచి 896గా నిర్ణయించారు. ఈనెల 22వ తేదీ నుంచి ఐపిఒ ప్రారంభం అవుతుంది. అదేరోజు ముగు స్తుంది. మొత్తం 411.5కోట్ల రూపాయలు ఈనిధులు రావచ్చని అంచనా. ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌క్యాపిటల్‌ లీడ్‌ మేనేజర్స్‌గా వ్యవహరిస్తున్నారు. 60కిపైగా దేశీయ వనరులతో కంపెనీ 400కుపైగా ఉత్పత్తులను  అభివృద్ధి చేస్తోంది. 50దేశాల్లో కంపెనీకి 700 కస్టమర్లు ఉన్నారు. కంపెనీషేర్లు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇల్లో జాబితా అయ్యాయి.
1entertainment
-  రు.6లక్షల కోట్లతో హైవే ప్రాజెక్టులు -  పెట్టుబడులకు గోల్డెన్‌ ఆఫరంటున్న కేంద్రం -  రాయితీలతో ఆకర్షించేలా పథకాలు    న్యూఢిల్లీ: దేశంలో మౌలికసదుపాయాల కల్పనలో భాగంగా ప్రపంచ స్థాయి హంగులు కల్పించేందుకు 93 బిలియన్‌ డాలర్లు అంటే.. ఆరు లక్షల కోట్ల రూపాయలతో హైవే ప్రాజెక్టుల కింద అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది.ఈ ప్రాజెక్టుల సాయంతో దేశంలోని ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సెక్టార్‌ దశ మారటం ఖాయమని భావిస్తోంది. పెట్టుబడులకు ఇది మంచి అవకాశమని ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో వందశాతం పన్ను మినహాయింపు, ఆ తర్వాత మరో ఐదేళ్లకు 30శాతం పన్ను మినహాయింపు ఉంటుంది. ఇలా రెండు దశాబ్దాల పాటు 93 బిలియన్‌ డాలర్లు వెచ్చించాలనుకుంటే.. అందులో 45 బిలియన్‌ డాలర్లు రోడ్‌ బిల్డింగ్‌ ప్రోగ్రాం కింద నేషలన్‌ హైవే బిల్డింగ్‌ ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌డిపి) చేపట్టనుంది. ఈ తరహా అభివృద్ధిని ఫ్లయింగ్‌ షిప్‌ ప్రోగ్రాం ద్వారా కేంద్రం అమలు చేయాలనుకుంటోంది. ప్రపంచంలో అతిపెద్ద పిపిపి పొగ్రాం         రోడ్‌ట్రాన్స్‌పోర్ట్‌ ఎండ్‌ హైవే మినిస్ట్రీ ద్వారా హైవే ప్రాజెక్టుల జాబితాను ప్రకటించింది. దీని ప్రకారం గ్రీన్‌ఫీల్‌ ్డ(హైబ్రీడ్‌ ఎన్యుటి) బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టు (మోనోటైజేషన్‌) మోడల్స్‌గా చెబుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశముందని, దీని వల్ల పెట్టుబడిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం భరోసా ఇస్తోంది. వచ్చే మూడేళ్లలో 45 బిలియన్‌ డాలర్లతో 20 వేల కిలోమీటర్ల రహదారుల అభివృద్ధిపనులను ఎన్‌హెచ్‌డిపికి అప్పగించనుంది. కాగా పెట్టుబడులు పెట్టేలా బిడ్డర్లను ఆకట్టుకునే ప్రయత్నాలకు కేంద్రం పదును పెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద పిపిపి డెవలప్‌మెంట్‌ పోగ్రాం అవుతుందని చెబుతోంది. హైవే సెక్టార్ల అభివృద్ధిపై డాక్యుమెంట్‌ను ప్రకటించాలనుకుంటోంది. దేశంలోని 123 జిల్లాలోని రహదారులను కలిపేలా 8 బిలియన్‌ డాలర్లువెచ్చించనుంది. వీటితో పాటు 350 వంతెనలు, ఆర్‌ఓబిలను చేపట్టాలనుకుంటోంది. వీటితో పాటు చార్‌థామ్‌ ప్రాజెక్టు కింద 2వేల500 కిలోమీటర్ల మేర పర్వత ప్రాంతాలను అభివృద్ధిపర్చనున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది పదివేల కిలోమీటర్ల హైవేలను తీర్చిదిద్దాలనుకుంటోంది.హెచ్‌హెచ్‌ఎఐ ప్రాజెక్టుకింద 40 శాతం క్యాపిటల్‌ గ్రాంటు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.     వీటితో పాటు 20 ఏళ్లపాటు పన్నుమినహాయింపు వెసులుబాటు కల్పిస్తామని భరోసా ఇస్తోంది.అలానే 80 శాతం పెన్షన్‌, బీమా రంగాలకు ఫండ్‌ అందుబాటులో వస్తుందని కేంద్రం చెబుతోంది. కాగా ప్రపంచంలో రెండో అతిపెద్ద రోడ్‌ నెట్‌ వర్క్‌ కలిగిన దేశం భారత్‌. ఇక్కడ 4.8 మిలియన్‌ కిలోమీటర్ల మేర రహదారులున్నాయి. ఇందులో రెండు శాతం ఉన్న జాతీయ రహదారులపై 40 శాతం ట్రాఫిక్‌ ఉంటోంది. ప్రయాణికులు, సరుకు రవాణా ఉండటం వల్ల పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయంటూనే.. రహదారుల రూపురేఖలను మార్చటానికి ఇది మంచితరుణమని మోడీ సర్కారు అంటోంది. అయితే ఎన్డీయే పాలకులు ఆకర్షణ పథకాలకు పెట్టుబడిదారులు ఎంతమేర ఆసక్తిచూపుతారో తెలియాలందే కొన్ని రోజుల వేచి ఉండాలి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 7, Jul 2019, 1:57 PM IST Highlights ఒక సినిమాను విమర్శించడానికి, అభ్యంతరం చెప్పడానికి చాలా తేడా ఉంటుందన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తన తాజా చిత్రం కబీర్ సింగ్ కు  కొందరు రెండు స్టార్స్ మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు.  ఒక సినిమాను విమర్శించడానికి, అభ్యంతరం చెప్పడానికి చాలా తేడా ఉంటుందన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తన తాజా చిత్రం కబీర్ సింగ్ కు  కొందరు రెండు స్టార్స్ మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. కానీ తెలివైన ప్రేక్షకులు ఈ సినిమాకు మాత్రం రూ.200 కోట్లు కట్టబెట్టారని చెప్పుకొచ్చాడు. మీ క‌న్నా మా తెలుగువాళ్లే మంచోళ్లు. అక్క‌డా సినిమాకు మంచి రేటింగ్స్ రాక‌పోయినా క‌నీసం టెక్నిక‌ల్ అంశాల గురించి ఎనాల‌సిస్ చేసి బాగా రాసారు. క‌బీర్ సింగ్ విష‌య‌సంలో అదీ జ‌ర‌గ‌లేదు.  .  సినిమాకు సంబంధించి అ,ఆలు తెలియని వాళ్లు కూడా క్రిటిక్స్ అవతారం ఎత్తడం ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు.   ఇక తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సి రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు సందీప్. షాహిద్‌ కపూర్‌ హీరోగా కబీర్‌ సింగ్ పేరుతో రిలీజ్ అయిన అర్జున్‌ రెడ్డి రీమేక్‌ బాలీవుడ్‌లోనూ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ సినీ విమర్శకులు మాత్రం పెదవి విరిచారు. ముఖ్యంగా సినిమాలో మహిళలను తక్కువగా చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్‌ లేని వ్యక్తిగా చూపించారని విమర్శించారు.   ఈ సందర్భంగా ఫిలిం కంపానియన్‌ యూట్యూబ్‌ చానల్‌తో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా క్రిటిక్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాను విమర్శించే వారంతా సూడో స్త్రీవాదులంటూ విమర్శించాడు.  సం‍దీప్‌ ఇంటర్య్వూపై స్పందించిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, ‘ సందీప్‌ రెడ్డి వంగా అమాకత్వంతో కూడిన నిజాయితీ, నిజమైన ధైర్యం కలిగిన వ్యక్తి. కబీర్‌ సింగ్‌పై ఆయన తాజా ఇంటర్వ్యూ ఓ సంచలనం’ అంటూ ట్వీట్ చేశారు.    I think @imvangasandeep is the most perfect mix of innocent honesty and truthful courage ..This interview of his,is as pathbreaking as his #KabirSingh https://t.co/ai1zb0P3iy pic.twitter.com/cqzYCpy91b — Ram Gopal Varma (@RGVzoomin) July 7, 2019 Last Updated 7, Jul 2019, 1:57 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Aakash Chopra: ధోనీని తరుముతుంటే సెక్యూరిటీ గార్డ్స్ ఏరీ..? స్టేడియంలో భద్రతా వైఫల్యానికి ఇది తార్కాణం. అభిమాని మైదానంలోకి ప్రవేశిస్తే..? అతడ్ని నియంత్రించేందుకు సెక్యూరిటీ గార్డ్స్‌ వేగంగా అక్కడికి ఎందుకు రాలేదు..? -ఆకాశ్ చోప్రా Samayam Telugu | Updated: Mar 6, 2019, 04:07PM IST Aakash Chopra: ధోనీని తరుముతుంటే సెక్యూరిటీ గార్డ్స్ ఏరీ..? హైలైట్స్ మహేంద్రసింగ్ ధోనీని మైదానంలో వెంబడించిన అభిమాని అభిమానికి దొరక్కుండా కాసేపు పరుగెత్తిన ధోనీ అంతర్జాతీయ క్రికెటర్ల భద్రతపై ప్రశ్నించిన ఆకాశ్ చోప్రా అభిమానులు మైదానంలోకి రావడం పరిపాటిగా మారుతోందంటూ మండిపాటు క్రికెట్ స్టేడియాల్లో అంతర్జాతీయ క్రికెటర్ల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో భారత క్రికెటర్లు ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి వస్తుండగా.. స్టేడియంలోని భద్రతా వలయాన్ని దాటుకుని వచ్చిన ఓ అభిమాని ధోనీతో కరచాలనం కోసం వెంటపడిన విషయం తెలిసిందే. Don't mess with #MSDhoni https://t.co/TQi7eSB2dn — Narsi Reddy Yaggonu (@NarsiYaggonu) 1551808735000 అభిమాని తనవైపు దూసుకొస్తుండటాన్ని గమనించిన ధోనీ.. అతనికి అందకుండా అటూ.. ఇటూ పరుగెత్తగా.. మైదానంలోనే కాసేపు మాజీ కెప్టెన్‌‌ని వెంబడించిన అభిమాని చివరికి కరచాలనం చేసిన తర్వాతగానీ వెనుదిరగలేదు. చూసేందుకు ఇది సరదాగా కనిపించినా.. క్రికెటర్ల భద్రతలోని డొల్లతనం మరోసారి బయటపడింది. ‘స్టేడియంలో భద్రతా వైఫల్యానికి ఇది తార్కాణం. అభిమాని మైదానంలోకి ప్రవేశిస్తే..? అతడ్ని నియంత్రించేందుకు సెక్యూరిటీ గార్డ్స్‌ వేగంగా అక్కడికి ఎందుకు రాలేదు..? గత కొద్దిరోజులుగా ఇలా అభిమానులు మైదానంలోకి రావడం పరిపాటిగా మారిపోయింది’ అని ఆకాశ్ చోప్రా మండిపడ్డాడు. ఇటీవల న్యూజిలాండ్‌ టూర్‌లోనూ ధోనీ కోసం ఓ అభిమాని మైదానంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 18, Aug 2018, 12:34 PM IST Highlights విజయ్ దేవరకొండ, రష్మిక, దర్శకుడు పరశురామ్ లు ఈ షోలో పాల్గొని తమ సినిమాను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారట. అది కాకుండా ఈ శని, ఆదివారాలు రెండు రోజులు సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకోబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 2లో సినిమాను ప్రమోట్ చేయడం దర్శకనిర్మాతలకు కలిసొచ్చే పాయింట్. ఇప్పటివరకు చాలా సినిమాలు ఈ షోలో తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నాయి. తాజాగా గీత గోవిందం టీమ్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతుందని సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక, దర్శకుడు పరశురామ్ లు ఈ షోలో పాల్గొని తమ సినిమాను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారట. అది కాకుండా ఈ శని, ఆదివారాలు రెండు రోజులు సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకోబోతున్నారు. బన్నీ శనివారం ఈ టీమ్ కి పెద్ద పార్టీ ఇస్తుండగా, ఆదివారం చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పైగా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు కూడా లేకపోవడం వచ్చే వారం కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో తమ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకువెళ్లాలనేది చిత్రబృందం ప్లాన్. ఇదంతా చూస్తుంటే ఈ నెలాఖరు వరకు గీతగోవిందం తన జోరుని చూపించబోతుందని తెలుస్తోంది.   ఇవి కూడా చదవండి..
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకు శాపం: పవన్ గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనలో ప్రభుత్వం నిర్ణక్ష్య వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. Samayam Telugu | Updated: May 16, 2018, 03:46PM IST గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనలో ప్రభుత్వం నిర్ణక్ష్య వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ప్రమాద ఘటన తెలియగానే జనసేన కార్యకర్తల్ని సహాయక చర్యల్లో పాల్గొనవల్సిందిగా పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ ద్వారా బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ‘ గోదావరి నదిలో లాంచీ ప్రమాద ఘటన తెలియగానే గుండె బరువెక్కింది. రోజు వారీ అవసరాలకి ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జల సమాధి కావడం ఆందోళన కలిగించింది. 60 అడుగుల లోతున లాంచీ పడిపోయిందని తెలిశాక ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధమైంది. మరణించిన వారి కుటుంబాలకు నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకి శాపం కావద్దు. ఈ ఘటనలో సర్కార్ శాఖలు, ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన లాంచీకి అనుమతులు సక్రమంగా లేవంటే.. లోపం ఎవరిది? జవాబుదారీతనం లేని పాలన విధానాలే అమాయకుల్ని జల సమాధి చేశాయి. దుర్ఘటన జరగగానే హడావిడి చేసే పాలకులు.. సమస్యలకి శాశ్వత పరిష్కారాలను చూపించాలి. ప్రజల వద్దకు పాలన ప్రకటనలకే పరిమితమా? నిత్యావసరాలకి, వైద్యం, విద్య, ఏ పని ఉన్నా నదిలోనే ప్రయాణాలు సాగిస్తూ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ శాఖలు గిరిజన గూడేలపూ శ్రద్ధ చూపడం లేదు. పోలవరం నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరిగి వెళుతూ ఈ ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి గిరిజనులకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనతో పాటు పాలన వారి గూడేలకి చేర్చాలి. నదుల్లో అనుమతులు లేని బోట్లను తిరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. కృష్ణానదిలో బోటు ప్రమాదం ఘటన మరువత ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం. అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. కాగా ఈ ప్రమాదంలో జరిగే సమయంలో లాంచీలో మొత్తం 50 మంది ఉండగా.. 16 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన 34 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. దేవీపట్నం మండలం మంటూరు దగ్గర 60 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు కనుగొన్నాయి. గల్లంతైనవారి మృత‌దేహాలన్నీ లాంచీలోనే ఉన్నట్టు గుర్తించిన అధికారులు, వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయనతో పాటు ఏపీ మంత్రులు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప తదితరులు ఉన్నారు.
0business
Hyd Internet 133 Views David Warner david warner హైద‌రాబాద్ః భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ లక్షణాలు అద్భుత‌మ‌ని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కితాబిచ్చాడు. హైదరాబాద్ లో వర్షం కారణంగా టీ-20 మ్యాచ్‌ రద్దు కావడంతో సిరీస్ లో సమంగా నిలిచిన తరువాత వార్నర్ ‘ఇండియా టుడేస తో మాట్లాడాడు. ఇటీవలి 5 వన్డేలు, రెండు టీ-20 పోటీల్లో తాను కోహ్లీ నాయకత్వాన్ని దగ్గర నుంచి చూశానని, అతను జట్టును నడిపించిన తీరు అద్భుతమని కితాబిచ్చాడు. గత ఏడాది కాలంలో భారత క్రికెట్ ఎన్నో మెట్లు ఎక్కిందని, దానికి కోహ్లీ లీడర్ షిప్ కారణమని అన్నాడు. ఆట పట్ల పూర్తి నిబద్ధత చూపుతూ తోటి ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడమే కోహ్లీ విజయాలకు కారణమని విశ్లేషించాడు. ఈ సంవత్సరం జనవరిలో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీ స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆపై ఎన్నో సిరీస్ లను కోహ్లీ గెలిపించాడు. శ్రీలంకలో పర్యటించి, ఆ దేశాన్ని మట్టికరిపిస్తూ, వైట్ వాష్ సాధించిన తొలి భారత క్రెప్టెన్ గానూ రికార్డు సృష్టించాడు.
2sports
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV భారత్‌తో టీ20, టెస్టు సిరీస్‌కి బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన భారత్‌తో టీ20 సిరీస్ కోసం 17 రోజుల క్రితమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జట్టుని ప్రకటించింది. కానీ.. వివిధ కారణాలతో ఆ జట్టు నుంచి ముగ్గురు అగ్రశ్రేణి క్రికెటర్లు తప్పుకోవడంతో మరోసారి జట్టుని ప్రకటించాల్సి వచ్చింది. Samayam Telugu | Updated: Oct 30, 2019, 05:55PM IST భారత్‌తో టీ20, టెస్టు సిరీస్‌కి బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన భారత్‌తో నవంబరు 3 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాజాగా జట్లని ప్రకటించింది. వాస్తవానికి టీ20 సిరీస్‌ కోసం ఈ నెల 17న జట్టుని బంగ్లాదేశ్ ప్రకటించింది. కానీ.. ఆ జట్టు నుంచి అనూహ్యంగా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తప్పుకోగా.. సైపుద్దీన్ గాయపడ్డాడు. ఇక టీమ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. బుకీ తనని సంప్రదించిన విషయాన్ని ఐసీసీ వద్ద షకీబ్ దాచడంతో ఈ మేరుకు నిషేధం వేటు వేసింది. దీంతో.. మరోసారి ఫ్రెష్‌గా జట్టుని బంగ్లాదేశ్ బోర్డు ప్రకటించాల్సి వచ్చింది. Read More: టీమిండియాకి ఉగ్ర ముప్పు.. ఢిల్లీ టీ20లో స్కెచ్ బంగ్లాదేశ్ టీ20 జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, నయీమ్ షేక్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మిథున్, అపిప్ హుస్సేన్, హుస్సేన్ సైకత్, అమినుల్ ఇస్లామ్, ఆర్పాత్ సన్నీ, తైజుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్ ఇస్లామ్, అబు హైదర్, ఆల్ అమిన్ హుస్సేన్ ఢిల్లీ వేదికగా ఆదివారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత గురువారం రెండో టీ20.. మళ్లీ ఆదివారం (నవంబరు 10) మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక నవంబరు 14 నుంచి తొలి టెస్టు మ్యాచ్.. 22 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. Read More: భారత్‌లో బంగ్లాదేశ్ టూర్.. మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే బంగ్లాదేశ్ టెస్టు జట్టు: మిమునల్ హక్ (కెప్టెన్), షదామన్ ఇస్లామ్, ఇమ్రూల్ కైస్, సైప్ హసన్, లిట్టన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, ఎండీ మిథున్, హుస్సేన్ సైకత్, మెహదీ హసన్, తైజుల్ ఇస్లామ్, నయీం హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అల్ అమిన్ హుస్సేన్, అబు జావెద్, ఎబడాత్ హుస్సేన్
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ప్రపంచకప్‌లో టాస్‌పై కెప్టెన్లు గొడవ..! అనూహ్యంగా విండీస్ కెప్టెన్ మాట మార్చడంతో మ్యాచ్ రిఫరీ, టీవీ వ్యాఖ్యాత ఏం చెప్పాలో అర్థంకాక కాసేపు సైలెంట్‌గా TNN | Updated: Jun 27, 2017, 08:44PM IST ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో ఆసక్తికరమైన గొడవ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ దగ్గర ఇద్దరు కెప్టెన్లకి భేదాభిప్రాయాలు వచ్చాయి. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ టేలర్ బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్లు మ్యాచ్ రిఫరీ, టీవీ వ్యాఖ్యాత వద్ద చెప్పింది. అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లాంగింగ్ వ్యాఖ్యాతతో మాట్లాడుతూ మొదట తాము బౌలింగ్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తుండగా.. మధ్యలో అడ్డుపడిన టేలర్ మొదట వెస్టిండీస్ జట్టు బౌలింగ్ చేస్తుంది అని ప్రకటించింది. అనూహ్యంగా విండీస్ కెప్టెన్ మాట మార్చడంతో మ్యాచ్ రిఫరీ, టీవీ వ్యాఖ్యాత ఏం చెప్పాలో అర్థంకాక కాసేపు సైలెంట్‌గా ఉండిపోయారు. ఈ సమయంలో ఇరు జట్ల కెప్టెన్ మధ్య వాగ్వాదం జరగగా.. సముదాయించిన అధికారులు ఆస్ట్రేలియా జట్టుకే తొలుత బౌలింగ్ చేసే అవకాశాన్ని కల్పించారు. క్రికెట్ నిబంధనల ప్రకారం టాస్ గెలిచిన కెప్టెన్‌కి తొలుత ఫీల్డింగ్/ బౌలింగ్ ఎంచుకునే అవకాశం కల్పిస్తారు. అయితే ఒక్కసారి నిర్ణయం ప్రకటించాక.. మళ్లీ దాన్ని మార్చుకోవడం జరగదు. ఈ మ్యాచ్‌లో చివరికి ఆస్ట్రేలియా చేతిలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఓటమి చవిచూసింది.
2sports
అంతంత మాత్రంగానే మార్కెట్లు - మళ్లీ స్వల్పంగానే లాభపడిన సూచీలు ముంబయి: మార్కెట్లకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల వణుకు వీడడం లేదు. ప్రస్తుత సమావేశాల్లో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)తో సహా పలు కీలక ఆర్థిక బిల్లులకు లభించే ఆమోదం ప్రకారం ముందుకు వెళ్లాలని మదుపరులు వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. వరుసగా తగ మూడు సెషన్ల నుంచి మార్కెట్ల పనితీరును చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో జోష్‌ కనిపిస్తున్నప్పటికీ మార్కెట్లు ముగిసే సమయానికి జాగ్రత్తగా వ్యవహరిస్తూ అమ్మకాలను దిగుతున్నారు. దీంతో సూచీలు 30 పాయింట్లకు లోబడే లాభాలను నమోదు చేస్తున్నాయి. మగళవారం కూడా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపించింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు పెరగడం, ఆర్‌బీఐ వడ్డీరేట్లను సవరించకుండా యథాతథ పరిస్థితిని కొనసాగించడం, ఆసియా మార్కెట్ల నుంచి అనుకూల పవనాలు అందినప్పటికీ మార్కెట్లు మాత్రం తీవ్ర ఊగిసలాట నడుమ చివరకు స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి. బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 23.74 పాయింట్ల మేర వృద్ధి చెంది 26,169 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ సూచీ నిప్టీ ˜20పాయింట్ల మేర పెరిగి 7954 పాయింట్ల వద్ద స్థిరపడింది. రిటైల్‌ ద్రవ్యోల్బణంలో పెరుగుదల, మరీ ముఖ్యంగా ఆహారేతర వస్తువుల ధరల పెరుగుదల కొంత ఆందోళన కలిగించే అంశాగానే ఉందంటూ ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌కు కొంత ప్రభావితం చేసింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు లేన్నట్లేనన్న ఊహాగానాలు కూడా మదుపరిని కొంత వెనుకడుగు వేసేలా చేశాయి. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు 0.4-06 శాతం మేర వృద్ధి చెందాయి. వడ్డీరేట్ల సంబంధిత వాహన, బ్యాంకెక్స్‌ సూచీలు 0.2-0.5 శాతం మేర కుంగాయి. స్థిరాస్తి రంగ సూచీ 0.4 శాతం మేర పెరిగింది. సెన్సెక్‌లో వేదాంతా (4.66%), డాక్టర్‌ రెడ్డీస్‌ (3.31%), టాటా స్టీల్‌ (3.3%), కోల్‌ ఇండియా (3.27%) హిందాల్కో (3.24%) లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ (3.53%), గెయిల్‌ (1.79%), యాక్సిస్‌ బ్యాంక్‌ (1.54%), టాటా మోటార్స్‌ (1.41%), ఇన్ఫోసిస్‌ (1.08%) మేర నష్టపోయాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
May 13,2017 వరుస ర్యాలీకి బ్రేక్‌ ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్ల వరుస ర్యాలీకి శుక్రవారం తెర పడింది. ద్రవ్యోల్బణం, పారిశ్రామికో త్పత్తి భయాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌్‌ 62.83 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 30,188.15కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21.5 పాయింట్లు లేదా 0.23 శాతం తగ్గి 9,400.90 వద్ద ముగిసింది. రంగాల వారిగా బీఎస్‌ఈలో కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌ సూచీ 0.98 శాతం, బ్యాంకింగ్‌ 0.89 శాతం, పవర్‌ 0.81 శాతం, వైద్య సూచీ 0.66 శాతం చొప్పున విలువ కోల్పోయి మార్కెట్లను ప్రతికూలతలోకి నెట్టాయి. మరోవైపు ఐటీ సూచీ 1.16 శాతం, రియాల్టీ 0.81 శాతం, టెక్‌ 0.68 శాతం, ఆటో 0.12 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్‌్‌-30లో ఇన్ఫోసిస్‌ 2.12 శాతం, హీరో మోటో కార్ప్‌ 2.11 శాతం, సిప్లా 1 శాతం, సన్‌ఫార్మా 0.81 శాతం, టాటా మోటార్స్‌ 0.7శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు ఆసియన్‌ పెయింట్స్‌ 3.04 శాతం, యాక్సిస్‌ బ్యాంకు 2.8 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.23 శాతం, అదానీ పోర్ట్సు 1.2 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.96 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.7 శాతం, 0.8 శాతం చొప్పున తగ్గాయి. గ్లోబల్‌ స్టాక్స్‌ యథాతథంగా నమోదయ్యాయి. వాల్‌స్ట్రీట్‌ స్వల్ప నష్టాలు చవి చూసింది. యూరప్‌ మార్కెట్లు యథాతథంగా ముగిశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV పవన్.. భీష్ముడు కాదు, శ్రీకృష్ణుడు: యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. Samayam Telugu | Updated: Apr 20, 2018, 11:24PM IST పవన్.. భీష్ముడు కాదు, శ్రీకృష్ణుడు: యాంకర్ శ్యామల జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీ నుంచి క్రమేనా మద్దతు పెరుగుతోంది. పవన్ తల్లిని దూషిస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు, పవన్ సన్నిహితులు మండిపడ్డారు. పవన్‌ను టార్గెట్ చేసుకోమని శ్రీరెడ్డికి చెప్పింది తానేనని వర్మ మరో బాంబు పేల్చడంతో.. ఇండస్ట్రీలో యుద్ధ వాతావరణ నెలకొంది.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఇంగ్లాండ్‌లోనూ ఆసీస్‌ స్లెడ్జింగ్ చేస్తుంది..! ఇంగ్లాండ్‌తో త్వరలో జరగనున్న సిరీస్‌లో తమ క్రికెటర్లు స్లెడ్జింగ్‌కి పాల్పడతారని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రకటించాడు. ఈ ఏడాది Samayam Telugu | Updated: Jun 6, 2018, 09:26PM IST ఇంగ్లాండ్‌లోనూ ఆసీస్‌ స్లెడ్జింగ్ చేస్తుంది..! ఇంగ్లాండ్‌తో త్వరలో జరగనున్న సిరీస్‌లో తమ క్రికెటర్లు స్లెడ్జింగ్‌కి పాల్పడతారని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రకటించాడు. ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్లెడ్జింగ్ కారణంగా.. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం పెరిగి.. చివరికి అది బాల్ టాంపరింగ్‌కి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ టాంపరింగ్ వివాదంతోనే మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఫాస్ట్ బౌలర్ బ్రాన్‌క్రాఫ్ట్ కెరీర్‌లు మసకబారాయి. అయినప్పటికీ.. ఇంగ్లాండ్ టూర్‌లో తమ క్రికెటర్లు నోటికి పనిచెప్తారని.. కానీ.. హద్దుల్లోనే ఉంటారని జస్టిన్ లాంగర్ స్పష్టం చేశాడు. ‘ఆస్ట్రేలియా జట్టులో స్లెడ్జింగ్ అనేది చాలా మంచి విషయం. నా కూతురితో నేను ఆట ఆడేటప్పుడు స్లెడ్జింగ్ చేస్తుంటా. నా తల్లిదండ్రులతో గోల్ఫ్ ఆడేటప్పుడు కూడా ఒకరినొకరం స్లెడ్జింగ్ చేసుకుంటాం. ఇక్కడ మన గుర్తించాల్సింది ఏంటంటే..? కవ్వించడానికి, తిట్టడానికి మధ్య ఉన్న తేడా. క్రికెట్‌లో తిట్లకి తావులేదు. గత మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియా జట్టులో స్లెడ్జింగ్‌ కొనసాగుతోంది. ఇకపై కూడా అంతే’ అని జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. జూన్ 13 నుంచి ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా జట్టు ఆడనుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బౌలర్లదే భారం   న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండవ టెస్టులో టీమిండియా బౌలర్లపైనే విజయం ఆధారపడింది.కాగా వీరు తమ సత్తా చాటితే ఇంగ్లండ్‌పై రెండవ టెస్టులో విజయం వరిస్తుంది. మొదటి టెస్టు రాజ్‌కోట్‌లో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.రెండవ టెస్టుకు నేడు ఆఖరు రోజు.ఇప్పటికే టీమిండియాకు చెందిన బ్యాట్స్‌మెన్‌ తన శక్తి మేరకు కృషి చేశారు. కాగా బౌలర్ల తమ వంతుగా స్పిన్‌తో సత్తా కనబరిస్తే విజయం ఖాయమని పలువురు భావిస్తున్నారు. కాగా రెండవ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 109 బంతులు ఆడి 8 బౌండరీలతో 81 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 3 వికెట్లకు 98 పరుగులతో నాలుగవ రోజు బరిలోకి దిగిన టీమిండియా 204 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ మరో 25 పరుగులు చేయగా, అజింక్యా రహానే 65 బంతులు ఆడి 2 బౌండరీ లతో 26 పరుగులు చేసి బ్రాడ్‌ బౌలింగ్‌లో కుక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.ఆ తరువాత భారత్‌ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. జయంత్‌ యాదవ్‌ 27 పరుగులు చేశాడు.దీంతో ఇంగ్లండ్‌కు భారత్‌ 405 పరుగులు టార్గెట్‌ నిర్ధేశించింది.కాగా రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ నిలకడగా ఆడింది.కుక్‌ 50 పరుగులు,హమీద్‌ 25 పరుగులతో చక్కని డిఫెన్స్‌తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు.జట్టు స్కోరు 75 పరుగుల వద్ద ఇంగ్లండ్‌కు చెందిన హమీద్‌ వికెట్‌ కోల్పోయింది.కాగా 51 ఓవర్‌లో అశ్విన్‌ అతడిని ఎల్‌బిడబ్ల్యూ చేశాడు.ప్రమాదకరంగా మారిన కుక్‌ను ఔట్‌ చేయడానికి టీమిండియా తీవ్రంగా శ్రమించింది.జడేజా వేసిన బంతికి కుక్‌ ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరగడంతో నాలుగవ రోజు ఆటముగిసింది.
2sports
Hyderabad, First Published 20, Aug 2018, 12:27 PM IST Highlights పాండ్యా వేసిన పంచ్.. కేవలం అభిమానులను ఉద్దేశించి మాత్రమే కాదని తెలుస్తోంది. ఈ మ్యాచ్ కాకుండా ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడి నుంచి ఆల్‌రౌండర్ అనే ట్యాగ్ తొలగించాలని భజ్జీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.  తనపై కామెంట్స్ చేసిన వారికి సరైన సమయంలో సరైన పంచ్ వేశారు.. టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. తానెప్పుడూ కపిల్ దేవ్ లాగా అవ్వాలని అనుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే...నాటింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో పాండ్య ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో మరోసారి అభిమానులు అతడ్ని మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌తో పోల్చడం మొదలుపెట్టారు. దీనిపై హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ...‘‘నేను ఎప్పటికీ కపిల్‌దేవ్‌ అవ్వాలని అనుకోవట్లేదు. నన్ను హార్దిక్‌ పాండ్యలాగే ఉండనీయండి. ఇలాగే చాలా బాగున్నాను. కపిల్‌దేవ్‌లా కాదు హార్దిక్‌ పాండ్యలా 41 వన్డేలు, 10 టెస్టులు ఆడాను. పోల్చడం మంచిదే. కానీ, ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోతే అవన్నీ మారిపోతాయి. దయచేసి ఒకర్ని మరోకరితో పోల్చడం ఆపండి. ఇదే జరిగితే నేను ఎంత సంతోషిస్తానో నాకే తెలుసు. నేను నా దేశం కోసం ఆడుతున్నాను. నా ప్రదర్శన పట్ల నా జట్టు సంతోషంగానే ఉంది.’’ అని పేర్కొన్నారు. అయితే.. పాండ్యా వేసిన పంచ్.. కేవలం అభిమానులను ఉద్దేశించి మాత్రమే కాదని తెలుస్తోంది. ఈ మ్యాచ్ కాకుండా ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడి నుంచి ఆల్‌రౌండర్ అనే ట్యాగ్ తొలగించాలని భజ్జీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ కపిల్ దేవ్ లాంటి ఆల్‌రౌండర్ కాదు. వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్‌గా మారడానికి హార్దిక్ ఎంతో దూరంలో ఉన్నాడు. మరో మంచి ఆల్‌రౌండర్ కోసం భారత్ వెతుక్కోవడం బెటరని వెస్టిండీస్ మాజీ ఆటగాడు మైకెల్ హోల్డింగ్ చురకలు అంటించాడు.  ఈ వ్యాఖ్యలన్నీ గుర్తించుకునే పాండ్యా ఇలా మాట్లాడని పలువురు భావిస్తున్నారు. Last Updated 9, Sep 2018, 10:59 AM IST
2sports
Visit Site Recommended byColombia తాజాగా మెగా హీరో రాంచరణ్‌ కూడా తుఫాన్ బాధితులకు అండగా నిలిచారు. తిత్లీ తుఫాన్ ప్రభావానికి గురైన ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘తిత్లీ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటన సందర్భంగా బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నాకు సూచించారు. గ్రామాన్ని దత్తత తీసుకుని బాధితులకు నా వంతు సాయం చేసేందుకు నా పేరును సూచించిన బాబాయ్‌కి ధన్యవాదాలు. ఈ విషయంపై మా టీమ్‌తో చర్చించా. త్వరలో దత్తత గ్రామం వివరాలు వెల్లడిస్తానని’ రాంచరణ్ పోస్ట్ చేశారు. కాగా తుఫాన్ బాధితుల సహాయార్థం బాలకృష్ణ, అల్లు అర్జున్‌లు రూ. 25 లక్షల చొప్పున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.15 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ.5 లక్షలు, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ రూ. 5 లక్షల చొప్పున, కొరటాల శివ రూ. 3 లక్షలు, సంపూర్ణేశ్ బాబు రూ. 50 వేలు అందజేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) తమ వంతు సాయంగా 5 లక్షల విరాళం ఇచ్చింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
TAX! చిన్నమొత్తాల పొదుపు వడ్డీరేట్ల తగ్గింపు ముంబై: కేంద్ర ప్రభుత్వం చిన్నమొత్తాలపొదుపు స్కీంలపై వడ్డీరేట్లను తగ్గిస్తుననతి. పిపిఎస్‌; కిసాన్‌ వికాస్‌పత్ర, సుకన్యసమృద్ధియోజన పథకాలపై 0.1శాతం తగ్గిస్తున్నట్లు తేలింది.ఏప్రిల్‌ జూన్‌ త్రైమాసికంలో ఈ రేట్లు అమలవుతాయి. దీనివల్ల బ్యాంకులు కూడా తమ డిపాజిట్‌ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఏప్రిల్‌-జూన్‌మాసాల్లో 0.1శాతం తగ్గించాలని నిర్ణయించింది. జనవరి మార్చి త్రైమాసి కం కంటే తక్కువచేయాలన్న నిర్ణయం బ్యాంకుల్లో డిపాజిట్లకు భద్రతకోసమేనని తెలుస్తోంది. పొదుపు డిపాజిట్లు నాలుగుశాతం వడ్డీని మాత్రమే ఇస్తాయి. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి చిన్నమొత్తాల వడ్డీరేట్లు త్రైమాసికం పద్దతిన సమీక్ష చేస్తున్నారు. ఆర్థికమంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ప్రకారం చూస్తే పబ్లిక్‌ప్రావిడెంట్‌ఫండ్‌ స్కీం సాలీనా వడ్డీరేటు 7.9 శాతంగా ఉంది. ఐదేళ్ల జాతీయ పొదుపు పత్రాలకు సైతం అదే రేటు అమలవుతోంది. ప్రస్తుతం ఈ వడ్డీరేటు ఎనిమిదిశాతంగా ఉంది. ఇక కెవిపి పెట్టుబడులపై 7.6శాతం వడ్డీ ఇస్తోంది. అది కూడా 112 నెలలకు వస్తుంది. సుకన్య సమృద్ధియోజన పథకం కింద 8.4శాతంగా వస్తున్నది. ప్రస్తుతం 8.5శాతం నుంచి తగ్గించారు. ఐదేళ్ల సీనియర్‌ సిటిజన్ల పొదుపు పత్రాలకు మాత్రం 8.4శాతంగా ఉన్నాయి. ఇక స్వల్ప కాలిక డిపాజిట్లు -5 ఏళ్లకాల వ్యవధి కలిగినవి 6.9 నుంచి 7.7శాతం వరకూ ఉన్నాయి. ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌ వడ్డీలు మాత్రం 7.2శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రాతిపదికగా తీసుకుంటే త్రైమాసిక పద్ధతిన వడ్డీరేట్లు అమలవుతాయి. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి మళ్లీ సమీక్ష జరుగుతుంది. ====== ఏప్రిల్‌ ఒకటవ తేదీ బ్యాంకులకు సెలవే! ముంబై, మార్చి 31: దేశంలోని బ్యాంకింగ్‌ కార్యకలాపాలన్నీ ఏప్రిల్‌ ఒకటవ తేదీ మూతపడతాయని వార్షిక బిజినెస్‌ ముగింపు సందర్భంగా ఆరోజు బ్యాంకులు పనిచేయవని రిజర్వుబ్యాంకు ప్రకటించింది. అంతకు ముందు ఆర్‌బిఐ అన్ని బ్యాంకులు కూడా అన్నిరోజులు పనిచేయాలని మార్చిచ 25నుంచి ఏప్రిల్‌ ఒకట వ తేదీవరకూ శనివారాలు, ఆదివారాలు సెలవుదినాల్లో కూడా పనిచేయాల్సి ఉంటుందని, ప్రభుత్వ పన్నుల రాబడులు, చెల్లింపులకు వీలుగా బ్యాంకులు పనిచేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే బ్యాంకు సిబ్బంది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంఅయింది. బ్యాంకు ఖాతాలు సమన్వయం చేసుకోవా ల్సిన అవసరం ఉందని అందువల్ల ఏప్రనిల్‌ ఒకటవ తేదీ ఖచ్చితంగా తెరిచి ఉంచాల్సిన అవసరం లేదని బ్యాంకులకు మళ్లీ ఆదేశాలు జారీచేసింది. ఇండి యన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌, ఎఐబిఇఎ, ఎఐబిఒఎ వంటి సంఘాలకు ఆర్‌బిఐ లేఖలు రాస్తూ ఎదురయిన తీవ్ర వ్యతిరేకత నిరసనను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బిఐ మార్చి 25,26 తేదీలు బ్యాంకులకు సెలవు దినాలని అవగా హన ఉన్నప్పటికీ 24వ తేదీ సాయంత్రం పత్రిక లు, ఎలక్ట్రానిక్‌ మీడియా సాధనాల్లో పనిచేయా లని ఆదేశించిందని యూనియన్లు మండిపడ్డా యి. వార్షిక ఖాతాల ముగింపు సందర్భంగా ప్రతిఏటా బ్యాంకులు మూతపడతాయి. దీనివల్ల ఒకటవ తేదీ బ్యాంకులు పనిచేస్తే వార్షిక ముగిం పు కార్యకలాపాలు దెబ్బతింటాయని వెల్లడించా రు. వీటికితోడు కొన్ని బ్యాంకులు విలీనం అవుతున్నందున వాటి లావాదేవీలపరంగా విఘాతం కలుగు తుందని యూనియన్లు హెచ్చరించాయి. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆర్‌బిఐ అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు శని, ఆదివారాలు, సెలవుల్లో కూడా పనిచేయాలని అయితే వార్షిక ముగింపు సందర్భంగా ఏప్రిల్‌ ఒకటవ తేదీ మాత్రం తెరిచిఉంచాల్సిన నిర్బంధం ఏమీలేదని వెల్లడించింది. అయితే యూనియన్లు మాత్రం ఈఉత్తర్వుల్లో స్పష్టత లేదని బ్యాంకులకు కొంతమేర కష్టం కలుగుతుందని, ఏఏ శాఖలు తెరిచిఉండాలి, ఎంతమంది సిబ్బంది హాజరుకావాల్సిఉంటుందన్న అంశాలపై స్పష్టత లేదన్నా రు. ఆర్‌బిఐ బ్యాంకులు, సిబ్బందితో చెలగాటం ఆడుతోందని, ఏనిర్ణయం క్రపటించినా ముందుగా యూనియన్‌ ప్రతినిధులకు తెలియజేయాల్సిన బాధ్యతను విస్మరిస్తోందని తీవ్రనిరసన వ్యక్తంచేసాయి.
1entertainment
internet vaartha 131 Views ముంబై : మహీంద్ర కంపెనీ ఉత్పత్తిచేసిన మినీట్రక్కు జీతో 20శాతం మార్కెట్‌ వాటాను సాధించినట్లు కంపెనీ ప్రకటించింది. చిన్నపాటి వాణిజ్య వాహనాల్లో ఏడాది క్రితం ప్రారంభించిన జీతో భారతీయ రోడ్లపై విజయవంతంగా నడుస్తోందని, ఏడాదిలోనే 20 శాతం మార్కెట్‌ వాటాసాధించినట్లు కంపెనీ వెల్లడించింది. జీతో రేంజిలో ఎనిమిది మినీట్రక్కులు విడుదలయ్యాయి. కంపెనీ తాజా గా కస్టమర్‌లకు ప్రోత్సాహకరంగా 20వేల రూపాయలు ఎక్ఛేంజి ఆఫర్‌ కూడా ప్రకటించింది. అంతేకాకుండా జీతోకు రెండేళ్ల వారంటీ లేదా 40 వేల కిలోమీటర్ల వరకూ అపరిమిత వారంటీనిప్రకటించింది. 2015 జూన్‌లో విడుదల చేసిన జీతో తక్కువ నిర్వహణ వ్యయంతోపాటు 30శాతం ఎక్కువ రాబడులు సాధించేవిధంగా మైలేజి ఇస్తుందన ఇకంపెనీ సిఇఒ ప్రవీణ్‌షా వెల్లడించారు. రెండుటన్నుల ఎల్‌సివి సామర్ధ్యంతో కంపెనీ నడుస్తుందన్నారు. జీతో ఇంధన సామర్ధ్యం 37.6 కిలోమీటర్ల వరకూ ఉం టుందని, అపోలో సివి ఆఫ్‌ది ఇయర్‌ అవార్డును కూడా సాధించినట్లు ప్రవీణ్‌షా వివరించారు.
1entertainment
ఆయన కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తోందట Highlights ఆయన కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తోందట కథానాయికలకు కాలం కలిసి రావడమంటే స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు రావడమే. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలోని సినిమాలను చూస్తుంటే, ఆమెకి కాలం కలిసొచ్చిందనే అనిపిస్తోంది. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి 'సాక్ష్యం' సినిమాతో పలకరించనున్న ఆమె, ఎన్టీఆర్ .. మహేష్ బాబు .. ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ మూడు ప్రాజెక్టులలో త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇటీవలే యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించిన త్రివిక్రమ్, వచ్చే నెలలో సాంగ్స్ ను చిత్రీకరించనున్నాడట. ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సరో అందరికీ తెలిసిందే. డాన్స్ విషయంలో ఆయన స్పీడ్ ను అందుకోవడం కష్టమని ఆయనతో జోడీ కట్టిన హీరోయిన్స్ అంతా చెబుతుంటారు. అందువలన అలాంటి ఇబ్బంది లేకుండగా ఉండటం కోసం పూజా హెగ్డే డాన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తోందట. ప్రస్తుతం డాన్స్ పైనే పూర్తి దృష్టి పెట్టిన ఈ సుందరి .. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.    Last Updated 5, May 2018, 2:01 PM IST
0business
Venkata ratnam కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ నుంచి 3 డిజిటల్‌ పథకాలు హైదరాబాద్‌: కరూర్‌వైశ్యాబ్యాంకు ఖాతాదారులకు బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింతచేరువచేసే లక్ష్యంతో కొన్ని డిజిటల్‌ విధానాలు అమలుచేస్తోంది. ఫాస్టాగ్‌, యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యుపిఐ), భారత్‌ బిల్‌పేమెంట్‌ వ్యవస్థలను ప్రారంభించింది. దీనితో కరూర్‌వైశ్యాబ్యాంకు దక్షిణభారత్‌ దేశంలో ఫాస్టాగ్‌ సర్వీసులుప్రారంభించిన తొలిబాంక్‌గా నిలిచిందని బ్యాంకు ఎండిసిఇఒ వెంకటరత్నం వెల్లడించారు. ముందుగా లోడ్‌చేసిన ట్యాగ్‌లను వాహణాలకు అమరుస్తారు. టోల్‌ప్లాజాలవద్ద క్యూల్లో నిలుచుండడం, సుంకం చెల్లించేందుకునగదు నిర్వహించడం వంటివి అవసరం లేకుండా వాహనాలు ముందుకు సాగడానికి సాయపడుతుందని ఫాస్టాగ్‌ ముందుగానే నిల్వ ఉంటుంద న్నారు. సుంకం మొత్తాలు టోల్‌ప్లాజాల వద్ద సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్‌గా డెబిట్‌అవుతాయన్నారు.ట్యాగ్‌లను అవసరమైన పుడు రీలోడ్‌చేసుకోవచ్చు. యుపిఐఒకమొబైల్‌యాప్‌ సాయం తో కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారా నగదు బదిలీలుచేసు కోవచ్చు. భారత్‌ బిల్‌పేమెంట్‌ వ్యవస్థకూడా జాతీయ చెల్లింపు ల సంస్థ అందిస్తున్న కార్యాచరణ. విద్యుత్‌, నీరు, గ్యాస్‌, డిటిహెచ్‌, టెలికాంసేవల్లోబిల్లులను ఒకేయుటిలిటీ సైట్‌ద్వారా చెల్లించుకోవచ్చని కరూర్‌వైశ్యాబ్యాంక్‌ వెల్లడించింది. కస్టమర్లకు మరింత అవగాహన పెంచేందుకు ఈ డిజిటల్‌ సేవలపై మరిన్ని సాంకేతిక ప్లాట్‌ఫారాలపై బ్యాంకు పనిచేస్తుందని వెంకటరత్నం వెల్లడించారు. =======
1entertainment
internet vaartha 212 Views ముంబై : దేశంలోని 29 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 2013 నుంచి 2015 మధ్యకాలంలో 1.14 లక్షల కోట్ల మొండిబకాయిలను రద్దుచేసినట్లు తేలింది. అంతకుముందు తొమ్మిదేళ్లలో రద్దుచేసిన బకాయిలకంటే మరింత రెట్టింపు ఉన్నాయి. ఆర్‌టిఐ కింద దరఖాస్తుకు స్పందించిన బ్యాంకర్లు ఆర్‌బిఐ సమాధానం ఇస్తూ రానిబాకీలు 2012 మార్చినాటికి 15,551 కోట్లుగా ఉన్నాయని అదే మార్చి 2015 నాటికి 52,542 కోట్ల రూపాయలకు పెరిగినట్లు వెల్లడించింది. అతిపెద్ద బకాయిదారులు, వ్యక్తులు, వాణిజ్యసంస్థలు పరంగాచూస్తే 100 కోట్లకుపైబడి నవి రద్దు అయ్యాయని ఆర్‌బిఐ ప్రకటించింది. అందుకు సంబంధించి సమాచారం తమవద్దలేదని ఆర్‌బిఐ వెల్లడించింది. బ్యాంకులు మొత్తం తమ రానిబాకీల జాబితాలను ఏకమొత్తంగా అందించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2004నుంచి 2015 మధ్యకాలంలో 2.11లక్షలకోట్లుగా ఉన్నట్లు తేలింది. 2013-2015 మధ్యకాలంలో లక్షా 14 వేల 182 కోట్లతో పోలిస్తే 50శాతం తక్కువేనని తేలింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ బ్యాంకులు గడచిన ఐదేళ్లలో ఒక్కబాకీ కూడా లేనట్లు తేలింది. ఇతరత్రా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల రుణాలు నాలుగుశాతం చొప్పున పెరిగాయి. 2004 -2012 మధ్యకాలంలోనే నాలుగుశాతం పెరిగినట్లు ప్రకటించింది. 2013-2015 మధ్యకాలంలో ఈ రుణాలు 60శాతం పెరిగాయి. రానిబాకీలు మార్చి 2015 నాటికి మరింత రద్దయ్యాయి. 2013లో రద్దుచేసిన రుణాల్లో 85శాతం 2015 మార్చినాటికి రద్దయ్యాయి. దేశంలోని టాప్‌పది బ్యాంకులు రద్దు చేసిన రుణాలు ఇలా ఉన్నాయి. ఎస్‌బిఐ 21,313 కోట్లు, పంజాబ్‌నేషనల్‌బ్యాంకు 6587 కోట్లు, ఇండి యన్‌ ఓవర్సీస్‌బ్యాంకు 3131కోట్లు, అలహాబాద్‌ బ్యాంకు 2109కోట్లు, ఐడిబిఐబ్యాంకు1609 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌బరోడా 1564 కోట్లు, సిండికేట్‌బ్యాంకు 1527కోట్లు, కెనరాబ్యాంకు 1472కోట్లు, యుకో బ్యాంకు 1401కోట్లు, సెంట్రల్‌బ్యాంక్‌ ఆఫ్‌ఇండియా 1386కోట్లు రద్దుచేసేందుకు నిర్ణయించినట్లు తేలింది. అలాగే ఈ టాప్‌ పది బ్యాంకులు గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారీగానే రుణాలను రుద్దచేసాయి. ఎస్‌బిఐ 40,084 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌బ్యాంకు 9531కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు 64278కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4983 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 4884కోట్లు, కెనాబ్యాంకు 4598కోట్లు, సెంట్రల్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4442కోట్లు, అలహాబాద్‌బ్యాంకు 4243 కోట్లు, సిండికేట్‌బ్యాంకు3849కోట్లు,  ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ 3593 కోట్లు రద్దుచేసినట్లు ఆర్‌బిఐ గణాంకాలను బట్టి అర్థంఅవుతోంది. అలాగే ఆర్‌టిఐ దరఖాస్తుకు అందిన సమాచారం చూస్తే 2004నుంచి చూస్తే 2011 మధ్యకాలంలో రాని బాకీలు నాలుగురెట్లు తగ్గినట్లు తేలింది. రాని బాకీలుగా ప్రకటించిన బ్యాంకుల్లో భారతీయ స్టేట్‌ బ్యాంకు అగ్రగామిగా ఉంది. 2013 నుంచి చూస్తే 5594 కోట్లు తేలితే 2015లో 21.313 కోట్లుగా ఉన్నాయి. ఎస్‌బిఐ రానిబాకీలు చూస్తే మొత్తం రాని బాకీల్లో 40శాతంగా ఉన్నాయి. ఇతర 20బ్యాం కులు రుద్దు చేసిన బాకీల్లో 40శాతం ఉన్నాయి. 2014-15లో రానిబాకీలు 34,490కోట్లుగా ఉన్నా యి. 2004-13 మధ్యకాలం నాటి రానిబాకీలతో పోలిస్తే పదివేల కోట్లు పెరిగాయి. దేశంలోని రెండో అతిపెద్ద బ్యాంకు పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు మొండి బకాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2014 -15లో 238 శాతం పెరిగాయి. 1947 కోట్లు 2014తో ఉంటే 2015లో 6587 కోట్లుగా ఉన్నా యి. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ ఈ మొండిబకాయిలపైనే పదేపదే హెచ్చరిస్తూ వస్తున్నాయి. నిరర్ధక ఆస్తులపరంగాచూస్తే బ్యాంకులు ఖచ్చితంగా కఠిన కార్యాచరణ అవలంభించాల్సిందే నని స్పష్టంచేస్తూ వచ్చారు. సమస్యాత్మక ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే నిరర్ధక ఆస్తులు, పునర్‌వ్యవస్థీకృత రుణాలు వంటివాటిని కలుపుకుంటే మొత్తం ఏడులక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్‌బిఐ అంచనా వేసింది. ఎన్‌పిఎలు 17-18శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల నిరర్ధకరుణాలు 6.03శాతంపెరిగాయి. 2015మార్చినాటికి 5.20 శాతం ఉన్న మొండి బకాయిలు 6.03శాతంగా ఉన్నాయి. డిసెంబరు 31వ తేదీతో ముగిసిన త్రైమాసికంతోపాటు అంతకుముందు త్రైమాసికం నుంచి ఆర్‌బిఐ ఎన్‌పిఎలను వర్గీకరించి కఠిన తరమైన రికవరీలకు ఆదేశించడంతో కొంతమేర కదలిక వస్తుందని స్పష్టం అవుతోంది.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Stock Market:హ‌మ్మ‌య్య! స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు లాభాలు ప్రారంభ ట్రేడింగ్ నుంచి ఒడుదొడుకుల మధ్య కదిలిన దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. Samayam Telugu | Updated: May 22, 2018, 05:19PM IST లాభాల్లో మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్ నుంచి ఒడుదొడుకుల మధ్య కదిలిన దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఫలితంగా ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 35 పాయింట్లు పెరిగి 34,651 వద్ద నిలవగా.. 20 పాయింట్లు బలపడిన నిఫ్టీ 10,537 వద్ద స్థిరపడింది. మ‌దుప‌ర్లు చిన్న షేర్లపట్ల ఆసక్తి చూపడంతో బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.65 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1444 లాభపడగా.. 1179 నష్టపోయాయి. 35 పాయింట్లు లాభ‌ప‌డ్డ సెన్సెక్స్
1entertainment
Hyd Internet 107 Views Maaruti suzuki Maaruti suzuki న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ) వాహన అమ్మకాలు ఆగస్టు నెలలో 23.8శాతం పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో 1,32,211 యూనిట్లను విక్రయించగా, ఈ ఏడాది 1,63,701 వాహనాలను విక్రయించింది. దేశీయ అమ్మకాలు 26.7శాతం పెరిగి 1,52,000కు చేరాయి. 2016 ఆగస్టులో దేశీయంగా 1,19,931 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. మినీ కార్ల విభాగంలో వేగ‌నార్ ,ఆల్టో స‌హా పలు వాహన అమ్మకాలు స్వల్పంగా 35,490 నుంచి 35,428కు తగ్గాయి. అయితే కాంపాక్ట్‌ విభాగంలో స్విఫ్ట్‌, ఎస్టిలో, డిజైర్‌, బాలినో విక్రయాలు 62.4శాతం పెరగడం ద్వారా 74,012 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే ఎగుమతులు 4.7శాతం మేర తగ్గి 11,701 వాహనాలకు పరిమితమయ్యాయి.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV Bajaj Qute Quadricycle: మార్కెట్‌లోకి బజాజ్ కారు.. మైలేజ్ 43 కిలోమీటర్లు కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ క్వాడ్రిసైకిల్స్ విభాగానికి సంబంధించిన కొన్ని నిబంధనలను రూపొందించింది. వీటి ప్రకారం క్వాడ్రిసైకిల్స్ విభాగం కింద మార్కెట్‌లోకి వచ్చే వాహనాల బరువు 475 కేజీలలోపు ఉండాలి. Samayam Telugu | Updated: Mar 27, 2019, 08:37AM IST హైలైట్స్ బజాజ్ క్యూట్ పేరుతో మార్కెట్‌లోకి పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్ ఆప్షన్లలో అందుబాటులో ధర రూ.2.63 లక్షల నుంచి ప్రారంభం ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఎట్టకేలకు నాలుగు చక్రాల వాహనాలను మార్కెట్‌లోకి తీసుకుచ్చింది. దీని పేరు బజాజ్ క్యూట్ . రాజస్థాన్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఈ వాహనాన్ని మార్కెట్‌లో లాంచ్ చేసింది. బజాజ్ ఈ వాహనాన్ని క్వాడ్రిసైకిల్స్ అనే కొత్త విభాగం కింద మార్కెట్‌లో ఆవిష్కరించింది. బజాజ్ ఈ నాలుగు చక్రాల వాహనాన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు చాలా అవరోధాలను ఎదుర్కొంది. నిబంధలకు అనువుగా ఇందులో చాలా మార్పులు చేసింది. బజాజ్ క్యూట్ ధర రూ.2.63 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. ఈ ధర పెట్రోల్ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇక ఇందులోనే సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.2.83 లక్షలుగా ఉంది. అంచనాల కన్నా ధర ఎక్కువగా ఉండటం గమనార్హం. కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ క్వాడ్రిసైకిల్స్ విభాగానికి సంబంధించిన కొన్ని నిబంధనలను రూపొందించింది. వీటి ప్రకారం క్వాడ్రిసైకిల్స్ విభాగం కింద మార్కెట్‌లోకి వచ్చే వాహనాల బరువు 475 కేజీలలోపు ఉండాలి. భద్రతా ప్రమాణాలు, ఉద్గార నిబంధనలను కచ్చితంగా పాటించాలి. క్రాష్ టెస్ట్ తప్పనిసరి. బజాజ్ క్యూట్ ప్రత్యేకతలు.. ❋ ఇంజిన్- 216.6 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ❋ మాగ్జిమమ్ పవర్- (పెట్రోల్) 13 హెచ్‌పీ@5500 ఆర్‌పీఎం (సీఎన్‌జీ) 10.8 హెచ్‌పీ@5500 ఆర్‌పీఎం ❋ మాగ్జిమమ్ టార్క్- (పెట్రోల్) 18.9 ఎన్ఎం@4000 ఆర్‌పీఎం (సీఎన్‌జీ) 16.1 ఎన్ఎం@4000 ఆర్‌పీఎం ❋ గేర్లు- 5 ❋ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం- 8 లీటర్లు ❋ టాప్ స్పీడ్- గంటకు 70 కిలోమీటర్లు ❋ మైలేజ్- పెట్రోల్ వేరియంట్: లీటరుకు 35 కిలోమీటర్లు సీఎన్‌జీ వేరియంట్: కిలోగ్రాముకు 43 కిలోమీటర్లు
1entertainment
internet vaartha 158 Views హైదరాబాద్‌ : రక్తంలో చక్కెరనిల్వలు తరచూ పరీక్షించుకునే జాగ్రత్తలు తరచూ తీసుకోవాలని రోచ్‌ డయాబెటిస్‌ కేర్‌ ఇండియా బిజి నెస్‌ హెడ్‌ సిద్ధార్ధరాయ్ వెల్లడించారు. బ్లడ్‌ గ్లూకోజ్‌ పర్యవేక్షణ ఉత్పత్తుల తయారీలో పేరు పొందిన రోచ్‌ సంస్థ రియల్‌ హీరోస్‌ వర్సెస్‌ డయాబెటిస్‌ అన్న ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఆక్యుచెక్‌ యాక్టివ్‌ సాయంతో నిత్యం పరీక్షించుకనే అవకా శంఉంది. దేశవ్యాప్తంగా మధుమేహంపై అవగాహన పెంచడంతో పాటు కంపెనీ వాణిజ్య విస్తరణకు కూడా రోషే నాందిపలుకుతోంది. కళ్లు, కిడ్నీ, నరాలబలహీనత, పాదాలసమస్యలు, గుండె పోటు వంటి వాటికిగురికాకుండా ఆరోగ్యం పరిరక్షించుకోవచ్చని ఈదిశగా రోషే కంపనీ విస్తృత ప్రచారంతోపాటు మార్కెట్‌కు తమ ఉత్పత్తులను కూడా ఎక్కువ అందుబాటులోకి తెచ్చిందన్నారు. భారత్‌లో రోజురోజుకూ మధుమేహరోగుల సంఖ్య పెరిగిపోతున్నది. అందుకోసమే నివారణ, నియం త్రణ జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు సిద్ధార్ధ్‌రాయ్ వెల్లడించారు.
1entertainment
అర్జంటెనాలో హీరో కొత్త ఇగ్నైటర్‌ విడుదల   న్యూఢిల్లీ, జనవరి 15: దేశంలో ద్విచక్రవాహన తయారీ దిగ్గజం హీరోమోటోకార్ప్‌ గ్లామర్‌ కొత్తవెర్షన్‌ను విడుదలచేసింది. కంపెనీ సిఎండి పవన్‌ముంజాల్‌ ఈ కొత్త వాహనాలను విడుదల చేసారు. మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో గ్లామర్‌ను ఇగ్నేటర్‌గా మార్కెట్‌చేస్తోంది. ఇగ్నే టర్‌తో పాటే కంపెనీ డ్యాష్‌ స్కూటర్‌, హంక్‌, హంక్‌ స్పోర్ట్స్‌బైక్‌లను కూడా విడుదలచేసింది. అర్జంటెనా మార్కెట్‌కు గ్లామర్‌ కొత్త వెర్షన్‌ విడు దలచేయడం వల్ల మార్కెట్‌ వాటా విపరీతంగా పెరుగుతుందని అంచనావేస్తోంది. హీరో పరంగా అర్జంటెనా మార్కెట్‌ 35వ విదేశీ మార్కెట్‌గా నిలిచింది. కంపెనీ 40 డీలర్‌ షిప్‌లను ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి 90 డీలర్‌షిప్‌లకు విస్తరిస్తామని వివరిం చింది. 2020 నాటికి 50 ప్రపంచ దేశాల మార్కెట్లకు హీరో విస్తరిస్తుందని పవన్‌ ముంజాల్‌ వెల్లడించారు. అర్జంటైనా, లాటిన్‌ అమెరికా మార్కెట్లలో విడుదల చేయడం పట్ల గ్లోబల్‌ మార్కెట్‌కు మరింత చేరువకాగలుగుతు న్నట్లు వెల్లడించారు. కంపెనీ అర్జంటెనా స్కార్‌ క్రీడాకారుడు డియోజియో సిమోన్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. సిమోన్‌ 2016లో అత్యుత్తమ సాక్కర్‌ కోచ్‌గా నిలిచారు. టైగర్‌వుడ్‌ తర్వాత హీరోకు సిమోనో రెండో బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచారు.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV అతనిలో ఎవరో ఉన్నారు ? రిహాన్, షైనా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరూ కలిసి ఓ మంచి ఇంటిలో కాపురం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడే భర్త ఒక అంతుచిక్కని రహస్యంగా మారిపోయాడు. తన భర్తతో కలిసి ఉన్నంత సేపు షైనాకు ఇంకెవరితోనో ఉన్నట్లు అనిపిస్తుంది... TNN | Updated: Aug 16, 2016, 01:19PM IST X Bathukamma Song: మంగ్లీ బత... రిహాన్, షైనా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరూ కలిసి ఓ మంచి ఇంటిలో కాపురం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడే భర్త ఒక అంతుచిక్కని రహస్యంగా మారిపోయాడు. తన భర్తతో కలిసి ఉన్నంత సేపు షైనాకు ఇంకెవరితోనో ఉన్నట్లు అనిపిస్తుంది. అతనిలో ఎవరిదో ఆత్మ ప్రవేశించినట్లుగా అనిపిస్తుంది. దీంతో భర్తకు భయపడుతూ అతనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది షైనా. మరోవైపు తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనకెందుకు దూరంగా ఉంటుంది.? తనకు ఇంకెవరైనా ఉన్నారా? ఆమె తనకు తెలియకుండా ఏదైనా దాచిపెడుతుందా అనుకుంటాడు భర్త రిహాన్. ఇంతకీ వారిద్దరి మధ్య ఎవరు ఉన్నారు? ఆ రహస్యమేంటి తెలియాలంటే ' రాజ్ రీబూట్ ' సినిమా చూడాల్సిందే. ఇమ్రాన్ హష్మి , క్రితి కర్బందా , గౌరవ్ అరోరా ప్రధాన పాత్రలుగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం 'రాజ్ రీబూట్'. ఇప్పటివరకే రాజ్ సిరీస్ లో మూడు చిత్రాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలకు సీక్వెల్ గా 'రాజ్ రీబూట్' సినిమా రాబోతుంది. విశేష్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ లో దర్శకుడు విక్రమ్ భట్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సెప్టెంబర్ 16న 'రాజ్ రీబూట్' విడుదల కానుంది. Raaz Reboot
0business
Hyd Internet 103 Views PRO KABADDI Pro Kabaddi రాంచీ: ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో టై. రాంచీ వేదికగా బెంగుళూరు బుల్స్‌తో జరిగిన పోరును టైటాన్స్‌ 26-26తో టై చేసింది. ఈ రెండు జట్లు పోటీపడటం ఇది మూడోసారి కాగా టై కావడం రెండోసారి. టైటాన్స్‌లో రాహుల్‌ చౌదరి 8రైడ్‌, విశాల్‌ భరద్వాజ్‌ 7 ట్యాకిల్‌ పాయింట్లు సాధించారు. బుల్స్‌లో సారథి రోహిత్‌ కుమార్‌ 8రైడ్‌ పాయింట్లు చేశారు.
2sports
Jul 15,2016 మార్కెట్లోకి 'స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌ 110' న్యూఢిల్లీ: దేశీయ దిచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ కొత్త స్ల్పెండర్‌ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఎంతో కాలంగా ద్విచక్ర వాహన ప్రియులు వేచి చూస్తున్న 'స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌ 110'ను హిరో సంస్థ గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను సంస్థ రూ.53,300గా (ఎక్స్‌షోరూమ్‌ న్యూఢిల్లీ) నిర్ణయించింది. హోండా సంస్థ నుంచి విడిపోయాక హీరో సంస్థ తన కంపెనీకి చెందిన జైపూర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ కేంద్రంలో స్వయంగా రూపొందించి ద్విచక్ర వాహన ఇదే కావడం విశేషం. పూర్తిగా సరికొత్త చాసిస్‌, కొత్త ఫ్రేమ్‌తో పాటు పూర్త్తి నూతన ఇంజిన్‌తో దీనిని హీరో సంస్థ తయారు చేసింది. వాహన ఇంజిన్‌ సామర్థ్యాన్ని పెంచేలా ఐ3ఎస్‌ టెక్నాలజీతో ఈ 'స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌ 110'ను సంస్థ రూపొందించింది. 110సీసీ, 8.9 బీహెచ్‌పీ, 9 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ ఇంజిన్‌ సామర్థ్యంతో పాటు అలాయిడ్‌ ట్యూబ్‌లేని టైర్లు ఈ వాహనం ప్రత్యేకతలు. సరికొత్త 'ఇండియన్‌ డ్రైవింగ్‌ సైకిల్‌' పరిశీలన మేరకు ఈ వాహనం లీటరుకు 68 కి.మీ. మైలేజీని అందిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బీసీసీఐకి చెల్లించండి.. పాక్ క్రికెట్ బోర్డ్‌కు ఐసీసీ షాక్! ద్వైపాక్షిక సిరీస్ ఆడకపోవడంతో.. బీసీసీఐ నుంచి రూ.447 కోట్ల పరిహారం రాబడదామనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. Samayam Telugu | Updated: Dec 19, 2018, 07:03PM IST బీసీసీఐకి చెల్లించండి.. పాక్ క్రికెట్ బోర్డ్‌కు ఐసీసీ షాక్! బీసీసీఐ నుంచి పరిహారం కోరుతూ ఐసీసీ మెట్లెక్కిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్‌కు షాక్ తగిలింది. పరిహారం కోసం ఆశపడి ఐసీసీని ఆశ్రయిస్తే.. బీసీసీఐకి తిరిగి సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌ ఆడకపోవడంతో.. పరిహారం చెల్లించాలని బీసీసీఐని పీసీబీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రూ.447 కోట్ల పరిహారం కావాలని కోరతూ పీసీబీ ఐసీసీని ఆశ్రయించింది. కానీ పాక్ వాదనలను ఐసీసీ వివాదాల పరిష్కార ప్యానెల్ తోసిపుచ్చింది.
2sports
ఇక ఖాయిలాల మూసివేత వేగవంతం - కొత్త మార్గదర్శకాలకు క్యాబినెట్‌ ఆమోదం న్యూఢిల్లీ: ఖాయిలా పడ్డ, నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ సంస్థల మూసివేతలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు సవరించిన కొత్త మార్గదర్శ కాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఖాయిలా పడిన, నష్టాల్లో ఉన్న సంస్థలను ఒక క్రమ పద్ధతిలో నిర్ధిష్ట కాలంలో విక్రయించేందుకు చర్యలు చేపట్టేలా కొత్త మార్గదర్శకాలను సర్కారు రూపొందించారు. ఆయా సంస్థలతో పాటు వాటికి చెందిన స్థిర, చరాస్తులను వీలైనంత త్వరగా విక్రయించేలా సర్కారు కొత్త మార్గదర్శకాలను రూపొందించినట్టుగా సమాచారం. ఎయిరిండియాలో కీలక వాటా విక్రయం విషయంలో సర్కారు విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో చురుగ్గా పావులు కదిపినట్టుగా తెలుస్తోంది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఖాయిలా పడిన లేదా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భూములలో స్థానిక ప్రజలకు చౌక గృహ నిర్మాణం చేపట్టేందుకు తొలి ప్రాధాన్యతనివ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు గాను గృహనిర్మాణ, పట్టణాల వ్యవహారాల శాఖకు చెందిన మార్గదర్శకాల మేరకు చర్యలు చేపట్టాలని క్యాబినెట్‌ నోట్‌లో వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థల శాఖ 2016 సెప్టెంబరులో జారీ చేసిన మార్గదర్శకాల స్థానంలో కొత్త మార్గదర్శకాలు త్వరలో అమలులోకి రానున్నాయి. సంస్థల మూసివేత ప్రక్రియలో మైలురాళ్లను గుర్తించి వాటిని అమలు చేసేందుకు గాను ముందుగానే సమయాన్ని నిర్దేశించుకొని.. వాటికి అనుగుణంగా సంస్థలను మూసివేస్తూ వెళ్లడమే తాజా నియమావళిలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. సంస్థల మూసివేత ఆయా పీఎస్‌యూల్లో పని చేస్తున్న ఉద్యోగులకు భారంగా మారకుండా చూసేందుకు గాను నోషనల్‌ పేస్కేల్‌ విధానంలో స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమాన్ని అమలు చేయాలని తాజా మార్గదర్శకాల్లో సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
పదవీ విరమణ తర్వాతే పూర్తిసొమ్ము లేనిపక్షంలో 50శాతం మాత్రమే అనుమతి న్యూఢిల్లీ : ఇపిఎఫ్‌60 శాతం సొమ్ము, వడ్డీపై ఒకటి శాతం పన్నువిధింపును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జీత భత్యాల ఉద్యోగులకు హర్షదాయకమేఅయినప్పటికీ కొత్త నిబంధనలు వస్తున్నాయి. పదవీ విరమణకు ముందే పూర్తిస్థాయి పింఛన్‌ సొమ్ము విత్‌డ్రా చేసు కునేందుకు వీలులేదు. గత నెల పదవ తేదీ కార్మిక ఉపాధి సంక్షేమశాఖ రూపొందించిన కొత్త నిబందన ప్రాకరం చూస్తే ఎవరైనా రెండునెలలపాటు ఉద్యో గం లేకుండా ఉంటే ఇపిఎఫ్‌ఖాతానుంచి సొమ్ము విత్‌డ్రాచేసుకోవాలని భావిస్తే అప్పుడు మాత్రమే పూర్తిస్థాయి ఇపిఎఫ్‌ సొమ్మును విత్‌డ్రాచేసుకునే సదుపాయం ఉంది. అయితే ఆ ఉద్యోగి యజమాని చెల్లించిన వాటా వడ్డీని మాత్రం 58 ఏళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో రెండునెలలు ఉద్యోగం లేక పోయినా ఎవరైనా సరే మొత్తంసొమ్మును విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. పదవీవిరమణకు ముందు సొంత వ్యాపారం ప్రారంభించాలన ఇభావిస్తే మొత్తం ఇపిఎఫ్‌సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు వీలులేదు. కేవలం 50 శాతం సొమ్మును మాత్రమే అనుమతిస్తారు. వివాహం, ప్రసూతి సమయం లేదా అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకారణంగా మహిళలు ఉద్యోగాలు వదిలి వేసినపక్షంలో వారికి పూర్తి మొత్తం లభిస్తుంది. మిగిలిన అన్ని సందర్భాల్లో ఇపిఎఫ్‌ సొమ్ము 58 ఏళ్లవరకూ పిఎఫ్‌ ఖాతాలోనే లాక్‌ అయి ఉంటుంది. 36 నెలల పాటు ఎటు వంటి లావాదేవీలు జమలు లేనిపక్షంలో పిఎఫ్‌ ఖాతా నిరర్ధకంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఇలాంటిఖాతాలకు ఎటువంటివడ్డీ కూడా చెల్లించరు.
1entertainment
SRM UniversityConvocation At Chennai క్రికెట్‌ తర్వాత బాడ్మింటన్‌కే ఆదరణ చెన్నై, అక్టోబరు 16 ప్రభాతవార్త : భారత్‌లో బాడ్మిం టన్‌కి అత్యంత ప్రోత్సాహం ఉందని, క్రికెట్‌ తర్వా త బాడ్మింటన్‌నే ప్రజలు ఆదరిస్తున్నారని అంత ర్జాతీయ ప్రముఖ బాడ్మింటన్‌్‌ క్రీడాకారిణి, పద్మ భూషణ్‌ సైనా నెహ్వాల్‌ తెలిపారు. చెన్నై కాటాన్‌ కొళత్తూర్‌లోని ఎస్‌ఆర్‌ఎం వర్శిటీ 12వ ప్రత్యేక స్నాతకోత్సవం ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బాడ్మింటన్‌ చాం పియన్‌ సైనా నెహ్వాల్‌ హాజరయ్యారు. కార్యక్ర మానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న అమెరికాకు చెందిన ఎవన్‌ శ్యామ్యూల్‌ డొబెల్లీ.. సైనా నెహ్వా ల్‌కు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, భారత లా కమిషన్‌ మాజీ చైర్మన్‌ డా.ఏఆర్‌ లక్ష్మణన్‌కు గౌరవ డాక్టరేట్‌ (డి.లిట్‌) లను ప్రదానం చేశారు. బాడ్మింటన్‌ చాంపియన్‌ సైనా మాట్లాడుతూ విద్యా ర్థులు విద్యతో పాటు స్పోర్ట్స్‌పై దృష్టి సారిం చాలని, ఆత్మస్తైర్యంతో క్రీడలలో రాణించాలని, రోజూ ఫిట్‌నెస్‌పై 30-40 నిమిషాలు కేటాయిం చాలని తెలిపారు. నేను బాడ్మింటన్‌పై దృష్టి పెట్ట డంవల్ల గ్రాడ్యుయేషన్‌ చేసే అవకాశం కోల్పో యానని, నా చిన్నతనంలో కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌కు ప్రయత్నించగా, బ్రౌన్‌ బెల్ట్‌ వచ్చిందని, నా తండ్రి సలహాపై బాడ్మింటన్‌లో అవిరళ కృషి చేసి, ప్రపం చస్థాయి క్రీడాకారిణిగా ఎదిగానని తెలిపారు. మోకాలి ఆపరేషన్‌ వల్ల ఈసారి ఒలంపిక్‌ గేమ్స్‌లో పాల్గొనలేకపోయానని, తదుపరి ఒలంపిక్‌ పోటీల్లో పాల్గొంటానని ఆమె పేర్కొన్నారు. ఒకప్పటి సౌకర్యాలకు ఇప్పటి సౌకర్యాలను పొల్చుకుంటే మనదేశంలో బాడ్మింటన్‌కు ప్రతిభావంతులైన శిక్షకులు ఉన్నారని, వారి ద్వారా మెరుగైన ప్రగతిని సాధించవచ్చని తెలిపారు. ఇకముందు టోర్న మెంట్స్‌ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతానని సైనా తెలిపారు. అమెరికాకు చెందిన ఎవన్‌ శ్యా మ్యూల్‌ డొబెల్లీ మట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ క్రీడాకారులు రాణిస్తున్నారని, రానున్న కాలంలో మనదేశం హర్షించే స్థాయిలో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి డా.ఏఆర్‌ లక్ష్మణన్‌కు మాట్లాడుతూ అన్ని దానాలలోకి అవయవదానం గొప్పదని విద్యార్థులు ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. 6 వేల మంది విద్యార్థులకు డిగ్రీలు, 140 మంది విద్యార్థులకు బంగారు, రజత, కాంస్య పతకాలను అందజేశారు. కార్యక్రమంలో వర్శిటీ చాన్సలర్‌ డా.పి.సత్యనా రాయణ, వైస్‌ చాన్సలర్‌ డా.ప్రబీర్‌ బక్షి, రిజి స్ట్రార్‌ డా.ఎన్‌.సేతురామన్‌, ప్రొ.వీసీ టిపీ గణేశన్‌ తదితరులు పాల్గొన్నారు.
2sports
-  కీలకంగా నిలవనున్న ఫలితాలు, సూక్ష్మ గణాంకాలు -  రెండు వారాలుగా నష్టాలతో నెట్టుకొస్తున్న మార్కెట్లు  ముంబయి: వరుసగా గత రెండు వారాల నుంచి నష్టాల్లో నిలుస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారంతో ప్రారంభమయ్యే వారంలో లాభాలలో పయనించే అవకాశాలున్నట్లుగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సోమవారంతో (మే 9తో) ప్రారంభమయ్యే కొత్త ట్రేడింగ్‌ వారంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లను ప్రధానంగా సూక్ష్మ గణాంకాలు ప్రభావితం చేయనున్నాయి. కొత్త వారంలో మార్కెట్లను పారిశ్రామికోత్పత్తి, కీలక రంగాల ఉత్పత్తి, ద్రవ్యోల్బణం సూచీల గణంకాలు, వివిధ కంపెనీల ఆర్ధిక ఫలితాలు వాటిపై మార్కెట్‌ వర్గాల అంచనాలు ప్రభావితం చేయనున్నాయి. మే 12న మార్చి మాసానికి సంబంధించిన 'పారిశ్రామిక ఉత్పత్తి సూచీ' (ఐఐపీ) గణంకాలను ప్రభుత్వం వెల్లడించనుంది. ఫిబ్రవరిలో 2 శాతం పెరిగిన ఐఐపీి ఆ తర్వాత వరుసగా ప్రతికూలతను ఎదుర్కోంటు వస్తోంది. ఏప్రిల్‌ మాసం 'వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ' (సీపీఐ) కదలికలను కేంద్ర గణంకాల శాఖ గురువారం (12న) ప్రకటించనుంది. మార్చిలో సీపీఐ 4.83 శాతంగా నమోదై 6 మాసాల కనిష్ట స్థాయి చేరింది. ఈ వారంలో పలు కార్పొరేట్‌ కంపెనీలు, బ్యాంకులు వచ్చే వారంలో మార్చితో ముగిసిన త్రైమాసికపు ఆర్థికర ఫలితాలను వెల్లడించనున్నాయి. హెచ్‌యూఎల్‌, ఎస్‌కెేఎఫ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హావెల్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్లెన్‌మార్క్‌, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర, నెస్లే ఇండియా, మనప్పుఱ్ణం, పొలారీస్‌ తదితర కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటి ఫలితాలు ఆయా స్టాక్‌లకు మాత్రమే కాకుండా సంబంధిత రంగాల పనితీరును కూడా ప్రభావితం చేయనున్నాయి. ఇవి దలాల్‌ స్ట్రీట్‌కు అత్యంత కీలకం కానున్నాయి. ఇప్పటికే సూచీల వరుస నష్టాలతో కుంగిన నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ట్రేడింగ్‌ వారంలో మార్కెట్లు పుంజుకునే అవకాశాలున్నట్లుగా మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 1.4 శాతం కుంగిన సూచీలు..  వరుసగా రెండో వారంలోనూ భారత మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. అదాని పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ సూచీ అత్యధిక తన విలువను కోల్పోయింది. మే 6తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 378 పాయింట్లు (1.48 శాతం) క్షీణించి 25,228.50 పాయింట్లకు పడిపోయింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 116 పాయింట్లు (1.48 శాతం) పతనమై 7,733.45 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌కు గాను 23 షేర్లు ప్రతికూలతనే ఎదుర్కొన్నాయి. అదాని పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ సూచీ అత్యధికంగా 18.17 శాతం కుంగి రూ.238.25 వద్ద ముగిసింది. ఇదే క్రమంలో ఐసీఐసీఐ బ్యాంకు 7.80 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ 7.31 శాతం, టాటా స్టీల్‌ 6.02 శాతం, ఓఎన్‌జీసీ 4.41 శాతం చొప్పున క్షీణించి అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భెల్‌ సూచీలు వరుసగా 7.24 శాతం, 6.62 శాతం, 2.34 శాతం, 1.08 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. రంగాల వారిగా లోహ, బ్యాంకింగ్‌, ఐటీ సూచీలు వరుసగా 3.60 శాతం, 3.01 శాతం, 2.54 శాతం చొప్పున అధిక విలువ కోల్పోయాయి. ఇతర సూచీలు అన్నీ కూడా నష్టాలలోనే నిలిచాయి. బీఎస్‌ఈ-500లో బ్లూస్టార్‌, జిందాల్‌ పాలీ, వెల్‌స్పన్‌ ఇండియా, పీవీఆర్‌, బీఈఎంఎల్‌, స్పైస్‌ జెట్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇమామీ, మారికో సూచీలు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
రష్యా! ఓ రష్యా! ఓడిపోయావా రష్యా..! Highlights ఈసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన రష్యా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ క్వార్టర్ ఫైనల్స్ దాకా చేరింది. అంతే నివ్వెరపాటుకు గురి చేస్తూ ఓటమిపాలైంది ఆది నుంచి పోరాటం.. కప్ గెలుచుకోవాలని అంతులేని పోరాటం.. ఇది హోస్ట్ టీమ్ రష్యా ఆట తీరు. కానీ సెమీ ఫైనల్స్‌కు చేరుకోవాలనుకున్న రష్యా ఆశలపై పెనాల్టీలు నీరుగార్చాయి. శనివారం 2-2 తో డ్రాగా ముగుస్తుందనుకున్న  గేమ్ కాస్త షూట్ అవుట్‌తో 4-3 తేడాతో క్రొయేషియా‌కు విన్నింగ్ గేమ్ అయ్యింది. లూకా మాడ్రిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టోర్నీ నుంచి రష్యా నిష్క్రమణం.. సెమీ ఫైనల్స్‌కు క్రొయేషియా పయనం ఏకకాలంలో జరిగాయి. ఈసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన రష్యా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ క్వార్టర్ ఫైనల్స్ దాకా చేరింది. అంతే నివ్వెరపాటుకు గురి చేస్తూ ఓటమిపాలైంది. నువ్వా నేనా అంటూ సాగిన గేమ్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్‌ అయ్యింది.   క్వార్టర్ ఫైనల్స్‌లో క్రొయేషియాను ఢీకొట్టడానికి గ్రౌండ్‌లోకి రష్యా టీమ్ అడుగుపెట్టగానే గ్యాలరీ అంతటా కరతాళ ధ్వనులతో నల్ల సముద్రపు అలల హోరును తలపించింది. గత గేమ్‌లో స్పెయిన్‌ను మట్టి కరిపించిన తమ సొంత జట్టు అదే తరహాలో క్రొయేషియాను ఇంటికి సాగనంపి, సెమీ ఫైనల్స్‌‌కు ఎంట్రీ ఇస్తుందనే ఉత్సాహం రష్యన్లలో కనిపించింది. అదే జరిగితే కప్ కొట్టేయ్యడం పెద్ద విషయం కాదన్న ధీమా వారి ముఖాల్లో కనిపించింది.  కానీ నాటకీయమైన 2-2 డ్రా అనంతరం షూట్ అవుట్‌లో ఇవాన్ రకిటిక్ గెలుపు పెనాల్టీ సాధించడంతో క్రొయేషియా 4-3 తేడాతో రష్యాను ఓడించింది. అంతకుమునుపు 115వ నిముషం వద్ద మరియో ఫెర్నాండేజ్ గోల్ చేసి 2-2 తో స్కోరు సమం చేశాడు. దాంతో పెనాల్టీల అవసరం పడింది. కానీ మరియో, మరో రష్యన్ ప్లేయర్ ఫెడొర్ స్మొలోవ్ స్పాట్ కిక్‌లను గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. క్రొయేషియా తరఫున అండ్రేజ్ క్రామరిక్, డొమగోజ్ విడా ఆట తీరు ఆ టీమ్‌ను సెమీ ఫైనల్స్ బాట పట్టించింది. Last Updated 8, Jul 2018, 11:12 AM IST
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కివీస్ చేతిలో విండీస్ వైట్‌వాష్..! న్యూజిలాండ్ పర్యటనలో విండీస్‌ పేలవ ప్రదర్శన వన్డేల్లోనూ కొనసాగింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌ని 0-2తో చేజార్చుకున్న విండీస్.. తాజాగా TNN | Updated: Dec 26, 2017, 03:35PM IST కివీస్ చేతిలో విండీస్ వైట్‌వాష్..! న్యూజిలాండ్ పర్యటనలో విండీస్‌ పేలవ ప్రదర్శన వన్డేల్లోనూ కొనసాగింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌ని 0-2తో చేజార్చుకున్న విండీస్.. తాజాగా మంగళవారం ముగిసిన మూడు వన్డేల సిరీస్‌‌లోనూ చిత్తుగా ఓడింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 23 ఓవర్లలో 131/4తో నిలిచిన దశలో వర్షం రావడంతో మ్యాచ్‌ని అంపైర్లు నిలిపివేశారు. ఆట సమయం చాలాసేపు వేస్ట్ కావడంతో చివరికి 23 ఓవర్లకే మ్యాచ్‌ని కుదించిన అంపైర్లు .. విండీస్ లక్ష్యం 166 పరుగులుగా నిర్ణయించారు.
2sports
Recommended byColombia యాపిల్, జైల్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ బిగ్ బాస్ రెండు టీమ్‌లకు యాపిల్, జైలు టాస్క్‌లు ఇచ్చారు. దీన్ని రోల్ రైడా చదివి వినిపించాడు. గార్డెన్ ఏరియాలో ఉండే యాపిల్ చెట్టుకు రెడ్, బ్లాక్ యాపిల్స్ ఉన్నాయి. వాటిలో బ్లాక్ చెడ్డవాళ్లవి.. రెడ్ మంచివాళ్లవని చెప్పాడు. వాటిని రెండు టీమ్‌లు కోసి.. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కువ ఎవరైతే కాపాడుకుంటారో వాళ్లు విన్నర్లు అని చెప్పారు. ఇక జైలు టాస్క్‌లో.. ఓ ఇంటి సభ్యుడ్ని జైల్లో పెట్టాలి. తాళం వాటికా టేబుల్‌పై ఉంటుంది. ఈ రెండు టాస్కుల్లో మైక్‌లు, కెమెరాలకు ఎలాంటి నష్టం జరగకూడదు.. ఎవరూ గాయపడకూడదని నిబంధన పెట్టారు. టాస్క్ మొదలవ్వగానే రెండు టీమ్‌లు యాపిల్స్ కోసేశారు. కిందపడిపోయిన వాటిని పోటీపడి ఏరుకున్నారు. తర్వాత జైలుకు సంబంధించిన తాళం కోసం కూడా పోటీపడ్డారు. చివరి చెడ్డ టీమ్ సభ్యులకే తాళం దొరకడంతో.. జైలు తలుపు తీశారు. తర్వాత కౌశల్‌ను లోపల వేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తర్వాత తనీష్‌ను టార్గెట్ చేశారు. కాని రెండు టీమ్‌లు ఒకర్ని ఒకరు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఒకర్ని ఒకరు తోసుకోవడంతో గొడవ జరిగింది. దీనికి నిరసనగా.. మంచివాళ్ల టీమ్ సభ్యులు అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. తాళం తీసినంత మాత్రాన గేమ్ పూర్తి కాలేదని దీప్తి వాగ్వాదాని దిగింది. కొద్దిసేపటి తర్వాత దీప్తిని జైల్లో వేయడానికి తేజస్వి ప్రయత్నించినా కుదరదు. చెడ్డవాళ్లు యాపిల్స్‌ను దాచడానికి నానా కష్టాలు పడతారు. బాత్‌రూమ్ దగ్గర దాచినా.. మంచివాళ్ల గమనించి దొంగలించబోతారు. కాని వాళ్ల ఎత్తుల్ని పసిగట్టి వాటిని చెడ్డవాళ్లు జాగ్రత్తగా కాపాడుకుంటారు. అమిత్ అయితే యాపిల్స్‌ను కాపాడుకోవడానికి తన ప్యాంటులో కూడా దాచుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత రోల్ రైడాను జైల్లో పెట్టడానికి చెడ్డవాళ్ల టీమ్ ప్రయత్నించినా కుదరదు. ఈలోపు చెడ్డవాళ్ల టీమ్‌లో కొంతమంది సభ్యులు తన గురించి మాట్లాడుకోవడం తనీష్‌కు తెలుస్తుంది. తాను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని.. అలాంటప్పుడు తన గురించి వాళ్లకు ఎందుకంటూ కోపగించుకుంటాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఈ టాస్క్‌లను కొనసాగించాలని ఆదేశిస్తాడు. రెండు టీమ్‌లు ఎలాంటి పాయింట్లు సాధించలేదని.. తామర పూలు నాశనం చేసిన టాస్క్‌లో చెడ్డవాళ్ల టీమ్ ఓ పాయింట్ సాధించి లీడ్‌‌లో ఉందని చెబుతాడు. రేపు ఎక్కువ యాపిల్స్‌ను ఏ టీమ్ అయితే తిరిగి చెట్టు మీద పెడుతుందో ఆ టీమ్ గెలిచినట్లని బిగ్ బాస్ చెప్పాడు. జైలు, యాపిల్స్ టాస్కులకు బాబు గోగినేని డీల్ జైలు, యాపిల్ టాస్క్‌ విషయంలో బాబు గోగినేని రెండు టీమ్‌ల మధ్య డీల్‌కు ప్రయత్నించాడు. బాబు జైలుకెళితే.. చెడ్డవాళ్లు రెడ్ యాపిల్స్ జోలికి వెళ్లరు. అప్పడు చెడ్డవాళ్లకు రెండు పాయింట్లు.. మంచి వాళ్లకు ఒక్క పాయింట్ వస్తుంది. ఈ ప్రతిపాదనను బాబు మిగిలిన సభ్యులకు చెప్పగా వాళ్లు ఒప్పుకోరు. చెడ్డవాళ్ల టీమ్ మాత్రం ఓకే చెబుతుంది. మంచివాళ్ల టీమ్ సభ్యుల్లో తనీష్, కౌశల్ ఈ డీల్‌ను వ్యతిరేకిస్తారు. 2:1కు ఒప్పుకునేది లేదని.. 1:1 అంటారు. కాని చెడ్డవాళ్ల టీమ్ ఒప్పుకోదు.. డీల్ మాట్లాడిన బాబు గోగినేనిపై కూడా మండిపడ్డారు.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV వీడియోకాన్ కేసు: చందా కొచ్చర్‌కు సెబీ నోటీసులు వీడియోకాన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో చందా కొచ్చర్‌కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆమెకు ఈ కేసులో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి తాఖీదులు అందాయి. Samayam Telugu | Updated: May 25, 2018, 07:11PM IST వీడియోకాన్ కేసు: చందా కొచ్చర్‌కు సెబీ నోటీసులు వీడియోకాన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో చందా కొచ్చర్‌కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆమెకు ఈ కేసులో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి తాఖీదులు అందాయి. ఈ మేరకు శుక్రవారం (మే 25) బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. వీడియోకాన్ గ్రూపునకు రుణ మంజూరు వ్యవహారంలో చందా కొచ్చర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చందా కొచ్చర్ 2012లో క్విడ్ ప్రోకో విధానంలో వీడియోకాన్ గ్రూపునకు అక్రమంగా రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ వ్యవహారంలో చందా కొచ్చర్‌కు ఐసీఐసీఐ బ్యాంకు బాసటగా నిలవడం గమనార్హం. అయితే.. ఆరోపణల్లో నిజమెంతో నిగ్గు తేల్చడానికి దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ వ్యవహారంలో ఆదాయం పన్ను (ఐటీ) విభాగం ఇప్పటికే చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ నడుపుతున్న నూపవర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పవన విద్యుత్ సంస్థ నుంచి వివరణ కోరింది. సంస్థ ఆదాయంతోపాటు పన్ను చెల్లింపుల వివరాలను అడిగి తీసుకుంది. నూపవర్ సంస్థకు దీపక్ కొచ్చర్ వ్యవస్థాపక సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.3,250 కోట్ల రుణాన్ని పొందిన వీడియోకాన్ గ్రూపు అందుకు ప్రతిఫలంగా నూపవర్ సంస్థకు కొంత మొత్తాన్ని చెల్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూత్ ఖండించారు. విచారణలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన పలువురు అధికారులను సీబీఐ ప్రశ్నించింది. దీంతో పాటు ఈ రుణ లావాదేవీకి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
బిగ్ బాస్2: అమిత్ తో కలిసి విజిల్ వేసిన కమల్ హాసన్ Highlights ఈ క్రమంలో హౌస్ మేట్స్ కమల్ తో కొన్ని అనుభవాలు షేర్ చేసుకున్నారు. అమిత్ అయితే కమల్ పర్మిషన్ తీసుకొని అతడు 'నటించిన అపూర్వ సోదరులు' సినిమాలో ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని విజిల్ గా వేశాడు నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ సీజన్ 2 కి అతిథిగా లోకనాయకుడు కమల్ హాసన్ రావడం హౌస్ మేట్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. కమల్ హౌస్ లోకి ఎంటర్ అయిన వెంటనే అందరూ వెళ్లి ఆయన్ను హత్తుకొని కాళ్లు పట్టుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమను తాము పరిచయం చేసుకొని ప్రత్యేకంగా కమల్ ను హౌస్ లోకి ఆహ్వానించారు. హౌస్ లోకి వెళ్లిన కమల్ ఇల్లు చాలా బాగుందని, వారితో కొంత సమయం కేటాయించారు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ కమల్ తో కొన్ని అనుభవాలు షేర్ చేసుకున్నారు. అమిత్ అయితే కమల్ పర్మిషన్ తీసుకొని అతడు 'నటించిన అపూర్వ సోదరులు' సినిమాలో ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని విజిల్ గా వేశాడు. అయితే అతడితో కలిసి కమల్ కూడా విజిల్ వేయడం విశేషం. ఇక గీతామాధురి 'కమ్మని ఈ ప్రేమ లేఖలే' అంటూ పాట పాడింది. నూతన్ నాయుడు లోకనాయకుడే పెద్ద నాయకుడు అవ్వగలడని కమల్ ను పొగుడుతూ డైలాగ్స్ చెప్పాడు.  కమల్ తో పాటు 'విశ్వరూపం2' సినిమా హీరోయిన్ పూజాకుమార్, సంగీత దర్శకుడు జిబ్రన్ అలానే సినిమాటోగ్రాఫర్ కూడా హౌస్ లోకి వచ్చారు. హౌస్ మేట్స్ అందరూ కమల్ ను పూజాతో కలిసి 'అదిరేటి డ్రెస్సు మీరేస్తే' సాంగ్ లో నడిచివచ్చినట్లు ఒకసారి నటించమని అడిగారు. దానికి కమల్ అంగీకరించి హౌస్ మేట్స్ అడిగినట్లుగా స్టైల్ గా నడుచుకుంటూ హౌస్ లో అందరినీ ఎంటర్టైన్ చేశారు.   Last Updated 3, Aug 2018, 10:14 PM IST
0business
BSE జిఎస్‌టి పన్నురేట్లే కీలకం ముంబయి, మే 21: సాధారణ సగటువర్ష పాతం అంచనాలు, జిఎస్‌టి పన్ను శ్లాబ్‌రేట్ల ఖరారు వంటి అంశాలతో గడచిన వారం దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోనే ముగిసా యి. గతవారం ఐదు ట్రేడింగ్‌లలో నాలుగురోజులు మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎఫ్‌బిఐ కార్యకలాపాలను ప్రభా వితంచేసారన్న అభియోగాలతోబుధవారం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు పతనం కావడంతో దేశీయం గాను గురువారం ఆప్రభావం కనిపించింది. ఫలి తంగా వారం మొత్తంగా సెన్సెక్స్‌ 277 పాయింట్లు పుంజుకుఇ 30,465 పాయింట్లవద్ద స్థిరపడింది. నిఫ్టీ స్వల్పలంగా 27 పాయింట్లు లాభపడి 9428 వద్ద నిలిచింది. బుధవారం సెన్సెక్స్‌ 30,658 పాయింట్లవద్ద ముగియడం ద్వారా కొత్త రికార్డులు నమోదు చేసినట్లయింది. చిన్న షేర్లకు మాత్రం అమ్మకాల ఒత్తిడిపెరిగింది. మార్కెట్లు లాభాల్లో ముగిసినా చిన్నషేర్లుఎక్కువ ప్రభావితం అయ్యా యి. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌ సూచి 1.4శాతం పత నం అయితే స్మాల్‌క్యాప్‌ మరింత అధికంగా దాదా పు 2శాతం దిగజారింది. టాటాస్టీల్‌, ఐటిసి కంపెనీలు జోరుగా ఉన్నాయి. గడచిన వారం సెన్సెక్స్‌ దిగ్గజాలలో టాటాస్టీల్‌ 12శాతానికిపైగా దూసుకెళ్లింది. నాలుగోత్రైమాసికంలో ప్రోత్సాహ కరమైన ఫలితాలు సాధించడం ఈ కౌంటర్‌కు జోష్‌నిచ్చింది. ఐటిసి 4.2శాతం ఎగిసిపడింది. జిఎస్‌టిలోభాగంగా సబ్బులు, పేస్టులు వంట నూనెలు వంటి నిత్యావసరాలపై పన్నురేట్లు తగ్గ డంతో ఎఫ్‌ఎంసిజి స్టాక్స్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇదే బాటలో టిసిఎస్‌ ఆరుశాతం, లూపిన్‌ ఐదు శాతం, ఐసిఐసిఐ, టాటామోటార్స్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ మూడుశాతం చొప్పున వృద్ధిబాటలో ఉన్నాయి. ఒఎన్‌జిసి, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌ వంటి కంపెనీలు 2.4శాతం స్థాయిలో నష్టాలు చవిచూసాయి. ఇదిలా ఉంటే మూడు రోజుల నష్టాలకు చెక్‌పెడుతూ డాలరుతో మారకం విలువల్లో దేశీయ కరెన్సీబలపడింది. వారం చివరి లో మూడురోజుల వరసనష్టాలకు కట్టడి అయింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫోరెక్స్‌ రేట్లలో డాలరుతో రూపా యి మారకంవిలువలు 64.64వద్దనిలిచింది. బ్యాంకు లు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయిం చడంతో దేశీయ కరెన్సీకి బలమొచ్చిందని ఫారెక్స్‌ వర్గాలు చెపుతాయి. శుక్రవారం తొలుత రూపాయి 65వరకూ బలహీనపడింది. ఆతర్వాత నెలన్నర కనిష్టానికిచేరిం ది. గురువారం ముగింపులో 64.84తో పోలిస్తే 64.78వద్ద లాభాలతో మొదలైంది. ఆపై దేశీస్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించి 65.02 వద్ద కనిష్టం అయింది. చివరికి 0.31 శాతం బలపడి 64.64 వద్ద స్థిరపడింది. గడచిన మూడురోజుల్లో డాలరుతో మారకం విలువలపరంగా రూపా యి 79పైసలు నష్ట పోయింది. మొత్తం మీద డాలరుతో రూపా యి బలపడటం, రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడు శాతంగా నమోదుకావ డం, ఆర్థిక ప్రాధమిక వనరులు బలపడుతున్న సంకేతాలతో మార్కెట్లు ఊపందుకున్నాయని జియోజిత్‌ఫైనాన్షియల్స్‌ రీసెర్చి హెడ్‌ వినోద్‌నాయర్‌ అన్నారు. ఇకవర్షపాతం, ఆర్‌బిఐ జూన్‌నెల పాలసీ విధానం తటస్థంగా ఉంటుందన్న అంచనాలు రుతుపవనాలతో ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందన్న అంచనాలు మార్కెట్లకు కలిసొస్తా యన్నారు. ఐటి, టెలికాం, ఫార్మా, సూచీలు పునరేకీ కరణ దిశగా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ పరంగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. ట్రంప్‌పన్ను హామీలు, ఇన్‌ఫ్రాయ వ్యయం ఎఫ్‌బిఐలో జోక్యం వంటివి ఆందోళన కలిగించాయి. బ్రెజిల్‌ బెంచ్‌మార్క్‌ సూచీలన్నీ కూడా పదిశాతం దిగజారాయి. రాజకీయ సంక్షోబం కారణంగానే ఈ దుస్థితి కలిగింది. జిఎస్‌టి మండలి పన్నురేట్లు ఖరారుచేయడంతో వచ్చేవారం కొన్ని రంగాల మార్కెట్లకు కలిసొస్తుందన్న అంచనాలున్నాయని వినోద్‌నాయర్‌ వెల్లడించారు.
1entertainment
Hyderabad, First Published 9, Aug 2019, 4:22 PM IST Highlights సాహో సినిమా కోసం దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ సాహో ద్వారా కూడా అదే తరహాలో రికార్డులు బద్దలు కొడతాని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్ పోస్టర్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.    సాహో సినిమా కోసం దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ సాహో ద్వారా కూడా అదే తరహాలో రికార్డులు బద్దలు కొడతాని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్ పోస్టర్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.  రోజుకో డిఫరెంట్ పోస్టర్ తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో హడావుడి గట్టిగానే చేస్తోంది. రీసెంట్ గా రిలీజైన మరో పోస్టర్ కూడా సాహో ఫ్యాన్స్ ని చూపు తిప్పుకోనివ్వడం లేదు. దిట్టంగా ఉండే కరేబియన్ రౌడీలు ప్రభాస్ వెనకాల రాక్షసుల్లా కనిపించడం భయానకంగా ఉంది. అలాగే ప్రభాస్ ఒక ధీరుడి లా కనిపించడం చూస్తుంటే సినిమాలో ఆ ఫైట్ రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  టాలీవుడ్ చరిత్రలో అత్యధిక భారీ యాక్షన్ సీన్స్ తో రూపొందిన సాహోలో ప్రతి యాక్షన్ సీన్ హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయట. దర్శకుడు సుజీత్ ఎలాంటి యాక్షన్ ట్రీట్ రెడీ చేశాడో తెలియాలంటే ఆగస్ట్ 30వరకు వెయిట్ చేయాల్సిందే. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది.      Last Updated 9, Aug 2019, 4:22 PM IST
0business
పాక్‌ జట్టు రాకతో బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు ఆదాయం న్యూఢిల్లీ : నష్టాల్లో ఉన్న క్రికెట్‌ అసోసియేషన్‌ ఆప్‌ బెంగాల్‌ పంట పండే సమయం వచ్చింది.అనూహ్య పరిస్థితుల్లో భారత్‌,పాకిస్థాన్‌ టి20 మ్యాచ్‌ వేదిక ధర్మశాల నుంచి కోల్‌కతాకు మారడంతో టికెట్ల అమ్మకాల మూలంగానే క్యాబ్‌ సుమారు 3 కోట్లు వెనుకేసుకోనుంది.మార్చి 19న జరిగే భారత్‌,పాక్‌ మ్యాచ్‌ ఈ టోర్నమెంట్‌లోనే అత్యధిక వ్యాపార ప్రకటనల ఆదాయాన్ని ఐసిసి ఖజానాకు చేరవేస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.కాగాఈ  మ్యాచ్‌కి టికెట్‌ ధరలను 500 రూపాయల నుంచి 1500లుగా నిర్ణయించామని,టికెట్‌ ధరలను పెంచాలనే ఉద్దేశం తమకు లేదని క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ స్పష్టం చేసింది.మొత్తం 67 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌ని తిలకించే అవకాశం ఉండగా,కేవలం టికెట్ల అమ్మకాల ఆదాయం మాత్రమే క్యాబ్‌కు మిగులుతుంది.దీన్ని ఈ సంవత్సరం తమకు అదనంగా వచ్చే ఆదాయంగా పరిగణించను న్నామని ఒక అధికారి పేర్కొన్నాడు.
2sports
50 కోట్ల క్లబ్ లో ఫిదా...కలెక్షన్స్ వర్షం కురుస్తోంది Highlights అంచనాలు మించి కలెక్షన్స్ సాధిస్తున్న ఫిదా ట్రేడ్ ఎనలిస్ట్ లనే అశ్చర్యానికి గురిచేస్తున్న ఫిదా 50 కోట్ల క్లబ్ లో చేరిన ఫిదా.. అమెరికాలో 2 మిలియన్ క్లబ్ దిశగా..   మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ఫిదా చిత్రం కలెక్షన్ల పరంగా అంచనాలన్నీ తారుమారు చేస్తూ.. జెట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది. రిలీజైన రోజు తొలి ఆట నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకొంది. గత పది రోజుల్లో ఫిదా వసూలు చేసిన కలెక్షన్లు సినీ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో థియేటర్లను కూడా పెంచిన నేపథ్యంలో ఫిదా మంచి వసూళ్లను రాబడుతోంది.   గత పది రోజుల్లో ఫిదా చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. స్థూలంగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. మెగా హీరోల కలెక్షన్లకు అడ్డగా మారిన నైజాంలో ఈచిత్రం కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. నైజాంలోనే ఫిదా చిత్రం రూ.10 కోట్లకు పైగా వసూలు చేసింది.   పదిరోజుల్లో రూ.31 కోట్లు అమెరికాలో ఫిదా చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతోంది. గత పదిరోజుల్లో ఈ చిత్రం రూ.31 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల విషయంలో ఫిదాను దూకుడుకు కల్లెం వేయడం మాత్రం ఎవరికీ సాధ్యంకాదన్న రేంజ్ లో సాగుతోంది. వరుణ్, సాయి పల్లవి నటించిన చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది అని ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా పేర్కొన్నారు.   రెండో వారాంతంలో శనివారం అమెరికాలో ఫిదా సినిమా కలెక్షన్లు 74.66 శాతం పెరిగాయి. శుక్రవారం 88,522 డాలర్లు, శనివారం 154,164 డాలర్లు వసూలు చేసింది. రెండోవారంలో రూ.9.83 కోట్లు (1,532,264 డాలర్లు) వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.   వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఓవర్సీస్ మార్కెట్లో కూడా ప్రేక్షకులు ఫిదా చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్నారు. అమెరికాలో ఈ చిత్రం రెండు మిలియన్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఫిదా నిలిచింది. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
Feb 12,2017 అయ్యో.. అంబాసిడర్‌ను అమ్మేశారు! కోల్‌కతా : భారత్‌లో ఒకప్పుడు కారు అంటే అంబాసీడర్‌. దశాబ్దం క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన ఈ ఐకానిక్‌ కారు బ్రాండ్‌ను హిందుస్థాన్‌ మోటార్స్‌ యూరోపియన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం ప్యూగోట్‌ ఎస్‌ఎకు విక్రయించింది. దీనికి సంబంధించిన ఒప్పందం జరిగింది. అంబాసిడర్‌ ట్రేడ్‌మార్క్‌తో సహా ఇతర హక్కులను రూ.80కోట్లకు విక్రయించామని హిందూస్తాన్‌ మోటార్స్‌ వెల్లడించింది. ఇందుకోసం సీ కె బిర్లా గ్రూప్‌ యాజమాన్యంలోని హిందూస్థాన్‌ మోటార్స్‌ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ ట్రేడ్‌ మార్క్‌ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉద్యోగులు, రుణదాతల బకాయిలను చెల్లించడానికి ఉపయోగించనున్నట్టు సీికె బిర్లా గ్రూప్‌ ప్రతినిధి వెల్లడించారు. అయితే ప్యుగోట్‌ ఈ బ్రాండ్‌ను ఇండియాలో పునరిద్ధరిస్తుందా లేదా అనేది అధికారికంగా స్పష్టతనివ్వలేదు. కాగా తమిళనాడులో ప్యూగోట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చని సమాచారం. తొలుత ఏడాదికి లక్ష వాహనాలు తయారి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయని తెలుస్తోంది. ఏడు దశాబ్దాల క్రితం హిందుస్థాన్‌ మోటార్స్‌ భారత్‌లో అంబాసిడర్‌ కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. 1960-70 దశకాల్లో ఒక వెలుగు వెలిగింది. భారత రోడ్లపై అంబాసిడర్‌ వాహనాల ఆధిపత్యం అంతా, ఇంత కాదు. కాగా 1980లో మారుతి 800 రాక అంబాసిడర్‌ అమ్మకాలను భారీగా దెబ్బతీసింది. ఎంతగా అంటే 1980 మధ్యకాలంలో 24,000 అంబాసిడర్‌ వాహన విక్రయాలు నమోదు కాగా, 2013-14 నాటికి విక్రయాలు 2,500 యూనిట్ల స్థాయికి పడిపోయాయి. భారత్‌లో క్రమంగా అంబాసిడర్‌ విక్రయాలు పడిపోవడంతో 2014లో తయారీని నిలిపివేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hillery, Donald భారత్‌ ఈక్విటీపై అమెరికా ‘అధ్యక్ష ప్రభావం! ముంబై, నవంబరు 7: అమెరికా అధ్యక్షపదవీకి జరు గుతున్న ఎన్నికలు భారత్‌ ఈక్విటీ మార్కెట్లకు కీల కం అవుతున్నాయి. అలాగే అమెరికా మార్కెట్‌తో మరింతఎక్కువ సన్నిహితంగా ఉన్న బిఎస్‌ఇ 500 జాబితా కంపెనీలపనితీరు కూడా అధ్యక్ష ఎన్నిక లకు లింక్‌అయి ఉంది. ఈ వారంలో ఈ కంపెనీల పై ఇన్వెస్టర్ల గురి తప్పకుండా ఉంటుంది. భారత్‌ లోని అనేక ఐటి కంపెనీలు, ఫార్మాకంపెనీలు అమె రికా మార్కెట్లతోనే ఎక్కువ రాబడులు సాధిస్తు న్నాయి. డాలర్‌ పటిష్టం అయితే ఈఐటి, ఫార్మా కంపెనీల షేర్లు జోరందుకుంటాయి. అలాగే ఈ కంపెనీలకు రాబడులు పరిమితి కూడా మరింతెక్కువగా ఉంటుంది. మోర్గాన్‌ స్టాన్లీ నిర్వహించిన సర్వేను చూస్తే టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీలు దాదాపు తమ రాబడుల్లో 50శాతం అమెరికానుంచే రాబ ట్టుకుంటున్నాయి. ఇక మెక్సికో, బ్రెజిల్‌; రష్యా దేశాల్లో స్టాక్స్‌కూడా అమెరికా అధ్య క్ష ఎన్నికల ప్రభావం ఎక్కువ ఉంటుందని అంచనా. హిల్లరీ క్లింటన్‌ ఎన్నిక అమెరికా ఔషధ ధరల క్రమబద్ధీకరణపై ప్రభావం చూపిస్తుందని భారతీయ ఫార్మాకంపెనీలు భావిసుత్నఆ్నయి. క్లింటన్‌ విజయం సాధి స్తే భారత్‌ ఫార్మాకంపెనీలకు సమస్యలుంటాయన్న అంచనాలున్నాయి. ఇటీవలే డ్రగ్‌ప్రైసింగ్‌ అథారి టీపరంగా భారత్‌కంపెనీలపై ప్రాసిక్యూషన్‌ ఆద ేశాలు కూడా జారీ అయ్యాయి. ఇక ఐటి కంపెనీ లకు డొనాల్డ్‌ట్రంప్‌ ఎన్నికైతే సమస్యలు ఎదురవు తాయని అంచనా. ఔట్‌సోర్సింగ్‌, వలసవిధానం లో ఆంక్షలు, పరిమితులు విధించాలన్న ట్రంప్‌ వైఖరే ఇందుకుకారణం. ప్రస్తుతం భారత్‌పరంగా పదికిపైగా ఫార్మా, ఐటి కంపెనీలు అమెరికా రాబ డులపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. ఐటికంపెనీ ల్లో టిసిఎస్‌ మార్కెట్‌ విలువలు 69బిలియన్‌ డాల ర్లయితే రాబడుల్లో అమెరికా వాటా 54శాతంగా ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విద్యుత్‌రంగంలో 51 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువలతో ఉంటే 17 శాతంరాబడులు అందుతున్నాయి. ఐటిసంస్థ ఇన్ఫో సిస్‌ మార్కెట్‌ విలువలు 33.9 బిలియన్‌ డాలర్ల యితే అమెరికా రాబడుల వాటా 61.9శాతంగా ఉంది. టాటామోటార్స్‌ ఆటోమొబైల్‌పరంగా 25.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అమెరికా రాబ డుల వాటా 12.6శాతంగా ఉంది. విప్రో ఐటిసంస్థ మార్కెట్‌ విలువలు 17బిలియన్‌ డాలర్లయితే అమె రికా రాబడుల వాటా 52.7శాతంగా ఉంది. హెచ్‌సిఎల్‌ టెక్నాలసీజ్‌ రాబడుల వాటా 57.5 శాతంగాఉంది. లూపిన్‌ ఫార్మాకంపెనీ 10.2 బిలి యన్‌ డాలర్ల మార్కెట్‌ విలువల్లో రాబులు 44.3 శాతం అమెరికా నుంచే వస్తాయి. అలాటే టెక్‌ మహీంద ఐటికంపెనీ కూడా 47.8శాతం రాబ డులు అమెరికా మార్కెట్‌ నుంచే అందుకుంటు న్నది. గ్లెన్‌మార్క్‌ఫార్మా 3.9 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువలతో 47.8శాతం అమెరికా రాబ డులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌ఫోర్జ్‌ కంపెనీ ఆటోమొబైల్‌పరంగా 3.1బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువలతో ఉంది. కంపెనీ అమెరికా రాబడుల వాటా 20శాతంగా ఉన్నట్లు అంచనా. ప్రస్తుత రాబడులు, మార్కెట్‌ వాటాల ఆధారంగా చూస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత్‌ కంపెనీ లపై ఎక్కువప్రభావం చూపించనున్నట్లు అంచనా.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మా 'బాబు బంగారం' వచ్చేస్తున్నాడు ! విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బాబు బంగారం'. ఈ సినిమా ​ఆడియో, సినిమా విడుదల తేదీలను అనౌన్స్ చేసేశారు... TNN | Updated: Jul 15, 2016, 08:02PM IST విక్ట‌రీ వెంక‌టేష్‌ , న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బాబు బంగారం'. సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, సూర్య‌దేవ‌ర నాగ వంశీ, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మించారు. ​సాధారణంగా మారుతి సినిమాలు బడ్జెట్ తో సంబంధం లేకుండా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతాయి. మారుతి ఈ తరం ట్రెండ్ తెలిసిన డైరెక్టర్ కావడం మరియు వెంకటేశ్ తో సినిమా చేయడంతో ఈ సినిమా పట్ల అంచనాలు చాలానే ఉన్నాయి. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మ‌రియు మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ కి విప‌రీతంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది. ఇప్పటికే వెంకటేశ్ సినిమా కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఏదైతేనేం ఇంకా ఆ ఎదురుచూపులు నెరవేరే సమయం వచ్చేసింది. ఈ సినిమా ​ఆడియో, సినిమా విడుదల తేదీలను అనౌన్స్ చేసేశారు. 'బాబు బంగారం' ఆడియోని జూలై 24న విడుద‌ల చేసి, సినిమాను అగ‌ష్టు 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
0business
Hyderabad, First Published 27, Sep 2018, 12:10 PM IST Highlights బుధవారం కోహ్లి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డ్‌ అందుకున్న సంగతి తెలిసిందే.  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరోసారి తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. బుధవారం కోహ్లి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డ్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో, అనుష్క ఫోటోను షేర్‌ చేస్తూ ‘అడ్డంకులను ఎదుర్కొంటూ.. మంచి పనులు చేసుకుంటూ ముందుకు నడిచేలా నిరంతరం నన్ను ప్రోత్సాహించే వ్యక్తి.. నిజమైన ప్రేమలోని శక్తిని తెలియజేసి.. నన్ను పూర్తిగా మార్చిన వ్యక్తి.. నా బలం.. నా సోల్‌మెట్‌’ అంటూ అనుష్క శర్మ గురించి ట్వీట్‌ చేశారు.
2sports
SUGAR BAGS చక్కెర దిగుమతులపై సుంకం పెంపు న్యూఢిల్లీ, జూలై 10: ప్రపంచంలోనే చక్కెరవినియోగంలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ ఇకపై చక్కెర దిగుమ తులపై సుంకాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 40శాతం ఉన్న ఈసుంకం 50శాతానికి పెంచేం దుకు నిర్ణయించింది. దీనివల్ల తక్కువధరలకే విదేశాల నుంచి చక్కెర దిగుమతులను కట్టడిచేసినట్లవు తుందని అంచనా. భారత్‌కు దిగుమతులు తగ్గితే అంతర్జాతీయ విఫణిలో ధరలపై ఒత్తిడిపెరుగుతుంది. స్థానిక ధరలకు కొంత మద్దతు లభిస్తుంది. గడచిన కొన్ని వారాలుగా చౌకధరలతో చక్కెర మరింతగా భారత్‌ మార్కెట్లకు వస్తున్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్లనే చక్కెరపై దిగుమతి సుంకాన్ని 50శాతానికి పెంచాలని నిర్ణ యించింది. రూపాయి పటిష్టత, విశ్వ విపణిలో ధరలు తగ్గుదల వంటివాటి కార ణంగా విదేశీ కొనుగోళ్లు గిట్టుబాటవుతు న్నాయి. ప్రభుత్వం ఏప్రిల్‌లోనే సుంకం లేని దిగుమతులు ఐదులక్షల టన్నువరకూ అనుమతించింది. జూన్‌నెలాఖరుతో ఈ అనుమతులు ముగిసిపోతాయి. దీనివల్ల కొంత దేశీయంగా ధరలను కట్టడిచేసేం దుకు ఉపకరించింది. స్థానిక ఉత్పత్తి ఐదో వంతు తగ్గడంతోదిగుమతులు అనివార్యం అయ్యాయి. అయితే 2017/18 మార్కె టింగ్‌ సంవత్సరం అక్టోబరు ఒకటవ తేదీ నుంచి ప్రారంభిస్తారు. భారత్‌ చక్కెర ఉత్పత్తి మొత్తంగాచూస్తే 25శాతంపెరిగి 25 మిలియన్‌ టన్నులకు చేరుతుందని అంచనా. చక్కెరరంగం దిగుమతిసుంకాన్ని 60శాతానికి పెంచాలని డిమాండ్‌చేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం 50శాతానికి పెంచేందుకు నిర్ణయించింది. భారత ప్రభుత్వం చెరకు మద్దతుధరలను 11వాతంపెంచింది. రైతులకు మిల్లరు బకాయిలు విధిగా చెల్లించాలన్న షరతుతో ఈ ధరలు పెంచింది. దిగుమతులపరంగాచూస్తే చక్కెరధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే మిల్లులు మాత్రం రైతులకు తమ చెరకుధరలు చెల్లించ లేకుండా ఉన్నాయని బారామతి ఆగ్రో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌రోహిత్‌ పవార్‌ వెల్లడించారు. మహారాష్ట్ర పశ్చిమప్రాంతంలో ఎక్కువగా చక్కెర మిల్లులు నడుస్తున్న బారామతి అగ్రో మాత్రమే కాదు ఇతర చెక్కర మిల్లుల పరంగా కూడా రైతులకు ధరలు చెల్లించకుండా ఉండటంతో రైతుల నుంచి ఆందోళన పెరిగింది. ఫలితంగా ఈ సీజన్‌లో ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిసారించే అవకాశాలు కూడా పెరిగాయి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV CSK vs RCB: ధోనీ షాట్‌కి స్టేడియం వెలుపలికి బంతి..! ఎడమచేతి వాటం స్పిన్నర్ విసిరిన బంతిని.. క్రీజు వెలుపలికి వచ్చిన ధోనీ లాంగాన్ దిశగా హిట్ చేశాడు. దీంతో.. బ్యాట్‌కి మిడిల్ అయిన బంతి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ స్టేడియం వెలుపలికి వెళ్లిపోయింది. Samayam Telugu | Updated: Mar 23, 2019, 04:13PM IST CSK vs RCB: ధోనీ షాట్‌కి స్టేడియం వెలుపలికి బంతి..! హైలైట్స్ ఈరోజు నుంచే ఐపీఎల్ 2019 సీజన్ మొదలు తొలి మ్యాచ్‌లో చెన్నై, బెంగళూరు ఢీ ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ హిట్టింగ్.. బంతి స్టేడియం వెలుపలికి ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న ధోని ఐపీఎల్ 2019 సీజన్‌ తొలి మ్యాచ్ ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లకి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గట్టి హెచ్చరికలు పంపాడు. చెపాక్ వేదికగా శనివారం రాత్రి 8 గంటలకి చెన్నై, బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ కోసం హిట్టింగ్ ప్రాక్టీస్ చేసిన ధోనీ.. బంతిని ఏకంగా స్టేడియం వెలుపలికి తరలించేశాడు. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2019 సీజన్ పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి..! ఎడమచేతి వాటం స్పిన్నర్ విసిరిన బంతిని.. క్రీజు వెలుపలికి వచ్చిన ధోనీ లాంగాన్ దిశగా హిట్ చేశాడు. దీంతో.. బ్యాట్‌కి మిడిల్ అయిన బంతి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ స్టేడియం వెలుపలికి వెళ్లిపోయింది. గత ఏడాది పేలవ ఫామ్‌తో నిరాశపరిచిన ధోనీ.. ఈ ఏడాది ఆరంభం నుంచి సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ మొదలుకానుండటంతో.. ఫామ్‌ని కొనసాగించాలని ధోనీ ఉవ్విళ్లూరుతున్నాడు. #msdstrong https://t.co/s8YUURMj7C — Karan Arjun (@KaranArjunSm) 1553050103000 ఈరోజు మ్యాచ్‌లో చెన్నై జట్టు అంచనా: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), కేదార్ జాదవ్, బిల్లింగ్స్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శాంట్నర్, శార్ధూల్ ఠాకూర్ బెంగళూరు జట్టు అంచనా: పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సిమ్రాన్ హిట్‌మెయిర్, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, చాహల్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
జన్‌ధన్‌ ఖాతాలలో లావాదేవీలేవీ..! -  53 శాతం అకౌెంట్లు మొక్కుబడివే..    న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన జన్‌ ధన్‌ పథకం కింద తెరిచిన చాలా బ్యాంకింగ్‌ ఖాతాల్లోని సగం పైగా వాటిలో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదు. గతేడాది ఆగస్టులో ప్రారంభించిన ఈ పథకంలో 16 కోట్ల ఖాతాలు నమోదయ్యాయి. ప్రజల కొనుగోలు శక్తిలో పెద్ద మార్పులు లేకపోవడం, పొదుపు సామర్థ్యం కొరవడటంతో ఈ బ్యాంకు ఖాతాలకు పెద్ద స్పందన రావడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. జూన్‌ 3 నాటికి జన్‌ ధన్‌ ఖాతాల్లో సుమారు రూ.16,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని అంచనా. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అట్టహాసంగా తెరిచిన పలు ఖాతాదార్లకు బ్యాంకులు అందుబాటులో లేకపోవడం కూడా ఓ కారణంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది చిరు వ్యాపారస్తులు వచ్చిన ఆదాయం తమ పెట్టుబడికి సరపోవడం లేదని, ఇంకా ఏమి పొదుపు చేస్తామని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు సర్వే ప్రకారం భారత్‌లోని అత్యధిక ప్రజల ఆదాయం రోజుకు 2 డాలర్లు మించి లేదు. ఇందుకు నిరక్షరాస్యత, పేదరికం ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొంది. ఈ నేపధ్యంలో జన్‌ ధన్‌ ఖాతాల్లో పెద్ద పురోగతి లేదు. మరికొన్ని ఖాతాలు గ్యాస్‌ సబ్సీడీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం నగదు బదిలీకి మాత్రమే పరిమితమయి ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్‌ను అందిస్తున్నాయి. ప్రయివేటు బ్యాంకులు ఆదాయం వచ్చే పట్టణాలపై దృష్టి కేంద్రీకరించడం కూడా బ్యాంకింగ్‌ విస్తరణకు అడ్డంకిగా మారింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బాహుబలి తర్వాత.. రాజమౌళి పెట్టే బేడ సర్దుకోటమేనా Highlights బాహుబలి2 తర్వాత రాజమౌౌళి ఏం చేయబోతున్నాడు రిలీజ్ డేట్ పై మళ్లీ డౌట్స్ క్రియేట్ చేసిన జక్కన్న గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందట, ఫినిష్ అయితేనే అనుకున్న డేట్ కు రిలీజట బాహుబలి 2 రిలీజ్ డేట్ పై మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు రాజమౌళి. రాజమౌళి శివరాత్రి సందర్భంగా ఇచ్చిన యాంకర్ సుమ ఇంటర్వ్యూలో మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. ప్రస్థుతం సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ వేగంగా జరుగుతోందని తెలిపాడు. అయితే ఏప్రిల్ 28న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం అప్పటివరకు రెడీ అవుతుందో లేదోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నాడు రాజమౌళి. స్వయంగా రాజమౌళి చెప్పడంతో మరోసారి బాహుబలి రిలీజ్ పై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఇప్పటికే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియక జుట్టు పీక్కుంటున్న అనేక మందికి ఇప్పుడు రిలీజ్ డేట్ పై జక్కన్న చేతులెత్తేయడంతో మరింత యాంగ్జయిటీ పెరిగిపోతోంది.   అంతే కాదు.. ఇప్పటికే గత కొన్నేళ్లుగా హైప్ క్రియేట్ చేస్తూ ఇప్పటికే వందల కోట్ల బిజినెస్ చేసిననవ బాహుబలి2 చిత్రంతో బాహుబలి తొలి సిరీస్ పూర్తి చేస్తానని బాహుబలి  దర్శకుడు చెప్తున్నాడు. ఈ లెగసీని ఇలాగే కంటిన్యూ చేసేందుకు బాహుబలి అనుబంధంగా గేమ్స్, నావెల్స్ ఇలా వస్తుునే ఉన్నాయి. అయితేేే బాహుబలి2 రిలీజ్ తర్వాత రాజమౌళి ప్లానింగ్స్ ఏంటో తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే.   బాహుబలి2 కోసం గత నాలుగేళ్లుగా శ్రమించిన టీమ్ లో ఇప్పటికే ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. రానా కూడా ఘాజీ హాట్ కొట్టి మరి కొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ఇక అనుష్క కూడా భాగమతి తదితర చిత్రాల్లో నటిస్తోంది. తమన్నా.. తన పని తాను చేసుకుంటూ పోతోంది. అయితే బాహుబలిపైనే పూర్తి గా  దృష్టి పెట్టిన రాజమౌళి ఈ సినిమా అయిపోగానే ఏంచేస్తాడా అని అంతా ఎదురుచూస్తున్న పరిస్థితి.   కానీ రాజమౌళి బాహుబలి 2 అయిపోగానే పెట్టే బేడా సర్దుకుని వెళ్లిపోతాడట. అంతా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్న మహాభారతంపై దృష్టి పెడతాడని, దాన్ని సూపర్ స్టార్లందరితో కలిసి వెయ్యి కోట్లతో నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ తాను అలాంటివేం ఇంకా ప్లాన్ చేయలేదని స్వయంగా రాజమౌళి చెప్తున్నాడు. పైగా బాహుబలి 2 అయిపోగానే పెట్టే బేడా సర్దుకుని కొన్నాళ్ల పాటు వెకేషన్ పై వెళ్తానని డిక్లేర్ చేశాడు. వెకేషన్ నుంచి లాంగ్ గ్యాప్ తీసుకుని వచ్చాక గానీ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని అంటున్నాడు. అప్పటిదాకా ఎలాంటి ప్రాజెక్ట్ గురించి ప్లాన్ చేయలేదని స్పష్టం చేశాడు రాజమౌళి. Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0business
Rajkot, First Published 6, Oct 2018, 2:51 PM IST Highlights టీంఇండియా కెప్టెన్ వ్యక్తిగత ప్రదర్శనతోనే కాదు టీంను ముందుకు నడిపిస్తూ కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అనేక రికార్డులు బద్దలుకోట్టాడు. భారత క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఎన్నో అద్భుతాలను కోహ్లీ సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ ఏం చేసినా అదో రికార్డుగా మారిపోతోంది. రాజ్ కోట్ టెస్టులో సెంచరీ సాధించిన కోహ్లీ.... అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 24 సెంచరీలు పూర్తి చేసుకున్న బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు.  టీంఇండియా కెప్టెన్ వ్యక్తిగత ప్రదర్శనతోనే కాదు టీంను ముందుకు నడిపిస్తూ కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అనేక రికార్డులు బద్దలుకోట్టాడు. భారత క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఎన్నో అద్భుతాలను కోహ్లీ సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ ఏం చేసినా అదో రికార్డుగా మారిపోతోంది. రాజ్ కోట్ టెస్టులో సెంచరీ సాధించిన కోహ్లీ.... అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 24 సెంచరీలు పూర్తి చేసుకున్న బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు.  ఇక ఇదే మ్యాచ్‌లో టీంఇండియా కెప్టెన్‌గా కూడా కోహ్లీ మరో రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు ప్రత్యర్థి జట్లను ఎక్కుసార్లు ఫాలో ఆన్ ఆడించిన ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ కంటే ఎక్కువసార్లు ప్రత్యర్థులను ఫాలో ఆన్ ఆడించింది మాజీ కెప్టెన్ అజారుద్దిన్. అయితే ప్రస్తుతం విండీస్ జట్టును ఫాలో ఆన్ ఆడించడం ద్వారా  ధోనీ, గంగూలీ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అదిగమించాడు. ధోనీ, గంగూలిలు టీంఇండియా కెప్టెన్లుగా వ్యవహరించిన సమయంలో ప్రత్యర్థి జట్లను నాలుగు సార్లు ఫాలో ఆన్ ఆడించారు. అయితే కోహ్లీ రాజ్ కోట్ టెస్టులో విండిస్‌ను ఫాలోఆన్ ఆడేలాగా చేసి వీరిని అధిగమించాడు. ఇప్పటివరకు కోహ్లీ కెప్టెన్ గా ప్రత్యర్థులను మొత్తంగా  5 సార్లు పాలోఆన్ ఆడించాడు. ఏడు సార్లు ఫాలోఆన్ ఆడించి మాజీ కెప్టెన్ అజారుద్దిన్ కోహ్లీ కంటే ముందున్నాడు.
2sports
Hyderabad, First Published 24, Jun 2019, 2:48 PM IST Highlights టీం ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ పప్పులో కాలేశారు. ఆ తప్పుని గమనించిన నెటిజన్లు... విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.  టీం ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ పప్పులో కాలేశారు. ఆ తప్పుని గమనించిన నెటిజన్లు... విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రపంచకప్ లో ఓటమన్నది లేకుండా దూసుకుపోతూ విజయాలు సాధిస్తున్న టీం ఇండియా.. రోహిత్ మిస్టేట్ తో ట్రోలింగ్ కి గురైంది.  ఇంతకీ మ్యాటరేంటంటే...  ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి సంబంధించిన జ్ఞాపకాలు అంటూ ఓ ఫొటోను రోహిత్ ఆదివారం ట్వీట్ చేశాడు.  2013లో జూన్ 23వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీని టీం ఇండియా అందుకుంది. అయితే... 2013కి బదులు రోహిత్ శర్మ 2017 అని తప్పుగా పోస్టు చేశాడు. వాస్తవానికి 2017 జూన్ 18నాటి ఫైనల్‌లో పాక్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. అయితే తన తప్పును గుర్తించిన రోహిత్.. దాన్ని డిలీట్ చేసి.. మళ్లీ కొత్తగా మరో పోస్ట్ పెట్టాడు. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. కొంతమంది నెటిజన్లు దీనిపై కామెంట్ చేయడం మొదలుపెట్టారు. మర్చిపోయిన చేదు జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేశావా రోహిత్‌ అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. ‘‘అది 2013 రోహిత్ సార్.. 17లో మనం వేరే వాళ్లను గెలిపించాం’’.. ‘‘ఎందుకు పాతవాటిని గుర్తు చేస్తావన్నా’’ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. Last Updated 24, Jun 2019, 2:48 PM IST
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భారత్‌ కాదంది.. ఆసియా కప్ వేదిక మారింది! ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్ వేదిక మారింది. ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తరుణంలో వేదిక మార్పు తప్పనిసరైంది. Samayam Telugu | Updated: Apr 10, 2018, 07:01PM IST భారత్‌ కాదంది.. ఆసియా కప్ వేదిక మారింది! ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్ వేదిక మారింది. ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తరుణంలో వేదిక మార్పు తప్పనిసరైంది. పాక్ క్రికెట్ జట్టుకు తాను ఆతిథ్యం ఇచ్చేది లేదని భారత్ తేల్చి చెప్పింది. దీంతో చేసేదేం లేక వేదిక మారుస్తున్నట్లు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తెలిపింది. ఈ విషయాన్ని ఏసీసీ, పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ ప్రకటించారు. ఈ ఏడాది ఆసియా కప్‌లో ఐసీసీ పూర్తి సభ్యదేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్ తలపడనున్నాయి. ఆరో స్థానం కోసం యూఏఈ, హాంగ్ కాంగ్, నేపాల్, సింగపూర్, మలేసియా, ఒమన్ పోటీ పడుతున్నాయి. ప్లే ఆఫ్ ద్వారా ఆరో జట్టును ఎంపిక చేస్తారు. ఆసియా కప్‌ను నిర్వహించడం ఇది 14వ సారి కాగా.. 12 సార్లు వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. 2016 ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. ఇది వరల్డ్ కప్ టీ20 టోర్నీకి వార్మప్‌గా ఉపయోగపడింది. ఆ టోర్నీ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌కు పాకిస్థాన్, శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వాస్తవానికి ఈ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా.. దాన్ని డిసెంబర్‌కు మార్చారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
అవుటర్‌ బయటకు పరిశ్రమల తరలింపు - నగర పౌరులకు స్వచ్ఛమైన జీవనమే లక్ష్యం - 2017 డిసెంబరుకు అన్ని పరిశ్రమలు అక్కడే - పరిశ్రమలకుతగిన ప్రోత్సాహకాలు: కేటీఆర్‌ నవతెలంగాణ-వాణిజ్య విభాగం: హైదరాబాద్‌లోని కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్‌ రింగ్‌ రోడ్డు అవతలకు తరలించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఈ ఆంశపై పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు శనివారం సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో మొత్తం 1068 కాలుష్య కారక పరిశ్రమలను నగరం అవతలకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలను గురించి మంత్రి అధికారులతో చర్చించారు. నగరం పౌరుల జీవితాల్లో నాణ్యత పెంపొందించే చర్యల్లో భాగంగానే ఈ యోచన చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. మొదట కాలుష్య కారక కంపెనీలను తరలిస్తామని, తర్వాతి దశల్లో నగరంలోని అన్ని పరిశ్రమలను రింగ్‌రోడ్డు అవతలకు మారుస్తామని మంత్రి వివరించారు. ప్రాథమికంగా ఇందుకు డిసెంబరు, 2017ను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఇది పెద్ద సవాళ్లతో కూడుకున్న పనైనప్పటికీ పరిశ్రమల తరలింపునకు తగిన ప్రోత్సాహకాలను కల్పించడంతో పాటు.. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసే ప్రాంతాల్లోని ప్రజలకు తగిన అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసే ప్రాంతంలో 'జీరో లిక్విడ్‌ డిచ్జార్జ్‌' విధానం ద్వారా జల, వాయు కాలుష్యాన్ని గరిష్ట స్థాయిలో తగ్గించే చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. తరలింపు విషయంలో పరిశ్రమలకు పలు రకాల ప్రోత్సాహకాలను అందించే విషయమై మంత్రి అధికారులతో చర్చించారు. ఒకే రకమైన పరిశ్రమలన్నీ ఒక చోట కేంద్రీకృతం అయ్యేలా చూసేందుకు క్లస్టర్‌ విధానాన్ని అమలు పరచనున్నట్లు ఆయన వివరించారు. ఈ క్లస్టర్ల ఏర్పాటునకు హెచ్‌ఎండీఏ లాంటి సంస్థలతో కలిసి పనిచేయాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో భాగంగా మంత్రి పలు బల్క్‌డ్రగ్‌ మాన్యుపాక్చరింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో బేటీ అయ్యారు.. వారి నుంచి సలహాలు స్వీకరించారు. ఎంఎస్‌ఎంఈ సంఘాల భేటీ.. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టాలని ఎంఎస్‌ఎంఈ సంఘాల వారు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల సంఘాల వారు మంత్రితో సమావేశమయ్యారు. ఆస్తిపన్ను, నీటి సరఫరా రేట్లను తగ్గించాలని కోరారు. తమకు 1500 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. బ్యాంకులు రుణాలను అందించే విషయంలో ఇబ్బంది పెడుతున్నందున ఎస్‌ఎల్‌బీసీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి వీరి విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ప్రభుత్వోద్యోగాల కుదింపు సర్కార్‌ను గట్టెక్కించిన ప్రభుత్వరంగం - నీటి బుడగలా సేవారంగం - దానిలోకే ఎఫ్‌డీఐలు - స్పష్టం చేసిన ఆర్ధిక సర్వే నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో ప్రయివేటు మంత్రం జపిస్తున్న మోడీ సర్కార్‌ నిజస్వరూపాన్ని 2015-16 ఆర్ధిక సర్వే బట్టబయలు చేసింది. ఈ సర్వే నివేదికను శుక్రవారంనాడు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆర్ధిక శాఖ విడుదల చేసింది. సామాన్య ప్రజానీకాన్ని విస్తుగొల్పే అనేక అంశాలు ఈ సర్వేలో ఉన్నాయి. అయితే వాటిని నేరుగా ప్రస్తావించే ధైర్యాన్ని మోడీ సర్కార్‌ చేయలేదు. సామాన్యుడికి అర్ధంకాని పరిభాషలో దేశ స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) ముడిపెట్టి అంకెల గారడీ చేసే ప్రయత్నం చేసింది. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసేలా సంస్కరణల విధానాల్ని భుజానమోస్తున్న మోడీ సర్కార్‌ను అదే ప్రభుత్వ రంగం ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేయడం గమనార్హం. తగ్గిపోయిన ప్రభుత్వోద్యోగులు గతంతో పోల్చితే ప్రభుత్వరంగ ఉద్యోగుల సంఖ్య 2012 నాటికే 5.8 లక్షలు తగ్గిపోయింది. 2006లో ప్రభుత్వోద్యోగుల సంఖ్య 181.9 లక్షలు కాగా ఆర్ధిక సర్వే గణాంకాల ప్రకారం ఈ సంఖ్య 176.1 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు 5.8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు తగ్గిపోయారు. పారిశ్రామికరంగంలోనూ... మైనింగ్‌, వ్యవసాయం, గ్యాస్‌, విద్యుత్‌, హౌల్‌సేల్‌ వ్యాపారం వగైరాలు నిర్వహించే పారిశ్రామికరంగంలో ఉద్యోగుల సంఖ్య 2006లో 178.7 లక్షలు కాగా, ఇప్పుడు 173.3 లక్షలకు తగ్గింది. ఇక్కడ కూడా 5.4 లక్షల మంది ఉద్యోగులు తగ్గిపోయారు. అయితే గడచిన మూడేళ్లలో ఈ సంఖ్య మరింత తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఆ వివరాల్ని ఆర్ధిక సర్వేలో వెల్లడించలేదు. లాభాల బాటలో ప్రభుత్వరంగ సంస్థలు 2014-15లో దేశంలో 235 ప్రధానమైన ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి. వీటిలో 18.34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉదాహరణకు ఓఎన్‌జీసీ, విద్యుత్‌ సంస్థలు, అల్యూమినియం, ఉక్కు పరిశ్రమలు, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. 235 ప్రభుత్వరంగ సంస్థల టర్నోవర్‌ రూ.19.95 లక్షల కోట్లుకాగా, రూ.2.81 లక్షల కోట్ల లాభాల్ని ఆర్జించాయని ప్రస్తుత ఆర్ధిక సర్వే వెల్లడించింది. పన్నులు, ఇతర ఖర్చులు, షేర్‌ హౌల్డర్లకు రూ.56,527 కోట్ల డివిడెండ్‌ చెల్లింపులు పోనూ ఈ సంస్థల నికర లాభం రూ.1.30 లక్షల కోట్లు ఆర్జించాయని ఆర్ధిక సర్వే తెలిపింది. స్థిర ఆదాయం వీటివల్లే... వ్యవసాయరంగం ద్వారా 2014-15లో ప్రభుత్వానికి రూ.24 లక్షల కోట్ల ఆదాయం (19.57 శాతం) వచ్చినట్టు ఆర్ధిక సర్వే వెల్లడించింది. అయితే వ్యవసాయాధారిత పరిశ్రమలన్నీ ప్రయివేటు రంగంలోనే ఉండటం వల్ల ఆయా లాభాలన్నీ వారికే వెళ్తున్నాయి. ఈ పరిశ్రమలు కూడా ప్రభుత్వ రంగంలో ఉంటే మధ్య దళారుల బెడద వదలడంతోపాటు వచ్చే ఆదాయం మొత్తం కార్మికులు, రైతులకే చెందుతుంది. ఆర్ధిక సర్వే గణాంకాలు ఇవే అంశాల్ని స్పష్టంచేస్తున్నాయి. పారిశ్రామికరంగం ద్వారా 2014-15లో దేశఖజానాకు రూ.56.01 కోట్ల ఆదాయం (45.72 శాతం) వచ్చింది. 2013-14 నుంచి ఈ రంగం స్థిరంగా ఉంది. ఎలాంటి పెరుగుదల లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈరంగంలోనే ఎక్కువగా లభిస్తాయి. మోడీ సర్కార్‌ ఈ రంగం విస్త్రుతికి చేస్తున్న ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు అంటూ దేశాలు పట్టి తిరుగుతున్నా ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావట్లేదని ఆర్ధిక సర్వే గణాంకాలు తేల్చి చెప్పాయి. జాతీయ ఆదాయం రూ.122 లక్షల కోట్లలో పై రెండు రంగాల నుంచే రూ.80.01 కోట్ల ఆదాయం సమకూరింది. సేవారంగంలో పెరిగిన ఉద్యోగాలు మోడీ సర్కార్‌ ఆశలు పెట్టుకున్న సేవారంగంలో మాత్రం ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2006లో ఈ రంగంలో 87.7 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఆ సంఖ్య 119.4 లక్షలకు పెరిగింది. ఈ రంగంలో దాదాపు 31.8 లక్షల ఉద్యోగాలు పెరిగాయి. సేవారంగం ద్వారా వచ్చే ఆదాయం గాలిబుడగ వంటిదే. అది ఎప్పుడు పేలిపోతుందో తెలీదు. ఈ రంగంలోకి మోడీ సర్కార్‌ విదేశీ పెట్టుబడుల్ని (ఎఫ్‌డీఐ) భారీగా స్వాగతిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ధికరంగం, ఇన్సూరెన్స్‌, రియల్‌ఎస్టేట్‌, సామాజిక సేవలు, వ్యక్తిగత ఉపాధి వగైరాలు సేవా రంగం పరిధిలోకి వస్తాయి. వీటిలోకి విదేశీ పెట్టుబడుల్ని స్వాగతిస్తే... పెట్టుబడిదారులు లాభాల్ని తమ ఖాతాలకు మళ్లించుకు పోతుండటం సర్వసాధారణం. ప్రభుత్వరంగంలో లాభాలు వస్తే, వాటిని తిరిగి ఆయా రంగాల విస్తరణకే ఖర్చు చేస్తారు. ప్రభుత్వరంగంలోని ఎల్‌ఐసీ సంస్థ భారతీయ రైల్వేల్లో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని గురువారంనాటి రైల్వే బడ్జెట్‌ సందర్భంగా ఆశాఖ మంత్రి సురేష్‌ప్రభు పార్లమెంటులో పేర్కొన్న విషయం తెలిసిందే. అటువంటి ఎల్‌ఐసీలో కూడా ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ ప్రభుత్వరంగాన్ని కుదించే చర్యలకు మోడీ సర్కార్‌ పాల్పడుతుండటం గమనార్హం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 122 Views హైదరాబాద్‌ : హోండా కంపెనీ కొత్తగా విడుదల చేసిన హోండా బిఆర్‌-వి వెర్షన్‌కు పదివేలకుపైగా బుకింగ్స్‌ అందినట్లు కంపెనీ ప్రకటించింది. గతమేనెల ఐదవ తేదీ విడుదల చేసిన తర్వాత కంపెనీ బిఆర్‌వి మోడల్‌కు మంచి గిరాకీ లభించిందని వెల్లడించింది. అత్యధికఇంధన సామర్ధ్యం, ప్రీమియం3-రో ఇంటీరియర్లు, మూడేళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీతో బిఆర్‌వి అందిస్తున్నట్లు కంపెనీ సిఇఒ ప్రెసిడెంట్‌ యోయిచిరోయూనో వెల్లడించారు. బిఆర్‌విఎక్కువగా మధ్య వయసు, యువత విభాగాల నుంచి డిమాండ్‌ లభిస్తోందని, మరింతగా కస్టమర్లు బిఆర్‌వికి పెరుగుతారని యోయిచిరో వెల్లడించారు.
1entertainment
విద్య, వైద్యం జీఎస్టీ పరిధిలోకి రావు - ఇవి పన్ను పరిధిలో లేవు : కేంద్రం న్యూఢిల్లీ : వచ్చే కొద్ది నెలల్లో అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధి నుంచి విద్య, వైద్యం, యాత్రలను ప్రభుత్వం మినహాయించాలని భావిస్తోంది. కొత్త పన్ను విధానం ఆరంభంలోనే ప్రజలపై అనవసర భారాలు తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదిస్తోంది. ఇప్పటి వరకూ ఇవి పన్ను పరిధిలో లేవు. అదే విధానం కొనసాగించే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతానికి ట్రాన్స్‌పోర్టు రంగానికి లభిస్తున్న రాయితీలను కొనసాగించాలనుకుంటున్నట్టు రెవెన్యూ శాఖ కార్యదర్శి హష్ముఖ్‌ అధియా తెలిపారు. ఇంకా ఖరారు కాని అంశాలపై చర్చించేందుకు మే నెల 18 19 తేదీల్లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆద్వర్యంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు శ్రీనగర్‌లో సమావేశం కానున్నారు. సర్వీసు టాక్స్‌కు సంబంధించి ఇప్పుడు అమలులో ఉన్న రాయితీలను ప్రారంభ సంవత్సరంలో యథావిధిగా కొనసాగించాలని తాము ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV వాంఖడే టీ20లో భారత్ ప్రయోగాలు..? శ్రీలంకతో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే TNN | Updated: Dec 24, 2017, 05:56PM IST వాంఖడే టీ20లో భారత్ ప్రయోగాలు..? శ్రీలంకతో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మూడు టీ20ల ఈ సిరీస్‌ని 2-0తో టీమిండియా దక్కించుకున్న నేపథ్యంలో జట్టులో మార్పులు చేయాలని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడట. ఇందులో భాగంగా తొలి రెండు టీ20ల్లో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన దీపక్ హుడా, బసిల్ థంపీ, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్‌లో కనీసం ఇద్దరికీ వాంఖడేలో ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. Visit Site Recommended byColombia 18 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే శ్రీలంకపై ఒక వన్డే మ్యాచ్ ఆడినా.. చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. జట్టులో కూడా స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ మెరుగ్గా రాణిస్తుండటంతో వారిని పక్కన పెట్టే సాహసం టీమిండియా మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు. దీంతో సుందర్‌కి చోటు అనుమానంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి రెండు టీ20ల్లో అవకాశం దక్కించుకున్న జయదేవ్ ఉనద్కత్‌ ఫర్వాలేదనిపించినా.. గెలిపించే ప్రదర్శన చేయలేకపోయాడు. కాబట్టి.. అతని స్థానంలో థంపీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అతను వద్దు అనుకుంటే.. మహ్మద్ సిరాజ్‌కి అవకాశం దక్కొచ్చు. ఇక మిడిలార్డర్‌లో నిరాశపరుస్తున్న మనీశ్ పాండే‌ స్థానంలో దీపక్ హుడా‌ రావొచ్చంటూ వార్తలు వస్తున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV అమెరికా సాఫ్ట్‌వేర్ సంస్థ‌కు ఐటీ శాఖ షాక్ ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ (సిటిఎస్) ఆదాయపన్ను శాఖ భారీ షాక్‌ ఇచ్చింది. TNN | Updated: Mar 28, 2018, 11:01AM IST ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ (సిటిఎస్) ఆదాయపన్ను శాఖ భారీ షాక్‌ ఇచ్చింది. పన్నుఎగవేత ఆరోపణలతో వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసింది. 2016-17 సంవత్సరానికి సంబంధించిన రూ.2500కోట్లకు పైగా పన్నులు చెల్లించలేదంటూ ఆదాయ పన్ను శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఆదాయం పన్ను చట్టం ప్రకారం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌ (డిటిటి) రూ. 2,500 కోట్ల‌ను ఇప్పటి దాకా చెల్లించలేదని సీనియర్ టాక్స్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో చెన్నై, ముంబైలోని బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ గతవారం స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై కాగ్నిజెంట్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కాగ్నిజెంట్‌ అధికారి ప్రతినిధి అన్నిబకాయిలను ఇదివ‌ర‌కే చెల్లించామని వివరణ ఇచ్చారు. తదుపరి చర్యలను నిషేధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిందని ప్రకటించారు. అయితే మరిన్ని వివరాలను అందించడానికి నిరాకరించారు. అమెరికాకు చెందిన సీటీఎస్ కంపెనీకి భార‌తదేశంలో చాలా చోట్ల కార్య‌క‌లాపాలు ఉన్నాయి. ఇక్క‌డ దాదాపు 2,60,000 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు.
1entertainment
First Published 3, Feb 2019, 4:49 PM IST టాలీవుడ్ జనవరి రివ్యూ..! దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చినా.. రెండో రోజుకి సినిమా డల్ అయిపోయింది. భారీ మొత్తాలతో సినిమా హక్కులను కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. దీంతో సినిమా రెండో భాగాన్ని బయ్యర్లకు ఫ్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తెలుగునాట ఈ సినిమా రూ.76 కోట్ల బిజినెస్ చేసింది. కానీ వసూళ్లు మాత్రం యాభై కోట్లు మాత్రమే. దాదాపు బయ్యర్లు పాతిక కోట్లు నష్టపోయినట్లు సమాచారం. 'రంగస్థలం' వంటి భారీ సక్సెస్ ఫుల్ సినిమా తరువాత చరణ్ నటించిన ఈ సినిమా అతడిని నిరాశనే మిగిల్చింది. రజినీకాంత్ నటించిన ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ ఈ సినిమా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. కానీ ఎక్కువ థియేటర్లు లేక డబ్బింగ్ సినిమా కావడంతో ఈ సినిమా ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయింది. పెద్ద సినిమాలతో పోటీ పడుతూ విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల విషయంలో ఈ సినిమా దుమ్ము దులిపేసింది. ఈ ఒక్క సినిమాతో నిర్మాతకు ముప్పై కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. విడుదలరోజు సినిమాకు ఏవరేజ్ టాక్ రావడంతో బయ్యర్లు రికవరీ అయిపోతారని భావించారు. కానీ ఈ సినిమా రెండో వీకెండ్ లో ముందుకు వెళ్లలేకపోవడంతో బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. బాలీవుడ్ లో విడుదలైన ఈ సినిమా యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందించారు. పాకిస్తాన్ పై భారత సైన్యం చేసిన దాడుల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు ఈ హిందీ చిత్రాన్ని బాగానే ఆదరించారు. కంగనా నటించిన ఈ సినిమా వివాదాల నడుమ విడుదలైంది. సినిమాలో కంగనా నటన బాగున్నప్పటికీ సినిమాకి మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు కూడా లేవు. మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. Recent Stories
0business
now you can track your rail ticket refund status in real-time Rail tickets: ఇక‌పై ఆన్‌లైన్లో రైలు టికెట్ల రుసుం వాప‌సు వివ‌రాలు ఒక్కోసారి రిజ‌ర్వేష‌న్ల‌ను క్యాన్సిల్ చేస్తుంటారు. మ‌ళ్లీ వాటికి సంబంధించి రైల్వే నుంచి సొమ్ము రీఫండ్ రావాల్సి ఉంటుంది. ఇదివ‌ర‌కూ మెయిల్, మొబైల్ మెసేజ్‌ల‌ ద్వారా మాత్ర‌మే రీఫండ్ స‌మాచారం వినియోగ‌దారుల‌కు అందేది Samayam Telugu | Updated: May 18, 2018, 02:46PM IST ఈ రోజుల్లో ఒక‌చోట నుంచి మ‌రో చోట‌కు ప్ర‌యాణించేందుకు ఎక్కువ మంది ప్రిఫ‌ర్ చేసే ప్ర‌యాణం రైల్లోనే. అయితే రైలు టిక్కెట్ల‌ను చాలా రోజుల ముందే రిజ‌ర్వ్ చేసుకోవాలి. ఒక్కోసారి రిజ‌ర్వేష‌న్ల‌ను క్యాన్సిల్ చేస్తుంటారు. మ‌ళ్లీ వాటికి సంబంధించి రైల్వే నుంచి సొమ్ము రీఫండ్ రావాల్సి ఉంటుంది. ఇదివ‌ర‌కూ మెయిల్, మొబైల్ మెసేజ్‌ల‌ ద్వారా మాత్ర‌మే రీఫండ్ స‌మాచారం వినియోగ‌దారుల‌కు అందేది. ఇక‌పై అలా కాకుండా మ‌రో కొత్త సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చింది. అదేంటి అంటారా... అయితే ఇది చ‌ద‌వండి. రైలు ప్రయాణికులు రద్దు చేసుకున్న టికెట్ల తాలూకూ రుసుం వాపసు స్థితిని ఇక నుంచి వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. refunds.indianrail.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పీఎన్‌ఆర్‌ సంఖ్యను నమోదు చేస్తే రుసుం వాపసు స్థితి కనిపిస్తుంది. ఐఆర్‌సీటీసీ భార‌తీయ రైల్వేలో పారదర్శకత కోసం ఈ సౌకర్యం తీసుకొచ్చామని, రుసుం వాపసు రావాల్సిన వారికి ఇది ఎంతో ఉపయుక్తమని రైల్వే బోర్డు ప్రచార విభాగం డైరెక్టర్‌ వేద్‌ ప్రకాశ్‌ తెలిపారు. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే రుసుం వాపసు గురించి ఈమెయిల్‌, సంక్షిప్త సందేశాల ద్వారా వివరాలు తెలుస్తున్నాయి. ఇతరులు టికెట్‌ కౌంటర్ల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సి వస్తోంది. ఇటువంటి వారందరికీ కొత్త వెబ్‌సైట్ ఉపయుక్తంగా ఉంటుంది. రైలు టిక్కెట్ల క్యాన్సిలేష‌న్-రీఫండ్
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పాక్ బౌలర్లని ఉతుకుతుంటే ఆ మజా..? కెరీర్ సాంతం ఎంత మంది ప్రత్యర్థులతో ఆడినా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడేటప్పుడు తెగ ఎంజాయ్ చేసేవాడినని ఈ మాజీ ఓపెనర్ గుర్తు TNN | Updated: Jun 18, 2017, 01:12PM IST పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ బౌండరీలు బాదడాన్ని తాను చాలా ఇష్టపడేవాడినని భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ‘సహనంతో ఎలా ఉండాలో సౌరవ్ గంగూలీ నాకు నేర్పించాడు. అతనే నా ఫేవరెట్ కెప్టెన్. మైదానంలో టెన్షన్ పడకుండా ఎలా స్వేచ్ఛగా బౌండరీలు బాదాలో సచిన్ తెందుల్కర్ నేర్పించాడు’ అని వివరించాడు. కెరీర్ సాంతం ఎంత మంది ప్రత్యర్థులతో ఆడినా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడేటప్పుడు తెగ ఎంజాయ్ చేసేవాడినని ఈ మాజీ ఓపెనర్ గుర్తు చేసుకున్నాడు. ‘పాకిస్థాన్‌పై బౌండరీలు కొట్టడమంటే నాకు చాలా ఇష్టం. ప్రత్యేకంగా 150 కి.మీ వేగంతో బంతులు విసిరే షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో’ అని వివరించాడు. ఇటీవల తనని తిడుతూ పాక్ మాజీ వికెట్ కీపర్ లతీఫ్ వీడియో విడుదల చేసినట్లు తనకు తెలిసిందని.. కానీ.. తను మాత్రం ఆ వీడియో చూడలేదన సెహ్వాగ్ వెల్లడించాడు. వీడియోకి ప్రతిస్పందిస్తూ.. ‘అనవసరమైన మాటలకంటే.. అర్థవంతమైన మౌనం మేలు’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ ఊరుకున్నా యువ క్రికెటర్ మనోజ్ తివారీ తనదైన శైలిలో లతీఫ్‌కి వీడియో ద్వారా బుద్ధి చెప్పాడు.
2sports
Hyderabad, First Published 10, Sep 2019, 4:24 PM IST Highlights అక్కినేని యువ వారసుడు అఖిల్ నాల్గవ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. అఖిల్ నటించిన మూడు చిత్రాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీనితో నాల్గవ చిత్రం విషయంలో అంచనాలు తగ్గించి ముందుకు రావాలని అఖిల్ భావిస్తున్నాడు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు.  అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నటీనటుల విషయంలో చిత్ర యూనిట్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. హీరోయిన్ విషయంలో కూడా ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉన్నాయి.  ఇటీవల ఈ చిత్రంలో నటించేందుకు క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే ఖరారైపోయినట్లు వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ ప్రకటించకపోయినా పూజా హెగ్డే భారీ రెమ్యునరేషన్ తో ఈ చిత్రానికి అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం కోసం పూజా హెగ్డేని తప్పించి మరో హీరోయిన్ ని ఎంచుకున్నట్లు టాక్.  హాట్ మోడల్ గా గుర్తింపు సొంతం చేసుకుంది కేతిక శర్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ అనే చిత్రంలో నటిస్తోంది. తన హాట్ గ్లామర్ తో అదరగొట్టే కేతిక అయితే అఖిల్ సరసన సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. ఈ చిత్రం కోసం అంత రెమ్యునరేషన్ ధారపోయడం అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే కేతికతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  ఈ చిత్రంలో కేతిక నటించడం ఖాయం అయితే ఆమె ఖాతాలో గోల్డెన్ ఛాన్స్ చేరినట్లే.  Last Updated 10, Sep 2019, 4:25 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఆ రెండూ త్యాగం చేయలేకే హీరోయిన్ కాలేదు: యాంకర్ శ్యామల నేను ఎక్కడికి వెళ్లినా శ్యామలా.. శ్యామలా.. అని జనం గుర్తుపడుతున్నారు. ముఖ్యంగా ఆంటీలు అయితే షూటింగ్‌కి వెళ్లినప్పుడు వాళ్ల ఇంట్లో మనిషిగా చూస్తున్నారు. Samayam Telugu | Updated: Nov 11, 2019, 02:56PM IST యాంకర్ శ్యామల యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న యాంకర్ శ్యామల హీరోయిన్‌గా చేయడానికి ఇష్టం లేదంటోంది. అసలు ఆమె హీరోయిన్ ఏంటి? అనేవారి కోసం కాదు కాని.. ఆమె హీరోయిన్ కావాలని కోరుకునే ఫ్యాన్స్‌కి క్లారిటీ ఇచ్చింది. ఓ ట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘నేను సక్సెస్‌ను రుచి చూస్తూనే ఉన్నా. ఇంకా పూర్తి కాలేదు. ఓ మధ్య తరగతి నుండి వచ్చిన నన్ను ఇంత మంది ఫ్యాన్స్ ఉండటం.. శ్యామలా అని పిలుస్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఔట్ డోర్ షూటింగ్‌లకు వెళ్తుంటే.. చాలా మంది ఆంటీలు నా దగ్గరకు వచ్చినువ్ చాలా బాగా చేస్తావ్ అంటే ఆనందంగా అనిపిస్తోంది. మాది కాకినాడ ఇదే నా సక్సెస్ ఫార్ములా.. మా నాన్న గారు నాకు ఏడాది వయసు ఉన్నప్పుడే చనిపోయింది. అమ్మకు నేనొక్కదాన్నే. మాది కాకినాడ. అక్కడ నుండి వచ్చి ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నా. నా సక్సెస్ ఫార్ములా సీక్రెట్ ఏంటంటే.. 80 శాతం కష్టం, 20 శాతం లక్ అని అనుకుంటా. నాకు లైవ్స్ చేయడం బాగా ఇష్టం. నేను సింగిల్ టేక్ యాంకర్‌ని. లైవ్‌లో క్విక్ రిజల్ట్ ఉంటుంది. హీరోయిన్ కావాలంటే వీటిని త్యాగం చేయాల్సిందే.. నేను హీరోయిన్ కావడం నాకు ఇష్టం లేదు. ఇంట్రస్ట్ లేదు. హీరోయిన్ కావాలంటే చాలా రెస్పాన్సిబులిటీ ఉండాలి. గ్లామర్ షోని ఎక్స్‌పర్ట్ చేస్తారు. దాన్ని నేను మెయిన్‌టైన్ చేయలేను. హీరోయిన్‌ని చూడగానే భలే ఉందిరా అనేట్టుగా ఉండాలి. నేను అందంగా ఉన్నా.. నాకు తిండి, నిద్ర మస్ట్‌గా ఉండాలి. హీరోయిన్ ఈ రెండింటినీ త్యాగం చేయాలి. అది నా వల్ల కాదు. అంతే కాకుండా ఫస్ట్ నాకు హీరోయిన్ కావాలనే ఇంట్రస్ట్ లేదు. ఫ్యూచర్‌లో హీరోయిన్ అవకాశం ఇచ్చినా చేయను. ఓన్లీ క్యారెక్టర్స్. సినిమాలకు సీరియల్స్‌కి తేడా ఇదే.. సీరియల్స్‌లోనూ సినిమాల్లోనూ నేను చేశా. రెండింటికీ పెద్ద తేడా ఉండదు. నేను సీరియల్స్‌లో నెగిటివ్ రోల్స్ చేశా కాబట్టి పెద్ద కష్టపడలేదు. అయితే సినిమాల్లో సింపుల్‌గా చెప్పేస్తే చాలు. సీరియల్స్‌లో కాస్త ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సీరియల్స్‌ నుండి సినిమాలకు షిఫ్ట్ అయ్యాక అలవాటు కావడానికి కాస్త టైం పట్టింది. గుండెల్లో గోదారి, లౌఖ్యం, బెంగాల్ టైగర్, ఒక లైలా కోసం చిత్రాల్లో మంచి పాత్రలే చేశా. యాంకర్‌గా 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా చాలా నేర్చుకున్నా. నా అవసరం ఉందనుకుంటే జనాలు మనల్ని కోరుకుంటారని తెలిసింది’ అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ శ్యామల.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి పాలాభిషేకం Highlights అక్కినేని ఫ్యామిలీని వదిలేయండి అని కోరుతూ.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి అక్కినేని అభిమానులు పాలాభిషేకం చేశారు. అదేదో అభిమానం ఎక్కువై అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఇకనైనా అక్కినేని ఫ్యామిలీని వదిలేయండి అని కోరుతూ వీళ్లు ఆ అభిషేకం చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రామ్ గోపాల్ వర్మ  ఇటీవల నాగార్జున హీరోగా ఆఫీసర్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నాగార్జున కెరీర్ లోనే అత్యంత తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. కాగా.. తన తదుపరి చిత్రం అఖిల్ తో చేయాలనుకుంటున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. నాగ్ కూడా వర్మ, అఖిల్‌ మధ్య చర్చలు జరుగుతున్న విషయాన్ని ధృవీకరించారు. దీంతో అక్కినేని అభిమానుల్లో కలవరం మొదలైంది. ఈ విషయంపై అక్కినేని అభిమానులు వినూత్నంగా స్పందించారు.  అక్కినేని ఫ్యామిలీని వదిలేయాలని కోరుతూ వర్మ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆర్జీవీ.. దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV Petrol prices:పెట్రో,డీజిల్ ధ‌ర‌ల రేట్ ఇంకా పైకే వెళ్ల‌నుందా? వ‌చ్చే రోజుల్లో లీట‌రుకు 3.5 నుంచి 4 రూపాయ‌లు పెంచే అవ‌కాశం ఉన్న‌ట్లు కొట‌క్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఈక్విటీస్ ఒక నివేదిక‌లో పేర్కొంది. అదే జ‌రిగితే సామాన్యుడికి ఇంధ‌న మంట‌ల‌తో పాటు, వ‌స్తువుల ధ‌ర‌ల సెగ సైతం తాక‌క త‌ప్ప‌దు. Samayam Telugu | Updated: May 17, 2018, 05:57PM IST పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను సామాన్యుడిని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి. అంత‌కంత‌కు కొత్త గ‌రిష్టాల‌కు వెళుతున్నాయి. సెప్టెంబర్ 2013లో ఇండియాలో పెట్రోలు ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయి రూ. 76.06కు చేరగా, ఇప్పుడా స్థాయికి ఒక్క శాతం మాత్రమే తక్కువగా ఉంది. ఈ ఉదయం ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలను 22 నుంచి 24 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ణయం తీసుకోగా, ఢిల్లీలో రూ. 75.32, కోల్ కతాలో రూ. 78.01, ముంబైలో రూ. 83.16, చెన్నైలో రూ. 78.16కు ధరలు పెరిగాయి. ఇదే సమయంలో ఢిల్లీలో రూ. 66.79కి, కోల్ కతాలో రూ. 69.33కు, ముంబైలో రూ. 71.12, చెన్నైలో రూ. 70.49కి డీజిల్ ధరలు చేరాయి. ఇక ఈ ధరలు మరొక్క శాతం పెరిగితే, అంటే ఇంకో 70 నుంచి 80 పైసలు పెరిగితే, ఆల్ టైమ్ రికార్డు ధరలకు 'పెట్రో' ఉత్పత్తులు చేరుతాయి. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు 2014 నాటి స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల కారణంగా ధరలు రికార్డు స్థాయికి చేరాయన్న సంగతి తెలిసిందే. <p>ఇంధ‌న ధ‌ర‌లు<br></p> అయితే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లైన ఐవోసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్, భార‌త్ పెట్రోలియం 19 రోజులు విరామ‌మిచ్చి పెట్రోలు,డీజిల్ ధ‌ర‌ల‌ను ఒక్క‌సారిగా పెంచాయి. ఇప్పుడు వ‌చ్చే రోజుల్లో లీట‌రుకు 3.5 నుంచి 4 రూపాయ‌లు పెంచే అవ‌కాశం ఉన్న‌ట్లు కొట‌క్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఈక్విటీస్ ఒక నివేదిక‌లో పేర్కొంది. అదే జ‌రిగితే సామాన్యుడికి ఇంధ‌న మంట‌ల‌తో పాటు, వ‌స్తువుల ధ‌ర‌ల సెగ సైతం తాక‌క త‌ప్ప‌దు.
1entertainment
Idea మొబైల్‌వ్యాన్‌తో ఐడియా 4జి నెట్‌వర్క్‌ ప్రచారం హైదరాబాద్‌,జూలై 7: టెలికాంరంగంలో మూడో అతిపెద్ద కంపెనీగా ఉన్న ఐడియా సెల్యులర్‌ 4జి హాట్‌స్పాట్‌ నగర వ్యాప్తంగా విస్తృతప్రచారం చేసేందుకు 4జినెట్‌వర్క్‌ను మరిం త విస్తరించే వ్యూహంతో ముందుకు వెళుతోంది. లుక్‌లుక్‌ ఐడియా4జి4ఇ హాట్‌ స్పాట్‌ బ్రాండఫై కొత్తగా నగరంలో ఒక ప్రత్యేక వ్యాన్‌ను ప్రవేశపెట్టిం ది. 4జి హాట్‌స్పాట్‌ మొబైల్‌వ్యాన్‌ వేరువేరు ప్రాంతాల్లో సంచరి స్తుంది. వైఫై కలిగిన ఐడియా 4జి హాట్‌ స్పాట్‌తో ఎక్కువ మంది వినియోగదారులు సినిమాలు సంగీ తం, హెచ్‌డి వీడియోలను వేగంగా పొందే అనుభవాన్ని 4జి ఆయాప్రాంతాల్లో అందిస్తున్నది. దేశంలో 4జి నెట్‌వర్క్‌ను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న ఐడియా తన 4జినెట్‌వర్క్‌ను విస్తృత ప్రచారం చేస్తోంది. ఇతర సర్వీసుల నుంచి కూడా తమ నెట్‌వర్క్‌తో పోర్టుచేసుకునే సదుపాయం ఉందని ఐడియా ప్రకటించింది. ఐడియాసెల్యులర్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ అధికారి శశిశంకర్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లుక్‌లుక్‌ ఐడియా 4జి అనేది అమలవుతోందని, హైదరాబాద్‌లోకూడా విస్తృత ప్రచారం జరుగుతున్నదని అన్నారు. ఎపి,తెలంగాణ రాస్ట్రాల్లో 4జి ఉనికితో 661 పట్టణాల్లో 4600 సైట్లను కలిగి న ఐడియా మొత్తం 1.69 కోట్ల కస్టమర్లను కలిగి ఉంది.
1entertainment
వారి నొప్పి‌.. మాకూ బాధ క‌లిగిస్తోంది..! -  చైనా మందగమనం ప్రభావం భారత్‌ పైనా ఉంది -  నేర్చుకోవాల్సి అంశాలు చాలా ఉన్నాయి -  మరోమారు భిన్నమైన ప్రకటనతో ఆకట్టుకున్న రాజన్‌     బీజింగ్‌: చైనా ఆర్థిక మందగమనం ప్రపంచం మొత్తానికి ఆందోళనకరంగా మారిందని భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. చైనా ఆర్థిక మందగమనం ప్రభావం భారత్‌కు కూడా బాధాకరంగానే మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చైనా మందగమనం ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా లేదంటూ భారత ప్రభుత్వం చేసిన ప్రకటనకు పూర్తి భిన్నంగా ఈ రాజన్‌ వ్యాఖ్యలు చేయడం విశేషం. చైనాకు భారత్‌ జరిపే కొన్ని ఎగుమతులకు డిమాండ్‌ బాగా తగ్గిందని ఆయన అన్నారు. హాంకాంగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఇతర దేశాలు కూడా గతంలో మాదిరిగా చైనాకు ఎగుమతులు జరపడం లేదని ఆయన వివరించారు. భారత్‌ కమోడిటీ దిగుమతిదారు అయినందున తక్కువ ధరలకు వాటిని పొందేందుకు దోహదం చేస్తోందని వివరించారు. చైనా మందగమనం ప్రపంచ దేశాలను బాగా ప్రభావితం చేస్తోందనీ.. ప్రపంచ ఆర్థిక వృద్ధిని బాగా ప్రభావితం చేస్తోందని అన్నారు. భారత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో బాగా సమ్మెళితమైనందున ఆ ప్రభావం తమ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. హాంకాంగ్‌ విశ్వవిద్యాలయం బహూకరించనున్న గౌరవ డాక్టరేట్‌ను అందుకొనేందుకు రాజన్‌ ఇక్కడ పర్యటిస్తున్నారు. గతంలో ప్రభుత్వం చేసిన 'చైనా పెయిన్‌ ఇండియా గెయిన్‌' అంటూ చేసిన కొన్ని వివాదాస్పద వాక్యలకు భిన్నంగా ఇప్పుడు రాజన్‌ మాట్లాడడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. తూర్పు వైపు ప్రత్యేక దృష్టి..   ఇరుగుపొరుగు దేశాల మధ్య సంబంధాలను గురించి కూడా రాజన్‌ ఇంటర్వ్యూలో ప్రస్థావించారు. ఇరుదేశాల మధ్య అన్యోన్యత బాగా పెరగాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. ఇందుకు ప్రధాని నిర్ధిష్టమైన మార్గనిర్దేశనం చేశారని అన్నారు. సంప్రదాయకంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పశ్చిమ దేశాలపై ఆధారపడుతూ వస్తున్న భారత్‌ ఇకపై తూర్పు దేశాలతో స్నేహ సంబంధాలను పెంచుకొని బలపడాలని ప్రధాని సూచించారన్నారు. ఇందులో భాగంగానే 'ఏషియన్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ ఇన్వెష్ట్‌మెంట్‌ బ్యాంక్‌' లేదా 'చైనా సిల్క్‌ రోడ్‌' వంటి వాటిపై ఆసక్తిగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. చైనా వృద్ధి రేటు తీరును గురించి భారత్‌ తెలుసుకొని అనుసరించాల్సింది చాలా ఉందని అన్నారు. చైనా మెరుగుదలను సాధించిన రంగాల నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు. తయారీ రంగం, మౌలిక వసతుల రంగం, గ్రామీణ ప్రాంతాలలో చిన్న పరిశ్రమల ఏర్పాటు, ఎఫ్‌డీఐల నిర్వహణ గురించి భారత్‌ తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు.అయితే వాటిని యథాతథంగా తాము గుడ్డిగా భారత్‌లో పాటించలేమని అన్నారు. చైనా ఇప్పటికే ఈ వృద్ధి మార్గంలో దూసుకుపోతోందని ఇందులో భాగంగా చాలా పరిస్థితులను మార్చేంసిందని అన్నారు. ఇరు దేశాల వృద్ధికి దోహదం చేసేలా ఈ విధానాలను తాము ఎలా అమలులో ఉంచాలో మేదోమథనం జరిపి ఇరువురికి మేలు జరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jindal Deal రక్షణ రంగానికి జిందాల్‌ ప్రత్యేక ఉక్కు తయారీ న్యూఢిల్లీ: రక్షణరం గంలోనికి జిందాల్‌ స్టెయి న్‌ లెస్‌(హిసార్‌) ప్రవేశిం చింది. అత్యున్నత నైట్రో జెన్‌ స్టీల్‌ను వాణిజ్య ప రంగా ఉత్పత్తిచేస్తున్న మొ దటి భారతీయ కంపెనీగా జిందాల్‌ నిలిచింది. బాలి స్టిక్‌, బ్లాస్ట్‌ప్రొటెక్షన్‌ సామ గ్రిగా వినియోగించే హైనె ౖట్రోజెన్‌ స్టీల్‌ సాయుధ రంగ వాహనాల బరువు, ధరలను సైతం తగ్గిస్తుం దని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో రక్షణరంగంలో ఒకమైలురాయిగా జిందాల్‌ నిలుస్తుందని కంపెనీ ప్రకటించింది. కేంద్ర రక్షణ సహాయ మంత్రి డా.సుభాష్‌ భామ్రే, వైస్‌ఛైర్మన్‌ అభ్యు ద§్‌ు జిందాల్‌ల సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రస్తుతం రోల్డ్‌ హోమోజీనియస్‌ ఆర్మూర్‌ స్థానాన్ని హిసార్‌ఎన్‌ఎస్‌ భర్తీచేస్తుంది. రక్షణరంగ అవసరాలకోసం సమీకరించుకునే సామగ్రికయ్యఖర్చులో 50శాతం తగ్గించవచ్చని కంపెనీ వివరించింది. ఇన్‌ఫాంట్రీ కంబాట్‌ వాహనాలు, లైట్‌ స్పెషాలిటీ వాహనాలు, లైట్‌ ఆర్మర్డ్‌ బహుళప్రయోజన వాహనాలు, రక్షణరంగ అన్ని వాహనాలకు జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వినియోగిస్తారని జిందాల్‌ వెల్లడించారు. మేకిన్‌ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఈ ఒప్పందం జరిగిందని,పదేళ్లుగా చేస్తున్న పరిశోధనలు అత్యున్నతస్థాయి సామగ్రి ఉత్పత్తికి బీజం పడిందని వైస్‌ఛైర్మన్‌ అభ్యుద§్‌ు జిందాల్‌ వెల్లడించారు.
1entertainment
Delhi, First Published 10, Apr 2019, 11:37 AM IST Highlights వివిధ దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయులు తమ కుటుంబాలతోపాటు దేశాన్ని కూడా ఆదుకుంటున్నారు. గత మూడేళ్లలో వివిధ దేశాల నుంచి అత్యధిక రెమిటెన్స్‌లు అందుకున్న దేశాల్లో భారతదేశానికే అగ్ర తాంబూలం. వాషింగ్టన్: సొంత దేశాలకు ప్రవాసులు పంపించే డబ్బు విషయంలో భారత్‌ మరోసారి అగ్రస్థానంలో నిలబడింది. 79 బిలియన్‌ డాలర్లతో గతేడాదీ ప్రథమ స్థానంలోనే నిలిచింది. తద్వారా ప్రవాస భారతీయులు తమ కుటుంబాలతోపాటు దేశాన్ని ఆదుకుంటున్నారు.  గత మూడేళ్లుగా భారత్‌కు వివిధ దేశాల్లోని ప్రవాసులు పంపిస్తున్న సొమ్ము క్రమేణా పెరుగుతుండటం విశేషం. 2016లో 62.7 బిలియన్‌ డాలర్లు పంపిన ప్రవాస భారతీయులు.. 2017లో 65.3 బిలియన్‌ డాలర్లను పంపారు. 2018లో 79 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో గతేడాదే దాదాపు 14 బిలియన్‌ డాలర్లు పెరిగినట్లయింది. ప్రపంచంలో మరే దేశానికీ ప్రవాసుల నుంచి ఈ స్థాయిలో నిధులు అందలేదు. భీకర వరదలతో అతలాకుతలమైన కేరళకు ఆదుకునేందుకు మలయాళ ఎన్నారైలు తమ వారికి ప్రవాసులు పెద్ద ఎత్తున సొమ్ము పంపి ఉంటారని బ్యాంక్‌ అభిప్రాయపడింది. చైనా తర్వాతీ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్‌ తమ తాజా జాబితాలో పేర్కొన్నది. మెక్సికో (3,600 కోట్ల డాలర్లు), ఫిలిప్పీన్స్‌ (3,400 కోట్ల డాలర్లు), ఈజిప్టు (2,900 కోట్ల డాలర్లు) తర్వాతీ స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం తక్కువ, మధ్యస్త ఆదాయ దేశాలకే ప్రవాసుల నుంచి గతేడాది ఎక్కువ సొమ్ము వచ్చినట్లు తేలింది. ఇది కూడా రికార్డు స్థాయిలో 529 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 9.6 శాతం ఎక్కువ. 2017లో 483 బిలియన్‌ డాలర్లుగానే ఉన్నది. ఇదీ రికార్డే కావడం గమనార్హం.  ఈ ఏడాది 550 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చన్న సంకేతాలు ఉన్నాయి. ఇక సంపన్న దేశాలకు నిరుడు 689 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. 2017లో 633 బిలియన్‌ డాలర్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, పాకిస్తాన్‌కు 2018లో అక్కడి పౌరులు విదేశాల నుంచి పంపిన మొత్తం తగ్గింది.  ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి పాకిస్తానీయులు ఈసారి తక్కువ రెమిటెన్సులు పంపారు. దీంతో 2017తో పోల్చితే 7 శాతం తగ్గుముఖం పట్టాయి. అయితే బంగ్లాదేశ్‌లో 15 శాతం వృద్ధి కనిపించడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయిలో పలికిన నేపథ్యంలో క్రూడ్‌ ఉత్పత్తి దేశాల్లోని విదేశీయులు తమతమ దేశాలకు గతేడాది పెద్ద ఎత్తున నిధులను పంపించగలిగారని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక స్పష్టం చేసింది. గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ)లోని బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదే అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశాల నుంచి ప్రవాసులు గణనీయంగా స్వదేశంలోని తమ వాళ్లకు డబ్బు పంపారు. అమెరికాలో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడటంతో డాలర్ల రాక ఎక్కువైందని ప్రపంచ బ్యాంక్‌ చెప్పింది. ఈ క్రమంలోనే దక్షిణాసియా దేశాల్లో 2017తో పోల్చితే 2018లో 12 శాతం వృద్ధి కనిపించిందని, 131 బిలియన్‌ డాలర్లుగా నమోదైందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. 2017లో 6 శాతం వృద్ధే ఉన్నట్లు పేర్కొన్నది. తూర్పు ఆసియా దేశాల్లోకి గతేడాది 7 శాతం పెరిగి 143 బిలియన్‌ డాలర్లు వచ్చాయి.  విదేశాల నుంచి తమ దేశాలకు డబ్బు పంపుతున్న ప్రవాసులను వ్యయ భారం వెంటాడుతున్నది. కష్టార్జితాన్ని కన్నవాళ్లకు, కట్టుకున్నవాళ్లకు చేర్చుతున్న వీరందరిపై బ్యాంకులు 11 శాతం చార్జీలను విధిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంకులు వసూలు చేసిన సగటు చార్జీలు ఇలాగే ఉన్నాయి మరి. అయితే పోస్టాఫీసులు మాత్రం 7 శాతం చార్జీలే తీసుకున్నాయి.  నిజానికి ప్రపంచ అభివృద్ధి లక్ష్యాల దృష్ట్యా ఐక్యరాజ్య సమితి 2015లో ఈ చార్జీలు 3 శాతాన్ని మించరాదని తీర్మానించింది. అయినా వివిధ కారణాల రిత్యా ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఫలితంగా వలస ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకే రెమిటెన్సులు ఎక్కువగా వస్తున్నందున చార్జీలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. Last Updated 10, Apr 2019, 11:37 AM IST
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV విశాఖ: లంక జట్టు బస్సుకు తప్పిన ప్రమాదం.. శ్రీలంక క్రికెటర్లు కలవరపాటుకు గురైన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. లంక జట్టు సభ్యులు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. TNN | Updated: Dec 16, 2017, 02:55PM IST శ్రీలంక క్రికెటర్లు కలవరపాటుకు గురైన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. లంక జట్టు సభ్యులు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం (డిసెంబర్ 15) ఆ జట్టు స్థానిక నోవాటెల్&zwnj; హోటల్&zwnj; నుంచి నెట్&zwnj;ప్రాక్టీస్ కోసం స్టేడియానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు హోటల్&zwnj; సమీపంలో అదుపుతప్పి ఓ గోడను ఢీకొంది. దీంతో లంక క్రికెటర్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవరు బస్సును సరైన దిశలో నడపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత యథావిధిగా స్టేడియంలో నెట్&zwnj;పాక్ట్రీసు చేసుకుని తిరిగి హోటల్&zwnj;కు చేరుకున్నారు.
2sports
Jul 03,2015 నేటినుంచి దేశ వ్యాప్త ఎంఎన్‌పి న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లు శుక్రవారం నుంచి దేశ వ్యాప్త 'మొబైల్‌ నెంబర్‌ పోర్టిబిలిటీ' (ఎంఎన్‌పి)లను ప్రారంభించనున్నాయి. దేశంలోని ప్రభుత్వ టెలికం కంపెనీలు జులై 3 నుంచి దేశ వ్యాప్తంగా ఎంఎన్‌పిని అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తొలుత ఎయిర్‌టెల్‌, వొడాపోన్‌ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించాయి. దీంతో దేశంలో తమ ఖాతాదార్లు ఏ సర్కిల్‌ నుంచి మరే సర్కిల్‌, నెట్‌వర్క్‌కు అయినా లోకల్‌కు మారడానికి వీలుటుందని పేర్కొన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 163 Views Gold Price , heavy gold హైదరాబాద్‌: పసిడి ధరలు పరుగులు తీస్తుంది. బుధవారం రాత్రి 10 గంటల సమయానికి తెలుగు రాష్ట్రాల్లోని బులియన్‌ విపణుల్లో 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం రూ.38,900 39,000ను తాకింది. అంతర్జాతీయ విపణిలో ఒక్కరోజులోనే ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 35 డాలర్ల మేర పెరిగి 1507 డాలర్లకు చేరడం వల్లే, దేశీయంగా భారీ పెరుగుదల నమోదవుతోందని విక్రేతలు చెబుతున్నారు. వెండి కూడా ఇదేబాటన కిలో రూ.45,000కు చేరింది. ట్రేడింగ్‌లో గిరాకీని బట్టి కూడా ఈ ధరలు మారుతుంటాయి. దీంతో డిమాండ్‌ పెరిగి పసిడి ధర ధగధగమంటోంది. ఈ ప్రభావం శ్రావణమాసం విక్రయాలపై పడింది. తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/
1entertainment
Hyd Internet 68 Views pravin amre , rahane coach ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా క్రికెటర్ రహానె రాణించినప్పటికీ, త్వరలో జరగనున్న టీ20 సిరీస్ కు మాత్రం అతన్ని ఎంపిక చేయలేదు. ఓ మంచి ఆటగాడిని సెలెక్టు చేయకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో రహానె వ్యక్తిగత కోచ్ ప్రవీణ్ స్పందించారు. ఆస్ట్రేలియా జట్టుతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో ఎంతో చక్కగా ఆడాడని కితాబిచ్చారు. ఇంత మంచి ప్రదర్శన చేసిన ఆటగాడెవరైనా, తదుపరి సిరీస్ కు తనను ఎంపిక చేయకపోతే ‘సెలెక్టర్ల తప్పిదం’ అనే వ్యాఖ్యలతో విమర్శిస్తాడని, రహానే మాత్రం ఆవిధంగా చేయలేదని, హుందాగా వ్యవహరించాడని అన్నారు. ఏ సమయంలోనైనా సరే, దేశానికి సేవ చేసేందుకు ఓ సైనికుడిలా రహానే ఎదురుచూస్తుంటాడని ప్రవీణ్ అన్నారు. rahane coach, pravin amre
2sports
SUMMER SHOPPING1 ప్లిప్‌ కార్ట్‌ సమ్మర్‌ సేల్‌ హైదరాబాద్‌, మే 3: ప్రముఖ ఇ-కామర్స్‌సంస్థ ప్లిప్‌కార్ట్‌ వేసవి సెలవు లను దృష్టిలో పెట్టుకుని సమ్మర్‌షాపింగ్‌డేస్‌ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ ను ప్రకటించింది. మే2నుండి మే 4వరకూ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. మొబైల్స్‌, స్మార్ట్‌వాచీలు, టాబ్ల్లెట్లపై ప్రత్యేక తగ్గింపు ధర లను ప్రకటించింది. ఇందులో శామ్‌సంగ్‌ ఆన్‌నెక్ట్స్‌ మోడల్‌ ధర రూ.18,490ఉండగా ప్రస్తుతం రూ.14,900కు అందిస్తోంది. మోటో ఎక్స్‌ప్లే పై సైతం భారీగా తగ్గింపును ఇస్తోంది. రూ.16999 ఉన్న 16జిబి మోడల్‌ను ఇప్పుడు 11,999కి, రూ.18499ధర ఉన్న 32 జిబి మోడల్‌ను రూ.13,499కి ఇస్తు న్నట్లు ప్రకటించింది. ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌, శామ్‌సంగ్‌ గేర్‌, మోటో 360 స్టోర్ట్‌ వంటి పలు మోడళ్లపై ధరలను తగ్గించింది. లెనోవా యోగా మోడల్‌ టాబ్స్‌, ఆపిల్‌ ఐప్యాడ్స్‌పై ధరలను తగ్గించినట్లు ప్లిప్‌కార్ట్‌ పేర్కొంది.
1entertainment
bse1 బ్రిటన్‌ ఎన్నికలు, యూరోపియన్‌ బ్యాంకు సమీక్ష ముంబయి, జూన్‌ 9: బెంచ్‌మార్క్‌స్టాక్‌ సూచీలు స్వల్పంగా దిగువస్థాయిలో ముగిసాయి. అంతర్జాతీ యంగా చోటుచేసుకున్న పరిణామాలు, బ్రిటన్‌ అధ్యక్ష ఎన్నికలు, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు విధాన సమీక్ష నిర్ణయాలు, అమెరికా ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామీపై వచ్చిన విమర్శలు వంటివి కొంత కీలకం అయ్యాయి. అయితే నష్టాలు కొంత మేర కట్టడి అయ్యాయి. ఆర్‌బిఐతన ద్వైమాసిక ద్రవ్యవసమీక్షలో నిర్ణయాలను వెల్లడించడంతో కొంతమేర ఆర్‌బిఐ సాత్విక ధోరణి అవలంభిస్తుం దన్న అంచనాలు పెరిగాయి. రెపోరేట్లు 6.25 శాతంవద్దనే కొనసాగించి మార్కెట్‌ నిపుణుల అంచ నాలను ఆర్‌బిఐ నిజంచేసింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ గురువారం 58పాయింట్ల దిగువన 31,213 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 16 పాయింట్ల దిగువన 9647 పాయింట్లవద్ద స్థిర పడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.2శాతం, 0.3శాతం వద్ద నిలిచాయి. మార్కెట్లు ఎక్కువగా బ్రిటన్‌ ఎన్నికలు, ఇసిబి సమావేశం అంశాలపై దృష్టిసారించాయని, ఇన్వెస్టర్లు కూడా అదే దిశగా ఉన్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సేవల సంస్థ ముఖ్య వ్యూహకర్త ఆనంద్‌జేమ్స్‌ వెల్లడిం చారు. జిఎస్‌టి అమలువల్ల వచ్చే పరిస్థితులపై కూడా మదింపు చేసుకుంటున్నట్లు ఆయన తెలి పారు. ఫార్మారంగసూచి మాత్రం అన్నిసూచీలకంటే ముందు నిలిచింది. డా.రెడ్డీస్‌, సన్‌ఫార్మా, సిప్లా వంటి కంపెనీలు 2-4శాతం పెరిగాయి. బిఎస్‌ఇ ఐటి సూచీ అతిపెద్ద నష్టం చవిచూసి 1.5శాతం దిగజారింది. టిసిఎస్‌ 3.5శాతం దిగజారింది. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కూడా 3శాతం దిగ జారింది. మూడీస్‌, ఫిట్జ్‌ రేటింగ్‌ సంస్థల అంచ నాలకు అనుగుణంగా షేర్లు కదిలాయి. వారంలో కనిష్టస్థాయి 2.8శాతాన్ని నమోదుచేసాయి. పెట్రో నెట్‌ ఎల్‌ఎన్‌జి 4.3శాతం దిగజారింది. జిడిఎఫ్‌ ఇంటర్నేషనల్‌ తన మొత్తం పదిశాతం వాటా 75 మిలియన్ల షేర్లను విక్రయించిందన్న వార్తలు వెలువడ్డాయి. 3.3శాతం స్టాక్‌ దిగువన ముగి సింది. ఆసియామార్కెట్లు గురువారం అంతర్జా తీయ సంఘటనల ఆధారంగా నడిచాయి. ఆసియా పసిఫిక్‌షేర్లు జపాన్‌ బైట ప్రాంతంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. చైనా వాణి జ్యగణాంకాలతో స్వల్పంగా పెరిగితే జపాన్‌నిక్కీ మాత్రం 0.4శాతం దిగజారింది. యూరోపియన్‌ షేర్లుస్థిరంగానడిచాయి. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు సమీక్ష, బ్రిటన్‌ ఎన్నికలు వంటివి కీల కంగా నిలిచాయి. యూరోస్టాక్స్‌ 600 సూచి 0.15శాతం పెరిగింది. ఆర్థికరంగషేర్లు పటిష్టం అయితే టెలికాం రంగషేర్లు నీరసించాయి. బ్రిటన్‌ బ్లూచిప్‌ ఎఫ్‌టిఎస్‌ఇ సూచి నిలకడగా కొనసాగింది.
1entertainment
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ... రెండేళ్ల వయస్సులో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటున్న ధోనీ కూతురు జీవా. ఇప్పుడు ఏకంగా పాటే పాడేసింది. అది కూడా మలయాళం పాట. సాధారణంగా మలయాళం భాషా రానివారికి.. ఆ పదాలను పలకడం అంత సులభం కాదు. అయితే, ఈ బుల్లి ధోనీ ఎంతో అవలీలగా, గుక్క తిప్పకుండా మలయాళం పాట పాడేసింది. మోహన్ లాల్ నటించిన &lsquo;అద్వైతం&rsquo; సినిమాలోని &lsquo;&lsquo;అంబాల పూజై ఉన్నికన్నానండూ నీ&rsquo;&rsquo; అనే పాటను ఎంతో చక్కగా ఆలపించింది. అక్షరం పొల్లుపోకుండా ఆమె పాడిన పాట విని ధోనీ అభిమానులు మురిసిపోతున్నారు. ఇటీవల &lsquo;&lsquo;నాన్న ధోనీకి నీళ్లు తాగిస్తూ.. లడ్డు కోసం పోట్లాడుతూ&rsquo;&rsquo; సోషల్ మీడియాలో ట్రెండ్&zwnj;గా మారిన జీవా ఈ పాటతో మరోసారి అబ్బో అనిపిస్తోంది. ఆ పాటను ఈ వీడియోలో చూడొచ్చు. (Video Source: SakshiDhoni.official/facebook)
2sports
పిల్లల్ని కనాలనుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ Highlights పిల్లల్ని కనాలనిపిస్తోందంటున్న కంగనా రనౌత్ గతంలో బ్లూ ఫిలింలో నటించడానికీ సిద్ధపడ్జానంటున్న కంగన ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనిపిస్తోందట బాలీవుడ్‌ బోల్డ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన కంగన ఓ దశలో బ్లూ ఫిల్మ్‌లో నటించేందుకు సిద్ధపడిందట. అయితే అదృష్టవశాత్తూ ‘గ్యాంగ్‌స్టర్‌’లో అవకాశం రావడంతో బ్లూ ఫిల్మ్‌ నుంచి బయటపడిందట. ఆ విషయాన్ని ఓ కార్యక్రమంలో వెల్లడించింది కంగన.   ‘నాకు 2006లో నా అరంగేట్ర సినిమా ‘గ్యాంగ్‌స్టర్‌’ కంటే ముందు ఓ ఆఫర్‌ వచ్చింది. ఆ సినిమా ఫోటో షూట్‌కు కూడా వెళ్లా. దుస్తులేమీ లేకుండా కాస్ట్యూమ్‌ రోబ్‌ ఇచ్చారు. అప్పుడే అర్థమైంది అది ఓ నీలిచిత్రమని. అయినా ఫర్వాలేదు.. చేద్దామనుకున్నా. ఇంతలోనే ‘గ్యాంగ్‌స్టర్‌’ ఆఫర్‌ వచ్చింది. ఆ కథ నచ్చడంతో అదే చేశాను. కానీ, ఆ బ్లూ ఫిల్మ్‌ నిర్మాత నా మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సినిమా చేయకపోవడం వల్ల చాలా కష్టాలు పడ్డాను. అప్పుడు నా వయసు 17 ఏళ్లు. ‘గ్యాంగ్‌స్టర్‌’ ఆఫర్‌ కనుక రాకపోయి ఉంటే కచ్చితంగా ఆ సినిమా చేసి ఉండేదాన్ని. అప్పట్లో నేను ఉన్న పరిస్థితులే ఆ నీలి చిత్రానికి సిద్ధపడేలా చేశాయ’ని కంగన వెల్లడించింది.   ఇక కంగనా రనౌత్ వయసు 30 ఏళ్ళకి దగ్గరవుతోంది. ఈ నేపత్యంలో ఆమెలో పిల్లల్ని కనాలనే కోరిక పెరుగుతోంది. ఈ విషయమై ఆమె స్పందిస్తూ ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి కోరికలేదు, కానీ ఈ మధ్య నా మయసు అంతా పిల్లలపైకే మళ్లుతోంది అని చెబుతోంది. ఇంకా పెళ్లి కూడా కాలేదు... అప్పుడే ఈ కోరిక ఏమిటో అని అడిగితే... 30 సంవత్సరాలకు దగ్గర్లో ఉన్నాను కనుక ఇలాంటి కోరిక కలుగుతోందేమో నాకు తెలియదు. వీలైనంత త్వరగా నా కోరికను తీర్చుకుంటాను. త్వరలో నాకు తగిన వాడిని చూసుకుని పెళ్లి చేసుకుని వెంటనే పిల్లల్ని కనేస్తాను అంటోంది. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV పారు కంటే దారు గొప్పదట: ‘కిట్టు’గాడి ఉపదేశం రాజ్ తరుణ్, అను ఎమన్యుల్ జంటగా నటిస్తున్న చిత్రం.. ‘కిట్టు ఉన్నాడు.. జాగ్రత్త’ విడుదల మార్చి 3కు వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా సినిమాలోని పాటల వీడియోలను ఒక్కొక్కటీ విడుదల చేస్తున్నారు. TNN | Updated: Feb 16, 2017, 08:33PM IST రాజ్ తరుణ్, అను ఎమన్యుల్ జంటగా నటిస్తున్న చిత్రం.. &lsquo;కిట్టు ఉన్నాడు.. జాగ్రత్త&rsquo; విడుదల మార్చి 3కు వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా సినిమాలోని పాటల వీడియోలను ఒక్కొక్కటీ విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 14న &lsquo;&lsquo;అర్థమైందా&rsquo;&rsquo; సాంగ్&zwnj;ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. గురువారం తాజాగా మరో పాటను విడుదల చేసింది. రాజ్ తరుణ్ అండ్ గ్రూప్&zwnj;పై చిత్రించిన &lsquo;&lsquo;జానీ జానీ ఎస్ పాప... డ్రింకింగ్ వొడ్కా నో పాప&rsquo;&rsquo; లెరెక్స్ వీడియోను యూట్యూబ్&zwnj;లో పెట్టారు. అనిల్ సుంకర నిర్మాతగా, వంశీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. &lsquo;&lsquo;జానీ జానీ ఎస్ పాప...&rsquo;&rsquo; వీడియో సాంగ్
0business
Hyderabad, First Published 4, Aug 2019, 12:05 PM IST Highlights యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇండియన్ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా తెరక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో కల్పిత గాధగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇండియన్ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా తెరక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో కల్పిత గాధగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు.  అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరూ యుక్తవయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరూ స్నేహితులై ఉంటె.. అనే పాయింట్ తో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేడు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ తమ స్నేహం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలని పంచుకున్నారు.  ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. సోక్రటీస్ చెప్పిన ఓ మాటని గుర్తు చేసుకున్నాడు. స్నేహితులుగా మారడానికి సమయం పడుతుందేమో.. కానీ ఒక్కసారి ఫ్రెండ్ షిప్ మొదలయ్యాక బలంగా కొనసాగుతూనే ఉంటుంది. రాంచరణ్, తనకు మధ్య ఉన్న స్నేహం గురించి ఇంతకంటే గొప్ప మాట చెప్పనవసరం లేదు అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.  రాంచరణ్ వ్యాఖ్యానిస్తూ.. బంధం ఏర్పడడానికి సమయం పడుతుందేమో.. కానీ ఒక్కసారి బంధం మొదలైతే జీవితాంతం కొనసాగుతుంది. ఎన్టీఆర్ తో నాకున్న రిలేషన్ అలాంటిది. నా భీం తారక్ అని రాంచరణ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇద్దరూ RRRYehDosti అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేశారు.    "Be slow to fall into friendship...but when thou art in..continue firm and constant" - Socrates ... Perhaps no other quote defines our friendship better #RRRYehDosti pic.twitter.com/4ec9KyEFh3 — Jr NTR (@tarak9999) August 4, 2019 Last Updated 4, Aug 2019, 12:06 PM IST
0business
Dec 09,2017 వచ్చే ఏడాది 7.5% వృద్ధి రేటు న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19)లో భారత వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ విత్త సేవల సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. వచ్చే ఏడాది జీడీపీ పుంజుకోనుందని ఈ సంస్థ ఒక రిపోర్టులో పేర్కొంది. ప్రస్తుత ఏడాది వృద్ధి రేటు 6.4 శాతం నుంచి మెరుగపడనుందని తెలిపింది. 2019లో 7.7శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేసింది. నోట్ల రద్దు, జీఎస్టీ పరిణా మాలతో స్తబ్దతలో పడిన ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందని పేర్కొంది. భవిష్యత్తులో వినియోగం, ఎగుమతులు పుంజుకోనున్నాయని అంచనా వేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
జూన్ 30వ తేదిన "కథలో రాజకుమారి" Highlights జూన్ 30వ తేదిన "కథలో రాజకుమారి" నారా రోహిత్  విభిన్న పాత్రలో  మరో మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మూవీ విభిన్నమైన టైటిల్ తో అందరినీ ఆకట్టుకొని, ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రం &#39;కధలో రాజకుమారి &#39; . మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరకు ప్రాంతం లో  వేసిన భారీ సెట్  లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. మేస్ట్రొ ఇళయరాజా గారు ఈ చిత్రానికి రెండు గీతాలను అందిస్తుండగా... "క్రిష్ణగాడి వీరప్రేమగాధ" సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మరో ఐదు పాటలను అందించారు....ఈ పాటలను అరన్ మ్యూజిక్  ద్వారా త్వరలోనే మర్కెట్ లోకి విడుదల చేయుటకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ తెలుగు తెరపై చూడని విభిన్నమైన క్యారక్టరైజేషన్ లో నారా రోహిత్ నటిస్తుండగా మరొక ప్రత్యేక పాత్రలో నాగ శౌర్య నటించారు.....వీరి ఇద్దరి మధ్యన జరిగే సన్నివేశాలు చిత్రానికి హైలెట్ గా వుండబోతాయి అని యూనిట్ వర్గాలు తెలిపాయి.  నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వర రావు, అవసరాల శ్రీనివాస్, మురళీమొహన్, అజయ్, ప్రబాస్ శ్రీను, రఘుబాబు, తనికెళ్ళ భరణి, శ్రీముఖి, చలపతిరావు, జెన్నీ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, హీరోయిన్ నందిత ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ 30 వ తారీకున రిలీజ్ చేయుటకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.     ఆరోహి సినిమా, అరన్ మీడియ వర్క్స్, శ్రీహాస్ ఎంటెర్ టైన్ మెంట్స్, సుధాకర్ ఇంపెక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సం యుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సౌందర్య నర్రా, ప్రశాంతి, సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ వర్మ సిరివూరి సమర్పకులు. ఈ విభిన్నమైన ప్రేమ కధా చిత్రానికి నరేష్ కె రాణా చాయాగ్రహణం వహిస్తుండగా, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చేస్తున్నారు. Last Updated 25, Mar 2018, 11:37 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ప్రపంచ క్రికెట్‌లో అశ్విన్ మేటి బౌలర్ - కోహ్లీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ  ప్రశంసల జల్లు కురిపించాడు. TNN | Updated: Sep 27, 2016, 06:07PM IST టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పిన్నర్ అశ్విన్ ను టెస్ట్ కెప్టెన్ కోహ్లీ ఆకాశానికెత్తేశాడు. ప్రపంచ క్రికెట్ లో అంత్యంత ప్రభావితం చేయగల వారిలో  అశ్విన్ ఒకడని కోహ్లీ కితాబిచ్చాడు. అతను వెలకట్టలేని క్రికెటర్ అని .. భారత్ జట్టుకు అనీల్ కుంబ్లే లేని లోటును అశ్విన్ పూడ్చాడని వెల్లడించారు. సమాకాలిక క్రికెట్ లో  అతను మేటి బౌలర్ అని కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. కివీస్ పై ప్రతిష్ఠాత్మక 500వ మ్యాచ్ లో విజయం అందించిన అశ్విన్ పై  కోహ్లీ  ఈ మేరకు ప్రసంశలు కురిపించారు. ఈ టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ 10 వికెట్లు ( తొలి ఇన్నింగ్ -4, రెండో ఇన్నింగ్ -6 వికెట్లు ) తీసి టీమిండియా గెలుపులో  కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
2sports
Hyd Internet 81 Views stock market ended with profit stock market ముంబై: స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ఈ ఉదయం 164పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 346.38 లాభపడి  33,106.82 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 96.70 పాయింట్ల లాభంతో 10,214.75 వద్ద ముగిసింది.
1entertainment
Visit Site Recommended byColombia దొంగతనం విషయమై బాలిక తల్లిని ప్రశ్నించడంతో ఆమె వెంటనే చెన్నై వచ్చిందని.. ఐప్యాడ్‌, వాచ్‌, కెమెరా ఇచ్చి మిగిలిన వస్తువులు తీసుకొస్తానని చెప్పి సామర్లకోట వెళ్లిందని భానుప్రయ తెలిపారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత తమపై తప్పుడు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.. భానుప్రియ ఇంట్లో నాకెలాంటి ఇబ్బంది లేదు: బాలిక భానుప్రియ ఇంట్లో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని బాలిక చెప్పింది. డబ్బు, నగలు దొంగిలించి తానే తన తల్లికి ఇచ్చానని తెలిపింది. వాటిని తిరిగి తీసుకొస్తానని చెప్పి వెళ్లిన తన తల్లి భానుప్రియపై కేసు పెట్టిందని చెప్పింది. తనకు ఎలాంటి వేధింపులూ లేవని మీడియాకు వెల్లడించింది. అసలేం జరిగింది? తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ ఏడాది కిందట తన కూతురు సంధ్యను చెన్నైలో భానుప్రియ నివాసంలో పనికి పెట్టింది. తాజాగా తన కూతుర్ని వేధింపులకు గురి చేస్తున్నారని భానుప్రియపై ఫిర్యాదు చేసింది. గత కొన్నాళ్లుగా తన కూతుర్ని ఇంటికి పంపించడంలేదని.. ఫోన్‌లో కూడా మాట్లాడకుండా తన కుమార్తెను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని తెలిపింది. దీంతో పోలీసులకు కేసు నమోదు చేశారు. భానుప్రియ సోదరుడు తన కుమార్తెపై గత కొన్నాళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారని.. గట్టిగా అడిగితే తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సదరు మహిళ ఆరోపిస్తున్నట్లు సమాచారం. చైల్డ్ హెల్ప్ లైన్ సహకారంతో పోలీసులకు ఆశ్రయించిన ప్రభావతి తన కుమార్తెను ఇంటికి తీసుకురావాల్సిందిగా పోలీసుల్ని కోరింది.
0business
READ ALSO: సినిమాల్లేక సీరియల్స్ చేసుకుంటున్నావా కౌశల్: నెటిజన్ వెక్కిరింపు ‘నా కొడుక్కి ఇప్పుడు 17 ఏళ్లు. పెంపుడు జంతువులంటే ఇష్టం ఉన్నవారు వాటిని కూడా కుటుంబంలో భాగంగా చూస్తారు. నాకు నా కుక్క క్యాస్పర్ కూడా అంతే. నాకు క్యాస్పర్, నా కొడుకు సమానమే. ఒక్కోసారి నా కడుకు అర్హాన్ వాడికంటే కుక్కకే ఎక్కువ ప్రేమను పంచుతుంటానని బాధపడుతుంటాడు. అమ్మా.. నీకు నేను ఎక్కువా క్యాస్పర్ ఎక్కువా అని అడిగాడు. నేను ఇద్దరూ సమానమే అని చెప్పాను. దాంతో వాడు బాధపడ్డాడు. వాడికి అన్నీ నేనే. కానీ నేను అలా అనలేదు. అర్హాన్ నా సర్వస్వం. క్యాస్పర్ కూడా అంతే. ఎందుకంటే వాటి నుంచి మనకు నిస్వార్థమైన ప్రేమ లభిస్తుంది. నేను పెట్టే పోస్ట్‌లకు కామెంట్లు వస్తుంటాయి. కానీ నేను వాటిని పట్టించుకోను. నా గురించి తెలిసిన వారి గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. అన్నీ తప్పుగా అర్థం చేసుకుని కామెంట్స్ చేసేవారిని చూస్తే నాకు బాధేస్తుంటుంది. ఎందుకంటే వారు మానసిక సమస్యలతో బాధపడుతుంటారని నా అభిప్రాయం’ అని వెల్లడించారు మలైకా. READ ALSO: నేనలా చేస్తే Virat Kohliకి చాలా ఇష్టం: అనుష్క శర్మ తనకు తన పెంపుడు కుక్కపై ఎంత ప్రేముందో ఈ రకంగా వివరించారు మలైకా. కానీ తన కుమారుడిని, కుక్కను పోల్చడం నెటిజన్లకు మింగుడు పడలేదు. కుక్కలంటే ఇష్టమున్నప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు అని పలువురు అసహ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అర్హాన్.. మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్ కుమారుడు. కొన్నేళ్ల క్రితం మలైకా, అర్బాజ్ విడిపోయారు. ఇప్పుడు మలైకా తనకంటే పదేళ్లు చిన్నవాడైన బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తన పెళ్లి బీచ్ వద్ద జరుగుతుందని మలైకా తెలిపారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Sri Lanka won by 7 wkts శ్రీలంక చేతిలో భారత్ పరాజయం అనంతరం ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. కుశాల్ మెండిస్.. TNN | Updated: Jun 8, 2017, 10:57PM IST ఛాంపియన్స్ ట్రోఫీ&zwnj;లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్&zwnj;కి రెండో మ్యాచ్&zwnj;లోనే ఊహించని షాక్ తగిలింది. బ్యాట్స్&zwnj;మెన్ చెలరేగినా.. బౌలర్లు తేలిపోవడంతో శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో భారత్ పరాజయం చవిచూసింది. శిఖర్ ధావన్ (125: 128 బంతుల్లో 15x4, 1x6) , రోహిత్ శర్మ (78: 79 బంతుల్లో 6x4, 3x6), ధోని (63: 52 బంతుల్లో 7x4, 2x6) నిలకడగా ఆడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. కుశాల్ మెండిస్ (89: 93 బంతుల్లో 11x4, 1x6), గుణతిలక (76: 72 బంతుల్లో 7x4, 2x6) అర్ధ శతకాలతో జట్టు విజయానికి బాటలు వేయగా.. చివర్లో కెప్టెన్ మాథ్యూస్ (52 నాటౌట్: 45 బంతుల్లో 6x4), గుణరత్నే (34 నాటౌట్: 21 బంతుల్లో 2x4, 2x6) గెలుపు లాంఛనాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే 322/3తో పూర్తి చేశారు. ఈ ఓటమితో సెమీఫైనల్ అవకాశాల్ని భారత్ సంక్లిష్టం చేసుకుంది. టోర్నీలో నిలవాలంటే దక్షిణాఫ్రికాతో ఆదివారం జరగనున్న మ్యాచ్&zwnj;లో భారత్ తప్పక గెలవాల్సి ఉంటుంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV లంకతో చివరి వన్డేకి శిఖర్ ధావన్ దూరం..? శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నాడు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి TNN | Updated: Sep 2, 2017, 07:27PM IST శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నాడు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శ్రీలంక నుంచి ఈ ఓపెనర్ భారత్&zwnj;కి పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల టెస్టులతో పాటు వన్డేల్లోనూ పరుగుల వరద పారించిన ధావన్.. ప్రస్తుతం జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ చివరి వన్డే అనంతరం భారత్ బుధవారం ఏకైక టీ20 మ్యాచ్&zwnj; కూడా లంకతో ఆడనుంది. ధావన్ దూరమైతే.. అతని స్థానంలో అజింక్య రహానె తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. అతను ఓపెనర్&zwnj;గా వస్తాడా..? లేదా మిడిలార్డర్&zwnj;లో కెప్టెన్ కోహ్లి అవకాశమిస్తాడో చూడాలి. ఎందుకంటే.. ఈ సిరీస్ ముందు వరకు ఓపెనర్&zwnj;గా ఉన్న కేఎల్ రాహుల్.. గత నాలుగు వన్డేల్లోనూ మిడిలార్డర్&zwnj;లో బ్యాటింగ్ చేశాడు. కానీ.. ఒకటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్&zwnj; ఆడలేకపోవడంతో ఐదో వన్డేలో ధావన్ స్థానంలో రాహుల్ మళ్లీ ఓపెనర్&zwnj;గా వచ్చే ఛాన్స్&zwnj;లున్నాయి. ఒకవేళ రహానెకి అవకాశం దక్కకపోతే.. కేదార్ జాదవ్&zwnj; తుది జట్టులోకి రావొచ్చు..!
2sports
Hyderabad, First Published 10, Oct 2018, 1:31 PM IST Highlights బాలీవుడ్ లో తనుశ్రీదత్తా, నానాపటేకర్ ల వివాదంతో మీటూ ఉద్యమం ఉదృతంగా మారింది. లైంగికంగా వేధించబడ్డ బాధితులు ఒక్కొక్కరిగా బయటకి వస్తూ తము ఎదుర్కొన్న చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.  బాలీవుడ్ లో తనుశ్రీదత్తా, నానాపటేకర్ ల వివాదంతో మీటూ ఉద్యమం ఉదృతంగా మారింది. లైంగికంగా వేధించబడ్డ బాధితులు ఒక్కొక్కరిగా బయటకి వస్తూ తము ఎదుర్కొన్న చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు బాధితులకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా ఐశ్వర్యరాయ్ కూడా ఈ విషయంపై స్పందించారు. సోషల్ మీడియాకి కృతజ్ఞతలు చెబుతూ.. ప్రపంచంలో ఏ మూలన ఉన్న మహిళైనా సరే తన బాధను సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్పుకోవచ్చు.. ప్రపంచం ఆమె బాధని వింటుందని అన్నారు. ఇలాంటి విషయాలను బయట పెట్టడానికి టైమ్ తో పని లేదనన్నారు.  ఆలస్యంగానైనా.. మన దేశంలో మీటూ ఉద్యమం రావడం నిజంగా మంచి పరిణామమని అన్నారు. బాధితులందరికీ దేవుడు మనోబలాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. గతంలో ఐశ్వర్యకి కూడా ఈ రకమైన వేధింపులు తప్పలేదు.  సల్మాన్ ఖాన్ నుండి ఆమె విడిపోయిన తరువాత కూడా అతడు ఆమెని ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.  ఇవి కూడా చదవండి..
0business