news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Visit Site
Recommended byColombia
హీరో అంటే నలుగురిని కొట్టి, హీరోయిన్ తో డ్యూయెట్ లు పాడి ఒక సమస్యను పరిష్కరిస్తాడు. ప్రస్తుతం మన సినిమాల్లో ఉన్న హీరోలంతా చేసే పనే అది. ఇలాంటి చిత్రాలకు మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అందుకే హీరోలు కూడా ఈ తరహా చిత్రాల్లో నటించడానికే మక్కువ చూపుతున్నారు. అయితే దానికి భిన్నంగా ఆలోచిస్తూ వైవిధ్య సినిమాలు, మంచి పాత్రలు చేయాలనుకుంటున్న కార్తీకి నిజంగా హాట్సాఫ్.
Tamil actor Karthi Sivakumar is keen to play the role of a farmer to inspire younger generation to take up agriculture and go back to their roots. Karthi has been in the film industry for a decade, says he now wants to take up challenging roles where he can do stories of people who are not often spoken about.
Giving an example, Karthi said the cause of farmers is something he really wants to take up and do it so that "people start cherishing agriculture, like before".
"Our country is an agriculture-based country. And slowly we are forgetting our roots. That's definitely one of the causes where I want to act as a farmer. It should be an entertaining film but also shows what the state of agriculture in the country is today," he told .
"And it should be a film of hope which inspires people to go back (to agriculture). I see many youngsters giving up their IT jobs and going to farming or taking up organic farming so that kids in future will stay a bit more healthier. That's one cause I really want to take up," Karthi said.
At present Karthi is coming up with a supernatural historical thriller film 'Kashmora'. The film is scheduled for a worldwide release on 28 October 2016. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సల్మాన్పై సానుభూతి వ్యక్తం చేసిన అక్తర్..!
కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో దోషిగా తేలి.. జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్
Samayam Telugu | Updated:
Apr 6, 2018, 12:20PM IST
సల్మాన్పై సానుభూతి వ్యక్తం చేసిన అక్తర్..!
కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో దోషిగా తేలి.. జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సానుభూతి వ్యక్తం చేశాడు. 1998లో సల్మాన్పై కేసు నమోదవగా.. గురువారం ఐదేళ్లు జైలు శిక్ష, రూ. 10వేలు జరిమానా విధిస్తూ జోధ్పూర్ న్యాయస్థానం తీర్పుని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ జోధ్పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్షాకాలం మూడేళ్ల కంటే ఎక్కువగా ఉండటంతో.. శుక్రవారం బెయిల్ పిటిషన్ని సల్మాన్ ఖాన్ దాఖలు చేసుకోగా.. విచారణను శనివారానికి కోర్టు వాయిదా వేసింది. | 2sports
|
Pakistan reach final for first time
అలవోకగా ఫైనల్ చేరిన పాకిస్థాన్
క్రికెట్ ప్రపంచంలో అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతం
TNN | Updated:
Jun 14, 2017, 09:48PM IST
క్రికెట్ ప్రపంచంలో అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతం చేసింది. టోర్నీలో ఓటమి ఎరుగకుండా సెమీస్ చేరిన ఇంగ్లాండ్‌ని అలవోకగా ఓడించేసి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కార్ఢిప్ వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓపెనర్లు అజహర్ అలీ (76: 100 బంతుల్లో 5x4, 1x6), జమాన్ (57: 58 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలు బాదడంతో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ని చిత్తుగా ఓడించింది.
తొలుత పాకిస్థాన్‌ బౌలర్లు హసన్ అలీ (3/35), జునైద్ ఖాన్ (2/42), రుమాన్ రేస్ (2/44) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 211 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో ఓపెనర్ బారిస్టో( 43: 57 బంతుల్లో 4x4), జో రూట్ (46: 56 బంతుల్లో 2x4), బెన్ స్టోక్స్ (34: 64 బంతుల్లో), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (33: 53 బంతుల్లో 4x4) నిలకడగా ఆడినా.. జట్టుకు మెరుగైన స్కోరు అందించలేకపోయారు. ఛేదనలో పాక్ ఓపెనర్లు శతక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేయగా.. బాబర్ అజామ్ (38 నాటౌట్: 45 బంతుల్లో 2x4, 1x6), మహ్మద్ హఫీజ్ (31 నాటౌట్: 21 బంతుల్లో 3x4, 2x6) చివర్లో గెలుపు లాంఛనాన్ని 37.1 ఓవర్లలో 215/2తో పూర్తి చేశారు. | 2sports
|
Hyderabad, First Published 3, Apr 2019, 8:58 PM IST
Highlights
టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ & కామెడీ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ అవుతున్నాడు.
టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ & కామెడీ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ అవుతున్నాడు. బావ కోసం ఒకప్పుడు సైకిలెక్కి ఊరూరా ప్రచారం చేసిన హీరో ఇప్పుడు కారెక్కి మిరపకాయ్ బజ్జిలు వేస్తూ ఓటర్లను ఆకర్షించాడు.
ఖమ్మం జిల్లా టీఆరెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరావు ప్రచారాల్లో జోరు పెంచారు. అయితే ఆయన కోసం సినీ నటుడు వేణు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో రీసెంట్ గా ప్రచారం చేసిన వేణు ఒక హోటల్లో బజ్జిలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ఇటీవల ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో నామ నాగేశ్వరావు టీడీపీ (ప్రజకూటమి) తరపున పోటీ చేయగా అప్పుడు వేణు సైకిలెక్కి ఊరూరా ప్రచారం చేశారు. కానీ అప్పుడు నామ గెలవలేదు. అనంతరం టీఆరెస్ లో చేరడంతో పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది.
Last Updated 3, Apr 2019, 8:58 PM IST | 0business
|
Visit Site
Recommended byColombia
ప్రస్తుతం ఏ గ్రేడ్ ఆటగాడిగా ఉన్న పుజారాకు బీసీసీఐకి ఏడాదికి రూ.5 కోట్లు చెల్లిస్తోంది. ఏ+ గ్రేడ్కి మారితే అతడికి రూ.7 కోట్లు దక్కనున్నాయి. ప్రస్తుతం టాప్ కేటగిరీలో కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్తోపాటు బుమ్రా, భువనేశ్వర్ ఉన్నారు.
అన్ని ఫార్మాట్లలోనూ ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఏ+ కేటగిరీలో చోటు ఇవ్వాలనే నిబంధన ఉండగా.. దాన్ని సడలించడం కుదురుతుందా? అని వినోద్ రాయ్ టీమ్ మేనేజ్మెంట్ను అడగనున్నారట. పుజారాకు ప్రమోషన్ ఇస్తే టెస్టు క్రికెట్ ఆడే యువ ఆటగాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఒకవేళ అన్ని ఫార్మాట్లూ ఆడటం తప్పనిసరి అనే నిబంధన సడలించడం కుదరకపోతే.. ధావన్ టాప్ గ్రేడ్లో స్థానం కోల్పోయే అవకాశం ఉంది. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ లాంటి యువ ఆటగాళ్లు టెస్టు జట్టులో స్థానం కోసం తీవ్రంగా కృషి చేస్తుండటమే ఇందుకు కారణం.
అన్ని ఫార్మాట్లూ ఆడటం లేదనే కారణంతోనే గత ఏడాది కాంట్రాక్టులు ఇచ్చే సమయంలో ధోనీని ఏ గ్రేడ్కు పరిమితం చేశారు. టెస్టులు ఆడని ధోనీకి ఏ+ గ్రేడ్ అర్హత లేనప్పుడు.. లాంగ్ ఫార్మాట్ మాత్రమే ఆడే పుజారాకు టాప్ కేటగిరీలో చోటు కల్పిస్తే వివాదం తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
K.Venkatesam with Hero Pawan (File)
తైక్వాండో అతనికి పంచప్రాణాలు!
తాండూరు : హమాలీ బస్తీలో పుట్టి అకుంఠిత దీక్షతో తైక్వాం డోలో శిక్షణపొంది జాతీయ స్థాయిగుర్తింపుతెచ్చుకున్నాడు తాండూ రుకు చెందిన కే.వెంకటేశం. మూడు దశాబ్ధాల పాటు కఠోర ప్రాక్టీసు చేస్తూ తనను తానునిలబెట్టుకుంటూ వేలాది మందికి శిక్షణ ఇచ్చాడాయన. తాండూరు పట్టణంలో ప్రారంభమైన ఆయన ప్రస్తానం తెలంగాణ వ్యాప్తంగా విస్తరించుకు న్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా తైక్వాండో బోర్డ్ ఆఫ్ తెలంగాణ స్థాపించి రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు బ్లాక్బెల్టులు అందజేశారు. పోలీసు అధికారులు, సినిమా హీరోలకూ వెంకటేశం శిక్షణ ఇవ్వడం గమనార్హం.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో హమాలీ బస్తీకి చెందిన కే.వెంకటేశం 1987లో కరాటేలో అరంగేట్రం వేశారు. తన ప్రాంత యువతకు ఆత్మరక్షణ కోసం ఇలాంటి పోరాట విద్య అవసరమని భావించాడు. 1990 వరకు కరాటే బుడోకాన్లో బ్రౌన్ బెల్టు సాధించాడు. తైక్వాండో పట్ల ఆకర్శితుడూ 1990 నుంచి 1991 వరకు బెంగుళూరులో మకాం వేసి గ్రాండ్మాస్టర్ ఎస్.కె.మూర్తి వద్ద శిక్షణ పొందాడు. స్నేహితుల అన్ని విధాల ప్రోత్సాహంతో ముందుకు సాగాడు. 600 కిలోమీటర్ల నుంచి వచ్చి కేవలం తైక్వాండో కోసమే యేడాదిన్నర పాటు బెంగుళూరులో ఉంటూ శిక్షణ పొందడం గ్రాండ్మాస్టర్ను ఎంతగానో ఆకట్టుకుంది. కిక్లు, పంచ్ల్లో వేగం, గంటల తరబడి ప్రాక్టీసు చేస్తున్న అతని పిట్నెస్ చూసి తక్కువ కాలంలోనే బ్లాక్బెల్టు శిక్షణ ఇచ్చారు. అనతంరం 1991లో తాండూరులో తరగతులు ప్రారంభించారు
. ఈ క్రమంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచాడు. నాకౌట్ విభాగంలో కడప, కర్నూలు జిల్లాల్లో తన ప్రతిభ కనబరిచాడు. బంగారు, వెండి, కాంస్య పతకాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. కొంతకాలం తర్వాత చెన్నైకిచెందిన గ్రాండ్ మాస్టర్ బాబూరావు వద్దకూడా విద్యనభ్యసించాడు. 1995-96లో హైదరా బాద్లో తైక్వాండో వీరుడు, గ్రాండ్మాస్టర్ జయంత్రెడ్డికు చేరువై కొంతకాలం పాటు ఆయన కలిసి ముందుకు సాగాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తైక్వాండో బోర్డ్ ఆఫ్ తెలంగాణ స్థాపించాడు. రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. తన వద్ద విద్యనభ్యసించిన వేల మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి బంగారు పతకాలు అందుకోవడం గమనార్హం. వివిధ స్టైళ్లలో శిక్షణ తైక్వాండో కిక్స్లలో ఫ్లైయింగ్ కిక్స్, టర్నింగ్ కాట్వీల్, వీల్కిక్, టర్నింగ్ హుక్కిక్, ఫ్లైయింగ్ డబుల్ కిక్స్, ట్విస్ట్ కిక్స్ వెంకటేశం ప్రత్యేకత. రెప్పపాటులో గాలిలో ఎగురుతూ ఇలాంటి పీట్స్ సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.యువత ఆకర్శితులై వెంకటేశం వద్ద శిక్షణ పొందుతు న్నారు. వీటితో పాటు నాన్చాకూ సింగిల్, డబుల్, త్రిపుల్ శిక్షణ ఇస్తు న్నారు.
తోంఫా, సాయి, బటర్ఫ్లై నైఫ్, స్టిక్స్, కత్తి, సమురా§్ు స్వార్డ్ కూడా శిక్షణ ఇవ్వడంతో నేర్పరి. పలు సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగులకూ ఆయన శిక్షణ ఇస్తున్నారు. మహిళా ఉద్యోగుల ఆత్మరక్షణ కోసం పలు టెక్నిక్లను నేర్పిస్తున్నారు. పోలీసు అకాడమిలో శిక్షణ మాస్టర్ వెంకటేశం రాష్ట్ర పోలీసు అకాడమిలో కూడా శిక్షణ ఇచ్చారు. 1995-06లో అప్పటి సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులకు తైక్వాండోలో శిక్షణ ఇవ్వడం గమనార్హం. 127 టికె బెటాలియన్ పోలీసు అధికారులకు ఇచ్చిన శిక్షణవల్ల ప్రభుత్వంనుంచి ప్రశంసా పత్రాలు అందుకు న్నారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా వ్యక్తిగతంగా ఆయన వద్ద తైక్వాండో శిక్షణ పొందారు. సినిమా హీరోలు కూడా.. టాలీవుడ్ హీరోలలో పవన్కళ్యాణ్, ప్రభాస్, నితిన్, అఖిల్, తారకరత్న, శ్రీహరి, సామ్రాట్, తనిష్క్, ఆదిపినిశెట్టి, మిస్ వరల్డ్ డయనా హెడోన్ వంటి ప్రముఖులు వెంకటేశంమాస్టర్ వద్ద శిక్షణపొందారు. తైచి, జుజుట్సు, కిక్బాక్సింగ్ వంటి స్లైల్స్లో శిక్షణ ఇచ్చారు. పలు సినిమాలలో కూడా ఆయనకు అవకాశం కల్పించారు.
అగ్ర డైరెక్టర్లలో ఒకరైన ఎన్.శంకర్ దర్శకత్వంలో శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాలో అసిస్టెంట్ ఫైట్మాస్టర్గా, నటుడిగా వెంకటేశం ప్రతిభ కనబరిచారు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అతి స్వల్పలాభంతో ముగిసిన మార్కెట్లు
బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 35,216 వద్ద ముగియగా నిఫ్టీ 2 పాయింట్లు బలపడి 10718 వద్ద స్థిరపడింది.
Samayam Telugu | Updated:
May 8, 2018, 04:12PM IST
అతి స్వల్పలాభంతో ముగిసిన మార్కెట్లు
ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ నుంచీ వెనకడుగు వేశాయి. స్వల్ప ఒడిదుడుకుల మధ్య కన్సాలిడేట్ అయ్యాయి. చివరికి నామమాత్ర లాభాలతో సరిపెట్టుకున్నాయి. తొలుత లాభాల సెంచరీ సాధించిన సెన్సెక్స్ చివరికి నష్టం లేకుండా సరిపెట్టుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 35,216 వద్ద ముగియగా నిఫ్టీ 2 పాయింట్లు బలపడి 10718 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంక్(6.86%), ఎస్బీఐఎన్(1.42%), యాక్సిస్ బ్యాంక్(1.18%), పవర్ గ్రిడ్(1.14%), భారతీ ఎయిర్టెల్(0.75%), ఎన్టీపీసీ(0.47%) ముందుండగా మరో వైపు ఎం అండ్ ఎం(2.44%), ఇండస్ఇండ్ బ్యాంక్(1.78%), ఎల్ అండ్ టీ(1.70%), ఇన్ఫీ(1.52%), యెస్ బ్యాంక్(1.19%) ఎక్కువగా నష్టపోయాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
అయోమయంలో బాలయ్య 'రైతు' సినిమా
Highlights
'రైతు' మూవీ క్లైమాక్స్ సీన్ పై అయోమయం
క్లైమాక్స్ నచ్చక సినిమా షూటింగ్ పెండింగ్ లో పెట్టిన బాలకృష్ణ
కృష్ణవంశీతో మంచి క్లైమాక్స్ రూపొందించాలన్న బాలయ్య
ప్రస్తుతం బాలకృష్ణ తన ప్రెస్టిజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణిని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేద్దామని అనుకున్నారు. డిసెంబర్లో బాలయ్య, కృష్ణవంశీ దర్శకత్వంలో తన 101వ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడని వార్తలు వచ్చాయి. కృష్ణవంశీ 'రైతు'కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా బిగ్ బి అమితాబ్ను కూడా కలిశాడు. అంతా ఓకే అనుకుంటున్న నేపథ్యంలో 'రైతు' ఫైనల్ స్క్రిప్ట్ బాలకృష్ణకు నచ్చలేదని, అందువల్ల సినిమాను తర్వాత చేద్దామని కృష్ణవంశీతో అన్నాడని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం బాలయ్య కొత్త స్క్రిప్ట్ వెతికే పనిలో బిజీగా ఉన్నాడని సమాచారం.
Last Updated 25, Mar 2018, 11:38 PM IST | 0business
|
గెలిస్తే పట్టుదల.. ఓడితే మూర్ఖత్వం.. ఆదిరిపోయిన ‘యాత్ర’ టీజర్ (వీడియో)
Highlights
వైఎస్ జయంతి సందర్భంగా ‘యాత్ర’ టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. గత రాత్రి విడుదల చేసిన ఈ టీజర్ వైఎస్ అభిమానులను ఆకట్టుకుంటోంది.. విడుదలైన కొద్దిసేపట్లోనే ఇది ఇండియాలో టాప్ ట్రెండింగ్ అవుతోంది.
ప్రస్తుతం తెలుగునాట బయోపిక్ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మహానటితో బయోపిక్లకు సరైన నిర్వచనం ఇచ్చింది టాలీవుడ్. దీంతో రాబోయే బయోపిక్ల కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైస్.రాజశేఖర్ రెడ్డిల జీవితకథలతో ఎన్టీఆర్, యాత్ర సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇవాళ వైఎస్ జయంతి సందర్భంగా ‘యాత్ర’ టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
"తెలుసుకోవాలనుంది. వినాలనుంది. ఈ కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలనుంది. వాళ్లతో కలిసి నడవాలనుంది. వాళ్ల గుండె చప్పుడు వినాలనుంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. ఈ పాదయాత్ర నా పట్టుదలో మూర్ఖత్వమో చరిత్రనే నిర్ణయించుకోనీ" అంటూ బ్యాక్ గ్రౌండ్లో ఒక స్వరం వినిపిస్తుండగా టీజర్ కట్ చేశారు.
వైఎస్ రాజకీయ జీవితంలో అత్యంత కీలక ఘట్టంగా చెప్పుకునే పాదయాత్రను హైలెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైఎస్గా మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తుండగా.. సుహాసినీ, అనసూయ కీలకపాత్రలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాను 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చల్లా, శశిదేవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ‘ఆనందోబ్రహ్మ’ ఫేమ్ మహి వీ రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. గత రాత్రి విడుదల చేసిన ఈ టీజర్ వైఎస్ అభిమానులను ఆకట్టుకుంటోంది.. విడుదలైన కొద్దిసేపట్లోనే ఇది ఇండియాలో టాప్ ట్రెండింగ్ అవుతోంది.
Last Updated 8, Jul 2018, 11:42 AM IST | 0business
|
Visit Site
Recommended byColombia
శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో బౌలింగ్ చేస్తుండగా ఈ దక్షిణాఫ్రికా పేసర్ పక్కటెముకల్లో గాయమైంది. దీంతో.. ఓవర్ మధ్యలోనే బౌలింగ్ని నిలిపివేసిన ఈ ఫాస్ట్ బౌలర్.. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా.. కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో.. ఐపీఎల్ 2019 సీజన్కి ఎంగిడి దూరమవుతున్నట్లు దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ మహ్మద్ ముసాజే ప్రకటించాడు.
ఐపీఎల్ 2019 సీజన్ పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి..!
శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్లు ప్రారంభంకానుండగా.. టోర్నీ తొలి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెపాక్ వేదికగా చెన్నై ఢీకొననుంది. 2018 ఐపీఎల్ సీజన్లో చెన్నై తరఫున 7 మ్యాచ్లాడిన ఎంగిడి.. 6.0 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా.. సీనియర్ పేసర్లు షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో దారాళంగా పరుగులిస్తున్న తరుణంలో ఈ 23 ఏళ్ల యువ పేసర్ పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కానీ.. గాయం కారణంగా అతను తాజాగా దూరమవడంతో.. ఇప్పుడు జట్టు బౌలింగ్ భారాన్ని వాట్సన్, బ్రావోతో పాటు మోహిత్ శర్మ, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్ మోయనున్నారు. కోల్కతా నైట్రైడర్స్ జట్టులోనూ గాయం కారణంగా యువ పేసర్ నాగర్ కోటి ఐపీఎల్కి దూరమైన విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
పెళ్లి పేరు చెప్పి ఈ హీరోయిన్ ఎంతమందిని మోసం చేసిందో తెలుసా.?
Highlights
పెళ్లి పేరుతో అనేకమందిని మోసం చేసిన కోలీవుడ్ నటి శృతి
అమాయక ” వరుల ” నుంచి అక్రమ వసూళ్ళకు పాల్పడింది
పెళ్లి పేరు చెప్పి 43 లక్షలు తీసుకుని పత్తా లేకుండా పోయింది
పెళ్లి పేరుతో అనేకమందిని మోసం చేసిన కోలీవుడ్ నటి శృతి ఆట కట్టయింది. అమాయక ” వరుల ” నుంచి అక్రమ వసూళ్ళకు పాల్పడింది. బాధితుల్లో చాలామంది తమ గుట్టు ఎక్కడ బయట పడుతుందోనని కామ్ అయిపోగా.. బాలమురుగన్ అనే ఎన్నారై మాత్రం ” ధైర్యంగా ” పోలీసులకు ఈమెపై ఫిర్యాదు చేశాడు.
పెళ్లి పేరు చెప్పి తననుంచి 43 లక్షలు తీసుకుని..కొన్నాళ్ళ తర్వాత పత్తా లేకుండా పోయిందని అన్నాడు. ” ఆడిపోనాల్ అవని ” అనే తమిళ చిత్రంలో నటించి మంచి నటిగా పాపులర్ అయిన శృతి అసలు రంగు బయటపడేసరికే చాలామంది ఈమె చేతిలో మోసపోయారు. దాంతో ఈ నటిమీద కోయంబత్తూరు పోలీసులు గూండా చట్టాన్ని ప్రయోగించారు. శృతి తో బాటు ఆమె పేరెంట్స్ చిత్ర, ప్రసన్న వెంకటేష్, సోదరునిపైనా కేసులు పెట్టి.. కటకటాల్లోకి నెట్టారు. వీరి అరెస్టు యవ్వారం కోలీవుడ్ని కుదిపేసింది.
Last Updated 26, Mar 2018, 12:01 AM IST | 0business
|
Hyderabad, First Published 1, Jul 2019, 4:41 PM IST
Highlights
దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వాడుతోన్న హ్యాండ్ బ్యాగ్ రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వాడుతోన్న హ్యాండ్ బ్యాగ్ రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మన సినీ తారలు హ్యాండ్ బ్యాగ్స్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం.. కానీ నీతా అంబానీ అంతకుమించి ఒక బ్యాగ్ కోసం కోట్లు ఖర్చు పెట్టింది.
ఆమె బ్యాగు రేటు ఏకంగా రూ.2.6 కోట్లని సమాచారం. ఇప్పుడు ఈ బ్యాగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్రోకొడైల్ హ్యాండ్ బ్యాగ్ గా పేర్కొంటున్న దీని విలువ అక్షరాలా రూ.2.6 కోట్లని తెలుస్తోంది.
అయితే అంత ధర ఉండడానికి కారణమేంటంటే.. ఈ బ్యాగ్ లో 240 డైమండ్స్ పొండుపరిచారట. బాలీవుడ్ నటి కరిష్మాకపూర్.. నీతా అంబానీతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఈ బ్యాగ్ సంగతి బయటకొచ్చింది.
దీంతో ఇప్పుడు అందరూ బ్యాగ్ కోసం ఇంటర్నెట్ లో వెతకడం మొదలుపెట్టారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాగ్ ఇదేనని అంటున్నారు. లక్షల కోట్లలో సంపాదన ఉన్న అంబానీ ఫ్యామిలీకి రెండున్నర కోట్లంటే పెద్ద విషయమేమీ కాదులెండి!
Last Updated 1, Jul 2019, 4:41 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మనీ ట్రాన్స్ఫర్లపై ‘మొబిక్విక్’ 0% ఆఫర్
మొబైల్ వాలెట్ సేవల్లో ఉన్న ‘మొబిక్విక్’ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్ను తీసుకొచ్చింది.
TNN | Updated:
Nov 15, 2016, 05:39PM IST
మొబైల్ వాలెట్ సేవల్లో ఉన్న ‘మొబిక్విక్’ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. మొబిక్విక్ వాలెట్ నుంచి ఏదైనా బ్యాంక్ అకౌంట్‌కు డబ్బును బదిలీ చేసుకుంటే ఎలాంటి ఫీజు ఉండదని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది.
గతంలో మొబిక్విక్ వాలెట్ నుంచి బ్యాంకు అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే సాధారణ వినియోగదారులకు 4 శాతం ఫీజుగా వసూలు చేసేవారు. అదే కేవైసీ సమర్పించిన యూజర్లకైతే 1 శాతం ఫీజు ఉండేది. ఇప్పుడు ఈ ఫీజు మొత్తాన్ని మొబిక్విక్ ఎత్తేసింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో మొబిక్విక్ ఇప్పటికే 18 శాతం వృద్ధిని సాధించింది. మొబిక్విక్‌కి ప్రధాన పోటీదారు అయిన పేటీఎం కూడా ఇటీవల తన వినియోగదారులకు ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించింది. | 1entertainment
|
రజినీకాంత్ మాటకి కరుణానిధి పంచ్!
Highlights
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనారోగ్యంతో నిన్న సాయంత్రం మృతి చెందారు. ఆయన మరణవార్త విని తమిళ ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనారోగ్యంతో నిన్న సాయంత్రం మృతి చెందారు. ఆయన మరణవార్త విని తమిళ ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కరుణానిధికి, సూపర్ స్టార్ రజినీకాంత్ కి మధ్య మంచి సంబంధాలున్నాయి. వీరిద్దరూ ఒక వేదికపైకి వచ్చారంటే.. సీరియస్ పంచ్ లు పడుతుండేవి.
అలాంటి ఓ సంఘటన గుర్తు చేసుకుంటే.. చెన్నైలో జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో రజినీకాంత్, కరుణానిధి పాల్గొన్నారు. ముందుగా మైక్ తీసుకొని మాట్లాడిన రజినీకాంత్ రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ.. 'రాజకీయ నాయకులంటే నిప్పు లాంటివారు.. వారు మనకు ఎంత సన్నిహితులైనా సరే ఆ నిప్పుల సెగ తగలకుండా జాగ్రత్తగా ఉండాలి' అన్నారు. దానికి కరుణానిధి.. 'తమ్ముడూ నేను అవినీతికి మాత్రమే నిప్పులాంటివాడిని.. కానీ సేవలో ప్రజల కాలి చెప్పులాంటివాడిని' అంటూ రజినీకాంత్ కి కౌంటర్ పంచ్ ఇచ్చారు. ఆయన డైలాగ్ తో అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు.
Last Updated 8, Aug 2018, 11:12 AM IST | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
వార్నర్ కెప్టెన్సీ.. సన్రైజర్స్ ఏమంటోంది?
స్టీవ్ స్మిత్ను కెప్టెన్సీ నుంచి రాజస్థాన్ రాయల్స్ తప్పించిన నేపథ్యంలో.. డేవిడ్ వార్నర్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఆసక్తి రేపుతోంది.
TNN | Updated:
Mar 26, 2018, 06:25PM IST
వార్నర్ కెప్టెన్సీ.. సన్రైజర్స్ ఏమంటోంది?
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఇరుకున్న స్టీవ్ స్మిత్, బాన్క్రాఫ్ట్లపై ఐసీసీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. స్మిత్ మ్యాచ్ ఫీజులో పూర్తి కోత విధించడంతోపాటు ఒక టెస్టు మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. బాన్క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పెట్టి, మూడు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో వేసింది. ఈ వివాదం కారణంగా వైస్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన డేవిడ్ వార్నర్పై మాత్రం ఏ చర్యలు తీసుకోలేదు.
Visit Site
Recommended byColombia
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్ను కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కూడా స్మిత్ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో రహానేకు కెప్టెన్ పగ్గాలు అప్పగించింది. ఐపీఎల్లో అతడు ఆడేది కూడా అనుమానంగా మారింది.
దీంతో డేవిడ్ వార్నర్ విషయంలో సన్రైజర్స్ ఏం చేయనుందనే ఆసక్తి రేపుతోంది. స్మిత్ బాటలోనే అతణ్ని కూడా కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా..? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ విషయమై సన్రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. వార్నర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకోబోయే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని లక్ష్మణ్ చెప్పాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తర్వాతే తాము చర్యలు తీసుకుంటామని వీవీఎస్ తెలిపాడు. వార్నర్ తప్పిస్తే.. అతడి స్థానంలో ఎవర్ని కెప్టెన్గా నియమిస్తారని ప్రశ్నించగా.. ఆ దిశగా మేం ఇప్పటి దాకా ఆలోచించలేదని చెప్పాడు. మా జట్టుకు వార్నర్ అద్భుతమైన నాయకుడని లక్ష్మణ్ తమ కెప్టెన్ గురించి సానుకూలంగా మాట్లాడాడు.
2016లో వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ విజేతగా నిలిచిన సన్రైజర్స్.. శుక్రవారం నుంచి ఐపీఎల్ కోసం సన్నద్ధం కానుంది. ఒకవేళ వార్నర్ ఐపీఎల్కు దూరం కావాల్సి వస్తే.. శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్లలో ఒకరికి కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Apr 09,2017
టెలికం ఆదాయానికి జియో ఎసరు..
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో రాకతో ఇతర ఆఫరేటర్లకే కాకుండా టెలికం శాఖ ఆదాయానికి గండి పడింది. వినియోగదారుల సేవలు అయిన మొబైల్ టెలిఫోని, డేటా వంటి వాటి నుంచి టెలికం రంగానికి వచ్చే ఆదాయానికి ఎసరు పడింది. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం కాస్తా 10.5శాతం దిగజారి రూ.37,284 కోట్లుగా నమోదైందని టెలికం నియంత్రణ సంస్థ (ట్రారు) పేర్కొంది. కాగా గతేడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఇదే రంగంలో ఆదాయం రూ.41,681 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఇక 2016 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అనుమతి సేవల నుంచి మొత్తం సర్దుబాటు స్థూల ఆదాయం (టెలికం సేవల అమ్మకం నుంచి మాత్రమే వచ్చే సంపాదన) రూ.44,754 కోట్లుగా ఉందని ట్రారు ఒక నివేదికలో పేర్కొంది. దీనికితోడు ప్రభుత్వానికి చెల్లించే లెసైన్స్ ఫీజు, ఇతర చార్జీలు టెలికం ఆపరేటర్ల స్థూల సర్దుబాటు రెవెన్యూ (ఏజీఆర్)పైనా ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ త్రైమాసికంలో లైసెన్స్ ఫీజులు రూ.3,698 కోట్లకు దిగజారింది. అయితే జులై-సెప్టెంబర్ కాలంలో ఇది రూ.4,091 కోట్లుగా నమోదు అయినట్టు నివేదించింది. ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అన్ని టెలికం సేవల ఏజీఆర్ 9.17శాతానికి పడిపోయి రూ.45,905 కోట్లుగా ఉందని పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Aug 20,2016
కొత్తగా 2,600 పెట్రోల్ బంకులు: ఎస్సార్
ముంబయి: రానున్న ఏడాది, ఏడాదిన్నర కాలంలో కొత్తగా 2,600 పెట్రోలు బంకులను (ఫిల్లింగ్ స్టేషన్లను) ఏర్పాటు చేయనున్నట్లుగా ఎస్సార్ ఆయిల్ వెల్లడించింది. ప్రస్తుతం సంస్థ 2,400 పెట్రోల్ బంకులను కలిగి ఉందని.. వచ్చే మార్చి నాటికి వీటి సంఖ్యను 4,300లకు ఆ తరువాత కాలంలో 5,000లకు విస్తరించనున్నట్లుగా ఎస్సార్ ఆయిల్ ఎండీ, సీఈవో లలిత్కుమార్ గుప్తా తెలిపారు. రానున్న రెండు-మూడేండ్లలో అమ్మకాలను ప్రస్తుతం ఉన్న 2.5 మిలియన్ కిలో లీటర్ల నుంచి 10 మిలియన్ కిలో లీటర్లకు చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. కొత్త ఫిల్లింగ్ స్టేషన్లను ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో ఏర్పాటు చేయన్నుట్లుగా తెలిపారు. ఇందుకు కావాల్సి పెట్టుబడుల గురించి ఆయన వివరిస్తూ దాదాపు రూ.2,100 కోట్లు అవసరమవుతుందని అన్నారు. వీటిలో అధిక భాగం ఫ్రాంచైజీల రూపంలో ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఈ నిర్ణయంతో అదనంగా మరో 20.000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 5, Oct 2018, 3:38 PM IST
Highlights
కెరీర్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నహీరో నారా రోహిత్. ప్రస్తుతం 'వీర భోగ వసంత రాయలు' అనే సినిమా చేస్తున్నాడు రోహిత్. మల్టీ స్టారర్ గా రూపొందుతున్నఈ చిత్రంలో సుధీర్ బాబు, శ్రీ విష్ణు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కెరీర్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నహీరో నారా రోహిత్. ప్రస్తుతం 'వీర భోగ వసంత రాయలు' అనే సినిమా చేస్తున్నాడు రోహిత్. మల్టీ స్టారర్ గా రూపొందుతున్నఈ చిత్రంలో సుధీర్ బాబు, శ్రీ విష్ణు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అప్పారావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఇంద్రసేన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోల గెటప్స్ ని రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశారు. హీరోయిన్ శ్రియ సీరియస్ లుక్స్ తో ఆడియన్స్ ని మరింతగా మెప్పించింది.
ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది చిత్రబృందం. అక్టోబర్ 26న డేట్ ని లాక్ చేశారు. నిజానికి ఈ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద సినిమాల జోరు మాములుగా ఉండదు. ఈరోజు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. వచ్చే వారం 'అరవింద సమేత' సందడి చేయనుంది.
దాని హవా కనీసం రెండు వారాలు తిరుగు లేకుండా సాగుతుంది. ఆ తరువాత రామ్ 'హలో గురు ప్రేమకోసమే' అలానే 'పందెంకోడి 2' సినిమాలు విడుదల కానున్నారు. దీంతో 'వీర భోగ వసంత రాయలు' అక్టోబర్ ఆఖరి వారాన్ని బుక్ చేసుకుంది.
ఇవి కూడా చదవండి.. | 0business
|
Hyderabad, First Published 13, Sep 2018, 3:15 PM IST
Highlights
నటి స్వర భాస్కర్ నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా కొన్ని నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్వర బార్కర్ వైబ్రేటర్ ని ఉపయోగిస్తూ స్వయంతృప్తి పొందే సీన్ ఒకటి ఉంది
నటి స్వర భాస్కర్ నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా కొన్ని నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్వర బార్కర్ వైబ్రేటర్ ని ఉపయోగిస్తూ స్వయంతృప్తి పొందే సీన్ ఒకటి ఉంది. సినిమా విడుదలైన తరువాత ఈ సన్నివేశంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. వాటిని ఎదుర్కొని స్వర కూడా ధీటుగా సమాధానాలు చెప్పింది.
ఇక ఈ ఇష్యూ సద్దుమణిగిందని అనుకుంటున్న సమయంలో మరో నెటిజన్ స్వర భాస్కర్ ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్ సంచలనంగా మారింది. స్వర భాస్కర్ తండ్రి రిటైర్డ్ నేవీ ఆఫీసర్. ఇటీవల సుప్రీమ్ కోర్టు సెక్షన్ 377 పై ఇచ్చిన తీర్పుని ప్రశంసిస్తూ ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ ట్వీట్ కింద కామెంట్ చేస్తూ స్వర నటించిన బోల్డ్ సీన్ ఫోటోని పోస్ట్ చేసి.. ఈ ఫొటోలో ఉన్నది ఎవరు..? ఆమె ఏం చేస్తుంది..? అంటూ ప్రశ్నించాడు.
తన తండ్రిని అవమానిస్తూ కామెంట్ చేసిన సదరు నెటిజన్ కి స్వర భాస్కర్ కొట్టినట్లు సమాధానమిచ్చింది. 'నేనొక నటిని.. సినిమాలో సీన్ కోసం వైబ్రేటర్ ని ఉపయోగిస్తున్నాను. దీని గురించి మా నాన్నని అడగాల్సిన అవసరం లేదు. నీకేమైనా అనుమానాలు ఉంటే నన్నే నేరుగా అడుగు. ముందు నీ పేరులో నుండి వీర్ అనే పదాన్ని తొలగించు. వయసులో పెద్ద వ్యక్తిని అవమానించడానికే చాలా దిగజారి ప్రవర్తించావంటూ' అతడిపై మండి పడింది.
Last Updated 19, Sep 2018, 9:24 AM IST | 0business
|
ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్న పరిణితి
Highlights
బాహుబలి తర్వాత సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ రెడీ
150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ప్రభాస్ తదుపరి సినిమా
యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా పరిణితి చోప్రా
బాహుబలి పూర్తి కాగానే ప్రభాస్ యువీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా చేయబోతున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ చివర్లో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఆమెకు ప్రపోజల్ పంపారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాపై పరిణీతి చోప్రా సైతం ఆసక్తిగా ఉందని తెలుస్తోంది.
ప్రభాస్ తదుపరి మూవీపై 150కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారని.. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు తెలుగుతోపాటు హిందీ-తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ కు క్రేజ్ మరింత పెంచాలంటే... బాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని భావించాడు దర్శకుడు సుజిత్. సో... బాహుబలితో సినీ పరిశ్రమల మధ్య అంతరం మరింత తగ్గిన నేపథ్యంలో... బాలీవుడ్ భామలను తెలుగులోకి డంప్ చేయడం మళ్లీ మొదలవుతోందన్న మాట.
Last Updated 25, Mar 2018, 11:55 PM IST | 0business
|
4 వికెట్లు కోల్పోయిన టీమిండియా
INDIA vs NEWZEALAND
మాంచెస్టర్: న్యూజిలాండ్తో సెమీఫైనల్లో 240 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కేవలం 5 పరుగుల స్కోరుకే 3 వికెట్లు చేజార్చుకుంది. రోహిత్ ఔటయిన తర్వాత వచ్చిన విరాట్ కూడా సింగిల్కే స్కోరుకే పెవిలియన్ దారి పట్టాడు. రోహిత్ శర్మను, లోకేశ్ రాహుల్ను, దినేశ్ కార్తీక్ను మాథ్ హెన్రీ ఔట్ చేయగా, విరాట్ను బౌల్ట్ ఎల్బిడబ్లూ చేశాడు. 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 38 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో రిషబ్పంత్( 19 ), హార్థిక్ పాండ్యా(5)లు ఉన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/ | 2sports
|
May 24,2018
జెట్ ఎయిర్వేస్కు ఇంధన నష్టాలు
న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద విమానయాన సంస్థ అయినా జెట్ ఎయిర్వేస్ ఇండియా ఫలితాలకు ఇంధన ధరల సెగ తాకింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరలు భారీగా పెరగడంతో ఈ కంపెనీ పెద్ద మొత్తంలో నష్టాలు చవి చూసింది. 2017-18 జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.1036 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.602 కోట్ల లాభాలు సాధించింది. క్రితం క్యూ4లో నిర్వహణ రెవెన్యూ 9 శాతం పెరిగి రూ.5925 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఇంధన ధరలు 31 శాతం ఎగిసి రూ.2063 కోట్లుగా చోటు చేసుకున్నాయి. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో దాదాపుగా 45 శాతం జెట్ ఇంధనం ఖర్చులే ఉంటాయి. బుధవారం బిఎస్ఇలో జెట్ ఎయిర్వేస్ షేర్ 0.23 శాతం పెరిగి రూ.421.15 వద్ద ముగిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సమంత జోక్యం.. నాగార్జునకు షాక్!
Highlights
ఈ జోక్యం ఇంతటితో ఆగదని, చైతు సినిమాల విషయంలో కూడా సమంత ఇప్పటినుండే కేర్ తీసుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు చైతు సినిమాలకు సంబంధించి నిర్ణయాలన్నీ తన తండ్రి నాగార్జునకు వదిలేసేవాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత.. నాగచైతన్యను వివాహం చేసుకున్న తరువాత కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. మొన్నామధ్య ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని చెప్పేశాడు నాగచైతన్య. సమంత వ్యవహారం చూస్తుంటే ఇంకొంతకాలం హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యూటర్న్' కన్నడ రీమేక్ సినిమాలో నటిస్తోంది. తెలుగు కూడా అదే టైటిల్ తో సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ సినిమాను పవన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో లీడ్ క్యారెక్టర్ పోషిస్తోన్న సమంతనే సినిమా విషయాలు కూడా దగ్గరుండి చూసుకుంటుందని టాక్. మేకింగ్, ప్రమోషన్ వ్యవహారాలు తన గ్రిప్ లోనే ఉంచుకుందట. టీమ్ తన ప్రమేయం లేకుండా ఏం చేయడం లేదని సమాచారం. ఆమె ఇచ్చే సలహాలు, సూచనలను యూనిట్ సభ్యులు క్రమ తప్పకుండా పాటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విడుదలవుతోన్న 'చిలసౌ' సినిమా ప్రమోషన్స్ లో కూడా అమ్మడి ఫింగరింగ్ ఎక్కువైందని టాక్.
సుశాంత్ కు సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియో బయటకు రావడానికి కూడా సమంతనే కారణమని చెబుతున్నారు. ఈ జోక్యం ఇంతటితో ఆగదని, చైతు సినిమాల విషయంలో కూడా సమంత ఇప్పటినుండే కేర్ తీసుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు చైతు సినిమాలకు సంబంధించి నిర్ణయాలన్నీ తన తండ్రి నాగార్జునకు వదిలేసేవాడు. కానీ ఇప్పుడు సమంత జోక్యం చేసుకుంటుందని టాక్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చైతు కూడా తన సినిమా కథలు సమంత వింటుందని చెప్పాడు. సో ఇక నాగార్జునకు విరామం దొరికినట్లే!
Last Updated 24, Jul 2018, 1:15 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆంధ్రప్రదేశ్కు రూ.4,39,765 కోట్ల పెట్టుబడులు
.రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం మూడు ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకుందని చంద్రబాబు వెల్లడించారు. ఇందులో తిరుపతిలో ఒక మొబైల్ తయారీ యూనిట్, ఇన్నొవేషన్ ఇంకుబేషన్, ఇంధన రంగంలో పెట్టుబడులు పెడతారని ప్రాథమిక సమాచారం.
TNN & Agencies | Updated:
Feb 27, 2018, 12:14PM IST
* 11 ల‌క్ష‌ల మందికి ఉపాధి అవ‌కాశాలు
మూడో పెట్టుబ‌డుల స‌మావేశం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అచ్చొచ్చింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఐఐ సదస్సు సోమ‌వారంతో ముగిసింది. విశాఖ నగరంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు..తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను బాబు వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావాలని, పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని బాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 734 ఒప్పందాలు జరిగాయి. రూ. 4,39,765 కోట్ల పెట్టుబడులు జరిగాయి. దీనిద్వారా 11 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. సదస్సు చివ‌రి రోజైన సోమ‌వారం 369 ఎంవోయూలు కుదిరాయ‌ని, వీటి విలువ రూ.2,20,951 కోట్ల‌ని అధికారులు పేర్కొన్నారు.
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ మొత్తం మూడు ప్రాజెక్టుల‌కు ఒప్పందం కుదుర్చుకుంద‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. ఇందులో తిరుప‌తిలో ఒక మొబైల్ త‌యారీ యూనిట్, ఇన్నొవేష‌న్ ఇంకుబేష‌న్, ఇంధ‌న రంగంలో పెట్టుబ‌డులు పెడ‌త‌రాని ప్రాథ‌మిక స‌మాచారం. ఇంకా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కేంద్రంగా ఉన్న లులూ గ్రూప్ విశాఖ‌ప‌ట్నంలో ఒక హోట‌ల్, షాపింగ్ మాల్ నిర్మించేందుకు ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
ఇంకా అదానీ గ్రూప్ భావ‌న‌పాడు వ‌ద్ద రూ. 9వేల కోట్ల పెట్టుబ‌డితో ఒక అభివృద్ది పోర్టును స్థాపించ‌నుంద‌ని స‌ద‌స్సు లో వెల్ల‌డించారు. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
టీ20 ట్రై సిరీస్: శ్రీలంకని కసితీరా ఓడించిన భారత్
ముక్కోణపు టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్లో ఓటమి రుచిచూపిన శ్రీలంకపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కొలంబో వేదికగా
Samayam Telugu | Updated:
Mar 13, 2018, 12:10AM IST
టీ20 ట్రై సిరీస్: శ్రీలంకని కసితీరా ఓడించిన భారత్
ముక్కోణపు టీ20 సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌‌లో ఓటమి రుచిచూపిన శ్రీలంకపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కొలంబో వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మనీశ్ పాండే (42 నాటౌట్: 31 బంతుల్లో 3x4, 1x6), దినేశ్ కార్తీక్ (39 నాటౌట్: 25 బంతుల్లో 5x4) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అంతకముందు ఫాస్ట్ బౌలర్లు శార్ధూల్ ఠాకూర్ (4/27), వాషింగ్టన్ సుందర్ (2/21) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు వర్షం కారణంగా కుదించిన 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది. టోర్నీలో తర్వాత మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ మధ్య బుధవారం రాత్రి 7 గంటలకి జరగనుంది.
ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (11: 7 బంతుల్లో 1x4, 1x6) మరోసారి వైఫల్యాల బాట కొనసాగించగా.. ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ (8) కూడా తొందరగానే ఔటవడంతో భారత్ ఆదిలోనే 22/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (27: 15 బంతుల్లో 2x4, 2x6).. కేఎల్ రాహుల్ (18: 17 బంతుల్లో 1x4)తో కలిసి కాసేపు స్కోరు బోర్డుని నడిపించాడు. అయితే.. జట్టు స్కోరు 62 వద్ద రైనా ఔటవగా.. తర్వాత కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ హిట్ వికెట్‌గా ఔటై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత్ తరఫున టీ20ల్లో హిట్ వికెట్‌గా ఔటైన తొలి క్రికెటర్ కేఎల్ రాహుల్ నిలిచాడు. స్పిన్నర్ జీవన్ మెండిస్ బౌలింగ్ వెనక్కి వెళ్లి ఆడే ప్రయత్నంలో.. రాహుల్ వికెట్లను తొక్కేశాడు. ఈ దశలో మనీశ్ పాండే - దినేశ్ కార్తీక్ జోడి భారత్‌ని గెలిపించే ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కి అజేయంగా 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కి అలవోక విజయం అందించారు. తొలుత మనీశ్ పాండే హిట్టింగ్‌తో మ్యాచ్‌ని భారత్‌వైపు తిప్పగా.. చివర్లో వరుస బౌండరీలతో గెలుపు లాంఛనాన్ని దినేశ్ కార్తీక్ పూర్తి చేశాడు. గత మంగళవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ని శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.
వర్షం కారణంగా దాదాపు గంట మ్యాచ్ సమయం వృథా కావడంతో మ్యాచ్‌ని అంపైర్లు 19 ఓవర్లకి కుదించారు. దీంతో.. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆతిథ్య శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్ గుణతిలక (17: 8 బంతుల్లో 1x6) ఆరంభంలోనే సిక్స్ బాది ఊపు మంచి మీద కనిపించినా.. మూడో ఓవర్‌ వేసి ఠాకూర్ బౌలింగ్‌లో బంతిని రైనా పక్క నుంచి బౌండరీకి తరలించబోయి.. అతను డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన కుశాల్ పెరీరా (3) స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. దీంతో.. 34/2తో ఇబ్బందుల్లో పడిన శ్రీలంకను కుశాల్ మెండిస్ (55: 38 బంతుల్లో 3x4, 3x6) - ఉపుల్ తరంగ (22: 24 బంతుల్లో 1x4, 1x6) జోడి ఆదుకుంది. వీరిద్దరూ మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో.. లంక కోలుకుంది.
జట్టు స్కోరు 96 వద్ద ఉపుల్ తరంగ ఔటవడంతో.. మళ్లీ శ్రీలంక ఇన్నింగ్స్‌లో తడబాటు మొదలైంది. తర్వాత వచ్చిన తిసార పెరీరా (15: 6 బంతుల్లో 2x6) తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్ని సిక్సర్లు మలిచి తన ఉద్దేశం చాటినా.. అతడ్ని ఠాకూర్ తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. చివర్లో భారత్ క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ లంకపై ఒత్తిడి పెంచింది. శనక (19), జీవన్ మెండిస్ (1), అఖిల ధనంజయ (5), చమీర (0) వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో ఆ జట్టు 152 పరుగులకే పరిమితమైంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
internet vaartha 139 Views
న్యూఢిల్లీ : నాలుగోవిడత పసిడిబాండ్లు సోమవారం నుంచి జారీ ప్రారంభంఅయింది. ప్రభుత్వం కొన్ని సడలింపులు, సవరణలు తీసుకురావడంద్వారా ఎక్కువ మంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు నాలుగో విడత ఎక్కువ నిధులు సమీకరించే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. బంగారం దిగుమతులు తగ్గిం చేందుకు దేశీయంగా నిరర్ధకంగా ఉన్న బంగారాన్ని వినియోగంలోనికి తెచ్చేందుకు ప్రభుత్వం పసిడి బాండ్లను ప్రవేశపెట్టింది. రిజర్వుబ్యాంకు ఈ బాండ్లకు గ్రాము బంగారంధర 3119రూపాయలుగా ప్రకటిం చింది. ఒక గ్రాము నుంచి 500 గ్రాముల వరకూ పెట్టుబడు పెట్టే వీలుంది. జూలై రెండవ తేదీ వరకూ ఈబాండ్లజారీ కొనసాగుతుంది. మొదటి మూడు విడతల్లో ప్రభుత్వం 1318 కోట్ల పెట్టుబడులు సమీక రించింది. బంగారంతో చూస్తే 4.9 టన్నుల బంగారం నిల్వలు వచ్చినట్లు సమాచారం. నాలుగో విడత కూడా మరింతగా ఎక్కువ పెట్టుబడులు సమకూరతాయన్న ధీమా వ్యక్తంచేస్తోంది. ఎన్ఎస్ఇ, బిఎస్ఇలు, అన్ని బ్యాంకు శాఖలు,ఎంపికచేసిన పోస్టాఫీసుల్లో ఈ బాండ్లు కొనుగోలుచేసేందుకు వీలవుతుంది. గత ఏడాది అక్టో బరులో ప్రకటించిన ఈ పథకానికి స్పందన పెంచేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషిచేసింది. సాలీనా 2.75 శాతం వడ్డీని ప్రకటించింది. ఎనిమిదేళ్లకాలపరిమితి ఉన్న ఈబాండ్లను ఐదేళ్ల తర్వాత నుంచి మాత్రమే పెట్టుబడుల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మూలధన లబ్ధిపన్ను నుంచి మినహాయింపు ఉంటుందని ప్రకటించింది. భారత్ బంగారం దిగుమతులు ప్రతి ఏటా 1000 టన్నులవరకూ ఉంది. ముడిచమురు తర్వాత పసిడి దిగుమతులే ఎక్కువ. బంగారం దిగుమతులు 2015-16లో 8 శాతం తగ్గాయి. 31.72 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ధోరణులు కొంత కీలకం అయ్యాయి. దిగుమతులు తగ్గడం వల్ల కరెంటుఖాతా లోటు కొంత మేర భర్తీ అవుతుందని అంచనా. 2014-15లో బంగా రం దిగుమతులు 34.38 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగినట్లు అంచనా. ప్రస్తుతం దేశీయంగా ఉన్న నిరర్ధక బంగారం బాండ్ల రూపంలో పెట్టుబడులకు వచ్చినా, లేక నగదీకరణ పథకం కింద డిపాజిట్ చేసినా కొంతమేర వినియోగం పెరుగుతుందని అంచనా. | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
హిట్లున్నా.. తనకెందుకు అవకాశాలు లేవో చెప్పిన హీరోయిన్!
తెలుగులో ఛాన్సులే లేవు. మరే సినిమాలోనూ ఈమెకు అవకాశం దక్కలేదు. మరి ఎందుకిలా
TNN | Updated:
Mar 30, 2017, 11:12AM IST
మాళవిక నాయర్.. తెలుగులో ఈమె నటించిన రెండు సినిమాలూ ప్రశంసలు పొందినవే. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘కల్యాణ్ వైభోగమే’.. ఈ రెండు సినిమాలూ డీసెంట్ హిట్స్ గా నిలిచాయి. క్లాస్ మూవీస్ అనిపించుకున్నాయి. మరి రెండు సినిమాల హిట్లను సొంతం చేసుకున్న హీరోయిన్ ఎవరికైనా అవకాశాలు వెల్లువెత్తాలి. అందునా.. నటిగా ప్రశంసలు అందుకుందంటే.. ఆమె దశ తిరిగిపోవాలి. అయితే ఈ హీరోయిన్ పరిస్థితి మాత్రం అలా లేదు.
2015లో ఒక సినిమా, 2016 లో మరోసినిమా.. అంతే , ఆ తర్వాత తెలుగులో ఛాన్సులే లేవు. మరే సినిమాలోనూ ఈమెకు అవకాశం దక్కలేదు. మరి ఎందుకిలా అంటే, ఈ విషయం గురించి మాళవికే క్లారిటీ ఇచ్చింది. తను ఎక్స్ పోజింగ్ విషయంలో పూర్తి స్ట్రిక్ట్ ఉంటాను అని, అందాలను ఆరబోసే బట్టలు వేసుకోవడానికి నిస్సందేహంగా నిరాకరిస్తానని చెప్పింది. గ్లామర్ షోకు తను పూర్తి వ్యతిరేకమని ఆమె స్పష్టం చేసింది.
తనకు కంఫర్ట్ అనిపించిన దుస్తులను మాత్రమే తను ధరిస్తాను అని మళవిక వ్యాఖ్యానించింది. మరి ఇది చాలదూ.. అవకాశాలు మొహం చాటేయడానికి! మాళవికవి అచ్చం పాతతరం హీరోయిన్ల ఆలోచనలు. అది కూడా తను పెట్టుకున్న రూల్స్ పట్ల చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని బహిరంగంగానే స్పష్టం చేస్తోంది. ఇలాంటప్పుడు అవకాశాలు ఎలా వస్తాయి? ఎక్స్ పోజింగ్ చేసే హీరోయిన్ల కే కదా.. ప్రస్తుతం డిమాండ్! అయితే మాళవికకు ఊరట ఏమిటంటే.. ‘కల్యాణ వైభోగమే’ డైరెక్టర్ నందినీ రెడ్డి తన తదుపరి సినిమాలోనూ మాళవికకు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటోందట. | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
'పెట్రో' ఊరట.. మళ్లీ తగ్గిన ఇంధన ధరలు
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు తగ్గి రూ.81.55 గా ఉండగా.. డీజిల్ ధర 21 పైసలు తగ్గి రూ.78.05 గా ఉంది.
Samayam Telugu | Updated:
Nov 20, 2018, 10:11AM IST
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో.. దేశీయంగా పెట్రోలు , డీజిల్ ధరలు శనివారం (నవంబరు 17) మరోసారి తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధర రూ.76.91 కి చేరింది. డీజిల్ ధర కూడా 19 పైసలు తగ్గి రూ.71.74 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 19 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.82.43 కి చేరగా.. డీజిల్ ధర 20 పైసలు తగ్గి రూ. 75.36 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ ధర 70 డాలర్ల దిగువకు పడిపోయి 66.76 వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 56.68 డాలర్లకు పడిపోయింది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు తగ్గి రూ.81.55 గా ఉండగా.. డీజిల్ ధర 21 పైసలు తగ్గి రూ.78.05 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.80.81 ఉండగా.. డీజిల్ ధర రూ.76.88 వద్ద కొనసాగుతోంది. | 1entertainment
|
Nov 02,2019
జియో దీపావళి ఆఫర్ సక్సెస్: రిలయన్స్
ముంబయి: 'జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్'కు అనూహ్య స్పందన లభించిందనిరిలయన్స్ తెలిపింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్ను కేవలం రూ.699కే అందించి మూడు వారాల పాటు కొనసాగించిన ఈ ఆఫర్కు ఊహించనంత డిమాండ్ వచ్చిందని సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్టు సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫీచర్ ఫోన్ వినియోగదారులందరూ దీపావళి ఆఫర్ను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని పొడిగించినట్టు పేర్కొంది. 2జీ ఫోన్ వినియోగదారులు ఈ పొడిగింపుతో తమ ఖాతాదారులుగా మారతారన్న ఆశాభావాన్ని సంస్థ వ్యక్తం చేసింది. 4జీ డివైస్ ప్లాట్ఫామ్లో నంబర్వన్గా రిలయన్స్ జియో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Vaani Pushpa 187 Views comments , hot topic , MICKEY ARTHUR
MICKEY ARTHUR
కేప్టౌన్: తనను పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పించడానికి ప్రస్తుత హెడ్ కోచ్గా ఉన్న మిస్బాహుల్ హక్ కూడా ఒక కారణమంటూ మికీ ఆర్థర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను తప్పించడంలో మిస్బావుల్తో పాటు వసీం అక్రమ్ కూడా కీలకపాత్ర పోషించారంటూ ఆర్థర్ పేర్కొన్నారు. వీరిద్దర్నీ తాను ఎంతగానో నమ్మితే తనకు అన్యాయం చేశారన్నాడు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఆర్ధర్ పేర్కొన్నాడు. వరల్డ్కప్లో పాకిస్తాన్ వైఫల్యం తర్వాత పిసిబి ఒక కమిటీని నియమించింది. దీనిపై సదరు కమిటీ విచారణ చేపట్టిన తర్వాతే మికీ ఆర్ధర్ కాంట్రాక్ట్ను పొడిగించడానికి పిసిబి మొగ్గు చూపలేదు. ఇందులో మిస్బావుల్ హక్తో పాటు వసీం అక్రమ్లు సభ్యులుగా ఉండటాన్ని ఆర్థర్ ప్రధానంగా ప్రస్తావించాడు. ఈ కమిటీ రిపోర్ట్ తనకు వ్యతిరేకంగా ఉండటం వల్లే కోచ్ పదవిని కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. ఈ క్రమంలోనే మిస్బాహుల్ హక్, వకార్లను టార్గెట్ చేశాడు. నేను ఎందుకు పదవి కోల్పోయానో ఊహించగలను. అందుకు కారణం నేను నమ్మినవారే. మిస్బావుల్, అక్రమ్లు కమిటీ సభ్యులుగా ఉన్నప్పటికీ నా కాంట్రాక్ట్ను పొడిగించలేదు. నేను పాకిస్తాన్ క్రికెట్కు పూర్తిస్థాయలో సేవలందించాను. దాంతోనే మిస్బావుల్-అక్రమ్లు నాకు అనుకూలంగా నివేదిక ఇస్తారనుకున్నా కానీ నాకు వ్యతిరేకంగా ఇచ్చారు. దాంతో నేను కోచ్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చిందని ఆర్థర్ పేర్కొన్నాడు. మరొకవైపు కొత్తగా హెడ్ కోచ్గా నియమించబడ్డ మిస్బావుల్ హక్ సక్సెస్ కావాలని కోరుతున్నట్లు స్పష్టం చేశాడు. మిస్బావుల్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాడు. అతనొక ఉన్నతమైన వ్యక్తి. అందుకోసమే పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ బాధ్యతల్ని అప్పజెప్పింది. కానీ నేను ప్రతీ సెకండ్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినా నన్ను తప్పించడం బాధించిందని ఆర్ధర్ తెలిపాడు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రికార్డ్: తొలిసారి 9,300 మార్క్ దాటిన నిఫ్టీ
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ సరికొత్త రికార్డును నమోదు చేసింది.
TNN | Updated:
Apr 25, 2017, 06:01PM IST
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ సరికొత్త రికార్డును నమోదు చేసింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో తొలిసారి 9,300 మార్కును దాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు మరికొన్ని కంపెనీల మార్కెట్ విలువలు పెరగడంతో నిఫ్టీ రికార్డు స్థాయి మార్కుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఈ ఏడాది ఏప్రిల్‌ 5న నమోదైన 9,273.90 పాయింట్లే అత్యధికం. ఇప్పుడు దాన్ని కూడా అధిగమించి ఏకంగా 9,300 పాయింట్లకు నిఫ్టీ చేరుకుంది.
మొత్తం 50 షేర్లతో కూడిన నిఫ్టీ 88.65 పాయింట్లు పైకి ఎగబాకి జీవితకాల గరిష్ఠం 9,306.60 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ కూడా 287.40 పాయింట్లు ఎగబాకి 29,943.24 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారక విలువ రూ. 64.21గా ఉంది.
నాలుగో త్రైమాసికంలో రూ. 8,046 కోట్ల లాభాన్ని అర్జించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం ప్రకటించడంతో ఈరోజు స్టాక్ ఎక్సేంజ్‌లో దూసుకుపోయింది. 1.21 శాతం వృద్ధి సాధించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ రూ. 1433.50కు పెరిగింది. దీంతో నాలుగేళ్ల తర్వాత మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానానికి చేరింది. దీంతో పాటు ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, హీరో మోటో కార్ప్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌ గ్రిడ్‌, ఐటీసీ లిమిటెడ్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ 3.36 శాతం వృద్ధి సాధించాయి. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
‘సినిమాలో నేను నల్లగా కనిపించే అమ్మాయి పాత్రలో నటించాను. అయితే మేం నల్లగా ఉన్నవాళ్లని కించపరచడానికి ఈ క్యారెక్టర్ చేయడంలేదు. దేశంలో తెల్లగా కనిపించాలని కోరుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. వారందరికీ బుద్ధి చెప్పడానికే నేను ఈ క్యారెక్టర్లో నటించడానికి ఒప్పుకున్నాను. తెల్లగా కనిపించే అమ్మాయిలను మాత్రమే ప్రేమిస్తారా? ఈ సినిమాలో నా క్యారెక్టర్పై వస్తున్న ఆర్టికల్స్ అన్నీ చదువుతూనే ఉన్నాను. అందరూ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. ఓ నటిగా ఇచ్చిన క్యారెక్టర్కు న్యాయం చేయడం నా బాధ్యత. నేను నటిని కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్స్లో నటిస్తాను. అలా నటించే అవకాశం లేనప్పుడు నేను ఈ ఇండస్ట్రీలో ఉండటం వేస్ట్. నా ఫస్ట్ సినిమా ‘దమ్ లగాకే హైషా’. ఇందులో నేను చాలా లావుగా ఆంటీలా కనిపిస్తాను’
READ ALSO: సెట్స్లో నన్ను ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడు: నటి
‘ సినిమా కోసం 30 కిలోలు పెరిగాను. లావుగా కనిపించేవారు చాలా మంది ఉన్నప్పుడు సినిమాలో నన్ను మాత్రమే ఎందుకు తీసుకున్నారు? నేను బరువు పెరగాలని ఎందుకు చెప్పారు? ఇదంతా డైరెక్టర్ ఆలోచనలను బట్టి ఉంటాయి. డైరెక్టర్కు ఎవర్ని తీసుకోవాలని అనిపిస్తే వారినే తీసుకుంటారు. నా సినిమాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. నా పాత్రలు కూడా అంతే. ఒకవేళ నేను సినిమాలో అబ్బాయిలా నటించమన్నా కూడా నాకు ఓకే. సినిమా కోసం ఏదైనా చేస్తాను. మనం చేసే పని ఇంట్రెస్టింగ్గా లేనప్పుడు ఆ పని చేయడం ఎందుకు?’ అని ఘాటుగా స్పందించింది భూమి. | 0business
|
internet vaartha 153 Views
ముంబై : బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు రెండు వారాల గరిష్టస్థాయికి చేరాయి. అమెరికా వడ్డీరేట్ల పెంపు కొంతమేర ఉండక పోవచ్చన్న అంచనాలే ఇందుకు ఊతం ఇచ్చాయి. ఫెడ్రిజర్వు ఛైర్ఫర్సన్ జన్నెట్ ఎల్లెన్ వ్యాఖ్యలు బులియన్ మార్కెట్కు ఊతం ఇస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని చెపుతూ వడ్డీరేట్లు పెంపు రావచ్చని అయితే ఇన్వెస్టర్లు మరింత స్పష్టత రావాల్సి ఉందని కోరుతున్నారు. స్పాట్ మార్కెట్లో బంగారం 0.4శాతంపెరిగి 1248.30 డాలర్లవద్ద ముగిసింది. అంతకుముందు ట్రేడింగ్లో 1249.20 డాలర్లుగా ముగిసింది. అమెరికాలో పసిడి ధరలు 0.3శాతం పెరిగి 1251.20 డాలర్లుగా నిలిచింది. వచ్చే వారం జరిగే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ సమావేశంపై ఆధారపడి బంగారం ధరలు నడుస్తాయని అంచనా. వ్యవసాయే తర ఉపాధి గణాంకాలు కొంత నిరాశ కలిగిస్తున్నాయని, వీటి ఆధారంగా వడ్డీరేట్లుపెంచితే పెట్టుబడులు మళ్లుతాయని అంచనా. అమెరికాఉపాధి గణాం కాలు గతవారం క్షీణించాయి. పెడ్ రిజర్వు వడ్డీరేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలున్నాయి. వడ్డీరేట్ల ఆధారం గానే పసిడిధరలు నడుస్తాయి. మేనెలలో చూస్తే పసిడిధరలు ఆరుశాతం క్షీణించాయి. అలాగే ఈ నెలలో ఇప్పటి వరకూ 2.7శాతం పెరిగాయి. వడ్డీ రేట్ల పెంపు ప్రభావాల ఆధారంగానే పసిడి మార్కెట్ కదులుతున్నట్లు అంచనా. ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ వృద్ధి రేటును తగ్గించింది. దీనివల్ల ఫెడ్రిజర్వు పెంపుయోచన కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ప్రపంచ మందగమనం వల్ల ఫెడ్రిజర్వు రేట్లు ఎంతమేర ఎరుగుతాయన్నది అంచనా వేయలేమని హాంకాంగ్కు చెందిన ఆర్థికవేత్త హెలెన్ లావు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పసిడి వినియోగం అత్యధికంగా ఉన్న చైనాలో పసిడినిల్వలు స్థిరంగా ఉన్నాయి. స్వఛ్ఛత కలిగిన ట్రాయ్ ఔన్స్ల్లో చూస్తే 58.14 మిలియన్ ఔన్స్ల వరకూ ఉన్నట్లు అంచనా. ఏప్రిల్ నుంచి మేనెల చివరివరకూ ఇదేస్థాయిలో ఉన్నట్లు చైనా సెంట్రల్ బ్యాంకు వివరించింది. అయితే చైనా ఇప్పటికీ అమెరికా డాలర్ కరెన్సీ నిల్వలు మరింత ఎక్కువస్థాయిలో కలిగి ఉందని, తన విదేశీ కరెన్సీ నిల్వలను వివిధ రంగాలకు మళ్లించేందుకు వీలుగా పసిడి కొనుగోళ్లను పెంచ వచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇతర విలువైన ఖణిజవనరుల్లో వెండిధరలు కూడా 0.6శాతం పెరిగింది. ఔన్స్ ఒక్కింటికి 16.48 డాలర్లుగా ఉన్నాయి. ప్లాటినమ్ 0.2శాతం పెరిగి 1000.50 డాలర్లుగా నడుస్తోంది. | 1entertainment
|
పవన్ పై ప్లేటు ఫిరాయించిన పూనమ్ కౌర్
Highlights
పవన్ పై ప్లేటు ఫిరాయించిన పూనమ్ కౌర్
సినిమా తారలుగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మీడియా మధ్య పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో చిన్న ఏమరుపాటుకు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది పూనం కౌర్ కు మెల్లగా అనుభవంలోకి వస్తోంది. ఆ మధ్య కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఇష్యూలో అనుకోకుండా వెళ్ళి బాగా ఇరుక్కుపోయి నానా రచ్చ చేసుకున్న హీరొయిన్ పూనం కౌర్ నిన్న మరోసారి వార్తల్లోకి ఎక్కిన విషయం చూసాం. పవన్ జనసేన ఆవిర్భావ సభ ముగిసాక నేరుగా కాకపోయినా అతన్నే టార్గెట్ చేస్తున్నట్టు అనిపించే ఘాటైన పదాలతో పూనం కౌర్ కాస్త పెద్ద పోస్టే పెట్టింది. రంగులు మార్చే రాజకీయ నాయకుల గురించి వాళ్ళను నమ్ముకున్న వాళ్ళకు మోసం చేయటం గురించి పూనం పెట్టిన ఆ మెసేజ్ ఫేస్ బుక్ లో పెను దుమారమే రేపింది.
వార్తల కోసం కాచుకుని కూర్చున్న ఛానల్స్ కు ఇది లడ్డులాగా దొరకటంతో దీంతో బాగానే పండగ చేసుకున్నారు. పూనం ఈ కామెంట్స్ చేసింది పవన్ గురించే అని రకరకాల విశ్లేషణలు చేయటం మొదలు పెట్టారు. పవన్ ఫాన్స్ పేరుతో కొందరు రివర్స్ కామెంట్స్ పోస్ట్ చేయటంతో ఇది ముదిరింది అని గమనించిన పూనం ఆ పోస్ట్ మొత్తం డిలీట్ చేసేసి వేరే ఫోటో మ్యాటర్ తో దాన్ని ఏమార్చింది. కాని ముందు పెట్టింది ఈ పాటికే అందరికి రీచ్ అయిపోయివడంతో ఇప్పుడు డిలీట్ చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. గతంలో వివాదం రేగినప్పుడు పవన్ ఫాన్స్ కత్తి మహేష్ మధ్య రాజీ ఫార్ములా కుదిరినప్పటికీ పూనం కౌర్ కు దక్కిన ఊరట ఏమి లేదు. అప్పుడు కూడా ట్విట్టర్ లో ఒకటి రెండు కామెంట్స్ చేసి ఇలాగే డిలీట్ చేయటం కూడా న్యూస్ గా మారింది. సినిమాలు లేకపోయినా ఈ ఇష్యూ వల్ల పూనం కౌర్ కు బాగానే పాపులారిటీ దక్కింది
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
GRUNDFOS
గ్రండ్ఫోస్ ఇండియా నుంచి ‘మొబైల్ పంపింగ్ స్టేషన్లు
చెన్నై,జూలై 29: వదరలు, అకాల వర్షాల్లో నిలిచిపోయిన వరదనీటిని బైటికి పంపించేందుకు గాను గ్రండ్ఫోస్ ఇండియా సంస్థ కొత్త ఇంధన సామర్ధ్య మొబైల్ పంపింగ్ స్టేషన్లను ప్రారం భించింది. రుతుపవనాల కాలంలో సహజంగానే మురుగునీరు పేరుకుపోయి జనజీవితాన్ని అస్తవ్యస్తంచేస్తుంది. ఇటువంటి వాటికి పరిష్కారంగా మొబైల్ వాటర్ పంపింగ్ స్టేషన్లను ప్రారంభించింది. గంటకురెండులక్షల లీటర్ల నీటిని బైటికి పంపిస్తాయి. ఎలాంటి వాతా వరణంలోనైనా ఈ పంపింగ్ స్టేషన్లు పని చేస్తాయి. నిర్మాణం జరిగే ప్రాజెక్టుల్లోను, వరదనీటి నిర్మూలన, షిప్యార్డలు, నీరు పేరుకునిపోయిన బేస్మెంట్లు, డ్రైనేజి గుంతలు, విద్యుత్ స్టేషన్లు లోతట్టు ప్రాం తాలు,క్యాచ్మెంట్ప్రాంతాలు, చేపలచెరువు లు వంటివాటికి ఈమొబైల్పంపింగ్ స్టేషన్లు ఎంతోఅనువుగా ఉంటాయని ఎండి ఎన్కె రంగనాధ్ వెల్లడించారు. వివిధ ఉపద్రవాల కారణంగా భారత్లో 2015లో 9.8బిలియన్ డాలర్లనష్టం జరిగిందని, వాటిలో కేవలం వరదలవల్లనే 700 కోట్లడాలర్ల నష్టంజరిగిందని ఐక్యరాజ్యసమితి అంచనావేసిందన్నారు. ఇటువంటి విపత్కర సమ యాల్లోనే వీటివినియోగం అత్యవసరంగా భావించి అమలుకు తెచ్చినట్లు రంగనాధ్ వివరించారు. | 1entertainment
|
- జీఎస్టీతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సెగ
- పన్నుపోటుతో ఊడనున్న కొలువులు
- కొత్త ఉద్యోగాల సృష్టి ఇప్పట్లో కష్టమేనట
- ఆందోళనలో సెక్యూరిటీ ఏజెన్సీలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కొందరు పేదల జీవితాల్లో చీకట్లు నింపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వివిధ వ్యాపార సంస్థలు, కంపెనీలతో పాటు బడాబాబుల ఇండ్ల వద్ద కాపలా ఉండే సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్తో పాటు ఇతర కింది స్థాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జీఎస్టీ ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ఈ శ్రమ జీవులకు ఇస్తున్న వేతనాలపై సర్కారు పన్ను పోటు పెంచడంతో ఆయా సంస్థలకు వీరికిచ్చే వేతనాలు భారంగా మారాయి. దీంతో పలు సంస్థలు సెక్యూరిటీ గార్డులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవలి కాలం వరకు వీరి వేతనాలపై 15 శాతం సర్వీసు ట్యాక్స్ను విధిస్తూ వచ్చింది. ఇప్పుడు జీఎస్టీ రాకతో ఇది 18 శాతానికి పెరిగింది. దీంతో వీరి నియామక సంస్థలకు ఏజెన్సీలకు లాభం గణనీయంగానే పడిపోయే పరిస్థితి నెలకొంది.
50 లక్షల గార్డలపై ప్రభావం..
జీఎస్టీ పన్నుపోటు భారాన్ని కొన్ని కంపెనీలు భరించడానికి వెనకాడుతున్నాయి. దీంతో ఆ మొత్తం భారాన్ని సెక్యూరిటీ గార్డుల వేతనాల్లోంచి కోత పెట్టేలా కొన్ని కంపెనీలు యోచిస్తున్నట్టుగా సమాచారం. అసలే జీవితానికి భరోసా లేకుండా అరకొర వేతనాలతో బతుకు బండిని లాగుతున్న తమకు జీఎస్టీ రూపంలో అదనపు కోత పడితే బతుకు మరింత దుర్భరంగా మారుతుందని వీరు వాపోతున్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మందిగా గార్డులుగా జీవితం వెల్లదీస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1000 పైగా సెక్యూరిటీ ఏజెన్సీలలో దాదాపు 4 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు జీఎస్టీ వీరి జీవితంలో అనుకోని చీకట్లు నింపే ప్రమాదం నెలకొంది.
అవుట్సోర్సింగ్పైనా అనూహ్యా ప్రభావం
దేశవ్యాప్తంగా మొత్తం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కోటి 50 లక్షల (15 మిలియన్లు) మందికి పైగా ఉద్యోగులు సెక్యూరిటీ గార్డులు, హౌసికీపింగ్ తదితర చిన్న ఉద్యోగాల్లో దినసరి వేతన కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరందరూ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలే. కొత్త పన్ను విధానం వల్ల ప్రయివేట్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఏజెన్సీలకు ఇబ్బందులు ఎదురువుతున్నాయని ఆయా సంస్థలు వాపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 2000 ప్రొఫెషనల్ ఏజెన్సీలకుగానూ సుమారు 10 లక్షల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్నారు. దేశంలోని నిరుద్యోగ యువతకు, దినసరి వేతన కూలీలకు సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఏజెన్సీలు తక్కువ వేతనాలకైనా సరే ఉపాధి అవకాశాల్ని చూపిస్తున్నాయి. నిబంధనల మేరకు గరిష్టంగా ఈపీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి ఇతర అదనపు సదుపాయాలను కూడా చెల్లిస్తున్నాయి. అయితే కొత్త పన్నుతో నూతన ఉద్యోగాలు తగ్గిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ భారంతో ఈ సేవలను తీసుకునే వారు తగ్గిపోవడంతో పాటు నేరాల సంఖ్య పెరిగేందుకు ఆస్కారం ఉందని అన్నారు. జీఎస్టీ విధానంపై పున:సమీక్షించాలని లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు.
14న నగరంలో భారీ ర్యాలీ..
జీఎస్టీ కారణంగా సెక్యూరిటీ గార్డు వ్యవస్థపై పెరిగిన పన్ను భారాన్ని వెనక్కి తీసుకోవాలని అసోసియేషన్ ఆఫ్ ప్రయివేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ డిమాండ్ చేస్తోంది. తమ గోడును సర్కారుకు తెలియబరిచేందుకు గాను ఈ నెల 14న హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, అసోసియేషన్ ఆఫ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ అధ్యక్షులు అఫ్సర్ హుస్సేన్లు తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 143 Views
న్యూఢిల్లీ : ఐరోపాకూటమి నుంచి వైదొలిగేందుకే ఓటువేసిన బ్రిటన్ పౌరుల తీర్పుపై ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా వణికాయి. యూరోపియన్ యూనియన్ మార్కెట్లు సైతం భారీ పతనం చవి చూసాయి. అగ్రరాజ్యాలకు సైతం ఈ ప్రభావం తాకింది. అయితే భారత్కు మాత్రం తొలినాళ్లలో స్వల్ప ప్రభావం ఉన్నప్పటికీ ఇక గ్లోబల్ ఇన్వెస్టర్లు మొత్తం క్యూ కడతారని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తు న్నారు. ఇకపై బ్రిటన్ తర్వాత ప్రపంచంలో అత్యంత సానుకూల దేశాలుగా భారత్, కొరియాలుమాత్రమే కనిపిస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక వేత్త జాకబ్నెల్ వెల్లడించారు. బ్రెగ్జిట్ అనంతరం భారత్ ఒక్కటే సమర్ధవంతంగా అనిశ్చితిని ఎదురొడ్డగలదని అగ్రరాజ్యం అమెరికా ఆర్థికవేత్తలు సైతం వెల్లడించారు. సమీపభవిష్య త్తులో సావరిన్ బాండ్లు, కరెన్సీ మార్కెట్లు మరింత ఒత్తిడికి లోనవు తాయని అంచనా వేస్తున్నాయి. యూరోప్లో వెల్లువెత్తిన ఈ ప్రకం పనలను ఆసియా సమర్ధవంతంగా తట్టుకోగలదని వెల్లడయింది. బయటి ప్రాంత వాణిజ్యంపైనా, లేక ఇతరుల పై ఆధారపడే ఆర్థికవ్యవస్థలున్న దేశాలు కొంత సతమతం అవుతాయి. కొరియా, జపాన్, తైవాన్, మలేసియా, సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ వంటిదేశాలు ప్రారం భంలో ఒత్తిడికిలోనవుతాయి. భారత్, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్,చైనా, వియత్నాం వంటిదేశాలు కొంత నిలదొక్కుకుంటాయి. బ్రెగ్జిట్ తీర్పును భగవంతుని సందేశంగా భావించాల్సి ఉందని, భవిష్యత్తులో మంచి వృద్ధి ఉంటుందని శాంకో సెక్యూరిటీస్ చీఫ్ జిమీత్మోడి వెల్లడించారు. బ్రిటన్ వైదొలగడంతో ఇక అదేబాటన మరికొన్ని దేశాలు వెళుతున్నాయి. బ్రెగ్జిట్వల్ల యూరోప్ మొత్తంగా రాజకీయసమస్యలు ఎదుర్కొంటున్నదని వెల్లడయింది. భారత్పరంగా మాత్రం ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొంటామని ధీమాగా ఉన్నారు. విదేశీ కరెన్సీ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, మార్కెట్ల అనిశ్చితి, కరెన్సీ హెచ్చుతగ్గులను కట్టడిచేయగలమని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అభిషేక్ అన్నయ్యా అని పిలవొద్దన్నాడు ?
జూనియర్ బచ్చన్ అభిషేక్కి, ఆశిన్కి మధ్య ఓసారి ఓ విచిత్ర పరిస్థితి ఎదురైందట.
TNN | Updated:
Aug 20, 2015, 10:38AM IST
జూనియర్ బచ్చన్ అభిషేక్కి, ఆశిన్కి మధ్య ఓసారి ఓ విచిత్ర పరిస్థితి ఎదురైందట. రెండేళ్ల క్రితం బోల్ బచ్చన్ సినిమాలో ఆమె అభిషేక్కి చెల్లి పాత్రలో నటించింది. ఆ సినిమాలో అన్నాచెల్లెళ్ల పాత్ర కావడంతో ఆయన్ని భాయిజాన్(అన్నయ్య) అని పిలవడం ఆమెకి అలవాటయిపోయింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి కావడంతోనే అదే ఇద్దరు నటీనటులు ప్రధాన పాత్రలుగా ఆల్ ఈజ్ వెల్ సినిమా సెట్స్పైకి వెళ్లింది. ఆల్ ఈజ్ వెల్ మూవీలో అభిషేక్, ఆశిన్లు ఇద్దరూ ప్రేమికులుగా నటిస్తున్నారు.
అయితే బోల్ బచ్చన్ సినిమాతో అయిన అలవాటు ప్రకారమే ఆమె అభిషేక్ని భాయిజాన్ అని పిలవడం మొదలుపెట్టిందట. ఆశిన్ అలా పిలవడం చూసి షూటింగ్ స్పాట్లో వున్న వాళ్లంతా ఆశ్చర్యపోతూ అదేంటి అలా పిలుస్తోందంటూ ముక్కున వేలేసుకునే వాళ్లంట. ఇదంతా గమనించిన అభిషేక్ ఓ రోజు నా వద్దకొచ్చి.. తనని భాయిజాన్ అని పిలవొద్దని చెప్పాడంటోంది ఆశిన్. ఆయన అలా ఎందుకు అన్నాడో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే మేం ఆర్టిస్టులం. సినిమాల్లో చేసే పాత్రల్ని బట్టి మేం ఒకరినొకరు పిలుచుకుంటుంటాం. అక్కడ ఎలా పిలుచుకున్నా వాటితో మా వ్యక్తిగత జీవితాలకు ఏ మాత్రం సంబంధం వుండదు. కానీ చూసేవాళ్లంతా అదోలా భావిస్తుంటారు కనుకే అభిషేక్ అలా చెప్పి వుంటాడంటోంది ఆశిన్. | 0business
|
Jan 25,2019
ఏషియా గొప్ప బ్రాండ్గా డాక్టర్ కాపర్
నవతెలంగాణ, హైదరాబాద్: ఎంఎస్ఆర్ ఇండియా లిమిటెడ్ విక్రయిస్తున్న డాక్టర్ కాపర్కు అంతర్జాతీయ అవార్డు దక్కింది. 2018 ఏడాదికి గాను ఆసియా గ్రేటెస్ట్ బ్రాండ్గా గుర్తింపు లభించినట్లు ఆ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సింగపూర్లో బిజినెస్ మ్యాగిజైన్ 'ప్రైస్ వాటర్ హౌస్ కాపర్స్' నిర్వహించిన ఇండో-సింగపూర్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరమ్లో ఈ అవార్డును కంపెనీ సీఈవో డాక్టర్ ఎం. మల్లారెడ్డి అందుకున్నారు. తమ లక్ష్య సాధనలో ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు తమకు పెద్ద మైలురాయి అని మల్లారెడ్డి పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయంగా డాక్టర్ కాపర్కు గుర్తింపు రావడంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి ఇది ఒక సదావకాశమని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Visit Site
Recommended byColombia
తమ అధ్యయనంలో పేటీఎమ్, చైనా ఆన్‌లైన్ రిటెయిల్ దిగ్గజం అలీబాబా సంస్థకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని ఎస్జేఎం తెలియజేసింది. తమ పరిశీలనలోని నివేదికల ప్రకారం పేటీఎం చైనా కంపెనీలోని భాగమేనని వెల్లడైందని తెలిపింది. నగదు రహిత లావాదేవీల్లో భారతీయులకు చెందిన సమాచారం పదిలంగా ఉందని, అలాగే స్వదేశీ సంస్థల్లో విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు పారదర్శకంగా ఉండాలని స్వదేశీ జాగరణ్ మంచ్ కో-కన్వీనర్ అశ్వని మహాజన్ అన్నారు.
గత నెలలో పే‌టీఎం బోర్డ్‌ ఆఫ్ అడిషినల్ డైరెక్టర్‌గా అలీబాబా గ్రూప్ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ కే గురు గౌరప్పన్ బాధ్యతలు స్వీకరించారని ఆయన తెలిపారు. అలీబాబాకు చెందిన నొయిడాలోని అలీపే మొబైల్ పే‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్‌కు 40 శాతం వాటా పేటీఎమ్‌లో ఉన్నట్లు తాము భావిస్తున్నామని అశ్వని మహాజన్ తెలిపారు. అలీబాబా సంస్థ ఇండియాలోకి ప్రవేశించడానికి పేటీఎం ప్రథమ మార్గంగా సహకరించిదని ఆయన అన్నారు.
New Delhi: Paytm, the country's top mobile wallet provider, may have been one of the biggest gainers of the government's demonetisation drive, but the economic wing of Rashtriya Swayamsevak Sangh (RSS) is keeping a close watch on the firm's Chinese connection. Swadeshi Jagran Manch (SJM), which has been running a relentless campaign against the inflow of Chinese goods and investments in India for some time, has said it will now "study" the relationship between Paytm and Chinese online retailing giant Alibaba Group. We have seen several reports about major Chinese stake in Paytm. Now that we are going for cashless transactions, we want to ensure the data shared by Indians is safe. No Indian company should be sharing data with foreign companies and the investment routes should be made very transparent," said Ashwani Mahajan, co-convener of SJM told ET.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
sumalatha 176 Views NBFCs , rbi , surveillance
Reserve Bank of India
ముంబయి : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా బ్యాంకింగేతర వ్యవస్థను బలపరిచేందుకు తన పర్యవేక్షణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్బిఎఫ్సిలకు వాణిజ్య బ్యాంకులకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆర్బిఐ ఇకపై నిశితంగా పరిశీలించనుందని తెలుస్తోంది. ఈ జాబితాలో శ్రీరామ్ గ్రూప్కు చెందిన శ్రీరామ్ ట్రాన్స్పోర్టు ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి దిగ్గజాలున్నాయి. కాగా ఎన్బిఎఫ్సి రంగంలో 85 శాతం ఆస్తులు వీటి కిందనే ఉండగా, బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాల మొత్తం ఆస్తులలో 12 శాతం ఎన్బిఎఫ్సిలు కలిగి ఉన్నాయి. ఎన్బిఎఫ్సిలపై ఆర్బిఐ ఈ ఏడాది కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో ఆర్బిఐ అన్ని ఎన్బిఎఫ్సిలను ఒకే సారి తనిఖీ చేయనుంది.
తాజా ప్రజావాక్కు వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/editorial/ | 1entertainment
|
Bathukamma Song: మంగ్లీ బత...
దిగ్గజ ద్విచక్ర వాహన సంస్ధ 'రాయల్ ఎన్ఫీల్డ్' మరో కొత్త మోడల్ బైక్ దేశీయ మార్కెట్లోకి వచ్చింది. ప్రత్యేక ఎడిషన్ కింద 'రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్' బైక్ను గురువారం (మే 31) భారత మార్కెట్లో విడుదల చేశారు. దీని ధర రూ. 2.49 లక్షలు (ఆన్-రోడ్ (మహారాష్ట్ర)గా ఉంది. జులై 10 నుంచి ఈ బైక్ల విక్రయాలు చేపట్టనున్నారు. ఈ ప్రత్యేక ఎడిషన్ కింద కేవలం 1000 బైక్లను మాత్రమే తయారుచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. వీటిలో భారత్ విపణిలో 250 బైక్లను విక్రయించనుంది. మిగతా వాటిని యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలో అమ్మనున్నారు.
స్టాండర్డ్ క్లాసిక్ 500 బైక్ తరహాలోనే క్లాసిక్ 500 పెగాసస్ను రూపొందించారు. అయితే కొన్ని అధునాతన ఫీచర్లను జతచేశారు. ఇందులోని 499 సీసీ, ఎయిర్కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 27.2 బీహెచ్పీ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. దీని బరువు 194 కేజీలు. అంతర్జాతీయ మార్కెట్లో తమ మార్కెట్ షేరును విస్తరించడమే లక్ష్యంగా బైక్లను విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక త్వరలోనే తమిళనాడు రాజధాని చెన్నైలో రాయల్ ఎన్ఫీల్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించనున్నారు.
బైక్ గురించి మరిన్ని వివరాలు...
5-స్పీడ్ గేర్బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 27.2బిహెచ్పి పవర్, 41.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఛాసిస్, బ్రేకులు, ట్రాన్స్మిషన్, క్లచ్ మరియు టైర్లలో ఏ విధమైన మార్పులు జరగలేదు.
రాయల్ ఎన్ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్గా అందుబాటులోకి తీసుకొచ్చిన సరికొత్త 'పెగాసస్ 500' బైకులో మిలిటరీ స్టైల్లో ఉన్న క్యాన్వాస్ ప్యానీయర్ బ్యాగులు, లెథర్ పట్టీలు మరియు ఫ్యూయల్ ట్యాంక్ మీద అచ్చం ఫ్లయింగ్ ఫ్లీ బైకు మీద ఉన్నటువంటి పెగాసస్ (ఎగిరే రెక్కల గుర్రం) లోగో ఉంది.
హ్యాండిల్ బార్, హెడ్లైట్ బెజెల్, ఎగ్జాస్ట్ మఫ్లర్, ఇంజన్ మరియు రిమ్ములు వంటివి బ్లాక్ కలర్ ఫినిషింగ్లో ఉన్నాయి. మరియు అన్ని లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిళ్ల మీద ఒక క్రమ పద్దతిలో కేటాయించిన సీరియల్ నెంబర్ ఫ్యూయల్ ట్యాంక్ మీద ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లో 'రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500' ఆలివ్ డ్రాబ్ గ్రీన్, సర్వీస్ బ్రౌన్ రంగులో లభ్యంకానుంది. భారత్లో మాత్రం కేవలం సర్వీస్ బ్రౌన్ కలర్ బైక్ మాత్రమే లభ్యం కానుంది. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
తరిమెల నాగి రెడ్డి గొప్పతనంపై పవన్ కల్యాణ్ ట్వీట్స్
కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి శత జయంతిని పురస్కరించుకుని ఆయన గొప్పతనం గురించి స్మరించుకున్నారు...
| Updated:
Feb 22, 2017, 11:41AM IST
కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి శత జయంతిని పురస్కరించుకుని ఆయన గొప్పతనం గురించి స్మరించుకున్నారు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ . 1917లో ఫిబ్రవరి 11న తరిమెల నాగి రెడ్డి జన్మించారు. ఈ ఫిబ్రవరి 11తో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతడు రాసిన 'తాకట్టులో భారతదేశం' పుస్తకాన్ని పవన్ గుర్తుచేసుకున్నారు. తాను ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజుల్లో తన తండ్రి ఆ పుస్తకాన్ని ఇచ్చారని, అయితే అప్పుడు తనకి ఆయన రాతల్లోని అర్థాన్ని గ్రహించలేకపోయాను కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ఆయన రాసిన పుస్తకానికి తగినట్టుగానే వున్నాయని ట్వీట్ చేశారు పవన్. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రాహుల్ టైటిల్ గెలిచినా బాధపడిన తల్లిదండ్రులు.. కారణం ఇదే!
రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్నారు. కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా ఆయన తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారని మీడియా వర్గాల్లో వినిపిస్తోన్న మాట.
Samayam Telugu | Updated:
Nov 4, 2019, 09:10PM IST
బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచిన హైదరాబాద్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాడు. ఆదివారం రాత్రి నుంచి ఆయన తన విజయాన్ని వేడుకలా జరుపుకుంటున్నాడు. కానీ, రాహుల్ విజేతగా నిలిచినా ఆయన తల్లిదండ్రులు మాత్రం ఆనందంగా లేరట. దానికి కారణం రాహుల్ తన ఇంటికి వెళ్లకపోవడమేనని ప్రస్తుతం వినిపిస్తోన్న వార్త.
బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలేలో రాహుల్ తల్లిదండ్రులు, సోదరి పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ టైటిల్ను అందుకున్నప్పుడు ఆయన తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు. ఆ తరవాత వారు నేరుగా మెహదీపట్నంలోని ఇంటికి వెళ్లిపోయారట. అక్కడ రాహుల్కు ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారట. పువ్వులు, కేకులు, స్వీట్లు సిద్ధం చేశారట. కానీ, రాహుల్ మాత్రం అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చిన తరవాత ర్యాలీగా మెహదీపట్నంలోని ఆయన మావయ్య ఇంటికి వెళ్లిపోయారని సమాచారం. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఎన్టీఆర్ తర్వాతి చిత్రంపై అఫీషియల్ న్యూస్..
నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాతో వరుస హిట్లు కొట్టి ఊపుమీదున్న ఎన్టీఆర్ తర్వాతి సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడింది.
TNN | Updated:
Dec 9, 2016, 11:17AM IST
ఎన్టీఆర్ తర్వాతి చిత్రంపై అఫీషియల్ న్యూస్..
నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాతో వరుస హిట్లు కొట్టి ఊపుమీదున్న ఎన్టీఆర్ తర్వాతి సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. నెక్స్ట్ మూవీ బాబీ దర్వకత్వంలో ఉండనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇది ఎన్టీఆర్ కెరీర్లో 27వ సినిమా కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన వార్త అధికారికంగా బయటకొచ్చింది. ఈ మూవీని తమ సొంత బ్యానర్‌లో నిర్మించనున్నామని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. | 0business
|
lady team
దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
కొలంబో: మహిళల వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్లో భాగంగా జరిగిన సూపర్ సిక్స్ తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై భారత్ ఘన విజయం సాధిం చింది.టాస్ గెలిచి దక్షిణాఫ్రికా భారత్ను మొదట బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.టార్గెట్ చేధించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 46.4 ఓవర్ల వద్ద 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.భారత క్రీడాకారి ణులు మిథాలీ రాజ్ 64 పరుగులతో, ఓపెనర్ ఎమ్ఆర్ మిశ్రం 55 పరుగులతో హాఫ్ సెంచరీలు చేశారు.బౌలర్లు ఎస్ పాండే 4,బిస్త్ 3,శర్మ, పూన మ్యాదవ్, ఆర్ఎస్ గైక్వాడ్ ఒక్కొక్కరు ఒక వికెట్ తీసుకున్నారు. మిథాలీ రాజ్ అరుదైన ఘనత: మహిళల వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ సూపర్ సిక్స్ను చేరుకున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య కొలంబో మ్యాచ్లో భారత క్రీడాకారిణి అరుదైన ఘనతను అందుకుంది.ఈ మ్యాచ్లో 64 పరుగు లు చేసిన మిథాలీ రాజ్ 5,500 పరుగులు చేసిన రెండవ మహిళా క్రికెటర్గా అరుదైన రికార్డు నమోదు చేశారు.ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ ఎడ్వర్డ్స్ 5,992 మిథాలీ కన్నా ముందు ఉన్నారు. 2016లో అంతర్జాతీయ క్రికెట్కు ఎడ్వర్డ్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. త్వరలో ఎడ్వర్డ్స్ రికార్డును మిథాలీ బద్దలు కొట్టనుంది.’
==== | 2sports
|
sumalatha 204 Views twitter , VIRENDER SEHWAG
Virender Sehwag
హైదరాబాద్: తనకు సెలక్టర్ కావాలనుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ ట్విట్టర్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత క్రికెటర్ల నుంచి మాజీ క్రికెటర్ల వరకు తనదైన శైలిలో ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంటాడు. అయితే తాజాగా సోమవారం సెహ్వాగ్ తన ట్విట్టర్లో ‘నాకు సెలక్టర్ కావాలనుంది. కానీ అవకాశం ఇచ్చేదెవరు’ అంటూ కామెంట్ పోస్టు చేశాడు. సాధారణంగా సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఎక్కువగా సరదా సందేశాలే పెడుతుంటాడు కాబట్టి.. ఈ ట్వీట్ ఉద్దేశమేంటన్నది అతనే చెప్పాలి మరి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/business/ | 2sports
|
SAP
ఐటిసి, ఎల్అండ్టితో శాప్ ఇండియా భాగస్వామ్యం
న్యూఢిల్లీ,జూన్ 19: భారత్లో డిజిటల్ ఇండియా కార్యాచరణకు అనువుగా వచ్చే ఏడాది చివరినాటికి డిజిటల్ టెక్నాలజీస్పై 6కోట్ల మంది పౌరులను తీసుకువచ్చే లక్ష్యంతో శాప్ ఇండియా ఐటిసి, ఎల్అండ్టి పబ్లిక్ ఛారిటబుల్ట్రస్ట్తో భాగస్వా మ్యం వహించింది. శాప్ ఇండియా చేపట్టిన ఈ కార్యాచరణ కారణంగా పౌరుల్లో డిజిటల్ అక్షరాస్యత పెరుగుతుందని చెపుతున్నారు. ప్రస్తుతం భారతీయుల్లో పదిశాతం మాత్రమే డిజిటల్ అక్షరాస్యత అవగాహన కలిగి ఉన్నారని మరింతమందిని డిజిటల్వైపు నడిపించే లక్ష్యంతోనే శాప్ ఈ ఒప్పందం చేసుకున్నదని సంస్థ ప్రకటిం చింది. టెక్నాలజీ మౌలికవనరులు, కోర్సు పాఠ్యాం శాల్లో నైపుణ్యం, బోధన డెలివరీ మెకానిజం టీచర్ల ను సైతం శాప్ అందిస్తుందని ఎండి దేబ్దీప్సేన్ గుప్తా వెల్లడించారు. పరిశ్రమకు అవసరమైన అత్యా ధునిక సాఫ్ట్వేర్ నైపుణ్యాలను విస్తరిస్తామన్నారు.
ఐటిసి సామాజిక పెట్టుబడి కార్యాక్రమాలు దేశం లోని 20 రాష్ట్రాల్నోఇ 84 జిల్లాలో ప్రాచుర్యం పొందా యని శాప్తో ఐటిసి కోడ్ ఉన్నతి ప్రణాళిక మరింతలోతుగా విస్తరిస్తుందని, రాష్ట్రంలోని మారు మూలప్రాంతాల చిన్నారులకు మరింత అందుబాటు లోకి వస్తుందని ఐటిసి ప్రతినిధి డాక్టర్ ఆశీస్ అంబాస్తా వెల్లడించారు. ఇక గుజరాత్, ఎపి రాష్ట్రా లతోపాటు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోకూడా శాప్ భాగస్వామ్యంతో టెక్నాలజీ సామాజికప్రభావాన్ని మరింతపెంచుతామనిఎ ల్అండ్టి ట్రస్టు ప్రనతినిధి అశోక్ డి షాహన్ వెల్లడించారు. ఇందుకుగానుప్రతి గ్రామపంచాయితీలో ఐసిటి వాతావరణం కల్పిస్తా మని, 100కోడ్ ఉన్నతి కమ్యూనిటీసెంటర్లు సర్పం చ్లకు శిక్షణ అందించేందుకు ఏర్పాటుచేస్తామన్నా రు. ఇ-సేవలనుసమర్ధంగా వినియోగించుకునేందు కు అవగాహన కల్పిస్తామనిఎల్అండ్టి వివరించింది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సచిన్కి మరిచిపోలేని రికార్డ్ ఇదేనట..!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కెరీర్లో వంద శతకాలు బాదినా.. మరిచిపోలేని సెంచరీ 30వ టెస్టు శతకమేనట. సరిగ్గా
TNN | Updated:
Aug 23, 2017, 08:04PM IST
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కెరీర్లో వంద శతకాలు బాదినా.. మరిచిపోలేని సెంచరీ 30వ టెస్టు శతకమేనట. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం అంటే.. ఆగస్టు 23, 2002లో ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన టెస్టులో సచిన్ తెందుల్కర్ (193: 330 బంతుల్లో 19x4, 3x6) అద్భుతమైన శతకంతో చెలరేగాడు. ఈ సెంచరీతో క్రికెట్ చరిత్రలోని ఓ ఘనమైన రికార్డుని కూడా సచిన్ అందుకున్నాడు.
ఈ శతకంతో భారత్ జట్టుని గెలిపించడమే కాదు.. డాన్ బ్రాడ్మాన్ 29 టెస్టు సెంచరీల రికార్డుని కూడా సచిన్ అధిగమించాడు. కెరీర్లో ఎవర్గ్రీన్ రికార్డులు నమోదు చేసిన ఈ ఆస్ట్రేలియా దిగ్గజం రికార్డుని అధిగమించడమే తనకి కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయే విషయమని సచిన్ తాజాగా వెల్లడించాడు. ‘డాన్ బ్రాడ్మాన్కి నా గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేకమైన చోటు ఉంటుంది. ఆయన సెంచరీల రికార్డు దాటడమే నా క్రికెట్ కెరీర్లో గొప్ప మైలురాయి’ అని సచిన్ బుధవారం ట్వీట్ చేశాడు.
Sir Don Bradman will always hold a special place in my heart. This was a memorable part of my journey. https://t.co/baXNByNJYf | 2sports
|
May 07,2015
ఫోన్ 'మార్కెట్' తగ్గింది
న్యూఢిల్లీ: కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, పన్నుల విధానంలో మార్పులు, చైనా సప్లరు విధానంలో నియంత్రణ తది తరాల కారణంగా మార్చితో ముగిసిన మొదటి త్రైమా సికంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల విపణి ఏడు శాతం మేర క్షీణించి 19.5 మిలియన్లకు చేరినట్లు సైబర్ మీడియా రీసర్చ్ (సీఎంఆర్) తెలిపింది. ఫ్యూచర్ ఫోన్లతో పాటు మోబైల్ హ్యాండ్సెట్ల మార్కెట్ కూడా అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 15 శాతం మేర కుంగి 53 మిలియన్ యూనిట్లకు చేరినట్లు సీఎంఆర్ వెల్లడించింది.
కొత్త బ్రాండ్లు, కొత్త హ్యండ్సెట్లు మార్కెట్లోకి రావడం కొంత అమ్మకాలను ప్రభావితం చేసినట్లు సీఎంఆర్ అధినేత, విశ్లేషకుడు ఫైసల్ కవూసా తెలిపారు. అయితే మార్కెట్ను ఆశ్చర్యగొలిపే ఉత్పత్తులు ఏవీ మార్కెట్లోకి రాలేదని కావున్న రానున్న రోజుల్లో అమ్మకాలు మళ్లీ జోరందుకుం టాయని ఆయన అన్నారు. మొదటి త్రైమా సికంలో స్యామ్సంగ్ తమ విస్తృతిని 23.7 శాతం నుంచి 27.9 శాతానికి పెంచుకున్నట్లు సీఎంఆర్ విశ్లేషించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
"శరణం గచ్ఛామి" చిత్రానికి సెన్సార్ తిరస్కరణపై సమరానికి సై..
Highlights
బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో "శరణం గచ్ఛామి"
సెన్సార్ చేసేందుకు నిరాకరించిన సెన్సార్ బోర్డు
బోర్డుపై పోరాటానికి సై అంటున్న చిత్ర దర్శక నిర్మాతలు
అసభ్యత, అశ్లీలతలకు పెద్ద పీట వేస్తూ.. హింసను ప్రేరేపిస్తూ, యువతను పెడ దారి పట్టిస్తూ.. అత్యంత జుగుప్సాకరమైన కధ, కథనాలు, రోత పుట్టించే సన్నివేశాలతో కూడిన సినిమాలకు "క్లీన్ సర్టిఫికెట్స్" జారీ చేసే సెన్సార్ బోర్డ్.. యువతరాన్ని మేల్కొలుపుతూ.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ.. క్లీన్ ఎంటర్ టైనర్ గా.. ఎంతో నిబద్ధతతో.. నిజాయితీతో రూపొందించిన తమ "శరణం గచ్ఛామి" సినిమాకు మోకాలడ్డుతుండడం తమకు ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోందని అంటున్నారు చిత్ర నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ప్రేమ్ రాజ్.
సహేతుకమైన కారణాలు చూపకుండా.. రివైజింగ్ కమిటీకి వెళ్లమనడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. సెన్సార్ బోర్డ్ పక్షపాత ధోరణిని, ఒంటెత్తు పోకడలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
తమ వాదనలో నిజముందని.. తమకు జరుగుతున్నది కచ్చితంగా అన్యాయమేనని భావిస్తే.. మీడియా మిత్రులు తమకు చేయూతనందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వతహా ఎన్. ఆర్.ఐ అయిన బొమ్మకు మురళి.. ఈ చిత్రానికి తనే స్వయంగా కథ-స్క్రీన్ ప్లే అందించారు.
నవీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కాశీ విశ్వనాధ్, సుధ, సత్యకృష్ణ, దేశపతి శ్రీనివాస్, సుబ్బారాయశర్మ, మరియు బి.సి. సంఘ నాయకులు-శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి.. సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సామి, ఎడిటింగ్: సత్య గిడుతూరి, సంగీతం: రవి కళ్యాణ్, సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ-జర్నలిస్ట్ సతీష్ చంద్ర, సమర్పణ: బొమ్మకు హిమమాల మురళి, స్టోరీ-స్క్రీన్ ప్లే- ప్రొడ్యూసర్: బొమ్మకు మురళి, డైలాగ్స్ & డైరెక్షన్: ప్రేమ్ రాజ్ !! | 0business
|
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
Selvi| Last Updated: బుధవారం, 23 జులై 2014 (10:46 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో బుధవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.275 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.15గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.279, విశాఖపట్నంలో రూ.300, విజయవాడ రూ.280, చిత్తూరులో రూ.318, ఉభయగోదావరి మార్కెట్లో రూ.280 రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.325 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్లో రూ.290 రూపాయలుగా పలుకుతోంది.
సంబంధిత వార్తలు | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
టెస్టు ర్యాంకింగ్స్లో కోహ్లీనే నెం.1.. పుజారా 3
బౌలర్ల ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ 849 పాయింట్లతో అగ్రస్థానాన్ని చేజార్చుకోగా.. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ 878 పాయింట్లతో నెం.1 స్థానానికి ఎగబాకాడు. 2006 తర్వాత ఓ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.
Samayam Telugu | Updated:
Feb 17, 2019, 06:54PM IST
హైలైట్స్
టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లి
13ఏళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా బౌలర్కి నెం.1 ర్యాంక్
ఆల్రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజాకి టాప్-5లో చోటు
ప్రపంచకప్ నేపథ్యంలో.. జూలై వరకూ టెస్టులకి దూరంగా భారత్
భారత్ జట్టు గత కొద్దిరోజులుగా టెస్టు మ్యాచ్లు ఆడనప్పటికీ ర్యాంకింగ్స్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగలిగాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) ఈరోజు ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో 922 పాయింట్లతో విరాట్ కోహ్లీ నెం.1 స్థానంలో నిలవగా.. చతేశ్వర్ పుజారా 881 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 897 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. జూలై వరకూ భారత్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం లేకపోగా.. టీమిండియా నుంచి కోహ్లీ, పుజారా మాత్రమే టాప్-10లో కొనసాగుతున్నారు.
ర్యాంకింగ్స్లో ఈరోజు గణనీయమైన మార్పు అంటే.. శ్రీలంక తాజా సంచలనం కుశాల్. దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన టెస్టు మ్యాచ్లో ఓటమి దిశగా వెళ్తున్న శ్రీలంక జట్టుని పెరీరా (153 నాటౌట్: 200 బంతుల్లో 12x4, 5x6) అసాధారణ శతకంతో ఒంటిచేత్తో గెలిపించాడు. దీంతో.. ఏకంగా 58 స్థానాలు ఎగబాకిన పెరీరా.. 40వ స్థానంలో నిలిచాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ 849 పాయింట్లతో అగ్రస్థానాన్ని చేజార్చుకోగా.. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ 878 పాయింట్లతో నెం.1 స్థానానికి ఎగబాకాడు. 2006 తర్వాత ఓ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. అప్పట్లో మెక్గ్రాత్ ఈ నెం.1 ర్యాంక్ అందుకున్నాడు. ఆల్రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. | 2sports
|
రామ్ చరణ్ తో డేటింగ్ చేయాలనుంది,కానీ నాకు పెళ్లైంది-అనసూయ
Highlights
రామ్ చరణ్ తో డేటింగ్ చేయాలనుంది,కానీ నాకు పెళ్లైంది-అనసూయ
రామ్చరణ్, సమంత జంటగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎం(మోహన్) నిర్మించిన చిత్రం `రంగస్థలం`. మార్చి 30న సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ను సోమవారం హైదరాబాద్లో నిర్వహించింది. ఈ సందర్బంగా...
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ మాట్లాడుతూ - ``సుకుమార్కి థాంక్స్. మమ్మల్ని నమ్మి తను ఓ క్రేజీ మిషన్ను మా భుజాలపై పెట్టాడు. తన మిషన్ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థాంక్స్. సాధారణంగా మమ్మల్ని చాలా మంది `మీరు ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు ఒప్పుకుంటారా?` అని అడుగుతుంటారు. లేదండి.. నేనెప్పుడూ ఫ్యాన్స్ను దృష్టిలోపెట్టుకుని సినిమాలు ఒప్పుకోలేదు. సుకుమార్గారు చెప్పిన కథ ముందు నాకు నచ్చాలి. అలా నచ్చితే అందరికీ నచ్చతుంది. అందరూ గర్వపడే సినిమా చేయాలనే కథ వింటాం. సినిమా సక్సెస్లో అసోసియేట్ అయిన ప్రతి ఒకరికీ థాంక్స్. ఇలాంటి సక్సెస్ ఇండస్ట్రీకి ఎంతో అవసరం. సమ్మర్కి రాబోయే మరో రెండు సినిమాలు కూడా పెద్ద సక్సెస్ కావాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంటే నాకు ఎంతోఇష్టం. ఎందుకంటే వారు ఈ సినిమా రంగంలో వచ్చే ప్రతి రూపాయిని మళ్లీ నెక్ట్స్ సినిమాపైనే పెడతారు. వాళ్లందరూ హ్యాపీగా ఉండాలి. సపోర్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్`` అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ - ``ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు చిట్టిబాబు క్యారెక్టర్ను చాలా ప్రేమించాను. ఓ మగాడిగా మరో మగాడు ముద్దొచ్చాడు. అలాగే ఈ ప్రెసిడెంట్ను చిట్టిబాబు చంపేయాలనేంతగా చిట్టిబాబు క్యారెక్టర్ను ప్రేమించాను. `ఈ నా కొడుకును ఎప్పుడు చంపుతాడు చిట్టిబాబు` అని నాకే అనిపించింది. ఇప్పుడు ఆడియెన్స్లో కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. నాకు లెజెండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఓ లీప్ అయితే.. ఈ రంగస్థలంతో మరో లీప్ వచ్చింది. ఇది సుకుమార్ ఇచ్చిన ఇంకో లైఫ్. నేను మాస్ చేయగలను. ఊరగా కూడా కనపడగలను అని అంటే ఎవరూ గమనించలేదు. ఒక సుక్కునే గమనించాడు. ప్రేక్షకులు కూడా చక్కగా స్వీకరించారు. సుక్కు దర్శకత్వంలో చేసేటప్పుడు తన ముఖంలో గ్లో వచ్చే వరకు నేను నటిస్తాను. లేకుంటే.. నాకే బాధగా ఉంటుంది. సుక్కు ఈ సినిమా కోసం రెండు మూడు క్లోజ్ల కోసం నన్ను రాజమండ్రికి పిలిపించారు. నేను షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని వెళితే .. కొందరు అంత అవసరమాఅన్నారు.. సుక్కు ఒక్క క్లోజ్ పెట్టినా అందులో చాలా ఉంటుందని అన్నాను`` అన్నారు.
దిల్రాజు మాట్లాడుతూ - ``మూడు రోజుల్లో ఎంత కలెక్షన్స్ అయితే వచ్చాయో.. నాలుగు రోజు సోమవారం కూడా అంతే కలెక్షన్స్ రావడం సినిమా బ్లాక్ బస్టర్ అనడానికి పెద్ద నిదర్శనం. ఆర్య తర్వాత సుక్కు సినిమా పూర్తిగా నచ్చిన సినిమా ఇది. సుక్కు కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. స్టార్ హీరో కొత్తగా ట్రై చేసినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరేలా ఉంటుంది. అది ధృవ సినిమాకు.. అలాగే ఈ సినిమాకు కూడా వర్కువట్ అయ్యింది. మంచి అప్రిసియేషనే కాదు.. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నిర్మాతలు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. సుకుమార్ ఒక సంవత్సరం పెట్టిన కష్టం. అందరి ముఖాల్లోనూ కనపడతుంది. మగధీరను కూడా ఈ సినిమా క్రాస్ చేయబోతుంది. టీం అంతటికీ కంగ్రాట్స్`` అన్నారు.
నవీన్ ఎర్నేని మాట్లాడుతూ - ``రంగస్థలం వంటి సినిమా చేసే అవకాశం ఇచ్చిన చరణ్గారికి థాంక్స్. సాధారణంగా ఓ సినిమాలో హీరోకు పెర్ఫామెన్స్ చేయడానికి అరగంటో, గంటో ఆస్కారం ఉంటుంది. స్టార్టింగ్ షాట్నుండి ఎండింగ్ వరకు మూడు గంటల పాటు చరణ్గారికి పెర్ఫామెన్స్ సూపర్బ్. నేనే కాదు.. ఇది అందరూ చెబతున్న మాటే. చరణ్గారి కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని అందరూ నమ్ముతున్నాం. ఆల్ టైమ్ హిట్ ఇచ్చిన సుకుమార్గారికి థాంక్స్. సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుందని.. ఇంకేదో అవుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందే సెఫ్టీ ప్రాజెక్ట్. సుకుమార్గారితో మా ట్రావెల్ ఎంతో కంఫర్ట్గా అనిపించింది. ఫస్ట్ షెడ్యూల్ కాగానే మరో సినిమా చేయమని సుకుమార్గారితో కమిట్ అయ్యామంటే మా జర్నీ ఎంత బాగా సాగిందో అర్థం చేసుకోవాలి. రత్నవేలుగారు గ్రేట్ జాబ్ చేశారు. సినిమా కోసం ఎంతోఇన్వాల్వ్ అయ్యారు. ఆర్ట్డైరెక్టర్ రామకృష్ణ, మోనికగారు, చంద్రబోస్గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అన్ని సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యాయి. దేవిశ్రీతో మంచి రిలేషన్ ఉంది. మా మూడు సినిమాలకు ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చాను. జగపతిబాబుగారు నటన చూసి ఫోన్ చేసి ఆయన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫామెన్స్అని చెప్పాను. అనసూయ, ఆదిపినిశెట్టి, ప్రకాశ్రాజ్గారు అందరూ అద్భుతంగా నటించారు. సినిమా రిలీజ్ తర్వాత మూడు రోజులు చాలా హ్యాపీగా అనిపించింది. నా జీవితంలో నా సంతోషపడ్డ సమయంగా భావిస్తున్నాను. డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతుంటే వారు చెబుతున్న కలెక్షన్స్ విని ఆనందంగా అనిపిస్తుది. బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ఇదే టాప్ గ్రాసర్ అవుతుంది. ఖైదీని కూడా చరణ్గారు దాటేస్తారు. చాలా ఎగ్జయిటింగ్ అనిపిస్తుంది. ఇంత బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చరణ్, సుకుమార్గారికి థాంక్స్`` అన్నారు.
సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ - ``సినిమా హిట్ మామూలుగా ఉంటుంది. కానీ సూపర్ డూపర్ హిట్ అనేది చాలా అరుదుగా వస్తుంటుంది. 20 ఏళ్ల క్రితం సేతు అనే సినిమాకు అప్రిసియేషన్స్తో పాటు కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు రంగస్థలం కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది. సుకుమార్, నిర్మాతలకు థాంక్స్. చరణ్ వన్ టేక్. నేచురల్ పెర్ఫామర్`` అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ - `` ఇంత మంచి రెస్పాన్స్ రావడం కొత్తగా ఉంది. నాకు,చరణ్కు కామన్ ఫ్రెండ్ రంగ. అతని ద్వారా నాన్నకు ప్రేమతో సమయంలో చరణ్ని కలిశాను. తను నా మైండ్లోఉండిపోయాడమో.. కాబట్టి ఈ సినిమాకు రంగస్థలం అనే టైటిల్ను పెట్టుకున్నాను. ఈ సందర్భంగా మామిత్రడు రంగకు థాంక్స్. `నాన్నకు ప్రేమతో తర్వాత జగపతిబాబుగారు సెక్సీగా ఉన్నారు` అని చాలా మంది అన్నారు. తర్వాత రంగస్థలం సినిమా చూసిన తర్వాత కూడా అలాగే అంటున్నారు. ఆయన ఏ రూపంలో ఉన్నా బంగారమే. ఆయనతోనే ప్రేమలోపడిపోయాను. ఆయనతో ప్రతి సినిమా చేయాలనుకుంటున్నాను. చంద్రబోస్గారి సాహిత్యం.. ఎంత సక్కగున్నావే అనే పాటను అందరూ ఎంతో పొగుడుతున్నారు. ఆ పాటను కేవలం 20 నిమిషాల్లో ఇచ్చారు. రామకృష్ణ ఆర్ట్ డైరెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నవీన్ నూలి ఎడిటింగ్.. గురించి చెప్పాలంటే.. తను ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఉండిపోయే ఎడిటర్. తను అన్నీ డిపార్ట్ మెంట్స్పై అవగాహన ఉంది. రత్నవేలుగారు సినిమాటోగ్రఫీతో అందంగా పెయింటింగ్ వేస్తారు. ఏ క్యారెక్టర్ను ఎలా చూపించాలని.. ప్రతి ఫ్రేమ్ను అందంగా రాసే రైటర్ అని చెప్పొచ్చు. తను ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అని చెప్పగలను. స్పాంటేనియస్గా వర్క్ చేసి అద్బుతమైన అవుట్పుట్ ఇచ్చే టెక్నీషియన్. దేవి నా ఆత్మ. తను లేకపోతే నేను లేను. నా ఆత్మకు రూపముంటే అది దేవినే. మా మధ్య వ్యక్తిగత సానిహిత్యం కూడా ఉంది. రంగమ్మత్తను సెట్స్లో ఎంత బాధ పెట్టినా.. తను మాత్రం పెర్ఫామెన్స్తో మెప్పించింది. ఈ పాత్రను ఎంచుకోవడంలో నేను చాలా కన్ఫ్యూజన్ అయ్యాను. చివరకు అనసూయను ఎంచుకున్నాను. అనసూయ తన పాత్రకు ఎంతో న్యాయం చేసింది. హీరోయిన్కు మ్యారేజ్ అయితే సినిమాలను ఆడియెన్స్ చూడరని అందరూ అంటుంటారు. కానీ సమంత విషయంలో అలా జరగలేదు. రూల్స్ను బ్రేక్ చేసిన సినిమా ఇది. ఆది పినిశెట్టి ఆమేజింగ్ ఆర్టిస్ట్. కుమార్ బాబు క్యారెక్టర్లో అద్భుతంగా చేశాడు. చిట్టిబాబు కంటే కుమార్బాబు క్యారెక్టర్నే ఇష్టపడ్డాను. మైత్రీ మూవీస్ బ్యానర్లో ఖర్చు గురించి ఎక్కడా డిస్కషన్ రాలేదు. సినిమా చేసే క్రమంలోనేను ఎక్కడా తప్పులు చేస్తున్నానో అర్థమైంది. నిర్మాతలు ముగ్గురు బోళా శంకరులు. వారికి మూడు బ్లాక్బస్టర్ రావడానికి కారణం వారి మంచి మనసు. సినిమాపై వారికున్న ప్రేమ. చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిట్టిబాబు క్యారెక్టర్లో నేను ఎవరినీ ఊహించలేదు. అలాంటి క్యారెక్టర్ను ఒప్పుకోవడం దారుణం.. సాహసం. తను చేయలేకపోతే.. నేను ఏమీ చేయలేను. వినగానే కొత్తగా ఉంటుందని నమ్మి క్యారెక్టర్ను ఓన్ చేసుకుని చేశాడు. డీ గ్లామరైజ్డ్క్యారెక్టర్ను ఇష్టపడి చేశాడు. ఈ క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో అనసూయ రామ్ చరణ్ నా ఫేవరెట్ కో స్టార్. సుకుమార్ సార్ నారోల్ గురించి చెప్పినపుడు అతడితో రంగమ్మత్త అని పిలిపించుకోలేను, నన్ను చరణ్ అత్త అని పిలిస్తే ఒప్పుకోను, అదే సమయంలో అతడిని అల్లుడు అని అస్సలు పిలవలేను అని చెప్పాను. కానీ ఈ రోజు రంగమ్మత్త అనే పిలుపంత వినసొంపైన పదం లేదని నాకు అనిపిస్తోంది. రంగస్థలం లాంటి ప్రాజెక్ట్ నాకు ఒక గొప్ప అచీవ్మెంటు లాంటిది..సుక్కూ సార్ మా రంగస్థల బ్రహ్మ. మీకు చాలా సార్లు నేను నస పెట్టాను. మా చిట్టిబాబుపై కూడా ప్రతి సారి గొనుగుతూ వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని అనసూయ అన్నారు. ఇక రామ్ చరణ్ ఫుల్ సపోర్ట్ చేశారన్నారు. తనకు పెళ్లి కాకుంటే రామ్ చరణ్ తో డేటింగ్ చేయాలని వుందని ఇటీవలే ఓ టీవీషోలో కూడా అన్నారు అనసూయ.
ఈ కార్యక్రమంలో ఎడిటర్ నవీన్ నూలి,ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక, నిర్మాత సి.వి.ఎం తదితరులు పాల్గొన్నారు.
Last Updated 2, Apr 2018, 6:45 PM IST | 0business
|
Rajani's kapali movie is copy of "Taken"
హాలీవుడ్ ‘టేకెన్’... రజనీ ‘కబలి’ ఒకటేనా?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కబలి’.
TNN | Updated:
Nov 7, 2015, 12:51PM IST
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కబలి’. దీనిపై చాలా అంచనాలే ఉన్నాయి సినీ జనాలకు . అయితే కపాలి కథ... హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన టేకెన్ కథ ఒకటేనని సమాచారం. కబలి కూడా కాపీనా అని కోలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు. కబలి సినిమాలో వయసైన పాత్ర చేస్తున్నాడు. ఒకప్పుడు పెద్ద డాన్ గా పనిచేసిన వ్యక్తి అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అలాంటప్పుడు అతని కూతురు కిడ్నాప్ అవుతుంది. మళ్లీ ఆమెను కాపాడుకోవడానికి తిరిగి డాన్ గా మారతాడు. ఈ లైన్ తోనే సాగుతుంది కబలి కథ. టేకెన్ కథ కూడా ఇంచుమించు ఇలా సాగుతుంది... ప్రాణానికి ప్రాణమైన కూతురిని కాపాడుకునేందుకు ఇంటెలిజెన్స్ రిటైర్డ్ ఉద్యోగి అయిన ఓ వృద్ధ తండ్రి చేసే సాహసంతోనే కథ సాగుతుంది. అయితే టెకెన్ లో యాక్షన్ సీన్ లు చాలా ఎక్కువ. మరి కపాలిలో ముసలి తనంలో రజనీ యాక్షన్ సీన్లను బాగా చేయగలడా? అతని శరీరం సహకరిస్తుందా... సినిమా వచ్చాక విషయం తెలిసేది. | 0business
|
జీవీకే చేతికి రూ.16,000 కోట్ల ప్రాజెక్టు!
- సంస్థ ఖాతాలోకి నవీ ముంబయి విమానాశ్రయ పనులు
ముంబయి: జీవీకే సంస్థ ప్రతిష్టాత్మకమైన మరో ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ముంబయిలో నిర్మించ తలపెట్టిన రెండో విమానాశ్రయ పనులను జీవీకే ఆధీనంలోని 'ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' (ఎంఐఏఎల్) సంస్థ చేజిక్కించుకుంది. నవీ ముంబయిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు విలువ రూ.16,000 కోట్లు. ఈ పనులను చేజిక్కించుకొనేందుకు ప్రత్యర్థి సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రా నుంచి తీవ్ర పోటీని ఎందర్కొంది. తుది రౌండ్లో మెరుగైన రెవెన్యూ షేరింగ్ ఇచ్చేందుకు సంస్థ మొగ్గు చూపడంతో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు జీవీకే పరమైయ్యాయి. ఫైనాన్షియల్ బిడ్స్లో విమానాశ్రయం నుంచి వచ్చే రెవెన్యూలో దాదాపు 12.60 శాతం ఆదాయాన్ని 'సిటీ అండ్ ఇండిస్టియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్'తో (సీఐడీసీవో) పంచుకొనేందుకు జీవీకే సిద్ధపడింది. ఈ పనుల కోసం పోటీపడిన మరో సంస్థ జీఎంఆర్ 10.44 శాతం రెవెన్యూ షేరింగ్కు మాత్రమే ముందుకు వచ్చినట్టు సమాచారం. దీంతో నవీ ముంబయి విమానాశ్రయం పనులు జీవీకేకు అప్పగించనున్నట్టుగా సీఐడీసీవో తెలిపింది. జీవీకే ఇప్పటికే ముంబయి, బెంగళూరు ఎయిర్పోర్టులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముంబయిలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం చాలా ఇరుకుగా తయారవడంతో పాటు.. పలు ఇతర ఇబ్బందుల కారణంగా ముంబయి పరిసరాలలో మరో విమానాశ్రయాన్ని నిర్మించాలని సర్కారు 2007లో నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు పర్యావరణ పరంగా, భూసేకరణ విషయంలోనూ పలు ఆటంకాలు ఏర్పడిన నేపథ్యంలో ప్రాజెక్ట్ వాయిదాపడుతూ వచ్చింది. 'సిటీ అండ్ ఇండిస్టియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్'తో (సీఐడీసీవో) సుదీర్ఘ ప్రయత్నాల తరవాత ఈ ప్రాజెక్టుకు ఇటీవల కొంత మార్గం సుగమమైంది. దాదాపు 2,867 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించనున్నారు. 5,23,000 చ.అడుగుల విస్తీర్ణంలో టెర్మినల్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టునకు అనుమతులు లభించడంలో దీర్ఘకాలం పట్టడంతో నవీ ముంబయి ఎయిర్పోర్ట్ పనులకు చాలా సంస్థలు ఆసక్తి చూపలేదు. అయితే సీఐడీసీవో బిడ్ నిబంధనలను మార్చడంతో తుదకు నాలుగు కంపెనీలు పోటీ పడ్డాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
bse
ఆటోమొబైల్ అమ్మకాలు, ఆర్జియో ఒత్తిళ్లు
ముంబై, డిసెంబరు 2: వారంలో ముగింపు రోజైన శుక్రవారం మార్కెట్లు దిగువస్థాయిలోనే ట్రేడింగ్ ముగించాయి. బెంచ్ మార్క్ సూచీలన్నీ క్షీణించాయి. ఆటోరంగసూచి నెలవారీ విక్రయాల్లో తగ్గుదల నమోదుచేసింది. టెలికాం కంపెనీలు ఆర్జియో ఉచిత ఆఫర్ పొడిగింపుతో ఒక్కసారిగా దెబ్బతిన్నా యి. ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్ఆర్కామ్ సంస్థలషేర్లు క్షీణించాయి. అమెరికా నెలావారీ ఉపా ధి గణాంకాలు ఇటలీరాజ్యాంగంపై రిఫరెండమ్, ఆర్బిఐ పాలసీ సమీక్ష వంటివి ఎక్కువప్రభావం చూపించాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 26,230 పాయిం ట్లవద్ద ముగిసింది.
329 పాయింట్లు దిగజారింది. నిఫ్టీ 50సూచి 106 పాయింట్ల దిగువన 8086 పాయింట్లవద్ద స్థిరపడింది. మార్కెట్లపరంగాచూస్తే 1779 కంపెనీలు క్షీణించాయి. 884కంపెనీలు మాత్రమే స్వల్పలాభాలతో ముగిసాయి. 128 కంపె నీల్లో మాత్రం ఎటువంటి మార్పులేదు. పెద్దనోట్ల ప్రభావంతో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేం దుకుగాను మార్కెట్స్థిరీకరణ నిధికింద ఆర్బిఐ పరిమితిని ఆరులక్షల కోట్లకు పెంచింది. ఇప్పటి వరకూ ఉన్న 30 వేల కోట్లనుంచి అదనపునగదును అందుబాటులోనికి తెచ్చేందుకు ఈ సౌలభ్యం అమలుచేసింది. అంతేకాకుండా రిజర్వుబ్యాంకు వాణిజ్యబ్యాంకర్లను కూడా తమ సిఆర్ఆర్ నిష్పత్తిని 100శాతం కొనసాగించాలని సూచించింది. బిఎస్ఇ వినియోగరంగ ఉత్పత్తులసూచి రెండుశాతం క్షీణిం చింది. టైటాన్, విర్ల్పూల్ సంస్థలు ఐదుశాతం చొప్పున ముగిసాయి. ఆటోరంగ షేర్లు క్షీణించాయి. నెలవారీ విక్రయాల్లో క్షీణత కారణంగా నష్టాలు చవిచూసాయి. మహీంద్ర, ఒకటిశాతం, టివిఎస్ 2.64శాతం, టాటామోటార్స్ మూడుశాతం క్షీణిం చాయి.
టెలికాం కంపెనీలు ఆర్జియో ఉచిత ఆఫర్ పొడిగింపుపై భారీగా దెబ్బతిన్నాయి. ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు రెండుశాతం వరకూ ఇంట్రాడే డీల్స్లో నష్టాలు చవిచూశాయి. బ్యాంకింగ్ రంగ పరంగాచూస్తే వచ్చేవారం ఆర్బిఐ నిర్వహించనున్న సమీక్షపైనే దృష్టిపడింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ ఒకటి శాతం దిగజారింది. పెయింట్ కంపెనీలు వరుసగా రెండో ట్రేడింగ్లో ఒత్తిడికి లోనయ్యాయి. ముడి చమురు ధరలపరంగా అంతర్జాతీయ మార్కెట్లో ర్యాలీకి అనుగుణంగా నేదేశీయ ధరలు నడిచాయి. ఏసియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ ఇండియా, షాలిమార్ పెయిం ట్స్, కన్సా§్ు నెరొలాక్ సంస్థలు రెండు శాతం, నుంచి నాలుగుశాతంవరకూ నష్ట పోయాయి. గడచిన రెండుట్రేడింగ్లలో ఏసియన్ పెయింట్స్, షాలిమార్ పెయింట్స్ ఆరుశాతం చొప్పున నష్టపోయాయి.
అమెరికా వ్యవసాయేతర రంగంలో ఉపాధి 1.75 లక్షలుగా గతనెలలో నమో దయింది. అక్టోబరులో 1.61 లక్షలుగా ఉన్నట్లు ఆర్థికవేత్తలు చెపుతున్నారు. ఇక ఇన్వెస్టర్లు ఇటలీ రాజ్యాంగ రిఫరెండమ్ ఆదేశ ప్రధాని మాట్టెయో రెంజి కొనసాగుతారా లేదా అన్నది స్పష్టం అవు తోంది. వ్యతిరేకఅభిప్రనాయంవస్తే మార్కెట్లు కుప్ప కూలే ప్రమాదం ఉంది. ఆదేశం బ్యాంకు షేర్లన్నీ దెబ్బతింటాయి. బాండ్ల రాబడులు పెరుగుతాయి. యూరో మరింతగా క్షీణిస్తుంది. ఇటలీమార్కెట్లలో షేర్లు మూడువారాల గరిష్టంగాపెరిగాయి. ఆస్ట్రేలి యాలో అధ్యక్ష ఎన్నిక, ఇటలీలో రాజ్యాంగ రిఫ రెండమ్ రెండూ కీలకం అయ్యాయి.
యూరోపి యన్ వ్యాప్తంగా సూచించే యూరోస్టాక్స్600 సూచి 0.3శాతం దిగజారింది. మిలన్ బ్లూచిప్ సూచి ఏమాత్రం వృద్ధి కనిపించలేదు. ఆసియా మార్కెట్లు అమెరికా వడ్డీరేట్ల పెంపుదల ఆధారంగా నడిచాయి. బాండ్లు ట్రెజరీ రాబడులు పదేళ్ల గరిష్టస్థాయికి చేరాయి. 18నెలల గరిష్ట స్థాయికి పెరిగాయి. చైనా షాంఘై కాంపోజిట్ 0.90 శాతం, హాంకాంగ్ హ్యాంగ్సెంగ్, సూచీ 1.37శాతం క్షీణించింది. జపాన్నిక్కీ 0.47శాతం దిగజారింది. | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
వారెవ్వా.. కోహ్లి ఒక్కడికే ఆ ఘనత!
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2019 టోర్నీలో ప్రస్తుతం భారత్ జట్టు ఆడుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో టీమ్ ఇండియా తర్వాతి మ్యాచ్ ఆడనుంది.
Samayam Telugu | Updated:
Jun 14, 2019, 02:13PM IST
హైలైట్స్
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో చోటు
భారత్ నుంచి స్థానం దక్కించుకున్న ఒకే ఒక ఆటగాడు ఈయనే
జాబితాలో తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్న మెస్సీ
ఫోర్బ్స్ మేగజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలని పాపులర్ బిజినెస్ మేగజైన్ ఇది. ఫోర్బ్స్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి కేవలం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మాత్రమే స్థానం దక్కించుకున్నారు.
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అయిన కోహ్లి 100వ స్థానంలో నిలిచారు. ఈయన ఆదాయం గత 12 నెలల్లో 25 మిలియన్ డాలర్లు. ఇందులో 21 మిలియన్ డాలర్లు ఎండోర్స్మెంట్స్ రూపంలో ఆర్జిస్తే, మిగతా 4 మిలియన్ డాలర్లు వేతనం/విన్నింగ్స్ రూపంలో ఆర్జించారు. | 1entertainment
|
Hyderabad, First Published 7, Sep 2018, 4:24 PM IST
Highlights
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ చివరిదశకు చేరుకుంటోంది. తాజాగా హౌస్ మేట్స్ కి 'టికెట్ టు ఫినాలే' అనే టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టికెట్ సంపాదించుకోవడానికి కార్ టాస్క్ ఒకటి ఇచ్చారు
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ చివరిదశకు చేరుకుంటోంది. తాజాగా హౌస్ మేట్స్ కి 'టికెట్ టు ఫినాలే' అనే టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టికెట్ సంపాదించుకోవడానికి కార్ టాస్క్ ఒకటి ఇచ్చారు. ఈ టాస్క్ లో గెలిచే వారిని ఎలిమినేషన్ నుండి మినహాయింపు కల్పిస్తూ ఫినాలేకి వెళ్లే ఛాన్స్ కల్పించనున్నారు.
ఇక మొదటి నుండి షోలో సినిమాలను ప్రమోట్ చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా 'మను' సినిమా హీరో, హీరోయిన్లు రాజా గౌతమ్, చాందిని చౌదరిలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. వీరితో హౌస్ మేట్స్ ఎంతో సరదాగా మాట్లాడుతున్న ప్రోమోని విడుదల చేశారు.
హీరోయిన్ చాందిని బయట ఎప్పుడూ చేయలేనిది ఇక్కడకి వచ్చి మీరేం చేశారని ప్రశ్నించగా దానికి సమాధానంగా ఒక్కొక్కరూ ఫన్నీగా సమాధానాలు చెప్పారు. ఇక హీరో రాజా గౌతమ్ అందరూ చాలా బాగా ఆడుతున్నారని హౌస్ మేట్స్ ని పొగిడారు. ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రి టెలికాస్ట్ కానుంది. | 0business
|
sumalatha 123 Views bse , NSE , stock market
Sensex
ముంబయి: నిన్న భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు ఈరోజు కాస్త పుంజుకొని లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9.41గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ 106 పాయింట్లు లాభపడి 37,064 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ 33 పాయింట్లు ఎగబాకి 10,959 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.92 వద్ద కొనసాగుతోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/telengana/ | 1entertainment
|
దిలీప్ పై హీరోయిన్ల వార్: వెనక్కి తగ్గిన హీరో
Highlights
మలయాళ నటి లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న హీరో దిలీప్ ఇటీవల బెయిల్ పై బయటకు
మలయాళ నటి లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న హీరో దిలీప్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు. దీంతో అప్పటివరకు ఆయనపై నిషేధాన్ని ప్రకటించిన అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) దాన్ని ఎత్తివేస్తూ అతడికి తిరిగి సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో హీరోయిన్లందరూ ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితురాలితో పాటు రమ్య నంబీసన్, రిమా కలింగల్, గీత్ మోహన్ దాస్ లు అమ్మకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఎమర్జన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ తరఫున నటి రేవతి, పార్వతీ మీనన్, పద్మప్రియలు ఈ నిర్ణయంపై పునారాలోచన చేయాలని కోరారు. ఈ సంఘటన పట్ల అసహనంతో ఉన్న దిలీప్ తాను అమ్మ సభ్యత్వాన్ని స్వీకరించడం లేదని తేల్చి చెప్పారు. తాను నిర్దోషిగా నిరూపించుకున్న తరువాతే అమ్మలో సభ్యత్వం తీసుకుంటానని అన్నారు. | 0business
|
Hyderabad, First Published 6, Sep 2019, 12:45 PM IST
Highlights
ఫెమస్ నవలారచయిత కల్కీ రాసిన 'పొన్నియన్ సెల్వన్' అనే హిస్టారికల్ నవల ఆధారంగా మణిరత్నం సినిమాను తెరక్కేక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 800కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే సినిమాకు సంబందించిన స్పెషల్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఫెమస్ నవలారచయిత కల్కీ రాసిన 'పొన్నియన్ సెల్వన్' అనే హిస్టారికల్ నవల ఆధారంగా మణిరత్నం సినిమాను తెరక్కేక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 800కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే సినిమాకు సంబందించిన స్పెషల్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సినిమాలో మొత్తం 12పాటలు ఉంటాయట. ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ ఈ హిస్టారికల్ ఫిల్మ్ కి సంగీతం అందించనున్నారు. సినిమా కోసం కొత్త తరహా మ్యూజిక్ ని కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా డిఫరెంట్ గా క్లాసిక్ స్టైల్ లో ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ బిగ్ ప్రాజెక్ట్ లో సౌత్ - నార్త్ కి సంబందించిన స్టార్ నటీనటులను మణిరత్నం సెలెక్ట్ చేసుకున్నారు
ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్' ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఎండింగ్ లో చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టనుంది. ఈ సినిమాలో కార్తీ - జయంరవి - అమితాబ్ బచ్చన్ అలాగే ఐశ్వర్య రాయ్ - కీర్తి సురేష్ - అమలాపాల్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.
Last Updated 6, Sep 2019, 12:45 PM IST | 0business
|
అంతర్జాతీయ అంచనాలతో ఆవిరైన ఉత్సాహం
- బేర్మన్న బ్యాంకింగ్ షేర్లు
- భారీగా పతనమైన మార్కెట్లు
- 516 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబయి: అంచనాల మేరకే ఆర్బీఐ పరపతి విధానం ఉండడం.. ప్రతికూల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ పతనాన్ని నమోదు చేశాయి. అమెరికా, జర్మనీలు వెల్లడించిన బలహీనమైన ఆర్థిక గణాంకాలను ఉఠంకిస్తూ ఐఎంఎఫ్ అధినేత్రి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గొప్ప ప్రమాదం పొంచి ఉందంటూ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీనికి తోడు చమురు ధరలు మరింత కుంగడం కూడా మదుపరులలో బలహీనతను పెంచింది. ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందనకు తోడు ఐరోపా మార్కెట్లు నష్టాలలో ప్రారంభం కావడం కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో ఆర్బీఐ కల్పించిన ఊత్సాహం ఆవిరైంది. ఫలితంగా మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 516.06 పాయింట్లు కోల్పోయి 24,883.59 పాయింట్లకు క్షీణించింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 155.6 పాయింట్లు నష్టపోయి 7,603.20 వద్ద నమోదయ్యింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేటును పావు శాతం తగ్గించినప్పటికీ స్టాక్ మార్కెట్లకు జోష్ను ఇవ్వలేకపోయింది. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో గత రెండు మాసాల్లో ఎప్పుడూ లేని విధంగా మంగళవారం ఒకే రోజు మార్కెట్లు 2 శాతం వరకు పతనమవడంతో ఇన్వెస్టర్లు రూ.1.64 లక్షల కోట్ల మదుపు విలువను కోల్పోయారు. ఆర్బీఐ పరపతి సమీక్ష నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు సూచీ అత్యధికంగా 5.45 శాతం విలువ కోల్పోయింది. ఇదే క్రమంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 5.38 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.89 శాతం, హెచ్డీఫ్సీ బ్యాంకు 1.03 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈలో అన్ని రంగాల స్టాక్స్ నష్టాలను చవి చూశాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
BHUVSN11
సన్ రైజర్స్కు మరో విజయం
హైదరాబాద్ : ఐపిఎల్-10 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండవ విజయం సాధించింది.9 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్ను చిత్తు చేసింది.టాస్ గెలిచిన సన్ రైజర్స్ గుజరాత్ లయన్స్ను మొదట బ్యాటింగ్కు చేయాల్సిందిగా కోరింది.కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 136 పరుగుల టార్గెట్ను సులువుగా ఛేదించింది.కెప్టెన్ డేవిడ్ వార్నర్ 45 బంతులు ఆడి 6 బౌండరీలు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి ఫామ్లోకి వచ్చాడు.భారీ సిక్సర్లు, బౌండరీలు బాది లయన్స్ బౌలర్లను చితకబాదాడు. ఈ క్రమంలో టి20ల్లో 7 వేల పరుగులు సాధించాడు.ఐపిఎల్ కెరీర్లో 33వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.మరో ఆసీస్ క్రికెటర్ మోజెస్ హెన్రిక్స్ 39 బంతులు ఆడి 6 సిక్సర్లతో 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 74 బంతుల్లో 108 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో 15.3 ఓవర్లలోనే సన్ రైజర్స్ విజయం సాధించింది.గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.
సన్ రైజర్్ 15.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 140 పరుగులు చేసింది.దీంతో గుజరాత్పై సన్రైజర్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం రషీద్ఖాన్ 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.ఇతని స్పిన్ మాయాజాలానికి గుజరాత్ లయన్స్ విలవిల్లాడింది.అతడు వేసిన మూడు వరుస ఓవర్లలో మూడు వికెట్లు సమర్పించుకుంది.రషీద్కు తోడుగా పేసర్ భువనేశ్వర్ కుమార్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకోగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన గుజరాత్ 135 పరుగులు చేసింది.దినేష్ కార్తీక్ 32 బంతులు ఆడి 2 బౌండరీలతో 30 పరుగులు,డ్వేన్ స్మిత్ 27 బంతులు ఆడి 4 బౌండరీలు,1 సిక్సర్తో 37 పరుగులు చేశాడు.ఇతను ఆడకపోయి ఉంటే కనీసం ప్రస్తుతం సాధించిన స్కోరు కూడా వచ్చేది కాదు.
గుజరాత్ లయన్స్లో ఓపెనర్ జేసన్ రా§్ు 21 బంతులు ఆడి 5 బౌండరీలతో 31 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించాడు.ఎడాపెడా బౌండరీలు బాదాడు.ప్రమాదకరంగా మారిన అతడు భువనేశ్వర్ కుమార్ వేసిన ఒక అద్భుత బంతిని ఆడబోయి ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే లయన్స్ స్కోరు 37 పరుగులు.రెండు పరుగుల ముందే మెక్కెలమ్ 5 పరుగుల వద్ద రషీద్ ఎల్బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్కు పంపాడు.అదే వూపులో సురేష్ రైనా 5 పరుగులు,అరోన్ పించ్ 5 పరుగుల వద్ద ఎల్బిడబ్ల్యూ అయ్యారు.కులకర్ణి 1 పరుగు వద్ద రనౌటయ్యాడు.ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించిన దినేష్ కార్తీక్ 30 పరుగులు,డ్వేన్ స్మిత్ 37 పరుగుల జోడీని భువనేశ్వర్ 113 పరుగులు వద్ద స్మిత్ను ఔట్ చేయడం ద్వారా విడదీశాడు.పరుగు తేడాలోనే దినేష్ కార్తీక్ను నెహ్రా పెవిలియన్కు పంపడంతో లయన్స్ 135 పరుగులకే పరిమితమైంది. | 2sports
|
West Indies Team
పాక్ పర్యటనను వాయిదా వేసిన విండీస్ బోర్డు
న్యూఢిల్లీ: పిసిబికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఝలక్ ఇచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ పర్యటనకి తాము వెళ్లబోమని వెస్టిండీస్ క్రికెటర్లు క్రిస్గేల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో ఆ దేశ క్రికెట్ బోర్డుకి తేల్చి చెప్పేశారు. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ పర్యటనను వాయిదా వేసింది. మూడు టీ20ల సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు పాక్లో పర్యటించాల్సి ఉంది. ఆ దేశంలో ఆటగాళ్ల భద్రత గురించి సీనియర్ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెస్టిండీస్ బోర్డు ప్రకటించింది. దీనిపై పిసిబి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత నెలలో శ్రీలంక జట్టు లాహోర్ వేదికగా ఒక టీ20 మ్యాచ్ ఆడిన నేపథ్యంలో ఇకపై టెస్టు హోదా కలిగిన జట్లు పాక్లో పర్యటిస్తాయని ఆశించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి తాజాగా విండీస్ నిర్ణయంతో చుక్కెదురైంది.
పాక్ పర్యటన గురించి విండీస్ బోర్డు ఆటగాళ్ల నుంచి అభిప్రాయాలు కోరగా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐసిసితో పాటు వెస్టిండీస్ ఏర్పాటు చేసిన భద్రతా కమిటీ కూడా…లాహోర్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. కానీ….జట్టులోని సీనియర్ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ పాక్ పర్యటనని నిరాకరించడంతో విండీస్ వెనక్కి తగ్గక తప్పలేదని పాక్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
దీంతో వచ్చే ఏడాది రెండు జట్లకు ఖాళీ ఉన్నప్పుడు షెడ్యూల్ రూపొందిస్తా మని బోర్డు వర్గాలు తెలిపాయి. 2009లో శ్రీలంక క్రికెటర్లు లాహోర్ స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు బస్సులో వెళ్తుండగా వారిపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏ అగ్రశ్రేణి జట్టు కూడా ఆ దేశంలో పర్యటించే సాహసం చేయడం లేదు. ఇటీవలే వరల్డ్ ఎలెవన్ జట్టు లాహోర్ వేదికగా పాకిస్తాన్తో సెప్టెం బర్లో మూడు టీ20లు ఆడింది. ఆ తర్వాత ఇదే వేదికలో శ్రీలంక జట్టు అక్టోబర్ 29న ఒక టీ20 ఆడింది. ఈ రెండు జట్లు అక్కడ పర్యటించినా పాక్లో ఆడేందుకు వెస్టిండీస్ క్రికెటర్లు ససేమిరా అనడం విశేషం. ఇదిలా ఉంటే, నవంబర్ 25 నుంచి వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్లో పర్యటించనుంది. | 2sports
|
Dec 28,2018
అప్రాధాన్యత ఆస్తుల్ని అమ్మేస్తాం..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను (ఏఐ) నిలబెట్టే నిమిత్తం ప్రభుత్వం పునరుద్ధరణ ప్రణాళికను సిద్ధం చేసినట్టు ప్రభుత్వం పార్లమెంట్కు తెలిపింది. ఏఐకి తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చే విషయమై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా గురువారం పార్లమెంట్కు వివరణనిచ్చారు. ఏఐ ముఖ్య వ్యాపారాలను నిలబెట్టే విధంగా పునరుద్ధరణ ప్రణాళిక రూపకల్పన జరిగినట్టుగా ఆయన తెలిపారు. సమగ్రమైన ఆర్థిక ప్యాకేజీ, ఒక్కో ముఖ్య వ్యాపారాన్ని నిలబెట్టే విధంగా విభిన్న వ్యూహాలు, బలమైన సంస్థాగత సంస్కరణలను ఇందులో పొందుపరిచినట్టుగా మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు అందించిన బెయిలవుట్ ప్యాకేజీల కొనసాగింపుతో పాటు, సంస్థ స్థిరాస్తుల నగదీకరణ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. సంస్థను మేటి పోటీదారుగా, లాభాలతో కూడిన విమాన సంస్థగా తీర్చిదిద్దే దిశగా కృషి జరుగుతోందని ఆయన తెలిపారు. సంస్థకు చెందిన అప్రాధాన్యత ఆస్తులు, రుణాలను స్పెషల్ పర్పస్ వెహికల్కు బదిలీ చేయడం జరుగుతోందని అన్నారు. నిర్వహణ సామర్థ్యాన్ని వీలైనంత గరిష్ట స్థాయికి తీసుకుపోవడం, మేనేజ్మెంట్ను బలోపేతం చేయడంతో పాటు ఉత్తమ వ్యాపార పద్ధతులను అమలు పరచడంపై తాము దృష్టి సారిస్తూ ప్రణాళికలను రూపొందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. సంస్థ వినియోగించని, స్థిరాస్తులను రానున్న రోజుల్లో అమ్మివేయనున్నట్టుగా మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఎయిరిండియా సంస్థ అప్రాధాన్యత ఆస్తుల అమ్మకం ద్వారా దాదాపు రూ.410 కోట్ల మేర నిధులను సమీకరించినట్టుగా ఆయన తెలిపారు. ఏఐ విక్రయం బెడిసికొట్టిన నేపథ్యంలో సర్కారు సొంత విమానయాన సంస్థను నిలబెట్టుకొనే య్నతం చేయడాన్ని పలువురు ఆహ్వానిస్తున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 131 Views
హైదరాబాద్ : భారత్లో శాంసంగ్ ప్రవేశించి 20 సంవత్సరాలు పూర్తిచేసున్న సందర్భంగా హర్యానాలోని గుర్గావ్లో అతిపెద్ద కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా ఈ యూనిట్ను ప్రారంభించారు. భారత్లో కొరియా రాయ బారి చోహ్యూన్, ఆర్థికశాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వార్, హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, పరిశ్రమలు వాణిజ్యమంత్రి విపుల్ గోయల్, వంటివారు పాల్గొన్నారు. కంపెనీ సిఇఒ అధ్యక్షులు హెచ్సి హాంగ్ ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తం ఐదు అంతస్తుల్లో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంది. మొత్తం 1500 మందికిపైగా ఉద్యోగులు ఈ కేంద్రంలో పనిచేస్తారని సిఇఒ హాంగ్ వెల్లడించారు. గడచిన 20 ఏళ్లుగా శాంసంగ్ భారత్ లో తన ఉనికిని పటిష్టం చేసుకుందని, రెండు ఉత్పత్తి కేంద్రాలు, మూడు ఆర్అండ్డి సౌకర్యాలతో మొత్తం 40వేల మందికిపైగా భారత్లో పని చేస్తున్నట్లు వివరించారు. | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
బాలకృష్ణ ఏసీ రూములో ఎవరితో కులుకుతున్నారు?: సినీనటి కవిత
Highlights
హీరోలు ఏసీ రూముల్లో కులుకుతున్నారన్న ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
చంద్రబాబు లోకేష్ మొత్తం హైదరాబాద్ లోనే ఉన్నారన్న విషయం మరవకు
ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం సినీ ప్రముఖులు కలసి రావడం లేదంటు ప్రజల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలతో ఏసీ రూముల్లో కులుకుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై సినీ నటి, బీజేపీ నాయకురాలు కవిత మండిపడ్డారు. 'మీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా టాప్ హీరోనే కదా... ఆయన ఎందుకు మాట్లాడటం లేదు... ఆయన ఏ ఏసీ రూములో కులుకుతున్నారు?' అంటూ ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడేముందు మంచి, చెడ్డ చూసుకుని మాట్లాడాలని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కూడా ఒక హీరోనే అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.
హైదరాబాదులోనే ఉంటూ బానిస బతుకులు బతుకుతున్నారంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా దారుణమని కవిత అన్నారు. ఇప్పటికీ నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణిలు హైదరాబాదులోనే ఉన్నారని... వారు కూడా బానిస బతుకు బతుకుతున్నట్టేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడకో, విశాఖపట్నానికో, రాజమండ్రికో, గుంటూరుకో, కాకినాడకో ఎందుకు షిఫ్ట్ కాలేదని... రెండేళ్లు ఆయన హైదరాబాదులోనే ఉన్నారని... మీరు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు కూడా బానిస బతుకు బతికినట్టేనా? అని అన్నారు.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST | 0business
|
IPO
రూ.200 కోట్ల నిధులకు ఇఇఎస్ఎల్ ఐపిఒ
హైదరాబాద్,జూన్ 21: ప్రభుత్వరంగంలోని విద్యుత్ ఇంధన పొదుపు సేవల సంస్థ ఇఇఎస్ఎల్ ఐపిఒకు వస్తోంది. సంస్తలో 20శాతం వాటాలను విక్రయించడం ద్వారా 200 కోట్ల నిధులు సమీకరించేందుకు సిద్దం అవుతోంది. కంపెనీ ఇటీవలికాలంలో ఆరువేల కోట్లు మూలధన వ్యయప్రణాళికనను ప్రకటిం చింది.
ఈ మొత్తంలో రూ.1200 కోట్లు ఈక్విటీ, రూ.4800 కోట్లు డెట్ పెట్టుబడులుగా ప్రస్తుత సంవత్సరంలో నిలిచాయి. సంస్థ ఎండి సౌరభ్కుమార్ మాట్లాడుతూ వివిధ పద్దతుల్లో రుణాలను సేకరిస్తామని 100 మిలియన్ డాలర్ల గ్రీన్,మసాలా బాండ్లజారీ కూడా ఉంటుందని, ఈ బాండ్లు అమెరికా,బ్రిటన్ మార్కెట్లనుంచి జారీచేస్తామన్నా రు. మొత్తం ఆరువేల కోట్లలో రూ.1200 కోట్లు మా ఈక్విటీ మొత్తంగా ఉంటుంది. 4800 కోట్లు రుణాలరూపంలో సమీకరిస్తామన్నారు. అధీకృత మూలధనం రూ.460కోట్ల వరకూ ఉంది. మరో 530కోట్ల రూపాయలు ప్రమోటింగ్ సంస్థలు అందిస్తాయన్నారు. ఇవికాకుండా రూ.200 కోట్లు ఐపిఒజారీచేసి సేకరిస్తామన్నా రు. త్వరలోనే ఈ ఐపిఒకు సంబంధించి బ్యాం కర్లను, సలహాసంస్థలను ఎంపికచేస్తామని సౌరబ్ కుమార్ వెల్లడించారు.
ఇఇఎస్ఎల్ ఎన్టిపిసి, పవర్ఫైనాన్స్కార్ప్, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, పవర్గ్రిడ్ సంస్థల జాయింట్ వెంచర్గా పని చేస్తోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విద్యుత్ పొదుపు ప్రాజెక్టులపై ఈ సంస్థ పని చేస్తుంది. విదేశాల్లో బాండ్లు జారీచేసే ముందు కంపెనీ డబుల్ఎ రేటింగ్ నుంచి ట్రిపుల్ ఎ రేటింగ్కు వెళ్లేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కంపెనీ గతఏడాది రూ.1200 కోట్లు రాబడులు సాధించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.2500 కోట్లుగా రాబట్టాలని లక్ష్యం నిర్దేశించినట్లు సౌరభ్కుమార్ వివరించారు. తెలంగాణలో ప్రస్తుతం 4.5 లక్షల వీధిలైట్లు ప్రాజెక్టులో లెడ్బల్బులు ఏర్పాటు చేస్తుందన్నారు. జిహెచ్ఎంసి నుంచి ఒక్కపైసా ఛార్జిచేయకుండా ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు వివరించారు. జిహెచ్ఎంసి ప్రాజెక్టుకు రూ.270 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఎండి తెలిపారు. | 1entertainment
|
Feb 22,2018
18 వేల మంది బ్యాంకు ఉద్యోగులు బదిలీ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) వెలుగుచూసిన భారీ కుంభకోణం బ్యాంకు ఉద్యోగులకు పాలిట శాపంగా మారింది. స్కామ్ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా బదిలీలు జరుగుతున్నాయి. వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న దాదాపు 18వేల మంది బ్యాంకు అధికారులపై ఇప్పటికే బదిలీ వేటు పడినట్టుగా సమాచారం. గత సోమవారమే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ బదిలీ విషయంపై 'సెంట్రల్ విజిలెన్స్ కమిషన్' (సీవీవీ)ఓ సర్క్యూలర్ను జారీ చేసింది. 2017 డిసెంబర్ 31 నాటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అదేవిధంగా క్లరికల్ స్టాఫ్ ఎవరైతే 2017 డిసెంబర్ 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్నారో వారిని కూడా బదిలీ చేయాలని సూచించింది. దీంతో బ్యాంకులు వెంటనే ఈ బదిలీ ప్రక్రియ చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల మేరకు దాదాపు 18 వేల మంది బ్యాంకు అధికారులు బదిలీ అయినట్టు సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Aug 02,2016
ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ తీపికబురు
ముంబయి : ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ఇంటి రుణాలను చౌకగా అందించే రెండు కొత్త పథకాలను ప్రకటించింది. దీని ద్వారా 7వ వేతన సంఘం లబ్దిదారులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షించే వ్యూహంలో ఈ పథకాలను ప్రకటిచింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 'ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్', రక్షణ శాఖ(డిఫెన్స్)వారి కోసం 'ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్' అనే రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. రక్షణ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ ధరలోనే గృహరుణాలిచ్చే ఈ పథకాలను ప్రారంభించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటుగా ఇప్పటివరకు ఉన్న లోన్ను తిరిగి చెల్లించే వయసును 70 నుంచి 75 సంవత్సరాల వయసు వరకు పొడిగించింది. ప్రాసెసింగ్ రుసుమును పూర్తిగా మాఫీ చేసింది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే వారికి గృహ రుణ సదుపాయాన్ని కల్పిస్తూ మరో బంపర్ ఆఫర్ను వెల్లడించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Iraq Team
టైటిల్ ఇరాక్ సొంతం
దోహా: ఆసియా పుట్బాల్ కాన్ఫిడరేషన్(ఎఎఫ్సి) టైటిల్ను గెలుచుకుందామన్న భారత్ కలలు సాకారం కాలేదు.కాగా శనివారం రాత్రి దోహాలో జరిగిన ఫైనల్స్లో బెంగళూరు ఎఫ్ సి జట్టుతో తలపడిన ఇరాకీ ఎయిర్ పోర్స్ క్లబ్ జట్టు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది.అంజాద్ రాధీ వేసిన పునాది ఆధారంగా 71వ నిముషంలో ఈ టోర్నమెంట్లోనే టాప్ స్కోరర్ అయిన హమ్మదీ అహ్మాద్ చేసిన గోల్తో ఇరాక్ 1-0 స్కోరు ఆధిక్యం సాధించింది. తద్వారా తొలి ఖండాంతర టోర్నీ టైటిల్ గెలుచుకునే చాన్స్ బెంగళూరు ఎఫ్సి కిచ్చేందుకు నిరాకరించింది. ఆద్యంతం ఇరాకీ ఎయిర్ ఫోర్స్ క్లబ్ లైవ్లీగా సుపీరియర్గా ప్రత్యేకించి సెకండాఫ్ లో బంతిపై పట్టును కొనసాగిస్తున్నట్లు చెలరేగిపోయింది. అనునిత్యం గోల్స్ సాధించేందుకు ఇరాకీ ప్లేయర్లు పోరాట పటిమ ప్రదర్శించారు.పదే పదే షాట్లతో అలరించారు. ఒకవైపు బెంగళూరు డిపెండర్ల అడ్డంకులనుఎదుర్కొంటూనే హమ్మదీ, అమీద్ సురక్షిత స్ట్రయికింగ్కు ప్రాధాన్యం ఇచ్చారు.ఇరాక్ జట్టులో గాయంనుంచి కోలుకున్న ఎక్స్ప్లోజివ్ లెఫ్ట్ వింగర్ హ్యూమస్ తారిఖ్ బరిలోకి దిగగా,సస్పెన్షన్ల కారణంగా ఢిపెండర్ సమల్ సయీద్, మిడ్ పీల్డర్ రేపాన్ బూనియన్ స్టానే అహ్మద్ ఖాదీం,ఎమాద్ మాజీద్ మ్యాచ్లో పాల్గొన్నారు.వందలాది మంది అభిమానుల మధ్య సునీల్ ఛెత్రి ఆధ్వర్యంలోని బెంగళూరు ఎఫ్ సి జట్టు గోల్స్ చివరిక్షణం వరకు మ్యాచ్ను డ్రాగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. బెంగళూరు కోచ్ ఆల్బర్ట్ రోసా తుది జట్టులో ఒక మార్పు తీసుకొచ్చాడు.అమరీందర్ సింగ్ స్థానంలో జోహోర్ దాఉల్ తాజింపై జరిగిన మ్యాచ్లో ఆడిన లాల్తౌమావైయా రాల్టేను గోల్ కీపర్గా బరిలోకి దిగాడు.
ఫస్టాఫ్లో గోల్స్ చేసేందుకు బెంగళూరు జట్టు పలు చాన్స్లు నెలకొల్పినా,ఎయిర్ పోర్స్ క్లబ్ కే రెండు మంచి అవకాశాలొచ్చాయి. అల్విన్ జార్జి ద్వారా క్రాసింగ్లో ఎగెనెస్సస్ లింగ్టో భారత్కు ఒకే ఒక్క చాన్స్ లభించింది. కానీ అది వైడ్గా మారిపోయింది.సెకండాఫ్లో అయిదు నిముషాల తరువాత రాదీ రూపంలో వచ్చిన చాన్స్ను బెంగళూరు పార్వర్డ్ కుర్రాళ్లు తేల్చేశారు.కాగా మరోవైపు సునీల్ చెత్రి ఎడమ వైపు స్పేస్ గమనించి ఎగెస్సెన్కు పంపిన బంతిని బాక్స్ వద్ద ఇరాకీ ప్లేయర్లు అడ్డుకున్నారు. తరువాత కర్నార్లో నెట్ వెనుక నుంచి వచ్చిన చాన్స్ను సునీల్ చెత్రి సద్వినియోగం చేసుకోకుండా డిఫెండర్ తిరగగొట్టాడు. కాగా ఈ దశలో బెంగళూరు కోచ్ రోసా నిషుకుమార్,జార్జి స్థానంలో నిప్పీ ప్లేయర్లు సెమీన్గ్ డౌంగెల్, ఉదాంతా సింగ్లను బరిలోకి దించినా ఇరాకీ ఎయిర్ పోర్స్దూకుడు ముందు తేలిపోయారు. అక్కడి నుంచి ఇరాకీ ప్లేయర్లు చెలరేగి పోయారు.అటాకింగ్ చేస్తూనే రాధీ పునాది వేసిన తరువాత బాక్స్కు సమీపంలో ఉన్న హహ్మదీ 16వ గోల్తో జట్టును ఫైనల్స్లో గెలిపించాడు.కాగా 17వ నిముషంలో బ్రేక్ పొందిన ఇరాకీ జట్టు హమ్మదీ అహ్మద్ను రైట్ హ్యాండ్ చానెల్ వైపు రాధీ వెనుక నిలిపింది. హమ్మీదీ స్థానంలో కొంత మెరుగైన డిఫెండర్ కామరూన్ వాస్టన్ను నిలిపింది.ఒపామా అలీ స్థానంలో వచ్చిన హుమన్ తారిఖ్ 26వ నిముషంలో గోల్ సాధించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. హమ్మదీ రెండు సందర్భాల్లోను మెరుగైన ఆటను ప్రదర్శించాడు.వైడ్ నుంచి ఇన్ సైడ్ బాక్స్ వరకు బంతిపై పట్టు కొనసాగించినా హమ్మదీ గోల్ చేయలేదు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చైతు ఫస్ట్లుక్ అదుర్స్: ‘సవ్యసాచి’ అంటే?
అక్కినేని వారసుడు నాగచైతన్య వరుస సినిమాలతో స్పీడ్ చూపిస్తున్నాడు. తాజాగా చందూ మొండేటి డైరెక్షన్లో ‘సవ్యసాచి’ ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్లుక్ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్
TNN | Updated:
Aug 16, 2017, 03:31PM IST
కార్తికేయ, ప్రేమమ్ మూవీలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుపొందారు యువ దర్శకుడు చందూ మొండేటి. అయితే నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌ మళ్లీ రిపీట్ చేస్తూ ఓ సినిమాను చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇప్పటివరకు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలతో సినిమాలు చేసిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు. అయితే ఈరోజు సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆ మూవీకి 'సవ్య సాచి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘సవ్యసాచి’ పోస్టర్‌తో పాటు టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇంతకీ ‘సవ్యసాచి’ అంటే ఏమిటి? ఈ టైటిల్‌కి హీరో క్యారెక్టరైజేషన్‌కి సంబంధం ఏమిటి అంటే.. ఒకసారి పురాణాలను తిరగేయాల్సిందే.
‘సవ్యసాచి’ అనే టైటిల్‌ను చందూ మొడేటి పురాణాలను వెతికిపెట్టిన పేరు. రెండు చేతులతో బాణాలు సమర్ధవంతంగా వేసే అర్జునుడిని ‘సవ్వసాచి’ అని పిలిస్తారు. రెండు చేతులతో రాయగలిగే వాళ్లని... రెండు చేతులతో ఒకే పనిని సమర్థవంతంగా ఒకేలా చేసేవారిని ‘సవ్యసాచి’లుగా పిలుస్తుంటారు. అయితే నాగ చైతన్య కండలు తిరిగిన శరీరంతో ఉన్న పోస్టర్‌తోటే మూవీలో అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పేశాడు దర్శకుడు చందూ మొండేటి. | 0business
|
బిగ్ బాస్2: మరో లవ్ స్టోరీ షురూ కానుందా..?
Highlights
తనీష్.. నందిని దగ్గరకు వెళ్లి.. 'నీతో మాట్లాడుతుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ఏదైనా మాట్లాడొచ్చనే ఫ్రీడమ్ ఉంటుంది' అని చెప్పగా.. నాకు నువ్వు బాగా నచ్చావ్ తనీష్ అంటూ అతడికి హగ్ చేసుకొని ముద్దు పెట్టింది నందిని.
మొదటి సీజన్ తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్2 లో మసాలా కాస్త ఎక్కువైందనే చెప్పాలి. మొదట అందరూ కలివిడిగా కనిపించినా.. మెల్లమెల్లగా గ్రూప్ గ్రూపులుగా విడిపోయారు. ఇందులో సామ్రాట్-తేజస్వి, తనీష్-దీప్తి సునైనాలు జంటలుగా కనిపించేవారు. వారి మధ్య జరిగే సంభాషణలు కూడా అలానే ఉండడంతో ఆడియన్స్ లో పలు సందేహాలు కలిగాయి. తేజస్వి బయటకి వెళ్లిపోవడంతో సామ్రాట్ తన ఆట ఆడుకుంటూ బిజీ అయిపోయాడు.
ఇక తనీష్, సునైనాను ముద్దు చేస్తూనే ఉన్నాడు. అయితే తనీష్.. నందినితో మాట్లాడే తీరు, ప్రవర్తన చూస్తుంటే ఆమె పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే సందేహం కలుగకమానదు. గతంలో నందినికి కూడా ఓ సందర్భంలో తనీష్ తనకు నచ్చాడని దీప్తి ముందు చెప్పింది. తనీష్ కూడా నందినితో మాట్లాడడం నచ్చుతుందని అన్నారు. అయితే ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో తనీష్.. నందిని దగ్గరకు వెళ్లి.. 'నీతో మాట్లాడుతుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ఏదైనా మాట్లాడొచ్చనే ఫ్రీడమ్ ఉంటుంది' అని చెప్పగా.. నాకు నువ్వు బాగా నచ్చావ్ తనీష్ అంటూ అతడికి హగ్ చేసుకొని ముద్దు పెట్టింది నందిని.
దీంతో హౌస్ లో మరో ప్రేమకథ ఏమైనా షురూ అయిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. మరి రాను రాను ఎపిసోడ్స్ లో వీరు ఎలా ఉంటారో చూడాలి!
Last Updated 26, Jul 2018, 11:15 PM IST | 0business
|
ఒక్క శాతం వాటా కూడా ఇవ్వం
ముంబయి: భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు ప్రస్తుతం ఉన్న వాటా నుంచి ఒక్క శాతం కూడా తిరిగి ఇవ్వమని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ హెచ్చరించాడు.కాగా నేను అందరికీ ఒక్కటే చెప్పదలచుకున్నా,ఐసిసికి 70 శాతం ఆదాయం ఉపఖండం నుంచే వస్తుంది,ఈ రకంగా బిసిసిఐ ఐసిసి ప్రాదాన్యం ఇవ్వడం లేదు.నా దృష్టిలో దేశం,బోర్డు బాగోగులే అత్యంత ముఖ్యం.వాటి తరువాతనే మిగతా వాటి గురించి ఆలోచిస్తానని ఠాకూర్ పేర్కొన్నాడు. కాగా తన దృష్టిలో సంస్థలే ముఖ్యమని వ్యక్తులు కాదని పరోక్షంగా ఐసిసి చైర్మన్ శశాంక్ మనోహర్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.శ్రీనివాసన్ హయాంలో అమల్లోకి వచ్చిన కొత్త ఆర్థిక విధానానికి స్వస్తి పలికి కొత్త నిర్ణయాలను అమల్లోకి తీసుకురావడానికి ఐసిసి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.నూతన నిర్ణయాలు అమల్లోకి వస్తే ఐసిసి ఆదాయంలో భారత బోర్డుకు 22 శాతం కాకుండా 15 శాతం వాటా మాత్రమే వస్తుంది. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఫ్యాన్సీ డ్రస్లో రాశీ.. స్పైసీగా!
దక్షిణాదిన ఇప్పుడు బిజీగా ఉన్న హీరోయిన్లలో ముందు వరసలో ఉంటుంది రాశీ ఖన్నా.
Samayam Telugu | Updated:
Aug 1, 2018, 05:54PM IST
దక్షిణాదిన ఇప్పుడు బిజీగా ఉన్న హీరోయిన్లలో ముందు వరసలో ఉంటుంది రాశీ ఖన్నా . ఉత్తరాది నుంచి తరలి వచ్చిన ఈ భామ దక్షిణాదిన చక్కగా సెటిలవుతోంది. చేతినిండా అవకాశాలతో బిజీగా ఉంది. ద్వితీయ శ్రేణిలోని హీరోలతో రాశీకి వరసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ‘తొలిప్రేమ’లో వరుణ్ తేజ్ సరసన నటించి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ హీరోయిన్. ఇప్పుడు చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి.
ఇక వచ్చే వారంలో ‘శ్రీనివాస కల్యాణం’ విడుదల కాబోతోంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో రాశీ హీరోయిన్. ఇప్పుడిప్పుడే పెద్ద హీరోల సరసన అవకాశాలను సంపాదించుకుంటోంది రాశీ. వాళ్ల పక్కన ఛాన్సులు వస్తే... రాశీ దక్షిణాదిన స్టార్ హీరోయిన్ కావడం ఖాయం. ఇక కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా బ్రాండ్ అంబాసిడర్గా కూడా దూసుకుపోతోంది రాశీ. ఒక మొబైల్ మార్కెటింగ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది రాశీ. అందులో భాగంగా తాజాగా ఇలా మెరిసింది. | 0business
|
Oct 09,2015
వృద్ధి రేటు అంచనాల్లో కోత
వాషింగ్టన్/ పారీస్ : ఈ ఏడాది భారత వృద్ధి రేటు అంచనాలకు 'అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ' (ఐఎంఎఫ్) కోత పెట్టింది. 2015లో తొలుత 7.5 శాతం వృద్ధి అంచనా వేసిన ఐఎంఎఫ్.. తాజాగా దీన్ని 7.3 శాతానికి కుదించింది. ప్రపంచంలోనే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమని ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ గియాన్ మారియా మిలెసి ఫెర్రెట్టి పేర్కొన్నారు. సాధారణంగానే విదేశీ పరిణామాలు క్లిష్టతరంగా ఉన్నాయని అన్నారు. ఇక్కడ జరుగుతున్న ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్లో గతేడాది చోటు చేసుకున్న స్తబ్దత కొనసాగుతుందన్నారు. విదేశాల్లో నెలకొన్న బలహీనమైన డిమాండ్ భారత్ను ఒత్తిడికి గురి చేస్తుం దన్నారు. దీంతో వృద్ధి రేటు అంచనాలు తగ్గించాల్సి వచ్చిందని పేర్కొంది. మరోవైపు విదేశాలో తగ్గుతోన్న సరుకుల ధరలు భారత్కు మద్దతు నిస్తున్నాయన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Suresh 77 Views
ఎస్బిఐ రుణపరపతిలో 12% ఎస్ఎంఇ రంగానికే
కోల్కత్తా, సెప్టెంబరు 18: భారత్లోని బ్యాంకింగ్ దిగ్గజం భారతీయస్టేట్ బ్యాంకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ ఏడాది రుణపరపతి కేటాయింపుల్లో 10-12శాతం వృద్ధిని సాధించిందని బ్యాంకు ఎండి రజనీష్కుమార్ వెల్లడించారు. స్థిరాస్తి తనఖాతో రుణాలు, సరఫరా చైన్ ఫైనాన్సింగ్ వంటి వాటికి రుణాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తంగా రుణపరపతి వృద్ధి 13-14శాతంగా ఉందని ఎస్ఎంఇ రంగానికి 12శాతంగా రుణపరపతి పంపిణీ జరిగిందన్నారు. రిటైల్ రుణాలపరంగాచూస్తే మొత్తం రుణపరపతిలో వృద్ధికి కారణం అయ్యా యని సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లా డారు. కంపెనీల ఆస్తి అప్పుల పట్టీల ఆధారంగాను, నగదు రాకపోకల ఆధారంగా కూడా రుణపరపతిని పెంచుతున్నట్లు వివరించారు. అలాగే ఎస్ఎంఇ రంగపరంగా నిరర్ధక ఆస్తుల కట్టడికి నియంత్రణ ప్రణాళిక అమలుచేస్తున్నట్లు వివరించారు. 50 కోట్ల రూపాయల వరకూ ఉన్న రుణాలను ఎస్ఎంఇ రంగానికి ఇస్తున్నట్లు తెలిపారు. మధ్యతరహా కంపెనీలకు కూడా ఇదేతరహా రుణపరపతిని అందిస్తున్నామన్నారు. కార్పొరేట్ రంగంనుంచి రుణాల డిమాండ్ చాలా తక్కువగా ఉందన్నారు. సేవలరంగపరంగా జిడిపికిఎక్కువ వాటా అందిస్తోందని, ఉత్పత్తి రంగం కంటే ఎక్కువ ఇస్తోందన్నారు. రోడ్నిర్మాణరంగానికి ఎక్కువ నిధులు వెళుతున్నాయని ఆ తర్వాత విద్యుత్రంగానికి రుణపరపతి అధికంగా ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐదుబ్యాంకుల విలీ నం పూర్తిచేస్తామన్నారు. ఐటి వ్యవస్థ పటిష్టంగా ఉన్నందున ఐదు బ్యాంకుల ఆస్తి అప్పుల పట్టీల సమ న్వయం పెద్ద సమస్యకాదన్నారు. విలీనం తర్వాత శాఖల ఏర్పాటు, ఇప్పటివరకూ బ్యాంకింగ్ సేవలు లేని ప్రాంతాల గుర్తింపు ఉంటుందని అన్నారు. ఎస్బిఐ శాఖలపరంగా విలీనం తర్వాత మరింతగా పెరుగుతాయని 30 లక్షల కోట్ల ఆస్తులున్న బ్యాంక్గా వృద్ధి చెందుతుందని కుమార్ వెల్లడించారు. | 1entertainment
|
ఎంజీఎల్ ఐపీవోకు 'మహా' స్పందన
- అనూహ్యరీతిలో 64,34 రెట్ల సబ్స్క్రిప్షన్
ముంబయి: దేశంలో రెండో అతిపెద్ద సీఎన్జీ రిటైలర్ సంస్థ 'మహానగర్ గ్యాస్' (ఎంజీఎల్) పబ్లిక్ ఇష్యూకు (ఐపీఓకు) మదుపరుల నుంచి గురువారం అనూహ్య స్పందన లభించింది. ఆఫర్ ముగిసే నాటికి సంస్థ ఐపీఓకు 64.34 రెట్ల కంటే అధిక స్పందన లభించింది. ఇష్యూలో అందుబాటులో ఉరచిన 1.7 కోట్ల షేర్లకు గాను (ఇన్వెష్టర్ల భాగం కాకుండా) 1.11 కోట్ల బిడ్లు లభించాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఐపీఓ తొలిరోజైన మంగళవారమే ఇష్యూకు పూర్తి స్థాయి సబ్స్క్రిప్షన్ లభించినట్లు తెలుస్తోంది. రూ.380-421 ధరల శ్రేణితో ఎంజీఎల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్, బ్రిటీష్ గ్యాస్ ఆసియా పసిఫిక్ హోల్డింగ్ల ఉమ్మడి సంస్థ అయిన ఎంజీఎల్ ఐపీఓ గరిష్ట ధర రూ.421 వద్ద యాంకర్ ఇన్వెష్టర్లకు షేర్లను కేటాయించడం ద్వారా దాదాపు రూ.309 కోట్లను సమీకరించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
గోల్సే గోల్సు.. నాకౌట్కు బెల్జియం
Highlights
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎడెన్ హజార్డ్
హైదరాబాద్: బెల్జియం నుంచి వెల్లువెత్తిన గోల్స్ వర్షానికి ట్యునీషియా శనివారం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. హజార్డ్, లుకాకు చెరి రెండేసి గోల్స్ చేసి బెల్జియం విషయానికి కారణమయ్యారు. ఆది నుంచి తనదైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చిన బెల్జియం 5-2 గోల్స్తో ట్యునీషియాపై విజయం సాధించింది. నాకౌట్కు చేరుకుంది. అంతటితో ఆగకుండా ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో మ్యాచ్ ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే అంటే 5.59 నిముషాల్లోనే గోల్ చేసిన రెండో జట్టుగా పేరు గడించింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎడెన్ హజార్డ్ నిలిచాడు.
మ్యాచ్ మొదట్లోనే బెల్జియం మిడ్ ఫీల్డర్ ఎడెన్ హజార్డ్ తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత స్ట్రయికర్ రొమెలు లుకాకు 16వ నిముషంలో గోల్ చేయడం ద్వారా జట్టుకు 2-0 ఆధిక్యతను సంపాదించిపెట్టాడు. ఫస్టాఫ్ ముగిసిన తర్వాత ఇంజూరీ టైమ్లో లుకాకు మరో గోల్ చేసి ట్యునీషియాను మరింత కష్టాల్లోకి నెట్టివేశాడు. ట్యునీషియా తరఫున డైలాన్ బ్రోన్ 18వ నిముషంలో తొలి గోల్ చేశాడు.
సెకండాఫ్కు వచ్చేసరికి 51వ నిముషంలో ఎడెన్ హజార్డ్ మరో గోల్ చేసి జట్టు ఆధిక్యతను పెంచాడు. ఈ మ్యాచ్లో హజార్డ్, లుకాకులు రెండేసి గోల్స్తో రెచ్చిపోయి ఆడారు. 90వ నిముషంలో బెల్జియం ఆటగాడు మిచ్చీ గోల్ చేయడంతో ట్యునీషియా కథ ముగిసిపోయింది. ఇంజూరీ టైమ్లో అంటే 93వ నిముషంలో ట్యునీషియా స్ట్రయికర్ ఖాజ్రీ గోల్ చేయడంతో 2-5 గోల్స్ తేడాతో బెల్జియం గెలుపొందింది.
Last Updated 24, Jun 2018, 11:27 AM IST | 2sports
|
Hyderabad, First Published 13, Sep 2019, 2:58 PM IST
Highlights
దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ షూటింగ్ ప్రస్తుతం బల్గెరియాలో కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఇంట్రడక్షన్ సీన్స్ ని భారీ ఖర్చుతో షూట్ చేస్తున్నట్లు సమాచారం.
దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ షూటింగ్ ప్రస్తుతం బల్గెరియాలో కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఇంట్రడక్షన్ సీన్స్ ని భారీ ఖర్చుతో షూట్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోల పాత్రలను ఏ విధంగా పరిచయం చేస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఇక 450కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న RRR సినిమాలో కూడా ఆ ఇంట్రడక్షన్ సీన్స్ అదిరిపోతాయని ఊహించవచ్చు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ సినిమా తీసినప్పుడు అందులో తారక్ ని పులితో పోలుస్తూ దర్శకుడు అద్భుతమైన సీన్స్ ని క్రియేట్ చేశాడు . ఇక ఇప్పుడు కూడా పెద్దపులులతో తారక్ ఇంట్రడక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
విఎఫ్ఎక్స్ తో కూడిన ఈ సన్నివేశాల కోసం హై టెక్నాలిజీ కెమెరాలను వాడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20కోట్ల వరకు తారక్ ఎంట్రీ కోసం ఖర్చు చేయనున్నారట. మరి ఆ సీన్ ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Last Updated 13, Sep 2019, 2:58 PM IST | 0business
|
వెస్టిండీస్తో తొలి ఇన్నింగ్స్లో
భారత్ 353 పరుగులకు ఆలౌట్
సెంచరీలతో దూసుకెళ్లిన
అశ్విన్, వృద్ధిమాన్ సాహా
వెస్టిండీస్ 107/1, బ్రాత్వెట్ హాఫ్ సెంచరీ
గ్రాస్ ఐలెట్ : వెస్టిండీస్తో జరుగుతున్న మూడవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 353 పరుగుకు ఆలౌటైంది.కాగా తొలి ఇన్నింగ్స్లో అశ్విన్,సాహా సెంచరీలతో భారత్ ఒక దశలో 5 వికెట్లకు 339 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచినా 14 పరుగుల తేడాతో చివరి అయిదు వికెట్లు కోల్పోయి భారీ స్కోరు సాధించే అవకాశాన్ని కోల్పోయింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ ఒక వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్సన్ను 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ రనౌట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో బ్రాత్వైట్ 53 పరుగులు,బ్రావో 18 పరుగులతో ఉన్నారు.కాగా తొలి రోజు భారత్ను దెబ్బ తీసిన యువ పేసర్ అర్జారి జోసఫ్ 69 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.సాహాను ఔట్ చేసి భారీ భాగస్వామ్యానికి తెరదించాడు.జడేజా 6 పరుగుల వద్ద కమిన్స్ పెవిలియన్కు పంపాడు.ఆ తరువాత అయిదు బంతుల తేడాతో భువనేశర్ జిరో వద్ద అశ్విన్,ఇషాంత్ కూడా ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. అంతకు ముందు 5 వికెట్లకు 234 పరుగులు ఓవర్ నైట్ స్కోరుతో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియాను అశ్విన్,సాహా నడిపించారు.తొలి రోజు ఆటలో తక్కువ స్కోరుకే ఆలౌటయ్యే ప్రమాదం నుంచి బయట పడిన వీరు రెండవ రోజు ఆచితూచి బ్యాటింగ్ చేసింది.అశ్విన్ సింగిల్స్ తీసుకుంటూ నిలకడగా ఆడటా,సాహా వీలు చిక్కినపుడు బౌండరీలు బాదాడు.అశ్విన్ తొలి రోజు ఆటలోనే హాఫ్ సెంచరీ చేయగా రెండవ రోజు సాహా 135 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.లంచ్కు కొద్ది ముందు అశ్విన్ సెంచరీకి చేరు వయ్యాడు.కాగా 99 పరుగుల వద్ద లంచ్కు వెళ్లిన అశ్విన్ వచ్చిన వెంటనే ఛేజ్ బౌలింగ్లో సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సిరీస్లో అశ్విన్కు ఇది రెండవ సెంచరీ.ఛేజ్ బౌలింగ్లోనే రెండు పరుగులు చేసి సాహా కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 300 పరుగులు దాటడంలో అశ్విన్,సాహా కీలక పాత్ర పోషించాడు. | 2sports
|
అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిన సమంత
Highlights
అర్జున్ రెడ్డి మూవీకి సమంత ప్రశంసలు
సహజత్వంతో చాలా రియలిస్టిక్ గా వుందని అభినందన
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిన సమంత
విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీ టాలీవుడ్ సెన్సేషన్ గా మారిపోవడంతో ఈ సినిమాకు ప్రముఖుల ప్రశంసలు కూడ జోరుగానే వస్తున్నాయి. అడల్ట్ కంటెంట్ అని సెన్సార్ తీర్పు ఇచ్చినా ఆ విషయాలు పట్టించుకోకుండా కేవలం యూత్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు.
ఈసినిమాకు ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈ మూవీ కలెక్షన్స్ పరంగా సంచలనాలు సృష్టిస్తూ విడుదలైన మూడు రోజులకే... బయ్యర్లను లాభాల్లోకి తీసుకు వచ్చింది. ఈచిత్రాన్ని ఒరిజినాలిటికీ దగ్గరగా తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవర కొండను అందరు వరుసపెట్టి తెగ పొగిడేస్తున్నారు. ఇప్పటికే నాని, వరుణ్ తేజ్, అను ఇమాన్యుయేల్ తదితరులు అర్జున్ రెడ్డిని పొగడేశారు.
అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ లిస్ట్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత కూడా చేరిపోయింది. "చాలా కాలం తర్వాత నేను చూసిన సినిమాల్లో సహజత్వానికి దగ్గరగా ఉన్న మూవీ అర్జున్ రెడ్డి. టాలీవుడ్ కి గోల్డెన్ డేస్ మనతోపాటే ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ టీం అద్భుతం" అంటూ ట్విట్ చేసింది సమంత. తన సినిమాలను మాత్రమే కాకుండా మూవీ బాగుంటే ఇతర హీరో హీరోయిన్ల సినిమాలను కూడ అభినందిస్తూ ప్రమోట్ చేసే సమంత చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా త్వరలో సమంత-విజయ్ దేవరకొండ కలిసి ఓ మూవీలో నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. మహానటి సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటిలో ఓ జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుండగా ఎన్టీఆర్ ఏఎన్నార్ రోల్స్ లో ఒకటి విజయ్ దేవరకొండతో చేయిస్తున్నారనే టాక్ ఉంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST | 0business
|
దిగివచ్చిన ఏపీ ప్రభుత్వం...దీక్ష విరమించిన జ్యోతి సురేఖ
Highlights
డబ్బులు ఇవ్వకుంటే దీక్ష చేస్తానన్న సురేఖ
ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. జ్యోతి సురేఖకు ఇస్తామని చెప్పిన ప్రొత్సాహకాలన్ని ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. దీంతో.. జ్యోతి సురేఖ తాను చెప్పట్టిన నిరాహార దీక్షను విరమించుకున్నారు.
అసలు విషయం ఏమిటంటే... అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ కి ప్రభుత్వం ప్రోత్సాహకాల పేరిట రూ.కోటి ఇవ్వాల్సి ఉంది. 9 నెలలు గడుస్తున్నా.. ఇవ్వకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష కూడా చేపట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, సాఫ్ చైర్మన్ అంకయ్య చౌదరిలు జ్యోతి సురేఖతో చర్చలు జరిపారు.
చివరకు ప్రభుత్వం సురేఖ విషయంలో వెనక్కి తగ్గింది. ఆమెకు డబ్బులు ఇచ్చేందుకు జీవీ విడుదల చేసింది. దీంతో.. ఆమె దీక్ష విరమించారు.
Last Updated 7, May 2018, 1:22 PM IST | 2sports
|
naga chaitanya says yuddham with srikanth, sharanam with my family
యుద్ధం శ్రీకాంత్తో.. శరణం నా ఫ్యామిలీతో..: నాగ చైతన్య
‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి డీసెంట్ హిట్ తరవాత అక్కినేని నాగచైతన్య చేసిన సినిమా ‘యుద్ధం శరణం’.
TNN | Updated:
Sep 7, 2017, 05:29PM IST
‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి డీసెంట్ హిట్ తరవాత అక్కినేని నాగచైతన్య చేసిన సినిమా ‘యుద్ధం శరణం’. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తరవాత యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నాడు ఈ యంగ్ హీరో. దీనికి తగ్గట్టుగానే ప్రచారం చేస్తున్నారు. యుద్ధం శరణం టూర్ పేరుతో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలసి తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. కృష్ణ మరిముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హీరో నాగచైతన్యతో కాసిన్ని ముచ్చట్లు..
సినిమా ఎలా ఉండబోతుంది?
మొదటిసారి థ్రిల్లర్ జోనర్‌లో నటిస్తున్నాను. అయితే కేవలం థ్రిల్లర్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ట్రాక్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే మాత్రం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
Recommended byColombia
ఈ సినిమా ఎలా వర్కవుట్ అయింది?
డైరెక్టర్ కృష్ణ నాకు మంచి స్నేహితుడు. కథ చెప్పగానే బాగా నచ్చింది. గత ఏడాదిగా ఈ సినిమాపై పని చేస్తూనే ఉన్నాం. పక్కా ప్రణాళిక వేసుకొని షూటింగ్ మొదలుపెట్టాం. 60 నుంచి 65 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రీప్రొడక్షన్ పనుల మీద ఎక్కువ సమయం కేటాయించాం.
డైరెక్టర్ మీ ఫ్రెండ్ అని ఛాన్స్ ఇచ్చారా..?
చాలా రోజులుగా నా ఫ్రెండ్‌తో కలిసి వర్క్ చేయాలనే డ్రీమ్ ఉంది. ఆ అనుభవం ఈ సినిమాతో వచ్చింది. కృష్ణ కూడా నలుగురైదుగురు దర్శకుల దగ్గర పని చేశాడు. రెండు, మూడు కథలు రాసుకున్నాడు. అవి రిజక్ట్ అయ్యాయి. కానీ ఈ కథకు అన్నీ సెట్ అయ్యాయి. సాయి కొర్రపాటి గారు బాగా ప్రోత్సహించారు.
శ్రీకాంత్ రోల్ ఎలా ఉంటుంది?
శ్రీకాంత్ గారు నెగెటివ్ రోల్‌లో నటించడానికి అంగీకరిస్తారని మొదట ఊహించలేదు. సినిమాకు ఆయన పాత్ర హైలైట్ అవుతుంది. నా పాత్రకు ఆయన మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం బాగా అనిపించింది.
సినిమాను ఎక్కువగా రాత్రి పూట షూట్ చేసినట్లున్నారు?
సినిమా మొత్తం ఒక రోజులో అయిపోతుంది. కథకు తగ్గట్లుగా ఎక్కువగా రాత్రి పూట షూట్ చేశాం. సహజంగా ఉండాలనే అలానే చేశాం. నేను సినిమా చూశాను. చాలా కొత్తగా అనిపించింది. ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు.
మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో డ్రోన్ అనే గాడ్జెట్ ఉపయోగించాం. సినిమాలో నేనొక డ్రోన్ మేకర్‌ని. ఆ డ్రోన్‌ను ఒక క్యారెక్టర్‌లా డిజైన్ చేశాం. సినిమా మొత్తం ఆ క్యారెక్టర్ నడుస్తుంటుంది. యూత్‌కు ఈ పాయింట్ బాగా కనెక్ట్ అవుతుంది.
కార్తికేయతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
రాజమౌళి గారబ్బాయి కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశాడు. ఎవరికి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. టీంలో మొత్తం 30 ఏళ్లలోపు వాళ్లమే.
యుద్ధం ఎవరితో..? శరణం ఎవరితో..?
యుద్ధం శ్రీకాంత్ గారితో.. శరణం నా ఫ్యామిలీతో..
పెళ్లి సంగతులేంటి?
అక్టోబర్ 6న గోవాలో పెళ్లి ప్లాన్ చేస్తున్నాం. ముందుగా 6న హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపి, 7న క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరపనున్నాం.
తరవాత ప్రాజెక్ట్స్..?
చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే సినిమా చేస్తున్నాను. సెప్టెంబర్ 20న తాతగారి పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టాలని భావిస్తున్నాం. అది పక్కా కమర్షియల్ సినిమా. ఆ సినిమాలో హీరో పాత్రకు ఎడమ చేయి కంట్రోల్‌లో ఉండదు. అది ఒక వ్యక్తిలా ఆలోచిస్తుంది. కుడి చేతితో సమానంగా ఎడమ చేతికి కూడా శక్తి ఉంటుంది.
మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారని విన్నాం.. నిజమేనా?
అవును.. మారుతి గారితో ఓ సినిమా కమిట్ అయ్యాను. ‘మహానుభావుడు’ విడుదలైన తరువాత దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదు. | 0business
|
CHANDRA
2.5లక్షల గ్రామీణ యువతకు నైపుణ్యశిక్షణ
ముంబయి, జూలై 15: ఐసిఐసిఐఫౌండేషన్ సాయంతో వచ్చే మార్చినాటికి 2.5లక్షల మంది యువతకు నైపుణ్యశిక్షణ అందిస్తామని ఐసిఐసిఐబ్యాంకు ఎండిసిఇఒ చందాకొచ్చర్ పేర్కొన్నారు. సమ్మిళిత అభివృద్ధికోసం నైపుణ్యశిక్షణకు తమ ఫౌండే షన్ విశేషకృషిచేసిందన్నారు. 2007లోనే ఐసిఐసిఐబ్యాంకు సమ్మిళిత వృద్ధికి ఐసిఐసిఐ ఫౌండేషన్తో కలిసి ఒక నైపుణ్యఅకాడమీని ప్రారంభించామని. గ్రామీణ యువతకు వృత్తిపరంగా శిక్షణ అందిస్తుందన్నారు. ఇప్పటివరకూ 100 గ్రామా లను డిజిటల్ గ్రామాలుగా తీస్తే ఈ తరహా గ్రామాలుమరో 500 వరకూ పెంచుతున్నట్లు వివరించారు. అదనంగా 50 వేల మంది యువతకు శిక్షణ ఇవ్వడంతోపాటు 12.5లక్షల మంది జీవితాలను ప్రభావితంచేయగలమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. అదనంగా ఫౌండేషన్, రేతీలు రాజస్థాన్లోని ఉద§్ుపూర్, జోధ్పూర్జిల్లాల్లో అమలుచేస్తున్నామని, 15 శాటిలైట్ కేంద్రా లు ఈ రెండుజిల్లాల్లోను అమలుచేస్తూ 38 వరకూ విభిన్న అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. 11 పరిశ్రమ లకు సంబంధించిన శిక్షణాకోర్సులు 12వారాలపాటు నిర్వహిస్తుందని చందాకొచ్చర్వివరించారు. ఐసిఐసిఐ అకాడమీఇపుడు అగ్రగామి సంస్థలను విజ్ఞాన భాగస్వాములుగా స్వాగతించడంతో పాటు వెయ్యికిపై పారిశ్రామిక భాగస్వాములతో ఉపాధి అవకాశాలను యువతకు మరింత చేరువ చేశామన్నారు.
శిక్షణపైనే ఎందుకు దృష్టికేంద్రీకరించారు?
చందాకొచ్చర్: యువత ఎక్కువ జనాభా కలిగిన దేశం మనది. 62శాతంమంది ప్రజలు 15-59వయసు మధ్యఉన్నవారే. 25ఏళ్లకులోబడినవారు 54శాతం మంది ఉన్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ఈశిక్షణ అకాడమీ స్థాపించాం. మొత్తం ఉద్యోగరంగంలో 4.69శాతంమందికి మాత్రమే వృత్తిపరంగా నైపుణ్యం ఉంది. అందువల్లనే 2013లో అకాడమీని స్థాపించాం. ప్రశ్న: ఇప్పటివరకూ ఎంతమంది విద్యార్థులకు శిక్షణ అందించారు. ఎంతమందికి లక్ష్యం ఉంది? చందాకొచ్చర్: గ్రామీణకార్యాచరణ ప్రాజెక్టుద్వారా 100డిజిటల్గ్రామాలతో పాటు 160గ్రామాల్లోని 18వేలమంది గ్రామస్తులకు శిక్షణఇచ్చాం. ఈశిక్షణ పూర్తిచేసు కున్న వారిలో రెండొంతులమంది మహిళలే.
84శాతం మంది ఆదాయవనరులు సమీకరించే కార్యాచరణలో ఉన్నారు. అదనంగా గ్రామీణస్వయం ఉపాధి సంస్థల ద్వారా 53వేలమందికి శిక్షణ ఇచ్చాం. గత ఏడాదే 15వేలమందికి ఇచ్చాం. ఐసిఐసిఐ అకాడమి ఫర్ స్కిల్స్ అర్బన్ సెంటర్లు 64 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చాయి. వీరిలో 28వేల మంది గతేడాదిలోనే శిక్షణపొందారని అందరికీ ఉపాధి లభించింది. భవిష్యత్కార్యాచరణ ఏమిటి? చందాకొచ్చర్: ఈ ప్రాజెక్టు ద్వారా 100గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా మార్చాం. మరో 500 గ్రామాలను గుర్తించి 50 వేలమందికి ఈ గ్రామాల్లో శిక్షణ ఇవ్వాలన్నదే లక్ష్యం.
ప్రశ్న: కొద్దినెలలక్రితం బ్యాంకు ప్రారంభించిన డిజిటల్ గ్రామాల వద్ద శిక్షణలో ప్రధాన అంశాలేమిటి?
చందాకొచ్చర్: ఐసిఐసిఐ బ్యాంకు డిజిటల్ గ్రామాలప్రాజెక్టు ఒక కొత్త కార్యా చర. స్థానిక అవసరాలకు ఆధారంగా వృత్తిపరమైన శిక్షణను అందిస్తున్నాం. ఆర్థిక లావాదేవీలను డిజిటైజ్చేయడం, రుణపరపతిని అందించడంద్వారా స్థిరమైన జీవనోపాధిని గ్రామీణులు పొందుతారు. రెండులక్షలకుపైగా బ్యాంకు ఖాతాలు ఇప్పటివరకూ తెరిచాం. ఈ గ్రామాల్లో 90శాతం పెద్దవారినే కవర్ చేసామని చందాకొచ్చర్ వివరించారు. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ప్రపంచ బ్యాడ్మింటన్: స్వర్ణమే లక్ష్యం!
ఒకప్పుడు భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో అర్హత సాధిండచమే గొప్ప అనే పరిస్థితి ఉండేది. అయితే, 2011 నుంచి పరిస్థితి మారిపోయింది. అదమం నుంచి ప్రథమం దిశగా అడుగులు వేస్తూ... ఫెవరెట్స్గా భారత్ బరిలో దిగుతోంది.
TNN | Updated:
Aug 21, 2017, 11:24AM IST
ఒకప్పుడు భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో అర్హత సాధిండచమే గొప్ప అనే పరిస్థితి ఉండేది. అయితే, 2011 నుంచి పరిస్థితి మారిపోయింది. అదమం నుంచి ప్రథమం దిశగా అడుగులు వేస్తూ... ఫెవరెట్స్‌గా భారత్ బరిలో దిగుతోంది. ‘స్వర్ణం’ సాధించాలనే స్వప్నం సాకారం చేసేందుకు మన ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
సోమవారం నుంచి గ్లాస్కోలో ప్రారంభమయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో ఈసారి 21 మంది భారత ఆటగాళ్లు పాల్గొంటున్నారు. పీవీ సింధూ, సైనా నెహ్వాల్ , కిదంబి శ్రీకాంత్ , సాయి ప్రణీత్ వంటి తెలుగు తేజాలు ఫెవరెట్స్‌గా బరిలో దిగుతున్నారు. మరి, ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దామా!! | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
WPI: ఏప్రిల్ నెలలో భారీగా పెరిగిన ఆహార, ఇంధన ధరలు
ఇంధనం, విద్యుత్ టోకు ధరల ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో ఏకంగా 4.70 శాతం నుంచి 7.85 శాతానికి పెరగడంతో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 3.18 శాతానికి చేరింది. కూరగాయలు, పండ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి .
Samayam Telugu | Updated:
May 14, 2018, 06:38PM IST
భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం
భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం
ఇంధనం, విద్యుత్ టోకు ధరల ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో ఏకంగా 4.70 శాతం నుంచి 7.85 శాతానికి పెరగడంతో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 3.18 శాతానికి చేరింది. కూరగాయలు, పండ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి . సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం… ఏప్రిల్ నెలలో టోకు ద్రవ్యోల్బణం 3.18శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 2.47 శాతంగా మాత్రమే నమోదు కాగా… గతేడాది ఏప్రిల్లో 3.85 శాతంగా ఉంది.
టోకు ద్రవ్యోల్బణం
మార్చిలో ఆహార పదార్థాల ధరలు 0.29శాతం తగ్గగా… ఏప్రిల్ నెలలో అవి 0.87శాతం పెరిగాయి.
ఇక కూరగాయాల ధరలు మాత్రం 0.89శాతం తగ్గాయి. అంతక్రితం నెలలో కూరగాయల ధరలు 2.70శాతం తగ్గడం గమనార్హం
ఇంధనం, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం మార్చిలో 4.70శాతానికి పెరగగా… ఏప్రిల్లో నెలలో మరింత పెరిగి 7.85శాతంగా నమోదైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమనడమే ఇందుకు కారణం.
ద్రవ్యోల్బణాన్ని బట్టి కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే ఆర్బీఐ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఏప్రిల్ -సెప్టెంబర్ వరకు ద్రవ్యోల్బణాన్ని 4.7-5.1 శాతంగా, అక్టోబర్-మార్చి వరకు 4.4 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
కండోమ్ పెట్టిన చిచ్చు.. ఇద్దరు నటీమణుల గొడవ!
Highlights
ఒక్కోసారి సరదా అనుకొని చేసే కామెంట్స్ కాస్త వివాదాలకు దారి తీస్తుంటాయి
ఒక్కోసారి సరదా అనుకొని చేసే కామెంట్స్ కాస్త వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా ఇద్దరు హీరోయిన్ల మధ్య కూడా సరదాగా సాగిన కన్వర్జేషన్ కాస్త సీరియస్ అయిపోయింది. ఒకరిపై ఒకరు బూతుల వర్షం కురిపించేవరకు ఈ వివాదం సాగింది.
అసలు విషయంలోకి వస్తే.. మహారాష్ట్రలో ప్లాస్టిక్ వినియోగంపై బ్యాన్ విధించారు. దీనిపై సీరియల్ నటి మహికా శర్మ.. రాఖీ సావంత్ ను ఉద్దేశిస్తూ ప్లాస్టిక్ బ్యాన్ పై అవగాహన పెంచుతావా..? కండోమ్ లు కూడా బ్యాన్ అయ్యాయా..? అంటూ సరదాగా ఓ కామెంట్ పెట్టింది. మహికా ఇలా ప్రశ్నించడం రాఖీకి రుచించక.. ఆమెను తిడుతూ కొని వీడియోలకు పోస్ట్ చేసింది. కండోమ్ ల గురించి నాకు ఐడియా ఉంది.
అవి ప్లాస్టిక్ తో కాకుండా రబ్బర్ తో తయారు చేస్తారు.. ఒకవేళ అవి గనుక బ్యాన్ చేస్తే.. మహికా లాంటి వాళ్లు ఎయిడ్స్ వచ్చి పోతారు అంటూ ఘాటుగా స్పందించింది రాఖీ. సరదాగా పోస్ట్ పెడితే రాఖీ ఇంతగా అవమానిస్తుందా అంటూ మహికా కూడా ఆమెపై విరుచుకుపడింది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కామెంట్లు చేసేప్పుడే జాగ్రత్త పడితే సరిపోయే దానికి ఇంతవరకు తెచ్చుకుంటున్నారు నేటి తారలు. | 0business
|
మొదటి వార్మప్ మ్యాచ్కు కెప్టెన్గా ధోనీ,
రెండవ మ్యాచ్కు అజింక్యా రహానే
ముంబై: టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనికి మరోసారి సారథ్య బాధ్యతలు దక్కాయి. ప్రధాన పోటీలో కాదు వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్ తో జరుగనున్న వన్డే,టి20 సిరీస్లకు సెలక్షన్ కమిటీ శుక్రవారం జట్టును ఎంపిక చేసింది. సారథ్య బాధ్యతల నుంచి వైదొలగిన ధోని రెండు ఫార్మాట్లలో ఆటగాడిగా కొనసా గుతున్నాడు. ఇంగ్లండ్తో జరుగనున్న మొదటి వార్మప్మ్యాచ్కు కెప్టెన్గా ధోనిని సెలక్షన్కమిటికి ఎంపిక చేసింది. భారత ఎజట్టుకు ధోని నాయక త్వం వహిస్తాడు. టీమిండియా టెస్టు జట్టుకు నాయకుడిగా ఉన్న కోహ్లీ వన్డే, టి20 సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండవ వార్మప్ మ్యాచ్ కు అజింక్యా రహానే కెప్టెన్గా వ్యవహరి స్తాడు. మొదటి వార్మఫ్ మ్యాచ్కు భారత ఎ జట్టులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు చోటు దక్కింది. మొదటి వార్మప్ మ్యాచ్కు భారత ఎ జట్టు ధోని(కెప్టెన్),ధవన్,మన్దీప్,అంబటి రాయుడు,యువరాజ్,హార్థిక్ పాండ్యా, సంజూ శామ్సన్,కుల్ధీప్ యాదవ్,దాహల్,నెహ్రా,మొహిత్శర్మ, సిద్దార్థ కాల్. రెండవ వార్మప్ మ్యాచ్కు భారత ఎ జట్టు రహానే (కెప్టెన్),పంత్,రైనా,దీపక్హుడా,ఇషాన్ కిషన్, షెల్డాన్ జాక్సన్, వి శంకర్, నదీం,పర్వేజ్ రసూల్,విన§్ుకుమార్,నదీప్ సాంగ్వాన్, అశోక్ దిందా. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్లు పైపైకి..!
కొలంబో వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్లో అత్యుత్తమంగా రాణించిన భారత స్పిన్నర్లు ఐసీసీ టీ20
TNN | Updated:
Mar 19, 2018, 08:09PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్లు పైపైకి..!
కొలంబో వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో అత్యుత్తమంగా రాణించిన భారత స్పిన్నర్లు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ మెరుగైన ర్యాంక్‌ని అందుకున్నారు. ఐసీసీ సోమవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో మణికట్టు స్పిన్నర్ చాహల్ 12 స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌ని దక్కించుకోగా.. వాషింగ్టన్ సుందర్ 151 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ ర్యాంక్‌‌కి ఎగబాకాడు. | 2sports
|
Nissan Sunny
నిస్సాన్ సన్నీ ధరల తగ్గింపు!
ముంబై, జపాన్ ఆటోమొబైల్ ఉత్పత్తి సంస్థ నిస్సాన్ గురువారం తనమిడ్సైజ్ సెడాన్ సన్నీధరలను 1.99 లక్షలు తగ్గించింది. ప్రారంభ ధరల్లో సన్నీ 6.99 లక్షల రూపాయల నుంచి 8.99 లక్ష లరూపాయల ఢిల్లీఎక్స్షోరూంధరల్లో లభిస్తుంది. కొత్తధరల్లో సన్నీ పెట్రోలు వెర్షన్ ప్రస్తు తం 6.99 లక్షలుగా ఉంది. 1.01లక్షలు తగ్గించిం ది. టాప్ ఎండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరి యంట్ రూ.8.99 లక్షలుగా ఉంది. 1.99 లక్షలు తగ్గించింది. అదేవిధంగా డీజిల్ వేరియంట్ ధరలు కూడా 1.31 లక్షలు తగ్గించి ఇకపై 7.49 లక్షలకు విక్రయిస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ 94 వేల ధరలు తగ్గి రూ.8.99 లక్షలకే లభిస్తుంది. గత ఏడాది కంపెనీ ఆటోమేటిక్ట్రాన్స్మిషన్వేరియంట్ ప్రీమియం హ్యాచ్బ్యాక్మిక్రాధరలను రూ.54,252 లకు తగ్గించింది. విడిభాగాలను స్థానికంగానే ఉత్పత్తి చేయడం వల్లనే ధరలు తగ్గాయని తేలింది. | 1entertainment
|
Hyderabad, First Published 3, Jul 2019, 12:13 PM IST
Highlights
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాలకు దూరమవుతున్నారని గత కొంత కాలంగా రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమాలను గ్యాప్ ఇస్తున్నారేమో అని అంతా అనుకుంటున్న వేళ.. నిజంగానే పూర్తిగా సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టేసే ఆలోచనలో ఉన్నట్లు నార్త్ మీడియాలో టాక్ వస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాలకు దూరమవుతున్నారని గత కొంత కాలంగా రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమాలను గ్యాప్ ఇస్తున్నారేమో అని అంతా అనుకుంటున్న వేళ.. నిజంగానే పూర్తిగా సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టేసే ఆలోచనలో ఉన్నట్లు నార్త్ మీడియాలో టాక్ వస్తోంది.
వరుస ఫ్లాపులు ఎదురవడంతో షారుక్ సినిమాల బిజినెస్ బాగా తగ్గిపోయింది. అయితే ఇంకా మార్కెట్ లో తన క్రేజ్ దిగజారకముందే ఎండ్ కార్డ్ పెట్టేయాలని ఆలోచిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అదే విధంగా తన వారసుల కెరీర్ పై ద్రుష్టి పెట్టాలనే ఆలోచనతో కూడా షారుక్ నటనకు దూరమవుతున్నట్లు చెబుతున్నారు.
పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ కి ఇప్పుడు 21 ఏళ్ళు. అతని ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తన వారసుడి కోసం ఒక మంచి సినిమాని సెట్ చేయాలంటే తాను వేరే పనులు పెట్టుకోకూడదని కింగ్ ఖాన్ డిసైడ్ అయినట్లు టాక్. ఆర్యన్ కెరీర్ ని ఒక ట్రాక్ లో పెట్టాలంటే ఎంతో కొంత సమయం పడుతుంది.
అతని కెరీర్ ని సెట్ చేయాలనీ షారుక్ సినిమాలకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ రూమర్స్ పై షారుక్ ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.
Last Updated 3, Jul 2019, 12:13 PM IST | 0business
|
మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పార్ట్ - 2 (వీడియో)
23, Mar 2019, 4:27 PM IST
తెలుగు ఎంతో మంది అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. అందులో మ్యూజిక్ డైరెక్టర్ కోటి కి కూడా ఒక పేజి ఉంటుంది. ఆయన అందించిన పాటలు ఇప్పటికి శ్రోతలను అలరిస్తూనే ఉంది. అసులు ఆయనకు సంగీతం మీద ఇంత మక్కువ ఎల వచ్చింది. ఆయన చిన్నపటి అనుభవాలు.. మరియు ఆయన రాజ్ తో కలిసి పనిచేసిన అనుభవాలు. వాళ్ల అబ్బాయి ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు. మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే విందాం... | 0business
|
Jakarta, First Published 28, Aug 2018, 1:23 PM IST
Highlights
కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్వతహాగా క్రీడాకారుడు అన్న సంగతి తెలిసిందే. ఒలింపిక్స్లో పతకాన్ని కొట్టిన ఆయన కేంద్రమంత్రి అయినా క్రీడలు, క్రీడాకారుల పట్ల అభిమానాన్ని మాత్రం పక్కనపెట్టలేదు. ఈ అభిమానమే ఆయన్ను సర్వర్గా మార్చింది.
కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్వతహాగా క్రీడాకారుడు అన్న సంగతి తెలిసిందే. ఒలింపిక్స్లో పతకాన్ని కొట్టిన ఆయన కేంద్రమంత్రి అయినా క్రీడలు, క్రీడాకారుల పట్ల అభిమానాన్ని మాత్రం పక్కనపెట్టలేదు. ఈ అభిమానమే ఆయన్ను సర్వర్గా మార్చింది.
ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులను ప్రొత్సహించేందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ జకార్తాలో పర్యటిస్తున్నారు. ఆటగాళ్లను స్వయంగా కలుసుకుని వారితో ముచ్చటిస్తున్నారు. ఎవరు పతకం గెలిచినా వెంటన్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజాగా ఆటగాళ్లంతా ఆహారాన్ని తీసుకునే చోటికి వెళ్లారు.. అయితే ఆయన వచ్చిన సంగతిని క్రీడాకారులు గుర్తించలేదు. ఇలోగా బౌల్స్లో సూప్, టీ పోసుకుని ప్లేటులో పెట్టుకుని ఆటగాళ్ల కోసం తీసుకెళ్లారు. మంత్రిని చూడగానే క్రీడాకారులు అవాక్కయ్యారు.. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Last Updated 9, Sep 2018, 1:06 PM IST | 2sports
|
Hyderabad, First Published 4, Aug 2019, 10:30 AM IST
Highlights
ఈ మద్యకాలంలో ఎక్కువగా మీడియాలో చర్చించబడి, రీమేక్ గా రాబోతోందని ప్రచారం జరిగిన చిత్రం విక్రమ్ వేద. గత పదేళ్ల కాలంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటి ‘విక్రమ్ వేద’. భార్యాభర్తలైన పుష్కర్ గాయత్రి తీసిన ఈ సినిమా ఇటు విమర్శకులను, అటు ప్రేక్షకులను మెప్పించింది. సినిమా కమర్షియల్గానూ చాలా పెద్ద హిట్టయింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి ఫిలిం ఇన్స్టిట్యూట్లలో పాఠాలు చెబుతున్నారు.
ఈ మద్యకాలంలో ఎక్కువగా మీడియాలో చర్చించబడి, రీమేక్ గా రాబోతోందని ప్రచారం జరిగిన చిత్రం విక్రమ్ వేద. గత పదేళ్ల కాలంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటి ‘విక్రమ్ వేద’. భార్యాభర్తలైన పుష్కర్ గాయత్రి తీసిన ఈ సినిమా ఇటు విమర్శకులను, అటు ప్రేక్షకులను మెప్పించింది. సినిమా కమర్షియల్గానూ చాలా పెద్ద హిట్టయింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి ఫిలిం ఇన్స్టిట్యూట్లలో పాఠాలు చెబుతున్నారు.
దాంతో మీడియాకు గుర్తు వచ్చినప్పుడల్లా ఎవరో ఇద్దరు హీరోలను తీసుకుని ఆ రీమేక్ లో చేస్తున్నారంటూ స్టోరీ రాసేసి, ట్రెండింగ్ లోకి తెచ్చింది. అందులో భాగంగా రాజశేఖర్, బాలకృష్ణ లతో ముడి పెట్టి ఈ రీమేక్ గురించి తెలుగు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఏ హీరో ఆ ధైర్యం చేయలేదు. ఆ వార్తలన్ని ఫేక్ అని మీడియా వండి వార్చినవే అని తేలిపోయాయి.
అయితే హిందీలో మాత్రం ‘విక్రమ్ వేద’ రీమేక్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. చాలాకాలంగా సాగుతున్న నటీనటుల వేటకు దాదాపుగా ముగిసినట్లే అని సమాచారం సమాచారం.
తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రలో ఆమిర్ ఖాన్.. మాధవన్ చేసిన క్యారెక్టర్లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారని తెలుస్తోంది. మాతృకను డైరెక్ట్ చేసిన భార్యాభర్తల దర్శక ద్వయం పుష్కర్-గాయత్రినే హిందీ వెర్షన్ను కూడా దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
ఎ వెడ్నస్ డే, బేబీ, స్పెషల్ చబ్బీస్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు నీరజ్ పాండే ‘విక్రమ్ వేద’ రీమేక్ను నిర్మిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు నేటివిటీ, స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేస్తున్నారట. ప్రస్తుతం అమీర్ ఖాన్ హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ అఫీషియల్ రీమేక్లో నటిస్తున్నారు. ఆ చిత్రం పూర్తయ్యాక ఈ ప్రాజెక్టులోకి వస్తాడు.
Last Updated 4, Aug 2019, 12:42 PM IST | 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.