news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
అన్న పైపైకి.. తమ్ముడు దివాళా...
కుమార్| Last Updated: బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:47 IST)
భారతదేశ కుబేరుడు ముకేశ్ అంబానీ మరో అరుదైన ఘనత సాధించారు. తొలిసారిగా ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల జాబితాలో మొదటి 10 మందిలో స్థానం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని 'ద హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019' వెల్లడించింది.
54 బిలియన్ డాలర్ల (రూ.3.83 లక్షల కోట్లు) నికర సంపదతో అంతర్జాతీయ కుబేరుల జాబితాలో పదో స్థానంలో నిలిచినట్లు సమాచారం. రిలయన్స్లో ముకేశ్కు 52 శాతం వాటా ఉంది, గత నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.8 లక్షల కోట్లకు చేరింది. ఆర్ఐఎల్ షేర్లు రాణించడంతో ఈ ఏడాది ముకేశ్ సంపద భారీగా పెరిగింది. దీనితో ఆయన ఈ ఘనత సాధించగలిగారు. కానీ, ఆయన సోదరుడు అడాగ్ అధినేత అనిల్ అంబానీ మాత్రం ఆస్తులు కరిగిపోగా, అప్పులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆయన మూడు వేలకు పైగా స్థానంలో ఉన్నారు.
అయితే ఈ జాబితాలో వరుసగా రెండో ఏడాది కూడా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోన్ 147 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. 96 బిలియన్ డాలర్ల సంపదతో బిల్గేట్స్, 88 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా భారతీయ కుబేరుల్లో ముకేశ్ తర్వాత హిందూజా గ్రూప్ ఛైర్మన్ (21 బిలియన్ డాలర్లు), విప్రో ఛైర్మన్ అజిమ్ ప్రేమ్జీ (17 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
ప్రియాంక చోప్రా ధరించిన చెప్పుల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Highlights
ప్రియాంక చోప్రా ధరించిన చెప్పుల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
మొన్న జరిగిన బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, అమెరికా నటి మేఘన్ మార్కల్ల పెళ్లి వేడుకకు సినీ నటి ప్రియాంక చోప్రా రూ.1.35 లక్షల విలువ చేసే చెప్పులు వేసుకెళ్లి వార్తల్లో నిలిచింది. తలపై నుంచి పాదాల వరకు ఆమె చేసుకున్న అలంకారాలు అద్భుతమని ఆమె అభిమానులు అంటున్నారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్వరోక్సి క్రిస్టల్స్తో ప్రియాంక చోప్రా తన చెప్పులను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది. అమెరికా నటి మేఘన్.. ప్రియాంక చోప్రాకు మంచి స్నేహితురాలు. తన స్నేహితురాలి జీవితం ఈ పెళ్లితో మారిపోతుందని, ఆమె చాలా తెలివైన నటి అని ప్రియాంక చోప్రా పేర్కొంది. కాగా, ఈ పెళ్లి వేడుకకు ఎందరో అతిరథ మహారథులు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీల్లోనూ ఈ వివాహ వేడుక ప్రసారమైంది.
Last Updated 21, May 2018, 6:38 PM IST | 0business
|
internet vaartha 248 Views
మరో కీలక పోరుకు సిద్ధం
బెంగళూరు : వరల్డ్ టి20 టోర్నమెంట్లో భాగంగా నేడు బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది.దీంతో మరో కీలక పోరుకు ఇరు జట్టు సిద్దంగా ఉన్నాయి. గ్రూపు-2 లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగునున్న లీగ్ మ్యాచ్లో ధోనీ సేన తలపడనుంది.కాగా రాత్రి 7.30 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.ఈ టోర్నీలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడిన టీమిండియా ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. సెమీ ఫైనల్లో ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమిండియా బంగ్లాదేశపై భారీ విజయం సాధించాలి.గ్రూప్ -2లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకుపోతూ రన్రేట్ పరంగా అగ్రస్థానంలో ఉండగా,ఇదే గ్రూప్లో ఉన్న పాకిస్థాన్ రెండవ స్థానంలో,ఆస్ట్రేలియా మూడవ స్థానంలో ఉన్నాయి.ఇక టీమిండియా నాలుగవ స్థానంలో ఉంది.మ్యాచ్కు మ్యాచ్కు నెట్ రన్ రేట్ లో మార్పులు చోటు చేసుకోవడం అనివార్యమే అయినా భారత పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగానే కనపిస్తుంది. దీంతో నేడు జరిగే మ్యాచ్లో భారత్ మెరుగైన రన్ రేట్తో బంగ్లాదేశ్తో గెలువాలి.కాగా సంచనాలకు మారుపేరైన బంగ్లాదేశ్తో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.కాగా బంగ్లాదేశ్ ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో ఈ సమయంలో బంగ్లాదేశ్ మరింత స్వేచ్చగా ఆడే అవకాశం కూడా లేకపోలేదు.
టీమిండియా జట్టు అంచనా : ధోనీ, రోహిత్, ధావన్, రైనా, కోహ్లీ, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా,బూమ్రా
బంగ్లాదేశ్ జట్టు అంచనా : మొర్తజా, మిథున్, సౌమ్యాసర్కార్,రెహ్మాన్,షకిబుల్ హసన్,సువగటా హామ్, మొహ్మదుల్లా, రహీమ్, సక్లయిన్, అల్-అమిన్హసన్, ముస్తాఫిజూర్. | 2sports
|
internet vaartha 222 Views
రాంచి : జార్ఖండ్ రాజధాని రాంచిలో మదర్డెయిరీ కొత్త ప్లాంట్ను ఏర్పాటుచేస్తోంది. ఈ కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఆహారశుద్ధి, కూరగాయల శుద్ది ప్లాంట్రాంచి సమీపంలోని నాగ్డి వద్ద ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఈ ప్లాంట్కు శంకుస్థాపన చేసారు. ఈ ప్లాంట్ ద్వారా జార్ఖండ్లోని 50వేల మంది రైతు లకు ఉపాధి కలుగుతుంది. ప్రస్తుతం కెపిసిటీ కూడా ఐదువేల మెట్రిక్ టన్నుల వరకూ ఉంటుందని, పల్ప్, ఇతర రసాయనాల ద్వారా మరో 20 వేల టన్నులు ఉత్పత్తి అవుతుందని కంపెనీ వెల్లడించింది. మొదటిదశలో పల్లీల ప్రాసెసింగ్ ప్రారం భిస్తామని రెండోదశలో టమోటా ప్రాసెసింగ్ ప్రారంభించి 2017-18లో వాణిజ్య కార్యకలాపా లకు పెద్ద ఎత్తునవస్తామన్నారు. ఎన్డి డిబికి పూర్తి అనుబంధంగా ఏర్పాటవుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు ఛైర్మన్ టి.నందకుమార్ మాట్లా డుతూ మదర్డెయిరీ (సఫల్) బ్రాండ్తో గ్రామీణ భారత్లో ఏర్పాటుచేస్తున్న అతిపెద్ద ప్లాంట్లలో ఇది ఒకటన్నారు. కంపెనీ ఎండి ఎస్,నాగరాజన్ మాట్లా డుతూ ఈ ప్లాంట్ వల్ల 50వేల మంది రైతులకు ఉపకారం జరుగుతుం దన్నారు. పల్ప్ ఇతరత్రా చూస్తే ఐదువేల మెట్రిక్ టన్నులు ఉంటాయని పల్ప్ ఇతర రసాయనాలు 20వేల మెట్రిక్టన్నుల వరకూ పెంచుకోగలమిన ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 75.65 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. జార్ఖండ్ ప్రభుత్వ సబ్సిడీ 14-15కోట్ల రూపాయలుగా ఉందన్నారు. బిజినెస్ హెడ్ప్రదీప్త కుమార్ సాహూ మాట్లాడుతూ మదర్డెయిరీ ప్రస్తుతం ఆహారప్రాసెసింగ్ యూనిట్లపరంగా 15వేల మెట్రిక్ టన్నులు, 18వేల మెట్రిక్ టన్నులుగా ఉంది. కంపెనీ శీతలికరించిన ఆహార ఉత్పత్తులను సఫల్బ్రాండ్ పేరిట విక్రయిస్తోంది. | 1entertainment
|
కోహ్లిసేన ముంగిట సరికొత్త రికార్డ్..!
TNN| Oct 31, 2017, 05.15 PM IST
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కి ముందు భారత్ ముంగిట ఓ సరికొత్త సవాల్ నిలిచింది. ఇప్పటికే ముగిసిన మూడు వన్డేల సిరీస్ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా.. ఒకసారి కూడా న్యూజిలాండ్ని టీ20ల్లో ఓడించలేకపోయింది. దీంతో ఈ చెత్త రికార్డుని బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరగనున్న తొలి టీ20తో తుడిచిపెట్టేయాలని కోహ్లిసేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు.. వన్డే సిరీస్ని కొద్దిలో చేజార్చుకున్న కివీస్ కూడా కనీసం టీ20 సిరీస్తోనైనా స్వదేశానికి గౌరవంగా తిరిగి వెళ్లాలని ఆశిస్తోంది.
భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు ఐదు సార్లు టీ20ల్లో తలపడగా.. ఐదింట్లోనూ కివీస్దే పైచేయిగా నిలిచింది. చివరి సారి.. నాగ్పూర్ వేదికగా గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో తలపడిన భారత్ జట్టు ఘోరంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 126 పరుగులకే పరిమితమవగా.. అలవోకగా లక్ష్యాన్ని ఛేదిస్తుందనుకున్న టీమిండియా అనూహ్యంగా 79 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ మ్యాచ్లో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 11 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ముగ్గురు ఖాన్ల గురించి కరీనా కామెంట్
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ గురించి కరీనా ఏమంటోంది ?
TNN | Updated:
Aug 26, 2015, 12:56PM IST
ఇటీవలే బ్రదర్స్ సినిమాలో ఐటం సాంగ్ చేసి కుర్రకారుని హీటెక్కించిన కరీనా కపూర్ ఖాన్ తాజాగా ఫిలింఫేర్ మేగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. కెరీర్లో అమీర్ ఖాన్ , సల్మాన్ ఖాన్ , షారుఖ్ ఖాన్ ... ఇలా ముగ్గురు ఖాన్లతో నటించిన మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఫిలింఫేర్. ఈ ప్రశ్నకి బదులిచ్చిన కరీనా కపూర్.. ఆ ముగ్గురు ఖాన్ల గురించి తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించింది.
సల్మాన్ ఖాన్ రిలాక్సింగ్లో వుంటాడు. అమీర్ ఖాన్ కూడా రిలాక్సింగ్గానే కనిపిస్తాడు కాకపోతే ఎప్పుడూ ప్రిపేరింగ్ అన్నట్లుగానే వుంటాడు. ఇక షారుఖ్ ఖాన్ విషయానికొస్తే, ఎప్పుడూ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తుంటాడని అంటోంది. ఈ ముగ్గురు ఖాన్లు ఎవరికి వారే అయినప్పటికీ ముగ్గురిలో వున్న ఓ కామన్ పాయింట్ ఏంటంటే... వాళ్లతో పనిచేస్తోంటే తనకి ఏదో బాక్సింగ్ రింగులో వున్నట్లనిపిస్తుంది అంటూ ముగ్గురు ఖాన్ల పనితీరు గురించి వివరించింది కరీనా. | 0business
|
Vaani Pushpa 149 Views cricket , MICHAEL HOLDING , Pakistan
MICHAEL HOLDING
కరాచి: పాకిస్తాన్లో సరైన భద్రత లేదనే కారణంగా చూపుతూ పలు దేశాల క్రికెటర్లు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు. ఇటీవల శ్రీలంక క్రికెట్ జట్టు…పాకిస్తాన్ పర్యటనకు వచ్చినా పూర్తి స్థాయి జట్టు రాలేదు. లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నేతో సహా ఎక్కువ సంఖ్యలో పాక్ పర్యటనకు రావడానికి ఇష్టపడలేదు. భద్రతా పరమైన కారణంగా పాకిస్తాన్కు రాలేమని తేల్చి చెప్పేశారు. దాంతో ‘జూనియర్ శ్రీలంక జట్టు పాక్ పర్యటనకు వచ్చింది. అయితే తాజాగా వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ పాకిస్తాన్లో అడుగుపెట్టారు. అదే సమయంలో మైకేల్ హోల్డింగ్కు తన నివాసంలో పాక్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది అతిథి మర్యాదలు చేశారు. అఫ్రిదితో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయ్యద్ అన్వర్ కూడా అఫ్రిది ఇచ్చిన విందును స్వీకరించారు.
అనంతరం హోల్డింగ్ మాట్లాడుతూ…ఏ విధమైన భద్రతా పరమైన లోపాలున్నా నేను పాకిస్తాన్కు రాలేను కదా. పాకిస్తాన్లో ఎటువంటి ముప్పులేదు. నాకైతే ఎటువంటి సమస్య తలెత్తలేదు. శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటించడం ఇక్కడ క్రికెట్కు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అన్నారు. హోల్డింగ్ తన ఇంటికిరావడంపై అఫ్రిది స్పందిస్తూ…ఒక దిగ్గజ ఆటగాడు నేను ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నా. హోల్డింగ్ పాక్ రావడానికి డాక్టర్ ఖాషిఫ్ కృషి చేశారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. దాంతో పాటు అన్వర్ కూడా నేను ఏర్పాటు చేసిన డిన్నర్కు వచ్చాడు. ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు ఇలా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందని అఫ్రిది ట్వీట్ చేశాడు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/ | 2sports
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి | 1entertainment
|
డీజే నిర్మాత దిల్ రాజు ఆఫీసుపై చిరంజీవి యువత దాడి
Highlights
డీజే కలెక్షన్స్ లెక్కలపై మెగాస్టార్ అభిమానుల ఆగ్రహం
డీజే సినిమాపై తప్పుడు లెక్కలుు చెప్తున్నారన్న చిరు ఫ్యాన్స్
డీజే నిర్మాత దిల్ రాజు కార్యాలయంపై రాష్ట్ర చిరంజీవి యువత కార్యకర్తల దాడి
డీజే సినిమా వసూళ్లు ఎన్ని సాధిస్తోందో కానీ.. వివాదాలు మాత్రం వీడటం లేదు. ఓ పక్క వంద కోట్లు దాటి కలెక్షన్స్ వచ్చాయని నిర్మాత అధికారికంగా ప్రకటించడంతో నాన్ బాహుబలి చిత్రాల్లో రికార్డు సాధించిన ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ పై ప్రభావం చూపుతోంది. అసలు మెగాస్టార్ సినిమాకే రానన్ని కలెక్షన్స్ డీజేకు వచ్చాయా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇటీవల బుక్ మై షో డాట్ కామ్ లో మెగా స్టార్ అంటూ అల్లు అర్జున్ కు బిరుదునిచ్చి టికెట్స్ సేల్ చేయటంతో మెగా అభిమానులు ఆగ్రహంతో వున్నారు.
నిజానికి డీజే సినిమా రిలీజ్ తర్వాత మిక్స్ టాక్ వచ్చింది. రివ్యూల్లో సినిమాలో మిస్సైన అంశాలపై రివ్యూ రైటర్స్ ఎక్కువ ఫోకస్ పెట్టి రాయటంతో కాస్త నెగెటివ్ పబ్లిసిటీ పడింది. అయితే.. నిర్మాత, దర్శకుడు, హీరో.. వరుసబెట్టి రివ్యూ రైటర్స్ పై కౌంటర్స్ వాయించడంతో కన్ ఫ్యూజన్ లో ఏం చేయాలో అర్థం కాక జనం సినిమా చూస్తున్నారు.
ఇదంతా బానే వుంది కానీ.. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ సాధించిన హైయస్ట్ నాన్ బాహుబలి కలెక్షన్స్ ను డీజే క్రాస్ చేసేసిందా అన్న రేంజ్ లో ప్రచచారం చేస్తుండటంతో... మెగా ఫ్సాన్చ్ కు కోపం వచ్చింది. దాంతో రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో పెద్దయెత్తున దిల్ రాజు కార్యాలయానికి చేరుకున్న చిరు ఫ్యాన్స్ కార్యాలయంపై దాడికి యత్నించారు. పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో స్పందించిన నిర్మాత దిల్ రాజు సాయంత్రం జరిగే ఫిదా వేడుకలో డీజే కలెక్షన్స్ పై క్లారిటీ ఇస్తానని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
Last Updated 25, Mar 2018, 11:58 PM IST | 0business
|
బిసిసిఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ తొలగింపు
కార్యదర్శి షిర్కేకి కూడా ఉద్వాసన
తదుపరి విచారణ జనవరి 19న
అదేరోజు బోర్డు కొత్త సభ్యుల నియామకం
ఇలాంటి నిర్ణయాలు చూడలేదని బోగ్లే వ్యాఖ్య
న్యూఢిల్లీ: బిసిసిఐపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది.సంస్కరణల అమలు విషయంలో లోథా కమిటీ,బిసిసిఐ మధ్య నడుస్తున్న కేసు వివాదంపై ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సుప్రీంకోర్టు సోమవారం ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయ నందుకు బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి షిర్కేలను పదవుల నుంచి తొలగించింది.వివరాల్లోకి వెళితే క్రికెట్ ప్రక్షాళనకు చేపట్టాల్సిన సంస్కరణలతో కూడిన నివేదికను లోధా కమిటీ 2016,జులై 18న సుప్రీంకోర్టుకు సమర్పించింది.కూలింగ్ ఆఫ్ పీరియడ్,ఒక రాష్ట్రానికి ఒక ఓటు,70 సంవత్సరాలు పై బడిన వారు రాజకీయ నేతలు క్రికెట్ సంఘాల్లో ఎలాంటి పదవులు చేపట్టరాదని కమిటీ సూచించింది.ఈ క్రమంలో సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్దంగా అజ§్ు షిర్కే ప్రధాన కార్యదర్శిగా నియ మించింది. అంతే కాదు లోధా కమిటీ సూచించిన పలు సిఫారసులను సైతం బిసిసిఐ బోర్డు సభ్యులు వ్యతిరేకిస్తూ వచ్చారు.లోధా కమిటీ పేర్కొన్న కొన్ని సిపారసులను అమలు చేయడం కష్టసాధ్యమని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.దీనిపై సుప్రీంకోర్టు గతంలోనే బిసిసిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్టు దిక్కారానికి పాల్పడి నందుకు బైలుకు వెళ్లాల్సి వస్తుందని గత విచారణ సందర్భంగా కోర్టు అనురాగ్ ఠాకూర్ను హెచ్చ రించింది.
ఈ నేపథ్యంలో బిసిసిఐకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో బోర్డులోని కీలక పదవులను కోల్పోను న్నారు.బిసిసిఐ సభ్యుల ఎంపికపై సూచనలు ఇచ్చేందుకు ఇద్దరు న్యాయవాదులను సైతం సుప్రీంకోర్టు నియమించింది. తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.తొలగించిన వారి స్థానంలో బోర్డు సభ్యులుగా కొత్తవారిని జనవరి 19న ప్రకటిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కీలక నిర్ణయం బిసిసిఐ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అజ§్ు షిర్కేలను సుప్రీంకోర్టు పదవుల నుంచి తొల గించింది. గత కొన్నాళ్లుగా ఇండియన్ క్రికెటర్ను పాలో అవుతున్నాను,ఇన్నాళ్లు ఇలాంటి నిర్ణయాన్ని ఇప్పటి వరకు చూడలేదని ప్రముఖ వ్యాఖ్యాత హర్షాబోగ్లే వివరించాడు. ఈ తీర్పు వెనుకున్న నిబద్దత కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు.
నువ్వు బిసిసిఐవి అయితే ఈ ఇయర్కు ఇది శుభారంభం కాదు,తీర్పు హైలైట్గా ఉందని ప్రేమ్ పనిస్కర్ వివరించాడు. బిసిసిఐ టాప్ ఆర్డర్ను సుప్రీంకోర్టు క్లీన్ బోర్డు చేసింది.అనురాగ్ ఠాకూర్ ను ఔట్గా డిక్లేర్ చేసింది. థర్డ్ అంఫైర్ రివ్యూ లేనందున బ్యాట్స్మెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని రాహుల్ కన్వాల్ పేర్కొన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ విచారణ ఇద్దరు బిసిసిఐ అధ్యక్షులైన అనురాగ్ ఠాకూర్, శ్రీని వాసన్ను తప్పించే వరకు వెళ్లిందని మిహిర్ వాస్వాడా అభిప్రాయం వ్యక్తం చేశాడు. దేశంలో ఉన్న పెండింగ్ కేసులను విచారించేందుకు సుప్రీంకోర్టు తగినంత మంది జడ్జీలను నియామకం చేయలేదు.అయితే క్రికెట్ బోర్డు ప్రక్షాళనకు పూనుకుందని ఒక అభిమాని పేర్కొన్నాడు | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
విరాట్ కోహ్లి టీచర్స్ని లెక్క పెట్టగలరా..?
క్రికెటర్లు కోచ్ దగ్గర నేర్చుకునేదానికంటే.. మైదానంలో అనుభవపూర్వకంగానే ఎక్కువ పాఠాలు నేర్చుకుంటుంటారు.
TNN | Updated:
Sep 5, 2017, 04:15PM IST
క్రికెటర్లు కోచ్‌ దగ్గర నేర్చుకునేదానికంటే.. మైదానంలో అనుభవపూర్వకంగానే ఎక్కువ పాఠాలు నేర్చుకుంటుంటారు. ప్రత్యర్థులతో పాటు సహచరుల బ్యాటింగ్‌ని పరిశీలించడం, మ్యాచ్ సమయంలో సీనియర్ల సలహాలను తీసుకోవడం ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతుంటారు. క్రికెటర్ల దృష్టిలో వారి ఆటకి సాయపడేలా సలహా ఇచ్చే ప్రతి ఒక్కరూ గురువుతో సమానం.. క్రికెట్‌ని తమ ఆటతో ఈ స్థాయికి తెచ్చిన దిగ్గజాలందరూ టీచర్లే. అందుకేనేమో గురు పూజోత్సవం సందర్భంగా విరాట్ కోహ్లి తన ఆటకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయపడిన గురువులందరినీ గుర్తు చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు.
కెరీర్ ఆరంభం నుంచి సచిన్ తెందుల్కర్‌పై ఎనలేని గౌరవం చూపుతున్న విరాట్ కోహ్లి.. గురువుల జాబితాలోనూ అతనికి అగ్రస్థానమిచ్చాడు. అనంతరం భారత్‌కి రెండు ప్రపంచకప్‌లు అందించిన మాజీ కెప్టెన్ ధోనీ, 1983లో తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్‌లకు టాప్-3లో కోహ్లి చోటిచ్చాడు. తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌ ఇలా భారత క్రికెట్ దిగ్గజాలని కోహ్లి గుర్తు చేసుకున్నాడు. ఒకప్పటి సహచరులతో పాటు.. క్రికెట్‌లో తమ ఆటతో అద్భుతాలు సృష్టించిన‌ విదేశీ క్రికెటర్ల‌ు కూడా కోహ్లి గురువుల జాబితాలో ఉండటం విశేషం. | 2sports
|
internet vaartha 159 Views
చెన్నై : టివిఎస్ కంపెనీ కొత్తగా బిఎండబ్ల్యు కంపెనీ బ్రాండ్ టూవీలర్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. అక్టోబరు తర్వాత కొత్త ఉత్పత్తి విడుదలవుతుందని బిఎండబ్ల్యు కంపెనీకి టివిఎస్ ఉత్పత్తి చేస్తుందని ఈఏడాది చివరికల్లా ఉత్పత్తులు మార్కెట్కు రావచ్చన్న అంచనాలున్నాయి. టివిఎస్ మోటార్ సిఇఒ ప్రెసిడెంట్ కెఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ బిఎండబ్ల్యు ఆధ్వర్యంలోనే మొదటి బైక్ వస్తుందని వెల్లడించారు. జర్మనీ ఆటోమేజర్ బిఎండబ్ల్యు భారతీయ మార్కెట్లోనికి ప్రవేశించేందుకు టివిఎస్తో జతకట్టింది. టివిఎస్ కంపెనీ కూడా తమకు ఇప్పటికే ఉన్న సర్వీస్ ప్లాట్ఫామ్ ఔట్లెట్లను సంయుక్తంగా వినియోగించు కోవాలని చూస్తోంది. బిఎండబ్ల్యు మోటోర్రాడ్ మొట్టమొదటి 300 సిసి మోటార్ సైకిల్ విడుదలచేసింది. అలాగే 200 సిసి అపాచె వెర్షన్కూడా వస్తోంది. బిఎండబ్ల్యు మోటార్రాడ్ అపాచి 200 మరింత తీర్చిదిదేదందుకు ఉపకరిస్తుందని అంచనా. కంపెనీ ఇప్పటికే బిఎండబ్ల్యు కాన్సెప్ట్ స్టంట్జి310ను విడుదల చేసింది. జర్మనీ కంపెనీ టివిఎస్ మోటార్స్ టైఅప్తో భారత్ లో విడుదలచేస్తోంది. బ్రెజిల్లో జరిగిన మోటార్షో ఈ బైక్ను జర్మనీ కంపెనీ ప్రదర్శించింది స్టంట్బైక్గా చెపుతున్న వన్ సిలిండర్ రోడ్స్టర్ణు విడుదల చేసినట్లు కంపెనీ చెపుతోంది. బిఎండబ్ల్యు-టివిఎస్ కె3 మోటార్షైకిల్ 2016 తర్వాత భారత్ మార్కెట్కు రావాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న టివిఎస్ డీలర్లకు వీటి ప్రత్యేక ఔట్లెట్ల ఏర్పాటులో ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. ముందు రెండు ఉత్పత్తులను విడుదలచేస్తుంది ఒకబ్రాండ్ టివిఎస్పేరిట ఉంటే మరొకటి బిఎండబ్ల్యు పేరిట వస్తుంది. బిఎండబ్ల్యు టివిఎస్ భాగస్వామ్యం 500 సిసిలోబ డి ఉన్న కేటగిరీ బైకులు ముందు విడుదల చేస్తుంది. ఈ భాగస్వామ్యంతో వచ్చే ప్రాజెక్టుకు పెట్టుబడులు 20 మిలి యన్ల యూరోల వరకూ ఉంటుంది. 2013లోనే ఈ రెండు కంపెనీలు పరస్పర సహకారంపై ప్రకటన చేశాయి. | 1entertainment
|
INSURANCE POLICY
సిఐసిఐ ప్రులైఫ్ పరిధిలోకి సహారా లైఫ్
ముంబయి, జూలై 31: బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్డిఎఐ) తాజాగా సహారా ఇండియా బీమాసంస్థను తీసుకోవాల్సిందిగా ఐసిఐసిఐ ప్రుడె న్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్కు సూచించింది. ఈనెల 31వ తేదీనుంచి సహారా పర్యవేక్షణ తన అధీనంలోకి తీసుకోవాలని ఐసిఐ సిఐ ప్రులైఫ్ను ఆదేశించింది. మొత్తం వ్యవస్థను ఏడాదిలోపు తమపర్యవేక్షణ లోకి తీసుకోవాలని ఐఆర్డిఎఐ ఆదేశిం చింది. సహారాగ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రా§్ు ఐఆర్డిఎఐఛైర్మన్ను కలిసి సంక్షో భం పరిష్కారానికి మరింత వ్యవధి కావాలని కోరారు ఈనెల 24వ తేదీనే ఐఆర్డిఎఐ ఛైర్మన్ విజన్ను కలిసి చర్చ లు జరిపినట్లు తెలిసింది. ఐసిఐసిఐ ప్రులైఫ్ ఇప్పటికే సహారాకంపెనీపై తన విలువలు మదించిన నివేదికను ఐఆర్డిఎఐకు అందించింది. కంపెనీని అదేరోజు టేకోవర్చేసేం దుకు కూడా సంసిద్ధత వ్యక్తంచేసింది. లక్నోకేంద్రం గా కొనసాగుతున్న సహారాలైఫ్ను విక్రయించేందుకు ఐఆర్డిఎఐ గతనెలలోనే అడ్మినిస్ట్రేటర్ను నియమిం చింది. సుపరిపాలనవ్యవస్థకు సంబంధించిన లోపా లతో పాటు ఆర్థికసంక్షోభంలో కూరుకున్న సహారా ను ఐసిఐసిఐ తీసుకోవాలని ఆదేశించింది. గతనెల 22వ తేదీ నివేదిక ఆధారంగా ఐఆర్డిఎఐ సహారా ఇండియా ఎల్ఐసి పోర్టుఫోలియోను మరో ఇతర కంపెనీకి కేటాయించాలని బీమా చట్టం 1938 సెక్షన్ 52బి(1)ప్రకారం నిర్ణయించింది.
ఇందుకు 15రోజుల మారిటోరియం వ్యవధిని కూడా నిర్దేశిం చింది. పాలసీ దారులు తమరెన్యువల్ప్రీమియం చెల్లించేందుకు వ్యవధినిచ్చింది. ఐసిఐసిఐప్రులైఫ్ 21రోజులపాటు క్లెయిమ్స్ పరిష్కారానికి గడువు ఇచ్చింది. ఆతర్వాత సహారా పాలసీదారుల మొత్తం ఐసిఐసిఐప్రులైఫ్పరిధిలోనికి వస్తారు. సహారా లైఫ్కు సంబంధించి పూర్తికాలం పనిచేసే కాల్ సెంటర్, ఇమెయిల్ ఐడి వంటివి ఏర్పాటుచేసి పాలసీదారుల సందేహాలను నివృత్తిచేస్తుందని వెల్లడించింది. ప్రభుత్వరంగంలోని ఎల్ఐసి కూడా సహారాలైఫ్ను స్వాధీనంచేసుకునేందుకు ఉన్న సంస్థల్లో ఒకటిగా రేసులో నిలిచింది. ఎల్ఐసి ఛైర్మన్ వికెశర్మ మాట్లాడుతూ సహారా బీమా స్టాక్ఆధారిత బీమా కంపెనీ అని ఈ సంస్థలో తాము పెట్టుబడులకు ఆసక్తి చూపిం చడంలేదని అన్నారు. తము ఐఆర్డిఎఐ నుం చి సహారాలైఫ్ ఆస్తులు టేకోవర్చేసు కోవచ్చని ఉత్తర్వులుఅందాయని ఐసిఐసిఐప్రులైఫ్ స్పష్టం చేసింది. ఇదేమీ విలీనంకాదని, కేవలం పాలసీదారు లను ఐసిఐసిఐప్రులైఫ్కు బదిలీచేయడం మాత్రమే నని అన్నారు. సహారా పాలసీదారులకు ఐసిఐసిఐ ప్రులైఫ్ అందిస్తున్న అత్యున్నత స్థాయి ప్రమాణాల తో కూడిన సేవలు అందిస్తామని స్పష్టం చేసింది. | 1entertainment
|
భార్య మళ్లీ హీరోయిన్ అవుతానంది.. మాజీ ముఖ్యమంత్రి ఓకే అన్నాడు
Highlights
కన్నడ నటి రాధికను పెళ్లి చేసుకున్న కుమారస్వామి
కుమారస్వామిని నిర్మాతగా వున్నప్పుడు ప్రేమించిన రాధిక
హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడ్డ రాధిక,కుమారస్వామి ఓకే
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి రెండో భార్య తిరిగి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. రాధిక గతంలో కన్నడంలో టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది. కానీ కుమార స్వామిని చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా ఆమె రీ ఎంట్రీ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే కుమార స్వామి భార్య అంటే ఏ నిర్మాతగానో, దర్శకురాలిగానో రీఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మళ్లీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తోందట రాధికా కుమారస్వామి.
రాధిక హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వడంపై కుమార స్వామి కూడా ఏలాంటి అభ్యంతరం చెప్పలేదట. గతంలో తాను హీరోయిన్ గా ఉన్న సమయంలో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ తనయుడిగా కుమారస్వామి సినీ నిర్మాతగా వ్యవహరించారు. ఆ రోజుల్లోనే నటి రాధికతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకుంది..అయితే అప్పటికే కుమార స్వామికి పిల్లలు కూడా ఉన్నారు. అయినా వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు.
నిజానికి రాధిక ఇక కుమారస్వామి రాజకీయ వారసురాలిగా అవతరించాలనే ప్రయత్నంలో ఉంది. కుమారస్వామి మొదటి భార్య కుమారుడు నిఖిల్ ఇటీవలే జాగువార్ సీనిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కుమారస్వామి రెండో భార్య రాధిక తిరిగి హీరోయిన్ గా వస్తోంది. మొత్తానికి కుమారస్వామి భార్య రాధిక సినిమాల్లోకి హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వనుండటం ఇప్పుడు కన్నడ నాట హాట్ టాపికైంది. | 0business
|
Read More: పేరుకేమో పవర్ హిట్టర్.. షాట్ మాత్రం..?
దేశవాళీ క్రికెట్లో ముంబయి తరఫున ఆడి సిక్సర్ల మోత మోగించిన శివమ్ దూబే.. బరోడాతో జరిగిన ఓ మ్యాచ్లో వరుసగా 6, 6, 6, 6, 6 బాదేసి వెలుగులోకి వచ్చాడు. అతని హిట్టింగ్ చూసిన అభిమానులు.. భారత్కి మరో యువరాజ్ సింగ్ దొరికేశాడంటూ మురిసిపోయారు. తొలి టీ20 ముందు కూడా ప్రాక్టీస్ సెషన్లో అతను అచ్చం యువీలానే షాట్స్ ఆడటం కనిపించింది.
Read More: టీ20లో 4, 4, 4, 4 ఖలీల్ అహ్మద్ ఇక సర్దుకో..!
శివమ్ దూబేని తనతో పోల్చడంపై యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘అతడ్ని ఫస్ట్ సాఫీగా కెరీర్ స్టార్ట్ చేయనివ్వండి. రెగ్యులర్గా మ్యాచ్లు ఆడుతూ ఓ స్థాయికి వెళ్లిన తర్వాత అప్పుడు కావాలంటే వేరొక ఆటగాడితో పోలికలు తీసుకురావొచ్చు. అయినా.. అతడ్ని నాతో పోల్చకండి. అతనికంటూ ఓ పేరు, ప్రతిభ ఉన్నాయి. శివమ్ దూబే బ్యాటింగ్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంది. ఆ లోపాల్ని టీమిండియా మేనేజ్మెంట్ గుర్తించిందో లేదో నాకు తెలీదు. కానీ.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం వాటిపై దృష్టి సారించాలి’ అని యువరాజ్ సింగ్ సూచించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
May 05,2016
వరంగల్కు విస్తరించిన అమూల్
హైదరాబాద్ : పాలు, పాల ఉత్పత్తులనందించే అమూల్ తమ పాల అమ్మకాలను వరంగల్కు విస్తరించింది. హైదరాబాద్లోని హయత్ నగర్ వద్ద రెండు పాల ప్రాసెసింగ్ మరియు ప్యాకెజింగ్ ప్లాంట్లు అమూల్కు ఉన్నాయి ఇక్కడ నుంచి వరంగల్కు పాలను సరఫరా చేయడం జరుగుతుందని ఆ సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అత్యున్తత నాణ్యత కలిగిన అమూల్ టోన్డ్ మిల్క్ లీటరుకు 38 రూపాయల చొప్పున అందిస్తున్నట్లు తెలిపింది. అమూల్ గోల్డ్ ఫుల్ క్రిమ్ మిల్క్ ధరను లీటరకు రూ.50గా నిర్ణయించామని తెలిపింది. హైదరాబాద్లో అమూల్ 2015 జనవరిలో పాల విక్రయాలను ప్రారంభించింది. కేవలం నేల రోజుల్లోనే రోజుకి ఒకలక్ష లీటర్ల అమ్మకాల మార్కును చేరుకుని, నగర మార్కెట్లో ఇప్పుడు మూడవ అతిపెద్ద మిల్క్ బ్రాండ్కు ఎదిగామని పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘అర్జున్ రెడ్డి’కి దిమ్మతిరిగేలా ‘అరుణా రెడ్డి’ వచ్చేసింది!
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ప్లేస్లో ఓ అమ్మాయిని పెట్టి తీస్తే..? ఆ సినిమా అచ్చం ఇలాగే ఉంటుంది..
TNN | Updated:
Nov 18, 2017, 02:10PM IST
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ మూవీకి ఫీమేల్ వర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్‌లైన్లో అరుణా రెడ్డి ట్రెండ్ సెట్ చేస్తోంది. ఒకవేళ అర్జున్ రెడ్డి సినిమా విజయ్ బదులు అమ్మాయితో తీయాలని దర్శకుడు సందీప్ రెడ్డి భావిస్తే.. ఇలా ఉంటుందనేలా ఆ సినిమా టీజర్‌కు స్పూఫ్‌గా అరుణా రెడ్డి వచ్చింది. అర్జున్ రెడ్డికి పేరడీలా వచ్చిన ఈ షార్ట్ మూవీతో హైదరాబాదీ అమ్మాయి ఎం.ప్రత్యూష సోషల్ మీడియా సంచలనంగా మారింది.
నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన ప్రత్యూష అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండకు పెద్ద అభిమాని. ‘పక్కా తెలంగాణ పోరిని నేను. ఎందంటే మాకు చాలా గట్స్ ఉంటయి, సింపుల్‌గా చెప్పాలంటే నేను ఎవ్వరికైనా..’ అంటూ ఆమె తన గురించి తాను చెప్పుకుంది. అరుణారెడ్డిలో ప్రతిసీన్‌లోనూ ఆమె విజయ్ దేవరకొండను అచ్చు దింపేసింది. | 0business
|
Vaija, Anand Amrut raj
చెన్నై ఓపెన్ తరలిపోవడం నిరాశ కలిగించింది
చెన్నై: భారత్లో జరిగే ఏకైక ఎటిపి ఈవెంట్ చెన్నై ఓపెన్ పూణేకు తరలిపోవడంపై భారత టెన్నిస్ స్టార్ బ్రదర్స్ విజ§్ు అమృత్రాజ్, ఆనంద్ అమృతరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. 21 ఏళ్ల క్రితం ఈ ఈవెంట్ చెన్నైలో జరిగేందుకు చెన్నైకు చెందిన అమృతరాజ్ బ్రదర్స్ విశేష కృషి చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈటోర్నీ మహారాష్ట్ర ఓపెన్గా పూణేలో నిర్వహించనున్నారు. 1997లో తొలిసారి చెన్నైలో గోల్డ్ప్లేక్ ఓపెన్ ఏటిపి టోర్నీ పేరుతో జరిపారు. అప్పటినుంచి ఈ టోర్నీ అభిమానలను విశేషంగా ఆకర్షిస్తూ వస్తోంది. సుదీర్ఘకాలం నుంచి ఈ ఈవెంట్ చెన్నైతో జరుగుతోంది. ఇప్పుడు వేదిక మారుతుండటం నిరాశ కలిగిస్తోంది. అయితే భారత్లోనే జరుగుతుండటం సంతోషకరమని విజ§్ు అమృత్రాజ్ అన్నారు. మరోవైపు ఎటిపి ఈవెంట్ చెన్నై నుంచి వెళ్లడం సిగ్గుచేటని ఆనంద్ స్పందించారు. అయితే పూణెలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని కితాబిచ్చారు. | 2sports
|
Apr 05,2016
'నువోస్పోర్ట్' వచ్చేసింది...
ముంబయి: దేశంలో అతిపెద్ద యుటిలిటీ (యూవీ) వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త యూవీ వాహనం 'నువోస్పోర్ట్'ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 'క్వాంటో' వాహనానికి మెరుగులుదిద్ది అత్యాధునికంగా 'నువోస్పోర్ట్'ను సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ బహుళ సీటర్ యూవీ వాహనం ధరను కంపెనీ రూ.7.35 లక్షలుగా (ఎక్స్షోరూమ్, థానే) నిర్ణయించింది. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడుగ్గా ఉండే ఈ వాహనం ఇప్పటికే మార్కెట్లోని మారుతీ సుజుకీ విటారా బ్రెజ్జా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా టీయూవీ300, కేయూవీ 100 వాహనాలకు ధీటుగా నిలవనుంది. కాంపాక్ట్ యూవీ విభాగంలో మహీంద్రా సంస్థ అందుబాటులోకి తెచ్చిన మూడో వాహనం 'నువోస్పోర్ట్'. రెండు ఆటోమెటిక్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) వ్యవస్థ కూడిన వేరియంట్లతో పాటు మొత్తం ఆరు వేరియంట్లలో మహీంద్రా కొత్త వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 1,493 సీసీ డీజిల్ ఇంజిన్తో పాటు గరిష్ఠంగా 100 బీహెచ్పీ పవర్తో దీనిని మహీంద్రా మార్కెట్లోకి తీసుకువచ్చారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Apr 03,2015
భారత్లో పెరిగిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ విమానయాన ప్రయాణికుల్లో 14.8 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. కాగా ఇది ప్రపంచంలోనే అతి ఎక్కువవని గ్లోబల్ ఎయిర్లైన్స్ సంఘం ఐఎటిఎ వెల్లడించింది. విమానయాన కంపెనీలు పోటీలో భాగంగా టిక్కెట్ ధరలు తక్కువగా ప్రకటించడంతో ఈ వృద్ధి చోటు చేసుకుంది. ప్రపంచ ప్రయాణికుల సగటు 6.2 శాతం పెరిగింది. క్రితం ఫిబ్రవరిలో భారత్, బ్రెజిల్, చైనా ప్రయాణికుల్లో పెరుగుదల నమోదయ్యిందని ఐఎటిఎ పేర్కొంది. ఐఎటిఎ అంచనా ప్రకారం గత మాసంలో మొత్తంగా లక్ష విమానాలు, 90 లక్ష లక్షల మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చాయని పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సమంతకు అది తెలుసుకోవటానికి ఏడేళ్లు పట్టిందట
Highlights
సమంత టాలీవుడ్ కు పరిచయమై ఏడేళ్లు
ఇండస్ట్రీ ఎంట్రీ తర్వాత తన లైఫ్ టర్న్స్ పై సమంత ట్వీట్
కష్టం, సుఖం అన్నీ అనుభవించానంటున్న సమంత
టాలీవుడ్ నటి సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఫిబ్రవరి 26తో 7 సంవత్సరాలు పూర్తయింది. సమంత తొలిసారిగా వెండితెరపై రొమాన్స్ చేసింది నాగ చైతన్యతో. ఏం మాయ చేశావే చిత్రంతో వెండితెరకు పరిచయమైన సమంత ఇప్పుడు ఆ చిత్ర హీరో నాగచైతన్యతోనే ఏడడుగులు వేయబోతోంది.
అయితే... ఈ ఏడేళ్ల తన సినీ జివితం ద్వారా తన లైఫ్ లో ఎదురైన అనుభవాలు, మంచి చెడు, సంతోషం దుఃఖం అన్నీ ఇలా ఎన్నో తెలుసుకున్నానంటోంది. సమంత ఎమోషనల్ గా స్పందించింది. తన మనసులోని భావాలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 26 February 2017
తాను కూడా అందరిలాగే అనేక కష్టాలు,నష్టాలు, అభద్రత, వైఫల్యాలు, తిరస్కారాలు, బాధ, ఆవేదన, విజయం, పేరు, డబ్బు ఇలా అన్నీ చూసానని అంటోంది. విజయాలు సాధించినంత మాత్రాన సంతోషంగా ఉన్నానని కాదని, సాధారణంగా ఉండటం ఎలాగో తెలుసుకోడానికి తనకు ఏడేళ్లు పట్టిందని చెప్పింది. సినిమా పరిశ్రమ తనకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి తన జీవితంలోకి వచ్చిన వ్యక్తులే అని సమంత చెప్పింది. ఈ మాటలు చైతూ గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే అఖిల్, శ్రీయ భూపాల్ పెళ్లి రద్దయ్యాక సోషల్ మీడియాలో అఖిల్ జాతకం వల్లనే అలా అయిందని, నాగ చైతన్య జాతకం ప్రకారం కూడా సమంతతో పెళ్లి జరిగే అవకాశం లేదని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే సమంతగానీ, నాగ చైతన్యగానీ ఈ జ్యోతిష్యాన్ని నమ్మడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా పెళ్లి జరగాల్సిన వేళ సమంత జీవితంలో చాలా నేర్చుకున్నానంటూ... ట్వీట్ చేయడం మాత్రం వెరైటీ. ఆల్ ది బెస్ట్ సమంత.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST | 0business
|
పవన్ తో పోటీ వద్దనుకుంటున్న మహేష్
Highlights
స్పైడర్ ప్రమోషన్లలో బిజీ బిజీ గా మహేష్
తరువాతి చిత్రం ‘ భరత్ అను నేను’
షూటింగ్ ల ో పాల్లొన్న మహేష్
మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందకు రానుంది. మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ కి జంటగా నటించింది. ప్రస్తతం మహేష్ అభినులంతా స్పైడర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహేష్ తన కొత్త సినిమా పనుల్లో పడిపోయాడు.
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ‘ భరత్ అను నేను’ చిత్రం తెరకెక్కుతోంది.ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా..మహేష్ షూటింగ్ లో పాల్గొంటున్నాడట. ఒక వైపు స్పైడర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నప్పటికీ ఈ చిత్ర షూటింగ్ కి హాజరౌతున్నాడట.
ఈ సినిమాని మొదట సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావించిందట. అయితే.. అంత కొద్ది సమయంలో షూటింగ్ పూర్తి చేయడం కష్టమని భావించి.. విడుదల తేదేని మార్చినట్లు సమాచారం. సంక్రాంతికి పవన్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా విడుదల ఖాయమైంది. అందుకే ‘భరత్ అను నేను’ సినిమాని సంక్రాంతికి కాకుండా మార్చిలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారని టాక్. పొలిటికల్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానిని ఎంపిక చేయగా.. కీలక పాత్రలో శరత్ కుమార్ నటిస్తున్నట్లు టాక్
Last Updated 25, Mar 2018, 11:53 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
క్రికెటర్ కుటుంబానికి పరిహారం
బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి కుటుంబానికి పరిహారం అందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
TNN | Updated:
Sep 5, 2015, 12:28PM IST
క్రికెట్ ఆడుతూ మృతిచెందిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి కుటుంబానికి పరిహారం అందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈమేరకు న్యాయపరంగా చేయాల్సిన పనులు పూర్తయినట్టు తెలుస్తోంది. మొత్తం పాతిక లక్షల రూపాయల్ని అంకిత్ కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈస్ట్ బెంగాల్ తరఫున స్థానికంగా జరిగిన మ్యాచ్లో క్యాచ్ పట్టడానికి ప్రయత్నించి మరో ఆటగాడిని బలంగా ఢీకొన్నాడు. దీంతో తలకు బలమైన గాయం తగిలింది. నాలుగు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. | 2sports
|
టెక్కీలకు షాక్: సీనియర్లను ఇంటికి పంపుతున్న కాగ్నిజెంట్
Highlights
టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ సీనియర్లకు చెక్ పెడుతోంది. సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. సీనియర్ల స్థానాల్లో జూనియర్లను తీసుకొంటుంది.రెండో క్వార్టర్ ఫలితాల్లో కాగ్నిజెంట్ మార్కెట్ విశ్లేషకుల అంచనాలను చేరుకోలేకపోయింది
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ సీనియర్లకు చెక్ పెడుతోంది. సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. సీనియర్ల స్థానాల్లో జూనియర్లను తీసుకొంటుంది.రెండో క్వార్టర్ ఫలితాల్లో కాగ్నిజెంట్ మార్కెట్ విశ్లేషకుల అంచనాలను చేరుకోలేకపోయింది. దీంతో సీనియర్లను వదిలించుకోవాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకొంది.
అమెరికాలోని న్యూజెర్సీలో ప్రధాన కార్యాలయంగా ఉన్న కాగ్నిజెంట్ సంస్థ ఈ రెండో క్వార్టర్ లో అట్రిక్షన్ రేటు 22 శాతానికి పైగా ఉందని వెల్లడైంది. 2017లో 4000 వేల మంది ఉద్యోగులను కాగ్నిజెంట్ ఇంటికి పంపేసిందని, అంతేకాక 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు కూడా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ను ఆఫర్ చేసినట్టు పేర్కొంది.
సీనియర్లను కాగ్నిజెంట్ నుండి బయటకు పంపిస్తున్నట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. ఎంతమందిని తొలగించాలని నిర్ణయం తీసుకొంటున్నారనే విషయమై ఆ సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సీనియర్లను తొలగిస్తూనే వారి స్థానాల్లో జూనియర్లను తీసుకొంటుంది. రెండో క్వార్టర్లో 7500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తీసుకుని ఉద్యోగుల సంఖ్యను 2,68,900కు చేర్చుకుంది.
మూడో క్వార్టర్లో జూనియర్ స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టనున్నామని ఫలితాల ప్రకటన తర్వాత కాన్ఫరెన్స్లో కాగ్నిజెంట్ సీఎఫ్ఓ కరెన్ మెక్లాగ్లిన్ తెలిపారు. సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఈ ప్రమోషన్లు నాలుగో క్వార్టర్లో ఉంటాయని ఆ సంస్థ ప్రకటించింది. . | 1entertainment
|
లండన్లోనే మోసకారి మోడీ!
- ధ్రువీకరించిన బ్రిటన్ మంత్రి బరోనెస్ విలియమ్స్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో(పీఎన్బీ) వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని దేశం దాటేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ లండన్లోనే తలదాచుకుంటున్నట్గు తేలిపోయింది. ఈ విషయాన్ని బ్రిటన్ మంత్రి బరోనెస్ విలియమ్స్ ధ్రువీకరించారు. నీరవ్ లండన్లో ఉన్నాడని తమ వద్ద సమాచారం ఉందని ఆయన చెప్పారు. పీఎన్బీకి కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ను అప్పగించేందుకు గాను తాము భారత్కు సహాయం అందిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజుతో జరిగిన ఒక సమావేశానికి విలియమ్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నీరవ్ ఆశ్రయం విషయం వెలుగులోకి వచ్చింది. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న విజరు మాల్యాను కూడా భారత్కు అప్పగించేందుకు తప్పకుండా మద్దతు ఇస్తామని విలియమ్స్ హామీ ఇచ్చారు. ఎస్బీఐకి వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మాల్యా రెండేళ్ల నుంచి లండన్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అతడిని భారత్ రప్పించేందుకు భారత్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రూ.13వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడిన నీరవ్, ఆయన వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీ లండన్లో పొలిటికల్ ప్రాసిక్యూషన్ పేరుతో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిని బ్రిటన్ హోశాఖ అధికారులు తోసిపుచ్చారు. కాగా.. మరోవైపు నీరవ్ మోడీ ఎక్కడ ఉన్నాడనే దానిపై స్పష్టమైన సమాచారం లేదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఎక్కడ ఉన్నాడో తెలిస్తే.. తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి.
రెడ్ కార్నర్కు సీబీఐ యత్నాలు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల కుంభకోణం పాల్పడిన నీరవ్ మోడీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని సీబీఐ కోరుతోంది. ఈ మేరకు ఇంటర్పోల్కు సీబీఐ లేఖ రాసిందని అధికారులు చెప్పారు. నీరవ్ కేసును విచారిస్తున్న మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా ఆయనకు వ్యతిరేకంగా రెడ్కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్పోల్ను మార్చిలోనే కోరింది. ఒక్కసారి రెడ్కార్నర్ నోటీసు జారీచేస్తే, లియోన్ ఆధారిత అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశముంటుంది. పీఎన్బీ కుంభకోణానికి సంబంధించిన కేసులో నీరవ్, చోక్సీపై కొద్ది రోజుల క్రితమే సీబీఐ విడివిడిగా చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Jan 14,2018
నాణేల తయారీపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
కోల్కతా : నాణేల తయారీని నిలిపివేయాల్సిందిగా ఈ మధ్యకా లంలోనే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. తిరిగి నాణేల తయారీని పునరుద్ధరిం చాల్సిందిగా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్పీఎంసీిఐఎల్)కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కోల్కతా, ముంబయి, నోయిడా, హైదరబాద్లో ఈ తయారీ కేంద్రాలు(మింట్) ఉన్నాయి. కాగా శుక్రవారం నుంచే తిరిగి నాణేల తయారీని తిరిగి ప్రారంభించామని కోల్కతా మింట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బిజన్ దేవ్ తెలిపారు. కాగా రెండు షిఫ్టుల్లో కాకుండా ఒకే షిఫ్ట్లో పనియాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. బ్యాంకుల్లో నాణేలను భద్రపరిచేందుకు స్థలం లేదని నాణేల తయారీని నిలిపివేయాల్సిందిగా ఈనెల 9న ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
'ముద్ర' వేసి అనంతలోకాలకు..
- ముద్ర యాడ్స్ వ్యవస్థాపకులు ఎజీకే అస్తమయం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'ముద్ర యాడ్స్' వ్యవస్థాపక ఛైర్మన్ అచ్యుతని గోపాల కృష్ణమూర్తి (ఏజికే) శుక్రవారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. 73 సంవత్సరాల ఏజీకే 1942 ఏప్రిల్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన ఏజీకే 'క్యాలికో టెక్స్టైల్స్' మిల్లులో చిన్న ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1972లో 'శిల్పి అడర్టైజింగ్'లో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేశారు. 1976లో 'రిలయన్స్ ఇండిస్టీస్'లో అడ్వర్టైజింగ్ మేనేజర్గా ఏజీకే బాధ్యతలు నిర్వర్తించారు. 1980 మార్చి 25న రూ.35,000 వ్యయంతో 'ముద్ర కమ్యూనికేషన్స్ యాడ్ ఏజెన్సీ'ని ప్రారంభించారు. 1991లో మరో సంస్థ 'ఇన్స్టిటిట్యూట్ ఫర్ స్ట్రాటెజిక్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్' (మిక)ను నెలకొల్పారు. ఈ సంస్థ సరిగా 25 ఏళ్ల వార్షికోత్సవం నాడే ఆయన మృతి చెందడం యాదృచ్ఛికం. 2003 మార్చిలో ఆయన ముద్రా నుంచి బయటికి వచ్చి స్వయంగా 'ఏజీకే బ్రాండ్ కన్సెల్టెన్సీ'ని ఏర్పాటు చేశారు. ఏజీకే పలు పుస్తకాలు, రచనలను కూడా చేశారు. ఎజికె ప్రకటనల రంగంలో అనేక మార్పులు తీసుకు వచ్చారు. ఈ రంగంలో చేసిన అత్యుత్తమ సేవలకు గాను ముద్ర యాడ్స్ ఏకంగా 844 అవార్డులను పొందింది.ఇందులో మాటీవీ ఉత్తమ అవార్డు కూడా ఉన్నది. కృష్ణమూర్తి బహుముఖ ప్రతిభాశాలిగా పేరు పొందారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
L&T
వేల మందికి ఉద్వాసన చెపుతున్న ఎల్అండ్టి
ముంబై, నవంబరు 23: ఆర్థికసవాళ్లతో సతమతం అవుతున్న లార్సెన్ టౌబ్రో ఏప్రిల్, సెప్టెంబరు త్రైమాసికంలో14 వేల మంది ఉద్యోగులకు ఉద్వా సన పలికింది. పోటీతత్వంలో కొనసాగేందుకు ఆర్థిక అనిశ్చితిని తట్టుకోవాలంటే ఈ చర్య తప్ప దని కంపెనీ ప్రకటించింది. రెండోత్రైమాసిక ఫలి తాలు ప్రకటించిన వెనువెంటనే ఈకార్మికుల ఉద్వా సన కార్పొరేట్ రంగంలో సంచలనం కలిగించింది. ప్రస్తుతం వ్యాపారం మంచివాతావరణంలో లేదని, సాధారణ స్థితికి రావాలంటే కొన్ని సంస్థాగత మార్పులు, సంస్కరణలు అవసరమని భావి స్తున్నట్లు కంపెనీ సిఎఫ్ఒ ఆర్.శంకర్రామన్ వెల్లడించారు. ఇందులో భాగంగానే ఉపాధి కొలువుల్లో తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 1.2 లక్షలమందికిపైగా వివిధ వ్యాపా రాల్లో తమ ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరి లో 2017 ఆర్థికసంవత్సరం మొదటి ఆరు నెలల్లో 14వేల మందిని తొలగించక తప్పదని కంపెనీ ప్రకటించింది. వివిధ విభాగాల వారీ గా ఎంతమందిని తొలగిస్తారన్న అంచనాలను ఇవ్వలేదు. కొన్ని విభాగాలపై ఆర్థిక విభాగం పని తీరు ఆశించినస్థాయిలో లేదని అదేధోరణి ఖణిజ వనరులు, ఖనిజ రంగంలో కొనసాగుతున్నదని సిఎఫ్ఒ పేర్కొన్నారు. పోటీతత్వాన్ని తట్టుకుని నిలబడి మరింత వృద్ధిని సాధించేందుకు అనువైన కార్యాచరణను సిద్ధం చేసామన్నారు. ఎక్కవ అవ సరమైతే అక్కడ డిజిటైజేషన్ అమలుచేసామని అన్నారు. 10మంది ఉద్యోగులు అవసరమైన ప్రాం తంలో ఐదుగురిని మాత్రమే నియమించామన్నా రు. ప్రస్తుతం మందగమనంతో ఉన్న వ్యాపారా ల్లోనే లే ఆఫ్లు ప్రకటించామని కాంట్రాక్టుల నిర్వ హణలో జాప్యం వంటి కీలక కారణాలే ఇందుకు దోహదం చేసినట్లు రామన్ వెల్లడిం చారు. కంపెనీ తన కార్యాలయాలను మరింతగా డిజిటైజ్ చేసేందుకు నిర్ణయించింది. వ్యాపారాల్లో కొన్ని దిగువ స్థాయిలోనే ఉన్నాయని వాటిపై పునఃసమీక్ష చేస్తున్నట్లు వివరించారు. పోటీ ప్రపంచంలో మారుతున్న స్థితిగతులకు అను గుణంగా ముందుకు వెళ్లాల్సి ఉందని కంపెనీ డిఫ్యూటీ ఎండి అధ్యక్షుడు ఎస్ఎన్ సుబ్రహ్మణి యన్ వెల్లడించారు. అయితే ఈ లేఆఫ్లు కేవ లం వన్టైమ్ నిర్ణయం మాత్రమేనని నిరంతరం కొనసాగించే ఆలోచనలేదన్నారు. కంపెనీ మొదటి అర్ధసంవత్సరంలో రాబడులు 8.6శాతం పెరిగి 46,885 కోట్లకు చేరితే లాభాలు కూడా 1197 కోట్ల నుంచి 2044 కోట్లకు చేరాయి. ఎల్అండ్టి రాబడులను రెండు లక్షల కోట్లకు పెంచుకునేందు కుగాను ఐదేళ్ల ప్రణాళికను విడుదల చేసింది. | 1entertainment
|
mithali raj rises to top spot in icc batswomen ranking
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో మిథాలీ రాజ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న రోజునే.. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఐసీసీ వన్డే బ్యాట్స్విమెన్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కి చేరుకుంది.
TNN | Updated:
Oct 30, 2017, 06:00PM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న రోజునే.. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఐసీసీ వన్డే బ్యాట్స్‌విమెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి చేరుకుంది. 753 పాయింట్లు సాధించిన మిథాలీ నంబర్ 1గా నిలవగా, ఆస్ట్రేలియాకు చెందిన ఇల్లీస్ పెర్రీ, న్యూజిలాండ్ క్రికెటర్ అమీ సాటెర్‌ర్త్‌వైట్ చెరో స్థానం ఎగబాకి.. రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరమైన ఆస్ట్రేలియాకు ప్లేయర్ మెగ్ లన్నింగ్ ఒకటో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది.
బౌలర్ల జాబితాలో ఝులన్ గోస్వామి రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన మరిజన్నే కప్ తొలిస్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ మహిళల ఛాంపియన్స్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో నెగ్గిన ఆస్ట్రేలియా వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ నెల ఆరంభంలో ఇంగ్లాండ్ టాప్ పొజిషన్‌కు చేరుకోగా.. మళ్లీ ఆసీస్ దాన్ని చేజిక్కించుకుంది. | 2sports
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
నేనే నిజమైన నాయకుడిని.. నాతో కలిసి రండి.. కమల్ సంచలన ట్వీట్
Highlights
తమిళ నాట రాజకీయాలపై విలక్షణ నటుడి విమర్శలు
నిజమైన నాయకున్ని నేనే.. నావెంట రండి అంటున్న కమల్
రజినీ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆసక్తి రేపుతున్న కమల్ కమెంట్స్
విలక్షణ నటుడు కమల్ హాసన్ లాంటి దిగ్గజ హీరో మాట్లాడినా, ట్వీట్ పోస్ట్ చేసినా... ఏం చేసినా రచ్చ రచ్చే. అందునా.. కమల్ ఈ మధ్య జయలలిత మరణం తర్వాత రాజకీయ కోణంలోనూ చాలా ఎగ్రెసివ్ గా స్పందిస్తున్నారు. అమ్మ మరణం తర్వాత చిన్నమ్మగా పిలవబడే శశికళనను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శించిన సత్తా కమల్ హాసన్ కే చెల్లింది.
ఇటీవల ఆయన హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో వివాదాలమయమైంది. కమల్ ను అరెస్ట్ చేయాలంటూ ఏకంగా ఉన్నత న్యాయస్థానంలో.. ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అయితే కకమల్ మాత్రం యధావిదిగా తన ట్విట్టర్ ఎకౌంటు పోస్టులతో వివాదాలకు ధీటుగా స్పందిస్తూ మరింత అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన వ్యవహారశైలిపై కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి.
ఏది ఏమైనా.. తాను మాత్రం తన దూకుడు తగ్గించటం లేదు. రీసెంట్ గా ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పెద్ద కవిత నే పోస్ట్ చేసారు కమల్. "ప్రస్తుతం ఎవరూ రాజు కాదు. మనం విమర్శిద్దాం. మనం రాజులం కాము. ఓడినా, మరణించినా, నేను తీవ్రవాదినే. నేను తలచుకుంటే నేనే నాయకుడిని. లొంగి ఉండటానికి నేను బానిసను కాను. కిరీటాన్ని వదిలిపెట్టినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. నాతో పాటు రండి కామ్రేడ్... అసంబద్ధతను బద్దలు గొట్టే నాయకుడిగా తయారు అవుతారు " అంటూ ఆయన కవితాత్మకంగా పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది.
అయితే తాజాగా కమల్ స్పందించిన తీరు.. కమల్ ని గురించి మాట్లాడిన తమిళ ఆర్ధిక మంత్రి జయకుమార్ కి వ్యతిరేకంగానే అని స్పష్టమవుతోంది. ఇలా తను చెప్పదలుచచుకున్నది స్పష్టంగా... సూటిగా,,సుత్తిలేకుండాచెప్పేశాడు కమల్. నేనే నాయకున్ని అంటూ కమల్ చేసిన ఈ ట్వీట్.. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది.
మరో రెండు నెలల్లో రాజకీయ అరంగేట్రానికి సంబంధించి రజినీ స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. రజినీ రాజకీయాలల్లోకి రావటం ఇష్టంలేకనే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు తమిళ తంబీలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి కమల్ కేవలం తన ట్వీట్స్ తోనే రాజకీయ రంగు పులుముకోవడంతో ఆపేస్తారా, లేక నాయకుడిని నేనేనంటున్న కమల్ ప్రత్యక్ష రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషిస్తారా అనే ఆసక్తి తమిళనాటనే కాక సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST | 0business
|
`రాధ` సెన్సార్ పూర్తి.. మే 12న విడుదల
Highlights
శర్వానంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తెరకెక్కిన రాధా
సక్సెస్ ఫుల్ గా రాధా చిత్రం సెన్సార్ పూర్తి
మే 12న విడుదల చేసేందుకు సన్నాహాలు
రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్ప్రెస్రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `రాధ`. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మే 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా...
చిత్ర సమర్పకులు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ``వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న అవుటండ్ అవుట్ ఎంటర్టైనర్ `రాధ`. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ `యు` సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో మే 12న విడుదల చేస్తున్నాం. రీసెంట్గా విడుదలై ఈ సినిమా పాటలు, థియేట్రికల్ ట్రైలర్స్కు ప్రేక్షకుల సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ చంద్రమోహన్ తొలి చిత్రమే అయినా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రొమాన్స్, కామెడీ , ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరించే చిత్రం రాధ శర్వానంద్ కెరీర్లో మరో హిట్ మూవీ అవుతుంది`` అన్నారు.
శర్వానంద్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతంః రధన్, సినిమాటోగ్రఫీః కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతః భోగవల్లి బాపినీడు, దర్శకత్వంః చంద్రమోహన్.
Last Updated 25, Mar 2018, 11:53 PM IST | 0business
|
9న ఇంగ్లండ్తో తొలి టెస్టు
న్యూఢిల్లీ: టీమిండియా,ఇంగ్లండ్ మధ్య రాజ్ కోట్లో ఈనెల 9న జరుగనున్న తొలి టెస్టు మ్యాచ్కి గుజరాత్ ముఖ్యమంత్రి విజ§్ు రూపానీ హాజరుకానున్నారు.కాగా ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్కి రాజ్కోట్ లోని ఎన్సిఎ స్టేడియం తొలిసారి ఆతిథ్యమిస్తుంది.దీంతో రాజ్కోట్లోని స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతు న్నాయి. మొదటిసారిగా టెస్టుమ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న క్రమంలో ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ యోచిస్తుంది. ఇందులో భాగంగా సౌరాష్ట్ర నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన టెస్టు క్రికెటర్లను సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. కాగా ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజ§్ు రూపానీని కూడా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానించింది. ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో స్పష్టత లేదు.గుజరాత్ ముఖ్యమంత్రి విజ§్ు రూపానీ మాత్రం ఈ మ్యాచ్కు హాజరయ్యేందుకు అంగీకరించినట్లు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మీడియా మేనేజర్ హిమన్షు వెల్లడించారు. టెస్టు మ్యాచ్ ఓపెనింగ్ డే రోజున సిఎం వస్తారు. టీమిండియా టెస్టు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మాజీ క్రికెటర్లు సలీమ్ దురానీ, కర్సన్గవ్రీ, యుజ్వేందర్ సింగ్, ధీరజ్ ప్రసన్న,పుజారా,జడేజాలకు సిఎం చేతుల మీదుగా సన్మానం జరుగనుంది అని వివ రించాడు. టీమిండియా,ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 9నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్టు మ్యాచ్కి రాజ్కోట్ ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే సిరీస్ జనవరి 15, 2017న ప్రారంభం కానుంది. పుణేలో తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది.జనవరి 26 నుంచి టి20 సిరీస్ కాన్పూర్లో ప్రారంభం కానుంది. టీమిండియా,ఇంగ్లండ్ సిరీస్ వివరాలు మొదటి టెస్టు నవంబర్ 9-13 రాజ్కోట్ రెండవ టెస్టు నవంబర్ 17-21 విశాఖపట్నం మూడవ టెస్టు నవంబర్ 26-30 మొహాలి నాలుగవ టెస్టు డిసెంబర్ 8-12 ముంబై అయిదవ టెస్టు డిసెంబర్ 16-20 చెన్నై | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆ ఫెయిల్యూర్స్ ధావన్ని రాటుదేల్చాయా..?
శ్రీలంక బౌలర్లని వారి సొంతగడ్డపైనే బ్యాట్తో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ చెడుగుడు ఆడుకుంటున్నాడు
TNN | Updated:
Aug 21, 2017, 02:42PM IST
శ్రీలంక బౌలర్లని వారి సొంతగడ్డపైనే బ్యాట్‌తో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండు శతకాలు బాదిన ధావన్.. ఆదివారం ముగిసిన తొలి వన్డేలో శతకంతో టీమిండియాకి ఒంటిచేత్తో విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ధావన్ రెండో వికెట్‌కి అజేయంగా 197 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 217 పరుగుల లక్ష్యఛేదనని భారత్‌ కేవలం 28.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించేసింది.
ఈ సుదీర్ఘ సిరీస్‌లో శతకాల మోత మోగిస్తున్న శిఖర్‌ని ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. కానీ.. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభం వరకూ శిఖర్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. దీంతో దాదాపు ఆరు నెలల పాటు టీమిండియాకి ధావన్ దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ.. ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటనల్లో భీకర ఫామ్‌తో దుమ్మురేపిన ఈ గబ్బర్ ఇప్పుడు లంక బౌలర్లకి కొరకారని కొయ్యగా మారాడు. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
కెప్టెన్సీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా..!
జట్టుకి కెప్టెన్సీ వహించేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. రాజస్థాన్ని జట్టు కంటే ఫ్యామిలీలా చూస్తా. నాపై నమ్మకం ఉంచి
Samayam Telugu | Updated:
Mar 27, 2018, 06:26PM IST
కెప్టెన్సీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా..!
ఐపీఎల్ 2018 సీజన్లో కెప్టెన్గా రాజస్థాన్ రాయల్స్ జట్టుని నడిపించేందుకు తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు అజింక్య రహానె వెల్లడించాడు. రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టులో బాల్ టాంపరింగ్కి పాల్పడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్స్మిత్పై విమర్శలు చెలరేగడంతో.. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ అతడ్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి రహానెకి అప్పగించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ షేన్ వాట్సన్ (2,474)కాగా.. అతని తర్వాత అజింక్య రహానె (2,333) ఉన్నాడు. గత జనవరిలో జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో రూ.4 కోట్లకి ‘రైట్ టు మ్యాచ్’ పద్ధతి ద్వారా రహానెని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. | 2sports
|
Visit Site
Recommended byColombia
సెన్సెక్స్ ఏకంగా 646 పాయింట్ల లాభంతో 38,178 పాయింట్లకు ర్యాలీ చేసింది. నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 11,313 పాయింట్లకు పరుగులు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు, బ్యాకింగ్ అండ్ ఫైనాన్షియల్ షేర్లలో ర్యాలీ, టెక్నికల్గా చూస్తే నిఫ్టీ బుల్లిష్ క్యాండిల్ను ఏర్పాటు చేయడం వంటి అంశాలు మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Stock Market Highlights..
✺ నిఫ్టీ 50లో ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ దాదాపు 6 శాతం పరుగులు పెట్టింది.
✺ అదేసమయంలో యస్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, జీ ఎంటర్టైన్మెంట్, టైటాన్, హెచ్సీఎల్ టెక్ వంటి షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 5 శాతానికి పైగా పడిపోయింది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ దాదాపు లాభాల్లోనే క్లోజయ్యాయి. ఒక్క నిఫ్టీ ఐటీ మాత్రం నష్టపోయింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్లు గరిష్టంగా 3 శాతానికి పైగా ర్యాలీ చేశాయి.
✺ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 1.06 శాతం పెరుగుదలతో 58.84 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 1.03 శాతం పెరుగుదలతో 53.17 డాలర్లకు ఎగసింది.
✺ అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి దాదాపు ఫ్లాట్గానే ట్రేడవుతోంది. 71.07 వద్ద కదలాడుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
నవంబర్ 10న మాస్ హీరో విశాల్ 'డిటెక్టివ్'
Highlights
మాస్ హీరో విశాల్ కథానాయకుడుగా డిటెక్టివ్
తమిళంలో తొలివారమే రూ.30కోట్లు వసూళ్లు సాధించిన డిటెక్టివ్
డిటెక్టివ్ లో అను ఎమాన్యుయెల్, యాండ్రియా, ప్రసన్న తదితరులు
మాస్ హీరో విశాల్ కథానాయకుడుగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డిటెక్టివ్'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ ''మొదటి వారంలోనే 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి విశాల్ కెరీర్లోనే మొదటివారం హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా 'తుప్పరివాలన్' రికార్డు స ష్టించింది. తెలుగులో 'డిటెక్టివ్'గా విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న నమ్మకం వుంది. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. నవంబర్ 10న చాలా గ్రాండ్గా 'డిటెక్టివ్' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.
మాస్ హీరో విశాల్, అను ఇమ్మానుయేల్, ఆండ్రియా, ప్రసన్న, కె.భాగ్యరాజ్, సిమ్రాన్, జాన్ విజయ్, అభిషేక్ శంకర్, జయప్రకాష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్ కొరెల్లి, సినిమాటోగ్రఫీ: కార్తీక్ వెంకట్రామన్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మిస్కిన్.
Last Updated 25, Mar 2018, 11:38 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘మహానటి’ మహాద్భుతం.. జక్కన్న ప్రశంసల జల్లు
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి బయోపిక్ మూవీ ‘మహానటి’ మూవీపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.
Samayam Telugu | Updated:
May 9, 2018, 03:42PM IST
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి బయోపిక్గా ప్రేక్షకుల మందుకొచ్చిన ‘మహానటి’ మూవీపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ లీడ్ రోల్లో ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ బుధవారం నాడు థియేటర్స్లో విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కామన్ ఆడియన్స్తో పాటు సెలబ్రిటీలు కూడా ‘మహానటి’ అద్భుతం అంటూ తమ అభిప్రాయాలను ట్విట్టర్లో తెలియజేస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి ‘మహానటి’ చిత్రాన్ని తొలి రోజునే వీక్షించి చిత్ర యూనిట్ను ఆకాశానికెత్తేశారు. తాను చూసిన అద్భుతమైన పెర్ఫామెన్స్ లలో కీర్తి సురేష్ నటన ఒకటని ఆయన కొనియాడారు. కీర్తి సురేష్ సావిత్రిని ఇమిటేట్ చేయలేదని, స్వయంగా సావిత్రినే మన కళ్ల ముందుకు తీసుకొచ్చిందని ప్రశంసలు కురిపించారు.
ఇక ఈ చిత్రంలో జెమినీ గణేశన్గా నటించిన దుల్క సల్మాన్ ఆ పాత్రలో జీవించారని.. ఇక నుంచి తాను అతడికి ఫ్యాన్ని అయిపోయానని జక్కన్న ట్వీట్ చేశారు. మరోవైపు టాలీవుడ్కి చెందిన మంచు మనోజ్, బ్రహ్మాజీ, లావణ్య త్రిపాఠి, మంచు లక్ష్మి తదితరులు ‘మహానటి మహా అనుభూతి’ని ఇచ్చిందంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.
. @KeerthyOfficial’s potrayal of Savitri garu is one of the finest performances I've ever seen. It is not just imit… https://t.co/MhiC5PR8FS
— rajamouli ss (@ssrajamouli) 1525850970000 | 0business
|
Wellington, First Published 7, Feb 2019, 2:13 PM IST
Highlights
ఈ ఏడాది జరిగనున్న ఐపిఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రభావం ప్రపంచ కప్లో పాల్గొనే భారత ఆటగాళ్లపై పడకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోనున్నట్లు టీంఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి వెల్లడించారు. బిసిసిఐ ప్రతిష్టాత్మాకంగా నిర్వహించే ఐపిఎల్ తో పాటు వరల్డ్ కప్ రెండు భారత జట్టుకు ముఖ్యమేనని ఆయన అన్నారు. అయితే ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు కొద్దిరోజుల ముందే జరిగే ఐపిఎల్లో పాల్గొని గాయాలపాలవడం, ఫిట్ నెస్ దెబ్బతినడం వంటివి జరక్కుండా వుండేందుకు ఫ్రాంఛైజీలతో చర్చలు జరుపుతున్నట్లు రవిశాస్త్రి తెలిపారు.
ఈ ఏడాది జరిగనున్న ఐపిఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రభావం ప్రపంచ కప్లో పాల్గొనే భారత ఆటగాళ్లపై పడకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోనున్నట్లు టీంఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి వెల్లడించారు. బిసిసిఐ ప్రతిష్టాత్మాకంగా నిర్వహించే ఐపిఎల్ తో పాటు వరల్డ్ కప్ రెండు భారత జట్టుకు ముఖ్యమేనని ఆయన అన్నారు. అయితే ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు కొద్దిరోజుల ముందే జరిగే ఐపిఎల్లో పాల్గొని గాయాలపాలవడం, ఫిట్ నెస్ దెబ్బతినడం వంటివి జరక్కుండా వుండేందుకు ఫ్రాంఛైజీలతో చర్చలు జరుపుతున్నట్లు రవిశాస్త్రి తెలిపారు.
మార్చి చివర్లో ప్రారంభంకానున్న ఐపిఎల్ 2019 టోర్నీ ప్రపంచ కప్ కు 10 రోజుల ముందు వరకు జరగనుంది. ఇందులో భారత ఆటగాళ్లందరు పాల్గొంటారు. దాదాపు రెండు నెలల పాటు జరిగే ఈ టోర్నీలో పాల్గొనడం వల్ల ఆటగాళ్లు బాగా అలసిపోవడం, గాయాలపాలవడం జరుగుతుంది. దీంతో ప్రపంచ కప్ జట్టుపై ఆ ప్రభావం పడుతుందని రవిశాస్త్రి తెలిపారు.
అందువల్ల ఐపిఎల్ మూలంగా ఆటగాళ్లపై పడే పనిభారాన్ని తగ్గించడానికి ఐపిఎల్ జట్ల యాజమాన్యాలతో, కెప్టెన్లతో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆటగాళ్ల ఫిట్ నెస్, ఫామ్ పై ప్రభావం పడకుండా చూడాల్సిందిగా కోరతామని అన్నారు.ముఖ్యంగా ప్రపంచ కప్ ఆడే అవకాశమున్న భారత ఆటగాళ్లు ఎలాంటి గాయాలకు, ఒత్తిడికి గురికాకుండా చూడాలని సూచిస్తామని రవిశాస్త్రి తెలిపారు.
వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు మంచి విశ్రాంతి అవసరమని...అప్పుడే వారి నుండి మంచి ప్రదర్శనను ఆశించవచ్చని రవిశాస్త్రి పేర్కొన్నారు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు మంచి ఫామ్ లో వున్నారు. న్యూజిలాండ్ పర్యటన ముగియగానే టీంఇండియా ఆటగాళ్లు స్వదేశంలో ఆస్ట్రేలియా సీరిస్ ఆ తర్వాత ఐపిఎల్ ఆడనున్నారు. ఆ తర్వాత కేవలం 10 రోజుల్లోనే ప్రపంచచ కప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రవిశాస్త్రి స్పష్టం చేశారు. | 2sports
|
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
First Published 26, Aug 2017, 4:19 PM IST
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
Recent Stories | 0business
|
May 26,2018
ఏడు లక్షల కోట్లకు టీసీఎస్ ఎంక్యాప్!
ముంబయి: దేశీయంగా అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన ఖాతాలో మరో రికార్డును నమోదు చేసుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో రూ.7 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ను అధిగమించింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో టీసీఎస్ షేరు రూ.3674 ఆల్ టైం గరిష్టాన్ని చేరడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 7.01 లక్షల కోట్లను చేరువైంది. మార్కెట్ క్యాప్ విషయంలో ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా టీసీఎస్ రికార్డును నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 16 నుంచి టీసీఎస్ షేర్లు 16 శాతం దూసుకెళ్లాయి. మరోవైపు రిలయన్స్ ఇండిస్టీస్ దాదాపు 5.81 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్తో రెండవ స్థానంలో నిలిచింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ పెరగడానికి ఇటీవల ఆ సంస్థ మార్చి త్రైమాసికానికి సంబంధించి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంమే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రతిపాదించడం కూడా సానుకూలం అంశమని వారు చెబుతున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మా మామతో పడుకున్నావా.. జర్నలిస్టుపై పాక్ క్రికెటర్ ఫైర్
భారత జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్కు చిర్రెత్తుకొచ్చింది. తన ఇష్టరీతిన నోరు పారేసుకున్నాడు.
Samayam Telugu | Updated:
Sep 15, 2018, 07:57PM IST
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆసియా కప్ సమరం మొదలైంది. అయితే టోర్నీ నేపథ్యంలో పాకిస్థాన్ ఓపెనర్, ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఇమామ్ ఉల్ హక్ ఇచ్చిన సమాధానంతో భారత జర్నలిస్టుకు మతిపోయింది. ప్రస్తుతం ఇంజమామ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్గా ఉన్నాడు. గతేడాది అక్టోబర్లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన ఇమామ్ తొలి మ్యాచ్లోనే శతకం బాది మేనమామకు తగ్గ అల్లుడిగా నిరూపించుకున్నాడు. అయితే ఆటతో పాటు మాటల్లోనూ దూకుడు ఎక్కువే కావడంతో విమర్శల పాలవుతున్నాడు పాక్ ఓపెనర్.
ఆసియా కప్ నేపథ్యంలో ఇమామ్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ‘మీ మామ, పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఎక్కువ సమయం నిద్రించేవాడు. నువ్వు కూడా అతడిలా నిద్రపోతావా. ఎక్కువగా నిద్రించడం ఇష్టమా’ అని భారత జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఈ క్రికెటర్కు చిర్రెత్తుకొచ్చింది. జర్నలిస్ట్ ప్రశ్నపై స్పందిస్తూ.. ‘మా మాయ చాలాసేపు నిద్రపోతాడని నీకు ఎలా తెలుసు. నీవేమైనా మా మామతో పడుతుకున్నావా ఏంటి’ అని ఎదురుదాడికి దిగాడు. దీంతో నోరెళ్లబెట్టడం అక్కడున్న స్పోర్ట్స్ జర్నలిస్టుల వంతు అయింది. సరదా ప్రశ్నలకు ఇలా సీరియస్ కావడం మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు. | 2sports
|
Suresh 87 Views
భారత యువ షూటర్కు స్వర్ణ పతకం
గాబలా: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో భారత యువ షూటర్ శుభాంకర్్ ప్రమాణిక్ స్వర్ణ పతకం కైవ సం చేసుకొని చరిత్ర సృష్టించాడు.కాగా 50మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో శుభాంకర్ 205.5పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.చెక్ రిప బ్లిక్ క్రీడాకారుడు పిలిప్నెపిజ్చల్ 205.2తో ద్వితీయ,రొమేని యా షూటర్ డ్రాగోమిర్ 185.1తో తృతీయ స్థానాల్లో నిలిచారు. అర్హత రౌండ్లో ఆరవ స్థానంలో నిలిచిన శుభాంకర్ తుదిపోరులో సత్తా కనబరిచి స్వర్ణ పతకం గెలిచాడు.ఐఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం అర్హత రౌండ్లో తొలిఎనిమిది మంది షూటర్లు మాత్రమే ఫైనల్స్కు అర్హులు.కాగా భారత్నుంచి పోటీపడ్డ మయూర్ దేవ భాను,సర్వేశ్ స్వరూప్,ఫతేసింగ్,అజ§్ు నితీశ్, పర్వేజ్లు ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు. | 2sports
|
internet vaartha 165 Views
భారత్లో ఇంగ్లండ్ షెడ్యూల్ ఖరారు
బెంగళూరు : భారత్లో జరుగనున్న ఇండియా – ఇంగ్లండ్ సిరీస్కు సంబంధించిన తేదీలు, వేదికలను బిసిసిఐ శుక్రవారం ప్రకటించింది. ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనలో భాగంగా 5 టెస్టులు,3 వన్డేలు,3 టి20 మ్యాచ్లు ఆడనుంది. నవంబర్ 9 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్కి రాజ్కోట్ ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే సిరీస్ జనవరి 15న ప్రారంభం కానుంది. పుణేలో తొలి వన్డే మ్యాచ్ నిర్వహించనున్నారు.
జనవరి 26 నుంచి టి20 సిరీస్ కాన్పూర్లో ప్రారంభం కానుంది.డిసెంబర్ 20న టెస్ట్ సిరీస్ ముగుస్తుం డటంతో ఇంగ్లండ్ జట్టుక్రిస్టమస్,న్యూ ఇయర్ వేడుకల కోసం ఇంగ్లండ్ తిరిగి వెళ్లనుంది.
తిరిగి మళ్లీ వన్డే,టి20 సిరీస్ కోసం భారత్కు రానుంది.ఈ విషయాన్ని బిసిసిఐ మీడియా అడ్వైజరీ అజయ్ షిర్కే వెల్లడించారు.
ఇంగ్లండ్ జట్టు భారత్ పర్యటన రాక ముందు సెప్టెంబరు,అక్టోబరు మాసాల్లో టీమిండియా, న్యూజిలాండ్తో మూడు టెస్టులు,అయిదు వన్డేలు ఆడనుంది.2016-17 సంవత్సరానికి టీమిండియా స్వదేశంలో 13 టెస్ట్ మ్యాచ్లు ఆడే విధంగా బిసిసిఐ ప్లాన్ చేసింది.
టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ : మ్యాచ్ల సమయం 9.30 ఎఎం
మొదటి టెస్టు నవంబర్ 9-13 (బుధవారం నుంచి ఆదివారం) రాజ్కోట్
రెండవ టెస్టు నవంబర్ 17-21(గురువారం నుంచి సోమవారం) విశాఖ
మూడవ టెస్టు నవంబర్ 26 -30(శనివారం నుంచి బుధవారం) మెహాలి
నాలుగవ టెస్టు డిసెంబర్ 8-12 (గురువారం నుంచి సోమవారం) ముంబై
అయిదవ టెస్టు డిసెంబర్ 16-20(శుక్రవారం నుంచి మంగళవారం) చెన్నై
అన్ని వన్డేలు ( డే అండ్ నైట్)
మొదటి వన్డే జనవరి 15 2017 (ఆదివారం) పుణే
రెండవ వన్డే జనవరి 19 2017 (గురువారం) కటక్
మూడవ వన్డే జనవరి 22 2017 (ఆదివారం) కోల్కతా
టి20 మ్యాచ్లు
మొదటి టి20 జనవరి 26 (గురువారం) కాన్పూర్
రెండవ టి20 జనవరి 29 (ఆదివారం) నాగ్పూర్
మూడవ టి20 ఫిబ్రవరి 1 (బుధవారం) బెంగళూరు | 2sports
|
Hyderabad, First Published 21, Mar 2019, 3:46 PM IST
Highlights
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం 'బ్రోచేవారెవరురా' సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం 'బ్రోచేవారెవరురా' సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీవిష్ణుతో పాటు లెటెస్ట్ సెన్సేషన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను కనపడతున్నారు. ఈ త్రయం రంగురంగుల దుస్తులు, షేడ్స్తో స్కూటర్ రైడ్ చేసేలా ఈ పోస్టర్ ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్నరెండో చిత్రం 'బ్రోచేవారెవరురా'.
'చలనమే చిత్రము.. చిత్రమే చలనము..' అనేది ట్యాగ్ లైన్. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటిస్తుండగా సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు.
చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
R3 BATCH headed towards you. By far the most hilarious batch, all set to entertain you. Brace Yourselves! Have a colorful and safe Holi #brochevarevarura #ManyamProducions pic.twitter.com/oF3WEOS4hk
— Sree Vishnu (@sreevishnuoffl) March 21, 2019
Last Updated 21, Mar 2019, 3:46 PM IST | 0business
|
Pune Team
హైదరాబాద్పై పూణె విజయం
హైదరాబాద్: ఐపిఎల్లోభాగంగా సన్రైజర్స్ హైదరాబాద్పై 12 పరుగుల తేడాతో పుణేజట్టు విజయం సాధించింది.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పుణె నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్లుకోల్పోయి 148 పరుగులు చేసింది.. 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన సనర్రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.. యువరాజ్ 47, వార్నర్ 40, ధావన్ 19 పరుగులు చేయగా, మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ సింగిల్ డిజట్కే పరిమితమయ్యారు.. కాగా చివరి ఓవర్లో ఉనడ్జట్ హ్యాట్రిక్ వికెట్లుసాధించాడు.. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మనదైన ఫేస్ బుక్ కావాలి: ఆనంద్ మహీంద్రా
టెక్నాలజీ మీద అంతులేని పట్టు కలిగి, దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నోళ్లకు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు.
TNN | Updated:
Mar 28, 2018, 05:13PM IST
టెక్నాలజీ మీద అంతులేని పట్టు కలిగి, దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నోళ్లకు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు. స్వదేశీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాన్ని తయారు చేయగలిగే సంస్థకు ప్రారంభ దశలో కావాల్సిన పెట్టుబడి సమకూర్చేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. అమెరికా సోషల్ నెట్వర్క్ సైటు ఫేస్బుక్ నుంచి యూజర్ల వ్యక్తిగత వివరాలను కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ సేకరించి .. పలు దేశాల ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహీంద్రా వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది.
దేశీయ సామాజిక మాధ్యమం తయారీకి ఆనంద్ మహీంద్రా పిలుపు
"నియంత్రణకు సిద్ధంగా ఉండి, ప్రొఫెషనల్గా నడిచే సోషల్ నెట్వర్క్ కంపెనీ ఒకదాన్ని మనకంటూ ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం వచ్చిందేమో అనిపిస్తోంది. ఇది సుసాధ్యం చేయగల భారతీయ స్టార్టప్ ఏదైనా ఉందా? ఒకవేళ ఏదైనా యువ టీమ్కి అలాంటి ఆలోచనేదైనా ఉంటే.. అందుకు కావల్సిన సీడ్ క్యాపిటల్ అందించగలను" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇది 1,300 సార్లు రీ-ట్వీట్ కాగా.. 3,300 పైగా లైక్లు వచ్చాయి. పలువురు తమ ఐడియాలను కూడా ఆనంద్ మహీంద్రాతో పంచుకున్నారు. | 1entertainment
|
హైదరాబాద్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు హిరోయిన్ల అరెస్ట్
Highlights
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ హిరోయిన్లు
హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ డెక్కన్ లో పట్టుబడ్డ తారలు
ఇద్దరు హిరోయిన్లతోపాటు మరో నిందితుడి అరెస్ట్
సినీతతారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సర్వ సాధారణంగా మారింది. తాజాగా మరో సారి సినీ తారల సెక్స్ వ్యవహారం గుట్టు రట్టయింది. హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న సినీ నటిని తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం ఆధారంగా వలపన్నిన పోలీసులు ముందుస్తుగా అందిన సమాచారంతో నిర్వహించిన దాడుల్లో సినీ నటి రెడ్ హ్యాండెడ్గా దొరికిందని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటలైన బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 1లోని తాజ్ డెక్కన్లో ఈ వ్యభిచారం వ్యవహారం గుట్టు రట్టయింది. ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందిందని, ధనవంతుల బిడ్డలను ఆకర్షిస్తూ రాత్రికి రూ.లక్ష, ఆ పైన డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసిందని పోలీసులు చెప్పారు.
“శనివారం రాత్రి నిఘా పెట్టి హోటల్లో వ్యభిచారం జరుగుతున్న గదిపై దాడి చేశాం. సినీ నటిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నాం. ఆమెకు సహకరిస్తున్న మోనీష్ కడాకియాతో పాటు హోటల్ మేనేజర్ను అరెస్టు చేశాం” అని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ముంబై నుంచి సినీనటి హైదరాబాద్కు వచ్చినట్టు తెలిసింది. ప్రముఖ హోటల్లో బస చేసి వ్యభిచారం నడుపుతున్నట్టు పక్కా సమాచారం అందింది. ఆ మేరకు దాడి చేశాం అని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు మనీష్ను విచారిస్తున్నాం. ఈ సెక్స్ రాకెట్ వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్నాం.
ఇదిలా ఉండగా, మరో హోటల్పై జరిపిన దాడిలో మరో సినీనటి కూడా అరెస్ట్ అయింది. ఆమెను బెంగాలీ సినీ నటిగా గుర్తించారు.
Last Updated 25, Mar 2018, 11:40 PM IST | 0business
|
Hyderabad, First Published 2, Mar 2019, 10:22 AM IST
Highlights
సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్. డాన్సర్ గా సినిమాలు చేస్తూనే.. కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్. డాన్సర్ గా సినిమాలు చేస్తూనే.. కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబ నుండి వచ్చిన శేఖర్ మాస్టర్ ఈరోజు స్టార్ హీరోలు చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోల పాటలకు డాన్స్ కంపోజర్ గా మారడం వెనుక చాలా కష్టమే ఉందట.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ కి ఎదురైన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. డాన్సర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చిన శేఖర్ మాస్టర్ అవకాశాలు లేనప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పని చేసినట్లు చెప్పారు. అలా ఒకరోజు షూటింగ్ కి వెళ్తే రూ.75 వచ్చాయట.
వాటిని చూసి ఎంతో ఆనందపడినట్లు.. అదే తన తొలి సంపాదన అని వెల్లడించాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక మాస్టర్ ని ఎంతగానో అభిమానించేవాడినని(ఆయన పేరు చెప్పలేదు) చెప్పిన శేఖర్ మాస్టర్ ఆయన మీద ఇష్టంతో చేతిపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నట్లు చెప్పారు. అయితే ఆ మాస్టర్ మాత్రం తనపై అభాండాలు వేసినట్లు, రాత్రిళ్లు ఫోన్ చేసి బూతులు తిట్టేవారని చెప్పాడు.
మళ్లీ ఉదయాన్నే ఫోన్ చేసి రాత్రి తాగి ఉన్నా.. ఏం అనుకోవద్దని అనేవారని చెప్పాడు. ఒకరోజు ఇంటికి పిలిపించుకొని మరీ తిట్టారని, లైఫ్ లో మీ దగ్గరకి రాను మాస్టర్ అని చెప్పి వచ్చేసినట్లు గుర్తు చేసుకున్నాడు శేఖర్ మాస్టర్. | 0business
|
బన్నీకి థాంక్స్ చెప్పిన బండ్ల గణేష్ బాధితుడు
TNN| Nov 26, 2017, 04.31 PM IST
వక్కంతం వంశీ, అల్లు అర్జున్
టెంపర్ సినిమాకు కథ అందించిన తనకి ఇవ్వాల్సిన పారితోషికాన్ని ఎగ్గొట్టాడంటూ బండ్ల గణేష్పై కేసు పెట్టి విజయం సాధించిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇటీవలే దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఎన్టీఆర్ని ఒప్పించడం కోసం ఎంతో కాలంపాటు వేచిచూసిన వక్కంతం వంశీకి చివరకు ఆ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత తన దగ్గరున్న మరో స్టోరీని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి చెప్పి అతడిని ఒప్పించిన వక్కంతం వంశీ... బన్నీ ఇచ్చిన అవకాశంతో మొదటిసారిగా డైరెక్టర్గా మారాడు.
వీళ్లిద్దరి కాంబోలో ప్రస్తుతం సెట్స్పై వున్న నా పేరు సూర్య సినిమా విశేషాల గురించి తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన వక్కంతం వంశీ.. తనకు అవకాశం ఇవ్వడమేకాకుండా.. తనకు ఏ ఇబ్బంది రాకుండా అన్ని విధాల సహకరిస్తున్న బన్నీకి చాలా థాంక్స్ చెప్పుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కొత్త దర్శకుడిగా తాను అసౌకర్యానికి గురికాకుండా వుండేందుకు అల్లు అర్జున్ తనకి ఎంతో స్వేచ్ఛను ఇచ్చి సహకరిస్తున్నాడు అని చెబుతూ ఆనందం వ్యక్తంచేశాడు వక్కంతం వంశీ.
'నా పేరు సూర్య' కానీ సక్సెస్ అయితే, రచయితగా కెరీర్ మొదలుపెట్టి దర్శకుడిగా హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుల జాబితాలో వక్కంతం వంశీ కూడా చేరడం ఖాయం. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాను నాగబాబు ప్రజెంట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బిగ్బాస్లో మగాళ్ల ముద్దులేంట్రా బాబూ!
Bigg Boss Telugu episode 23: తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 22 ఎపిసోడ్లను పూర్తిచేసి 23వ ఎపిసోడ్కి ఎంటర్ అయిపోయింది.
TNN | Updated:
Aug 8, 2017, 09:31AM IST
తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 22 ఎపిసోడ్‌లను పూర్తిచేసి 23వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయిపోయింది. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో రానా స్పెషల్ ఎంట్రీ ఇచ్చి బిగ్‌బాస్‌కి జోగేంద్ర ఫుల్ జోష్ ఇవ్వడంతో నెక్స్ట్ ఎపిసోడ్‌పై ఆసక్తిగా మారింది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో హైలైట్స్ విషయానికి వస్తే.. ఆదర్శ్ భార్య పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ బర్త్‌డే కేక్‌ను పంపించడంతో భావోద్వేగంతో కేక్ కట్ చేశాడు ఆదర్శ్, ఇక హౌస్‌లో ఉన్న మిగిలిన సెలబ్రిటీలు సైతం ఆదర్శ్ భార్యకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు.
ఇక ఎప్పటి లాగే హౌస్‌లో సభ్యుల కోసం మరో సరదా టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌పై పూర్తి అధికారాన్ని హౌస్ కెప్టెన్ ఆదర్శ్‌కి ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా.. హౌస్‌మేట్స్ ఎలా ఉండాలి. ఏ దుస్తులు ధరించాలో కూడా ఆదర్శ నిర్ణయిస్తాడు. అంతే కాకుండా ఇద్దరికి సంకెళ్లు వేయాలని అందులో ఒకరికి కళ్లగంతలు కట్టాలని టాస్క్‌లో ఉండటంతో ఉప్పు నిప్పులా ఉన్న దీక్ష-అర్చనలకు సంకెళ్లు వేశాడు ఆదర్శ్. ఇక సింగర్ కల్పన మ్యాక్సీని ఒకరు ధరించాలనగా... శివబాలాజీని మ్యాక్సీ వేసుకోవల్సిందిగా ఆదేశించాడు ఆదర్శ్. అతడు అన్ కన్ఫర్టబుల్‌గా భావించడంతో ప్రిన్స్‌ని కల్పన మ్యాక్సీ ధరించాడు. ఇక కెప్టెన్ ఆదర్శ్‌తో మాట్లాడాలనుకునే వాళ్లు అతడికి ముద్దు పెట్టాలనే నిబంధన పెట్టడంతో ప్రిన్స్ పదే పదే ఆదర్శ్‌తో మాట్లాడుతూ ముద్దులు మీద ముద్దులు పెట్టేశాడు. మరోవైపు హరితేజకు మాటలను కూడా పాటలుగా పాడాలనే టాస్క్‌లో నిబంధన ఉండటంతో ఆమె మాటల పాటలు ఈ ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచాయి.
మరోవైపు ఈవారంలో ఎలిమినేషన్ అయ్యే సెలబ్రిటీ కోసం నామినేషన్ ప్రక్రియను చేపట్టారు బిగ్ బాస్. దీని ప్రకారం టేబుల్ ఉన్న ఫోమ్‌ని పూసి ఇద్దరు కన్టిస్టెంట్స్ పేర్లు చెప్పాలనే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఆదర్శ్ హౌస్ కెప్టెన్‌గా ఉండటంతో మినహాయింపు ఇచ్చారు బిగ్‌బాస్.
ఈ నామినేషన్ ప్రక్రియలో దీక్ష.. ప్రిన్స్, హరితేజ,, మహేష్ కత్తి.. కల్పన, దీక్ష,, ముమైత్ ఖాన్.. కల్పన, దీక్ష ,, ఆదర్శ్ .. మహేష్ కత్తి, శివ బాలాజీ,, హరితేజ.. కల్పన, శివబాలాజీ,, కల్పన.. ముమైత్, మహేష్ కత్తి,, ధనరాజ్.. మహేష్ కత్తి, దీక్ష,, కత్తి కార్తీక.. మహేష్ కత్తి, అర్చన,, ప్రిన్స్... దీక్ష, కల్పన,, అర్చన.. కల్పన, కత్తి కార్తీక,, బాలాజీ.. శివ తేజ, కల్పనలను ఎలిమినేషన్స్ కోసం సూచించారు. ఈ ఎలిమినేషన్ కార్యక్రమంలో అత్యధికంగా కల్పనకు ఆరు ఓట్లు వేసి ఆమెను హౌస్‌నుండి సాగనంపాలంటూ ఫోమ్ పూయగా.. దీక్ష నెక్స్ట్ ప్లేస్‌లో నిలిచింది.
ఇక అందరి అభిప్రాయాలను తెలుసుకున్న బిగ్ బాస్ నెక్ట్ వీక్‌లో ఎలిమినేషన్స్‌ కోసం కల్పన, మహేష్ కత్తి, దీక్ష, శివ బాలాజీ, హరితేజ పేర్లను అనౌన్స్ చేశారు. దీన్ని బట్టి ఈ ఐదుగురిలో ఒకరు ఈవారంలో ఎలిమేట్ కాబోతున్నారు. ఇక అర్చన తనదైన ఫర్ఫామెన్స్‌తో చెలరేగిపోతున్న టీజర్‌ను వదిలారు. అదిఏంటో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
స్టార్ హీరోయిన్తో అభిమాని అనుచిత ప్రవర్తన!
సినీతారలతో అభిమానులు అనుచితంగా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. పబ్లిక్ ప్లేసుల్లో హీరోయిన్లు అగుపించినప్పుడు
TNN | Updated:
Aug 21, 2017, 08:02AM IST
సినీతారలతో అభిమానులు అనుచితంగా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. పబ్లిక్ ప్లేసుల్లో హీరోయిన్లు అగుపించినప్పుడు ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా అభిమానులు రెచ్చిపోతూ ఉంటారు. సినీతారలను చూసి ఆనందం పొందే వాళ్లు కొందరైతే, వారిని తాకి శునకానందం పొందాలని చూసే వాళ్లు మరికొంతమంది. అలాంటి వారితో హీరోయిన్లు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇలియానాకు కూడా అలాంటి అనుభవమే ఎదురైందట. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది ఈమె.
తను నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘బాద్షాహో’ ప్రచార కార్యక్రమంలో ఇలియానాకు చేదు అనుభవం ఎదురైనట్టుగా తెలుస్తోంది. ఎవరో ఆమెతో అనుచితంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ ట్వీట్ చేసింది.
‘It's a pretty shitty world we live in. I'm a public figure. I understand that I don't have the luxury of a private & an anonymous life. But that doesn't give any man the right to misbehave with me. Don't confuse "fan antics" with that. I am a WOMAN at the end of the day.’ అంటూ రెండు ట్వీట్ల ద్వారా తన ఆవేదనను పంచుకుంది ఇలియానా .
‘మనం అత్యంత దారుణమైన ప్రపంచం మధ్యన ఉన్నాం. నేను పబ్లిక్ ఫిగర్ నే. నాకు వ్యక్తిగత, ప్రైవేట్ జీవితం ఉండదని తెలుసు. అలాగని నాతో అనుచితంగా ప్రవర్తించడానికి నేనెవరికి హక్కు ఇవ్వలేదు. ఫ్యాన్స్ కు కూడా హద్దులుంటాయి. నేను మహిళను అనే విషయాన్ని గుర్తుంచుకోండి..’ అనే సారాంశంతో ఇలియానా ట్వీట్ చేసింది. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వీడియో: ధోనీ vs పాండ్య రన్నింగ్ రేసులో గెలుపెవరిది?
మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య మధ్య 100 మీటర్ల పరుగు పందెం పెడితే ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు. వీడియో చూస్తే షాకవాల్సిందే..
TNN | Updated:
Dec 13, 2017, 12:08PM IST
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మధ్య పరుగు పందెం పెడితే ఎవరు నెగ్గుతారు? 36 ఏళ్ల ధోనీ, 24 ఏళ్ల పాండ్య మధ్య వంద మీటర్ల రన్నింగ్ రేసు పెడితే.. హార్దిక్నే విజయం వరిస్తుందని భావిస్తాం కదూ. కానీ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికీ ఎంత ఫిట్గా ఉన్నాడో చాటిచెప్పేలా.. బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసింది. దిగ్గజ క్రికెటర్, యంగ్ ప్లేయర్ మధ్య రన్నింగ్ రేసును మన కళ్ల ముందు ఉంచింది.
రెండో వన్డే ప్రారంభానికి ముందు వార్మప్ సెషన్లో పాల్గొన్న ధోనీ, పాండ్య మైదానంలో వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. సరదాగా రన్నింగ్ మొదలుపెట్టిన వీరు.. తర్వాత సీరియస్గా తీసుకున్నారు. వీరిద్దరూ చిరుతల్లా పరిగెత్తి.. ఉసేన్ బోల్ట్ను మైమరిపించారు. ఇద్దరూ సమానంగా పరిగెత్తినప్పటికీ.. చివర్లో పాండ్య అలసిపోయినట్లు కనిపించాడు. కానీ ధోనీ మాత్రం ఆఖరి వరకూ ఒకే వేగంతో రన్నింగ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన పాండ్యను ఓడించిన ధోనీ.. ఈ వయసులోనూ సత్తా తగ్గలేదని మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు.
A quick 100 metre dash between @msdhoni and @hardikpandya7 . Any guesses on who won it in the end? #TeamIndia #INDvSL pic.twitter.com/HpboL6VFa6
— BCCI (@BCCI) December 13, 2017
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Visit Site
Recommended byColombia
చమ్మకు చంద్ర స్కిట్లో.. సత్తిపండు జమిందారు. అతడు పెళ్లి చేసుకుని భార్యను తీసుకుని వస్తాడు. అతడు రావడమే ఊరివాళ్లంతా.. ‘అయ్యా జమిందారయ్యా’ అంటూ చేతులకు ముద్దులు పెడుతూ, మొక్కుతూ ఉంటారు. సత్తిపండు కూడా అంతే గంభీరంగా కనిపిస్తాడు. అదంతా చూసిన భార్య.. ‘ఇంత పెద్ద జమిందారి ఇంటికి కోడలు కావడం నిజంగా నా అదృష్టమండీ..’ అంటుంది. ‘ఇంకా ఏం చూశావే.. మా జనాల అభిమానాలు ఆచారాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతావు’ అంటాడు సత్తిపండు(జమిందారు). ‘అవునండీ.. మన ఆస్తి ఎంత ఉంటుంది?’ అని అడుగుతుంది భార్య.
‘నాకూ సరిగా తెలియదే.. మన పని వాడికి తెలుస్తుంది. పిలుస్తాను ఆగు’ అంటూ ‘రేయ్ రామూ.. రేయ్ రామూ’ అంటూ పిలుస్తాడు. అప్పుడు వస్తాడు చంద్ర పనివాడు రాము గెటప్లో. ‘అవును రామూ.. మన ఆస్తి ఎంతుంటాదిరా?’ అడుగుతాడు గర్వంగా రాము. ‘మన ఆస్తి 2వేల కోట్ల 53 లక్షల 40 వేల 350 రూపాయల 41 పైసా ఉంటుందయ్యా’ అంటాడు పనివాడు రాము(చంద్ర). అది విన్న జమిందారు భార్య.. ‘అంత ఆస్తికి మీరే యజమానులా?’ అంటుంది ఆశ్చర్యంగా. ‘నేనే యజమాన్ని ఏంటే ఇవాళ్టి నుంచి నువ్వు కూడా యజమానురాలివే.. తాళాల గుత్తే నీది’ అంటూ.. ‘రేయ్ రామూ ఆ తాళాల గుత్తి ఇటు ఇవ్వు’ అని అడుగుతాడు సత్తిపండు(జమిందారు). ‘కుదరదయ్యా’ అంటాడు రాము. అక్కడ నుంచి మొదలవుతుంది అసలు కథ.
గోడ మీద ఫొటో(గెటప్ శ్రీనుది) చూపిస్తూ..‘మీ నాన్న కేశవరావు.. ఆడవాళ్ల చేతిలో పెత్తనం పెట్టొద్దని, ఆడపెత్తనం బోడి పెత్తనం అని వీలునామాలో రాశాడయ్యా’ అనే సాకుతో తాళాల గుత్తి ఇవ్వడు రాము. తర్వాత హనీమూన్కి వెళ్లడానికి రెండు మూడు లక్షలు అడిగిన జమిందారుకి.. ‘అయ్యా లైట్ ఆఫ్ చేసి ఆన్ చేయడానికి రెండు మూడు లక్షలు ఎందుకయ్యా.. మన పక్కనే ఉన్న గొడ్లపాకలోకి వెళ్లి రెండు మూడు రోజులు గడిపి రండయ్యా’ అంటూ రెండొందలు చేతిలో పడతాడు. ‘అదేం న్యాయం’ అంటూ గొడవపడిన జమిందారుతో.. ‘పెళ్లి చేసుకుని వచ్చిన వారసుడికి రోజుకి 200 మాత్రమే ఇవ్వాలని మీ నాన్నగారు వీలునామాలో రాశారయ్యా’ అంటాడు రాము.
Chammak Chandra
ఇక పనివాడు రామూ.. తన భార్య పిల్లలు విషయానికి వస్తే.. లగ్జరీ లైఫ్ ఇస్తూ.. భార్యతో తన పిల్లల్ని సినిమాకు ఫ్లైట్లో తీసుకుని వెళ్లమంటాడు. అదంతా విన్న జమిందారు భార్య.. ‘చూశావా? ఆ పనివాడికి రెండో భార్యనైనా బాగుండు’ అంటూ జమిందారు గాలితీసేస్తుంది. కనీసం సినిమాకు వెళ్లడానికి కూడా జమిందారికి 500 ఇవ్వకుండా చుక్కలు చూపిస్తాడు రాము. దాంతో ‘కనీసం దూరంగా వెళ్లిపోయి.. ఏ కొట్టో పెట్టుకుని బతుకుదాం’ అంటుంది జమిందారు భార్య. దాంతో ఇద్దరూ లగేజ్ తీసుకుని.. బయలుదేరతారు. ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న జమిందారుని.. ‘అయ్యా.. వెళ్లొద్దయ్యా.. మీరు మాట వినకపోతే.. నాలుగు పీకైనా సరే అడ్డు చెప్పాలని మీ నాన్నగారు వీలునామాలో రాశారయ్యా’ అంటూ రెండు పీకుతాడు కూడా.
అదంతా చూసిన జమిందారు భార్య.. ‘అయ్యా నేను వెళ్లొచ్చా?’ అని పనివాడ్ని పర్మీషన్ అడగడం, పనివాడు వెళ్లమని పర్మీషన్ ఇవ్వడం, భార్య వెళ్లిపోతుంటే.. జమిందారు ఏడుస్తూ.. ‘ఆగవే.. నువ్వు వెళ్లిపోతే.. కనీసం ఆ రెండు వందలు కూడా ఇవ్వడే’ అని తన బాధని చెప్పుకోవడం భలే ఫన్నీగా అనిపిస్తుంది. స్కిట్ అయిన తర్వాత జడ్జెస్ నాగబాబు గారు.. బాగా నవ్వుతూ ‘చాలా హిలేరియస్గా ఉంది’ అంటూ పొగడ్తలు గుప్పించగా.. ‘డబ్బు ఉండి అనుభవించలేనోడు దరిద్రుడు’ అంటూనే రోజా నవ్వించారు.
ఈ షో కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
బిగ్ బాస్2: కౌశల్ కు చెక్ పెట్టనున్నారా..?
Highlights
సామ్రాట్, తనీష్ లు కూడా ఆరంభంలో కౌశల్ ను టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు అతడిని కాపాడడానికి కౌశల్ ఆర్మ్ సిద్ధమైంది. అతడిని నామినేషన్ లో ఉన్నప్పుడు సేవ్ చేయడంతో పాటు అతడికి హౌస్ లో వ్యతిరేకంగా ఎవరు కామెంట్స్ చేసినా.. ఎలిమినేట్ అయ్యే విధంగా చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఎక్కువ ఓట్లు సాధించి హౌస్ లో విజేతగా నిలుస్తారు. లేదంటే ఎలిమినేషన్ లో బయటకు వచ్చేస్తారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అయితే హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు సైలెంట్ గా కనిపించిన కౌశల్ ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిలో హీరో అయిపోయాడు. ముఖ్యంగా భానుశ్రీ, తేజస్విలు కౌశల్ పై ప్రవర్తించి తీరుతో ఆయనకు ప్రేక్షకుల్లో ఆదరణ బాగా పెరిగింది. సామ్రాట్, తనీష్ లు కూడా ఆరంభంలో కౌశల్ ను టార్గెట్ చేశారు.
అయితే ఇప్పుడు అతడిని కాపాడడానికి కౌశల్ ఆర్మ్ సిద్ధమైంది. అతడిని నామినేషన్ లో ఉన్నప్పుడు సేవ్ చేయడంతో పాటు అతడికి హౌస్ లో వ్యతిరేకంగా ఎవరు కామెంట్స్ చేసినా.. ఎలిమినేట్ అయ్యే విధంగా చేస్తున్నారు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన తేజస్వి వెళ్లిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. దానికి కారణం కూడా కౌశల్ ఆర్మీ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తేజస్విని హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎలాగో జరుగుతున్నాయి కానీ అలానే కౌశల్ ను ఎలిమినేట్ అయ్యే విధంగా కూడా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
అతడిని బయటకి పంపించి కౌశల్ సేనను కంట్రోల్ చేయకపోతే హౌస్ మొత్తం అతడి కంట్రోల్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే కౌశల్ ను కార్నర్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. హౌస్ లో అందరూ కూడా కౌశల్ కు వ్యతిరేకంగా ఉన్నారు. బాబు గోగినేని అయితే అతడు ఈ హౌస్ కు చాలా డేంజర్, వీలైనంత తొందరగా వెళ్ళిపోతే బావుంటుందని అన్నారు. ఓటింగ్స్ బట్టి చూస్తే కౌశల్ కు మంచి నెంబర్ కనిపిస్తుంది. తనంతట తాను స్వయంగా బయటకు వెళ్తే తప్ప కౌశల్ ను బయటకు పంపాలంటే అంత సులువైన విషయం కాదు. సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకోవడానికి కౌశల్ అంత వీక్ కంటెస్టెంట్ కూడా కాదు.. మరి ఏం జరుగుతుందో చూడాలి! | 0business
|
India Won the Mohali Test
మొహాలీ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ
మొహాలీ టెస్టులో సౌతాఫిక్రాపై భారత్ 108 పరుగుల తేడాతో విజయం సాధించింది.
TNN | Updated:
Nov 7, 2015, 04:58PM IST
మొహాలీ టెస్టులో సౌతాఫిక్రాపై భారత్ 108 పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 109 పరుగులకే చేతులెత్తేశారు. భారత్ స్పిన్ దెబ్బలకు సఫారీలు విలవిలలాడారు. జడేజా ఐదు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతాన్ని శాసించగా.. .అశ్విన్ మూడు వికెట్లుపడగొట్టి జడేజాకు చక్కటి సహకారం అందించాడు . మరో స్పిన్నర్ మిశ్రా, ఆరోన్ లకు చెరో వికెట్ దక్కింది. సౌతాఫ్రికా జట్టులో స్వాన్ (36) మినహా సపారీ బ్లాట్స్ మెన్లలందరరూ చతికీలపడ్డారు.
తొలి ఇన్నింగ్ లో 201 పరుగులకే ఆలౌటైన భారత్ ...కసితో ఆడి సఫారీలకు 184 పరుగుల వద్దే కట్టడి చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్ ప్రారంభించిన టీమిండియా .. తొలుతా పర్వలేదని పించినా..మూడో రోజైన శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో 200 పరుగుల వద్దే భారత్ రెండో ఇన్నింగ్ తెరపడింది. తొలి ఇన్నింగ్ ఆధిక్యాన్ని కలిపి మొత్తం 218 పరుగుల లక్ష్యాన్ని సఫారీల ముందు ఉంచింది. లక్ష్య చేధనలో సఫారీలు 39.5 ఓవర్ల ఆడి కేవలం 109 పరుగులే చేతులెత్తేశారు. దీంతో భారత్ విజయం లాంచనమైంది. | 2sports
|
I don't influence team selections - Steven Smith
జట్టు ఎంపికని నేను ప్రభావితం చేయలేదు
ఇంగ్లాండ్తో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్స్మిత్ వివాదాల్లో చిక్కుకున్నాడు. జట్టు ఎంపికని స్టీవ్స్మిత్ ప్రభావితం
TNN | Updated:
Nov 3, 2017, 01:35PM IST
ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ వివాదాల్లో చిక్కుకున్నాడు. జట్టు ఎంపికని స్టీవ్‌స్మిత్ ప్రభావితం చేస్తున్నాడని.. సెలక్టర్లపై తన అభిప్రాయాలను రుద్దుతూ ఒకప్పటి సహచరుల్ని ఆసీస్ జట్టులోకి ఎంపిక చేయాల్సిందిగా కోరుతున్నాడంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. నవంబరు 23 నుంచి ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇటీవల భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు ఎంపిక కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. కీపర్ మాథ్యూవెడ్‌ వరుసగా విఫలమైనా.. అతనికి అవకాశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
‘జట్టు ఎంపికని నేను ప్రభావితం చేస్తున్నానే మాటలు పూర్తిగా అబద్దం. ఆ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఒకప్పటి నా సహచరుల్ని జట్టులోకి తీసుకోమని నేను ఎప్పుడూ సెలక్టర్లని కోరలేదు. ప్రజలు ఎవరికి నచ్చింది వారు మాట్లాడుతున్నారు. ఆ విమర్శల్ని నేను పట్టించుకోను. జట్టుని ఎంపిక చేసేందుకు నేను సెలక్టర్‌ని కాదు. కాకపోతే.. జట్టు ఎంపిక సమయంలో మాత్రం నా అభిప్రాయం అడుగుతారు. నా ఆలోచనల్ని మాత్రమే వారికి చెప్తాను’ అని స్టీవ్‌స్మిత్ వెల్లడించాడు. | 2sports
|
New Deal
ఇటలీ ఎఎస్ఇ ఎస్పిఎతో సైయింట్ ఒప్పందం
హైదరాబాద్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ సేవల సంస్థ సైయింట్ ఏరో ఇండియా సదస్సు లో ఎఎస్ఇ ఎస్పిఎ కంపెనీతో మార్కెటింగ్ పరంగాఒప్పందంచేసుకుంది. ప్రైవేటురంగంలోని ఇటాలియన్ కంపెనీ విద్యుత్ ఉత్పత్తి పంపిణీ పరికరాలను అంతర్జాతీయంగా విక్రయిస్తున్న ఇటాలియన్ కంపెనీతో ఏరోస్పేస్, రక్షణరంగ పరంగా ఒప్పందం చేసుకోవడం పట్ల సైయింట్ టెక్నాలజీ సంస్థ అధిపతి కృష్ణబోదనపు హర్షం ప్రకటించారు. ఎండిసిఇఒ కృష్ణ, ఎఎస్ఇ ప్రెసిడెంట్ కార్మెలో కోసెన్టినోలు ఒప్పందంపై సంతకాలు చేసారు. ఏరోస్పేస్, రక్షణరంగాలకు సంబంధించి ఇకపై మార్కెటింగ్ రంగంలో ఈ రెండు కంపెనీలు సహకరించుకుంటాయి | 1entertainment
|
ఉపాసన కోసం చరణ్ ఏం కొన్నాడో చూడండి!
Highlights
రామ్ చరణ్-ఉపాసన టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అనే చెప్పాలి. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా
రామ్ చరణ్-ఉపాసన టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అనే చెప్పాలి. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు కాబట్టి అతడికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఉపాసన అభిమానులతో పంచుకుంటుంటుంది. తాజాగా ఉపాసన.. చరణ్ తనకోసం ప్రత్యేకంగా కొని తీసుకొచ్చిన గిఫ్ట్ ను అభిమానులకు చూపిస్తూ తెగ మురిసిపోతుంది.
సోమవారం సాయంత్రం చరణ్ పూల మార్కెట్ కు వెళ్లి రంగురంగుల పూలతో బొకే చేయించి దాన్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఆ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది ఉపాసన.
'సో స్వీట్.. మిస్టర్ సి నాకోసం పువ్వులు కొనడానికి షాపింగ్ కు వెళ్ళారు.. మనసున్న మనిషి' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం చరణ్.. దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కు జంటగా కైరా అద్వానీ కనిపించనుంది.
— Upasana Kamineni (@upasanakonidela) June 4, 2018
Last Updated 5, Jun 2018, 5:46 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అర్జున అవార్డుకి ధావన్, మంధాన పేర్లు సిఫార్సు
ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు కోసం భారత పురుషుల జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్, మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన పేర్లని సిఫార్సు చేసినట్లు భారత
Samayam Telugu | Updated:
Apr 25, 2018, 07:01PM IST
అర్జున అవార్డుకి ధావన్, మంధాన పేర్లు సిఫార్సు
ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు కోసం భారత పురుషుల జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ , మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన పేర్లని సిఫార్సు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. గత ఏడాది కాలంగా టీమిండియా ఆడుతున్న అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఓపెనర్గా ఉంటున్న ధావన్.. ప్రస్తుతం ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున మ్యాచ్లు ఆడుతున్నాడు.
ఇంగ్లాండ్ వేదికగా గత ఏడాది జరిగిన మహిళల ప్రపంచకప్ టోర్నీలో భారత్ జట్టు ఫైనల్కి చేరడంలో ఓపెనర్ స్మృతి మంధాన క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో మెరుగ్గా రాణించిన స్మృతి మంధాన.. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన మూడు వన్డేల సిరీస్లోనూ పరుగు వరద పారించి భారత్ జట్టు సిరీస్ గెలవడంలో కీలకంగా వ్యవహరించింది.
ఏడాది కాలంగా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ ఇద్దరి క్రికెటర్ల పేర్లని అర్జున అవార్డు కోసం బుధవారం పంపినట్లు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మీడియాతో వెల్లడించారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Visit Site
Recommended byColombia
భారత్ వన్డే, టీ20 జట్టులో ఉన్నా.. గత కొంతకాలంగా రిజర్వ్ బెంచ్‌కే ఎక్కువ పరిమితమవుతున్న కేఎల్ రాహుల్ దొరికిన అవకాశాన్ని రెండుచేతులా సద్వినియోగం చేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభ ఓవర్‌లోనే బౌండరీతో తన ఉద్దేశాన్ని చాటగా.. కేఎల్ రాహుల్ చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. జట్టు స్కోరు 38 వద్ద రోహిత్ శర్మ బంతిని బలంగా హిట్ చేయబోయి ఎడ్జ్ తీసుకోవడంతో ఫీల్డర్ చమీరా చేతికి చిక్కాడు. అనంతరం వచ్చిన శ్రేయాస్‌తో కలిసి.. కేఎల్ రాహుల్ వరుస బౌండరీలు బాదేశాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్‌ 9వ ఓవర్ వేసిన మాథ్యూస్ బౌలింగ్‌లో రాహుల్ కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మరో ఎండ్‌లో శ్రేయాస్ కూడా భారీ షాట్లు ఆడటంతో భారత్ 12.3 ఓవర్లు ముగిసే సమయానికి 101/1తో మెరుగైన స్థితిలో నిలిచింది.
ఈ దశలో అప్పర్ కట్ ఆడబోయి శ్రేయాస్ ఔటవగా.. కొద్ది సేపటికే పెరీరా స్లో బంతికి కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో భారత్‌ ఒత్తిడిలో పడేలా కనిపించింది. కానీ.. చివర్లో ధోనీ, మనీశ్ పాండే జోడి భారీ షాట్లతో జట్టుకి మెరుగైన స్కోరు అందించారు. 19వ ఓవర్ వేసిన ప్రదీప్ బౌలింగ్‌లో ధోనీ ఒక ఫోర్ కొట్టగా.. మనీశ్ వరుసగా సిక్స్, ఫోర్ బాదేశాడు. దీంతో ఆ ఓవర్‌లో భారత్ ఏకంగా 21 పరుగులు పిండుకుంది. పెరీరా వేసిన చివరి ఓవర్ ఆఖరి బంతిని ధోనీ కళ్లు చెదిరే రీతిలో సిక్స్‌గా స్టాండ్స్‌లోకి తరలించాడు. దీంతో భారత్ 180 పరుగులు చేయగలిగింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Jan 02,2016
ఎగుమతుల లక్ష్యాన్ని చేరలేం: ఈఈపీసీ
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో పతనం చోటు చేసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. 2015-16లో వీటి ఎగుమతులు 6200 కోట్ల డాలర్లకు పడిపోవచ్చని 'ఇంజినీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్' (ఈఈపీసీ) పేర్కొంది. గతేడాది అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 7-8 శాతం దిగజారడం కూడా ఎగుమతులపై ప్రభావం చూపిందని తెలిపింది. 2014-15లో 7000 బిలియన్ డాలర్ల ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు చోటు చేసుకున్నాయి. మొత్తం దేశ ఎగుమతుల్లో ఈ రంగం వాటా 23 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 14.4 శాతం తగ్గి 3986 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఏకంగా 4655 బిలియన్ డాలర్ల ఎగుమతులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 7000 డాలర్లకు చేరే ప్రశ్నే లేదని ఈఈపీసీ ఇండియా ఛైర్మన్ భాసిన్ అన్నారు. ఈ సమయంలో 6000-6200 డాలర్ల ఎగుమతులు చోటు చేసుకోవచ్చని ఆయన అంచనా వేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ వీడియో
9, Aug 2019, 11:14 AM IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ అమ్మాయిల్లో అతడికి మాంచి క్రేజ్ ఉంది. తన కెరీర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించారు. అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని తన సినిమాలతో మెప్పిస్తోన్న ఈ నటుడు నేడు 44వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
వరుసగా మూడో రోజు పెరిగిన 'బంగారం' ధర!
ఒకవైపు పసిడి పరుగులు పెడుతుంటే.. వెండి ధర మాత్రం పతనమైంది. పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ మందగించడంతో బులియన్ మార్కెట్లో రూ.90 తగ్గింది.
Samayam Telugu | Updated:
Nov 2, 2018, 09:02AM IST
వరుసగా మూడో రోజు పెరిగిన 'బంగారం' ధర!
పండుగ సీజన్ నేపథ్యంలో దేశీయ నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బంగారం ధరలు వరుసగా మూడోరోజు కూడా పెరిగాయి. బుధవారం ట్రేడింగ్లో రూ.30 మేర పెరిగిన బంగారం ధర.. గురువారం ట్రేడింగ్లో ఏకంగా రూ.130 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.32,650 నుంచి రూ.32,780 రికార్డు స్థాయికి చేరింది. ఒకవైపు పసిడి పరుగులు తీయగా వెండి ధర మాత్రం పతనమైంది. పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ మందగించడంతో బులియన్ మార్కెట్లో రూ.90 తగ్గిన కిలో వెండి ధర రూ.39,110కి చేరింది.
Visit Site
Recommended byColombia
తాజా పెంపుతో.. దేశ రాజధాని ఢిల్లీలో 130 రూపాయలు పెరిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,780 కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,630 కి చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. నిన్నటి ధర రూ.24,900 వద్దే కొనసాగుతోంది.
2012 నవంబరు 29న బంగారం ధర రూ.32,940 గా నమోదైంది. ఆ తర్వాత అక్టోబరు 25న తొలిసారి ఆరేళ్ల గరిష్ఠ ధర రూ.32,625 మార్క్ను తాకింది. అక్టోబరు 31న మరోసారి రూ.32,650 సరికొత్త గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ట్రేడింగ్లో ఏకంగా రూ.130లు ఎగబాకి రూ.32,780 కి చేరి మరోసారి కొత్త ఆరేళ్ల గరిష్ఠస్థాయిని నమోదుచేసింది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు రెండు వారాల కనిష్ఠానికి పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా డాలర్ బలపడం ఇందుకు కారణమైంది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.8 శాతం పెరిగిన పసిడి ధర 1,217.84 డాలర్ల నుంచి 1,222.41 కి ఎగబాకింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
- 19న ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఐపీఓ
- ధరల శ్రేణి రూ.300-334
ముంబయి: దేశంలో మరో అతిపెద్ద ఐపీఓకు నగారా మొగింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ దాదాపు రూ.6,057 కోట్ల మేర నిధుల సమీకరణకు గాను ప్రాథమిక మార్కెట్లోకి రానుంది. ఈ నెల 19 నుంచి ఈ ఇష్యూ మొదలు కానుంది. ఈ ఐపీఓ ధరల శ్రేణిని సంస్థ రూ.300-334గా నిర్ణయించారు. దేశంలో ఒక బీమా సంస్థ పబ్లిక్ ఇష్యూకు రావడం ఇదే తొలిసారి. కంపెనీలో 68 శాతం వాటా కలిగి ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ప్రతిపాదిత ఇష్యూ ద్వారా 12.65 శాతం వాటాను (181 మిలియన్ షేర్లను) విక్రయించనుంది. ఇష్యూ గరిష్ట ధర వద్ద సంస్థ దాదాపు రూ.6,057 కోట్ల నిధులను సమీకరించనుంది. కనిష్ట ధర వద్ద సంస్థకు రూ.5,440 కోట్లు లభించనున్నాయి. దీంతో ఈ ఐపీఓ దేశీయ మార్కెట్లోకి వచ్చిన ఆరో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డుకెక్కనుంది. 2010లో కోల్ ఇండియా ఇష్యూ తరువాత భారీగా నిధుల సమీకరణకు వస్తున్న ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుత మార్కెట్ విలువ వద్ద ఐసీఐసీఐ బ్యాంక్ విలువ రూ.1.59 లక్షల కోట్ల పైగానే పలుకుతోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
business news
icici bank offer: 55% discount on travel, shopping, dining and more
ఐసీఐసీఐ బ్యాంక్ అదిరే ఆఫర్: ఏకంగా 55 శాతం డిస్కౌంట్.. అన్ని రకాల రుణాలపై సూపర్ డీల్స్!
ఐసీఐసీఐ బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. గురు నానక్ జయంతి సందర్భంగా ఏకంగా 55 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అలాగే అన్ని రకాల రుణాలపై సూపర్ డీల్స్ కూడా ఆఫర్ చేస్తోంది.
Samayam Telugu | Updated:
Nov 4, 2019, 02:07PM IST
ఐసీఐసీఐ బ్యాంక్ అదిరే ఆఫర్: ఏకంగా 55 శాతం డిస్కౌంట్.. అన్ని రకాల రుణాలపై సూపర్ ...
హైలైట్స్
అదిరిపోయే ఆఫర్లు ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్
55 శాతం వరకు డిస్కౌంట్
రుణలపై కూడా ఆకర్షణీయ డీల్స్
ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. గురు నానక్ జయంతి సందర్భంగా ఖాతాదారులకు ఏకంగా 55 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ట్రావెల్, డైనింగ్, షాపింగ్ వంటి వాటికి ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ అమృత్సర్లోని వారికి మాత్రమే ఈ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్లు ఈ నెల మొత్తం అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా హోమ్ లోన్స్, వాహన రుణాలు, టూవీలర్ లోన్స్, పర్సనల్ లోన్స్పై కూడా బ్యాంక్ ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో మేక్మైట్రిప్ ద్వారా జరిపే లావాదేవీలపై 55 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. | 1entertainment
|
బ్రెజిల్ vs బెల్జియం హైలెట్స్ పాయింట్స్ (వీడియో)
Highlights
2018 ఫిఫా వరల్డ్కప్ నిన్న పెను సంచలనం నమోదైంది.. మాజీ విశ్వవిజేత.. టైటిల్ ఫేవరేట్లో ముందు వరుసలో ఉన్న బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కజెస్ ఏరెనాలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బెల్జియం చేతిలో 2-1 తేడాతో సాంబా జట్టు ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.
2018 ఫిఫా వరల్డ్కప్ నిన్న పెను సంచలనం నమోదైంది.. మాజీ విశ్వవిజేత.. టైటిల్ ఫేవరేట్లో ముందు వరుసలో ఉన్న బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కజెస్ ఏరెనాలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బెల్జియం చేతిలో 2-1 తేడాతో సాంబా జట్టు ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.
* 2018 ఫిఫా ప్రపంచకప్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ బ్రెజిల్
* చివరి 16 మ్యాచ్ల్లో బ్రెజిల్ ఓడిపోయింది. అలాంటిది తొలిసారిగా ఓటమి రుచి చూసింది.
* ఈ మ్యాచ్లో కొట్టిన రెండు గోల్స్తో కలిపి ఈ టోర్నీలో బెల్జియం 14 గోల్స్ సాధించింది.. అత్యధిక గోల్స్ సాధించిన జట్టుగా అవతరించింది.
* రొమేలు లుకాకు బెల్జియం సాధించిన 20 గోల్స్తో సంబంధం ఉంది.
* ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో బెల్జియం సెమీఫైనల్స్ చేరడం ఇది రెండవసారి.. ఇంతకు ముందు 1986లో బెల్జియం మొదటిసారి సెమీస్ చేరింది.
* ఫిలిప్ కౌటిన్హో తను ఆడిన 10 మ్యాచ్ల్లో జట్టు చేసిన 11 గోల్స్లతో సంబంధాన్ని కలిగిఉన్నాడు.
" | 2sports
|
internet vaartha 176 Views
కోహ్లీసహా పలువురు ఆందోళన
న్యూఢిల్లీ : టీమిండియా హెడ్ కోచ్గా మాజీ కెప్టెన్ కుంబ్లే బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్నో మార్పులు చోటు చేసు కుంటున్నాయి.ఒకవైపు తనను ఎందుకు ఎంపిక చేయలే దంటూ మాజీ ఆటగాడు, టీ మిండియా డైరెక్టర్గా సేవలం దించిన రవిశాస్త్రి పరోక్షంగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు.మాజీ కెప్టెన్ గంగూలీ ఉద్దేశపూర్వకంగానే తనను ఇంటర్వ్యూ చేసే సమయంలో అక్కడ లేకపోవడంపై వ్యాఖ్యలు చే యగా ఆ సమయంలో అధి కారిక సమావేశంలో పాల్గొ న్నందున హాజరుకాలేదని గంగూలీ వివరించాడు.ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు బిసిసిఐ నిర్ణయాలతో ఆందోళన చెందుతున్నారు.బోర్డు నిర్ణయంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మినీ ఐపిఎల్, దులీప్ ట్రోఫీని ఏక కాలంలో నిర్ణయించాలని బిసిసిఐ షెడ్యూల్ ఖరారు చేయడంతో అసలు సమస్య మొదలైంది. సరైన ప్రణాళికలు లేకుండా బోర్డు వ్యవహరిస్తుందని ఏ టోర్నమెంట్లో పాల్గొనాలో అర్థం కావడం లేదని ఆట గాళ్లు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఆటగాళ్లు తమకు ఉన్న ఒప్పందాల కారణంగా ఆయా జట్టుకు కొన సాగాల్సి ఉంటుంది. కానీ బిసిసిఐ నిర్వహించే మ్యాచ్లు ఏకకాలంలో ఉంటే కాంట్రాక్టుల పరిస్థితి ఏంటని ఆటగాళ్లు ప్రశ్నిస్తున్నారు.అయితే కనీసం నెల రోజుల ముందు తమకు ఏ విషయాన్ని తెలపాలని టీమిం డియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ తో సహా ఇతర ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. | 2sports
|
ముంబై ఎయిర్పోర్ట్ షట్ డౌన్.. ఎప్పుడు? ఎందుకు?
Last Updated: సోమవారం, 28 జనవరి 2019 (11:50 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఫిబ్రవరి-మార్చి నెలల్లో మూతపడనుంది. రన్ వే మరమ్మత్తుల కారణంగా విమానాశ్రయాన్ని రెండు నెలల పాటు మూతవేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదుగంట వరకు తాత్కాలికంగా ముంబై ఎయిర్పోర్ట్ మూతపడనుందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
తద్వారా 230 రోజూ నడిచే విమానాల సేవలు రద్దైనాయి. రోజుకు ఆరు గంటల పాటు ముంబై విమానాశ్రయం మూతపడటం ద్వారా విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు మరమ్మత్తు పనులు జరుగుతాయని.. ముంబై విమానాశ్రయంలోని రెండు రన్వేలపై రోజుకు 85 ఫ్లైట్స్ నడుస్తాయి.
అదీ గంటలోనే ఈ రన్వేలపై 85 విమానాల రాకపోకలు నడుస్తుంటాయి. ముంబై నుంచి ఢిల్లీ, గోవా, బెంగళూరుకు నడిచే విమాన సేవలు కూడా రద్దైనట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. మెడికల్ విమాన రాకపోకలు మాత్రం జరుగుతాయి.
సంబంధిత వార్తలు | 1entertainment
|
internet vaartha 239 Views
దేశీయ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు
న్యూఢిల్లీ : దేశీయ ఉక్కు కంపెనీలకు మార్కెట్ లాభదాయ కత పెంచేందుకుగాను దిగుమతులపై ఆంక్షలు ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది ఇప్పటివరకూ దిగుమతులు 1/4శాతం తగ్గినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి 11నెలల కాలంలోనే నాలుగోవంతు తగ్గాయని మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దిగుమతి, రక్షణసుంకం, కనీస దిగుమతిధర, నాణ్యతనియంత్రణ ఉత్తర్వులు వంటివాటితో ఉక్కు దిగుమతులు ఏప్రిల్ ఫిబ్రవరి నెలల మధ్యకాలంలో తగ్గినట్లు ఉక్కుశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. గత ఏడాది దిగుమతులు 71శాతం పెరిగాయి. దేశీయ ఉక్కుపరిశ్రమను రక్షించుకు నేందుకు నిఘా కొంత అవసరమని చైనా ఇప్పటికే భారత్కు చౌక ఉక్కును భారీగా తరలిస్తోందని, దీనివల్ల దేశీయ కంపెనీల విక్రయా లు, లాభాలను ప్రభావితం చేస్తున్నట్లు వెల్లడించారు. ఉక్కుమంత్రిత్వ శాఖపరిధిలోని జాయింట్ ప్లాంట్కమిటీ వివరాలను పరిశీలిస్తే 2014 -15లో దిగుమతులు 9,321మిలియన్ టన్నులకు పెరిగాయి. అంటే 71శాతం పెరిగాయి. భారత్ ఎక్కువగా చౌక ఉక్కు దిగుమతులపైనే దృష్టిపెట్టింది. అదే ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ఉక్కు దిగుమతులు 20.5శాతంగా ఉన్నాయి. 10,215 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అయితే ఫిబ్రవరి నెలలో మాత్రం 0.1శాతం తగ్గింది. గత ఏడాది ఫిబ్రవరినెలతో పోలిస్తే 7.3శాతంగా ఉన్నాయి. వరుసగా నాలుగు నెలల నుంచి ఉక్కుదిగుమతులు తగ్గుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ ఉత్పత్తిదారులను పరిరక్షించేందుకుగాను ప్రభుత్వం కనీస దిగుమతిధరలను ప్రకటించింది. మొత్తం 174 ఉక్కు ఉత్పత్తు లపై ఈ ధరలు అమలవుతాయి. గత ఏడాది జూలై, ఆగస్టునెలల్లో పీక్ కస్టమ్స్ సుంకం ఉక్కుపై 15శాతానికి పెంచారు. యాంటిడంపిం గ్ సుంకం కూడా కొన్నిగ్రేట్లపై విధించారు. జూన్, డిసెంబరునెలల్లో మరింతగా విధించింది. వీటితోపాటు చట్టపరంగా సేఫ్గార్డ్ సుంకం 20శాతం హాట్రోల్డ్ స్టీల్ కాయిల్స్పై ఆరునెలలపాటు విధించినట్లు తోమర్ వివరించారు. గత ఏడాది భారత్ప్రపంచంలోనే ఉక్కు ఉత్పత్తి చేస్తున్న మూడో అతిపెద్ద దేశంగా నిలిచిందని, అమెరికా తర్వాత భారత్కే ఆస్థానం దక్కిందన్నారు. 2014మేనెల నుంచి ఉక్కు కంపెనీ లు ప్రభుత్వరంగంలోని సెయిల్, ఆరైఎన్ఎల్ వంటి వాటితో కలిసి మొత్తం 16 మిలియన్ టన్నుల కెపాసిటీని పెంచుకున్నాయి. ఇందుకు పెట్టుబడులు లక్షకోట్లుపెట్టారని వివరించారు. 2014-15 ఆర్ధిక సంవ త్సరంలో భారత్ ఉక్కు ఉత్పత్తి 7.9శాతం పెరిగి 88.12 మిలియన్ టన్నులుగా ఉంది. గనుల తవ్వకాల మొదటిదశ వేలంలలో మొత్తం 43 బ్లాక్లు వేలంకు వచ్చాయని, ఆరు ఇప్పటివరకూ వేలం జరిగి నట్లు తోమర్ వివరించారు. రాష్ట్రాలు ఈ వేలం ద్వారా 14,855 కోట్లు రాబడులు ఆరుబ్లాక్ల నుంచి రాబట్టినట్లు రెండోవిడత 12 ఖనిజవనరులున్న రాష్ట్రాలకు రాబడులు అందుతాయన్నారు. వీటిలో 42 బ్లాక్లను వేలం వేయనున్నట్లు వివరించారు. ఈ వేలం వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఉంటుందన్నారు. 1957 నాటి ఖనిజవనరుల అభివృద్ధి క్రమబద్ధీకరణ చట్టాన్ని సవరించేందుకు యోచిస్తున్నామని దీనివల్ల ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వేలంలో కాకుండాగనులు కేటాయించేందుకు వెసులుబాటు కలుగు తుందన్నారు. క్యాప్టివ్మైనింగ్ లీజులు ఇప్పటివరకూ వేలం ద్వారానే కేటాయిస్తుండగా ఈ గనుల చట్టంసవరణ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి కేటా యించే వీలుందన్నారు. ఇందుకు సంబంధించిన ముసాయి దాను కేబి నెట్కు పంపిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పార్లమెంటుకు వస్తుం దన్నారు. జింక్ ఆల్లాయ్ పై సుంకం పెంచేందుకు ప్రతిపాదించామని దీనివల్ల దిగుమతులు కట్టడిచేయగలమన్నారు. ఎగుమతులపై సుంకం తొలగింపు వల్ల భారతీయ ఉక్కును అత్యధికంగా ఎగుమతి చేయగలమన్నారు. అల్యూమినియం ఉత్ప త్తులపై 2.5శాతం సుంకం విధింపువల్ల దేశీయంగా ఉన్న పరిశ్రమకు లాభం కలుగుతుందన్నారు. బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఉక్కురంగం ఎంతో లాభపడుతుందన్నారు. గ్రామీణప్రాంతాలకు ఎల్పిజిసరఫరా నిర్ణయం వల్ల ముందు సిలిండర్ల తయారీకి అవసరమైన ఉక్కుకుడిమాండ్ పెరుగుతుందని దీనివవల్ల ఉక్కు రంగానికి ప్రత్యక్షంగా మేలు జరుగుతుందన్నారు. అలాగే 2018 మే ఒకటవతేదీలోపు నూరుశాతం గ్రామాల విద్యుదీకరణ ప్రాజెక్టు వల్ల ఉక్కు డిమాండ్ పెరుగుతుందని, స్తంభాలు, ఇతర ఉక్కువైర్లు, విద్యుత్ రంగానికి అవసరమైన ఉక్కు కొనుగోళ్లు పెరుగుతాయన్నారు. అలాగే జలవన రుల రంగంలో 85వేల కోట్ల పెట్టుబడులు వల్ల ఉక్కురంగంలో పైపులు ట్యూబ్లు వంటి వాటికి డిమాండ్ పెరుగుతుందన్నారు. అలాగే ఆహార ఉత్పత్తుల్లో నూరుశాతం ఎఫ్డిఐను ప్రోత్సహించడం వల్ల కంటైనర్ల నిర్మాణానికి, సిలోస్ నిర్మాణానికి ఉక్కు అవసరం పెరుగుతుందన్నారు. దీనివల్ల పరోక్షంగా ఉక్కు డిమాండ్ పెరుగుతుందని మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వివరించారు. | 1entertainment
|
Eden Gardens
ఇవాల్టి రెండో మ్యాచ్కు వర్షం అడ్డంకి
కోల్కతా: కోల్కతాలని ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ , ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సి ఉన్న మ్యాచక్ ఇపుడు వర్షం అడ్డంకి అంతరాయం కలిగింది.. కోల్కతాలో వర్షం కురుస్తుండటంతో ఇప్పటికీ టాస్ వేయలేదు. మరికాసేపట్లో టాస్ వేసిమ్యాచ్ను ప్రారంభించనున్నారు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రియోలో మన గురి అదిరింది
రియో ఒలింపిక్స్ లో మొదటి రోజు నిర్వహించిన పురుషుల ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో భారత ఆర్చర్ అతానుదాస్ ప్రతిభ చాటాడు.
TNN | Updated:
Aug 6, 2016, 12:17AM IST
రియో ఒలింపిక్స్ లో మొదటి రోజు నిర్వహించిన పురుషుల ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో భారత ఆర్చర్ అతానుదాస్ ప్రతిభ చాటాడు. 12 రౌండ్లు జరిగిన ఈ పోటీలో 683 పాయింట్లు సాధించి 58/60 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచాడు. కొరియా ఆర్చర్ కిమ్ వూజింగ్ 700 పాయింట్లతో ప్రపంచ, ఒలింపిక్ రికార్డులు బద్దలు కొట్టి తొలి స్థానంలో నిలిచాడు. | 2sports
|
‘ బిసిసిఐ అధ్యక్షుడిని అరెస్టు చేయాలి
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ఠాకూర్ను అరెసఉట చేయాలని కోర్టు సహాయకుడు పేర్కొన్నారు. బిసిసిఐ పిటిషన్పై వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. కాగా విచారణ సందర్భంగా బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు ఇచ్చారని కోర్టు సహాయకుడు అమికస్ క్యూరే పేర్నొన్నారు. | 2sports
|
india vs sri lanka, 1st test: rahul falls early on day 5
రాహుల్ క్లీన్ బౌల్డ్.. మరో సెంచరీ మిస్!
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తిగా సాగుతోంది.
TNN | Updated:
Nov 20, 2017, 10:10AM IST
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తిగా సాగుతోంది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ అదరగొట్టడం.. ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రా కావడం ఖాయమని దాదాపు అంతా అనుకున్నారు. అయితే ఐదో రోజు ఆట ఆరంభించిన అరగంటలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ రూపంలో భారత్ కీలక వికెట్ కోల్పోయింది.
పేసర్ సురంగ లక్మల్ వేసిన అద్భుత బంతికి రాహుల్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సెంచరీకి చేరువవుతున్న తరుణంలో పెవిలియన్‌కు చేరాడు. ఆదివారం మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తృటిలో సెంచరీని చేజార్చుకున్న విషయం తెలిసిందే. దూకుడుగా ఆడుతూ 94 పరుగుల వద్ద ఔటైన ధావన్ నిరాశతో వెనుదిరిగాడు. | 2sports
|
Balayya's 100th movie
ఉగాది రోజున వందో సినిమా ప్రకటన
అమరావతిలోని ధ్యాన బుద్ధ ప్రాజెక్టు వద్ద శుక్రవారం తన వందో సినిమాని ప్రకటించనున్నారు బాలయ్య.
TNN | Updated:
Apr 8, 2016, 09:11AM IST
అమరావతిలోని ధ్యాన బుద్ధ ప్రాజెక్టు వద్ద శుక్రవారం తన వందో సినిమాని ప్రకటించనున్నారు బాలయ్య. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఆ సినిమాని తీయబోతున్నారు. నాటి ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలయ్య నటించబోతున్నారు. నాటి ధాన్యకటకమే నేడు ధరణికోట, అమరావతిగా విలసిల్లుతున్నాయి. ఇక్కడ నుంచి బీహార్లోని మగధ వరకు సువిశాలంగా తెలుగు సామ్రాజ్యాన్ని విస్తరించిన మహావీరుడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఆ చక్రవర్తిగా తమ అభిమాన నటుడు నటిస్తుండంతో అమరావతిలోని బాలయ్య అభిమానులు ఆనందిస్తున్నారు. అందుకే అమరావతిలోనే ఆ సినిమా ప్రకటనను చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. | 0business
|
Sep 23,2015
జాతిని ఐక్యం చేస్తున్న హిందీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రాజభాష హిందీ భారతీయుల మధ్య ఐక్యత పెంచి.. మనమంతా ఒకే జాతికి చెందిన వారిమనే భావనను కలిగిస్తోందని కార్పొరేషన్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ హెడ్ ప్రశాంతి చంద్రశేఖర్ అన్నారు. బ్యాంకులో ఇటీవల నిర్వహించిన హిందీ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అమె మాట్లాడుతూ హిందీ ప్రాధన్యతను గురించి సిబ్బందికి వివరించారు. జోనల్ పరిధిలో అంతర్గత వ్యవహారాల నిమిత్తం హిందీని వాడుతున్న తీరు పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతర వివిధ విభాగాల్లో రాణించిన వారికి జోనల్ హెడ్ ప్రశాంతి చంద్రశేఖర్, డిప్యూటీ జోనల్ హెడ్ తిరుత్తువాలు బహుమతులను అందజేశారు. జోనల్ ఆఫీస్ చీఫ్ జనరల్ మేనేజర్ హోసోమణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. | 1entertainment
|
Feb 11,2017
కాశ్మీర్లో పర్యాటకంతోనే శాంతి
హైదరాబాద్: జమ్మూ, కాశ్మీర్ పర్యాటకం అభివృద్ధితో ఆ ప్రాంతంలో శాంతి విరభూస్తుందని పిల్టోఫ్ ఛైర్మన్ నాసిర్ షా తెలిపారు. ఇందుకు దేశ ప్రజలు తగిన సహకారం అందించాలని ఆయన కోరారు. కాశ్మీర్కు అధిక సంఖ్యంలో వచ్చి ఇకడ పర్యటకం అభివృద్ధి చెందేలా తగిన సహకారం అందిచాలని కోరారు.అక్కడి ప్రాంతానికి చెందిన ప్రముఖ టూర్ ఆపరేటర్ల సంఘం జమ్మూ, కాశ్మీర్ పిలిగ్రిమ్ అండ్ లీజర్ టూర్ ఆపరేటర్స్ ఫోరమ్ (పిల్టోఫ్) శుక్రవారం హైదరాబాద్లో 'ది కాశ్మీర్ టూరిజం రోడ్ షో'ను నిర్వహించింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాసిర్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు పర్యాటకం నుంచి వచ్చే ఆదాయంపైనే అత్యధికంగా ఆధారపడ్డారన్నారు. తమకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి వల్ల సమర్థులైన అధికారుల ప్రయత్నాల వల్ల పర్యాటక రంగం తిరిగి పుంజుకుందని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రమైన కాశ్మీర్ నిజంగానే భూతల స్వర్గమన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సానియా జోడీ శుభారంభం
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటిఎ ప్రీమియర్ టెన్ని టోర్నీలో సానియా మిర్జా (భారత్), మార్టినా హింగీస్ (స్విట్జర్లాండ్) జంట శుభారంభం చేసింది. కాగా మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్సీడ్ సానియా జోడీ 6-3, 7-5 తేడాతో కెవి డెలాక్వా-సమంత స్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయంసాధించింది. | 2sports
|
Hyderabad, First Published 17, Aug 2019, 11:21 AM IST
Highlights
నటి శ్రీరెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు శృంగార తార షకీలా. కొబ్బరి మట్ట చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చిన షకీలా.. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు తల్లిగా నటించి మంచి నటనను కనబరిచారు.
శృంగార తారగా మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన షకీలా.. తన సినిమాలతో స్టార్ హీరోలకు పోటీ ఇచ్చేది. తనకు నమ్మకద్రోహం జరగడంతో జీరో పొజిషన్ కి వచ్చేసింది. తాను నమ్మకద్రోహానికి గురైనా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని.. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే ఎదురుతిరిగి నిలబడతానని అంటోంది షకీలా.
తాజాగా ఆమె నటించిన 'కొబ్బరిమట్ట' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సంపూర్ణేష్ బాబు తల్లిగా నటించింది. తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటిస్తానంటోంది షకీలా. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంపై జనాలకు ఉన్న సందేహాలు తీర్చే క్రమంలో కొన్ని సమాధానాలు చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఆమెని ప్రశ్నించగా.. తను శృంగార తారగా అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఇండస్ట్రీ నుండి లైంగిక వేధింపు ఎదురుకాలేదని.. కెమెరా ముందు అర్ధనగ్నంగా నటించడానికి ఇబ్బంది పడలేదని చెబుతూ.. పాపం శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకుని రోడ్డుమీద నిలబడలేను. నా చేతుల కష్టంపై ఫైట్ చేసి వెనక్కి రాగలిగా అంటూ శ్రీరెడ్డికి పంచ్ వేసింది.
అయితే గతంలో ఇదే కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించినప్పుడు మాత్రం ఓ నిర్మాత తనను షూటింగ్ అయిపోయిన తరువాత వస్తావా..? అని అడిగాడని.. అతడి పేరు చెప్పడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.
Last Updated 17, Aug 2019, 11:21 AM IST | 0business
|
sumalatha 102 Views bse , NSE , stock market
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ స్టాకులు మర్కెట్లను లాభాల్లో నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 164 పాయింట్లు లాభపడి 37,145కి చేరుకుంది. నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 11,004 వద్ద స్థిరపడింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/andhra-pradesh/ | 1entertainment
|
sumalatha 143 Views jio , Mukesh Ambani , RELIANCE
Mukesh Ambani
ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ జియో గిగా ఫైబర్తో పాటు కీలక నిర్ణయాలను ప్రకటించిన సందర్భంగా కంపెనీ షేర్ల విలువ నేడు జోరందుకుంది. దేశీయ మార్కెట్లు పతనమైతున్నప్పటికీ ఆర్ఐఎల్ షేర్లు మాత్రం ఊపు మీదున్నాయి. మార్కెట్ ప్రారంభంలో ఆరు శాతం ఎగబాకిన షేర్లు ప్రస్తుతం 12 శాతం లాభంతో సెన్సెక్స్లో రూ.1,302.50 వద్ద ట్రేడవుతోంది. అలాగే నిఫ్టీలో సైతం 12.10శాతం లాభపడి రూ.1,302.80 వద్ద కొనసాగుతోంది. గత పదేళ్లలో ఇంట్రాడేలో ఆర్ఐఎల్ షేర్లు ఈ స్థాయిలో పుంజుకోవడం ఇదే తొలిసారి. గతంలో మే 18, 2009న 24శాతం మేరకు ఇవి లాభపడ్డాయి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/sports/ | 1entertainment
|
Visit Site
Recommended byColombia
దూరం నుంచి చూస్తున్న నాకు.. కరెక్టేకదా, ఆ స్థానాన్ని అలంకరించే అర్హుడు ఆయనేకదా అనిపించింది. అది ఒక్క సత్యానంద్నే కాదు రచయితలందరినీ గౌరవించినట్టు అని నేను ఫీలయ్యాను. అందరం ఆయన దగ్గరకు వెళ్లి ఒక ఫొటో దిగాం. సత్యానంద్గారిని కాలుమీద కాలేసుకోమని చెప్పాం. ఆయన స్వభావం కాకపోయినా మేం చెప్పామని వేసుకున్నారు. ఆ సమయంలో మోహన్ బాబు.. ఎప్పుడూ ఏదో గెలుకుతూ ఉంటాడు కదా ఆయన. ఏమయ్యా.. రాఘవేంద్రరావును నిలబెట్టి, సత్యానంద్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. దర్శకేంద్రుడయ్యా.. ఆయన్ని అవమానిస్తావా అన్నారు.
నేను వెంటనే.. రాఘవేంద్రరావు అమరశిల్పి జక్కన్న. ఉలి, సుత్తి ఆయన చేతిలో ఉంటుంది. ఆయన దేన్ని చెక్కాలి.. ఒక శిల ఉండాలి కదా.. ఆ శిలేనయ్యా సత్యానంద్ గారు అన్నారు. సత్యానంద్ మనసులో నుంచి వచ్చిన కథను రాఘవేంద్రరావు అందంగా చెక్కుతారు. ఆ రకంగా ఆయన దిట్ట. రాఘవేంద్రరావును తక్కువ చేయటం కాదయ్యా.. సత్యానంద్ లాంటి రచయితలను గౌరవించుకోకపోతే మనకు మనుగడు లేదు అని గుర్తుచేస్తున్నాను అని అన్నాను. ఇదంతా ఆ సాయంకాలం సరదాగా జరిగింది’’ అని నవ్వుతూ చెప్పారు చిరంజీవి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మోహన్ బాబు కూడా అక్కడే ఉన్నారు.
ఆ తరవాత సినీ రచయితలతో తనకున్న అనుబంధం గురించి చిరంజీవి చెబుతూ.. ‘‘పరుచూరి బ్రదర్స్తో అనుబంధం చాలా వుంది. కుటుంబ సభ్యుల్లా అయిపోయాం. ‘మగమహారాజు’కు రాసిన ఆకెళ్ళ ఇక్కడే వున్నారు. వీరందరికీ నా కృతజ్ఞతలు. ఈ సభకు నన్ను పిలకపోయివుంటే అసంతృప్తిగా వుండేవాడిని. గొప్ప అనుభూతి పొందే అవకాశం ఇచ్చారు. ఎంతో అనుభవం వున్న ప్రతిభ వున్నవారికి నా చేతుల మీదుగా సన్మానం చేయడం జీవితంలో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను.
నాకు ఆదివిష్ణు గారితో పరిచయం తక్కువ. ఆయన సినిమాలకు తక్కువరాసినా జంథ్యాలగారితో అనుబంధం చాలా గొప్పది. నాటకరచయితగా అద్భుతాలు చేశారు. ఇక రావికొండలరావుగారు నాటక రచయితగా, సంపాదకుడిగా, నటుడిగా, సాహితీవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి. బాపు, రమణలకు అత్యంత ఆప్తుడు ఆయన. ఇక కోదండరామిరెడ్డిగారితో 25 సినిమాల సుదీర్ఘ ప్రయాణం మాది. దర్శకుడిగాకంటే ఆత్మీయుడు, స్నేహతుడిగా కన్పిస్తాడు. కల్మషం లేని వ్యక్తి.
ఇక భువన చంద్రగారు.. ఆయన మిలట్రీ మనిషి. విజయ బాపినీడుగారు మొదటిసారి.. ‘ఖైదీ నెం.786’తో పరిచయం చేశారు. ఆరుద్ర, ఆత్రేయగారి టైంలో ఈయన రాస్తారా అనిపించింది. ఆ తర్వాత ఆయన రాసిన విధానం చూశాక.. రణరంగంలో గన్తో పేల్చినట్లు.. సినీకలంతో విజృంభించారు. ఆయన రాసిన మూడు పాటలు.. నేటితరం రీమిక్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. ‘గువ్వాగోరింకతో’, ‘బంగారు కోడిపెట్ట’, ‘వాన వాన వెల్లువాయె’ వంటివి అందుకు నిదర్శనం.
ఇలా వీరందరినీ సత్కరించుకోవడంతోపాటు నా కృతజ్ఞతను తెలుపుకోవడానికి అవకాశం కల్గింది. ఇంకా సింగీతం శ్రీనివాసరావు, విశ్వనాథ్గారు కూడా వచ్చివుంటే బాగుండేది. అది లోటుగా భావిస్తున్నా. వారిద్దరు మనకు నిధి లాంటివారు. మాయాబజార్ నుంచి ఈ కాలం వరకు వున్న వ్యక్తులు. వారు రాలేకపోయారు. ముందుముందు వారిని సన్మానించుకునే అకవాశం నాకు ఇవ్వగలిగితే బాగుంటుంది’’ అని అన్నారు. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
డేటా లీక్లపై స్పందించిన వాట్సాప్
ఫేస్బుక్కు చెందిన వాట్సాప్ డేటా లీకేజీల వివాదంపై స్పందించింది. మెసేజ్లను ట్రాక్ చేస్తున్నట్టు వస్తున్న రిపోర్టులను వాట్సాప్ కొట్టిపారేసింది.
Samayam Telugu | Updated:
Apr 7, 2018, 03:09PM IST
డేటా లీక్లపై స్పందించిన వాట్సాప్
ఫేస్బుక్కు చెందిన వాట్సాప్ డేటా లీకేజీల వివాదంపై స్పందించింది. మెసేజ్లను ట్రాక్ చేస్తున్నట్టు వస్తున్న రిపోర్టులను వాట్సాప్ కొట్టిపారేసింది. చాలా తక్కువ మొత్తంలో డేటాను మాత్రమే కలెక్ట్ చేశామని, కానీ ప్రతి మెసేజ్ ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్గా వాట్సాప్ పేర్కొంది. భారత్లో 200 మిలియన్ యాక్టివ్ యూజర్లు కలిగి ఉన్న ఈ వాట్సాప్ సెక్యూర్ కాదంటూ పలువురు విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేశారు. యూజర్ ఒప్పందాలపై కొన్ని నియమాలపై ప్రశ్నలు సంధించారు. అయితే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపే మెసేజ్లను తాము ట్రాక్ చేయడం లేదని, చాలా తక్కువ మొత్తంలో డేటాను మాత్రమే తాము సేకరించామని, కానీ ప్రతి మెసేజ్ ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్గా వాట్సాప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. | 1entertainment
|
సెక్సీ భంగిమలతో మతి పోగొడుతున్న కాజల్ అగర్వాల్!
First Published 18, Aug 2019, 3:51 PM IST
అందాల చందమామ కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దకాలం పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల పోటీని తట్టుకుని కూడా కాజల్ అందాల మెరుపులు మెరిపిస్తోంది.
(Courtesy: Instagram)కాజల్ కు ఇటీవల సరిగా కలసి రావడం లేదు. కాజల్ నటించిన చిత్రాలు సీత, గత ఏడాది నటించిన కవచం, ఎమ్మెల్యే చిత్రాలు నిరాశపరిచాయి.
(Courtesy: Instagram)వరుస ప్లాపులు ఎదురైనా తన స్టార్ స్టేటస్ తో నెట్టుకొచ్చేస్తోంది.
(Courtesy: Instagram)ఇక కాజల్ అగర్వాల్ ఈ ఏడాది కమల్ హాసన్ సరసన శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రంలో నటించే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది.
(Courtesy: Instagram)మరికొన్ని చిత్రాలలో కాజల్ కు అవకాశాలు వస్తున్నాయి.
(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ తన అందాల ఫోజులతో మతిపోగొడుతున్న సంగతి తెలిసిందే.
(Courtesy: Instagram)కాజల్ చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులని సైతం ఆశ్చర్యపరుస్తోంది.
(Courtesy: Instagram)తాజాగా కాజల్ అగర్వాల్ బ్లూ కలర్ ట్రెండీ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది.
(Courtesy: Instagram) కాజల్ అగర్వాల్ ఫోటో గ్యాలరీ
(Courtesy: Instagram) కాజల్ అగర్వాల్ ఫోటో గ్యాలరీ
Recent Stories | 0business
|
ఆసియాలో భారత్ దూసుకుపోతోంది
- ఈ ఏడాది 7.4% వృద్ధిని చేరుకోవచ్చు
- అధిక వర్షాలతో డిమాండ్ పుంజుకోనుంది: ఏడీబీ
న్యూఢిల్లీ: అనుకూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది భారత వృద్ధిరేటు మెరుగ్గా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా 'ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్' (ఏడీబీ) అంచనా కట్టింది. ఈ ఏడాది (2016-2017లో) భారత్ 7.4 శాతం వరకు వృద్ధిని నమోదు చేయగలదని ఒక అధ్యయనంలో తేల్చింది. మెరుగైన వర్షపాతం కారణంగా పంటలు బాగా పండనుండడం, వినియోగదారు డిమాండ్ పెరగడం, కీలక నిర్మాణాత్మక సంస్కరణల వేగవంతం ఇందుకు ప్రధానంగా దోహదం చేయనున్నట్లుగా వివరించింది. ఇటీవల పెరిగిన వేతనాలు, పించన్లకు తోడు పంటలు బాగా పండనుండడంతో గ్రామీణ డిమాండ్ కూడా బాగా పుంజుకొనే అవకాశం ఉన్నట్లుగా 'ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ (ఏడీవో) 2016 అప్డేట్'లో పేర్కొంది. కార్పొరేట్లను మెరుగ్గా రాణిస్తుండడం, బ్యాంకుల సంస్కరణల ఊతం కారణంగా రుణ వితరణ పెరగడంతో ప్రయివేటు పెట్టుబడులు పుంజుకోవడం తదితర పరిణామాలు 2017లో భారత వృద్ధి 7.8 శాతానికి చేరుకొనేందుకు దోహదం చేయవచ్చని పేర్కొంది. జాతీయ స్థాయిలో జీఎస్టీ అమలునకు చట్టం తేనుండడం మూలంగా మదుపరుల విశ్వాసం పెరగడంతో పాటు సమీకృత, ఉత్పాదక ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు దోహదం చేస్తుందని తెలిపింది. దేశంలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పన్నులను తీసుకువచ్చే దిశగా ఇటీవలి కాలంలో పలు నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టడం కూడా అనుకూలించే పరిణామం కానుంది. దక్షిణాసియా ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఎదుగుతోందని అన్నారు. ఇందులో భారత వృద్ధి చోదకశక్తిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. భారత్ ఐటీతో సహా ఇతర వాణిజ్య సేవల ఎగుమతులతో వాణిజ్యాన్ని విస్తరించే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
డేట్ ఇస్తా.. కానీ ముంబై రండి అంటోంది..
Highlights
బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్స్ అందర్నీ మించిన సన్నీ లియోనీ
సన్నీ లియోనీ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనాలన్నా కండిషన్స్
డేట్స్ కావాలని వచ్చిన వారికి కేవలం ముంబైలో మాత్రమే షూటింంగ్ అని చెప్తున్న సన్నీ
బాలీవుడ్ స్టార్ స్టేటస్ దక్కించుకున్న పోర్న్ స్టార్ సన్నీ లియోనీ కి ఇప్పుడు దేశవ్యాప్తంగా యమా క్రేజు వచ్చింది. ఈ క్రేజ్ దృష్ట్యానే బాలీవుడ్ ఐటమ్ గర్ల్ అంటే కేవలం సన్నీయే అనిపించుకున్న పోర్న్ స్టార్.. ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లోనే కాక ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తూ క్రేజ్ సంపాదిస్తోంది. తెలుగులో సన్నీ మంచు మనోజ్ సరసన కరెంట్ తీగ సినిమాలో లేలే నా రాజా పాటతో అలరించింది.
ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా ఇతర రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలను కాస్త ఎక్కువగా ఫోకస్ చేసింది. సన్నీ ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తుంది. ఈ బ్యూటీ తాజాగా రాజశేఖర్ చిత్రం ‘పి.యస్.వి.గరుడ వేగ 126.18ఎం’లో ఓ సాంగ్ లో చేసింది. ఈ షూటింగ్ కూడా ముంబైలోనే జరిగింది. దీనికి కారణం సన్నీ కండిషన్సే. హైదరాబాద్ లో జరగాల్సిన ఈ షూటింగ్ సన్నీ పెట్టిన కండిషన్స్ వల్ల ముంబైలో జరిగింది.
సన్నీ లియోనీ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనాలన్నా కండిషన్స్ మాత్రం దర్శకనిర్మాతలకు దిమ్మ దిరిగేలా చేస్తున్నాయి. తన డేట్స్ కావాలని వచ్చిన వారికి అవి ఇస్తానని, అయితే కేవలం ముంబైలో మాత్రమే షూటింంగ్ పూర్తి చేసుకోవాలని చెప్తోందట.
ఇప్పుడు సన్నీలియోన్ ఎటువంటి షూటింగ్స్ పెట్టుకున్నా... ప్రతి ఒక్కరూ ముంబై వెళ్ళాల్సిందే. ముంబైలో లొకేషన్స్ లో షూటింగ్ పెట్టుకుంటేనే సన్నీలియోన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అందుకే ఈ బ్యూటీ సౌత్ మేకర్స్ కి ముందుగానే ముంబైలో షూటింగ్ అంటేనే నా దగ్గరకి రండి అని గట్టిగా చెబుతుందట.
Last Updated 25, Mar 2018, 11:37 PM IST | 0business
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీ 300వ వన్డే.. ఆ రికార్డులకీ మోక్షం..?
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్లో మరో అత్యుత్తమైన మైలురాయిని గురువారం చేరుకోనున్నాడు
TNN | Updated:
Aug 30, 2017, 04:25PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్‌లో మరో అత్యుత్తమైన మైలురాయిని గురువారం చేరుకోనున్నాడు. శ్రీలంకతో కొలంబో వేదికగా జరగనున్న నాలుగో వన్డే.. ధోనీ కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్. ఈ రికార్డుతో పాటు మరో రెండు అరుదైన ఘనతలు కూడా ధోనీ ఖాతాలో చేరనున్నాయి. అందులో ఒకటి వికెట్‌ కీపర్‌గా.. మరొకటి మ్యాచ్ ఫినిషర్‌గా అతను సాధించిన విజయాలకి నిదర్శనంగా క్రికెట్ చరిత్రలో నిలవనున్నాయి.
డిసెంబరు 23, 2004లో వన్డే కెరీర్‌ని ఆరంభించిన ధోనీ ఇప్పటి వరకు 299 మ్యాచ్‌ల్లో 10 శతకాలు, 65 అర్ధశతకాలు సాధించాడు. ఈ సుదీర్ఘ కెరీర్‌లో మ్యాచ్ ఫినిషర్‌గా మంచి గుర్తింపు పొందిన ధోనీ.. 72 సార్లు నాటౌట్‌గా క్రీజులో నిలిచాడు. వన్డే చరిత్రలో ఇప్పటి వరకు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా), చమిందా వాస్ (శ్రీలంక) మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా గురువారం జరిగే నాలుగో వన్డేలో ధోనీ నాటౌట్‌గా నిలిస్తే.. 73తో అగ్రస్థానానికి చేరుకుంటాడు. మరోవైపు వికెట్‌ కీపర్‌గానూ ధోనీ ఇప్పటి వరకు 99 స్టంపింగ్‌లతో శ్రీలంక మాజీ వికెట్ కీపర్‌ కుమార సంగక్కర‌ని సమం చేశాడు. కొలంబో వన్డేలో ఒక స్టంపౌట్ చేయగలిగితే.. అక్కడా ధోనీ‌నే నెం.1.. కెరీర్‌లో 300వ వన్డే ఆడుతూ ధోనీ ఈ రికార్డులను అందుకోగలిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది భారత్ అభిమానికి..! | 2sports
|
Feb 14,2016
అత్యవసర వైద్య సేవలకు 'రైల్యాత్రి.ఇన్' యాప్
న్యూఢిల్లీ : ప్రయాణాల్లో ఉన్న సమయంలో అత్యవసర వైద్య సేవలను అందుకోవడానికి వీలుగా రైల్యాత్రి.ఇన్ మెడికల్ ఎమర్జేన్సీ ఫీచర్లతో నూతన యాప్ను ఆవిష్కరించింది. ప్రయాణికులు తాము ఉన్న ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు ఎక్కడ లభిస్తాయో ఈ యాప్ సమాచారం ఇస్తుందని రైల్యాత్రి.ఇన్ సహ వ్యవస్థపకులు మనిష్ రాఠి పేర్కొన్నారు. ఈ యాప్ను ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రయాణికులు అత్యవసర సమయాల్లో తమ ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా, తోటి ప్రయాణికులకు కూడా సహాయం అందించవచ్చన్నారు. ఆరోగ్య సమస్యలు కలిగిన వారు, దూర ప్రయాణాలు సాగించే వారి కోసం దీన్ని రూపొందించామన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Bathukamma Song: మంగ్లీ బత...
పెళ్లిచూపులు లాంటి హిట్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ 'ద్వారక' అనే సినిమాలో నటిస్తున్నాడు. పూజా జవేరి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్, పృధ్వీరాజ్, రఘుబాబు, కాళకేయ ప్రభాకర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈ సినిమాలోని 'భజరే నందగోపాల భజరే' అనే సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. మ్యూజిక్ బాగుంది. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Dwaraka | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘టాక్సీవాలా’ సాంగ్: ‘మాటే వినదుగా’.. విజయ్ పాటే వినాలిగా!
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్ జోడీగా జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సీవాలా’ చిత్రం నుండి ‘మాటే వినదుగా’ లవ్ మెలోడీ సాంగ్ను శుక్రవారం నాడు విడుదల చేసింది చిత్రయూనిట్.
Samayam Telugu | Updated:
Oct 26, 2018, 06:49PM IST
‘టాక్సీవాలా’ సాంగ్: ‘మాటే వినదుగా’.. విజయ్ పాటే వినాలిగా!
‘మాటే వినదుగ.. మినదుగ.. వినదుగ.. వేగం దిగదుగ... దిగదుగ’ అంటూ అద్భుతమైన లవ్ రొమాంటిక్ సాంగ్తో మాయ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇటీవల ‘ఇంకేం.. ఇంకేం.. కావాలే’ సాంగ్తో సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించిన విజయ్ మరోసారి తన అప్ కమింగ్ మూవీ ‘టాక్సావాలా’ నుండి అదిరిపోయే సాంగ్ను వినిపిస్తున్నాడు. జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సీవాలా’ చిత్రం నుండి ‘మాటే వినదుగా’ లవ్ మెలోడీ సాంగ్ను శుక్రవారం నాడు విడుదల చేసింది చిత్రయూనిట్. | 0business
|
- 100 శాతం డిజిన్వెస్ట్మెంట్
- ఇప్పటికే కేంద్రం ఆమోదం
- తాజాగా ఒఎన్జిసి బోర్డు కూడా అంగీకారం
న్యూఢిల్లీ : హెలీక్యాప్టర్ సేవల సంస్థ పవన్ హాన్స్ త్వరలోనే ప్రయివేటుపరం కానుంది. ఇందులోని 100 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం బిడ్డింగ్లను అహ్వానించనుందని దీంతో ప్రత్యక్ష సంబంధం కలిగిన అధికారులు పేర్కొన్నారు. కాగా ఇందులోని తమ పూర్తి వాటాను విక్రయించడానికి తాజాగా ఒఎన్జిసి బోర్డు ఆమోదం తెలిపింది. పవన్ హాన్స్లో కేంద్ర ప్రభుత్వానికి 51 శాతం, ఒఎన్జిసికి 49 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ కంపెనీకి 49 హెలీక్యాప్టర్లు ఉన్నాయి. ఇందులోని 51 శాతం వాటాను ఉపసంహరించుకోవడానికి గత ఏప్రిల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆసక్తి కలిగిన వారి నుంచి జూన్ 18 వరకు బిడ్లను అహ్వానించింది. దాదాపుగా ఆరు కంపెనీలు ఈ వాటా కొనుగోలుకు బిడ్లను దాఖలు చేసినప్పటికీ ఇందులో పురోగతి లేకుండా పోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంస్థ ప్రధానంగా హెలీ టూరిజంతో పాటు ఒఎన్జిసికి కీలక సేవలను అందిస్తుంది.
తాజాగా ఈ సంస్థలోని తమ వాటాను ఉపసంహరించుకోవడానికి ఒఎన్జిసి సిద్దం అయ్యింది. ఈ క్రమంలోనే జులై 2న కంపెనీ బోర్డు సమావేశంలో దీనిపై తీర్మాణం చేసింది. ప్రభుత్వం తన వాటా విక్రయిస్తున్న సమయంలోనే తమ వాటాను కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయాలని ఒఎన్జిసి ఇందులో పేర్కొంది. దీంతో త్వరలోనే పవన్ హాన్స్లోని 100 శాతం వాటా విక్రయానికి వీలుగా డాక్యూమెంట్లను రూపొందించనున్నామని ప్రభుత్వాధికారి ఒక్కరు తెలిపారు. పాత బిడ్లను రద్దు చేసి, పూర్తి వాటా విక్రయానికి కొత్త బిడ్లను అహ్వానించనున్నామన్నారు. ఇందులోని వంద శాతం వాటా కొనుగోలుకు ఇతర పెట్టుబడిదారులకు కూడా అవకాశం ఇవ్వనున్నామన్నారు.
పవన్ హాన్స్ డిజిన్వెస్ట్మెంట్కు స్ట్రాటజిక్ అడ్వైజర్గా ఎస్బిఐ కాపిటల్ మార్కెట్ వ్యవహారిస్తోంది. గతేడాది అక్టోబర్లోనే ఇందులోని వాటా విక్రయించాలని కేంద్రం ప్రయత్నించినప్పటికీ, బిడ్డర్ల నుంచి సరైన స్పందన రాకపోవడంతో గత ఏప్రిల్లో దీన్ని వెనక్కి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇందులోని వాటా విక్రయించినప్పటికీ ఒఎన్జిసికి వాటా ఉంటే తిరిగి సర్కార్ జోక్యం చేసుకునే అవకాశాలు ఉంటాయన్న ఆందోళనలో ఇన్వెస్టర్లు మొగ్గు చూపలేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఉన్న వాటాతో పాటు ఒఎన్జిసి కూడా విక్రయిస్తే పెట్టుబడిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉందన్న సూచనల మేరకు ఒఎన్జిసి కూడా తాజాగా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆ విధంగా కేంద్రం కూడా ఒఎన్జిసిపై డిజిన్వెస్ట్మెంట్కు ఒత్తిడి తెచ్చి ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లోని కీలక వాటాలను ఉపసంహరించుకోవడానికి మోడీ సర్కార్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
మధుర శ్రీధర్ కేసీఆర్ గా బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు
Highlights
తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితంపై సినిమా తీస్తానని ఇప్పటికే ప్రకటించిన మధుర శ్రీధర్
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును కేసీఆర్ గా ఎంచుకున్న మధుర శ్రీధర్
మధుర శ్రీధర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి
సిఎం కెసిఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కెసిఆర్ పాత్రలో నటించేది ఏవరు అనే దానిపై ఇన్నాళ్లు సస్పెన్స్న్ నెలకొంది. ఈ సస్పెన్స్కు తెరదించుతూ చిత్ర దర్శక నిర్మాతలు కెసిఆర్కు పాత్రకు బాలీవుడు యువ నటుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మధుర శ్రీధర్ డైరెక్షన్లో పెళ్లిచూపులు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ మూవీలో కెసిఆర్గా బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు నటించనున్నాడట. ఈ విషయాన్ని నిర్మాత రాజ్ తెలిపారు. కెసిఆర్ బాల్యం నుంచి రాజకీయ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆయన పోషించిన పాత్రతో పాటు ప్రస్తుతం సిఎంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న విధానాన్ని ఈ సినిమాలో చూపించన్నున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుందని దర్శకుడు మధుర శ్రీధర్ తెలిపారు. 2018, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మూవీని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉంది.
Last Updated 26, Mar 2018, 12:01 AM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వరుణ్ సందేశ్ ఔట్.. రూ. 20లక్షలు వద్దని బిగ్ బాస్ నుండి బయటకు
105 రోజుల పాటు జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 విజేతను ప్రకటించేందుకు సమయం ఆసన్నమైంది. ఫైనల్కి శ్రీముఖి, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, అలీలు వెళ్లగా అలీ ఎలిమినేట్ అయ్యి ఐదో స్థానంతో సరిపెట్టుకోగా.. వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయ్యి నాలుగో స్థానంలో నిలిచారు.
Samayam Telugu | Updated:
Nov 3, 2019, 08:29PM IST
వరుణ్ సందేశ్
బిగ్ బాస్ సీజన్లో ఫినాలే రంజుగా సాగుతోంది. సాయత్రం 6 గంటల నుండి స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ షోలో తారల తళుకులతో పాటు సెలబ్రిటీల పెర్ఫామెన్స్తో బిగ్ బాస్ హౌస్ను హోరెత్తిస్తున్నారు. ఇక ఫైనల్లో ఉన్న ఐదుగురిలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు మొదటిగా ఫైనల్లో అలీ, రాహుల్, వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్లలో అలీ ఎలిమినేట్ అయ్యి ఐదోస్థానంలో సరిపెట్టుకోగా.. వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయ్యి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.
ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంట్రస్టింగ్..
ఇక ఫైనల్కి చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్లో అలీ రెజా ఎలిమినేట్ అయ్యి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక మిగిలిన నలుగురు వరుణ్, బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్లో మరో కంటెస్టెంట్ను ఎలిమినేట్ చేయడానికి హీరో శ్రీకాంత్ను రంగంలోకి దింపారు నాగార్జున.
మొదట బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చి షూటింగ్ అయినా మానేస్తా కాని బిగ్ బాస్ షో చూడటం మాననని అన్నారు శ్రీముఖి. ఈ సీజన్లో నాకు పునర్నవి అంటే ఇష్టం అని చెప్పారు. అనంతరం హోస్ట్ నాగార్జున.. హౌస్లో ఉన్న నలుగురిలో ఒకర్ని ఎలిమినేట్ చేయడం కోసం శ్రీకాంత్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. ఇందులో కోసం ప్లాన్ ఎ, బి, సిలు ప్రతిపాదించారు.
ప్లాన్ ఎ.. పది లక్షలు..
శ్రీకాంత్ రూ. 10 లక్షల సూట్ కేసుతో బిగ్ బాస్ హౌస్కి వెళ్లారు. హౌస్లో ఉన్న నలుగురిలో ఒకరు ఈ పది లక్షల సూట్ కేస్ తీసుకుని బయటకు వెళ్లిపోవచ్చిన బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్, రాహుల్లు ఎవరూ వెనక్కి తగ్గలేదు.
ప్లాన్ బి.. మరో 10 లక్షలు
ప్లాన్ ఎ వర్కౌట్ కాకపోవడంతో ప్లాన్ బి ప్రవేశపెట్టారు. దీన్ని ప్రకారం మరో 10 లక్షల ఆఫర్ ఇచ్చారు. మరో సూట్ కేసుని తీసుకువచ్చి మొత్తం రూ. 20 లక్షలు ఉన్నాయని వీటిని తీసుకుని ఇప్పుడు డ్రాప్ కావొచ్చని మరో ఆఫర్ ఇచ్చారు. అయినప్పటికీ ఈ నలుగురు వెనక్కి తగ్గలేదు.
ప్లాన్ సి.. రంగంలోకి కేథరిన్
ప్లాన్ సి ప్రవేశపెట్టడం కోసం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది కేథరిన్. ఆమెకు ఒక కవర్ ఇచ్చి ఆ కవర్లో ఒక పేరు ఉంటుందని ఆ పేరును చదవాలని కోరడంతో ఆ కవర్ను హీరో శ్రీకాంత్కి అందించి మరింత ఉత్కంఠకు గురి చేసింది కేథరిన్. ఫైనల్గా ఆ కవర్లో వరుణ్ సందేశ్ పేరు ఉండటంతో అతన్ని తీసుకుని బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చేశారు శ్రీకాంత్, కేథరిన్లు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
వారసుడి కోసం ఇంట్లో ప్రెజర్ పెరిగిందని చెప్పకనే చెప్తున్న రామ్ చరణ్
Highlights
రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లై ఐదేళ్లు పూర్తి
ఇంకా వారసున్నివ్వని మెగా కోడలు ఉపాసన
వారసుని కోసం నాన్న ఇకపై ప్రెజర్ పెడతారేమో అంటున్న చెర్రీ
రామ్ చరణ్- ఉపాసన దంపతులకు వివాహం జరిగి ఐదేళ్లయిపోయింది. అయితే మెగా అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నా... ఇంకా బుల్లి మెగా వారసుడు అతను తండ్రి కాలేదు. పోయినేడాదే చరణ్ తండ్రి కాబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ వాటిని చరణ్ ఖండించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడాడు చరణ్. వారసులు కావాలంటూ ఇప్పటిదాకా ఇంట్లో తమ మీద ప్రెజర్ ఏమీ లేదన్నాడు చరణ్. ఐతే భవిష్యత్తులో తన తండ్రి వారసుల కోసం అడగొచ్చేమో అని చరణ్ వ్యాఖ్యానించాడు.
ఇక ఉపాసనతో తన ప్రేమ, పెళ్లి గురించి స్పందిస్తూ.. తనతో ప్రేమ సంగతి పెళ్లికి ఎనిమిది నెలల ముందు తన తండ్రికి చెప్పానన్నాడు. వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకున్నారా అని ఒకటే మాట అడిగారని.. ఔననగానే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చరణ్ వెల్లడించాడు.
ఇక తమ తల్లిదండ్రుల వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. "మా అమ్మ మోస్ట్ హ్యాపియెస్ట్ లేడీ. నాన్న 30-40 మంది హీరోయిన్లతో పనిచేశారు. కానీ అమ్మను ఎప్పుడూ ఇబ్బంది పడనివ్వలేదు. అమ్మ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. సుహాసిని, రాధ, సుమలత లాంటి చాలామంది హీరోయిన్లతో చాలా సినిమాలు చేశారు. వాళ్లందరూ కూడా అమ్మతో బాగా మాట్లాడతారు. హీరోయిన్ల విషయంలో నాన్న నాకు కూడా కొన్ని సలహాలిచ్చారు" అని చరణ్ తెలిపాడు.
Last Updated 25, Mar 2018, 11:59 PM IST | 0business
|
ఎయిర్టెల్ కాదు.. జియోనే టాప్
October 23, 2019, 20:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం జియో ఇంటర్నెట్ డౌన్లోడ్ వేగంలో మరోసారి తనస్థానాన్ని నిలబెట్టుకుంది.భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) విడుదల...
ఇన్ఫీలో రగిలిన వివాదంపై సెబీ దృష్టి
October 23, 2019, 19:35 IST
ముంబై: టెక్ సేవల సంస్థ ఇన్ఫోసిస్లో రగిలిన వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేలా సూచనలు కనిపించడంలేదు. కార్పొరేట్ గవర్నెన్స్పై ఇన్ఫోసిస్ సీఈవో సలిల్...
October 23, 2019, 16:22 IST
అల్జీమర్స్కు ఇదో అద్భుతమని చెప్పవచ్చని బయోజెన్ సీఈవో మైఖేల్ వోనత్సోస్ అన్నారు.
భారతీయులకు ఉబెర్ సీఈవో హెచ్చరిక
October 23, 2019, 14:39 IST
సాక్షి, న్యూడిల్లీ: భారతీయ కార్ల కొనుగోలుదారులకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఆసక్తికరమైన హెచ్చరిక చేశారు. కొత్త కార్లను...
ఆగి..చూసి..కొందాం..
October 23, 2019, 11:49 IST
సాక్షి, సిటీబ్యూరో: దసరా, దీపావళి పండగలొచ్చాయంటే చాలు... ఏ ఇంట్లో చూసినా కొత్తదనం ఉట్టిపడుతుంది. చాలామంది పండగల సందర్భంగా ఏదో ఒక వస్తువు కొనుగోలు...
కోటక్ లాభం 2,407 కోట్లు
October 23, 2019, 04:47 IST
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.2,407 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్)...
యాక్సిస్ నష్టం రూ.112 కోట్లు
October 23, 2019, 04:40 IST
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.112 కోట్ల నికర నష్టాలు (స్టాండ్అలోన్) వచ్చాయి....
ఇన్ఫోసిస్..ఇన్వెస్టెర్రర్!
October 23, 2019, 03:17 IST
న్యూఢిల్లీ: ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ స్వయంగా సీఈవో సలిల్ పరేఖ్పై వచ్చిన ఆరోపణలతో ఐటీ దిగ్గజం...
ధంతేరస్ : కార్లపై భారీ డిస్కౌంట్లు
October 22, 2019, 21:01 IST
సాక్షి, ముంబై: ధంతేరస్ సందర్భంగా కొత్త కారును కొందామని ప్లాన్ చేస్తున్నారా. లేదంటే ప్రస్తుత కారును మార్పిడి చేసి కొత్త కారును ఇంటికి తెచ్చుకోవాలని...
జియో కొత్త ప్యాకేజీలు
October 22, 2019, 05:01 IST
న్యూఢిల్లీ: ఇంటర్కనెక్ట్ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధింపుపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో టెలికం సంస్థ రిలయన్స్ జియో సవరించిన కొత్త టారిఫ్...
ఇన్ఫీలో మరో దుమారం!
October 22, 2019, 04:44 IST
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ‘అనైతిక విధానాల’ ఆరోపణల్లో చిక్కుకుంది. సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్వో నీలాంజన్ రాయ్ స్వల్పకాలికంగా ఆదాయాలు...
మరో వివాదంలో ఇన్ఫోసిస్
October 21, 2019, 16:46 IST
సాక్షి,ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. కంపెనీ రాబడి, లాభాలని అధికంగా చూపేందుకు ఉన్నతాధికారులు...
దిగి వచ్చిన జియో : కొత్త రీచార్జ్ ప్లాన్లు
October 21, 2019, 14:52 IST
సాక్షి, ముంబై : ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త మంత్లీ ప్లాన్లను లాంచ్ చేసింది. ఇటీవల నిమిషానికి 6 పైసల చార్జీల వడ్డనపై నిరసనలు...
రిలయన్స్ బోర్డులోకి మాజీ సీవీసీ
October 19, 2019, 19:33 IST
సాక్షి, ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోకి అవినీతి నిరోధక శాఖ మాజీ అధికారి కేవీ చౌదరి చేరారు. ఈ...
ఈ స్వీట్ బాంబులు..హాట్ కేకులే!
October 19, 2019, 18:22 IST
సాక్షి,జోధ్పూర్ : దీపావళి అంటేనే స్వీట్లు, క్రాకర్స్ పండుగ. అయితే ఈ దీపావళి పండుగకు కూడా ఉత్త లడ్డూలు, జిలేబీలు, జామూన్లు ఏంటి బోర్... సమథింగ్...
అమెజాన్ దివాలీ సేల్ : టాప్ బ్రాండ్స్, టాప్ డీల్స్
October 19, 2019, 17:04 IST
సాక్షి, బెంగళూరు: అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ - దీపావళి స్పెషల్ సేల్ను శనివారం ప్రకటించింది. అక్టోబర్ 21 అర్థరాత్రి నుంచి 25వ...
స్విగ్గీ గుడ్ న్యూస్ : 3 లక్షల ఉద్యోగాలు
October 19, 2019, 16:20 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ భారీ ప్రణాళికలతో వస్తోంది. తన ప్రత్యర్థులకు ధీటుగా వినియోగదారులకు సేవలందించడంతోపాటు, ...
వన్ప్లస్ టీవీలపై రిలయన్స్ ఆఫర్
October 19, 2019, 14:16 IST
సాక్షి, ముంబై : చైనా సంస్థ వన్ప్లస్ దేశీయ నెంబర్ వన్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ రిలయన్స్ డిజిటల్ తో మరోసారి కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ...
రిలయన్స్ ‘రికార్డు’ల హోరు!
October 19, 2019, 04:19 IST
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రికార్డ్ స్థాయి లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో...
ఓలా సెల్ఫ్ డ్రైవ్ సేవలు ప్రారంభం
October 18, 2019, 13:54 IST
న్యూఢిల్లీ: ట్యాక్సీ ఆగ్రిగేటర్ ఓలా.. తాజాగా సెల్ఫ్ డ్రైవ్ సేవలను ప్రారంభించింది. ‘ఓలా డ్రైవ్’ పేరిట తొలుత బెంగళూరులో ఈ సేవలను అందుబాటులోకి...
సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ
October 18, 2019, 04:50 IST
వాషింగ్టన్: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఆర్థిక సంవత్సరంలో 42.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 305 కోట్లు) ప్యాకేజీ...
మెర్సిడెస్ బెంజ్ జీ-క్లాస్ లగ్జరీ కారు
October 16, 2019, 17:04 IST
సాక్షి, ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో లగ్జరీ ఆఫ్-రోడ్ వాహనాల్లో క్లాస్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (...
సరికొత్తగా హమారా బజాజ్ స్కూటర్ చేతక్
October 16, 2019, 16:17 IST
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన పాపులర్మోడల్ చేతక్ స్కూటర్ను...
రూ. 2 వేల నోటు కనబడుటలేదు!!
October 16, 2019, 02:18 IST
న్యూఢిల్లీ: ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు ఈ మధ్య కాలంలో అంతగా రాకపోవడాన్ని గమనించారా...? గతంలో పెద్దమొత్తంలో నగదు తీస్తే కచ్చితంగా ఎక్కువ సంఖ్యలోనే రూ.2...
మార్కెట్లోకి మరో సూపర్ టీవీ వచ్చేసింది
October 15, 2019, 19:23 IST
సాక్షి, ముంబై: దేశీయ టీవీ మార్కెట్లో సూపర్ టీవీ లాంచ్ చేసింది. ప్రపంచంలోనే తొలి 100 అంగుళాల 4కే ఎల్ఈడీ టీవీ భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన వూ...
అంచనాలు దాటేసిన విప్రో : 36 శాతం ఎగిసిన లాభం
October 15, 2019, 16:18 IST
సాక్షి, ముంబై : దేశీయ ఐటీ దిగ్గజం విప్రో రెండవ త్రైమాసిక ఫలితాలను మంగళవారం వెల్లడించింది. విశ్లేషకుల అంచనాలను మించి ఫలితాలను నమోదు చేసింది. ...
9 రోజుల్లో రూ.81,700 కోట్ల రుణాలు
October 15, 2019, 00:36 IST
న్యూఢిల్లీ: పండుగుల సీజన్లో మార్కెట్లో రుణ వితరణ పెంచడం ద్వారా డిమాండ్కు ఊతం ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... అక్టోబర్ 1 నుంచి 9 వరకు...
ఎయిర్టెల్ సెట్-టాప్ బాక్స్ల ధర తగ్గింపు
October 14, 2019, 19:58 IST
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కొత్త చందాదారులకోసం ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం తాజాగా హెచ్డి, ఎస్డి సెట్-టాప్ బాక్స్ల ధరలను...
జియో దెబ్బ : ఎగిసిన ఎయిర్టెల్
October 14, 2019, 18:41 IST
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ మళ్లీ ఫాం లోకి వస్తోంది. టెలికాం మార్కెట్లోకి జియో ఎంట్రీతో టారిప్ వార్లో భారీగా ...
అదానీ గ్యాస్తో ఫ్రెంచ్ దిగ్గజం డీల్
October 14, 2019, 17:16 IST
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజ ఇంధన కంపెనీ అదానీ గ్యాస్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్ఏ గ్యాస్ పంపిణీ సంస్థ అదానీ... | 1entertainment
|
సమరానికి సిద్ధమైన భారత్-పాక్.. సెప్టెంబర్ 19న దాయాదుల పోరు
Highlights
అబుదాబి, దుబాచ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియాకప్ షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. సెప్టెంబర్ 19న పాకిస్తాన్తో భారత్ తలపడనుంది
క్రికెట్లో అసలు సిసలు మజాను ఆస్వాదించాలంటే కొన్ని దేశాల మధ్య జరిగే మ్యాచ్లు చూడాల్సిందే. వాటిలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం అటువైపే ఉంటుంది. బాల్ టూ బాల్ నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగుతుంది. గతేడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇరు దేశాలు మళ్లీ తలపడలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు నిర్వహించడానికి భారత ప్రభుత్వం బీసీసీఐకి అనుమతి నిరాకరించింది.
ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఊసురుమన్నారు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించాలని ప్రయత్నించిన్పటికీ కేంద్రప్రభుత్వం ససేమీరా అంది. అయితే తిరిగి అభిమానుల కోరిక తీర్చేందుకు ఆసియా కప్ వేదికయ్యింది. అబుదాబి, దుబాచ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియాకప్ షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది.
సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ తలపడుతుండగా.. మరోస్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేసియా, హంకాంగ్లు పోటీపడనున్నాయి. పాకిస్తాన్, క్వాలిఫయిర్, భారత్ గ్రూప్-ఎ లో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లు గ్రూప్-బి లో ఉన్నాయి. సెప్టెంబర్ 18న భారత్, క్వాలిఫయిర్తో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం సెప్టెంబర్ 19న పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 28న దుబాయ్లో ఫైనల్ జరుగుతుంది. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
హృతిక్ మెయిల్స్లో వాస్తవం లేదు -కంగనా లాయర్
ట్విస్టుల మీద స్విస్టులతో రోజుకో మలుపు తిరుగుతున్న హృతిక్ రోషన్-కంగనా రనౌత్ల కేసు ఎప్పటికప్పుడు పరిశీలకులకి షాక్ల
TNN | Updated:
Apr 23, 2016, 06:28PM IST
ట్విస్టుల మీద స్విస్టులతో రోజుకో మలుపు తిరుగుతున్న హృతిక్ రోషన్-కంగనా రనౌత్ల కేసు ఎప్పటికప్పుడు పరిశీలకులకి షాక్ల మీద షాక్లు ఇస్తూనే వుంది. గతంలో కంగనా తనకి పంపించిన ఈమెయిల్స్ ఇవి అంటూ తాజాగా హృతిక్ కొన్ని ఈమెయిల్స్ని బహిర్గతం చేయడం ఈ ఎపిసోడ్లో మరో కొత్త మలుపుకి కారణమైంది. ఈ మెయిల్స్ లీకైన కొద్ది రోజుల తర్వాత మెయిల్స్లోని అంశాలపై స్పందిస్తూ కంగనా తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ తాజాగా మరో స్టేట్మెంట్ విడుదల చేశారు. ఓపిగ్గా న్యాయపోరాటం చేయకుండా ఇలా ఓ ప్రైవేటు ఫోరెన్సిక్ రిపోర్టు సహాయంతో వాస్తవాలు లేని ఈమెయిల్స్ని లీక్ చేయడం ద్వారా చట్టంపై తనకి నమ్మకం లేదని హృతిక్ పరోక్షంగా అంగీకరించారు. అంతేకాకుండా నా క్లయింట్ కంగనా పరువు ప్రతిష్టలకి భంగం కలిగించేందుకు ఎంతటిపని చేయడానికైనా సిద్ధమేనని హృతిక్ ఈ ఘటనతో నిరూపించుకున్నాడు అని సిద్ధిఖీ ఈ స్టేట్మెంట్లో ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా కంగనాని భయపెట్టవచ్చని హృతిక్ భావిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే హృతిక్ రోషన్ తన మెయిల్స్ హ్యాక్ చేశాడంటూ కంగనా గతంలోనే అతడి తండ్రికి ఫిర్యాదు చేసిన వైనాన్ని ఆమె కౌంటర్ నోటీసులోనే పేర్కొంది. హృతిక్ రోషన్ తన ఎకౌంట్స్ హ్యాక్ చేస్తున్నాడంటూ నా క్లయింట్ కంగనా ఫిర్యాదు చేసిన తర్వాత చాలా రోజులకి హృతిక్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు. అంటే ఆయన లీక్ చేసిన మెయిల్స్కి విశ్వసనీయత లేదని ఇక్కడే అర్థమవుతోంది అని సిద్ధిఖీ అభిప్రాయపడ్డారు.
అన్నింటికి మించి ముఖ్యంగా తన పేరుపై గుర్తుతెలియని ఓ ఇంపోస్టర్ మెయిల్ కమ్యునికేషన్ చేస్తున్నాడు అని ఫిర్యాదు చేసిన హృతిక్ వద్ద ఈ మెయిల్స్ ఎలా వున్నాయో గ్రహించాల్సిన అవసరం వుంది. ఈ మెయిల్స్ అన్నీ కూడా తర్వాత అవసరానికి ఉపయోగించుకునేందుకు వీలుగా సృష్టించినవిగా వున్నాయి. అంతేకాకుండా నా క్లయింట్ కంగనాకి హృతిక్ రోషన్తో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా గత ఏడేళ్లుగా పరిచయం వుంది. కానీ హృతిక్ రోషన్ అండ్ గ్యాంగ్ మీడియాకు బహిర్గతం చేసిన ఈ మెయిల్స్ మాత్రం అందుకు విరుద్ధంగా వున్నాయి. దీనికితోడు నా క్లయింట్ కంగనాకి తనకి మధ్య ఎటువంటి యుద్ధం లేదని చెప్పిన హృతిక్ రోషన్ ఎందుకు తన నోటీసుని ఉపసంహరించుకుని ఈ లీగల్ ఫైట్కి ఫుల్ స్టాప్ పెట్టడం లేదో జవాబు చెప్పాలి. ఇదంతా పరిశీలిస్తే హృతిక్ ఎలా వ్యవహరిస్తున్నాడో పబ్లిక్కి ఇప్పటికే అర్థమైపోయి వుంటుంది. అందుకే హృతిక్ ముందుగా నా ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పిన తర్వాతే తాను నిరపరాధిని అని నిరూపించుకోవాలి అని సిద్ధిఖీ ఈ స్టేట్మెంట్ ద్వారా డిమాండ్ చేశారు. | 0business
|
Visit Site
Recommended byColombia
ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. ధ్రువ్ (145: 294 బంతుల్లో 21x4) సెంచరీ చేసినా తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు వాడ్కర్ శతకం, టెయిలెండర్లు ఆదిత్య (79), సిద్దేశ్ (74) కీలక భాగస్వామ్యాల సాయంతో తొలి ఇన్నింగ్స్‌లో 547 పరుగులు చేసింది. దీంతో 252 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో ఒత్తిడిలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ జట్టు ఆశించిన మేర రాణించలేకపోయింది. ఆ జట్టులో గౌతమ్ గంభీర్ (36), నితీశ్ రాణా (64), రిషబ్ పంత్ (32) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో 280 పరుగులకే ఢిల్లీ కుప్పకూలిపోయింది. దీంతో 29 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ కేవలం 5 ఓవర్లలోనే 32/1తో విజయం సాధించి గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.