news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Aug 01,2018 సిండికేట్‌లో 'గోయింగ్‌ డిజిటల్‌ క్యాంప్‌' నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వ రంగపు బ్యాంకింగ్‌ సంస్థ సిండికేట్‌ బ్యాంకు డిజిటల్‌ లావాదే వీలపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు గాను ప్రత్యేక కార్యక్ర మాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల (రూరల్‌) బ్యాంక్‌ ఆధ్వర్యంలో 'గోయింగ్‌ డిజిటల్‌ క్యాంప్‌'ను నిర్వహించింది. కార్యక్రమంలో బ్యాంక్‌ మేనేజర్‌ వై.శ్రీకాంత్‌ మాట్లాడుతూ పొదుపు ప్రాధాన్యతను, బాధ్యతాయుతమైన రుణ చెల్లింపులు, డిజిటల్‌ వేదికలపై బ్యాంక్‌ అందుబాటులో ఉంచిన పలు సదుపాయాలను గురించి స్థానిక ప్రజలకు బ్యాంకు ఖాతాదారులకు తెలియజేశారు. అవగాహన కోసం కరపత్రాలను అందజేసి, పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిండికేట్‌ బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌- 2కు చెందిన అధికారులు పాల్గొన్నారు. రూపే కార్డులు, బ్యాంకుకు తలమానికమైన పలు ఉత్పత్తులను గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 9, Mar 2019, 12:50 PM IST Highlights టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా స్టార్ హీరోలందరితో చాలా సన్నిహితంగా కనిపిస్తున్నాడు. అయన త్వరలో మెగా కాంపౌండ్ లోకి ఒక సినిమా ద్వారా అడుగుపట్టబోతున్నాడు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సంస్థ మెగా హీరోలతో తప్ప వేరే హీరోలతో సినిమాలను నిర్మించరు అనే టాక్ కు కౌంటర్ ఇచ్చే విధంగా ప్రిన్స్ తో ఒక భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా స్టార్ హీరోలందరితో చాలా సన్నిహితంగా కనిపిస్తున్నాడు. అయన త్వరలో మెగా కాంపౌండ్ లోకి ఒక సినిమా ద్వారా అడుగుపట్టబోతున్నాడు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సంస్థ మెగా హీరోలతో తప్ప వేరే హీరోలతో సినిమాలను నిర్మించరు అనే టాక్ కు కౌంటర్ ఇచ్చే విధంగా ప్రిన్స్ తో ఒక భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  మహేష్ గత కొంత కాలంగా అర్జున్ రెడ్డి దర్శకుడితో క్లోజ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను గీత ఆర్ట్స్ నిర్మించడానికి సిద్దమైనట్లు సమాచారం. అల్లు అరవింద్ మహేష్ సతీమణి నమ్రత తో మహేష్ కాల్షీట్స్ గురించి మాట్లాడినట్లు సమాచారం. అయితే మహేష్ ఈ ఏడాది దొరకడం కష్టమే అని ఆమె సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.  ప్రస్తుత సూపర్ స్టార్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ లో 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వంశి పైడిపల్లి మహేష్ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మహేష్ అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.  ఆ తరువాత సందీప్ వంగ స్క్రిప్ట్ గురించి ఆలోచించే అవకాశం ఉన్నట్లు టాక్. అయితే ముందే కమిట్మెంట్ ఇవ్వమని అడిగితే మహేష్ కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఇక నుంచి ఆయన సొంత ప్రొడక్షన్ లోనే సొంతంగా సినిమాలను నిర్మించుకోవాలని మహేష్ ఆలోచిస్తున్నాడు. కానీ ఆ లోపు గీత ఆర్ట్స్ లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.   Last Updated 9, Mar 2019, 12:52 PM IST
0business
Aug 20,2017 అదనపు మూలధనంతో ఆదుకోవాలి ముంబయి: బ్యాంకింగ్‌ రంగంలో అంతకంతకు పెరుగుతున్న మొండి బాకీల విషయమై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఎన్‌పీలను ఎదుర్కొంటూ నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం అందించాల్సిన అవసరముందని ఉర్జిత్‌ అభిప్రాయపడ్డారు. శనివారం ముంబయిలో సీఐఐ ఏర్పాటు చేసిన 'ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ' జాతీయ సదస్సులో ఉర్జిత్‌ పాల్గొని ప్రసంగించారు. మొండి బాకీల భారాన్ని తగ్గించుకునేందుకు బ్యాంకులు మార్కెట్‌ నుంచి నిధులను సమీకరించడం, ప్రభుత్వం బ్యాంకుల్లో తమ వాటాను తగ్గించడంతో పాటు.. పలు రంగాల్లో అదనపు మూలధనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో మొండి బాకీలు 9.6 శాతానికి చేరడం ఆమోదయోగ్యం కాదన్నారు. గత కొన్ని ఏండ్లుగా మొండి బాకీలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయన్నారు. దాదాపుగా చాలా ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాలెన్ష్‌ షీట్లు ఆరోగ్యకరంగా లేవన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ILEND బ్రిటన్‌కోవేతో ఐలెండ్‌ ఒప్పందం హైదరాబాద్‌, నవంబరు 30: నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఐలెండ్‌ తాజాగా బ్రిటన్‌కు చెందిన కోవే వెంచర్స్‌తో ఒప్పందంచేసుకుంది. బ్రిటన్‌లోని బిగ్‌డేటా పరిష్కారాలందించే సేవలసంస్థగా ఉన్న కోవే వెంచర్స్‌తో వ్యూహాత్మక ఒప్పందంచేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం కింద రెండుసంస్థలు డేటారంగానికి సంబంధించి అర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, డీప్‌మెషిన్‌ లెర్నింగ్‌ ఆల్గోరిథమ్స్‌పరంగా భార తీయ ప్రత్యామ్నాయఫైనాన్స్‌, పి2పిరుణపరపతి రంగానికి మరింత సేవలందించేందుకు దోహదం చేస్తుందని ప్రకటించాయి. భారత్‌లోని పట్టణ, గ్రామీణప్రాంతాల్లో రుణపరపతి 20 బిలిన్‌ డాలర్లమేరకు వృద్ధిచెందే అవకాశాలున్నాయని ఈ రంగంలో మరిం త రుణపరపతికి అవకాశాలున్నట్లు రెండుసంస్థలు ప్రకటించాయి. రెండుసంస్థల ఒప్పందంతో భారత్‌లో రుణపరపతిరంగంలో మరింత సేవలందించేందుకు ఐలెండ్‌ డేటా ఉపకరిస్తుందని ప్రకటించాయి. ఐలెండ్‌ వ్యవస్థాపకులు శంకర్‌ వడ్డాది మాట్లాడుతూ ఈ టైఅప్‌వల్ల ఇకెవైసి విధానంలో రుణపరపతిని మరిం త పెంచుకునే అవకాశం ఉంటుందని, పట్టణప్రాంతాల్లో ఆర్ధికచేకూర్పుకనకు మరింత వీలు కల్పిస్తున్నట్ల యిందన్నారు అంతేకాకుండా రుణపరపతి జారీలో కూడా ఎక్కువ పారదర్శకతకు చోటు కలుగుతుంద న్నారు. కోవె వెంచర్స్‌ సిఇఒ వ్యవస్థాపకులు మాధవ తురుమెళ్ల మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వల్ల రెండు కంపెనీల మధ్య రుణపరపతి పంపిణీకి ఐటి పరిష్కారాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. రెండు కంపెనీల వద్ద ఉన్న డేటా పరస్పర మార్పిడికి వీలవుతుందన్నారు. పీర్‌2పీర్‌ రుణ పరపతి రంగంలో భారత్‌పరంగా ఎక్కువ అవకాశాలున్నందున ఈ రెండు కంపెనీలమధ్య జరిగిన ఒప్పందం భారత్‌లో రుణపరపతి రంగాన్ని మరింత వృద్ధిచేస్తుందని రెండుసంస్థల ప్రతినిధులు వెల్లడిం చారు. అంతేకాకుండా గుణాత్మక పరపతిని అందించగలమని, ప్రస్తుత ఆల్గోరిథమ్స్‌కు తోడు ఇకెవైసి విధానం అమలయితే మరింత పారదర్శకత వస్తుందని రెండు సంస్థల వ్యవస్థాపకులు వెల్లడించారు.
1entertainment
RBI Governer Urjit patel రుణమాఫీ వల్ల చెల్లింపుల సంస్కృతి దెబ్బతింటుంది ముంబై: వ్యవసాయ రుణాల మాఫీ వల్ల నిజా యితీతో చెల్లించేవారు సైతం వెనుకంజ వేసే ప్రమాదం ఉందని, దీనివల్ల ప్రభుత్వ రుణాలు మరింత పెరుగు తాయని, ప్రభుత్వ బాండ్ల రాబడులు కూడా దెబ్బతింటాయని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ వ్యాఖ్యానించారు. వ్యవసాయ రుణాల రద్దు వంటి హామీలు నిజమైన పన్నుచెల్లింపుదారుల సొమ్ము ఈ రుణాలకు పోతుందని ఆయన అన్నారు. ఈ రుణాల రద్దు నిజమైన నిజాయితీతో చెల్లింపులు జరిపేవారిని శంకించినట్లవు తుందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌ప్రభుత్వం వ్యవసాయ రుణాలను 36వేల కోట్లరూపాయల వరకూ మాఫీచేయడంపై ఆయన స్పందించారు. ఈ విధానం వల్ల నిజాయితీతో జరిగే రుణపర పతి చెల్లింపుల సంస్కృతిని దెబ్బతీస్తుందన్నా రు. ప్రభుత్వం ఎక్కువ రుణపరపతిని సాధిస్తే దీనివల్ల రుణపరపతి వ్యయం పెరుగుతుందని, దీనిపై ఏకాభిప్రాయానికి కృషిచేయాల్సిన అవస రం ఉంటుందని, ఇకపై ఎలాంటి రుణమాఫీ హామీ లు లేకుండా నిర్ణయించేవిధానం రావాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలోని ఆస్తిఅప్పుల పట్టీ సమన్వయం దెబ్బతింటుందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్‌ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సన్న, చిన్నకారు రైతులకు రుణాలను మాఫీచేస్తున్నట్లు ప్రకటించింది. రైతుల పంటరుణాలు లక్షరూపాయల వరకూ ఉన్నవాటిని మాఫీచేస్తామని దీనివల్ల 36,359 కోట్ల రూపాయలు భారం పడుతుందన్నారు. తన మొట్టమొదటి కేబినెట్‌ సమావేశంలోనే ఈ నిర్ణయాన్ని వెల్లడించారని, ఉత్తరప్రదేశ్‌ లోని రుణపీడిత సన్న, చిన్నకారు రైతులకు ఈ భారం ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. 92.5శాతం మంది రైతులకు ఊరటనిస్తుందన్నారు. అంతేకా కుండా కిసాన్‌రాహత్‌ బాండ్లను జారీచేసి 36,359 కోట్ల రూపాయలు సమీకరించి ఈ రుణాలరద్దుకు ప్రత్యామ్నాయంగా ఆర్థికభారం నుంచి అధిగమిం చాలని యుపి ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర ప్రదేశ్‌ప్రభుత్వం తర్వాత మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా తన ప్రభుత్వం యుపి విధానంపై అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటిం చారు. ఈవారంలోనే మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని కరువుపీడితప్రాంతాల్లోని రైతుల రుణాలను మాఫీచేయాలని, బకాయిల వసూళ్లలో నిర్బంధాలకు దిగుతున్న సహకారసొసైటీలు, బ్యాంకులు ఆవిధానం మానుకోవాలని కూడా హెచ్చరించింది.
1entertainment
Suresh 257 Views హీరోల పోరు ప్యారిస్‌: ప్రపంచ నెంబర్‌వన్‌ ప్లేయర్‌, సెర్బియాకు చెందిన నోవాక్‌ జొకోవిచ్‌, బ్రిటన్కఉ చెందిన ఆండీ ముర్రేతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కోసం తలపడనున్నాడు. ఆదివారం ఇక్కడి రోలాండ్‌ గ్యారస్‌లో జరిగే పోరు ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు 29 ఏళ్ల ముర్రే తొలి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటి వరకు 11 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన టాప్‌సీడ్‌ జొకోవిచ్‌కు ఇంతకుముందు మూడుసార్లు ఫైనల్‌కే చేరినా ట్రోఫీ అందుకోలేకపోయాడు.. ఇది గెలిస్తే జొకోవిచ్‌ కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ (ఆస్ట్రేలియా ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓఎపెన్‌, వింబుల్డన్‌, యుఎస ఓపెన్‌) గెలిచినవాడవుతాడు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కోహ్లి నిర్ణయంతో ఆశ్చర్యపోయా..!: వీవీఎస్ తుది జట్టులో కుల్దీప్, చాహల్, జడేజా రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉండటంతో అతను ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకోగలిగాడు. అంతకంటే ముఖ్యంగా.. ప్రపంచకప్ ముంగిట ఒత్తిడిలో ఆడటంపై టీమిండియా బౌలర్లని అతను పరీక్షించదలిచాడు. Samayam Telugu | Updated: Oct 26, 2018, 01:10PM IST కోహ్లి నిర్ణయంతో ఆశ్చర్యపోయా..!: వీవీఎస్ వెస్టిండీస్‌తో విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకోవడం తనని ఆశ్చర్యపరిచిందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13x4, 4x6) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ (123 నాటౌట్: 134 బంతుల్లో 10x4, 3x6) సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలిచింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. విశాఖపట్నంలో రాత్రి 7 గంటల తర్వాత మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిసినా.. సెకండాఫ్‌లో బౌలింగ్ చేసేందుకు కోహ్లి సిద్ధపడటంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
2sports
Visit Site Recommended byColombia భార్య మోపిన కేసుల పుణ్యామని షమీకి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లనుంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ప్రకటించే సమయంలోనే హసీన్ షమీపై ఆరోపణలు గుప్పించింది. దీంతో చివరి నిమిషంలో బోర్డు అతడి పేరును తొలగించింది. గత ఏడాది షమీ రూ. 3 కోట్ల కేటగిరీలో ఉన్నాడు. ఈ వివాదం లేకపోతే.. ఇప్పుడు కూడా కచ్చితంగా అదే కేటగిరిలో ఉండేవాడు. ఇక ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా షమీ దూరం కానున్నాడు. అదే జరిగితే అతడికి మరో రూ.3 కోట్లు నష్టం వాటిల్లనుంది. ఐపీఎల్-2018 కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్ అతణ్ని ఆర్టీఎం ద్వారా రూ.3 కోట్లు ఖర్చుపెట్టి తమతోనే ఉంచుకుంది. దోషిగా తేలితే.. ప్రకటనలు, ఇతరత్రా మరో రూ. 2 కోట్ల మేర ఆదాయాన్ని షమీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఓవరాల్‌గా హసీన్ నమోదు చేసిన కేసుల వల్ల షమీ ఒక్క ఏడాదిలోనే రూ. 6-8 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Nov 13,2019 అప్రమత్తతో.. నష్టాల్లోకి జారిన మార్కెట్లు! ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మధ్యాహ్నం వరకు సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అయినప్పటకీ 2 గంటల తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రభుత్వం ఎకనామిక్‌ డేటా విడుదల చేయనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తతలో వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. దీంతో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 229 పాయింట్లు దిగజారి 40,116కు పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లను నష్టపోయి 11,840 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఒకానొకసమయంలో 386 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ కూడా 11,823 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. బ్యాంక్‌ షేర్లలోని తీవ్ర అమ్మకాల ఒత్తిడి వల్ల సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి హెవీవెయిట్‌ షేర్లు పడిపోవడంతో ఇండెక్స్‌లు నష్టపోయాయి. నిఫ్టీ సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3 శాతానికి పైగా పతనమైంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
May 27,2015 2, 4 శనివారాల్లో బ్యాంకులు పని చేయవు              ముంబయి: జులై నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన అన్ని శాఖలు రెండో, నాలుగో శనివారాల్లో పనిచేయవు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, యాజమాన్యపు అధికారులకు ఇటీవల కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ శనివారం సెలవుల విధానం అమలులోకి రానుంది. ఈ ప్రతిపాదనకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) సమ్మతి తెలిపిందని త్వరలోనే 'నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రూమెంట్‌ యాక్ట్‌' నందు ఇందుకు చెందిన సవరణ రానుందని ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ టి.ఎం.బాసిన్‌ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి రెండు మూడు వారాలు పడుతుందని ఆయన అన్నారు. 2,4 శనివరాల్లో సెలవులకు ప్రతిగా బ్యాంకులు మొదటి, మూడో శనివారలు పూర్తిగా పని చేస్తాయని ఆయన అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఈమెకు ఇంటి నిండా శత్రువులే.. మహదేవ Highlights స్టార్ మా బిగ్ బాస్ హౌజ్ లో కేరక్టర్ ఆర్టిస్ట్ అర్చన వేద తోటి హౌజ్ మేట్స్ అంతా ఇంటి నుంచి పంపేయాలని డిమాండ్ ఎలిమినేషన్ ఓటింగ్ లో అర్చనను పంపేయాలని ఏకగ్రీవంగా ఓట్లు ఎన్టీఆర్ స్టార్ మా ఛానెల్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. షోలో ఎప్పటికప్పుడు సర్ ప్రైజెస్ ఇస్తున్నాడు ఎన్టీఆర్. ఈ వారం హీరో నవదీప్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వచ్చే వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆససక్తికరంగా మారింది. ఓటింగ్ లో పాల్గొన్నవాళ్లంతా ఇంట్లో అర్చన(వేద) ఉండొద్దని తేల్చి చెప్పారు.   వచ్చే వారం ఎలిమినేషన్ కు సంబంధించి సోమవారం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో 9మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో 8 మంది అర్చనకు వ్యతిరేకంగా ఓటేశారు. అర్చన ప్రవర్తన సరిగా లేదని.. పదే పదే వాదిస్తూనే వుంటుందని, ఏదైనా వుంటే.. పదేపదే సాగదీస్తూ సభ్యులను ఇరిటేట్ చేస్తోందని సభ్యులందరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు.       9 మంది ఓటేస్తే 8 మంది తనకు వ్యతిరేకంగా ఓటేయడంపై అర్చన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతేకాదు.. తానేం తప్పు చేశానంటూ అంతర్మథనంలో పడింది. తాను ఎంతో ఇష్టపడే వాళ్లు కూడా తనకు వ్యతిరేకంగా ఓటేయడంపై అర్చన ఆవేదన వ్యక్తం చేసింది. అర్చన తర్వాత అత్యధికంగా 5 ఓట్లు ధన్ రాజ్ కు పడ్డాయి. దీంతో అర్చన, ధన్ రాజ్, ముమైత్, హరితేజ వచ్చేవారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ముమైత్, హరితేజ గతవారం స్వచ్చంధంగా ఎలిమినేషన్ కు నామినేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.   అయితే వీరిలో అర్చనను బయటికి పంపే ఛాన్సెస్ ఎక్కువ వున్నాయి. తన అసలు కేరక్టర్ ఏంటో నిర్మొహమాటంగా బిగ్ బాస్ హౌజ్ లోనూ బయటపెట్టడంతో తోటి సభ్యుల ఛీత్కారాలు ఎదుర్కొంటున్న అర్చనను బిగ్ బాస్ హౌజ్ నుంచి పంపేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇదే సరైన నిర్ణయమని సర్వత్రా అభిప్రాయాలు వెలువడటం విశేషం. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ First Published 8, Oct 2017, 7:38 PM IST రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్ Recent Stories
0business
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
విజయ్ దేవరకొండ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఇంటా,బయటా అక్షింతలు Highlights అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నోరు జారిన విజయ్ దేవరకొండ సెన్సార్ బోర్డ్ కట్ చేసిన బూతులు థియేటర్లో ప్రేక్షకులే చెప్పాలట ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మా..ర్..చో... అంటూ మాట్లాడి అందరికీ షాకిచ్చిన విజయ్   పెళ్లి చూపులు సినిమాతో తెలుగులో అతి తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు పొందాడు విజయ్ దేవరకొండ. అయితే.. కథ పరంగా ఆ సినిమా ఎట్రాక్ట్ చేయడంతోనే జనాలు ఆ రేంజ్ హిట్ ఇచ్చారు. కానీ ఆ హిట్ తన ఖాతాలో వేసుకుంటూ తన స్థాయిని చాలా పెద్దగా ఊహించుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈవారం విడుదల కాబోతున్న అర్జున్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఓవరయ్యాయని, అంతొద్దు అంటూ ..ఈ యంగ్ హీరో పై ఘాటైన సెటైర్లు ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో హడావిడి చేస్తున్నాయి.   అర్జున్ రెడ్డి సినిమాలో బూతు పదాలు ఉన్నాయి అన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికే ముద్దు సీన్ తో వేసిన పోస్టర్ పై పలు రాజకీయ, మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రి రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తెగ దుమారం రేగుతోంది. ఏదో యూట్యూబ్ కు సెన్సార్ ఉండదు కాబట్టి ఈసినిమా టీజర్ ను అప్ లోడ్ చేసినా ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. అయితే సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఉంటుంది అన్న విషయం కూడ ఈయంగ్ హీరోకు తెలియదా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.    ఈమూవీలోని కొన్ని బూతు పదాలను సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. అయితే ఈ నిర్ణయాన్ని విజయ్ దేవరకొండ ఒప్పుకోవడం లేదు. థియేటర్లలో ఆ బూతు పదాల సీన్స్ వచ్చినప్పుడు తన బదులు ఆ డైలాగ్స్ ను ప్రేక్షకులను చెప్పమని అంటూ విజయ్ దేవరకొండ యూత్ ను రెచ్చగొట్టడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు తన సినిమాకు ‘ఎ’ సర్టిఫికేట్ ఇవ్వడం ఈ యంగ్ హీరోకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. ఈసినిమా కథ విన్నప్పుడే ఇది పిల్లల కథ కాదు అని తనకు అనిపించింది అని చెపుతున్న ఈ యంగ్ హీరో తన సినిమాలోని డైలాగ్స్ ను తొలిగించే అధికారం సెన్సార్ బోర్డ్ కు ఎక్కడ ఉంది అని అర్ధం వచ్చే విధంగా కామెంట్స్ చేస్తున్నాడు.    ముఖ్యంగా “ఏం మాట్లాడుతున్నావ్ రా“ అనే డైలాగ్ దగ్గర చివర వచ్చే బూతు పదాన్ని మ్యూట్ చేయడం ఈ యంగ్ హీరోకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. దీనితో టాప్ యంగ్ హీరోలు అంతా తమ అభిమానులు సభ్యతగా సంస్కారంతో ఉండాలి అని స్పీచ్ లు ఇస్తూ ఉంటే పట్టుమని కనీసం 5  సినిమాలలో కూడా నటించని ఈ యంగ్ హీరో ఓవర్ యాక్షన్ ఏమిటి అంటూ చాలామంది అంటున్నారు. అయినా బూతు పదాలు పబ్లిక్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కొందరు కేసులు వేసేందుకు కూాడా రెడీ అవుతున్నారు. Last Updated 25, Mar 2018, 11:58 PM IST
0business
Hyderabad, First Published 17, Aug 2018, 10:20 AM IST Highlights విశాఖపట్నం అన్నవరంలో శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో ఆయన వివాహం జరిగింది.   జోగి బ్రదర్స్... ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈ ఇద్దరు చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఈ జోగి బ్రదర్స్ లో ఒకరైన జోగి నాయుడు గురువారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. విశాఖపట్నం అన్నవరంలో శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో ఆయన వివాహం జరిగింది. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తెలుగు సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం యాంకర్ ఝాన్సీని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. కాగా.. ఇప్పుడు ఆయన  తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్య అనే యువతిని  రెండవ వివాహం చేసుకున్నారు. Last Updated 9, Sep 2018, 10:57 AM IST
0business
Visit Site Recommended byColombia సింగర్‌గా, నటుడుగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ని కొనసాగిస్తున్న టి.రాజేందర్‌ ఈ చిత్రంతో మరోసారి హైలైట్‌ అవ్వబోతున్నారు. మే 2న ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్‌ చేసి అదేనెలలో సినిమాని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రేమసాగరం టి.రాజేందర్‌ మాట్లాడుతూ - ''ఐటి బ్యాక్‌డ్రాప్‌లో విభిన్నంగా సాగే ప్రేమకథ ఇది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని పాండిరాజ్‌ ఎక్స్‌లెంట్‌గా తెరకెక్కించారు. రియల్‌ లైఫ్‌లో ఐటి రంగంలో పని చేసే యువతీ యువకులు ఎలా లవ్‌ చేసుకుంటున్నారు? ఎలా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా? లేదా? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం వుంటుంది. ప్రజెంట్‌ యూత్‌కి కనెక్ట్‌ అయ్యేవిధంగా ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం వుంటుంది. ఈ చిత్రానికి మా చిన్నబ్బాయి, శింబు తమ్ముడు కురళ అరసన్‌ మ్యూజిక్‌ అందించాడు. ఐదు పాటలు చాలా డిఫరెంట్‌గా వుంటాయి. మ్యూజికల్‌గా ఆడియో చాలా పెద్ద హిట్‌ అవుతుంది. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో నటించారు. సత్యం రాజేష్‌ త్రో అవుట్‌ క్యారెక్టర్‌లో హీరో ఫ్రెండ్‌గా నటించాడు. అతను నటించిన సీన్స్‌ సూపర్బ్‌గా వచ్చాయి. మా శింబు సినీ ఆర్ట్స్‌ బేనర్‌లో 'కుర్రాడొచ్చాడు' తర్వాత రిలీజ్‌ అవుతున్న డైరెక్ట్‌ తెలుగు సినిమా ఇది. ఎంతో కేర్‌ తీసుకుని ప్రేక్షకులకి నచ్చేలా ఈ సినిమాని నిర్మించాం. 'మన్మథ', 'వల్లభ' చిత్రాల కంటే 'సరసుడు' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని చాలా కాన్ఫిడెన్స్‌తో వున్నాం. మే 2న సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్‌ చేసి, మే మూడో వారంలో చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం'' అన్నారు.
0business
ప్రముఖ తెలుగు టివి యాంకర్ సూసైడ్! Highlights తెలుగు ప్రముఖ యాంకర్ సూసైడ్!   విషాదం చోటు చేసుకుంది. ఒక టీవీ ఛానల్ లో పని చేసే న్యూస్ యాంకర్ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఆఫీసుకు వెళ్లి.. డ్యూటీ చేసి వచ్చిన ఆమె.. తానున్న అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు మీద నుంచి దూకి చనిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా సృష్టించింది. తలకు తీవ్రగాయం కావటంతో ఘటనాస్థలంలోనే ఆమె మరణించారు. ఆమె బ్యాగ్ లో సూసైడ్ నోట్ లభించింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన 36 ఏళ్ల రాధిక ఒక టీవీ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తోంది. 15 ఏళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. కొంతకాలంగా భర్తతో దూరంగా ఉందని.. ఆర్నెల్ల క్రితమే వారికి విడాకులు మంజూరు అయినట్లుగా చెబుతున్నారు.  మూసాపేటలోని ఒక అపార్ట్ మెంట్లో మానసికంగా ఎదగని కుమారుడు భానుతేజారెడ్డి (14)తో కలిసి సిస్టర్ ఇంట్లో ఉంటోంది. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన ఆమె రాత్రి 10 గంటలకు ఇంటికి బయలుదేరారు. ఇంటికి వచ్చిన వెంటనే.. బ్యాగ్ ఇంట్లో పడేసి.. అపార్ట్ మెంట్ ఐదో అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేశారు. పై నుంచి ఏదో పడిన శబ్ధం పెద్దగా వినిపించటంతో అపార్ట్ మెంట్ వాసులు చూశారు. సూసైడ్ చేసుకున్న వైనాన్ని పోలీసులకు తెలియజేశారు. ఎత్తు నుంచి కిందకు దూకేయటం.. తలకు తీవ్ర గాయం కావటంతో రాధిక అక్కడికక్కడే మరణించారు.  ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్ లో ఆమె సూసైడ్ నోట్ దొరికింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పెన్సిల్ తో పేర్కొంది. మానసిక ఒత్తిడి.. డిప్రెషన్ తోనే తాను చనిపోతున్నట్లుగా రాసింది. తన మరణానికి ఎవరూ కారణం కాదన్న రాధిక.. "నా బ్రెయిన్ నా శత్రువు" అని పేర్కొనటం గమనార్హం.  భర్తతో దూరంగా ఉండటం.. మానసికంగా ఎదగని కొడుకు లాంటి కారణాలతో ఆమె తీవ్ర వేదనకు గురైనట్లుగా చెబుతున్నారు. సూసైడ్ నోట్ తో ప్రాధమిక విచారణ చేపట్టినప్పటికీ.. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి కారణాలు ఏమిటన్న విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్య వెనుక నోట్ లో పేర్కొన్న అంశాలు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలోనో.. ఆవేదనలోనో ఆత్మహత్య చేసుకున్న యాంకర్ రాధిక.. మానసికంగా ఎదగని కొడుకును తన కంటే మరెవ్వరూ సరిగా చూసుకోలేరన్న విషయాన్ని ఎందుకు ఆలోచించనట్లు? తన మరణం తన కొడుకు జీవితానికి శాపంగా మారుతుందన్న విషయాన్ని ఆమె ఆలోచించి ఉంటే.. ఆత్మహత్య చేసుకునే వారు కాదేమో?
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV శ్రీలంక గెలుపు మాటే మర్చిపోతోంది..! భారత్ దెబ్బతో గెలుపునకు శ్రీలంక జట్టు బాగా దూరమైపోయిందని ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ కపుగెదర అభిప్రాయపడ్డాడు. TNN | Updated: Aug 28, 2017, 05:31PM IST భారత్ దెబ్బతో గెలుపునకు శ్రీలంక జట్టు బాగా దూరమైపోయిందని ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ కపుగెదర అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే టెస్టుల్లో క్లీన్‌స్వీప్‌కి గురైన లంకేయులు.. ఆదివారం జరిగిన మూడో వన్డేలో కూడా ఓడి ఐదు వన్డేల సిరీస్‌‌లో 3-0తో వెనకబడ్డారు. ఈ సుదీర్ఘ సిరీస్‌లో మొదటి నుంచే శ్రీలంక పేలవ ప్రదర్శన కొనసాగిస్తోందని.. విజయానికి చేరువైనా గెలుపు అందుకోలేకవడం ప్రస్తుతం జట్టు ఆత్మస్థైర్యానికి అద్దంపడుతోందన్నాడు. ‘శ్రీలంక జట్టుకి వెలుపల నుంచి ఎలాంటి సమస్యలు లేవు. నాకు తెలిసి.. మ్యాచ్‌ని గెలిచే ఫార్ములాని ఆటగాళ్లు మర్చిపోయినట్లున్నారు. వరుస ఓటములు చూసిన తర్వాత.. గెలుపునకి చేరువైనా చాలా జట్లు ఓడిపోవడం నేను చూశాను. కానీ.. ఇక్కడ మేము ఒక విజయం సాధిస్తే చాలు.. మళ్లీ పుంజుకుంటాం. బలహీనతలు దిద్దుకోవడం గురించి ఇప్పటికే సుదీర్ఘంగా జట్టులో చర్చించాం. గత రెండు వన్డేల్లో బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారు. ఇక బ్యాట్స్‌మెన్లు బాధ్యత తీసుకుని మ్యాచ్‌ని కాపాడాలి’ అని కపుగెదర సూచించాడు. కొలంబో వేదికగా గురువారం నాలుగో వన్డే జరగనుంది.
2sports
58 పరుగులతో కోహ్లీకి అండగా ఉన్న రహానే Virat Kohli పుణె: దక్షిణాఫ్రికాతో పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. తన టెస్ట్ కెరీర్ లో 26వ శతకాన్ని బాదాడు. అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్ తో 2019లో తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. మరో ఎండ్ లో అజింక్యా రహానే నిలకడగా ఆడుతూ కోహ్లీకి అండగా నిలిచాడు. భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు. కోహ్లీ 104 పరుగులతో, రహానే 58 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీనికి ముందు మయాంక్ 108, రోహిత్ శర్మ 14, పుజారా 58 ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూడు వికెట్లను రబాడా తీశాడు. కోహ్లీ, రహానేల జోరుతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/business/
2sports
బిగ్ బాస్ లో శృతి హడావిడి! Highlights బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభిస్తోంది బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగులో ఇప్పుడిప్పుడే ఈ షోకి మాసాలా యాడ్ చేస్తున్నారు. ఇక కోలివుడ్ లో అయితే ఏకంగా పోటీదారుల మధ్య  లిప్ లాక్ లు కూడా సాగుతున్నాయి. తమిళ బిగ్ బాస్ కు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ షోలో హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా పాల్గొంది. ఈ షోలో 'విశ్వరూపం2' సినిమా పాటలు విడుదల చేసి హైప్ క్రియేట్ చేశారు. కమల్, శ్రుతి ఇద్దరూ కలిసి ఓ పాట కూడా పాడారు. వీరి పాటకు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. షోలో పాల్గొన్న శ్రుతి తన తండ్రి గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎంత బిహీగా ఉన్నప్పటికీ సినిమాలకు గుడ్ బై చెప్పకూడదని శ్రుతి తన తండ్రిని కోరింది. అసలు ఆ ఆలోచనను మానుకోవాలనిచెప్పడంతో ఆమెకు మద్దతుగా మరికొందరు ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. దానికి సమాధానంగా కమల్.. యువ నటులు తమిళ ఇండస్ట్రీను ముందుకు నడపడానికి కృషి చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. సినిమాల విషయానికొస్తే.. విశ్వరూపం2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'శభాష్ నాయుడు' సినిమా మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.  Last Updated 3, Jul 2018, 12:41 PM IST
0business
సినారే అంతిమయాత్రలో పాల్గొననున్న సీఎం కేసీఆర్ Highlights సినారే అంతిమయాత్రలో పాల్గొననున్న సీఎం కేసీఆర్ సినారే నివాసంలో మృతదేహానికి నివాళులర్పించిన కేసీఆర్ ప్రశాసనన్ నగర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమ యాత్ర ప్రముఖ సాహితీవేత్త సి. నారాయణ రెడ్డిని స్మరించుకొనేందుకు వీలుగా ఆయన పేరున మ్యూజియాన్ని ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. నారాయణరెడ్డి భౌతిక కాయం వద్ద కెసిఆర్ మంగళవారం నాడు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు తెలుగు ప్రజలంతా గర్వంగా చెప్పుకొనే కవి నారాయణరెడ్డి అని ఆయన కొనియాడారు. తెలంగాణ సాహితీ మకుటంలో కలికితురాయిగా ఆయన అభివర్ణించారు.   ఆది, అంత్యప్రాసలకు ఆయనకు ఆయనే సాటి అని కెసిఆర్ చెప్పారు. నారాయణరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చే వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను ఏర్పాటుచేసినట్టు కెసిఆర్ చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో బస్సులను ఏర్పాటుచేస్తామన్నారు. ఉచితంగానే ఈ బస్సుల్లో ప్రయాణించి అంత్యక్రియల్లో పాల్గోనాల్సిందిగా కెసిఆర్ చెప్పారు. ఇందుకోసం వంద బస్సులను ఏర్పాటుచేసినట్టు ఆయన చెప్పారు. సినారె పేరున మ్యూజియాన్ని, స్మారక భవనాన్ని ఏర్పాటుచేస్తామని కెసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రముఖ సంస్థ లేదా యూనివర్శిటీకీ సినారె పేరును పెడతామన్నారు. పూర్వ కరీంనగర్ జిల్లాలో సినారె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. ఇక సినారే అంత్య క్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక బుధవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ సారస్వత భవనం లో సినారే పార్థివ దేహాన్ని ప్రజలు, ఆయన అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అక్కడి నుంచి ప్రశాసన్ నగర్ మహా ప్రస్థానం వరకు జరిగే అంతిమ యాత్రలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని దహన సంస్కార కార్యక్రమాలు పూర్తయ్యే వరకు సీఎం హాజరు కానున్నారని ఈ సందర్భంగా ప్రముఖ కవి గాయకుడు, సీఎంఓ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ తెలిపారు. Last Updated 25, Mar 2018, 11:40 PM IST
0business
internet vaartha 166 Views నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు ముంబై : బెంచ్‌మార్క్‌ స్టాక్‌ సూచీలన్నీ ఒకటిశాతం దిగజారాయి. ఆసియా మార్కెట్లలోను, ఆర్థికరంగ కంపెనీల షేర్లలో పతనంతో మార్కెట్లు వారం ప్రారంభంలోనే ప్రభావితం అయ్యాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 371 పాయింట్లు దిగజారి 24,966 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి 101 పాయింట్లుక్షీణించి 7615వద్ద నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ 7588 పాయింట్లు, సెన్సెక్స్‌ 24,895 పాయింట్లకు కూడా చేరాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 1.5నుంచి 2శాతంవరకూ క్షీణించాయి. మార్కెట్లపరంగా 1790 కంపెనీల షేర్లు క్షీణిస్తే 1157కంపెనీల షేర్లు స్వల్పలాభాలతో ముగి సాయి. ఇన్వెస్టర్లు ఎక్కువగా మార్చినెల ఫ్యూచర్స్‌ఆప్షన్స్‌ ముగియడంతో లాభాల స్వీకరణకే మొగ్గుచూపించారు. నిఫ్టీ7800నుంచి 7900 పాయింట్లకు సైతం ముగిసే అవకాశం ఉంది. బ్యాంకింగ్‌, మెటల్‌, సిమెంట్‌ రంగాలకు చెందిన షేర్లు ఎక్కువ ప్రభావానికి లోనయ్యాయి. పెట్టుబడులపరంగాచూస్తే 7800నుంచి 7900పాయింట్లవద్ద నిలిచింది. ఏప్రిల్‌ రెండోవారంలో మార్కెట్ల కు భారీ మార్పులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ 6600 నుంచి 6300గా ఉంటుందని వచ్చే నాలుగునుంచి ఆరునెలల్లో ఇదే తీరు ఉంటుందని ఐడిబిఐ కేపిటల్‌ ఎకె ప్రభావకర్‌ విశ్లేషించారు. డాలరుతో రూపాయి మారకం విలువలు కూడా 66.57 రూపాయలుగా నిలిచింది. చమురు సంస్థల ధరలు సోమవారం మందకొడిగా సాగాయి. అలాగే ట్రేడర్లు రిజర్వుబ్యాంకు ద్రవ్యవిధాన సమీక్ష, రెపోరేట్ల తగ్గింపు అంశాలకు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఏప్రిల్‌ ఐదవతేదీ సమీక్షలో బ్యాంకు 25బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తుందని ఇప్పటికే ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. విదేశీ మార్కెట్ల పరంగాచూస్తే ఆసియా మార్కెట్లు తొలిలాభాలు కోల్పోయి నష్టాల్లో పడ్డాయి. ఫెడ్‌రిజర్వుఅధికారులు వడ్డీరేట్లపెంపు ఉండవచ్చన్న సంకేతాలిచ్చారు. యూరో పియన్‌మార్కెట్లు ఈస్టర్‌డే సందర్భంగా సోమవారం సెలవు ప్రకటించాయి. ఇక దేశీయంగా చూస్తే మెటల్‌ కంపెనీలు లాభాలస్వీకరణతో ఎక్కువ వత్తిడి చవిచూశాయి. వేదాంత, హిందాల్కో ఇండస్ట్రీస్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండి యా, భూషణ్‌ స్టీల్‌ వంటి కంపెనీలు రెండుశాతం చొప్పున నష్టపోయాయి. టాటాస్టీల్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌పవర్‌, జెఎస్‌డబుల్య స్టీల్‌, ఎన్‌ఎండిసి వంటివి 1 నుంచి ఐదుశాతం ఎన్‌ఎస్‌ఇలో క్షీణించాయి. టాటాస్టీల్‌ బోర్డు ఈనెల 29వ తేదీ సమావేశం అవుతోంది. యుకె ప్లాంట్‌ను కొనసాగించాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరుపతాయి. టాటాస్టీల్‌ ఐదుశాతంమేర క్షీణిం చింది. అలాగే టాటామోటార్స్‌కు అదనంగా 619 యూనిట్ల భారీ రక్షణరంగ వాహనాలను సరఫరాచేసే కాంట్రాక్టు లభించింది. మల్టీయాక్సిల్‌ ట్రక్కులు రక్షణరంగంలో వినియోగించేందుకు ఆర్డరు వచ్చింది. టాటామోటార్స్‌షేర్లు మాత్రం నాలుగుశాతం క్షీణించాయి. ఎస్‌బిఐ, యాక్సిస్‌బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి వంటివి 2నుంచి 4శాతం క్షీణించాయి. పార్మరంగ షేర్లు కూడా ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఎఫ్‌డిఎ తనిఖీలు, ఇటీవలే కేంద్రం 300 ఔషధాలపై నిషేధం విధించడంతో సన్‌ఫార్మా, లూపిన్‌ సంస్థలు రెండుశాతం, నాలుగుశాతం చొప్పున క్షీణించాయి. నాట్కోఫార్మా కూడా ఐదు శాతం క్షీణించింది. కంపెనీపై ఎఫ్‌డిఎ తనిఖీలే ఇందుకు దోహదం చేశాయి. ఇక జివికె పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ఆరుశాతం పెరిగింది. 33శాతం బెంగళూరు ఎయిర్‌పోర్టు వాటానుఫెయిర్‌ఫాక్స్‌ హోల్డింగ్స్‌కు 2149కోట్లకు విక్రయించేందు కు బోర్డు అంగీకరించడమే ఇందుకు కీలకం. బయోకాన్‌ జపాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖనుంచి తన ఔషధం బయోసిమిలర్‌ ఇన్సులిన్‌ గ్లార్గిన్‌ను డిస్పోజబుల్‌ పెన్స్‌లో విక్రయించేందుకు అనుమతిని పొందింది దీనితో కంపెనీ షేర్లు ఐదుశాతం పెరిగాయి.
1entertainment
New Delhi, First Published 8, Sep 2018, 1:23 PM IST Highlights వినాయక చవితి.. అటు తర్వాత నవరాత్రులు.. విజయదశమి.. దీపావళి.. కార్తీక పౌర్ణమి.. వరుసగా పండుగలే. ఈ సీజన్‌లో భారతీయులు తమకు ఇష్టమైన వస్తువుల కొనుగోలు చేయడం మంచిదని భావిస్తారు. భారతీయుల సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకోవడానికి ప్రతి సంస్థ కూడా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా డిజిటల్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం పండుగల సీజన్‌లో 30 శాతానికి మొబైల్ ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది.  న్యూఢిల్లీ: డిజిటల్ రిటైల్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వచ్చే పండుగల సీజన్‌ను సొమ్ము చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతేడాదితో పోలిస్తే 30 శాతానికి పైగా మొబైల్ ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఫ్లిప్‌కార్ట్.. సదరు మొబైల్ ఫోన్ సంస్థలు మార్కెట్‌లోకి నూతనంగా విడుదల చేస్తున్న మొబైల్ ఫోన్లపై ఆఫర్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. క్యాష్ బ్యాక్ తరహా ఫైనాన్సింగ్ ఆప్షన్లతో భారతీయ వినియోగదారులకు ఆకట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతర్జాతీయ రిటైల్ దిగ్గజం ‘వాల్‌మార్ట్’తో జత కట్టిన ఫ్లిప్‌కార్ట్ సంస్థకు అమెరికా కేంద్రంగా ఆన్ లైన్ రిటైల్ సేవలందిస్తున్న ‘అమెజాన్’ నుంచి ఈ దఫా గట్టి పోటీ ఎదురవుతోంది. భారతదేశంలో 25 శాతం ఫోన్లను విక్రయించాలని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్నది అమెజాన్.  ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ల విభాగం సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్ రాజగోపాల్ మాట్లాడుతూ ‘పండుగల సీజన్‌లో మా సంస్థ విక్రయాలు మరింత పెరుగుతాయని మేం విశ్వాసంతో ఉన్నాం. మార్కెట్ లో 30 - 32 శాతం వాటా పొందుతాం’ అని చెప్పారు. 2020 నాటికి ‘మొబైల్స్ 40బై 20’ వ్యూహంలో భాగంగా 40 శాతం మార్కెట్ ను సొంతం చేసుకోవాలని ఏప్రిల్‌లో ఫ్లిప్‌కార్ట్ లక్ష్యంగా పెట్టుకున్నది. పండుగల సీజన్‌లో మా మొబైల్ ఫోన్ల సంస్థల భాగస్వాములతో కలిసి నూతన మొబైల్ ఫోన్లను మార్కెట్‌లోకి ఆవిష్కరించేందుకు మా ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉన్నది. అన్ని ప్రైస్ పాయింట్ల వద్ద మొబైల్ ఫోన్లు లభిస్తాయి. ప్రత్యేకించి రూ.10,000 - 15,000 క్యాటగిరీతోపాటు ప్రారంభ స్థాయి (రూ.4000 - రూ.7000) స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు చాలా ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాం’ అని తెలిపారు.  ఇన్ఫోమాక్స్, రియల్ మీ, పనాసోనిక్, అసూస్ తదితర మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలతో కలిసి ఫ్లిప్ కార్ట్ పని చేస్తోంది. పరిశ్రమ అంచనా నివేదికల ప్రకారం భారతదేశంలో ఆన్ లైన్ వేదికలపై ఫ్లిప్‌కార్ట్ 39 శాతం ఫోన్లను విక్రయిస్తున్నదని అయ్యప్పన్ రాజగోపాల్ తెలిపారు. చైనాలో 29 శాతం ఫోన్లను ఆన్ లైన్ లో తాము విక్రయిస్తున్నామని చెప్పారు. మొబైల్ ఫోన్ వినియోగదారులు అత్యధికంగా ఆన్ లైన్ వేదికగా ఫ్లిప్‌కార్ట్ ను వాడుకునేందుకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసేవారికి ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభించిందన్నారు.  పండుగల సీజన్ సందర్భంగా మొబైల్ ఫోన్ల కొనుగోళ్లకు ఆపర్లను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కానీ విక్రయాలు మాత్రం వచ్చేనెలలోనే ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు రెండు కూడా భారతదేశంలో ‘ఈ- కామర్స్’ ద్వారా విక్రయిస్తున్న అతిపెద్ద సంస్థలుగా నిలిచాయి. ఆన్ లైన్ కొనుగోళ్లలో అత్యంత ప్రజాదరణ గల వస్తువులుగా మొబైల్ ఫోన్లు నిలిచాయి. కొన్నేళ్లుగా హెచ్ఎండీ, జియామీ, మోటరోలా, కూల్ పాడ్ తదితర మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ తదితర సంస్థలతో కలిసి భారతీయ మార్కెట్‌లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాయి.  Last Updated 9, Sep 2018, 1:32 PM IST
1entertainment
అన్నయ్యను మోసం చేసిన వారికి చెప్పుతోకొట్టినట్లు సమాధానమివ్వాలి Highlights ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రస్థావన మెగాస్టార్ ని మోసం చేసినవారికి చెప్పుతో కొట్టినట్లు సమాధానమివ్వాలన్న పవన్ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చేసిన ప్రసంగం మెగా పవర్ అభిమానులనే కాక.. తెలుగు ప్రజలందరినీ ఆలోచింప చేసింది. అన్ని పార్టీలను, పార్టీల అధినేతలను చెండాడిన పవన కళ్యాణ్ తన అన్న మెగాస్టార్ చిరంజీవిని మోసం చేసారని ఆరోపించారు.   చిరంజీవిని మోసం చేసిన వారిని జీవితంలో మరవనన్నారు. సమాజానికి మంచి చేయాలనే సదుద్దేశంతో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన ఒక మెగాస్టార్ ను కూడా... చిల్లర రాజకీయాలకు బలి చేశారని పవన్ ఆరోపించారు. చిరంజీవి గారికి చేసిన ద్రోహం కంటే.. ఒక కొత్త మార్పుకు చేసిన ద్రోహం ఎప్పటికీ క్షమించనని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంచి మార్పు జరగాల్సి వుండగా ప్రజారాజ్యం పార్టీని నామరూపాలు లేకుండా చేశారని, అది తలుచుకుంటే నేను కొన్ని సందర్భాల్లో నిస్సహాయతతో ఒక్కడ్నే కూర్చుని ఏడుస్తానని పవన్ తెలిపారు.   తనకు ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధలేదని, కానీ అన్నయ్య చిరింజీవిని మోసం చేసిన వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని, అలాంటి ఉన్నతమైన వ్యక్తిని మోసగించిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పేలా యువత అంతా పని చేయాలని పవన్ పిలుపునిచ్చారు. కొన్నిదశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలుతున్న చిరంజీవిని స్వార్థం కోసం, చిన్న లబ్ది కోసం దెబ్బతీశారని, దెబ్బ తీసిన ఏ ఒక్కరినీ మరిచిపోలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.   మంచి చేయాలనుకున్న మెగాస్టార్ ను కూడా చిన్న కీటకాలు ఎలా తినేశాయో అలా తినేశారు. చిరంజీవి గారికి ద్రోహం చేసిన వాళ్లని కొడితేనో, తిడితేనో సరిపోదు. వాళ్లకు చెప్పుతో కొట్టినట్లు చేసి చూపించాలనేదే జనసేన పార్టీ సిద్దాంతం అన్నారు. ఆ దిశగా యువత ప్రతి ఒక్కరూ పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు. Last Updated 25, Mar 2018, 11:56 PM IST
0business
Jan 05,2016 డాగ్‌స్పాట్‌.ఇన్‌లో రతన్‌ పెట్టుబడులు         న్యూఢిల్లీ: అంకుర సంస్థలలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా తన పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ పెట్‌కేర్‌ పోర్టల్‌ 'డాగ్‌స్పాట్‌.ఇన్‌లో'పెట్టుబడులు పెట్టారు. పెంపుడు జంతువుల సంరక్షణ, వాటికి కావాల్సిన అన్ని వస్తువులను ఈ పోర్టల్‌ విక్రయిస్తుంది. అయితే టాటా తమ సంస్థలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారో ఆ పోర్టల్‌ వెల్లడించలేదు. తమ సంస్థలు రోనీ స్క్రూవాలా, అశోక్‌ మిట్టల్‌, రిషి పార్ధి, ధీరజ్‌ జైన్‌, అబిజీత్‌ పారు తదితరులు పెట్టుబడులు పెట్టారని డాగ్‌స్పాట్‌.ఇన్‌ సీఈఓ రాణా అథేయా తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Highlights భారీగా తగ్గిన బంగారం ధర, పసిడి బాటలోనే  వెండి కూడా.. పసిడి ధర ఈరోజు భారీగా పడిపోయింది. నేటి బులియన్ మార్కెట్ లో  రూ.365 తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ. 30,435కి చేరుకుంది. స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ క్షీణించడం, గ్లోబల్‌గా ఈ విలువైన మెటల్‌కు సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో బులియన్‌ మార్కెట్‌లో ధరలు క్షీణించినట్టు బులియన్‌ ట్రేడర్లు చెప్పారు. బంగారంతో పాటు వెండి ధరలూ స్వల్పంగా తగ్గాయి.  పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ కాస్త తగ్గడంతో, కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి రూ.40 వేల కింద రూ.39 వేలుగా రికార్డైంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచడంతో డాలర్‌ బలపడింది. దీంతో ఈ విలువైన మెటల్‌కు అంతర్జాతీయంగానూ డిమాండ్‌ తగ్గింది.  అంతర్జాతీయ మార్కెట్లో 0.65 శాతం పడిపోయి ఔన్స్‌  బంగారం 1,215.50 డాలర్లుగా నమోదైంది. బలహీనమైన గ్లోబల్‌ ట్రెండ్‌తో పాటు, దేశీయంగా ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 365 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,435, రూ.30,285గా నమోదయ్యాయి. కాగా, నిన్న బంగారం ధర రూ.150 పెరిగిన సంగతి తెలిసిందే.   Last Updated 2, Aug 2018, 4:43 PM IST
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV బంగ్లా 306 లక్ష్యాన్ని ఊదేసిన ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఇంగ్లాండ్ అవతరించింది. TNN | Updated: Jun 1, 2017, 11:19PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య ఇంగ్లాండ్ బోణి కొట్టింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 306 పరుగుల లక్ష్యాన్ని జో రూట్ (133 నాటౌట్ : 129 బంతుల్లో 11x4, 1x6) అజేయ శతకం బాదడంతో ఇంగ్లాండ్ మరో 16 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. జట్టులో ఓపెనర్ జేసన్ రాయ్ (1) విఫలమైనా.. రూట్‌తో పాటు అలెక్స్ హేల్స్ (95: 86 బంతుల్లో 11x4, 2x6), కెప్టెన్ మోర్గాన్ (75 నాటౌట్: 61 బంతుల్లో 8x4, 2x6) నిలకడగా ఆడటంతో ఇంగ్లాండ్ 308/2తో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఇంగ్లాండ్ అవతరించింది. అంతకముందు తమీమ్ ఇక్బాల్ (128: 142 బంతుల్లో 12x4, 3x6) శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌తో 2013లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఛేదించిన 294 పరుగులే ఇప్పటి వరకు టోర్నీలో భారీ లక్ష్యఛేదన. తాజాగా ఇంగ్లాండ్ జట్టు ఆ రికార్డును తుడిచిపెట్టేసింది. టోర్నీలో భాగంగా రెండో మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మధ్యాహ్నం జరగనుంది.
2sports
Suresh 117 Views gold rates న్యూఢిల్లీ: నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి,రూ.29వేలకు చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక తయారీదారుల నుంచి డిమాండ్‌ ఉండటమే దీనికి కారణామని బులియన్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో శనివారం నాటికి ట్రేడింగ్‌లో రూ. 29,050కి చేరింది. మరోపక్క వెండి ధర కూడా 38వేల మార్కును దాటింది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV విశాఖ విజయం మనదే.. వన్డే సిరీస్ కైవసం భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల క్రికెట్ సిరీస్ విజేతగా టీమిండియా నిలిచింది. TNN | Updated: Oct 29, 2016, 10:01PM IST విశాఖ విజయం మనదే.. వన్డే సిరీస్ కైవసం భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల క్రికెట్ సిరీస్ విజేతగా టీమిండియా నిలిచింది. విశాఖపట్టణంలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచులో భారత్ 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ కు ముందు తలా రెండేసి మ్యాచుల్లో విజయం సాధించిన భారత్ కివిస్ జట్లు సమఉజ్జీలుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో విశాఖ మ్యాచ్ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దానికి కయాంత్ తుపాను భయం తోడయ్యింది. తుపాను వల్ల మ్యాచ్ రద్దవుతుందని అంతా భావించారు. కానీ, చివరకు తుపాను ముప్పు తప్పడంతో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 270 పరుగుల విజయ లక్ష్యాన్ని కివిస్ జట్టుకు నిర్ధేశించింది. బ్యాటింగుకు దిగిన కివిస్ ఆటగాళ్లు పేలవమైన ఆటతీరును ప్రదర్శించారు. దీంతో కేవలం 23.1 ఓవర్లలోనే కివిస్ భారత జట్టుకు దాసోహమంది. ఈ మ్యాచులో కివిస్ జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు డకౌట్లయ్యారు.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV కంగనా హృతిక్ తో డేట్ చేస్తోందా? కంగనా రనావత్, హృతిక్ రోషన్ లు ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంత ప్రేమలో మునిగిపోయారా? TNN | Updated: Sep 10, 2015, 06:11PM IST కంగనా రనావత్, హృతిక్ రోషన్ లు ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంత ప్రేమలో మునిగిపోయారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ కథనాలు. ఆజానుబాహుడై కండలు తిరిగిన శరీరంతో ఉండే హృతిక్ ను అంతా గ్రీక్ దేవుడంటూ ఉంటారు. కంగనాను కూడా అంతే. బాలీవుడ్ రాణుల్లో ఒకర్తయిపోయిందీమె ఇప్పుడు. భార్యతో విడాకులు తీసుకున్న తరువాత హృతిక్ ఇప్పుడు ఒంటరి జీవితాన్నే జీవిస్తున్నాడు. ఇటు కంగనా కూడా బ్యాచులరెట్టే. సో ఒక మంచి ముహూర్తంలో ఈ ఇద్దరికీ జోడీ కుదిరిందిట. కంగనా, హృతిక్ ఇద్దరు కలిసి క్రిష్-3లో కనిపించారు. ఆ సమయంలో హృతిక్ కాపురం బాగానే ఉంది. తన భార్య సుసాన్నేతో గత ఏడాది నవంబరులో విడాకులు తీసుకున్నాడు. విడాకుల తరువాత కంగనాతో డేటింగ్ చేస్తున్నట్లున్నావేమిటీ అని అడిగిన ప్రశ్నలకు చాలా తెలివిగానే ఇటీవల బదులిచ్చాడు.
0business
కూతురితో ఆమిర్ ఖాన్ ఫోటో.. అసభ్యకరంగా ఉందంటూ కామెంట్లు! Highlights బాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఆమిర్ ఖాన్. వివాదాలకు  బాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఆమిర్ ఖాన్. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే ఈ హీరో తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో కారణంగా విమర్శలపాలవుతున్నాడు. తన కూతురి ఈరాఖాన్ తో కలిసి పార్క్ లో దిగిన ఫోటోను ఆమిర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. కుమార్తెతో కలిసి ఇలాంటి ఫోటోలు ఎలా తీసుకుంటారు.. అది కూడా పవిత్రమైన రంజాన్ మాసంలో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ఒక ముస్లిం అయిన నువ్వు రంజాన్ మాసంలో ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుండాలి.. రంజాన్ సందర్భంలోనైనా మంచి బట్టలు ధరించాలి అంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఆమిర్ ను సపోర్ట్ చేస్తూ.. 'ప్రపంచంలోనే బెస్ట్ రిలేషన్షిప్ ఇది.. తండ్రి కుమార్తెల ప్రేమకు చిహ్నమిది.. ఒక తండ్రి ఎదిగే తన కూతురితో ఆడుకోకుడదా..? ఈ ఫోటోలో కూతురికి బదులు కొడుకు ఉంటే ఇలానే అనేవారా..? అంటూ ప్రశ్నించారు.   Last Updated 31, May 2018, 11:18 AM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV తనుశ్రీ వివాదం.. ‘బిగ్‌బాస్’ నిర్వాహకులకు వార్నింగ్! తనుశ్రీ వివాదం రోజు రోజుకు ముదిరిపోతోంది. ఆమె చేసిన ఆరోపణలపై రాజ్‌థాకరేకు చెందిన ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Samayam Telugu | Updated: Oct 3, 2018, 09:22PM IST తనుశ్రీ వివాదం.. ‘బిగ్‌బాస్’ నిర్వాహకులకు వార్నింగ్! బాలీవుడ్ నటులు తనుశ్రీ, నానా పటేకర్ వివాదం బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. నానా పటేకర్‌పై తనుశ్రీ లైంగిక ఆరోపణలు చేయడమే కాకుండా తనపై రాజ్‌థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ( ఎంఎన్ఎస్ ) పార్టీ అనుచరులు తనపై దాడి చేశారని తెలిపింది. దీంతో, ఎంఎన్‌ఎస్ పార్టీ కార్యకర్తలు తనుశ్రీపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనుశ్రీ త్వరలో తన సోదరి ఇషితా దత్తాతో కలిసి హిందీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్’ షోలో ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఎంఎన్‌ఎస్ పార్టీకి చెందిన యూత్ సెల్ ప్రతినిధులు లొనవ్లాలోని ‘బిగ్‌బాస్ -12’ నిర్వాహకులను కలిసి తనుశ్రీని వారి షోలోకి తీసుకోరాదని డిమాండు చేశారు. తమ హెచ్చరికలు లెక్కచేయపోతే హింస చెలరేగే అవకాశం ఉందని తెలిపారు. Youth wing of Maharashtra Navnirman Sena (MNS) today handed over a letter to Bigg Boss makers at the show's Lonaval… https://t.co/Ou58PLuc01 — ANI (@ANI) 1538557289000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 16, Aug 2018, 3:05 PM IST Highlights ఇప్పటివరకు స్టూడెంట్ గా, లెక్చరర్ గా కనిపించిన ఈ హీరోగారు ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో దర్శనమివ్వబోతున్నాడట. దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందించనున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు విజయ్ దేవరకొండ తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ క్లబ్ లో చేరిపోయాడు. అర్జున్ రెడ్డితో విజయ్ కి ఏర్పడిన ఫాలోయింగ్ మామూలుది కాదు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక రీసెంట్ గా 'గీత గోవిందం' సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. సినిమా సినిమాకు తన పాత్రల మధ్య వేరియేషన్ చూపిస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తోన్న ఈ హీరో తదుపరి సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనే విషయంలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు స్టూడెంట్ గా, లెక్చరర్ గా కనిపించిన ఈ హీరోగారు ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో దర్శనమివ్వబోతున్నాడట. దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందించనున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు విజయ్ దేవరకొండ. కథ ప్రకారం హీరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా కనిపించనుందని టాక్. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ఈ లవ్ స్టోరీ సెట్స్ పైకి వెళ్లనుంది.  Last Updated 9, Sep 2018, 12:23 PM IST
0business
వంటగదిలో ఎక్కువగా గడిపేది మనమే.. వారానికి సగటున 13.2 గంటలు అక్కడే - ఇండోనేషియన్లకు వంటంటే మిక్కిలి మక్కువ - తక్కువగా ఇష్టపడేది దక్షిణ కొరయన్లు - జీఎఫ్‌కే అధ్యనంలో వెల్లడి ముంబయి: భారతీయులు వంట విషయంలో బాగా ఆసక్తిగా వ్యవహరిస్తారని ఒక అధ్యయనంలో తేలింది. ఇక్కడి వినియోగదారులు రుచికి పెద్దపీట వేస్తూ వంట వండేందుకు గాను.. వారానికి సగటున 13.2 గంటల సమయాన్ని వెచ్చిస్తారని జీఎఫ్‌కే సంస్థ తన తాజా అధ్యయనంలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థాలు, వంటగదిలో అత్యధిక సమయం గడిపే వినియోగదారుల విషయమై 22 దేశాలలో జీఎఫ్‌కే సంస్థ అధ్యయనం నిర్వహించగా అందులో మన భారతీయులదే అగ్రస్థానమని తేలింది. ఈ వంట అధ్యయనంలోని ఇతర ఆసక్తికర విషయాలు.. - ఇండేనేషియన్లు వంట వండే విషయంలో ఎక్కువ మక్కువ కనబరుస్తారు. - ఈ విషయంలో వీరిదే అగ్రస్థానం. - ఇండోనేషియన్లు రుచికరమైన వంటను వండడాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, ఎక్కువ మక్కువ చూపుతారని అధ్యయనం తేల్చింది. ఈ విషయంలో అయిదు ఆసియా పసిఫిక్‌ మార్కెట్లలోకి వీరిదే అగ్రస్థానం. అంతర్జాతీయంగా చూస్తే ఇండోనేషియన్లు నాలుగో స్థానంలో ఉన్నారు. - ప్రపంచంలోని మొత్తం వయోజన జనాభాలో సగం మంది వినోదం కోసం వారానికి ఒక మారు వంట చేయడానికి ఇష్టపడతారు. - ఆహర తయారీ వండే విషయంలో ఇటలీ, దక్షిణాప్రికన్లు ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. - మన ఆసియా ప్రాంతంలోని ఇండోనేషియన్లలో దాదాపు 40 శాతం మంది ఆహార పదార్థాలు, వంటకం విషయం మక్కువ చూపుతారు. ఆ తదుపరి స్థానంలో భారత(39%), చైనా(32%), అస్ట్రేలియా(24%) దేశాలకు చెందిన వినియోగదారులు ఉన్నారు. - ఆహరం తయారీ వండే విషయంలో దక్షిణ కొరియన్లు అంత ఎక్కువ ఆసక్తి కనబరచరు. - భారతీయుల తరువాత యుక్రేన్‌ దేశీయులు ఎక్కువ సమయం వంట గదిలో గడుపుతుంటారు. - ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఉండే భారత సంతతి వారిలో ఆడవారి కంటే మొగవారే ఎక్కువ సమయం వంటగదిలో గడుపుతారు. రుచుకరమైన ఆహారం తయారు చేసుకొనేందుకు గాను వీరు సగటున దాదాపు ఆరు గంటలకు పైగానే సమయాన్ని వెచ్చిస్తారు. - రుచికరమైన ఆహారం తయారీకి భారత సంతతి వారి తరువాత చైనీయులు, ఇండోనేషియన్లు (4.8 గంటలు) ఎక్కువ సమయం వంటగదిలో గడుపుతుంటారు. - భారత్‌, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలలోని మహిళలు సగటున వారానికి వరుసగా 14.2, 9, 7 గంటల సమయాన్ని వెచ్చిస్తుంటారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
AzimPremji ఆదిత్యబిర్లా కేపిటల్‌లో ప్రేమ్‌జీ ‘ఇన్వెస్ట్‌! ముంబయి,జూలై 5: విప్రోసంస్థల అధినేత అజీమ్‌ప్రేమ్‌జీ ఆదిత్యబిర్లా కేపి టల్‌లో రూ.703 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. దీనితో గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఒక్కసారిగా 52 వారాల గరిష్టస్థాయికి చేరాయి. విప్రోఛైర్మన్‌ అజీమ్‌ప్రేమ్‌జీ ఆదిత్యబిర్లాగ్రూప్‌లో 2.2శాతం వాటాలను కొనుగోలుచేసారు. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ ఈ సంస్థలో 703 కోట్లు పెట్టు బడులు పెట్టింది. ఈ కొనుగోలు సమాచారంతో ఎన్‌ఎస్‌ఇలో ఉన్న స్టాక్‌ ఒక్క సారిగా 1290.10 రూపాయలకు చేరిం ది. ఇంట్రాడేలో 1294.10 రూపాయ లుగా ఉంది. 0.83శాతం ముందురోజు కంటే పెరిగినట్లు అంచనా. ఆదిత్యబిర్లా క్యాపిటల్‌ మొత్తం 4.84 కోట్ల షేర్లను 145.40 రూపాయలు వంతున ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ప్రైవేటు ఇన్వెస్టర్ల అవకాశాల ఫండ్‌వన్‌ కింద కేటాయిం పులు జరిపింది. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ఈ సమాచారాన్ని స్టాక్‌ ఎక్ఛేంజిలకు సైతం నివేదించింది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సంస్థ నిర్వహించిన ఆదిత్యబిర్లా కేపిటల్‌ మార్కె ట్‌ విలువలు 32 వేల కోట్లుగా అంచనా వేసింది. అజీమ్‌ప్రేమ్‌జీ ఆధ్వర్యంలోని ప్రైవేటు ఈక్విటీఫండ్‌ బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత పోర్టుఫోలియోను నిర్వహిస్తోం ది. ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ సుమారు 40కిపైగా జాబితా అయిన ప్రైవేటు కంపె నీల్లో పెట్టుబడులు పెట్టింది. అయితే కంపెనీ కార్యకలాపాలను మాత్రం గోప్యంగానే ఉంచుతోంది. ప్రజా బాహుళ్యంలోకి వచ్చేందుకు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ ఎక్కువ ఆసక్తి చూపించడంలేదని తేలింది. ఆదిత్యబిర్లా కేపిటల్‌ అంతకు ముందు తన అనుబంధ కంపెనీలయిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఆదిత్యబిర్లా నువోలతో ఒక ఒప్పందానికి వచ్చింది. గ్రాసిమ్‌ను ఆదిత్యబిర్లానువోలో విలీనం చేసి మొత్తం ఆర్థికసేవల బిజినెస్‌ను ఆదిత్యబిర్లా కేపిటల్‌కు బదిలీ చేయాలనేది లక్ష్యంగా ఉంది. ఈ ఒప్పందం అమలయిన తర్వాత ఆదిత్య బిర్లా కేపిటల్‌ కంపెనీ గ్రూప్‌ జీవితబీమా, ఆరోగ్యబీమా అసెట్‌ మేనేజ్‌మెంట్‌, ప్రైవేటు ఈక్విటీ, కార్పొరేట్‌ రుణపరతి, వ్యూహాత్మక పరపతి, బ్రోకింగ్‌, వెల్త్‌మేనేజ్‌మెంట్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ వ్యాపారాలను పర్య వేక్షిస్తుంది. మొత్తం మీద ఐటిరంగంలో మూడో అతిపెద్ద కంపెనీగా ఉన్న విప్రో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ తన సొంత పెట్టు బడులను విభిన్నరంగాలకు విస్తరిస్తున్నట్లు స్పష్టం అవు తున్నది. ఇప్పటికే తనకు ఉన్న 100 కోట్ల డాలర్ల నిధుల నుంచి వృద్ధి అవకాశం ఉన్న కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా మరింతగా తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఒప్పందంతో ఆదిత్యబిర్లా కంపెనీల జోరు కూడా మరింతగా కొనసాగుతున్నది. స్టాక్‌ మార్కెట్లలో గ్రాసిమ్‌ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.
1entertainment
Hyderabad, First Published 11, Oct 2019, 11:29 AM IST Highlights మీరా మిథున్ తమిళనాడు ప్రభుత్వంపై ఊహించని విధంగా ఆరోపణలు చేశారు. ఒకానొక సమయంలో పోలీసుల వైఖరికి మనోవేదనకు గురయ్యానని చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు ఇటీవల ఆమె తరచు పలు వివాదాలతో చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి కూడా వెలివేయాల్సి వచ్చింది. సూర్య గ్యాంగ్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించిన మీరా మిథున్ తమిళనాడు ప్రభుత్వంపై ఊహించని విధంగా ఆరోపణలు చేశారు. ఒకానొక సమయంలో పోలీసుల వైఖరికి మనోవేదనకు గురయ్యానని చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు ఇటీవల ఆమె తరచు పలు వివాదాలతో చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి కూడా వెలివేయాల్సి వచ్చింది.   గతంలో బ్యూటీ కంటెస్టెంట్ లో గెలుపొందిన ఆమె అవార్డును కూడా వివాదాల కారణంగా వెనక్కి తిరిగి ఇచ్చేశారు. అందాల పోటీల కోసం కొంతమంది మహిళల వద్ద డబ్బు తీసుకొని మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కారణంగా మిస్‌ సౌత్‌ ఇండియా బ్యూటీ అవార్డు వెనక్కి తీసుకున్నారు. హత్య బెదిరింపు కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.   "తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయి. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం ఉక్కు మహిళ మృతి తర్వాత రాష్ట్రంలో చాలావరకు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజకీయ నాయకులకు చదువుకున్న అర్హత తప్పనిసరిగా ఉండాలి. మహిళలపై అకృత్యాలు వేధింపులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో పోలీసులు క్రిమినల్స్ తో స్నేహం చేస్తున్నారు. నేను చేసిన పిర్యాదులు కమిషనర్ తో పాటు ఏ పోలీస్ కూడా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది" అని మీరా వివరణ ఇచ్చారు. Last Updated 11, Oct 2019, 11:55 AM IST
0business
PULSES ఖరీఫ్‌లో పెరిగిన పప్పుదినుసుల ఆయకట్టు న్యూఢిల్లీ,జూలై 10: దేశవ్యాప్తంగా పప్పుదినుసులసాగు 23శాతం పెరిగింది. ఏటికేడాదిచొప్పున సాగులో ఆయకట్టు పెరగడంవెనుక ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు సకాలంలో రావడం, దేశమంతటా విస్త రించడమే కీలకమని ఖరీఫ్‌ రైతులు చెపుతున్నారు. గత ఏడాది 3.59 మిలియన్‌ హెక్టార్లు సాగుచేస్తే ఈ ఏడాది ఖరీఫ్‌సీజన్‌లో పప్పుదినుసులు 4.41 మిలియన్‌ హెక్టార్లలో సాగుచేసారు. గిట్టుబాటు ధర లు లేవని రైతుల ఆందోళనల కారణంగా ఈసారి పప్పుదినుసుల సాగు తగ్గుతుందన్న అంచనాలకు భిన్నంగా సాగు ఆయకట్టుపెరిగింది. ఖరీఫ్‌ పంటల సాగు గత ఏడాదితో పోలిస్తే తొమ్మిదిశాతం పెరిగిం ది. 40.4 మిలియన్‌ హెక్టార్లుగా ఉంది. అంతకు ముందు ఏడాది 37.12మిలియన్‌ హెక్టార్లనుంచి తొమ్మిది శాతం పెరిగిందనే చెప్పాలి. ఇక వరి పరంగా చూస్తే ఆరుశాతం పెరిగి ఎనిమిది మిలియన్‌ హెక్టార్లలో సాగయింది. ఖరీఫ్‌ సాగు సాధారణంగా నైరుతి రుతుపవనాలతో ప్రారంభం అవుతుంది. జూలై నుంచి జోరుగా సాగవుతుంది. వరి, కంది, పెసర, మినుములు, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు విత్తనాలు, పత్తి వంటివి ప్రధాన పంటలుగా సాగవుతాయి. ఇక తృణ ధాన్యాల పరంగా చూస్తే 8.08 మిలియన్‌ హెక్టార్లుగా ఉం టాయి. అంతకుముందు 7.01 మిలియన్‌ హెకార్ల లో సాగుచేసారు. నూనె గింజల సాగు కూడా 6.95 మిలియన్‌ హెక్టార్ల నుంచి 7.28 మిలియన్‌ హెక్టార్లకు పెరిగింది. ఇక వాణిజ్యపంటల పరంగా చూస్తే చెరకు సాగు 4.52 మిలియన్‌ హెక్టార్లనుంచి 4.79మిలియన్‌ హెక్టార్లకు పెరిగింది. పత్తి సాగు 6.79 మిలియన్‌ హెక్టార్ల నుంచి 7.18మిలియన్‌ హెక్టార్లకు చేరితే జనపనార 6.95 లక్షల హెక్టార్లలో సాగయింది. గత ఏడాది 7.27 లక్షల హెక్టార్లతో పోలిస్తే తగ్గింది. ఇక రుతుపవనాలు సకాలంలో రావడంతో ప్రభుత్వం కూడా ఉద్యానవనపంటల దిగుబడులు కూడా పెరుగుతాయని అంచనా వేస్తోంది. జూన్‌నెలలో నాలుగుశాతం అధికంగా వర్షపాతం నమోదయింది. మొత్తంగా చూస్తే నైరు తి రుతుపవనాలు జూన్‌లో 52శాతం అదనంగా వర్షాలు అందించాయి. మధ్యభారత్‌లో ఐదుశాతం అదనంగా వర్షపాతం నమోదయింది. తూర్పుప్రాం తం, ఈశాన్యప్రాంతంలో 18శాతం తక్కువ ఉంది.
1entertainment
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో.. - బంగ్లాతో భారత్‌ తొలి టీ20 నేడు - మిడిల్‌ ఆర్డర్‌ కూర్పుపై రోహిత్‌ దృష్టి - బంగ్లాదేశ్‌కు లెక్కలేనన్ని సమస్యలు! నవతెలంగాణ-న్యూఢిల్లీ 2020 టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాన్ని టీమ్‌ ఇండియా మళ్లీ మొదలు పెట్టనుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ నేడు న్యూఢిల్లీ టీ20తో షురూ కానుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితిలో కొనసాగుతుండగా.. బలమైన భారత్‌ను ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్‌ సమాయత్తం అవుతోంది. విరాట్‌ కోహ్లి లేని వేళ రోహిత్‌ శర్మ మరోసారి నాయకత్వ బాధ్యతలు పోషించనున్నాడు. షకిబ్‌ అల్‌ హసన్‌పై వేటుతో మహ్మదుల్లా బంగ్లా బెబ్బులి సారథ్యం తీసుకోనున్నాడు. భారత్‌, బంగ్లాదేశ్‌ ఎనిమిది టీ20ల్లో ముఖాముఖి తలపడ్డాయి. అన్నింటా టీమ్‌ ఇండియా జయకేతనం ఎగురవేసింది. 2016 టీ20 ప్రపంచకప్‌ క్వార్టర్‌ఫైనల్లో బంగ్లాదేశ్‌ ధోనీసేనకు ఓటమి భయాన్ని రుచి చూపించింది. ఆ మ్యాచ్‌లో స్టార్‌ ఫర్‌ఫార్మర్‌ మహ్మదుల్లా నేడు కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌ను గెలుపు దిశగా నడిపించేందుకు సిద్ధమయ్యాడు. భారత్‌, బంగ్లాదేశ్‌ తొలి టీ20 నేడు. మిడిల్‌లో మార్పులు : పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత్‌ను మిడిల్‌ ఆర్డర్‌ సమస్య వేధిస్తోంది. టాప్‌ ఆర్డర్‌ బలోపేతంగా ఉన్నప్పటికీ మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ ఆర్డర్‌లో నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌కు కరువయ్యారు. 2020 టీ20 ప్రపంచకప్‌కు ముందు ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని భారత్‌ కృత నిశ్చయంతో ఉంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గైర్హాజరీలో నం.3లో కెఎల్‌ రాహుల్‌కు అవకాశం దక్కనుంది. యువ ఆటగాడు సంజూ శాంసన్‌ సైతం టాప్‌ ఆర్డర్‌లో కోహ్లి స్థానం కోసం పోటీపడుతున్నాడు. ముంబయి ఆల్‌రౌండర్‌ శివం దూబె అంతర్జాతీయ అరంగ్రేటం ఖాయంగా కనిపిస్తోంది. హార్ధిక్‌ పాండ్య స్థానాన్ని భర్తీ చేసేందుకు శివం దూబె ఢిల్లీ టీ20తో రానున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో బంతిపై ధనాధన్‌ విరుచుకుపడే స్వభావం దూబె చూపించాడు. పేస్‌ బౌలింగ్‌తో బంతితోనూ జట్టుకు ఉపయుక్తుడు. మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్‌ రాకతో రాహుల్‌ చాహర్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సి రావచ్చు. దీపక్‌ చాహర్‌తో కలిసి పేస్‌ బాధ్యతలు పంచుకునేందుకు షార్దుల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌ పోటీ పడుతున్నారు. టాప్‌ ఆర్డర్‌లో శిఖర్‌ ధావన్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాయకుడిగా గతంలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌లో బాదాడు. రోహిత్‌ క్రీజులో నిలదొక్కుకుంటే అతడిని ఆపటం బంగ్లా బౌలర్ల తరం కాదనే చెప్పాలి. యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మరోసారి ఆసక్తికర చర్చకు వేదిక కానున్నాడు. ధోని వారసుడిగా, అపార ప్రతిభాశాలీగా రిషబ్‌ పంత్‌ అంచనాలను అందుకోవాల్సి ఉంది. సమస్యల నిలయం బంగ్లా! : తొలి టీ20 ముంగిట బంగ్లాదేశ్‌ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. బంగ్లా సూపర్‌ స్టార్‌, మాజీ కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ సస్పెన్షన్‌ కారణంగా ఆఖరు నిమిషంలో భారత పర్యటనకు దూరమయ్యాడు. సీనియర్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ అందుబాటులో లేడు. వన్డే కెప్టెన్‌ మష్రపె మొర్తాజా టీ20ల నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. మహ్మద్‌ సైఫుద్దీన్‌ వెన్నునొప్పితో దూరమయ్యాడు. మూడేండ్ల క్రితం చివరి టీ20 ఆడిన అరాఫత్‌ సన్నీ, ఆల్‌ ఆమీన్‌ హుస్సేన్‌లు కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ సమయంలో బంగ్లాదేశ్‌ బాధ్యతలు పూర్తిగా మహ్మదుల్లా, ముష్ఫీకర్‌ రహీమ్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌లపై పడింది. 2016 టీ20 ప్రపంచకప్‌ క్వార్టర్‌ఫైనల్లో మహ్మదుల్లా భారత్‌పై గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ అంతిమ విజయం దక్కలేదు. ఇప్పుడు కెప్టెన్‌గా భారత గడ్డపై తొలి టీ20 విజయంపై మహ్మదుల్లా పట్టుదల చూపించే అవకాశం ఉంది. ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడి అనుభవం గడించాడు. భారత పిచ్‌లపై ముస్తాఫిజుర్‌ అనుభవం బౌలింగ్‌ బృందానికి పనికొస్తుంది. సొంత సమస్యలతో సతమతం అవుతున్న బంగ్లాదేశ్‌, ఢిల్లీలో బలమైన భారత్‌కు సవాల్‌ విసరటం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. పిచ్‌ రిపోర్టు : దీపావళి బాణాసంచా కాలుష్యంతో న్యూఢిల్లీలో ప్రస్తుతం ఆరోగ్య అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. శుక్రవారంతో పోల్చితే గాలి నాణ్యత 484 నుంచి 407కు మెరుగుపడింది. అయినా, ప్రమాదకర స్థాయిలోనే ఉంది. నేడూ అదే పరిస్థితి కొనసాగే వీలుంది. ఆస్ట్రేలియాతో గత టీ20లో ఇక్కడ మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ స్పిన్‌కు సహకారం లభించింది. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు పిచ్‌ పచ్చికతో కనిపించింది. సీమర్లకు మెరుగైన సహకారం లభించినా.. బ్యాటింగ్‌కు అనువుగా ఉందని చెప్పవచ్చు. తుది జట్లు (అంచనా) : భారత్‌ : రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కెఎల్‌ రాహుల్‌, శ్రేయాష్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, శివం దూబె, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వెంద్ర చాహల్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌. బంగ్లాదేశ్‌ : లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, మహ్మద్‌ నయీం, ముష్ఫీకర్‌ రహీమ్‌, మహ్మదుల్లా, మొసద్దెక్‌ హుస్సేన్‌, అసిఫ్‌ హుస్సేన్‌, అరాఫత్‌ సన్నీ, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, ఆల్‌ ఆమీన్‌ హుస్సేన్‌, అబు హైదర్‌. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
2sports
మెగా, నందమూరి అభిమానులకు షాకిస్తున్న ఉపాసన,బ్రాహ్మణి Highlights మెగా కోడలు ఉపాసన ట్వీట్ తో సోషల్ మీడియాలో రచ్చ బ్రాహ్మణి తనకు మంచి స్నేహితురాలంటున్న ఉపాసన దీంతో షాక్ కు గురైన మెగా, నందమూరి అభిమానులు ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసిన ఫోటోతో రాజమౌళి రచ్చ తెలుగు సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ వార్ కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా.. అనే పోటీ సాగుతూనే వుంది. ఈ పోటీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్లతోపాటు అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలు కూడా వార్ గ్రౌండ్ లో దిగుతున్నా.. మెయిన్ లీడ్ మాత్రం మెగా, నందమూరి ఫ్యామిలీలదే. దీనికి కారణం లేకపోలేదు. మాసెస్ లో మెగాఫ్యామిలీకున్న ఫాలోయింగ్ తర్వాత నందమూరి ఫ్యామిలీ హీరోలకే వుంది.  దీంతో ఈ రెండు బ్రాండ్స్ మధ్యనే బాక్సాఫీస్ వార్ ఎక్కువ.   తాజాగా ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డుల జాబితాలో కూడా మెగా హీరో అల్లు అర్జున్ నటించిన సినిమాల గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. గతంలో మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీకి కూడా అదే తరహాలో నంది అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందనేది అప్పట్లో బాగానే వినిపించింది. ముఖ్యంగా నంది అవార్డుల్లో మెగా  కుటుంబానికి అన్యాయం జరిగిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... మెగా కోడలు ఉపాసన, నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి ఇచ్చిన షాక్ హాట్ టాపిక్ గా మారింది.   నంది అవార్డుల రగడకు ఒక విధంగా  నందమూరి బాలకృష్ణ కారణం అని  మెగా అభిమానులు ఓ రేంజ్ లో మండి పడుతుంటే.. ఈ ఇద్దరు కుటుంబాలకు చెందిన  బ్రాహ్మణి, ఉపాసనలు ఒకరికొకరు ఎంతో ఆప్యాయతతో మెలగడం విశేషంగా మారింది.  వివరాల్లోకి వెళ్ళితే  ఇద్దరూ కలిసి నిన్న ఒకేచోట రక్తదానం చేసారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలసి తీయించుకున్న ఫోటోను  ఉపాసన  సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరం చాలా మంచి స్నేహితులం అని చెపుతూ..ఉపాసన భలే ట్విస్చ్ ఇచ్చింది. తామిద్దరం ఆనందంగా  సమయం గడిపామని చెప్తోంది.   టాప్  హీరోల మధ్య ఎట్టి పరిస్తితులలోను ఎటువంటి వైరుధ్యాలు ఉండవని కేవలం ఊహించుకుని టాప్ హీరోల అభిమానులే గాసిప్పులు సృష్టిస్తూ ఉంటారని లీకులు ఇస్తోంది ఉపాసన. ఇరు కుటుంబాల అభిమానులకు కూడ ఈ అంశం షాకింగ్ గా మారింది.   Bhramani & I spent a heartwarming afternoon donating blood. If you begin donating blood at age 18 &donate every 90 days until you reached 60, you would have potentially helped save more than 500 lives! #foodforthought #donateblood - it’s a very powerful & satisfying thing to do. pic.twitter.com/cZtKP2WUks — Upasana Kamineni (@upasanakonidela) November 18, 2017 Last Updated 25, Mar 2018, 11:56 PM IST
0business
ss rajamouli and k. vishwanath launched prasad’s creative mentors film & media school రాజమౌళి పక్కన కూర్చోవడం గర్వంగా ఉంది: కె.విశ్వనాథ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పక్కన కూర్చోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. TNN | Updated: Jan 18, 2018, 01:34PM IST దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పక్కన కూర్చోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. దీన్ని తనకిచ్చిన గౌరవంగా భావిస్తున్నాని చెప్పారు. రాజమౌళి ప్రతిభ, ఆయన సాధించిన విజయం చిన్న విషయం కాదని కొనియాడారు. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్రియేటివ్ మెంటర్స్ సంయుక్తంగా ‘ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిల్మ్ అండ్ మీడియా స్కూల్’ను స్థాపించారు. ఈ స్కూల్‌ను బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్ ప్రాంగణంలో నిర్మించారు. దీన్ని దర్శకుడు రాజమౌళి, కళాతపస్వి కె.విశ్వనాథ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాజమౌళి, కె.విశ్వనాథ్ ప్రసంగించారు. సినీ పరిశ్రమ విజయం వెనుక ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్ కృషి ఎంతో ఉందని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. గడిచిన 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ప్రసాద్ ల్యాబ్స్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ప్రసాద్ ల్యాబ్స్‌దని రాజమౌళి కొనియాడారు. ‘బాహుబలి’ సినిమాకు అవసరమైన కొత్త టెక్నాలజీకి సంబంధించిన మెషినరీ ప్రసాద్ ల్యాబ్స్‌లో లేకపోతే.. తమ సినిమా కోసం దాన్ని రెండు నెలల్లో ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు. ఈ విషయంలో సంస్థ యజమాని రమేష్ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
0business
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి ఏటీఅండ్‌టీ చేతికి టైమ్స్‌ వార్నర్‌! Sun 23 Oct 03:54:25.860565 2016 న్యూయార్క్‌: ప్రపంచ ప్రఖ్యాత మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ టైమ్‌ వార్నర్‌ను అమెరికా టెలికాం దిగ్గజ సంస్థ ఏటీఅండ్‌టీ చేజిక్కించుకోనుంది. అంతర్జాతీయ మీడియా దిగ్గజ సంస్థను జియో జోరు తగ్గింది! Sat 22 Oct 05:35:50.143291 2016 న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనంగా దూసుకు వచ్చిన రిలయన్స్‌ జియో సంస్థ జోరు తగ్గిందట! దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు అందిస్తున్న డేటా వేగంతో పోలిస్తే జియో అయిదో స్థానంలో 'బ్యాంకుల నుంచి నివేదిక కోరాం' Sat 22 Oct 05:35:54.746711 2016 న్యూఢిల్లీ: కొన్ని బ్యాంకులకు చెందిన డెబిట్‌ కార్డుల సమాచారం మాల్‌వేర్‌ ద్వారా తస్కరించబడడం పట్ల కేంద్ర ప్రభుత్వ సీరియస్‌ అయింది. ఈ వ్యవహారంపై రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియ 'విజయా బ్యాంక్‌ దూసుకుపోతోంది' Sat 22 Oct 05:36:00.757846 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఖాతాదారులకు మెరుగైన సేవలను అందిస్తూ దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో విజయా బ్యాంక్‌ దూసుకుపోతోందని ఆ బ్యాంకు హైదరాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ కె.ఎస్‌.సత్యన Sat 22 Oct 05:36:06.232437 2016 వాణిజ్యవిభాగం ఆద్యంతం ఊగిసలాటలోనే.. Sat 22 Oct 05:36:11.249565 2016 ముంబయి: గత కొన్ని సెషన్లుగా భారీ లాభాలను నమోదు చేస్తూ వస్తున్న దేశీయ మార్కెట్లు వారాంతంలో నష్టాలలో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 52.66 పాయింట్ల మేర కుంగి 28,077.18 పాయింట జీఎస్‌టీతో తిండికి తిప్పలే!! Fri 21 Oct 05:01:09.506008 2016 దేశంలో కొత్తగా అమలులోకి తీసుకురానున్న 'వస్తు సేవల పన్ను' (జీఎస్‌టీ) సామాన్యుని జీవితాన్ని మరింత భారంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిత 4 లాభాల్లో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ Fri 21 Oct 05:01:13.869331 2016 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌ రెండో త్రైమాసికానికి ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. రెండ సిమెంట్‌ ధరలు పెరగొచ్చు..! Fri 21 Oct 03:25:10.539378 2016 డిమాండ్‌ పుంజుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో సిమెంట్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పుష్పరాజ్‌ సింగ్‌ తెలిపారు. గురువారం ఆయన హై తెలంగాణలో అద్భుత సౌకర్యాలు: కేటీఆర్‌ Fri 21 Oct 05:01:20.415732 2016 తెలంగాణ అభివృద్ధిలో వైద్య పరికరాల విభాగం కీలకం రంగంగా మారనుందన్న విషయాన్ని రాష్ట్ర సర్కారు ఇప్పటికే గుర్తించి ఆ దిశగా పలు చర్యలు తీసుకున్నట్లుగా రాష్ట్ర ఐటీ, Fri 21 Oct 03:23:21.363572 2016 న్యూఢిల్లీ మెరుగైన సేవలకు కృషి Fri 21 Oct 05:02:03.120666 2016 గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాలలోనూ ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్‌ వ్యవస్థపై అవగాహనను పెంపొందించేందుకు 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' (ఎస్‌బీహెచ్‌) పలు కార్యక అనుకూల పవనాలతో లాభాలు Fri 21 Oct 05:02:09.294213 2016 దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం మరింత రాణించాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల పరిణామాలతో దేశీయ మార్కెట్లో బ్యాంకింగ్‌, లోహ రంగపు సూచీలు మంచి పనితీరును కనబరిచాయి. 31% వృద్ధిలో యెస్‌ బ్యాంకు Fri 21 Oct 05:02:14.576246 2016 ప్రయివేటు విత్త సంస్థ యెస్‌ బ్యాంకు 2016-17 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో 31.3 శాతం వృద్ధితో రూ.801.5 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాస జీఎస్టీతో రాష్ట్రాలకు నష్టం రూ.51 వేల కోట్లు Thu 20 Oct 05:17:31.183565 2016 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు సుమారు రూ. 51 వేల కోట్ల నష్టం జరుగుతుందని జీఎస్టీ కౌన్సిల్‌ ప్రాథమిక అంచనా వేసింది. రెండు రోజుల పాటు ఢ ధరలు పెంచిన టాటా మోటార్స్‌ Thu 20 Oct 05:17:38.337321 2016 ముంబయి : దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహనాల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు రూ.5000 నుంచి రూ.12,000 మధ్యలో ఉంటుందని మాల్యా విల్లాను ఎవ్వరూ కొనలేదు Thu 20 Oct 05:17:43.854967 2016 ముంబయి : బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ మాల్యాకు చెందిన విల్లాను కొనుగోలు చేయడానికి మళ్లీ ఎవరూ రాలేదు. ఎస్‌బీఐ టెల్కోలపై రూ.11 కోట్ల జరిమానా Thu 20 Oct 05:17:49.37645 2016 న్యూఢిల్లీ : రేడియేషన్‌ నిబంధనలను ఉల్లఘించిన టెలికం కంపెనీలపై ప్రభుత్వం రూ.10.8 కోట్ల జరిమాన విధించింది. 2016 జులై 31 వరకు టెలికం శాఖ మొత్తం 3.19 లక్షల బేస్‌ స్టేషన్లలో ఆరు లక్షల ఎస్‌బీఐ డెబిట్‌ కార్డులు బ్లాక్‌ Thu 20 Oct 05:18:58.823958 2016 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం : దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ అయినా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు చెందిన 6.25 లక్షల డెబిట్‌ కార్డులను నిలిపివేస్తు డిసెంబర్‌లో బౌమా కాన్‌ ప్రదర్శన Thu 20 Oct 05:18:03.027914 2016 హైదరాబాద్‌ : బౌమా కాన్‌ఎక్స్‌ఫో ఇండియా 2016 నాలుగోవ ఎడిషన్‌ను గురుగ్రామ్‌ హుడా గ్రౌండ్స్‌లో నిర్వహి స్తున్నట్టు బౌమా కాన్‌ఎక్స్‌పో ఇండియా సీఈఓ ఐగోర్‌ పాల్క తెలిపారు. డిసె వాల్వోలైన్‌ అంబాసీడర్‌గా కోహ్లీ Thu 20 Oct 05:17:56.054816 2016 ముంబయి : వాల్వోలిన్‌ కుమిన్స్‌ ఇండియా బ్రాండ్‌ అంబాసీడర్‌గా ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ నియమితులయ్యారు. దీంతో కోహ్లీ ఆ కంపెనీ విక్రయించే ఇంజిన్‌ ఆయిల్‌, ల్యూబ్రికెంట విపణిలోకి బీఎండబ్ల్యూ 3జీటీ Thu 20 Oct 02:15:37.638267 2016 న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ 3జీటీ కార్లలో ఫేస్‌ లిప్ట్‌ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త కారు ది స్పోర్ట్స్‌ ప్రారంభ ధర రూ.43.30 రూ.259కే ఎయిర్‌టెల్‌ 10జీబీ డేటా Thu 20 Oct 02:14:57.674491 2016 న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో రాకతో టెల్కోల మధ్య రోజు రోజుకు వేడి పెరుగుతోంది. తాజాగా భారతీ ఎయిర్‌టెల్‌ కొత్తగా 4జీ మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.259కే పద మార్కెట్లకు అనూహ్య దీపావళి! Wed 19 Oct 06:29:37.43969 2016 ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు దీపావళి పండుగకు ముందే వెలుగులను విరజిమ్మాయి. వివిధ పరిణామాల నేపథ్యంలో మంగళవారం మార్కెట్లు అనూహ్య ర్యాలీని నమోదు చేశాయి.పలు అంతర్జాతీయ, జా ట్రయంఫ్‌ నుంచి రూ. 7.78 లక్షల బైక్‌ Wed 19 Oct 06:29:43.604981 2016 న్యూఢిల్లీ: ట్రయంఫ్‌ మోటార్‌ సైకిల్స్‌ మంగళవారం భారత మార్కెట్లోకి మరో కొత్త మోడల్‌ బైక్‌ను విడుదల చేసింది. 'బోనొవిల్లే టీ100' పేరుతో దీనిని కంపెనీ విడుదల చేసింది. ఈ బైక్‌ సోషల్‌ మీడియాలో 'మలబార్‌' హల్‌చల్‌! Wed 19 Oct 06:29:49.421609 2016 నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ప్రముఖ వజ్రాభరణాల సంస్థ 'మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌' సరికొత్తగా రూపొందించిన ప్రచార చిత్రానికి సోషల్‌ మీడియాలో అపూర్వ స్పందన లభిస్తోంది. ఎలా ఇల్లినాయిస్‌తో తెలంగాణ ఒప్పందం Wed 19 Oct 06:29:54.758427 2016 నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: తెలంగాణ, ఇల్లినాయిస్‌ రాష్ట్రాలు కలిసి వివిధ రంగాలలో నైపుణ్యాల సహకారం పంచుకోను న్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిర జెబ్రోనిక్స్‌ నుంచి సరికొత్త సౌండ్‌బార్‌ Wed 19 Oct 06:30:01.337746 2016 నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ జెబ్రోనిక్స్‌ మరో అత్యాధునిక సౌండ్‌బార్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. 'వండర్‌బార్‌' పేరుతో దీనిని విపణిలో రేపు కాన్పూర్‌లో ఆర్‌బీఐ బోర్డు మీటింగ్‌ Wed 19 Oct 06:30:09.512256 2016 కాన్పూర్‌: 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ) కేంద్ర బోర్డు సమావేశం గురువారం (20న) కాన్పూరులో జరగనుంది. ఊర్జిత్‌ పటేల్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుత ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్‌! Wed 19 Oct 01:59:51.821105 2016 న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఫిబ్రవరి 1వ తేదీ ముహూర్తాన్నే పక్కా చేసుకోవాలని మోడీ సర్కారు యోచిస్తోంది. ఇందుకు సంబంధించి వేగంగా పావులు కదుపుతోంది రెండు నెలల్లో 4 కొత్త మోడళ్లు.. Tue 18 Oct 04:08:08.920755 2016 భారత్‌లో మరింతగా విస్తరించాలని యోచిస్తున్న మెర్సిడెస్‌ బెంజ్‌ సంస్థ ఈ ప్రయత్నంలో భాగంగా మరిన్ని కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. అశోక్‌ లేలాండ్‌ నుంచి ఎలక్ట్రిక్‌ బస్సు Tue 18 Oct 04:08:13.915837 2016 హిందూజా గ్రూపునకు చెందిన అశోక్‌ లేలాండ్‌ సంస్థ ఎలక్ట్రిక్‌ బస్సును ఆవిష్కరించింది. పూర్తిగా భారత్‌ కేంద్రంగా తయారు చేసిన మొట్టమొదటి విద్యుత్తు బస్సు 'సర్క్యూట్‌' పేరుతో నవంబరు 3, 15న పెట్రోల్‌ బంకులు బంద్‌! Tue 18 Oct 04:08:19.134752 2016 తమ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని 'ఆల్‌ ఇండియా పెట్రోలియం డీలర్స్‌ అసోసి యేషన్‌' (ఏఐపీడీఏ) కోరుతో ంది. నేటి నుంచి జీఎస్‌టీ కీలక సమావేశం! Tue 18 Oct 04:08:24.343592 2016 'వస్తు సేవల పన్ను' (జీఎస్‌టీ) విధానానికి తుది రుపం ఇచ్చేందుకు గాను 'జీఎస్‌టీ కౌన్సిల్‌' నేటి (మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది. మూడు నెలల కనిష్టానికి మార్కెట్లు Tue 18 Oct 04:08:29.879488 2016 ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన పరిణామాలకు తోడు దేశీయంగా కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలపై అనుమానాల నేపథ్యంలో భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం మూడు మాసాల కనిష్టానికి చమురు వ్యాపారంలో కొనసాగుతాం:ఎస్సార్‌ Tue 18 Oct 04:08:34.927099 2016 ఎస్సార్‌ ఆయిల్‌లో సింహ భాగాన్ని ఇతర సంస్థలకు విక్రయించి న్పప్పటికీ తాము చమురు, సహజ వాయువు వ్యాపారం నుంచి వైదలగడం లేదని ఎస్సార్‌ గ్రూపు స్పష్టతనిచ్చింది. విజయాబ్యాంక్‌లో రక్తదాన శిబిరం Tue 18 Oct 04:08:39.985053 2016 విజయాబ్యాంక్‌ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రాంతీయ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాణించిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ Tue 18 Oct 03:52:00.351151 2016 ద్వితీయ త్రైమాసికానికి అల్ట్రాటెక్‌ సిమెంట్‌ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. వ్యయాలను నియంత్రణ వల్ల సంస్థ లాభం రెండో త్రైమాసికంలో 25 శాతం మేర పెరిగింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ లాభాల్లో 29% వృద్ధి Tue 18 Oct 03:51:08.756865 2016 ప్రముఖ గృహ రుణాల సంస్థ 'దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌' (డీిహెచ్‌ఎఫ్‌ఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికానికి 28.8 ఫాల్కన్‌ పంపులతో ఎంతో మేలు Mon 17 Oct 06:05:49.450691 2016 ఎక్కువ లోడు నుంచి తక్కువ విద్యుత్‌తో ఎక్కువ నీటితో నడిచే మన్నికైనా, దృఢమైన ఫాల్కన్‌ పంపులు ఎంతో మేలైనవని వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పేర్కొన్నారు. హన్మకొండ హంటర్‌రో అతిపెద్ద గ్యాస్‌ పైప్‌లైన్‌ యోచనలో ఐఓసీ Mon 17 Oct 06:05:56.064618 2016 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ 'ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌' (ఐఓసీ) దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌ పైపులైన్‌ నిర్మించాలని యోచిస్తోంది. ప్రస్తుతం గెయిల్‌ నిర్వహణలో ఉన్న చెన్నై నుంచి తగ్గిన కార్ల ఎగుమతి Mon 17 Oct 06:06:02.95674 2016 చెన్నై: తూర్పు తీరంలోని చెన్నై, కామరాజర్‌ పోర్టుల నుంచి విదేశాలకు జరిగే కార్ల ఎగుమతి తగ్గుతోంది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో ఈ పోర్టుల నుంచి జరిగిన కార్ల ఎగుమతులు వరుసగా 4. రష్యా కంపెనీ చేతికి ఎస్సార్‌ ఆయిల్‌ Sun 16 Oct 05:32:33.095771 2016 ముంబయి, గోవా: దేశీయ 'విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు' (ఎఫ్‌డీఐ) విభాగంలో శనివారం రికార్డు ఒప్పందం జరిగింది. అనుబంధ సంస్థ ఎస్సార్‌ ఆయిల్‌తో పాటు దాని అనుబంధ మౌలిక సంస్థలలో దా హైదరాబాద్‌ను అంకుర నగరంగా మారుస్తాం! Sun 16 Oct 05:32:39.729037 2016 సిలికాన్‌వ్యాలీ (అమెరికా): ప్రపంచంలోని అత్యుత్తమ అంకుర (స్టార్టప్‌) సంస్థల నగరాల సరసన హైదరాబాద్‌ను గర్వంగా నిలిపే దిశగా తెలంగణ సర్కారు కృషి చేస్తున్నట్లుగా రాష్ట్ర ఐటీ శా వినూత్నంగా మార్కెట్లోకి టీయూవీ 300 Sun 16 Oct 05:32:46.785826 2016 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: దేశీయ వాహన తయారీ దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా రెండు రంగుల సమ్మేళనంతో (డ్యూయల్‌ టోన్‌ ఎక్స్‌టీరియర్‌ కలర్‌తో) కూడిన కొత్త 'టీయూవీ-300' వాహ ముందస్తు బుకింగ్‌ చేసుకున్నవారికి Sun 16 Oct 05:32:54.307289 2016 ముంబయి: సమస్యాత్మకంగా మారిన శాంసంగ్‌ కొత్త ఫోన్‌ గెలాక్సీ నోట్‌ 7 అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించిన సంస్థ.. ఇప్పటికే ఆ ఫోన్లను ఆర్డర్‌ చేసిన వారికి అద్భుతమైన ఆఫర్లను ప్ Sun 16 Oct 05:33:01.023116 2016 న్యూయార్క్‌ పెరిగిన భారత్‌ ఎగుమతులు Sun 16 Oct 05:33:08.793292 2016 న్యూఢిల్లీ: మందగమన పరిస్థితులు సడలుతున్న వేళ దేశీయ వాణిజ్యంలో కొంత పురోగతి కనిపిస్తోంది. సెప్టెంబరు నెలలో దేశీయ ఎగుమతులు 4.62 శాతం మేర పెరిగి 22.9 బిలియన్‌ డాలర్లకు చేరాయ అంచనాలను మించిన ఇన్ఫోసిస్‌ ఫలితాలు Sat 15 Oct 04:47:20.751055 2016 అంతర్జాతీయంగా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం విశ్లేషకులు ఊహిస్తున్నంత గడ్డు పరిస్థితి లేదని మరోమారు స్పష్టమైంది. నిన్న మార్కెట్‌ అంచనాలను తలకిందలు చేస్తూ 'టాటా కన్సె బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి ఆర్‌కామ్‌ టవర్లు Sat 15 Oct 04:46:26.792443 2016 అనిల్‌ అంబానీ నేతృత్వంలోని 'రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌' (ఆర్‌కామ్‌) తన సెల్‌ టవర్ల వ్యాపారంలో దాదాపు 51 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించింది
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బిగ్‌బాస్ టుడే : దెబ్బఠా.. దొంగల ముఠా తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీషో బిగ్‌బాస్ 37 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 38వ ఎపిసోడ్‌కి ఎంటరయ్యింది. TNN | Updated: Aug 23, 2017, 03:26PM IST Bigg Boss Telugu episode 38 తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీషో బిగ్‌బాస్ 37 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 38వ ఎపిసోడ్‌కి ఎంటరయ్యింది. నిన్నటి ఎపిసోడ్‌లో ఈవారం బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కన్టిస్టెంట్స్ కోసం నామినేషన్ నిర్వహించగా అర్చన, శివబాలాజీ, ధనరాజ్, కత్తి కార్తీక ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ హౌస్‌నుండి ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ సీక్రెట్ రూం నుండి బిగ్ బాస్ హౌస్‌లో గజదొంగల ముఠా సభ్యురాలిగా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. నేటి ఎపిసోడ్‌లోని టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లోకి గజదొంగలు చొరబడి హౌస్ మేట్స్ వస్తువులన్నింటినీ దొచేశారు. తిరిగి వాటిని పొందాలంటే బిగ్ బాస్ చెప్పిన టాస్క్‌లలో విన్ అవ్వాలని ట్విస్ట్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇక ఈ టాస్క్‌లన్నీ సీక్రెట్ హౌస్‌లో ఉన్న ముమైత్ ఖాన్ సూచనల ఆధారంగా పోటీదారులను ఎంపిక చేశారు. ఇక టాస్క్‌లో పాల్గొనేందుకు హౌస్‌లో ఉన్నవారంతా రెండు గ్రూపులుగా విడిపోతారని టీం Aలో ప్రిన్స్, హరితేజ, దీక్ష, ఆదర్శ్ ఉంటారని.. టీం Bలో శివబాలాజీ, ధనరాజ్, నవదీప్, అర్చనలు ఉంటారని ఈ టాస్క్‌లన్నీ కత్తి కార్తీక పర్యవేక్షణలో జరుగుతాయని మూడు టాస్క్‌లను ఇచ్చారు. ఇందులో మొదటి టాస్క్ ‘చేపనోట్లో మౌత్ ఆర్గన్’ ఈ టాస్క్‌లో పెద్ద చేపలు నోట్లో మౌత్ ఆర్గన్ ఉంటుందని దాన్ని మీరు చేతులు ఉపయోగించకుండా చేప నోట్లో నోరు పెట్టి ఆ మౌత్ ఆర్గాన్‌ ప్లే చేయాలనేది టాస్క్. ఈ టాస్క్‌లో ధనరాజ్, ఆదర్శ్‌లు పోటీ పడగా ధనరాజ్ విజేతగా నిలిచారు. — STAR MAA (@StarMaa) August 22, 2017 ఇక రెండవ టాస్క్‌గా ఐస్‌ని కరిగించడం. ఈ టాస్క్‌లో ఇచ్చిన ఐస్‌నే కేవలం శరీరాన్ని ఉపయోగించి మాత్రమే ఐస్ కరిగించాలని ఎవరు ఎక్కువ ఐస్ కరిగిస్తే వాళ్లే విజేతలని ప్రకటించగా.. ఈ టాస్క్‌లో హరితేజ, అర్చనలు పోటీ పడ్డారు. ఈ ఐస్‌ను కరిగించడం కోసం ఇద్దరూ కింద మీద పడుతూ తెగ కష్టపడ్డారు. చివరికి అర్చన ఎక్కువ కష్టపడి ఐస్‌ని కరిగించడంతో ఆమె ఐస్ టాస్క్ విన్నర్‌గా నిలిచింది. — STAR MAA (@StarMaa) August 22, 2017 ఇక మూడవ టాస్క్ ‘పేడలో కాయిన్స్’. పెద్ద పెద్ద పేడ బౌల్స్‌‌లో కాయిన్స్ ఉంటాయని వాటిని వెతికి పట్టుకోవాలని ఎవరు ఎక్కువ కాయిన్స్ తీస్తే వాళ్లే విజేతలనగా ఈ టాస్క్‌కోసం ప్రిన్స్, ధనరాజ్‌లు పోటీపడ్డారు. ఈ పోరులో ప్రిన్స్ ఎక్కువ కాయిన్స్ వెతికి తీసి విజేతగా నిలిచాడు. ఇక చివరి టాస్క్‌ ‘కాకరవీరులు’. ఈ టాస్క్‌లో కాకరకాయలు తినాలని, కాకరకాయం రసం తాగాలని టాస్క్ ఇవ్వగా.. ఇందులో నవదీప్, దీక్షలు పోటీపడ్డారు హోరా హోరాగా సాగిని ఈ పోటీలో నవదీప్ విన్నర్‌గా నిలిచారు. ఫైనల్‌గా రెండు టీంలు టాస్క్‌లు బాగా ఆడాయని అయితే ఇంకా ఈ టాస్క్ పూర్తికాలేదంటూనే .. బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన దోపిడీలో మీరు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి గెలుచుకునే అవకాశాన్ని ఇచ్చారు బిగ్‌బాస్. మీరు పోగొట్టుకున్న వస్తువులను తిరిగిపొందాలంటే ఎవరైతే మీ వస్తువులను దొంగిలించారో ఆ గజదొంగ బిగ్‌బాస్ హౌస్‌కి వస్తున్నారని.. ఆ గజదొంగను మెప్పించి... మీ వస్తువులను మీరు పొందాలని అందుకోసం మీరు ఆ గజదొంగ ఏం చెప్తే అది చేయాలంటూ కండిషన్స్ పెట్టారు బిగ్‌బాస్. అందరూ ఆ కండిషన్స్‌కి ఓకే చెప్పడంతో బిగ్‌బాస్ లోకి వచ్చే గజదొంగ ఎవరై ఉంటారని ఆత్రుతగా చూస్తున్న కన్టెస్టెంట్స్‌కి ముమైత్ ఖాన్ గజదొంగగా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ముమైత్ ఖాన్ మిగిలిన సెలబ్రిటీలను ముప్పు తిప్పలు పెడుతుంది. ముఖ్యంగా ధనరాజ్‌ను చెడుగుడు ఆడేస్తుంది. అవేంటో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే! Read Bigg Boss Telugu Updates Here: బిగ్‌బాస్ అన్ని ఎపిసోడ్‌లు ఒక్కక్లిక్‌తో   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ First Published 26, Nov 2017, 3:10 PM IST రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ Recent Stories
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV అఖిల్ హీరోయిన్‌తో పవన్‌ రొమాన్స్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ అవకాశం కొందరికే లభిస్తుంది. TNN | Updated: Dec 14, 2016, 07:49PM IST పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ అవకాశం కొందరికే లభిస్తుంది. తాజాగా తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా అది కూడా ఫ్లాప్ అయిన సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయిని పవన్ హీరోయిన్‌గా ఎంపిక చేశారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 'అఖిల్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ముంబై భామ సాయేషా సైగల్ . ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో నిర్మాతలు ఆమెపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ తన నటనతో, నాజూకు తనంతో యూత్‌ను బాగానే ఆకట్టుకుంది. రీసెంట్ గా 'శివాయ్' అనే బాలీవుడ్ సినిమాలో మెరిసింది. ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతుందని టాక్. అది కూడా పవర్ స్టార్‌తో అవకాశం రావడంతో ఈ భామ ఫుల్ హ్యాపీ‌లో ఉందట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్, దర్శకుడు నేసన్ సినిమాల్లో నటించనున్నాడు. వచ్చే ఏడాది నుండి ఈ రెండు చిత్రాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడు నేసన్ సినిమాలో హీరోయిన్‌గా సాయేషా‌ను ఎన్నుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగులో చాలా మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతూ మిగతా భాషల్లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఆఫర్స్‌ని అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి హీరోయిన్స్‌ని కాదని ఫ్లాప్‌లలో ఉన్న హీరోయిన్‌కి చాన్స్ ఇవ్వడం పవన్ ప్రయోగం చేస్తున్నారంటూ టాలీవుడ్‌లో చర్చలుమొదలయ్యాయి.
0business
Sep 20,2015 వడ్డీరేట్ల పైనే ప్రధాన దృష్టి    ముంబయి: సోమవారం నుంచి ప్రారంభం కానున్న కొత్త ట్రేడింగ్‌ వారం భవిష్యత్తు ప్రధానంగా దేశంలో వడ్డీ రేట్ల సవరణ విషయం పైనే ఆధారపడనుంది. సెప్టెంబర్‌ 29న రిజర్వు బ్యాంకు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహిం చనుంది . ప్రధాన ంగా ఆర్‌బిఐ సమీక్షపై జరిగే అంచనాలు, సమాలోచనలు ఈ నెల 21తో ప్రారంభ మయ్యే వారంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయను న్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా సెప్టెంబర్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టు వచ్చే గురువారంతో ముగియనుండటంతో మార్కెట్లు ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మదుపరులు ఎక్కువగా అమ్మకాలకు మొగ్గు చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తే చైనా సెప్టెంబర్‌ మాసం పారిశ్రామికోత్పత్తి సూచీని వెల్లడించనుంది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టపై వచ్చే వార్తలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. ఇదే సమయంలో అమెరికాలో గృహ నిర్మాణంపై ఆ దేశం గణంకాలను వెల్లడించనుంది. వీటికి తోడు అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ, చమురు ధరలలో కదలికలను మదుపరులు కీలకంగా పరిగణించనున్నారు మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Washington, First Published 17, Mar 2019, 1:13 PM IST Highlights అమెరికా ఏవియేషన్ మేజర్ బోయింగ్ క్రుత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ సాయంతో రూపొందించిన 737 మ్యాక్స్ 8 విమానాలు ప్రమాదాల భారీన పడటం ఆ సంస్థకు ఆశనిపాతంగా మారింది.  వరుసగా ‘737 మాక్స్‌ 8’ విమానాలు కుప్పకూలడం బోయింగ్‌కు పెద్ద శాపంగా మారింది. ఆటోమేషన్ సాయంతో తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగల అత్యాధునిక టెక్నాలజీతో సంస్థ ఈ తరహా విమానాలను తయారు చేసింది.  దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సంస్థలు ఈ తరహా విమానాల కొనుగోలుకు ఎక్కువగా ముందుకు రావడంతో అనతి కాలంలోనే సంస్థ వివిధ దేశాలకు 350కి పైగా విమానాలను బోయింగ్ విక్రయించింది. బోయింగ్‌కు ‘737 మాక్స్ 8’ మోడల్‌ విమానాలు పాడి ఆవులా మారుతున్నవేళ అధిక టెక్నాలజీ వాడకం ఆ సంస్థకే ముప్పు తెచ్చింది.  సాధారణంగా బోయింగ్‌ విమానాల్లో పైలట్ల చేతిలోనే ఎక్కువ నియంత్రణ ఉంటుంది. కానీ కొత్తగా బోయింగ్‌ ఉత్పత్తి చేసిన 737 మాక్స్‌ 8 విమానాల్లోనూ కూడా ది మనూవరింగ్‌ క్యారెక్టరిస్ట్‌ అగ్మెంటేషన్‌ సిస్టమ్‌(ఎంకాస్‌)ను ఏర్పాటు చేసింది. దీంతో విమాన నియంత్రణను కృత్రిమమేథస్సు (ఏఐ) ఎంకాస్‌ టెక్నాలజీ చూసుకుంటుంది. విమానంపై ఎంత మేరకు కృత్రిమమేథస్సు పర్యవేక్షిస్తుంది? పైలట్‌ దానిని ఎలా నియంత్రించాలన్నదానిపై స్పష్టత లేదు. దీంతో టెక్నాలజీ పరంగా, మ్యానువల్‌గా విమానాల నియంత్రణ చేపడుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అర్థం చేసుకొనే లోపే ఈ తరహా విమానాలు నేల కూలుతున్నాయి.  2009లో ఎయిర్‌ ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఎ330-203 విమానం కూడా బ్రెజిల్‌ నుంచి తిరుగు ప్రయాణంలో అట్లాంటిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది. ఎయిర్‌బస్‌ కూడా ఎ330లో స్టాల్‌ సమస్యను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఆటోమేషన్‌ గందరగోళంవల్లే ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత సంస్థ నష్టనివారణ చర్యల్లో భాగంగా పైలట్లకు ఎయిర్‌బస్‌ శిక్షణ ఇచ్చింది. తాజాగా బోయింగ్‌ సంస్థ కూడా ఈ దిశగానే అడుగులు వేస్తోంది. బోయింగ్‌ 737 మాక్స్‌ 8 విమానాల్లో టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌కు చర్యలను ప్రారంభించింది. వీటిపై త్వరలోనే పైలట్లకు కూడా శిక్షణనివ్వనుంది.  బోయింగ్‌ 737 మాక్స్‌ 8 ఫ్లైట్‌లు ప్రపంచ విమానయాన సంస్థలకు శాపంగా మారాయి. వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 350కి పైగా బోయింగ్‌ విమానాలను విమానాశ్రయాలకే పరిమితం చేశారు. దీంతో ప్రయాణికుల రద్దీని తట్టుకొనేందుకు ఇప్పుడు ఆ విమానాల స్థానే వేరే విమానాలను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో ప్రత్యామ్నాయ విమానానికి నెలకు సగటున 2.5లక్షల డాలర్లు (రూ.1.7కోట్లు) అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్స్‌ సంస్థలు బోయింగ్‌ సంస్థపై ఆర్థిక యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. అనూహ్య నష్టాలకు కారణమైన బోయింగ్‌ ఈ మొత్తాన్ని చెల్లించాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మొదలు పెట్టాయి. ఈ పరిహారం ఇప్పటికే నెలకు 100 మిలియన్‌ డాలర్లకు పైగా ఉండవచ్చని అంచనా వేశారు. ఇక ఇప్పటికే విక్రయించిన 737 మ్యాక్స్‌ విమానాల సాఫ్ట్‌వేర్‌, ఇతర పరికరాల్లో మార్పుల ఖర్చును ఈ లెక్కలో చేర్చలేదు. ఇదిలా ఉండగానే మార్పులు చేర్పులు చేశాకే మళ్లీ పైలట్లకు దీనిపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ శిక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ మార్పులు చేర్పుల ప్రక్రియ ఎంత ఆలస్యమైతే బోయింగ్‌పై భారం అంతగా పెరిగిపోతుంది. మొత్తంగా చూస్తే బోయిరగ్‌ సంస్థకు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులేనన్న విషయం అవగతమవుతోంది.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV చిరంజీవి గారి క్లాప్‌తో మొదలైంది నా 30 ఏళ్ల సినీ ప్రయాణం: జగపతిబాబు కోట్లకు కోట్లు ఖర్చు చేసి భారీ చిత్రాలు తీసే ప్రతి ఒక్కరూ చిన్న చిత్రమైన ‘గూఢచారి’ని చూడాలి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలి. ఎంత బడ్జెట్‌లో తీశారో చూసి నేర్చుకోవాలి. Samayam Telugu | Updated: Aug 14, 2018, 09:20PM IST కోట్లకు కోట్లు ఖర్చు చేసి భారీ చిత్రాలు తీసే ప్రతి ఒక్కరూ చిన్న చిత్రమైన ‘గూఢచారి’ని చూడాలి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలి. ఎంత బడ్జెట్‌లో తీశారో చూసి నేర్చుకోవాలి. మరికొంత మంది సిగ్గుపడాలన్నారు జగపతిబాబు. ఆయన కీలకపాత్రలో నటించిన ‘గూఢచారి’ మూవీ సక్సెస్ మీట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకును జగపతి బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా నిర్వహించడం విశేషం. ఈ ప్రి రిలీజ్ వేడుకలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జగపతిబాబు. ఆయన మాట్లాడుతూ.. ‘గూఢచారి’ సినిమా నాకెంతో స్పెషల్ ఎందుకంటే నా 30 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది గూఢచారి తోనే. ఇంతకంటే ఏం కావలి నాకు. ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న నాకు 30 ఏళ్ళు సినిమాలు చేసే అవకాశం కల్పించారు.. అందరికి నా స్పెషల్ థాంక్స్. చిరంజీవి గారి క్లాప్‌తో మొదలైన నా ప్రయాణం ఇక్కడిదాకా వచ్చింది. అందరి లాగ నేను కూడా ఓ స్టార్ అవబోతున్నానని అప్పుడు అనిపించింది. కానీ వరుసగా 10, 12 ఫ్లాప్‌ల తర్వాత కూడా నన్ను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు. నా కెరియర్ అయిపోయింది ఇక సినిమాలు రావు అనుకుంటున్న సందర్భంలో ‘లెజెండ్’ సినిమాతో మళ్లీ కొత్త జీవితం ప్రారంభించా. మళ్లీ వెనుతిరిగి చూడలేదు. ఇక ఈ గూఢచారి థాంక్స్ మీట్ ఫంక్షన్‌ని నా కోసం చేసారంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా గురించి చెప్పాలంటే టీం అంతా చాలా బాగా చేసారు. ఏ ఫెసిలిటీ లేకుండా ఈ సినిమాకి అందరు టెక్నిషియన్స్ చాలా బాగా పనిచేశారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఈ ‘గూఢచారి’ చిత్రాన్ని చూడాలి. ఎంత బడ్జెట్‌లో తీశారో చూసి నేర్చుకోవాలి. మరికొంత మంది సిగ్గుపడాలి. నా ఫ్యాన్స్‌కి, మిగతా హీరోల ఫాన్స్ అందరికీ థాంక్స్. మంచి మనసున్న అందరికీ థాంక్స్. ఎదవలతో నాకు సంబంధం లేదు. ఎదవలకి వాళ్లు ఎదవలు అని తెలియదు. ఎందుకంటే ఇండస్ట్రీలో నువ్ ఎదవవి అని ఎవరూ చెప్పరు. అందుకే వాళ్లు ఎప్పటికీ మారరు. మంచి వాళ్ల వరకూ బాగుందాం. ఇప్పటి వరకూ 130 సినిమాలు చేశాను. ఓ లక్షమందికి పైగా పనిచేశాను. నేను 30 సంవత్సరాల్లో ఇదే బెస్ట్ ఈవింనింగ్. నా మీద ఒట్టు. నాకు మాట్లాడటం పెద్దగా రాదు. కెమెరా ముందే నేను నటిస్తా. నిజజీవితంలో నాకు నటించడం రాదు. నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు పూర్తైందని.. నా నాకోసం నేను నటించిన ‘గూఢచారి’ సక్సెస్ మీట్‌ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.
0business
internet vaartha 144 Views   న్యూఢిల్లీ : ఇటాలియన్‌ సూపర్‌కార్ల తయారీ సంస్థ ఫెరారి భారత్‌ మార్కెట్‌లో గత ఏడాదే పునఃప్రవేశించింది. తన కొత్త కారు ఫెరారి 488 జిటిబిని భారత్‌ మార్కెట్‌కు విడుదల చేసింది. జిటిబి కారు 3.9 లీటరు, వి8 టర్బోఛార్జిడ్‌ ఇంజన్‌ ఏడు స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోంది. ఎక్స్‌షోరూంధరగా 3.88 కోట్ల రూపాయలుగా కంపెనీ ప్రకటిం చింది. ఫెరారి 488 జిటిబి ఇండియాను ఇంట ర్నేషనల్‌ సేల్స్‌ డైరెక్టర్‌ ఔరెలీన్‌ సౌవర్డ్‌ సమ క్షంలో ఫెరారి మధ్యతూర్పు,ఆఫ్రికా దేశాల డైరెక్ట ర్‌ యాదుర్‌ కపూర్‌ తదితరప్రముఖుల సమక్షం లో కారును భారత్‌ మార్కెట్‌కు విడుదలచేసారు. కొత్తమోడల్‌ ఇంజన్‌ 660 బిహెచ్‌పి, 760 ఎన్‌ఎం, ఎలక్ట్రానిక్‌గా టాప్‌స్పీడ్‌లో 330 కిలోమీటర్లు గంటకు ప్రయాణిస్తుంది. ఫెరారి 488జిటిబి ఎనిమిది సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV IPL Expensive players: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర ఆటగాళ్లు వీరే..! 2015 ఐపీఎల్ వేలంలో యువరాజ్ సింగ్‌ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఏకంగా రూ. 16 కోట్లకి కొనుగోలు చేసింది. Samayam Telugu | Updated: Dec 18, 2018, 02:42PM IST IPL Expensive players: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర ఆటగాళ్లు వీరే..! ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ ఆటగాళ్ల వేలం ఈరోజు జైపూర్ వేదికగా మరికొద్దిసేపట్లో మొదలుకానుంది. టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 70 మంది క్రికెటర్లని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండగా.. 346 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు 11 ఐపీఎల్ సీజన్లు ముగియగా.. ఏటా రికార్డు ధరకి ఆటగాళ్లు అమ్ముడుపోతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. 11 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాని ఓ సారి పరిశీలిస్తే..! 1. 2008లో మహేంద్రసింగ్ ధోనీని రూ. 9.5 కోట్లకి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. 2. 2009లో ఆండ్రూ ఫ్లింటాప్‌ని చెన్నై సూపర్ కింగ్స్, కెవిన్ పీటర్సన్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీలు దాదాపు రూ. 9.8 కోట్లకి కొనుగోలు చేశాయి. 3. 2010లో షేన్‌బాండ్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్, కీరన్ పొలార్డ్‌ని ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీలు దాదాపు రూ. 4.8 కోట్లకి కొనుగోలు చేశాయి. 4. 2011లో గౌతమ్ గంభీర్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ ఏకంగా రూ. 14.9 కోట్లకి కొనుగోలు చేసింది. 5. 2012‌లో రవీంద్ర జడేజాని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ రూ. 12.8 కోట్లకి కొనుగోలు చేసింది. 6. 2013లో గ్లెన్ మాక్స్‌వెల్‌ని ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ రూ. 6.3 కోట్లకి కొనుగోలు చేసింది. 7. 2014లో యువరాజ్ సింగ్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ రూ. 14 కోట్లకి కొనుగోలు చేసింది. 8. 2015లో యువరాజ్ సింగ్‌ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఏకంగా రూ. 16 కోట్లకి కొనుగోలు చేసింది. With a base price of INR 1 cr @YUVSTRONG12 is all set to go under the hammer at the @Vivo_India #IPLAuction today.… https://t.co/Rtp3pTSY6Z — IndianPremierLeague (@IPL) 1545110283000 9. 2016లో షేన్‌వాట్సన్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ రూ. 9.5 కోట్లకి కొనుగోలు చేసింది. 10. 2017‌లో బెన్‌స్టోక్స్‌ని రైజింగ్ పుణె సూపర్‌ జెయింట్స్ ఫ్రాంఛైజీ రూ. 14.5 కోట్లకి కొనుగోలు చేసింది. 11. 2018లోనూ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ జయదేవ్ ఉనద్కత్‌ని రూ. 12.5 కోట్లకి కొనుగోలు చేసింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Team India కోహ్లీసేనపై నలుగురి బౌలర్ల వ్యూహం : శ్రీలంక కోల్‌కతా: కోహ్లీసేనపై నలుగురు బౌలర్ల వ్యూహంతో మైదానంంలోకి దిగుతామని శ్రీలంక సారథి దినేశ్‌ ఛండీమాల్‌ సూచన చేశారు. యూఏఈలో ఉష్ణ వాతావరణంలో పాకిస్తాన్‌పై విజయవంతమైన ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని భారత్‌లో అమలు చేయనున్నారు. పాకిస్తాన్‌పై మేం ఆరుగురు బ్యాట్స్‌మెన్‌, ఐదుగురు బౌలర్లతో ఆడాం. ఉక్కపోత వాతావరణంలో ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అక్కడ నలుగురు బౌలర్లతో ఆడి గెలవడం సులభం కాదు. కానీ టీమిండియాలో అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. అందుకే మేం ఆల్‌రౌండర్‌ గురించి ఆలోచిస్తున్నాం. పిచ్‌ను పరిశీలించిన తర్వాత మా ప్రణాళికలు సిద్ధం చేస్తామని చండీమాల్‌ అన్నారు. శ్రీలంక 1982 నుంచి భారత్‌లో ఒక్క టెస్టైనా గెలవలేదు. సొంతగడ్డపై ఈ ఏడాది జరిగిన సిరీసుల్లో కోహ్లీసేన చేతిలో క్లీన్‌స్వీప్‌ అయింది. టెస్టుల్లో 5-0, వన్డేల్లో 3-0, టీ20లో 1-0తో వైట్‌ వాస్‌ అయింది. అందుకే ప్రస్తుత సిరీస్‌ను కుర్రాళ్లు సవాల్‌గా తీసుకున్నారని చండీమాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం టీమిండియా నంబర్‌వన్‌ జట్టని తెలుసు. గత రెండేళ్లుగా వారు నాణ్యమైన క్రికెట్‌ ఆడుతున్నారు. మేం పాక్‌పై బాగా ఆడాం. చక్కని బృంద ప్రదర్శన కనబరిచాం. కుర్రాళ్లు ఈ సవాల్‌ను ఎదుర్కొంటారని ఆశిస్తున్నా. ఏంజెలో మాథ్యూస్‌, రంగనా హెరాత్‌ను మినహాయిస్తే నాతో సహా అందరికీ ఇదే భారత్‌లో తొలి పర్యటనని తెలిపారు.
2sports
వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ First Published 23, May 2017, 7:18 PM IST వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ Recent Stories
0business
అత్యంత కాస్ట్లీ మూవీ 500 కోట్ల రామాయణం రెడీ Highlights రామాయణ గాధను భారీ చిత్రంగా రూపొందించే ప్రతిపాదన గతేడాది వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడీ అల్లు వారి రామాయణానికి రంగం సిద్ధమవుతోంది.  రామాయణ గాధను భారీ చిత్రంగా రూపొందించే ప్రతిపాదన గతేడాది వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు.. తమిళ.. హిందీ భాషలలో రూపొందనున్న ఈ రామాయణానికి.. అల్లు అరవింద్ కూడా ఒక నిర్మాత. ఇప్పుడీ అల్లు వారి రామాయణానికి రంగం సిద్ధమవుతోంది.  కొన్ని నెలల పాటు ఎక్కడా మాట వినిపించకపోయే సరికి.. ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదనే అనుమానాలు వినిపించిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడీ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ తెలిస్తే.. ప్రొడ్యూసర్స్ ఎంత చురుగ్గా ఉన్నారో.. ఈ ప్రాజెక్టుపై ఎంత సీరియస్ గా ఉన్నారో తెలుస్తోంది. ప్రస్తుతం లక్నో సిటీలో యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడే ఈ మూవీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం కూడా జరగడం విశేషం. ఉత్తరప్రదేశ్ లో రామాయణంను తెరకెక్కించేందుకు.. యూపీ ప్రభుత్వంతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఓ నిర్మాత మధు మంతెన వెల్లడించారు.  అయోధ్య నెలవైన ఉత్తర ప్రదేశ్ లోనే రామాయణం అధిక భాగం షూటింగ్ జరుపుకోనుండడంతో.. అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు నిర్మాతలు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో దేశంలోనే.. అత్యంత కాస్ట్లీ మూవీగా ఈ సినిమా రూపొందనుంది. మూడు భాగాలుగా రామాయణం రూపొందనుండగా.. మూడు భాషల్లో ఏకకాలంలో ఈ 3డీ రామాయణం విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేయాల్సి ఉంది.  Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
Hyderabad, First Published 25, Oct 2018, 5:22 PM IST Highlights టాలీవుడ్ లో ఇప్పుడొస్తున్న కథలు చాలా ప్రయోగాత్మకంగా ఉన్నాయని చెప్పాలి. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా దర్శకులు కూడా ఎక్కువగా వినూత్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  టాలీవుడ్ లో ఇప్పుడొస్తున్న కథలు చాలా ప్రయోగాత్మకంగా ఉన్నాయని చెప్పాలి. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా దర్శకులు కూడా ఎక్కువగా వినూత్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యువ హీరోలు సైతం అలాంటి కథలనే ఒకే చేస్తున్నారు. ఇక త్వరలోనే వరుణ్ తేజ్ నటించిన స్పెస్ థ్రిల్లర్ అంతరిక్షం రాబోతున్న సంగతి తెలిసిందే.  ఎంతో ప్రయోగాత్మకంగా తెరక్కుతున్న ఈ సినిమాకు ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా చిత్రీకరణను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో చిత్ర యూనిట్ బిజీగా మారింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. సినిమాలో వరుణ్ చేస్తోన్న వ్యోమగామి పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుందట.  దేశం కోసం స్పెస్ లో ఒక ప్రమాదకరమైన మిషన్ ను తెలివిగా పూర్తి చేసే వరుణ్ తన దేశాన్ని గర్వపడేలా చేస్తాడట.అంతరిక్షంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి ఊహించని అనుభవాన్ని కలుగజేస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా గ్రాఫిక్స్ పనులు ఎండింగ్ వచ్చాయి. రీసెంట్ గా టీజర్ అందరిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇక అంతరిక్షం సినిమా డిసెంబర్ 21న విడుదలకానుంది. Last Updated 25, Oct 2018, 5:22 PM IST
0business
Hyderabad, First Published 8, Feb 2019, 11:16 AM IST Highlights బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఇటీవల స్టార్ హీరోయిన్ అలియా భట్, అమీర్ ఖాన్ ల మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఏదైనా సినిమా నచ్చితే తన ప్రోత్సాహం అందిస్తుంటానని కానీ తన విషయంలో మాత్రం ఎవరూ అలా ప్రవర్తించరని కామెంట్స్ చేసింది.  బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఇటీవల స్టార్ హీరోయిన్ అలియా భట్, అమీర్ ఖాన్ ల మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఏదైనా సినిమా నచ్చితే తన ప్రోత్సాహం అందిస్తుంటానని కానీ తన విషయంలో మాత్రం ఎవరూ అలా ప్రవర్తించరని కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో అలియా భట్ ని టార్గెట్ చేస్తూ.. 'రాజీ' సినిమా ట్రైలర్ చూసి అలియా, దర్శకురాలు మేఘనాలతో అరగంట సేపు మాట్లాడినట్లు కంగనా చెప్పింది. బహిరంగంగా  ప్రశంసించినట్లు చెప్పుకొచ్చింది. కానీ తన సినిమా ప్రీమియర్ షోకి మాత్రం ఎవరూ రాలేదని అవసరం ఉంటే బాగా మాట్లాడతారని లేదంటే పట్టించుకోరని వెల్లడించింది. ఈ విషయంపై మీడియాఅలియా భట్ ని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఆమె.. ''కంగనా నాకు ఎప్పుడూ నచ్చుతుంది. ఒక వ్యక్తిగా నటిగా ఆమె అంటే నాకు ఎప్పుడూ ఇష్టం. మనసులో ఉన్న విషయాన్ని ఆమె ధైర్యంగా  వెల్లడించగలదు. నా విషయంలో ఆమెకి తలెత్తిన ఇబ్బంది ఏమిటో తెలుసుకుంటా.. ప్రస్తుతం షూటింగ్ తో బిజీగా ఉన్నా.. కంగనాను వ్యక్తిగతంగా కలిసి సారీ చెబుతా'' అంటూ చెప్పుకొచ్చింది.   Last Updated 8, Feb 2019, 11:16 AM IST
0business
‘నాకు కావాల్సిందికూడా ఇదే నాని’ Highlights లీగల్ నోటీసుపై స్పందించిన శ్రీరెడ్డి సినీ హీరో నానిపై శ్రీరెడ్డి మరోసారి విరుచుకుపడింది. ఇప్పటికే శ్రీరెడ్డి.. నానిపై పలు అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ లీగల్ నోటీసులపై శ్రీరెడ్డి తాజాగా స్పందించింది. తన పుట్టిన రోజు సందర్భంగా వేరే ప్రాంతానికి వెళ్తుంటే  ఈ విషయం తెలిసిందన్నారు. తనకు కావాల్సింది కూడా ఇదేనని.. నీ రంకు బాగోతం బయటపెట్టడానికి ఓ మంచి అవకాశం తనకు వచ్చిందని నానిని ఉద్దేశించి అన్నారు. తప్పనిసరిగా ఫైట్‌ చేద్దాం.. గురువారం మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వస్తాను.. అప్పుడు నాని సంగతి చూస్తానని తెలిపారు. ఇక నానిపై చేసే పోరాటం చూసి మిగతా వారందరూ వణికిపోయేలా చేస్తానని ఛాలెంజ్‌ విసిరారు.  అలాగే బాధిత మహిళలు ఎలా ఫైట్‌ చేయాలో నేను చేసి చూపిస్తాను. నీవ్వు నిజంగా తప్పు చేస్తే, కచ్చితంగా నీ మనఃసాక్షికి తెలుసు.. నీ భార్యకు అన్నీ చెబుతానని చెప్పావు. మన సంగతి చెప్పావో లేదో నాకు తెలియదన్నారు. నువ్వు జనాల్లో పరువు పోతుందని లీగల్‌ నోటీసులు పంపావు కానీ ఏమి జరిగిందో నీకు తెలుసన్నారు. నువ్వు నిజంగా తప్పు చేసి ఉంటే.. ధర్మానికి నిజంగా బలం ఉంటే.. నువ్వు కచ్చితంగా దోరుకుతావని, దేవుడు నిన్ను శిక్షిస్తాడన్నాడని ఆమె అన్నారు.  Last Updated 12, Jun 2018, 10:12 AM IST
0business
Suresh 159 Views క్రెడిట్‌, డెబిట్‌ కార్డు లావాదేవీలకు చార్జీలు లేవు న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డు చెల్లింపుల విధానంలో లావాదేవీల ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించింది. డెబిట్‌ కార్డులు ,క్రెడిట్‌కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌ విధానంలో చేసేచెల్లింపులపై లావాదేవీలు ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించినసంగతి తెలిసిందే.. ప్రస్తుతం కస్టమర్లు ఈ లావాదేవీల చార్జీలనుచెలించుకోవాల్సి వస్తంది.. ఈ చార్జీలను సాధారణంగా మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ గా పిలుస్తారు.. ఇదిలా ఉండగా 2015 అక్టోబర్‌ నాటికి దేశ వ్యాప్తంగా 61.5 కోట్ల మందికి డెబిట్‌ కార్డులు, మరో 2.3 కోట్ల మందికి క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తున్నట్టు తేలింది.
1entertainment
బాహుబలి2లో ఈ సన్నివేశాలు అమోఘం Highlights రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి2 చిత్రంలోని కొన్ని సన్నివేశాలు నభూతో న భవిష్యతి అన్నట్లున్నాయి అమరేంద్ర బాహుబలి ఎంట్రీ.. మాహిష్మతి సామ్రాజ్యాధినేత పట్టాభిషేకానికి ముందు రాజవంశ సాంప్రదాయం ప్రకారం రాజమాత శివగామి ఓ పూజను ప్రారంభిస్తుంది. ఆ పూజ ప్రారంభమైన తర్వాత అడుగు కూడా ఆగకుండా పూర్తి కావాలి. తలపై మంటతో ఉన్న బోనం పెట్టుకొని ఆలయానికి బయలుదేరుతుంది. ఆలయానికి చేరుకొనే క్రమంలో ఒక్కసారిగా మదపుటేనుగులు అలజడి సృష్టిస్తాయి. అక్కడున్న జనం అంతా చెల్లాచెదురుగా పారిపోతుంటారు. దొరికిన వాళ్లను దొరికిటనట్టు ఏనుగులు విసిరి పారేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో రాజమాత నడక ఆపకుండా ముందుకెళ్తుంటుంది. వెంట ఉన్న కట్టప్పను ప్రజలను కాపాడమని శివగామి ఆదేశిస్తుంది. ఏనుగులు ఘీంకరించుకొంటూ శివగామి వైపు దూసుకువస్తుంటాయి. ఆ పరిస్థితుల్లో ఆలయ రథం ఉండే గది నుంచి తలుపులు బద్దలు కొట్టుకొని అమరేంద్ర బాహుబలి దూసుకొస్తాడు. ఏనుగును తప్పించి శివగామి పూజను పూర్తయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ ఏనుగును శాంతింపజేసి దాని తొండం మీదుగా ఎక్కి దానిపై ఊరేగుతాడు. ఈ సీన్‌ను రాజమౌళి అద్బుతంగా చిత్రీకరించాడు.   కుంతల దేశంలో బాహుబలి గురించి.. పట్టాభిషేకానికి ముందు దేశాటనకు వెళ్లిన కట్టప్ప, బాహుబలి కుంతల దేశానికి చేరుకొంటారు. కుంతల దేశంలో దోపిడిలకు పాల్పడే పిండారుల నుంచి ఆ దేశ ప్రజలను కాపాడుతారు. ఆ క్రమంలో దేవసేన, బాహుబలి పరస్పరం ప్రేమలో పడతారు. అయితే తాను ప్రేమించింది ఓ సామాన్య పౌరుడిని కాదు. ఓ క్షత్రియవంశ పుత్రుడినని దేవసేన గ్రహిస్తుంది, తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి నీవు ఎవరు? నీ చేతులు చూస్తే యుద్ధంలో కత్తి పట్టిన యోధుడివిలా కనిపిస్తున్నావు అని నిలదీస్తుంది. అయినా సరైనా సమాధానం రాకపోవడంతో పక్కనే భగభగ మండుతున్న కాగడాతో బాహుబలి ఛాతిపై కొడుతుంది. దాంతో బాహుబలి ఛాతిపై ఉన్న వస్త్రం కాలిపోయి ఉక్కు కవచంతో ఉన్న బాహుబలి అసలు రూపం కనిపిస్తుంది. ఈ సీన్‌ను దర్శకుడు రాజమౌళి అద్బుతంగా తీర్చిదిద్దారు. అద్భుతమైన గ్రాఫిక్స్‌ను మేలవించారు.   ఇంటర్వెల్ బ్యాంగ్.. మహిష్మతీ సామాజ్యంలో అధికారం కోసం జరిగిన పోరాటంలో హోదాలు తారుమారవుతాయి. దేశ ప్రజల విశేష మద్దతు ఉన్న బాహుబలికి జరగాల్సిన పట్టాభిషేకం మారిపోయి సేనాధిపతిగా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ‘అమరేంద్ర బాహుబలి అను నేను.. మహిష్మతీ దేశ ప్రజల ధన, మాన, ప్రాణాలంటూ‘ ప్రమాణం చేస్తున్న సమయంలో ప్రజల స్పందన, సైనిక విన్యాసాలు తెరమీద ప్రకంపనలు సృష్టిస్తాయి. ఈ సన్నివేశాన్ని దర్శకుడు తెరకెక్కించిన తీరు అమోఘం. కట్టప్ప బాహుబలిని హత్య చేసే.. పురిటి నొప్పులతో ఉన్న భార్యను వదిలేసి తనకు ప్రాణమైన కట్టప్పను రక్షించుకోవడం అనే సీన్‌ను దర్శకుడు అద్భుతంగా తీశాడు. ఓ వైపు కట్టప్పను బతికించుకోవాలనే ఆరాటం. మరోవైపు తనను కాపాడుకోవడానికి వచ్చిన బాహుబలిని చంపడానికి కట్టప్ప పూనుకోవడం చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. చివరికి కట్టప్ప కత్తితో వెన్నుపోటు పొడిచిన తర్వాత జరిగే సన్నివేశం ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురిచేస్తుంది.   మహేంద్ర బాహుబలి వీరత్వం.. ఇక తన తండ్రి అమరేంద్ర బాహుబలికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తున్న మహేంద్ర బాహుబలిని ప్రజలందరూ తాకుతూ ఉండే సీన్ సినిమాను పీక్ రేంజ్‌కు తీసుకెళ్తుంది. ఈ సీన్‌లో ప్రజల ఉద్వేగాలు, ఎమోషన్స్, బాహుబలి ముఖంలో కనిపించే కసి, పగ, ప్రతీకారం అద్భుతహ అనిపిస్తాయి. పాత్ర పట్ల బాహుబలి అంకితభావం, రాజమౌళి విజన్, వీరద్దరి ఫీలింగ్స్‌ మేళవించి సెంథిల్ కుమార్ తెరకెక్కించిన తీరు, దానికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం అన్ని ఊహలకు అందని విధంగా ఉండటం ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురిచేసింది. బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిపెట్టటానికి కారణం కాబోతున్నది.  Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV పవన్ యాక్షన్- త్రివిక్రమ్ డైరెక్షన్ మొదలైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. TNN | Updated: Apr 3, 2017, 04:00PM IST పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. వీరి గత చిత్రాలు జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో వీరి నెక్ట్స్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జల్సా మూవీ రిలీజ్ డేట్‌ను సెంటిమెంట్‌గా భావించి ఇదే రోజున పవన్-త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు. తొలిరోజు షూటింగ్ లోనే పవన్ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ బడ్జెట్‌తో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సెట్‌ని వేసిన విషయం తెలిసిందే.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 104 ఎఫ్‌ఎమ్ ప్రారంభోత్సవంలో దేవిశ్రీ ప్రముఖ ఎఫ్‌ఎమ్ స్టేషన్ రేడియో మిర్చి నుంచి మిర్చి లవ్ 104 ఎఫ్‌ఎమ్ పేరిట స్థాపించిన కొత్త రేడియో స్టేషన్‌ను ఆదివారం సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హైదరాబాద్‌లో ప్రారంభించారు TNN | Updated: Jan 17, 2017, 04:56PM IST తన పాటలకు, శ్రోతలకు మధ్య వారధిలా రేడియో మిర్చి ఎఫ్‌ఎమ్ స్టేషన్ నిలుస్తుందని.. తన పాటలకు శ్రోతల నుంచి వచ్చే స్పందనను రేడియోమిర్చి ద్వారా తెలుసుకుంటానని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ప్రముఖ ఎఫ్‌ఎమ్ స్టేషన్ రేడియో మిర్చి నుంచి మిర్చి లవ్ 104 ఎఫ్‌ఎమ్ పేరిట స్థాపించిన కొత్త రేడియో స్టేషన్‌ను ఆదివారం సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హైదరాబాద్‌లోప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేడియో మిర్చితో తన అనుబంధం ప్రత్యేకమైనది. ఈ సంస్థ నుంచి వస్తున్న ఈ కొత్త ఎఫ్‌ఎమ్ కూడా విజయవంతం కావాలన్నారు.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఫైనల్లో విన్నింగ్ షాట్ నేనే కొట్టాలి: రైనా ప్రపంచకప్‌ 2019‌ ఫైనల్లో విన్నింగ్ షాట్ తానే కొట్టాలని ఆశపడుతున్నట్లు భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా TNN | Updated: Aug 17, 2017, 08:58PM IST ప్రపంచకప్‌ 2019‌ ఫైనల్లో విన్నింగ్ షాట్ తానే కొట్టాలని ఆశపడుతున్నట్లు భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా వెల్లడించాడు. ఇటీవల శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో స్థానం కోల్పోయిన రైనా.. రెండేళ్ల నుంచి వన్డేలకి దూరంగా ఉంటున్నాడు. అయితే.. త్వరలోనే మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేస్తానని.. ఆస్ట్రేలియా లేదా పాకిస్థాన్‌తో జరిగే ఫైనల్లో తాను ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఇంగ్లాండ్‌లో 2019లో జరిగే ప్రపంచకప్ నేను ఆడతాను. ఆ టోర్నీ ఫైనల్లో భారత్ జట్టు ఆస్ట్రేలియా లేదా పాకిస్థాన్‌తో తలపడుతుంది. నేను విన్నింగ్‌ షాట్‌గా ఫోర్ కొట్టాలి.. అది చూసి స్టాండ్స్‌లోని నా కూతురు గ్రేషియా చప్పట్లు కొట్టాలి. ఆ సమయంలో జాతీయ జెండా స్టేడియంలో ఎగురుతూ ఉండాలి. ప్రస్తుతం ఇదే నా కల. నా కూతురుని నేను అమితంగా ప్రేమిస్తున్నాను.. అలానే దేశం కోసం ఆడటాన్ని కూడా అంతే ఇష్టపడతాను’ అని రైనా వివరించాడు.
2sports
Nov 15,2018 19% పెరిగిన జీవోసీఎల్‌ కార్ప్‌ లాభం న్యూఢిల్లీ: హిందుజా గ్రూపు కంపెనీ జీవోసీఎల్‌ కార్పొరేషన్‌ (గతంలో గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వ్యవహిరంచబడిన) సంస్థ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు మధ్య కాలానికి సంస్థ నికర లాభం 18.9 శాతం మేర పెరిగి రూ.3.16 కోట్ల నుంచి రూ.3.75 కోట్లకు చేరుకుంది. కాగా ఇదే సమయంలో సంస్థ అమ్మకాల్లో 13.34 శాతం తగ్గుదల నమోదు అయింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు రూ.23.02 కోట్ల నుంచి రూ.19.95 కోట్లకు కుంగాయి. సెప్టెంబరుతో ముగిసిన మొదటి అర్థ భాగంలో జీవోసీఎల్‌ కార్పొరేషన్‌ రూ.266 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో సంస్థ నికర లాభం 5.6% వృద్ధి చెంది రూ.13.93 కోట్లకు చేరుకుంది. న్యూఢిల్లీ: హిందుజా గ్రూపు కంపెనీ జీవోసీఎల్‌ కార్పొరేషన్‌ (గతంలో గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వ్యవహిరంచబడిన) సంస్థ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు మధ్య కాలానికి సంస్థ నికర లాభం 18.9 శాతం మేర పెరిగి రూ.3.16 కోట్ల నుంచి రూ.3.75 కోట్లకు చేరుకుంది. కాగా ఇదే సమయంలో సంస్థ అమ్మకాల్లో 13.34 శాతం తగ్గుదల నమోదు అయింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు రూ.23.02 కోట్ల నుంచి రూ.19.95 కోట్లకు కుంగాయి. సెప్టెంబరుతో ముగిసిన మొదటి అర్థ భాగంలో జీవోసీఎల్‌ కార్పొరేషన్‌ రూ.266 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో సంస్థ నికర లాభం 5.6% వృద్ధి చెంది రూ.13.93 కోట్లకు చేరుకుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV రెండో ఏడాది త‌గ్గిన హెచ్1బీ వీసా ద‌ర‌ఖాస్తులు ట్రంప్ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి స్థానికుల ఉపాధి కోసం విదేశీ వ‌ల‌స‌ల‌పై ఉక్కు పాదం మోపుతున్నారు. దీంతో వ‌రుస‌గా రెండో ఏడాదీ హెచ్-1బీ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసే వారి సంఖ్య త‌గ్గింది. TNN & Agencies | Updated: Apr 15, 2018, 02:20PM IST రెండో ఏడాది తగ్గుదలే ట్రంప్ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి స్థానికుల ఉపాధి కోసం విదేశీ వ‌ల‌స‌ల‌పై ఉక్కు పాదం మోపుతున్నారు. దీంతో వ‌రుస‌గా రెండో ఏడాదీ హెచ్-1బీ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసే వారి సంఖ్య త‌గ్గింది. 2018-19 సంవ‌త్స‌రంలో అక్టోబ‌ర్ నుంచి అనుమ‌తించే విదేశీ వృత్తి నిపుణుల‌కు సంబంధించి 1.90 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అమెరికా ఏజెన్సీ యూఎస్సీఐఎస్ వెల్ల‌డించింది. అంత‌కుముందు సెష‌న్లో అనుమ‌తించిన దాదాపు 2 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల కంటే ఇది త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం. ఇండియ‌న్ ఐటీ నిపుణుల‌కు ఇక క‌ష్ట‌మే 2017-18 సంవ‌త్స‌రం కంటే ఈసారి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు 8902(4.5%) త‌గ్గాయి. ట్రంప్ అధికార గ‌ణం యూఎస్ దేశానికి వ‌చ్చే వృత్తి నిపుణుల‌ను నియంత్రించేందుకు తీసుకున్న క‌ఠిన చ‌ర్య‌లే ఇందుకు కార‌ణం. గ‌త కొన్ని నెల‌ల్లో భార‌త‌ ఐటీ కంపెనీల‌న్నీ స్థానిక నియామ‌కాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తుండ‌టం వ‌ల్లే హెచ్-1బీ వీసాల విష‌యంలో ఆస‌క్తి త‌గ్గిపోయిన‌ట్లు తెలుస్తోంది. 2013-14 నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం యూఎస్సీఐఎస్ హెచ్1-బీ వీసాల విష‌యంలో లాట‌రీ ప‌ద్ద‌తిని అనుస‌రిస్తోంది. 2016-17 సంవ‌త్స‌రంలో ఈ విధ‌మైన హెచ్-1బీ వీసాల కోసం ద‌ర‌ఖాస్తుల సంఖ్య అత్య‌ధికంగా 2.4ల‌క్ష‌లుగా న‌మోద‌యింది. ప్ర‌స్తుతం అభ్య‌ర్థులు ప్ర‌య‌త్నించిన ద‌ర‌ఖాస్తుల‌ను ఆ సంఖ్య‌తో పోల్చి చూస్తే 20% త‌గ్గుద‌ల క‌న‌బ‌డుతోంది. ఇది కూడా చదవండి హెచ్-1 బీ వీసా మరింత గగనం! క‌ఠిన నిబంధ‌న‌ల‌తో త‌గ్గుతున్న ద‌ర‌ఖాస్తుల సంఖ్య‌ రెండో ఏడాది తగ్గుదలే క‌ఠిన నిబంధ‌న‌ల‌తో త‌గ్గుతున్న ద‌ర‌ఖాస్తుల సంఖ్య‌   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
Aug 06,2015 1.1లక్షల కోట్ల సమీకరణ: జైట్లీ               న్యూఢిల్లీ: ద్రవ్యపరమైన అవసరాల కోసం దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రానున్న ఏళ్లలో సుమారు రూ.1.1 లక్షల కోట్ల మేర నిధులను మార్కెట్ల నుంచి సమీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైటీ బుధవారం పార్లమెంట్‌కు తెలిపారు. నిరర్ధక రుణాలు ఉచ్చులో చిక్కుకున్న బ్యాంకులకు కొత్త జవసత్వాలు అవసరమని ఆయన అన్నారు. రానున్న నాలుగేళ్లలో ఆయా బ్యాంకులకు దాదాపు 2800 కోట్ల డాలర్ల మేర మూలధనాన్ని సమకూర్చాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పరోక్ష పన్నుల వసూళ్లు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం మేర పెరిగినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెరిగితే ప్రభుత్వం రోడ్లు, భవనాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై చేస్తున్న వ్యయాన్ని పెంచుతుందని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
- కరేబియన్‌ అమ్మాయిలపై - ఏడు వికెట్లతో గెలుపు గయానా: భారత మహిళల క్రికెట్‌ జట్టు కరేబియన్‌లపై ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచులు మిగిలుండగానే 3-0తో చేజిక్కించుకున్నారు. గురువారం జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ జట్టు భారత బౌలర్ల దెబ్బకు 59 పరుగులకే పరిమితమయ్యారు. రాధా, దీప్తిలకు రెండేసి, అనూజ, పూజ, హర్మన్‌, పూనమ్‌లకు తలా ఒక వికెట్‌ పడగొట్టారు. చెడీన్‌ నేషన్‌(11), హెన్రీ(11) టాప్‌ స్కోరర్లు. అనంతరం 60 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. గత టీ20లో అదరగొట్టిన ఓపెనర్‌ షెఫాలీ వర్మ(0) డకౌటై నిరాశపరిచింది. ఆ తర్వాత మంధాన(3), హర్మన్‌ ప్రీత్‌కౌర్‌(7) స్వల్ప స్కోర్‌లకే పెవీలియన్‌కు చేరిపోయారు. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్‌(40 నాటౌట్‌), దీప్తి(7 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి 16.4 ఓవర్లలో భారత్‌కు విజయాన్ని సంపాదించిపెట్టారు. ఉమెన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోడ్రిగ్స్‌కు దక్కగా... నాల్గో టీ20 ఆదివారం జరగనుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రణ్‌బీర్‌తో వ్యాన్‌లో కూర్చోనన్న కత్రినా నిన్నమొన్నటివరకు చేతిలో చెయ్యేసి ప్రేమపక్షుల్లా దేశాలు చుట్టొచ్చిన రణ్‌బీర్, కత్రినాల మధ్య సడెన్‌గా ఎంత గ్యాప్ పెరిగిందో.. TNN | Updated: Jan 20, 2016, 05:47PM IST రణ్‌బీర్‌తో వ్యాన్‌లో కూర్చోనన్న కత్రినా నిన్నమొన్నటివరకు చేతిలో చెయ్యేసి ప్రేమపక్షుల్లా దేశాలు చుట్టొచ్చిన రణ్‌బీర్, కత్రినాల మధ్య సడెన్‌గా ఎంత గ్యాప్ పెరిగిందో చెప్పడానికి జనవరి 18న జరిగిన 'జగ్గా జాసూస్' షూటింగ్‌లో అనేక ఉదాహరణలు కనిపించాయి. కొంత కాలంగా కత్రినాతో కలిసి సహజీవనం చేస్తున్న రణ్‌బీర్ ఆ ఇంట్లోంచి వెళ్లిపోయాకా ఆమె మాత్రం అదే ఇంట్లో వుంటూ వస్తోంది. ఇదిలావుంటే, జనవరి 8 నుంచి 'జగ్గా జాసూస్' షూటింగ్‌కి రణ్‌బీర్ ఒక్కడే హాజరయ్యాడు. తాజాగా జనవరి 18 నుంచి కత్రినా కూడా షూటింగ్‌కి రావడం మొదలుపెట్టింది. అంతకుముందు కలిసి షూటింగ్‌కి వచ్చేవారు. కలిసే వెళ్లిపోయేవారు. లొకేషన్‌లో వున్నంతసేపు ఒక్కటే వ్యానిటీ వ్యాన్‌ని ఉపయోగించుకునేవారు. కానీ ఈ బ్రేకప్ తర్వాత ఇద్దరూ వేరుగా రావడం, వేర్వేరుగా వెళ్లిపోవడం కనిపించింది. అన్నింటికిమించి ఇంతకాలం రణ్‌బీర్‌తో కలిసి వ్యానిటీ వ్యాన్‌ని పంచుకున్న కత్రినా.. తాజాగా తన కోసం మరో వ్యానిటీ వ్యాన్‌ని తెప్పించుకుంది. లొకేషన్‌లో వున్నంతసేపు ఖాళీ సమయం అంతా అందులోనే గడిపింది. ఒకే ఒక్క సీన్ కోసం ఇద్దరూ కలిసి నటించినప్పటికీ.. అంతకుముందులా ఇద్దరూ కలిసి మాట్లాడుకోలేదు. కనీసం ఒకరివైపు మరొకరు చూసుకోనూలేదు. వీళ్లిద్దరి వింత ప్రవర్తన చూసిన యూనిట్ సభ్యులు.. అంతలోనే ఇంత మార్పేంటి అని ఆశ్చర్యంపోతున్నారు. వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టు.. వీళ్ల బ్రేకప్ జగ్గా జాసూస్ మూవీ డైరెక్టర్ అనురాగ్ బసుని టెన్షన్ పెట్టిస్తోంది. షూటింగ్‌లోనే ఇలా ఎడమొహం పెడమొహం అన్నట్టుగా వుంటే ఇక ఈ ఇద్దరూ కలిసి సినిమాని ఎలా ప్రమోట్ చేస్తారనేది అనురాగ్ భయమట!!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Mar 22,2018 రద్దులో తర్కం అర్థం కాలేదు! కోల్‌కతా: మోడీ సర్కారు నోట్లరద్దును ఎందుకు చేపట్టిందో తనకు ఇప్పటి వరకు అర్థం కాలేదని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ తన విశ్లేషణ ప్రకారం పెద్దనోట్ల రద్దు చర్యను పట్టణ మేధావులు చాలా మంది అంగీకరించనప్పటికీ.. గ్రామీణ భారతంలో అత్యధికులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారని వివరించారు. తాను వాస్తవానికి ఆర్థిక శాస్త్ర నిపుణుడిని కాదని..తన ద ష్టికి వచ్చిన అంశాల్ని మాత్రమే చెబుతున్నట్టుగా వివరించారు. దేశంలో దాదాపు 75 శాతం మంది చిన్నారులు పాఠశాలకు వెలుతున్నా అందులో చాలా మంది 8వ తరగతికి వచ్చే సరికి డ్రాపవుట్‌గా మిగిలి పోతున్నారని అన్నారు. వీరు 22 ఏండ్లకు వచ్చే సరికి ఉపాధి కోసం ఉద్యోగ అన్వేషణకు వస్తున్నారని తెలిపారు. పెద్ద చదువులకు పోని కారణంగా వీరు ఎక్కువగా తక్కువ టెక్నాలజీతో కూడిన ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారని నిరుద్యోగులుగా మారిపోతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా జపాన్‌, చైనాల మాదిరిగా తక్కువ టెక్నాలజీతో కూడిన తయారీ రంగంపై మొదటి నుంచి దృష్టి సారించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV నా ప్రియుడు నాకంటే 21 ఏళ్ల చిన్నవాడు, అయితే ఏంటి: నటి 21 ఏళ్ల వయసున్న కుర్రాడితో డేటింగ్‌లో ఉన్న హాలీవుడ్ నటి. అంతకుముందే పెళ్లై అదే వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తనకు ఇలాంటివేవీ పట్టవంటూ షాకింగ్ కామెంట్స్. Samayam Telugu | Updated: Nov 4, 2019, 02:03PM IST హెలెనా ఏంటో ఈ ప్రపంచం.. కొడుకు వయసున్న వారితో, మనవడి వయసున్న వారితో డేటింగ్ చేసేస్తున్నారు నటీమణులు. అదేంటని అడిగితే ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఒక్కమాటలో సమాధానం ఇచ్చేస్తారు. ఇప్పటికే బాలీవుడ్‌లో మలైకా అరోరా, ప్రియాంక చోప్రా తమకంటే పదేళ్లు చిన్న వయసున్న వారితో ప్రేమలో ఉన్నారు. తనది కేవలం ఆకర్షణ కాదు అని నిరూపించుకోవడానికి ప్రియాంక ఏకంగా పెళ్లే చేసుకుంది. కానీ ఈ నటి లవ్ స్టోరీ మాత్రం ఇంకా షాకింగ్‌గా ఉంది. ఏకంగా కొడుకు వయసున్న కుర్రాడితో డేటింగ్‌లో ఉంది. హెలెనా బోన్హామ్ అనే 53 ఏళ్ల హాలీవుడ్ నటికి ఇది వరకే దర్శకుడు టిమ బర్టన్‌తో పెళ్లైంది. అతనితో ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవలై విడిపోయారు. ఇప్పుడు హెలెనా తన కంటే 21 ఏళ్లు చిన్నవాడైన రైటర్ రై హోమ్‌బోతో డేటింగ్‌లో ఉంది. పైగా తన ప్రేమ విషయం గురించి మీడియా ముందు ధైర్యంగా మాట్లాడేస్తోంది కూడా. READ ALSO: ‘ఏమ్మా ప్రియాంకా నీ సిగరెట్లు ఎక్కడ?’ ‘అవును నా బాయ్‌ఫ్రెండ్ నాకంటే 21 ఏళ్లు చిన్నవాడు. అయితే ఏంటి? నాకు వయసు విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. అలాంటప్పుడు ప్రేమించుకుంటే తప్పేంటి? నా ప్రియుడు చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాడు. అతని వయసు చిన్నదే అయినా ఆలోచనా విధానం మాత్రం పెద్దవారిలా ఉంటుంది. నాకు అంతకంటే ఇంకేం కావాలి. చాలా మంది ముసలివాళ్లను చూస్తే భయపడుతుంటారు. కానీ నా బాయ్‌ఫ్రెండ్ అలా కాదు. ముసలివాళ్లయ్యాక ఆడవాళ్లు చాలా పవర్‌ఫుల్‌గా తయారు అవుతారు. మాలాంటి వారితో డేటింగ్‌ చేస్తే చాలా ఫన్‌గా ఉంటుంది. ఇప్పుడు మేం పిల్లల్ని కనలేం. అంతమాత్రాన మేం ఈ వయసులో రొమాంటిక్‌గా ఉండమని కాదు. మేం సెక్స్‌ను ఈవయసులోనూ ఎంజాయ్ చేస్తాం. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు మాకు గర్భం వస్తుందేమోనన్న భయం కూడా ఉండదు. కాబట్టి ఫన్ కోసం మరొకరితో డేటింగ్ చేయడంలో ఎంత మాత్రం తప్పు లేదు’ అని నిర్మొహమాటంగా చెప్పింది. READ ALSO: ‘సాఫ్ట్ పోర్న్ సినిమాలు తీస్తున్నారు, Karan Johar లాంటివారిని శిక్షించండి’ ఎవరి పిచ్చి వారి ఆనందం అన్నట్టు.. మున్ముందు ఇలాంటి ఇంకెన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందో ఏమో. ఇది 21వ శతాబ్దం, 2019లో ఉంటున్నాం.. ఇంకా అలాంటి పాత ఆలోచనలేంటి? అంటూ కొన్ని విలువలను తీసి పారేస్తున్నారు. ఎవరి ఇష్టం వారిది. కానీ ఇలాంటివారి వల్ల సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఊహించడానికే కష్టంగా ఉంది.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Gold Rate: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు . ఒకవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం, మరోవైపు అమెరికా - చైనా మధ్య నెలకొన్నొ వాణిజ్య యుద్దం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. Samayam Telugu | Updated: Sep 25, 2018, 01:43PM IST Gold Rate: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి.. ప్రస్తుతం రూ.32,160 వద్ద కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం అతిస్వల్పంగా రూ.10 పెరిగి రూ.30,160 వద్ద కొనసాగుతోంది. ఒకవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం, మరోవైపు అమెరికా - చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్దం నేపథ్యంలో బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి ధరలు కూడా పతనమయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే రూ.90 తగ్గిన 100 గ్రాముల వెండి ధర ప్రస్తుతం రూ.4,020 వద్ద కొనసాగుతోంది. దీంతో సోమవారం కిలో వెండి ధర రూ.41,100 పలకగా..మంగళవారం రూ.40,110గా ట్రేడ్ అవుతోంది. సెప్టెంబరు 25న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు నగరం 22 కారెట్ల బంగారం ధర 24 కారెట్ల బంగారం ధర చెన్నై
1entertainment
వేగంగా బీఎస్‌ఈ ఐపీఓ పనులు -  జులైలో సెబీకి 'డ్రాఫ్ట్‌ ప్రాస్పెక్టస్‌' దాఖలు!   ముంబయి: ఆసియాలోని ప్రధాన స్టాక్‌ మార్కెట్లలో ఒకటైన 'బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ' (బీఎస్‌ఈ) ప్రాథమిక మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ద్వారా సుమారుగా రూ.800 కోట్ల మేర నిధుల సమీకరణకు గాను జులైలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి 'డ్రాఫ్ట్‌ పేపర్స్‌్‌'ను సమర్పించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. బీఎస్‌ఈ ఐపీఓ ఈ ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఎక్స్ఛేంజీ నికర లాభం 38 శాతం మేర కుంగి రూ.96.74 కోట్లకు పరిమితమైంది. ఇదే కాలంలో ఆదాయం రూ.583.71 కోట్ల నుంచి రూ.616.19 కోట్లకు చేరింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 212 Views   సిడ్నీ: టీమిండియా కష్ట సమయాల్లో మ్యాచ్‌ విన్నర్‌ పాత్ర పోషించిన స్టార్‌ ఆటగాడు యువరాజ్‌ సేవలను టి20 వరల్డ్‌ కప్‌లో వినియోగించుకోవాలని మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ సూచించాడు.కాగా ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌ స్వీప్‌ చేయడంలో యువరాజ్‌ పాత్ర అభినందనీయమని గవాస్కర్‌ పేర్కొన్నాడు.ఆస్ట్రేలియాతో జరిగి చివరి టి20 మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో భారత్‌ విజయానికి 17 పరుగులు అవసరమైన సమయంలో యువరాజ్‌ రెండు బంతులను బౌండరీ,సిక్సర్‌గా మలిచిన తీరును కొనియాడాడు.కాగా ఈ రెండు షాట్లను కొట్టి సురేష్‌ రైనా ఓత్తిడి తగ్గించడంతోనే టీమిండియా విజయం సాధ్యమైందన్నాడు.యువరాజ్‌లో ఇంకా శక్తి ఉందనడానికి అతను మూడు విభాగాల్లోనూ బ్యాటింగ్‌,ఫీల్డిండ్‌,బౌలింగ్‌లో ఆకట్టుకోవడమే నిదర్శనమన్నాడు.బౌలింగ్‌ విభాగంలోనూ ఉత్తమంగా ఆడాడని గవాస్కర్‌ పేర్కొన్నాడు.యువరాజ్‌ ఆట తీరుకు సంబంధించి తొందర పడి నిర్ణయాలు తీసుకోకుండా సహనం పాటిస్తే మంచిదని గవాస్కర్‌ సలహా ఇచ్చాడు.టి20 ప్రపంచ కప్‌ భారత జట్టులో యువరాజ్‌ తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.కాగా రైనా కూడా టి20 ఫార్మట్‌లో సత్తా కనబరిచే ఆటగాడేనని గవాస్కర్‌ వివరించాడు.
2sports
Jul 18,2017 సిగరెట్లపై సెస్సు న్యూఢిల్లీ : సిగరెట్లపై సెస్‌ విధించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. సెస్‌ విధింపుతో రూ. 5 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. జీఎస్టీలో భాగంగా ఇప్పటికే 28 శాతం పన్నురేటు సిగరెట్లపై అమలవుతున్నది. దీంతో పాటు మరో 5 శాతం యాడ్‌వెలొరమ్‌ సెస్‌ కూడా కొనసాగుతుందని ఆయన చెప్పారు.
1entertainment
murugadoss to direct prabhas after vijay`s film? మురుగదాస్ ప్రభాస్‌ని కలిశాడా ? సౌతిండియాలోనే కాకుండా బాలీవుడ్‌కి సైతం పరిచయం వున్న స్టార్ డైరెక్టర్ మురుగదాస్, ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ప్లాన్... TNN | Updated: Sep 5, 2017, 03:03PM IST సౌతిండియాలోనే కాకుండా బాలీవుడ్‌కి సైతం పరిచయం వున్న స్టార్ డైరెక్టర్ మురుగదాస్, ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. మురుగదాస్ ప్రస్తుతం మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ 'స్పైడర్' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా వున్నాడు. 'స్పైడర్' తర్వాత విజయ్‌తో ఓ సినిమా చేస్తానని ఆల్రెడీ ప్రకటించిన మురుగదాస్.. విజయ్ తర్వాత ప్రభాస్‌తో ఓ సినిమా డైరెక్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఫిలింనగర్ టాక్. అందులో భాగంగానే మురుగ ఇటీవల ప్రభాస్‌తో భేటీ అయినట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బాహుబలి 2 సినిమాతో బాలీవుడ్‌లోనూ జండా పాతిన ప్రభాస్ సైతం ఇకపై తన ప్రాజెక్ట్స్ ఆ స్థాయిలోనే వుంటే బాగుంటుందని భావిస్తున్నాడట. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా కూడా అలాగే భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. మురుగదాస్‌కి కూడా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో అభిమానులు వున్నారు. ఈ మూడు భాషల ఆడియెన్స్ పల్స్ ఏంటో మురుగకు బాగా తెలుసు. అందుకే మురుగ సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పినా చెప్పవచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్-మురుగ కాంబినేషన్‌లో సినిమా లేదని కొంతమంది చెబుతున్నప్పటికీ.. అసలు వాస్తవం మాత్రం ఇదే అంటున్నాయి సినీవర్గాలు. అంతిమంగా ఏం జరుగుతుందో చూడాలిమరి.
0business
Kolcutta Knight Riders టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న నైట్‌రైడర్స్‌ కోల్‌కతా: కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైటరైడర్స్‌ టాస్‌ గెలిచింది.. ఫీలిండ్‌ ఎంచుకుంది.. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.. 8 గంటలకు ప్రారంభించాల్సిన మ్యాచ్‌ 8.30 గంటలకు ప్రారంభమైంది.. కాసేపట్లో ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ప్రారంభించనుంది.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV తల నరకడం కాదు.. ధోనీ దెబ్బకు గుండెలు పగిలేలా రోదించారు ధోనీ తలతో బంగ్లా బౌలర్ ఉన్నట్టుగా ఫొటోషాప్ చేసిన బంగ్లా అభిమానులు.. అదే ధోనీ దెబ్బకు గుండెలు పగిలేలా రోదించారు. Samayam Telugu | Updated: Mar 23, 2018, 02:28PM IST తల నరకడం కాదు.. ధోనీ దెబ్బకు గుండెలు పగిలేలా రోదించారు బంగ్లాదేశ్ క్రికెటర్లు తమ ఆటతీరు కంటే వ్యవహారశైలితోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తారనే సంగతి తెలిసిందే. ఇటీవల శ్రీలంకపై గెలిచి నాగినీ డ్యాన్స్‌లతో సంబరాలు చేసుకోవడం, డ్రెస్సింగ్ రూంలో గ్లాస్ డోర్ పగలగొట్టడం ఇవన్నీ ఓ మచ్చుతునక మాత్రమే. బంగ్లా ఫ్యాన్స్ సంగతి ఇక చెప్పనక్కర్లేదు. గతంలో భారత్‌తో తలపడిన సందర్భాల్లోనూ బంగ్లా ఆటగాళ్లు, అభిమానులు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. మరి దానికి భారత్ ఎలా బదులిచ్చిందో మరోసారి గుర్తు చేసుకుందాం. Visit Site Recommended byColombia రెండేళ్ల క్రితం అంటే 2016లో బంగ్లాదేశ్ ఆసియా కప్‌కి ఆతిథ్యం ఇచ్చింది. బంగ్లా జట్టు సెమీఫైనల్లో పాక్‌ను ఓడించి ఫైనల్లో భారత్‌తో పోరుకి సమాయత్తమైంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు బంగ్లా అభిమానులు శ్రుతి మించి వ్యవహరించారు. బంగ్లా బౌలర్ టస్కీన్ అహ్మద్ నరికిన ధోనీ తలను చేత్తో పట్టుకున్నట్టుగా ఫొటోషాప్‌లో మార్ఫింగ్ చేశారు. ఈ ఫొటో చూసి ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు, అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు. మార్చి 6న జరిగిన ఫైనల్లో ధోనీ సేన బంగ్లాను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తర్వాత కేవలం ఒక్క రోజు గ్యాప్‌తోనే భారత గడ్డ మీద టీ20 వరల్డ్ కప్ ఆరంభమైంది. మార్చి 23న బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ధోనీ సేన ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని ఖాతాలో వేసుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 146/7కే పరిమితమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ విజయం దిశగా సాగింది. చివరి ఓవర్లో 11 పరుగులు చేస్తే బంగ్లాదే గెలుపు. హార్దిక్ పాండ్య విసిరిన చివరి ఓవర్ మొదటి బంతికి మహ్మదుల్లా సింగిల్ తీయగా.. రెండు, మూడు బంతులను ముస్తాఫికర్ రహీమ్ బౌండరీకి తరలించాడు. బంగ్లా విజయానికి మూడు బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరం. దీంతో బంగ్లా అభిమానులు ముందుగానే సంబరాలు చేసుకున్నారు. ఈ దశలో విన్నింగ్ షాట్‌గా సిక్స్ బాదడం కోసం యత్నించిన ముస్తాఫికర్, మహ్మదుల్లా వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో బంగ్లా విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. ఒక్క పరుగు చేస్తే మ్యాచ్ టైగా ముగిసే అవకాశం. దీంతో ధోనీ, నెహ్రా కలిసి బంతి ఎక్కడ విసరాలో పాండ్యకు సలహా ఇచ్చారు. ధోనీ తన బుర్రకు పదును పెట్టి కట్టుదిట్టంగా ఫీల్డింగ్ సెట్ చేశాడు. క్రీజ్‌లోకి వచ్చిన షువగట పాండ్య విసిరిన చివరి బంతిని ఆడటంలో విఫలమయ్యాడు. కానీ సింగిల్‌ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని ముస్తాఫిజుర్ రహ్మాన్ వేగంగా పరిగెత్తుకొచ్చాడు. ఇలా జరుగుతుందని ముందే పసిగట్టిన ధోనీ బంతిని అందుకోవడమే ఆలస్యం.. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు. ధోనీ రనౌట్ చేయడంతో ఆఖరి బంతికి తమ జట్టు అనూహ్యంగా ఓడిపోవడంతో.. బంగ్లా ఫ్యాన్స్ షాకయ్యారు. ఫొటోషాప్‌లో తన తలనరికిన ఫొటోను క్రియేట్ చేసి రాక్షసానందం పొందిన బంగ్లా అభిమానులకు ధోనీ క్షణాల్లో వికెట్లను గిరాటేసి తన సత్తా ఏంటో చాటాడు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో చివరి బంతికి సిక్స్ బాదిన దినేశ్ కార్తీక్ కూడా మరోసారి బంగ్లా ఫ్యాన్స్‌‌కు టీమిండియా పవరేంటో రుచి చూపాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
internet vaartha 105 Views హైదరాబాద్‌ : భారత్‌లో హైఎండ్‌ కుట్టు, ఎంబ్రాయిడరీ మార్కెట్‌పరంగా సాలీనా ఐదువేల యూనిట్ల సామర్ధ్యంఉంది. మార్కెట్‌ సైజ్‌ను పరిశీలిస్తే వార్షిక పద్ధతిలో రూ.50కోట్ల వరకూ ఉం టుందని ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌ డైరెక్టర్‌ పివీరభద్రుడు వెల్లడించారు. ఎంబ్రాయిడరీలకు మధ్య, తూర్పు భారత్‌దేశం అతిపెద్ద మార్కెట్‌ అని దక్షిణ భారత్‌లో ఈట్రెండ్‌ ఇపుడిపుడే వేగంగా పెరుగుతోందని అన్నారు. కుట్టుమిషన్ల రంగంలో అత్యాధునిక ఫీచర్లతో ఉన్నమెషిన్లను కస్టమర్ల కోసం ఉత్పత్తుల ప్రదర్శ న ఏర్పాటు చేసామన్నారు. ఈఎక్స్‌పోలో జర్మనీ, అమెరికా, స్వీడన్‌ దేశాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీల కుట్టుమిషన్లను ప్రదర్శించారు. కుట్టు, ఎంబ్రాయిడరీ విభాగంలో అత్యధిక నైపుణ్యత కలిగిన మెషిన్లను మహిళలకు వివరించారు. స్వీడన్‌కుచెందిన వికింగ్‌, జర్మనీకి చెందిన పిఎఫ్‌ఎఎఫ్‌ఎఫ్‌, అమెరికాకు చెందిన హ్యాండీ క్విల్టింగ్‌ మెషిన్లు ఎక్కువ ప్రద ర్శనకు వచ్చాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌ ఎక్కువ మార్కెటింగ్‌చేస్తోంది. 15కుపైగా హైఎండ్‌ మెషిన్లను మొదటిసారిగాప్రదర్శించారు. బౌటిక్‌ యజమానులు, గార్మెంట్‌ ఎగుమతి దారులు, ఫ్యాబ్రికేటర్లు, లోగో తయారీదారులు, జాబ్‌ వర్క ర్లు, ఫ్యాషన్‌ డిజైనర్లు, క్విల్ట్‌మేకర్లు లెక్కకు మించిన సంఖ్య లో పాల్గొన్నారు. ఈహెఎండ్‌ కుట్టుమిషన్లు రూ.40వేల నుంచి రూ.12.80లక్షలధరల్లో ఉన్నాయి. ఇటీవలికాలంలో ఎంబ్రాయిడరీ వర్క్‌నుమహిళలు ఎక్కువ ఇష్టపడుతున్నా రని అందువల్లనే మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా వీటిని తెచ్చినట్లు ధనలక్ష్మి డైరెక్టర్‌ పి.వీరభద్రుడు పేర్కొన్నారు.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV బౌలింగ్ చేసి వికెట్ పడగొట్టిన ఫించ్.. అరుదైన జాబితాలో చోటు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్ చేశాడు. బౌలింగ్ చేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో అరుదైన జాబితాలో ఫించ్ చోటు దక్కించుకున్నాడు. Samayam Telugu | Updated: Jun 12, 2019, 09:43PM IST హైలైట్స్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్ చేశాడు. బౌలింగ్ చేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో అరుదైన జాబితాలో ఫించ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్‌ వేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఎడమ చేత్తో బౌలింగ్ చేసే ఫించ్.. పాక్‌పై రెండు ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ పడగొట్టాడు. తద్వారా వరల్డ్ కప్‌లో వికెట్ తీసిన ఐదో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. 27 ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ఫించ్ ఊరించే ఫుల్ టాస్‌తో హఫీజ్‌ను బుట్టలో వేసుకున్నాడు. 49 బంతుల్లో 46 పరుగులు చేసిన హఫీజ్ ప్రమాదకరంగా మారుతున్న దశలో.. ఫించ్ అతడిని ఔట్ చేసి ఆసీస్‌కు బ్రేక్ ఇచ్చాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలెన్ బోర్డర్. అతడు 16 మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీశాడు. స్టీవ్ వా 10 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇయాన్ ఛాపెల్, మైకెల్ క్లార్క్ కూడా చెరో వికెట్ చొప్పున పడగొట్టారు. తాజాగా ఫించ్ వీరి సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో ఫించ్ 82 పరుగులతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. వార్నర్, ఫించ్ కలిసి తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించారు. ఆసీస్ 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటయ్యింది.
2sports
ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్‌ రెండో దశకు సీసీఈఏ ఆమోదం దిల్లీ: గ్రిడ్‌తో అనుసంధానం చేస్తూ ఇళ్లు/కార్యాలయాల పైకప్పులపై ఏర్పాటు చేసే సౌర ఫలకాల ప్రాజెక్టు రెండో దశకు ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. 2022 నాటికి ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా 40,000 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని అమలు చేయడానికి కేంద్రం రూ.11,814 కోట్లు వెచ్చించనుంది. గృహ రంగంలో 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర పైకప్పు వ్యవస్థలకు 40 శాతం, 3 కిలోవాట్ల నుంచి 10 కిలోవాట్ల మధ్య సామర్థ్యం కలిగిన వాటికి 20 శాతం చొప్పున కేంద్రం ఆర్థిక మద్దతు ఇవ్వనుంది. గ్రూప్‌ హౌసింగ్‌ సొసైటీలు, సంక్షేమ సంఘాలకు దీన్ని 20 శాతానికి పరిమితం చేశారు. సంస్థలు, విద్యా, సామాజిక, ప్రభుత్వ, వాణిజ్య, పారిశ్రామిక విభాగాలకు ఆర్థిక మద్దతు లభించదు. ప్రధానాంశాలు
1entertainment
internet vaartha 232 Views ముంబై : క్రికెటర్లు ధోనీ,కోహ్లీ,అశ్విన్‌లతో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌తో కలిసిన చేసిన ఒక అడ్వర్టయిజ్‌మెంట్‌ ఇంటర్నెట్లో వైరల్‌ అవుతుంది. ఒక మొబైల్‌ ఫోన్‌ ప్రచారం కోసం తీసిన వాణిజ్య ప్రకటనలో వీరందరూ కలిసి చల్‌చల్‌ చేశారు. కాగా ఈ యాడ్‌లో అశ్విన్‌ స్మార్ట్‌ ఫోన్‌లో కంగనా రనౌత్‌ వీడియో చూస్తుంటాడు,అదే సమయానికి ధోనీ,కోహ్లీ అక్కడకు వసారు,అప్పుడే కంగనా కూడా అక్కడకు వస్తుంది,ధోనీ,కోహ్లీలు ఆమెను అక్కడే చాటుగా ఉంచుతారు.అశ్విన్‌ వద్దకు వెళ్తారు.మళ్లీ కంగనానే చూస్తున్నావా అని అతడిని అడుగుతారు.దానికి అశ్విన్‌ స్పందిస్తూ ఇదేం ఫోన్‌ చెత్తగా ఉందని,ఇందులో పిక్చర్‌ క్వాలిటీ బాగా లేదని విసుక్కుంటాడు.దానికి ధోనీ,కోహ్లీలు లైఫ్‌ అనే స్మార్ట్‌ ఫోన్‌ను అశ్విన్‌ చేతికి ఇచ్చి ఇందులో పిక్చర్‌ క్వాలిటి అదిరిపోద్ది,ఒక్కసారి స్క్రీన్‌ టచ్‌ చేస్తే కంగనా నీ ముందుకు వచ్చినట్లే ఉంటుందని చేతికి ఇస్తారు.వారు ఇచ్చిన పోన్‌ స్క్రీన్‌ను అశ్విన్‌ టచ్‌ చేస్తాడు.అప్పుడే అక్కడ గోడ చాటున ఉన్న కంగనా రనౌత్‌ వచ్చి వారి ముందు డాన్స్‌ చేస్తుంది. అలా అందరూ కలిసి లైఫ్‌ స్మార్ట్‌ ఫోన్‌ కోసం డ్యాన్స్‌చేస్తారు.
2sports
ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు పెంచే యోచనలో... - జులై 7న జరిగే సీబీటీ సమావేశంలో నిర్ణయం : దత్తాత్రేయ హైదరాబాద్‌ : ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లో ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులను పెంచే యోచనలో వున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సంకేతాలిచ్చారు. ప్రస్తుతం 5శాతంగా వున్న ఈ పెట్టుబడులను 15శాతం దాకా పెంచనున్నట్టు తెలిపారు. ఈ దిశగా జూలై 7న జరిగే సెంటల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గతేడాది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్‌ఓ నూతన పెట్టుబడుల విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా 5శాతం నుంచి 15శాతం వరకు నిధులను ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధింత స్కీమ్‌ల్లో పెట్టుకునేందుకు సంస్థకు అనుమతి ఇచ్చినట్టు వివరించారు. మార్చి 31 2016 నాటికి 0.37శాతం రాబడితో రూ.6,577 కోట్ల పెట్టుబడికి గానూ రూ.6,601 కోట్లు రాగా, ఏప్రిల్‌ 30, 2016లో రూ.6,674 కో ట్లకు 1.68 శాత ంతో రూ.6,786 కోట్ల రా బడి వచ్చినట్టు మంత్రి పేర్కొ న్నారు. ఇకపోతే భ విష్యనిధి సంస్థ ఆగస్టు 2015లో ఈక్విట్‌ మార్కెట్లోకి ప్రవేశించిన విషయం విదితమే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
అలాంటివి చూసైన సిగ్గుపడి మారాలి : కేటీఆర్ Highlights అలాంటివి చూసైన సిగ్గుపడి మారాలి : కేటీఆర్ తెలంగాణ మంత్రి కల్వకుంట్ల రామారావు సినిమాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటాడు. రాజకీయ నేతగా.. మంత్రిగా ఫుల్ బిజీగా ఉండే కేటీఆర్.. కొన్నిసార్లు వీలు చూసుకుని సినిమాలకు వెళ్తుంటాడు. తాజాగా ఆయన ‘భరత్ అనే నేను’ సినిమా చూశాడు. అనంతరం మహేష్ బాబుతో కలిసి ఒక చర్చా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో భరత్ అనే నేను లో ఆయనకి నచ్చిన సీన్ల గురించి ఇలా చెప్పుకొచ్చడు. ‘‘సినిమాలో మహేష్‌ సీఎం అవగానే ట్రాఫిక్‌ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా అలా చేస్తే ప్రజలు ఊరుకోరు. అది నాకు తెలుసు. అయితే, సినిమా చూసాకైనా కాస్త సిగ్గుపడి అలాంటి తప్పు చేయకుండా ఉంటే చాలు’’ అని అన్నారు. ఇలాంటి సినిమాలు రావాలి: ‘‘మేము లేదా ప్రభుత్వ అధికారులు మంచి చెబితే ఎవరూ వినరు, అమలు చేయరు. కానీ, మీలాంటి స్టార్లు చెప్పే విషయాలు తప్పకుండా ప్రజలపై ప్రభావం చూపుతాయి. మంచి విషయాలు సినిమాల్లో చూపించడం ద్వారా మనం అలా ఉండాలనే భావం వారిలో కలిగే అవకాశం ఉంటుంది. అలాగని, సినిమా మొత్తం అలాగే ఉండాలని కోరడం లేదు. ‘భరత్ అనే నేను’ తరహాలోనే కమర్షియల్‌గా చూపింవచ్చు’’ అని కేటీఆర్ తెలిపారు. Last Updated 28, Apr 2018, 5:25 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఉద్యోగికి అందే బీమా మొత్తం పెంపు ప్ర‌స్తుతం ఈపీఎఫ్ఓలో స‌భ్యులుగా ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ క‌నీస బీమా హామీ మొత్తం రూ.1.5 ల‌క్ష‌లుగా ఉంటుంది. ఇక నుంచి ఈ మొత్తం రూ.2.5 ల‌క్ష‌ల‌కు పెర‌గ‌నుంది. ఈ ప‌థ‌కంలోని గ‌రిష్ట ప‌రిమితిని సైతం రూ.3.6 ల‌క్ష‌ల నుంచి రూ.6 లక్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది . TNN & Agencies | Updated: Feb 27, 2018, 05:22PM IST ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)లో స‌భ్యులుగా ఉన్న‌ ఉద్యోగులు, కార్మికుల‌కు శుభ‌వార్త‌. వారంద‌రికీ ఉద్యోగంలో చేరితే అందించే క‌నీసం అందించే బీమా మొత్తాన్ని పెంచుతున్నారు. సాధార‌ణంగా ఉద్యోగుల‌కు ఎలాంటి ప్రీమియం చెల్లించ‌కుండానే ఈడీఎల్ఐ( ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ) పేరిట బీమా అందిస్తారు. ఈ బీమా హామీ మొత్తాన్ని పెంచుతున్న‌ట్లు ప్ర‌భుత్వం ఫిబ్ర‌వ‌రి 15న గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఈపీఎఫ్ఓలో స‌భ్యులుగా ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ క‌నీస బీమా హామీ మొత్తం రూ.1.5 ల‌క్ష‌లుగా ఉంటుంది. ఇక నుంచి ఈ మొత్తం రూ.2.5 ల‌క్ష‌ల‌కు పెర‌గ‌నుంది. ఈ ప‌థ‌కంలోని గ‌రిష్ట ప‌రిమితిని సైతం రూ.3.6 ల‌క్ష‌ల నుంచి రూ.6 లక్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది .ఈ కొత్త నిబంధ‌న‌ల‌ను ఫిబ్ర‌వ‌రి 15 నుంచి రెండేళ్ల పాటు అమ‌ల్లో ఉండే అవ‌కాశం ఉంది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఏంటి? 1976 లో ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప‌థ‌కంలో ఉద్యోగి లేదా కార్మికుడు త‌న ఉద్యోగ జీవితంలో మ‌ర‌ణిస్తే ఆ వ్య‌క్తికి చెందిన నామినీకి బీమా హామీ మొత్తం అందుతుంది. ఈపీఎఫ్ఓలో స‌భ్యులుగా ఉన్న ప్ర‌తీ ఒక్కరూ ఈ ప‌థ‌కం ప‌రిధిలోకి వ‌స్తారు. ఉద్యోగి మ‌రణించిన‌ప్పుడు అత‌ని పీఎఫ్ ఖాతాకు సంబంధిత మొత్తాన్ని జ‌మ చేసి నామినీకి చెల్లిస్తారు. ఈడీఎల్ఐలో సొమ్ము ఎలా జ‌మ అవుతుంది? ఈ ప‌థ‌కంలో హామీ మొత్తం అందుకునేందుకు ప్ర‌త్యేకంగా ఉద్యోగి ఎలాంటి ప్రీమియం సొమ్ము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. యాజామాన్య‌మే ఇందుకు సంబంధించిన చెల్లింపుల‌ను చేస్తుంది. రూ.15 వేల లోపు గ‌ల‌ ఉద్యోగి మూల వేత‌నంలో 0.5 శాతం మొత్తాన్ని సంబంధిత యాజామాన్యం జ‌మ చేస్తుంది. ఈడీఎల్ఐ ద్వారా అందే మొత్తాన్ని ఎలా లెక్కిస్తారు? ఈడీఎల్ఐ ద్వారా అందే హామీ మొత్తం ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోని నిల్వ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఉద్యోగి మ‌ర‌ణించిన స‌మ‌యానికి ముందు 12 నెల‌ల్లోని మూల వేత‌నానికి 30 రెట్ల సొమ్ముకు, ఆ వ్య‌క్తి పీఎఫ్ ఖాతాలోని సాధార‌ణ నిల్వ మొత్తంలో 50 శాతం మొత్తం క‌లిపి చెల్లిస్తారు.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Budget 2019: ‘ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా’ అంటున్న నిర్మలా సీతారామన్! నిర్మలా సీతారామన్ తానేంటో ఆరంభంలోనే గుర్తుచేశారు. సాధారణంగా గత ఆర్థిక మంత్రులు అందరూ గోధుమ రంగులోని బ్రీఫ్‌కేస్‌తో పార్లమెంట్‌కు వచ్చేవారు. అయితే ఈసారి నిర్మలా సీతారామన్ ట్రెండ్ మార్చారు. Samayam Telugu | Updated: Jul 5, 2019, 11:02AM IST Budget 2019: ‘ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా’ అంటున్న నిర్మలా సీతారామన్! హైలైట్స్ బడ్జెట్ బ్రీఫ్‌కేస్‌ సంప్రదాయానికి మంగళం గోధుమ రంగు బ్రీఫ్‌కేసుతో కాకుండా ఎర్రటి వస్త్రంతో కప్పిన పార్సిల్‌తో పార్లమెంట్‌కు నిర్మలా సీతారమన్ దీందో గత ఆర్థిక మంత్రుల ఆనవాయితీకి బ్రేకులు 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమౌతుంది ఇప్పుడు అందరి చూపు కేంద్ర బడ్జె‌ట్‌‌పైనే ఉంది. ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీ ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్. సాధారణంగా ఆర్థిక మంత్రులు ఒక బ్రీఫ్‌కేస్‌తో పార్లమెంట్‌లో అడుగుపెడతారు. ఇందులోనే బడ్జెట్ కాగితాలు ఉంటాయి. అయితే ఈసారి నిర్మలా సీతారామన్ ఈ ఆనవాయితీని బ్రేక్ చేశారు 1970 నుంచి ఆర్థిక మంత్రులు బడ్జెట్‌ పత్రాలను గోధుమ వర్ణ సూట్‌కేసులో పార్లమెంట్‌కు తీసుకువస్తే.. అయితే ఈసారి ఆర్థికశాఖ కార్యాలయం నుంచి పార్లమెంట్‌కు బయల్దేరిన నిర్మలా సీతారామన్‌ చేతిలో బ్రీఫ్ కేసు కాకుండా ఎర్రటి వస్త్రంతో చుట్టిన పార్శిల్‌ లాంటిది కనిపించింది. దీనిపై రాజముద్ర కూడా ఉంది. సంప్రదాయాన్ని పక్కనబెట్టి ఎర్రటి బ్యాగ్‌లో బడ్జెట్ పత్రాలు తీసుకొస్తున్నారు నిర్మలా సీతారామన్‌. ఇకపోతే ఫ్రెంచ్‌ పదం బుగెటి నుంచి బడ్జెట్‌ అనే పదం వాడుకలోకి వచ్చింది. బుగెటి అంటే బ్రీఫ్‌కేస్‌ అని అర్థం వస్తుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పార్లమెంట్‌లో 11 గంటలకు ప్రారంభమౌతుంది. నిర్మలా సీతారామన్ బ్రీఫ్‌కేస్ మార్పుపై ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ స్పందిస్తూ.. ‘ఇది భారతీయ సంప్రదాయంలో ఉంది. పాశ్చాత్య ఆలోచనా బానిసత్వం నుండి మన నిష్క్రమణకు ఇది ప్రతీక. ఇది బడ్జెట్ కాదు, బాహి ఖాటా (లెడ్జర్)’ అని తెలిపారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
Visit Site Recommended byColombia కానీ.. తాజాగా విరాట్ కోహ్లి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లి కంటే ముందు ఆ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌ని కొనుగోలు చేసిన సహచర క్రికెటర్ యువరాజ్ సింగ్ సూచన మేరకు అప్పట్లో కొనుగోలుపై విరాట్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. గత ఏడాది బాలీవుడ్ నటి అనుష్క శర్మని వివాహం చేసుకున్న కోహ్లి.. ప్రస్తుతం ముంబయిలోని ఓ ఖరీదైన ఇల్లుని లీజ్‌కి తీసుకుని ఉంటున్నాడు. రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్న ఈ ఇంటికి రూ. 15 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 7న ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభంకాబోతుండగా.. ప్రస్తుతం విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు‌ వ్యూహారచనల్లో బిజీగా ఉన్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
sumalatha 207 Views interest rates , Reduces , SBI SBI హైదరాబాద్‌: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండోసారి వడ్డీరేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లను తగ్గించడం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి. ఈ నెల ఒకటవ తేదీన మొదట.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ.. తాజాగా, మళ్లీ వడ్డీ రేట్లను సవరించింది. ఇవి ఈ నెల 26 వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. తాజాగా సవరించిన వడ్డీ రేట్ల విషయానికి వస్తే రిటైల్‌ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్‌ పాయింట్లు, బల్క్‌ డిపాజిట్లపై 30 నుంచి 70 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది ఎస్‌బీఐ. ఇక, 7 నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5 శాతం నుంచి 4.5 శాతానికి, 46 నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.75 శాతం నుంచి 5.5 శాతానికి, 180 నుంచి సంవత్సరం కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటును 6.25శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్టు ప్రకటించింది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
1entertainment
తొలి టెస్టులో ఓటమి.. ఇంగ్లాండ్ బౌలర్లకు తలవంచిన భారత్ Highlights ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 110/5తో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 110/5తో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు.. భారత బ్యాట్స్‌మెన్లు చెత్త షాట్లు ఆడి ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూకట్టారు. 37వ ఓవర్లో అండర్సన్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్ ఔటవ్వగా.. ఆ కాసేపటికే జట్టును గెలిపిస్తాడనుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వెనుదిరగ్గా.. పేస్ బౌలర్ మహ్మాద్ షమీ డకౌట్ కావడంతో భారత్ ఓటమి అంచుల్లో నిలబడింది. అయితే మరో బౌలర్ ఇషాంత్ శర్మతో కలిసి హార్డిక్ పాండ్యా  ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తుండగా.. రషీద్  బౌలింగ్‌లో ఇషాంత్ వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత ఓటమి ఖాయమని అభిమానులు అంచనాకి వచ్చేశారు. అయితే ఉమేశ్‌తో కలిసి పాండ్యా ధాటిగా ఆడుతూ కాస్త ఆశలు రేకిత్తించినప్పటికీ.. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.. చివరికి స్టోక్స్ బౌలింగ్‌లో కుక్‌కి క్యాచ్ ఇచ్చి హార్డిక్ పాండ్యా ముగియడంతో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది.  ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. Last Updated 4, Aug 2018, 5:14 PM IST
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV హద్దులు దాటొద్దు.. ఫ్యాన్స్‌కి మొర్తాజా స్వీట్ వార్నింగ్ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ మష్రఫె మొర్తాజా తమ దేశ అభిమానులు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. భారత్‌తో మ్యాచ్ నేపథ్యంలో హద్దులు దాటొద్దని సూచించారు. తమ దేశ పరువు తీసేలా ప్రవర్తించొద్దన్నారు. Samayam Telugu | Updated: Jul 2, 2019, 02:44PM IST టీమిండియాతో కీలక మ్యాచ్ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మొర్తాజా ఆ దేశ అభిమానులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపారు. భారత్‌తో మ్యాచ్‌ సమయంలో అభిమానులు హద్దులు దాటొద్దంటూ సూచించారు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో నేడు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ వేదికలోనే ఆదివారం ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఇప్పుడు అదే పిచ్‌పై బంగ్లాతో టీమిండియా తలపడనుంది. సమీకరణాలపై ఆధారపడకుండా నేరుగా సెమీఫైనల్‌ బెర్తు సాధించడమే లక్ష్యంగా భారత్‌ కీలక పోరుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 13 పాయింట్లతో కోహ్లీసేన నేరుగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. IND vs BAN Live Updates: బంగ్లాపై భారత్ బ్యాటింగ్.. తుది జట్టులో రెండు మార్పులు మరోవైపు, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న బంగ్లా.. భారత్‌పై గెలిచి సెమీస్ రేసులో నిలవాలని చూస్తోంది. ప్రపంచకప్‌లో నిలిచినా నిలవకపోయినా భారత్‌పై మాత్రం గెలవాలని పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే, భారత్‌తో మ్యాచ్ అనగానే బంగ్లాదేశ్ అభిమానులు రెచ్చిపోతారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెడతారు. తమ జట్టు ఆటగాళ్లు తప్పులు చేసినా ట్రోల్ చేస్తారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మొర్తాజా అభిమానులకు ఒక సూచన చేశారు. బర్మింగ్‌హామ్‌లో ఓ న్యూస్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన మొర్తాజా అభిమానులు హద్దులు మీరి ప్రవర్తించకూడదని అన్నారు. ‘భారత్‌తో మ్యాచ్ అనగానే ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. కానీ, అది హద్దులు దాటకూడదు. ఒకరిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోకూడదు. సోషల్ మీడియాలో తిట్టడం, ట్రోలింగ్ చేయడాన్ని పట్టించుకోకుండా ఉండటం ఆటగాళ్ల వల్ల కాదు. ఇలా ట్రోలింగ్ చేసే వాళ్లను పక్కనపెట్టడం ఎంత కష్టమన్నది పెద్ద విషయం కాదనుకోండి. కానీ, క్రికెటర్లు కూడా మనుషులే కదా. వీళ్లు చేసే అతి రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. అలాగే, మా దేశంపై మచ్చ పడుతుంది. మ్యాచ్‌లో గెలవాలని రెండు జట్లు కోరకుంటాయి. మేం కూడా 100 శాతం ప్రయత్నిస్తాం. మా అభిమానులు ఎప్పుడూ మా వెంటే ఉంటారు. మేమే గెలవాలని కోరుకుంటారు. కానీ, వాళ్లు చెత్తగా ప్రవర్తించకూడదు. దేశానికి చిన్న మచ్చ కూడా తేకూడదని వాళ్లు మనసులో పెట్టుకోవాలి’ అని మొర్తాజా వెల్లడించారు.
2sports
శ్రీదేవిని ప్లాన్ ప్రకారం.. చంపేశారు. Highlights శ్రీదేవిది ప్రమాదం కాదు.. ముమ్మాటికీ హత్యే అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి మరణం వెనక ఉన్న అపోహలు ఇప్పట్లో తొలగిపోయేలా లేవు. శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయినప్పుడు శ్రీదేవి గుండెపోటుతో చనిపోయారని తొలుత దుబాయ్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించగా బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు తేలింది. అయితే శ్రీదేవి మృతిపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా గతంలో కొందరు వ్యక్తులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆమె మృతి విషయంలో తాము కలగజేసుకోలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో దిల్లీకి చెందిన వేద్‌ భూషణ్‌ అనే మాజీ ఏసీపీ శ్రీదేవిని పథకం ప్రకారం హత్య చేశారని వ్యాఖ్యనించడం వివాదాస్పదంగా మారింది. పదవీ విరమణ పొందాక భూషణ్‌ దిల్లీలో ఓ ప్రైవేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీని నడుపుతున్నారు. ‘బాత్‌టబ్‌లో బలవంతంగా ముంచి చంపడం చాలా సులువు. అలా చేస్తే మునిగి చనిపోయారని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుంది. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోలేదు. ఆమెను పథకం ప్రకారం చంపేశారని నాకు అనిపిస్తోంది. దుబాయ్‌ వైద్యులు ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికపై నాకు సందేహాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు భూషణ్‌. దీనిపై శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఏమంటారో వేచి చూడాలి. Last Updated 18, May 2018, 12:10 PM IST
0business
Hyderabad, First Published 3, Nov 2018, 9:53 AM IST Highlights ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న హీరో రవితేజ పరిస్థితి ఇప్పుడు బాగా డీలా పడింది. మాస్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ఒకరైన రవితేజ సినిమాలను కొనడానికి ఇప్పుడు బయ్యర్లు లేకుండా పోయారు. పరాజయాలు ఎంతటి స్టార్ హీరోనైనా ఇబ్బందుల్లో నెట్టేస్తాయనే దానికి రవితేజ ఉదాహరణ.  ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న హీరో రవితేజ పరిస్థితి ఇప్పుడు బాగా డీలా పడింది. మాస్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ఒకరైన రవితేజ సినిమాలను కొనడానికి ఇప్పుడు బయ్యర్లు లేకుండా పోయారు.  పరాజయాలు ఎంతటి స్టార్ హీరోనైనా ఇబ్బందుల్లో నెట్టేస్తాయనే దానికి రవితేజ ఉదాహరణ. వివరాల్లోకి వెళితే రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా రూపొందించాడు. అటు శ్రీనువైట్లకి వరుస ఫ్లాప్ లు ఉండడం, మరోపక్క రవితేజకి వరుసగా రెండు పెద్ద డిజాస్టర్ లు ఈ ఏడాదిలోనే రావడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కొనడానికి బయ్యర్లు ఆసక్తి చూపడం లేదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ని చూసి కొందామని అనుకున్నప్పటికీ బయ్యర్లు మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా అంటే జంకుతున్నారు. లోకల్ బయ్యర్ల పరిస్థితే ఇలా ఉందంటే.. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాని కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. ఒకప్పుడు శ్రీనువైట్ల సినిమాలకి ఓవర్సీస్ లో మార్కెట్ ఓ రేంజ్ లో జరిగేది. కానీ ఇప్పుడు ఆయన సినిమాను కొనే పరిస్థితి లేకుండా పోయింది. మరి నిర్మాతలు ప్రీరిలీజ్ బిజినెస్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి! Last Updated 3, Nov 2018, 9:53 AM IST
0business
Hyderabad, First Published 7, Apr 2019, 10:36 AM IST Highlights అవెంజర్స్ సిరీస్ లు వరల్డ్ వైడ్ గా ఎంతగా పాపులర్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు రాబోతున్న ఎండ్ గేమ్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. అవెంజర్స్  చిత్ర దర్శకుడు జోయి రుస్సో ఇండియన్ స్టార్స్ పై ఓ కామెంట్ చేశారు.  అవెంజర్స్ సిరీస్ లు వరల్డ్ వైడ్ గా ఎంతగా పాపులర్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు రాబోతున్న ఎండ్ గేమ్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. అవెంజర్స్  చిత్ర దర్శకుడు జోయి రుస్సో ఇండియన్ స్టార్స్ పై ఓ కామెంట్ చేశారు.  మెయిన్ గా శంకర్ రోబో సినిమా చూసి దాని స్పూర్తితో  అవెంజర్స్‌: ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్స్‌ సినిమా క్లయిమాక్స్ ను తెరకెక్కించినట్లు చెబుతూ ఆ సినిమా తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఇండియన్ నటీనటులను అవెంజర్స్ తో పోలుస్తూ.. సల్మాన్ ఖాన్ వంటి హీరోని ఒక హల్క్ గా చూపించవచ్చని.. అలాగే సూపర్ స్టార్ రాజినీకాంత్ ని ఐరెన్ మెన్ గా ప్రజెంట్ చేయవచ్చని రుస్సో వివరణ ఇచ్చారు.  అవెంజర్స్ ఎండ్ పార్ట్ ని ఇండియాలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో ఈ నెల 26న ఈ హై యాక్షన్ మూవీ రిలీజ్ కానుంది.  ఇన్ఫినిటీ వార్‌ సినిమా ఇండియాలో 200కోట్లకు పైగా వసూలు చేయడంతో చిత్ర యూనిట్ ఇక్కడ కూడా ప్రమోషన్ డోస్ పెంచుతోంది.  Last Updated 7, Apr 2019, 10:39 AM IST
0business
Visit Site Recommended byColombia ‘ఆస్ట్రేలియా జట్టుని సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టం. కానీ.. ప్రస్తుతం టీమ్‌లో స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లు లేరు. వారి స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లూ ప్రస్తుతం జట్టులో ఉండారని నేను అనుకోవట్లేదు. మరోవైపు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చగొట్టడం కంటే.. అతని బలహీతనలపై దృష్టి పెట్టడం ఉత్తమం. ముఖ్యంగా.. ఆరంభం నుంచే కోహ్లీ కవర్ డ్రైవ్స్‌ని నిలువరించాలి. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతులు విసురుతూ.. తొలుత అతను బ్యాక్‌ఫుట్‌పై ఎక్కువగా ఆడేలా చేయాలి. అలా అతడ్ని వెనక్కి తగ్గేలా చేస్తూ ఆఫ్ సైడ్‌లో వైడ్‌ రూపంలోనూ అప్పుడప్పుడు బంతులు విసిరాలి. అప్పుడే.. స్లిప్‌ లేదా గల్లీలో ఫీల్డర్‌కి కోహ్లీ చిక్కే అవకాశం ఉంటుంది’ అని డీన్‌జోన్స్ సూచించాడు. డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుండగా.. భారత సెలక్టర్లు ఇటీవల జట్టుని ప్రకటించారు. అయితే.. గాయం కారణంగా పృథ్వీ షా తొలి టెస్టుకి దూరమయ్యాడు. భారత్ టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Dadasaheb Phalke Award: ఇండియన్ సినిమాకి అమితాబ్ నచ్చెన్ ఇలా! Amitabh Bachchan: బాలీవుడ్‌ మెగాస్టార్, దేశం మొత్తం మెచ్చే నటుడు బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుండగా.. 2019 ఏడాదికి గానూ అమితాబ్‌ ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. Samayam Telugu | Updated: Sep 24, 2019, 10:35PM IST అమితాబ్ బాలీవుడ్ సీనియర్ నటులు, హిందీ సినిమా ఇండస్ట్రీకి సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్‌కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించారు. బాలీవుడ్‌లో మెగాస్టార్‌గా వెలుగొందుతూ ఇంకా ప్రేక్షకుల్ని తన నటనతో కట్టిపడేస్తున్న అమితాబ్ బచ్చన్‌కి అత్యున్నత పురస్కారం రావడంతో ఆయన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. అప్పటివరకు ఒక మూసలో సాగిపోతున్న బాలీవుడ్‌కి అసలు సిసలు యాక్షన్ పరిచయం చేసిన షెహన్షా అమితాబ్. అసలు సినిమాలకే పనికిరావు అని అనేకమంది రిజెక్ట్ చేసినా కూడా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి, అనుకున్నది సాధించిన బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్. 1942 అక్టోబర్ 11న అలాహాబాద్‌లో జన్మించిన ఇంకిలాబ్ శ్రీవాస్తవ అమితాబ్‌గా మారి బాలీవుడ్ సినిమాని ఏలిన వైనం ఒక కథ కాదు ఒక చరిత్ర. మునుపెన్నడూ విననిది, భవిష్యత్తులో కూడా చూడలేనిది అంటే తప్పేం లేదు. 'సాత్ హిందూస్థానీ' అనే సినిమాతో 1969 లో బాలీవుడ్‌కి పరిచయమయిన అమితాబ్ మెదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. హార్డ్ వర్క్‌ని నమ్ముకుని, తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ, బలహీనతలను అధిగమిస్తూ అతి తక్కువ కాలంలో అగ్రనటుడిగా వెలుగొందారు. జoజీర్, దీవార్, షోలే లాంటి సినిమాలతో యాంగ్రీ యంగ్‌మ్యాన్ ఇమేజ్ వచ్చినా కూడా కేవలం యాక్షన్‌కే పరిమితం అయిపోలేదు. అమితాబ్ ఎలాంటి సినిమా తీసిన చూసే ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. అమితాబ్ ఫ్యాన్స్ కేవలం బాలీవుడ్‌కో,లేక ఇండియావరకో పరిమితం కాదు. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, యునైటెడ్ కింగ్ డమ్, రష్యా, అమెరికా వంటి దేశాల్లో కూడా అమితాబ్‌కి అశేష అభిమానులు ఉన్నారు. ఆయన పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి కూడా గతంలో కంటే ఇంకా పవర్ ఫుల్‌గా బౌన్స్‌బ్యాక్ అయ్యాడు. ఎప్పుడూ కూడా ఓటమిని ఒప్పుకోకూడదు అనే మాటకి నిలువెత్తు అద్దం, ఆరడుగుల ధీరత్వం అమితాబ్. ఆయన కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. టీవీ హోస్ట్‌గా కూడా వరల్డ్ వైడ్ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాడు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోని అంత రసవత్తరంగా అన్ని సీజన్స్ పాటు నడపడం, తాను తప్ప వేరే ఎవరు హోస్ట్ చేసినా కూడా ప్రేక్షకులు ఒప్పుకొని విధంగా తన ముద్ర వెయ్యడం వంటి అసామాన్యమైన ఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి అమితాబ్. నమ్ముకున్న వృత్తిని దైవంగా భావించి చేసుకుంటూ వెళ్లడం మాత్రమే ఆయనకు తెలుసు. అందుకే అవార్డులు అనేవి వరించి వచ్చాయి. 1984లో పద్మశ్రీ పురస్కారం, 2001లో పద్మభూషణ్,2015‌లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది భారత ప్రభుత్వం. అంతే కాదు నాలుగు సార్లు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఏకంగా 15 సార్లు ఉత్తమనటుడిగా ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆ అవార్డు కి మొత్తం 41 సార్లు నామినేట్ అయ్యారు అమితాబ్. ఆయన నటించిన సినిమాలు ఫెయిల్ అయిన దాఖలాలు ఉన్నాయేమోకానీ నటుడిగా ఆయన ఫెయిల్ అయిన సందర్భాలు మచ్చుకు కూడా లేవు. హీరోగానే స్థిరపడిపోవాలి అని నియమాలు పెట్టుకోకుండా వయసు పెరుగుతున్న కొద్ది ఆ వయసుకు తగ్గ పాత్రలు వెయ్యడం మొదలుపెట్టారు. నటించడం నటుడి లక్షణం అని నమ్మిన అమితాబ్ తన వయసుకు తగ్గ పాత్రలు వేస్తూ ప్రతిష్ఠతో పాటు గౌరవం కూడా సంపాదించుకున్నారు. నటన విషయంలో మాత్రం చాలా క్రమశిక్షణతో ఉంటారు అమితాబ్. ఏదైనా సినిమా ఒప్పుకుంటే ఆ సినిమాలో తన పాత్రకు సంబంధించి ఇంకా ఏదైనా చెయ్యగలనా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకప్పుడు డాన్,కూలీ,అగ్నిపథ్ లాంటి సినిమాలు చేసిన ఆయననుండి పా, పీకు, బ్లాక్ లాంటి సినిమాలు వచ్చాయి అంటే నటనపట్ల ఆయన ఎంత మక్కువతో ఉంటారో,ఎంత అప్డేటెడ్ గా ఆలోచిస్తారో అర్ధమవుతుంది. అలాంటి అద్భుతమయిన వ్యక్తిత్వం ఉన్న మనిషికి, ఏ ఉపమానాలు సరిపోలని నటుడికి ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సముచితం.అందుకే మొత్తం ఇండియన్ సినిమా ఆయనకి సెల్యూట్ చేస్తుంది. అమితాబ్ ది గ్రేట్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV YS Jagan: దాసరి స్థానం చిరంజీవిదా? మూర్ఖత్వం అంటూ మండిపడ్డ తమ్మారెడ్డి Sye Raa Narasimha Reddy: మెగాస్టార్ చిరంజీవి జగన్‌ను కలవడం వెనుకు వ్యూహం ఏంటి? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడ్ని కూడా కలిశారు. రేపో మాపో ప్రధానికి కూడా కలుస్తారు. దాసరి స్థానం ఆక్రమించడం కోసం వాళ్లను కలుస్తున్నారా? వాళ్లది మూర్ఖత్వమా? అమాయకత్వమా? Samayam Telugu | Updated: Oct 24, 2019, 08:18PM IST చిరంజీవి టాలీవుడ్ సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి అంటే మెగాఫ్యాన్స్‌కి అసలే మంట. ఖైదీ 150 అప్పుడు కాని.. రీసెంట్‌గా ‘సైరా’ కలెక్షన్స్ విషయంలో ఆయన చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. అయితే ఎంతమంది ఎన్ని అన్నా.. ఆయన మాత్రం చెప్పాల్సింది చెబుతూనే ఉన్నారు. నన్ను అనుకుంటే అనుకోండి మీ కర్మ అంటూనే మెగాఫ్యాన్స్‌ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి .. వైఎస్ జగన్‌ను కలవడంపై వస్తున్న రూమర్స్‌ను ఖండిస్తూ పాజిటివ్‌గా స్పందించారు తమ్మారెడ్డి. ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ ‘నా ఆలోచన’ ద్వారా మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చూస్తుంటే మంచి కామెడీగా అనిపిస్తుంది. అందులో వాళ్ల జోక్‌లు కామెడీ చూస్తుంటే.. సీరియస్‌గా కూడా జోక్‌లు వేయొచ్చు అని. అందులో ఒకటి ఏంటంటే.. ఇటీవల చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు, అలానే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు దగ్గరకు వెళ్లి సైరా చూపించారు. ప్రధానమంత్రిని కూడా కలిసి సైరా సినిమా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిరంజీవి. అయితే వీటిపై యూట్యూబ్‌లో వచ్చే కామెంట్స్ ఏంటంటే.. ఇండస్ట్రీలో స్వర్గీయ దాసరి నారాయణ రావుగారి ప్లేస్‌ను భర్తీ చేసేందుకు చిరంజీవి ఇవన్నీ చేస్తున్నారు అని. ఇది నాకు కామెడీ చేయడానికి పరాకాష్టగా అనిపించింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్లలో చిరంజీవి పెద్ద ఆర్టిస్ట్. ఆయన తలచుకుంటే ఏ స్థానమైనా తీసుకోవచ్చు. ఆయన కావాలనుకుంటే.. దాసరి పొజీషన్ అనేది అఫీషియల్ పోస్ట్ కాదు. ఏ పదవి లేదు అక్కడ. దాసరి పెద్ద మనిషిగా ఉన్నారు. అందరితో కలిసి మాట్లాడేవారు. అలాగే చిరంజీవి గారు చేయాలంటే చేయొచ్చు. ఆయన్ని చేయమని నేను రెండు మూడు సార్లు అడిగా. మా ఇష్యూలో కూడా గతంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి పరిష్కరించారు. సో ఇండస్ట్రీలో ఏదైనా చేయాలి అనుకుంటే.. చిరంజీవి.. జగన్ దగ్గరకు ఎందుకు వెళ్తారు. జగన్ ఏమైనా చెప్తారా? ఆయనేమైనా పదవి ఇస్తారా? ముఖ్యమంత్రి ఏమైనా పదవి ఇస్తారా? దీని కోసం చిరంజీవి ఆయన దగ్గరకు ఎందుకు వెళ్తారు. వీళ్లకు తెలిసి మాట్లాడతారో తెలియకమాట్లాడతారో.. లేక అమాయకత్వంతో మూర్ఖత్వమో నాకు తెలియడం లేదు. చిరంజీవి పేరు చెప్తే మనకు ఏదోటి వస్తుందని అనుకోవడమో నాకు అర్ధం కాలేదు. ఇది పెద్ద జోకు. మరోవైపు గంటా శ్రీనివాసరావుని వైసీపీలోకి తీసుకువెళ్లేందుకు చిరు మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గంటా అనుకుంటే ఏ పార్టీలోకైనా వెళ్లగలడు. డబ్బు ఉంది కాబట్టి చిరంజీవి తీసుకువెళ్లి వేరే పార్టీలో చేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ల బతుకు వాళ్లు చూసుకుంటున్నారు. వాళ్లను బయటకు లాగడం వల్ల వీళ్లకు వచ్చేదేమిటో నాకు అర్ధం కావడం లేదు. సోషల్ మీడియాను పిచ్చి పిచ్చి వాటికి ఉపయోగించడం కరెక్ట్ కాదు’ అంటూ చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి.
0business
internet vaartha 189 Views ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆకాంక్ష ముంబై : భారత టెన్నిస్‌ వెటరన్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌కు క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. పేస్‌ 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందున సచిన్‌ ట్విటర్‌ ద్వారా శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్‌లో పేస్‌ పతకం సాధించాలని సచిన్‌ ఆకాంక్షించాడు. ఈ సంవత్సరం పేస్‌కు ఒక చిరస్మరణీయమైనదిగా మిగిలిపోవాలని సచిన్‌ పేర్కొన్నాడు. ఆగస్టులో ఆరంభం కానున్న రియో ఒలింపిక్స్‌లో భాగంగా పురుషుల డబుల్స్‌లో బోపన్నతో జోడీ కట్టబోతున్న పేస్‌ తప్పకుండా పతకం సాధిస్తాడని సచిన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో పేస్‌-హింగీస్‌ల జోడీ టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో పేస్‌ డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాధించిన గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్ల సంఖ్య 18కి చేరింది.
2sports
- ఎయిరిండియా విక్రయంపై సర్కారు తాజా వ్యూహం - స్వదేశీ విమానయాన సంస్థల నుంచి అంతంతమాత్రంగానే ఆసక్తి! - విదేశీ సంస్థలతే మరింత మెరుగైన ధరొస్తుందని అభిప్రాయం - మంత్రివర్గ బృందం సమావేశంలో కొత్త ప్రతిపాదనకు 'సై'! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయం దిశగా సర్కారు వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటి వరకు దేశానికి గర్వకారణంగా నిలుస్తూ వస్తున్న మహారాజా ఎయిర్‌లైన్స్‌ ఎయిరిండియాను మంచి ధర వస్తే విదేశీ సంస్థలకైనా విక్రయించాలని మోడీ సర్కారు తాజాగా యోచిస్తున్నట్టుగా సమాచారం. ఆర్థిక కష్టాలతో కునారిల్లుతున్న ఎయిరిండియాను కేవలం దేశీయ విమానయాన సంస్థలకే అప్పగిసామంటూ సర్కారు ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది. అయితే తాజాగా ఇప్పడు సర్కారు ఈ విషయంలో మనసు మార్చుకున్నట్టుగా సమాచారం. విదేశీ సంస్థలను కూడా బిడ్‌కు ఆహ్వానిస్తే ఎయిరిండియాకు మంచి ధర వచ్చే అవకాశం ఉందంటూ కొన్ని ప్రభుత్వ వర్గాలు సర్కారు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ బృందం ఈ నెల 21న తొలిసారిగా సమావేశమైంది. పౌర విమానయాన మంత్రి అశోక్‌ గజపతి రాజు, విద్యుత్తు శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌, రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఎయిరిండియా ప్రయివేటైజేషన్‌లో విదేశీ సంస్థలను కూడా బిడ్‌ వేసేందుకు అనుమతిస్తే బాగుంటుందని వీరు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో బృందం ఈ ప్రతిపాదనపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కేవలం 49% వాటా విక్రయానికే అవకాశం.. ఎయిరిండియా వాటా విక్రయంలో విదేశీ సంస్థలకు స్థానం కల్పించే విషయాన్ని కొట్టిపారేయలేమని ఈ వ్యవహారంతో సంబంధమున్న సర్కారు అధికారి ఒకరు ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ వెల్లడించారు. ప్రస్తుతానికి ఎయిరిండియా అంతర్జాతీయ వ్యాపార విభాగాన్ని చేజిక్కించుకొనేందుకు కేవలం ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఒక్కటే ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. అయితే దేశీయ సంస్థల నుంచి తగిన ఆసక్తి కనడని కారణంగా సర్కారు మరో మార్గాలపై దృష్టి సారిస్తున్నట్టుగా సర్కారు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న పౌర విమానయానంలో విదేశీ పెట్టుబడుల నిబంధనల ప్రకారం కేవలం 49% వరకే విదేశీ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. అదే దేశీయ సంస్థలైతే పూర్తిగా 100 % వాటాను కొనుగోలు చేయొచ్చు. అయితే ఎయిరిండియా విక్రయపు నియమ నిబంధనలకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలోని కమిటీ త్వరలోనే తుది రూపం ఇస్తేగానీ.. వాస్తవ పరిస్థితి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Read Also: మంచోళ్లను గెలిపిస్తే బాగుండేది: బాబా భాస్కర్ బిగ్ పంచ్ పునర్నవి హౌస్‌లో ఉన్నన్నాళ్లు ఓ సోమరిగా.. ఆమెతో తిట్లు తింటూ.. పున్నూ కోసం మాత్రమే ఈ పులిహోర రాజా అని ముద్రవేసుకున్న రాహుల్.. పునర్నవి ఎలిమినేషన్ తరువాత రెండు రోజుల పాటు కుమిలి కుమిలి ఏడుస్తూ తరువాత గేమ్‌పై ఫోకస్ పెట్టాడు. ఒకరకంగా చెప్పాలంటే పునర్నవి ఎలిమినేషన్ తరువాతనే రాహుల్‌లోని ఆటగాడు బయటకు వచ్చాడు. అంతకు ముందు బత్తాయి, బ్రెడ్ అంటూ పునర్నవి వెనుక తిరగడం.. ఆమె తన బీభత్సమైన యాటట్యూట్‌ని చూపించడం.. వీకెండ్‌లో ఈఇద్దర్నీ హైలైట్ చేస్తూ నాగార్జున ఎపిసోడ్‌ను నడిపించడం జరిగేవి. Read Also: ఒసేయ్ రాములమ్మా! బిగ్ బాస్ టైటిల్ బాణం గురితప్పిందెక్కడ? ఇక పున్నూ కోసం రాహుల్ చేసిన త్యాగాలు.. వాటికి కృతజ్ఞ‌తగా పున్నూ పాత కౌగిలింతలు, కిస్‌లకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్, పునర్నవిల మధ్య రొమాన్స్ బిగ్ బాస్ హౌస్‌లో వేరే రేంజ్‌ కావడంతో ఈ ఇద్దరూ లవ్ ట్రాక్ ఎక్కేశారని నాగార్జునతో పాటు ప్రేక్షకులుకూడా డిసైడ్ అయిపోయారు. పాపం పునర్నవి వాడి వదిలేసిన పిన్నీసులు, లబ్బరు బ్యాండ్, కవర్‌లు దాచుకుని వాటితోనే బిగ్ బాస్ హౌస్‌లో రాహుల్ కాలం గడిపేశాడంటే ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమబంధం ఎంత బలమైనదో ఓ అంచనాకు వచ్చేయొచ్చు. Read Also: ‘బిగ్ బాస్ షో ఫైనల్ రిజల్ట్స్.. స్త్రీ జాతికే అవమానం’ ఈ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చేందుకు పెద్దలు కూడా రెడీ అయ్యారు. అవునండీ.. పునర్నవి, రాహుల్‌లు ఓకే అంటే పెళ్లి చేసి ఓ ఇంటి వాళ్లను చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు రాహుల్ పేరెంట్స్. రాహుల్ బిగ్ బాస్ విజేతగా అవతరించిన తరువాత పున్నూకి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు రాహుల్. ఈ సందర్భంగా రాహుల్ పేరెంట్స్ వీరి పెళ్లిపై ఓపెన్ అయ్యారు. బిగ్ బాస్ విన్నర్ రాహుల్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ X బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగిందన్నది వాళ్లకు మాత్రమే తెలుసు. ఒకవేళ వాళ్లు నిజంగా లవ్ చేసుకుని ఉంటే మేం కాదనం. వాళ్లు లోపల లవ్ చేసుకున్నారేమో బయట ఉన్న మాకు తెలియదు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తుందనే భావన జనంలో కలిగించారు బిగ్ బాస్ వాళ్లు. అయితే అది వాళ్ల టీఆర్పీ రేటింగ్ గురించి అయినా ఉండొచ్చు. Read Also: 110 % బార్బర్ షాప్ పెడతా: రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ వాళ్లు లవ్ చేసుకుంటుంటే.. వాళ్ల ఇష్టమే మా ఇష్టం. ఫైనల్‌గా వాళ్ల నిర్ణయమే మా నిర్ణయం. తప్పకుండా పెళ్లి చేస్తాం. అయితే వాళ్ల మధ్య అయితే లవ్ ఉందనేది బిగ్ బాస్ హౌస్ వరకే అనుకుంటున్నాం. మాకైతే తెలియదు. వాళ్లతో పాటు ఉన్న మిగిలిన వాళ్లకు తెలుస్తుంది. మాకైతే వాళ్లకు పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ కుండబద్దలు కొట్టేశారు రాహుల్ సిప్లిగంజ్ పేరెంట్స్. రాహుల్ పునర్నవి   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 20, Mar 2019, 3:45 PM IST Highlights సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి మొదటి నుండి ఓ వర్గం నుండి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది.  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి మొదటి నుండి ఓ వర్గం నుండి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు ఈ సినిమా విడుదల ఆపాలని ఈసీకి, కోర్టుకి ఫిర్యాదులు చేశారు.  అవన్నీ దాటుకొని సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. సెన్సార్ పూర్తి చేసి ఈ నెల 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో కంప్లైంట్ నమోదైంది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రద్దు చేయాలని హైదరాబాద్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విజయవాడకి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, చంద్రబాబును కించపరిచేలా ఈ సినిమాలో సీన్లు ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారు. మరి దీనిపై సెన్సార్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో చూడాలి! Last Updated 20, Mar 2019, 3:45 PM IST
0business
Suresh 127 Views match ఇంగ్లాండ్‌-విండీస్‌…తొలి డే-నైట్‌ టెస్టుకి సర్వం సిద్ధం బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ-వెస్టిండీస్‌ జట్ల మధ్య తొలి డే-నైట్‌ టెస్టుకు సర్వం సిద్ధమైంది. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి. రాత్రిపూట జరిగే ఈ టెస్టు మ్యాచ్‌లో గులాబి రంగు బంతితో ఆడతారు. దీంతో ఈ టెస్టు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఆస్ట్రేలియాతో మొట్టమొదటిసారిగా డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌ ఆడిన ఇంగ్లాండ్‌ స్వదేశంలో తొలిసారి ప్రయోగాత్మకంగా తొలిసారి డే-నైట్‌ టెస్టుకు ఆతిథ్యమిస్తోంది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇది ఐదో డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌ కావడం విశేషం. ఈ ఐదు టెస్టుల్లో ఆస్ట్రేలియా మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. 2015లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా మొట్టమొదటి డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌ ఆడగా…ఆ తర్వాత దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌లతో ఆడింది. క్రికెట్‌ అభిమానుల కోరిక మేరకు ఐసిసి డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. డే-నైట్‌ టెస్టుల్లో ఎర్రబంతికి బదులుగా గులాబి బంతిని వాడతార. ఎందుకంటే ఫ్లడ్‌లైట్ల వెలుగుల్తో అటు బ్యాట్స్‌మెన్లతో పాటు ఫీల్డర్లకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి. అంతకుముందు ఆస్ట్రేలియా డే-నైట్‌ టెస్టులు ఆడిన సందర్భంలో గులాబి కోకాబుర్రా బంతులను వాడితే ఇంగ్లాండ్‌ మాత్రం గులాబి డూక్స్‌ బంతులను వాడుతుండటం విశేషం.
2sports
Hyderabad, First Published 16, Aug 2019, 12:53 PM IST Highlights బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జైలు నుంచి విడుదలైన తరువాత డిఫరెంట్ సినిమాలంటూ బాగానే హడావుడి చేశాడు. భూమి - కళంక్ సినిమాలు విడుదల కాకముందు నుంచే ఎన్నో అంచనాలు పెరిగాయి. విడుదల తరువాత మాత్రం ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి.    బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జైలు నుంచి విడుదలైన తరువాత డిఫరెంట్ సినిమాలంటూ బాగానే హడావుడి చేశాడు. భూమి - కళంక్ సినిమాలు విడుదల కాకముందు నుంచే ఎన్నో అంచనాలు పెరిగాయి. విడుదల తరువాత మాత్రం ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి.  ఇక ఇప్పుడు ప్రస్థానం సినిమాతో తన సత్తా చాటాలని కష్టపడుతున్నాడు. యాక్టింగ్ కి ఎమోషనల్ డ్రామాకి మంచి స్కోప్ ఉన్న ప్రస్థానం కథను బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కథ ఒరిజినల్ దర్శకుడైన దేవకట్ట దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సంజయ్ సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నాడు. అయితే నేడు సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.  పోస్టర్ లో సినిమాలో నటిస్తున్న యాక్టర్స్ మాత్రమే కనిపిస్తున్నారు కానీ స్పెషల్ గా ఏమి లేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మనిషా కొయిరాలా - జాకీ ష్రాఫ్ - చుంకి పాండే - అలీ ఫజల్ వంటి స్టార్స్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్థానం సినిమా తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీంతో సినిమా బాలీవుడ్ లో ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.  Last Updated 16, Aug 2019, 12:53 PM IST
0business
sumalatha 157 Views domestic-currency , Indigo , ticket-sales IndiGo న్యూఢిల్లీ : ఇంటర్‌గ్లోబల్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌కు చెందిన ఇండిగో లాభాల్లో ఏకంగా 42 రెట్ల పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.1,203 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ1లో రూ.27 కోట్ల లాభాలతో సరిపెట్టుకుంది. విమాన ఇంధన ధరలు తగ్గడం, టికెట్‌ అమ్మకాలు పెరగడం, దేశీయ కరెన్సీ విలువ కూడా పటిష్టంగా ఉండటంతో మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఇండిగో సిఇఒ రొనోజారు దుత్తా పేర్కొన్నారు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
1entertainment