news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Visit Site
Recommended byColombia
బ్యాంకు విదేశీ కరెన్సీ జారీ ఆధారిత రేటింగ్ను కూడా బీఏఏ3 నుంచి బీఏ1కు తగ్గించింది. దీంతో పాటు పీఎన్బీ బ్యాంక్ బేస్లైన్ క్రెడిట్ అసెస్మెంట్(బీసీఏ), అడ్జెస్టెడ్ బీసీఏను కూడా ‘బీఏ3’ నుంచి ‘బీ1’కు తగ్గించింది. బ్యాంకులో వెలుగుచూసిన మోసాలు, అంతర్గత నియంత్రణ బలహీనంగా ఉండటమే రేటింగ్ను తగ్గించడానికి కారణమని మూడీఎస్ పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పీఎన్బీలో భారీ కుంభకోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. వజ్రాల వ్యాపారి నీరవ్మోదీ, ఆయన బంధువు మెహుల్ ఛోక్సీ ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరు బ్యాంకు నుంచి అక్రమంగా ఎల్ఓయూలు తీసుకుని విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. మోసాలతో సతమతమవుతున్న బ్యాంకు జనవరి-మార్చి త్రైమాసికంలో భారీ నష్టాన్ని నమోదు చేసింది. మొండి బకాయిలపై కేటాయింపులు పెరగడంతో ఏకంగా రూ.13,416.91 కోట్ల త్రైమాసిక నష్టాన్ని నమోదు చేసింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Suresh 198 Views
టి20 ప్రపంచ క్రికెట్ సిరీస్లో భాగంగా బుధవారం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో భారత్ ఒక్క పరుగు తేడాలో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. బంగ్లాదేశ్కు 147 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. | 2sports
|
Visit Site
Recommended byColombia
ప్రధానమంత్రిని కూడా కలిసి సైరా సినిమా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిరంజీవి. అయితే వీటిపై యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ ఏంటంటే.. ఇండస్ట్రీలో స్వర్గీయ దాసరి నారాయణ రావుగారి ప్లేస్ను భర్తీ చేసేందుకు చిరంజీవి ఇవన్నీ చేస్తున్నారు అని. ఇది నాకు కామెడీ చేయడానికి పరాకాష్టగా అనిపించింది.
ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్లలో చిరంజీవి పెద్ద ఆర్టిస్ట్. ఆయన తలచుకుంటే ఏ స్థానమైనా తీసుకోవచ్చు. ఆయన కావాలనుకుంటే.. దాసరి పొజీషన్ అనేది అఫీషియల్ పోస్ట్ కాదు. ఏ పదవి లేదు అక్కడ. దాసరి పెద్ద మనిషిగా ఉన్నారు. అందరితో కలిసి మాట్లాడేవారు. అలాగే చిరంజీవి గారు చేయాలంటే చేయొచ్చు. ఆయన్ని చేయమని నేను రెండు మూడు సార్లు అడిగా. మా ఇష్యూలో కూడా గతంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి పరిష్కరించారు.
సో ఇండస్ట్రీలో ఏదైనా చేయాలి అనుకుంటే.. చిరంజీవి.. జగన్ దగ్గరకు ఎందుకు వెళ్తారు. జగన్ ఏమైనా చెప్తారా? ఆయనేమైనా పదవి ఇస్తారా? ముఖ్యమంత్రి ఏమైనా పదవి ఇస్తారా? దీని కోసం చిరంజీవి ఆయన దగ్గరకు ఎందుకు వెళ్తారు. వీళ్లకు తెలిసి మాట్లాడతారో తెలియకమాట్లాడతారో.. లేక అమాయకత్వంతో మూర్ఖత్వమో నాకు తెలియడం లేదు. చిరంజీవి పేరు చెప్తే మనకు ఏదోటి వస్తుందని అనుకోవడమో నాకు అర్ధం కాలేదు. ఇది పెద్ద జోకు.
మరోవైపు గంటా శ్రీనివాసరావుని వైసీపీలోకి తీసుకువెళ్లేందుకు చిరు మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గంటా అనుకుంటే ఏ పార్టీలోకైనా వెళ్లగలడు. డబ్బు ఉంది కాబట్టి చిరంజీవి తీసుకువెళ్లి వేరే పార్టీలో చేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ల బతుకు వాళ్లు చూసుకుంటున్నారు. వాళ్లను బయటకు లాగడం వల్ల వీళ్లకు వచ్చేదేమిటో నాకు అర్ధం కావడం లేదు. సోషల్ మీడియాను పిచ్చి పిచ్చి వాటికి ఉపయోగించడం కరెక్ట్ కాదు’ అంటూ చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి. | 0business
|
ఆరో మాసంలోనూ నిరుత్సాహం
- మే ఎగుమతుల్లో 20% పతనం
- 10.40 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత్తికి తోడు భారత ఉత్పత్తుల ధరలు, నాణ్యత అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడలేకపోవడంతో వరుసగా ఆరో మాసంలోనూ ఎగుమతులు రాణించలేకపోయాయి. ఈ ఏడాది మేలో ఏకంగా 20.19 శాతం పతనమై 22.34 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకున్నాయి. గతేడాది ఇదే మాసంలో 28 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. క్రితం ఏప్రిల్ ఎగుమతులతోనూ పోల్చిన మేలో 13.96 శాతం తగ్గుదల నమోదయ్యిందని మంగళవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. గతేడాది నవంబర్లో మాత్రమే సానుకూలంగా 27.99 బిలియన్ డాలర్ల ఎగుమతులు చోటు చేసుకున్నాయి. ఇక తర్వాత మాసాల్లో వరుసగా క్షీణిస్తు వస్తున్నాయి. వరుసగా పడిపోతున్న ఎగుమతులు మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేక్ ఇన్ ఇండియాకు ప్రధాన సవాల్ను విసురుతున్నాయి. మరోవైపు క్రితం మాసంలో దిగుమతులు 16.52 శాతం తగ్గి 32.75 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే మాసంలో 39.23 బిలియన్ డాలర్ల దిగుమతులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్తో పోల్చితే మేలో వాణిజ్య లోటు 10.40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఏప్రిల్లో ఈ లోటు11 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి రెండు మాసాల్లో మొత్తం ఎగుమతులు 17.21 శాతం పతనమై 44.40 బిలియన్ డాలర్లుగా, గతేడాది ఇదే మాసంలో 53.60 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. మరోవైపు క్రితం రెండు మాసాల్లో దిగుమతులు 12.21 శాతం తగ్గి 65.80 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే రెండు మాసాల్లో 74.95 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయి. క్రితం ఏప్రిల్, మే మాసాల్లో భారత వాణిజ్య లోటు 21.39 బిలియన్ డాలర్లుగా, గతేడాది ఇదే రెండు మాసాల్లో 21.32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. క్రితం మే మాసంలో చమురు దిగుమతులు 41 శాతం తగ్గి 8.53 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్, మేలో 41.76 శాతం పతనమై 16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
మేలో చమురేతర దిగుమతులు 2.24 శాతం తగ్గి 24.21 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత మాసంలో బంగారం దిగుమతులు 10.47 శాతం పెరిగి 2.42 బిలియన్ డాలర్లకు చేరాయి. 2014-15లో భారత ప్రభుత్వం పెట్టుకున్న 340 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేరలేక 310.5 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 9, Jul 2019, 1:43 PM IST
Highlights
మొత్తానికి విజయ్ దేవరకొండ నుంచి మరో డిఫరెంట్ ఫిల్మ్ రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాను భరత్ కమ్మా తెరకెక్కించాడు. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోవడంతో చిత్ర యూనిట్ ట్రైలర్ ను సిద్ధం చేసింది.
మొత్తానికి విజయ్ దేవరకొండ నుంచి మరో డిఫరెంట్ ఫిల్మ్ రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాను భరత్ కమ్మా తెరకెక్కించాడు. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోవడంతో చిత్ర యూనిట్ ట్రైలర్ ను సిద్ధం చేసింది.
తెలుగు - తమిళ్ - కన్నడ - మళయాలం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. అందుకోసం 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ముహూర్తం సెట్ చేశారు. స్పెషల్ సమయంలో రిలీజ్ కానున్న డియర్ కామ్రేడ్ ట్రైలర్ కోసం సౌత్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపించనున్నాడట. సినిమాలో మాస్ ఆడియెన్స్ మెచ్చే అంశాలతో పాటు రొమాంటిక్ డోస్ కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు. | 0business
|
sumalatha 65 Views bse , NSE , stock market
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం లాభాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్ 150 పాయింట్లు లాభపడి 38,818 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 11,524వద్ద ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ప్రవేటు బ్యాంకుల షర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/ | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
india vs new zealand: kiwis beat india by 40 runs
భారీ లక్ష్య చేధనలో చేతులెత్తేసిన భారత్
భారీ లక్ష్య చేధనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన భారత్ చేతులెత్తేసింది. కోహ్లి, ధోనీ పోరాడినా.. విజయానికి 40 పరుగుల దూరంలో నిలిచింది.
TNN | Updated:
Nov 4, 2017, 10:57PM IST
రాజ్‌కోట్ టీ20లో న్యూజిలాండ్ జట్టు 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్.. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (42 బంతుల్లో 65; 8x4, 1x6), మహేంద్ర సింగ్ ధోనీ (37 బంతుల్లో 49; 2x4, 3x6) పోరాడినప్పటికీ.. సాధించాల్సిన రన్ రేట్ కొండలా పెరిగిపోవడంతో భారత్ 20 ఓవర్లలో 156/7కే పరిమితమైంది. ఓవర్‌కు దాదాపు పది పరుగులు చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాను ట్రెంట్ బౌల్ట్ ఆదిలోనే దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్లు శిఖర్ ధావన్ (1), రోహిత్ శర్మ (5)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత జట్టు 11 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితిలో కొత్త కుర్రాడు శ్రేయస్ అయ్యర్ (21 బంతుల్లో 23), విరాట్ కోహ్లితో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ కుదురుకుంటున్న తరుణంలో మున్రో బౌలింగ్‌లో అయ్యర్‌ అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య (1) కూడా వెంటనే అవుట్ కావడంతో భారత జట్టు 67 పరుగులకే నాలుగు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది.
Visit Site
Recommended byColombia
ఓవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ కోహ్లి మాత్రం ధాటిగా పరుగులు రాబట్టాడు. 32 బంతుల్లో అర్ధ సెంచరీ బాదిన విరాట్ జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. మరో ఎండ్‌లో ధోనీ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో విరాట్ ఒత్తిడికి లోనయ్యాడు. శాంట్నర్ విసిరిన 17 ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ విజయంపై ఆశలు వదులుకుంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 49 పరుగులు అవసరం కాగా, తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన ధోనీ బౌల్ట్ విసిరి రెండో బంతిని శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్‌కు 4 వికెట్లు దక్కగా, శాంట్నర్, సోథీ, మున్రో తలో వికెట్ పడగొట్టారు.
జట్టును గెలిపించడంలో కోహ్లి విఫలమైనప్పటికీ.. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. న్యూజిలాండ్‌కు చెందిన బ్రెండన్ మెకల్లమ్ (2140) తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ కోహ్లి(1943)నే కావడం విశేషం.
అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. గుప్టిల్ (44 బంతుల్లో 45), మున్రో (58 బంతుల్లో 109 నాటౌట్; 7x4, 7x6) న్యూజిలాండ్‌కు భారీ స్కోరు అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 105 పరుగులు జోడించారు. తర్వాత గుప్టిల్‌ను చాహల్ అవుట్ చేసినప్పటికీ.. మున్రో మాత్రం మెరుపు సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన సిరాజ్ భారీగా పరుగులిచ్చి నిరాశపరిచాడు.
టీ20ల్లో భారత్‌పై శతకం సాధించిన తొలి కివీస్ ఆటగాడిగా మున్రో రికార్డు నెలకొల్పాడు. ఈ సెంచరీతో టీ20ల్లో రెండు శతకాలు సాధించిన క్రిస్ గేల్, బ్రెండన్ మెక్ కల్లమ్, ఈవిన్ లూయిస్‌ల సరసన మున్రో చేరాడు. అద్భుతంగా బ్యాటింగ్‌ చేయడంతో పాటు బౌలింగ్‌లో ఒక వికెట్ తీసుకున్న మున్రో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. | 2sports
|
Hyderabad, First Published 5, Aug 2019, 3:41 PM IST
Highlights
ఫైనల్ డ్రాఫ్ట్ విన్న తరువాత రామ్ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నారట. కథ, కథనాలు బాగానే ఉన్నప్పటికీ రీమేక్ అనేసరికి రామ్ వెనకడుగు వేస్తున్నాడు.
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మాస్ ఆడియన్స్ లో ఈ సినిమాకి చక్కటి ఆదరణ లభించింది. చాలారోజుల తరువాత దర్శకుడు పూరి జగన్నాథ్ కి సక్సెస్ రావడంతో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
ఈ సినిమా కోసం రామ్ ఎంతో కష్టపడ్డాడు. సినిమాకి హిట్ టాక్ రావడంతో అమెరికాకి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తరువాత రామ్ ఓ తమిళ రీమేక్ లో నటించాల్సివుంది. కోలీవుడ్ లో సక్సెస్ అయిన 'తడం' అనే సినిమా తెలుగు రైట్స్ రామ్ పెదనాన్న ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ దక్కించుకున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను తెరకెక్కించాలను నిర్ణయించుకున్నారు.
రామ్ హీరోగా అనుకున్నారు. ఫైనల్ డ్రాఫ్ట్ విన్న తరువాత రామ్ ఈ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నారట. కథ, కథనాలు బాగానే ఉన్నప్పటికీ రీమేక్ అనేసరికి రామ్ వెనకడుగు వేస్తున్నాడు. తనకు సినిమా నచ్చినా.. రిస్క్ తీసుకోలేకపోతున్నాడు. దీంతో సినిమా హోల్డ్ లో పడింది. రామ్ కి బదులుగా మరో హీరోని తీసుకోవాలా..?లేక కొన్నాళ్లు సినిమాను పక్కన పెట్టాలా..? అనే డైలమాలో పడిపోయాడు స్రవంతి రవికిషోర్.
ప్రస్తుతం రామ్ దర్శకులను కలుస్తూ తన తదుపరి సినిమా కోసం కథలు వింటున్నాడు. ఇటీవల గుండు కొట్టించడంతో కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని సినిమాలు చేయాలనుకుంటున్నాడు రామ్. త్వరలోనే స్క్రిప్ట్ ఒకే చేసి అధికారికంగా ప్రకటించనున్నాడు.
Last Updated 5, Aug 2019, 3:41 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
200 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
దేశీయ మార్కెట్లకు ఈ రోజు కూడా నష్టాలు కొనసాగాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో గతవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు... సోమవారం కూడా తీవ్రంగా కుంగాయి. పీఎన్బీ ఆర్థిక మోసం కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టాల్లోకి వెళ్లడం మార్కెట్ సెంటిమెంటును బాగా దెబ్బకొట్టింది.
TNN & Agencies | Updated:
Feb 19, 2018, 04:56PM IST
దేశీయ మార్కెట్ల‌కు ఈ రోజు కూడా న‌ష్టాలు కొనసాగాయి. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు కుంభ‌కోణం నేప‌థ్యంలో గ‌తవారం భారీ న‌ష్టాల‌ను చ‌విచూసిన సూచీలు... సోమ‌వారం కూడా తీవ్రంగా కుంగాయి. పీఎన్బీ ఆర్థిక మోసం కార‌ణంగా ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు న‌ష్టాల్లోకి వెళ్ల‌డం మార్కెట్ సెంటిమెంటును బాగా దెబ్బ‌కొట్టింది. దీంతో ప్ర‌ధాన సూచీలు రెండూ న‌ష్టాల‌తోనే ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే స‌మయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 33,775 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 10378 వ‌ద్ద స్థిర‌ప‌డింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో కోల్ ఇండియా(0.66%), యాక్సిస్ బ్యాంక్(0.57%), ఇన్ఫీ(0.46%), రిల‌య‌న్స్(0.45%), ఎన్టీపీసీ(0.31%) బాగా లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు టాటా స్టీల్ అత్య‌ధికంగా 5.82% న‌ష్ట‌పోయింది. ఇంకా ఏసియ‌న్ పెయింట్స్(2.77%), డాక్ట‌ర్ రెడ్డీస్(2.75%), అదానీ పోర్ట్స్(2.72%), ఎల్ అండ్ టీ(2.35%), ఎం అండ్ ఎం(2.24%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి. | 1entertainment
|
Hyd Internet 93 Views Sourav Ganguly
sourav ganguly
కోల్కతా: భారత-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ను మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరిశీలించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వికెట్పై ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని, ఇది మంచి వికెట్ అని తెలిపారు. అలాగే పరిపాలకుడిగా కంటే ఆటగాడిగా ఉండడమే కష్టమని అన్నాడు. ‘పరిపాలనలో ఓసారి విఫలమైనా మరో అవకాశం ఉంటుంది. కానీ ఆటగాడికి అలాంటి దేమీ ఉండదు’ అని దాదా తెలిపారు. | 2sports
|
త్వరలో లక్షల ఉద్యోగాలు: దత్తాత్రేయ
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
రానున్న రోజులలో యువతకు లక్షల్లో ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్లో కార్మిక శాఖకు చెందిన వివిధ విభాగాల వారు ఏర్పాటు చేసిన ఒక అవగాహన ప్రదర్శనను ఆయన ఆదివారం ఇక్కడ ప్రారంభించి ప్రసంగించారు. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం వల్ల త్వరలో ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయని ఆయన వివరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన యువతకు, అధికారులకు సూచించారు. దీనివల్ల దేశం శుభ్రంగా, పచ్చగ ఉంటుందని ఆయన అన్నారు. బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ల పథకానికి గాను దాదాపు రూ.9 కోట్ల నిధులను విడుదల చేశారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు, ఉద్యోగ సంస్థలకు అందిస్తున్న పలు ప్రయోజనాలను గురించి తెలుగులో ప్రచురించిన చేతి పుస్తకాన్ని ఆయన ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పీఎఫ్ కమీషనర్ కె.కె.జలాన్, ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ అగర్వాల్తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 10, Oct 2018, 9:58 AM IST
Highlights
ప్రస్తుతం దేశంలో కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ఉదృతంగా మారాయి. ఇప్పటివరకు సినీ తారలు మాత్రమే వారికి ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టు లో మహిళా జర్నలిస్ట్ లు కూడా యాడ్ అయ్యారు.
ప్రస్తుతం దేశంలో కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ఉదృతంగా మారాయి. ఇప్పటివరకు సినీ తారలు మాత్రమే వారికి ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టు లో మహిళా జర్నలిస్ట్ లు కూడా యాడ్ అయ్యారు.
తాజాగా మీడియాకి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ తనకు ఎదురైన ఓ సంఘటనను సోషల్ మీడియాలో బయటపెట్టింది. పెళ్లికి ముందు టాలీవుడ్ లో సినిమా జర్నలిస్ట్ గా పని చేసిన తనను ఓ హీరో లైంగికంగా వేధించాదంటూ ఆరోపణలు చేసింది ఓ మహిళా రిపోర్టర్.
ఓ నైట్ పార్టీలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఆ తరువాత పలుమార్లు గెస్ట్ హౌస్ కి రమ్మని పిలిచేవాడని చెప్పుకొచ్చింది. తన పెళ్లికి రెండు రోజుల ముందుకు కూడా సదరు హీరో ఫోన్ చేసి ఒక్కసారి కలవాలి రమ్మని పిలిచినట్లు వెల్లడించింది.
తనకు ఎప్పుడైతే పెళ్లి కుదిరిందని చెప్పిందో.. అప్పటినుండి సదరు బడా హీరో నుండి తనకు కాల్స్, మెసేజ్ లు రావడం ఆగిపోయాయని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. సదరు మహిళా జర్నలిస్ట్ ని కొందరు నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆమె వెంటనే పెట్టిన పోస్ట్ ని తన ఖాతా నుండి తొలగించింది.
ఇవి కూడా చదవండి.. | 0business
|
సూపర్ హౌస్ నికర లాభం రూ. 18 లక్షలు
PNR| Last Modified శుక్రవారం, 3 ఆగస్టు 2007 (17:36 IST)
ప్రముఖ లెథర్ ఉత్పత్తుల సంస్థ, సూపర్ హౌస్ జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ. 18 లక్షల నికరలాభాన్ని నమోదు చేసుకుంది. దీనితో కంపెనీ అమ్మకపు విలువ 22 శాతం మేర పెరిగిందని సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
యూఎస్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా రూ. 80వేల పెట్టుబడితో కొత్త ఫుట్వేర్ డివిజన్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందని విడుదల వివరాలు పేర్కొంటున్నాయి.
జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో బ్యాగ్, షూస్ వంటి లెథర్ ప్రాడెక్ట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసిందని కంపెనీ అధికారిక వర్గ వివరాలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా కాన్పూర్, యునావో, ఆగ్ర వంటి తదితర ప్రాంతాల్లో దాదాపు 12 యూనిట్లను విస్తరించిందని ఆ వివరాలు తెలిపాయి.
సంబంధిత వార్తలు | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రష్మి 'తను వచ్చెనంట' టీజర్
జబర్దస్త్ రష్మి గౌతమ్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే 'జాంబీస్' ఈసారి తెలుగు సినిమా తను వచ్చెనంటలో రష్మి రూపంలో కనిపించనుంది...
TNN | Updated:
Jul 24, 2016, 02:45PM IST
X
Bathukamma Song: మంగ్లీ బత...
జబర్దస్త్ రష్మి గౌతమ్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే 'జాంబీస్' ఈసారి తెలుగు సినిమాలో రష్మి రూపంలో కనిపించనుంది. ప్రస్తుతం రష్మి 'తను వచ్చెనంట' చిత్రంలో నటిస్తోంది. తేజ కాకుమాను (బాహుబలి ఫేం), రేష్మి గౌతం, ధన్య బాలకృష్ణన్ నటీనటులుగా శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మాతగా వెంకట్ కాచర్ల దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తను వచ్చెనంట'. రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు హారర్- కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ ను తాజాగా విడుదల చేశారు. అతి త్వరలోనే ఈ చిత్రం ఆడియో కూడా రిలీజ్ చేసి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. | 0business
|
రవితేజ "టచ్ చేసి చూడు" ఫస్ట్ డే కలెక్షన్స్
Highlights
రవితేజ నటించిన తాజా చిత్రం "టచ్ చేసి చూడు"
"టచ్ చేసి చూడు" చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ నిరాశ
రొటీన్ కథాంశం కావటంతో పడిపోయిన వసూళ్లు
ఇటీవల రాజా ది గ్రేట్ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కిన మాస్ రాజా ‘టచ్ చేసి చూడు’ తొలిరోజు కలెక్షన్స్లో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. భారీ అంచనాలతో శుక్రవారం నాడు థియేటర్స్కి వచ్చిన ఈ మూవీ తొలి ఆట నుండి నెగిటివ్ టాక్ రావడంతో ఈ ప్రభావం కలెక్షన్స్పై పడింది. మాస్ రాజా మూసకథ మాస్ ఆడియన్స్కి తప్ప.. కామన్ ఆడియన్స్ని మెప్పించలేకపోయింది.
ఓవర్సీస్లో బిజినెస్లో ‘టచ్ చేసి చూడు’ వెనకబడిపోవడం, ప్రమోషన్స్ అంతంత మాత్రంగానే ఉండటంతో పాటు టీజర్, ట్రైలర్లు సైతం రొటీన్గానే ఉండటం తొలిరోజు కలెక్షన్స్పై ప్రభావం చూపించింది. రవితేజ గత చిత్రం ‘రాజా ది గ్రేట్’ తొలిరోజు కలెక్షన్స్లో దుమ్ములేపగా.. ‘టచ్ చేసి చూడు’ ఆ స్థాయి కలెక్షన్స్ సాధించలేకపోయింది. ‘రాజా ది గ్రేట్’ తొలిరోజు రూ.4.9 కోట్ల షేర్ని అందుకొని రవితేజ కెరియర్లోనే బెస్ట్ ఓపెనింగ్ మార్క్ని చేరుకోగా.. ‘టచ్ చేసి చూడు’రూ.3 కోట్ల దగ్గరే ఆగిపోయినట్లు ట్రేడ్ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. అయితే ‘టచ్ చేసి చూడు’ తొలిరోజు కలెక్షన్స్పై ఇంత వరకూ అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు చిత్ర యూనిట్. ఈ మూవీలో మాస్ ఆడియన్స్ ఆకట్టుకునే సీన్స్ పుష్కలంగా ఉండటంతో శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరగవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు.
రాశీఖన్నా, సీరత్ కపూర్లు హీరోయిన్లుగా నటించగా... కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ ‘టచ్ చేసి చూడు’ మూవీతో టాలీవుడ్కి పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ కథను అందించారు.
టచ్ చేసి చూడు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్.. ఏపీ తెలంగాణ మొదటిరోజు..
నైజాం-1.56 | 0business
|
kohli
ఛాంపియన్స్ సమరం షురూ
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి గురువారం తెరలేచింది. క్రికెట్లో మినీ వరల్డ్ కప్గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీ మొదటిరోజు ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరుతో ఆరంభమైంది. ఇంగ్లాండ్ వరుసగా రెండోసారి ఆతిథ్యం ఇస్తున్న ఈమెగా టోర్నీలో మొత్తం 8జట్లు పాల్గొంటున్నాయి. జూన్ 1 నుంచి 18వరకు 18రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 15 మ్యాచ్లను 3వేదికల్లో నిర్వహించ నున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీకి ఫ్రైజ్ మనీగా మొత్తం రూ.28.8కోట్లు ఇవ్వనున్నారు. విజేత జట్టుకు రూ.14.8 కోట్లు, రన్నరప్కు రూ.7.4 కోట్లు, సెమీ ఫైనలిస్ట్కు రూ.2.8కోట్లు, గ్రూప్లో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.57.6 లక్షలు, నాలుగో స్థాణం నలిచిన జట్టుకు రూ.38.4లక్షలు ఇవ్వనున్నారు. విండీస్కు ప్రాతినిధ్యంలేకుండా వెనక్కునెట్టిన బంగ్లా ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. సెప్టెబర్ 30, 2015వరకు టాప్-8జట్లు మాత్రమే ఛాంపియన్స్కు అర్హత సాధించగా, విండీస్ నిరాశ ఎదురైంది. బంగ్లాదేశ్ పదకొండేళ్ల తర్వాత తిరిగి చాంపియన్స్ ట్రోఫీ బరిలో నిలిచింది. ర్యాంకింగ్స్లో వెస్టిండీస్ను వెనక్కి నెట్టి బంగ్లా ఈసారి అర్హత సాధించింది. కోచ్, కెప్టెన్ల మధ్య విభేదాలతో బరిలో భారత్ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని ప్రత్యేకతలే చోటు చేసుకున్నాయి. ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి నేపథ్యంలో కొంత అలజడి చెలరేగినా ఇప్పుడు అదంతా సద్దు మణిగి క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఈటోర్నీ సిద్దమైంది.మరో పక్క టైటిల్ ఫేవరెట్గా నిలిచిన భారత్ జట్టు ఇటీవల కోచ్ కూంబ్లే, కెప్టెన్ కోహ్లీల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో ఈసారి భారత్ జట్టు విజయావకాశాలపై ఈఅంశాలు ఏమైనా ప్రభావం చూపుతాయనే భారత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వారి మధ్య సయోద్య కుదిర్చే పనిలో మాజీ సీనియర్లు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గంగూలీకి సవాల్ విసిరిన షేన్ వార్న్ ఛాంపియన్స్ ట్రోఫీలో షేన్ వార్న్ నుంచి ఓ సవాల్ ఎదురైంది. ‘ఆజ్ తక్ సలామ్ క్రికెట్ కార్యక్రంలో సౌరభ్ గంగూలీ, షేన్ వార్న్, మైకేల్ క్లార్క్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ ముగ్గురూ తమ తమ ఫేవరెట్ జట్లను ఎంపిక చేశారు. ఈక్రమంలో జూన్ 18న జరిగే ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడతా యని క్లార్క్ ఆశాభావం వ్యక్తం చేయగా, గంగూలీ వ్యతిరేకించాడు. అంతే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గంగూలీ వ్యాఖ్యలపై మైకేల్ క్లార్క్, వార్న్ స్పందిస్తూ…ఇంగ్లాండ్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎవరు ఉన్నారంటూ ప్రశ్నించారు. దీనికి జో రూట్, బట్లర్ ఉన్నారని గంగూలీ సమాధానమిచ్చాడు. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా ఆస్ట్రేలియా కంటే ఇంగ్లాండ్ పటిష్టంగా ఉందని గంగూలీ చెప్పాడు. అయితే గంగూలీ చెప్పిన సమాధానానికి నొచ్చుకున్న షేన్ వార్న్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 10న ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ నేతృత్వంలో ఆస్ట్రేలియావిజయం సాధిస్తే, గంగూలీ ఆసీస్ జెర్సా ధరించాలని, తనకు డిన్నర్ పార్టీ ఇవ్వాలనికోరాడు. ఒకవేళ అదే మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిస్తే తాము ఇంగ్లాండ్ జెర్సీ ధరిస్తామని వార్న్ అన్నాడు. ఈసవాల్ను గంగూలీ స్వీకరించాడు. జూన్ 10న ఎడ్జిబా స్టన్లో జరిగే ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలుస్తారో చూడాలి.
డూడుల్తో ట్రోఫీకి వెల్కమ్ చెప్పిన గూగుల్
ఇంగ్లాండ్ వేదికగా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ గురువారం ప్రారంభమైన నేపథ్యంలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఓ యూనిక్ డూడుల్తో ఛాంపియన్స్ ట్రోఫీకి వెల్కమ్ చెప్పింది. ఈ డూడుల్లోని ప్లే బటన్ ప్రెస్చేస్తే….ఓ ఇంట రాక్టివ్ క్రికెట్ గేమ్ ప్రారంభమవుతుంది. ఇందులో నత్తలు, మిడతలు ఓ స్టేడియంలో క్రికెట్ఆడుతుంటాయి. మిడతలు బ్యాటింగ్ చేస్తుండగా… నత్తలు బౌలింగ్ చేస్తుంటాయి. మిడతలు తరుపున యూజర్లు బ్యాటింగ్ చేస్తుం డటం ఈ గేమ్ విశేషం. ఇందులో 1,3,4,6 పరుగులు అందుబాటులో ఉంటాయి. ఒక వేళ ఆటగాడు జీరో పరుగులకే అవుటైతే డక్ ప్రత్యక్ష మవుతుంది. ఫోరో, సిక్సో కొట్టినప్పుడు గ్యాల రీలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం కూడా కనిపిస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు క్రికెట్ అభిమానులు వెంటనే గూగుల్ డూడుల్లోకి వెళ్లి మీ స్కోర్ ఎంతో చూసుకోండి | 2sports
|
india vs new zealand 3rd t20, india scores 67 runs in rain effected match
8 ఓవర్లలో కివీస్ లక్ష్యం 68 పరుగులు
సిరీస్ విజేతను తేల్చే మూడో టీ20లో భారత జట్టు నిర్ణీత 8 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించారు.
TNN | Updated:
Nov 7, 2017, 10:13PM IST
తిరువనంతపురం : సిరీస్ విజేతను తేల్చే మూడో టీ20లో భారత జట్టు నిర్ణీత 8 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కివీస్ బౌలర్లు తెలివిగా స్లో బంతులను విసిరి భారీ షాట్లకు యత్నించిన బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో వేసుకున్నారు. చక్కటి బంతులతో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. ఓవర్లు తక్కువగా ఉండటంతో హిట్టింగ్ చేసే ప్రయత్నంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వెనువెంటనే ఔటయ్యారు. దీంతో భారత్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
సౌథీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో భారత్ వరుస బంతుల్లో ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. మూడో బంతికి శిఖర్ ధావన్ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. మరుసటి బంతికే రోహిత్ శర్మ కూడా కాస్త ఎత్తులో వచ్చిన బంతిని హిట్ చేయబోయి క్యాచ్ అవుట్‌ అయ్యాడు. వీరిద్దరూ శాంట్నర్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. | 2sports
|
tata sky
టాటాస్కై ప్రచారకర్తగా ‘నయనతార’
హైదరాబాద్, జూలై 22: దక్షిణాది రా€ష్టాలకు టాటాస్కై డిటిహెచ్సేవలసంస్థకు ప్రచారకర్తగా ప్రముఖ నటీమణి నయనతార నియమితులయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో సౌత్ స్పెషల్ ప్యాక్ను రూ.229ధరల్లో విక్రయించడం వల్లరూపాయి చిల్లర ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న వ్యక్తిగా ఆమె కనిపిస్తారన్నా రు. ఈ ప్యాక్లో 200ఛానెల్స్కుపైగా అవకాశం ఉంటుంద ని టాటాస్కైచీఫ్ కమ్యూనికేషన్స్ అధికారిమలా§్ు దీక్షిత్ వెల్లడించారు. నయనతారవ్యక్తిత్వం, నటన న్రపచారకర్త గా టాటాస్కైకుఎంతో ఉపయోగపడిందని ఆమె అన్నారు. | 1entertainment
|
May 31,2017
అపోలో హాస్పిటల్స్కు పెద్ద నోట్ల దెబ్బ!
చెన్నై : పెద్దనోట్ల రద్దు తరువాత వ్యవస్థలో నగదు లభ్యత తగ్గిపోవడం, తమిళ నాడు మాజీ సీఎం జయలలిత చికిత్స కారణంగా సెక్యూరిటీ కారణాలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య తగ్గడం, స్టంట్ల ధరలు పడిపోవడం తదితర కారణాల మూలంగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అపోలో హాస్పిటల్స్ లాభం 40.7 శాతం మేర కుంగింది. జనవరి-మార్చి త్రైమాసికానికి సంస్థ నకర లాభం రూ.81.31 కోట్ల నుంచి రూ.48.16 కోట్లకు కుంగింది. ఇదే కాలంలో సంస్థ మొత్తం ఆదాయం 14.6 శాతం మేర పెరిగి రూ.1,457.34 కోట్ల నుంచి రూ.1,670.77 కోట్లకు చేరింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ మొత్తం లాభం 14.6% మేర తగ్గి రూ.285.15 కోట్లకు చేరువైంది.అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం రూ.333.95 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం 15 శాతం మేర పెరిగి రూ.5,621.04 కోట్ల నుంచి రూ.6,467.66 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంస్థ ఏకీకృత నికర ఆదాయం రూ.7,255 కోట్లుగా నమోదు అయింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Sep 26,2017
ప్రధాని ఈఏసీ చైర్మెన్గా బిబేక్ ఎంపిక
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్గా (ఈఏసీ) బిబేక్ దెబోరారు ఎంపికయ్యారు. నిటి ఆయోగ్ సభ్యులు, సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్లో ప్రొఫెసర్గా పనిచేసిన బిబేక్తో పాటు మరో నలుగురు సభ్యులతో ఈఏసీనిఏర్పాటు చేస్తూ ప్రధాని ఉత్తర్వూలు జారీ చేశారు. సుర్జీత్ భళ్లా, రతిన్ రారు, అశీమా గోయెల్, రతన్ వతల్లు మండలిలో ఇతర సభ్యులుగా ఎంపికయ్యారు. ఆర్థిక అంశాలతో పాటు ప్రధాని అప్పగించే వివిధ సమస్యలపై ఈఏసీ పూర్తిస్థాయిలో విశ్లేషణలు జరిపి ప్రధానికి సలహాలను ఇస్తుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సూక్ష్మ గణాంకాల సమస్యలు, సందర్భోచితంగా వాటి ఆవశ్యకతను గురించి కూడా మండలి ప్రధానికి దిశానిర్ధేశం చేయనుంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈఏసీ కొత్త సభ్యుల ఎంపిక ప్రాధాన్యత సంతరించుకొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
kohli
ఛేజ్లో కోహ్లీపై ఆధారపడ్డారా?
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగవ వన్డేలో టీమిండియా 19 పరుగుల తేడాతో పరాజయం చెందిన సంగతి తెలిసిందే.కాగా 261 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా తడబడి 48.4 ఓవర్లకే 241 పరుగుకు ఆలౌటైంది.ఈ విజయంలో అయిదు వన్డేల సిరీస్ 2-2 తో సమం చేసింది.దీంతో వన్డే సిరిస్ విజేత ఎవరో చివరి అయిదవ వన్డే ఈనెల 29న విశాఖపట్నంలో జరుగనుంది. నాలుగువ వన్డే అజింక్యా రహానే అత్యధికంగా 57 పరుగులు చేయగా,కోహ్లీ 45 పరుగులతో రెండవ స్థానంలో నిలిచాడు.అయిదు వన్డేల సిరీస్లో టీమిండియా గెలిచిన రెండు వన్డేల్లో కోహ్లీ సత్తా చాటిన సంగతి తెలిసిందే.కోహ్లీ సత్తా చాటడం వల్ల విజయం సాధ్యమైంది.కాగా మిగతా రెండు మ్యాచ్ల్లో కోహ్లీ డిల్లీ వన్డేలో 9 పరుగులు,రాంచీ వన్డేలో 45 పరుగుల స్వల్ప స్కోర్లకే వెనుదిరగడం వల్ల టార్గెట్ చేధనలో తడబడింది.
దీనిని బట్టి చూస్తుంటే రెండవ ఇన్నింగ్స్లో కోహ్లీపైనే టీమిండియా ఆధారపడిందా? అనే అనుమానం కలుగుతుంది.ఇదే ప్రశ్నని రాంచీలో నాలుగవ వన్డే అనంతరం విలేఖరులు ధోనీని అడగ్గా తనదైన శైలిలో స్పందించాడు.అలాంటిదేమీ లేదుని గత ఏడాది కాలంగా చూస్తే టీమిండియా వన్డే క్రికెట్ను ఎక్కువగా ఆడలేదు, జింబాబ్వేతో 3 వన్డేలు మాత్రమే ఆడాం,కొంచెం కష్టంగానే ఉంటుందని ధోనీ పేర్కొన్నాడు.గత ఏడాదిగా చూసుకుంటే తాను అనేక స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చానని,తాను బ్యాటింగ్కు వెళ్లిన క్రమంలో టీమిండియా టాప్ ఆర్డర్ బాగా ఆడిందని,అప్పటికి,ఇప్పటికి చాలా తేడా ఉందన్నాడు.ఈ సిరీస్లో కొన్ని మ్యాచ్ల్లో వికెట్ బాగా స్లోగా ఉందని ధోనీ వివరించాడు.ఈ సిరీస్లో కొత్త కుర్రాళ్లు కావడంతో ఆ జాబ్ని సమర్థవంతంగా నిర్వహించే వాళ్లు కొద్ది మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నాడు.వారికి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉందని తెలిపాడు. కాగా టార్గెట్ చేధనలో భాగంగా కోహ్లీ ఇటీవలే క్రికెట్ లెజెండ్ సచిన్ 14 సెంచరీల రికార్డుని సమం చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీకి ఔట్ చేయడం
సంతోషాన్ని ఇచ్చింది: గుప్టిల్
అయిదు వన్డేల సిరీస్లో నిలబడాలంటే చావో రేవో తేల్చు కోవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శనను చేసింది. కాగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 261 పరుగులు టార్గెట్కు చేరుకోవడంతో న్యూజిలాండ్ బౌలర్లు విజయం సాధించారు.టీమిండియా బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీసి 48.4 ఓవర్లకే 241 పరుగులకే ఆలౌట్ చేసింది.దీంతో టీమిండియాపై న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.కాగా ఈ విజయంతో అయిదు వన్డేల సిరీస్ 2-2తో సమం చేసింది.దీంతో వన్డే సిరీస్ విజేత ఎవరనేది విశాఖ పట్నం వేదికగా శనివారం జరిగే వన్డేలో తేలనుంది. కాగా 261 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు మొదట్లో నిలకడగానే ఆడారు.ఓపెనర్ రహానే 57 పరుగులతో జట్టును విజయం వైపు నడిపించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు.అతనికి తోడుగా రెండవ వికెట్గా వచ్చిన కోహ్లీ కూడా 45 పరుగులతో ఇద్దరూ 79 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. కాగా ఈ క్రమంలో న్యూజి లాండ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఈ జోడీ ప్రయత్నించింది. అయితే న్యూజిలండ్ జట్టు విజయంలో కోహ్లీని త్వరగా పెవిలియన్కు చేర్చడమే అత్యంత కీలక పరిణామమని న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గుప్టిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
నాలుగవ వన్డేలో ఫామ్లోకి వచ్చిన గుప్టిల్ న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.నిజానికి గుప్టిల్ 29 పరుగుల వద్ద ఔట్ కావాల్సి ఉంది.కాగా ఉమేష్ యాదవ్ వేసిన ఏడవ ఓవర్లో గుప్టిల్ ఇచ్చిన క్యాచ్ను అమిత్ మిశ్రా విడిచిపెట్టాడు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గుప్టిల్ మ్యాచ్లో మరో 43 పరుగులు అధికంగా చేశాడు.దీంతో మొత్తం 84 బంతులు ఆడి 72 పరుగులు చేసిన గుప్టిల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం గుప్టిల్ మీడియాతో మాట్లాడాడు. కోహ్లీ క్లాస్ ప్లేయర్ అని 45 పరుగుల వద్ద కోహ్లీని ఔట్ చేయడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని,కోహ్లీ క్లాస్ ప్లేయర్ అతన్ని త్వరగా ఔట్ చేయడం ఆనందమే కదా? అని పేర్కొన్నాడు. కాగా రన్ మెషిన్గా పేరుగాంచిన కోహ్లీ ఈ మధ్య కాలంలో మంచి ఫాంల్ ఉన్నాడు.న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియాకు మంచి విజయాలు అందించిన సంగతి తెలిసిందే.కాగా మొహాలిలో జరిగిన మూడవ వన్డేలో 154 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ధర్మశాలలో జరిగిన తొలి టెస్టులో 85 పరుగులు చేసి టీమిండియా విజయాన్ని అందించాడు.
కాగా నాలుగవ వన్డేలో 11 పరుగుల వద్ద ధోనీ ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.టీమిండియా బ్యాట్స్మెన్ రహానే 57 పరుగులు,కోహ్లీ 45 పరుగులు,అక్షర్ పటేల్ 38 పరుగులతో ధాటిగా ఆడినప్పటికి టార్గెట్ను చేరుకోలేకపోయింది.కేదార్ జాదవ్ జిరో పరుగులు, మనీశ్ పాండే 12 పరుగులు,హార్థిక్ పాండ్యా 9 పరుగులతో కీలక సమయంలో వికెట్లను చేజార్చుకున్నారు. చివరలో కులకర్ణి బ్యాటింగ్తో మెరుపులు మెరిపించి విజయంపై ఆశలు రేపాడు.కాగా ఉమేష్ యాదవ్తో కలిసి 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన భారత్ పరాజయం చెందింది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హిందీలో స్టార్ హీరోతో టెంపర్ రీమేక్
టాలీవుడ్లో బ్లాక్బస్టర్ హిట్ అయి, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని మళ్లీ సక్సెస్ ట్రాక్పై నిలబెట్టిన టెంపర్ సినిమా హిందీలో...
TNN | Updated:
Aug 10, 2017, 06:44PM IST
టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయి, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ని మళ్లీ సక్సెస్ ట్రాక్‌పై నిలబెట్టిన టెంపర్ సినిమా హిందీలో రీమేక్ అయ్యేందుకు రెడీ అవుతోంది. తెలుగు టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన యంగ్రీ యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రని ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణ్‌వీర్ సింగ్ చేయనున్నాడు. గతేడాది ప్రముఖ నటుడు, నిర్మాత, బిజినెస్‌మేన్ అయిన సచిన్ జోషి టెంపర్ సినిమా రీమేక్ రైట్స్ కొన్నాడు. అప్పట్లోనే రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆ సినిమాను రీమేక్ చేయనున్నారని వార్తలొచ్చాయి కానీ అప్పట్లో అది కుదరలేదు. అప్పటి నుంచి అలాగే మరుగున పడి వున్న ఈ రీమేక్ ప్రాజెక్టుని త్వరలోనే పట్టాలెక్కించేందుకు సచిన్ జోషి ఏర్పాట్లు చేసుకుంటున్నాడనేది బాలీవుడ్ మీడియా లేటెస్ట్ న్యూస్.
ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ హిందీ రీమేక్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో పద్మావతి సినిమా షూటింగ్‌తో బిజీగా వున్నాడు. పద్మావతి చిత్రం పూర్తి కాగానే రణ్‌వీర్ ఈ రీమేక్‌లో జాయిన్ అవుతాడని సమాచారం. | 0business
|
తన తాజా ప్రేమ వ్యవహారం గురించి రకుల్ బైటపెట్టింది
Highlights
స్పైడర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్
లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని వరుస ఆఫర్లు కొట్టేస్తున్న రకుల్
తాజాగా కొత్త కారు కొని దానితో ప్రేమలో పడిందట
సూపర్ స్టార్ మహేష్ సరసన స్పైడర్ సినిమాలో హిరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే టాలీవుడ్ లో వున్న యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో నటిస్తూ... లక్కీ హీరోయిన్ గా పేరుచెత్తుకుని.. వరుసగా హిట్లు అందుకుంటున్న రకుల్ ఇప్పుడు తనకు కొత్త లవ దొరికేశాడంటోంది. ఇంతకీ రకుల్ కొత్త లవ ఎవరు రకుల్ మనసు దోచిన అతగాడెవరు అని చూస్తే మాత్రం అందరు షాక్ అవుతున్నారు.
పంజీబీ భామ రకుల్ ఈమధ్యనే రకుల్ ఓ కొత్త బంజ్ ఎస్.యు.వి మోడల్ కార్ కొన్నదట. తన రెమ్యునరేషన్ తో కొన్న ఈ కార్ తో దిగిన ఫోటోని ట్విట్టర్ లో పెట్టి తన కొత్త లవ్ ఇదే అంటూ రకుల్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఇంతకు ముందున్న జాగ్వార్ కు తోడుగా రకుల్ ఈ బెంజ్ కార్ తీసుకుంది.
ఇక బుధవారం రిలీజ్ కానున్న స్పైడర్ లో మహేష్ పక్కన జతకట్టిన రకుల్ ప్రీత్ సింగ్ సినిమాతో మరో విజయం దక్కించుకోవాలని చూస్తుంది. ఈ ఇయర్ ఇప్పటికే మూడు సినిమాలతో అలరించిన రకుల్ ఈ సినిమాతో మరింత అలరిస్తుందని అంటున్నారు. మురుగదాస్ డైరక్షన్ లో నటించాలన్న కోరిక తీర్చుకున్న రకుల్ ఆమె డెడికేషన్ చూసి మరో ఛాన్స్ కూడా ఇచ్చాడని అంటున్నారు. తెలుగులో క్రేజీ బ్యూటీల్లో రకుల్ కంటూ ఓ ఇమేజ్ వుంది. ప్రస్తుతం యువ హీరో, స్టార్ హీరో అన్న తేడాలేవి లేకుండా రకుల్ అందరితో జతకడుతూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. స్పైడర్ తో తమిళ తంబీలను ఆకట్టుకునేందుకు రెడీ అయింది రకుల్. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Bigg Boss 3 కంటెస్టెంట్స్: ఫస్ట్ ఛాన్స్ ‘తీన్మార్’కే!
‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 షోలో తొలి కంటెస్టెంట్గా యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి అడుగుపెట్టింది. నాగార్జున శివజ్యోతి పేరును ప్రకటించగానే తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చింది.
Samayam Telugu | Updated:
Jul 21, 2019, 09:40PM IST
Bigg Boss 3 కంటెస్టెంట్స్: ఫస్ట్ ఛాన్స్ ‘తీన్మార్’కే!
మోస్ట్ వాంటెండ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 3’ మొదలైంది. నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెరపై సందడి షురూ అయ్యింది. ఆదివారం రాత్రి ప్రారంభమైన ఈ షోలో కింగ్ తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. బిగ్ హౌజ్లోకి వెళ్లి అన్నింటినీ పరిశీలించారు. నాగార్జునను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఆయనకు ఒక టాస్క్ కూడా ఇచ్చారు. 15 మంది సెలబ్రిటీల్లో మొదటి ముగ్గురిని పరిచయం చేసే అవకాశం నాగార్జున ఇచ్చారు. దీంతో చిట్టీలు తీసి నాగార్జున ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ని ఎంపిక చేశారు. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఐపీఎల్ వేలంలో హార్దిక్.. ముంబైకి గుడ్ బై?
ముంబై ఇండియన్స్లో కీలక ఆటగాడైన హార్దిక్ పాండ్య వచ్చే సీజన్లో ఆ జట్టుకు దూరం కానున్నాడా..?
TNN | Updated:
Oct 29, 2017, 12:50PM IST
ఐపీఎల్‌లో అద్భుత ఆటతీరుతో ముంబై ఇండియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్య భారీ మొత్తంపై కన్నేశాడు. వచ్చే సీజన్ కోసం నిర్వహించే వేలంలో తాను అందుబాటులో ఉంటానని హార్దిక్ బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. ప్రస్తుత భారత జట్టులో ఆల్‌రౌండర్‌ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న హార్దిక్ వేలంలో పాల్గొంటే.. ఫ్రాంచైజీలు అతణ్ని దక్కించుకునేందుకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసే అవకాశం ఉంది.
రెండు సీజన్ల క్రితం హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ జట్టు రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. తర్వాత కొద్ది కాలానికే హర్దిక భారత క్రికెట్లో అడుగు పెట్టాడు. దీంతో తర్వాతి సీజన్లో ముంబై జట్టు అతడికి చెల్లించే మొత్తాన్ని రూ. 20 లక్షలకు పెంచింది. కాగా హార్దిక్ అన్న క్రునాల్ పాండ్యను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు తన జట్టు తరఫున ఆడటానికి ఇష్టపడకపోతే.. వేలంలో పాల్గొనే వీలుందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. | 2sports
|
sumalatha 183 Views Hesson , RAVI SHASTRI , team india coach
Hesson
ముంబయి: టీమ్ఇండియా కోచ్గా రవిశాస్త్రి తిరిగి ఎంపికైన సందర్భంగా ఆ పదవికి దరఖాస్తు చేసుకున్న న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్ అభినందనలు తెలిపాడు. ట్విటర్ ద్వారా ”టీమ్ఇండియా ప్రధాన కోచ్గా తిరిగి ఎంపికైనందుకు రవిశాస్త్రికి అభినందనలు. రాబోయే కాలంలో మీకూ, మీ జట్టుకు శుభాకాంక్షలు” అని పేర్కొన్నాడు. ఇందుకు శాస్త్రి బదులిస్తూ.. ”వెయ్యి ధన్యవాదాలు, మైక్. మీ శుభాకాంక్షలకు అభినందనలు. మీ కోచ్ బాధ్యతలను అలాగే కొనసాగించండి” అని రీట్వీట్ చేశాడు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/international-news/ | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
చెన్నై vs కోల్కతా: టాస్ ఆలస్యం ఎందుకంటే?
రెండేళ్ల తర్వాత చెన్నై జట్టు చెపాక్ స్టేడియంలో బరిలో దిగిన మ్యాచ్లో టాస్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా మొదలైంది. దీనికి కావేరీ నిరసన సెగలే కారణం.
Samayam Telugu | Updated:
Apr 10, 2018, 08:19PM IST
చెన్నై vs కోల్కతా: టాస్ ఆలస్యం ఎందుకంటే?
రెండేళ్ల విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెపాక్ స్టేడియంలో బరిలో దిగింది. ఆరంభ మ్యాచ్లో ముంబైపై థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న ధోనీ సేన.. సొంత గడ్డ మీద కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతోంది. టాస్ గెలిచిన తలైవా ఎలాంటి సంకోచం లేకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండేళ్ల తర్వాత చెన్నైలో జరుగుతోన్న మ్యాచ్ కావడంతో సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో మైదానానికి తరలివచ్చారు.
కానీ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా టాస్ వేయడం చర్చనీయాంశమైంది. కావేరీ నదీ జలాల కోసం చెన్నైలో భారీ ఎత్తున నిరసన సెగలు జరుగుతుండటంతో దాని ప్రభావం మ్యాచ్పై పడింది. నిరసనకారులు అడ్డుకోవడంతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు స్టేడియానికి రావడం ఆలస్యమైంది. అందుకే టాస్ వేయడం లేటయ్యింది.
కావేరి నిరసన సెగలు తాకుతున్న వేళ.. చెపాక్ స్టేడియానికి 4 వేల మంది పోలీసులు భద్రత కల్పించారు. కానీ నిరసనకారులు మాత్రం ఆరంభంలోనే మ్యాచ్ను ప్రభావితం చేయగలిగారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
పిల్లలు కోహ్లిని ఫాలో అవుతారని భయం: ద్రవిడ్
TNN| Oct 30, 2017, 04.31 PM IST
కోహ్లితో అభిప్రాయ బేధాల కారణంగా టీమిండియా కోచ్గా అనిల్ కుంబ్లే తప్పుకోవడంపై రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. జంబోతో కలిసి ఆడిన ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ ఇది దురదృష్టకరమైన సంఘటన అన్నాడు. నాకు తెలిసినంత వరకూ భారత్కు కుంబ్లే ఎక్కువ టెస్టు విజయాల్ని అందించాడు. అతడో లెజెండ్ అని కితాబిచ్చాడు. కోచ్ల కంటే ఆటగాళ్లే శక్తివంతులు, మేం ఆడినప్పుడు కూడా అంతే. వారికి నచ్చకపోతే కోచ్లను తప్పిస్తారని ఇండియా-ఏ జట్టు కోచ్గా వ్యవహరిస్తున్న ద్రవిడ్ తెలిపాడు. అండర్-19, ఇండియా-ఏ జట్ల కోచ్ బాధ్యతల నుంచి ఏదో ఒక రోజు నేను తప్పుకోవాల్సి వస్తుందని తెలుసు. కాకపోతే అది సరైన పద్ధతి ప్రకారం జరగాలని మిస్టర్ డిపెండబుల్ అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లి చాలా దూకుడుగా వ్యవహరిస్తాడు. అతడిలా నేనేందుకు ఆడలేకపోయా అని చాలా మంది అడుగుతుంటారు. కానీ అది నాకు సరిపడదు. ‘ఒక్కొక్కరిది ఒక్కో తరహా. అదే రహానే చూడండి ఎంత కామ్గా ఉంటాడో. ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు కోహ్లి చాలా ఆవేశంగా మాట్లాడాడు. మొదట నాకు ఇబ్బందిగా అనిపించింది. కానీ కోహ్లి ఆ సిరీస్ను సీరియస్గా తీసుకున్నాడని, మైదానంలో మాటలకు దిగడం వల్ల అతడు మరింతగా రాణిస్తున్నాడని తర్వాత అర్థమైందని చెప్పాడు. ఆ దూకుడు విరాట్ రాణించడానికి ఉపయోగపడుతుంద’ని మిస్టర్ డిపెండబుల్ చెప్పాడు
కాకపోతే నేటి తరం పిల్లలు విరాట్ను గుడ్డిగా అనుకరించే ప్రమాదం ఉందనేది నా భయం. అది వారికి నప్పుతుందా లేదా అని చూడకుండా కోహ్లిని ఫాలో అయితే ఇబ్బంది పడతారని ద్రవిడ్ తెలిపాడు. ఎప్పుడు రిటైర్ అవుతాడనే విషయాన్ని ధోనీకే వదిలేయాలని సూచించాడు. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
పూజారులపై ద్వేషం.. దొంగగా మారిన రచయిత కులశేఖర్
వందకుపైగా సినిమాలకు గేయ రచయితగా పనిచేసి, ఎన్నో సూపర్హిట్ పాటలను అందించిన కులశేఖర్ ఇప్పుడు ఓ దొంగగా మారి పోలీసులకు చిక్కాడు.
Samayam Telugu | Updated:
Oct 29, 2018, 09:54AM IST
ఓ ఆలయ పూజారి బ్యాగును దొంగిలించిన కేసులో ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్హిట్ చిత్రాలకు పాటల రచయితగా పనిచేసిన కులశేఖర్ స్వస్థలం సింహాచలం. తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్(47) హైదరాబాద్ మోతీనగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. మూడు రోజుల కిందట ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో మాతా దేవాలయం పూజారి బ్యాగు దొంగిలించాడు. ఆదివారం శ్రీనగర్కాలనీలోని ఓ ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కులశేఖర్ నుంచి రూ.50వేల విలువైన 10 మొబైల్స్, రూ.45వేల విలువచేసే బ్యాగులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, తాళంచెవులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
వందకు పైగా సినిమాలకు పాటల రచయితగా పనిచేసిన కులశేఖర్, చెడు వ్యసనాలకు బానిసై కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. కుటుంబ సభ్యులతోనూ కూడా దూరంగా ఉన్నాడు. రెండేళ్ల కిందట కాకినాడలోని ఆంజనేయస్వామి గుడిలో శఠగోపం చోరీ చేశాడు. ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో ఆరు నెలలపాటు శిక్షను అనుభవించాడు. ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని వెలివేసింది. దీంతో బ్రాహ్మణులపై ద్వేషం పెంచుకున్న కులశేఖర్, పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
కాకినాడలోని శ్రీబాలాత్రిపుర సుందరి ఆలయానికి 2013 అక్టోబరు 24న వెళ్లిన కులశేఖర్, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి శఠ గోపరాన్ని అపహరించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కులశేఖర్ దొంగతనం చేసినట్టు నిర్ధరణ కావడంతో కాకినాడ అయిదో జేఎఫ్సీ జడ్జి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. | 0business
|
ఆభరణ ప్రేమికులకు చేరువవ్వడమే మా స్వప్నం
- కరీంనగర్లో 'జోయాలుక్కాస్' షోరూం ప్రారంభం
- ప్రపంచ శ్రేణి నగలకు నిలయం: సంస్థ ఛైర్మన్ జోరు అలుక్కాస్
నవ తెలంగాణ - మంకమ్మతోట
ప్రతీ ఆభరణ ప్రేమికునికి అందుబాటు ధరలోనే అపురూప డిజైన్ జ్యువెల్లరీని చేరువ చేయడమే తమ స్వప్నమని జోయాలుక్కాస్ ఛైర్మన్ జోరు అలుక్కాస్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 'జోయాలుక్కాస్ జ్యువెల్లరీ సంస్థ' కరీంనగర్లో శనివారం నూతన బ్రాంచీని నెలకొల్పారు. స్థానిక ముకరంపురలో పోలీస్హెడ్క్వార్టర్స్ ఎదుట ఏర్పాటుచేసిన షోరూంను నగర మేయర్ సర్దార్ రవీందర్సింగ్ ప్రారంభించారు. అనంతరం షోరూం లోపల మేయర్తో పాటు డిఎస్పి జె.రామారావు జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్ జోరు అలుక్కాస్, ఎండి జాన్పౌల్ జారు అలుక్కాస్ మాట్లాడారు. తమ సంస్థకు 10 దేశాల్లో 100కు పైగా షోరూంలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ చెయిన్గా కొనసాగుతోందన్నారు. జ్యువెల్లరీ, మనీ ఎక్ఛ్సేంజ్, ఫ్యాషన్ అండ్ సిల్క్స్, లగ్జరీ ఎయిర్ ఛార్జర్, తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే జోయాలుక్కాస్ను మరో రెండు దేశాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. జ్యువెల్లరీ రిటైలర్లో పది మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నట్లు తెలిపారు. జోయాలుక్కాస్ చెన్నైలోని అతిపెద్ద షోరూంగా లిమ్కాబుక్లో చోటు సంపాదించుకోవడం తమకు ఆనందంగా ఉందని చెప్పారు. వినియోగదారుల మనసుస దోచుకునే సాంప్రదాయ, సమకాలీన అంత ర్జాతీయ డిజైన్స్ ఇందులో లభిస్తాయని పేర్కొన్నారు. కరీంనగర్లో షోరూం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సోనియా జాన్పౌల్ జారు అలుక్కాస్, రిటైల్ డిజిఎం పిడి.ఫ్రాన్సిస్, డిజిఎం గోల్డ్ పిడి.జోస్, ట్రాఫిక్ సిఐ మహేశ్, కార్పొరేటర్లు ఆరీఫ్, కర్ర లింగయ్య పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Visit Site
Recommended byColombia
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ.. దేశీ వాహన విక్రయాలు కేవలం 1.8 శాతం మాత్రమే పెరిగాయి. 1,19,804 యూనిట్లుగా నమదయ్యాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ వాహన విక్రయాలు 1,18,560 యూనిట్లుగా ఉన్నాయి. విటారా బ్రెజా, ఎర్టిగా, ఓమ్ని, ఎకో వ్యాన్ వంటి మోడళ్లు ఈ వృద్ధికి కారణంగా నిలిచాయి. వీటిని మినహాయించి చూస్తే కంపెనీ విక్రయాలు 4.7 శాతం మేర క్షీణించాయి.
హ్యుందాయ్ కార్ల అమ్మకాలు డిసెంబర్లో 4.6 శాతం వృద్ధితో 42,093 యూనిట్లకు ఎగశాయి. కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చని శాంట్రో మోడల్ డిమాండ్ ఇందుకు కారణం. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 3 శాతంమేర తగ్గాయి. ఈ కంపెనీ డిసెంబర్లో 15,091 యూనిట్ల ప్యాసింజర్ కార్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో కంపెనీ అమ్మకాలు 15,543 యూనిట్లుగా ఉన్నాయి. ఇక టాటా మోటార్స్ దేశీ వాహన అమ్మకాలు దాదాపు 1 శాతం వృద్ధితో 14,260 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ గతేడాది ఇదే నెలలో 14,180 యూనిట్లను విక్రయించింది. జపాన్కు చెందిన టయోటా కంపెనీ డిసెంబర్లో 11,830 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలోని అమ్మకాలు 10,793 యూనిట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. హోండా కార్ల అమ్మకాలు 4 శాతం వృద్ధితో 13,139 యూనిట్లకు పెరిగాయి. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పసిడి ధరలు రూ.90 మేర తగ్గడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,750 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.31,600కి చేరింది.
Samayam Telugu | Updated:
Nov 25, 2018, 08:49AM IST
Gold price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, స్థానిక నగల వ్యాపారాల నుంచి డిమాండ్ మందగించడంతో శనివారం కూడా బంగారం ధర తగ్గింది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.31,950 నుంచి రూ.31,750 కి దిగి వచ్చింది. అమెరికాలో వడ్డీరేట్లు పెరుగుతాయనే సంకేతాలు డాలర్, బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. శుక్రవారం బంగారం ధర రూ.90 రూపాయలు తగ్గిన సంగతి తెలిసిందే. మొత్తంగా చూస్తే ఈ వారంలో బంగారం ధర రూ. 400 తగ్గింది. మరోవైపు పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో శనివారం ఒక్కరోజే వెండి ధర రూ.500 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.37,800 నుంచి రూ.37,300 కి పడిపోయింది. ఈ వారం మొత్తంలో వెండి ధర రూ. 850 తగ్గింది. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘నీవెవరో’ ట్రైలర్: అసలేం జరుగుతోంది?
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పోరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
Samayam Telugu | Updated:
Aug 13, 2018, 07:28PM IST
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పోరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. హరినాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్ప్లే, డైలాగులు అందించారు. ఈ సినిమా ఆడియోను, టీజర్ను ఆదివారం రాత్రి విడుదల చేశారు.
గతంలో విడుదల చేసిన టీజర్లో ‘‘మూడు నగరాలు, రెండు ప్రేమకథలు, ఒక్క సంఘటన’’ అంటూ ఆది పినిశెట్టి .. ఈ చిత్రంపై ఆసక్తి పెంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సైతం చిత్రం మీద ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో ఆదిది ద్విపాత్రాభినయమా? లేదా ఒకే పాత్ర రెండు విధాలుగా కనిపిస్తుందా? అనేది మాత్రం సస్పెన్స్. | 0business
|
నోట్ల రద్దుతో మందగించిన ముద్ర
- డిసెంబరు చివరి నాటికి రూ.80వేల కోట్ల వితరణ
- అందుకోవాల్సిన లక్ష్యం రూ.1.83 లక్షల కోట్లు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పెద్దనోట్ల రద్దు చర్య చిన్న సంస్థలనూ బాగా ప్రభావితం చేస్తోంది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసిక కాలంలో 'సూక్ష్మ సంస్థల అభివృద్ధి, పున:ఆర్థిక చేయూత సంస్థ' (ముద్రా) రుణాల వితరణలో మందగమనం నెలకొంది. పెద్దనోట్ల రద్దు కారణంగా నవంబరు, డిసెంబరు మధ్య కాలంలో రుణ వితరణలో కొంత మందగమనం ఏర్పడినట్టుగా ముద్రా సీఈవో జిజి మెమెన్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి డిసెంబరు ముగింపు వరకు రూ.80,000 కోట్ల మేర ముద్రా రుణాలను మంజూరు చేసినట్లు మెమెన్ తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో పాటు తదనంతర పరిణామాలు ముద్రా రుణాలపై ప్రభావం కనబరిచినట్టుగా ఆయన వివరించారు. ఎంఎస్ఎంఈ సంస్థలు ఆన్లైన్ ద్వారా నిధుల సమకూర్చుకొనేందుకు వీలుగా అసోచామ్ ఏర్పాటు చేసిన పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో మెమెన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాదికి లక్ష్యంగా పెట్టుకున్న రూ.1,83,000 కోట్ల ముద్రా రుణాల పంపిణిని మార్చి చివరి నాటికి అందుకోగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఓటమి..
ఓలింపిక్స్ లో భారీ అంచనాలతో రంగంలోకి దిగిన భారత రెజ్లర్ యోగేశ్వర్ తన ప్రత్యర్ధి ముందు చేతులేత్తేశాడు.
| Updated:
Aug 21, 2016, 09:01PM IST
సింధూ,సాక్షిని స్పూర్తిగా తీసుకొని భారత రెజ్లర్ యోగేశ్వర్ పతకం సాధిస్తాడని భారత అభిమానులు ఆశతో ఎదురు చూశారు. కానీ అభిమానుల ఆశలపై యోగేశ్వర్ దత్ నీళ్లు చల్లాడు. ఈ రోజు సాయంత్రం 65 కిలలో రెజ్లింగ్ విభాగంలో క్వాలిఫైయింగ్ రౌండ్ లోనే యోగేశ్వర్ అపజయం పాలయ్యాడు. మంగోలియాకు చెందిన రెజ్లర్ మందక్ చేతిలో 3-0 తేడాతో ఓటమి చవిచూశాడు. బౌట్ ప్రారంభం నుంచి తన ప్రత్యేర్ధిపై పట్టుకోసం యత్నించిన యోగేశ్వర్ కు ఎక్కడా అవకాశం లభించలేదు. ఫలితంగా తొలి రెండు రౌండ్లలో ఓటమి చవిచూడటంతో యోగేశ్వర్ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. దీంతో రియో ఒలింపిక్స్ ఒక రజతం, ఒక కాంస్య పతకాలతో భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. | 2sports
|
Suresh 99 Views
మాల్యా గోవా విల్లా మరోసారి వేలం!
ముంబై, సెప్టెంబరు 19: 17 మంది బ్యాంకర్ల కూటమికి పారిశ్రామికవేత్త విజ§్ుమాల్యా చెల్లించాల్సిన రుణబకాయిలను రికవరీకోసం ఎస్బిఐ ఆధ్వర్యంలో కింగ్ఫిషర్ గోవా నివాసాన్ని వేలం వేస్తున్నారు. బేస్ధరను 85.29 కోట్లు రూపాయలుగా అంచనావేసారు. ఉత్తరగోవాలోని కాండొలిమ్ బీచ్లో అక్టో బరు 19వ తేదీ ఈవిల్లాను వేలం వేయాలని నిర్ణయించారు. ఈ విల్లాలో అత్యాధునిక విలాసవంతమైన విభాగాలున్నాయి. భవనాలతోపాటుపంపింగ్ వ్యవస్థలు,స్విమ్మింగ్ పూల్స్,విద్యుత్ వైరింగ్ పైపింగ్ మొత్తం అన్ని వ్యవస్థలను వేలం వేయాలని నిర్ణయించారు. ఎస్బిఐ క్యాప్ట్రస్టీ ఈ వేలం నిర్వహి స్తుంది. బిడ్డర్లు విల్లాను ఈనెల 26,27 తేదీల్లోను, అక్టోబరు ఐదారు తేదీల్లో తనిఖీ చేసుకోవచ్చని వివరించింది. ఆరువేల కోట్ల రూపాయల రుణాలఎగవేతకు సంబంధించిన ఆరోపణలు ఎదు ర్కొంటున్న మాల్యా ఈ స్థిరనివాసం 12,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలోఉంది. జరిమానాలు, వడ్డీతోపాటుగా ఎస్బిఐ, పిఎన్బి, ఐడిబిఐబ్యాంకు, బ్యాంక్ఆఫ్ బరోడా, అలహాబాద్బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, యాక్సిస్బ్యాంకులకు మాల్యా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంది. విల్లాను ఈఏడాది మే 13వ తేదీనే స్వాధీనం చేసుకున్న బ్యాంకర్లు కొంతమేర న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. ఈ స్థిరాస్థిపై యునైటెడ్ స్పిరిట్స్ లీజు హక్కులున్నాయంటూ పోరాటం చేసింది. | 1entertainment
|
Mar 26,2015
స్పెక్ట్రంతో 1.10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : భారత అతిపెద్ద టెలికం స్పెక్ట్రం వేలం బుధవారంతో ముగిసింది. మొత్తంగా రూ.1.10 లక్షల కోట్ల బిడ్లు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వరుసగా 19 రోజుల పాటు జరిగిన ఈ వేలంలో 115 రౌండ్లలో బిడ్డింగ్లు నమోదయ్యాయి. మొత్తంగా రూ.1,09,874 కోట్ల విలువ చేసే బిడ్డింగ్లు వచ్చాయని, సుప్రీంకోర్టు అనుమతి తర్వాత డిఒటి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2015-16 నాటికి ఐడియా సెల్యూలర్కు చెందిన తొమ్మిది సర్కిళ్లు, రిలయన్స్ టెలికం, వొడాఫోన్లకు చెందిన ఏడేసి సర్కిళ్లలో, భారతీ ఎయిర్టెల్ ఆరు సర్కిళ్లలో అనుమతుల గడువు ముగియనుంది. దీంతో ఈ సారి వేలంకు ప్రాధాన్యత లభించింది. 900మెగాహెడ్జ్ బ్యాండ్, 1800 మెగాహెడ్జ్ బ్యాండ్లను ప్రభుత్వం వేలానికి పెట్టింది. 2100 ఎంహెచ్జడ్ స్పెక్ట్రం దక్కించుకున్న కంపెనీలు పది రోజుల్లో 33 శాతం చెల్లింపులు చేయాలి. 900 ఎంహెచ్జడ్లో 25 శాతం సొమ్ము చెల్లించాలి. మిగితా సొమ్మును 10 ఏళ్లలో వాయిదాల పద్దతిలో చెల్లించవచ్చు. మరో రెండేళ్లు అదనపు గడువు కూడా ఇస్తుంది. 2014 ఫిబ్రవరిలో 10 రోజుల పాటు నిర్వహించిన 900, 1800 ఎంహెచ్జడ్ స్పెక్ట్రం వేలంలో రూ.62,162 కోట్ల బిడ్లు నమోదయ్యాయి. 2010లో 34 రోజుల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన వేలంలో రూ.67,718 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
india vs south africa, 2nd test: virat kohli makes 3 changes for centurion test
విమర్శలకి తలొగ్గని కోహ్లి.. మళ్లీ సాహసం
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విమర్శలకి తలొగ్గలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన అనంతరం తుది జట్టు
TNN | Updated:
Jan 13, 2018, 02:02PM IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విమర్శలకి తలొగ్గలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన అనంతరం తుది జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు. సఫారీ పిచ్‌లపై మంచి బ్యాటింగ్ రికార్డు ఉన్న అజింక్య రహానెని తప్పించి.. రోహిత్ శర్మకి అవకాశం ఇవ్వడంపై విమర్శలు గుప్పించారు. అయితే.. సెంచూరియన్ వేదికగా శనివారం ఆరంభమైన రెండో టెస్టులోనూ రోహిత్ శర్మకి ఛాన్సిచ్చాడు. గత ఏడాది చివర్లో శ్రీలంకతో ముగిసిన సిరీస్‌లో రోహిత్ శర్మ మెరుగ్గా రాణించిన విషయం తెలిసిందే.
ఇటీవల ఫామ్ ఆధారంగానే తుది జట్టుని ఎంపిక చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కోహ్లి.. రెండో టెస్టుకి తుది జట్టులో మొత్తం మూడు మార్పులు చేశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్, గాయపడిన సాహా స్థానంలో పార్థీవ్ పటేల్, భువనేశ్వర్ కుమార్‌కి బదులుగా ఇషాంత్ శర్మ జట్టులోకి వచ్చారు. కేప్‌టౌన్ టెస్టులో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన భువనేశ్వర్‌ని పక్కన పెట్టడం కోహ్లి సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. ఒకవేళ ఈ టెస్టులో బౌలర్లు విఫలమైతే.. కోహ్లి విమర్శలకి మళ్లీ సిద్ధమవ్వాల్సిందే..! | 2sports
|
- దాదాపు 22 నెలల్లో పెరగనున్న దేశీయ
- బ్యాంక్ల మొండి బాకీల విలువ ఇదీ..
- ఇంకా గుర్తించని పారు రుణాలు రూ.7.7 లక్షల కోట్లు!
- ప్రగతికి విఘాతం కలిగే అవకాశం: ఇండియా రేటింగ్స్
ముంబయి: దేశీయ బ్యాంకింగ్ రంగానికి మొండి బాకీల కష్టాలు ఇప్పట్లో సమిసిపోయేలా కనపించడం లేదు. ఇప్పటికే దాదాపు రూ.6.7 లక్షల కోట్లకు చేరిన బ్యాంకుల మొండి బాకీలు రానున్న రెండేండ్లలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2019 మార్చి నాటికి మొండి బాకీలు మరో రూ.2.6 లక్షల కోట్ల (40.58 బిలియన్ డాలర్లు) మేర వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషణలు చెబుతున్నాయి. ఫిచ్ రేటింగ్స్కు అనుబంధంగా పని చేసే 'ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్' సంస్థ తాజా విశ్లేషణలో ఇదే విషయాన్ని వెల్లడించింది. బ్యాంకులు గుర్తించని రూ.7.7 లక్షల కోట్ల మొండి బాకీలు ఉన్నాయని అంచనా వేసింది. ఇందులో సగం వరకు వచ్చే 12-18 మాసాల్లో మొండి బాకీలుగా మారే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ విశ్లేషకుడు ఉదిత్ కరివాలా ఒక నివేదికలో వెల్లడించారు. మొత్తం బ్యాంకు రుణాల్లో కార్పొరేట్, చిన్న, మధ్యస్థ సంస్థల వాటా 3.2 శాతంగా ఉంటుందని రేటింగ్ ఎజెన్సీ పేర్కొంది. కాగా బ్యాంకుల మొత్తం మొండి బాకీల్లో వీటి వాటా 22% ఉండటం గమనార్హం. గుర్తించి రాని బాకీలు 12 శాతంగా ఉన్నాయని తెలిపింది.
ప్రభుత్వ గణంకాల ప్రకారం గత డిసెంబర్ ముగింపు నాటికి బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) రూ.6.5 లక్షల కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. 2016-17 ఏప్రిల్ నుంచి డిసెంబర్ కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులపై కొత్తగా మరో రూ.లక్ష కోట్ల మొండి బాకీల వచ్చి పడ్డాయి. ముఖ్యంగా విద్యుత్తు, స్టీల్, రోడ్లు, మౌలిక వసతులు, టెక్స్టైల్ రంగాలలోని రుణాలు రాని బాకీలుగా నిలిచిపోయాయి. 2015-16 ముగింపు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బాకీలు రూ.5,02,068 కోట్లకుగా నమోదు అయ్యాయి. అదే డిసెంబర్ 2016 ముగింపు నాటికి అంటే కేవలం తొమ్మిది మాసాల్లోనే కొత్తగా మరో రూ.లక్ష కోట్ల మొండి బాకీలు కొత్తగా వెలుగులోకి వచ్చి చేరాయని స్థూలంగా రూ.6,06,911 కోట్లకు ఎగిశాయని ఇటీవలే స్వయంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు.
కార్పొరేట్ల బాకీలు చాలా ఎక్కువ..
మొత్తం మొండి బాకీల్లో కార్పొరేట్ల రుణాలే ఎక్కువగా ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ 'స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా' (ఎస్బీఐ) డిసెంబర్ 2016 ముగింపు నాటికి రూ.6.36 లక్షల కోట్ల రుణాలు అందజేయగా.. ఇందులో 8.16 శాతం లేదా రూ.81,442 కోట్ల మొండి బాకీలుగా మారాయి. 'పంజాబ్ నేషనల్ బ్యాంకు' కార్పొరేట్లకు ఇచ్చిన రూ.2.05 లక్షల కోట్ల రుణాల్లో 16.38 శాతం లేదా రూ.41,467 కోట్ల అప్పులు రాని బాకీలుగా నమోదయ్యాయి. అదే విధంగా ఐడీబీఐ బ్యాంకు కార్పొరేట్ రుణాలు 1.31 లక్షల కోట్లుగా ఉండగా, ఇందులో రూ.25,724 కోట్లు లేదా 15.44 శాతం రాని బాకీలగా మారి ఈ బ్యాంకుకు గుది బండగా మారాయి. కెనరా బ్యాంకు కార్పొరేట్ రుణాలు రూ.1.47 లక్షల కోట్లు కాగా రూ.11.84 శాతం (రూ.23,018 కోట్లు) మొండి పద్దులుగా మారాయి. బ్యాంకు ఆఫ్ ఇండియా 1.76 లక్షల కోట్లు ఇవ్వగా 16.79 శాతం (రూ.36,003 కోట్లు) రాని బాకీలుగా నమోదయ్యాయి. బ్యాంకు ఆఫ్ బరోడా రూ.139 లక్షల కోట్లు జారీ చేయగా.. ఇందులో 12.85 శాతం (రూ.23,122 కోట్లు) పారు బకాయిలుగా మారాయి. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.1.26 కోట్లు మంజూరు చేయగా.. 12.70 శాతం (రూ.20,293 కోట్లు) అప్పులు నిరర్థక ఆస్తులుగా నమోదయ్యాయి.
ప్రయివేటు బ్యాంకులపైనా భారం..
2014-15 ముగింపు నాటికి బ్యాంకుల మొండి బాకీలు రూ.2,67,065 కోట్లుగా ఉన్నాయి. 2016 డిసెంబర్ 31 నాటికి ప్రయివేటు రంగ బ్యాంకుల మొండి బాకీలు రూ.70,321 కోట్లుగా నమోదయ్యాయి. 2016 మార్చి 31 నాటికి ఈ బ్యాంకుల మొండి బాకీలు రూ.48,380 కోట్లుకు చేరుకున్నాయి. కాగా 2014-15 ముగింపు నాటికి ప్రయివేటు రంగ బ్యాంకుల మొండి బాకీలు రూ.31,576 కోట్లుగా నమోదయ్యాయి. ఈ దెబ్బతో ఆయా బ్యాంకుల నికర లాభాలు భారీగా పడిపోయాయి. కొన్ని బ్యాంకులు ఏకంగా నష్టాలు చవి చూశాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 176 Views
మాంచెస్టర్ : ప్రొఫెషనల్ బాక్సర్గా కెరీర్ కొనసాగిస్తున్న విజేందర్ పాల్గొనాల్సిన నాలుగవ బౌట్ మార్చి 12కు వాయిదా పడింది. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం డబ్ల్యూబిఓ వరల్డ్ లైట్ వెయిట్ చాంపియన్ టెర్రీ స్థానాగాన్-విజేందర్ మధ్య నాలుగవ బౌట్ పిబ్రవరి 23 వ తేదిన జరగాల్సి ఉంది.కాగా వరల్ట్ టైటిల్ పోరులో భాగంగా డెర్రీ మాథ్యస్ తలపడిన మ్యాచ్లో టెర్రీ స్థానాగాన్ గాయపడ్డారు.దీంతో ఆ బౌట్ను మార్చి 12కు వాయిదా వేశారు.దీనిపై విజేందర్ మాట్లాడుతూ నాలుగవ బౌట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు.బౌట్ అర్థాంతరంగా వాయిదా పడటంతో నిరాశా చెందినట్లు వివరించాడు.ఆ బౌట్లో కూడా విజయం సాధించాలనే కసితో ఉన్న తాను ప్రస్తుతం తీవ్రమైన ప్రాక్టీస్లో నిమగ్నమైనట్లు పేర్కొన్నాడు. | 2sports
|
హోమ్ Business News బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త
బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త
August 12, 2019, 12:38 PM IST
Share on:
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఒకే వేళలో పని చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం బ్యాంకులన్నీ వివిధ సమయ పాలనను పాటిస్తున్నాయి. బ్యాంకు సమయం ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేస్తున్నారు. దీంతో వారు ఒత్తిడి గురవుతున్నారు. మరో వైపు వినియోగదారులకు కూడా బ్యాంకుల సమయ పాలన పై సరైన అవగాహన లేదు. ఏ బ్యాంకు ఎప్పుడు తీస్తారో అన్న దాని పై కాస్త గందరగోళ వాతావరణం ఉంది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఒకే సమయపాలన పాటించేలా కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈజ్ 2.0 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. దీని కోసం బ్యాంకర్స్ ప్యానెల్ మూడు టైమింగ్ స్లాట్స్ ను ప్రతిపాదించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు, ఉదయం 10 నుంచి సాయంత్రం 6, ఉదయం 11 నుంచి 5 గంటల వరకు ఉండేలా మూడు టైమింగ్స్ ను సిద్దం చేశారు. వీటిలో ఏదో ఒక దానిని ప్రభుత్వం నిర్ణయించనుంది. బ్యాంకు ఉద్యోగులతో చర్చించిన తర్వాతనే అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులతో పాటు కస్టమర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
TS Minister Kcr
చేనేతకు మైక్రోసాఫ్ట్ చేయూత
హైదరాబాద్,జూన్ 25: తెలంగాణ చేనేత ఉత్ప త్తులకు మార్కెటింగ్ సౌకర్యం పెంచడంతో పాటు డిజిటల్ వాతావరణానికి చేనేతను సన్న ద్ధం చేసేందుకువీలుగా మైక్రోసాప్ట్ ఇండియాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పోచంపల్లి వద్ద ఉన్న పర్యాటక కాంప్లెక్స్లో డిజిటల్ రిసోర్స్సెంటర్ను తెలంగాణ ఐటి, పరిశ్రమలశాఖమంత్రి కెటి.రామారావు, ఐటిశాఖ కార్యదర్శి జయేష్రంజన్లు ప్రారంభించారు. భారతీయ టెక్స్టైల్స్ వారసత్వ సంపదగా వెలుగొందుతున్న సాంప్రదాయ పద్దతులను పునరుద్ధరించడంతోపాటు స్థిరమైన జీవనోపాధికోసం తెలంగాణ చేనేతకళాకారులు సాంప్రదాయవృత్తులను కొనసాగించేందుకు తోడ్పడే లక్ష్యంతో ఈకేంద్రం ప్రారంభిస్తున్నట్లు మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. లాభాపేక్షలేని స్వఛ్ఛంద సంస్థ చైతన్యభారతి భాగస్వా మ్యంతో మైక్రోసాప్ట్ ఈ కేంద్రం నిర్వహిస్తోంది.
డెయింగ్,డిజైన్, నైపుణ్యంపరంగా శిక్షణ, వర్క్షాపులు నిర్వహించి చేనేత ఉత్పత్తులను కొనుగోలుచేసే ప్రజలనుంచి ఆర్డర్లు పొందడం వంటివి ఉన్నాయి. చేనేత కార్మికులకు ముడివనరులకొనుగోలు నుంచి ఉత్పత్తుల మార్కెటింగ్వరకూ మద్దతు ఉంటుంద న్నారు. మైక్రోసాప్ట్ ఇండియా ఎండి అనిల్బన్సాలి మాట్లాడుతూ పోచంపల్లిక్టస్టర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చేనేత కళాకారులకోసం డిజిటల్ సాధికారత సెంటర్ ఏర్పాటుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మద్దతివ్వడం పట్ల హర్షం ప్రకటించింది. అలాగే ఇ-మార్కెట్లు ఏర్పాటుచేసి తమ ఉత్పత్తులను పరిరక్షించుకుని సాంకేతిక వినియోగంపై కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్టు లో 22 వేలమందికిపైగా చేనేతకళాకారులు, తొమ్మిదివేల హ్యాండ్లూమ్స్స్టేషన్లకు ఈ కేంద్రం చేరువ అవుతున్నదని అన్నారు. డిజైన్, మార్కెటింగ్, వ్యాపార దక్షతలో ఉపయోగించడంతో పాటు ఈ క్లస్టర్స్లో యువతకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు అందించే లక్ష్యంతో పనిచేస్తామని మంత్రి కెటిఆర్కు హామీ ఇచ్చారు. | 1entertainment
|
83% దిగుమతి చేసుకుంటున్నవే..
- సెల్ ఫోన్ల తయారీ దేశీయంగా పెరగాలి
- ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించాలి
- విదేశీ మారకపు ద్రవ్యం ఆదా అవుతుంది
- ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి
- నివేదికలో పేర్కొన్న ఫిక్కీ-ఈవై
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశీయంగా సెల్ఫోన్ల మార్కెట్ 30 కోట్ల హ్యాండ్సెట్ల మార్కును దాటవచ్చని, అందులో కేవలం 4.6 కోట్ల హ్యాండ్సెట్లు మాత్రమే దేశీయంగా మన మార్కెట్లలోనే తయారు చేసినవి ఉండనున్నట్లు ఫిక్కీ-ఈవై రూపొందించిన 'స్పీడింగ్ ఎహెడ్ ఆన్ ది టెలికాం అండ్ డిజిటల్ ఎకానమి హైవే' అనే నివేదిక వెల్లడించింది. దేశీయంగా హ్యాండ్సెట్లు, ట్యాబ్లెట్ల తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్ల తయారీకి వియత్నాం కేంద్రంగా వృద్ధి చెందుతున్న విషయాన్ని ఉదాహరణగా చూపింది. అక్కడి ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను ప్రకటించడంతో పాటు స్థిరమైన నియంత్రణ వ్యవస్థ ఉందని తెలిపింది. ఈ కారణం చేతనే అక్కడ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతోందని నివేదిక వెల్లడించింది. దేశీయంగా మొబైల్ మార్కెట్ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అందులో 83 శాతం డిమాండ్ను దిగుమతుల ద్వారానే తీర్చుకొంటున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీనివల్ల దేశీయంగా తయారీ చాలా వెనకబడిందని అభిప్రాయ పడింది. మొబైల్ తయారీ పరిశ్రమలకు తగిన ప్రోత్సహం ఇవ్వడం వల్ల విలువైన విదేశీ మారకపు ద్రవ్యంతరలి పోవడాన్ని అడ్డుకోవడంతో పాటు, దేశీయంగా సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు ఉపయోగ పడుతుందని.. ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని నివేదిక స్పష్టం చేసింది. దేశీయంగా పరిశ్రమ అభివృద్ధికి గాను పరిశ్రమ సభ్యులు, ప్రభుత్వ అధికారులతో డైటీవై ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీని లక్ష్యం 2019 నాటికి 50 కోట్ల మొబైల్ ఫోన్ల ఉత్పత్తి దేశీయంగానే జరిగేటట్లు చూడడం. పర్యావరణానికి పెద్దపీట వేస్తూనే దేశీయంగా మొబైల్ ఫోన్ల విడిభాగాలను రూపొందించడం దేశీయంగా తయారీని ప్రోత్సహించడంతో పాటు అదనంగా దాదాపు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం ధ్యేయంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్లు నివేదకలో తెలిపారు.హ్యాండ్సెట్లను సెంట్రల్ ఎక్సైస్ ట్యాక్ చట్టం 1956లోని 'ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన వస్తువుల' విభాగంలోకి చేర్చాలని, రాష్ట్రాలు విధించే వ్యాట్ ను తగ్గించడం ట్యాక్స్ హాలీడేలను ప్రకటించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది.
14.5 శాతం తగ్గిన మొబైల్ అమ్మకాలు?
న్యూఢిల్లీ: గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత్లో మొబైల్ ఫోన్ల అమ్మకాలు 14.5 శాతం మేర క్షీణించాయి. 2014 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దేశీయంగా మొత్తం మొబైల్ ఫోన్ల అమ్మకాలు 62 మిలియన్ హ్యాండ్సెట్లు ఉండగా.. అది మార్చి త్రైమాసికానికి 53 మిలియన్ మొబైల్స్కు పడిపోయినట్లు సైబర్ మీడియా రీసర్చ్ తెలిపింది. స్మార్ట్ఫోన్ అమ్మకాలలో ఈ క్షీణత 7.14 శాతంగానూ, తక్కువ ధర కలిగిన ఫోన్ల విషయంలో 18.3 శాతంగానూ ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. 2014లో ఆసియా-పసిఫిక్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ఫోన్ మార్కెట్గా భారత్ ఎదిగిన విషయం తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రియో: ప్రీక్వార్టర్స్ కు దూసుకెళ్లిన బాంబేలా
రియో ఒలింపిక్స్ లో ఆర్చరీలో ఐదో రోజు కాస్త ఆశాజనక ఫలితాలు వచ్చాయి.
BCCL | Updated:
Aug 10, 2016, 11:57PM IST
రియో ఒలింపిక్స్ లో ఆర్చరీలో ఐదో రోజు కాస్త ఆశాజనక ఫలితాలు వచ్చాయి. భారత మహిళా ఆర్చర్ బాంబేలా దేవి గురి అదిరింది. తైపీ క్రీడాకారిణి లిన్షి చియాను ఓడించి మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ప్రీక్వార్టర్స్ కు అర్హత సాధించారు. రౌండ్ 64లో బాంబేలా దేవికి ఆస్ట్రేలియాకు చెందిన లారెన్స్ బాల్డఫ్ మధ్య పోటీ జరిగింది. ఇందులో బాంబేలా విజయం సాధించారు. తర్వాత జరిగిన పోటీలో తైపీ క్రీడాకారిణి లిన్ షి చియాతో ఆమె పోటీపడ్డారు. లిన్ షి చియాను రౌండ్-32 లో 6-2 తేడాతో ఓడించి రౌండ్-16కు దూసుకెళ్లింది బాంబేలా. ఇటీవల రియో ఒలింపిక్స్లో భారత మహిళల ఆర్చరీ టీమ్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకుని ఆ తర్వాత రష్యా తో జరిగిన పోటీలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ టీమ్ లో బాంబేలా దేవి ఒక మెంబర్. | 2sports
|
internet vaartha 118 Views
న్యూయార్క్ : ప్రముఖ సర్జింజన్ యాహూ ఇంక్ త్రైమాసిక ఫలితాలు వాల్స్ట్రీట్ అంచనాలను చేరుకోలేకపోయాయి. యాహూ కంపెనీ రాబడులు ప్రతిషేరుకు తొమ్మిది సెంట్లుగా ప్రకటించింది. మార్కెట్ నిపుణులు పది సెంట్లుగా ఉంటాయని అంచనా వేసారు. కంపెనీ ఇప్పటికే టంబ్లర్ 482 మిలియన్ డాలర్ల విలువను రద్దుచేసింది. 2013లో 1.1 బిలియన్ డాలర్లకు సోషల్ మీడియాను సంస్థ ను యాహూ కొనుగోలుచేసింది. తనిఖీ, వ్యాపార ప్రకటనల విభాగాన్నివేలం వేసేందుకు యాహూ యోచిస్తోంది. ఈవారమే విజేతను ప్రకటించే అవకాశం ఉంది. వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలపై కంపెనీ ఎక్కువ దృష్టిసారించింది. వెరిజాన్ కమ్యూనికేషన్స్, ఎటిఅండ్టి కంపెనీలు కీలక వ్యాపా రాన్ని చేజిక్కిం చుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. మరో ప్రైవేటు ఈక్విటీసంస్థ టిపిజి కేపిటల్, క్వికెన్లోన్స్ ఫౌండర్ డాన్ గిల్బర్ట్, వారెన్ బఫెట్ మద్దతు ఉన్న ఇన్వెస్టర్ ఈ కొనుగోలుపై దృష్టిపెట్టా రు. చైనా ఇ-కామర్స్ దిగ్గజం ఆలిబాబాలో వాటాలున్నాయి. యాహూ జపాన్లో కూడా యాహూ ఇంక్ వాటాలున్నట్లు ప్రకటిం చింది. కంపెనీటంబ్లర్ కొనుగోలురద్దు ప్రకటించిన తర్వాత నికర నష్టం 439.9 మిలియన్ డాలర్లుగాఉంది. మొత్తం రాబడులు చూస్తే పెరిగాయి. 1.24బిలియన్ డాల ర్ల నుంచి 1.31 బిలియన్ డాలర్లకు పెరిగాయి. బిజినెస్ ట్రాఫిక్కోసం భాగస్వామ్య వెబ్సైట్లకు ఫీజులు చెల్లించిన తర్వాత రాబడులు 1.04బిలియన్డాలర్ల నుంచి 841.2మిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మెస్సీని దాటేసి.. కళ్లు చెదిరే రీతిలో కోహ్లి సంపాదన!
క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ కూడా అదే రేంజ్లో పెరిగిపోతోంది.
TNN | Updated:
Oct 26, 2017, 12:23PM IST
క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ కూడా అదే రేంజ్‌లో పెరిగిపోతోంది. అభిమానుల్లో కోహ్లికి ఆదరణ కారణంగా.. అతడిపై కోట్లు గుమ్మరించేందుకు కూడా కంపెనీలు వెనుకాడటం లేదు. దీంతో విరాట్ సంపాదన పరంగానూ దూసుకెళ్తున్నాడు. ఎంతలా అంటే స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ, అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ స్టీప్ కర్రీ లాంటి అథ్లెట్లను కూడా వెనక్కి నెట్టేంతలా. ఫోర్బ్స్ వెలువరించిన ప్రపంచంలోని టాప్ 10 రిచెస్ట్ అథ్లెట్ల జాబితాలో కోహ్లి ఏడోస్థానంలో నిలవడం గమనార్హం. భారత కెప్టెన్ బ్రాండ్ వాల్యూ 14.5 మిలియన్ డాలర్లని ఫోర్బ్స్ తెలిపింది.
భారీ ఆర్జనతో క్రిస్టియానో రొనాల్డో, రోజర్ ఫెదరర్, ఉసేన్ బోల్ట్ తదితర దిగ్గజ అథ్లెట్ల సరసన విరాట్ స్థానం సంపాదించాడు. ఫోర్బ్స్ జాబితాలో 37.2 మిలియన్ డాలర్ల సంపాదనతో టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ అగ్రస్థానంలో నిలిచాడు. లిబ్రోన్ జేమ్స్ (33.4 మిలియన్ డాలర్లు), ఉసేన్ బోల్ట్ (27 మిలియన్ డాలర్లు) రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. రొనాల్డో (21.5 మి. డాలర్లు), ఫిల్ మెకల్‌సన్ (19.6 మి. డాలర్లు), టైగర్ ఉడ్ (16.6 మి. డాలర్లు) వరుసగా నాలుగు, ఐదు, ఆరోస్థానాల్లో ఉన్నారు. ఈ ఆదాయానికి ఆటగాళ్ల జీతభత్యాలు, బోనస్‌లు, ఇతర సంస్థల్లో వారి పెట్టుబడులు లాంటి ఆదాయాల్ని కలపలేదు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శతకం బాదిన కోహ్లి (31 సెంచరీలు).. అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రిక్కీ పాంటింగ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక సచిన్ (49) మాత్రమే టీమిండియా కెప్టెన్ కంటే ముందున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు కూడా కోహ్లినే కావడం గమనార్హం. | 2sports
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
Hyderabad, First Published 12, Apr 2019, 2:49 PM IST
Highlights
2012లో బాలీవుడ్ లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.
2012లో బాలీవుడ్ లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఒరిజినల్ చిత్రంలో వరుణ్ ధావన్, అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రాలు నటించగా.. ఇప్పుడు సీక్వెల్ లో టైగర్ ష్రాఫ్, అనన్య పాండే, తారా సుతారియా నటిస్తున్నారు.
ఇక కథ విషయానికొస్తే.. పేరుగాంచిన ఓ కాలేజ్ లో టైగర్, అనన్య, తారా సుతారియాలకు సీట్లు వస్తాయి. అక్కడ హీరోకి ఓ సంపన్న కుటుంబానికి చెందిన కుర్రాడితో గొడవలు వస్తాయి. ఈ క్రమంలో టైగర్ ని కాలేజ్ నుండి బయటకి పంపించేస్తారు.
ఆ తరువాత ఎలాగైనా.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ట్రోఫీ సాధించాలని టైగర్ మళ్లీ అదే కాలేజ్ లో అడుగుపెడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు. పునీత్ మల్హోత్రా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మే 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. | 0business
|
బంగారం లాంటి భరోసా! వడ్డితో సహా..
- 'గోల్డ్ బాండ్స్', 'గోల్డ్ మోనిటైజేషన్' పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- భౌతిక పసిడి విక్రయాలను తగ్గించడమే లక్ష్యం
- మంచి వడ్డీతో సహా అపరంజంతటి ధీమాకు కృషి
- భారీగా తగ్గనున్న కనకంపు దిగుమతులు
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: బంగారాన్ని భవితకు భరోసాగా భావించే వారు మన దేశంలో చాలా ఎక్కువ. అందుకే పసిడిని కొనుగోలు చేసుకొని తమ వద్ద దాచుకొంటుంటారు. ఇలాంటి వారి నుంచి ఎదరయ్యే డిమాండ్ను తట్టుకోవడానికి ప్రతి ఏటా దేశం దాదాపు 1000 టన్నుల పసిడిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇలా కొనుగోలు చేసిన బంగారంలో చాలా భాగం చలామణిలోకి రాకుండా నిరుపయోగంగా ఆయా సంస్థల వద్ద, ప్రజల వద్ద పేరుకుపోతోంది.
ఫలితంగా ప్రతియేడా దేశ పసిడి డిమాండ్ను తట్టుకోవడం కోసం లక్షల కొద్ది విదేశీ మారకపు ద్రవ్యం సరిహద్దులు దాటించాల్సి వస్తోంది. కరెంట్ ఖాతా లోటు బాగా పెరుగుతోంది. వీటికి చెక్ పెట్టేందుకు పేరుకుపోయిన బంగారం నిల్వలను చలామణిలోకి తెచ్చేందుకు గాను ప్రభుత్వం 'గోల్డ్ మోనిటైజేషన్' (బంగారం చలామణి) పథకాన్ని, 'గోల్డ్ బాండ్స్' పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేయడంతో త్వరలోనే ఈ పథకాలు అందుబాటులోకి రానున్నాయి. అపరంజికి భౌతిక డిమాండ్ను తగ్గించేందుకు అంతే భరోసాను వడ్డీతో సహా కల్పించేలా ప్రభుత్వం ఈ చలామణి పథకాల్ని రూపొందించింది. పరోక్షంగా దేశం కనకం దిగుమతి కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరమూ చాలా వరకు దూరం కానుంది. బంగారం చలామణి పథకం వల్ల దేశంలో ప్రజలు, ఆలయాలు, ఇతర ప్రయివేటు సంస్థల వద్ద ఉన్న టన్నుల కొద్ది బంగారం వ్వవస్థలోకి చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా సేకరించిన బంగారాన్ని దేశంలోని ఆభరణాల తయారీ సంస్థలకు కొత్త నగలను తయారు చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచనున్నారు. బంగారం విలువకు సమానంగా ఉండే గోల్డ్ బాండ్స్ వల్ల కూడా బంగారం బౌతిక కొనుగోళ్లకు చెక్ పడనుంది.
'గోల్డ్ మోనిటైజేషన్' పథకం తీరిది..
ఈ పథకంలో లబ్ది పొందాలనుకునే వారు కేవైసీ నిబంధనల మేరకు 'బంగారం సెవింగ్స్ ఖాతా'లను తెరవాల్సి ఉంటుంది. ఇందులో నగదుకు బదులుగా బంగారాన్ని గ్రాముల ప్రాతిపదికన డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో 1-3 సంవత్సర స్వల్ప కాలానికి, 5-7 సంవత్సరాల వ్యవధితో మధ్య కాలానికి, 12-15 సంవత్సరాల వ్యవధితో దీర్ఘకాలానికి డిపాజిట్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. గడువు ముగిశాక ఏడాది ప్రాతిపదికన డిపాజిట్లను పొడిగించుకోనే వెసులుబాటు ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే వీటికి లాక్ఇన్ పీరియాడ్ ఉంటుంది. అంతకంటే ముందే పసిడిని వెనక్కి తీసుకొనే ఖాతాదారులపై, కొంత మొత్తంలో తిరిగి తీసుకొనే వారిపై కూడా పెనాల్టీతో వాటి బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తారు. స్వల్పకాలిక డిపాజిట్లపై అంతర్జాతీయ లీజు రేట్లు, ఇతర ఖర్చులు, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని బ్యాంకులే వీటికి చెల్లించే వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. దీనిని కూడా వాస్తవానికి బంగారం రూపంలోనే జమ చేస్తారు. ఒక వేళ ఖాతాదారు మొత్తం పసిడిన వెనక్కి తీసుకోవాలనుకుంటు సదరు మొత్తాన్ని నగదు రూపంలోనూ బ్యాంకులు చెల్లిస్తాయి. మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేటును ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదింపులు జరిపి కాలానుగుణంగా నిర్ణయిస్తుంది. వీటిపై చెల్లించే వడ్డీని మాత్రం నగదు రూపంలోనే చెల్లిస్తారు.ఆభరణాల రూపంలో ఉన్న పసిడి కోసం బ్యాంకులు 'గోల్డ్ మెటల్ లోన్ ఖాతా'ను తెరుస్తాయి. బ్యాంకులు తమ వద్ద నిల్వ ఉంచుకోవడానికి ఉన్న పరిమితిని మించి బంగారం వస్తే వారు డిపాజిట్ల రూపంలో వచ్చిన పసిడిని శుద్ధి కేంద్రాలకు తరలిస్తాయి. బంగారపు సేకరణ కేంద్రాలు, స్వచ్ఛత పరీక్షా కేంద్రాలు కూడా బంగారాన్ని బంగారం శుద్ధి కేంద్రాలకు పంపుతాయి. శుద్ధి కేంద్రాలు ఇలా వచ్చిన బంగారాన్ని తమ గోదాములలో నిల్వ ఉంచుతాయి. ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఇందుకు బ్యాంకులు వాటికి రుసుమును చెల్లిస్తాయి. దీని కోసం వినియోగదారు నుంచి ఎలాంటి రుసుమును బ్యాంకులు వసూలు చేయవు. ఇలావచ్చిన బంగారాన్ని కరిగించి తిరిగి దేశ పసిడి అవసరాలకోసం వినియోగిస్తారు.
బాండ్ల జారీ ఇలా..
కేంద్ర మంత్రివర్గం అనుమతి పొందిన మరో పథకం'గోల్డ్ బాండ్స్'. ఇది కూడా భౌతికంగా బంగారం కొనకుండానే అంతటా భరోసా ఇచ్చేలా అందుబాటులోకి రానున్న మరో అద్భుత పథకం. ఈ పథకం ద్వారా లబ్ది పొందాలనుకునే మదుపరులు బంగారానికి బదులు అంతే భరోసా ఇచ్చే 'గోల్డ్ సర్టిఫికెట్ల'ను కొనుగోలు చేయయాల్సి ఉంటుంది. వీటిని తరువాత కాలంలో నగదుగాను లేదా బంగారం రూపంలోకి మార్చుకొని వాడుకొనేందుకు వీలుంటుంది. మదుపరులు ఎంత మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే సర్టిఫికెట్ను కొనుగోలు చేస్తే దానిపై వడ్డీని లెక్కించి చెల్లింస్తారు. వీటిపై ఎంత మొత్తంలో వడ్డీ చెల్లించాలనే విషయాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఈ పథకంలో భాగంగా 5,10,50,100 గ్రాముల డినామినేషన్తో గోల్డ్ బాండ్లను జారీ చేస్తారు. గరిష్ఠంగా ఒక వ్యక్తి ఏడాదికి 500 గ్రాముల వరకు పసిడి బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బంగారం ధరల్లో స్వల్పకాలంలో వచ్చే ఒడిదొడుకుల నుంచి రక్షణకు గాను ఈ బాండ్ల కనీస కాలావధిని 5-7 సంవత్సరాలుగా నిర్ణయించనున్నట్లు సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రీమేక్ సినిమాలో రిపోర్టర్గా రవితేజ
త్వరలోనే రిపోర్టర్ అవతారం ఎత్తనున్నాడు మాస్ మహారాజ రవితేజ.
TNN | Updated:
Apr 2, 2016, 04:45PM IST
త్వరలోనే రిపోర్టర్ అవతారం ఎత్తనున్నాడు మాస్ మహారాజ రవితేజ . అందుకోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల స్కామ్ నేపథ్యంలో తమిళంలో తెరకెక్కిన కనితన్ మూవీ అక్కడ బాగా హిట్ అయింది. ఇప్పుడిదే సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ టీఎన్ సంతోష్ . గతంలోనే ఓసారి హైదరాబాద్ వచ్చి రవితేజకి ఈ స్టోరీ వినిపించి అతడిచేత ఓకే అనిపించుకున్నాడని వార్తలొచ్చాయి. అయితే, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రకారం.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. రవితేజ ఇమేజ్కి సూటయ్యే విధంగా తెలుగులో కొన్ని మార్పులుచేర్పులు చేస్తున్నాడట డైరెక్టర్ సంతోష్. ప్రముఖ రచయిత అబ్బూరి రవి ఈ రీమేక్ టీమ్తో కలిసి పనిచేస్తున్నాడు. ఈ రీమేక్ గురించి ఇప్పటివరకు డైరెక్టర్ సైడ్ నుంచి తప్పించి రవితేజ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. | 0business
|
Aug 17,2018
క్షణాల్లో సేవింగ్స్ ఖాతా: కోటక్ బ్యాంక్
హైదరాబాద్: కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి కొత్తగా దాదాపు 100 శాఖలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1391 శాఖలను కలిగి ఉన్నామని.. మార్చి ముగింపు నాటికి వీటి సంఖ్యను దాదాపు 1500 శాఖలకు విస్తరించాలని లక్ష్యాంగా పెట్టుకున్నట్టుగా బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జీరో బ్యాలెన్స్తో సేవింగ్ ఖాతాను తెరుచుకొనేందుకు గాను అందుబాటులోకి తెచ్చిన 'కోటక్ 811' సేవింగ్ ఖాతాల పథకానికి అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు. కేవలం బయోమెట్రిక్ ఆధారంగానే క్షణాల్లో ఈ ఖాతాను తెరిచే వీలుందని ఆయన తెలిపారు. ఖాతాతో పాటు డెబిట్ కార్డును కూడా అందిస్తున్నట్టుగా ఆయన వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
హోమ్ Business News రేపో రేటును తగ్గించిన ఆర్బీఐ
రేపో రేటును తగ్గించిన ఆర్బీఐ
August 07, 2019, 3:25 PM IST
Share on:
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం పై నేడు సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇది మూడో పరపతి సమీక్ష. ఈ సమీక్షలో ఆర్బీఐ ఓ తీపి కబురును చెప్పింది. ఈ సారి 35 బేసిక్ పాయింట్ల మేరకు కోత విధించింది. వరుసగా నాలుగోసారి ఆర్బీఐ రేపోరేటును తగ్గించింది. కీలకమైన రెపోరేటును 35 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 5.75 శాతంగా ఉన్న రెపో రేటును 5.40 శాతానికి, 5.50శాతంగా ఉన్న రివర్స్ రెపో రేటును 5.15శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. కాగా… ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు స్పల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ మాసాల్లో రెపో రేటును సవరించడం ద్వారా 75 పాయింట్ల మేర కీలక రేట్లలో కోత విధించింది. సెప్టెంబర్లో మొదలయ్యే పండుగ సీజన్కు ముందే రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించాలని ఆర్బీఐ తాజా నిర్ణయంతో సంకేతాలు పంపింది. మరోవైపు ఆర్బీఐ అందించిన వెసులుబాటును బ్యాంకులు ఎంత మేర తమ ఖాతాదారులకు వర్తింపచేస్తాయనేది వేచిచూడాలి. | 1entertainment
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
Hyderabad, First Published 7, Mar 2019, 6:39 PM IST
Highlights
టాలీవుడ్ లో 2019కి మంచి శుభారంభాన్ని ఇచ్చిన F2 సినిమా విడుదలై 50 రోజులు పూర్తవుతున్నా రికార్డుల మోతను ఏ మాత్రం తగ్గించడం లేదు. సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసినా కూడా మాస్ థియేటర్స్ లో సినిమా ఇంకా నడుస్తూనే ఉంది. ఇకపోతే రీసెంట్ గా 52వ రోజు సినిమా సరికొత్త రికార్డు కొట్టడానికి సిద్ధమైంది.
టాలీవుడ్ లో 2019కి మంచి శుభారంభాన్ని ఇచ్చిన F2 సినిమా విడుదలై 50 రోజులు పూర్తవుతున్నా రికార్డుల మోతను ఏ మాత్రం తగ్గించడం లేదు. సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసినా కూడా మాస్ థియేటర్స్ లో సినిమా ఇంకా నడుస్తూనే ఉంది. ఇకపోతే రీసెంట్ గా 52వ రోజు సినిమా సరికొత్త రికార్డు కొట్టడానికి సిద్ధమైంది.
సింగిల్ థియేటర్ లో ఈ కామెడీ ఎంటర్టైనర్ మొత్తంగా కోటి రూపాయలను వసూలు చేయడానికి సిద్ధమైంది. ఆర్టిస్ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో సరికొత్త రికార్డ్ ను అందుకోవడానికి ఇంకా కొంచెం ధురంలోనే ఉంది. సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 80కోట్ల షేర్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ తో దిల్ రాజుకి చాలా రోజుల తరువాత లాభాలు వచ్చాయి.
వరుణ్ తేజ్ - వెంకటేష్ కెరీర్లకె కాకుండా హీరోయిన్స్ కు కూడా సినిమా కెరీర్ లోనే బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా గుర్తుండిపోయేలా చేసింది.ఈ రోజుల్లో 10 రోజుల కంటే ఎక్కువగా కనిపించని సినిమాలు వీకేస్తున్న తరుణంలో F2 ఆఫ్ సెంచరీ కొట్టి డైరెక్టర్ అనిల్ కి కూడా భారీ ఆఫర్స్ ను అందుకునేలా చేసింది.
Last Updated 7, Mar 2019, 6:39 PM IST | 0business
|
Kohli
వన్డే కెప్టెన్గా ఎంపికైన కోహ్లీ
ముంబై : టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో కొత్త శకం మొదలుకాబోతుంది.బిసిసిఐ ఛీప్ సెలక్టర్ ఎం ఎస్కె ప్రసాద్నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమా వేశంలో భారత వన్డే,టి20 కెప్టెన్గా కోహ్లీని లాం ఛనంగా ఎంపిక చేశారు.ఈ భేటికి హాజరుకావాలని కోహ్లీకి బిసిసిఐ ఆహ్వానం కూడా పంపింది. కోహ్లీ వస్తే ముందుగా అతన్ని కెప్టెన్గా ప్రకటించిన తరువాత అతని సమక్షంలోనే జట్టుకు ఎంపిక ప్రక్రియ ఏర్పాటు చేశారు. వన్డే,టి20 కెప్టెన్గా ధోనీ అనూహ్యంగా రిటై ర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ధోని వారసుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడానికి కోహ్లీ సిద్దంగా ఉన్నాడని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కె ప్రసాద్ వివ రించాడు. అయితే సమతూకంతో వన్డే,టి20 జట్లను ఎంపిక చేయడమే సెలక్టర్లకు పెద్ద సవాల్గా మారింది.
రోహిత్శర్మ, రహానే గాయాలతో ఇప్పటికే దూరమ య్యారు. అయితే సుదీర్ఘ టెస్టు సీజన్ను దృష్టిలో ఉం చుకుని స్పిన్ బౌలర్లు అశ్విన్,జడేజాకు విశ్రాంతిని వ్వనున్నారు. వన్డే,టి20 జట్లతో పాటు ముంబైలో ఇం గ్లండ్తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ల కోసం టీమిండియా ఎ జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించనున్నారు.ఇంగ్లండ్తో జరుగనున్న వన్డే సిరీస్కు ధవన్కు అవకాశం లభిం చింది. ఢిల్లీ తరపున అతను రంజీ ట్రోఫీ మ్యాచ్లో కూడా పాల్గొన్నాడు. అజింక్యా రహానే స్థానం లభిం చింది. ఇంగ్లండ్తో చివరి టెస్టులో ఒక్క పరుగుతో డబుల్ సెంచరీ కోల్పోయిన కెఎల్ రాహుల్ జట్టులోకి రానున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్,ఉమేష్ యాదవ్, బుమ్రాలతో భర్తీ చేశారు. అశ్విన్, జడేజా గైర్హాజరీ అనే సంగతి తెలిసిందే.ఇక మరో ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ గాయం వల్ల ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులో ఆడలేదు.ఇదిలా ఉంటే గత సంవత్సరం టీమిండియాకు దూరమైన సురేష్ రైనా పునరాగమనం ఆసక్తి నెలకొంది.ఇతను జట్టుకు ఎంపిక కాలేదు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఎంపికైనా అనా రోగ్యం కారణంగా రైనా బరిలోకి దిగలేదు. | 2sports
|
kumbli
చాంపియన్ ట్రోఫీలో కోహ్లీసేన ఆడాలని కోరుకుంటుంది: కుంబ్లే
న్యూఢిల్లీ: చాంపియన్ ట్రోఫీలో కోహ్లీ సేన ఆడాలని టీమిండియా కోరుకుంటుందని హెడ్ కోచ్ కుంబ్లే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈ టోర్నీలో పాల్గొనబోయే మిగతా ఏడు దేశాలు తమ జట్టును ప్రకటించగా బిసిసిఐ మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.ఐసిసి నిబంధనల ప్రకారం ఏప్రిల్ 25 లోపు జట్టును వెల్లడించాలి.కానీ బిసిసిఐ మాత్రం ఇంకా జట్టుని ప్రకటించలేదు.బిసిసిఐకి,ఐసిసికి మధ్య నడుస్తున్న వివాదం చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనకపోవడంపై ప్రభావం చూపకూడదని కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశాడు.చాంపియన్స్ట్రోపీలో ఆడాలని కోహ్లీ సేన కోరుకుంటున్నట్లు కుంబ్లే వివరించాడు. ఇదిలా ఉంటే భారత జట్టు చాంపియన్స్ ్టట్రోఫీలో పాల్గొనడం మంచిదని అంతకు ముందు క్రికెట్ లెజెండ్ సచిన్,ద్రవిడ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.మరో వైపు చాంపియన్స్ ట్రోఫీల ఆడే భారత జట్టుని వెంటనే ప్రకటించాలని బిసిసిఐ పరిపాలకుల కమిటీ(సిఒఎ) ఆదేశించింది.చాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టుని ప్రకటించేందుకు ఏప్రిల్ 25 వరకు గడువు ఉండగా ఇప్పటి వరకు ఎందుకు జట్టును ఎంపిక చేయలేదని సిసిఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరిని సిఇఎ ప్రశ్నించింది. వెంటనే సెలక్షన్ కమిటీతో సమావేశం ఏర్పాటు చేసిన చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుని వెంటనే ప్రకటించాలని అమితాబ్ చౌదరి కమిటీని కోరింది.జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లండ్లో చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న సంగతి తెలిసిందే. | 2sports
|
Visit Site
Recommended byColombia
ఈ సిరీస్‌లోని నాలుగు వన్డేలూ హోరాహోరీగా సాగడంతో నిర్ణయాత్మక ఐదో వన్డేపై ఆసక్తి పతాకస్థాయికి చేరింది. అయితే.. తొలుత బ్యాటింగ్ న్యూజిలాండ్ జట్టు అంచనాల్ని అందుకోలేక చతికిలపడింది. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్ వోక్స్ (3/32), ఆదిల్ రషీద్ (3/42) ధాటికి ఆ జట్టు బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (47: 68 బంతుల్లో 3x4, 1x6) కీలక సమయంలో వికెట్ చేజార్చుకుని జట్టుని ఒత్తిడిలో పడేయగా.. చివర్లో హెన్రీ నికోలస్ (55: 81 బంతుల్లో 1x4, 1x6), మిచెల్ శాంట్నర్ (67: 71 బంతుల్లో 4x4, 2x6) అర్ధశతకాలతో కివీస్ పరువు నిలిపే ప్రయత్నం చేశారు.
ఛేదనలో బారిస్టోతో పాటు మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ (61: 74 బంతుల్లో 9x4) మెరుగైన ఇన్నింగ్స్ ఆడటంతో.. తొలి వికెట్‌కి 155 పరుగుల అభేద్య భాగస్వామ్యం ఇంగ్లాండ్‌కి లభించింది. ఈ ఇద్దరు ఓపెనర్లు 22 పరుగుల వ్యవధిలో ఔటైనా.. చివర్లో గెలుపు లాంఛనాన్ని జో రూట్ (23 నాటౌట్: 37 బంతుల్లో 1x4), బెన్‌స్టోక్స్ (26 నాటౌట్: 18 బంతుల్లో 1x4, 2x6) జోడి పూర్తి చేసింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
4 th one day : india Vs Aus
నాల్గో వన్డే: ధోనీసేన ముందు భారీ లక్ష్యం
కాన్ బెర్రా: భారత్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 348 పరుగులు చేసింది.
| Updated:
Jan 20, 2016, 12:58PM IST
కాన్ బెర్రా: భారత్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. దీంతో ధోొనేసేన విజయం సాధించాలంటే 349 పరుగులు చేయాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. ఓపెనర్ ఫించ్ (107) సెంచరీతో కదం తొక్కగా..వార్నర్ (93), కెప్టెన్ స్మిత్ (51) అర్థ సెంచరీలతో రాణించారు. మార్ష్ 33, మాక్స్ వెల్ 37 పరుగులతో తమ వంతు సహకారం అందించడంతో ఆసీస్ కు భారీ స్కోర్ సాధ్యపడింది. ఈ మ్యాచ్ లో అందువచ్చిన ప్రతీ అవకాశాన్ని ఆసీస్ బ్యాట్స్ మెన్లు ఏ మాత్రం జారవిడచకుండా పరుగుల వరద పారించారు.
ఐదు వన్డేల సిరీస్ లో 0-3 తేడాతో సిరీస్ కోల్పోయిన ధోనీసేన ఈ మ్యాచ్ లో నెగ్గి పరువుదగ్గించుకోవాలని భావిస్తోంది. అయితే కంగారులు ఉంచిన భారీ లక్షాన్ని టీమిండియా చేధించగల్గుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. అయితే బలమైన బ్యాటింగ్ లైవఫ్ ఉన్న టీమిండియా.. సమిష్టిగా రాణిస్తే విజయాన్ని అందుకోవచ్చని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ భారీ లక్ష్యాన్నిధోనీసేనా చేధిస్తుందా లేదా చతికీలబడుతుందా అనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది. దీంతో మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. | 2sports
|
Hyderabad, First Published 3, Oct 2019, 8:03 PM IST
Highlights
ఇండియాలో బిగ్ బాస్ షోకు విపరీతమైన ఆదరణ ఉంది. బిగ్ బాస్ షోపై విమర్శలు ఉన్నపటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. హిందీతో పాటు సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో బిగ్ బాస్ షోలు జరుగుతున్నాయి.
ప్రముఖ నటి పాయల్ రోహ్తాగి బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 13 వైభవంగా ప్రారంభమైంది. ఈసారి ఎక్కువగా పేరున్న సెలెబ్రిటీలకే ప్రాధాన్యత ఇచ్చారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహారిస్తున్న సీజన్ 13 కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.
బిగ్ బాస్ సీజన్ 13లో అమీషా పటేల్, కొయినా మిత్రా, సిద్ధార్థ శుక్లా, అబూ మాలిక్, రేష్మీ దేశాయ్ లాంటి సెలెబ్రిటీలు పాల్గొంటున్నారు. వీరందరిపై పాయల్ రోహ్తాగి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అవకాశాలు లేక కాలం చెల్లిన నటులే బిగ్ బాస్ షోలో పాల్గొంటారని కామెంట్ చేసింది.
సీజన్ 13లో పాల్గొంటున్న సెలెబ్రెటీలకు ప్రస్తుతం ఎలాంటి పనిలేదు. డబ్బు కోసం మాత్రమే వీరంతా బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారు అని పాయల్ వ్యాఖ్యానించింది. మరికొందరు పాపులారిటీ లేని సెలెబ్రిటీలు చాలా తక్కువ రెమ్యునరేషన్ కే బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు ఒప్పేసుకుంటున్నారు అని కూడా కామెంట్ చేసింది.
తాను కూడా ఎలాంటి పని లేకపోవడం వల్లే బిగ్ బాస్ 2లో పాల్గొనాన్నని పాయల్ చెప్పుకొచ్చింది. దీనితో నెటిజన్లు పాయల్ పై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. చౌకబారు వ్యాఖ్యలు చేయడం ఆపాలని హితవు చెబుతున్నారు. | 0business
|
తెలంగాణ సినీ పరిశ్రమ పై భారీ చర్చకు తెరలేపిన వర్మ
Highlights
తెలంగాణ సినీ పరిశ్రమపై చర్చకు మళ్లీ తెరలేపిన రామ్ గోపాల్ వర్మ
అర్జున్ రెడ్డి సినిమా తెలంగాణ పరిశ్రమ ఏర్పాటుకు నాంది పలకాలన్న వర్మ
మూస ధోరణిలో సాగుతున్న ఈ పరిశ్రమకు భిన్నంగా తెలంగాణ పరిశ్రమ రావాలన్న వర్మ
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు కొత్త టాలెంట్ ను ప్రోత్సాహించాలని అకాంక్ష
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒక్కటే. అయితే పరిశ్రమలో తెలంగాణ వాళ్ల వాటా అంటూ పోరాటాలు జరిగిన తర్వాత ప్రత్యేక తెలంగాణ సినిమా అనే అంశంపై తెరపైకి వచ్చింది. కానీ రాష్ట్రం విడిపోయాక తెలంగాణ సినిమా అనే అంశం మరుగునపడిపోయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనే సినిమా పరిశ్రమ కొనసాగుతుందని, ఇక్కడుండే ఆంధ్ర సోదరులంతా తమవాళ్లేనని తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో పరిశ్రమలో తెలంగాణ, ఆంధ్రా అని చూసే దృక్పథం మారిపోయింది.
తెలంగాణకు, ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి సినిమా నిర్మాతల మండలి, చాంబర్ ఆఫ్ కామర్స్ లు వేరు పడ్డట్టు ప్రొజెక్ట్ అవుతున్నా.. తెలంగాణ పేరుతో ఏర్పడ్డ సంస్థలకు రకరకాల ఇబ్బందులు తప్పడడంలేదు. పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాల్లో వివిధ సంఘాల మధ్య విబేధాలు సహజంగానే వున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తెలుగు సినిమా అంతా ఒక్కటేనని, హైదరాబాద్ లోనే పరిశ్రమ వుండాలని, ఎక్కడికీ తరలి వెళ్లాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడమే కాక పరిశ్రమ వర్గాల వారికి కావాల్సినంతకంటే ఎక్కువే అండగా వుంటోంది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒక్కటే అనే భావన ఏర్పడింది.
మరోవైపు తెలంగాణ సినిమా అంటూ ప్రత్యేకంగా కొన్ని సంఘాలు వేరుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నా.. సినిమా అంటే తెలుగు సినిమానే అనే పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది.
అయితే తెలుగు సినిమాల్లో ఇటీవల కాలంలో తెలంగాణ భాష,యాసకు పెరిగిన ప్రాధాన్యత ఇక్కడి ప్రభుత్వాధినేతలను సైతం ఆకట్టుకుంది. ఆ కోవలోనే పెళ్లి చూపులు, ఫిదా, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలను మంత్రి కేటీఆర్ మాత్రమేకాక ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పొగడ్తలతో ముంచెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రామ్ గోపాల్ వర్మ తాజాగా అర్జున్ రెడ్డి సినిమాపై, హీరో విజయ్ దేవరకొండపై చేసిన కమెంట్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
అర్జున్ రెడ్డి సినిమాపై ఇటీవల సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కమెంట్స్ చేశారు. అర్జున్ రెడ్డి సినిమా తెలంగాణ సినీ పరిశ్రమ ఏర్పాటుకు నాంది కావాలని వర్మ ఆకాంక్షించారు. అంతే కాదు.. అర్జున్ రెడ్డి సినిమా చూశాక..తెలంగాణ ప్రాంతం నుంచి గొప్ప నటీనటులు, దర్శకులు రావటానికి ఎంతో దోహగ పడుతుందని వర్మ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు సాగిన ధోరణిలో కాకుండా తెలంగాణ మట్టిలోంచి పుట్టే కథలు సాంస్కృతికంగా, భాషా పరంగా కొత్త ఒరవడి సృష్టించగలవని వర్మ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రాంతం నుంచి పరిశ్రమకు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం వుందని, తెలంగాణ నేపథ్యంలో సాగే కథలు కూడా సినిమాలుగా మలచాలని, ఇప్పటి వరకున్న దర్శకులు ఎవరూ అలాంటి ఆలోచన చేయలేదని వర్మ అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలని, తద్వారానే మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినీ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కే అవకాశముందని వర్మ అన్నారు. తద్వారా తెలంగాణ సినీ పరిశ్రమను ఇప్పుడు మూస ధోరణిలో కొనసాగుతున్న తెలుగు పరిశ్రమకు భిన్నంగా ఒక ప్రత్యేక గుర్తింపున్న పరిశ్రమగా మలుచుకునే అవకాశముందని వర్మ అంటున్నారు.
మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
రాజస్థాన్ కథ ముగిసింది. (వీడియో)
Highlights
క్వాలిఫయర్-2కు కోల్కతా (వీడియో)
రాజస్థాన్ కథ ముగిసింది . 20 ఓవర్లు.. 170 పరుగుల లక్ష్యం.. ఓ దశలో రాజస్థాన్ జట్టు స్కోరు 109/1. గెలువాలంటే 35 బంతుల్లో 69 పరుగులు చేయాలి.కానీ ఏం లాభం. కోల్కతా బౌలర్ల నైపుణ్యం ముందు రాజస్థాన్ బడా హిట్టర్లందరూ దూది పింజల్లా తేలిపోయారు.
లీగ్ దశ నుంచి నిలకడైన విజయాలు సాధిస్తున్న కోల్కతా నాకౌట్లోనూ ఆకట్టుకుంది. ఆల్రౌండ్ షోతో అదురగొడుతూ కీలక మ్యాచ్లో సత్తా చూపెట్టింది. రస్సెల్ (25 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు)
కుల్దీప్, చావ్లా రాణించడంతో రాజస్థాన్ను ఓడించి సన్రైజర్స్తో శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్లో నెగ్గిన జట్టు ఫైనల్లో ఆదివారం చెన్నైని ఢీకొంటుంది.
Last Updated 24, May 2018, 11:09 AM IST | 2sports
|
New Delhi, First Published 23, Mar 2019, 1:18 PM IST
Highlights
రుణ సంక్షోభంలో చిక్కుకుని సర్వీసులు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్ జెట్ భావిస్తున్నది. మరోవైపు జీతాల్లేక విలవిలాడుతున్న జెట్ ఎయిర్వేస్ పైలట్లను తమ సర్వీసులోకి తీసుకునేందుకు ఇండిగో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక రుణదాతలు అధిక వాటా తీసుకుని జెట్ ఎయిర్వేస్ సంస్థను నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని జెట్ ఎయిర్వేస్ నిలిపివేసిన విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్జెట్ ఆలోచిస్తోంది. ఇందుకోసం‘జెట్’ విమానాల లీజు యజమానుదార్లతో పాటు జెట్ ఎయిర్వేస్ సంస్థ యాజమాన్యంతో చర్చలు జరుపుతోంది. దాదాపు 50 వరకు విమానాలను స్పైస్జెట్కు ఆఫర్ చేసే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల కథనం.
డీల్ కుదిరాక స్పైస్జెట్ నెట్వర్క్ లోకి..
లీజుదారులు, స్పైస్జెట్ మధ్య డీల్ కుదిరాక కొద్ది వారాల్లోనే విమానాలు ఈ ఎయిర్లైన్ నెట్వర్క్లోకి చేరవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం తన నెట్వర్క్లోని 119లో 41 విమానాలనే నడుపుతోంది.
టికెట్ ధరలు తగ్గేందుకు చాన్స్
జెట్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన ఎయిర్క్రాఫ్ట్లు స్పైస్జెట్ లీజుకు తీసుకోవడం ద్వారా విమాన సర్వీసులు పెరిగి ఈ మధ్య భారీగా పెరిగిన టికెట్ల ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. లీజు అద్దె చెల్లించలేకపోవడంతోపాటు ఇతర కారణాల వల్ల జెట్ ఎయిర్వేస్ తన నెట్వర్క్లోని మూడింట రెండోవంతు విమానాలను నిలిపివేసింది.
బోయింగ్ విమానాలపై డీజీసీఏ నిషేధం
దీనికితోడు ఇథియోపియో ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రపంచ దేశాలతోపాటు భారత్ కూడా బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలపై నిషేధం విధించింది. దాంతో స్పైస్జెట్ తన వద్దనున్న 12 బోయింగ్ 737లను నిలిపివేయాల్సి వచ్చింది. తత్ఫలితంగా రోజుకు వందల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. విమాన చార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చేశాయి.
13 అంతర్జాతీయ రూట్లలో విమానాలు రద్దు
ఏప్రిల్ నెలాఖరు వరకు జెట్ ఎయిర్వేస్ 13 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటు మరో ఏడు విమానాలకు అద్దె చెల్లించక పోవడం వల్ల జెట్ ఎయిర్వేస్ ఆయా సర్వీసులను నిలిపివేసింది. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి వివిధ దేశాలకు రాకపోకలు సాగించే జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
పుణె సింగపూర్, అబుదాబీ సర్వీసులు కూడా రద్దు
గత డిసెంబర్ నెలలో ప్రారంభించిన పుణె - సింగపూర్, పుణె -అబుదాబీ విమాన సర్వీసులను జెట్ ఎయిర్వేస్ రద్దు చేసింది. దీంతో పాటు ముంబై -మాంచెస్టర్ మార్గంలో విమానసర్వీసును కూడా నిలిపివేసింది.
600 నుంచి 119 విమానాలకు జెట్ ఎయిర్వేస్
గతంలో రోజుకు 600 విమానసర్వీసులు నడిపేవారమని, ప్రస్థుతం కేవలం 119 విమానాలే నడుపుతున్నామని జెట్ ఎయిర్వేస్ వెల్లడించింది. ఢిల్లీ - అబుదాబీ, ఢిల్లీ -దమ్మమ్, ఢిల్లీ -ఢాకా, ఢిల్లీ -హాంకాంగ్, ఢిల్లీ- రియాద్ విమాన సర్వీసులను రద్దు చేశారు. బెంగళూరు నుంచి సింగపూర్ వెళ్లే విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. ముంబయి నుంచి అబుదాబీ, బహ్రెయిన్, దమ్మమ్, విమాన సర్వీసులను కూడా ఏప్రిల్ 30వతేదీ వరకు రద్దు చేశారు.
జెట్ ఎయిర్వేస్లో మెజారిటీ వాటాకు బ్యాంకర్లు రెడీ
సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్లో రుణదాతలు మెజారిటీ వాటా తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్త ప్రమోటర్ వచ్చే వరకు బ్యాంకులు ఈ వాటాను తమ చేతిలో ఉంచుకునే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కొత్త ప్రమోటర్ కోసం మూడు నెలలు కావాలి
జెట్ ఎయిర్వే్సలోకి కొత్త ప్రమోటర్ను తీసుకువచ్చేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం బ్యాంకులు తమ వాటాను తగ్గించుకోవటం లేదా విక్రయించే అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఐదు నెలలుగా నిధుల కోసం ఎస్బీఐ కన్సార్టియం కసరత్తు
నిధుల కటకటతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్ కోసం రుణ పరిష్కార ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం గడిచిన ఐదు నెలలుగా కసరత్తు చేస్తోంది. జెట్ ఎయిర్ రుణ భారం దాదాపు రూ.8,200 కోట్ల వరకు ఉంది. మరోవైపు రూ.1,700 కోట్ల విలువైన రుణాలను ఈ నెలాఖరులోగా చెల్లించాలి.
రుణదాతలు వాటా తీసుకుంటే బెటర్
ఒకవేళ జెట్ ఎయిర్వేస్ సంస్థలో రుణదాతలు వాటా తీసుకుంటే సంస్థ గాడిన పడుతుందని పేర్కొన్నారు. కొత్త ప్రమోటర్ను తేవాలంటే ముందుగా ఇప్పటి ప్రమోటర్ తప్పుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావటానికి దాదాపు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ అయిన నరేశ్ గోయల్కు 51 శాతం వాటాలుండగా ఎతిహాద్ ఎయిర్వే్సకు 24 శాతం వాటాలున్నాయి.
జెట్ ఎయిర్వేస్ పైలట్లకు ఇండిగో ఎర!
పైలట్లు, ఇతర సిబ్బంది కొరతతో సతమతం అవుతున్న ఇండిగో.. జెట్ ఎయిర్వేస్ పైలట్లకు ఎర వేస్తోంది. జెట్ నుంచి బయటికొస్తున్న 100కు పైగా బోయింగ్ 737 పైలట్లను ఇండిగో నియమించుకుంటోంది. ఇండిగో నెట్వర్క్లోని విమానాల్లో ఎయిర్బస్ ఏ320లే అధికం.
బోయింగ్ విమానాలు నడిపేందుకు ఆరు నెలల శిక్షణఈ బోయింగ్ పైలట్లకు ఎయిర్బస్ విమానాలు నడిపేందుకు మరో ఆర్నెళ్లపాటు శిక్షణ ఇప్పించనున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి పైలట్లను నియమించుకోవడంకన్నా దేశీయంగా అందుబాటులో ఉ న్న పైలట్లకే అవసరమైతే శిక్షణ ఇప్పించడం చౌక అని ఇండిగో భావిస్తోంది. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
టెలికమ్యూనికేషన్స్ రంగంలో ప్రస్తుతం కన్సాలిడేషన్ దశ నడుస్తుండగా..ఫైబర్ టు హోమ్ పేరుతో ఇంటర్నెట్తో కూడిన వినోద సాధనసేవలను అందిస్తోంది జియో. న్యూఢిల్లీ, ముంబైలో ఈ సర్వీసు ప్రారంభించింది. ఇప్పటిదాకా వైర్ నెట్తో ఎవరూ ఫోన్ కాల్స్ వీడియోలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎయిర్టెల్, రిలయన్స్ ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నా ఇంటర్నెట్ ఆధారిత టివి సౌకర్యం తక్కువనే చెప్పాలి అందుకే రిలయన్స్ జియో . ఇంటర్నెట్ ఆధారిత ఫోన్ కాల్స్కి ప్రభుత్వం నుంచి అనుమతి గతంలో లేదు. మే1 న ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇవ్వగా ఆ నిబంధనల మేరకు జియో పైబర్ టూ హోమ్ ఫోన్ పనిచేస్తుందని తెలుస్తోంది. అలానే జియో టివి యాప్ ద్వారా ఇందులో టివి ఛానల్స్ చూసే సౌకర్యం అదనం. ఇంకా ఇందులో అదనపు హంగు ఏమిటంటే ఒకసారి లైవ్ వచ్చిన కార్యక్రమాన్ని ఏడు రోజుల వరకూ వెనక్కి వెళ్లి చూడొచ్చట. ఇలాంటి అనేక హంగులతో వస్తోంది వస్తోంది అంటూ ఊరిస్తోన్న జియో ఫైబర్ టూ హోమ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికే ఎయిర్టెల్ 300 ఎంబిపిఎస్ స్పీడ్తో బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టుంది. ఐనా జియో తక్కువ రేటుకి ఎక్కువ ఫీచర్లు అందించనుందనే ప్రచారం జరుగుతోంది | 1entertainment
|
అమ్మకానికి ఎయిర్ ఇండియా ఆస్తులు
- ముంబయి, చెన్నై, కోయంబత్తూర్లలో స్థలాల విక్రయం
- సిద్ధమైన కేబినెట్ నోట్
- వివిఐపి ప్రయాణికుల బాకీ 600 కోట్లు
న్యూఢిల్లీ : నష్టాల్లోవున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా వివిధ ప్రదేశాలలలో ఉన్న సంస్థ ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. దీని ద్వార సుమారు 250 కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని ఆలోచిస్తుంది. ముంబయి, చైన్నై, కోయంబత్తూరులోవున్న స్థలాలను అమ్మాలని సంస్థ నిర్ణయించింది. ముంబయిలో 90 కోట్ల రూపాయల విలువచేసే ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించింది. చెన్నైలోవున్న 120 కోట్ల రూపాయలన పార్శిల్ స్థలాన్ని అమ్మివేస్తుంది. కోయంబత్తూరులోవున్న పార్శిల్ స్థలం విలువ 30 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఈ మూడు ప్రదేశాల్లోవున్న ఆస్తుల అమ్మకానికి సంబంధించి కేబినెట్ నోట్ సిద్ధమైందని ఉన్నతాధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా 40 వేల కోట్ల రూపాయల నష్టాల్లో నడుస్తున్నది. సంస్థ మనుగడ కోసం 2012లో బెయిలవుట్ ప్యాకేజిని పొందింది. యుపిఎ హాయాంలో ఉద్ధీపన ప్యాకేజీ ద్వారా 30 వేల కోట్ల రూపాయలను తొమిదేళ్లలో సేకరించారని నిర్ణయించారు. మరోవైపు సంస్థకు రావాల్సిన 2,400 కోట్ల రూపాయల బకాయిల్ని రాబట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో 600 కోట్ల రూపాయలు కేవలం వివిఐపిల ప్రయాణాల ద్వారా రావాల్సి ఉంది. మిగతా లోటు 1,800 వేల కోట్ల రూపాయను కేంద్ర గ్రాంటుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. నిధుల సేకరణపై
జూలై 21 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. 2015-16 కేంద్ర బడ్జెట్లో ఎయిర్ ఇండియా 4,300 కోట్లను కేటాయించాలని కోరింది. కానీ 2,500 కోట్లను మాత్రమే బిజెపి ప్రభుత్వం ఇచ్చింది.1,800 కోట్ల రూపాయలను నష్టాల నివారణకు మంజూరు చేయాలని కేంద్రానికి ఎయిర్ ఇండియా విజ్ఞప్తి చేస్తోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Bathukamma Song: మంగ్లీ బత...
అభిమానులు తమకు ఇష్టమైన హీరోలపై ప్రేమను రకరకాలుగా చాటుకుంటారు. సినిమా విడుదలైనప్పుడు పాలాభిషేకాలు చేయడం.. ఫ్లెక్సీలు కట్టడం.. కొందరు ఒకడుగు ముందుకేసి తమ పిల్లలకు పేర్లు కూడా పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా రకరకాలుగా తమకు తోచినట్లు అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా నందమూరి హీరో బాలయ్యపై కర్ణాటకకు చెందిన శ్రీనివాసులు తన అభిమానాన్ని వినూత్నంగా చూపించాడు.
శ్రీనివాసులు ఏకంగా తన కుమారుడి పెళ్లి పత్రికపై బాలయ్య ఫోటోలతో ముద్రించాడు. నందమూరి అభిమానులందరూ.. తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వానం పలికాడు. మే 13న తన కుమారుడి పెళ్లికి బాలయ్య, నందమూరి అభిమానులు హాజరై.. తన కుమారుడికి ఆశీస్సులు అందించాలని కోరాడు. ఈ దంపతులకు బాలయ్య బాబు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి...మా ఆరాధ్య దైవం బాలయ్య బాబు అంటూ పత్రికపై ముద్రించాడు.
ఈ పెళ్లి పత్రికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డు చూసిన నందమూరి ఫ్యాన్స్.. శ్రీనివాసులు బాలయ్యపై చూపించిన అభిమానానికి ఫిదా అవుతున్నారు. | 0business
|
Jun 05,2018
చెన్నయ్ సిల్క్ 25వ షోరూమ్ ప్రారంభం
హైదరాబాద్: దక్షిణ భారత దేశంలో ప్రముఖ వస్త్ర రిటైలర్ సంస్థ ది చెన్నరు సిల్క్ తెలంగాణలో మరో ముందడుగు వేసింది. హైదరాబాద్లో ఆ సంస్థ తన రెండో అతిపెద్ద షోరూమ్ను మోహదీపట్నంలో ప్రారంభించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.కె.చందిరన్ ప్రముఖ టాలీవుడ్ నటి (పెళ్లిచూపులు ఫేం) రీతూ వర్మాలు ఈ షోరూమ్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా చందిరన్ మాట్లాడుతూ హైదరాబాద్లో కూకట్పల్లి తరవాత తాము రెండో షోరూమ్ను మెహదీపట్నంలోనే ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. విస్తరణ పథంలో ఉన్న తమకు ఇది 25వ షోరూమ్ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు కె.మాణిక్యం, కె. శివలించగం, పి.కె.అర్ముగం, కె.వినాయకం, ఎన్.కె.నందగోపాల్, కె. పరుమశివం పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘విరుష్క’ వివాహ విందులో ప్రధాని మోదీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్కశర్మల వెడ్డింగ్ రిసెప్షన్ ఢిల్లీ తాజ్ డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లోని దర్బార్ హాల్లో కొద్దిసేపటి క్రితం వైభవంగా ప్రారంభమైంది.
TNN | Updated:
Dec 21, 2017, 10:53PM IST
‘విరుష్క’ వివాహ విందులో ప్రధాని మోదీ
టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్ న‌టి అనుష్కశర్మల వెడ్డింగ్ రిసెప్షన్ ఢిల్లీ తాజ్ డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్‌లోని దర్బార్ హాల్‌లో కొద్దిసేపటి క్రితం వైభవంగా ప్రారంభమైంది. ఈ వివాహ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈనెల 11న ఇటలీలోని టస్కనీలో వివాహ బంధంతో ఒక్కటైన విరుష్క జంట.. ఆ తర్వాత హనీమూన్‌ ట్రిప్‌ పూర్తిచేసుకొని గురువారం నాడు ఢిల్లీలో వివాహ విందును ఏర్పాటు చేశారు.
Visit Site
Recommended byColombia
దర్బార్ హాల్‌లో జరుగుతున్న ఈ వేడుకకి ఇరువురి కుటుంబసభ్యులు పలువురు ముఖ్య అతిథులు హాజరయ్యారు. చీర‌క‌ట్టులో అనుష్క చూడ ముచ్చట‌గా ఉంటే.. చిరు నవ్వులు చిందిస్తూ విరాట్ కోహ్లీ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఎర్రరంగు బెనారస్ చీరలో అనుష్క మెరిస్తుంటే.. నలుపు రంగు పట్టు కుర్తా, గోధుమ రంగు పైజామాతో విరాట్ కోహ్లీ కొత్త పెళ్లికొడుకు గెటప్‌లో అదరగొట్టేశాడు. ప్రస్తుతం విరుష్క జోడి వెడ్డింగ్ రిసెప్షన్‌‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఢిల్లీలో రిసెప్షన్‌ అనంతరం విరుష్క జంట ముంబయికి బయల్దేరి వెళ్లనుంది. ఈ నెల 26న ముంబయిలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు రెండో విందు ఇవ్వనున్నారు ‘విరుష్క’ జంట.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
News Room 365 WATCH LIVE TV
బాహుబలి చాన్స్ అలా మిస్సయ్యిందట
ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో బాగా వినపడుతున్న పేరు సాయి మాధవ్ బుర్రా.. డైలాగ్స్ రాయడంలో తనకంటూ ఓ స్టయిల్ను క్రియేట్ చేసిన ఈ రచయిత రీసెంట్గా ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి వంటి రెండు పెద్ద సినిమాలకు మాటలు రాశాడు.
TNN | Updated:
Jan 21, 2017, 05:51PM IST
ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో బాగా వినపడుతున్న పేరు సాయి మాధవ్ బుర్రా.. డైలాగ్స్ రాయడంలో తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసిన ఈ రచయిత రీసెంట్‌గా ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి వంటి రెండు పెద్ద సినిమాలకు మాటలు రాశాడు. వాటికొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరి నోటి ద్వారా ఈ డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అంతగా ఇంపాక్ట్ చేశాయి.
మరి ఇటువంటి రచయితకు బాహుబలి సినిమాలో స్థానం ఎందుకు దక్కలేదో.. ఆయనే స్వయంగా చెప్పడం విశేషం. నిజానికి బాహుబలి సినిమా సిట్టింగ్స్‌లో సాయి మాధవ్ కూడా ఉన్నారట. స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు రాజమౌళి మీతో పాటు సినిమాకు మరో రచయిత కూడా పని చేస్తారని చెప్పారట. దీంతో సాయి మాధవ్ బుర్రా వెంటనే సినిమాకు ఒక్క రచయిత ఉంటేనే బావుంటుంది అలా అయితేనే నేను పనిచేస్తానని చెప్పారట. | 0business
|
దూకుడు పెంచిన సెబీ!
- సీఐఎస్ పథకాలు, డీమ్డ్ ఇష్యూలపై కన్నెర్ర
- రూ.55,000 కోట్ల సొమ్ము రికవరీకి చర్యలు
- 2500 అటాచ్మెంట్ నోటీసులు జారీ
ముంబయి: నిబంధనలకు వ్యతిరేకంగా వివిధ 'డబ్బు పూలింగ్ పథకాల' ద్వారా నిధులను సమీకరించిన సంస్థలపై మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' కొరడా జులిపించేందుకు సిద్ధమవుతోంది. వివిధ పథకాల ద్వారా అధికంగా నిధులను సమీకరించి మదుపరులకు బకాయి పడిన సంస్థల నుంచి దాదాపు రూ.55,000 కోట్ల మేర సొమ్మును తిరిగి రాబట్టేందుకు గాను సెబీ చర్యలను మొదలు పెట్టింది. ఆయా సంస్థలకు విధించిన జరిమానాలతో పాటు మదుపరులకు సొమ్మును తిరిగి రాబట్టేందుకు గాను 2013లో సెబీకి సర్కారు అధికారాలను కట్టబెట్టింది. దాదాపు రూ.55,015 కోట్ల సొమ్మును రాబట్టేందుకు గాను సెబీ 900 కేసుల్లో చర్యలు చేపట్టింది. వీటిలో రూ.52,912 కోట్ల సొమ్ము 'కలెక్టివ్లి ఇన్వెష్ట్మెంట్ స్కీం' (సీఐఎస్)లు, డీమ్డ్ పబ్లిక్ ఇష్యూలకు సంబంధించినవ కేసులే ఉన్నాయి. వీటికి తోడు మరో రూ.47 కోట్ల రూపాయలు పెనాల్టీల రూపంలో రావాల్సి ఉంది. వీటిలో మొత్తం 207 కేసులు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటి ద్వారా సెబీ ఇప్పటి వరకు దాదాపు రూ.250 కోట్ల నిధులను తిరిగి రాబట్టగలిగింది. పరిశీలనలో ఉన్న కాలంలో సెబీ మొత్తం 2,500 అటాచ్మెంట్ నోటీసులను జారీ చేసింది. ఈ కేసుల్లో చిక్కుకున్న ఎక్కువ సంస్థలు అధిక మొత్తంలో రాబడిని ఇస్తామంటూ పెట్టుబడి దారులను మోసం చేస్తూ నిధులను సమీకరించిన వారే కావడం విశేషం. ఈ సంస్థల నుంచి సొమ్మును రికవరీ చేసేందుకు గాను సెబీ బకాయిపడిన సంస్థలు, వ్యక్తుల ఆస్తులను, బ్యాంక్, డిమాట్ ఖాతాలను అటాచ్ చేసింది. రికవరీ ప్రక్రియలో భాగంగా సంస్థ ఆయా సంస్థల షేర్లను 744 ట్రేడింగ్ సెషన్లలో వీటిని విక్రయించి రూ.11 కోట్లను సమీకరించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 336 Views
ముంబై : సిమెంట్ కంపెనీల షేర్లు 52 వారాల గరిష్టస్థాయిలో కొనసాగుతున్నాయి. భారీ కంపెనీలు ఎసిసి, అంబుజాసిమెంట్స్ శ్రీసిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు 52వారాల గరిష్టంగా నడిస్తే చిన్న, మధ్యస్థాయి కంపెనీలు కూడా 52 వారాల గరిష్టంగా ట్రేడింగ్ జరుపుతున్నాయి. గడచిన కొన్ని త్రైమాసికాలుగా ట్రేడింగ్ అసంబద్ధం గాను అనిశ్చితంగాను ఉన్న సిమెంట్ కంపెనీలకు ఈఏడాది బడ్జెట్లో పొందుపరిచిన ఇన్ఫ్రా కేటాయింపులు, గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి చర్యలతో రానున్న కాలంలో సిమెంట్ కంపెనీలకు డిమాండ్ పెరుగుతుంద ని అంచనాలు వేస్తున్నారు. ఇన్ఫ్రా రంగంలోనే 40శాతం సిమెంట్ వినియోగం జరుగుతోంది. 2017 మధ్యభాగం నుంచి సిమెంట్ కంపెనీలకు మరింత డిమాండ్ ఉంటుందని అంచనా. రుతుపవనాల అనంతరం ప్రాజెక్టుల్లో కదలిక పెరుగుతుంది. ఉత్తర, మధ్య భారతంలోను, పశ్చిమప్రాంతంలో కూడా మధ్య కాలికంగా ప్రాజెక్టుల్లో కదలిక పెరుగుతున్నట్లు నిపు ణులు పేర్కొంటున్నారు. కోటక్ సెక్యూరిటీస్ వంటి సంస్థల అభిప్రాయాన్ని పరిశీలిస్తే మార్చినెలలో ఉత్తరభారత్లో పనులు స్థిరంగా ఉన్నాయి. జెకె సిమెంట్, జెకెలక్ష్మి, శ్రీసిమెంట్కంపెనీలు తమతమ ధరలను పునఃసమీక్షించాయి.ఇక దక్షిణాది ప్రాంతం లో ఉత్పత్తికి అనుగుణంగా డిమాండ్ ఉన్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిమాండ్ అనుకున్నంతగా లేదని అంచనా. అయితే రానురాను రాజధాని నిర్మాణం, మరింత ఇన్ఫ్రా భారీ ప్రాజెక్టులతో కొంత డిమాండ్ పెరుగుతుందని అంచనా. ఇండియాసిమెంట్స్ వంటి కంపెనీలు షేర్లు కనిష్టంగా 67.50 నుంచి 91.90స్థాయికి ట్రేడింగ్ జరుగుతున్నాయి. ఓరియంట్ సిమెంట్ తెలంగాణలోఉత్పత్తిచేస్తూ పశ్చిమప్రాంతానికి కూడా పంపిణీచేస్తోంది. ఈ రెండుప్రాంతాల్లోను కూడా డిమాండ్పెరిగే అవకాశం ఉంది. కర్నాటకలో కూడా ఓరియంట్ పటిష్టం అవుతోంది. సాగర్ సిమెంట్స్ పరంగాచూస్తే 15శాతం పెరుగుతుందని అంచనా. మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ వంటి ఏజెన్సీలు 2015లో బిఎంఎం సిమెంట్ కొనుగోలుతో మరి కొంత పెరుగుతుందని అంచనా. సాగర్ సిమెంట్స్ ఏప్రిల్ 11వ తేదీ 604 రూపాయలుగాట్రేడ్ అయితే ప్రస్తుతం 569ప్రాంతంలోఉంది. దాల్మియా భారత్ వంటివి ఈశాన్యరాష్ట్రాలు, దక్షిణ భారత్లో ఎక్కువ పటిష్టంగా ఉన్నాయి. ఈశాన్యభారతంలో రోడ్డుప్రాజెక్టులు ఎక్కువ గా రావడమే ఇందుకుకీలకం. క్రెడిట్స్యూస్సీ వంటి సంస్థలు మార్చి త్రైమాసికం కొంత నీరసిస్తుందని, ధరల్లో ఉత్తర భారత్వైపు నుంచి ధరల్లోకొంత రికవరీ కనిపించాల్సి ఉందని ఈ త్రైమాసికం చివరినాటికి కనిపి స్తుందని ప్రకటించింది. సగటు అమ్మకం ధరలు గతంలో పోలిస్తే ఏటికేటాది చొప్పున 6-8శాతం దిగజారాయి. శ్రీసిమెంట్, అంబూజా, ఎసిసి, అల్రాటెక్ సంస్థలు 9-29శాతం పెరిగాయి. మిడ్సైజ్ కంపెనీల పరంగా చూస్తేఓరియంట్, జెకెలక్ష్మి, జెకెసిమెంట్ వంటి వి 13-41శాతం పెరిగాయి. ప్రిస్మ్ సిమెంట్ ఒకే ఒక్కకంపెనీ ఏటికేడాదిచొప్పున8.2శాతం క్షీణించింది. | 1entertainment
|
bse
ముందన్నది కష్టకాలమే.
ముంబై, జనవరి 15: దేశీయ స్టాక్ మార్కెట్లు గత ఏడాది చివరిలో డీలాపడ్డాయి. కొత్త ఏడాదిప్రారంభం నుంచి కొంతవరకూ పుంజు కున్నాయి. రెండునెలల గరిష్టస్థాయిలో ఇపుడు కొనసాగుతున్నా యి. సెన్సెక్స్ 27000 పాయింట్లు, నిఫ్టీ 8400 స్థాయిలో ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు బైటపడినట్లేనని చెప్పలేమని నిపుణులు చెపుతున్నారు. మార్కెట్లు కనిష్టస్థాయి నుంచి ఇంకా గట్టెక్కలేదనే భావించాలని సూచిస్తున్నారు. రానున్న కాలంలో పరిస్థితులు విషమిస్తే 10శాతం వరకూ నష్టాలపాలయ్యే అవకాశం ఉంది. పెద్దనోట్ల రద్దుతో దేశీయంగా డిమాండ మందగించింది. ఈ తరుణంలో కంపెనీలు మూడోత్రైమాసిక ఫలితాలు వెల్లడిస్తు న్నాయి. ఆర్థిక సంవత్సరం అక్టోబరు డిసెంబరు త్రైమాసికంలో కొన్ని రంగాల కంపెనీల ఫలితాలు నిరుత్సాహం కలిగిచే అవకా శం ఉంది. బ్రెగ్జిట్, ఇటలీప్రధాని రాజీనామా, అమెరికా కొత్త అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికలు వంటిఅంశాలు ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ప్రభావంచూపిస్తాయి.
ఇక సార్వత్రిక బడ్జెట్ను ప్రభు త్వం వచ్చేనెల ఒకటవ తేదీనే ప్రకటించనున్నది. ఈసారి రైల్వే లను కూడా సాధారణ బడ్జెట్లోనే చేర్చేందుకు ప్రభుత్వం నిర్ణ యించింది. రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ ఇకపై ఉండదు బడ్జెట్లో కేంద్రం ఇచ్చే సంస్కరణలే మార్కెట్లకు కీలకం అవుతాయి. ఇక రాజకీయ అంశాలు కూడా కొన్ని ప్రభావితంచేస్తాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్తో సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రజల తీర్పు ఆధా రంగా మార్కెట్లలోఇన్వెస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బిజెపిపై ఓటర్ల తీర్పునకు ప్రాధాన్య తుంది. ఎన్డిఎకు వ్యతిరేక పవనాలుంటే మార్కెట్లపై ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది. 20వ తేదీ కొత్త అధ్యక్షునిగా డొనాల్డ్ట్రంప్ బాధ్యతలు చేపడుతున్నారు.
దేశీయఫార్మా, ఐటిరంగాలకు ట్రంప్ విధానాలు కీలకం అవుతాయి. ట్రంప్ విదేశీ విధానాలపై ఇప్పటికే కొంతమేర ఆందోళనలున్నాయి. ఇక అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు మరికొంత కీలకం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సెంట్ర ల్ బ్యాంకు నిర్ణయాలు కీలకం అవు తాయి. గతఏడాది చివరిలో పావు శాతం వడ్డీరేటును పెంచడంతో పాటు ఈఏడాది మరో మూడుసార్లు రేట్లు పెంచే అవకాశం ఉందని ఫెడ్ సంకే తం ఇచ్చింది. అమెరికా ఆర్థికవ్యవస్థ పటిష్ట వృద్ధిని సాధించగలిగితే రేట్ల పెంపు నిర్ణయాలు వేగమందుకునే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడు లను వెనక్కి మళ్లించే అవకాశంఉంది. గత ఏడాది అక్టోబరు మొదలు ఎఫ్ఐఐలు దేశీయ స్టాక్మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరిం చుకుంటున్న అంశం విదితమే. రాను న్న కాలంలో విదేశీ సంస్థాగత పెట్టు బడులు సైతం మార్కెట్లకు కీలకం అవుతాయనడంలో సందేహంలేదు. | 1entertainment
|
ఇక కనీస వేతనం రూ.15,000.. 55 లక్షల మందికి ప్రభుత్వం గుడ్ న్యూస్..!
Samayam Telugu| Oct 29, 2019, 04.05 PM IST
సుప్రీం కోర్టు ఇటీవల మద్దతు తెలిపిన కనీస వేతన పెంపు నిర్ణయాన్ని నోటిఫై చేసింది ఢిల్లీ ప్రభుత్వం. దీంతో ఏకంగా 55 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. అన్స్కిల్డ్ వర్కర్లకు ఇప్పుడు కనీసం వేతనం నెలకు రూ.14,842గా ఉంది. ఇది వరకు వీరికి రూ.14,000 జీతం ఉండేది.
అలాగే సెమీ స్కిల్డ్ వర్కర్లకు ఇప్పుడు రూ.15,400 కాకుండా రూ.16,341 కనీస జీతం లభిస్తుంది.అలాగే స్కిల్డ్ వర్కర్లకు జీతం రూ.16,962 నుంచి రూ.17,991కు పెంచారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జీతం 11 శాతం మేర పెరగనుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు అలాగే డియర్నెస్ అలవెన్స్ (డీఏ) కూడా లభిస్తుందని తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి డీఏ వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఒక నెల జీతం దీపావళి బోనస్ కింద అందజేస్తామని తెలిపారు. నగరంలో మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, పేదరికాన్ని అధిగమించేందుకు ఇది చాలా కీలకమైన నిర్ణయమని పేర్కొన్నారు.
Also Read: పోస్టాఫీస్ స్కీమ్ అదిరింది.. నెలకు రూ.5,000తో చేతికి ఏకంగా రూ.3.6 లక్షలు..!
ఆర్థికంగా వెనుకబడిన వారు నాణ్యమైన జీవితం గడిపేందుకు కనీస వేతన పెంపు నిర్ణయం అమలు దోహదపడుతుందని ఆయన తెలిపారు. చేతిలోకి ఎక్కువ డబ్బులు రావడం వల్ల వర్కర్లు కూడా ఎక్కువగానే ఖర్చు చేస్తారని, అప్పుడు మార్కెట్లో ఉత్పత్తి పెరుగుతుందని, దీంతో ఉద్యోగ కల్పన మ మెరుగు పడుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని వివరించారు.
Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం..
ఇకపోతో 2019 అక్టోబర్ 9న కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ 5 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జూలై 1 నుంచే ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
Also Read: ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేసుకున్నారా? లేదంటే ఈ 5 ప్రయోజనాలు మిస్ అవుతారు!
మరోవైపు అక్టోబర్ 14న సుప్రీం కోర్టు.. ఢిల్లీ గవర్నమెంట్ నోటిఫై చేసిన కనీస వేతన నిర్ణయాన్ని సబబే అని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ కనీస వేతన పెంపును వ్యతిరేకిస్తూ 44 అసోసియేషన్లు సుప్రీం తలుపుతట్టాయి. అయితే సుప్రీం కోర్టు మాత్రం ఢిల్లీ నిర్ణయాన్ని సమర్థించింది. కాగా జాతీయ స్థాయి కనీస వేతనం రూ.4,628గా ఉండగా, ఢిల్లీలో మాత్రం ఇది రూ.14,842గా ఉండటం గమనార్హం. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
IND vs PAK: ఇంటికి వెళ్లాలని లేదా..? పాక్ కెప్టెన్ వార్నింగ్
భారత్తో మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. ఆటగాళ్లకి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు ఆ దేశ మీడియా వెలుగులోకి తెచ్చింది.
Samayam Telugu | Updated:
Jun 18, 2019, 09:18PM IST
హైలైట్స్
భారత్ చేతిలో ఓటమి తర్వాత పాక్ ఆటగాళ్లకి వార్నింగ్ ఇచ్చిన కెప్టెన్ సర్ఫరాజ్
ఆటతీరు మార్చుకోకపోతే.. స్వదేశంలో వ్యతిరేకత తప్పదని హెచ్చరిక
టీమ్ గ్రూప్ రాజకీయాలు మానేయాలని వినతి
సర్ఫరాజ్ మాట్లాడుతున్నంతసేపు మౌనంగా ఉండిపోయిన మాలిక్, హఫీజ్
భారత్ చేతిలో ఘోర పరాజయంతో విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ టీమ్ దిద్దుబాటు చర్యలకి ఉపక్రమించింది. గత ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో తేలిపోయిన పాకిస్థాన్ జట్టు.. టీమిండియా చేతిలో 89 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రపంచకప్లో పాక్పై ఆడిన ప్రతి మ్యాచ్లోనూ గెలిచిన భారత్ జట్టు అజేయ రికార్డుని 7-0తో మెరుగుపర్చుకుంది. మరోవైపు మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని ఆశించిన పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు.. ఏకపక్షంగా ముగిసిపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
విక్రయాల రికార్డుల్లో విశాఖ ఉక్కు
TNN | Updated:
Mar 22, 2018, 01:03PM IST
విశాఖ స్టీల్ అమ్మకాల్లో రికార్డులు సాధిస్తోంది. గతేడాది 19 శాతం ప్రగతి సాధించగా... ఈ సంవత్సరం 35శాతం వృద్ధి లక్ష్యంగా కొనసాగుతోంది. ఏడాది కాలంగా అమరావతిలో నిర్మాణాలు ఊపందుకోవడంతో స్టీల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయాలపై విశాఖ స్టీల్ దృష్టి సారించింది. డీలర్ల సమావేశంలో విశాఖ సీఎండీ మధుసూధన్ మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో 35వేల టన్నుల విక్రయాలు జరగ్గా, ఈసారి ఆర్థిక సంవత్సరం ఇప్పటికే విజయవాడ బ్రాంచీ 1.40లక్షల టన్నులను అమ్మిందని తెలిపారు. మొత్తం మీద ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు 5లక్షల టన్నుల ఉక్కును వైజాగ్ స్టీల్ విక్రయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
50 లక్షల టన్నుల విక్రయాలు చేయనున్న విశాఖ స్టీల్
ముడిపదార్థాల ధరలు పెరగడంతో కొంతమేర కంపెనీపై భారం
ఇక ముడిపదార్థాల ధరలు పెరగడంతో కొంతమేర కంపెనీపై భారం పడుతుందన్నారు అధికారులు. దేశంలో మేలైన బొగ్గు లభించకపోవడంతో.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే ముడి ఇనుమును చత్తీస్గఢ్, ఒడిస్సాల నుండి తెప్పిస్తున్నారు. అయితే... ఎవరైతే ముడి ఇనుము తీసుకుంటే.. స్థానికంగానే ఉత్పత్తి చేయాలని పక్క రాష్ట్రాలు మెలిక పెడుతుండడంతో కంపెనీకి కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు ప్రాంతంలో సుమారు 30 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం లభించే గనులున్నాయని... వాటిని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. దీనిపై ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రుల పోరాట ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం
గత కొన్నాళ్లుగా నష్టాల్లో నడుస్తున్న విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ లాభాల బాట పట్టిందంటోంది యాజమాన్యం. అమరావతిలో భవన నిర్మాణాలు ఊపందుకోవడంతో... విశాఖ స్టీల్స్ అమ్మకాలు పెరిగాయి. దీంతో గత రెండేళ్లుగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ లాభాలు చవిచూస్తోంది. ఆంధ్రుల పోరాట ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడింది. ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి చూపించడమే కాకుండా... తెలుగు రాష్ట్రాలకు అవసరమైన స్టీల్ను అందిస్తోంది. దేశంలోని సముద్ర తీరప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారంగా 2010లో నవరత్న హోదాను పొందింది. 3.4 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో రష్యా, జపాన్ల సాంకేతిక సహకారంతో ప్లాంట్ ఏర్పాటు చేసుకుని... 23 ఏళ్ల జీవితకాలాన్ని పూర్తి చేసుకుంది. 2009లో యూపీఏ సర్కార్ ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు నిర్ణయించింది. 4 వేల కోట్ల వ్యయంతో ప్లాంట్ సామర్ధ్యాన్ని 6.3 మిలియన్ టన్నులకు పెంచింది. అయితే... గత కొంతకాలంగా స్టీల్ డిమాండ్ తగ్గడంతో విశాఖ స్టీల్స్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఏపీ నూతన రాజధాని అమరావతిలో కొత్త నిర్మాణాలు, ప్రాజెక్టులు చేపట్టుతుండడంతో విశాఖ స్టీల్స్ దశ తిరిగింది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పెట్టుబడులకు భారత్ అనుకూల దేశం: మోడీ
న్యూఢిల్లీలో జరుగుతున్న '2వ ఇండియా -కొరియా వ్యాపార సదస్సు'లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పెట్టుబడులకు భారత్ అనుకూలమైన దేశమని వెల్లడించారు.
TNN | Updated:
Feb 27, 2018, 01:59PM IST
న్యూఢిల్లీలో జరుగుతున్న '2వ ఇండియా - కొరియా వ్యాపార సదస్సు'లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెట్టుబడులకు భారత్ అనుకూలమైన దేశమని వెల్లడించారు. పారిశ్రామిక వేత్తలు భారత్‌‌లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మోడీ చెప్పారు.
దక్షిణ కొరియాతో స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొరియా చిన్న దేశమైనప్పటికీ అద్భుత ప్రగతి సాధిస్తోందని కొనియాడారు.
భారత్, కొరియా దేశాల మధ్య వ్యూహాత్మక వ్యాపార సంబంధాలు, పెట్టుబడులే లక్ష్యంగా ఈ సారి సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు భారత్, కొరియాలకు చెందిన దాదాపు 200 మంది వ్యాపారవేత్తలు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, సురేశ్ ప్రభు, రవిశంకర్ ప్రసాద్ కూడా సదస్సులో ప్రసంగించారు. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మలేసియా ఓపెన్: సెమీస్ చేరిన సింధు, శ్రీకాంత్
తెలుగు షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ మలేసియా ఓపెన్ సెమీఫైనల్ చేరారు. సిందు కరోలిన్ మారిన్పై వరుస సెట్లలో గెలుపొందింది.
Samayam Telugu | Updated:
Jun 29, 2018, 06:16PM IST
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసియా ఓపెన్ మహిళ సింగిల్స్లో సెమీఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో తన ప్రియతమ ప్రత్యర్థి స్పెయిన్ ప్లేయర్ కరోలిన్ మారిన్ను 22-20, 21-18 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. తొలి సెట్లో మరో రెండు పాయింట్లు సాధిస్తే మారిన్ గెలిచే స్థితిలో సింధు అద్భుతంగా పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి సెట్ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో విజృంభించిన తెలుగు తేజం.. 12-6 తేడాతో ముందజ వేసింది. తర్వాత ఆధిక్యాన్ని 14-15కి తగ్గించినప్పటికీ.. 21-18 తేడాతో సెట్ను సింధుకు కోల్పోయింది.
పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ సెమీఫైనల్ చేరాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్కు చెందిన బ్రిస్ లెవెర్డ్జ్ను 21-18, 21-14 తేడాతో ఓడించాడు. నాలుగో సీడ్గా బరిలో దిగిన శ్రీకాంత్ 22వ ర్యాంక్ ఆటగాడైన లెవెర్డ్జ్ను 39 నిమిషాల్లో మట్టికరిపించాడు.
సెమీఫైనల్లో శ్రీకాంత్ జపాన్ ఆటగాడు, వరల్డ్ నంబర్ 2 కెంటో మొమొటాతో తలపడనున్నాడు. జపాన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ 2015లో కేసినో గ్యాంబ్లింగ్ కారణంగా కెంటోపై ఏడాది నిషేధం విధించింది. తర్వాత బరిలో దిగిన నాటి నుంచి మొమొటో అద్భుత ఫామ్లో ఉన్నాడు. గత ఏడాది డచ్ ఓపెన్, మకావు ఓపెన్లను గెలుపొందడంతోపాటు కెనడా ఓపెన్ ఫైనల్ చేరాడు. 2018 ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నాడు. | 2sports
|
Windies batting
వెస్టిండీస్పై భారత్ విజయలక్ష్యం: 190
అంటిగ్వ: నార్త్సౌండ్ అంగ్వ వేదికగా భారత్తో జరిగిన నాలుగో వన్డేలో వెస్టీండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది..భారత్కు 190 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.. తొలుత టాస్గెలిచి బ్యాటింగ్కు దిగిన వెస్టీండీస్ ఓపెనర్లు లెవిస్ (35), కైల్ హోప్ (35) నిలకడగా ఆడారు.. ఆ తర్వాత షా§్ు హోప్ 25 , రోస్టన్ చేజ్ 24 , జసన్ మహ్మద్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించారు. బౌలింగ్లో హార్థిక్ పాండ్యా ఉమేష్ యాదవ్ చోరో 3 వికెట్లు తీసుకున్నారు.. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. | 2sports
|
Vaani Pushpa 185 Views afridi and kohli , appreciating
kohli and afridi
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ విజయంలో కోహ్లీ ముఖ్య భూమిక పోషించడాన్ని ప్రస్తావిస్తూ అఫ్రిది కొనియాడాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ అత్యధిక అర్థ సెంచరీలు విషయాన్ని ఐసిసి ట్వీట్ చేయగా, అందుకు అఫ్రిది రీట్వీట్ చేస్తూ కోహ్లీని ప్రశంసించాడు. కోహ్లీ నువ్వొక అసాధారణ ఆటగాడివి. నీ సక్సెస్ ఇలానే కొనసాగాలి. ప్రపంచంలోని క్రికెట్ అభిమానుల్ని నీ ఆట తీరుతో మరింత అలరించు అని అఫ్రిది పేర్కొన్నాడు. సఫారీలతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో కోహ్లీ అజేయంగా అర్థ సెంచరీ సాధించాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్థ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ (21 అర్థ సెంచరీలు)ను కోహ్లీ అధిగమించాడు. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 150 పరుగుల టార్గెట్లో కోహ్లీ తనదైన మార్కుతో చెలరేగిపోయాడు. 52బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు.
తాజా క్రీడల వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/ | 2sports
|
Apr 24,2018
బీఓఈ గవర్నర్ రేసులో రఘురామ్ రాజన్!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ను బ్రిటన్ పెద్ద బ్యాంక్ 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్' (బీఓఈ) సారథ్య బాధ్యతలు వరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీఓఈ తదుపరి గవర్నర్ రేసులో రాజన్ పేరు కూడా వినిపిస్తుండటమే ఇందుకు కారణం. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుత గవర్నర్ మార్క్ కార్నే త్వరలో పదవీ విరమణ పొందనున్నారు. దీంతో తదుపరి గవర్నర్ కోసం బ్రిటన్ ప్రభుత్వం కొందరు ప్రముఖ ఆర్థికవేత్తల పేర్లను పరిశీలిస్తోంది. ఈ జాబితాలో రఘురాం రాజన్ కూడా ఉన్నట్లుగా సమాచారం. బ్రిటన్ కోశాగార ఛాన్సెలర్ ఫిలిప్ హమాండ్ ఇప్పటికే ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.. మొత్తం ఆరుగురు రేసులో ఉండగా.. ఇందులో రాజన్ ముందంజలో ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై మంచి అవగాహన ఉండటం, భారత కేంద్ర బ్యాంక్కు సారథ్యం వహించిన అనుభవం, ఆయన నేతృత్వంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధించిన విజయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న బ్రిటన్ ప్రభుత్వం రాజన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పదవి చేపట్టేందుకు రాజన్కు ఆసక్తిగా ఉన్నారో లేదో అన్న అంశంపై ఇంకా స్పష్టత లభించాల్సి ఉంది. 2013లో రాజన్ ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఆయన పదవీ కాలం పూర్తయింది. ఆ తర్వాత అమెరికా యూనివర్శిటీలో ప్రొఫెసర్గా బాధ్యతలు చేపటిన రాజన్ భావి ఆర్థికవేత్తలను రూపొందిస్తున్నారు. 2008 ఆర్థిక మాంద్యాన్ని ముందుగా ఊహించి ప్రపంచానికి వెల్లడించిన ఆర్థికవేత్తగా రాజన్కు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పవన్ పుట్టిన రోజున జనతా గ్యారేజ్ రిలీజ్
ఎన్టీఆర్ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున విడుదల కావడం ఏంటని అనుకుంటున్నారా? నిజానికి ఈ సినిమా విడుదలకు..
TNN | Updated:
Jul 15, 2016, 12:17PM IST
ఎన్టీఆర్ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున విడుదల కావడం ఏంటని అనుకుంటున్నారా? నిజానికి ఈ సినిమా విడుదలకు పవన్ బర్త్డేకు ఎలాంటి సంబంధం లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ మూవీ విడుదల వాయిదా పడింది. దీంతో ముందుగా అనుకున్నట్లు ఆగష్టులో కాకుండా సెప్టెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని సినిమా పీఆర్వో ట్విట్టర్లో ప్రకటించారు. సినిమా విడుదల ఆలస్యం కావడం నిజంగా బాధాకరమని, అభిమానులు మన్నించాలని కొరటాల శివ అభిమానులను కోరారు. ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా ఈ సినిమా ఉండనుందని, బెస్ట్ అవుట్ పుట్ కోసమే రిలీజ్ డేట్ను వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్ పేర్కొన్నారు. ఆగష్టులో ఈ సినిమా ఆడియో విడుదల చేయనున్నారని కూడా తెలుస్తోంది. చక్కని కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి వర్షాలు కూడా కారణమని తెలుస్తోంది. ఎన్టీఆర్ అభిమానుల.. వర్రీ కాకుండా పవన్ ఫ్యాన్స్తో కలిసి ఈ సినిమా చూసేయండి మరి.
Official Announcement: #JanathaGarage will be releasing on September 2, 2016. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సెలవు రోజులూ పనిచేయనున్న ఐటీ కార్యాలయాలు
వరుసగా వస్తున్న సెలవు దినాల్లో ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు పని చేయనున్నాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ కమిషనర్ తెలిపారు.
TNN | Updated:
Mar 29, 2018, 03:48PM IST
వరుసగా వస్తున్న సెలవు దినాల్లో ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు పని చేయనున్నాయని తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ కమిషనర్ తెలిపారు. మహావీర్ జయంత్రి సందర్భంగా 29న, గుడ్ఫ్రైడేను పురస్కరించుకొని 30న, ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా 31న సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు సెలవు దినాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు పని చేస్తాయని చీఫ్ కమిషనర్ వివరించారు. ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసేవారి సౌకర్యార్థం కార్యాలయాలను తెరిచి ఉంచనున్నామని ఆయన తెలిపారు.
ఐటీ కార్యాలయాలు ఈ మూడు రోజులు తెరిచే ఉంటాయ్
గత రెండు ఆర్థిక సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు మార్చి 31 వరకూ గడువు ఉన్న సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను రిటర్నులు ఐటీ కార్యాలయాలకు వెళ్లి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ సమర్పించవచ్చు. పన్ను సంక్రమిత ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే రిటర్నులను ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి. | 1entertainment
|
nagarjuna telugu bigg boss season 3 july 27 written updates; king super fun with contestants
Episode 07 Highlights: బిగ్ బాస్ టుడే: ఎలిమినేషన్ నుండి ఇద్దరు ముద్దుగుమ్మలు సేఫ్
బిగ్ బాస్ సీజన్ 3 ఐదు ఎపిసోడ్లను ముగించుకుని శనివారం నాడు ఏడో ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. 15 మంది కంటెస్టెంట్స్లో ఆరుగురు ఈవారం ఎలిమినేషన్ జోన్లో ఉండటంతో ఆసక్తికరంగా నేటి (జూలై 27) ఎపిసోడ్ ప్రారంభమైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
Samayam Telugu | Updated:
Jul 28, 2019, 09:17AM IST
మ... మ.. మాస్ అంటూ మోడల్స్తో అదిరిపోయే స్టెప్పులేస్తూ పూలరంగడి మాదిరి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. వచ్చీ రావడంతో హౌస్లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మన టీవీ ద్వారా కంటెస్టెంట్స్ ముచ్చట్లను చూపించారు నాగార్జున.
ఇక ఈవారం ఎలిమినేషన్స్ ఉండటంతో హౌస్ సభ్యులు సూట్ కేసులు సర్దేపనిలో ఉన్నారు. ముఖ్యంగా ఈవారం ఎలిమినేషన్లో ఉన్న రాహుల్.. సూట్ కేస్తో కనిపించారు.
Read Also: బిగ్ బాస్ సీజన్ 3 అన్ని ఎపిసోడ్ల పూర్తి సమాచారం ఒక్క క్లిక్తో
మరోవైపు బాత్ టబ్లో రొమాంటిక్ ముచ్చట్లు మొదలెట్టారు వరుణ్, వితికాలు. ఒకరి కళ్లల్లో ఒకరు కళ్లు పెట్టు చూసుకుంటూ.. నేను ఎలిమినేట్ అయితే ఏం చేస్తావ్.. అంటూ వితికా రొమాంటిక్ మూడ్లో మాట్లాడగా.. ఆకలేస్తుంది బ్రెడ్ ముక్కలు ఉన్నాయా అని అడిగాడు వరుణ్. నా మొగుడ్ని విడిచి నేను ఉండలేను బిగ్ బాస్ . మమల్ని వేరు చేయొద్దు అంటూ బిగ్ బాస్కి మస్కా కొట్టే ప్రయత్నం చేసింది వితిక.
ఇక హౌస్లో తనదైన శైలిలో బాబా భాస్కర్తో కలిసి కామెడీ పంచుతున్న జాఫర్ హౌస్లో కన్నీళ్లు పెట్టుకోవడం ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. తన భార్య గుర్తుకు రావడంతో.. వెక్కి వెక్కి ఏడ్చేశారు జాఫర్. శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్లు జాఫర్ను ఆ మూడ్ను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. బాబా భాస్కర్.. జాఫర్తో మూన్ వాక్ స్టెప్పులేయించడం నవ్వులు కురిపించాయి.
తీన్మార్ సావిత్రి ఎమోషనల్ లవ్ స్టోరీ..
19 ఏళ్ల వయసులో ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్న తనను తన భర్త ఎంత బాగా చూసుకున్నారో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది శివజ్యోతి. ఊరంతా తనను ఒంటరిని చేసినా.. ఒక అబ్బాయి అమ్మాయికోసం పోరాడినట్టు తన భర్త కోసం 19 ఏళ్ల వయసులో పోరాడానని చెప్పింది. ఊరి నుండి పారిపోయి వచ్చిన తనను.. తన భర్త చాలా లగ్జరీగా చూసుకుని సంవత్సర పాటు తాను చదువుకోసం తెచ్చుకున్న డబ్బులతో నన్ను పెంచాడని చెప్పింది. తాగుబోతు అయిన తన తండ్రిని చివరి రోజుల్లో ఒక కొడుకుగా తన భర్త ఆదరించాడని.. ప్రతి అమ్మాయికి ఇలాంటి మంచి భర్త రావాలని కోరుకుంటూ ఏడ్చేసింది తీన్మార్ సావిత్రి.
ఇక నాగార్జునను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న కంటెస్టెంట్స్కు సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. మన టీవీ ద్వారా కంటెస్టెంట్స్ను పలకరించిన నాగ్.. పాసింగ్ పిల్లో ద్వారా ఒక్కొక్కరితో మాట్లాడుతూ.. ఈ వారం రోజులు వాళ్లు ఇంట్లో ఎలా వ్యవహరించారో గుర్తు చేశారు. అయితే గత సీజన్ మాదిరిగా వాళ్ల నెగిటివ్స్ని ఎత్తి చూపి క్లాస్లు పీకకుండా వాళ్ల పాజిటివ్స్ మాత్రమే చర్చించారు. అందరితో చనువుగా మాట్లాడుతూ.. నాగ్ మార్క్ చూపించారు.
ఎలిమినేషన్స్లో సేఫ్ అయ్యింది వీరే..
ఇక ఈవారం కీలకమైన ఎలిమినేషన్లో భాగంగా ఆరుగురు కంటెస్టెంట్ నామినేట్ అయ్యారు. రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు డేంజర్ జోన్లో ఉండగా.. ఈ ఆరుగురిలో సేవ్ అయిన తొలి కంటెస్టెంట్ హిమజ అంటూ ఆమె కళ్లల్లో ఆనందం నింపారు నాగార్జున. ఆయన హిమజ సేవ్ అయినట్టు తెలపగానే కన్నీళ్లు పెట్టుకుని ఎప్పటిలాగే ఏడ్చేసింది హిమజ.
ఇక మిగిలిన ఐదుగురిలో పునర్నవి సేఫ్ జోన్లో ఉన్నట్టు తెలిపారు నాగార్జున. దీంతో రాహుల్, వితికా, జాఫర్, హేమలు ఎలిమినేషన్లో ఉండిపోయారు. సో.. ఈ నలుగురిలో ఎలిమినేట్ అయ్యే ఆ ఒక్కరూ తెలియాలంటే రేపటి వరకూ వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి.
బిగ్ బాస్ సీజన్ 3 పూర్తి వివరాలు ఎపిసోడ్ల వారీగా.. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆ నా*** కొడుకులకి బాలయ్యే కరెక్ట్: పూరీ జగన్నాథ్
బాబోయ్ బాలకృష్ణ.. అతనికి చాలా పొగరు, ఇష్టం వచ్చినట్టు తిడతాడు.. ఫ్యాన్స్ అని కూడా చూడకుండా కొడతాడు. దర్శకులు, హీరోయిన్స్, మిగిలిన హీరోలకు అసలు గౌరవమే ఇవ్వరు. ఇవీ తరచూ బాలయ్య గురించి వినిపించే కామెంట్స్. కాని బాలయ్యకు మరో రూపం ఉంది. అదే మంచి మనసున్న హీరో. అదేంటో పూరీ జగన్నాథ్ మాటల్లో విందాం.
Samayam Telugu | Updated:
Jul 24, 2019, 05:14PM IST
ఆ నా*** కొడుకులకి బాలయ్యే కరెక్ట్: పూరీ జగన్నాథ్
హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా దర్శకుడిని నమ్మి సినిమాలు ఇచ్చే హీరో ఇండస్ట్రీ ఎవరైనా ఉన్నారు అంటే అది బాలయ్య ఒక్కరే అంటున్నారు డేరింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్. నందమూరి బాలకృష్ణ మంచి మనసున్న హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పూరీ.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న పూరీ జగన్నాథ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా హిట్స్లేక ఢీలా పడ్డ పూరీ.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి పుంజుకున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు పూరీ.
Read Also: నేను తాగి చెప్పట్లేదు.. ‘ఇస్మార్ట్ శంకర్’ నాదే, ఆధారం ఇదిగో: హీరో ఆకాష్
మహేష్, పవన్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు పోకిరి, బద్రి, టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన పూరీ జగన్నాథ్.. ఒకప్పటి క్రేజీ దర్శకుడు. అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడు కూడా. అయితే ఇదే దర్శకుడికి టైం కలిసి రాకపోవడంతో చేతిలో లక్షరూపాయిలు కూడా లేని పరిస్థితికి వచ్చేశారు.
తిరిగి జీరో నుండి కెరియర్ మొదలు పెట్టిన పూరీ.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఏ హీరోకాని.. ఇండస్ట్రీ కాని ఆదుకోలేకపోయిందంటూ హీరో మహేష్పై సంచలన కామెంట్స్ చేశారు పూరీ. మహేష్ బాబు హిట్లు ఉన్న దర్శకులతోనే పనిచేస్తారని.. అతని కంటే అతని ఫ్యాన్స్కి నాపై నమ్మకం ఉన్నా.. మహేష్కి మాత్ర నాపై నమ్మకం లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఇక హీరో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరోల్లో ఎవరికీ లేని మంచి మనసు బాలకృష్ణకు ఉందన్నారు. నేను ఫ్లాప్లతో ఉన్నా.. ‘పైసా వసూల్’ సినిమా ఇచ్చారు.. ఆ సినిమా హిట్ కాకపోయినా.. ఆయన అస్సలు పట్టించుకోలేదు. ఇది కాకపోతే ఇంకోటి అనే వ్యక్తి బాలయ్య. ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది. మాటమీద నిలబడే వ్యక్తి బాలయ్య. మనుషులకు వాల్యూ ఇస్తారు అందుకే బాలయ్య అంటే నాకు చాలా ఇష్టం అన్నారు పూరీ.
ఇక బాలయ్య డేట్స్ సరిగా ఇవ్వరని.. టైంకి రారని, కోపం ఎక్కువ అని, వాళ్లను కొడతారు వీళ్లని కొడతారు అని ఏవేవో చెప్తారు కాని.. బాలయ్యతో పనిచేస్తే ఆయన గురించి తెలుస్తోంది. అయినా బాలయ్య కొడితే కొడతారు.. ఊరికే కొట్టరాయన. ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయం ఒకటి చెబుతా.. హీరోయిన్స్ పబ్లిక్లోకి వెళ్తే.. ఎక్కడబడితే అక్కడ పట్టుకుంటారు.. బట్టలు పట్టుకుని లాగేస్తారు.
ఇదే పరిస్థితి హీరోలకు కూడా ఉంది. పబ్లిక్ లోకి హీరోలు వెళ్లినా అలాగే చేస్తున్నారు. హీరోల **** పట్టుకుని నొక్కేస్తారు. ఈ అనుభవం ప్రతి హీరోకి ఎదురైంది. వాళ్లు పైకి చెప్పలేకపోతున్నారు. పబ్లిక్లో అంత శాడిష్ట్ **** నా కొడుకులు ఉన్నారు పబ్లిక్లో.
అందుకే బాలయ్య.. తన దగ్గరకు వచ్చే వాడి మూమెంట్ని బట్టి ఫట్ మని కొడతాడు. మిగతా వాళ్లు కొట్టరు కాబట్టి బాలయ్య దుర్మార్ఖుడిలా కనిపిస్తాడు. ఇది ఎవ్వరికీ తెలియదు. వాచ్లు, ఫోన్లు, చైన్లు లాగేస్తారు. మీడియాలో కొట్టేశాడు బాలయ్య అంటారు కాని.. మీద పడిపోతే ఏం చేయాలి. ఇలాంటి వాళ్లకు వందశాతం మా బాలయ్యే కరెక్ట్’ అంటూ చెప్పుకొచ్చారు పూరీ జగన్నాథ్.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
internet vaartha 150 Views
న్యూఢిల్లీ : విక్రయాలు జోరందుకోవడంతో దేశంలోని టూవీలర్ దిగ్గజం హీరోమోటోకార్ప్ నికర లాభం 883కోట్ల రూపాయలుగాప్రకటించింది. జూన్ మొదటి త్రైమాసికంలో లాభాలు 18శాతంపెరిగాయి అంతకుముందు ఏడాది ఇదేకాలానికి 747కోట్లు ఆర్జిం చినట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం రాబడులు 8శాతంపెరిగి 8011 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదేకాలంలో 7435కోట్లుగాఉన్నాయి. కంపెనీ టూ వీలర్లపరంగా 17.45లక్షలవాహనాలను మొదటిత్రైమాసికంలో విక్రయించింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 16.46లక్ష యూనిట్లు విక్రయించింది. అంతకుముందుత్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమా సికంలో మంచి ఫలితాలు రాబట్టుకోగలిగామని ఎండి సిఇఒ పవన్ముంజాల్ వెల్లడించారు. సాధారణ సగటుకంటే ఎక్కువ వర్షపాతం, ఏడోవేతన సంఘ సిఫారసులు వంటివి కంపెనీ విక్రయాలకు మరింత ఊతం ఇస్తాయని అంచనా వేస్తోంది. కంపెనీషేర్లు రూ.3500.10గా బిఎస్ఇలో ట్రేడింగ్ జరుగుతున్నాయి. | 1entertainment
|
ముచ్చటగా మూడోసారి 'సిడ్బీకి ఉత్తమ రాజభాష అమలు బహుమతి
- రాష్ట్రపతి చేతుల మీదుగా బహూకరణ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రాజభాష అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను 'స్మాల్ ఇండిస్టీస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'కి (సిడ్బీ) ప్రభుత్వం అందించే ' ఇండియా రాజ భాష కీర్తి పురస్కార' బహుమతి లభించింది. భాషాపరమైన ప్రాంతం 'ఏ' లోని జాతీయ బ్యాంకుల కేటగిరిలో సిడ్బీకి ద్వితీయ బహుమతి లభించింది. సిడ్బీ బ్యాంకునకు ఈ బహుమతి లభించడం ఇది వరుసగా మూడోసారి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బ్యాంకు తరఫున బహుమతిని సిడ్బీ ఛైర్మన్, ఎండీ డాక్టర్ క్షత్రపతి శివాజీ ఈ బహుమతిని అందుకున్నారు. బహుమతి స్వీకరణ సమయంలో వేదికపై బ్యాంకు హిందీ విభాగం జనరల్ మేనేజర్ అనితా సచ్దేవ్ కూడా ఉన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
దిగ్గజ నటుడికి గూగుల్ ‘డూడుల్’ నీరాజనం
భారతీయ సినిమాలో ఆ ముఖం తెలియనివారుండరు. అర్ధశతాబ్దంపాటు కన్నడ చిత్ర పరిశ్రమను ఏలి, 200 పైగా సినిమాల్లో నటించిన ఆ మహానటుడే కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్.
TNN | Updated:
Apr 24, 2017, 12:39PM IST
భారతీయ సినిమాలో ఆ ముఖం తెలియనివారుండరు. అర్ధశతాబ్దంపాటు కన్నడ చిత్ర పరిశ్రమను ఏలి, 200 పైగా సినిమాల్లో నటించిన ఆ మహానటుడే కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్. 1929 ఏప్రిల్ 24న జన్మించిన రాజ్‌కుమార్ అసలు పేరు సింగనల్లూరు పుట్టస్వామయ్య ముతురాజు. దేశంలో అత్యుత్తమ నటుల్లో ఒకరిగా వెలిగిన రాజ్‌కుమార్‌ను కన్నడిగులు అనేక పేర్లతో పిలుచుకుంటారు. నటసార్వభౌమ, బంగరాడ మనుష్య (బంగారం లాంటి మనిషి), వర నట, రాజ‌న్నగా పిలుచుకునే రాజ్‌కుమార్ 88వ పుట్టున రోజు నేడు.
రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ‘డూడుల్’తో ఆయన్ని గౌరవించింది. తెరపై వెనకాల గూగుల్ అని రాసి.. దానిపై చిరునవ్వు చిందిస్తున్న రాజ్‌కుమార్ ఫొటోను ఉంచి.. తెర ముందు కూర్చకున్న ప్రేక్షకులు ఆయన్ని చూస్తున్నట్లుగా ఓ చక్కని పెయింటింగ్‌ను డూడుల్‌గా పెట్టింది. ఈ మేరకు గూగుల్ దీనిపై ఓ ట్వీట్ కూడా చేసింది. ‘నటుడు, గాయకుడు, దిగ్గజం. గొప్ప వ్యక్తి రాజ్‌కుమార్ 88వ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తిచేస్తున్నాం’ అని గూగుల్ ట్వీట్ చేసింది.
Actor, singer, legend. Remembering the great #Rajkumar on his 88th birth anniversary. #GoogleDoodle pic.twitter.com/mOoBuruiqW | 0business
|
క్వీన్ రీమేక్ లో మంజిమా మోహన్
Highlights
బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా క్వీన్
దక్షిణాది భాషల్లో క్వీన్ రీమేక్ కు సన్నాహాలు
తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్
మళయాల క్వీన్ గా మంజిమా మోహన్
బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన క్వీన్ సినిమా ప్రాంతీయ భాషల్లో రీమేక్ కానుంది. ఇప్పటికే క్వీన్ చిత్రంపై చాలా ఆసక్తి పెరిగింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో సమాచారం అందుతోంది. తెలుగులో క్వీన్ రీమేక్ లో తమన్నా నటిస్తుండగా.. తమిళంతో కాజల్ అగర్వాల్ ఈ మూవీ చేసేందుకు అంగీకరించింది. ఇక మళయాల వెర్షన్ లో ఈ చిత్రం రీమేక్ లో మంజిమా మోహన్ హిరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.
నాగ చైతన్యతో సాహసం స్వాసగా సాగిపో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మంజిమా మోహన్ క్వీన్ రీమేక్ లో చేయడం విశేషమే.
ఈ చిత్రాన్ని రొటీన్ కి భిన్నంగా.. కొత్త తరహాలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మళయాల భాషల్లో టాలీవుడ్ దర్శకుడు నీలకంఠ ఒక్కడే తెరకెక్కించనున్నాడు. మరో రెండు మూడు నెలల్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST | 0business
|
Apr 20,2018
మార్కెట్లోకి కొత్త ఎక్స్యూవీ-500
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అత్యంత విలాసవంతమైన కొత్త ఎక్స్ యూవీ- 500 వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. సంస్థ ఆటోమోటివ్ సెక్టర్ అధినేత రాజన్ వధేరా కొత్త వాహనాన్ని గురువారం రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ వాహనపు ప్రారంభ ధరను కంపెనీ రూ.12.31 లక్షలుగా (ఎక్స్షోరూమ్, హైదరాబాద్) నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011లో మార్కెట్లోకి విడుదల చేసిన నాటి నుంచి ఎక్స్యూవీ వాహనం ఈ విభాగంలో మేటి వాహనంగా నిలుస్తూ వస్తోందని పేర్కొన్నారు. కొత్త వాహనం అయిదు డీజిల్ వేరియంట్స్, ఒక పెట్రోలు వేరియంట్తో పాటుగా ఏడు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ వాహనం అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
’పారా’ దిగ్గజం.. దేవేంద్ర జఝారియా
బ్రెజిల్లోని రియో డి జెనిరోలో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న పారాలంపిక్స్ లో భారత పారా అథ్లెట్లు పోటీ పడనున్నారు.
TNN | Updated:
Sep 5, 2016, 01:25PM IST
బ్రెజిల్లోని రియో డి జెనిరోలో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న పారాలంపిక్స్ లో భారత పారా అథ్లెట్లు పోటీ పడనున్నారు. రియో వెళ్తున్న బృందంలో భారత దిగ్గజ పారా అథ్లెట్ దేవేంద్ర జఝారియా కూడా ఉన్నారు. దీంతో ఈసారి భారత్ మరిన్ని పతకాలు సాధించవచ్చని భావిస్తున్నారు. రాజస్థాన్లోని చురు జిల్లాకు చెందిన ఈ 35 ఏళ్ల జావెలిన్ త్రోవర్.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించాడు. దేవేంద్ర ఈసారి భారత్ను కచ్చితంగా పతకాల పట్టికలో నిలబెడతాడని అంటున్నారు. పారాలంపిక్స్ లో భారత్ నుంచి బంగారు పతకాలు సాధించిన ఇద్దరిలో దేవేంద్ర ఒకడు. అంతేకాకుండా జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు సైతం నెలకొల్పాడు.
దక్షిణ కొరియాలో 2002లో జరిగిన ఫెస్పిక్ (FESPIC) గేమ్స్, 2004 ఏథెన్స్ పారాలంపిక్స్, 2013 ఐపీసీ అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ల్లో దేవేంద్ర స్వర్ణ పతకాలు సాధించాడు. అలాగే 2015 వరల్డ్ ఛాంపియన్షిప్, 2014 ఆసియా క్రీడల్లో రజతాలు గెలుపొందాడు. 2013 వరల్డ్ ఛాంపియన్షిప్లో ఈయన సాధించిన బంగారు పతకమే ఈ ఈవెంట్లో భారత్కు మొదటిది.
చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదంలో తన చేయిని కోల్పోయినా దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో దేవేంద్ర ఈ స్థాయికి చేరుకున్నాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులన్నప్పటికీ తన శక్తి, సామర్థ్యాలను నమ్ముకుని ముందుకు సాగాడు.. ఎన్నో విజయాలందుకున్నాడు. ‘నాకు ఎనిమిదేళ్ల వయసప్పుడు విద్యుక్ షాక్ తగిలింది. మా గ్రామంలో చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు హై టెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకున్నాను. ఫలితంగా నా ఎడమ చేతిని కోల్పోయాను. నేను మళ్లీ కోలుకుంటానని ఎవరూ ఊహించలేదు‘ అని ఓ ఇంటర్వ్యూలో దేవేంద్ర చెప్పారు.
ప్రస్తుతం ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఆర్డీ సింగ్ వద్ద దేవేంద్ర శిక్షణ పొందుతున్నాడు. దేవేంద్రకు 2012లో పద్మశ్రీ అవార్డు లభించింది. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రనౌట్ కోపం.. బ్యాట్తో కుర్చీ విరగొట్టిన ఫించ్
మెల్బోర్న్ స్టార్స్ జట్టు బౌలర్ జాక్సన్ బంతిని పాదంతో ఆపే ప్రయత్నం చేశాడు. కానీ.. అతని పాదాన్ని తాకుతూ వెళ్లిన బంతి.. నేరుగా వెళ్లి నాన్స్ట్రైక్ ఎండ్లోని వికెట్లను తాకింది. దీంతో పరుగు కోసం క్రీజు వెలుపలికి వెళ్లిన అరోన్ ఫించ్ రనౌటయ్యాడు.
Samayam Telugu | Updated:
Feb 18, 2019, 06:14PM IST
హైలైట్స్
బిగ్బాస్ లీగ్ ఫైనల్లో పేలవంగా రనౌటైన అరోన్ ఫించ్
అసహనంతో పెవిలియన్కి వెళ్తూ కుర్చీను విరగొట్టిన వైనం
భారత్తో ఈనెల 24 నుంచి రెండు టీ20, ఐదు వన్డేల సిరీస్ ఆడనున్న ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్ సహనం కోల్పోయాడు. ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బిగ్బాస్ లీగ్ ఫైనల్లో.. ఏమరపాటు కారణంగా రనౌటైన అరోన్ ఫించ్.. పెవిలియన్కి వెళ్తూ.. దారి పక్కన ఉన్న కుర్చీని బ్యాట్తో విరగొట్టేశాడు.
మెల్బోర్న్ రెనిగేడ్స్ తరఫున లీగ్లో ఆడిన అరోన్ ఫించ్.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రనౌటయ్యాడు. సహచరుడు కామెరూన్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. మెల్బోర్న్ స్టార్స్ జట్టు బౌలర్ జాక్సన్ బంతిని పాదంతో ఆపే ప్రయత్నం చేశాడు.
A Bucket Moment to end all Bucket Moments as Finch is run out off Bird's boot! #BBLFinal | @KFCAustralia https://t.co/ewI4i9WTZE
— KFC Big Bash League (@BBL) 1550377580000
కానీ.. అతని పాదాన్ని తాకుతూ వెళ్లిన బంతి.. నేరుగా వెళ్లి నాన్స్ట్రైక్ ఎండ్లోని వికెట్లను తాకింది. దీంతో పరుగు కోసం క్రీజు వెలుపలికి వెళ్లిన అరోన్ ఫించ్ రనౌటయ్యాడు. అప్పనంగా వికెట్ చేజార్చుకోవడంతో అసహనానికి గురైన ఫించ్.. తిట్టుకుంటూ మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్లో గెలిచిన మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది.
Aaron Finch is every local cricketer who has been given out LBW by one of their teammates #BBLFinal https://t.co/nEV1k9CvTi
— Odds.com.au (@OddsComAu) 1550377568000
భారత్తో ఈనెల 24 నుంచి ఆస్ట్రేలియా జట్టు రెండు టీ20లు, ఐదు వన్డేల సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు భారత్కి వస్తోంది. | 2sports
|
Hyderabad, First Published 6, Mar 2019, 10:09 AM IST
Highlights
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది పూజా హెగ్డే. ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో 'మహర్షి' సినిమాలో నటిస్తోన్న ఈ భామ ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేస్తోంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది పూజా హెగ్డే. ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో 'మహర్షి' సినిమాలో నటిస్తోన్న ఈ భామ ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేస్తోంది.
మొత్తానికి స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ బిజీ భామగా మారిన పూజాకి ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేసుకున్నారు.
'అరవింద సమేత'లో పూజా నటన, ప్రొఫెషనలిజం త్రివిక్రమ్ కి బాగా నచ్చడంతో మరోసారి ఆమెని రిపీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. అల్లు అర్జున్ కి కూడా ఇది పూజాతో రెండో సినిమా. గతంలో వీరిద్దరూ కలిసి 'డీజే' సినిమాలో నటించారు.
మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ, రష్మికల పేర్లు పరిశీలించారు. కానీ ఫైనల్ గా పూజాకి ఫిక్స్ అయ్యారు. ఈ నెలలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇది పూర్తయిన తరువాత బన్నీ-సుకుమార్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది.
Last Updated 6, Mar 2019, 10:09 AM IST | 0business
|
Visit Site
Recommended byColombia
సావిత్రి పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. కాగా ఈ సినిమాలో కీర్తి లుక్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విశాలవంతమైన నుదురుపై ఎరుపు రంగు బొట్టు, కళ్లకు కాటుక, వాలు జడను కొప్పుగా మలిచి.. 80ల కాలం నాటి హీరోయిన్ మాదిరి ఆభరణాలు ధరించి వెరైటీ లుక్‌తో కుందనపు బొమ్మలా తయారైంది కీర్తి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
ఇక ‘మహానటి’తారాగణం విషయానికి వస్తే.. ఈమూవీలో మరొక స్టార్ హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, షాలిని పాండే, ప్రగ్యా జైస్వాల్, భానుప్రియ, రాజేంద్రప్రసాద్‌లు ఈ మూవీలో కీ రోల్ చేస్తుండగా.. తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ శాలినీ పాండే జాయిన్ అయినట్టు సమాచారం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. | 0business
|
Suresh 76 Views amazon
బ్యాంక్ ఆఫ్ బరోడాతో అమెజాన్ ఒప్పందం
న్యూఢిల్లీ,సెప్టెంబరు 18: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ప్లాట్ ఫాంపై ఉత్పత్తులు విక్రయించే విక్రేతలకు సూక్ష్మ రుణాల సహకారం అందించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం కుదర్చుకుంది. ఇన్వైట్ ఓన్లీ(ఆహ్వానం) ప్రాతిపదికన మాత్రమే విక్రేతలకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.బ్యాంక్ తోడ్పాటుతో జులైలో అమె జాన్ ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిం చింది. వార్షికంగా 10.45-11.5 శాతం వరకు వార్షిక వడ్డీ రేటుపై లక్ష నుంచి 25 లక్షల వరకు రుణ లభ్యత ఉండగలదని అమెజాన్ ప్రకటించింది.
చిన్న, మధ్య తరహా సంస్థల వ్యాపార అవస రాలపై మంచి అవగాహన ఉన్నందున అమెజాన్ ఇండియాలో 2 లక్షల మంది పైగా విక్రేతలకు సమగ్రమైన బ్యాంకింగ్ సేవలు అందించే దిశగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండి పిఎస్ జయకుమార్ పేర్కొన్నారు.వచ్చే సంవత్సరం వ్యవధిలోగా 15-20 శాతం మంది అమెజాన్ సెల్లర్లు ఈ సదుపాయం ఉపయోగించు కునే అవకాశం ఉన్నట్లు వివరించారు.అమెజాన్ పోర్టల్లో విక్రయాల ట్రాక్ రికార్డు, కస్లమర్స్ ఫీడ్ బ్యాక్,నిబంధనలను పాటించడం మొదలైన అంశాల ప్రాతిపదికగా విక్రేతలకు ఈ పథకం కింద రుణ అర్హత వివరా లతో ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్బ్యాంక్ నుంచి అందుతుంది. కార్యకలాపాలు విస్తరించే క్రమంలో వ్యాపార సంస్థలు ఎదుర్కొనే నిధుల కొరత సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఈ పథకం అందుబాటులోకి తెచ్చినట్లు అమెజాన్ ఇండియా డెరెక్టర్ గోపాల్ పిళ్లై తెలిపారు | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ప్రియుడి కోసం నయన్ రికమెండేషన్స్
ప్రేమ వ్యవహారాలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే నయనతార తన లవర్ కోసం ఏదైనా చేస్తుందనే మాట కూడా వాస్తవమే.
TNN | Updated:
Sep 11, 2016, 06:52AM IST
ప్రేమ వ్యవహారాలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే నయనతార తన లవర్ కోసం ఏదైనా చేస్తుందనే మాట కూడా వాస్తవమే. శింబు, ప్రభుదేవాల విషయంలో అది ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు తన కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం కూడా నయన్ చాలా త్యాగాలు చేస్తోందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత కొంత కాలంగా నయనతార, విఘ్నేష్ శివన్ ను ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆయనకొక ఎక్స్పెన్సివ్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చిన ఈ భామ ఇప్పుడు అతడ్ని డైరెక్టర్ గా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. పెద్ద హీరోలతో విఘ్నేష్ సినిమాలు చేయాలనే ఉద్ధేశ్యంతో నయన్ తనకు పరిచయమున్న అగ్ర హీరోలందరికి ఫోన్లు చేసి విఘ్నేష్ చెప్పే కథ వినమని రిక్వెస్ట్ చేస్తోందట. అలా అడిగిన తరువాత వచ్చిన అవకాశమే సూర్య సినిమా అని చెబుతున్నారు. నయన్ కారణంగానే సూర్య, విఘ్నేష్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నట్లు కోలీవుడ్ మీడియా ప్రచురిస్తోంది. | 0business
|
New Delhi, First Published 24, Apr 2019, 11:22 AM IST
Highlights
ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు వచ్చే నెల రెండో తేదీతో ముగియనున్నది. తదుపరి ఏ దేశానికి కూడా మినహాయింపులు ఉండబోవని ట్రంప్ తేల్చేయడంతో ముడి చమురు ధర పెరిగి క్యాడ్ ఆ పై ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
న్యూఢిల్లీ/ముంబై: ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతిపై అమెరికా ఆంక్షలు అమలులోకి రావడంతో మున్ముందు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. ఫలితంగా కరంట్ ఖాతా లోటు (క్యాడ్)పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పది శాతం ముడి చమురు ధర పెరిగితే కరంట్ ఖాతా లోటు 0.40 శాతం పెరుగుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువపై 0.24 శాతం ప్రభావం చూపుతుంది.
తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రెండు దఫాలుగా వడ్డీరేట్లలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ ఇక ముందు ఆ సాహసం చేయకపోవచ్చునని రేటింగ్ సంస్థలు చెబుతున్నాయి.
ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే ఏ దేశానికి ఇక నుంచి మినహాయింపులు ఇవ్వబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి భారత్ ముడి చమురు దిగుమతులను నిలిపివేయనుంది.
ట్రంప్ ఆంక్షల వల్ల అత్యధికంగా ఇబ్బంది పడే దేశాల్లో చైనా తర్వాత మనమే ఉంటాం. ఎందుకంటే ముడి చమురు దిగుమతుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సౌదీ అరేబియా వద్ద ఉన్న మిగులు చమురు నిల్వలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని పెట్రోలియం శాఖ వర్గాలు తెలిపాయి.
‘మినహాయింపులు ఇవ్వనంత వరకూ ఇరాన్ నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేయదు. త్వరలోనే ఆ దేశం నుంచి ఆయిల్ దిగుమతిని నిలిపివేస్తాం’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.
గత నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2018-19) 24 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. కాగా, అమెరికా ఆంక్షల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ‘ఇండియన్ రిఫైనరీలకు సరిపడినంత ముడి చమురందించడానికి మా వద్ద తగిన ప్రణాళిక ఉంది. చమురును ఉత్పత్తి చేస్తున్న విదేశాల నుంచి ఆ మొత్తాన్ని దిగుమతి చేసుకుంటాం. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రిఫైనరీలు అన్నింటికీ సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
మే రెండో తేదీ నుంచి రాయితీలు ఎత్తి వేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అందుకు సంబంధించిన ప్రణాళికతోనూ సిద్ధంగా ఉన్నామని పెట్రోలియంశాఖ కూడా ప్రకటించింది. దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్లో 10 శాతం ఇరాన్ నుంచి లభిస్తున్నది.
ప్రపంచ దేశాల్లో ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా, జపాన్, భారత్ ఉన్నాయి. ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత భారత్తో సహా ఏడు దేశాలకు ఆరునెలల పాటు మినహాయింపులు ఇచ్చింది. మే 2వ తేదీతో ఈ గడువు ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఇక మినహాయింపులు ఇవ్వబోమని ట్రంప్ ప్రకటించారు. కాగా, ఇరాన్ నుంచి భారత్ మినహాయింపులు పొందడానికి నెలకు 1.25 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంది. 2018-19లో ఏకంగా 24మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంది.
2017-18లో ఇది 22.6 మిలియన్ టన్నులుగా ఉంది. భారత రిఫైనరీలు ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు పెద్ద స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఛైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు.
ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోకపోవడం ద్వారా ఏర్పడే లోటును భర్తీ చేయడానికి విదేశాలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా భర్తీ చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఛైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు.
ఈ ఏడాదిలో మెక్సికో నుంచి 0.7మిలియన్ టన్నులు, సౌదీ అరేబియా నుంచి 2 మిలియన్ టన్నులు, కువైట్ నుంచి 1.5మిలియన్ టన్నులు, యూఏఈ నుంచి మరో మిలియన్ టన్ను ముడి చమురును దిగుమతి చేసుకోవచ్చు.
‘ఆయిల్ దిగుమతి కోసం ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు సులభంగానే లభిస్తుంది. అయితే, ధరలపై ఎంత ప్రభావం చూపుతుందనే మాత్రం ఇప్పుడే చెప్పలేను’ అని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
Last Updated 24, Apr 2019, 11:24 AM IST | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'సాహో'లో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్
ప్రభాస్తో తమ యూవీ క్రియోషన్స్ బ్యానర్పై ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాతలు వంశీ, ప్రమోద్లు ఆ చిత్రానికి...
TNN | Updated:
Apr 25, 2017, 10:36AM IST
ప్రభాస్‌తో తమ యూవీ క్రియోషన్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు ఆ చిత్రానికి సాహో అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రన్ రాజ్ రన్ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేయనున్న చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ త్రయం శంకర్-ఎహ్‌సాన్-లాయ్, బాహుబలి చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ సబు సిరిల్ వంటి ప్రముఖులు పనిచేస్తున్న విషయాన్ని కూడా ఆ చిత్ర యూనిట్ వెల్లడించింది. 'బాహుబలి'తో బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తర్వాతి సినిమా కావడంతో సాహో చిత్రాన్ని సాహో అనేలాగే తెరకెక్కించాలని యూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇంతమంది ప్రముఖులు పనిచేయనున్న ఈ సినిమాలో ఇంతకీ ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంలోనే ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే, లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం తెలుస్తోంది ఏంటంటే... తెలుగు, తమిళ, హీందీ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న చిత్రం కావడంతో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించే లేడీ కూడా అదే స్థాయిలో పాపులారిటీ వున్న హీరోయిన్ అయి వుండాలని భావిస్తున్న మేకర్స్ అందుకోసం ఓ బాలీవుడ్ హీరోయిన్‌ని ఎంచుకున్నట్టు సమాచారం. | 0business
|
DOLLAR
భారత్కు 25.4బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు
ముంబయి,జూలై 27: విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 25.4 బిలియన్ డాలర్లు భారత్ ఈక్విటీ డెట్ మార్కెట్లలో పెట్టుబడులుపెట్టారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ గణాంకాలను బట్టిచూస్తుంటే భారత్ ఆర్థికవృద్ధి పునరుద్ధ రణ కావడం, ఇటీవలి ప్రభుత్వ సంస్కరణలు బ్యాంకింగ్ రంగంలో తెచ్చిన ఆకస్మిక మార్పులు వంటివి కొంత పెట్టుబడులకు ఊతం ఇచ్చాయనే చెప్పాలి. వీటివల్ల డెట్రంగంలో పెట్టుబడులు 16.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారతీయ కరెన్సీలో చూస్తే 10,389 కోట్లు. ఈక్విటీల మార్కెట్లలో 8.5 బిలి యన్ డాలర్లు భారతీయ కరెన్సీలో అయితే 55,959 కోట్లు రూపాయలుగా ఉన్నాయి. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారతీయ సెక్యూ రిటీల మార్కెట్లలో లెక్కకు మించిన పెట్టుబ డుల లావాదేవీలు నిర్వహించారు. రైట్స్, బోనస్ జారీ, ప్రైవేటు ప్లేస్మెంట్, విలీనాలు, కొనుగోళ్లు లావాదేవీల్లో ఇన్వెస్టర్లు చురుకుగా పాల్గొన్నట్లు కనిపిస్తోంది. ఈక్విటీ విభాగంలో బెంచ్మార్క్సూచీలు భారీగా పెరగడంతో పెట్టుబడులకు ఊతంఇచ్చినట్లయింది. బిఎస్ఇ సెన్సెక్స్, నిఫ్టీ 50సూచీలు కనీసం 22శాతం ఈఏడాదిలో ఇప్పటివరకూ పెరిగాయి.
ప్రపం చంలోని ఇతర అన్ని మార్కెట్ల కంటే భారీగా వృద్ధిని సాధించినట్లు తేలింది. మంగళవారం ఒక్కరోజే నిఫ్టీ 50సూచి ఈక్విటీమార్కెట్లలో మొట్ట మొదటిసారి 10,000 పాయింట్లను తాకింది. బిఎస్ఇ మిడ్క్యాప్, బిఎస్ఇ స్మాల్క్యాప్సూచీలు 30 శాతానికిపైగా పెరిగాయి. నిపుణుల అంచనాలను చూస్తే భారత్కు మరింతగా విదేశీ పెట్టుబడులు వస్తాయని తెలుస్తోంది. దేశీయంగాను, విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత్లోని స్థిరమైన రాజకీయ వాతావరణం, ఆర్థికవృద్ధిలో పెరుగు దల, విధివిధానాల్లో సంస్కరణలు, కార్పొరేట్ ఫలితాల రాబడుల్లో పురోగతి వంటివి వచ్చే కొన్నేళ్లపాటు కొనసాగుతాయని అంచనావేస్తున్నారు. సమీపభవి ష్యత్తులో కొంతమేర ఉపసంహరణలు, దాడులు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. అలాగే అంతర్జాతీయంగా కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు భారత్ పట్ల సానుకూలంగా ఉన్నాయి.
ఇక దేశీయంగా ఆర్థిక వతావరణం స్థిరంగా ఉంది. కార్పొరేట్రాబడులు క్రమేపీ పెరుగుతున్నాయని ఈ సంఘటన లు అన్నింటినీ పరిగణనలోనికి తీసుకుంటే భారతీయ మార్కెట్లకు మరింతగా విదేశీ నిధులు వస్తాయని మిజుహోబ్యాంకు భారతీయ వ్యూహకర్త తీర్ధాంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. 2014 ఆర్థికసంవత్సరంలో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్లలో 42.4 బిలియన్ డాలర్ల నిధులను పెట్టుబడులు పెట్టారు. 2000సంవ త్సరం తర్వాత ఇదే మెగా పెట్టుబడులుగా నిలిచింది. తదనంతరం నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేయడం పెట్టుబడులు కూడా క్రమేపీ పెరిగా యి.
2015లో 10.8 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2016లో ఎక్కువ అమ్మకాలకే మొగ్గుచూపించి 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. కొన్ని ప్రతికూల అంశాలు కూడాలేకపోలేదు. గడచిన మూడునెలలుగా ఎగుమతులు పడిపోతున్నాయి. దీనివల్ల ఆర్థికవృద్ధికి అవరోధంగా నిలుస్తోంది. అయితే కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు కూడా కొంత ఆశాజనకంగా రావడం కొంత మద్దతు పెంచినట్లయింది. యుబిఎస్ బ్యాంకు తన నిఫ్టీ50సూచీని 7500 స్థాయికి అంచనావేసింది. ఎగువప్రాంతంలో పదివేల పాయింట్లకు చేరుతుందని వేసిన అంచనాలు వాస్తవమని నిరూ పితం అయ్యాయి. మొత్తం మీదప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, విధివిధానాలపై విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల కు ధీమా పెరుగుతుండటంతో పెట్టుబడులు సైతం పెరిగినట్లు తెలుస్తోంది. | 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.