news
stringlengths
299
12.4k
class
class label
3 classes
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV జులపాల జుట్టుతో మళ్లీ మహేంద్రసింగ్ ధోని భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ జులపాల జుట్టుతో క్రికెట్ అభిమానులకి దర్శనమిచ్చాడు. రోమన్ చక్రవర్తి TNN | Updated: Mar 6, 2018, 09:36AM IST జులపాల జుట్టుతో మళ్లీ మహేంద్రసింగ్ ధోని భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ జులపాల జుట్టుతో క్రికెట్ అభిమానులకి దర్శనమిచ్చాడు. రోమన్ చక్రవర్తి తరహాలో డ్రెస్‌ వేసుకుని.. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు‌ సహచరుల్లో స్ఫూర్తి నింపేలా గట్టి సందేశమిచ్చాడు. ఇదంతా ఏప్రిల్ 7 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2018 సీజన్ కోసం అనుకుంటున్నారా..? మహేంద్రసింగ్ ధోనీని ఇటీవల ‘స్నికర్స్ చాక్లెట్స్‌’ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ప్రచారంలో భాగంగా ధోనీతో ఓ 35 సెకన్ల నిడివిగల యాడ్‌ని ఆ సంస్థ రూపొందించింది. డ్రెస్సింగ్ రూములో ప్రత్యర్థిపై తొలుత కోపంతో ఊగిపోయిన ధోని.. స్నికర్స్ చాక్లెట్ తిన్న తర్వాత కూల్‌‌గా అయిపోవడంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలోకి మారిపోవడం ఈ యాడ్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం నుంచి శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి మహేంద్రసింగ్ ధోనీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ప్లాన్.. 30జీబీ డాటా ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. TNN | Updated: Mar 1, 2018, 01:04PM IST ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. హోలీ పండుగను పురష్కరించుకొని రూ.399 విలువ గల ‘హోలీ ధమాకా’ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు 30 జీబీ డాటాను పొందొచ్చు. ఈరోజు (మార్చి 1) నుంచే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. నెల రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌లో డాటాపై రోజు వారీ పరిమితి ఏమీ లేదు. బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఈ సరికొత్త ప్లాన్.. ఎయిర్‌టెల్, వొడాఫోన్ అందిస్తోన్న రూ.399 ప్లాన్‌తో పోటీపడనుంది. రూ.399 ప్లాన్ కింద ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 20జీబీ డాటాను అందిస్తున్నాయి. మరోవైపు ఐడియా సెల్యులర్ కూడా ఇంచుమించుగా ఇవే బెనిఫిట్స్‌ను రూ.389 ప్లాన్ కింద అందిస్తోంది. ఇక రిలయన్స్ జియో అయితే రూ.409 ప్లాన్ కింద అపరిమిత కాలింగ్, 30జీబీ డాటాను ఆఫర్ చేస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే అన్ని టెలీకాం కంపెనీలు అందిస్తోన్న ప్లాన్ల కంటే బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ప్లాన్ మెరుగుగా కనిపిస్తోంది.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV అబ్బాయ్ చరణ్.. పవన్ ఉన్నాడు జాగ్రత్త!! రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయలేదనే రీమార్క్ పడింది. TNN | Updated: Apr 2, 2017, 04:01PM IST రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయలేదనే రీమార్క్ పడింది. దానికి కారణం సినిమాను అన్ సీజన్ అయిన డిసంబర్‌లో విడుదల చేయడమే. దాని వెనుక పెద్ద కారణమే ఉంది చిరు సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి.. దానికి అడ్డు తగలకుండా ఉండాలని చరణ్ త్యాగం చేశాడని చెబుతారు. ఆ కారణంగానే ధృవ సినిమా వసూళ్లపై ప్రభావం పడింది. అయితే చరణ్ కొత్త సినిమాకు బాబాయ్ సినిమాతో క్లాష్ వచ్చేలా ఉంది. చరణ్-సుకుమార్‌ల సినిమాను దసరాను విడుదల చేయాలని సినిమా ప్రారంభించిన రోజే అనుకున్నారు.
0business
Hyderabad, First Published 13, May 2019, 2:14 PM IST Highlights సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రైతుల సమస్యలపై తెరకెక్కించిన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. మహర్షి చిత్రం పుణ్యమా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వీకెండ్ వ్యవసాయం ట్రెండింగ్ లో నిలుస్తోంది.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రైతుల సమస్యలపై తెరకెక్కించిన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. మహర్షి చిత్రం పుణ్యమా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వీకెండ్ వ్యవసాయం ట్రెండింగ్ లో నిలుస్తోంది. మహేష్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండే అశ్విని దత్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.  సూపర్ స్టార్ కృష్ణ హీరోగా దూసుకుపోతున్న రోజుల్లో ఆయన తల్లి నాగరత్నమ్మ గారిని రెండుమూడు సందర్భాల్లో కలిశానని తెలిపారు. అప్పట్లో కృష్ణ రైతుగా నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్ గా నిలిచేది. అదే మ్యాజిక్ ని మహేష్ మహర్షి చిత్రంతో రిపీట్ చేశారు. మహేష్ నానమ్మ ఓ రైతు. ఆమె ఎన్నో కష్ఠాలు ఎదుర్కొని అనేక పంటలు పండించినట్లు నాతో స్వయంగా చెప్పారు అని అశ్విని దత్ అన్నారు.  ఈ విధంగా మహేష్ కుటుంబం కూడా వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినవారే. మహేష్ మాత్రమే కాదు అన్ని కుటుంబాల పూర్వీకులు రైతులుగా బతికినవారే. మహర్షి చిత్రం తొలి వీకెండ్ పూర్తయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రలో 50 కోట్ల షేర్ కు చేరువగా వచ్చింది. సోమవారం నుంచి కూడా ఇదే జోరు కొనసాగిస్తే ఘనవిజయం ఖాయం.  Last Updated 13, May 2019, 2:14 PM IST
0business
ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమవుతున్న "దడ పుట్టిస్తా" Highlights ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమవుతున్న "దడ పుట్టిస్తా"  విన్నీ వియాన్ కథానాయకుడిగా పి.జె.ఆర్ & ఏన్.పి.ఆర్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం "దడ పుట్టిస్తా". రోమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హరీష్.ఇ దర్శకుడు. నాయిని పృధ్వీ రెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయకుడు విన్నీ వియాన్ సరసన నేహా-హరిణీలు కథానాయికలుగా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని కె.చిన్ని-కె.శ్రీనివాసరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థామ్సన్ మార్టిన్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు ఇటీవల విడుదలై మంచి ఆదరణ చూరగొంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.   ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు కె.చిన్ని-కె.శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ.. "రొమాన్స్ తోపాటు హారర్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా కలిగిన చిత్రం "దడ పుట్టిస్తా". విన్నీ వియాన్ కు ఈ సినిమా మంచి లాంచ్ పాడ్ అవుతుంది. దర్శకుడు హరీష్ హిలేరియస్ హారర్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరిస్తుంది. మా చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు!   Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
Indian Cricketer Rohit Sharma టెస్టుల్లో నిలదొక్కుకున్న రోహిత్‌ కాన్పూర్‌: వన్డే,టి20ల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే రోహిత్‌శర్మ టెస్టుల్లో మాత్రం కనీసం హాఫ్‌ సెంచరీ చేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు. గత కొంత కాలంగా విమర్శకులు,అభిమానుల నుంచి తరచూ వినిపిస్తున్న మాట.కాగా వాదనకు బలం చేకూర్చే విధంగా కాన్పూర్‌లో జరుగుతున్న చారిత్రాత్మక 500 టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ తొలిఇన్నింగ్స్‌లో 35పరుగులకే ఔటయ్యాడు.దీంతో విమర్శలు మరింత ఎక్కు వయ్యాయి.కానీ వాటంన్నింటికి ఒకరోజు వ్యవధిలోనే రోహిత్‌ సత్తాచాటి మార్చివేశాడు.కీలక సమ యంలో క్రీజులోకి వచ్చిన రోహిత్‌ 75 బంతుల్లోనే తన మార్క్‌ బౌండరీలు చేశాడు. కాగా 7 బౌండరీలతో అలరించి కెరీర్‌లో 5వ హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు.గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూసుకుపోతున్నా టెస్టుల్లో వరుస వైపల్యాలతో ఇబ్బంది పడుతున్నరోహిత్‌కు ఇది సాంత్వన కలిగించే పరిణామంగా పేర్కొనాలి.ఇప్పటి వరకు మొత్తం 19 టెస్టులు ఆడిన రోహిత్‌చేసింది 2 సెంచరీలు,5 హాప్‌ సెంచరీలు మాత్రమే.గత కొంత కాలంగా టెస్టు జట్టులోకి వచ్చిపోతున్న రోహిత్‌కు స్వదేశంలో భారత్‌ ఎక్కువ టెస్టు మ్యాచ్‌లుఆడనున్న నేపథ్యంలో సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అంబాసిడర్‌ శకం ముగిసినట్లేనా? ఏడు దశాబ్దాలుగా భారత ప్రధాన మంత్రి నుంచి సామాన్యుల వరకు విశేష సేవలందించిన దేశీ దిగ్గజ కార్ బ్రాండ్ అంబాసిడర్ కనుమరుగు కానుందా? TNN | Updated: Feb 11, 2017, 12:55PM IST ఏడు దశాబ్దాలుగా భారత ప్రధాన మంత్రి నుంచి సామాన్యుల వరకు విశేష సేవలందించిన దేశీ దిగ్గజ కార్ బ్రాండ్ అంబాసిడర్ కనుమరుగు కానుందా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. కారణం ఈ దిగ్గజ కార్ బ్రాండ్‌ను ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ ప్యుగోట్ సొంతం చేసుకోడమే. సీకే బిర్లా గ్రూపునకు చెందిన హిందుస్థాన్ మోటార్స్.. అంబాసిడర్‌ను రూ. 80 కోట్లకు ప్యుగోట్‌కు విక్రయించింది. వాస్తవానికి మూడేళ్ల క్రితమే అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని హిందుస్థాన్ మోటార్స్ ఆపేసింది. అయితే ఇకపై భారత మార్కెట్‌లోకి ప్యుగోట్ తీసుకొచ్చే కార్లకు అంబాసిడర్ బ్రాండ్ వాడుతుందా.. లేదా.. అనే విషయంపై స్పష్టత లేదు. కంపెనీ కూడా దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఈ బ్రాండ్ నుంచి ఇకపై కార్లు వస్తాయనే నమ్మకం లేదు. ఇంగ్లండ్‌కు చెందిన ప్రఖ్యాత మోరిస్ ఆక్స్‌ఫర్డ్ సిరీస్ 2 కారులో కొద్దిగా మార్పులు చేసి హిందుస్థాన్ మోటార్స్ తొలిసారిగా 1958లో అంబాసిడర్‌ను పరిచయం చేసింది. కొద్దికాలంలోనే ఇది జాతీయ చిహ్నంగా మారిపోయింది. 1980 వరకు భారత రోడ్లపై అంబాసిడర్ హవా కొనసాగింది.
1entertainment
భద్రాద్రి రాముడి సన్నిధిలో నందమూరి తారక రాముడు(ఫోటో గ్యాలరీ) First Published 10, Nov 2017, 12:12 PM IST భద్రాద్రి రాముడి సన్నిధిలో నందమూరి తారక రాముడు(ఫోటో గ్యాలరీ) భద్రాద్రి రాముడి సన్నిధిలో నందమూరి తారక రాముడు(ఫోటో గ్యాలరీ) భద్రాద్రి రాముడి సన్నిధిలో నందమూరి తారక రాముడు(ఫోటో గ్యాలరీ) భద్రాద్రి రాముడి సన్నిధిలో నందమూరి తారక రాముడు(ఫోటో గ్యాలరీ) భద్రాద్రి రాముడి సన్నిధిలో నందమూరి తారక రాముడు(ఫోటో గ్యాలరీ) Recent Stories
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV బీసీసీఐ పెద్దలకి సుప్రీంకోర్టు మొట్టికాయలు లోధా కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను బోర్డులో అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న బీసీసీఐ పెద్దలకి సుప్రీంకోర్టు TNN | Updated: Aug 23, 2017, 04:57PM IST లోధా కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను బోర్డులో అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న బీసీసీఐ పెద్దలకి సుప్రీంకోర్టు బుధవారం మొట్టికాయలు వేసింది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, సెక్రటరీ అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరి తీరుపై విచారణ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసి సర్వోన్నత న్యాయస్థానం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురూ సెప్టెంబరు 19న కోర్టుకి హాజరై ఎందుకు సంస్కరణలు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బీసీసీఐ పాలన కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నియమించిన పాలకుల కమిటీ.. బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆగస్టు 16న ఓ నివేదికని సమర్పించింది. సంస్కరణల అమలుకి అడ్డుపడుతున్న బీసీసీఐ పెద్దలని పదవుల నుంచి తప్పించాలని ఈ నివేదికలో కమిటీ కోరినట్లు సమాచారం. ఈ ఏడాది ఆరంభంలో ఇలానే లోధా సంస్కరణల అమలుకి అడ్డుపడుతున్నారనే కారణంగా అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను సుప్రీంకోర్టు పదవుల నుంచి శాశ్వతంగా తప్పించింది.
2sports
ఆర్‌బీఐ స్వేచ్ఛను కొనసాగించాలి - గవర్నర్‌ రఘురాం రాజన్‌ భువనేశ్వర్‌: ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు వీలుగా సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను 'రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా' (ఆర్‌బీఐ)కు కల్పించాలని కేంద్ర బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ఈ దిశగా ప్రభుత్వ నుంచి పూర్తి సహకారం అందు తున్నట్లుగా ఆయన వివరించారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలని అభిలషించారు. ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలు కీలకమైనవి, అవి కోట్లాది ప్రజల జీవనంలో ముడిపడి ఉంటాయని అన్నారు. చిన్న పొరపాటు జరిగినా దాని వల్ల దేశం మొత్తం సమస్య ఉత్పన్నమవుతుందని రాజన్‌ వివరించారు. ప్రజల అవసరాలను దష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ నిర్ధిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒడిశాలోని ఆర్‌బీఐ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో రఘురామ్‌ రాజన్‌ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఆర్‌బీఐ స్వతంత్రంగా వ్యవహరించడం, అందుకు ప్రభుత్వం సహకరించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆర్‌బీఐ నుంచి చిన్న తప్పు దొర్లినా అది దేశాన్ని ప్రజలను కష్టాల్లోకి నెడుతుందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారితమైనదని వివరించారు. అందుకే చిన్న, మధ్య తరహా వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులపై దష్టి పెట్టాలన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే వెళ్తోందని, విశ్వవ్యాప్తంగా మనం కీలక వ్యవస్థగా మారే అవకాశాలున్నాయన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సరైన దారిలో నడుస్తోందని తెలిపారు. అయితే అన్ని రంగాలలో ఒకే రకవమైన వృద్ధి కనిపించడం లేదని అన్నారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయం వంటి పలు రంగాలు ఇంకా ఒత్తిడిలో ఉన్నట్లు రాజన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది మెరగైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Dec 03,2016 6 నుంచి లారస్‌ ల్యాబ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ! నవతెలంగాణ-వాణిజ్య విభాగం: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ లారస్‌ లాబ్స్‌ నిధుల సమీకరణ నిమిత్తం పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ నెల 6న ప్రారంభమయ్యే ఈ ఇష్యూ 8న ముగుస్తుందని సంస్థ వ్యవస్థాపకులు సీఈవో సత్యనారాయణ చావా తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐపీఓ ధరల శ్రేణిని రూ.426-428గా నిర్ణయించినట్టుగా వివరించారు. కనీసం 35 ఈక్విటీ షేర్లకు బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ.300 కోట్ల మేర నిధుల సమీకరణ జరపాలని యోచిస్తోంది.కొత్త ఈక్విటీల జారీ ద్వారా సమీకరించిన మొత్తాలను టర్మ్‌ రుణాల ముందస్తు చెల్లింపులతో పాటు.. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనున్నట్టుగా తెలిపారు. కంపెనీ ఈక్విటీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నమోదు చేస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సంస్థ పరిశోధన- అభివృద్ధి కేంద్రం (ఆర్‌అండ్‌డీ సెంటర్‌) ఉందని ఆయన అన్నారు. విశాఖపట్టణంలో మరో కేంద్రాన్ని తెరవనున్నట్లుగా ఆయన వివరించారు. ఏడా ఏడాదికి 1 బిలియన్‌ టాబెట్లు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రానున్న కాలంలో దీనిని 5 బిలియన్ల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 31, Oct 2018, 3:12 PM IST Highlights టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఇప్పటినుంచి అందరి చూపు ఎక్కువగా దర్శకదీరుడు రాజమౌళి తీయబోయే RRR పైనే ఉంటుంది రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ బారి మల్టీస్టారర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలవ్వనుంది. టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఇప్పటినుంచి అందరి చూపు ఎక్కువగా దర్శకదీరుడు రాజమౌళి తీయబోయే RRR పైనే ఉంటుంది రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ బారి మల్టీస్టారర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలవ్వనుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బారి స్థాయిలో ఒక సౌత్ మల్టీస్టారర్ ను డివివి.దానయ్య నిర్మిస్తున్నారు.  ఇకపోతే సినిమాకు సంబందించిన అప్డేట్స్ రోజురోజుకి అందరిలో ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి. అసలు విషయానికి వస్తే సినిమా కథ గురించి ఇప్పటివరకు ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇక విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం  కథ 1920 కాలాన్ని బేస్ చేసుకొని ఉంటుందట. ఆ కాలం నాటి వాతావరణం తెరపై కరెక్ట్ గా కనిపించడానికి రాజమౌళి టీమ్ గత కొంత కాలంగా అనేక వర్క్ షాప్స్ ని నిర్వహించింది.  ఇక హైదరాబాద్ నగర  అంచుల్లో గండిపేట వద్ద కొన్ని స్పెషల్ సెట్స్ ను మొదటి షెడ్యూల్ కోసం సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆ పనులన్నీఎండింగ్ కి వచ్చేశాయి. ఇక నవంబర్ రెండవరంలో సినిమా లాంచింగ్ కార్యక్రమాలతో మొదలుకానున్న సంగతి తెలిసిందే.  Last Updated 31, Oct 2018, 3:12 PM IST
0business
Oct 05,2015 ఫ్లిప్‌కార్డ్‌ సిఎఫ్‌వోగా శ్రీరామ్‌       న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్డ్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా (సిఎఫ్‌వో) కొత్తగా శ్రీరామ్‌ వెంకటరామన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇకపై సంస్థకు చెందిన అన్ని ఆర్థిక లావాదేవీలను వెంకటరామన్‌ పర్యవేక్షిస్తారని తెలిపింది. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారని పేర్కొంది. శ్రీరామ్‌ యూనీలివర్‌ కంపెనీలో 19 ఏండ్ల పాటు వివిధ హౌదాల్లో పనిచేశారు. ఫ్లిప్‌కార్డ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లోనూ మార్పులు చేసింది. ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ప్రమోద్‌జైన్‌కు పన్నుల శాఖ అధిపతిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. జైన్‌ ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇండస్‌ టెలికం టవర్‌ కంపెనీకి ఈ విభాగంలో ఐదేండ్లు పని చేశారు. ఇండస్‌ టెలికం టవర్‌ కంపెనీ ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాపోన్‌లు భాగస్వామ్యులుగా ఉన్న సంస్థ. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కామన్వెల్త్ గేమ్స్‌: అథ్లెట్ల కోసం 2 లక్షల కండోమ్స్! కామన్వెల్త్ గేమ్స్‌ కోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్-2018 బుధవారం (ఏప్రిల్ 4) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆటగాళ్ల ఆరోగ్య రక్షణ కోసం 2 లక్షల కండోమ్స్ అందుబాటులో ఉంచారు. TNN | Updated: Apr 2, 2018, 09:26PM IST కామన్వెల్త్ గేమ్స్‌ కోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్-2018 బుధవారం (ఏప్రిల్ 4) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వేలాది మంది క్రీడాకారులు, అధికారులు, లక్షలాది మంది అభిమానులు గోల్డ్ కోస్ట్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్య రక్షణ కోసం వారికి లక్షల సంఖ్యలో కండోమ్స్ అందుబాటులో ఉంచారు. కామన్వెల్త్ గేమ్స్ 11 రోజులపాటు జరుగనున్నాయి. ఈ 11 రోజుల కోసం దాదాపు 2.25 లక్షల కండోములు, 17000 టాయిలెట్ రోల్స్‌ అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా అందరికీ ఉచితంగా ఐస్‌క్రీమ్స్ అందిచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక్కో అథ్లెట్‌కు 34 కండోమ్స్ పంపిణీ చేయనున్నారు. ఈ పోటీల్లో సుమారు 6,600 మంది అథ్లెట్లు పాల్గొంటున్నట్టు సమాచారం. అంటే ఒక్కో అథ్లెట్ రోజుకి 3 కండోమ్స్ వినియోగించుకొవచ్చన్నమాట. రియో ఒలింపిక్స్‌లో అథ్లెట్లకి అత్యధికంగా 4.50 లక్షల కండోమ్స్ పంపిణీ చేశారు. ఆ సమయంలో జికా వ్యాధి ప్రబలంగా ఉండటంతో.. ఎవరికీ ఎలాంటి హాని జరుగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్.. కామన్‌వెల్త్ విలేజ్‌లో ఆటగాళ్ల ఆహ్లాదం కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. స్విమ్మింగ్ పూల్స్, మానవ నిర్మిత జలపాలాలతో కూడిన ప్రత్యేక లాంజ్‌లు, 24 గంటలు నడిచే డైనింగ్ రూమ్‌లు అందుబాటులోకి తెచ్చారు. అథ్లెట్ల కోసం శాఖహారం, మాంసాహార వంటకాలు అందుబాటులోఉంటాయి. అంతేకాకుండా అథ్లెట్లు బసచేయడానికి 1,250 అపార్ట్‌మెంట్లు, టౌన్ హౌస్‌లు నిర్మించారు. ఆటలు ముగిసిన తర్వాత కామన్‌వెల్త్ విలేజ్‌ని అమ్మకానికి లేదా అద్దెకు ఇవ్వనున్నారు.
2sports
Hyderabad, First Published 6, Sep 2019, 6:54 PM IST Highlights సూపర్ స్టార్ మహేష్, అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతున్నాయి. మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురములో చిత్రాలపై భారీ అంచనాలు నెకొన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో ముందుగా బెర్తులు ఖరారు చేసుకున్న చిత్రాలు ఈ రెండే.  ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమా సందడి కనిపిస్తుంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు తక్కువ గ్యాప్ లో విడుదలైతే వసూళ్ళలో నష్టం రావచ్చనే భయం నిర్మాతల్లో ఉంటుంది. కానీ సంక్రాంతికి ఆ సమస్య ఉండదు. సినిమా బాగుండాలి కానీ విడుదలైన ప్రతి చిత్రానికి ఆదరణ ఉంటుంది.  ఈ సంక్రాంతికి రెండు భారీ చిత్రాల మధ్య పోటీ ఉండబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల.. వైకుంఠపురములో చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కథానాయకుడు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి.  ఇక సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీ కెవ్వరు చిత్రం కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ తొలిసారి మహేష్ ని డైరెక్ట్ చేస్తుండడంతో ఈ అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.  ఈ రెండు చిత్రాల విషయంలో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు ప్రధాన ఆకర్షణగా మారారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా కాలం తర్వాత వెండి తెరపై కనిపించబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. కీలకమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. ఒకప్పుడు తన అందంతో వేడెక్కించిన టబు కూడా చాలా కాలం తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.  అలా వైకుంఠపురములో చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. ఈ ఇద్దరి సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీలో ఏ చిత్రం హైలైట్ గా నిలుస్తుందో అనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పటి నుంచే నెలకొని ఉంది.  Last Updated 6, Sep 2019, 6:54 PM IST
0business
May 25,2016 ఎయిర్‌టెల్‌ చేతికి వీడియోకాన్‌ స్పెక్ట్రమ్‌ ముంబయి: దేశీయ టెలికాం రంగంలో ఎయిర్‌టెల్‌ సంస్థ తన విస్తృతిని అంతకంతకు పెంచుకొంటోంది. తాజాగా ఆ సంస్థ ఆరు సర్కిళ్లలో వీడియాకాన్‌ సంస్థకు చెందిన 1800 మెగాహెర్జ్‌ల స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకుంది. దాదాపు రూ.4428 కోట్ల మేర నగదును చెల్లించి వీడియోకాన్‌ స్పెక్ట్రమ్‌ను వాడకొనేందుకు వీలుగా ఒక నిర్ధిష్ట ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. రెండు సర్కిళ్లలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు ఐడియా సంస్థ రూ.3,300 కోట్లను చెల్లించేందుకు తొలత ముందుకు వచ్చింది. అయితే ఆ తరువాత ఈ ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గింది. ఇది జరిగిన మరుసటి రోజే ఎయిర్‌టెల్‌ సంస్థ వీడియోకాన్‌ వాయు తరంగాలను కొనుగోలు చేయడం విశేషం. తాజా ఒప్పందంతో బిహార్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, యూపీ (తూర్పు), యూపీ (పశ్చిమ), గుజరాత్‌ సర్కిళ్ల ఎయిర్‌టెల్‌ తన సేవలను మరింత విస్తృత పరిచేందుకు వెసులుబాటు కలుగనుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jakarta, First Published 21, Aug 2018, 11:01 AM IST Highlights ఆసియా దేశాల మధ్య ఇండోనేషియాలో క్రీడా సమయం మొదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఏషియన్ గేమ్స్ ఈవెంట్ మూడో రోజుకు చేరుకుంది. మొదటి రెండు రోజులు కలిసి భారత క్రీడాకారులు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. ఇక మూడో రోజు భారత క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నారు. అందువల్ల ఆసియా క్రీడల్లో ఈ రోజు జరిగే ఈవెంట్స్ షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం.  ఆసియా దేశాల మధ్య ఇండోనేషియాలో క్రీడా సమయం మొదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఏషియన్ గేమ్స్ ఈవెంట్ మూడో రోజుకు చేరుకుంది. మొదటి రెండు రోజులు కలిసి భారత క్రీడాకారులు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. ఇక మూడో రోజు భారత క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నారు. అందువల్ల ఆసియా క్రీడల్లో ఈ రోజు జరిగే ఈవెంట్స్ షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం.  ఆసియా క్రీడల్లో నేటి ఈవెంట్స్....   స్విమ్మింగ్ : మెడల్ కాంపిటీషన్  వాటర్ పోలో: ఈవెంట్ కాంపిటీషన్   ఆర్చరీ: ఈవెంట్ కాంపిటీషన్  బేస్ బాల్: సాప్ట్ బాల్ ఈవెంట్ కాంపిటీషన్ బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్ సైక్లింగ్: మౌంటెన్ బైక్ మెడల్ కాంపిటీషన్ పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ గోల్ఫ్: ఈవెంట్ కాంపిటీషన్    హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్ కబడ్డీ: ఈవెంట్ కాంపిటీషన్ కరాటే: మెడల్ కాంపిటీషన్ మార్షల్ ఆర్ట్స్:  ఈవెంట్ కాంపిటీషన్,  మెడల్ కాంపిటీషన్ రోవింగ్: ఈవెంట్ కాంపిటీషన్ ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్ షూటింగ్: మెడల్ కాంపిటీషన్ స్పోర్ట్స్ క్లైబింగ్: ఈవెంట్ కాంపిటీషన్ టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్     వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్   వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్  Last Updated 9, Sep 2018, 12:32 PM IST
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
netizens troll global star priyanka chopra for complaining about delhi pollution asks where are your cigarettes ‘ఏమ్మా ప్రియాంకా నీ సిగరెట్లు ఎక్కడ?’ ప్రియాంక చోప్రాను నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. షూటింగ్ కోసం ప్రియాంక ఇటీవల దిల్లీ వెళ్లింది. అక్కడ కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. Samayam Telugu | Updated: Nov 4, 2019, 01:22PM IST ప్రియాంక చోప్రా దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. సాధారణంగా ఊపిరి పీల్చుకోకపోతే చనిపోతాం. కానీ దిల్లీ కాలుష్యానికి అక్కడున్నవారు ఊపిరి పీల్చుకుంటే చనిపోయే పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. షూటింగ్స్ కోసం వెళుతున్న సెలబ్రిటీలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన తర్వాతి ప్రాజెక్ట్ షూటింగ్ కోసం దిల్లీ వెళ్లింది. అక్కడి కాలుష్యం భరించలేక ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్ వేసుకుని సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. READ ALSO: ‘సాఫ్ట్ పోర్న్ సినిమాలు తీస్తున్నారు, Karan Johar లాంటివారిని శిక్షించండి’ ‘షూటింగ్ కోసం దిల్లీ వచ్చాను. ఇక్కడ షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలా జీవిస్తున్నారో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. మనకు ఎయిర్ ప్యూరిఫైయర్స్, మాస్క్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇళ్లు లేనివారిని ఆ దేవుడే కాపాడాలి’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే ముందుగా ఊహించినట్లుగానే ప్రియాంక పోస్ట్‌‌పై ట్రోలింగ్ మొదలైంది. ఎందుకంటే ప్రియాంకకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని ఆమె ఓ సందర్భంలో చెప్పింది. అయితే బీచ్‌లో తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి సిగరెట్ తాగుతూ కనిపించింది. దాంతో ‘ఇప్పుడు ఈ ఆస్తమా డ్రామా ఏమైంది?’ అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. ఇప్పుడేమో దిల్లీలో కాలుష్యం ఉందంటూ ఫొటో పెట్టడంతో మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. ‘ఏమ్మా ప్రియాంకా కాలుష్యం తట్టుకోలేకపోతున్నావా? ఇప్పుడు నీ సిగరెట్లు ఏమయ్యాయ్?. కాలుష్యం భరించలేకపోతే అమెరికాకు వెళ్లిపో’ అంటూ కొందరు నెటిజన్లు వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. READ ALSO: ఆ ప్రమాదం నాకు జరగాల్సింది, తప్పించుకున్నాను: మహేష్ హీరోయిన్ ప్రియాంక కథానాయికగా నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఆమె ‘ది వైట్ టైగర్’ సినిమాలో నటిస్తోంది. రామిన్ బహ్రానీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్ కుమార్‌రావు హీరోగా నటిస్తున్నాడు. ఓ చిన్న గ్రామంలో టీ షాప్ వర్కర్‌గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత పెద్ద నగరంలో సక్సె‌స్‌ఫుల్ వ్యాపారవేత్తగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా కథ. ప్రియాంక చోప్రా
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు హైదరబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.30,650 పలుకుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,600 గా పలుకుతోంది. Samayam Telugu | Updated: Oct 12, 2018, 01:39PM IST Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు దేశవ్యాప్తంగా బంగారం ధరలు శుక్రవారం (అక్టోబరు 12) స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 తగ్గి.. ప్రస్తుతం రూ.32,700 వద్ద కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గి రూ.30,690 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండిపై రూ.150 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.41,150 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.30,650 పలుకుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,600 గా పలుకుతోంది. అక్టోబరు 12న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు.. నగరం 22 కారెట్ల బంగారం ధర 24 కారెట్ల బంగారం ధర చెన్నై
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV యువ క్రికెటర్‌ను బలితీసుకున్న బౌన్సర్ బౌలర్ విసిరిన బౌన్సర్ తలకు తగలడంతో వర్ధమాన క్రికెటర్ మృత్యువాత పడ్డాడు. గతంలోనూ ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కూడా ఇలాగే మరణించాడు. TNN | Updated: Aug 16, 2017, 05:18PM IST బౌలర్ విసిరిన బౌన్సర్ దెబ్బకు మరో యువ క్రికెటర్ బలైన విషాద సంఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖైబర్ ఫఖ్తునఖ్వా ప్రావిన్సుల్లోని మార్డన్ జిల్లాలో జరిగిన టీ20 మ్యాచ్ లో క్వెట్టా బియర్స్ జట్టు తరపున ఆడుతున్న జుబైర్ అహ్మద్ అనే యువ క్రికెటర్ ప్రత్యర్థి బౌలర్ విసిరిన బంతి తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. జుబైర్ మరణం ద్వారా ఆటగాళ్లకు భద్రత ముఖ్యమనే విషయాన్ని మరోమారు గుర్తుచేస్తోందని, ఆడే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పీసీబీ సూచించిస్తూ, అహ్మద్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్, బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. Tragic death of Zubair Ahmed is another reminder that safety gear i.e. helmet must be worn at all times. Our sympathies with Zubair's family pic.twitter.com/ZNmWDYaT5w — PCB Official (@TheRealPCB) August 16, 2017 వర్ధమాన ఆటగాడు జుబైర్ అహ్మద్ జమనాస్ అకాడమీలో సభ్యుడు. కామెంటేటర్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు డీన్ జోన్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా జుబైద్ మృతికి సంతాపం తెలియజేశారు. మంగళవారం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్ డేవిడ్ వార్నర్ దేశవాళీ ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా బౌలర్ జోష్ హేజల్‌వుడ్ విసిరిన బంతి మెడకు తగలడంతో గాయమైంది. అయితే మెడ పట్టేయడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. గాయం అంత తీవ్రమైంది కాకపోవడంతో త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. #ZubairAhmed young #cricketer From mardan #KPK received a short pitch delivery hit upon his head and died during match #ICC #Cricket #PCB pic.twitter.com/4ooW0hNJoS
2sports
Hyd Internet 81 Views FACEBOOK facebook ప్ర‌ముఖ జాబ్ వెబ్‌సైట్ గ్లాస్‌డోర్, అమెరికాలో ఉద్యోగుల‌కు ఓ స‌ర్వే నిర్వ‌హించి ప‌నిచేయ‌డానికి ఉత్తమ కంపెనీల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో ఉన్న వంద కంపెనీల్లో ఫేస్‌బుక్ మొద‌టి స్థానంలో నిలిచింది. ఆపిల్ సంస్థ 84వ స్థానంలో ఉంది. గతేడాది ఇదే జాబితాలో ఆపిల్ 36 స్థానం సంపాదించుకుంది. ఎక్కువ రేటింగ్ ఉన్న యాజ‌మాన్య సంస్థ‌గా ఆపిల్ ముందంజ‌లో ఉన్న‌ప్ప‌టికీ ప‌నిచేయ‌డానికి ఉత్త‌మ ప్ర‌దేశంగా మాత్రం ఉద్యోగుల‌ను సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోయింది. ఇక రెండో స్థానంలో బైన్ అండ్ కంపెనీ ఉండ‌గా బోస్ట‌న్ క‌న్స‌ల్టింగ్ గ్రూప్‌, ఇన్ ఎన్ ఔట్ బ‌ర్గ‌ర్‌, గూగుల్ సంస్థ‌లు వ‌రుస‌గా త‌రువాతి స్థానాల్లో నిలిచాయి. అంతర్జాతీయంగా ఎంతోమందిని ప్ర‌భావితం చేసే ఫేస్‌బుక్ సంస్థ ఉద్యోగులు చాలా చ‌క్క‌ని పనివాతావ‌ర‌ణంలో పనిచేస్తున్నార‌ని గ్లాస్‌డోర్ సీఈఓ రాబ‌ర్ట్ హోమ‌న్ తెలిపారు. అలాగే ఆపిల్ గురించి చాలా మంది ఉద్యోగులు అసంతృప్త సమీక్ష‌లు ఇచ్చార‌ని ఆయ‌న పేర్కొన్నారు.
1entertainment
ధోనీ బంతి "మిస్టరీ" వీడింది ... ‘‘ధోనీ మనల్ని వదిలి అప్పుడే వెళ్లడు’’ Highlights ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిర్ణాయాత్మక చివరి వన్డేలో ఓడిపోయిన అనంతరం.. ఆ రోజు ఏ బంతితో మ్యాచ్ జరిగిందో ఆ బంతిని అంపైర్ల నుంచి ధోనీ తీసుకుని మైదానాన్ని వీడటం.. దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిర్ణాయాత్మక చివరి వన్డేలో ఓడిపోయిన అనంతరం.. ఆ రోజు ఏ బంతితో మ్యాచ్ జరిగిందో ఆ బంతిని అంపైర్ల నుంచి ధోనీ తీసుకుని మైదానాన్ని వీడటం.. దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. గతంలో టెస్టులకు వీడ్కోలు చెప్పే సందర్భంలోనూ అంపైర్ల నుంచి వికెట్లు తీసుకుని.. ఆ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించడంతో.. ఆ సందర్భాన్ని ఈ సందర్భంతో పోల్చి.. ధోనీ వన్డేల నుంచి తప్పుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అభిమానులు కూడా ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్ చేశారు.. ఈ నేపథ్యంలో  ధోనీ ‘‘బంతి మిస్టరీ’’ని ఛేదించేందుకు టీమిండియా కోచ్ రవిశాస్త్రి రంగంలోకి దిగారు. ఎంఎస్ మనల్ని వదిలి అప్పుడే ఎక్కడికి వెళ్లడం లేదు.. అతడు భారత జట్టుతో ఇంకొంత కాలం ప్రయాణిస్తాడు. ఆ రోజు అంపైర్ల నుంచి బంతిని తీసుకున్న ఉద్దేశ్యం వేరే ఉంది.. మ్యాచ్‌లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి.. బంతిని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడు తప్పించి.. అతనికి ఏ రిటైర్మెంట్ ఉద్దేశం లేదు.. అంటూ రవిశాస్త్రి తెలిపాడు. ఆయన వివరణ ఇచ్చాకా ధోనీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు..  Last Updated 19, Jul 2018, 11:37 AM IST
2sports
ఇంటర్‌ కనెక్టివిటీపై రోజువారీ నివేదికలు ఆర్‌జియో ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ముంబై, సెప్టెంబరు 3: టెలికాం సర్వీసు సంస్థల ఆపరేటర్లు ఇంటర్‌ కనెక్ట్‌ పాయింట్లు ఏర్పాటుచేసి జియో చందాదారుల నుంచి వారి కంపెనీల చందా దారులకు వాయిస్‌కాల్స్‌ నిరంతరాయంగా వెళ్ళేం దుకు సహకరించాలని ఆర్‌జియో ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ సూచించారు. ఆపరేటర్‌ల వారీగా వైఫ ల్యాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వివరించారు. అంతేకాకుండా సర్వీస్‌ ప్రొవై డర్లు మొబైల్‌ నంబరు పోర్టబలిటీ సౌకర్యం కూడా అందించాలని ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రస్తుత టెలి ఫోన్‌ నంబరు నుంచి మరొక నెంబరుకు మారేందుకు కస్టమర్లకు స్వేఛ్ఛ ఉందన్నారు ఒకసారి ఆర్‌జియో తన సేవలను ప్రారం భించినట్లు టెలికాం డిపార్టుమెంట్‌, ట్రా§్‌ు కు నివేదించిన తర్వాత నిబంధనలు, లైసె న్సు నియమాల ప్రకారం అన్నీ అమలవుతా యని అన్నారు. అలాగే ఇతర కంపెనీలు కూడా తమవైపు నుంచి ఇంటర్‌ కనెక్టివిటీ సౌకర్యం అందించాలని కోరారు. జియో అవసరాలదృష్ట్యా సహకరించడంతోపాటు మొబైల్‌ నంబరు పోర్టబి లిటీ(ఎంఎన్‌పి)ని కూడాఏర్పాటుచేయాలని కోరారు. జియోసేవలు ప్రారంభించడం ద్వారా ప్రస్తుతం ఉన్న టెలికాం కంపెనీలు జియోకు సహకరింస్తా యన్న నమ్మకం వ్యక్తంచేశారు. పూర్తి పారదర్శకం గా కస్టమర్లే తమకు ముఖ్యం అన్న రీతిలో జియో సేవలందిస్తుందని, ప్రతి టెలికాం ఆపరేటర్లపరంగా కాల్స్‌ వైఫల్యం ఉంటే ఆపరేటర్ల వారీగా వెబ్‌సైట్‌ లో పొందుపరుస్తామని జియోడాట్‌కామ్‌లో ప్రతిరోజూ వీటిని అందుబాటులో ఉంచుతా మని కంపెనీ ప్రకటించింది. ఒక్క గతవారం లోనే తమ కస్టమర్లు 50 మిలియన్లకుపైగా కాల్‌ డ్రాప్స్‌ చవిచూసారని ముఖేష్‌ అంబానీ స్వయంగా వెల్లడించారు. ఇంటర్‌ కనెక్ట్‌ సౌకర్యం సక్రమంగా అందించకపోవడం వల్లనే ఈ విధంగా జరిగిందని అన్నారు. ఈ సమస్య అంతటికీ ప్రస్తుతం ఉన్న టెలికాం ఆపరేటరే కారణమని ఆపరే టర్లు ఈ నిబంధనలను దుర్వినియోగంచేస్తూ మార్కెట్‌ పవర్‌కోసం తాపత్రయపడుతున్నట్లు ఆర్‌జియో ప్రకటించింది. అసహజమైన అడ్డం కులు సృష్టిస్తూ జియోరాకను నియంత్రిస్తు న్నాయన్నారు. ఇలాంటి అడ్డంకులు జియో నెట్‌వర్క్‌ను ఏమాత్రం నిలువరించలేవని ముఖేష్‌ స్పష్టంచేశారు. అయితే తాత్కాలికంగా ఈ అడ్డంకులు జియో కస్టమర్లకు కొంతమేర అసహనం పెంచుతుందని, ఇతర నెట్‌వర్క్‌ ఆపరేటర్లకు చేసే సమయాల్లోనే ఈ సమస్యలు వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈనెల ఐదవ తేదీ నుంచి ఆర్‌జియో వాణిజ్యసేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మణికట్టు స్పిన్నర్‌ను కాదు, వేళ్లతోనే తిప్పేస్తా: రషీద్ టీ20ల్లో తిరుగులేని బౌలర్ అయిన రషీద్ ఖాన్.. తాను మణికట్టు స్పిన్నర్ కాదని.. ఫింగర్ స్పిన్నర్ అని చెప్పడానికే ఇష్టపడతానని చెప్పాడు. Samayam Telugu | Updated: Jun 5, 2018, 04:05PM IST టీ20ల్లో ప్రపంచ నంబర్ 1 బౌలర్ అతడంటూ రషీద్ ఖాన్‌ను ఉద్దేశించి సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్ చాలు.. ఈ అప్ఘాన్ స్పిన్నర్ గొప్పదనమేంటో చెప్పడానికి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున బరిలో దిగిన ఈ స్పిన్నర్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. క్వాలిఫయర్ మ్యాచ్‌లోనైతే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తిరుగులేని ఆటతో జట్టును ఒంటి చేత్తో ఫైనల్ చేర్చాడు. రషీద్‌ను అద్భుతమైన మణికట్టు స్పిన్నర్ అని అందరూ పిలుస్తుంటే.. తను మాత్రం మణికట్టు కంటే ఎక్కువగా వేళ్ల కొనలతోనే బంతిని తిప్పుతానంటున్నాడు. ఇలా వేలి కొనలతో బంతిని తిప్పడం వల్ల వేగంగా విసరడానికి అవకాశం లభిస్తుందని చెబుతున్నాడు. ‘‘లెగ్ స్పిన్ ఎలా వేయాలో నాకెవరూ చెప్పలేదు. ఆ అవకాశం కూడా నాకు లేదు. కాకపోతే ఐదారేళ్ల క్రితం షాహిద్ అఫ్రిదీ, అనిల్ కుంబ్లేల వీడియోలను చూసేవాణ్ని. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో కుంబ్లే బౌలింగ్ వీడియోలను చూస్తుంటా’’ అని రషీద్ చెప్పాడు. గతేడాది ఐపీఎల్ సీజన్ ముగిశాక ఇంటికెళ్లినప్పుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం నన్నెంతో ఆకట్టుకుంది. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని రషీద్ చెప్పాడు. ఒంటరిగా అనిపించినప్పుడు పడుకోవడానికి ప్రయత్నిస్తాను. గ్రీన్ టీ తాగి రిలాక్స్ అవుతా. ఇంకేం చేయనని ఈ అప్ఘాన్ యువ సంచలనం చెప్పాడు.
2sports
Hyderabad, First Published 15, Aug 2018, 3:59 PM IST Highlights నా కూతుళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ ప్రపంచంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నిర్మాతలతో శృతిహాసన్ తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడేప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది లోకనాయకుడు కమల్ హాసన్ తన ఇద్దరు కూతుళ్లను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. మొదట సింగర్ గా తన కెరీర్ మొదలుపెట్టిన శృతిహాసన్ ఆ తరువాత నటిగా తెరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్ గా వెలుగొంది బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. అలానే కమల్ చిన్నకూతురు అక్షరహాసన్ కూడా నటిగా తన కెరీర్ స్టార్ట్ చేసింది. పలు తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఇలా ఆయన ఇద్దరు కూతుళ్లు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ తన కూతుళ్ల గురించి మాట్లాడుతూ ఓ సందర్భంలో తండ్రిగా బాధపడుతుంటా అని చెప్పారు. ఇంతకీ కమల్ ఎందుకు అలాంటి కామెంట్ చేశారంటే.. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనల గురించి విన్నప్పుడు ఓ తండ్రిగా బాధపడుతుంటానని, అలా అని నా పిల్లల స్వేచ్ఛను లాక్కోలేనని ఆయన అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. 'నా కూతుళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ ప్రపంచంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నిర్మాతలతో శృతిహాసన్ తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడేప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది' అని అన్నారు.  Last Updated 9, Sep 2018, 10:58 AM IST
0business
మాకు వరల్డ్‌ క్లాస్‌ స్పిన్నర్లు ఉండరు ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ వ్యాఖ్య న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాస్‌ వివా దాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కాడు.అయిదు టెస్టుమ్యాచ్‌ల సిరీస్‌లోభాగంగా ఇంగ్లండ్‌ జట్టు భారత్‌ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.ఈ సంద ర్భంగా ఇంగ్లండ్‌ విజయావకాశాలపై స్వాన్‌ మీడియా తో మాట్లాడాడు.మాంటీ వనేసర్‌తో కలిసి ఇంగ్లండ్‌ జట్టుకు దీర్ఘ కాలం సేవలందించిన ఈ మాజీ స్పిన్నర్‌ ఇంగ్లండ్‌ గడ్డపై స్పిన్నర్ల పట్ల వ్యవహరించే తీరుపై మండిపడ్డారు.ఇంగ్లండ్‌లో స్పిన్‌ నిరాదరణకు గురైం దని,అసలు దేశంలో స్పిన్నర్లను గుర్తించడంలేదని విమర్శలు గుప్పించాడు. ఇంకో అడుగు ముందుకేసి ఇంగ్లండ్‌లో స్పిన్నర్లను మూడవ తరగతి ప్రజలుగా పరిగణిస్తారని వివరించాడు.దీనివల్లే ఇంగ్లండ్‌ క్రికెటర్లు స్పిన్‌పై ఆసక్తి కనబరచడానికి కారణమని పేర్కొన్నాడు.కాగా 2012లో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టు 2-1తో భారత్‌పైవిజయం సాధించడంలో స్వాన్‌ కీలక పాత్ర పోషించాడు.మాకు వరల్డ్‌ క్లాస్‌ స్పిన్నర్లు ఉండరు.అందుకు కారణం మమ్మల్ని ట్రీట్‌ చేసే విధానమే. మాకు ఉపయోగపడని మంచి జట్టుతో పాటు ఉపయోగపడని మంచి క్రికెటర్ల కూడా ఉంటారు.దీంతో భారత్‌తో జరుగబోయే సిరీస్‌లను కోల్పోతాం.కాగా మూడవ తరగతికి చెందిన క్రికెటర్ల తరహాలో చూస్తారు.కారణం స్పిన్నర్లను చిన్నచూపు చూడటమే అని స్వాన్‌ మండి పడ్డాడు.
2sports
పవర్ స్టార్ 25 మూవీ ఆడియో రిలీజ్ ఆ రోజేనా? Highlights పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో పిఎస్పికె25 ప్రస్థుతం  యూరోప్ లో కొనసాగుతున్న ఈ మూవీ షూటింగ్ ఈ మూవీ ఆడియో రిలీజ్ డేట్ పై ఫిల్మ్ నగర్ టాక్స్ రౌండ్స్ పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న పిఎస్.పికె25 చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన నేపథ్యంలో.. తాజాగా ఈ కాంబినేషన్ లో రాబోతోన్న మరో మూవీపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఆడియో డిసెంబర్ నెలలో రిలీజ్ కానుందని అనుకున్నాం. తాజాగా ఫిలింనగర్ నుంచి వినిపిస్తున్న అప్‌డేట్స్ ప్రకారం డిసెంబర్ 14వ తేదీన పీఎస్‌పీకే25 సినిమా ఆడియో విడుదల కార్యక్రమం వుండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్-పవన్ అండ్ టీమ్ యూరప్‌లో సినిమా షూటింగ్‌లో బిజీగా వుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి కావచ్చినట్టవుతుంది. ఆ తర్వాత ఎలాగూ ఇక పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టడమే మిగిలివుంటుంది కనుక డిసెంబర్ 14న జరపబోయే ఆడియో లాంచింగ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తోందట సినిమా యూనిట్.   అందులోనూ ఈ సినిమాకు ఓ ప్రత్యేకత వుంది. తమిళంలో సంచలనాలు సృష్టించిన యువ సంగీత కెరటం అనిరుధ్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌కి పరిచయం అవబోతున్నాడు. ఆడియో లాంచింగ్ ఫంక్షన్ అంటేనే ముఖ్యంగా మ్యూజిక్ కంపోజర్స్‌కి సంబంధించి ఓ ఫెస్టివల్ లాంటిది. అందుకే ఈ ఆడియో లాంచింగ్ ఫంక్షన్ అన్ని ఇతర ఆడియో రిలీజింగ్ ఫంక్షన్స్‌ తో పోలిస్తే మరింత ఎట్రాక్టివ్ గా నిర్వహించనున్నారనే టాక్ వినిపిస్తోంది. Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పవన్ కళ్యాణ్ Highlights జనసేన అధినేతకు సమాజంలో కుళ్లును కడిగేయాలనే  ఆవేశం ఆవేశం మూలంగా ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించిన పవన్   మెగా స్టార్ ఫ్యామిలీ హీరోగా ఆరంగేట్రం చేసి... తన టాలెంట్ తో అనతి కాలంలోనే పవర్ స్టార్ అనిపించుకన్నారు పవన్ కళ్యాణ్. సినిమాల ద్వారా తనకు వచ్చిన ఇమేజ్ ను ఆసరాగా చేసుకుని ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ కూడా స్థాపించి.. విశేష ప్రజాదరణతో.. ప్రజా సమస్యలపై నేతలను నిలదీస్తూ సాగుతున్నారు పవన్ కళ్యాణ్. ఇంతటి ప్రజాదరణ ఉన్న ఒక వ్యక్తి ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట. ఆ విషయాలను పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించాడు.   అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పవన్ ప్రసంగించాడు. ఇండియన్ కాన్ఫరెన్స్ 2017 సందర్భంగా  దాదాపు గంటసేపు మాట్లాడిన పవన్.. తన బాల్యం, విద్య, సామాజిక అవగాహన, సినిమాలు, రాజకీయాల్లో తన అనుభవాలను పంచుకున్నాడు. చదువులో తానెప్పుడూ వెనకేనని, చదువు అస్సలు అబ్బేదే కాదని వెల్లడించాడు. పుస్తకాల్లో ఉన్నదానికి సమాజంలో జరుగుతున్నదానికి చాలా తేడాలను చిన్నప్పుడే గమనించానని, అది చూసి విపరీతమైన విసుగు పుట్టేదని చెప్పాడు. ఒకానొక దశలో తన అన్న చిరంజీవి లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చుకుని చనిపోదామనుకున్నానని పవన్ వెల్లడించాడు.   అదృష్టం కొద్దీ కుటుంబ సభ్యుల కౌన్సెలింగ్‌తో ‘ఆత్మహత్య’ ఆలోచనలను విరమించుకున్నానని షాకింగ్ విషయాన్ని తెలిపాడు. ఆ తర్వాత నెమ్మది..నెమ్మదిగా సమాజంపై అవగాహన పెంచుకున్నానని చెప్పాడు. కాగా, జనసేన పార్టీ ఎప్పుడూ జాతీయ సమగ్రతకే ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించాడు. Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
Hyd Internet 133 Views rohith ROHITH హైదరాబాద్‌: భారత్‌-శ్రీలంకల మధ్య కోల్‌కతా వేదికగా తొలి టెస్టు ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మకు తుది జట్టులో స్థానం దక్కలేదు. మరోవైపు వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ 11.5 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 17పరుగులు చేసింది.
2sports
Hyderabad, First Published 3, Oct 2018, 12:04 PM IST Highlights స్టార్ హీరో సుదీప్ కారు ప్రమాదంలో గాయ పడ్డారని కన్నడ వర్గాల ద్వారా తెలుస్తోంది. కన్నడలో స్టార్ హీరో అయిన సుదీప్ తెలుగులో కూడా నటించాడు.  స్టార్ హీరో సుదీప్ కారు ప్రమాదంలో గాయ పడ్డారని కన్నడ వర్గాల ద్వారా తెలుస్తోంది. కన్నడలో స్టార్ హీరో అయిన సుదీప్ తెలుగులో కూడా నటించాడు. రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' సినిమాలో విలన్ పాత్రలో నటించి తెలుగు వారికి దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన కన్నడలో నటిస్తోన్న 'పైల్వాన్' సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. తాజాగా సుదీప్ నటించిన 'ది విలన్' సినిమా టీజర్ విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. దీనికి సుదీప్ రాకపోవడంపై మీడియాలో చర్చ మొదలైంది. ఆ కార్యక్రమానికి తాను ఎందుకు హాజరు కాలేకపోయాననే విషయాన్ని వెల్లడిస్తూ.. కారు ప్రమాదంలో గాయపడ్డ కారణంగా హాజరుకాలేకపోయినట్లు చెప్పారు. అభిమానులంతా అయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.  Last Updated 3, Oct 2018, 12:04 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV నాకు 50 ఏళ్లు కాదు.. 27 ఏళ్లే-సల్మాన్ బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ వయసు నేటితో 50 ఏళ్లకి చేరుకుంది. సినిమా స్టార్స్ ఎవరికైనా జీవితంలో ఒక్కో బర్త్‌డే జరుపుకుంటున్న కొద్దీ TNN | Updated: Dec 27, 2015, 05:02PM IST బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ వయసు నేటితో 50 ఏళ్లకి చేరుకుంది. సినిమా స్టార్స్ ఎవరికైనా జీవితంలో ఒక్కో బర్త్‌డే జరుపుకుంటున్న కొద్దీ వారికి తమ వయస్సు పెరిగిపోతోందనే బెంగ ఎక్కడో ఓ చోట వేధిస్తూనే వుంటుంది. కానీ ఈ ఆదివారం, డిసెంబర్ 27న తన 50వ బర్త్‌డే జరుపుకుంటున్న సల్మాన్ ఖాన్‌కి మాత్రం అటువంటి భయాలేమీ లేవు. పైగా తనకిది 50వ పుట్టినరోజే అయినప్పటికీ... తనకి మాత్రం 27వ బర్త్‌డేలా వుందని చెప్పి తనలోని జోష్‌ని చాటుకున్నాడు సల్మాన్. ఏజ్ పెరుగుతోందని ఎందుకు భయపడాలి. అది జీవిత ప్రయాణంలో ఓ భాగమే కదా అని ఎదురుప్రశ్నిస్తున్నాడు సల్మాన్. బాలీవుడ్ రైటర్ సలీం ఖాన్‌కి సినీ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన సల్మాన్ ఖాన్.. తన ఫిట్‌నెస్, కండలతో బాలీవుడ్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాడు. బీవీ హై తో ఐసీ అనే సినిమాలో సపోర్టింగ్ రోల్ పోషించడం ద్వారా మొదటిసారి సినిమాల్లోకి వచ్చిన సల్లూ భాయ్.. మైనే ప్యార్ కియా , హమ్ ఆప్ కే హై కౌన్ , కరణ్ అర్జున్ , బీవీ నెం.1, హమ్ సాత్ సాత్ హై , కుచ్ కుచ్ హోతా హై , దబంగ్, బాడీగార్డ్, ఏక్ థా టైగర్ , కిక్ నుంచి ఇటీవలే వచ్చిన భజ్రంగీ భాయిజాన్ , ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాల వరకు అంతకంతకూ తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని రెట్టింపు చేసుకుంటూ వచ్చాడు సల్మాన్. లవ్ ఎఫైర్లు, రాజస్థాన్‌లో క్రిష్ణ జింకల వేట కేసు, 2002 హిట్ అండ్ రన్ కేసు వంటి వివాదాలు సల్మాన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఏ మాత్రం అడ్డుకోలేకపోయాయి. 2002 హిట్ అండ్ రన్ కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్న సల్మాన్‌కి 2015 బాగా కలిసొచ్చింది. ఎందుకంటే ఆ కేసులో సల్మాన్ నిర్ధోషి అంటూ ముంబై హై కోర్టు తీర్పు వెల్లడించింది ఈ సంవత్సరంలోనే. ఈ తీర్పుతో తాను, తన కుటుంబం అనుభవించిన 13 ఏళ్ల మానసిక వేధనకి ఫుల్‌స్టాప్ పడినట్లయ్యిందని స్వయంగా సల్మానే అభిప్రాయపడ్డాడు. వచ్చే సంవత్సరానికి సల్మాన్ కెరీర్‌లో మరో ప్రాధాన్యత వుంటుందని సల్మాన్ సన్నిహితులు భావిస్తున్నారు. తన ప్రస్తుత గాళ్‌ఫ్రెండ్ అయిన రొమేనియా నటి, మోడల్ లూలియాని 2016లో సల్మాన్ వివాహం చేసుకుంటాడనే వార్తలే అందుకు కారణం.
0business
టీవీలోనూ నేనే మెగాస్టార్ అంటూ అదరగొడుతున్న వెండితెర మెగాస్టార్ Highlights మా టీవీ మీలో ఎవరు కోటీశ్వరుడు షోని హోస్ట్ చేస్తున్న మెగాస్టార్ తనదైన శైలిలో షోని ఆకర్షణీయంగా హోస్ట్ చేస్తున్న చిరు చిరు మనసు పెద్దదని నిరూపిస్తూ గెలవని పార్టిసిపెంట్స్ కు ఆర్థిక చేయూత మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకి చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తారనగానే చాలా మందిలో సందేహాలు వ్యక్తమయ్యాయి. హోస్ట్‌ అంటే ఇలాగే వుండాలి అన్నట్టుగా నాగార్జున మొదటి మూడు సీజన్లలో ప్రశంసలు అందుకున్నాడు. నాగ్ షోని హోస్ట్ చేయటంలో సక్సెస్ అయిన విధంగా చిరంజీవి చేయలేడని విమర్శలు వచ్చాయి.  అయితే ఖైదీ నంబర్‌ 150 సక్సెస్ ఇచ్చిన ఉత్సాహానికి తోడు, తన హాస్య చతురతని, జనంతో ఇంటరాక్ట్ కాగలిగే స్కిల్స్‌తో చిరంజీవిపై అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ల నోళ్లు మూయించారు. మెగాస్టార్ తనదైన శైలిలో మా మీలో ఎవరు కోటీశ్వరుడు షోను రన్ చేస్తున్నారు.   ఇంత కాలం కేవలం డిగ్నిఫైడ్‌ థ్రిల్లింగ్‌ గేమ్‌గా వున్న షోని చిరంజీవి ఎంటర్‌టైనింగ్‌గా మలుస్తున్నారు. షోలో ఎంటర్ టైన్ మెంట్ పండిస్తూనే పోటీలో పాల్గొంటున్న వారి కష్టాలకి స్పందించి, అనుకున్న మొత్తం గెలుచుకోలేక పోయిన వారికి తన సొంత అకౌంట్‌లోంచి డబ్బులిస్తూ చిరంజీవి అందరి మనసులు గెలుస్తున్నారు. కష్టాలకి స్పందించే గుణంతో పాటు మధ్య తరగతి కష్టాలేమిటి అనేది తెలిసిన వ్యక్తి కావడంతో చిరంజీవి ఈ షోకి పూర్తిగా కొత్త యాంగిల్‌ ఇస్తున్నారు.    ఇక తనదైన శైలిలో తన తన హిట్ సినిమాల మెమొరీస్ ని పంచుకుంటూ, కోస్టార్స్ తో షోని అట్రాక్టివ్ గా మార్చి షోని మరితం అట్రాక్టివ్ గా మార్చారు బాస్. చిరంజీవి ఈ షో హోస్ట్‌గా సూపర్‌హిట్‌. నాగార్జున లా అయినా చేయగలడా అని డౌటుపడ్డ వారందరికి... మెగా స్టార్ స్టామినా చూపించాడు. అనుకన్నదానికంటే ఎన్నో రెట్లు షోని హోస్ట్ చేస్తూ.. చిరు మెస్మరైజ్ చేస్తున్నాడు.  Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
ఇటలీ సంస్థను కొనుగోలు చేసిన రెడ్డీస్ ముంబై (ఏజెన్సీ) | Sdhamani| Last Modified శుక్రవారం, 4 ఏప్రియల్ 2008 (14:40 IST) దేశంలో రెండో పెద్ద ఫార్మాస్యూటికల్స్ సంస్థగా పేరుగాంచిన రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇటలీకి చెందిన జెట్ జనరసీ ఎస్ఆర్ఎల్ సంస్థను కొనుగోలు చేసినట్లు గురువారం ప్రకటించింది. ఒకే వారంలో వరుసగా మరోసారి యూరప్‌కి చెందిన సంస్థను కొనుగోలు చేయడాన్నిబట్టి చూస్తే డాక్టర్ రెడ్డీస్ సంస్థ యూరప్‌లోని సంస్థలను కొనుగోలు చేయడంపై తన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందుగానే ఏప్రిల్ ఒకటో తేదీన బ్రిటన్‌కి చెందిన స్మాల్ మాలిక్యూల్స్ వ్యాపార సంస్థను కొనుగోలు చేసిన విషయం విదితమే. ఈ విధంగా రెడ్డీస్ సంస్థ యూరప్‌ సంస్థల కొనుగోలు వేటలో నిమగ్నమవడాన్ని చూస్తుంటే ఆసంస్థ వ్యూహాత్మక ప్రణాళిక ప్రస్ఫుటంగా కనబడుతోంది. అంతేకాకుండా యూఎస్‌పై ఆధారపడకుండా స్వతంత్రంగా కార్యకలాపాలను కొనసాగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. యూరప్‌లోకల్లా మూడో అతి పెద్దదైన జెట్ జనరిసీ సంస్థను చేపట్టడం యూరప్‌ వ్యాపారరంగంలో తమ అభివృద్దికి తొలి మెట్టుగా భావిస్తున్నామని రెడ్డీస్ యూరప్ కార్యకలాపాల ప్రెసిడెంట్ వి.ఎస్.వాసుదేవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఫలితంగా ఈ ఇటలీ సంస్థకు చెందిన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో, రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్, సేల్స్, మార్కెటింగ్‌లు తమ ఆధీనంలోకి వస్తాయని రెడ్డీస్ సంస్థ పేర్కొన్నది. సంబంధిత వార్తలు
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Hyderabad, First Published 4, Oct 2018, 11:38 AM IST Highlights 'అరవింద సమేత' సినిమా ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దీని వెనుక ఎన్టీఆర్ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానుల హస్తం కూడా ఉందని టాక్. 'అరవింద సమేత' ప్రీరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్పీచ్ విన్న తారక్ అభిమానులు ఎంతో ఎమోషనల్ అయ్యారు.  'అరవింద సమేత' సినిమా ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దీని వెనుక ఎన్టీఆర్ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానుల హస్తం కూడా ఉందని టాక్. 'అరవింద సమేత' ప్రీరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్పీచ్ విన్న తారక్ అభిమానులు ఎంతో ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ స్పీచ్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తారక్ ని సపోర్ట్ చేస్తూ మీకు మేమున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాధారణంగా ఒక టాప్ హీరో సినిమాలకు సంబంధించిన ట్రైలర్ ని మరో టాప్ హీరో అభిమానులు సపోర్ట్ చేయడం అరుదుగా జరుగుతుంది.  'అరవింద సమేత' సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ తారక్ కి సపోర్ట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమా ట్రైలర్ ని ఆకాశానికేత్తేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో టీడీపీ కి ప్రచారం కల్పించడానికి ఎన్టీఆర్ ని రంగంలోకి దింపబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి తారక్ నుండి విమర్శలు రాకుండా తప్పించడానికే ఇలా తారక్ ని పొగుడుతూ సపోర్ట్ ఇస్తున్నారని టాక్. ఇవన్నీ పక్కన పెడితే.. 'అరవింద సమేత'కి తారక్ ఫ్యాన్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ కూడా తోడైతే ఇక రికార్డుల మోతమోగడం ఖాయం! సంబంధిత వార్తలు..
0business
internet vaartha 159 Views ఫతేమైదాన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడలకు పెద్ద పీఠ వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావు క్రీడాపాలసీని ప్రవేశపెట్టి క్రీడాకారులకు అ పాలసీలో అనేక ప్రొత్సహాలను కల్పించిన విషయం అందరికి తెలిసిందే కానీ రాష్ట్రంలో క్రీడా సంఘాలకు పెద్ద దిక్కువగా వ్యవహరించే తెలంగాణ ఒంలింపిక్‌ సంఘం రెండుగా చీలిపోయిన విషయం అందరికి తెలిసిందే ఒక సంఘానికి పార్లమెంట్‌ సభ్యుడు ఎపి. జితేందర్‌ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా, మరో ఒలింపిక్‌ సంఘానికి ప్రొపెషర్‌ కె.రంగారావు నాయకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరికితోడు కె. జగదీశ్వర్‌యాదవ్‌, ఎస్‌.అర్‌.ప్రేమ్‌రాజ్‌ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వీరు క్రీడా సంఘాలకు, క్రీడల అభివృద్ధికి, క్రీడా కారులకు ఏ విధమైన సహాయం చేయాలని మార్చి పోయిన తమ అదితపథ్య పోరుకు రాష్ట్ర ఒలింపిక్‌ భవనం కేంద్రబిందువు అయింది. వివరాలలోకి వెలితే ఒలింపిక్‌ భవనాని సంబంధించిన విషయంలో తెలంగాణ క్రీడాపాధికార సంస్థ విసి.ఎండి ప్రస్తుతం ఎల్బీస్టేడియంలో ఉన్న భవనాన్ని ప్రొఫెసర్‌ కె.రంగారావుకు అప్పజెప్పాలని ఈ నెల 12వ తేదీ నాడు శాట్స్‌ఎండి ఒక జీవోను విడుదల చేసింది. ప్రభుత్వ మెమెనెంబర్‌ 77బై స్పోర్ట్స్‌2016, 11-3-16 నాడు ప్రభుత్వ క్రీడల కార్యదర్శి తెలంగాణ శాట్స్‌ ఎండికి అదేశాలు జారీ చేశారు. వారితో పాటు లెటర్‌ నెం స్పెషల్‌ సెక్రటరీ సిఎం నెం 3862 జిఎన్‌, జిపి అబ్లిక్‌, జిపి తేదీ 21-3- 2016 నాడు క్రీడల ముఖ్య కార్యదర్శికి ఒక జీవోను పాస్‌ చేయడం జరిగింది. దాని అదేశాల మేరకే ప్రొఫెసర్‌ కె.రంగారావు, ఒలింపిక్‌ అఫ్‌ తెలంగాణ సంఘం అధ్యక్షతన ఈయనకు ఈ భవనాన్ని అప్పచెప్పాలని తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడైన ఎపి జితేందర్‌ రెడ్డి, కె.జగదీశ్వర్‌యాదవ్‌కు తెలంగాణ క్రీడాపాధికార సంస్థ ఒక ఉత్తరాన్ని అందజేయడం జరిగింది. ఈ ఉత్తరాన్ని తీసు కొని ప్రొఫెసర్‌ కె.రంగారావు బుధవారం నాడు తన అనుచురులతో పోలీసు బందోబస్తుతో ఒలింపిక్‌ భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి రావడం జరిగింది. వారికి వ్యతిరేకంగా మరో ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులు అసలైన ఒలింపిక్‌ సంఘం మాదే కాబట్టి మికిచ్చే ప్రసేక్తే లేదని వారు అన్నారు. క్రీడాపాధికార సంస్థ వారు స్వాధీనం చేసుకోవాలని మాకు ఉత్తరం ఇచ్చారు కబట్టీ మాకు అందజేయాలని వారు డిమాండ్‌ చేశారు. కానీ ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకొని మిగితా వారిని అక్కడి నుండి పంపించడం జరిగింది. తరువాత రంగారావు మాట్లాడుతూ భారత ఒలింపిక్‌ సంఘం మాకే గుర్తింపు ఇచ్చింది  కాబట్టి రాష్ట్రంలో మాదే అసలైన ఒలింపిక్‌ సంఘం కాబట్టి మీరు వెంటనే ఈ భవనాన్ని ఖాళీ చేసిపోవాలని రంగా రావు,ప్రేమ్‌రాజ్‌ కోరినప్పట్టికి వారు ససేమిరా అన్నారు. కొంత సేపు శాంతి ఇచ్చిన తరువాత కొంత సేపు రంగారావు నాయకత్వం లోని వారి వర్గం ఒలింపిక్‌ భన్‌లో ఇసి మీటింగ్‌ నిర్వహించుకోవ డం జరిగిందని రంగారావు చెప్పారు. సిఎం కార్యాలయం అదేశాల మేరకు తాత్కళికంగా ఈ ఒలింపిక్‌ భవనం స్వాధీనం తాత్కలికంగా వాయిదా వేయడం జరిగింది. క్రీడా కారులను ప్రొత్సహించాల్సిన వీరే రచ్చకెక్కితే వీరిని భాగుచేసేది ఎవరని పలువురు క్రీడా పండితులు అంటున్నారు. అసలైన ఒలింపిక్‌ సంఘం మాదే ఉమ్మడి హైకోర్టు అదేశాల మేరకు గత ఏడాది తెలంగాణకు, అంధ్ర ప్రదేశ్‌కు రెండు సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందని మరో ఒలింపిక్‌ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవ హరిస్తున్న కె.జగదీశ్వర్‌ యాదవ్‌ అన్నారు. నిస్పర్ధంగా నిర్భయంగా రిటైర్ట్‌ హైకోర్టు జడ్జిచేత ఈ రెండు సంఘాలకు  ఎన్నికలు నిర్వహించడం జరిగిందని అయన అన్నారు. అ ఎన్నికల్లో తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడుగా ఎంపి పార్లమెంట్‌ సభ్యుడు ఎపి జితేందర్‌ రెడ్డితో  పాటు నేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగిందని అయన అన్నారు. అంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సం ఘం అధ్యక్షుడుగా  రాజ్యసభ అధ్యక్షుడు సియం రమేష్‌,ప్రధాన కార్యదర్శిగా జెసి పవన్‌ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల పర్య వేక్షకులుగా రెండు రాష్ట్రాల క్రీడా పాధికార సంస్థ అధికారులు హాజరు అయ్యారని తెలిపారు. కొందరు స్వార్ధపరుల వలన భారత ఒలింపిక్‌ సంఘం నుంచి ప్రతినిధులు రావాల్సిఉన్న రాకుండా చేయడం జరిగిందని అయన చెప్పారు. ఎన్నికలను సజావుగా నిర్వహించి ముమ్మడి హై కోర్టు అదేశాల మేరకు ఎన్నికలకు సంబంధించిన అన్నింటిని కూడా స్టీల్‌ కవర్‌లో హై కోర్టుకు అందజేయడం జరిగిం దని తెలిపారు. భారత ఒలింపిక్‌ సంఘం రంగారావు వర్గానికి కొమ్ముకాయడం వల్లనే ఈ సమస్యను రాష్ట్రంలో అంత జరుగుతుందని అయన చెప్పారు. రాష్ట్రంలోని అనేక క్రీడా సంఘాలు మావైపే ఉన్నాయని కె.జగదీశ్వర్‌యాదవ్‌ చెప్పారు. ఏదిఏమైన ప్పటికి ఈ రెండు క్రీడా సంఘాల ప్రతి నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఒక వద్దకు చేర్చి ఈ సమస్యను పరిష్కరిస్తే తప్పా బంగారు తెలం గాణతో పాటు బంగారు క్రీడలు కూడా కావాల్సిన సమయంలో వీరిద్దరు ప్రతినిధులు కొట్లాడుకుంటే క్రీడల అభివృద్ధి కుంటు పడుతుంది కాబట్టీ వీరిని రాష్ట్ర ప్రభుత్వం కలు గజేసుకొని క్రీడల అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలు వురు సీనియర్‌ క్రీడాకారులు కోరుతున్నారు. మొత్తానికి గొడవలు లేకుండా పోలీసుల బందోబస్తుల మధ్య ఈ ఒలింపిక్‌ భవనం స్వాధీనం వాయిదా పడడం జరిగింది.
2sports
DHONI కెప్టెన్‌ కోహ్లీకి ధోనీ గిఫ్ట్‌ న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ధోని నుంచి బాధ్యతలు తీసుకున్న కోహ్లీ తన తొలి ఎసైన్మెంట్‌లో విజయవంత మయ్యాడు. కెప్టెన్‌గా తొలి సిరీస్‌ విజయం అందుకున్న కోహ్లీకి టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని ఒక అరుదైన గిఫ్ట్‌ ఇచ్చాడు.ఈ విషయాన్ని కోహ్లీయే బిసిసిఐకి ఇచ్చిన ఇంటర్వ్యులో పేర్కొన్నాడు.రెండవ వన్డేలో విజయం సాధిం చిన అనంతరం ధోని సంతకం చేసిన బంతిని తనకు ఇచ్చా డని వెల్లడించాడు.తొలి వన్డే సిరీస్‌ విజయం ఎప్పటికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని ధోని తనతో అన్నాడని వివరించాడు.తొలి విజయం సాధించిన సందర్భంగా తనకు తన సంతకంతో కూడిన బంతిని ప్రజెంట్‌ చేశాడని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రస్తుతం చాలా ఖరీదైనవిగా మారాయని, అందుకే వాటిని ఇంటికి తీసుకెళ్లనీయడం లేదని కోహ్లీ నవ్వుతూ వివరించాడు. సిరీస్‌ గెలవడంతో పాటు ధోని ఆటోగ్రాఫ్‌ ఉన్న బంతిని అందుకోవడం కూడా తనకు ప్రత్యేకమన్నాడు.ఇంగ్లండ్‌తో ముగిసిన సిరీస్‌లో టీమిండియా విజయం వెనుక జట్టు సభ్యులందరి పాత్ర ఉందన్నాడు. వచ్చిన అవకాశాన్ని అందురూ అందిపుచ్చుకున్నారని, ఇంతకు మించి కెప్టెన్‌గా తనకు ఇంకా ఏంకావాలని కోహ్లీ పేర్కొన్నాడు.ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో యువ ఆటగాళ్లు కేదార్‌ జాదవ్‌, హార్థిక్‌ పాండ్యాల ఆటతీరుపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన సిరీస్‌లో కెప్టెన్‌గా సిరీస్‌ గెలవడంతో పాటు బ్యాటింగ్‌లో సైతం సత్తా చాటాడు.ఈ సిరీస్‌లో ఒక సెంచరీ,హాఫ్‌ సెంచరీ చేశాడు.ఇదిలా ఉంటే భారత్‌,ఇంగ్లండ్‌ జట్ల మధ్య జనవరి 26న కాన్పూర్‌లో మొదటి టి20 మ్యాచ్‌ జరుగనుంది. జోకర్‌గా ఉండేందుకు ఇష్టపడతా రన్‌ మిషన్‌,ఛేజింగ్‌ హీరో అంటూ టీమిండియా కెప్టెన్‌ కోహ్లీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న సంగతి తెలిసిందే. ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తరువాత తన తొలి వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా తన సత్తా ఏమిటో చూపించాడు.ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో ఒక సెంచరీతో పాటు హాఫ్‌ సెంచరీ చేసి అభిమానులు అలరించాడు.ఇంగ్లండ్‌పై మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కోహ్లీ నేతృత్వంలో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కోహ్లీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కోహ్లీని అభిమానులు కింగ్‌ కోహ్లీ,కెప్టెన్‌ ఫియర్‌లెస్‌ అంటూ పొగిడారు.ఈ రెండింటిలో మీకు ఏది బాగా నచ్చిందని కోహ్లీని మీడియా ప్రతినిధులు అడుగగా కోహ్లీ నోటి నుంచి వింత సమాధానం వచ్చింది.అదేమిటంటే డ్రెసింగ్‌ రూంలో జోకర్‌గా ఉండేందకు తాను ఇష్టపడతానని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు.ఇంగ్లండ్‌తో ముగిసిన సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన కేదార్‌ జాదవ్‌పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.బ్యాటింగ్‌,బౌలింగ్‌లో ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా ప్రదర్శన అద్బుతమని కొనియాడాడు.ముఖ్యంగా జట్టు విజయంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించా రన్నాడు.మరోవైపు టీమిండియా ఆటగాళ్లు, ధోని,యువరాజ్‌ ఫామ్‌లోకి రావడంతో సంతోషంగా ఉందన్నాడు.ఇవన్నీ జట్టుకు ఎంతగానో కలిసి వచ్చే అంశాలని పేర్కొన్నాడు. ఈడెన్‌ గార్డెెన్‌ పిచ్‌ ఛాంపియన్‌ ట్రోఫికి చక్కగా సరిపోతుం దని కోహ్లీ పేర్కొన్నాడు
2sports
Visit Site Recommended byColombia తనీష్‌కు.. నాని వార్నింగ్: మైకులు పక్కన పెట్టి బాత్రూమ్‌లోకి వెళ్లి ఎందుకు మాట్లాడరని నాని ప్రశ్నించారు. దీనిపై దీప్తి స్పందిస్తూ పై విషయాన్ని చెప్పింది. దీంతో తనీష్‌ దానిపై వివరణ ఇచ్చి కౌశల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో నాని కలుగజేసుకుని ‘‘నా ఎదురుగా హౌస్‌మేట్స్‌కు వార్నింగ్ ఇవ్వకు. ఏమైనా ఉంటే నాతో మాట్లాడు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హౌస్‌లో ఒక్కసారే వాతావరణం వేడెక్కింది. విలన్ ఎవరు?: హౌస్‌లో మీకు ఎవరు విలన్‌లా కనిపిస్తారో చెప్పాలంటూ ‘విలన్’ గేమ్ ఆడించారు. ఈ సందర్బంగా గీతా మాధురీ, కౌశల్ తనీష్‌ను విలన్‌గా పేర్కొన్నారు. తనీష్, దీప్తి సునైనా, గణేష్.. కౌశల్‌ను; సామ్రాట్, బాబుగోగినేని, నందిని.. రోల్ రైడాను; రోల్.. సామ్రాట్‌ను; కౌశల్, గీతా.. తనీష్‌ను; తేజస్వీ.. అమిత్‌ను, శ్యామల, అమిత్.. గీతాను, దీప్తి.. శ్యామాలను విలన్లుగా ఎంపిక చేసుకుని కిరీటం పెట్టారు. శ్యామలా ఔట్.. దీప్తి ఎమోషనల్: ఎలిమినేషన్‌లో బాబుగోగినేని, తేజస్వీలు సేఫ్‌జోన్‌లోకి వెళ్లగా.. నందిని, శ్యామల, దీప్తీలు చివరిలో మిగిలారు. వీరిలో ఎవరు బయటకు వెళ్లాలనేది బిగ్‌బాస్ నిర్ణయిస్తాడని నాని తెలిపారు. దీంతో, బిగ్‌బాస్ ఆ ముగ్గురిలో ఒకరిని బయటకు పంపే అవకాశాన్ని తేజస్వి, కౌశల్‌కు ఇచ్చారు. వీరు శ్యామలాను బయటకు పంపాలని నిర్ణయించారు. శ్యామలా ఎలిమినేట్ కావడంతో దీప్తీ కన్నీరు మున్నీరైంది. హౌస్‌లో అంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబును దీప్తీపై వేసింది శ్యామలా. దీని ప్రకారం వారమంతా హౌస్‌‌మేట్స్ దుస్తులన్నీ దీప్తి ఉతకాలి. పిట్ట కథ కాదు.. నాని కథ: నాని ఈ రోజు పిట్ట కథకు బదులు తన కథ చెప్పారు. ‘‘రాధాగోపాలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ క్యాసెట్ పట్టుకుని ఓ ఆఫీసుకు వెళ్లాను. అది తీసుకోవలసిన వ్యక్తి నన్ను ముందుగానే చూసినా.. రోజంతా వెయిట్ చేయించారు. భోజనానికి వెళ్తే ఆయన వెళ్లిపోతారేమోనని అలాగే తిండి తినకుండా వెయిట్ చేశా. చివరికి ఆయన్ను కలిశాను. ‘‘నేను నిన్ను ఉదయాన్నే చూశాను. అస్తమాను నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పించడం ఎందుకు?’’ అని ఆయన కాస్త కోపంగా అన్నారు. నేను హీరో అయిన తర్వాత ‘ఎటో వెళ్లి పోయింది మనసు’ కోసం మళ్లీ అదే ఆఫీసుకు వెళ్లా. నేను లిఫ్ట్ ఎక్కగానే మొదట కనిపించిన వ్యక్తి ఆయనే. ఆయన నన్ను చూసి.. ‘ఇలా వెళ్లండి సార్’ అని దారి చూపించారు. ఈ విషయంలో నేను ఆనందం వ్యక్తం చేయడం లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి, ఇతరులతో గౌరవంగా మసలు కోవాలి’’ అని నాని తెలిపారు. Photo Credits: Star Maa Tv
0business
Feb 10,2017 21% పెరిగిన లూపిన్‌ లాభాలు ముంబయి: దేశంలో మూడో అతిపెద్ద ఔషధ విక్రేత లూపిన్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్కెట్‌ అంచనాలను తారుమారు చేస్తూ అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక కాలంలో సంస్థ లాభాలు 21 శాతం మేర పెరిగి రూ.633.11 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.524.56 కోట్లుగా నమోదు అయింది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో సంస్థ అమ్మకాలు 31.5% పెరిగి రూ.4,404.94 కోట్ల నుంచి రూ.3,350.33 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికాలో అమ్మకాలు 57.6 శాతం మేర పెరిగి రూ.2,175.5 కోట్లకు చేరినట్టుగా సంస్థ తెలిపింది. ఇక్కడి నుంచి సంస్థ మొత్తం అమ్మకాలలో 49% విక్రయాలు నమోదైనట్టుగా కంపెనీ వివరించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
పెట్రో రిటైలింగ్‌ ప్రయివేటు పరం! Thu 24 Oct 00:16:29.881141 2019 దేశంలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్న మోడీ సర్కారు.. అందుకు గాను ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను ఫణంగా పెడుతోంది. రిటైల్‌ చమురు రంగంలో మేటిగా వెలుగొందుతున్న వొడాఫోన్‌-ఐడియా నష్టం 4874 కోట్లు Sun 28 Jul 04:35:33.546485 2019 టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా సంస్థ మరోసారి అనూహ్య నష్టాలను మూటగట్టుకుంది. జూన్‌ త్రైమాసికంలో సంస్థ నష్టాలు రూ.4,874 కోట్లుగా నమోదు అయ్యాయి. అంతకు ముందు మార్చి త్రైమాసి 20-25 విమానాశ్రయాలు ప్రయివేటుకు Sat 27 Jul 04:28:07.420737 2019 కేంద్ర ప్రభుత్వం దేశంలోని మరిన్ని విమానాశ్రయాలను ప్రయివేటీకరించనుంది. ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంలో (పీపీపీ) అభివృద్ధి పేరుతో మోడీ సర్కారు ఇప్పటికే దేశంలోని ఆరు ప్రధాన మారుతీ లాభాల్లో 'తరుగుదల' Sat 27 Jul 04:28:16.678714 2019 దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. దేశీయ మార్కెట్లో మందగమన పరిస్థితుల కారణంగా అమ్మకాలు 'జెట్‌'పై పలు సంస్థల ఆసక్తి! Sat 27 Jul 04:28:23.788675 2019 ఆర్థిక, రుణభారంతో మూతపడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ తెరుచుకొనే దిశగా శుభ శకునాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌ ధరలకు విమానయానం అందించే ఇండిగో సంస్థ.. దివాలా దశకు చేరిన జెట్‌ ఎయిర్‌వే ఆరు సెషన్ల తరువాత ఆనందం! Sat 27 Jul 04:29:42.624581 2019 దేశీయ మార్కెట్లు వరుసగా ఆరు సెషన్ల తరువాత తొలిసారిగా శుక్రవారం లాభాలను నమోదు చేశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో గత ఆరు సెషన్లలో నష్టాలను చవ నష్టాల్లో నిస్సాన్‌.. ఉద్యోగులు ఇంటికి! Sat 27 Jul 04:29:49.526993 2019 జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్‌ మోటార్స్‌ భారత్‌లోని ఉద్యోగుల మెడపై కత్తిపెట్టింది. ఏకంగా 1700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. నిస్సాన్‌ పీఎన్‌బీకి అనూహ్య లాభాలు! Sat 27 Jul 04:29:57.842073 2019 వివిధ కుంభకోణాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ పంజాబ్‌ నేషన్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి అనూహ్య ఆర్థిక ఫలితా సాగించుకున్నోడే.. సైడ్‌కు! Fri 26 Jul 01:46:41.802205 2019 ఆర్థికశాఖ కార్యదర్శి సుభాశ్‌ గర్గ్‌పై మోడీ సర్కారు బదిలీవేటు వేసింది. నిన్నటి వరకు మోడీ సర్కారులో కీలక బ్యూరోక్రాట్‌గా..ఆర్థిక శాఖలో ఎదురులేని అధికారిగా ఆయన చలామణి అయ్యార సెప్టెంబరులో శాంసంగ్‌ మడత ఫోన్‌ Fri 26 Jul 01:47:37.745966 2019 స్మార్ట్‌ఫోన్‌ ప్రేమికులను ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న మడత ఫోన్‌ (ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌) విడుదల విషయమై శాంసంగ్‌ బుధవారం కీలక ప్రకటన చేసింది. తుది పరీక్షల అనంతరం ఈ ఏ నోకియా నుంచి రెండు కొత్త ఫీచర్‌ఫోన్లు Fri 26 Jul 01:48:05.508114 2019 హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నోకియా బ్రాండ్‌ కింద రెండు అత్యాధునిక ఫీచర్‌ ఫోన్లను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. నోకియా- 220 4జీ, నోకియా 105 పేర్లతో ఈ ఫీచర్‌ ఫోన్లను సంస్థ మార జీఎస్టీ మండలి సమావేశం వాయిదా! Fri 26 Jul 01:49:32.38782 2019 వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మండలి సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం గురువారం సాయంత్రం ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సమయంలో వచ్చే ఏడాదే చెల్లింపు సేవలు: వాట్సప్‌ Fri 26 Jul 01:50:47.780334 2019 ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వచ్చే ఏడాదిలోనే దేశ వ్యాప్తంగా చెల్లింపు సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. గతంలోనే డిజిటల్‌ చెల్లింపు సేవలను అందుబాటులోకి తేనున్ హైదరాబాద్‌లో జీఏసీఎస్‌ సదస్సు Fri 26 Jul 01:50:55.884498 2019 వ్యాపార నిర్వహణలో ఏదైనా విపత్తులు, అవాంచిత పరిణామాలు ఎదురైనప్పుడు స్పందించాల్సిన విధా నాలపై గురువారం హైదరాబాద్‌లో నాలెడ్జ్‌ కాన్‌క్లేవ్‌ జరిగింది. ది గ్లోబల్‌ అసోసియేషన్‌ ప్రమాదంలో పది లక్షల కొలువులు! Thu 25 Jul 04:14:26.404116 2019 ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో వివిధ రంగాల్లో లక్షలాది కొలువులు కొండెక్కె పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధానంగా వాహన రంగంలో పరిస్థితి మరీ ద భారత్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌ చౌక 'ప్లాన్‌' Thu 25 Jul 04:14:43.057156 2019 దేశంలో ఇంటర్‌నెట్‌ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌ స్టార్‌ వంటి ఓటీటీ సర్వీసుల వాడకం పెరిగిపోతోంది. దీంతో ఈ రంగంలో తమ వ్యాపారాన్ని విస్తరించుకోవా ఇండిగో ఇంటి గొడవకు తెర! Thu 25 Jul 04:14:55.573739 2019 బడ్జెట్‌ ధరలకు విమానయానాన్ని అందిస్తోన్న ఇండిగోలో ఇంటిపోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇండిగో ప్రమోటార్ల వివాదానికి తెరపడినట్టు తెలుస్తోంది. ప్రధాన విభేదాలు పరిష్కరించుకన సింగరేణికి ఆదాయపన్ను అవార్డు Thu 25 Jul 04:15:08.679245 2019 తెలుగురాష్ట్రాల్లో అత్యధిక ఆదాయపన్ను చెల్లింపుదారుగా సింగరేణి రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంది. 159వ ఇన్‌కంట్యాక్స్‌ దినోత్సవ వేడుకలు బుధవారంనాడిక్కడ జరిగాయి. ఇన్‌కంట్యాక్ ఆర్థికశాఖ కార్యదర్శి సుభాశ్‌ బదిలీ Thu 25 Jul 04:15:16.37215 2019 రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు బుధవారం 12 కీలక శాఖల కార్యదర్శును, ఉన్నతాధికారులను బదిలీ చేసింది. ఇందులో ఆర్థిక శాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. ప్ భారత వృద్ధిరేటు పడిపోనుంది.. Wed 24 Jul 01:49:12.396038 2019 దేశీయంగా ఆర్థిక పరిస్థితులు మందగిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంక్‌తో సహా పలు అంతర్జాతీయ ర ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు! Wed 24 Jul 01:49:20.525785 2019 ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారికి శుభవార్త. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నుల సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొ ఆర్బీఐలో ముగిసిన విరాల్‌ శకం Wed 24 Jul 01:49:29.090137 2019 భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా విరాల్‌ ఆచార్య తన ప్రస్థానాన్ని ముగించారు. గత నెలలోనే రాజీనామా సమర్పించిన ఆయన మంగళవారం నుంచి తన విధుల నుంచి పూర్తిగా 12 నుంచి 'జియో గిగా ఫైబర్‌' సేవలు! Wed 24 Jul 01:49:37.661722 2019 టెలికాం రంగంలో సంచలనంగా దూసుకువచ్చిన రిలయన్స్‌ జియో.. వచ్చే నెల నుంచి దేశ వ్యాప్తంగా జియో గిగా ఫైబర్‌ పేరుతో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్టు హైదరాబాద్‌లో పేపాల్‌ టెక్‌ సెంటర్‌ Wed 24 Jul 01:49:45.947955 2019 అమెరికాకు చెందిన డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌ హైదరాబాద్‌లో తన టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించింది. డేటాను స్థానికీకరించాలన్న భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) నిబంధన హ్యుందాయ్ కార్లు మరింత ప్రియం Wed 24 Jul 01:49:53.909693 2019 ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐ) తాము ఉత్పత్తి చేసే వాహనాల ధరలను పెంచుతున్నట్టుగా ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి వాహనాల ధరను గరిష్టంగా రూ. దేశంలో నిశ్శబ్ద ఆర్థిక సంక్షోభం! Tue 23 Jul 01:24:07.110685 2019 భారత్‌ నిశ్శబ్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు రతిన్‌ రాయ్ అన్నారు. పన్ను ఆదాయాల్లో కొరత కారణంగా దేశంలో నిశ్శబ్ద ఆర్థిక సంక్షో మార్కెట్లోకి సరికొత్త బజాజ్‌ సీటీ 110 Tue 23 Jul 01:24:21.298794 2019 ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో మార్కెట్లోకి సరికొత్త బజాజ్‌ సీటీ-110 వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార విస్తరణే లక్ష్యంగా బజాజ్‌ పేదలకు ప్రపంచ స్థాయి వైద్య సలహాలు Tue 23 Jul 01:24:34.914232 2019 పేద రోగులకు ప్రపంచ స్థాయి వైద్య సలహాలను అందిం చేందుకు గాను అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు సంస్థ హెల్త్‌నెట్‌ గ్లోబల్‌ (హెచ్‌ఎన్‌జీ), అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి! Tue 23 Jul 01:24:54.763728 2019 బలహీనమైన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ భారీ నష్టాలను నమోదు చేశాయి. మందగమన పరిస్థితుల నేపథ్యంలో సోమవారం దేశీయ మార్ లాభం రాకున్నా అమ్మేస్తాం: కేంద్రం Tue 23 Jul 01:25:06.193833 2019 కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు లాభదాయకత అనేది ప్రమాణతే కాదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. సోమవారం ఆయన లోక్‌సభలో అడిగిన నిలిచిపోయిన ఎస్‌బీఐ 'నెట్‌' సేవలు Tue 23 Jul 01:25:21.938001 2019 దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం నుంచి బ్యాంక్‌ సర్వర్లు మొరాయిం 19 రోజులు @ 7700 కోట్లు Mon 22 Jul 04:07:29.118699 2019 విదేశీ పెట్టుబడులపై మోడీ సర్కారు ప్రకటించిన అంచనాలు.. మార్కెట్‌లో వాస్తవ పరిస్థితులకు మధ్య పొంతన లేకుండా పోతున్నది. మేకిన్‌ ఇండియా, కీలక రంగాల్లోనూ విదేశీ పెట్టుబడులకు మో ఐఎంఎఫ్‌ విధానాల వల్లే అసమానతలు! Mon 22 Jul 04:07:52.451287 2019 తాము చెప్పినట్టుగా ఆర్థిక విధానాలు అమలుజేసిన దేశాల్లో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరగటంపై అంతర్జాతీయ ద్య్రవనిధి సంస్థ ఆందోళన చెందుతోంది. తమ నుంచి అప్పులు తీసుకున్న దేశాల్లో ఎయిర్‌ ఇండియాలో నూతన నియామకాలు వద్దు Mon 22 Jul 04:08:11.350616 2019 ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌ ఇండియాలో అధిక వేతన ఉద్యోగుల పదోన్నతులు, నియామ కాలను నిలిపి వేయాలని కేంద్రం ఆదేశించింది. కొత్త విమానాలను కూడా అత్యవసరమైతేనే ప్రారంభించాలని సూచించ ఐడియా పేమెంట్‌ బ్యాంకు మూసివేత Mon 22 Jul 04:08:29.517137 2019 ఊహించని పరిణామాల వల్ల ఆదిత్యా బిర్లా ఐడియా పేమెంట్‌ బ్యాంకు సేవలు నిలిపివేస్తున్నట్టు వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ తెలిపింది. సంస్థ నిర్వహణ భారంగా మారటం వల్లనే ఈ నిర్ణయమని ప సెబీ నిధులకు మోడీ సర్కారు ఎసరు! Sun 21 Jul 03:02:44.829636 2019 కేంద్రంలోని మోడీ సర్కారు దేశంలోని వివిధ నియంత్రణ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తోందన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చుతూ.. కేంద్ర ప్రభుత్వం మరో జెట్‌ ఎయిర్‌వేస్‌కు కాస్త ఊరట! Sun 21 Jul 03:02:52.85078 2019 రుణ సంక్షోభంతో నేలకొరిగిన విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఊరట కలిగించేలా శనివారం పలు అంశాలు తెర మీదకు వచ్చాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు సాయం చేసేందుకు వేడుకగా బీవోబీ వ్యవస్థాపక దినోత్సవం Sun 21 Jul 03:03:01.735503 2019 బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు తెలంగాణ రీజియన్‌లో ఘనంగా జరిగాయి. శనివారం బ్యాంక్‌ 112వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ జీఎస్టీ దాడుల వార్తలు అవాస్తవం: మేఘా Sun 21 Jul 03:03:11.454747 2019 మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) సంస్థ కార్యాలయాలపై జీఎస్టీ పన్ను అధికారులు దాడులు జరిపినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఫలితాలు అదుర్స్‌! Sun 21 Jul 03:03:18.795602 2019 ప్రయివేటు రంగ బ్యాంకింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ శనివారం మార్కెట్‌ వర్గాలను మెప్పించే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో సంస్థ ఏకీకృత నికర లా మార్కెట్లకు బ్లాక్‌ 'ఫ్రై'డే! Sat 20 Jul 02:43:20.1277 2019 దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతాన్ని భారీ నష్టాల్లో ముగించాయి. ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విదేశీ సంస్థాగత మదుపరులకు(ఎఫ్‌పీఐ) పన్నుల దేశీయ మార్కెట్లోకి చైనా మోటార్‌ సైకిల్స్‌ Sat 20 Jul 02:43:29.409792 2019 చైనాకు చెందిన ప్రముఖ మోటార్‌ సైకిల్స్‌ తయారీ సంస్థ సీఎఫ్‌ మోటో భారత్‌లో అడుగు పెట్టింది. సంస్థ తయారు చేసిన సీఎఫ్‌ మోటో 300ఎన్‌కే, 650ఎన్‌కే, 650ఎంటీ, 650 జీటీ దేశంలో రెండో అతిపెద్ద టెలికాం జియో Sat 20 Jul 02:43:38.046946 2019 టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకున్న సంస్థ.. కొత్తఫోన్లకు కేరాఫ్‌ అడ్రెస్‌గా బిగ్‌'సి' Sat 20 Jul 02:43:44.936922 2019 ప్రముఖ మొబైల్‌ కంపెనీ షియోమి తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్లను బిగ్‌'సి' వేదికగా తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేసింది. షియోమి సరికొత్తగా మార్కెట్లోకి ఆవిష్కరించిన రెడ్ ఏడు నెలల్లో..మూడు మాల్స్‌: మాంగళ్య Sat 20 Jul 02:43:53.583467 2019 తెలంగాణలో అతిపెద్ద టెక్స్‌టైల్‌ రిటైల్‌ వ్యాపార సంస్థ మాంగళ్య రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే సోమవారం (22న) పీఎన్‌ఎస్‌బీలో భారీ కుంభకోణం! Fri 19 Jul 00:27:16.322034 2019 పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ (పీఎన్‌ఎస్‌బీ) కుంభకోణం గురువారం ఆర్థికంలో ప్రకంపనలు సృష్టించింది. దివాలా తీసిన భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌కు (బీపీఎస్‌ఎల్‌) సంబంధించి భారత వృద్ధి 7 శాతానికే పరిమితం: ఏడీబీ Fri 19 Jul 00:26:46.801578 2019 ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తోన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత అత్యుత్తమ కెమెరాతో శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ Fri 19 Jul 00:26:40.403762 2019 ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్‌ గురువారం ఏ-సిరీస్‌లో ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ-ఏ80 పేరుతో దీనిని సంస్థ మార్కెట్లోకి తె హైదరాబాద్‌లో డుమోంట్‌ తయారీ కేంద్రం Fri 19 Jul 00:26:31.800574 2019 ప్రముఖ పాల ఉత్పత్తుల తయారీ సంస్థ డుమోంట్‌ హైదరాబాద్‌లో ఐస్‌క్రీమ్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. గత రెండు దశాబ్దాలుగా ఐస్‌క్రీమ్‌లు, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌! Fri 19 Jul 00:26:23.528255 2019 ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్‌ సీఈవో జెఫ్‌బెజోస్‌ మరోమారు తన సత్తా చాటారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానంలో నిలిచారు. రూ.250 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం Thu 18 Jul 02:29:16.054564 2019 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250-280 కోట్ల అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్‌ఎస్‌ఐఎల్‌ పైప్స్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ పజ్నూ అన్నారు. బుధవారం
1entertainment
రాధికా ఆప్తే.. అంత హాట్ గానా, ఏమిటీ తెగింపు? ఆమెది బరితెగింపు అని సంప్రదాయ వాదులు విరుచుకుపడుతున్నారు. TNN | Updated: Mar 18, 2017, 11:26AM IST ​ఇది వరకూ ఒక షార్ట్ మూవీలో టాప్ లెస్ తో కనిపించి దేశ వ్యాప్తంగా చర్చలో నిలిచిన నటి రాధికా ఆప్తే తన తాజా ఫొటో షూట్ తో మరోసారి వార్తల్లోకి వచ్చింది. పరిధులు దాటి ఫొటోలకు పోజులు ఇచ్చింది రాధిక . పూర్తిగా నగ్నంగా కనిపించేసిన తనకు కొత్తగా అర్ధనగ్నంగా కనిపించడానికి మొహమాటం ఎందుకన్నట్టుగా ఫొటోలో దిగింది రాధిక. ఆమె బోల్డ్ యాక్ట్ పట్ల కొందరు ఆశ్చర్యక్తులవుతున్నారు. ఇదే సమయంలో రాధికపై విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఆమెది బరితెగింపు అని సంప్రదాయ వాదులు విరుచుకుపడుతున్నారు. షార్ట్ ఫిల్మ్ లో టాప్ లెస్ తో నటించిన రాధిక.. మళ్లీ ఇలా అవతారం ఎత్తడమేంటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పుడంటే.. సినిమా కోసం టాప్ లెస్ తో శఈంగార సన్నివేశాల్లో నటించానని చెప్పిన ఆమె ఇప్పుడు ఇలా కనిపించడం ఏమిటి అంటున్నారు.
0business
Visit Site Recommended byColombia ‘నాలుగేళ్ల వయసులో నేను వేధింపులు ఎదుర్కొన్నా. ఆ విషయం తెలుసుకోవడానికి నాకు 17 ఏళ్లు పట్టింది. రోజూ ఈ విషయాన్ని తలుచుకుంటూనే ఉంటా. దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ఆ సంఘటన నిత్యం నన్ను బాధిస్తోంది’ అని పార్వతి తెలిపింది. మీటూ ఉద్యమం ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో తనకు ఈ విషయాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందని పార్వతి చెప్పింది. కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో పార్వతి సుమారు 20 సినిమాల్లో నటించారు. 2017లో ‘కరీబ్‌ కరీబ్‌ సింగిల్‌’ సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌)లోనూ పార్వతి సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. మీటూ ఉద్యమం పెను మార్పులు తీసుకొస్తోందని, మహిళలు తమపై జరిగిన ఘటనల గురించి బయటపెడుతుంటే నిందితులు చిక్కుల్లో పడుతున్నారని.. కొంత మందికి పని కూడా దొరకడంలేదని పార్వతి చెప్పుకొచ్చింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ఖజానాకు ముందుస్తు ప(ద)న్ను! - తొలి త్రైమాసికం వసూళ్లలో 14.8% వృద్ధి న్యూఢిల్లీ: ముందస్తు పన్ను చెల్లింపుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 14.8 శాతం మేర పెరిగాయి. ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో దాదాపు రూ.1.42 లక్షల కోట్ల సొమ్ము ఖజానాకువచ్చి చేరినట్టుగా సర్కారు వెల్లడించింది. ఇదే కాలంలో రెవెన్యూ శాఖ దాదాపు రూ.55,520 కోట్ల మేర పన్ను తిరిగి చెల్లింపులను జరిపినట్టుగా తెలిపింది. గత ఏడాది ఇదే కాలపు లావాదేవీలతో పోలిస్తే పన్ను తిరిగి చెల్లింపులు 5.2 శాతం తక్కువేనని వివరణనిచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్ధేశించుకున్న దాదాపు రూ.9.8 లక్షల కోట్ల లక్ష్యంలో మొదటి త్రైమాసికంలో వసూళ్లయిన మొత్తం 14.5 శాతానికి సమానమని సర్కారు తెలిపింది. ఇదే కాలంలో కార్పొరేట్‌ పన్ను వసూళ్లు 4.8%, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌తో సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లులో 12.9% వృద్ధి నమోదు అయినట్టుగా ప్రభుత్వం వివరణనిచ్చింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Ranji Trophy: Mayank Agarwal scores maiden triple ton against Maharashtra ట్రిఫుల్ సెంచరీ బాదిన మయాంక్ రంజీ ట్రోఫీలో కర్ణాటక బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ ట్రిఫుల్ సెంచరీ నమోదు చేశాడు. మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ TNN | Updated: Nov 3, 2017, 05:58PM IST రంజీ ట్రోఫీలో కర్ణాటక బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ ట్రిఫుల్ సెంచరీ నమోదు చేశాడు. మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ (304 నాటౌట్: 494 బంతుల్లో 28x4, 4x6) కెరీర్‌లో తొలిసారి ట్రిఫుల్ సెంచరీ బాదడంతో కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 628/5 వద్ద డిక్లేర్ చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌‌లో 245 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 383 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కర్ణాటక జట్టుకి లభించింది. శుక్రవారం మ్యాచ్ ముగిసే సమయానికి మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌ 135/4తో ఉంది. తాజా రంజీ సీజన్‌లో ఇప్పటికే రెండు ట్రిఫుల్ సెంచరీలు నమోదవగా.. ఈ ఘనత అందుకున్న మూడో బ్యాట్స్‌మెన్‌గా మయాంక్ అగర్వాల్ నిలిచాడు. మొత్తంగా దేశవాళీ క్రికెట్‌లో ట్రిఫుల్ సెంచరీ బాదిన 43వ బ్యాట్స్‌మెన్.. కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ తర్వాత మయాంక్ అగర్వాల్ 300+ మార్క్‌ని అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు.
2sports
– అమెరికా ఉపాధి గణాంకాల మద్దతు – అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు కీలకం ముంబై : బెంచ్‌మార్క్‌ స్టాక్‌ సూచీలు రెండుశాతం పెరిగాయి. నిఫ్టీ 50సూచి గత ఏడాది ఆగస్టునాటి గరిష్టస్థాయి ని నమోదుచేసింది. అంతర్జాతీయ ధోరణులు గట్టిమద్దతు నిచ్చాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ ఒక్కటే 500 పాయింట్లకుపైబడిం ది. నిఫ్టీలోనూ అదేధోరణులు కనిపించాయి. అమెరికా ఉపాధి గణాంకాలు కూడా కొంతమేర మార్కెట్ల రికవరీకి దోహదం చేసాయి. ఉపాధిగణాంకాలు అమెరికా ఆర్ధికవ్యవస్థను గాడిలో నికి తచ్చినట్లు స్పష్టంచేయడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉపక్ర మించారు. ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 500 పాయింట్లు పెరిగి 27,627 పాయింట్లవద్ద స్థిరపడింది.తొమ్మిదినెలల్లో ఇదే గరిష్టంగా కనిపించింది. నిఫ్టీ 50 సూచి కూడా 145 పాయిం ట్లు గరిష్టంగా లాభపడింది. 8468 పాయింట్ల వద్ద స్థిరపడిం ది. ఇంట్రాడేలో 8475పాయింట్లకు చేరింది. 2015 ఆగస్టు 20వ తేదీనాటి స్థాయి పునరావృతం అయింది. బిఎస్‌ఇ మిడ్‌ క్యాప్‌ సూచి 12,079 పాయింట్లువద్ద ముగిస్తే ఎన్‌ఎస్‌ఇ మిడ్‌ క్యాప్‌ 100సూచి 14,299 పాయింట్లకు పెరిగింది. పారిశ్రా మిక ఉత్పత్తిసూచి, ద్రవ్యోల్బణ గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బ్లూచిప్‌ కంపెనీలైన టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీల ధోరణులు, రుతుపవనాల ప్రభావంవంటివి నేటి స్టాక్‌ మార్కెట్‌ కు కీలకంగా మారాయి. ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లు సోమవారం ర్యాలీతీసాయి. అమెరికా ఉపాధి గణాంకాలే ఇందు కు కీలకం.అయితే బ్రెగ్జిట్‌నిర్ణయంతో సావరిన్‌ బాండ్ల దిగుబడు లు కనిష్టంగా దిగజారాయి. జపాన్‌ బయట ప్రాంతంలో ఆసి యా పసిఫిక్‌షేర్లు 1.9శాతంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా కంపెనీ 1.8శాతం షాంఘై 1శాతం, జపాన్‌ నిక్కీ 3.5శాతంపెరిగాయి. యూరోప్‌, ఫ్రాన్స్‌ సిఎసి, జర్మనీ డాక్స్‌, లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ లు కూడా 0.6 నుంచి 1.3శాతం పెరిగాయి. ఇక దేశీయ మార్కెట్ల పరంగాచూస్తే డాలరుతో రూపాయి మారకం విలువలు 20పైసలు పెరిగి 67.16 రూపాయలుగా మారింది. యాక్సిస్‌బ్యాంకు మినహాయించి సెన్సెక్స్‌లోని 30స్టాక్‌ సూచీ సానుకూలంగా ముగిసింది. మూడు ప్రైవేటురంగ బ్యాంకులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, ఎస్‌బ్యాంకు తమతమ జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు మొదటిత్రైమాసిక ఫలి తాల ప్రకటన తర్వాత తగ్గింది. నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు 52 వారాల గరిష్టస్థాయి కిచేరాయి. బజాజ్‌ ఫైనా న్స్‌, ఎల్‌ఐసి హౌసింగ్‌ ఫైనాన్స్‌,జిఐసి హైసింగ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సెర్వ్‌, మహీంద్ర అండ్‌ మహీంద్ర ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ వంటి కంపెనీ లు రికార్డుస్థాయికి పెరిగా యి. భారత్‌ ఫైనాన్షియ ల్‌ ఇంక్లూజన్‌ గృహ ఫైనాన్స్‌,శ్రీరామ్‌ ట్రాన్స్‌ పోర్టు ఫైనాన్స్‌సంస్థలు అత్యంత గరిష్టస్థాయికి చేరాయి.బజాజ్‌ ఫైనాన్స్‌ ఐదుశాతం పెరిగింది. టాటా మోటార్స్‌ 4శాతం పెరిగింది. కంపెనీ 21శాతం తన ప్రపంచ విక్రయాల్లో వృద్ధిని నమోదుచేసింది. దేశీయంగా ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 2.68శాతం పెరిగాయి. సియామ్‌ లెక్కల ప్రకారం 2,17,620 నుంచి 2,23,454 యూనిట్లకు పెరిగాయి. కార్ల విక్రయాలుచూస్తే 5.18శాతం క్షీణించాయి. 1,62,655 నుంచి 1.54,237యూనిట్లకు తగ్గాయి. మారుతి సుజుకి మాత్రం మూడుశాతం లాభపడింది. ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్‌ క్యాపిటల్‌ మార్కెట్లకు ఐపిఒ జారీచేసింది. 1243 కోట్ల నిధులను సమీకరించేందుకు ఐపిఒ జారీచేస్తే రెండుశాతం షేర్లు పెరిగాయి. జర్మనీ సంస్థ థైస్సెన్‌క్రుప్‌ టాటాస్టీల్‌తో విలీనం చర్చలు ప్రారంభించింది. యూరోప్‌లో తమ వాణిజ్య కార్యకలాపాలను సంఘటితంచేసే లక్ష్యంతోకంపెనీ టాటాతో చర్చలు జరుపుతోంది. టాటాస్టీల్‌ 3శాతం పెరిగాయి. ప్రైవేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు గ్రామీణ, పట్టణ ప్రాంత మార్కెట్లవైపు దృష్టిపెట్టింది. కంపెనీ స్టాక్‌ రెండుశాతం లాభ పడింది. డిష్‌మాన్‌ ఫార్మా, కెమికల్స్‌ మూడుశాతం లాభ పడింది. అమెరికా ఎఫ్‌డిఎ కంపెనీకి చెందిన బావ్లా ప్లాట్‌ తనిఖీని పూర్తిచేసిందని వెల్లడించింది. కేడిల్లా హెల్త్‌కేర్‌ 3.5శాతం పెరిగింది. కంపెనీ అమెరికా ఎఫ్‌డిఎ నుంచి మౌఖిక యాంటి డయాబెటిక్‌ ఔషధానికి అనుమతులు సాధించింది.
1entertainment
రైల్వేస్టేషన్ లో జబర్థస్త్ టీం గొడవ (వీడియో) Highlights రైల్వేస్టేషన్ లో జబర్థస్త్ టీం గొడవ (వీడియో)    ఈ రోజు జబర్థస్త్ టీం షేకింగ్  షేషు టీం హైదరాబాద్ నుండి వైజాగ్ కి జనరెల్ టికెట్ తీసుకుని ఏసీ కోచ్ లో కూర్చొని ప్రయాణం చేశారు. వాళ్లను టీటీ పట్టుకున్నారు. ఫైన్ కట్టిన గొడవపడుతు ఇలా కెమెరాకు చిక్కారు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రాంచీ టీ20లో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా శనివారం జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ TNN | Updated: Oct 7, 2017, 06:41PM IST ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా శనివారం జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భుజానికి గాయం కారణంగా టీ20 సిరీస్‌కి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ దూరమవడంతో.. ప్రస్తుతం ఆ జట్టుకి ఓపెనర్ డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ 4-1తేడాతో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, చాహల్
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Suresh 64 Views LEXUS LEXUS బెంగళూరు: భారత్‌లో విలాసవంతమైన వాహనాలతయారీసంస్థ లెక్సస్‌ దేశంలో తనప్రతిష్టాత్మక నాలుగోషోరూంను బెంగళూరులో ప్రారంభించింది. లెక్స్‌స్‌ గెస్ట్‌ ఎక్పీరియన్స్‌సెంటర్లుగా పేర్కొంటున్న కంపెనీ ఇప్పటికే న్యూఢిల్లీ, గురుగ్రామ్‌, ముంబైలలో ఈ షోరూంలు ఏర్పాటుచేసింది. శరవేగంతో అభివృద్ధిచెందుతున్నమార్కెట్లకు కొత్త అద్భుత అనుభూతులు కల్పించేందుకు కొత్తగా ఈ ప్రతిష్టాత్మక అధీకృత షోరూంలు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరు జిఇసి అనేది కన్నడిగ జపనీయుల సంస్కృతుల సమ్మేళనంగా ఉంటుందన్నారు. భారత్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అకితోషి తకేమురా మాట్లాడుతూ తమ వాహనాలద్వారా బ్రాండ్‌ పట్ల ఆసక్తిపెంపొందేవిధంగా లెక్సస్‌ గెస్ట్‌ఎకీక్పరియెన్స్‌ సెంటర్లలో లెక్స్‌స్‌ఖు మాత్రమే పరిమితమైన అతిధి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సిగ్నేచర్‌ ఎల్‌ ఆకారపు ఆకృతులు, పాలెట్స్‌ ఎక్స్‌టీరియల్‌ ఎలివేషన్లు డిజైన్లు అద్భుతంగా ఉంటాయని తకెమురా అన్నారు.
1entertainment
Hyderabad, First Published 9, Apr 2019, 6:05 PM IST Highlights సినిమా హిట్ టాక్ తెచ్చుకోగానే వెంటనే ఆ డైరక్టర్ పై కర్చీఫ్ లు వేసేయటానికి పోటీలు పడతారు. అందుకు స్టార్ హీరోలు సైతం మినహాయింపు కాదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సైతం అదే చేసారు.  హీరోలెప్పుడూ హిట్ డైరక్టర్స్ కోసం వెతుకుతూంటారు. ప్రతీ శుక్రవారం రిలీజయ్యే సినిమాలపై వారి కన్ను ఉంటుంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకోగానే వెంటనే ఆ డైరక్టర్ పై కర్చీఫ్ లు వేసేయటానికి పోటీలు పడతారు. అందుకు స్టార్ హీరోలు సైతం మినహాయింపు కాదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సైతం అదే చేసారు. ఆయన శివ నిర్వాణని పిలిచి సినిమా ఇచ్చినట్లు సమాచారం. నాగచైతన్య హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మజిలీ’. ఈ చిత్రంలో సమంత, దివ్యాంక కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించారు. పూర్ణ పాత్రలో నాగచైతన్య, శ్రావణి పాత్రలో సమంత నటించారు. క్రికెటర్‌ కావాలనుకున్న పూర్ణ లైఫ్‌లో ఫెయిల్‌ అవుతాడు. అతనికి 30 ఏళ్లు దాటినా గతంలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడడు. అలాంటి పూర్ణను గతంలోంచి లాగటానికి అతని భార్య శ్రావణి ఏం చేసిందనే పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది.  సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. దాంతో విజయ్ దేవరకొండ ఈ దర్శకుడు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.  హార్ట్‌ టచింగ్ ఎమోషనల్‌ డ్రామాలతో అలరించిన శివా.. విజయ్‌ కోసం మంచి  కథను రెడీ చేయమని చెప్పేసాడట. తను కష్టపడకుండా తన గుమ్మంలోకి వచ్చిన ఈ ఆఫర్ తో శివ నిర్వాణ మురిసిపోతున్నారట. ప్రస్తుతం  డియర్ కామ్రేడ్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నవిజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు తమిళ డైరెక్టర్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఇటీవల ప్రారంభమైంది.   Last Updated 9, Apr 2019, 6:05 PM IST
0business
అంతర్జాతీయ సంకేతాలపై మార్కెట్ల దృష్టి..! - దేశీయ అంశాలూ ముఖ్యమే - వినాయక చవితి సందర్భంగా శుక్రవారం సెలవు - స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ నాలుగు రోజులే నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ఈ వారం అంతర్జాతీయ అంశాలు కీలకంగా నిలువనున్నాయి. అలాగే దేశీయంగా ఇన్ఫోసిస్‌ పరిణామాలతో పాటు చివరిదశకు చేరిన కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, వర్షాపాత నమోదుపై మదుపర్లు దృష్టిసారించనున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలరుతో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు వంటి తదితర అంశాలు కూడా స్టాక్‌ మార్కెట్లను నిర్ధేశిస్తాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. గతవారం విదేశీ అంశాలకు తోడు శుక్రవారం (18న) ఇన్ఫోసిస్‌ చైర్మెన్‌ పదవి నుంచి విశాల్‌ సిక్కా హఠాత్తుగా వైదొలగడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 271 పాయింట్లు నష్టపోయి 31,524 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 67 పాయింట్లు క్షీణించి 9,837 వద్ద స్థిరపడింది. వినాయక చవితి సందర్భంగా ఈ నెల శుక్రవారం (25న) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ఈ వారం నాలుగురోజులకే పరిమితం కానున్నది. ఇన్ఫీ అంశాలకు ప్రాధాన్యం.. ప్రముఖ సాప్ట్‌వేర్‌ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ రూ.13,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌కు బోర్డు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా షేరు ఒక్కింటికి రూ.1,150 చొప్పున ధర చెల్లించి తిరిగి కొనుగోలు చేపట్టనున్నట్టుగా ప్రకటించింది. విశాల్‌ సిక్కా రాజీనామా నేపథ్యంలో ఇన్ఫీ షేరు ధర శుక్రవారం 932 వద్ద ముగిసింది. ముగింపు ధరతో పోలిస్తే ప్రస్తుతం సంస్థ ప్రకటించిన బైబ్యాక్‌ ధరను పోలిస్తే దాదాపు 25శాతం ప్రీమియంతో షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా అమెరికా స్టాక్‌ మార్కెట్లలోనూ ఇన్ఫోసిస్‌ లిస్ట్‌యింది. దీంతో ఈ టెక్‌ దిగ్గజానికి మరో భారీ షాక్‌ తగిలినట్టు అయ్యింది. విశాల్‌ సిక్కా సీఈవో, ఎండీ పదవులకు అనూహ్యంగా రాజీనామా చేసిన నేపథ్యంలో అమెరికాలోని అక్కడి న్యాయ సంస్థలు న్యాయవిచారణకు దిగాయి. ప్రధానంగా ఫెడరల్‌ చట్టాలన ఈ దేశీయ సాప్ట్‌వేర్‌ సంస్థ అధికారులు, డైరెక్టర్లు ఉల్లఘించిన ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్ల తరుపున బ్రోన్‌స్టెయిన్‌, జివెర్ట్‌ అండ్‌ గ్రాస్మాన్‌, రోసెస్‌ న్యాయ సంస్థ, పోమెరాంట్జ్‌ న్యాయ సంస్థ గోల్డ్‌ బర్గ్‌ పీసీలు ఈ విచారణ చేపట్టాయి. దీనికితోడు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కూడా ఇన్ఫోసిస్‌ విషయమై అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్‌లో ఈ అంశాలకు ప్రాధాన్యం సంతరించుకోనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే బైబ్యాక్‌ ఆఫర్‌ కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. చివరి దశ ఫలితాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం క్యాస్ట్రోల్‌ ఇండియా, జిల్లెట్‌ ఇండియాతో పాటు పలు ఇతర సంస్థలు ఏప్రిల్‌-జూన్‌ ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్నాయి. దీంతో పాటు రుతుపవనాల విస్తరణ మార్కెట్‌ సెంటిమెంటుకు కీలకంగా నిలువనుంది. అలాగే బ్యాంకింగ్‌ రంగంలో నానాటికి పెరిగిపోతున్న మొండిబాకీల అంశంపై... ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం అందించాల్సిన అవసరముందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఉర్జిత్‌ పటేల్‌ అభ్రిపాయం వ్యక్తం చేసిన తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే వారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు స్టాక్‌ మార్కెట్లకు దిశనిర్దేశం చేయనున్నట్టు నిపుణులు పేర్కొన్నారు. విదేశీ అంశాలు కీలకమే.. అమెరికా- ఉత్తర కొరియా మధ్య తలెత్తిన యుద్ధ వాతావరణ తొలగినప్పటికీ, అమెరికాలోని టాప్‌ సీఈవోల రాజీనామాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు వ్యూహాత్మక వ్యాపార సలహా కౌనిల్స్‌ళ్లను రద్దు చేయడం, స్పెయిన్‌లో ఉగ్రదాడులు, ఫెడ్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్ల పెంపుపై వెనక్కి తగ్గడం, అలాగే ఆగస్టు నెలకు చెందిన నిక్కి ప్లాష్‌ జపాన్‌ తయారీ పీఎంఐ గణంకాలను మార్కిట్‌ ఎకనామిక్స్‌ ఈ వారం ప్రకటించనుంది. జులైలో ఇది 52.1శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మార్కెట్లకు ఈ అంశాలు కీలకంగా మారనున్నట్టు మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
మార్కెట్లకు సంస్కరణల జోష్‌- జీవితకాల గరిష్టస్థాయికి సెన్సెక్స్‌ ముంబయి, మే 28: దేశీయ మార్కెట్లకు గతవారం సంస్కరణల జోష్‌ కనిపిం చింది. సంస్కరనల దూకుడుతో కేంద్రం మూడేళ్ల సుస్థిరపాలన పూర్తిచేసుకున్న బిజెపి ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్ని అందించింది. ఎప్‌పిఐలు, దేశీయ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ప్రాధాన్యతనివ్వడంతో మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేసాయి. వారాంతంలో స్టాక్‌మార్కెట్ల చరిత్రలో తొలిసారి సెన్సెక్స్‌ 31వేల పాయింట్లకు ఎగువన ముగియగా నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 9600 పాయింట్లను అధిగమించిం ది. 9605వద్ద రికార్డుస్థాయి గరిష్టాన్ని తాకిం ది. గడచిన వారం మొత్తంగా సెన్సెక్స్‌ 563 పాయింట్లు 1.9శాతం పెరిగి 31,028 పాయిం ట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 167 పాయిం ట్లు పెరిగి 9595 వద్ద స్థిరపడింది. వారం మొదట్లో చిన్నషేర్లలో భారీవిక్రయాలు వెలుగు చూసాయి. వారం మొత్తంగా బిఎస్‌ఇ మిడ్‌ క్యాప్‌, సూచి 0.85శాతం క్షీణిస్తే స్మాల్‌క్యాప్‌ సూచి 0.9శాతం పతనంఅయింది. వారం మొత్తంగాచూస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌సూచీలు 2శాతం, 1.6శాతం చొప్పున లబ్ధిపొందాయి. సెన్సెక్స్‌ కీలక కంపెనీల్లో టాటామోటార్స్‌ 8.5శాతం, ఐటిసి 8శాతంచొప్పున దూసుకువచ్చాయి. హెల్త్‌ కేర్‌ దిగ్గజాలు లూపిన్‌ 15శాతం, సన్‌ఫార్మా, సిప్లా 13శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 9శాతం చొప్పున దిగజారాయి. మి గిలిన బ్లూచిప్‌ కంపెనీల్లో ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌ఇ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, మారుతి, ఎల్‌అండ్‌టి, 4-5శాతం మధ్య పెరిగాయి. భారతీయ స్టేట్‌బ్యాంకు, బజాజ్‌ఆటో, కోల్‌ఇండియా 3నుంచి 6.,4శాతంమధ్య పతనం చవిచూసాయి. వారంమొత్తంగా ముడిచమురుధరలు సైతం పతనం కావడంతో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు ప్రతి కూలంగానే ప్రారంభం అయ్యాయి. రోజుకు 1.8 మిలియన్‌ బ్యారళ్ల మేర సరఫరాలో కోతను అమలు చేస్తున్న చమురు దేశాలు మరో తొమ్మిదినెలల పాటు కొనసాగించేందుకు నిర్ణయించాయి. అయినా చమురు ధరలు రెండురోజుల్లో ఆరుశాతం పతనం అయ్యా యి. మరో పక్క జి7దేశాధినేతలు ఇటలీలో సమా వేశం అయి వాణిజ్యం, పర్యావరణ అంశాలపై జరిపి న చర్చల నేపథ్యంలో యూరోప్‌ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్‌ మార్కెట్లు 0.22శాతం, ఇటలీ మార్కెట్‌ 0.4 శాతం చొప్పున క్షీణించాయి. యుకె ఎఫ్‌టిఎస్‌ఇ నామమాత్ర లాభంతో ట్రేడింగ్‌ నిర్వహించింది. ఇక మార్కెట్లలో రిలయన్స్‌ 2.7శాతం, టాటాస్టీల్‌ 5.9శాతంచొప్పున పెరిగాయి. మారుతిసుజుకి 1.3శాతం పెరి గింది. నష్టాలపరంగాచూస్తే వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ పదిశాతం దిగజారింది.
1entertainment
Jan 29,2017 ఎల్‌అండ్‌టీ లాభాల్లో 39% వృద్ధి న్యూఢిల్లీ: ప్రముఖ నిర్మాణ, ఇంజినీరింగ్‌ దిగ్గజ సంస్థ ఎల్‌అండ్‌టీ డిసెంబరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్‌- డిసెంబర్‌తో త్రైమాసిక కాలంలో సంస్థ నికర లాభం 38.85 శాతం మేర పెరిగి రూ.972 కోట్లకు చేరువైంది. గత ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో సంస్థ లాభం రూ.700.34 కోట్లుగా నమోందైంది. డిసెంబు త్రైమాసికానికి సంస్థ మొత్తం ఆదాయం రూ.25,928 నుంచి రూ.26,286.98 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వ్యయం సంస్థ వ్యయం కూడా 24,170 కోట్ల నుంచి రూ.24,486.57 కోట్లకు పెరగడం విశేషం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
"జవాన్" కు హిట్ టాక్.. మరి కలెక్షన్స్ ఎలా వున్నాయి Highlights సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన జవాన్ జవాన్ మూవీకి పాజిటివ్ టాక్ రూ.18కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్, కలెక్షన్స్ లాంగ్ రన్ ఎలా వుంటుందో.. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్-మెహరీన్ కౌర్ జంటగా నటించిన ‘జవాన్’ మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. ‘తిక్క, విన్నర్ మూవీలు కలిసిరాకపోవడంతో.. తాజాగా రిలీజైన ‘జవాన్’ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు సాయి ధరమ్ తేజ్. బీవీఎస్ రవి దర్శకుడిగా తెరకెక్కిన జవాన్ మూవీలో రొటీన్ కథే అయినా.. డైలాగ్స్‌, సెంటిమెంట్ సీన్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరగడం ‘జవాన్’‌కు బాగా కలిసొచ్చింది. శుక్రవారం విడుదలైన అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ‘జవాన్’ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సుమారు రూ. 22 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ.. ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్స్ సాధించగా.. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లో తొలిరోజు రూ.5.5 కోట్లు గ్రాస్ వచ్చినట్లు అంచనా వేస్తున్నారు సినీ పండితులు.   ఇక శని, ఆదివారాలు కలిసి రావడంతో పాటు లాంగ్ రన్‌లో ‘జవాన్’ మూవీ కలెక్షన్స్ పై పాజిటివ్ అంచనాలే వున్నాయి. జవాన్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ 18 కోట్ల మార్క్ చేరింది. ఈ సినిమా 18 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ సినిమాగా, 21.6 కోట్లు వసూళ్లు సాధిస్తే సూపర్ హిట్ సినిమాగా, 27 కోట్లు వసూళ్లు సాధిస్తే.. బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది. బలమైన కథ,కథనంతో పాజిటివ్ టాక్ రావటం, మెహరీన్ గ్లామర్ కూడా సినిమాకు తోడవటం వసూళ్లపై పాజిటివ్ అంచనాలున్నాయి. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలం అసోచామ్‌ అధ్యక్షుడు సునీల్‌ కనోరియా హైదరాబాద్‌ : తెలంగాణలో పెట్టుబడులకు ఎంతో అనువైన వాతావరణం ఉందని, ఉమ్మడిఆంద్రప్రదేశ్‌గా ఉన్నకాలంలోనే కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినతర్వాత ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అసోచామ్‌ అధ్యక్షుడు సునీల్‌ కనోరియా వెల్లడించారు. సోమవారం తెలంగాణ ఐటి పంచాయితీరాజ్‌ శాఖ లమంత్రి కెటిరామారావును మర్యాదపూర్వకంగా కలిసి ఐటిరంగం తీరుతెన్నులు, వృద్ధి అవకాశాలు, ఉత్పత్తి, పారిశ్రామికరంగం తీరుతెన్నులపై సమగ్ర చర్చలు జరిపారు. మెట్రోరైలుతో రవాణా వసతులు మరింతమెరుగుపడతాయని, పివిఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఔటర్‌రింగురోడ్డు వంటి రవాణా కారిడార్లతో మంచి వృద్ధికి అవకాశం ఉందని కనోరియా వెల్లడించారు. పారిశ్రామికీకరణ పరంగా ప్రస్తుతం తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రాలో పోటీపడుతున్నాయని ఇన్వెస్టర్లకు ఇదొక మంచి తరుణమని పేర్కొన్నారు. పారిశ్రామిక లైసెన్సులు కేవలం 15రోజుల్లోనే తెలంగాణప్రభుత్వం జారీచేస్తోందని, ఐపాస్‌ వంటి అత్యాధునిక విధానాలతోపాటు ఎటువంటి అడ్డంకులులేని వ్యవస్థను ఏర్పాటుచేసినందున తెలంగాణలో ఉత్పత్తిరంగానికి మరిన్ని పెట్టుబడులు అందుతాయని, మరిన్ని పరిశ్రమలు రావచ్చని పేర్కొన్నారు. అలాగే బిజినెస్‌ సానుకూల వాతావరణం తెలంగాణలో పూర్తిస్థాయిలో ఉందని అందువల్లనే ఇటీవలి కాలంలో మరింతగా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఐసీఏఐ హైద‌రాబాద్ చాప్ట‌ర్ నూత‌న కార్య‌వ‌ర్గం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) హైదరాబాద్‌ చాప్టర్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. 2018-19 సంవత్సరానికి గాను ఐసీఏఐ చైర్మన్‌గా డాక్టర్‌ చంద్రశేఖర్‌ రాజనాల మ‌ళ్లీ తిరిగి ఎన్నిక‌య్యారు Samayam Telugu | Updated: Jun 1, 2018, 11:06AM IST ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) హైదరాబాద్‌ చాప్టర్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. 2018-19 సంవత్సరానికి గాను ఐసీఏఐ చైర్మన్‌గా డాక్టర్‌ చంద్రశేఖర్‌ రాజనాల మ‌ళ్లీ తిరిగి ఎన్నిక‌య్యారు. గురువారం రోజున ఐసీఏఐ-హైద‌రాబాద్ చాప్ట‌ర్‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇత‌ర ముఖ్య స్థానాల‌కు సైతం కొత్త‌వారి నియామ‌కం జ‌రిగింది. ఐసీఏఐ-హైద‌రాబాద్ చాప్ట‌ర్ వైస్ ఛైర్మ‌న్ స్థానానికి దార‌ప‌నేని మునిశేఖ‌ర్‌ను ఎంపిక చేశారు. ఐసీఏఐ హైద‌రాబాద్ కొత్త కార్య‌వ‌ర్గం సెక్ర‌ట‌రీగా క‌ళ్యాణి పెమ్మ‌రాజు, ట్రెజ‌ర‌ర్‌గా చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి పొనుగంటి త‌దిత‌రుల‌ను ఎన్నుకున్నారు. ఇత‌ర మేనేజింగ్ క‌మిటీ స‌భ్యులుగా కేవీఎన్ లావ‌ణ్య‌, ఎం. వెంక‌టేశ్వ‌ర్లు, వి.సుధారాణిల‌ను నియ‌మించ‌డం జ‌రిగింది.
1entertainment
Suresh 199 Views   కరాచీ: టి 20 ప్రపంచ కంప్‌ లో భాగంగా ఈనెల 19న ధర్మశాలలో పాక్‌తో భారత్‌ మ్యాచ్‌ నిర్వహిస్తే అమరవీరుల కుటుంబాలను కించపరిచనట్టేనని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంతి వీరభద్రసింగ్‌ వ్యాఖ్యలను పాక్‌ మాజీ కెప్టెన్‌, తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ పార్టీ నేత ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. సిఎం స్థాయి వ్యక్తులు మాట్లాడవల్సిన మాటలు కావని అన్నారు. పాక్‌ జట్టుకు వ్యతిరేకంగా వాఖ్యలు చేయటం బాధ్యతారాహిత్యమేనన్నారు. ఇలాంటి వ్యాఖ్యల తరుణంలో ధర్మశాలలో పాక్‌ జట్టు ఆడాల్సిన అవసరం లేదని ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు.
2sports
Hyderabad, First Published 2, Oct 2018, 9:50 AM IST Highlights యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం 'అరవింద సమేత'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన సరైన ప్రమోషన్స్ ని నిర్వహించలేదు చిత్రబృందం. ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేయడంపైనే దృష్టి పెట్టింది.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం 'అరవింద సమేత'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన సరైన ప్రమోషన్స్ ని నిర్వహించలేదు చిత్రబృందం. ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేయడంపైనే దృష్టి పెట్టింది.  ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనుంది. ఈ వేడుక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదుచుస్తున్నారు. ఇదే వేడుకలో సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతుంది చిత్రబృందం. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ ని విడుదల చేశారు. అక్టోబర్ 2న రాత్రి 8 గంటల 10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానుల ఆనందం రెట్టింపయింది. ఇప్పటికే ఈ వేడుకకు అతిథిగా బాలకృష్ణ వస్తున్నాడని చెప్పి అభిమానులను ఖుషీ చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో మరింత రంజింపచేయబోతున్నారు. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్‌కు దూరంగా ఉన్న బాలయ్య.. హరికృష్ణ మరణంతో మళ్లీ దగ్గరయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఎన్టీఆర్ కోసం అతిథిగా రావడానికి సిద్ధమయ్యారు బాలయ్య. బాబాయ్, అబ్బాయ్ లను ఒకే వేదికపై చూడడానికి అభిమానులు ఆనందంగా ఎదురుచూస్తున్నారు! The most eagerly anticipated #AravindhaSamethaTheatricalTrailer will be released by @tarak9999 tomorrow at 8:10pm. Set your clocks now, for this will be one video you do not want to miss! — Haarika & Hassine Creations (@haarikahassine) October 1, 2018 Last Updated 2, Oct 2018, 9:50 AM IST
0business
ఉద్దేశపూర్వక ఎగవేతలుఏ రూ.92,000 కోట్లు - ఎగవేతదారుల సంఖ్యలో దాదాపు 10 శాతం మేర వృద్ధి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలను స్వీకరించి ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మార్చి ముగింపు నాటికి వీటికి ఇలాంటి రుణాల ఎగవేత మొత్తంలో 20 శాతం వృద్ధి నమోదైంది. గణాంకాల ప్రకారం దాదాపు 9000 మంది ఎగవేతదారులు ఉద్దేశపూర్వకంగా రూ.92,376 కోట్ల సొమ్మును ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకొని తిరిగి చెల్లించడం లేదు. అంతకు ముందు ఏడాది (2015-16) ఇలా ఎగవేసిన రుణాల మొత్తం రూ.76,685 కోట్లుగా నమోదు అయింది. ఇదే కాలంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్యలో కూడా 10 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి చివరి నాటికి ఉద్దేశపూర్వక రుణ ఏగవేతదారుల సంఖ్య 8,167 ఉండగా 2017 మార్చి చివరికి ఆ సంఖ్య 8,915కు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలలో వెల్లడైంది. మొత్తం 8,915 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల్లో 1,914 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం జరిగిందని.. వీరు తీసుకున్న రుణాల విలువ రూ.32,484 కోట్లుగా నమోదయ్యాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ఎస్‌బీఐ దాని అనుబంధ బ్యాంకులు కలిసి దాదాపు రూ.81,683 కోట్ల రుణాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇది గత అయిదేండ్ల కాలంలో గరిష్టం కావడం విశేషం. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ మార్చి త్రైమాసికం నాటికి రూ.5.02 లక్షల కోట్ల నుంచి రూ.6.41 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థిని నియంత్రణలోకి తెచ్చేందుకు గాను ఆర్‌బీఐ పలు నిబంధనలను కఠినతరం చేసిన సంగతి విదితమే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV నాల్గో వన్డే.. బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు TNN | Updated: Aug 31, 2017, 02:10PM IST శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్‌లో ఇప్పటి వరకు లక్ష్య ఛేదనకే ఎక్కువ మొగ్గు చూపిన టీమిండియా తొలిసారి మొదట బ్యాటింగ్ చేస్తోంది. మరోవైపు శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ కపుగెదర గాయం కారణంగా జట్టుకి దూరమవడంతో అతని స్థానంలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఈ వన్డేకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సొంతగడ్డపై ఇప్పటికే భారత్ చేతిలో టెస్టుల్లో క్లీన్‌స్వీప్‌నకు గురైన శ్రీలంక.. ఐదు వన్డేల సిరీస్‌లోనూ 3-0తో వెనకబడి ఉంది. దీంతో కనీసం ఈ వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని లంకేయులు ఆశపడుతుండగా.. భారత్ మాత్రం వన్డేల్లో కూడా ఆతిథ్య జట్టును క్వీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
2sports
రంగుల రాట్నం మూవీ రివ్యూ రేటింగ్ Highlights చిత్రం : రంగుల రాట్నం నటీనటులు: రాజ్ తరుణ్, చిత్ర శుక్లా, సితార, ప్రియదర్శి తదితరులు మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల  నిర్మాత: అక్కినేని నాగార్జున ఆసియానెట్ రేటింగ్ : 2/5 సరదాగా నడిచే కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు రాజ్ తరుణ్. వరుసగా విజయాలు సాధిస్తున్న హీరో రాజ్ తరుణ్ ఈసారి సంక్రాంతి బరిలోకి పవన్,బాలయ్య, సూర్య లాంటి హీరోలతో పోటీపడుతూ బరిలో దిగాడు రాజ్ తరుణ్. తనకు హీరోగా తొలి అవకాశమిచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ‘రంగుల రాట్నం’ అనే ప్రేమకథా చిత్రాన్ని చేశాడు. సంక్రాంతి సందర్భంగా ఎంతో నమ్మకంగా బరిలోకి దింపిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం!  కథ:  విష్ణు(రాజ్ తరుణ్) సాఫ్ట్‌ వేర్ రంగంలో స్ధిరపడిన యువకుడు. తన తల్లి(సితార)తో కలిసి జీవిస్తుంటాడు. విష్ణుకి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటుంది సితార. అదే సమయంలో ఒక పెళ్లిలో కీర్తి(చిత్రా శుక్లా) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు విష్ణు. తన కొడుకు ప్రేమను సపోర్ట్ చేస్తుంది సితార. కానీ అనుకోకుండా సితార చనిపోతుంది. తల్లిని పోగొట్టుకున్న విష్ణు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికాకుండానే తల్లి చనిపోవడంతో బాధలో కూరుకుపోయిన విష్ణు ఎలా బయటపడ్డాడు..? కీర్తి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు..? అనేదే మిగతా కథ విశ్లేషణ:  కామెడీతో మొదలుపెట్టి ఇంటర్వెల్‌కి వచ్చేసరికి పూర్తి భావోద్వేగభరితంగా మార్చేశారు. ప్రథమార్ధం రొటీన్ స్క్రీన్‌ప్లే‌తో సాగిపోతుంది. అమ్మ సెంటిమెంట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేసిన డైరెక్టర్.. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో కనెక్టివిటీ సరగా మ్యాచ్ చేయలేదనిపిస్తుంది.. హీరో అమ్మగా సితార అంతగా కుదరలేదనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది.. సితార నటన, డబ్బింగ్ అసలు కుదరలేదు. రాజ్ తరుణ్‌కి, సితారకు మధ్య సెంటిమెంట్ పండలేదు. ద్వితీయార్ధం మరింత భారంగా గడుస్తుంది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ‘కేరింగ్’ అంటూ విధించే షరతులు హీరోని బాగా ఇబ్బంది పెడతాయి. తెరపై ఆ ఇబ్బందులను చూసే ప్రేక్షకుడు మరింత ఇబ్బంది పడతాడు. సినిమాలో హైలైట్ అని చెప్పుకోవడానికి ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం బాధాకరం.   క్లైమాక్స్‌ లో కమెడియన్ ప్రియదర్శన్ పాత్ర లేకుండా సన్నివేశాలను ఊహించుకోలేం. అంతగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ‘పెళ్ళిచూపులు’ సినిమా తరువాత పూర్తిస్థాయిలో ప్రియదర్శన్ కనిపించిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. హీరోతో పాటు ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్‌లో ప్రియదర్శన్ తనదైన నటనతో, కామెడీతో మెప్పించాడు. రాజ్ తరుణ్ మరోసారి సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నాడు. భావోద్వేగ సన్నివేశాల్లో జీవించేశాడు. చిత్ర శుక్ల పద్ధతిగా, చాలా చక్కగా కనిపించింది. నటన పరంగా పర్వాలేదనిపించింది. ఒక ప్రేమకథను నిజాయితీగా తెరపై చూపించాలనుకున్న దర్శకురాలు స్క్రీన్‌ప్లే‌ను బలంగా రాసుకోలేకపోయారు. సినిమా మొత్తం చాలా నిదానంగా సాగుతుంది. సినిమాకు సంగీతం మరో పెద్ద బలహీనతగా మారింది. ఏ ఒక్క పాట వినసొంపుగా లేదు. నేపథ్య సంగీతం కొన్నిచోట్ల సన్నివేశాలని డామినేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. అయితే లవ్, సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా లేకపోవటంతో అంతా మిస్సింగ్ అనిపిస్తుంది. Last Updated 25, Mar 2018, 11:40 PM IST
0business
- 'సీబీ షైన్‌ ఎస్‌పీ'ని విడుదల చేసిన హోండా - ధర రూ. రూ.59,900-రూ.64,400 న్యూఢిల్లీ: హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) దేశీయ విపణిలోకి సరికొత్త ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించింది. హోండా సీబీ షైన్‌ ఎస్‌పీ (స్మార్ట్‌ పవర్‌) పేరుతో దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వాహనం 125 సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో మార్కెట్లోకి తెచ్చిన ఈ బైక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుందని సంస్థ తెలిపింది. ప్రామాణిక డ్రైవింగ్‌ పరిస్థితులలో ఈ బైక్‌ దాదాపు లీటరుకు 65 కి.మి. మైలేజీని అందిస్తుందని సంస్థ తెలిపింది. ఈ వాహనం ధరను సంస్థ రూ.59,900-రూ.64,400గా (ఎక్స్‌షోరూమ్‌, న్యూఢిల్లీ) నిర్ణయించింది. హోండా సంస్థ ఈ ఏడాది మార్కెట్లోకి తెచ్చిన వాహనాలలో ఇది పదిహేనవది. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకతను కొరుకొనే యువత కోసం తాము మార్కెట్లోకి ఈ సరికొత్త సీబీ షైన్‌ ఎస్‌పీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ అధ్యక్షుడు, సీఈఓ కెయితా మురమత్సు తెలిపారు. ఇతర ప్రత్యేకతలు ఇవీ.. ొ ఒకే సిలెండర్‌తో కూడిన ఎయిర్‌కూల్ట్‌ ఇంజిన్‌ొ అయిదు స్పీడ్‌ గేర్లుొ డిజిటల్‌ ఎనలాగ్‌ మీటర్‌ వ్యవస్థ ొ సరికొత్త హెడ్‌ల్యాంప్‌ొ ఆధునికీకరించిన టెయిల్‌ ల్యాంప్‌ొ అధునాతన గ్రాఫిక్స్‌ొ5స్ప్లిట్‌ ఎలారు వీల్స్‌ొ స్మార్ట్‌పవర్‌ స్టార్ట్‌, స్టాప్‌ వ్యవస్థొ అయిదు రంగులలో లభిస్తుందిొఅతిపెద్ద వీల్‌బేస్‌ొ ఉన్నతమైన క్లియరెన్స్‌తో పాటు భారత్‌లోని అన్ని రకాల రహదారులపై ప్రయాణానికి వీలుగా దీనిని తీర్చిదిద్దారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రొటొమ్యాక్ అధినేత‌ను అరెస్ట్ చేసిన సీబీఐ రూ.800 కోట్ల మేర బ్యాంకు రుణం తీసుకొని ఇప్ప‌టివ‌ర‌కూ రుణం, వ‌డ్డీ చెల్లించ‌లేద‌నే కార‌ణంతో సీబీఐ ఈ వ్య‌వ‌హారంపై దర్యాప్తును ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు చేసిన‌ వేల కోట్ల మోసం మ‌రువ‌కముందే.. మ‌రో బ్యాంకు కుంభ‌కోణం వెలుగుచూసింది. TNN | Updated: Feb 19, 2018, 12:58PM IST నిన్న పీఎన్బీ కుంభ‌కోణం.. నేడు రొటామ్యాక్ రూ.800 కోట్ల మేర బ్యాంకు రుణం తీసుకొని ఇప్ప‌టివ‌ర‌కూ రుణం, వ‌డ్డీ చెల్లించ‌లేద‌నే కార‌ణంతో సీబీఐ ఈ వ్య‌వ‌హారంపై దర్యాప్తును ప్రారంభించి చివ‌ర‌కు అరెస్ట్ చేసింది.. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు చేసిన‌ వేల కోట్ల మోసం మ‌రువ‌కముందే.. మ‌రో బ్యాంకు కుంభ‌కోణం వెలుగుచూసింది. కాన్పూర్‌కు చెందిన వ్యాపార వేత్త విక్రమ్‌ కొఠారీ రూ. 800 కోట్ల మేర బ్యాంకుల్ని ముంచేసి విదేశాలకు పరారయ్యారన్న వార్త కలకలం రేపుతోంది. రొటొమ్యాక్‌ పెన్స్‌ కంపెనీ యజమాని కొఠారీ.. అలహాబాద్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల నుంచి తీసుకున్న రూ. 800 కోట్ల రుణాల్ని ఎగ్గొటారని, ఈ రుణాల మంజూరులో బ్యాంకులు కూడా రాజీపడ్డాయని కథనాలు వెలువడ్డాయి. ఒక ప‌క్క నేనేమి ఉద్దేశ‌పూర్వ‌క ఎగ‌వేత‌దారును కాద‌ని, విదేశాల‌కు పారిపోలేద‌ని కొఠారీ వివ‌ర‌ణ ఇస్తున్న‌ప్ప‌టికీ ఇది మ‌రో బ్యాంకు కుంభ‌కోణ‌మేన‌ని ఆర్థిక విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక నివేదిక ప్రకారం ముంబైలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ. 485 కోట్లు, కోల్‌కతాలోని అలహాబాద్‌ బ్యాంకు నుంచి రూ. 352 కోట్లను కొఠారీ రుణంగా తీసుకున్నారని.. ఏడాది గడిచినా అస‌లు, వ‌డ్డీ కొఠారీ చెల్లించలేద‌ని తెలుస్తోంది. కాన్పూర్‌ నడిబొడ్డున ఉన్న కొఠారీ కంపెనీ ప్రధాన కార్యాలయం వారం నుంచి మూసేఉందని.. ఆయన జాడ కూడా తెలియడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాను పారిపోయానంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని కొఠారీ చెప్పినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి.గ‌తేడాదే రొటామ్యాక్ గ్లోబ‌ల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దేశ‌పూర్వ‌క ఎగ‌వేత‌దారుగా ప్ర‌క‌టించింది. తమను ‘విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌’ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఆ కంపెనీ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. రూ. 300 కోట్లకు పైగా ఆస్తుల్ని ఇచ్చేందుకు సిద్ధమైనా రోటొమ్యాక్‌ను ‘విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌’గా తప్పుగా ప్రకటించారని అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీబీ భోస్లే, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ధర్మాసనం పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాల మేరకు రొటొమ్యాక్‌ను విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌గా ప్రకటిస్తూ ఫిబ్రవరి 27, 2017న ఆదేశాలు జారీ అయ్యాయి.
1entertainment
రెండవ టెస్టుకు ఓపెనర్‌ రాహుల్‌ సిద్ధం గంభీర్‌కు అవకాశం లేనట్లే న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండవ టెస్టుకు టీమిండియా ఓపెనర్‌ రాహుల్‌ సిద్దమయ్యాడు. కాగా ఈ మేరకు అతను మంగళవారం జట్టుతో కలిసినట్లు బిసిసిఐ సెక్రటరీ అజ§్‌ు షిర్కే ఒక ప్రకట నలో వెల్లడించాడు.గత కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న రాహుల్‌ పూర్తిగా కోలుకున్నట్లు ఆయన వివరించాడు.దీనిలో భాగంగా రాహుల్‌ ఇటీవల రంజీల్లో సత్తా చాటుకుని తన ఫిట్‌నెస్‌ ను నిరూపించుకున్నాడు. కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్‌, రాజస్థాన్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 85 బంతుల్లో 76పరుగులు చేయగా, రెండవ ఇన్నింగ్స్‌లో 132 బంతుల్లో 106 పరు గులు సాధించాడు. తాజాగా రాహుల్‌ జట్టులో చేరడం వెటరన్‌ ఆటగాడు గంభీర్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. కాగా తొలి టెస్టులో గంభీర్‌ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 29 పరు గులు చేస్తే,రెండవ ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఫైనల్లో బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారత్ జట్టు ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ప్రపంచకప్ కలను నెరవేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. TNN | Updated: Jul 23, 2017, 02:42PM IST ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హెదర్ నైట్ బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీ ఆరంభంలోనే ఇంగ్లాండ్‌ని అలవోకగా ఓడించి టైటిల్ రేసును ఆరంభించిన భారత్ జట్టు తుదిపోరులో విజయం సాధించి ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ప్రపంచకప్ కలను నెరవేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు భారత్‌ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడినా.. తర్వాత వరుస విజయాలతో ఫైనల్ చేరిన ఇంగ్లాండ్ సొంతగడ్డపై విశ్వవిజేతగా నిలవాలని ఆశిస్తోంది. భారత్ జట్టు : స్మృతి మంధానా, పూనమ్‌ రౌత్‌, మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ ప్రీత్‌ కౌర్, దీప్తి శర్మ, వేద, సుష్మ, జులన్ గోస్వామి, శిఖ పాండే, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆస్ట్రేలియా కొత్త కోచ్‌గా జస్టిన్ లాంగర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత డారెన్ లీమన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో ఆస్ట్రేలియా కొత్త కోచ్‌గా జస్టిన్ లాంగర్‌ను ఎంపిక చేశారు. Samayam Telugu | Updated: May 3, 2018, 02:54PM IST ఆస్ట్రేలియా కొత్త కోచ్‌గా జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా జస్టిన్ లాంగర్ ఎంపికయ్యాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం ప్రధాన కోచ్ పదవికి డారెన్ లీమన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా లాంగర్‌ను ఎంపిక చేసింది. 47 ఏళ్ల లాంగర్ ఆస్ట్రేలియా తరఫున దాదాపు 20 ఏళ్లపాటు క్రికెట్ ఆడాడు. 105 టెస్టులు ఆడిన లాంగర్ 7696 రన్స్ చేశాడు. 2007లో ఆస్ట్రేలియా 5-0తో యాషెస్ సిరీస్ నెగ్గాక అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు.
2sports
bigg boss telugu season 3 logo promo released Telugu Bigg Boss 3: ‘బిగ్ బాస్ 3’ రెడీ.. ప్రోమో వచ్చేసింది కేవలం 15 సెకన్లు నిడివితో ఉన్న ఈ ప్రోమోలో సీజన్ 3 ఎప్పటి నుండి ప్రసారం కాబోతోంది? హోస్ట్ ఎవరు? కంటెస్టెంట్స్‌గా ఎవరు ఉండబోతున్నారు? లాంటి వివరాలను బహిర్గత పరచకుండా కేవలం.. Samayam Telugu | Updated: Jun 17, 2019, 06:20PM IST హైలైట్స్ బిగ్ బాస్ సీజన్ 3 రెడీ లోగో ప్రోమోను అఫీషియల్‌గా విడుదల చేసిన స్టార్ మా హోస్ట్, టెలికాస్ట్ డేట్‌ని సీక్రెట్‌గా ఉంచిన స్టార్ మా దాదాపు నాగార్జున ఖాయమైనట్లేనా? బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 అన్ని కార్యక్రమాలను ముగించుకుని టెలికాస్ట్‌కి రెడీ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 1, 2కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో.. సీజన్ 3ని భారీ హంగులతో కలర్ ఫుల్ కంటెస్టెంట్స్‌తో మరింత రంజుగా రెడీ చేశారు. ఈ షో ఎప్పటి నుండి ప్రసారం కాబోతుందని ఎదురు చేస్తుండగా.. తాజాగా సీజన్ 3కి సంబంధించి లోగో ప్రోమోను అధికారికంగా విడుదల చేసింది స్టార్ మా. కేవలం 15 సెకన్లు నిడివితో ఉన్న ఈ ప్రోమోలో సీజన్ 3 ఎప్పటి నుండి ప్రసారం కాబోతోంది? హోస్ట్ ఎవరు? కంటెస్టెంట్స్‌గా ఎవరు ఉండబోతున్నారు? లాంటి వివరాలను బహిర్గత పరచకుండా ట్విస్ట్ ఇస్తూ.. కేవలం షోని కన్ఫామ్ చేస్తూ లోగోని డిజైన్ చేశారు. కాగా జూలై మొదటి లేదా రెండో వారం నుండి బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
0business
- జీఎస్టీ రాబడిపై జైట్లీ అసంతృప్తి - ఎగవేతలు పెరగడంపై సీరియస్‌ - ఏప్రిల్‌ నుంచి దశల వారీగా అమలుకు నిర్ణయం - 'సరళీకరణ'కు మరింత గడువు న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన 'వస్తు, సేవల పన్ను' (జీఎస్టీ) పన్ను వసూళ్లపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ జరిగిన జీఎస్టీ మండలి 26వ సమావేశంలో ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మహోన్నత ఆర్థిక లక్ష్యాలతో అందుబాటులోకి తెచ్చిన జీఎస్టీ విధానం ద్వారా అనుకున్న స్థాయిలో పన్ను వసూళ్లు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు జీఎస్టీలోని వివిధ సౌలభ్యాలను ఆసరాగా చేసుకొని భారీగా ఎగవేతలకు ప్పాలడుతున్నట్టు సర్కారు దృష్టికి వచ్చిందని మంత్రి వివరించినట్టు తెలుస్తోంది. ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ పన్నుల ఎగవేతకు పాల్పడుతున్న వారి ఆగడాలను అరికట్టేందుకు ఈ-వే బిల్లు పరిష్కారం చూపగలదని జైట్లీ మంత్రులకు వివరించినట్టుగా సమాచారం. రాష్ట్రాల నుంచి తగిన సహాకారాన్ని, సమగ్ర కార్యాచరణను జైట్లీ కోరినట్టుగా సమాచారం. ఏప్రిల్‌ నుంచి ఈ-వే బిల్లు విధానం.. రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ గల సరుకులు రవాణా చేయాలంటే ఉండాల్సిన ఎలక్ట్రానిక్‌-వే బిల్లును ఏప్రిల్‌ 1 నుంచి దశల వారీగా అమల్లోకి తేనున్నట్టుగా జైటీ తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 1 నాటికి దేశవ్యాప్తంగా ఈ విధానం అందుబాటులోకి వస్తుంది ఆర్థిక మంత్రి సమావేశం అనంతరం తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉనున్న జీఎస్‌టీఆర్‌-3బీ ఫైలింగ్‌ విధానాన్నే మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగా ప్రతిపాదించిన రివర్స్‌ చార్జీ వ్యవస్థను మూలం వద్దే పన్ను మినహాయింపు, టీసీఎస్‌ విధానాలను కూడా జూన్‌ 30 వరకు అమలు చేయకూదని ఈ సమావేశంలో నిర్ణయించారు. కుదరని ఏకాభిప్రాయం.. జీఎస్టీ రిటర్నుల సరళీకరణకు విషయంలో జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ అంశంపై మరింత అధ్యయనానికి గాను మంత్రుల బృందం మరింత కసరత్తు చేయనుందని జైట్లీ తెలిపారు. సమగ్రమైన చర్చల తరువాతే ఒక నిర్ణయం తీసుకొని ఈ అంశాన్ని మరో సమావేశంలో ఏకాభిప్రాయానికి ఉంచనున్నట్టుగా జైట్లీ తెలిపారు. ఈ నేపథ్యంలో పాత విధానాన్నే మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. పార్లమెంట్‌ ప్యానెల్‌ విస్మయం కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీ పన్ను విధానం అమలుపై పార్లమెంట్‌ ఆర్థిక వ్యవహారాల ప్యానెల్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎంపీ, కాంగ్రెస్‌ నేత వీరప్ప మోయిల్‌ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ జీఎస్టీ విధానాన్ని సమీక్షించి ఒక నివేదికను పార్లమెంట్‌కు అందజేసింది. ఇందులో జీఎస్టీ అమలవుతున్న తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. జీఎస్టీ పన్ను శ్లాబ్‌లను తరుచూ మార్చుతుండడం, పన్ను వసూళ్లకు లక్ష్యాలను నిర్దేశించకపోవడం వల్ల పన్ను వసూళ్లు ప్రోత్సాహకర స్థాయిలో జరగడం లేదని విస్మయం వ్యక్తం చేసింది. ఇది కొత్త పన్ను విధానాన్ని ప్రభావితం చేస్తున్నట్టుగా పేర్కొంది. పన్ను విధానాలను మార్చుతుండడం వల్ల దేశంలోని వ్యాపార వ్యవస్థ, వాణిజ్యం ప్రభావితం అవుతూ వస్తోందని పేర్కొంది. దీనిని నివారణకు చర్యలు తీసుకోవాలని ప్యానెల్‌ కోరింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 27,430 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్లు నష్టంతో 8,485 వద్ద ముగిసింది... TNN | Updated: Nov 3, 2016, 03:52PM IST భవిష్యత్ యూఎస్ ప్రెసిడెంట్ ఎవరనే అనిశ్చితి నేపథ్యంలో వరుసగా రెండో రోజు అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోళ్లపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గురువారం సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 27,430 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్లు నష్టంతో 8,485 వద్ద ముగిసింది. ఐటీ, బ్యాంకింగ్, పవర్ సెక్టార్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డీఎఫ్సీ , ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, ఏసిన పెయింట్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, లుపిన్ షేర్లు నష్టపోయాయి. కాగా, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, డా. రెడ్డీస్ ల్యాబ్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.70 వద్ద స్థిరపడింది.
1entertainment
Hyderabad, First Published 20, Aug 2018, 4:34 PM IST Highlights కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఎందరో నిరాశ్రయులుగా మారినా వరుణుడు మాత్రం కరుణించడం లేదు. కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఎందరో నిరాశ్రయులుగా మారినా వరుణుడు మాత్రం కరుణించడం లేదు. ఏకధాటిగా కురుస్తోన్న వానలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేక తమను ఆదుకునేవారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎందరో ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా వరద బాధితుల సహాయార్ధం నిధులు సమకూరుస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల నుండి ప్రతి ఒక్కరూ తమవంతూ స్పందిస్తూ సహాయాన్ని అందిస్తున్నారు. తాజాగా 'RX100' సినిమా టీమ్ కూడా వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. పెద్ద మొత్తంలో డబ్బుని సమకూర్చడం కోసం ఓ వినూత్న ఆలోచన చేసింది చిత్రబృందం. 'RX100' సినిమాలో హీరో వాడిన బైక్ ని వేలం వేసి దాని ద్వారా వచ్చిన డబ్బుని కేరళ వరద బాధితులకు డొనేట్ చేయనున్నారు. వేలంలో బైక్ మినిమమ్ ధర యాభై వేలుగా నిర్ణయించారు. వేలం పాటలో ఎంత డబ్బుకి ఈ బైక్ ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారో.. ఆ ధరను [email protected] కి మెయిల్ గానీ లేదా 9100445588 కి వాట్సాప్ చేయమని తెలిపారు.     #RX100 Team Fundraising Auction #RX100 Bike Which is used in the film is for auction and the fundraised amount I'll be donated to Kerala Relief Fund. Send your details and bidding amount to [email protected] or whatsapp to 9100445588 Minimum bid amount is 50,000₹ pic.twitter.com/960R7i3J0n
0business
adhyayan suman fires on media కంగనా మాజీ ప్రియుడినంటే మండిపోతోంది మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు బాలీవుడ్ నటుడు అధ్యాయన్ సుమన్. తనను కంగనా మాజీ ప్రియుడంటూ వార్తలు రాయడంపై మండిపడ్డాడు. తన పేరుతో పిలిస్తేన తనకు గౌరవంగా ఉంటుందన్నాడు. Samayam Telugu | Updated: Jan 25, 2019, 12:17PM IST కంగనా మాజీ ప్రియుడంటే హృతిక్ రోషన్ అనుకుని పొరపడకండి. ఇది వేరే స్టోరీ. ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ కుమారుడు అధ్యాయన్ సుమన్, కంగనా రనౌత్ గతంలో కొంతకాలం ప్రేమించుకున్నారు. అనంతరం విభేదాల వల్ల విడిపోయారు. అధ్యాయన్ ఇప్పుడు టీవీ నటి మైరా మిశ్రాతో డేటింగ్‌లో ఉన్నాడు. వీరి ప్రేమకథపై ఇటీవల మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఈ సందర్భంగా కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లు ఆయన్ని కంగనా మాజీ ప్రియుడు అంటూ సంబోధించాయి. ఇక్కడే అధ్యాయన్‌కు మండింది. ఒకరితో ప్రేమ గురించి రాస్తూ... మరో వ్యక్తి మాజీ ప్రియుడని ఎలా అంటారంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. నా ప్రేమ, డేటింగ్‌పై పుకార్లు రావడాన్ని నేను తప్పుపట్టను. కానీ మరొక వ్యక్తి మాజీ ప్రియుడంటూ మాట్లాడితే ఒప్పుకోను. నా పేరుతో పిలిస్తే నాకు గౌరవంగా, సౌకర్యంగా ఉంటుంది’ అని అధ్యాయన్ పేర్కొన్నాడు.
0business
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి virat kohli, team india సౌతాంప్టన్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి పరిణతి లేదని, విమర్శిస్తూ మాట్లాడితే విరాట్‌ అస్సలు తట్టుకోలేడని దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడా విమర్శించిన విషయం తెలిసిందే. రబాడా వ్యాఖ్యలపై ఇప్పటివరకు మౌనం వహించిన కోహ్లి మీడియా సమావేశంలో దీని గురించి స్పందించాడు. ఈ సందర్బంగా విరాట్‌ మాట్లాడుతూ..రబాడా తాను ఎన్నో సార్లు పోటీ పడ్డామని, ఒకవేళ తన మీద చేసిన వ్యాఖ్యలపై చర్చించాల్సివస్తే అది తామిద్దరం తేల్చుకుంటామని, రబాడాతో తానే నేరుగా మాట్లాడాతానని ,కాని ఇలా మీడియా సమావేశంలో దీని గురించి చర్చించాలనుకోవటం లేదని స్పష్టం చేశాడు. నేడు ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా కోటి ఆశలతో తొలి మ్యాచ్‌ కోసం మైదానంలో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే వరుస అపజయాలతో దెబ్బతిన్న సఫారీ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంది. మరోవైపు నూతనోత్సాహంతో తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టాలని టీమిండియా చూస్తుంది. తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/
2sports
internet vaartha 163 Views న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా జట్టు తరుపున 200 వన్డేలు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్ప డంపై డివిలియర్స్‌ స్పందించాడు. కాగా తాను రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోనని, అందుకే వాటి గురించి ఎప్పుడు మాట్లాడ లేదని, సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో తనకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయన్నాడు. ఈ ప్రయాణంలో తమ జట్టు ఎన్నో విజయాలు సాధించిందని, ఎంతో మంది గొప్ప వ్యక్తులు స్నేహితులయ్యారని గుర్తు చేసుకున్నాడు. వాటన్నింటితో పోల్చితే  ఈ వ్యక్తిగత రికార్డులు అంత గొప్పవి కాదని,అయితే 200 వన్డేలు ఆడ టమన్నది గొప్ప విషయమని పేర్కొన్న డివిలియర్స్‌ ఇంతకంటే మంచి ప్రదర్శన చేయాలని భావిస్తున్నానని వివరించాడు.
2sports
Hyderabad, First Published 4, Sep 2019, 7:25 PM IST Highlights తెలుగు తమిళ భాషల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంది. గజినీ, సింగం సిరీస్ చిత్రాలతో సూర్య తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు. విలక్షణమైన నటన సూర్య ప్రధాన బలం. ప్రయోగాత్మక చిత్రాలలో నటించేందుకు సూర్య ఆసక్తి చూపుతుంటాడు.  తెలుగు తమిళ భాషల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంది. గజినీ, సింగం సిరీస్ చిత్రాలతో సూర్య తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు. విలక్షణమైన నటన సూర్య ప్రధాన బలం. ప్రయోగాత్మక చిత్రాలలో నటించేందుకు సూర్య ఆసక్తి చూపుతుంటాడు.  సూర్య ప్రస్తుతం నటిస్తున్న చిత్రం కాప్పాన్. తెలుగులో బందోబస్త్ గా రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ చిత్ర తమిళ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సూర్య ప్రధానికి రక్షణ కల్పించే సెక్యూరిటీ ఆఫీసర్ గా, సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి.  సూర్య వివిధ గెటప్పులలో మారుతూ యాక్షన్ సీన్స్ లో అదరగొడుతున్నాడు. ఇక హీరోయిన్ గా యంగ్ బ్యూటీ సాయేషా సైగల్ నటిస్తోంది ఈ చిత్రానికి కెవి ఆనంద్ దర్శకుడు. సూర్య కెవి ఆనంద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరి కలయికలో వీడోక్కడే, బ్రదర్స్ చిత్రాలు వచ్చాయి.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 20న బందోబస్త్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ లాల్, నటుడు ఆర్య ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
0business
Visit Site Recommended byColombia టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు భారత్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ మిథాలీ రాజ్ (62: 50 బంతుల్లో 8x4, 3x6), జమ్మీ (44: 34 బంతుల్లో 3x4, 2x6), కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్ (27 నాటౌట్: 17 బంతుల్లో 1x4, 2x6) దూకుడుగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కి ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో.. ఆ జట్టు 18 ఓవర్లలోనే 112 పరుగులకు కుప్పకూలిపోయింది. మరిజానె కప్ (27: 21 బంతుల్లో 1x4, 2x6) చోలే ట్రయాన్ (25: 17 బంతుల్లో 2x6) కాసేపు భారీ షాట్లతో కంగారుపెట్టినా.. బౌలర్లు శిఖ పాండే (3/16), రాజేశ్వరి (3/26), రుమేలి ధార్ (3/26) లయ తప్పకుండా బౌలింగ్ చేసి భారత్‌ని గెలిపించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Hyderabad, First Published 3, Oct 2019, 2:32 PM IST Highlights స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా’ చిత్రాన్నిదేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం  చేయడంపై చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపట్టింది.  మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదల చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా’ చిత్రాన్నిదేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేయడంపై చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా నిర్మాత రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''పరుచూరి గారి ఆలోచనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని'' చెప్పారు. సాయి మాధవ్ బుర్రా గారు ఎన్నో మంచి డైలాగ్స్ రాశారు. చాలా మంది పాత్రలు ఎలివేట్ అవ్వడానికి ఆయన డైలాగ్సే కారణమని చెప్పారు. సినిమాలో వీఎఫ్ఎక్స్అంత బాగా రావడానికి కారణం కనల్ సర్ అని అన్నారు. రత్నవేలుతో చాలా రోజులుగా జర్నీ చేస్తున్నట్లు.. ఈ సినిమాకి ఆయన పని చేయడం తమ అదృష్టమని చెప్పారు. టెక్నీషియన్స్, నటీనటులు ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు రామ్ చరణ్. సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు, కొణిదెల ప్రొడక్షన్స్ లో ఈ సినిమా కోసం పని చేసినవారందరికీ థాంక్స్ చెప్పిన రామ్ చరణ్ సక్సెస్ ఇలా ఉంటుందని అసలు ఊహించలేదని చెప్పారు. నెలరోజులుగా ఎంతో ఒత్తిడికి గురైనట్లు చెప్పారు. అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచేవాడినని చెప్పిన చరణ్ ఇండస్ట్రీలో నిర్మాతలంతా అలానే లెగుస్తారేమోనని నవ్వేశారు.   Last Updated 3, Oct 2019, 2:32 PM IST
0business
'సై రా'కు బ్రేక్ పడింది.. కారణం ఏంటంటే..? Highlights గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా గ్రౌండ్ పాడవడంతోషూటింగ్ ను అర్ధాంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి కలిగింది. రాత్రిపూట కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి  ఉండటం.. వాతావరణం సహకరించకపోవడంతో షూటింగ్ కు ఆటంకం కలుగుతోంది మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తరువాత ఇచ్చిన రీఎంట్రీలో 'ఖైదీ నెం150' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత అతడు ఓకే చేసిన చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు నిర్మాత రామ్ చరణ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర్ శివార్లలో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన కీలక యుద్ధ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్ లో పాల్గొనాలి. యుద్ధ సన్నివేశాలకు తగ్గట్లుగా గ్రౌండ్ ను సిద్ధం చేసింది చిత్రబృందం. కానీ గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా గ్రౌండ్ పాడవడంతోషూటింగ్ ను అర్ధాంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి కలిగింది. రాత్రిపూట కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉండటం.. వాతావరణం సహకరించకపోవడంతో షూటింగ్ కు ఆటంకం కలుగుతోంది. దీంతో మరో రెండు రోజుల పాటు షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార కనిపించనుంది. అలానే అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  Last Updated 13, Jul 2018, 1:04 PM IST
0business
Jan 12,2019 జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టుకు అవార్డు.. హైదరాబాద్‌ : జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఐఎల్‌)కు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీిఎస్‌ఆర్‌)లో మరో గుర్తింపు లభించింది. ఐసీిఎస్‌ఐ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సీఎస్‌ఆర్‌ అవార్డును ముంబయిలో జీహెచ్‌ఏఐఎల్‌ సీఎఫ్‌ఒ రాజేష్‌కు ఇండియా ప్రొఫెషనల్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌ కౌల్‌, సెబీ మాజీ ఛైర్మన్‌ జిఎన్‌ బజ్‌పాల్‌ అందజేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia 2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ విజేతలుగా నిలిచిన జట్ల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్ జట్లు మూడు సార్లు విజేతగా నిలవగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండుసార్లు టైటిల్‌ను గెలిచింది. డక్కన్ ఛార్జర్స్‌ ఒక్కసారి టైటిల్‌ను ముద్దాడగా.. ఆ తర్వాత ఈ జట్టు స్థానంలో వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 2016లో విజేతగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్), కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాయి..! 2008లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్లో అసాధారణ ఆటతీరుతో చెన్నై సూపర్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 163 పరుగులు చేయగా.. రాజస్థాన్ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌తో జరిగిన ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి వరకూ పోరాడిన డెక్కన్ ఛార్జర్స్ 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ జట్టు 143 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు 137/9కే పరిమితమైంది. 2010లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 168 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబయి 146/9కే పరిమితమైంది. దీంతో.. 22 పరుగుల తేడాతో ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు టైటిల్ గెలిచింది. 2011లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు అలవోక విజయంతో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 205 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు 147/8తోనే సరిపెట్టింది. దీంతో.. 58 పరుగుల తేడాతో చెన్నై గెలిచింది. 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తొలిసారి టైటిల్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 190 పరుగులు చేయగా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదించేసింది. 2013లో ముంబయి ఇండియన్స్ టీమ్‌ తొలిసారి టైటిల్‌ను గెలిచింది. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కి చేరిన చెన్నై సూపర్ కింగ్స్‌‌ను 23 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను ముద్దాడింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 148 పరుగులు చేయగా.. అనూహ్యంగా చెన్నై 125/9కే పరిమితమైంది. 2014‌లో రెండోసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో భారీ స్కోరు నమోదైన ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 199 పరుగులు చేయగా.. మరో 3 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా ఆ లక్ష్యాన్ని ఛేదించేసింది. 2015లో మరోసారి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ముంబయి ఇండియన్స్ టైటిల్‌ను గెలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 202 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన చెన్నై 161/8కే పరిమితమైంది. దీంతో.. 41 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలిచింది. డెక్కన్ ఛార్జర్స్ స్థానంలో ఐపీఎల్‌లోకి వచ్చిన ఈ జట్టు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్రిస్‌గేల్, విరాట్ కోహ్లీ చెలరేగడంతో.. మ్యాచ్‌ ఆఖరి వరకూ బెంగళూరు చేతుల్లోనే ఉంది. కానీ.. స్లాగ్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హైదరాబాద్ ఆఖరికి ఆ జట్టుని 200/7కే పరిమితం చేసింది. 2017లో ఐపీఎల్‌ టైటిల్‌ను మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా ముంబయి ఇండియన్స్‌ రికార్డుల్లో నిలిచింది. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడిన ముంబయి ఇండియన్స్ కేవలం ఒక పరుగు తేడాతో విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 129 పరుగులు చేయగా.. ఛేదనలో పుణె జట్టు 128/6కే పరిమితమైంది. 2018లో రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ టోర్నీలోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. మూడోసారి విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ అసాధారణ శతకం బాదడంతో 8 వికెట్ల తేడాతో మ్యాచ్‌లో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 178 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని చెన్నై కేవలం 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించేసింది. 2019 ఐపీఎల్ సీజన్ షెడ్యూల్ ఇది.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. తొలి రెండు వారాల షెడ్యూల్‌ని మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Visit Site Recommended byColombia అక్కినేని నాగచైతన్య హీరోగా నిర్మిస్తోన్న ‘సవ్యసాచి’ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని ఒక పాటను శ్రేయ ఆలపించారు. ఈ విషయాన్ని కీరవాణి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘సవ్యసాచిలో ఒక డ్యుయెట్ ద్వారా సునీత కుమార్తె శ్రేయా గోపరాజును పరిచయం చేస్తున్నాం. ఆమెది వాళ్లమ్మ గొంతులా లేదు.. పూర్తిగా వెస్టరన్ ఫీల్‌లో ఉంది’ అని కీరవాణి ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పాట త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే ‘సవ్యసాచి’ నుంచి మూడు పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. Introducing Sunitha’s daughter Shreya Goparaju with a duet from Savyasaachi. Unlike her mother ‘s voice she has totally western feel — mmkeeravaani (@mmkeeravaani) 1540094352000 ఇదిలా ఉంటే, కీరవాణితో కలిసి రికార్డింగ్ థియేటర్‌లో ఉన్న తన కుమార్తె ఫొటోలను సునీత ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘శ్రేయ తొలి రికార్డింగ్ సమయం. ఆమె చాలా భయపడింది. కానీ కీరవాణి గారు ధైర్యం చెప్పారు. ఆమె గొంతులోని లక్షణాలను వివరించారు. ఆమె సౌఖర్యవంతంగా పాడేందుకు దోహదపడ్డారు. ఈ క్షణాలు ఆయనతో నా మొదటి రికార్డింగ్‌ను మళ్లీ గుర్తుచేశాయి’ అని సునీత తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV పెళ్లికి పిలుస్తావ్ కదా.. కూతురితో తండ్రి పాపులర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. దర్శకుడు ఎన్ శంకర్ శిష్యుడు ప్రతాప్ తాతంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రిద్ధి కుమార్, రాధాలు హీరోయిన్లుగా నటించారు. Samayam Telugu | Updated: Oct 27, 2018, 06:24PM IST పెళ్లికి పిలుస్తావ్ కదా.. కూతురితో తండ్రి చేతిలో కళ పెట్టుకుని చంద్రకళ కోసం వెంటబడే కుర్రాడు ‘అనగనగా ఓ ప్రేమకథ’ అంటూ రొటీన్ లవ్ స్టోరీని వినిపిస్తున్నాడు. పాపులర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. దర్శకుడు ఎన్ శంకర్ శిష్యుడు ప్రతాప్ తాతంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రిద్ధి కుమార్, రాధాలు హీరోయిన్లుగా నటించారు. ఈ టీజర్ విషయానికి వస్తే.. తొలిచూపులో అమ్మాయి ప్రేమలో పడటం, ఎలాగోలా అమ్మాయిప్రేమను సాధించడం.. పెళ్లికి అమ్మాయి తండ్రి అడ్డు చెప్పి విలన్‌గా మారడం.. చివర్లో ఫైట్ చేసి హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం. సింపుల్‌గా ఇదే ‘అనగగనగా ఓ ప్రేమ కథ’ సినిమా అని టీజర్‌ని బట్టి ఓ అంచనాకు వచ్చేయొచ్చు. ‘పెళ్లికి చెప్తావా? అని తండ్రి కూతుర్ని ఆటపట్టించడం.. కూతురు నాన్నా.. అంటూ అలగడం’ ఆసక్తికరంగా ఉంది. అయితే డెబ్యూ అంటే కాస్త రొటీన్‌కి భిన్నంగా పాత చింతకాయ కథలకు దూరంగా ఉండటం ఎందుకు దండగ అనుకున్నాడో ఏమో కాని దర్శకుడు రొటీన్ కమర్షియల్ కథనే మళ్లీ కొత్త జాడీలో పెట్టి చూపిస్తున్నారు. ‘అనుబంధాలు ఉన్న సంబంధం చూడమన్నా.. అక్రమ సంబంధం ఉన్న సంబంధం చూడమననేదు’ అంటూ కమెడియన్ వేణు జబర్దస్త్ స్థాయి జోక్‌లు పేల్చే ప్రయత్నం చేశారు. అయితే టెక్నికల్ పరంగా టీజర్ చాలా రిచ్‌గా ఉంది. విదేశీ లొకేషన్స్ చాలా గ్రాండ్ లుక్‌లో ఉన్నాయి. స్టంట్స్ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సింది.. బక్కపలచగా ఉన్న హీరో ఎగెరెగిరి మరీ విలన్లను చితక్కొట్టేయడం రియలస్టిక్‌కి దూరంగా ఉంది. కె.సి అంజన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్ X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ గోల్డెన్ డక్ తొలి ఓవర్ మొదటి బంతికి ఓపెనర్ డీఆర్క్ షార్ట్ సింగిల్ తీసివ్వగా.. అరోన్ ఫించ్ స్ట్రైకింగ్ వెళ్లాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా భువీ విసిరిన బంతిని ఫీల్డర్ల తలమీదుగా హిట్ చేసేందుకు ఫించ్ ప్రయత్నించాడు. Samayam Telugu | Updated: Nov 23, 2018, 03:25PM IST ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా ఈరోజు జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టింది. ఆస్ట్రేలియా కెప్టెన్/ ఓపెనర్ అరోన్ ఫించ్ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా భువనేశ్వర్ కుమార్ విసిరిన బంతిని.. పాయింట్ దిశగా అరోన్ ఫించ్ (0) కట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతుల్లో పడింది. దీంతో.. డకౌట్‌గా అరోన్ ఫించ్ వెనుదిరిగాడు. తొలి ఓవర్ మొదటి బంతికి ఓపెనర్ డీఆర్క్ షార్ట్ సింగిల్ తీసివ్వగా.. అరోన్ ఫించ్ స్ట్రైకింగ్ వెళ్లాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా భువీ విసిరిన బంతిని ఫీల్డర్ల తలమీదుగా హిట్ చేసేందుకు ఫించ్ ప్రయత్నించాడు. కానీ.. బంతి కొంచె స్వింగ్ అవడంతో అతను ఆశించిన విధంగా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో.. ఎడ్జ్ తీసుకున్న బంతి క్యాచ్‌గా వెళ్లిపోయింది. తొలి టీ20లోనూ అరోన్ ఫించ్ 27 పరుగులకే ఔటైన విషయం తెలిసిందే. Ideal start for India at the MCG. Watch via Kayo: https://t.co/4RaLpNkrJn #AUSvIND https://t.co/IA55tF89f6 — cricket.com.au (@cricketcomau) 1542959825000
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా..! శ్రీలంకపై టెస్టు, వన్డే సిరీస్‌ను ఇప్పటికే చేజిక్కించుకున్న భారత్ జట్టు.. టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. వాంఖడే వేదికగా సిరీస్‌లో ఆఖరిదైన TNN | Updated: Dec 24, 2017, 03:09PM IST క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా..! శ్రీలంకపై టెస్టు, వన్డే సిరీస్‌ను ఇప్పటికే చేజిక్కించుకున్న భారత్ జట్టు.. టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. వాంఖడే వేదికగా సిరీస్‌లో ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకి జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. భారత్ జట్టు టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకనుంది. తొలి టీ20లో 93 పరుగులు, రెండో టీ20లో 88 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది.
2sports
microsoft plans low-cost surface tablet pc 'మైక్రోసాఫ్ట్' నుంచి తక్కువ ధర ట్యాబ్లెట్ పీసీ! తక్కువ ధరలో 'ట్యాబ్లెట్ పీసీ'లను ఆవిష్కరించనున్నట్లు..టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ముఖ్యంగా విద్యార్థుల కోసం వీటిని రూపొందిస్తున్నట్లు తెలిపింది. యాపిల్ ఐప్యాడ్‌కు దీటుగా.. కొత్త ట్యాబ్లెట్ పీసీలను తయారుచేయనుంది. TNN | Updated: May 19, 2018, 09:02PM IST తక్కువ ధరలో 'ట్యాబ్లెట్ పీసీ'లను ఆవిష్కరించనున్నట్లు..టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ముఖ్యంగా విద్యార్థుల కోసం వీటిని రూపొందిస్తున్నట్లు తెలిపింది. యాపిల్ ఐప్యాడ్‌కు దీటుగా.. కొత్త ట్యాబ్లెట్ పీసీలను తయారుచేయనుంది. వీటి బరువు కూడా ఇతర సర్ఫేస్ ట్యాబ్లెట్ల కన్నా తక్కువగానే ఉండనుందని సంస్థ తెలిపింది. జూన్ లేదా జూలై నెలలో ఈ ట్యాబ్లెట్ పీసీలను విడుదల చేసే అవకాశముంది. ఫీచర్లు ఇవే.. * 10 ఇంచ్ డిస్‌ప్లే, * యూఎస్‌బీ టైప్ సి కనెక్టివిటీ
1entertainment
TEAM INDIA టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటన ఖరారు న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌లో భారత్‌ జట్టు పర్యటన ఖరారైంది. 2019 ప్రపంచకప్‌కి ఇంగ్లాండ్‌ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జూలై నుంచి అక్కడ టీమిండియా దాదాపు రెండు నెలల పాటు పర్యటించనుంది. సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా భారత్‌ 3 టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టులను ఆతిథ్య జట్టుతో ఆడనుంది. 2018, జూలై 3 న టీ20తో ఆరంభమయ్యే ఈసిరీస్‌ సెప్టెంబర్‌ 11వరకు కొనసాగనుంది. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య వచ్చే ఏడాది జరిగే ఐదు టెస్టుల సిరీస్‌ అంతర్జాతీయ క్రికెట్‌కే హైలెట్‌గా మారనుంది. రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఈపోటీకి అభిమానుల నుంచి పెద్ద సంఖ్యలో ఆదరణ కూడా లభించొచ్చు అని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు సిఈఓ టామ్‌ హరీసన్‌ దీమా వ్యక్తం చేశారు. గత ఏడాది భారత్‌లో పర్యటించిన ఇంగ్లాండ్‌ జట్టు టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. అయితే…సొంతగడ్డపై మాత్రం ఇంగ్లాండ్‌ టెస్టుల్లో ఏ జట్టుకైనా సవాల్‌ విసరగలదు.
2sports
Oct 24,2017 జిగేలుమన్న జీఎంఆర్‌ ఇన్‌ఫ్ర్రా షేర్లు హైదరాబాద్‌: జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా షేర్లు సోమవారం మార్కెట్లో సందడి చేశాయి. అంతర్జాతీయ బాండ్‌ మార్కెట్లో కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ జీఎంఆర్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ విభాగం (జీహెచ్‌ఐఏఎల్‌) దాదాపు రూ.2,276 కోట్ల (350 మిలియన్‌ డాలర్ల) మేర నిధులను సమీకరించిందన్న వార్తలు మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో బీఎస్‌ఈలో సంస్థ స్టాక్‌ 8.5 శాతం మేర పెరిగింది. రూ.16వద్ద ప్రారంభమైన సంస్థ స్టాక్‌ ఇంట్రాడేలో రూ.17.40ల గరిష్టాన్ని తాకింది. చివరకు 7.81 శాతం లాభంతో రూ.17.25 వద్ద ముగిసింది. మరో వైపు ఎన్‌ఎస్‌ఈలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా స్టాక్‌ 8.15 శాతం మేర పెరిగి మార్కెట్లు ముగిసే సమయానికి రూ.17.25 వద్ద స్థిరపడింది. మొత్తంగా 26.04 లక్షల షేర్లు చేతులు మారాయి. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అనుబంధ సంస్థ అయిన జీహెచ్‌ఐఏఎల్‌ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా గ్రూపుసంస్థలు 10 ఏండ్ల కాలావధితో 350 మిలియన్‌ డాలర్ల సొమ్మును 4.25 శాతానికి సీనియర్‌, సెక్యూర్డ్‌, ఫిక్స్డ్‌-రేట్‌ నోట్స్‌ రూపంలో జారీ చేసేందుకు గాను ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
England, First Published 9, Sep 2018, 4:52 PM IST Highlights ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) కన్నెర్ర చేసింది. భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో అంపైర్‌తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగినందుకు గాను అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) కన్నెర్ర చేసింది. భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో అంపైర్‌తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగినందుకు గాను అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.. దానితో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా వేశారు. చివరి టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా అండర్సన్ వేసిన 29వ ఓవర్‌లో బంతి విరాట్ కోహ్లీ ప్యాడ్లను తాకింది. దీంతో అండర్సన్ అప్పీల్ చేశాడు.. దీనికి అంపైర్ కుమార ధర్మసేన నాటౌట్‌గా ప్రకటించాడు.. దీనిపై అండర్సన్ రివ్యూకి వెళ్లినప్పటికీ... అక్కడా నిరాశే ఎదురైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అండర్సన్ అంపైర్ ధర్మసేనతో పాటు కోహ్లీతో గొడవపడ్డాడు. దీనిపై అంపైర్లు కుమార ధర్మసేన, జోయెల్ విల్సన్, థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్‌ఫొర్డ్, ఫోర్త్ అంపైర్ టిమ్ రాబిన్ సన్‌లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఇది ఐసీసీ నియమావళి 2.1.5కి వ్యతిరేకం కావడంతో క్రమశిక్షణా చర్యల కింద అండర్సన్‌కు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. Last Updated 9, Sep 2018, 4:52 PM IST
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV పిల్లల్ని పవన్‌లా తయారుచేస్తోంది... రేణూదేశాయ్, పవన్ కళ్యాణ్... బద్రి సినిమా సమయంలో ప్రేమలో పడి సహజీవనం చేశారు. TNN | Updated: Feb 13, 2016, 09:30AM IST Renu Desai రేణూదేశాయ్, పవన్ కళ్యాణ్ ... బద్రి సినిమా సమయంలో ప్రేమలో పడి సహజీవనం చేశారు. కొడుకు అకిరా పుట్టాక పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారిద్దరికీ కూతురు ఆద్య పుట్టింది. అనంతరం వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడిపోయాక పవన్ వేరే పెళ్లి చేసుకుంటే... రేణూ మాత్రం పుణేలో ఉంటూ తన ఇద్దరు పిల్లల బాధ్యతను చూసుకుంటోంది. తాను భర్త నుంచి విడిపోయినా... పిల్లల్ని మాత్రం తండ్రికి దగ్గరగా పెంచుతోంది రేణు. పవన్ లో ఉన్న మంచి లక్షణాలను పిల్లలకూ అలవాటయ్యేలా చూస్తోంది. పవన్ కు సామాజిక కార్యక్రమాలంటే ఇష్టం. అకిరా నందన్ కూడా సమాజంలో జరిగే సంఘటనలపై స్పందించేలా చూస్తోందట రేణూ. ఇప్పుడు అకిరా కూడా సేవ పట్ల ఆకర్షితుడయ్యాడట. పవన్ కు చదవడం చాలా ఇష్టం. ఇంతవరకు రెండు లక్షల పుస్తకాలు చదివేశాడు. కూతురు ఆద్యని కూడా పవన్ లా పుస్తకాల పురుగుగా మార్చాలని చూస్తోంది రేణూ. పుస్తకాలు చదవడం వల్ల ఒంటరితనం దరిచేరదు. పుస్తకాలను ప్రేమించు అని కూతురికి నూరిపోస్తోందట.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మిడిల్ క్లాస్ అంటూనే.. 30 కోట్లు లాగేశాడు! వరస విజయాల మీద ఉన్న ఈ హీరో.. ఎంసీఏతో వసూళ్ల పంటను పండించాడు. TNN | Updated: Jan 1, 2018, 02:53PM IST మొత్తానికి మిడిల్ క్లాస్ అబ్బాయ్ తో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు నాని . వరస విజయాల మీద ఉన్న ఈ హీరో.. ఎంసీఏతో వసూళ్ల పంటను పండించాడు. ఇటు దేశీయంగా, అటు అమెరికాలోనూ ఎంసీఏ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్కును రీచ్ అయినట్టుగా తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మిక్డ్స్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం ఎంసీఏ దూసుకుపోతోంది. ఈ సినిమా మొత్తంగా ముప్పై కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటేసినట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో, రెస్టాఫ్ ఇండియాలో, ఓవర్సీస్ లో కలుపుకుని ముప్పై కోట్ల రూపాయల వసూళ్లను సాధించాడట మిడిల్ క్లాస్ అబ్బాయి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Ramesh Powar: మిథాలీ రాజ్ ఆరోపణలపై పొవార్ స్పందన.. ఆ ప్రశ్నకు నీళ్లు నమిలిన కోచ్! మిథాలీ రాజ్ ఎప్పుడూ దూరంగా ఉండేది. ఆమెను హ్యాండిల్ చేయడం కష్టం. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటంతో, క్రికెట్ వ్యూహాల్లో భాగంగానే ఆమెను తప్పించామని చెప్పిన రమేశ్ పొవార్.. బీసీసీఐ ప్రతినిధులు అడిగిన ఆ ప్రశ్నకు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు. Samayam Telugu | Updated: Nov 28, 2018, 09:19PM IST మిథాలీ రాజ్ ఆరోపణలపై కోచ్ రమేశ్ పొవార్ స్పందించాడు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మిథాలిని తప్పించడం పూర్తిగా క్రికెట్ వ్యూహాల్లో భాగంగానే జరిగిందని పొవార్ తెలిపాడు. కోచ్ తనను వేధించాడని మిథాలీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సబా కరీంతో పొవార్ కలిశాడు. బుధవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో పొవార్ వీరితో భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా.. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మిథాలీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో పొవార్ బీసీసీఐకి వివరణ ఇచ్చాడు. మిథాలీ తనకు ఎప్పుడూ దూరంగా ఉండేదని, ఆమెను హ్యాండిల్ చేయడం కష్టమని పొవార్ తెలిపాడు. ఈ కారణంగానే తామిద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ దెబ్బతిందని బీసీసీఐకి ఆయన చెప్పినట్టు సమాచారం. క్రికెట్ వ్యూహంలో భాగంగానే సెమీఫైనల్లో మిథాలీని పక్కనబెట్టామని, ఆమెపై ఎలాంటి పగ లేదని పొవార్ తెలిపాడు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటం, విన్నింగ్ కాంబినేషన్ ఉండాలని మేనేజ్‌మెంట్ చెప్పడంతోనే.. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆమెను తప్పించామన్నాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఎయిర్ ఏషియా: రూ.999 కే టిక్కెట్లు మ‌లేషియ‌న్ ఎయిర్‌లైన్స్ సంస్థ‌ ఎయిర్ ఏషియా మ‌ళ్లీ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. రూ. 999కే దేశీయ ప్ర‌యాణ టిక్కెట్ల రేట్ల‌ను ప్ర‌క‌టించింది. Samayam Telugu | Updated: Sep 2, 2018, 09:26AM IST ఎయిర్ ఏషియా ఇండియా(ఏఏఐ)భారీగా డిస్కౌంట్స్ ప్రకటించింది. అంతర్జాతీయ ఫ్లైట్లకు రూ.1,399 తో ఛార్జీలు ప్రారంభం కానున్నాయి. డొమెస్టిక్ ఫ్లైట్స్ కు రూ.999 ప్రారంభ ధర. ఈ ఆఫర్ పరిమిత కాలంగా ఉంటుంది. ఎయిర్ ఏషియా గ్రూపునకు సంబంధించిన అన్ని ఫ్లైట్లలో ఈ ఆఫర్ వర్థిస్తుంది. ఇవాళ అర్థరాత్రి నుంచి టికెట్లు బుక్ చేసుకునేందుకు విండో ఓపెన్ కానుంది. ఇప్పుడు బుక్ చేసుకుంటే... వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 19 నుంచి నవంబర్ 26 మధ్యలో ప్రయాణం చేయవచ్చు. ఎయిర్ ఏషియా.కామ్, ఎయిర్ ఏషియా మొబైల్ ఆప్ ద్వారా టికెట్లు బుకింగ్ సౌకర్యం ఉంది. కౌలాలంపూర్, బ్యాంకాక్, సిడ్ని, ఆక్లాండ్ ,మెల్ బోర్న్ ,సింగపూర్, బాలి లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు ఈ అవకాశాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది ఎయిర్ ఏషియా భావిస్తోంది. భారత్‌లో 21 ప్రాంతాల నుంచి తన సర్వీసులను నడుపుతోంది.
1entertainment
misra , kuldeep మిశ్రా స్థానంలో కుల్‌దీప్‌ సింగ్‌ న్యూఢిల్లీ: టీమిండియాతో బంగ్లాదేశ్‌ ఈనెల 9న ఏకై కటెస్టు మ్యాచ్‌ ఆడనుంది.హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం ఈటెస్టుకు వేదిక కానుంది.ఈ నేపథ్యంలో టీమిండియా జట్టులో చిన్నమార్పుచోటు చేసుకుంది. క్రీడాకారుడు అమిత్‌ మిశ్రా గాయపడటంతో అతని స్థానంలో కుల్‌దీప్‌ సింగ్‌ను తీసుకున్నట్లు బిసిసిఐ ట్వీట్‌ చేసింది.భారత్‌,ఇంగ్లండ్‌ మధ్య టి20లో అమిత్‌ గాయపడ్డాడు. వైద్యుల సూచన మేరకు అమిత్‌కు విశ్రాంతి కల్పించిన సెలక్టర్లు అతని స్థానం లో కుల్‌దీప్‌సింగ్‌ను ఎంచుకున్నారు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఎగవేతదారుల నుంచి రూ.26,500 కోట్లు వసూలుచేసిన కేంద్రం పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహించి, పన్నులు ఎగ్గొట్టేవారిపై కేంద్ర కొరడా ఝలిపించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం పార్లమెంటులో ప్రకటించారు. TNN | Updated: Feb 10, 2018, 09:22AM IST పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహించి, పన్నులు ఎగ్గొట్టేవారిపై కేంద్ర కొరడా ఝలిపించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం పార్లమెంటులో ప్రకటించారు. నాన్-ఫైలర్ మోనిటరింగ్ సిస్టమ్ ద్వారా 1.7 కోట్ల పన్ను చెల్లింపుదారుల లక్ష్యాన్ని చేసుకున్నామని, డిసెంబరు నాటికి దీని వల్ల ఖజానాకు సుమారు రూ.26,500 కోట్లు అదనంగా చేరిందని జైట్లీ తెలిపారు. పార్లమెంటులో దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన జైట్లీ, గత కొన్నేళ్లుగా వివిధ సంస్థల సహాయంతో ఆదాయపు పన్ను శాఖ ఎగవేతదారులను గుర్తించి, చర్యలు తీసుకుంటోందని తెలియజేశారు. ఈ క్రమంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర వాణిజ్య లావాదేవీల వివరాలతో ఎగవేతదారులను గుర్తించినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. స్థిరాస్తి కొనుగోళ్లు, షేర్లు, బీమా, విదేశీ పర్యటనలకు సంబంధించి రూ.2 లక్షలు, అంతకు మించిన నగదు లావాదేవీలకు పాన్‌ను తప్పనిసరి చేశామని అన్నారు. దీంతో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేవారి వివరాలు ఐటీ శాఖకు చేరుతాయని జైట్లీ పేర్కొన్నారు. దీని వల్ల గతేడాది 35 లక్షల మంది పన్ను ఎగవేతదారులను గుర్తించామన్నారు. అయితే కిందటి ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 67 లక్షలకు తగ్గినా, పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను నిర్వహించినట్లు బయటపడిందని తెలిపారు. దీని వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామని, 1.25 కోట్ల మంది కొత్తగా తమ ఆదాయ వివరాలను తెలిపారని జైట్లీ ప్రకటించారు. గత రెండేళ్లలో ఆదాయపు పన్ను వసూళ్లలో భారీ పెరుగుదల నమోదైనట్లు తెలిపారు.. పన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 40శాతానికి పెరిగిందన్నారు.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ధోనీసేన ప్రపంచకప్‌ గెలిచి.. నేటితో 7 ఏళ్లు..! భారతీయుల 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకి ధోనీసేన తెరదించి నేటితో సరిగ్గా 7 ఏళ్లు. 1983లో తొలిసారి ప్రపంచకప్‌ని ముద్దాడిన భారత్.. ఆ Samayam Telugu | Updated: Apr 2, 2018, 02:57PM IST ధోనీసేన ప్రపంచకప్‌ గెలిచి.. నేటితో 7 ఏళ్లు..! భారతీయుల 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకి ధోనీసేన తెరదించి నేటితో సరిగ్గా 7 ఏళ్లు. 1983లో తొలిసారి ప్రపంచకప్‌ని ముద్దాడిన భారత్.. ఆ తర్వాత చాలాసార్లు సమీపానికి వెళ్లి బోల్తా కొట్టింది. అయితే.. 2011లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో అసాధారణ రీతిలో ప్రత్యర్థులపై విరుచుకుపడిన భారత్.. ఎట్టకేలకి మళ్లీ కప్‌ని చేజిక్కించుకోగలిగింది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు.. క్లిష్ట మ్యాచ్‌ల్లోనూ చూపిన తెగువకి దేశం మొత్తం నీరాజనం పలికింది. Visit Site Recommended byColombia 2011, ఏప్రిల్ 2న వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ జట్టులో మహేల జయవర్దనె (103: 88 బంతుల్లో 13x4) అజేయ శతకంతో రాణించాడు. ఫైనల్ కావడంతో.. 270+ భారత్‌కి చాలా పెద్దదిగా కనిపించింది. అప్పటి వరకు టోర్నీలో తాను ఆడిన తొలి బంతినే బౌండరీకి తరలిస్తూ భారత్‌‌కి మెరుగైన ఆరంభాలిచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ (0) తొలి ఓవర్‌లోనే డకౌటయ్యాడు. అనంతరం కొద్దిసేపటికే సచిన్ టెండూల్కర్ (18) కూడా పెవిలియన్ బాట పట్టడంతో భారత్ 31/2తో ఒత్తిడిలో పడిపోయింది. ఈ దశలో క్రీజులో ఒంటరి పోరాటం చేసిన గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4) శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతనికి కాసేపు అండగా నిలిచిన విరాట్ కోహ్లి (35) పేలవ రీతిలో ఔటవగా.. అనంతరం వచ్చిన మహేంద్రసింగ్ ధోనీ (91: 79 బంతుల్లో 8x4, 2x6) చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ భారత జట్టుని విజయతీరాలకి చేర్చేవరకూ పట్టువీడలేదు. అయితే.. శతకం ముంగిట గంభీర్ ఔటవగా.. చివర్లో యువరాజ్ సింగ్ (21 నాటౌట్)తో కలిసి ధోనీ చరిత్రాత్మక సిక్స్‌తో భారత్‌కి కప్‌ను అందించాడు. టీమిండియా 48.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘రోషగాడు’ టీజర్: వామ్మో.. పొగరుకే మొగుడట బిచ్చగాడు చిత్రంతో క్రేజీ హీరోగా మారిన విజయ్ ఆంథోని నటిస్తోన్న తాజా చిత్రం ‘రోషగాడు’. ఈ మూవీ టీజర్‌ను గురువారం నాడు విడుదల చేసింది చిత్రయూనిట్. Samayam Telugu | Updated: Oct 25, 2018, 07:51PM IST ‘రోషగాడు’ టీజర్: వామ్మో.. పొగరుకే మొగుడట ‘పుడింగిలే.. అవును పుడింగిలే.. పోలీస్‌లు అంటే పెద్ద పుడింగిలే.. మీరు రాత్రి పూట ఫ్యాన్ వేసుకుని హాయిగా నిద్రపోతుంటే కుక్కల్లాగ నిద్ర లేకుండా రోడ్ మీద మేం కాపలా కాస్తుంటాం కదా.. మేం పుటింగులమే’ అంటూ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో విజయ్ ఆంటోని ‘రోషగాడు’ టీజర్‌తో వచ్చేశాడు. పొగరురా.. పొగరురా.. పొగరుకే మొగుడురా.. అంటూ వస్తున్న థీమ్ సాంగ్ దమ్మున్న పోలీసోడు పవర్‌ ఏంటో చూపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ ఆంటోనీ నటన, అతడు చెప్పిన డైలాగ్స్, యాక్షన్ పార్ట్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
0business