news
stringlengths
299
12.4k
class
class label
3 classes
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV RRRలో సముద్రఖని.. ఎలా ఎంపికచేశారో చెప్పిన తమిళ దర్శకుడు తాను ‘RRR’లో నటిస్తుండటంపై సముద్రఖని స్పందించారు. ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను రాజమౌళి ఎంపిక చేసిన విధానాన్ని చెప్పారు. Samayam Telugu | Updated: Jan 24, 2019, 02:35PM IST తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ‘బాహుబలి’లో చేసిన కట్టప్ప పాత్రకు ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు సత్యరాజ్‌కు ఉన్న క్రేజ్ ఒక ఎత్తయితే.. కట్టప్ప పాత్ర చేసిన తరవాత ఆయన ఇమేజ్ మరో ఎత్తు. ఈ ఒక్క పాత్రతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు సత్యరాజ్. ఇప్పుడు అంత ప్రాధాన్యత ఉన్న మరో పాత్రను ‘RRR’లో రాజమౌళి డిజైన్ చేశారట. ఆ పాత్రకు తమిళ దర్శకుడు, నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సముద్రఖనిని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా సముద్రఖని తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాను ‘RRR’లో నటిస్తుండటంపై సముద్రఖని స్పందించారు. ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను రాజమౌళి ఎంపిక చేసిన విధానాన్ని చెప్పారు. ‘నా సినిమా నడోడిగల్ చూసిన తరవాత రాజమౌళి సార్ నాకు ఒక పెద్ద మెసేజ్ పంపారు. అప్పటి నుంచి మేమిద్దం టచ్‌లో ఉన్నాం. ఇటీవల ఆయన ఇంటికి నన్ను ఆహ్వానించారు. ఆయన కుటుంబసభ్యులను నాకు పరిచయం చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో నన్ను ఓ ప్రధాన పాత్రలో నటించమని అడిగారు. నేను వెంటనే అంగీకరించాను’ అని సముద్రఖని వివరించారు.
0business
Hyderabad, First Published 27, Jun 2019, 10:06 AM IST Highlights నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్న విజయనిర్మలగారు తిరిగిరాని లోకాలకు వెళ్లడం తెలుగు పరిశ్రమకు తీరని లోటు అని జీవితా రాజశేఖర్ అన్నారు.  నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్న విజయనిర్మలగారు తిరిగిరాని లోకాలకు వెళ్లడం తెలుగు పరిశ్రమకు తీరని లోటు అని జీవితా రాజశేఖర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆమె అన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "మనసున్న మనిషి అనడానికి నిలువెత్తు నిదర్శనం విజయనిర్మలగారు. ఎంతోమందికి సహాయం చేశారు. ఆవిడ ఒక లెజెండ్. లెజెండ్ అని అనిపించుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. మహిళలకు పెద్ద స్ఫూర్తి. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆవిడ సాధించిన విజయాలు అసామాన్యం. ఆవిడతో ఎవరినీ కంపేర్ చేయలేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆవిడతో కంపేర్ చేయదగ్గ వాళ్లు ఎవరూ పుట్టలేదేమో. విజయ నిర్మలగారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో 'మీనా' నాకు చాలా ఇష్టం. అది పక్కన పెడితే... 'దేవుడే గెలిచాడు' అని ఒక దెయ్యం సినిమా తీశారు. నా చిన్నప్పుడు వచ్చిన ఆ చిత్రాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే, ఆవిడ నటించిన 'అల్లూరి సీతారామరాజు' నాకు ఇష్టమైన చిత్రాల్లో ఒకటి. రీసెంట్‌గా కృష్ణగారి పుట్టినరోజుకి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆవిణ్ణి కలిశాం. అప్పటికి కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో హాస్పిటల్ లో ఉన్నారామె. అయినా మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆవిణ్ణి ఎప్పుడూ ఒక ఆడపులిలా చూసేవాళ్లం. అటువంటిది ఇబ్బంది  పడుతూ నడవటం చూసి చాలా బాధగా అనిపించింది. ఇంత త్వరగా మనందరినీ విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు. విజయనిర్మలగారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇప్పుడు కృష్ణగారి గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఆవిణ్ణి ఎక్కువగా మిస్ అయ్యేవ్యక్తి ఆయనే. ఒకరినొకరు అర్ధం చేసుకుని, ఒకరిని మరొకరు వదలకుండా అండ‌ర్‌స్టాండింగ్‌తో కృష్ణ, విజయనిర్మల దంపతులు ఉండేవారు. ఇద్దరి దాంపత్యం ఎంతోమందికి స్ఫూర్తి. కృష్ణగారికి, నరేష్ కి భగవంతుడు కొండంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
0business
Dec 15,2016 దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజల కొనుగోళ్లు తగ్గడంతో ఈ ఏడాది నవంబర్‌ మాసంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ 3.15 శాతానికి దిగివచ్చింది. ఇంతక్రితం మాసంలో ఇది 3.39 శాతంగా చోటు చేసుకుంది. నవంబర్‌ 8 నుంచి పెద్ద నోట్ల మార్పిడి వల్ల అహారోత్పత్తుల కొనుగోళ్లు పడిపోవడంతో ద్రవ్యోల్బణం మరింత తగ్గిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇంధన, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం పెరిగింది. అహార్పోత్తుల ద్రవ్యోల్బణం సూచీ 3.31 శాతం నుంచి 1.25 శాతానికి పడిపోయింది. కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. ఇంధన, విద్యుత్‌ ధరలు మాత్రం 6.18 శాతం నుంచి 7.07 శాతానికి పెరిగాయి. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.67 శాతం నుంచి 3.20 శాతానికి హెచ్చించాయి. మొత్తం టోకు ద్రవ్యోల్బణం సూచీలో తయారీ, ఇంధన ఉత్పత్తుల వాటా అత్యధికంగా 79 శాతంగా ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 93 పాయింట్లు నష్టపోయి 26,560 వద్ద ముగిసింది. నిఫ్టీ 31 పాయింట్లు నష్టంతో 8,193 వద్ద ముగిసింది... TNN | Updated: Dec 1, 2016, 04:18PM IST స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 93 పాయింట్లు నష్టపోయి 26,560 వద్ద ముగిసింది. నిఫ్టీ 31 పాయింట్లు నష్టంతో 8,193 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్, టెలికాం మరియు ఆటోమొబైల్ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. హెచ్డీఎఫ్సీ , ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఐడియా, భారతీ ఎయిర్ టెల్, ఎం అండ్ ఎం, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. కాగా.. హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. రిలయన్స్, సన్ ఫార్మా, సిప్లా, డా. రెడ్డీస్ లుపిన్ తదితర షేర్లు లాభపడ్డాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 68.31 వద్ద స్థిరపడింది. స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
సంక్రాంతికి రానున్న బాలకృష్ణ 102వ చిత్రం టైటిల్ ఖరారు Highlights కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ 102వ సినిమా సి.,కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు "జైసింహ" టైటిల్ ఖరారు నవంబర్ 1న ఫస్ట్ లుక్, సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‌ 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే. బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి "జై సింహా" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12, 2018న విడుదల చేయాలని నిర్మాత సి.కళ్యాణ్ నిర్ణయించారు.       ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "సెన్సేషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణగారు హీరోగా ఆయన 102వ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి "జై సింహా" అనే టైటిల్ ను ఫిక్స్ చేశాం. నవంబర్ 1న సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి.. జనవరి 12న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్ లో 5000 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో "మహా ధర్నా" సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. ఇదే షెడ్యూల్ లో బాలకృష్ణ-హరిప్రియలపై ఓ రోమాంటిక్ సాంగ్ తోపాటు, బాలయ్యపై ఓ మాంటేజ్ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్ లో "సింహా" అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినట్లుగానే.. "జై సింహా" కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం" అన్నారు.   బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ,  ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి,  ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!
0business
Hyderabad, First Published 10, Jul 2019, 12:39 PM IST Highlights అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలకు కొత్త సమస్య తెచ్చిపెట్టాడు.    అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలకు కొత్త సమస్య తెచ్చిపెట్టాడు. వాళ్లు అతన్ని తలుచుకుని గోలెత్తిపోతున్నాడు. ఏకంగా 35 కోట్లా అని తమలో తాము మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంతకీ సందీప్ వాళ్లకు చేసిన  అన్యాయం ఏమిటి...ఆ గోలేంటి అని ఆరా తీస్తే...అర్జున్ రెడ్డి  సినిమాతో విజయ్ దేవరకొండను తెలుగులో సూపర్ స్టార్ ని చేసాడు. అదే విధంగా హిందీలోనూ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ ని సూపర్ స్టార్ ని చేసాడు. అతని కెరీర్ లో అతి పెద్ద హిట్ సినిమాగా కబీర్ సింగ్ నమోదు అయ్యింది. షాహిద్ గత చిత్రాల కలెక్షన్స్ కు నాలుగు రెట్లు కలెక్ట్ చేసి 300 కోట్ల క్లబ్ లో ఈ సినిమా జాయిన్ అయ్యింది. గతంలో అతను చేసిన కమీనే, ఉడ్తా పంజాబ్ వంటి చిత్రాలు తెచ్చిన క్రేజ్ ని నాలుగైదు రెట్లు పెంచింది. నెక్ట్స్ లెవిల్ కు షాహిద్ ని ఈ సినిమా తీసుకెళ్లింది.  దాంతో యధావిధిగా షాహిద్ కపూర్ తన రెమ్యునేషన్ ని పెంచేసాడు. సినిమాకు 35 కోట్లు దాకా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.  అలాగే ఆల్రెడీ కమిటైన ప్రాజెక్టులు వాళ్లు కూడా అదే రెమ్యునేషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. బాలీవుడ్ లో షాహిద్ వంటి స్టార్ కు 35 కోట్లు అనేది అతి పెద్ద మొత్తం. దాంతో నిర్మాతలు తల పట్టుకు కూర్చున్నారట. దక్షిణాది నుంచి వచ్చిన డైరక్టర్ ఇచ్చిన హిట్...ఇలా తమకు దెబ్బకొడుతుందని ఊహించలేందంటున్నారట. అయితే సరే షాహిద్ కపూర్ డేట్స్ కోసం ఎగబడుతున్నారట. మరో ప్రక్క హీరో లు అది డైరక్టర్ సినిమా అంటూ సందీప్ వంగతో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. అలా కబీర్ సింగ్ తన విన్యాసం బాలీవుడ్ లో కొనసాగిస్తున్నాడు. Last Updated 10, Jul 2019, 12:40 PM IST
0business
sbi మూడోత్రైమాసికం నుంచే విలీనం ఫలితాలు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బిఐలో అనుబంధ బ్యాంకుల విలీనం ద్వారా ఒనగూరేప్రయోజనాలు ఇప్పటికిప్పుడు ఉండబోవని 2017-18 ఆర్థిక సంవత్సరం మూడోత్రైమాసికం నుంచే సానుకూల ఫలితాలు చూడగలమని ఎస్‌బిఐ ఎండి దినేష్‌కుమార్‌ ఖారా వెల్లడించారు. బ్యాంకు మార్కెట్‌ వాటా ప్రస్తుతం ఉన్న 17శాతం నుంచి 23శాతానికి పెరుగుతుందని అంచనా. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి బ్యాంకు విలీనం అమలులోకి వస్తుంది. వీటిఫలితాలు ప్రాథమికంగా వచ్చే రెండుత్రైమాసికాల్లో కనిపించవని మూడోత్రైమాసికంనుంచే వెలుగులోనికి వస్తాయన్నది బ్యాంకు ఎండి అభిప్రాయం. విలీనం వల్ల కొన్ని కేటగిరీల్లో ఎస్‌బిఐకి వ్యయభారం పెరుగు తుంది. ఈవిలీనంతో తాత్కాలికంగా పెరగక తప్పవని తొలిత్రైమాసికంలో కనంపించకపోయినా క్రమేపీ స్పష్టం అవుతుందని బ్యాంకు భావిస్తోంది. రెండో త్రైమాసికంలో కొంత ఖర్చుతగ్గుతుంది. ఎందుకంటే 47శాతం అనుబంధశాఖలను తొలగించే అంశం ఉం టుంది. అలాగే రీజినల్‌ కార్యాలయాలు కూడా కొన్ని తగ్గించుకోవడం వల్ల బ్యాంకు కార్యాలయాలోంల ఎక్కువ అదనపు భారం తగ్గుతుందని అంచనా. బ్యాంకు జోన్లను క్రమబద్ద్ధీకరించడం వల్ల కొంతవరకూ ఖర్చులు అదుపులో ఉంటాయి. భారత్‌లో ఎస్‌బిఐ స్థిరాస్తులు 30.72 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం గ్లోబల్‌ ర్యాంకింగ్‌లో 64వ స్థానంలో ఉంది. విలీనం తర్వాత రూ.40 లక్షల కోట్లకు పెరుగుతాయి. టాప్‌ 50 బ్యాంకుల్లో ఒకటిగా ఉంటుందని ఎస్‌బిఐ ముఖ్య ఆర్ధికవేత్త సౌమ్యకాంతిఘోష్‌ ంచనాలయితే బ్యాంకు 45వ ర్యాంకులో ఉంటుందని అంచనా. 45 కోట్ల మందికిపైగా కస్ట మర్లు ఉంటారు. 25 లక్షల కోట్ల డిపాజిట్లు, 19 లక్షలకోట్ల అడ్వాన్సులు ఉం టాయి. 44 లక్షల కోట్లతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తోంది. ఇక బ్యాంకు విదేశాల నుంచి కూడా నిధులు సమీకరించుకునే అవకాశం ఉంటుంది. అనుబంధ బ్యాంకులతో కలిపి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.70 లక్షలమందిగా ఉన్నారు. ఐదు అసోసియేట్‌ బ్యాంకులనుంచి 70వేల మంది వస్తారు. ఎస్‌బిఐ సొంతంగా 58 వేల ఎటిఎంలు 24వేల శాఖలు ఉన్నాయి. కొన్ని ఎటిఎంలను క్రమబద్ధీకరిస్తామని ఎండి వెల్లడిం చారు. శాఖల సంఖ్య, ఎటిఎంల సంఖ్యలో మార్పులుండవని క్రమబద్ధీకరించడం జరుగుతుం దని ఎండి వివరించారు. విలీనంతోపాటు ఎన్‌పిఎలు కూడా పెరుగుతున్నాయి. డిసెంబరు లో మొత్తం 8.70శాతం ఎన్‌పిఎలున్నాయి. నికరంగాచూస్తే 5.33శాతంగా ఉన్నాయి. అసోసియేట్‌ బ్యాంకుల రికార్డులు చూస్తే ఎన్‌పిఎ లను కార్పొరేట్ల ఈక్విటీలుగా మారుస్తూ కొంత రికవరీచేస్తోంది. ఎన్‌పిఎల రికవరీకి బ్యాడ్‌బ్యాంక్‌ స్థాపన మంచిదేనన్నారు. ఈ ఆర్ధ్థిక సంవత్సరంలోనే బ్యాంకు ఎస్‌బిఐ లైఫ్‌తో ఐపిఒకు వస్తుందని అంచనావేసారు. వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించి మూలధన వనరులు పెంచుకుంటుంది. మార్కెట్‌ స్థితిగతుల ఆధారంగా ఐపిఒ వస్తుందని అన్నారు ఎస్‌బిఐ లైఫ్‌లో ఎస్‌బిఐకు 70శాం వాటా ఉంది. అనుబంధ సంస్థలో కనీసం 51శాతం వాటాను కలిగి ఉండాలి.
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
నిప్పు‌తో చెల‌గాల‌మాడుతున్నాం.. - మందగమనం చాలా ప్రమాదకరం - ఇతర దేశాల వృద్ధిని తరలించడమే మార్గం - ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ న్యూయార్క్‌ (అమెరికా): ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగమనంలోనే కొనసాగుతున్నాయని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ఈ పరిణామం ప్రపంచానికి చాలా ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులను నుంచి తమతమ దేశాలను వృద్ధి పథం వైపు నడిపేందుకు కేంద్ర బ్యాంకులు దాదాపు నిప్పుతో చలగాటం అడుతున్నంత పని చేస్తున్నాయని ఆయన అభివర్ణించారు. ద్రవ్య విధానాలను సరళీకరించడం ద్వారా కేంద్ర బ్యాంకులు ఇతర దేశాల నుంచి వృద్ధిని తమ దేశాలకు తరలించేందుకు చూస్తున్నాయని అన్నారు. ఈ విషయంలోనూ ప్రమాదకరమైన పోటీనే ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వంటి పలు విత్త సంస్థలు విధానపరమైన నిర్ణయాల కోసం కొత్త నిబంధనల విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించాలని ఆయన సూచించారు. అదే సమయంలో ఈ నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని ఆయన అన్నారు. దేశీయంగా పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లను అరికట్టేందుకు పారిశ్రామిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అధిక వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుత మందగమన పరిస్థితి అందుకే చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు. ఇక్కడ ఎకనమిక్‌ క్లబ్‌ ఆఫ్‌ న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ప్రస్తుత పరిస్థితులలో కొత్త వృద్ధి కారక విధానాలను రూపొందించడం కంటే ఇతర దేశాల నుంచి వృద్ధిని తరలించికుపోయే దిశగానే విధానాల రూపకల్పన జరుగుతోందని అన్నారు. తెల్లని అశ్వంపై రోనాల్డ్‌ రీగన్‌ అనుకున్నారు..!                     న్యూయార్క్‌ (అమెరికా): గత ఏడాది మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సర్కారుపై వాస్తవానికి దూరమైన అనూహ్యమైన అంచానాలు ఉండేవని భారత రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. అయితే కొత్త ప్రభుత్వం పలు చర్యలు చేపట్టడం ద్వారా దేశంలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించిందని ఆయన అన్నారు. వృద్ధికి ఈ చర్య చాలా అవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు. మదుపరులు సమస్యలను పట్ల చాలా సున్నితంగా వ్యవహరిస్తూ వారిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఆర్థిక సవాళ్లను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని అన్నారు. ఇక్కడ ఎకనమిక్‌ క్లబ్‌ ఆఫ్‌ న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించిన అనంతరం రఘురామ్‌రాజన్‌ స్థానిక విలేకరులతో ముచ్చటించారు. మోడీ పగ్గాలు చేపట్టిన సమయంలో ప్రజలందరూ ప్రధానిని తెల్లని అశ్వంపై రోనాల్డ్‌రీగన్‌ కదిలి వస్తున్నట్లు ఊహించుకున్నారని.. మార్కెట్‌ వ్యతిరేక శక్తులను మోడీ రూపుమాపుతారని వారు భావించారని అన్నారు. అంత భారీ స్థాయిలో ఊహించుకోవడం సరైన చర్య కాదని అయన అభిప్రాయపడ్డారు. భారీ అంచనాల మేరకు ఫలితాలు కనిపించకపోయినా మదుపరులలో నమ్మకం పెంచే కార్యక్రమాలతో సర్కారు పని చేస్తోందని ఆయన అన్నారు. వ్యాపార, వాణిజ్య వాతావరణంలో అత్యంత ప్రధానమైన భాగం పన్నులని, పాత కాలం నాటి పన్నుల వ్యవస్థ మళ్ళీ రాబోదని ఈ ప్రభుత్వం చాలా స్పష్టమైన హామీ కూడా ఇచ్చిందని చెప్పారు. ప్రతి ఏడాది గడుస్తున్నకొద్దీ కార్పొరేట్‌ పన్ను రేటు తగ్గుతూ వస్త్తోందన్నారు. ఇటువంటి సమస్యల పరిష్కారంలో బహుశా భారత్‌ మంచి పనే చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. జీఎస్‌టీ గురించి ఆర్‌బీఐ గవర్నర్‌ స్పందిస్తూ వచ్చే మార్చి 31 నాటికి దేశ వ్యాప్తంగా ఈ సరికొత్త పన్ను విధానం అందుబాటులోకి రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం మెరుగుపరచడానికి, అభివృద్ధి దిశగా దేశం పయనించేలా చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం అనేక తీవ్రమైన, ప్రాధాన్యత గల చర్యలను తీసుకుందన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కొరోలా ఆల్టిస్‌ను ప్రారంభించిన టయోటా Hanumantha Reddy| భారత కార్ల మార్కెట్‌లో పదిశాతం వాటాను సాధించడమే లక్ష్యంగా ఎంచుకున్న ప్రముఖ జపాన్ కార్ల ఉత్పత్తి దిగ్గజం టయోటా కంపెనీ శుక్రవారం సరికొత్త... అధునాతన వెర్షన్ కారును ఆవిష్కరించింది. 'సిడాన్‌, కొరోలా ఆల్టిస్' పేరుతో విడుదలైన ఈ ఆధునిక వాహనం ధర రూ 10.83 మరియు రూ. 12.86 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర). మూడు విభిన్నరకాల గ్రేడ్‌లలో విడుదలైన ఈ కొత్త కారు 1.8 పెట్రోల్ లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ సంవత్సరంలో 63వేల వాహనాలను విక్రయించాలన్నది తమ ప్రస్తుత లక్ష్యమని... అలాగే 2015 ఆర్ధిక సంవత్సరం కల్లా 10 శాతం వాటాను కైవసం చేసుకోవాలన్నది భవిష్య లక్ష్యంగా టయోటా కంపెనీ వెల్లడించింది. ఈ లక్ష్యాలను సాధించడంలో భాగంగా కొత్త కారు 'ఆల్టిస్' ప్రారంభించి ఓ పెద్ద అడుగు ముందుకేసినట్లుగా టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎమ్) వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. గత ఏడాదిలో తమ సంస్థ 50వేల యూనిట్లను విక్రయించిందని... ప్రస్తుతం భారత కార్ల మార్కెట్‌లో తాము 3 శాతం వాటాను కలిగి ఉన్నట్లు విక్రమ్ అన్నారు. తమ లక్ష్యాన్ని ప్రణాళిక ప్రకారం చేదించేకు విభిన్న రకాలైన మోడళ్లను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అలాగే ఈ నెలాఖరు లోగా కొరోలా ఆల్టిస్‌ కార్లు సగటున 2వేల యూనిట్ల మేర విక్రయించేలా ప్రణాళిక చేశామని విక్రమ్ వ్యాఖ్యానించారు. కాగా, బెంగుళూరులో చిన్న తరహా కార్ల ఉత్పత్తి చేపట్టేందు కోసం సుమారు రూ. 1,400 కోట్ల పెట్టుబడితో రెండో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు గతంలో టయోటా ప్రకటించింది. అలాగే చిన్న తరహా కార్లను మరో రెండేళ్లలోపు భారత మార్కెట్‌లోకి ప్రవేశపెడతామని తెలిపింది. సంబంధిత వార్తలు
1entertainment
"ఖైదీ నంబర్‌ 150" మూవీ రివ్యూ. Highlights నటీనటులు: చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌, తరుణ్‌ అరోరా, రాయ్‌ లక్ష్మి, బ్రహ్మానందం, అలీ, పోసాని సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌  మాటలు: పరుచూరి బ్రదర్స్‌, బుర్రా సాయి మాధవ్‌, వేమారెడ్డి  నిర్మాత: రామ్‌చరణ్‌  ఏషియానెట్ రేటింగ్ 3.5/5 కథ:  కోల్ కతా సెంట్రల్ జైల్లో కత్తి శీను(చిరంజీవి) ఇంట్రడక్షన్ తో కథ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్నశీను హైదరాబాద్ కు వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్ కు వెళ్లే సమయంలో లక్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఫారిన్ వెళ్లాలనుకున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు. ఆ సమయంలోనే ఒకరిపై హత్యాయత్నం జరగటం.. అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలా ఉన్న శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం)ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే.. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు.   మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ.. కత్తి శీనును శంకర్ గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్(తరుణ్ అరోరా) రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో శీతల పానీయాల కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్ గా అనుకొని.. రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే రూ.25కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను.   రైతులను ఎలాగైనా ఒప్పించి.. తనకు ఇస్తానన్న 25కోట్లు తీసుకుని వెళ్లిపోవాలనుకుని..ప్లాన్ వేసి ఓల్డేజ్ హోంలో తిష్ట వేస్తాడు శీను. అయితే రైతులంతా.. శీనుకు సన్మాన కార్యక్రమం సందర్భంగా శంకర్ అనుకుని అతన్ని అక్కడికి తీసుకెళ్తారు. సన్మాన కార్యక్రమంతో.. శంకర్ ఆశయాలు కత్తి శీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తపిస్తాడన్నది తెలీటంతో పాటు.. అగర్వాల్ కుతంత్రం ఏమిటో అర్థమవుతుంది. దొంగే అయినా మంచి మనసున్న కత్తిశీను రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని నిర్ణయించుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెబుతూ.. రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు.. రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తి శీనుకు మధ్య పోరు మొదలవుతుంది.   అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన వ్యూహం ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మీ.. కత్తి శ్రీనుల ప్రేమకథ ఏమైంది? కత్తి శీను ఫారిన్ ప్రయాణం ఎటు మళ్లింది? అన్నవి తెలుసుకోవాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే.   ఎలా ఉందంటే:  వినోదం, సందేశం మేళవింపుగా సినిమా రూపుదిద్దుకుంది. కత్తి శీను పాత్ర ఎలా మలుపులు తిరుగుతుందీ.. అతడికీ, విలన్‌కీ మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది. వంటి వాటిని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ఒక పక్క కథనం వేగంగా సాగుతుండగానే అలరించే పాటలూ, రైతుల పరిస్థితిని కళ్లకు కట్టే సన్నివేశాలూ, కామెడీ పంచ్‌లూ వరుస కడతాయి. ఇది 'కత్తి'కి రీమేక్‌. అయితే చిరంజీవి రేంజ్‌కి తగ్గట్టుగా పాటల్నీ, ఫైట్స్ నూ.. బాగా చిత్రీకరించారు. 'అమ్మడూ.. లెట్స్‌ డూ కుమ్ముడూ' పాటలో రామ్‌చరణ్‌ తళుక్కుమని మెరుస్తాడు. 'రత్తాలూ..' 'సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరో' పాటలు హుషారెక్కిస్తాయి. 'అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడూ' కుర్రకారుతో ఈలలేయిస్తుంది.   ఎవరెలా చేశారంటే: తొమ్మిదేళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చిరంజీవి మునుపటిలాగానే తన నటనతో రెండు పాత్రల్ని పండించారు. డాన్సుల్లోనూ ఒకప్పటి హుషారు కనిపిస్తుంది. చిరంజీవి సరసన కాజల్‌ అందంగా కనిపించింది. దర్శకుడిగా వి.వి. వినాయక్‌ చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథనాన్ని నడిపించారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ బాగున్నాయి. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాశ్‌రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.  ప్లస్ పాయింట్స్ : ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ అంటే అది మెగాస్టార్ చిరంజీవే. 9 ఏళ్ల తరువాత స్క్రీన్ మీద ఆయన్ను ఫుల్ లెంగ్త్ హీరోగా చూడటం అభిమానులకు పండగే అని చెప్పాలి. చిరంజీవి కూడా బాగా వర్కవుట్స్ చేసి యంగ్ గా కనువిందు చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన అసామాన్యమైన నటన, డైలాగులు, ఫైట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రతి పాటలోనూ చిరంజీవి వేసిన సూపర్ స్టెప్పులు ప్రేక్షకుల ఉత్సాహాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళేలా ఉన్నాయి. రీమేక్ కథే అయినప్పటికీ ఒరిజినల్ వర్షెన్‌ను చిరంజీవికి తగ్గట్టుగా మలచడంలోనే ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కాజల్ ఎప్పట్లానే తన అందంతో, నటనతో బాగా ఆకట్టుకుంది. ఫస్టాఫ్‌ అంతా చిరు ఎనర్జిటిక్ డైలాగ్స్, యాక్టింగ్‌తో సరదాగా నడుస్తూనే ఇంటర్వెల్ రాబోయే ముందు ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయింది. రైతుల సమస్యను కాస్త ఎలివేట్ చేయడంతో అద్భుతంగా తయారైంది. ఇక పాటలన్నీ మంచి ఊపు తెచ్చేవే కాకుండా, వాటిని అందమైన లొకేషన్స్‌ లో చిత్రీకరించడం, చిరు డ్యాన్సుల అదిరిపోయేలా ఉండటంతో అభిమానులకు కనులవిందు చేశాయి. ముఖ్యంగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటలో రామ్ చరణ్ చిరంజీవితో కలిసి వేసిన స్టెప్పులు అభిమానులకు స్పెషల్ గిఫ్టనే చెప్పొచ్చు. మైనస్ పాయింట్స్ : మైనస్ పాయింట్స్ లో  ప్రధానంగా కనిపించేది బలం లేని విలనే. చిరంజీవి అంతటి స్టార్ హీరోకి ఇమేజ్ ని సినిమాలో మోయాలంటే అంతే బలమైన ప్రతి నాయకుడు అవసరం. విలన్ ఎంత బలంగా ఉంటే హీరో అంత స్ట్రాంగ్ గా కనిపిస్తాడు. కానీ విలన్ పాత్ర అలా లేదు. చిరంజీవి ముందు చాలా వరకు చిన్నబోయింది. తరుణ్ అరోరా నటన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇక ఫస్టాఫ్ రైతుల సమస్యను బలంగా చూపించినా... సెకండాఫ్లో అంతే బలంగా దానికి పరిష్కారం చూపడంలో దర్శక రచయితలు విఫలమయ్యారు. మీడియా కూడా సెన్సేషన్ ఉంటేనో లేక క్రియేట్ చేస్తేనో తప్ప కవరేజ్ ఇవ్వదంటూ సెటైర్ వేసే ప్రయత్నం చేసినా.. రైతుల స్టోరీ కావడంతో సీరియస్ నెస్ మెయింటైన్ చేశారు. క్లైమాక్స్ చిరంజీవి 150వ సినిమాకు ఉండాల్సిన స్థాయిలో లేదేమో అనిపిస్తుంది. అయితే అంతకు మించి ఏం చేసినా మొత్తం చెడిపోతుందనే అలా చేసి ఉండొచ్చు.   సాంకేతిక విభాగం : సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా వీవీ వినాయక్ తనపై మోపిన అతిపెద్ద బాధ్యతను సమర్ధవంతంగానే పోషించాడని చెప్పాలి. మురుగదాస్ కథను చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి, అభిమానులు ఏయే అంశాలు కోరుకుంటారో అవన్నీ ఉండేలా చూసుకుంటూ, కథలోని ఎమోషన్ దెబ్బతినకుండా వినాయక్ చూపిన ప్రతిభ మెచ్చుకోదగ్గది. దర్శకుడిగా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాను అందించడంలో వినాయక్ విజయం సాధించాడు. ఇకపోతే సెకండాఫ్ విషయంలో, ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే, సినిమా రేంజ్ వేరేలా ఉండేది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్. విజువల్స్ పరంగా చూసినప్పుడు ఆ పాటల స్థాయి మరింత పెరిగినట్లనిపించింది. కొరియోగ్రాఫర్లు లారెన్స్, జానీ మాస్టర్లు చిరంజీవి చేత వేయించిన స్టెప్పులు సినిమాకే మేజర్ హైలెట్ గా నిలిచాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ కీలక సన్నివేశాలన్నింటిలో దేవిశ్రీ పనితనం చూడొచ్చు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకో స్థాయిని తీసుకొచ్చింది. సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు చాలా వరకు బలంగా తాకేలా, చిరు ఇమేజ్ కు తగ్గట్టు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. రామ్ చరణ్ పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.   చివరగా : ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ చిరంజీవి ఇచ్చిన రీ ఎంట్రీ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే ఉండటంతో ప్రేక్షకులకు నచ్చటం ఖాయం.
0business
ఆసిస్‌ సీరిస్‌ నా టార్గెట్‌ : రోహిత్‌ శర్మ   ముంబై: గత కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మకు ఎదురుచూపులు తప్పడం లేదు.రోహిత్‌ శర్మ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో త్వరలోనే ఇంగ్లండ్‌తో జరిగే పరమిత ఓవర్ల సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు.ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ గాయపడ్డాడు.దీంతో రోహిత్‌ శర్మకు సుదీర్ఘ విశ్రాంతి అవసరమైంది. అయితే ఇంగ్లండ్‌తో వన్డే,టి20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఎంపిక నాటికి రోహిత్‌ ఫిట్‌ అవుతాడని అనుకున్నా అదీ జరగలేదు.తన ఫిట్‌నెస్‌పై తాజాగా స్పందించిన రోహిత్‌ వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు అందుబాటులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. నేను ఇంకా ఫిట్‌ కాలేదు.దీంతోనే ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు నన్ను ఎంపిక చేయలేదు.నా ఫిట్‌నెస్‌ను పరిగణలోకి తీసుకుని నన్ను ఎంపిక చేయని వారికి ధన్యవాదాలు,నా ప్రస్తుత టార్గెట్‌ ఆసీస్‌ సిరీస్‌.అప్పటికి అంతా సవ్యంగా జరుగుతుందని భావిస్తున్నా అని రోహిత్‌ పేర్కొన్నాడు.
2sports
SBI ఎస్‌బిఐ డిపాజిట్‌ రేట్లపై కోత ముంబై, మే 3: ఇప్పటికే వడ్డీరేట్లు కనిష్టస్థాయిల్లో కొన సాగుతుండగా ప్రభుత్వ రంగ ఎస్‌బిఐ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను అరశాతం మేర తగ్గిస్తూ సోమవారం అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. కోటిరూపాయల లోపు విలువగల మధ్య కాల, దీర్ఘకాల టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. వివరించిన వడ్డీరేట్లు తాజాగా చేసిన డిపాజిట్లు, గత డిపాజిట్ల పునరుద్ధరణకు ఏప్రిల్‌ 29 నుండి వర్తిస్తుందని ఎస్‌బిఐ తెలిపిం ది. కాగా, బ్యాంకు ఎంసిఎల్‌ఆర్‌లో ఎటువంటి మార్పులేదు.
1entertainment
Hyderabad, First Published 11, Apr 2019, 11:37 AM IST Highlights దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎన్నికల నేపధ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.  దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎన్నికల నేపధ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ట్వీట్ చేశారు. ఎన్నికల సందర్భంగా 'RRR యూనిట్ సగం ఖాళీ అయిందంటూ' రాజమౌళి చెప్పుకొచ్చారు. చిత్రయూనిట్ ఓటు వేయడానికి తమ గ్రామాలకు, సిటీలకు వెళ్లడంతో యూనిట్ సగానికి సగం ఖాళీ అయిందని, ఇది మంచి పరిణామమని అన్నారు. ఒకవేళ పార్టీ అభ్యర్ధులు, పార్టీలతో తేడాలు వస్తే నోటాకి అయినా ఓటు వేసి ఓటు హక్కుని వినియోగించుకోవాలంతూ పిలుపినిచ్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమా షూటింగ్ వడోదరాలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం పూణేకి పయనమవనున్నారు.    Half of my unit members left to their towns and villages to exercise their vote... Good... Do Vote... If you think no party/candidate makes a difference, make use of nota.. #IndiaElections2019   #LokSabhaElections2019   #VoteForIndia pic.twitter.com/M1y4egqDjn — rajamouli ss (@ssrajamouli) April 11, 2019 Last Updated 11, Apr 2019, 11:39 AM IST
0business
ఢిల్లీ ఓడిపోవడం బాధాకరమే, గబ్బర్ ఈస్ ఆల్వేస్: శిఖర్ ధావన్ Highlights ఢిల్లీ డేర్ డెవిల్స్ ను మట్టి కరిపించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్ డెవిల్స్ ను మట్టి కరిపించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. తమపై ఢిల్లీ ఓడిపోవడం బాధాకరమేనని అన్నారు. గురువారంనాడు జరిగిన మ్యాచులో కేన్ విలియమ్సన్ తో కలిసి శిఖర్ ధావన్ అద్భుతంగా ఆడి జట్టుకు ఘన విజయం సాధించి పెట్టాడు.  కేవలం 50 బంతుల్లో 92 పరుగులు చేసిన ధావన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు. ఈ విజయంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అది ఆనందమే అయినా ఢిల్లీ ఓటమి కాస్తా బాధ కలిగించిందని అన్నాడు.  అద్భుతంగా ఆడారు, గబ్బర్ ఈస్ బ్యాక్ అనుకోవచ్చా అని వ్యాఖ్యాత అంటే తిరిగి రావడం కాదు, గబ్బర్ ఈస్ ఆల్వేస్ అని శిఖర్ ధావన్ అన్నాడు. తాను తన స్టైల్లో రెచ్చిపోయానని, కేన్ విలియమ్సన్ తన శైలిలో ఆదడాడని అన్నాడు. బ్యాటింగ్ కు దిగే ముందు కోచ్ మూడీ ఒక్కటే మాట చెప్పాడని, అన్ని పరుగులు వాళ్లు (ఢిల్లీ) సాధించగా లేనిది మనం సాధించలేమా అని అన్నాడని చెప్పాడు. ప్రత్యేకమైన వ్యూహాలేమీ లేకుండా తమ సహజ శైలిలో ఆడామని, ఇన్నింగ్స్ మధ్యలో కేన్, తాను పెద్దగా మాట్లాడుకున్నది కూడా లేదని అన్నాడు.  మ్యాచ్ గెలిచింది సన్ రైజర్సే అయినా ప్రేక్షకుల మనసులను దోచుకుంది మాత్రం ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ ఇన్నింగ్సేననే అభిప్రాయంతో ధావన్ ఏకీభవించాడు. రిషబ్ లాంటి యువకుడు అద్భుతంగా ఆడడం బాగుందని, భారత క్రికెట్ కు సంబంధించి కూడా ఇది మంచి పరిణామమని అన్నాడు.  పంత్ చెలరేగి ఆడినా చివరికి ఢిల్లీ ఓడిపోవడం ఒకింత బాధ కలిగించిందని, వారు ఇంకా ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండింది కావచ్చునని శిఖర్ ధావన్ అన్నాడు. Last Updated 11, May 2018, 5:05 PM IST
2sports
Nov 17,2018 8000 కోట్ల నిధుల సమీకరణకు సై! న్యూఢిల్లీ: జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థ అదనంగా దాదాపు రూ.8000 కోట్ల మేర నిధులను సమీకరించుకొనేందుకు మార్గం సుగమమైంది. వివిధ మార్గాల ద్వారా ఈ నిధుల సమీకరణకు గాను చేసిన ప్రతిపాదనకు సంస్థ వాటాదారులు సమ్మతి తెలిపినట్టుగా జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. బుధవారం నాడు నిర్వహించిన సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు వాటాదారులు అవసరమైన మెజార్టీతో సమ్మతి తెలిపారని జీవీకే వెల్లడించింది. నిధుల సమీకరణకు గాను సంస్థకు చెందిన స్థిర, చరాస్తుల విక్రయం, లీజు, మార్టగేజ్‌ల మార్గలను పరిశీలిస్తున్నట్టుగా సంస్థ మార్కెట్లకు వెల్లడించింది. ఇందులో సంస్థకు సంభందించిన షేర్లు, సెక్యూరిటీలు కూడా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ ప్రక్రియల ద్వారా లభించే మొత్తాన్ని సంస్థ, అనుబంధ సంస్థలు, అసోసియేట్స్‌, గ్రూపు కంపెనీలు తప్పనిసరిగా చేయాల్సి ఉన్న చెల్లింపులకు వినియోగించనున్నట్టుగా కంపెనీ తెలిపింది. దీనితో పాటు జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌లో 50 శాతం ఈక్విటీ వాటాను డైల్యూట్‌ చేసే ప్రతిపాదనకు కూడా వాటాదారులు సమ్మతి తెలిపారని జీవీకే తెలిపింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా గానీ.. లేదా ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా గానీ.. లేదా వాటా విక్రయం ద్వారా గానీ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టుగా సంస్థ తెలిపింది. తద్వారా వచ్చే సొమ్మును జీవీకే ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్‌ సంస్థ తప్పని సరగా చేయాల్సిన చెల్లింపులకు వాడనున్నట్టుగా కంపెనీ తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బాహుబలి2 టికెట్ ధరలకు దిమ్మదిరిగి మైండ్ "బ్లాక్" అవుతోంది Highlights బాహుబలి2 టికెట్ ధరలకు దిమ్మదిరిగి మైండ్ "బ్లాక్" అవుతోంది తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధర4000 వరకు పలికినట్టు సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదలౌతున్న బాహుబలి2 మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూసారో తెలిసిందే. రిలీజ్ డేట్ తర్వాత ఆ ఎదురు చూపులు తగ్గుతాయనుకుంటే.. ఏ మాత్రం తగ్గకపోగా పెరిగాయి. రిలీజ్ డేట్ నాడు టికెట్స్ కోసం జనం నిలబడ్డ క్యూలు రైళ్లను తలపించాయి. బాహుబలి పార్ట్1 సాధించిన సెన్సేషన్స్‌తో పార్ట్‌2 అంతకు మించిన రేంజ్‌లో ఉండటం ఖాయం అనే హైప్ క్రియేట్ కావడంతో ప్రేక్షకులు బాహుబలి ది కన్‌క్లూజన్‌ని తెరపై చూసి ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు.   అంతేకాకుండా ఈ సినిమా బాహుబలి పార్ట్1 వన్ కంటే పెద్ద హిట్ పక్కా అనే ప్రచారం విపరీతంగా జరుగుతుండటంతో ఈ సినిమా చూడటం కోసం ప్రేక్షకులు ఇప్పటికే థియేటర్స్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా థియేటర్స్ వద్ద జనం బారులు తీరారు. క్యూ లైన్‌లో తోపులాటలు, పలు గొడవలు జరుగుతున్నాయి.   మరోవైపు బాహుబలి2 టికెట్స్ అడ్వాన్స్ బుక్కింగ్ చేసుకుందామనుకుని ఆన్ లైన్ లో ప్రయత్నిస్తున్న వారికి తీవ్ర నిరాశే మిగులుతోంది. అవసరమున్న వారి కోసం టికెట్స్ అన్నీ బ్లాక్ చేయడంతో పాటు.. బ్లాక్‌ మార్కెట్‌లో బాహుబలి 2 టికెట్ దందా జోరుగా నడుస్తుండటంతో సాధారణ ప్రేక్షకుడికి బాహుబలి2 టికెట్ అందని ద్రాక్షగా మారింది. ఇది కేవలం ఓ చిన్న థియేటర్ కో, కాంప్లెక్స్ కో పరిమితతం కాలేదు. అన్ని చోట్ల అంటే.. బడా బడా వ్యాపార సంస్థలు నిర్వహించే మల్టీ ప్లెక్స్ ల టికెట్స్ కూడా టికెట్ బుకింగ్ సైట్స్ లో లభించడంలేదు. మరోపక్క అందుబాట్లో టికెట్లు ఉన్నట్లు చూపిస్తున్న కొన్ని చోట్ల కూడా బుక్ చేద్దామంటే వినియోదారులకు దొరక్కుండా సర్వర్ కనెక్ట్ కాకుండా చుక్కలు చూపిస్తున్నారు. ఇలా బుక్ మైషో, జస్ట్ టికెట్, పే టీఎం, పీవీఆర్ సినిమా, ఐమాక్స్, ఐనాక్స్, సినిపోలీస్ లాంటి అన్ని సైట్లలో అదే తంతు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సర్కారు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తుండటంతో ప్రేక్షకులకు టికెట్ కష్టాలు తప్పడంలేదు. ఇక టికెట్ కౌంటర్స్ వద్ద టికెట్ కొనాలన్నా దాదాపు అదే పరిస్థితి. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్, జివికె ఐనాక్స్, పివిఆర్ సినిమాస్, బిగ్ సినిమాస్, సినిమ్యాక్స్‌ దగ్గర పరిస్థితి ఇలాఉంటే.. విజయవాడలోనూ పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. బాహుబలి2 టికెట్స్ రేటును విపరీతంగా పెంచేయడంతో పాటు క్యూలైన్‌లో ఉన్న ప్రేక్షకులకు టికెట్ దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు విజయవాడ శైలజ థియేటర్ వద్ద ధర్నాకు దిగే వరకూ పరిస్థితి వచ్చిందంటే బాహుబలి2 మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో  టికెట్ ధర రూ.4000 వరకు కూడా పలుకుతుండటంతో సినీ ప్రేమికులకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది.
0business
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
internet vaartha 205 Views శాంసంగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ భూటాని హైదరాబాద్‌ : సాంప్రదాయ బద్ధమైన గృహోపకరణాల విభాగంలో ఆధునీకరణను జోడించిన శాంసంగ్‌ కొత్తగా డిజిటల్‌ ఇన్వర్టర్‌లతో కూడిన స్మార్ట్‌ రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌ ఎసిలను మార్కెట్లకు ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మార్కెట్లతో పోలిస్తే తమకు హైదరాబాద్‌ మార్కెట్‌ అత్యంత కీలకమైనదని సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రాజీవ్‌భూటాని వెల్లడించారు. నగర మార్కెట్‌కు డిజిటల్‌ శ్రేణి 5ఇన్‌వన్‌ రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌ ఇన్వర్టర్‌ ఎసిలను ఆయన విడుదలచేసారు. సాంప్రదాయ ఎసిలతో పోలిస్తే తక్కువవిద్యుత్‌ వినియోగిస్తాయని డ్యూరాఫిన్‌ కండెన్సర్లవల్ల తుప్పు ఉండదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ రంగంలోని మార్కెట్‌తో పోలిస్తే 1.3రెట్లు శాంసంగ్‌ వృద్ధితో ఉందని, కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న శాంసంగ్‌ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నదన్నారు. ప్రస్తుత మార్కెట్‌ వాటా 43.4శాతంగా ఉందని, కొత్త ఇన్వెర్టర్‌ ఎసిలు 26.8శాతం మార్కెట్‌ వాటాతో ఉండగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జాతీయ సగటు వాటాతో పోలిస్తే హైదరాబాద్‌ మార్కెట్‌ వాటా 1.6 రెట్లు ఎక్కువ అని, ఈ ఏడాది 2.8శాతం మార్కెట్‌ వాటా సాధించగలమని ఆయన ప్రక టించారు. తమకు హైదరాబాద్‌ మార్కెట్‌ అత్యంత కీలకమైనదన్నారు. ఈ రంగంలో 13-14శాతం వార్షికవృద్ధి ఉంటే శాంసంగ్‌ వృద్ధి 1.4రెట్లు అధికంగా ఉందని, భారత్‌ వినియోగదారుల్లో శాంసంగ్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. నోయిడా,చెన్నై ప్లాంట్లలో ఈ ఉత్పత్తులు విడుద లవుతాయన్నారు. ఎసి మార్కెట్లలో 15శాతం వాటాను మించి సాధించగలమని ఆయన అన్నారు. డిజిటల్‌ ఇన్వర్టర్లపై పదేళ్ల వారంటీతోసాటు కంప్రెసర్లపై కూడా ఐదేళ్ల వారంటీ శాంసంగ్‌ ఇస్తోంద న్నారు. 31 వేల రూపాయలనుంచి 67 వేల రూపాయలధరల్లో ఇవి లభిస్తున్నాయి. రిఫ్రిజిరేటర్ల పరంగా 212లీటర్లు, 230 లీటర్లలో ఉంటాయన్నారు వీటి వినియోగంతో 6900 రూపాయలవరకూ విద్యుత్‌ ఆదా అవుతుందన్నారు. స్మార్ట్‌ రిఫ్రిజిరేటర్లు 45వేలనుంచి 82,500 ధరల్లో లభిస్తాయ న్నారు. ఎసిలధరలు కూడా 35 వేల నుంచి ప్రారభం అవుతాయని రాజీవ్‌భూటాని వివరించారు.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మంచు విష్ణుకి కలిసొచ్చిన 'జల్లికట్టు' వివాదం జల్లికట్టు కోసం జరిపిన ఆందోళన హింసాత్మకం అయిన కారణంగా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా... | Updated: Jan 23, 2017, 07:31PM IST జల్లికట్టు కోసం జరిపిన ఆందోళన హింసాత్మకం అయిన కారణంగా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కావాల్సి వున్న సింగం-3 (తెలుగులో యముడు 3) మూవీని వాయిదా వేసుకుంటున్నట్టు తాజాగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. సోమవారం ఉదయం మీడియాకు ఓ ప్రకటన ఇచ్చిన సింగం-3 చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా... " తమ చిత్రాన్ని వాయిదా వేయడం లేదని, ఎట్టిపరిస్థితుల్లో 26వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది" అని ప్రకటించాడు. కానీ ఇంతలోనే తమిళనాడులో జల్లికట్టు వివాదం కారణంగా చెలరేగిన హింస మరింత ఉద్రిక్త పరిస్థితులకి దారితీయడంతో ప్రస్తుతానికి చిత్రం విడుదలను వాయిదా వేసుకుంటున్నట్టు సోమవారం సాయంత్రమే మళ్లీ ప్రకటించారు. అయితే, తెలుగులో జనవరి 26న రిలీజ్ కావాల్సి వున్న యముడు 3 చిత్రం వాయిదా పడటంతో ఆయా థియేటర్ల స్లాట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఇదే అదనుగా భావించిన లక్కున్నోడు చిత్ర నిర్మాతలు.. తమ సినిమాను ఓ వారం ముందే రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.
0business
మా అసోసియేషన్ వాళ్లకు గట్టి స‌వాల్‌ విసిరిన శ్రీరెడ్డి Highlights మా అసోసియేషన్ వాళ్లకు గట్టి స‌వాల్‌ విసిరిన శ్రీరెడ్డి  టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ శ్రీరెడ్డి. రీసెంట్ గా ఒ డిబేట్ లో త‌న‌తో రాస‌లీల‌లు న‌డిపిన ఆ వ్య‌క్తి ఎవ‌రో కాద‌ని, టాలీవుడ్‌లో బ‌ఢా నిర్మాత‌గా ఓ వెలుగు వెలుగుతున్న సురేష్‌బాబు త‌న‌యుడు అభిరామ్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అలా శ్రీ‌రెడ్డి ఒక్క‌సారిగా అభిరామ్ ఫోటోలు బ‌య‌ట‌పెట్ట‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. అవును, అభిరామ్ నాకు సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని న‌మ్మించి… నన్ను శారీర‌కంగా వాడుకున్నాడు అంటూ మీడియా ముఖంగా చెప్పింది శ్రీ‌రెడ్డి. టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని పోరాటం చేస్తున్న నాకు మా అసోసియేష‌న్ స‌భ్య‌త్వం ర‌ద్దు చేసి.. సినీ ఇండ‌స్ర్టీ నుంచి వెలేస్తారా..?  ఇప్పుడు ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ త‌న‌యుడి రాజ‌లీల‌లను ఆధారాల‌తో స‌హా  బ‌య‌ట‌పెట్టా క‌దా..!!  మా అసోసియేష‌న్‌కు ద‌మ్ముంటే ద‌గ్గుబాటి ఫ్యామిలీని సినీ ఇండ‌స్ర్టీ నుంచి వెలేయ‌గ‌ల‌దా..!  ద‌గ్గుబాటి అభిరామ్‌, అత‌న్ని ప్రోత్స‌హించిన ఆయ‌న తండ్రి, అండ‌గా నిలిచిన వెంక‌టేష్‌, రాణాల‌ను తెలుగు సినీ ఇండ‌స్ర్టీ నుంచి వెలేయ‌గ‌ల ద‌మ్ము మా అసోసియేషన్‌కు ఉందా..? అంటూ శ్రీ‌రెడ్డి ప్ర‌శ్నించింది. Last Updated 11, Apr 2018, 7:39 PM IST
0business
kohli again reaches to top position in odi rankings వన్డేల్లో తిరిగి అగ్రస్థానానికి కోహ్లి.. బుమ్రాకు బెస్ట్ ర్యాంక్ ఐపీఎల్ సహచరుడు ఏబీ డివిలియర్స్‌కు ఇటీవలే నంబర్ 1 స్థానాన్ని కోల్పోయిన విరాట్.. తిరిగి టాప్ పోజిషన్‌కు చేరుకున్నాడు. TNN | Updated: Oct 30, 2017, 01:24PM IST టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. తన ఐపీఎల్ సహచరుడు ఏబీ డివిలియర్స్‌కు ఇటీవలే నంబర్ 1 స్థానాన్ని కోల్పోయిన విరాట్.. తిరిగి టాప్ పోజిషన్‌కు చేరుకున్నాడు. కివీస్‌పై తొలి వన్డేలో 121 పరుగుల చేసిన కోహ్లి, మూడో వన్డేలో 113 పరుగులు చేశాడు. మూడు వన్డేల్లో కలిపి 263 పరుగులు చేయడంతో 889 రేటింగ్ పాయింట్లు సాధించాడు. దీంతో భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. 1998లో సచిన్ 887 పాయింట్లు సాధించగా.. ఈ ఏడాది కోహ్లి దాన్ని సమం చేశాడు. కివీస్‌పై దూకుడుగా ఆడటంతో విరాట్ ఖాతాలో 889 పాయింట్లు చేరాయి. మూడో వన్డేలో 147 పరుగులతోపాటు మూడు వన్డేల్లో 174 రన్స్ చేసిన రోహిత్ శర్మ కూడా కెరీర్ బెస్ట్ (799) పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ధోనీ ఒక మెట్టు ఎక్కి 11వ స్థానానికి చేరుకోగా, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్ 15 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.
2sports
kohli pushes india past 200 after rohit-dhawan frenzy ఉతికారేసిన ఓపెనర్లు.. కివీస్ టార్గెట్ 203 న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో TNN | Updated: Nov 1, 2017, 08:40PM IST న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. రోహిత్ శర్మ (80: 55 బంతుల్లో 6x4, 4x6), శిఖర్ ధావన్ (80: 52 బంతుల్లో 10x4, 2x6) అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు‌తో కివీస్‌కి గట్టి సవాల్ విసిరింది. తొలి ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టిన ఈ ఓపెనర్ల జోడి మొదటి వికెట్‌కి 16.2 ఓవర్లలో అభేద్యంగా 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. చివర్లో విరాట్ కోహ్లి (26 నాటౌట్: 11 బంతుల్లో 3x6), ధోనీ (7 నాటౌట్: 2 బంతుల్లో 1x6) క్రీజులో ఉన్నంతసేపు బ్యాట్ ఝళిపించేశారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి ఓవర్‌ స్పిన్నర్‌తో వేయించి షాకివ్వాలని భావించిన కివీస్‌కి రోహిత్ శర్మ వరుస బౌండరీలతో రివర్స్ పంచ్ ఇచ్చాడు. వన్డేల్లో భారత్ టాప్ ఆర్డర్‌‌ని ఇబ్బందిపెట్టిన ట్రెంట్ బౌల్ట్‌ బౌలింగ్‌లో అప్పర్ కట్‌ సిక్స్ ద్వారా టాప్ గేర్‌లోకి వెళ్లిన రోహిత్ శర్మ చివరి వరకూ అదే జోరుని కొనసాగించాడు. దీంతో మరో ఎండ్‌లో ఉన్న శిఖర్ ధావన్ కూడా స్వీప్, రివర్స్ స్వీప్‌లతో స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకుని దూకుడు పెంచడంతో భారత్ స్కోరు బోర్డు జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్లింది. మధ్యలో రోహిత్ శర్మ ఇచ్చిన రెండు క్యాచ్‌ల్ని కివీస్ ఫీల్డర్లు జారవిడచడం కూడా భారత్‌కి కలిసొచ్చింది. ఎట్టకేలకి ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో శిఖర్ ధావన్‌ని స్పిన్నర్ ఇస్ సోథీ వైడ్ రూపంలో బంతిని విసిరి స్టంపౌట్‌గా పెవిలియన్‌కి పంపగలిగాడు. అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్య (0) కూడా అదే ఓవర్‌లోనే ఔటైపోయాడు. స్లాగ్ ఓవర్లలో వరుస సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ సెంచరీ చేసేలా కనిపించిన ఒక ఓవర్‌లో మ్యాచ్ ముగుస్తుందనగా కీపర్ లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
2sports
బాహుబలి సినిమా చూసేందుకు విమానాల్లో ఢాకా నుంచి కలకత్తాకు...గుంపులు Highlights బాహుబలి సినిమా చూసేందుకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి జనం కలకత్తాలో టికెట్స్ కొనుక్కుని థియేటర్ లోనే సినిమా చూడాలని వచ్చిన 40 మంది   మే డే రోజున బాహుబలి ది కన్ క్లూజన్ షో చూసేందుకు వచ్చిన కొంత మందితో ఐనాక్స్ ఫోరం మాల్ ప్రత్యేకత సంతరించుకుంది. నలభై సీట్లు ఒకే చోట బుక్ చేసుకున్న కొంత మంది బాహుబలి ప్రేమికులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి ఇక్కడికి వచ్చారు. రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9వేల థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే తొలి వీకెండ్ లోనే 540 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన బాహుబలి ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే బాహుబలి ది బిగినింగ్ తరహాలో ఈసారి బాహుబలి ది కన్ క్లూజన్ బంగ్లా దేశ్ లో రిలీజ్ కాలేదు. దీంతో ఆరేళ్ల చిన్నారి నుంచి 66ఏళ్ల వృద్ధుల వరకు ఓ 40మంది పైగా టీమ్ సినిమా చూసేందుకు కలకత్తాలోని పోరమ్ మాల్ ఐనాక్స్ లో సోమవారం సక్సెస్ ఫుల్ గా బాహుబలి ది కన్ క్లూజన్ సినిమా చూసి బుధవారం తిరిగి వెళ్లిపోయారని ది టెలిగ్రాఫ్ కథనం.   సనావుల్ అఫ్రీన్ అనే 63ఏళ్ల బంగ్లాదేశీ యాడ్ ఏజెన్సీ వ్యాపారి వివరణ ప్రకారం... బాహుబలి విజువల్ లో ఉన్న గొప్పదనం మరే సినిమాలోనూ ఇప్పటివరకు చూడలేదని, డీవీడీల్లో చూసేకన్నా థియేటర్స్ లో చూస్తేనే అద్భుతమైన అనుభూతి కలుగుతుందని ఇక్కడిదాకా వచ్చామని చెప్తున్నాడు. వీళ్లతోపాటు ఇదే టీమ్ లో వచ్చిన బంగ్లాదేశ్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్-ఐ ఏండీ ఫరీదుల్ రెజా సాగర్, కలేర్ కాంత డైలీ ఎడిటర్ ఇమ్ దాదుల్ హక్ మిలాన్, డ్రామా నటుడు అఫ్జల్ హుసేన్, అతని సతీమణి ఫ్యాషన్ డిజైనర్ తాజీన్ హలీమ్ తదితరులు ఉన్నారు. బంగ్లాదేశ్ లో ఆ దేశంలో షూటింగ్ జరుపుకున్న సినిమాలు, లేదా బంగ్లాదేశీయులు సహ నిర్మాతలుగా వ్యవహరించిన సినిమాలు రిలీజ్ అవుతాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గ్రూప్ సోమవారం ఈవెనింగ్ షో కు గంట ముందే థియేటర్ కు చేరుకున్నారు. సినిమా చూశాక అంతా ఒకే మాట అనుకున్నారు. అదే.. బాహుబలి సినిమా కోసం రావటానికి పెట్టిన ఫ్లైట్ టికెట్ ఖర్చులు ప్రతీ పైసాకు బాహుబలి వ్యాల్యూ ఇచ్చిందని. బాహుబలి 1 కంటే 2 అద్భుతంగా ఉందని అంటోంది 14 ఏళ్ల యువతి తనీషా నహర్ రోజా. బాహుబలి1 సినిమాను 80 సార్లు డీవీడీల్లో చూశానని చెప్తోంది. ఈ గ్రూపులో బాహుబలి1ను 2015లో థియేటర్లో చూసిన ఒకే ఒక్కడు ఆమీర్ హుస్సేన్ ఖోకోన్. ఈ గ్రూప్ లో ఒక యువతి తను అనుష్కలా హీరోయిన్ అవాలని అనుకుంటున్నానని అంది. వెంటనే పక్కనున్న అతను మీ నాన్నకు తెలుసా అని అరుపులు. మొత్తానికి బాహుబలి ఆ సాయంత్రం వాళ్ళందరి ముఖంలో నవ్వులు పూయించింది. ఇలా బంగ్లాదేశ్ నుంచి చాలా మంది థియేటర్ కు వచ్చి బాహుబలి సినిమా చూడటం థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్. నాకు తెలిసీ కలకత్తాలో ఇలా బంగ్లాదేశీయులు ఒక సినిమాకు ఇన్ని టికెట్స్ బుక్ చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదని ఐనాక్స్ రీజనల్ డైరెక్టర్ సుభాషిస్ గంగూలీ అన్నారు. మొత్తానికి బాహుబలి ఎలాంటి వేవ్స్ క్రియేట్ చేస్తోందో ఉదాహరణ చూస్తేనే తెలుస్తోంది. Last Updated 26, Mar 2018, 12:00 AM IST
0business
Visit Site Recommended byColombia ‘భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు టెస్టు జట్టులో చతేశ్వర్ పుజారా కూడా కీలక ఆటగాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇద్దరికీ మెరుగైన రికార్డులున్నాయి. అయితే.. పుజారా ఆట చాలా భిన్నం. పాతతరం ఆటగాళ్ల తరహాలో క్రీజులో కుదుకున్న తర్వాత నెమ్మదిగా పరుగులు రాబట్టడం అతడి ఆట నైజం. ఈ కారణంగా అతను గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా.. కోహ్లీతో పోలిస్తే అతనికి సరైన గుర్తింపు లభించడం లేదు. జట్టులో మూడో నెంబరు బ్యాట్స్‌మెన్ ఎప్పుడూ ఉత్తమంగా ఉంటాడు. దీనికి ఉదాహరణ గతంలో రాహుల్ ద్రవిడ్.. ఇప్పుడు పుజారా. ఈ స్థానంలో వచ్చే ఆటగాళ్లు.. మ్యాచ్ ఆరంభంలో బంతి మెరుపును పోగొట్టి.. తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా షాట్లు ఆడే సౌలభ్యం కల్పిస్తారు. అందుకే.. పుజారా జట్టులో ఉంటే కోహ్లీకి మంచిది’ అని గంగూలీ వివరించాడు. టెస్టు జట్టులో పుజారా మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తుండగా.. తర్వాత స్థానంలో కోహ్లికి బ్యాటింగ్‌కి వస్తుంటాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Nov 26,2017 ప్రపంచ కుబేరుడు బిజోస్‌! న్యూయార్క్‌ : ప్రపంచంలోనే అపర కుబేరుడుగా అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బిజోస్‌ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ తొలి స్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌ను ఆయన దాటేశాడు. గత అక్టోబర్‌లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన బిజోస్‌ తాజాగా శుక్రవారం నాడు పెరిగిన అమ్మకాలకు తోడు ఆ కంపెనీ షేర్లు కూడా బాగా పెరిగాయి. దీంతో ఆయన సంపద 100.3 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. 1999లో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ఈ ఘనత సాధించారు. ఆ తర్వాత తొలిసారి బిజోస్‌ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే బిల్‌గేట్స్‌ తన సంపదలో కొంత దాతృత్వ సంస్థలకు, గేట్స్‌ ఫౌండేషన్‌కు అందజేశారు. లేదంటే ప్రస్తుతం బిల్‌గేట్స్‌ సంపద 150 బిలియన్‌ డాలర్ల వరకూ ఉండేదని అంచనా. అమెజాన్‌ ప్రకటించిన ఆన్‌లైట్‌ రీటైలర్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ భారీ విజయాన్ని సాధించింది. దీంతో బెజోస్‌ సంపదలో 1.7 బిలియన్‌ డాలర్లు జమ అయ్యాయి. ఈ ఏడాది మొత్తంలో 32.6 బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీంతో ఈ అపరకుబేరుడి ఆస్తి విలువ మొత్తం 100 బిలియన్‌ డాలర్ల మైలురాయికి చేరింది. అమెజాన్‌లో బెజోస్‌కు 78.9మిలియన్‌ షేర్లు ఉన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV బంగ్లా నాగిని డ్యాన్స్‌కు... శ్రీలంక నాదస్వరం శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో నాగిని డ్యాన్స్ అందరికి బాగా గుర్తుండిపోతుంది. బంగ్లా ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ ఈ వెరైటీ డ్యాన్స్‌ను పరిచయం చేశాడు. రెండు మూడు మ్యాచ్‌ల నుంచి ప్లేయర్లంతా దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ నాగిని డ్యాన్స్‌కు శ్రీలంక కౌంటర్ ఇచ్చింది. Samayam Telugu | Updated: Mar 17, 2018, 04:13PM IST శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో నాగిని డ్యాన్స్ అందరికి బాగా గుర్తుండిపోతుంది. బంగ్లా ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ ఈ వెరైటీ డ్యాన్స్‌ను పరిచయం చేశాడు. రెండు మూడు మ్యాచ్‌ల నుంచి ప్లేయర్లంతా దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ నాగిని డ్యాన్స్‌కు శ్రీలంక కౌంటర్ ఇచ్చింది. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ముష్ఫికర్ క్రీజులో ఉన్నాడు. లంక బౌలర్ అపోన్స్ ఓవర్ వేస్తున్నాడు. అయితే రహీం భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. వెంటే అపోన్స్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టాడు. రహీమ్‌కు కౌంటర్‌గా చేతులు రెండు దగ్గరకు చేసి... నాదస్వరం ఊదాడు. ఇప్పుడు ఈ వీడియో హాట్‌టాపిక్‌గా మారింది.
2sports
భారత ఇంజినీర్లు మేధావులే.. - స్నాప్‌డీల్‌ వ్యవస్థాపకుడు రోహిత్‌ బన్సాల్‌ న్యూఢిల్లీ: భారత్‌లో తగిన సామర్థ్యం కలిగిన ఇంజినీర్లు లేరంటూ స్నాప్‌డీల్‌ సహ వ్యవస్థాపకుడు రోహిత్‌ బన్సాల్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్‌లైన్‌లో పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన శనివారం నష్ట నివారణ చర్యలకు దిగారు. విశ్వంలోనే భారత ఇంజినీర్లు ఆకర్షణీయమైన మేథస్సుగల వారని ఆయన అన్నారు. భారత్‌ మెరగైన ఇంజినీర్లకు కేంద్రమని ఆయన అభివర్ణించారు. ఇటీవలి కాలం వరకు కూడా భారత్‌లో ఇంటర్‌నెట్‌ పరిశ్రమ చాలా చిన్నదిగా ఉండేదని అన్నారు. దీంతో అన్‌లైన్‌ అవసరాలకు సరిపడ ఉత్పత్తులను తయారు చేసే శక్తి ఇక్కడి వారికి పెద్దగా లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశాలలో ఇప్పటికే పరిశ్రమ రకరకాల ఉత్పత్తులతో బాగా విస్తరించిందని, వీటిని అందిపుచ్చుకొని దేశీయంగా అతిపెద్ద వేదికను ఏర్పాటు చేసేందుకు గాను స్నాప్‌డీల్‌ పలు ఉత్పత్తుల కోసం విదేశాల బాట పట్టాల్సి వస్తోందని ఆయన వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
అదే ప్రత్యర్థి.. కొరియా ఓపెన్ లో మట్టి కరిపించి ఛాంపియన్ షిప్ కైవసం Highlights కొరియన్ ఓపెన్ ఛాంపియన్ గా నిలిచిన పివీ సింధు జపాన్ క్రీడాకారిణి ఒకుహరను ఫైనల్లో మట్టికరిపించిన సింధు నజమి ఒకుహరపై 22-20, 11-21, 21-18 తేడాతో సింధు విజయం మూడు వారాల క్రితం వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో ఎదురైన పరాభవానికి పీవీ సింధు ప్రతీకారం తీర్చుకుంది. మళ్లీ అదే ప్రత్యర్థితో జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్లో విజయం సాధించి కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అందరూ ఊహించినట్లే కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నజొమి ఒకుహర, తెలుగు తేజం సింధు మధ్య పోరు హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌ను సింధు గెలుచుకోగా.. రెండో గేమ్‌ను ఒకుహర సునాయాసంగా నెగ్గింది. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరాగా సాగింది. భారీ ర్యాలీలు ఆడుతూ ఇద్దరు ప్లేయర్లు తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించారు. కానీ చివరికి సింధునే విజయం వరించింది. సియోల్‌లో ఆదివారం జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్‌లో నజమి ఒకుహరపై 22-20, 11-21, 21-18 తేడాతో సింధు విజయం సాధించింది. 1 గంటా 24 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఫైనల్‌లో సింధు పైచేయి సాధించింది. దీంతో కొరియా ఓపెన్ సిరీస్‌ టైటిల్ నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది. Last Updated 26, Mar 2018, 12:02 AM IST
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
sandhya 184 Views IND vs SA , World Cup 2019 IND vs SA సౌతాంప్టన్‌: క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌లో టీమిండియా ఫస్ట్‌ఫైట్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే వరుస అపజయాలతో తీవ్ర నిరాశలో ఉన్న సఫారీలు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంది. మరోవైపు టీమిండియా తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ప్రపంచకప్‌లో బోణీ కొట్టాలని చూస్తుంది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
2sports
sumalatha 113 Views Decreased , Festive season , gold-prices gold ముంబయి: పండుగ సీజన్‌కు ముందు బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర ఒక్క రోజే రూ.1580 తగ్గింది. బులియన్ మార్కెట్లో పసిడి 10 గ్రాములకి రూ.497 తగ్గి 38,685 రూపాయలకు చేరుకుంది. వెండి ధర కూడా రూ .1,580 తగ్గి కిలో రేటు 47,235 రూపాయలకు పడిపోయింది. అంతర్జాతీయంగా న్యూయార్క్‌లో బంగారం ఔన్సు 1,508 డాలర్లు, వెండి న్యూయార్క్‌లో ఔన్సు 17.90 డాలర్లకు పడిపోయింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు ముమ్మరం కావడంతో బంగారానికి డిమాండ్ తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. చైనా అధ్యక్షుడితో వాణిజ్య యుద్ధాన్ని ఊహించిన దానికంటే ముందే పరిష్కరించుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ చేసిన ప్రకటనతో బంగారం ఒత్తిడిలో ఉందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/andhra-pradesh/
1entertainment
వ్యవసాయం, ఇమిటేషన్‌ జ్యూయెలరీ, ఫార్మా ఎగుమతులకు ఊతం exports న్యూఢిల్లీ: అమెరికా సుంకాల విధింపు, జిఎస్‌పిని రద్దుచేసిన కేటగిరీలకు దేశీయంగా సుంకాలను రాయితీలివ్వడంతోపాటు, అమెరికాయేతర దేశాలకు ఎగుమతులు చేయాలన్న వ్యూహంతో భారత్‌ముందుకుపోతోంది. సుంకాలరహిత ఎగుమతులను ఇటీవలే అమెరికా రద్దుచేయడంతో సుమారు రెండువేల ఉత్పత్తులపై ఇపుడు భారీ సుంకాలు పడుతున్నాయి. ప్రత్యేక ప్రాధాన్యతా హోదా స్కీంను రద్దుచేయడంవల్ల ఇపుడు మూడువేల ఉత్పత్తులపై ప్రభావంపడుతోంది. కొన్ని ప్రత్యేరంగాలు ఈ విధానం వల్ల దెబ్బతింటునానయని, అందువల్ల వాటిని ముందు పునరుద్ధరించేచర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఇమిటేషన్‌జ్యూయలెరీ, తోలు ఉత్పత్తుల పాదరక్షలుమినహాయించి మిగిలిన ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు, శస్త్రిచికిత్సల పరికరాలు, రసాయనాలు, ప్లాస్టిక్స్‌, వ్యవసాయ ఉత్పత్తుల వంటి రంగాలు ఇపుడు జిఎస్‌పి రద్దుతో ఎక్కువ దెబ్బతింటునానయని భారత ఎగుమతిసంఘాల సమాఖ్య పేర్కొంటున్నది. కేంద్ర, రాష్ట్రాల పన్నులు, సుంకాల రాయితీ విధానానిన ఈ ఉత్పత్తులకు అమలుచేయాలని ఎఫ్‌ఐఇఒ చెపుతోంది. వాణిజ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి పియూష్‌ గోయల్‌ అధికారులతో నిరంతరం సమావేశాలునిర్వహించి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇపుడు ఈ జిఎస్‌పి రద్దు వ్యవహారంపై కూడా ఈ వారాంతంలోనే సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాం నిర్ణయిస్తారని అంచనా. గతనెల 31వ తేదీనే జిఎస్‌పి స్కీంను భారత్‌ ఉత్పత్తులపై మినహాయిస్తున్నామని, జూన్‌ 5వ తేదీనుంచి అమలుకు వస్తుందని వెల్లడించారు. భారత్‌అమెరికా ఉత్పత్తులకు మార్కెట్‌చేరువచేయడంలేదన్న కక్షతోనే ప్రతీకారచర్యగా అమెరికా ఈ సుంకం రద్దుచేసిందని అంచనా. జిఎస్‌పి ఉపసంహరణ వల్ల సుమారు 6.35 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు భారత్‌నుంచి వచ్చేవి దెబ్బతింటాయి. ఎగుమతిదారులు సాలీనా సుమారు 260 మిలియన్‌ డాలర్లమేర నష్టపోతారని అంచనా. వ్యవసాయం, ఆటో విడిభాగాలు, ఫార్మారంగాలు వీటివల్ల తీవ్రంగా దెబ్బతింటాయని, భారత్‌ముందుగానే మేల్కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కాంగ్రెస్‌ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. సుమారు 28 బిలియన్‌ డాలర్ల అమెరికాకు ఎగుమతులపై వీటిప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. వాణిజ్య లావాదేవీల్లో భారత్‌ శ్రేయస్సును విస్మరించి ముందుకు వెళ్లలేమని భారత్‌ వాణిజ్యశాఖ స్పష్టంచేసింది. వాస్తవానికి ట్రంప్‌ హయాంలో వాణిజ్యం వాణిజ్యమిగులుతోనే ఉన్నట్లు అంచనా. అయితే వైద్యపరికరాలపై ధరల పరిమితులు ఎత్తివేయాలని, ఖచ్చితంగా కొన్ని ధృవీకరణలు, అనుమతులు డైయిరీ ఉత్పత్తుల ఎగుమతులకు ఉండాలని, సెల్యులర్‌ఫోన్లపై దిగుమతి సుంకాలు రద్దుచేయాలని, ఇకామర్స్‌ విధానంలో పొందుపరిచిన కొన్ని మార్పులు వెంటనే అమలుచేయాలని అమెరికా పట్టుబడుతోంది,. స్థానిక విక్రేతలనుంచే 30శాం కొనుగోళ్లుచేయాలన్న నిబంధన ఎత్తివేయాలని భారత్‌పై ఎప్పటినుంచో ఒత్తిడిచేస్తోంది. ఈనేపథ్యంలో ఇపుడు అమెరికా జిఎస్‌పి రద్దుకు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV 'జనతా గ్యారేజ్'ని రెండుసార్లు చూసిన 'బాహుబలి' డైరెక్టర్ మిర్చి, శ్రీమంతుడు వంటి రెండు వరుస హిట్లతో జోష్‌మీదున్న డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'జనతా గ్యారేజ్'పై... | Updated: Sep 2, 2016, 11:09AM IST మిర్చి, శ్రీమంతుడు వంటి రెండు వరుస హిట్లతో జోష్‌మీదున్న డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'జనతా గ్యారేజ్'పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత మోహన్ లాల్ మళ్లీ తెలుగులో నటించిన మొదటి సినిమా కావడం, ఆకట్టుకునే కొరటాల శివ కథ, కాన్సెప్టులు 'జనతా గ్యారేజ్'పై అంచనాలు పెరగడానికి ఓ కారణమయ్యాయి. అందుకే ఈ సినిమాపై అభిమానులకే కాకుండా సెలబ్రిటీల్లోనూ క్రేజ్ వుంది. నిన్న రిలీజైన ఈ సినిమాని రాజమౌళి వెంటవెంటనే రెండుసార్లు చూశాడంటే ఆ క్రేజ్ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. అవును, జనతా గ్యారేజ్ మూవీని బ్యాక్ టు బ్యాక్ రెండుసార్లు చూసినట్టు స్వయంగా రాజమౌళినే ట్విటర్ ద్వారా తెలిపాడు. The combination of mohanlal garu and tarak, the subtle intensity betwen them is the best thing i liked about #JanathaGarage . It is a joy to — rajamouli ss (@ssrajamouli) September 1, 2016 watch both outperforming each other. Feel proud the way tarak is planning his characters and career since temper. My friend Rajeev .
0business
Hyderabad, First Published 1, May 2019, 9:42 PM IST Highlights సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే పీపుల్స్ ప్లాజాలో భారీ ఎత్తును నిర్వహించారు. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల మహేష్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వెంకటేష్, విజయ్ దేవరకొండ అతిథులుగా విచ్చేసి సీడీ లాంచ్ చేశారు. ఈ సంధర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''మహేష్ బాబు గారికి నేను పెద్ద అభిమానిని. కాలేజ్ లో ఉన్నప్పుడు మహేష్ బాబు అని పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు యాక్టర్ అయిన తరువాత మహేష్ సర్ ని పిలవాల్సి వస్తుంది. మనవాడు అనుకునేవాళ్లం.. ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సివస్తోంది.. అప్పుడప్పుడు మహేష్ అని  వచ్చేస్తుంది(నవ్వుతూ).. మురారి సినిమా నుండి ఆయన్ని ఫాలో అవుతున్నాను. అలాంటి హీరో నా సినిమాలకు ట్వీట్ వేయడం సంతోషంగా అనిపించింది. ఈ  సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. ఆరోజు నా పుట్టినరోజు.. ఆరోజు రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చారు.
0business
CROP111 పంటలకు గిట్టుబాటు ధరలేవీ న్యూఢిల్లీ: ఖరీఫ్‌ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ దేశంలోని అత్యధిక రైతు సంఘాలు ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయ ధరల వ్యయ పర్యవేక్షణ సంస్థ (సిఎసిపి)కిసం యుక్తంగా మొరపెట్టుకున్నాయి. ఖరీఫ్‌ పంటలకు కనీస గిట్టుబాటుధరలు కల్పించాలని కోరాయి. సిఎసిపి దీనిపై ఒక ప్రత్యేక అధ్యయనం చేయాల ని, పెద్దనోట్ల రద్దుతో వ్యవసాయ రంగం ఏవిధంగా దెబ్బతిన్నదీ ముందు బేరీజువేయాలని, ఖరీఫ్‌ 2017-18కోసం ప్రత్యేక పరిహారం విడుదలచేయా లని సూచించింది. జైకిసాన్‌ ఆందోళన్‌ వ్యవస్థాప కులు యోగేంద్ర యాదవ్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఒక వినతిపత్రాన్ని సిఎసిపికి అందించింది. ఇందుకు ఒక ప్రత్యేక ధరల విధానాన్ని రూపొందిం చాలని కూడా రైతుబృందం కోరింది. వ్యయ మదిం పు విధానం పూర్తిగామారాలని కృత్రిమ మాంద్యం, వాస్తవంగా వెలుగులోకిరాని ఖర్చులను సైతం పరి గణనలోకి తీసుకోలేని ఈ సాంకేతిక విధానాన్ని పక్కనపెట్టి కొత్త విధానం అమలుచేయాలని రైతు లు కోరుతున్నారు. సుస్థిర గిట్టుబాటు వ్యవసాయ రైతుల కూటమి, కర్ణాటక రాజ్యరైత సంఘ, కిసాన్‌ సంఘర్ష్‌సమితి, మధ్యప్రదేశ్‌, రైతు స్వరాజ్యవేదిక తెలంగాణ ప్రాంతాలనుంచి సంయుక్తంగా ఈ వినతి పత్రం అందించాయి. ఆధునిక సాంకేతికపరిజ్ఞానం వినియోగించి దిగుబడులు పెంచుకునేందుకు వీలు గా మొత్తం ఆహారోత్పత్తులకు గిట్టుబాటుధరలు కల్పించేందుకు సిఎసిపికి కేంద్రం పూర్తి అధికారా లిచ్చింది. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో గిట్టుబాటు ధరల పెంపులో మందగమనం చోటుచేసుకున్నదని రైతుల కూటమి వ్యవసాయ ధరల నిర్ధారిత కమిటీ కి సూచించింది. కనీస మద్దతుధరలు గిట్టుబాటు విధానంలోకి మారాలని, సార్వత్రికధరల విధానం, దిగుబడుల హామీ యంత్రాంగం పరిగణనలోకి తీసు కోవాలని సూచించింది. మొత్తం 23 ఉత్పత్తులకు సిఎసిపి ధరలను సిఫారసుచేస్తుంది. ఏడు తృణ ధాన్యాలు వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్యా లు, బార్లీ, రాగి వంటి వాటితోపాటు ఐదు పప్పు దినుసులు కంది, మినుము, పెసర, వంటి వాటితో పాటు నూనెగింజలపరంగా వేరుశెనగ, ఆముదం, సోయాబీన్‌, నువ్వులు, పొద్దుతిరుగుడు, వంటి వాటికి ధరలు నిర్దేశిస్తుంది. వాణిజ్యపంటల్లో కొబ్బరి, చెరకు, పత్తి, ముడిజనపనార ఉత్పత్తులకు సైతం గిట్టుబాటుధరలు అందిస్తుందని అంచనా.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV నిహారికాను హీరోయిన్‌గా వద్దన్నారు: వరుణ్‌తేజ్ కొందరు అభిమానులు నాన్నను కలిసి నిహారికా కథానాయికగా నటించడం వారికి ఇష్టం లేదని చెప్పారు TNN | Updated: Oct 21, 2015, 12:07PM IST హైదరాబాద్: నిహారిక సినిమాల్లోకి వెళ్లాలా? వద్దా? అనే విషయం గురించి ఒక్కసారిగా నిర్ణయం తీసుకోలేదు. చెల్లెలు నిహారిక టెలివిజన్ షోలు చేస్తుంటే అంతవరకే తనకు ఇంట్రెస్ట్ వుందని అనుకున్నాను. తర్వాత సినిమాలంటే కూడా ఆసక్తి వుందని తెలిసింది’ అన్నారు కథానాయకుడు వరుణ్‌తేజ్. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తన సోదరి నిహారిక నాయికగా అరంగ్రేటం గురించి వరుణ్‌తేజ్ తెలియజేస్తూ పై విధంగా స్పందించాడు.ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నిహారికకు సినిమాల పట్ల షాషన్ వుంది కాబట్టి మా కుటుంబ సభ్యులందరూ నిహారికాను ఎంకరేజ్ చేయాలనుకున్నాం. కొందరు మాత్రం ‘మీ సిస్టర్‌ను సినిమాల్లో రానివొద్దు’ అని చెప్పారు. కొందరు అభిమానులు నాన్నను కలిసి నిహారికా కథానాయికగా నటించడం వారికి ఇష్టం లేదని చెప్పారు. ‘మీ ఫీలింగ్స్‌ను హర్ట్ చేసేలా నిహారికా సినిమాలు చేయదు. మంచి కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తుంది’ అని నాన్న వారిని ఒప్పించారు. అందరి ఆమోదయోగ్యంగానే నిహారికా సినిమాలు చేస్తుంది’ అని తెలిపాడు వరుణ్‌తేజ్.
0business
Recommended byColombia క్రికెట్: జనవరి 5 - ఫిబ్రవరి 24: భారత జట్టు దక్షిణాఫ్రికాలో మూడు టెస్టులు, 6 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. సొంత గడ్డ మీద గతేడాది తిరుగులేని ప్రదర్శన చేసిన టీమిండియా ఇప్పుడు సఫారీ గడ్డ మీద సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. గత పాతికేళ్లుగా భారత జట్టు సౌతాఫ్రికాలో సిరీస్ గెలవలేదు. ఈ లోటును భర్తీ చేయాలని కోహ్లి సేన భావిస్తోంది. జనవరి 13 - ఫిబ్రవరి 5: అండర్-19 వరల్డ్ కప్: న్యూజిలాండ్. పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత జట్టు కివీస్ గడ్డ మీద ప్రపంచకప్ ఆడనుంది. మార్చి 8 - 20: శ్రీలంకలో భారత జట్టు ట్రై సిరీస్ ఆడనుంది. శ్రీలంక, భారత్, బంగ్లాదేశ్‌లు టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి. ఏప్రిల్ 4 - మే 31 : ఐపీఎల్ 2018. చెన్నై, రాజస్థాన్ జట్లు రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లో బరిలో దిగనున్నాయి. ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. జూలై 3 - సెప్టెంబర్ 11: ఇంగ్లాండ్‌లో భారత జట్టు పర్యటన. కోహ్లి సేన ఇంగ్లిష్ గడ్డ మీద ఐదు టెస్టులు, 3 టీ20లు, 3 వన్డేల్లో తలపడనుంది. సెప్టెంబర్: ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆసియా కప్‌లో ఆడనుంది. ఈ సిరీస్‌కు మన దేశమే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ పాకిస్థాన్‌తో భారత్‌లో క్రికెట్ ఆడలేమని చెప్పడంతో టోర్నీ ఎక్కడ జరుగుతుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే. అక్టోబర్ - నవంబర్ : ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ ప్రకారం వెస్టిండీస్ జట్టు మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడేందుకు భారత్ రానుంది. ఈ సిరీస్‌పై ఇప్పటికీ స్పష్టత లేదు. నవంబర్ 3 - నవంబర్ 24: మహిళల టీ20 వరల్డ్ కప్, వెస్టిండీస్. ఐసీసీ తొలిసారి మహిళల టీ20 వరల్డ్ కప్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. డిసెంబర్ - ఫిబ్రవరి 2019: టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన. షెడ్యూల్ పూర్తిగా కొలిక్కి రాలేదు. కానీ భారత జట్టు ఆస్ట్రేలియాలో 4 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. బ్యాడ్మింటన్: డిసెంబర్ 23, 2017 - జనవరి 14: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ జనవరి 29: ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ మార్చి 14 - 18: ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ జూలై 30 - ఆగష్టు 5: వరల్డ్ ఛాంపియన్ షిప్ నవంబర్ 20 - 25: వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ ఫుట్‌బాల్: జూన్ 14 - జూలై 15: రష్యాలో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జరగనుంది. ఏషియన్ గేమ్స్: ఆగష్టు 18 నుంచి సెప్టెంబర్ 2 తేదీల మధ్య జకర్తా, పాలెంబాంగ్‌లో ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. కామన్వెల్త్ గేమ్స్: ఏప్రిల్ 4 - 15 తేదీల మధ్య గోల్డ్ కోస్ట్‌లో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. పురుషుల హాకీ వరల్డ్ కప్: నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 తేదీల మధ్య పురుషుల హాకీ వరల్డ్ కప్ భువనేశ్వర్‌లో జరగనుంది. మహిళల హాకీ వరల్డ్ కప్: జూలై 21 నుంచి ఆగష్టు 5 తేదీల మధ్య లండన్లో మహిళల హాకీ వరల్డ్ కప్ నిర్వహించనున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కోపా అమెరికా పుట్‌బాల్‌ టోర్నీలో అర్జెంటీనాపై చిలీ సంచలన విజయం విజేతకు 25.37 కోట్లు రన్నరఫ్‌కు 19 కోట్లు రిటైర్మెంట్‌ ప్రకటించిన మెస్సీ ఈస్ట్‌ రూథర్‌పర్డ్‌ : కోపా అమెరికా పుట్‌ బాల్‌ టోర్నమెంట్‌ తుదిపోరులో చిలీ 4-2 తేడాతో అర్జెంటీనాపై చిలీ సంచలన విజయం సాధించింది. దీంతో వంద సంవత్సరాల సుధీర్ఘ చరిత్రలో భాగంగా నిర్వహించిన ఈ కప్‌ను చిలీ వరుసగా రెండవ సారి గెలుచుకుంది.ఇరుజట్లు హోరాహోరీగా పోరా డినా నిర్ణీత సమయంలోపు ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయాయి .పెనాల్టీ షూటౌట్‌లో చిలీ నాలుగు గోల్స్‌ ఏయగా,మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా రెండు గోల్స్‌ మాత్రమే చేయగలిగింది.విజేత చిలీకి 25.37 కోట్ల రూపాయలు, రన్నరప్‌ అర్జెంటీనాకు 19 కోట్ల ప్రైస్‌ మనీ దక్కింది. కాగా అర్జెంటీనాను విజేతగా నిలుపడంలో విఫలమైన ఆ జట్టు కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ ఆవేదన వ్యక్తం చేశాడు. అర్జెంటీనాకు కప్‌ సాధించి పెట్టాలని ప్రయ త్నించినా అది సాధ్యంకాలేదని మెస్సీ కన్నీంటి పర్యం తమయ్యాడు. మ్యాచ్‌ ఓటమిపై విశ్లేషించే సమయం కాకపోయినా గెలుపు సాధించడం కష్టంగా మారిందన్నాడు.కాగా ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ పుట్‌బాల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికినట్లు మెస్సీ వివరించాడు. ఇక జాతీయ జట్టుతో ఆడనందుకు బాధగా ఉన్నా ఓటమికి నైతిక బాధ్యతగా రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు పేర్కొ న్నాడు.జట్టును కోపా అమెరికా చాంపియన్‌గా నిలుపుదామని ప్రయ త్నించా, అయితే అది జరగలేదు,ఓటమికి బాధ్యత నాదే,ఇక అర్జెంటీనా డ్రెసింగ్‌ రూంలో కనిపించను,ఎంతో ముఖ్యమైన పెనాల్టీ షూటౌట్‌ను సాధించలేకపోయా,దీంతో జట్టుకు ఓటమి తప్పలేదని మ్యాచ్‌ అనంతరం మెస్సీ పేర్కొన్నాడు. కాగా 2015లో కూడా చిలీ చేతిలోనే అర్జెంటీనా ఓడిపోయింది. అప్పుడు కూడా పెనాల్టీ షూటౌట్‌లోనే చిలీ జయకేతనం ఎగురవేసింది.ఆనాటి ఫైనల్ల్‌ చిలీ 4-1 తేడాతో విజయం సాధించగా,ఈ ఏడాది పోరులో 4-2తో గెలిచింది.ఈ రెండుసార్లు అర్జెంటీనా కెప్టెన్‌గా మెస్సీనే ఉండటం గమనార్హం.క్లబ్‌ జట్టు బార్సిలోనాకు ఎన్నో ట్రోఫీలు అందించిన మెస్సీ అర్జెంటీనా కేవలం రెండు ప్రధాన ట్రోఫీలను సాధిం చడంలో మాత్రమే మెస్సీ భాగస్వామి అయ్యాడు. కాగా అండర్‌-20 వరల్డ్‌ కప్‌,2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన అర్జెం టీనా జట్టులో మెస్సీపాలు పంచుకున్నాడు.
2sports
Sharad Pawar: Lodha Committee report has 'destroyed' cricket ఆ కమిటీతో భారత్‌లో క్రికెట్ నాశనం..! బీసీసీఐ‌లో సంస్కరణల కోసం సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ అందించిన రిపోర్ట్ కారణంగా భారత్‌లో క్రికెట్ నాశనమైందని ఎన్సీపీ చీఫ్, TNN | Updated: Nov 10, 2017, 05:39PM IST బీసీసీఐ‌లో సంస్కరణల కోసం సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ అందించిన రిపోర్ట్ కారణంగా భారత్‌లో క్రికెట్ నాశనమైందని ఎన్సీపీ చీఫ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ఘాటుగా విమర్శించాడు. లోధా కమిటీ సిఫార్సు చేసిన కొన్ని సంస్కరణలను బోర్డులో అమలు చేస్తుండటంపై శరద్ పవార్ స్పందన అడగ్గా.. ఆయన పైవిధంగా స్పందించాడు. 2013 ఐపీఎల్ స్ఫాట్ ఫిక్సింగ్‌‌లో.. అప్పటి వరకు బీసీసీఐ ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి ప్రమేయం పరోక్షంగా ఉండటంతో బోర్డుని సంస్కరించాలని సుప్రీంకోర్టు ఆ కమిటీని 2015లో ఏర్పాటు చేసింది. కమిటీ రిపోర్ట్‌లో ఒక రాష్ట్రానికి.. ఒక ఓటు, ఒక వ్యక్తికి బోర్డులో ఒక పోస్ట్, బీసీసీఐలో ఏ స్థాయి ఉద్యోగికైనా వయో పరిమితి 70 ఏళ్లుగా నిర్ణయించడంతో.. కొన్నేళ్లపాటు బోర్డులో చక్రం తిప్పిన 76 ఏళ్ల శరద్ పవార్ లాంటి వ్యక్తులు తమ అధికారాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. ‘లోధా కమిటీ రిపోర్ట్ నిస్సందేహంగా భారత్‌లో క్రికెట్‌ని సర్వనాశనం చేసింది’ అని శరద్ పవార్ ఘాటుగా వ్యాఖ్యానించడం వెనుక అదే అసలు కారణమని తెలుస్తోంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV సఫారీలపై కోహ్లీ సేన పైచేయి ​సౌతాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్ లో 334 పరుగులకు ఆలౌటైంది TNN | Updated: Dec 4, 2015, 01:32PM IST ​సౌతాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్ లో 334 పరుగులకు ఆలౌటైంది. రహానే సెంచరీ (127) తో కదంతొక్కడంతో ఈ మేరకు స్కోర్ సాధ్యపడింది. ఒకనొక దశలో వికెట్లు వెనువెంటనే పడిపోతున్న తరుణంగా కెప్టెన్ కోహ్లీ(44) రహానేకు అండగా నిలిచాడు. కోహ్లీ ఔట్ అయిన తర్వాత రోహిత్ (1) వికెట్ కీపర్ సాహా (1) వెనువెంటనే ఔటవడంతో టీమిండియా కష్టాల్లోపడింది. ఈ సమయంలో వచ్చిన జడేజా (24) కాసేపు మాత్రమే నిలబడ్డాడు. జడేజా ఔటైన తర్వాత వచ్చిన స్పిన్నర్ అశ్విన్ (56) రహానేకు చక్కటి సహకారాన్ని అందించాడు ఫలితంగా స్కోర్ 300 దాటగల్గింది. నాలుగు టెస్టుల సిరీస్ ను కోహ్లీ సేన ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ను కూడా టీమిండియా తన ఖాతాలో వేసుకోవాలంటే సఫారీలను తక్కవ స్కోర్ వద్దే కట్టడి చేయాల్సి ఉంది. అప్పడే మ్యాచ్ పై కోహ్లీ సేనా పట్టుబిగించగల్లుతుంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆస్కార్ పిస్టోరియస్ నేరస్తుడే! గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్కాంప్ హత్య కేసులో ప్రఖ్యాత ఒలింపియన్ ఆస్కార్ పిస్టోరియస్ నేరస్తుడే అని కోర్ట్ చెప్పింది TNN | Updated: Dec 3, 2015, 07:34PM IST గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్కాంప్ హత్య కేసులో ప్రఖ్యాత ఒలింపియన్ ఆస్కార్ పిస్టోరియస్ నేరస్తుడే అని దక్షిణాఫ్రికా అప్పీళ్ల కోర్ట్ గురువారం నాడు పేర్కొంది.ఈ నేపథ్యంలో గతంలో దిగువ కోర్ట్ ఇచ్చిన తీర్పును ఆ కోర్టు కొట్టివేసింది. ఈ కేసు కింద ఆస్కార్ కు కనీసం తక్కువలో తక్కువగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కేసును విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెపుతున్న వేళ, హతురాలు రీవా స్టీన్కాంప్ తల్లి కూడా కోర్టు హాలులోనే ఉన్నారు. ఆస్కార్ వికలాంగుడైనందున అతగాడి శిక్షను తగ్గించమంటూ అతని తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. 29 ఏళ్ల పిస్టోరియస్ గృహంలో 2013లో ప్రేమికుల దినోత్సవం నాటి ఉదయం వేళ రీవా హత్యకు గురయిన సంగతి తెలిసిందే. గర్ల్ ఫ్రెండ్ రీవాతో (పైల్)
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రివర్స్‌స్వీప్ ఆడబోయి.. బోల్తాపడ్డాడు..! స్పిన్నర్ అక్షర్ బౌలింగ్‌లో వాస్తవంగా బ్యాక్‌వర్డ్ స్కైర్‌లెగ్ దిశగా బంతిని తరలించాలని గుణతిలక యోచించాడు TNN | Updated: Aug 20, 2017, 04:15PM IST భారత్‌తో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ గుణతిలక (35: 44 బంతుల్లో 4x4) ఆశ్చర్యకరరీతిలో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన గుణతిలక.. కవర్స్‌లో ఫీల్డర్ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో 74 పరుగుల వద్ద లంక తొలి వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ అక్షర్ బౌలింగ్‌లో వాస్తవంగా బ్యాక్‌వర్డ్ స్కైర్‌లెగ్ దిశగా బంతిని తరలించాలని గుణతిలక యోచించాడు. అయితే.. షాట్ ఆడటంలో కాస్త తడబడి ముందుగానే బ్యాట్‌ని ఊపేశాడు. దీంతో బంతి బ్యాట్ అంచున తాకుతూ కవర్స్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా క్యాచ్ అందుకున్నాడు. స్వీప్, రివర్స్‌స్వీప్ షాట్స్ ఆడే సమయంలో బ్యాట్స్‌మెన్ షాట్ ఎంపికలో తడబడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ వికెట్ మరోసారి క్రికెట్ ప్రపంచానికి గుర్తు చేసింది.
2sports
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV కోహ్లీసేన ఆధిపత్యాన్ని ముందే ఊహించా: కుంబ్లే భారత్ గడ్డపై ఇటీవల దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడించిన టీమిండియా.. సొంతగడ్డపై వరుసగా 11 టెస్టు సిరీస్‌లు గెలిచిన ఏకైక జట్టుగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. Samayam Telugu | Updated: Oct 26, 2019, 05:48PM IST Team India ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్, ఛాంపియన్‌షిప్‌లో భారత్ టాప్ 2017లో టీమిండియా హెడ్‌ కోచ్‌గా పనిచేసిన అనిల్ కుంబ్లే భారత్ జట్టు ఆధిపత్యాన్ని అప్పట్లోనే ఊహించానని తాజాగా వెల్లడి విదేశీ గడ్డపై కూడా భారత్ జట్టు టెస్టుల్లో ఆధిపత్యం చెలాయించగలదని ధీమా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత్ జట్టు క్రికెట్ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించగలదని తాను ముందే ఊహించినట్లు దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు. వరల్డ్‌కప్‌‌ తర్వాత వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లని టెస్టుల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని కాపాడుకుంటూ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎంతలా అంటే.. ఛాంపియన్‌షిప్‌లో భారత్ జట్టు వరుసగా ఆరు టెస్టు విజయాలతో 240 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఖాతాలో ఉన్నవి 60 పాయింట్లే కావడం విశేషం. Read More: భారత్‌లో బంగ్లాదేశ్ టూర్.. మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే ‘భారత్ జట్టు ఆధిపత్యాన్ని నేను మూడేళ్ల ముందే ఊహించాను. 2016-17లో నేను కోచ్‌గా ఉన్న సమయంలోనే వరల్డ్‌ క్రికెట్‌లో కోహ్లీసేన ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పా. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ మాట నేను కేవలం తుది జట్టులో ఆడే 11 మందిని చూసి చెప్పలేదు. రిజర్వ్ బెంచ్‌‌‌లో ఉన్న నాణ్యమైన క్రికెటర్లని చూసి అంచనా వేశా. ఇప్పుడు కోహ్లీసేన భారత్ గడ్డపైనే కాదు.. విదేశాల్లోనూ విజయాల్ని సాధించగలదు’ అని అనిల్ కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు. Read More: బంగ్లాదేశ్‌తో టీ20, టెస్టు సిరీస్‌కి భారత్ జట్టు ప్రకటన ఈ ఏడాది ఆగస్టు నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలవగా.. అప్పటి నుంచి వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు ఆడిన టీమిండియా.. అన్నింటిలోనూ విజయాల్ని అందుకుంది. దీంతో.. కోహ్లీసేనకి 240 పాయింట్లు దక్కాయి.
2sports
Mumbai, First Published 29, Sep 2018, 10:24 AM IST Highlights సెప్టెంబర్ నెల మదుపర్లకు పీడకల మిగిల్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రూ.12.5 లక్షల మదుపర్ల పొదుపు ఆవిరై పోయింది. రూపాయి పతనం కారణంగా ద్రవ్యోల్భణం, వడ్డీరేట్లు పెరిగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి.  ముంబై: సెప్టెంబర్ నెల ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. దాదాపుగా రెండున్నరేళ్ల పాటు పరుగులు తీసిన బుల్ కుర్రాడు.. అమెరికా అధ్యక్షుడు విసిరిన ట్రేడ్ వార్’ పంజా ముందు విలవిలలాడాడు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో తొలిసారి మదుపర్లు నష్టపోయిందీ ఈ నెలలోనే కావడం గమనార్హం. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధంతో డాలర్ బలోపేతమై.. రూపాయి అంతకంతకు జీవిత కాల కనిష్టం వద్దకు పతనమైంది. ఫలితంగా సెప్టెంబర్ నెలలో స్టాక్ మార్కెట్లు ‘బేర్‌’మనిపించాయి మదుపర్ల సంపదకు భారీగా గండి పడింది. చాలా తక్కువ షేర్లు ఈ నెలలో లాభాలను నమోదు చేయగా.. ఎక్కువ షేర్లు భారీ పతనానికి గురయ్యాయి. వీటికి తోడు బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) ద్రవ్యలభ్యతపై ఆందోళనలను కూడా ఒత్తిడికి గురి చూశాయి. అందుకే సెప్టెంబర్‌లో సెన్సెక్స్‌  2418 పాయింట్లు (5%) నష్టపోగా.. మదుపర్ల సంపద రూ.12.5 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఆగస్టు 31న బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.159.35 లక్షల కోట్లు కాగా, ఈ నెల 27 నాటికి రూ.146.86 లక్షల కోట్లకు పరిమితమైంది. ఒక షేర్  20% పడిపోతే దాని విలువ సరైనదేనా.. కంపెనీ స్వల్పకాల, దీర్ఘకాల అంచనాలు ఎలా ఉన్నాయో గమనించాల్సి ఉంటుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ ఒకటి అంటోంది. కేవలం షేరు విలువను కాకుండా.. మూలాలను బట్టి కొనుగోలు చేయాలని సిఫారసు చేస్తోంది. మార్కెట్‌ ఈ సమయంలో అనిశ్చితిగానే కనిపిస్తోంది. కొన్ని పెద్ద స్థాయి కంపెనీలు, మధ్య, చిన్న స్థాయి కంపెనీలతో పోలిస్తే మెరుగ్గా కనిపిస్తున్నాయి. విద్యుత్‌, ఎగుమతులు, తయారీ రంగాలతోపాటు.. డిపాజిట్లను గట్టిగా సేకరించగలిగే బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టడం మంచిదని ఓ దేశీయ బ్రోకరేజీ సంస్థ అంచనా వేస్తోంది. ఇటువంటి దిద్దుబాట్ల వల్ల మంచి షేర్ల ఎంపికకు వీలవుతుందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌లు బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొందరు మాత్రం బ్యాంకు షేర్లను కొనడం ప్రస్తుతానికి మంచిది కాదని.. స్వల్పకాల మదుపర్లు పడినపుడల్లా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. మూడేళ్లు, అయిదేళ్ల పాటు అయితే ప్రస్తుత స్థాయిల్లో కొనుగోళ్లు మంచివి కానీ.. 6 నెలలు, ఏడాదికైతే మార్కెట్లకు దూరంగా ఉండడం మంచిదని అంటున్నారు. నిఫ్టీ ఇండెక్స్ డిసెంబర్ 2018కల్లా 10,500 చేరొచ్చన్న అంచనా వేస్తున్నారు.  నెలలో స్టాక్ మార్కెట్లు భారీగా చవిచూసిన నష్టాల్లోనూ వేదాంతా, విప్రో, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, ఓఎన్‌జీసీ వంటి కొన్ని పెద్ద షేర్లు.. బయోకాన్‌, రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ వంటి మధ్య స్థాయి షేర్లు లాభాలను అందుకున్నాయి. ఇక ఏబీబీ, దివీస్‌ ల్యాబ్స్‌, ముతూట్‌ ఫైనాన్స్‌, జిందాల్‌ స్టీల్స్, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, టీవీఎస్‌ మోటార్‌, జిలెట్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌ వంటి మధ్యస్థాయి షేర్లు కూడా 1-10% రాణించాయి.  చిన్న షేర్లలో హాత్‌వే, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, బాంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌, త్రివేణి ఇంజినీరింగ్‌, డీసీఎమ్‌ శ్రీరామ్‌, ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌లు 15% పైగా పెరిగాయి. ధమ్‌పూర్‌ షుగర్‌ మిల్స్‌(50%), అవధ్‌ షుగర్‌ అండ్‌ ఎనర్జీ(37%), బజాజ్‌ హిందుస్థాన్‌ షుగర్‌(36%), దాల్మియా భారత్‌(29%), ఉత్తమ్‌ షుగర్‌ మిల్స్‌(28%), ద్వారికేశ్‌ షుగర్ ‌(27%) వంటి చక్కెర షేర్లు లాభాలే పొందాయి. ఈ మార్కెట్‌ పతనంలో చిన్న షేర్లే 90- 60 శాతం దాకా పతనం అయ్యాయి. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, ఇండియన్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ పవర్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌లు 55 శాతం వరకూ దిగాలు పడ్డాయి. ఇక యెస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ 20-40 శాతం మేర చతికిలబడ్డాయి.  రూపాయి క్షీణత వల్ల ఎగుమతిదార్లు మాత్రం ప్రయోజనం పొందితే.. కానీ దేశీయంగా ధరలు పెరగడానికి కారణమైంది. ఇక చమురు దిగుమతి దేశంగా ఉన్న భారత్‌పై 80 డాలర్లకు చేరిన పీపా ధర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. త్వరలో ఇది 100 డాలర్లకు కూడా చేరుతుందన్న భయాలు ఉన్నాయి.  ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు కూడా వినియోగదారు కొనుగోలు శక్తిని నిర్ణయించేవే. ఆహార ధరలు తగ్గడంతో రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణం దిగివచ్చాయి. భవిష్యత్‌లో షేర్ల ధరలపై ప్రభావం చూపే అంశాల్లో ద్రవ్యోల్బణం కీలకం కానుంది. ఇక దీనిపై ఆధారపడే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. జూన్‌ నుంచి ఇప్పటిదాకా రెండు సార్లు రెపో రేటును పెంచింది కూడా. ఆర్‌బీఐ నిర్ణయాలు కూడా మార్కెట్‌కు దిశానిర్దేశం చేయవచ్చు.  సమీప భవిష్యత్‌లో దేశంలో చోటు చేసుకోబోయే అతిపెద్ద పరిణామం ఎన్నికలే. స్టాక్‌ మార్కెట్‌పైనా ఇవి గట్టి ప్రభావాన్నే చూపగలవు. ఓటరు నిర్ణయం ఏదైనా ప్రభావం తప్పదు. ఇక స్థూలంగా చూస్తే భారత్‌ వేంగా వృద్ధి చెందుతున్న దేశంగా పేరున్నప్పటికీ.. కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం 2018-19లో 3.3 శాతానికి పరిమితం చేస్తామని చెబుతోంది. ఇక కంపెనీలు లాభదాయకతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కమొడిటీ ధరలు తగ్గడం వీటికి కలిసివస్తోంది. అయితే వీరికి రుణ వ్యయాలు మాత్రం భారంగానే ఉంటున్నాయి.  అమెరికా, చైనా మధ్య అంతకంతకూ రాజుకుంటున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఎగుమతి ఆధారిత షేర్లకు భారీ అవకాశాలు వస్తున్నాయి. భారత్‌ కూడా ఈ పరిణామం నుంచి సానుకూలతలను అందుకునే అవకాశం ఉంది. ఇక బ్రెగ్జిట్‌ పరిణామాలు, అమెరికా ఆర్థిక వృద్ధి, డాలరు బలోపేతం, విదేశీ మదుపర్ల నిధుల ప్రవాహం తదితరాలు కూడా కీలకం కానున్నాయి. Last Updated 29, Sep 2018, 10:24 AM IST
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బంగ్లాపై గెలిచి ఆసీస్‌ను దెబ్బతీసిన ఇంగ్లండ్! చిట్టగాంగ్ టెస్టులో హోరాహోరీ పోరులో బంగ్లాదేశ్‌పై నెగ్గిన ఇంగ్లండ్ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. ఎలాగో తెలుసా? TNN | Updated: Oct 24, 2016, 04:10PM IST బంగ్లాపై గెలిచి ఆసీస్‌ను దెబ్బతీసిన ఇంగ్లండ్! బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ గెలవడం ద్వారా ఇంగ్లండ్ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడోస్థానానికి ఎగబాకింది. ఈ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు చెరో 108 పాయింట్లతో నిలిచాయి. కానీ దశాంశ స్థానాల్లో ఆధిక్యం వల్ల ఆసీస్‌కు మూడోస్థానం దక్కింది. బంగ్లాపై ఉత్కంఠభరితమైన పోరులో విజయం సాధించడం ద్వారా ఇంగ్లండ్ తన పాయింట్లను మెరుగుపర్చుకోవడం ద్వారా ఆసీస్‌ను వెనక్కి నెట్టింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో ఉండగా, పాక్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య లంక జట్టు ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. దీంతో టెస్టులో అగ్రస్థానాన్ని కోల్పోయిన ఆసీస్ ఇప్పుడు నాలుగో స్థానానికి పరిమితమైంది. ఆసియా గడ్డపై తాను ఆడిన చివరి తొమ్మిది టెస్టు్ల్లోనూ ఆస్ట్రేలియా జట్టు ఓటమిపాలవడం విస్మయానికి గురి చేస్తోంది. ఇదే సమయంలో ఇంగ్లండ్ ఆసియాలో ఆడిన చివరి 9 టెస్టుల్లో 4 గెలిచి, మూడింట్లో ఓడింది. రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. చిట్టగాంగ్‌లో నెగ్గడం ద్వారా ఇంగ్లండ్ జట్టుక అత్యధిక టెస్టు విజయాలను అందించిన కెప్టెన్ల జాబితాలో అలిస్టర్ కుక్ రెండో స్థానానికి చేరుకున్నాడు. 24 విజయాలతో అతడు స్ట్రాస్‌తో కలిసి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. మైకెల్ వాన్ 26 విజయాలతో తొలిస్థానంలో ఉన్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
prithvi shaw slams fourth first-class ton in five matches కుర్రాడి జోరు.. 5 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు 17 ఏళ్ల కుర్రాడు.. ఐదు మ్యాచ్‌ల్లో 4 శతకాలతో దుమ్ము రేపుతున్నాడు. సచిన్ బాటలో సాగుతూ.. టీమిండియా తలుపు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. TNN | Updated: Nov 1, 2017, 04:42PM IST ముంబై నుంచి మరో యువ క్రికెటర్ టీమిండియా తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సచిన్ తరహాలోనే చిన్న వయసులోనే శతకాల మోత మోగిస్తున్న పృథ్వీ షా .. ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనే నాలుగు సెంచరీలు సాధించాడు. 18 ఏళ్లు వచ్చే సరికి అత్యధిక సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో సచిన్ (7) ముందు వరుసలో ఉండగా.. ఈ కుర్రాడు మాస్టర్ బ్లాస్టర్‌‌ను ఫాలో అవుతున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో 17 ఏళ్ల షా భువనేశ్వర్‌లో ఒడిశాతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో బుధవారం శతకం బాదాడు. ఐదు గేముల్లో అతడు వరుసగా 4, 120, 71, 44, 154, 31, 123, 5, 105 చొప్పున పరుగులు చేయడం విశేషం. నాలుగు సెంచరీల్లో మొదటి మూడు రెండో ఇన్నింగ్స్‌లో చేసినవే కావడం గమనార్హం. ఒడిశాపై 68.63 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేసిన షా.. 18 బౌండరీలు బాదాడు. రంజీల్లో అడుగుపెడుతూనే సెంచరీ బాదిన ఈ కుర్రాడు.. దులీప్ ట్రోఫీలో కూడా అరంగేట్రంలో శతకం సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బోర్డ్ ఎలెవన్ తరఫున ఓపెనర్‌గా బరిలో దిగిన షా.. బౌల్ట్ లాంటి పేసర్లు దీటుగా ఎదుర్కొని 66 పరుగులు సాధించాడు. బంతి స్వింగ్ అవుతున్నా.. ఏ మాత్రం తడబడకుండా ఆడిన ఈ కుర్రాడి వయసు 17 ఏళ్లేనని తెలుసుకున్న బౌల్ట్ అభినందించకుండా ఉండలేకపోయాడు.
2sports
Visit Site Recommended byColombia ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే డిక్వెల్లా(1)ని ఔట్ చేసి శ్రీలంకకి షాకిచ్చిన జయదేవ్ ఉనద్కత్ తానేసిన తర్వాత ఓవర్‌లో మరో ఓపెనర్ ఉపుల్ తరంగ (11)ను కూడా పెవిలియన్‌కి పంపేశాడు. మధ్య ఓవర్‌లో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా కుశాల్ పెరీరా (4)ని ఔట్ చేసేయడంతో శ్రీలంక ఆదిలోనే 18/3తో ఒత్తిడిలో పడింది. ఈ దశలో సమరవిక్రమ(21)తో కలిసి గుణరత్నె కాసేపు ఇన్నింగ్స్‌ని నడిపించినా.. హార్దిక్ పాండ్య వరుస ఓవర్లలో వీరిద్దరినీ బోల్తా కొట్టించేయడంతో లంక పూర్తిగా ఒత్తిడిలో పడి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. చివరి ఓవర్ వేసిన హైదరాబాద్ ఆటోడ్రైవర్ కుమారుడు మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో శ్రీలంక 18 పరుగులు పిండుకుంది. ఆ ఓవర్‌లో ధనంజయ ( 11 నాటౌట్: 7 బంతుల్లో 2x4) రెండు ఫోర్లు కొట్టగా.. శనక (29 నాటౌట్: 24 బంతుల్లో 2x6) ఒక సిక్స్ బాదేయడంతో శ్రీలంక 135 పరుగులు చేయగలిగింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
అమ్మాయిలు నచ్చినోడితో పడుకుంటే మీకేంటి-ఆండ్రియా Highlights మీ టూ హ్యాష్ ట్యాగ్ పై స్పందించమన్నందుకు బోల్డ్ గా స్పందించిన యాండ్రియా అమ్మాయిలు నచ్చినవాడితో పడుకుంటే ఎందుకు తొంగిచూస్తారంటున్న యాండ్రియా యాండ్రియా ప్రస్థుతం విశాల్ డిటెక్టివ్ సినిమాలో నటిస్తోంది ఇటీవల కాలంలో మీ టూ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఎంతటి చర్చ జరుగుతుందో చూస్తున్నాం. ఈ హ్యాష్ ట్యాగ్ కు నెటిజన్ల నుంచి, ముఖ్యంగా లేడీస్ నుంచి విశేష స్పందన వస్తోంది. దీనిపై హీరోయిన్లు కూడా విరివిగానే స్పందిస్తున్నారు. తాజాగా స్పందించిన ఓ హిరోయిన్ మాత్రం.. చాలా బోల్డ్ గా మాట్లాడేసింది.   సోషల్ మీడియాలో సంచలనంగా మారిన హ్యాష్‌ టాగ్‌ 'మీ టూ' పై మీ స్పందన అని అడిగిన ప్రశ్నకు హీరోయిన్ ఆండ్రియా దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది. లైంగిక వేదింపులకు తాను వ్యతిరేకం అని, అమ్మాయిలని బలవంతంగా లైంగిక చర్యలకు లాగటం సరికాదంటూనే, అలాగే ఆమె వ్యక్తిగతంగా ఇష్టపడి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు మీరెందుకు ఆ విషయాన్ని మళ్ళీ, మళ్ళీ చూడాలని ప్రయత్నిస్తారు? అంటూ పంచ్ ఇచ్చింది.   ఈ తరహా మాటలు బాలీవుడ్ లో చల్తాహై అన్నట్లుంటుంది కానీ...  సౌత్ హీరోయిన్లకు ఇలా మాట్లాడే ధైర్యం తక్కువే. కానీ హిరోయిన్ ఆండ్రియా మాత్రం... ‘‘ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుందనేది ఆమె వ్యక్తిగత విషయం. ఆ విషయంపై మరొకరు బలవంతం చేయకూడదు. చేయలేరు కూడా. నా సినీ కెరీర్‌లో నాకు లైంగికంగా ఇబ్బందులకు గురిచేసే సమస్యలు ఎక్కడా ఎదురు కాలేదు. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకోవడానికి నేను సిద్ధం'' అని బోల్డ్ గా చెప్పేసింది.   ఇటీవల ముద్దు సీన్ల గురించి కూడా ఆమె ఇలానే షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిద్దార్థ్ సరసన ‘గృహం' సినిమాలో నటించిన ఆండ్రియా.. ఈ చిత్ర ట్రైలర్లో చూపించిన లిప్ లాక్స్ గురించి మీడియా వాళ్లు ప్రశ్నించినపుడు అదే రకం అసహనం తో తనదైన శైలిలో బదులిచ్చింది."లిప్ లాక్ సీన్స్ గురించి కేవలం మీడియానే ఇంకా విమర్శనాత్మక కోణంలో చూస్తోంది.   ఒకసారి రోడ్డు మీదికి వచ్చి చూడండి.. ఈ కాలం యువత ఇలాంటి వాటిని చాలా సహజంగా భావిస్తోంది. లిప్ లాక్ అశ్లీలం, అసభ్యం అనే వాళ్లందరూ నిజ జీవితంలో ముద్దులే పెట్టుకోవట్లేదా? లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని.. దాని గురించి మాట్లాడటం పాత పంచాంగం లాంటి విషయం'' అంటూ కోపాన్ని అనుచుకుంటున్న రీతిలో గట్టిగానే క్లాస్ తీసుకుంది ఈ యాంగ్రీ హాట్ హీరోయిన్. ప్రస్థుతం విశాల్ హీరోగా నటించిన ‘డిటెక్టివ్' చిత్రంలో నటించిన ఆమె సినిమా గురించి కూడా ముచ్చట్లు చెప్పింది. Last Updated 26, Mar 2018, 12:01 AM IST
0business
మ‌ళ్లీ రోడ్డె‌క్క‌నున్న బ‌జాజ్ చేత‌క్ - 'హమారా బజాజ్‌' - స్కూటర్ల విభాగంలోకి రీ ఎంట్రీ - సామాన్యుడికి చేరువయ్యే ప్రయత్నం - అధునాతన స్కూటర్ల విడుదలకు కసరత్తు          సామాన్యుడిని విస్మరించిన ప్రభుత్వాలు గానీ.. వ్యాపారాలు గానీ.. ఎక్కువగా రాణించవని మరోమారు నిరూపితమైంది. ఒకప్పుడు సగటు భారతీయుడు ప్రాణంగా భావించిన 'హమారా బజాజ్‌'.. 'చేతక్‌' వాహనాలు మళ్లీ రోడ్ల మీదకు రానున్నాయి. స్కూటర్లకు పెద్దగా మార్కెట్‌ లేదని, వాటి వల్ల తమ మోటర్‌ సైకిళ్ల వ్యాపారానికి కొంత విఘాతం కలుగుతోందంటూ అయిదు సంవత్సరాల కిందట బజాజ్‌ సంస్థ 'చేతక్‌' స్కూటర్ల ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సంస్థ తన నిర్ణయం మార్చుకోవాలని నిర్ణయించినట్లు ఆటోకార్‌ ఇండియా తెలిపింది. దీనికి కారణం దేశీయంగా స్కూటర్లకు గిరాకీ తిరుగులేకుండా పెరుగుతుండడమే. ప్రజల అభిరుచులు మారడం.. ప్రత్యర్థి కంపెనీలైన హీరో మోటార్‌ కార్ప్‌, టీవీఎస్‌ మోటార్స్‌, సుజుకీ మోటార్‌ సైకిల్స్‌ ఇండియా, మహీంద్రా, వెస్పా వంటి కంపెనీలు వివిధ మోడళ్లలో అధునాతన స్కూటర్లను అందుబాటులోకి తెచ్చి మార్కెట్‌ను ట్యాప్‌ చేసుకుంటుండడం.. తదితర కారణాలు బజాజ్‌ సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకొనేలా చేసినట్లు సమాచారం. స్కూటర్లకే సై: దేశీయంగా ప్రజల అభిరుచులు మారటంతో స్కూటర్లకు గిరాకీ తిరుగులేకుండా పెరుగుతోంది. మోటారు సైకిళ్లతో పోలిస్తే స్కూటర్‌ ప్యామిలీతో బయటకు వెళ్లడానికి, ఏమైనా సామాన్లు తీసుకురావడానికి ఉపయుక్తంగా ఉంటుండడం.. ఇందుకు ప్రధాన కరాణంగా తెలుస్తోంది. కంపెనీలు కూడా వివిధ సౌకర్యాలతో వీటిని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తుండడంతో ప్రజలు ఎక్కువగా వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. 'భారత ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సోసైటీ' తాజాగా వెలువరించిన నివేదిక ప్రకారం ఫిబ్రవరి మాసంలో స్కూటర్ల అమ్మకాలు విభాగం 18.8% మేర పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో మొత్తం 3,12,000 వాహనాలుగా ఉన్న డిమాండ్‌ ఈ ఏడాది 3,70,000 లకు చేరింది. ఏడాది ప్రాతిపదికన (ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య కాంలో) చూడగా స్కూటర్ల వృద్ధి రేటు 26.6% మేర పెరిగి 41.1 లక్షల నుంచి 98.84 లక్షలకు చేరినట్లు సొసైటీ వెల్లడించింది ఈ వార్తపట్ల మధ్యతరగతి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. బజాజ్‌ సామన్యుని అవసరాలు వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే ఏ వాహనానైనా విడుదల చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బజాజ్‌ వాహనాలు మంచి మన్నికతో కూడుకొని ఉంటాయని.. వీటి నిర్వహణ వ్యయమూ చాలా తక్కువగా ఉంటుందని వారంటున్నారు. బజాజ్‌ సంస్థ కూడా తమను సామాన్య ప్రజలు 'హమారా బజాజ్‌' అంటూ తిరిగి అక్కున చేర్చుకుంటారన్న విశ్వాసంతో ముందుకు వెళుతోంది. - నవ తెలంగాణ, వాణిజ్య విభాగం మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
TATA రూ.10,300 కోట్లతో టిసిఎస్‌ షేర్ల బైబాక్‌ ముంబయి, జూన్‌ 9: టాటాగ్రూప్‌ సంస్థలప్రమోటింగ్‌ కంపెనీ టాటాసన్స్‌ ఇటీవల చేపట్టిన షేర్‌బైబాక్‌ పథ కం ద్వారా 10,300 కోట్ల రూపాయలు టిసిఎస్‌ నుంచి వ్యయంచేసింది. 16వేల కోట్ల రూపాయలు షేర్‌బైబాక్‌ పథకాన్ని టిసిఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌లోనే అతిపెద్ద ఐటి సేవల కంపె నీగా నిలిచిన టిసిఎస్‌ మొదట 16వేల కోట్ల రూపా యలతో మెగా బైబాక్‌ను ప్రకటించింది. గత మేనెల 18వ తేదీ నుంచి ప్రారంభించి అదేనెల 31వ తేదీ ముగించింది. మొత్తం 5.61కోట్ల షేర్లను రూ.2850 వద్ద వాటాలను కేటాయించింది. మొత్తం 3.60 కోట్ల షేర్లనుబైబాక్‌ కింద కొనుగోలుచేసింది. మొత్తం వాటా ల్లో 64.2శాతం విలువలతో ఉంటాయని ప్రకటిం చింది. ఇతర ఇన్వెస్టర్లపరంగాచూస్తే సింగపూర్‌ప్రభు త్వం, కాప్‌టహల్‌ మారిషస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, యూరోపసిఫిక్‌ గ్రోత్‌ఫండ్‌ వంటివి ఉన్నాయి. సింగపూర్‌ ప్రభుత్వానికి రూ.335కోట్లు అందాయి. కాప్ట్‌హాల్‌ మారిషస్‌కు 187 కోట్లు, యూరోపసిఫిక్‌ గ్రోత్‌ఫండ్‌ కు రూ.161 కోట్లు ఈ బైబాక్‌ద్వారా నిధులు అందాయి. ఇక చిన్న వాటాదారుల నుంచి స్పందన తక్కువగా ఉంది. సాధారణ కేటగిరీలో ఆర్థికసంస్థలు, విదేశీ ఇన్వెస్టర్లు 12కోట్ల షేర్లను కొనుగోలుకు టెండర్లు దాఖలుచేసారు. వాస్తవానికి వారికి 4.7 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. భార తీయ ఐటి కంపెనీలు తమవద్ద ఉన్న అదనపు నగదు నిల్వలను షేర్‌బ్యాంక్‌ద్వారా ఖర్చుచేయాలని, లేదా డివిడెండ్లు అయినా ప్రకటించాలన్న డిమాండ్‌ వాటాదారుల నుంచి ఎక్కువ ఉంది. టిసిఎస్‌ ప్రత్యర్ధి సంస్థ ఇన్ఫోసిస్‌ కూడా 13వేల కోట్ల షేర్ల బైబాక్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఇలా సపోర్ట్ చేస్తే.. ప్రాణాలైనా ఇస్తాం: ఛెత్రీ భావోద్వేగం మమ్మల్ని తిట్టండి కానీ మేం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు మాత్రం రండంటూ పిలుపునిచ్చి ఛెత్రీ ప్రేక్షకుల మద్దతుతో పులకరించిపోయాడు. Samayam Telugu | Updated: Jun 5, 2018, 09:49AM IST ఇలా సపోర్ట్ చేస్తే.. ప్రాణాలైనా ఇస్తాం: ఛెత్రీ భావోద్వేగం మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ ఆట చూడండని భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఆవేదనతో ఇచ్చిన పిలుపునకు అద్భుత స్పందన లభించింది. ఈ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడికి సచిన్, కోహ్లి లాంటి క్రికెటర్లతోపాటు కేటీఆర్ లాంటి రాజకీయ నాయకులు కూడా మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఛెత్రీ పిలుపుతో దేశం స్పందించింది. సోమవారం ముంబై వేదికగా కెన్యాతో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు జనం పోటెత్తారు. స్టేడియం మొత్తం ప్రేక్షకులతో కిటకిటలాడింది. భారత్ తరఫున వందో మ్యాచ్ ఆడిన సునీల్ ఛెత్రి రెండు గోల్స్‌ చేయడంతో భారత్ 3-0 తేడాతో కెన్యాను మట్టి కరిపించింది. ఈ విజయంతో ఇంటర్ కాంటినెంటల్ ట్రోఫీలో భారత్ ఫైనల్ చేరింది. బైచుంగ్ భూటియా తర్వాత భారత్ తరఫున వంద ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన రెండో ఆటగాడిగా ఛెత్రి రికార్డ్ నెలకొల్పాడు. We promise you that if that’s the kind of support we get every time we play for the country, we will give our live… https://t.co/ZEbAQTN1Gu — Sunil Chhetri (@chetrisunil11) 1528134427000 ఈ స్థాయిలో ప్రేక్షకుల మద్దతు లభించడం పట్ల భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆనందం వ్యక్తం చేశాడు. ‘దేశం తరఫున మేం ఆడేటప్పుడు ప్రతీసారి మీరు ఇలాగే మాకు మద్దతుగా నిలిస్తే.. పిచ్ మీద మా ప్రాణాలైనా ఇస్తాం. ఈ రాత్రి ఎంతో ప్రత్యేకం. అరుపులు, కేకలతో మమ్మల్ని ఉత్సాహపరుస్తూ.. మ్యాచ్ చూడటానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు’ అని ఛెత్రీ ట్వీట్ చేశాడు. .@chetrisunil11 came up with a double on a special night for the @IndianFootball team skipper, that saw the Blue Ti… https://t.co/quDiiPm47H — Indian Super League (@IndSuperLeague) 1528137193000 టీమిండియా కెప్టెన్ చేసిన ఈ భావోద్వేగ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఆ ట్వీట్‌ను 10 గంటల్లోనే 23 వేల మందికిపైగా రీట్వీట్ చేయగా.. 62 వేల మందికిపైగా లైక్ చేశారు. భారతావని మీకు అండగా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేశారు. గత శుక్రవారం నాలుగు దేశాల టోర్నీ ప్రారంభం కాగా.. మొదటి మ్యాచ్‌లో భారత్ 5-0 తేడాతో చైనీస్‌ తైపీపై గెలుపొందింది. కానీ ఈ మ్యాచ్‌కి ఆదరణ కరువైంది. కేవలం 2569 మంది ప్రేక్షకులే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. దీంతో మమ్మల్ని తిట్టండి, కానీ మ్యాచ్ చూసేందుకు రండని సునీల్ ఛెత్రీ ఆవేదనతో ట్వీట్ చేశాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర అంతర్జాతీయ బలహీన సంకేతాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర దిగొచ్చింది. వెండికూడా బంగారం బాటలోనే పయనించింది. Samayam Telugu | Updated: Oct 22, 2018, 06:16PM IST Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో రూ.50 తగ్గిన 10 గ్రాముల బంగారం (99.9 %) ధర రూ.32,220 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల బంగారం (99.5 %) ధర రూ.32,070 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ బలహీన సంకేతాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర దిగొచ్చింది. వెండికూడా బంగారం బాటలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కిలో బంగారం ధర రూ.100 తగ్గింది. ప్రస్తుతం కిలో బంగారం ధర రూ.32,220 వద్ద కొనసాగుతోంది.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌ర్లో చేయాల్సిన 8 ప‌నులు ఇప్ప‌టికైనా స‌క్ర‌మంగా ప‌న్ను ఆదాకు ఉప‌యోగ‌ప‌డే వాటిలో పెట్టుబ‌డులు పెడితే ఈ ఏడాదికి త‌క్కువ ఆదాయ‌పు ప‌న్ను క‌ట్టి, వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి మంచి ప‌న్ను ప్ర‌ణాళిక‌ను క‌లిగి ఉండొచ్చు. అన్ని పెట్టుబ‌డులు, పొదుపు, వ్య‌యాల‌కు సంబంధించిన రికార్డుల‌ను మొద‌ట సిద్దం చేసుకుని ఉండండి. TNN | Updated: Mar 15, 2018, 06:38PM IST ప‌న్ను ఆదాకు ప్ర‌భుత్వం ఎన్నో ఆప్ష‌న్లు ఇస్తుంది. అయితే చివ‌రి వ‌ర‌కూ వాటిని ప‌ట్టించుకోకుండా గ‌డువు ముగిసే స‌మ‌యంలో హ‌డావిడి చేసే ఉద్యోగులు ఎక్కువ‌. అయితే ఇప్ప‌టికీ కంగారు పడాల్సిందేమీ లేదు. ప‌న్ను ఆదా ఆప్ష‌న్లు వాడుకునేందుకు మార్చి 31 వ‌ర‌కూ గ‌డువు ఉంది. ఇప్ప‌టికైనా స‌క్ర‌మంగా ప‌న్ను ఆదాకు ఉప‌యోగ‌ప‌డే వాటిలో పెట్టుబ‌డులు పెడితే ఈ ఏడాదికి త‌క్కువ ఆదాయ‌పు ప‌న్ను క‌ట్టి, వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి మంచి ప‌న్ను ప్ర‌ణాళిక‌ను క‌లిగి ఉండొచ్చు. అన్ని పెట్టుబ‌డులు, పొదుపు, వ్య‌యాల‌కు సంబంధించిన రికార్డుల‌ను మొద‌ట సిద్దం చేసుకుని ఉండండి. దాని త‌ర్వాత ప‌న్ను ఆదా కోసం ఏమేం చేయాలో ఆలోచించండి. ఇదంతా చేసిన త‌ర్వాత ఈ కింద సూచించిన 8 అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా విజ‌యవంతంగా ముందుకువెళ్లండి. అదెలాగో కింద తెలుసుకుందాం. 1. పోర్ట్ ఫోలియో ట్రాక‌ర్ పోర్ట్ ఫోలియో ట్రాక‌ర్ అనేది మీ షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిపాజిట్లు, ఇన్సూరెన్స్, బులియ‌న్ పెట్టుబ‌డుల‌ను ట్రాక్ చేస్తుంటుంది. ఏదైనా పోర్ట్ ఫోలియో ట్రాక‌ర్లో ఖ‌తా సృష్టించుకుని ఉంటే అది కొనుగోళ్లు, అమ్మ‌కాలు, వ్య‌యాలను ట్రాక్ చేస్తుంది. జ‌న‌వ‌రి 31 త‌ర్వాత నుంచి దీర్ఘ‌కాల రాబ‌డి ప‌న్ను అమ‌ల‌వుతుంది కాబ‌ట్టి, జ‌న‌వ‌రి 31 నాటికి ఉన్న మ్యూచువల్ ఫ‌డ్ ఎన్ఏవీని గుర్తు పెట్టుకుని ఉండాలి. ఈటీ మ‌నీ, వాల్యూ రీసెర్చ్ వంటివి ఉచితంగా మీకు పోర్ట్ ఫోలియో ట్రాకింగ్ స‌ర్వీసుల‌ను అందిస్తున్నాయి. Recommended byColombia 2. దీర్ఘ‌కాల ప్ర‌యోజ‌నాలు ఏప్రిల్ 1 నుంచి 10% దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను(ఎల్‌టీసీజీ) అమ‌ల‌వుతుంది. కాబ‌ట్టి అందుబాటులో ఉన్న పెట్టుబ‌డి మార్గాల్లోని లాభాల‌ను అంత లోపు ప‌క్క‌కు తీసుకుంటే మంచిది. అంటే ఏప్రిల్ 1 లోపు లాభాల‌ను బుక్ చేసుకోవాలి. ఈక్విటీల్లో ఎక్కువ‌గా పెట్టుబ‌డి క‌లిగి ఉన్న‌వారు ఈ విధంగా లాభ‌ప‌డ‌తారు. అలా కాకుండా మీ ద‌గ్గ‌ర మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచే కంపెనీల షేర్లు ఎక్కువ కాలం ఉండాల‌నుకుంటే ఈ విధంగా చేయాలి.మొద‌ట ఆ కంపెనీ షేర్లు అమ్మేసి లాభాల‌ను బుక్ చేసుకుని, కొంత కాలం త‌ర్వాత ఆయా కంపెనీ షేర్ల‌ను మ‌ళ్లీ ఒక్కొక్క‌టిగా కొనుగోలు చేయాలి. 3. గ‌తేడాది వార్షిక నివేదిక‌ను నింపాలి అంత‌కుముందు రెండేళ్ల ఐటీ రిట‌ర్నులు ఇప్పుడే అందుబాటులోకి వ‌స్తాయి. కాబ‌ట్టి 2015-16, 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు చెందిన ఐటీ రిట‌ర్నులు మార్చి 31లోపే ఫైల్ చేయాల్సి ఉంటుంది. సాధ్య‌మైనంత వ‌ర‌కూ ఐటీ రిట‌ర్నుల విష‌యంలో జాప్యం వ‌ద్దు. ఐటీ రిట‌ర్నులు ఆల‌స్య‌మైతే పెనాల్టీ చెల్లించాల్సి రావొచ్చు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి గతేడాది ఆదాయం వివ‌రాల‌ను జులై 31లోపే ఐటీ శాఖ‌కు ఇవ్వాలి. స‌వ‌రించిన ఐటీ రిట‌ర్నుల‌ను మార్చి 31లోపే నింపాలి. మీ వ్యాపారంలో న‌ష్టాలు వ‌చ్చి ఉంటే, అదే ఏడాది ఐటీ రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించాల్సిందిగా సూచించ‌డ‌మైన‌ది. మ‌దింపు సంవ‌త్స‌రం గ‌డువు తేదీ ప‌న్ను సంక్ర‌మించే ఆదాయం పెనాల్టీ రూ. 6 ల‌క్ష‌లు రూ.10వేలు రూ. 4 ల‌క్ష‌లు రూ. 1000 రూ. 4 ల‌క్ష‌లు రూ. 5,000 4. పోర్ట్ ఫోలియోను స‌రిచూసుకోవాలి ఆరు నెల‌ల‌కోసారి లేదా సంవ‌త్స‌రానికి ఒక‌సారి పోర్ట్ ఫోలియో స‌మీక్ష చేసుకోవాలి. ఆస్తుల కేటాయింపు స‌మ‌తౌల్యంగా ఉందో లేదో గ‌మ‌నించుకోవాలి. గ‌త కొన్నేళ్ల నుంచి ఈక్విటీ రాబ‌డులు బాగా ఉన్న కార‌ణంగా ఎక్కువ పెట్టుబ‌డులు ఈక్విటీల్లో పెట్టి ఉండొచ్చు. అది ఏ పెట్టుబ‌డిదారుకు మంచిది కాదు. అంతే కాకుండా మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను సైతం స‌మీక్షించుకోవాలి. అయితే సంవ‌త్స‌రం లోపే మ్యూచువల్ ఫండ్ పెట్టుబ‌డుల నుంచి వైదొల‌గ‌డ‌మూ సూచ‌నీయం కాదు. 5. ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు ఆర్థిక సంవత్స‌రం గ‌డువు ముగిసేట‌ప్పుడే చాలా మందికి ప‌న్ను మినహాయింపుల విష‌యం గుర్తుకొస్తుంది. అంతే హ‌డావిడిగా ప‌న్ను ఆదా కోసం సంప్ర‌దాయ పాల‌సీ వైపు మొగ్గుచూపుతారు. ఇది క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన పెట్టుబ‌డి కాద‌ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా యూలిప్ పాల‌సీల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. మార్కెట్ రిస్క్ అధికంగా ఉండే పాల‌సీలు యూలిప్‌. దీనిపై స్టాక్ మార్కెట్ ప్ర‌భావం నేరుగా ఉంటుంది. దానికి బ‌దులు ఒక ట‌ర్మ్ పాల‌సీ తీసుకుని, మిగిలిన ప్రీమియం సొమ్మును మ్యూచువల్ ఫండ్ల‌లో పెడితే మంచిద‌ని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తుంటారు. ఒకేసారిగా మ్యూచువల్ ఫండ్ల‌లో ఎక్కువ డ‌బ్బు పెట్టుబ‌డులు పెట్టే సామ‌ర్థ్యం లేక‌పోతే సిప్ మార్గాన్ని ఎంచుకోవ‌చ్చు. 6. వాలంట‌రీ ప్రావిడెంట్ ఫండ్ వ‌డ్డీ రేట్లు త‌గ్గిన‌ప్ప‌టికీ ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ‌ చెల్లించే వ‌డ్డీ ఇప్ప‌టికీ ఆకర్ష‌ణీయంగానే ఉంది. అంతే కాకుండా ఈపీఎఫ్‌; పీపీఎఫ్ వ‌డ్డీ రేట్ల‌ను పోల్చి చూస్తే చాలా వ్య‌త్యాసం ఉంది. నిపుణులు చెప్పేదాన్ని బ‌ట్టి చూస్తే చాలా డెట్ ప‌థ‌కాల కంటే ఈపీఎఫ్ ద్వారా మంచి రాబ‌డే వ‌స్తుంది. ఈపీఎఫ్‌లో ఎక్కువ సొమ్ము పెట్టుబ‌డి పెట్టాల‌ని భావించేవారు , వీపీఎఫ్‌లో పెట్టుబ‌డి పెట్టే అంశాన్ని ప‌రిశీలించాలి. ఆర్థిక సంవత్స‌రం మొద‌ట్లో కొన్ని రోజుల పాటు వీపీఎఫ్ మార్గంలో పెట్టుబడి పెట్టేందుకు చాలా కంపెనీలు అవ‌కాశం ఇస్తాయి. కాబ‌ట్టి ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌ట్లోనే ఈ పెట్టుబ‌డి మార్గంలో సొమ్ము ఉంచేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక వేసుకోండి. ఈ మేర‌కు సొమ్మును స‌ర్దుబాటును ఇప్ప‌టి నుంచే ప్రారంభించండి 7. వార్షిక బోన‌స్‌లు చాలా కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు బోన‌స్ చెల్లింపుల‌ను ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి నెల‌లోనే చేస్తాయి. బోన‌స్ రాగానే దానితో విలాసాలు చేయ‌డం చాలా మందికి అల‌వాటే. ఏడాదంతా ఉద్యోగంలో క‌ష్ట‌పడి ఉంటారు కాబ‌ట్టి బోనస్ వ‌స్తే ఏంజాయ్ చేయాల‌ని ఉండ‌టం సాధార‌ణ‌మే. బోన‌స్ అనేది వేత‌నం కాకుండా అద‌నంగా వ‌చ్చే సొమ్మే. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ప్లాన్ వేసుకుని బోన‌స్ డ‌బ్బును ఏ విధంగా పెట్టుబ‌డి పెట్టాలో ఆలోచించుకోవాలి. బోన‌స్ డ‌బ్బును ఇదే విధంగా పెట్టుబడి పెట్టాల‌ని క‌చ్చిత‌మైన ఫార్ములా లేదు. అయితే కొన్ని స్థిర‌మైన నిబంధ‌న‌లు ఉన్నాయి. మీ పేరు మీద ఎక్కువ రుణం లేదా క్రెడిట్ కార్డు అప్పు ఎక్కువ‌గా ఉండ‌టం వంటివి ఉంటే, బోనస్ సొమ్మును దీనికి వాడుకోవ‌చ్చు. అది పోనూ మిగిలిన బోనస్ డ‌బ్బును రోజువారీ ఖ‌ర్చుల‌కు వాడుకోవ‌చ్చు, విహార యాత్ర‌ల‌కు వెళ్లేందుకు ఉప‌యోగించుకోవ‌చ్చు. భ‌విష్య‌త్తులో ఈ బోన‌స్ రాద‌ని ఊహించుకుని, ఇప్పుడొచ్చే బోన‌స్‌లో గ‌రిష్టంగా ఎంత వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టొచ్చే ప‌రిశీలించడం ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌రం. 8. టీడీఎస్ మ‌న దేశంలో ఎక్కువ మంది ఉద్యోగుల‌కు ఫేవ‌రెట్ సేవింగ్, పెట్టుబ‌డి మార్గం డిపాజిట్లే. అందుకే ఎఫ్‌డీ, ఆర్‌డీలు చేసేవారు టీడీఎస్ గురించి భ‌య‌ప‌డుతుంటారు. మీకు డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీ ఏడాది లోపు రూ.10 వేలు దాటితో బ్యాంకులు టీడీఎస్ మిన‌హాయించి మిగిలిన సొమ్మును మీ ఖాతాలో డిపాజిట్ చేస్తాయి. టీడీఎస్ మిన‌హాయింపులు పొందాల‌నుకుంటే ఫారం 15జీ లేదా ఫారం 15హెచ్ నింప‌డం మ‌ర‌వొద్దు.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV మణికట్టు స్పిన్నర్లే కాదు.. మేమూ తిప్పగలం మణికట్టు స్పిన్నర్లు మ్యాజికల్‌గా బౌలింగ్ చేస్తారు. అయితే.. చేతివేళ్లతో బంతిని తిప్పే ఆఫ్ స్పిన్నర్లు కూడా వారిలానే మెరుగ్గా బౌలింగ్ చేయగలరు. Samayam Telugu | Updated: Mar 20, 2018, 01:13PM IST మణికట్టు స్పిన్నర్లే కాదు.. మేమూ తిప్పగలం భారత వన్డే, టీ20 జట్టులో గత ఏడాదికాలంగా మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ హవా నడుస్తోంది. దీంతో సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా‌లు సైతం టెస్టులకే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే.. గత ఆదివారం కొలంబో వేదికగా ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన ద్వారా.. చేతివేళ్లతో బంతిని తిప్పే స్పిన్నర్లకి ఇంకా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భవితవ్వం ఉందని యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ నిరూపించాడు. టోర్నీలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన సుందర్ 5.70 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టి.. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో కుల్దీప్ యాదవ్ గాయపడగా.. అతని స్థానంలో సుందర్‌కి సెలక్టర్లు ఈ టోర్నీకి అవకాశం కల్పించారు. ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్‌ జట్టు విజేతగా నిలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్ తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించాడు. ‘భారత్‌ గడ్డపై గత ఏడాది చివర్లో శ్రీలంకతో జరిగిన టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో.. నాకు మళ్లీ అవకాశం దక్కుతుందనే నమ్మకంతోనే ఉన్నా. టోర్నీలో కూడా మానసికంగా అన్నింటికీ సిద్ధమయ్యే ఉన్నా(తుది జట్టులో అవకాశం లేదా వేటు పడటం లాంటివి). కానీ.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ దక్కుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసిన తర్వాత.. దాన్ని టోర్నీ మొత్తం కొనసాగించాలని నిర్ణయించుకున్నా. ఇక జట్టులో పోటీ అంటారా..? మణికట్టు స్పిన్నర్లు మ్యాజికల్‌గా బౌలింగ్ చేస్తారు. అయితే.. చేతివేళ్లతో బంతిని తిప్పే ఆఫ్ స్పిన్నర్లు కూడా వారిలానే మెరుగ్గా బౌలింగ్ చేయగలరు. కానీ.. చాలా జట్లు ఎడమచేతి వాటం స్పిన్నర్లు లేదా లెగ్ స్పిన్నర్లకి మాత్రమే ప్రాధాన్యమిస్తారు. దీనికి కారణం టీ20 ఫార్మాట్‌లో ఆఫ్ స్పిన్నర్లు వేసే కొన్ని బంతులు.. బ్యాట్స్‌మెన్‌ హిట్టింగ్ చేసేందుకు అనుకూలంగా మారుతుంటాయి. కాబట్టి.. ఆ బంతులపై ప్రతి మ్యాచ్‌కి ముందు ఆఫ్ స్పిన్నర్లు ప్రాక్టీస్ చేస్తే సరి..!’ అని వాషింగ్టన్ సుందర్ సూచించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ Highlights రవితేజ, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో మూవీ సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాంతో కల్యాణ్ కృష్ణకు హిట్స్ డిసెంబర్ చివరి వారం  ప్రారంభం కానున్న కొత్త చిత్రం షూటింగ్ రాజా ది గ్రేట్ చిత్రం సక్సెస్ తో మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రవితేజ.. దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోందట. డిసెంబరు చివరి వారంలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.   ప్రస్థుతం రవితేజ నటిస్తున్న ‘టచ్‌ చేసి చూడు’ చిత్రానికి విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ హిరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నారు, కానీ విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.   కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా వచ్చిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. గత కొంత కాలంగా హిట్స్ ఇచ్చిన దర్శకుడికి సినిమా లేదా అనే రూమర్స్ వినిపించిన నేపథ్యంలో తాజాగా వచ్చిన రవితేజ,కల్యాణ్ కృష్ణ కాంబో మూవీ వార్త కల్యాణ్ కృష్ణ రేంజ్ ను నిరూపిస్తోంది. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Hyderabad, First Published 11, Aug 2019, 1:01 PM IST Highlights క్షణం, గూఢాచారి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌ హీరోగా తెరకెక్కుతున్న మరో థ్రిల్లర్ మూవీ ఎవరు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. సైలెంట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న  ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది. రీసెంట్ గా ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇప్పటికే ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.    ఈ ఉత్సాహంలో  విభిన్న రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాని విభిన్న తరహా ప్రేక్షకులకు వెయ్యి మందికి పైగా చూపెట్టారని సమాచారం. సినిమాకు సంభందం లేని కొంతమందిని ఎంపిక చేసుకుని సినిమా చూపెట్టి అభిప్రాయం తీసుకుంటారు. ఆ విధంగా సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేయబోతున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.! ఈ నేఫద్యంలో ఈ సినిమాని ఆగస్ట్ 14 రాత్రి మీడియాకు చూపించబోతున్నారు.  ఇందులో అడివి శేషు ‘విక్రమ్‌’ అనే తమిళ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు.  ఈ సినిమా స్పానిష్ సినిమా రీమేక్‌ అన్న ప్రచారం జరుగుతోంది. 2007లో  రిలీజ్‌ అయిన ది ఇన్విజిబుల్‌ గెస్ట్ కు ఎవరుగా మార్చారంటున్నారు. ఇదే సినిమాను బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీల కాంబినేషన్‌లో బద్లా పేరుతో రీమేక్‌ చేశారు. అయితే స్పానిష్ లో ఓ మహిళ హత్య విషయంలో ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ను అరెస్ట్ చేస్తే, ఇండియన్‌ రీమేక్‌లలో మాత్రం ఓ వ్యక్తి హత్య విషయంలో ఆమె గర్ల్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసినట్టుగా మార్చారు. అయితే ‘ఎవరు’ సినిమా రీమేకా.. కాదా అన్న విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.‘ఎవరు’ సినిమాకు వెంకట్‌ రాంజీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తోంది. Last Updated 11, Aug 2019, 1:01 PM IST
0business
internet vaartha 168 Views జులై 3 నుంచి 7 వరకు టోర్నీ న్యూఢిల్లీ : వచ్చే నెలలో ఐబా ఆధ్వర్యంలో వెనుజులాలో జరుగనున్న ప్రొ బాక్సింగ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌కు ముగ్గురు భారత బాక్సర్లు అర్హత సాధించారు. డబ్ల్యూబిసి టైటిల్‌ విజేత నీరజ్‌ గోయత్‌ (69 కెజీలు),గౌరవ్‌ బిధురి (52 కెజీలు),దిల్బాసింగ్‌( 81 కెజీలు) ప్రొ బాక్సింగ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకిఅర్హత సాధించారు. కాగా 69 కెజిల విభాగంలో భారత్‌ నుంచి మరే బాక్సర్‌ అర్హత సాధించలేకపోవడంతో నీరజ్‌కు అవకాశం దక్కింది.మరోవైపు వరల్డ్‌ డబ్ల్యూఎస్‌బి ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో తన గెలుపు – ఓటములు సమానంగా ఉండటంతో గౌరవ్‌ అర్హత సాధించాడు. ఇదే కేటగిరిలో భారత్‌ నుంచి ఇతర బాక్సర్లు ఎవరూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడంతోకూడా గౌరవ్‌కు కలిసొచ్చింది. ఇదిలా ఉండగా,ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ క్వాలిఫయింగ్‌ టోర్నీలో సుమిత్‌ సంగ్వాస్‌ (81) క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోవడంతో అతని రియో అవకాశాలకు గండి పడింది.దీంతో అదే కేటగిరిలో ప్రొ బాక్సర్‌ దిల్బాగ్‌ సింగ్‌ ఒలింపిక్‌ క్వాలిఫ యింగ్‌ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ప్రొ బాక్సర్ల ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ జులై 3 నుంచి 7 వరకు జరుగనుంది.
2sports
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చిరు సైరా డైలాగులు Highlights మెగాస్టార్ 151వ చిత్రంగా సురెందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సైరా 200కోట్ల భారీ బజట్ తో తెరకెక్కనున్న సైరా నరసింహారెడ్డి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చిరు సైరాకు చెందిన డైలాగులు మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీఎంట్రీతో హ్యూజ్ హిట్ కొట్టి తన సత్తా చాటాడు. ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో... 151వ సినిమాగా సెట్స్‌పైకి వెళ్లనున్న సైరా నరసింహా రెడ్డి ని అత్యంత ప్రతిష్టాత్మకంగా  తీసుకున్నారు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించినదిగా చెబుతున్న ఓ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, కంచె లాంటి చిత్రాలకి అదుర్స్ అనిపించే డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ మళ్లీ చిరు 151వ సినిమాకు కూడా డైలాగ్స్ రాస్తున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ బ్రిటీష్ అధికారిని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎదిరించే క్రమంలో ఓ సన్నివేశం కోసం సాయిమాధవ్ రాసిన డైలాగ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ డైలాగ్ వైరల్ అవుతోంది. "ఒరేయ్.. నేను ఒట్టి చేతులతో వచ్చా... నువ్వు భుజంమీద తుపాకీతో వచ్చావు. అయినా నా చేయి మీసం మీదకు వెళ్లేసరికి నీ బట్టలు తడిచిపోతున్నాయ్ రా" అనే డైలాగ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సైరా సినిమాకు మంచి ప్రమోషన్ కల్పిస్తోంది. ఇలాంటి డైలాగ్స్ తో మెగాస్టార్ చిరంజీవి దుమ్ములేపుతారని టాక్ వినిపిస్తోంది.   ఈ డైలాగ్ లీకై చాలా రోజులే అయినప్పటికీ, మరోసారి ఆన్‌లైన్‌లో హల్చల్ చేస్తోందీ డైలాగ్. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో చిరుతోపాటు అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 6 నుంచి సైరా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV 'బాహుబలి 2' ఖాతాలో రూ.1,500 కోట్ల రికార్డ్ 'బాహుబలి 2' భారతీయ చలనచిత్ర రంగంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇండియన్ సెల్యూలాయిడ్‌పై... | Updated: May 19, 2017, 03:23PM IST Prabhas stills from Baahubali 2 movie బాహుబలి 2 సినిమా భారతీయ చలనచిత్ర రంగంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇండియన్ సెల్యూలాయిడ్‌పై ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా, ఇకపై ఎప్పుడు, ఎవరికి అందుతాయో కూడా తెలియని విధంగా బాహుబలి 2 సినిమా సరికొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తూ మరిన్ని బాక్సాఫీస్ రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఇటీవలే రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఆ తర్వాత అంతే వేగంతో రూ.1,500 కోట్ల కలెక్షన్స్ సాధించే దిశగా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. It's getting Bigger and Bigger... SUCH A REMARKABLE MILESTONE!! THANK YOU EVERYONE FOR YOUR SUPPORT! #1500CroreBaahubali pic.twitter.com/C7htwLDxS7
0business
ఆర్‌బీఐ 'సమీక్ష'పైనే దృష్టి - అంతర్జాతీయ పరిణామాలు కీలకమే నవతెలంగాణ-వాణిజ్య విభాగం రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష, వర్షాలపై అంచనాలు, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఉపాధి రేటు తదితర పరిణామాలను వచ్చే వారం మదుపర్లు కీలకంగా తీసుకోనున్నారు. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రుతుపవనాలు, రూపాయి మారకం విలువ, చమురు ధరలు, యూరప్‌ పరిణామాలు జూన్‌ 6తో ప్రారంభమయ్యే వారంలో దేశీయా స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. కాగా కేరళ తూర్పు ప్రాంతాన్ని రుతుపవనాలు తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. చురుగ్గా రుతుపవనాలు కదిలితే మార్కెట్లకు మద్దతు లభించనుంది. ఏప్రిల్‌ 2016కు సంబంధించి ప్రభుత్వం పారిశ్రామికోత్పత్తి సూచీ గణంకాలను వెల్లడించనుంది. ఈ పరిణామమూ మార్కెట్లకు కీలకం కానుంది. ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ, చమురు ధరలు కీలకం కానున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుత మాసంలో జరుగనున్న అమెరికా ఫెడ్‌ సమావేశం, బ్రిటన్‌ యూరప్‌లో కొనసాగాలా వద్దా అనే దానిపై జరిగే రెఫరెండము ప్రపంచ మార్కెట్లకు కీలకం కానున్నాయి.ఈ నెల 7న రిజర్వు బ్యాంకు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. అయితే ఈ దపా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనుందన్న విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ ప్రధానంగా రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోనుంది. వరుసగా 17 మాసాలు తగ్గిన ద్రవ్యోల్బణం సూచీ ఏప్రిల్‌లో మాత్రం 5.39 శాతానికి పెరిగింది. భవిష్యత్తులో ధరలు పెరగనున్నాయని అంచనా. ముఖ్యంగా 7వ వేతన సంఘ సిఫారసులు అమల్లోకి వస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరగనుంది. దీంతో వస్తువుల ధరలు పెరుగొచ్చు. ఈ ప్రభావం రెండేండ్లపాటు ద్రవ్యోల్బణంపై కొనసాగొచ్చని రిజర్వు బ్యాంకు ఇప్పటికే అంచనా వేసింది. కాగా ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయి. అదే జరిగితే సరుకు రవాణ భారం కానుంది. దీంతో రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణం సూచీలు పెరుగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవేకాకుండా వర్షపాతంతో పాటు వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ తీసుకునే నిర్ణయం కోసం ఆర్‌బీఐ వేచి చూడనుంది. ఈ పరిణామాల నేపథó్యంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో వారంలోనూ ర్యాలీవరుసగా రెండో వారంలోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జూన్‌ 3తో ముగిసిన వారంలో బీఎస్‌ఇ సెన్సెక్స్‌ 189.43 పాయింట్లు లేదా 0.71 శాతం రాణించి 26,843.03 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 64,15 పాయింట్లు లేదా 0.79 శాతం పెరిగి 8,220.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 51 సూచీల్లో 32 స్టాక్స్‌ లాభాల్లో ముగిశాయి. క్రితం వారంలో ముఖ్యంగా టాటా మోటార్స్‌ 16.60 శాతం పెరిగి రూ.316.80 వద్ద నమోదయ్యింది. ఇదే క్రమంలో హిందాల్కో, టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా, అదాని పోర్ట్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఎన్‌టీపీసీ సూచీలు వరుసగా 14.69 శాతం, 12.05 శాతం, 9.72 శాతం, 6.16 శాతం, 5.83 శాతం, 5.42 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు సన్‌ఫార్మాస్యూటికల్‌, భెల్‌, ఐడీయా సెల్యూలర్‌ సూచీలు వరుసగా 10.71శాతం, 7.85 శాతం, 6.86 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. రంగాల వారిగా లోహ, ఆటో బ్యాంకింగ్‌ సూచీలు 4.96 శాతం, 3.76 శాతం, 1.35 శాతం చొప్పున అధికంగా పెరిగాయి. కాగా కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌, వైద్య సూచీలు అధికంగా 2.68 శాతం, 2.63 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. గత వారంలో విదేశీ మదుపర్లు నికరంగా రూ.2,013.70 కోట్ల ఈక్విటీలు కొనుగోళ్లు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.27 శాతం క్షీణించి 67.24 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 6, Feb 2019, 12:36 PM IST Highlights పండగ సీజన్ కు సరిగ్గా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ‘ఎఫ్-2’. వెంకటేష్-వరుణ్ తేజ్ క్రేజీ కాంబినేషన్లో   దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు.  పండగ సీజన్ కు సరిగ్గా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ‘ఎఫ్-2’. వెంకటేష్-వరుణ్ తేజ్ క్రేజీ కాంబినేషన్లో   దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు.  ఈ చిత్రం కలెక్షన్స్ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయ్యినా ఇప్పటికీ దుమ్ము రేపుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు , పేట , వినయ విధేయ రామ చిత్రాలు ఘోర పరాజయం సాధించడంతో ఎఫ్ 2 కు బాగా కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు వాటికి అమెజాన్ ప్రైమ్ ద్వారా దెబ్బపడనుందా అంటే అవుననే చెప్పాలి. అందుతున్న సమాచారం మేరకు 'ఎఫ్ 2: ఫ‌న్ & ఫ్ర‌స్టేష‌న్' చిత్రం అమెజాన్ లో లైవ్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈనెల 11నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది.  ఎఫ్ 2 ఇప్ప‌టికే 25 రోజులు పూర్తి చేసుకుని... దాదాపు 80 కోట్ల మేర షేర్ రాబ‌ట్టింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. అయితే మ‌రో ఐదు రోజుల్లో అంటే ఫిబ్ర‌వ‌రి 11న డిజిట‌ల్ లో లైవ్ లోకి వ‌చ్చేయటం డిస్ట్రిబ్యూటర్స్ ని కాస్త ఇబ్బంది పెడుతోంది.  ఈ రోజుకీ ఎఫ్ 2 చిత్రం చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తూ.. ఇంకా థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌గానే అమెజాన్‌లో రిలీజ్ చేసేస్తుండ‌డం పద్దతి కాదంటున్నారు. అయితే నెల‌రోజుల్లో డిజిట‌ల్ రిలీజ్ చేసుకునేలా నిర్మాత దిల్ రాజు అమెజాన్ తో మొదటే ఎగ్రిమెంట్  చేసుకున్నారు. ఆ ప్ర‌కార‌మే ఈ చిత్రం డిజిట‌ల్ లో లైవ్ కి వ‌స్తోంది.  Last Updated 6, Feb 2019, 12:36 PM IST
0business
వర్మ కామెంట్స్ వింటే పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో.. Highlights ఇటీవలే ఉత్తరాంధ్రతో పాటు పలు చోట్ల జనసేనాని పవన్ పర్యటన పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా పలు అంశాలపై సుదీర్థ ప్రసంగాలు పవన్ ప్రసంగాలపై తాజాగా వెరైటీగా స్పందించిన సంచలన దర్శకుడు వర్మ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ.. చుట్టూ జరుగుతున్న అంశాలపై.. ముఖ్యంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఏదో ఒక విమర్శ చేసి వార్తల్లో నిలుస్తుంటారు. ఏమైందో ఏమో కానీ ఈసారి తన సహజశైలికి భిన్నంగా పవన్ కల్యాణ్ ను పొడగ్తలతో ముంచెత్తారు వర్మ.   తాజాగా పవన్ కల్యాణ్ పై వర్మ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు హాట్ టాపిక్ అయింది. ఇటీవల పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాలు తిరుగుతూ రాజకీయ ప్రసంగాలు ఇచ్చారు. పలు రాజకీయ, సామాజిక అంశాలపై స్పందించారు. తనకు పరిటాల గుండు కొట్టించాడంటూ ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న రూమర్‌పై ఆయన క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ ప్రసంగంపై వర్మ స్పందించారు.   పవన్ కళ్యాణ్ లేటెస్ట్ స్పీచ్ ఇప్పుడే చూశాను. వివిధ అంశాలపై ఆయన స్పందించిన తీరు, ఆయనకు ఉన్న దూరదృష్టిని చూసి థ్రిల్ అయ్యానని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. తనపై ప్రచారంలో ఉన్నరూమర్ల మీద పవన్ కళ్యాణ్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారని, ఎంతో నిజాయితీగా స్పందించారని, ఈ క్రమంలో ఆయా వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ తన మనసులోని భావాలను, ఆలోచనలను ఏ మాత్రం సిగ్గుపడకుండా, దాచకుండా వ్యక్తం చేయడం బాగా నచ్చిందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.   మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తాడు, ఈ విషయంలో ఆయన నుండి నేను పాఠం నేర్చుకున్నాను. ఎందుకంటే, నాకు ఒక స్టుపిడ్ అలవాటు ఉంది.. మాట్లాడేటప్పుడైనా, ట్వీట్ చేసేటప్పుడైనా ఎటువంటి ఆలోచనా చేయకుండా.. అప్రయత్నంగానే చేసేస్తాను... ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ నుండి నేర్చుకుంటాను. ఈ సందర్భంగా ఆయనకు థాంక్స్ చెబుతున్నాను అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.   అన్ని అంశాలపై దూరదృష్టి ఉన్న పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుల్లో ఒకే ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచిపోతారని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
0business
వర్మ మియామాల్కోవాతో సెక్స్ చేశాడా..? వర్మ మాటల్లోనే.. Highlights గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విడియోపై చర్చలో వర్మ మల్కోవాతో షూటింగ్ సమయంలో సెక్స్ పై నిజం చెప్పిన వర్మ మియామల్కోవాను దేవతలా ఆరాధించానన్న వర్మ   సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ జనవరి 25న రిలీజ్ చేయనున్న గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విడియో గురించి ఓ న్యూస్ ఛానెల్ లో చర్చా గోష్టిలో పాల్గొన్నారు. కత్తి మహేష్ తో కలిసి ఈ చర్చలో పాల్గొన్న వర్మ సినిమాతోపాటు తన వ్యక్తిగత అంశాలకు సంబంధించిన విశేషాలపై చర్చించారు. చర్చాగోష్టిలో పాల్గొన్న యువతుల్లో ఓ యువతి ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా మియా మల్కోవాతో సెక్స్ చేశారా అన్న ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు వర్మ చాలా సంతోషం, ఈ ప్రశ్న అడిగినందుకు మీరు నాకు చాలా నచ్చారు అంటూ సమాధానం ఇచ్చారు.   మియా మల్కోవాతో జీఎస్టీ షూటింగ్ సందర్భంగా ఆమె నా ఎదుట నగ్నంగా వున్నా నాకు సెక్స్ చేయాలనే కోరిక కలగలేదు అని వర్మ స్పష్టంచేశారు. ఎందుకంటే నేను చేయగలుగుతానో లేదోననే ఆందోళనతో విరమించుకున్నా. ఆమెలాంటి అందం చూసినప్పుడు దేవతలా ఆరాధించడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదని నాకనిపించింది. అంతటి అందగత్తె కళ్లెదుట నగ్నంగా కనిపిస్తే కల్లప్పగించి చూడటం, ఆరాధించడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. నేను సెక్స్ కోసం ఎవరినీ బతిమాలను. ఆమెకు నచ్చితేనే చేస్తా. బలవంతం చేయను. నేను వందల మందిని సెక్స్ కోసం అడిగా. అలాగని అందరూ ఓకే చెప్పలేదు. వాళ్లు కాదన్నా నాకు ఓకే. అలాగని అడగటం మానలేను కదా. అయితే... సెక్స్ కోసం పవర్ వుపయోగిస్తే అది అర్థం లేనిది అంటూ కాస్టింగ్ కౌచ్ గురించి అడిగిన ప్రశ్నకు వర్మ సమాధానం చెప్పారు. నా కూతురుకు కూడా గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ నచ్చిందని వర్మ చెప్పారు. Last Updated 25, Mar 2018, 11:56 PM IST
0business
Jewellery స్వల్పంగా తగ్గిన బులియన్‌ మార్కెట్‌ న్యూఢిల్లీ,: బంగారం ధరలు పదిగ్రాములు 25రూపాయలు తగ్గి 29,625 రూపాయలుగా నిలిచాయి. బుధవారం మార్కెట్లలో అంతర్జాతీయ ధోరణుల ఆధారంగా స్థానిక జ్యుయెలర్ల నుంచి డిమాండ్‌ తగ్గడం కూడా ఇందుకు కారణమని బులియన్‌ నిపుణులు చెపుతున్నారు. ఇక వెండిపరంగా కూడా 43 వేల స్థాయిని దాటింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో ధరలు పెరిగాయి. విదేశీ మార్కెట్ల లోని క్షీణించిన ధోరణులు డాలర్‌ పటిష్టం కావడం, పసిడికి డిమాండ్‌ స్థానికంగా కూడా తగ్గడంతో దేశీయ స్పాట్‌ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు 0.26శాతం క్షీణించి 1224.60 డాలర్లుగా సింగపూర్‌ మార్కెట్లలో లభించింది. ఇక దేశరాజధాని పరిసర మార్కెట్ల లో 99.9కేరట్లు, 99.5 కేరట్ల బంగారంధరలు 25 రూపాయలు తగ్గి 29,625 రూపాయలు, 29,475 రూపాయలుగా పలికింది. సవర్లలో చూస్తే ఎనిమిది గ్రాముల బంగారం 24,500 రూపా యలుగా నడిచింది. ఇతరత్రా వెండిధరలు కూడా వందరూపాయలు పెరిగి కిలో ఒక్కింటికి 43వేల రూపాయలుధరలు పలికాయి. వారం వారం పంపిణీకిందచూస్తే 95 రూపాయలు పెరిగి 42,585 రూపాయలుగా ధరలు పలికాయి. ఇక వెండినాణేలపరంగా చూస్తే కిలో ఒక్కింటికి 72 వేల రూపా యలు కొనుగోళ్లలోను, విక్రయాల్లో ప్రతి వంద నాణేలు 73 వేల రూపాయలుగాను పలుకుతున్నాయి.
1entertainment
నీ బిడ్డ రంగెంటీ.. డ్రగ్స్ పరీక్షలు.. సెరెనాను కృంగదీస్తోన్న జాతి వివక్ష Highlights ఆటలో స్పీడ్.. గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు...4 ఒలింపిక్ బంగారు పతకాలు.. వివాదాలకు దూరం.. దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ప్రతిభకు ఇవి తార్కాణాలు.. ఆటలో ఎంతగా రాణిస్తున్నా నల్లగా ఉండే ఆమెకు ఇప్పటికీ జాతి వివక్ష వ్యాఖ్యలు తప్పడం లేదు ఆటలో స్పీడ్.. గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు...4 ఒలింపిక్ బంగారు పతకాలు.. వివాదాలకు దూరం.. దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ప్రతిభకు ఇవి తార్కాణాలు.. ఆటలో ఎంతగా రాణిస్తున్నా నల్లగా ఉండే ఆమెకు ఇప్పటికీ జాతి వివక్ష వ్యాఖ్యలు తప్పడం లేదు. ఆటతోనే అందరికీ సమాధానం చెబుతున్నప్పటికీ.. ఆమెను మాటలతోనే హింసిస్తున్నారు.. నిండు గర్భిణీగా ఉన్నప్పుడు నీకు పుట్టబోయే బిడ్డ ఏ రంగులో పుడతాడని జాతివివక్ష వ్యాఖ్యలు ఆమెను తీవ్రంగా కృంగదీశాయి. అయిన్పటికీ ప్రసవం తర్వాత అత్యంత వేగంగా కోలుకుని వింబుల్డన్‌ను తృటిలో చేజార్చుకుని రన్నరప్‌గా నిలిచింది. అయితే తాజాగా ఈ దిగ్గజ క్రీడాకారిణీ మరోసారి ఉద్వేగానికి గురైంది.. అమెరికా డోపింగ్ నిరోధక అధికారులు అందరి కన్నా తనకే ఎక్కువసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఇక్కడ కూడా తాను వివిక్షను ఎదుర్కొంటున్నానని కన్నీటి పర్యంతమైంది.. అధికారులకు డోపింగ్ పరీక్ష చేయాలనిపించే ప్రతి సారీ మొదటి ఛాయిస్ సెరెనానే.. అందరీకంటే ఎక్కువ సార్లు డోపింగ్ పరీక్షలను ఎదుర్కొన్నది తానే.. ఏదీ ఏమైనప్పటికీ చివరికి నేనన్నా ఆటలను స్వచ్ఛంగా ఉంచుతున్నానంటూ ‘‘staypositive’’ అని సెరెనా ట్వీట్ చేశారు. దీంతో ఆమెకు మద్ధతుగా టెన్నిస్ క్రీడాకారులు, అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.   ...and it’s that time of the day to get “randomly” drug tested and only test Serena. Out of all the players it’s been proven I’m the one getting tested the most. Discrimination? I think so. At least I’ll be keeping the sport clean #StayPositive — Serena Williams (@serenawilliams) 25 July 2018 Last Updated 26, Jul 2018, 12:01 PM IST
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఎయిర్ ఏషియాలో 2000 ఉద్యోగాలు ఎయిర్ ఏషియా ఇండియా కార్మికశక్తిని 2,000 వరకు పెంచుకున్నట్లు తెలిపింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ విమానయాన సంస్థ వచ్చే ఏడాది అంతర్జాతీయ సేవలను విస్తరించడానికి అన్ని విధాలుగా సిద్ధమౌతోంది Samayam Telugu | Updated: May 20, 2018, 02:11PM IST ఎయిర్ ఏషియా ఎయిర్ ఏషియా ఇండియా కార్మికశక్తిని 2,000 వరకు పెంచుకున్నట్లు తెలిపింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ విమానయాన సంస్థ వచ్చే ఏడాది అంతర్జాతీయ సేవలను విస్తరించడానికి అన్ని విధాలుగా సిద్ధమౌతోంది. ఎయిర్ ఏషియా గత ఏడాది నుంచి దృష్టి కేంద్రీకరిస్తూ వస్తున్న అంశాల్లో ప్రతిభావంతులైనవారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం ఒకటి. కంపెనీ 2020 నాటికి సిబ్బంది సంఖ్యను మూడింతలు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ ఎయిర్‌లైన్స్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి అమర్ అబ్రోల్ ఇంతకు ముందు ప్రకటించారు. ‘‘ఎయిర్ ఏషియా ఇండియా సిబ్బందిని 2,000 మందికి పెంచుకుని మరో మైలు రాయిని చేరింది. ఒక్క సంవత్సరంలోనే చాలా వరకు సిబ్బందిని పెంచుకుంది.’’ అని కంపెనీ తెలిపింది. టాటాగ్రూపు, మలేషియన్ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా సంయుక్త రంగంలో 51:49 వాటా నిష్పత్తితో ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను నిర్వహిస్తున్నాయి. ఇది 2014 జూన్‌లో సర్వీసులు ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో 20 ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది. 18 ఎయిర్ బస్ ఏ320 విమానాలతో సేవలందిస్తోంది. అంతర్జాతీయ సేవలను మొదలు పెట్టదలచుకున్న ఈ సంస్థ మరో రెండు విమానాలను జత చేసుకుంది. భారత నిబంధనల ప్రకారం దేశీయ విమానయాన సంస్థలు విదేశాలకు ప్రయాణించాలంటే 20 విమానాలు వాటి దగ్గర ఉండాలి. ఎయిర్ ఏషియా ఇండియా 2017-18 మార్చి త్రైమాసికంలో 2016-17 క్యూ 4లో కంటే 74 శాతం ఎక్కువగా 1.47 మిలియన్ల ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేర్చింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Marjaavan Trailer: ఆరడుగుల హీరో, మూడు అడుగుల విలన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో హిందీ సినిమా ‘మర్జావా’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించారు. Samayam Telugu | Updated: Sep 26, 2019, 01:40PM IST మర్జావా బాలీవుడ్‌లో ‘దే దే ప్యార్ దే’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు ఆమె కథానాయికగా నటించిన మరో హిందీ చిత్రం ‘మర్జావా’. సిద్ధా్ర్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తారా సుతారియా ఇందులో మరో కథానాయికగా నటించారు. కాగా ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఎంతటి సాహసాలకైనా బెదరని యువకుడి పాత్రలో సిద్ధార్థ్ నటించాడు. ఆవారాలా తిరుగుతూ అందరితో గొడవలు పెట్టుకునే సిద్దార్థ్‌.. తారా సుతారియాను చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. తారా కూడా ఇష్టపడుతుంది. అలా ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. READ ALSO: ఒక జన్మ సరిపోక 600 ఏళ్ల తర్వాత మళ్లీ పుట్టిన సూపర్ స్టార్స్ అంతా బాగానే సాగిపోతున్న వీరి జీవితంలోకి మూడు అడుగుల విలన్ వస్తాడు. అతనే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్. చూడటానికి మూడు అడుగులే ఉన్నా అతను చాలా డేంజరస్. కనిపించినవారిని చంపుకుంటూ పోతాడు. అలా సిద్ధార్థ్ జీవితంలోకి కూడా వస్తాడు. సిద్ధార్థ్‌, తారాలను చంపేయాలనుకుంటాడు. కానీ సిద్ధార్థ్ అలా జరగనివ్వడు. ‘ప్రేమ కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధమే’ అంటాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ బార్ డ్యా్న్సర్ పాత్రలో నటించారు. ట్రైలర్ మొత్తంలో రకుల్ కేవలం ఓ ఐటెం పాటలోనే కనిపించారు. సినిమాకు మిలాప్ జవేరీ దర్శకత్వం వహించారు. టీ సిరీస్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భూషణ్ కుమార్, దివ్యా ఖోస్లా కుమార్, క్రిషన్ కుమార్, మోనిషా అడ్వాణీ, మధు భోజ్వానీ, నిఖిల్ అడ్వాణీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. X రకుల్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతున్న రెండో సినిమా ఇది. గతంలో వీరిద్దరూ ‘అయ్యారీ’ చిత్రంలో నటించారు. ఇకపోతే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తారా సుతారియాకు ఇది రెండో సినిమా. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ట్రైలర్‌లో ఆమె చాలా అందంగా కనిపించారు. కనీసం ఈ సినిమా అయినా తారాకు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నటుడు సిద్దార్థ్ మల్హోత్రా కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు. ఈ సినిమాతోనైనా తన కెరీర్ మళ్లీ పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి. నవంబర్ 8న ‘మర్జావా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Read More: 3rd T20కి భారత్ జట్టులో రెండు మార్పులు..? భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు టీ20లు ముగియగా.. సిరీస్‌ విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. అక్కడ కూడా రిషబ్ పంత్‌ గురించి చర్చ రావడంతో సీరియస్ అయ్యాడు. రెండో టీ20కి ముందు రోహిత్ మీడియాతో మాట్లాడుతుండగా.. జర్నలిస్ట్ ఫోన్ రింగ్ అవడంతో ‘సెలైంట్‌లో పెట్టండి బాస్’ అని అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. Read More: ధోనీ వ్యూహంతో భారత్‌ని ఓడించిన బంగ్లా‌దేశ్ ‘రిషబ్ పంత్ గురించి ప్రతి రోజు, ప్రతి నిమిషం చర్చ జరుగుతోందని మీకు తెలుసు. కానీ.. మీకు నేను చెప్పేది ఒక్కటే.. అందరూ అతడి నుంచి కాస్త చూపు పక్కకి తిప్పుకోండి. వాస్తవానికి రిషబ్ పంత్ బెరుకులేని క్రికెటర్. టీమిండియా అతడి నుంచి సహజసిద్ధమైన ఆటని ఆశిస్తోంది. అయితే.. అతను స్వేచ్ఛగా ఆడాలంటే మాత్రం.. ఫస్ట్ అందరూ అతని గురించి చర్చించడం కొద్దిరోజులు మానేయాలి. మైదానంలో జట్టు కోసం రిషబ్ పంత్ ఏం చేయాలని ఆశిస్తున్నాడో..? అది చేయనివ్వడమే ప్రస్తుతం ఉత్తమం’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. Read More: రోహిత్ శర్మ 6, 6, 6 వెనుక గొడవే కారణమా..?   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్‌ సంచలనం.. నెంబర్‌వన్‌ను ఓడించి స్వర్ణం Highlights ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో భారత యువ సంచనలం లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు.  ఏకంగా ప్రపంచ నెంబర్‌వన్‌ను మట్టికరిపించి దేశానికి స్వర్ణం సాధించాడు ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో భారత యువ సంచనలం లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు.  ఏకంగా ప్రపంచ నెంబర్‌వన్‌ను మట్టికరిపించి దేశానికి స్వర్ణం సాధించాడు.. ఆదివారం ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో మ్యాచ్‌లో వరల్డ్ జూనియర్ ఛాంపియన్ థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవత్ వితిద్ శరణ్‌ను 21-19, 21-18 తేడాతో ఓడించి ఆసియా ట్రోఫీ అందుకున్నాడు. తద్వారా ఈ ఛాంపియన్ షిప్‌లో విజేతగా నిలిచిన మూడో భారత షట్లర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకు ముందు దివంగత గౌతమ్ టక్కర్, పీవీ సింధులు భారత్ తరపున ఈ ఘనత సాధించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన లక్ష్యసేన్ 2016లో ఈ టోర్నీలో కాంస్య పతకం సాధించాడు.. ఈ ఛాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి లక్ష్యసేన్ అన్నీ సంచనాలే నమోదు చేశాడు. ఫైనల్ ముగిసిన అనంతరం సేన్ మాట్లాడుతూ... ‘‘ ఈ టోర్నీలో తీరిక లేకుండా ఆడాను.. వాస్తవంగా కాలి గాయంతో ఛాంపియన్‌షిప్‌కు ముందు ట్రైనింగ్ సరిగా తీసుకోలేదు.. విపరీతంగా పెయిన్‌కిల్లర్స్‌ను వాడాను.. టాప్ ఆటగాళ్లందరినీ గతంలో ఎదుర్కొని ఉండటంతో నాకు వారి ఆటపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని.. అది ఈ టోర్నీలో బాగా ఉపయోగపడిందని సేన్’’ అన్నాడు.  Last Updated 23, Jul 2018, 10:59 AM IST
2sports
Visit Site Recommended byColombia ఈ సందర్భంగా మహేష్ తల్లి ఇందిర దేవి అపురూపమైన ఫోటోని ట్విట్టర్‌‌లో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అమ్మా.. ‘భరత్ అనే నేను’ ఇన్ సినిమాస్ నౌ’.. ‘ఈ ప్రత్యేకమైన రోజున నా హృదయానికి దగ్గరైన సినిమాను అందరి ముందుకు తీసుకురావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది అంటూ మహేష్ చేసిన ఎమోషనల్ ట్వీట్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీంతో మహేష్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇందిర దేవి ఫోటోను విపరీతంగా షేర్ చేస్తుండటంతో వైరల్‌గా మారింది. It is overwhelming for me to present a film so close to my heart on this special day. Happy Birthday, amma :) :) Bh… https://t.co/URXPlId6Vb — Mahesh Babu (@urstrulyMahesh) 1524162639000 కాగా భారీ అంచనాలతో శుక్రవారం థియేటర్స్‌కి వచ్చిన ‘భరత్ అనే నేను’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రిమియర్ టాక్ బయటకు రావడంతో యంగ్ అండ్ డైనమిక్ సీఎం అదరొగొట్టేశాడంటూ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. #BharathAneNenu Cutout (63 hight & 24 Width) @ Archana70MM, NELLORE https://t.co/Ba9pg5Rpvn — eluru movies369® (@movies369) 1524117856000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
అవును పవన్ పిచ్చోడే.. మరి మీరు.. తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు Highlights ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారడ్డి భరద్వాజ్ ఆయన మనసులో ఏముంటే అదే మాట్లాడుతారు ఏదైన నికచ్చిగా ఉంటారు. రీసెంట్ గా  ఒక ఇంటర్వ్యూ లో ఆయన తాజా రాజకీయాలపై ప్రస్తుత పరిమాణాలపై స్పందించారు​ ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారడ్డి భరద్వాజ్. ఆయన మనసులో ఏముంటే అదే మాట్లాడుతారు. ఏదైన నికచ్చిగా ఉంటారు. రీసెంట్ గా  ఒక ఇంటర్వ్యూ లో ఆయన తాజా రాజకీయాలపై ప్రస్తుత పరిమాణాలపై చర్చించారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పై చాలా పాజిటివ్ గా స్పందించారు. ఆయన మాట్లాడుతు... పవన్ కల్యాణ్ టీడీపీ బీజేపీల డ్రామాపై మాట్లాడటం. ఈ రెండు పార్టీలు నాలుగేళ్లుగా తెలుగు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇంతలోనే టీడీపీ నుంచి ఎటాక్ మొదలైంది. పవన్ ను పిచ్చివాడని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పిచ్చివాడైతే.. 2014లో ఆయన ఇంటికెళ్లి మద్దతు ఎందుకు కోరారు? ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సంజీవని అన్నారు.. ఆ తర్వాత కాదన్నారు. ఆయన గురించి చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్లు, వామపక్షాలు మాట్లాడితే మీడియా కూడా పట్టించుకోలేదు. కానీ పవన్ కల్యాణ్ మాట్లాడాక ఒక చర్చ మొదలైంది. మీడియా కూడా దానిపై చర్చ చేస్తోంది. అందుకే ట్విట్టర్ మెసేజ్‌లతో ఒరిగేదేమి ఉండదు.. నువ్వు జనంలోకి రావాలని పవన్ కల్యాణ్‌కు గతంలోనే చెప్పా. ఇప్పటికైనా ఆ పని చేసినందుకు సంతోషం. ఆయన ఇదే స్టాండ్ మీద ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. కాబట్టి.. హ్యాట్సాఫ్ టు పవన్ కల్యాణ్.. అయితే అది నిన్నటివరకే. ఆ తర్వాత కూడా ఆయన ఇదే స్టాండ్‌పై ఉంటారా?.. లేక ఎప్పటిలాగే స్టాండ్ మారుస్తారా? అన్నది చూడాలి. బీజేపీ వాళ్లు మాట్లాడితే కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. ఆ పార్టీ పనైపోయింది. రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పరిస్థితి అందరికీ తెలిసిందే. కాబట్టి.. వాళ్లు ఏం పీకలేకపోయారనే కదా ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చారు. మీరు దాని గురించి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీనే విమర్శిస్తూ కూర్చుంటే ఎలా?. మొత్తానికి మొన్న రాజస్తాన్ లో దెబ్బ, నిన్న యూపీలో దెబ్బ.. అలాగే నాసిక్ నుంచి ముంబైకి రైతుల పాదయాత్ర.. ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో భయంకరమైన అసంతృప్తి ఉందనేది స్పష్టమవుతోంది. Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
First Published 29, Jun 2019, 11:44 AM IST ఒక సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడాలంటే సినిమా టైటిల్ అనేది చాలా ముఖ్యం. ఒక సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడాలంటే సినిమా టైటిల్ అనేది చాలా ముఖ్యం. వీలైనంత క్యాచీగా పెట్టాలని మన దర్శకనిర్మాతలు ఆలోచిస్తుంటారు. రకరకాల విషయాలను కన్సిడర్ చేస్తూ టైటిల్స్ పెడుతుంటారు. ఒక్కోసారి హీరో పేర్లు, కొన్నిసారి కవితాత్మకమైన టైటిల్స్ పెడుతుంటారు. అలానే కొన్నిసార్లు కథలను బట్టి ఊర్ల పేర్లను కూడా పెడుతుంటారు. అలాంటి సినిమాలేవో ఇప్పుడొకసారి చూద్దాం! భీమిలి - నాని కులుమనాలి - విమలారామన్, శశాంక్ కేరాఫ్ కంచరపాలెం హనుమాన్ జంక్షన్ - జగపతిబాబు, అర్జున్ రేణిగుంట - తమిళ డబ్బింగ్ సినిమా అనంతపురం - జై, స్వాతి బొంబాయి - అరవింద స్వామీ అన్నవరం - పవన్ కళ్యాణ్ గంగోత్రి - అల్లు అర్జున్ భద్రాచలం - శ్రీహరి
0business
విప్రో సంస్థను వీడేదిలేదు..! - లేఖ ద్వారా ఉద్యోగులకు అజీమ్‌ ప్రేమ్‌జీ భరోసా బెంగళూరు : విప్రో వ్యవస్థాపకులు ఆయన కుంటుంబ సభ్యులు సంస్థలో తమకున్న వాటాను విక్రయించే ప్రయ త్నాల్లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఆ సంస్థ చైర్మెన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ ఖండించా రు. ఈ వార్తలు పూర్తి నిరాధారమైనవని.. అవాస్తవమని ఆయన అన్నారు. విప్రోలో వాటాల విక్రయపు వార్తలకు సంబంధించి స్పందించిన అజీమ్‌ ప్రేమ్‌జీ ఉద్యోగులకు ఈ విషయమై లేఖ రాశారు. విప్రో స్థానిక మార్కెట్లో చిన్న వంటనూనెల కంపెనీ స్థాయి నుంచి.. విశ్వ దిగ్గజ సంస్థల స్థాయికి చేరే ప్రస్థానాన్ని తాను చాలా దగ్గరగా వీక్షించానని ఆయన అన్నారు. రానున్న రోజ్లుల్లోనూ మంచి వృద్ధిని నమోదు చేయగల సామర్థ్యం విప్రో సొంతమని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. గత 50 ఏండ్లలో విప్రో సాగించిన విజయ ప్రస్థానం మున్ముందు కూడా కొనసాగిస్తామని అజీమ్‌ స్పష్టం చేశారు. వృద్ధికి మంచి అవకాశం ఉన్న ఐటీ రంగంలో విప్రో ప్రయాణం సాఫీగా సాగుతున్నట్టుగా ఆయన తెలిపారు. వీటికి తోడు ఖాతాదారుల విజయాన్ని అందించేందుకు, సంస్థ విజయ పథంలో ఉరకలేసేందుకు కావాల్సిన శక్తి విప్రోకు ఉందని లేఖలో పేర్కొన్నారు. దీని కొనసాగింపునకు గాను తాను కంకణబద్దుడినై ఉన్నటు వివరించారు. వాటా విక్రయించునన్నుట్టు వస్తున్న వార్తలు నమ్మవద్దని.. తాను సంస్థ వీడనని ఉద్యోగులకు భరోసానిచ్చారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 130 Views హైదరాబాద్‌ :  లైఫ్‌స్టైల్‌ రంగంలో అగ్ర గామి స్టోర్‌గా వస్తున్న ఈజీబైస్టోర్లను ఇప్పటికే రెండు, మూడోశ్రేణి నగరాలకు విస్తరించామని, దక్షిణభారత్‌లో తమస్టోర్ల సంఖ్యను 12కు పెంచా మని, మరికొన్నింటిని ఏర్పాటుకు సమాయత్తం అవుతున్నట్లు ఈజీబై బిజినెస్‌ హెడ్‌ ఆనంద్‌ అయ్యర్‌ వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లు తమకు ఎంతో కీలకమని, అందులోనూ తెలంగాణలో తమకు అపారమైన మార్కెట్‌ వనరులున్నట్లు గుర్తించామని, అందుకే తెలంగాణలో విస్తరిస్తున్నట్లు తెలిపారు. ల్యాండ్‌మార్క్‌ గ్రూప్‌ నుంచి కొత్త వాల్యూరిటైల్‌ ఫార్మాట్‌ ఈజీబైను మధ్యతరగతిప్రజలు లక్ష్యంగా చేసుకుని ప్రారంభిస్తామ న్నారు. నవ్‌భారత్‌లో నాన్‌మెట్రోనగ రాలు, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈజీబై విస్తరించనున్నట్లు ఆనంద్‌ అయ్యర్‌ వివరించారు. తెలంగాణలోని వరంగల్‌ లో ఈజీబై మెగాస్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్‌ మార్క్‌గ్రూప్‌లోనే లైఫ్‌స్టైల్‌, మాక్స్‌, స్పార్‌ ఇండియా వంటి బ్రాండ్లు ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతంలో తమ పెట్టు బడులు పెంచుతూ కొత్త స్టోర్లను తెరుస్తామని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో వాల్యూ ఫ్యాషన్‌ మార్కెట్‌లో బలమైన ఉనికిని చాటగల మన్న ధీమా వ్యక్తంచేశారు. సుమారు వెయ్యికి పైగా స్టైల్స్‌లో రూ.69 నుంచి రూ.699 ధరల శ్రేణిలో ఉంటాయన్నారు. డిజైన్‌, సీజన్‌కు సం బంధించిన రంగులు ఏర్పాటు చేయడం తమకు మాత్రమే వీలయిందని ఆనంద్‌ అయ్యర్‌ అన్నా రు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై ఢిల్లీ, ఎన్‌సిఆర్‌, పుణె వంటి కీలక నగరాల్లో స్పార్‌స్టోర్లలో ఈజీబై లేబుల్‌ను హైపర్‌మార్కెట్లలో విడుదలచేసామ న్నారు. మెన్స్‌వేర్‌, లేడీస్‌వేర్‌, కిడ్స్‌వేర్‌, ఫుట్‌ వేర్‌, ఇతర విడి ఉత్పత్తుల పరంగా ఈజీబై బ్రాండ్‌ కింద విక్రయిస్తామని ఆనంద్‌ అయ్యర్‌ వివరించారు.
1entertainment
Hyderabad, First Published 4, Oct 2019, 12:11 PM IST Highlights లాంబోర్ఘినీ యూరస్ మోడల్ కారు అది. దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా..? మూడు కోట్లకు పైగానే.. రీసెంట్ గానే రణవీర్ ఈ కారును సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది 'గల్లీ బాయ్' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం '83' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ హీరో తన కొత్త కారులో ముంబైలో షికారు చేస్తూ కనిపించారు. ఇంకా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ రాని కారులో రణవీర్ షికారు చేస్తూ.. కొత్త కారు కొన్న విషయాన్ని తెలియజేశాడు. లాంబోర్ఘినీ యూరస్ మోడల్ కారు అది. దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా..? మూడు కోట్లకు పైగానే.. రీసెంట్ గానే రణవీర్ ఈ కారును సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ కారుని తనే స్వయంగా ముంబై  వీధుల్లో నడుపుతూ ఫోటోలను ఫోజులిచ్చాడు. దీంతో రణవీర్ కారు స్టోరీ బయటకి వచ్చింది. రణవీర్ లాంటి హీరో మూడు కోట్లు పెట్టి కారు కొనడం పెద్ద విషయమేమీ కాదు. ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే రణవీర్ కి మూడు కోట్లు అనేది తను ఒక సినిమా తీసుకునే రెమ్యునరేషన్ లో నాలుగో వంతు. కానీ మూడు కోట్ల విలువైన కారు అంటే ఇండియన్స్ కి అది పెద్ద విషయమే. రణవీర్ గ్యారేజ్ లో ఇలాంటి కార్లు మరిన్ని ఉండే ఉంటాయి!
0business
Suresh 101 Views gujarath fortune jiants gujarath fortune jiants అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ విజయ పరంపర కొనసాగుతొంది. వరుసగా నాలుగు విజయాలు సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగూళూర్‌ బుల్స్‌ను 27-24 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో గుజురాత్‌ జట్టుకు చెందిన సచిన్‌ 4రైడ్‌, పర్వీశ్‌ 4ట్యాకిల్‌ పాయింట్లు సాధించారు.
2sports
Kings punjab పంజాబ్‌: 170-9, కోల్‌కతా లక్ష్యం: 171 కోల్‌కతా: ఇక్కడ జరగుతున్న ఐపిఎల్‌ మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఎలెవన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసి, కోల్‌కతాకు 171 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్స్‌ ఆమ్లా (25), నోహ్రా (28) మ్యాక్స్‌వెల్‌ (25), మిల్లర్‌ (28),సాహా (25) పరుగులు చేశారు.. నైట్‌ రైడర్స్‌ బౌలర్లు ఉమేష్‌ యాదవ్‌ 4, ఓక్స్‌2, నరేన్‌, పియూష్‌ గ్రాండూమ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.
2sports
Hyderabad, First Published 6, Nov 2018, 11:07 AM IST Highlights స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో.. మలయాళంలో కూడా అంతే క్రేజ్ ఉంది. అక్కడ ప్రేక్షకులు బన్నీని మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకుంటుంటారు. ఇటీవల కేరళలో వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో.. మలయాళంలో కూడా అంతే క్రేజ్ ఉంది. అక్కడ ప్రేక్షకులు బన్నీని మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకుంటుంటారు. ఇటీవల కేరళలో వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వంతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ రూ.25 లక్షల సహాయాన్ని అందించారు. కేరళని ఆదుకోవాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు. దీంతో కేరళ ప్రభుత్వం బన్నీని ప్రత్యేకంగా అభినందించింది. ఇప్పుడు కేరళ ప్రభుత్వం నుండి బన్నీకి ఓ ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇప్పుడిప్పుడే కేరళ కోలుకుంటోంది. ఈ క్రమంలో అక్కడ పడవల పోటీలు నిర్వహించబోతున్నారు. దీనికి ప్రత్యేక అతిథిగా రావాలని అల్లు అర్జున్ ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అలప్పిలోని మాడ లేక్ లో జరగనున్న ఈ పోటీలో మొత్తం 81 బోట్లు పాల్గోనున్నాయి. పడవల పోటీకి బన్నీ తప్పకుండా వెళ్తాడని తెలుస్తోంది!
0business
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
- యాక్సిస్‌లో అత్యధికంగా రూ.46 కోట్ల మార్పిడి -14 కేేసులు నమోదు - 167 మంది అధికారులపై సస్పెన్షన్‌ న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు సమయంలో వివిధ బ్యాంకుల ద్వారా అక్రమంగా దాదాపు రూ.71.47 కోట్ల విలువైన నగదు మార్పిడి జరిగినట్టుగా సర్కారు శుక్రవారం లెక్క తేల్చింది. నవంబరు 8 నుంచి డిసెంబరు 30 మధ్య కాలంలో రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్ల స్థానంలో అక్రమంగా కొత్త నోట్లు మార్పిడి జరిగినట్టుగా తమ దృష్టికి వచ్చినట్టు ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. ఇలాంటి అవకతవకల్లో పాలు పంచుకున్న బ్యాంకు ఉద్యోగులపై ఆయా శాఖల్లో 14 కేసులు నమోదైనట్టుగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ శుక్రవారం లోక్‌సభకు వివరించారు. అత్యధికంగా యాక్సిస్‌ బ్యాంకునకు చెందిన మూడు శాఖల ద్వారా దాదాపు రూ.46.29 కోట్ల సొమ్ము మార్పిడి జరిగినట్టు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ముగ్గురిపై సస్పెండ్‌ వేటు పడినట్టు తెలిపారు. ధనలక్ష్మి బ్యాంకునకు చెందిన పలు శాఖల ద్వారా దాదాపు రూ.22.67 కోట్ల మేర అక్రమ సొమ్ము మార్పిడి జరిగినట్టుగా మంత్రి వివరించారు. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌లో రూ.1.9 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో రూ.54.90 లక్షలు, సిండికేట్‌ బ్యాంక్‌ ద్వారా రూ.6 లక్షల మేర అక్రమ మార్పిడి జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. 156 మంది సీనియర్‌ బ్యాంకు అధికారులపై వేటు: జైట్లీ న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో 'ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో' (పీఎస్‌బీ) అవకతవకలకు పాల్పడిన దాదాపు 156 మంది సీనియర్‌ అధికారులను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్టుగా సర్కారు తెలిపింది. మరో 41 మందికి స్థానచలనం కల్పించినట్టు ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పీఎస్‌బీలలో జరిగిన అవకతవకల గురించి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌లో ప్రకటన చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్యాంకులు ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం అందించినట్టుగా ఆయన తెలిపారు. క్రిమినల్‌ కేసులలో ఇరుక్కున్న వారిపై పోలీసులు, సీబీఐ వద్ద దాదాపు 26 కేసులు నమోదైనట్టుగా పీఎస్‌బీలు వెల్లడించినట్టుగా మంత్రి పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు సమయంలో ప్రయివేటు బ్యాంకుల్లో అవకతవకలకు సంబంధించి దాదాపు 11 మంది ఉద్యోగులను ఆయా బ్యాంకులు సస్పెండ్‌ చేసినట్టుగా ఆర్‌బీఐ సర్కార్‌కు సమాచారం ఇచ్చినట్టు జైట్లీ తెలిపారు. అవకతవకలకు సంబంధించి బ్యాంకులు అంతర్గత విచారణను చేపట్టినట్టు ఆయన వివరించారు. పోలీసులు, సీబీఐ వద్ద వీటికి సంబంధించి కేసులు కూడా నమోదైనట్టు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 2, Jul 2019, 1:25 PM IST Highlights యువ హీరో రామ్ - డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  యువ హీరో రామ్ - డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మాస్ కాంబో మొదట టైటిల్ నుంచి ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది.  సాంగ్స్ అండ్ టీజర్ కూడా అంచనాలు రేపడంతో సినిమా రిలీజ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ ఖతమ్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ట్రైలర్ ను కూడా రిలీజ్ చెయ్యాలని పూరి గ్యాంగ్ ప్లాన్ వేస్తోంది.  రామ్ సరసన నాభా నటాషా - నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయిపోగానే జులై 18న సినిమాను రిలీజ్ చేయనున్నారు. గత కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్న పూరికి రామ్ కి ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. మరి వారికి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందిస్తుందో చూడాలి. Last Updated 2, Jul 2019, 1:39 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ధోనీ 300వ వన్డే.. భారత్ జట్టులో 3 మార్పులు..! శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌‌లో ఇప్పటికే 3-0తో ఆధిక్యం సాధించిన భారత్ జట్టు గురువారం జరుగుతున్న నాలుగో TNN | Updated: Aug 31, 2017, 02:27PM IST శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌‌లో ఇప్పటికే 3-0తో ఆధిక్యం సాధించిన భారత్ జట్టు గురువారం జరుగుతున్న నాలుగో వన్డేకి తుది జట్టులో మూడు మార్పులు చేసింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కి విశ్రాంతినివ్వగా అతని స్థానంలో యువ పేసర్ శార్ధూల్ ఠాకూర్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. మిడిలార్డర్‌లో టోర్నీ ఆరంభం నుంచి విఫలమవుతున్న కేదార్ జాదవ్‌పై వేటు వేసిన కెప్టెన్ కోహ్లి.. మనీశ్ పాండేకి ఛాన్సిచ్చాడు. మరో స్పిన్నర్ చాహల్‌కి విశ్రాంతినివ్వగా అతని స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కి అవకాశం దక్కింది. ఈ వన్డేతో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ కెరీర్‌లో 300వ వన్డే మైలురాయిని అందుకున్నాడు. భారత్ జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, మనీశ్ పాండే, ధోని , హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, శార్ధూల్ ఠాకూర్
2sports
PRO KABADI ప్రో కబడ్డీ లీగ్‌: నేటి నుంచి ఐదో సీజన్‌ ముంబయి: భారత దేశ సంప్రదాయక గ్రామీణ క్రీడ కబడ్డీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. గ్రామాలకే పరిమితమైన ఈ ఆట ప్రో కబడ్డీ లీగ్‌ పేరుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గత నాలుగు సీజన్లతో ప్రో కబడ్డీ లీగ్‌ కబడ్డీ అభిమానులను అలరించింది.ఈసారి ఐదో సీజన్‌ 12 జట్ల మధ్య టైటిల్‌ సమరం జరగనుంది. ఐదో సీజన్‌ శుక్రవారం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ లీగ్‌లో 8జట్లు ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో నాలుగు జట్టు కొత్తగా చేరుతున్నాయి.దీంతో జట్ల సంఖ్య 12కు చేరింది. కొత్తగా తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి నాలుగు జట్లు ఐదో సీజన్‌లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే ఉన్న జట్లు బెంగుళూరు,హైదరాబాద్‌, పూణె, ఢిల్లీ, కోల్‌కత, పాట్నా నగరాల పేర్లతో ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రో కబడ్డీ లీగ్‌లో కొత్తగా నాలుగు జట్లు చేరడంతో ఐదో సీజన్‌లో ఎక్కువగా మ్యాచ్‌లు జరగనున్నాయి. దాదాపు 113కిపైగా మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌ శుక్రవారం హైద్రాబాద్‌లో ప్రారంభం కానుండగా…అక్టోబర్‌ 28న ఫైనల్‌ చెన్నైలో జరగనుంది. మొత్తం 13 వారాల పాటు అభిమానులను అలరించనుంది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఈ పాటకు క్రేజీ.. క్రేజీ.. క్రేజీ ఫీలింగ్ ఇష్టపడే అమ్మాయి రోజూ గంటల కొద్దీ చాటింగ్ చేస్తే, రోజూ పొద్దునే గుడ్ మార్నింగ్, నైట్ గుడ్ నైట్ చెప్తే? సూపర్ ఫిగర్ మన ఫిగర్ అయితే ఇట్స్ రియల్లీ ఎ క్రేజీ.. క్రేజీ ఫీలింగ్ కదా? సరిగ్గా ఇదే కాన్సెప్టుతో... TNN | Updated: Jul 11, 2016, 04:33PM IST X Bathukamma Song: మంగ్లీ బత... ఇష్టపడే అమ్మాయి రోజూ గంటల కొద్దీ చాటింగ్ చేస్తే, రోజూ పొద్దునే గుడ్ మార్నింగ్, నైట్ గుడ్ నైట్ చెప్తే? సూపర్ ఫిగర్ మన ఫిగర్ అయితే ఇట్స్ రియల్లీ ఎ క్రేజీ.. క్రేజీ ఫీలింగ్ కదా? సరిగ్గా ఇదే కాన్సెప్టుతో ' నేను..శైలజ ' చిత్రంలోని దేవీ శ్రీ ప్రసాద్ అందించిన 'క్రేజీ.. క్రేజీ ఫీలింగ్' అనే పాటకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. రామ్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'నేను శైలజ' అనే చిత్రం విడుదలై హీరో రామ్ కెరియర్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో హీరో రామ్ హీరోయిన్ తో ప్రేమలో పడి తన ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తాడు. ఆ సమయంలోనే ' కౌంపౌండ్ వాల్ ఎక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాలెక్కి మూన్ తాకినట్లుందే, మార్నింగ్ లేవగానే నీ మేసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్లుందే.. నిన్న మొన్న దాకా సూపర్ అన్న ఫిగర్ నిన్ను చూసినాకా సోసోగుందే' అంటూ సాగే లిరిక్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు చాలా మంది ఫిదా అయ్యారు. ఇంతవరకు ఏ తెలుగు సినిమా పాటకు రానంతగా యూట్యూబ్ లో ఈ పాటకు కోటికి పైగా హిట్స్ వచ్చాయి.'క్రేజీ క్రేజీ ఫీలింగ్' పాటకు కోటికి పైగా వ్యూస్ రావటం పట్ల హీరో రామ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్, లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రి, ఇతర 'నేను శైలజ' మూవీ యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.
0business
వ్యక్తిగత కారణాల వల్లే సింధు కోచ్ కిమ్ జి హ్యున్ రాజీనామా PV Sindhu with her Coach Kim Ji Hyun హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను భారత షట్లర్‌ పీవీ సింధు గెలవడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్‌ కిమ్ జి హ్యున్ తన కోచ్ పదవికి రాజీనామా చేశారు. కిమ్ జి హ్యున్ వ్యక్తిగత కారణాలతో తన పదవి నుండి తప్పుకుంటున్నారు. హ్యున్ భర్త కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం అతనికి న్యూజిలాండ్‌లో కీలక సర్జరీ అవటంతో 6 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని ఈ ఆరు నెలలు తన భర్తను దగ్గరుండి చూసుకునేందుకు హ్యున్ వెళ్లారు. టోక్యో ఒలింపిక్స్‌కు ఏడాది కన్నా తక్కువ సమయం ఉన్నందున కోచ్‌ రాజీనామా చేయడం సింధూకు పెద్ద లోటే అని అందరూ భావిస్తున్నారు.
2sports
మళ్లీ పెద రాయుడు తీర్పు... మోహన్ బాబుకు సూపర్ స్టార్ రజినీ మాట Highlights మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీ కాంత్ ల మధ్య గాఢ స్నేహం రజినీ, మోహన్ బాబు ల పెద రాయుడు బ్లాక్ బస్టర్ హిట్ రజినీ అల్లుడు ధనుష్ తెరకెక్కించిన పవర్ పాండి సూపర్ హిట్ పవర్ పాండిని తెలుగులో రీమేక్ చేయమని మోహన్ బాబుకు సూచించిన రజినీ సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు, టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మధ్య స్నేహం ఎంత బలమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల విషయంలోను ఈ ఇద్దరు ఒకరికొకరు పూర్తి సహాయ సహాకారాలు అందించుకుంటూ ఉంటారు.   వీరిద్దరి కాంబినేషన్ లో ఒకప్పుడు 'పెద్దరాయుడు' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమాలో రజనీకాంత్ రోల్ లేకుండా ఊహించలేం. తన చిరకాల మిత్రుడు మోహన్ బాబు కోరిక మేరకు రజనీ మరో మాట లేకుండా ఈ సినిమాలో నటించేశారు.   ఇక ఇప్పుడు రజనీకాంత్ వంతు వచ్చింది. తాజాగా రజనీ అల్లుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'పవర్ పాండి' తమిళ్‌లో సూపర్ హిట్ అవడంతో.. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని మోహన్ బాబుకు సూపర్ స్టార్ రజనీ సూచించారట.   ఈ సినిమాను ప్రత్యేకంగా రజనీ కోసం 'షో' వేసిన సందర్బంగా మోహన్ బాబును కూడా పిలిపించారట. సినిమా ఆసాంతం ఎంతగానో ఆకట్టుకుందని అల్లుడు ధనుష్‌ను పొగడ్తల్లో ముంచెత్తిన రజనీ.. మరో పదేళ్ల వరకు ఇంకో సినిమా చేయకని కూడా చెప్పారట. ఎన్నో ఏళ్లపాటు నీ పేరు నిలబడిపోవడానికి ఈ ఒక్క సినిమా చాలని అన్నారట.   అదే సమయంలో పక్కనే ఉన్న మోహన్ బాబుతో 'పవర్ పాండి' రీమేక్ గురించి చర్చించారట రజనీ. తెలుగులో దీన్ని రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయనకు సలహా ఇచ్చారట. చూడాలి మరి తన చిరకాల మిత్రుడు రజనీ సూచనను మోహన్ బాబు పాటిస్తారా లేదా చూడాలి. Last Updated 25, Mar 2018, 11:37 PM IST
0business
MITHALI RAJ with Parents మిథాలీ డ్యాన్సర్‌ అవ్వాలని క్రికెటరయ్యింది న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌ తొలుత డ్యాన్సర్‌ అవ్వాలనుకుని…అనూహ్యంగా క్రికెటర్‌గా మారిందని ఆమె తండ్రి దొరై రాజ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో వన్డేల్లో 6వేల పరుగుల మైలురాయిని అందు కున్న ఏకైన క్రికెటర్‌గా మిథాలీరాజ్‌ రికార్డునెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మిథాలీ రాజ్‌ చిన్ననాటి విషయాలను ఆమె తండ్రి మీడి యాతో పంచుకున్నారు. చిన్న వయసులో మిథాలీ డ్యాన్సర్‌ అవ్వాలని ఆశపడింది. కానీ, కాలం ఆమెని క్రికెటర్‌గా మార్చింది. మహిళల క్రికెట్‌లో అరుదైన రికార్డుని మిథాలీ అందుకోవడం మాకు చాలాసంతో షంగా ఉందని దొరై రాజ్‌ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కష్టించే తత్వం, నిబద్ధతతోనే తను ఈమైలురాయిని అందుకోగలిగిందని తన కెరీర్‌లో మరెన్నో మైలురాళ్లను అందుకోవాలని దొరై రాజ్‌ ఆనందం వ్యక్తం చేశారు.16ఏళ్ల వయసులో1999లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన మిథాలీ… ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసింది. ఇప్పటికీ అత్యంత పిన్నవయసులో సెంచరీ చేసిన రికార్డు మిథాలీ పేరిట ఉండటం విశేషం. మహిళల క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌గా మిథాలీకి పేరుంది. 19ఏళ్ల వయస్సులో టాంటన్‌వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు సాధించింది. టెస్టుల్లో అత్యదిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్‌గా పాకిస్తాన్‌కు చెందిన కిరన్‌ బలూచ్‌ పేరిట ఉంది. 2004లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కిరన్‌ 242 పరుగులుచేసింది. తన 18ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీ ర్‌లో మిథాలీరాజ్‌ ఎన్నెన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ఇటీవలే వన్డేల్లో వరుసగా ఏడు అర్థసెంచరీలుచేసిన తొలిక్రికెటర్‌గా మిథాలీరాజ్‌ సృష్టించింది.
2sports
పెళ్లిలో సమంత ఏడ్చింది.. అది చూసి భైరవ్ నవ్వాడు Highlights వివాహ బంధంతో ఒక్కటైన సమంత, నాగచైతన్య వివాహం తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న సమంత శనివారం క్రిస్టియన్ పద్ధతిలో చైసామ్ వెడ్డింగ్ తాళి కట్టిన సందర్భంలో సమంత కంటతడిపెట్టగా భైరవ్ నవ్వినట్లు మార్పింగ్ ఫోటో వైరల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. అక్కినేని వారింటి కోడలయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న అక్కినేని వారసుడు నాగచైతన్య, సమంతలు శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.  వారి పెళ్లి ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేశారు. నవవధువులు ఎంత సంతోషంగా, నవ్వుతూ తుళ్లుతూ పెళ్లి చేసుకున్నారో.. ఆ ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది.   అయితే.. వివాహం తర్వాత సమంత కన్నీళ్లు పెట్టుకుందట. పెళ్లి తర్వాత ఏ ఆడపిల్లకైనా అత్తారిల్లే సొంతిల్లు. పుట్టి పెరిగిన పుట్టినింటికి కూడా చుట్టపు చూపుగా వెళ్లాల్సి వస్తుంటుంది అందుకే అప్పగింతల సమయంలో  ఆడపిల్లలు ఏడ్చేస్తుంటారు. ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా.. సమంత కూడా ఒక ఆడపిల్లే కదా.. అందుకే వివాహం తర్వాత కన్నీళ్లు పెట్టుకుందట.  అయితే ఆ కన్నీళ్లు.. తల్లిదండ్రులను దూరమౌతున్నందుకో లేదా.. కోరుకున్నవాడు దక్కినందుకు సంతోషంతో వస్తున్న ఆనంద భాష్పాలో. ఏదేమైనా ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. సమంత ఏడ్చే ఫోటోని సోషల్ మీడియాలో  ఫన్నీ చేస్తున్నారు. స్పైడర్ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఎస్ జే సూర్య కి ఎవరైనా ఏడిస్తే.. సంతోషం. ఇప్పుడు సమంత ఏడుస్తున్న ఫోటోలో ఆయన ఫోటో పెట్టి నవ్వుతున్నట్లుగా  మార్ఫింగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ ఫోటోకి కౌంటర్లు ఇస్తున్నారు. సమంత బాధతో ఏడ్వడం లేదని.. సంతోషంతో ఏడుస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.  Last Updated 25, Mar 2018, 11:51 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ధోనీకి 11 మ్యాచ్‌లే ఛాన్స్..! ఆ తర్వాత...? 2019 ప్రపంచకప్‌కి ముందు ధోనీ కేవలం 8 వన్డేలు మాత్రమే ఆడే అవకాశముంది. ఇక కివీస్‌తో ఆడే మూడు టీ20లు కలుపుకుంటే.. మొత్తం 11 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను ఆడనున్నాడు. Samayam Telugu | Updated: Dec 25, 2018, 01:02PM IST ధోనీకి 11 మ్యాచ్‌లే ఛాన్స్..! ఆ తర్వాత...? భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ టీ20 జట్టులోకి పునరాగమం చేశాడు. ఇటీవల వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో వరుసగా టీ20 సిరీస్‌లకి దూరమైన ధోనీ.. దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ టీమిండియా తరఫున మైదానంలోకి రానున్నాడు. ఆస్ట్రేలియాతో వచ్చే ఏడాది జనవరి 12 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ కోసం నిన్న టీమ్స్‌ని ప్రకటించిన సెలక్టర్లు.. ధోనీకి వికెట్ కీపర్‌గా అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. 2019 ప్రపంచకప్‌లోపు ధోనీ భవితవ్యంపై ఓ నిర్ణయానికి రావాలనే ఉద్దేశంతోనే సెలక్టర్లు ఈ ఛాన్సిలిచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. Visit Site Recommended byColombia ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన.. మధ్యలో వెస్టిండీస్, ఆసియా కప్ ఇలా ధోనీకి వరుస అవకాశాలు లభించినా.. ఫామ్‌ని అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వికెట్ల వెనుక అతని నైపుణ్యం, వ్యూహాల్లో అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు, టీమిండియా మేనేజ్‌మెంట్.. తుది జట్టులో కొనసాగించేందుకు మొగ్గుచూపారు. కానీ.. వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మాత్రం ఎట్టకేలకి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుని ధోనీపై వేటు వేసి వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కి సెలక్టర్లు అవకాశమిచ్చారు. అయితే.. 2019 ప్రపంచకప్‌కి ధోనీనే వికెట్ కీపర్‌గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మళ్లీ ధోనీవైపు మొగ్గుచూపిన సెలక్టర్లు.. వరల్డ్‌కప్‌లోపు అతనికి తగినన్ని అవకాశాలివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ‘2019 ప్రపంచకప్‌కి ముందు ధోనీ కేవలం 8 వన్డేలు మాత్రమే ఆడే అవకాశముంది. ఇక కివీస్‌తో ఆడే మూడు టీ20లు కలుపుకుంటే.. మొత్తం 11 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను ఆడనున్నాడు. వరల్డ్‌కప్‌కి ముందు అతను కుదురుకునేందుకు తగినన్ని అవకాశాలివ్వాలనే ఉద్దేశంతోనే సెలక్టర్లు వన్డే, టీ20 జట్టులోకి ఎంపిక చేశారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ.. ధోనీ ఫామ్ అందుకోలేకపోతే.. మెగా టోర్నీలో ఆడిస్తారా..? అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వికెట్ కీపర్లుగా దినేశ్ కార్తీర్, రిషబ్ పంత్ ప్రత్యామ్నాయంగా టీమ్‌కి ఉన్న విషయం తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
-  'రెట్రాస్పెక్టివ్‌ టాక్స్‌' కారణంగా విదేశీ మదుపరులు తరలిపోయారు -  పన్ను అధికారులు నిజాయితీగా వ్యవహరించాలి -  గాంధేయ విధానాలతో విధులు నిర్వహించాలి: జైట్లీ     న్యూఢిల్లీ: గత ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన 'పునరావృత' (రెట్రాస్పెక్టివ్‌) పన్ను విధానం దేశానికి చేటు చేసిందని ఆర్థిక మంత్రి ఆరుణ్‌ జైట్లీ విచారం వ్యక్తం చేశారు. ఈ పన్ను విధానం వల్ల విదేశీ మదుపరులు భయపడ్డారని అన్నారు. ఫలితంగా దేశంలో మదింపు విషయమై వెనక్కి మరలిపోయారని ఆయన వివరించారు. పన్ను మదింపు విధానంలో పారదర్శకతతో పాటు తగు ప్రమాణాలను పాటించాలని ఆయన అధికారులకు సూచించారు. 'ఇండియన్‌ రెవెన్యూ సర్వీసుల' విభాగంలో శిక్షణలో ఉన్న అధికారులతో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన ప్రసంగించారు. విధి నిర్వహణలో అధికారులు గాంధేయ సిద్ధాంతాలను, నైతిక విలువలను పాటించాలని ఆయన కోరారు. విధి నిర్వహణలో వివిధ వర్గాల నుంచీ.. పైస్థాయి అధికారుల నుంచీ.. రాజకీయ శక్తుల నుంచి.. తీవ్ర ఒత్తిళ్లు ఎదరవుతాయని ఆయన తెలిపారు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో విధి నిర్వహణకు ఎది సక్రమ మార్గమో దానిని అసనుసరించాలని సూచించారు. కొన్ని పరిస్థితులకు లోబడి ఏ చిన్న తప్పు చేసినా అది మీ విలువను తగ్గింస్తుందని అన్నారు.యూపీఏ హయాంలో తీసుకువచ్చిన రెట్రోస్పెక్టివ్‌ టాక్స్‌ గురించి జైట్లీ మాట్లాడుతూ పెట్టుబడిదారులు స్థిరత్వాన్ని, ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని అన్నారు. వారికి అనువైన పరిస్థితులను అందుబాటులో ఉంచితేనే వారు విరివిగా పెట్టుబడులు పెటేందుకు వస్తారని తెలిపారు. ఇందుకు ఏ మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపించినా వారు పెట్టుబడులకు వేరే గమ్యాలను వెతుక్కుంటారని అన్నారు. అధికారులు దేశానికి మేలు చేసేందుకు గాను నూటికి నూరు శాతం సమర్థమంతంగా పని చేయాలని సూచించారు. రెట్రాస్పెక్టివ్‌ ట్యాక్స్‌ నేపథ్యంలో ఇటీవలి కాలంలో భారీగా విదేశీ మదుపరులు దేశం వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 160 Views న్యూఢిల్లీ : దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక్క సారిగా పెరిగాయి. 22 నెలల గరిష్టస్థాయికి చేరాయి. పది గ్రాముల బంగారం ఒక్కసారిగా 31వేల రూపాయలకు పెరిగింది. ముందు రోజుకంటే రెండుశాతం పరిగినట్లు బులియన్‌ నిపుణుల అంచనా. ఈ ధరలు 2014 ఆగస్ట నెలలో మాత్రమే కనిపించాయి. స్థాఇక బంగారంధరలు అంతర్జాతీయ మార్కెట్‌ ధోరణులకు అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఔన్స్‌ బంగారంధరలు 1317 డాలర్లుగా ఉంది. ప్రపంచ మార్కెట్లలోకూడా బంగారం ఔన్స్‌ ఒక్కింటికి 1300 డాలర్ల స్థాయినిదాటింది. అమెరికా ఫెడ్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపు విధానాలకు అనుగుణంగా ఈరేట్లు నడిచినట్లు తేలింది. ద్రవ్యవినిమయ విధానాన్ని వచ్చే ఏడాదినుంచి మరింత కఠినతరం చేస్తుందన్న వాదనలు బులియన్‌ మార్కెట్‌పై చూపించాయి. వడ్డీరేట్ల పెంపునకు లింక్‌ అయి బంగారంధరలు నడుస్తాయి. ఫెడ్‌రిజర్వు నిర్ణయం వల్లనే బంగారంధరలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎస్‌బిసి ఆర్ధికవేత్త జేమ్స్‌ స్టీల్‌ మాట్లాడుతూ సమీపభవిష్యత్తులో కూడా బంగారంధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈనెల 23వ తేదీ యూరోపియన్‌ కూటమినుంచి వైదొలిగే అంశంపై బ్రిటన్‌ నిర్వహిస్తున్న రిఫరెండమ్‌ నేపథ్యంలో ఫెడ్‌రిజర్వు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రెగ్జిట్‌తో యూరోప్‌ మళ్లీ ఆర్ధిక మాంద్యంలోనికి వెళుతుందని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావంచూపిస్తుందన్న అంచనాలున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఇన్వెస్టర్లు తమకు ఎటువంటి ఇబ్బందిలేని బంగారం మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడమే మేలన్న అంచనాలతో బంగారం పెట్టుబడులు పెంచుతున్నారు. ఎస్‌పిడిఆర్‌ గోల్డ్‌ట్రస్టు ఎటిఎఫ్‌పరంగాచూస్తే 0.23శాతం పెరిగి 900.75 టన్నులుగా ఉంది. 2013 అక్టోబరు తర్వాత ఇదే గరిష్టస్థాయిగా నిపుణుల అంచనా. స్పాట్‌ మార్కెట్‌లో వెండిధరలు కూడా పెరిగాయి. 17.86 డాలర్లుగా ఉంది. గత నెల రెండవ తేదీధరల తర్వాత ఇదే గరిష్టంగా పెరగడం. ఔన్స్‌ వెండిధరలు 17.85డాలర్లుగా స్థిరంగా న్నాయి. ఇతర విలువైన ఖణిజవనరులకు సంబంధించి స్పాట్‌ మార్కెట్లలో ప్లాటినమ్‌ 1.6శాతంపెరిగి ఔన్స్‌ ఒక్కింటికి 986.30 డాలర్లుగా ఉంది. స్పాట్‌ మార్కెట్‌లలో పల్లాడియం ఒకటిశాతంపెరిగి ఔన్స్‌ ఒక్కింటికి 537.22 డాలర్లుగా ఉన్నట్లు నిపుణుల అంచనా. మొత్తం మీద పసిడిధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.
1entertainment
BENAGAL ఎక్కువ పరుగులిచ్చాడని క్రికెటర్‌పై నిషేధం న్యూఢిల్లీ: బంగ్లదేశ్‌ లీగ్‌ క్రికెట్‌లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్‌లో కేవలం 4 బంతులు వేసి 92 పరుగులు ఇచ్చిన బౌలర్‌ సుజాన్‌ మహ్మద్‌పై ఆ దేశం 10సంవత్సరాల పాటు నిషేదం విధించింది. బౌలింగ్‌ వేసిన తీరు క్రికెట్‌ ప్రతిష్టకు ఇబ్బందిక రంగా ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో ఈ నిర్ణ యం తీసుకున్నట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు క్రమ శిక్షణ కమిటీ చీఫ్‌ షేక్‌ సోహెల్‌ మీడియా సమా వేశంలో పేర్కొన్నాడు.మరోవైపు మ్యాచ్‌ను నిబం ధనలకు అనుగుణంగా నిర్వహించనందుకు ఆరు నెలల పాటు అంపైర్లను కూడా సస్పెండ్‌ చేసింది. ఇటీవల ఐపిఎల్‌లో కోల్‌కతా,ముంబయి మ్యాచ్‌లో 2 బంతులకు 18 పరుగులొచ్చాయి. దీనికే ఆశ్చ ర్యపోయారు,అయితే బంగ్లాదేశ్‌ లీగ్‌ క్రికెట్‌లో భా గంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 4 బంతులకే 92 పరుగులు రావడం విశేషం.ఓ జట్టు అంపైర్లు తీరుపై నిరసనగా కావాలనే మ్యాచ్‌ ఓడిపోవడా నికి ఇలా పరుగులిచ్చేసింది.50 ఓవర్ల మ్యాచ్‌లో మొదట లాల్మాటియా క్లబ్‌ 14 ఓవర్లలో 88 పరు గులకే ఔటైంది.అయితే ఈ మ్యాచ్‌తో పాటు దీనికి ముందు కూడా అంపైర్లు తమ జట్టు విషయంలో వివక్ష ప్రదర్శించారని, తమకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు ప్రకటించారని ఆరోపించిన లాల్మా టియాక్లబ్‌ జట్టు, బౌలింగ్‌ ద్వారా తమ నిరసనను తెలియజేసింది.ఆ జట్టు బౌలర్‌ సుజాన్‌ మహ్మద్‌ 13 వైడ్లు, 3 నోబాల్స్‌ వేశాడు.వాటిని కీపర్‌ ఆపకపోవడంతో బౌండరీకి వెళ్లాయి.బౌలర్‌ సరిగ్గా వేసిన నాలుగు బంతు లు కూడా బౌండరీలుగా వెళ్లడంతో కేవలం 0.4 ఓవర్లలోనే ప్రత్యర్థి జట్టు 92 పరుగులు చేసిఇ ఛేదన పూర్తి చేసింది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV హాట్ హాట్ అందాలతో హీటెక్కిస్తోన్న యాంకర్ పటాస్ షోతో బుల్లి తెరపై అభిమానులను అలరిస్తున్న టీవీ యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.. TNN | Updated: Sep 15, 2016, 04:16PM IST పటాస్ షోతో పాపులరైన యాంకర్ శ్రీముఖి గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో మంచి అవకాశం ఎప్పుడు వస్తుందా అని కాచుకు కూర్చుందామె. ఆ మధ్య జెంటిల్‌మెన్ సినిమాలో ఆమె తళుక్కున మెరిసింది. ప్రేమ ఇష్క్ కాదల్‌లో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీముఖి తర్వాత త్రివిక్రమ్ జులాయిలో కనిపించింది. కానీ సరైన బ్రేక్ మాత్రం దొరకలేదు. దీంతో బుల్లితెరపై బిజీగా మారిపోయింది. తోటి యాంకర్లు అనసూయ, రష్మీలు వెండితెరపై హీరోయిన్లుగా వెలిగిపోయేందుకు శతథా ప్రయత్నిస్తుంటే.. తాను మాత్రం టీవీ షోలకు మాత్రమే ఎందుకు పరిమితం కావాలి అని అనుకుంది కాబోలు. సినీ అవకాశాల కోసం ఓ ఫొటోషూట్ తీసుకొని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. హాట్ హాట్‌గా ఉన్న ఆ ఫోటోలను చూస్తుంటే పిచ్చెక్కి పోవడం ఖాయం. బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో టాప్ బటన్ విప్పేసి అందాలను ఆరబోస్తున్న శ్రీముఖి ఫోటోలను చూసిన వారెవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఈ ఫోటో షూట్‌తో మరిన్ని సినిమా అవకాశాలను రాబట్టుకోవాలని చూస్తున్న శ్రీముఖి ప్రయత్నాలు సఫలం కావాలని ఆశిద్దాం. మరో విషయం ఏమంటే.. అవసరాల శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సెక్స్ అడిక్ట్ హిందీ మూవీ ‘హంటర్’ రీమేక్‌లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోందనే వార్తలు కూడా ఈ మధ్య వినిపిస్తున్నాయి. ఏదేమైనా సినిమాల్లో అవకాశాల కోసం ఈ అమ్మడు బాగానే ప్రయత్నిస్తోంది కదూ.
0business
Visit Site Recommended byColombia సౌత్ ఇండియాలోనే తొలిసారిగా బిగ్ బాస్ రియాలిటీ షోకి కపుల్‌గా రావడంతో వరుణ్, వితికాలు ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్‌లో జంటగానే ఆట ఆడుతూ 13 వారాలు పాటు ప్రేక్షకుల్ని అలరించి క్రేజీ కపుల్ అయ్యారు. లవ్, రొమాన్స్, అలకలు, బుజ్జగింపులు, గిల్లికజ్జాలతో వరుణ్ వితికాల జంట సీజన్ 3లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుండి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నా.. వితికా-వరుణ్‌ల జంటకు 13 వారాలు పాటు బిగ్ బాస్ హౌస్‌లో ‘హ్యాపీ డేస్’ నడిచాయి. అయితే 13 వారంలో వితిక ఎలిమినేట్ అయ్యింది. అప్పటి వరకూ వరుణ్ కోసమే వితికాను బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగిస్తున్నారు.. లేదంటే ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిందే అని కామెంట్స్ వినిపించేవి. అయితే ఎప్పుడైతే వితికా బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు వచ్చిందో.. అప్పటి వరకూ టైటిల్ రేస్‌లో ముందుఉన్న వరుణ్ ఒక్కసారిగా డల్ అయ్యారు. రాహుల్ పుంజుకున్నాడు. దీంతో గేమ్ ఒక్కసారికి మారిపోయింది. రిజల్ట్ తలకిందులైంది. ఓవరాల్‌గా సీజన్ 3 చూసిన ప్రేక్షకులకు వితికా అంటే ఓ నెగిటివ్ వైఫ్ అనే ముద్ర పడేలా చూపించారు. అయితే అందులో ఉన్న వాస్తవం ఏంటి? వితికాను ఎందుకలా చూపించారు? అసలు హౌస్‌లో ఏం జరిగిందన్న విషయాలతో పాటు తన ఆత్మహత్యపై వచ్చిన రూమర్స్‌పై తెరవెనుకు జరిగిన విషయాలను ‘సమయం’తో ముచ్చటించారు వితిక షెరు. ఆ ఎక్స్‌క్లూజివ్ విషయాలు మీకోసం. X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Oct 13,2018 ఐదేండ్లలో మార్కెట్లలోకి వస్తాం: శ్రీనివాస ఫార్మ్స్‌ నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రోజూ క్రమం తప్పకుండా కోడిగుడ్డును ఆహారంలో తీసుకోవడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని అధిగమించడంతో పాటు.. కీలక హృద్రోగాలకు కూడా దూరంగా ఉండొచ్చని పరిశోధనల్లో వెల్లడయిందని ఇంటర్‌నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌, శ్రీనివాస ఫార్మ్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ చిట్టూరి తెలిపారు. దేశ పౌల్ట్రీ ఉత్పత్తిలో తమ సంస్థ చాలా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. రానున ఐదేండ్ల కాలంలో దాదాపు రూ.2000 కోట్ల టర్నోవర్‌ను అందుకోవడమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రపంచ- కోడి గుడ్డు దినో త్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌ అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా గంభీర్ నియామకం..! ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్‌ని నియమిస్తూ ఆ జట్టు ఫ్రాంఛైజీ బుధవారం నిర్ణయం తీసుకుంది. TNN | Updated: Mar 7, 2018, 02:48PM IST ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా గంభీర్ నియామకం..! ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్‌ని నియమిస్తూ ఆ జట్టు ఫ్రాంఛైజీ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లపాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్‌ను.. ఈ ఏడాది జనవరి 27, 28న బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ రూ. 2.8 కోట్లకి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి 2010 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫునే మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ ఓపెనర్‌ని 2011 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.11.4 కోట్లకి కొనుగోలు చేసింది. ‘ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకి మళ్లీ కెప్టెన్‌గా ఎంపికవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. జట్టులో చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నారు. వారిని సమన్వయం చేసుకుంటూ సీజన్‌లో జట్టు ప్రదర్శన మెరుగయ్యేలా చూస్తా. కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేయబోతుండటం ఆనందంగా ఉంది’ అని గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. 2011 నుంచి ఏడేళ్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న గంభీర్.. 2012, 2014లో టైటిల్స్‌ను అందించాడు. అట్టిపెట్టుకునే విధానం, వేలంలో తనని తీసుకోవద్దని కోల్‌కతా నైట్‌‌రైడర్స్ ఫ్రాంఛైజీకి ముందుగానే గౌతమ్ గంభీర్ స్వయంగా చెప్పినట్లు ఈ ఏడాది వేలం ముగిసిన తర్వాత వార్తలు వచ్చాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తాగుతాను కానీ తాగుబోతుని కాదు! Highlights 'కృష్ణంవందే జగద్గురుం','ఖైదీ నెంబర్ 15౦','గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి చిత్రాలను మాటలు  'కృష్ణంవందే జగద్గురుం','ఖైదీ నెంబర్ 15౦','గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి చిత్రాలను మాటలు అందించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు రచయిత సాయి మాధవ్ బుర్రా. ఇటీవల విడుదలైన 'మహానటి' చిత్రానికి కూడా ఆయన సంభాషణలు అందించారు. అయితే సాయి మాధవ్ బుర్రా పచ్చి తాగుబోతని, తరచూ మద్యం సేవించడం వలన అతడి ఆరోగ్యం కూడా పాడైందని రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై స్పందించిన ఆయన.. 'అవును నేను తాగుతాను.. కానీ అందరూ అనుకుంటున్నట్లు రోజులో 24 గంటలు తాగను. రాత్రి 8 తరువాత మాత్రం కొంత ఆల్కహాల్ తీసుకుంటాను. అది కూడా ఆరోగ్యం పాడుచేసుకునేంతగా ఏం తాగనని స్పష్టం చేశారు'. ప్రస్తుతం సాయి మాధవ్ బుర్రా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై.. రా' సినిమాకు మాటలు రాస్తున్నారు. అలానే మోహన్ బాబు నటించనున్న 'కన్నప్ప' సినిమాకు కూడా రైటర్ గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ రైటర్.. డైరెక్టర్ గా పరిచయం కానున్నాడని టాక్. Last Updated 12, May 2018, 4:28 PM IST
0business