news
stringlengths
299
12.4k
class
class label
3 classes
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV దీపావ‌ళికి 'గుంటూరోడు' ఓ లుక్కిచ్చాడు ! మంచు మనోజ్ ఘాటు మంచువారబ్బాయి మనోజ్ గుంటూరు వెళ్లి 'గుంటూరోడు' అయ్యాడు. అక్కడే కంచె లాంటి అమ్మాయితో లవ్ లో పడ్డాడు. ఈ దీపావ‌ళికి ఓ లుక్కిచ్చాడు. చూడండి ఈ గుంటూరోడి లుక్ ఎలా ఉందో... TNN | Updated: Oct 30, 2016, 11:54AM IST మంచు మనోజ్ ఘాటు మంచువారబ్బాయి మనోజ్, గుంటూరు వెళ్లి ' గుంటూరోడు ' అయ్యాడు. అక్కడే కంచె లాంటి అమ్మాయితో లవ్ లో పడ్డాడు. ఈ దీపావ‌ళికి ఓ లుక్కిచ్చాడు. చూడండి ఈ గుంటూరోడి లుక్ ఎలా ఉందో.. సిగరెట్ పొగతో హృదయాకారం చేసే దాంట్లోకి మిరపకాయ బాణం విసిరాడు. వైవిధ్యమైన సినిమాలు చేసే మంచు మనోజ్ ప్రస్తుతం 'ఒక్కడు మిగిలాడు' , సీతా మహాలక్ష్మీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇవేకాకుండా సత్య డైరెక్ట్ చేస్తోన్న 'గుంటూరోడు' సినిమాలో కూడా మనోజ్ నటిస్తున్నాడు. లవ్‌లో పడ్డాడు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా మొత్తం గుంటూరు నేపథ్యంలోనే సాగుతుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ​ ఈ సినిమాలో మనోజ్ పాత్ర గుంటూర్ మిర్చి లాగా ఘాటుగా ఉంటుందట. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది. 'కంచె' భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోటశ్రీనివాసరావు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్ప‌టికే టాకీ పార్టు పూర్తి చేసుకుంది. డిసెంబ‌ర్‌లో 'గుంటూరోడు' అన్ని ఊర్లకు రాబోతున్నాడు.
0business
Oct 10,2015 ఇండుస్‌ ఇండ్‌ బ్యాంకు లాభాల్లో 30% వృద్ధి ముంబయి : ప్రయివేటు రంగంలోని విత్త సంస్థ ఇండుస్‌ ఇండ్‌ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.30 శాతం వృద్ధితో రూ.560 కోట్ల నికర లాభాలు సాధించింది. 2014-15 ఇదే క్యూ2లో రూ.430.20 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. అధిక ఆదాయం లాభాల వృద్ధికి దోహదం చేసిందని ఆ బ్యాంకు పేర్కొంది. గత క్యూ2 నాటికి బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 0.77 శాతానికి తగ్గాయని పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికం నాటికి జిఎన్‌పిఎ 1.08 శాతంగా చోటు చేసుకుంది. క్రితం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు నికర ఎన్‌పిఎ కూడా 0.31 శాతానికి నియంత్రించింది. 2014 ఇదే త్రైమాసికంలో 0.33 శాతం నికర ఎన్‌పిఎ నమోదయ్యింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 88 Views పప్పు దినుసుల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలి న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: పప్పుదినుసుల ఉత్పత్తిని మరింత పెంచేందుకు గాను దేశంలో పప్పుదినుసుల ఎగుమతులు, నిల్వలపై పరిమితులు ఆంక్షలను ఎత్తివేసి కనీస మద్దతుధరలను నిర్ణయించాలని ప్రభుత్వ ప్రధాన ఆర్థికసలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణియన్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దేశంలో పప్పుదినుసుల కొరతను అధిగమించేందుకు వీలుగా వీటి సాగును మరింతప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ పంపిణీచేసిన ఈ నివేదికలో ఆర్థిక, వ్యవసాయ, వినియోగరంగ వ్యవహారా లు, ప్రధాని ప్రిన్సిపల్‌ కార్యదర్శిలతో కూడిన కమిటీని కూడా ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా పప్పుదినుసుల కొనుగోళ్ల తీరును తరచూ సమీక్షచేయాలని సూచించింది. అలాగే వ్యవసాయఉత్పత్తుల మార్కెట్‌ కమిటీలనుంచి పప్పు దినుసులను మినహాయించాలని సూచించారు. కిలోకు కనీస మద్దతుధరను 40 రూపాయలు పెంచాలని, రబీలో 60 రూపాయలు పెంచాలని సూచించిం ది. ఎక్కువ కంది, మినుము పంటలకు ఈ ధరలు పెంచాల్సిన అవసరం ఉం దని, ద్రవ్యోల్బణ ఆధారంగా వీటిధరలను తరచూ సవరించాలని సూచిం చింది. ఇతర పప్పుదినుసులపరంగా చూస్తే కిలోకు 70 రూపాయలు పెంచా లని 2018 నాటికి అమలుచేయాలని సూచించారు. ఖరీఫ్‌ సీజన్‌లో కంది పంటను స్వల్పకాలిక పంటగా సాగుచేస్తున్నందున వాణిజ్యపరమైన లావా దేవీలు పెంచాలని సూచించింది. ప్రతి పప్పుదినుసుల కేటగిరీలోను ప్రభుత్వం అన్నింటినీ కలిపి కనీసం 20 లక్షల టన్నుల నిల్వలను సిద్ధంచేసుకోవాలని ప్రణాళిక వేసింది. వీటిలో కంది 3.5 లక్షల టన్నులు, మినములు 2 లక్షల టన్నులనిల్వలు పెంచాలని నిర్ణయించింది. ఈ పరిమితులు అవసరాలకు అను గుణంగా పెంచుకోవాలని కూడా ఆర్థికసలహాదారు సూచించారు. ధరలు తక్కు వగా ఉన్నపుడు కొనుగోలుచేసి వీటిని నిల్వచేసుకోవాలని సిఫారసులుచేసింది. అలాగే పప్పుదినుసుల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని, టోకువర్తకుల వద్ద అతితక్కువ నిల్వలు ఉంచాలన్న నిబంధననుఎత్తివేయాలని సూచించింది. పప్పుదినుసుల సేకరణద్వారా తక్షణ అవసరాలను అధిగమించేందుకు కార్యా చరణ చేపట్టాల్సిఉంటుందని, మార్కెట్లలో ధరల స్థిరీకరణకు ప్రాధాన్యతనివ్వా లని, ధరలు కనీసమద్దతుధరకంటే ఎక్కువ కొనసాగేటట్లు చూడాలని సూచిం చింది. ప్రస్తుతం ధరలపరంగా మాంద్యంనెలకొంది. దేశంలో ఎక్కడ కొనుగోళ్ల ను చూసినా మందకొడిగానే జరుగుతున్నాయి. దీనివల్లనే రైతులు ఎక్కువగా తమ ఉత్పత్తులను మార్కెట్‌ధరలకు అనుగుణంగా విక్రయించుకోలేకపోతున్నా రని, కనీసమద్దతుధరకంటే తక్కువకే తెగనమ్ముకోవాల్సివస్తున్నదని సూచించారు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ధోనీ.. భారత్‌కు అరుదైన ఆరో క్రికెటర్! ఇంతకు ముందు ఇన్ని మ్యాచ్‌లు ఆడింది కేవలం ఐదుగురే.. వారు.. TNN | Updated: Aug 31, 2017, 01:04PM IST కొలంబో వేదికగా నేడు శ్రీలంకతో జరగనున్న వన్డే మ్యాచ్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి 300 మ్యాచ్ అనే అంశం భారతక్రికెట్ అభిమానులకు తెలియనిది ఏమీ కాదు. ధోనీని అమితాభిమానంతో ఆరాధించే, అభిమానించే అభిమానులు ఈ రికార్డు ఫీట్ గురించి అవగాహనతోనే ఉన్నారు. ఇటీవలే.. యువరాజ్ సింగ్ తన కెరీర్ లో మూడు వందల వన్డే మ్యాచ్ లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆ ఫీట్ ను సాధించిన ఐదో భారత క్రికెటర్ గా యువీ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ ఆరో ఆటగాడిగా ఆ జాబితాలో స్థానం సంపాదించబోతున్నాడు. మరి యువీ, ధోనీలకు ముందు కేవలం నలుగురు భారత క్రికెటర్లకే మూడొందలు, అంతకు మించిన సంఖ్యలో మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. ఆ నలుగురు ఎవరంటే.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మహ్మద్ అజారుద్ధీన్, సౌరవ్ గంగూలీ.
2sports
READ ALSO: వైరలైన ‘సెక్స్’ డైలాగ్.. తలపట్టుకున్న దర్శకుడు అయితే.. ఈ ఫొటోను చూసి ఫిదా అయిన మహిమ నంబియార్ అనే నటి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఇందూజను ప్రశ్నించారు. ఇందుకు ఇందూజ వెంటనే స్పందిస్తూ.. ‘వచ్చేయ్ ఇప్పుడే పెళ్లి చేసేసుకుందాం మై లవ్’ అన్నారు. ఇందూజ, మహిళ కలిసి ‘మహాముని’ సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. అయతే ఈ డిస్కషన్ ఇక్కడితో ఆగలేదు. వీరిద్దరి చాటింగ్ చూసి మరో హీరోయిన్ తోడైంది. ఆమే ప్రముఖ నటి అతుల్యా రవి. ‘నేను కూడా నీ కోసం వెయిట్ చేస్తున్నాను’ అని కామెంట్ చేశారు. దాంతో మహిళ రిప్లూ ఇస్తూ.. ‘ఓకే అతుల్య. ఎవర్ని పెళ్లి చేసుకుంటుందో ఇందూజ నిర్ణయానికే వదిలేద్దాం. ఒకవేళ తను నో చెబితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అని సరదాగా కామెంట్ చేశారు. READ ALSO: స్టార్ హీరోపై పిచ్చి ప్రేమ.. త్రిష ఏం చేసిందో తెలుసా? వీరి ముగ్గురి చాటింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయింది. నెటిజన్లైతే కామెంట్లతో పండగ చేసుకున్నారు. ‘మీరు మీరు పెళ్లిళ్లు చేసుకుంటే ఇక మా అబ్బాయిలు ఎందుకు’ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. బిజిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల చేత ‘విజిల్’ వేయించింది. బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టింది. ఏ.ఆర్ రెహమాన్ సినిమాకు మ్యూజిక్ అందించారు. హిందీలో షారుక్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా’ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను డైరెక్ట్ చేశారు అట్లీ. ఈ సినిమాకు షారుక్ కూడా ఫిదా అయిపోయారు. త్వరలో అట్లీ, షారుక్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Washington, First Published 11, Apr 2019, 2:29 PM IST Highlights ఏడాది క్రితం చైనా, భారత్ సహా పలు దేశాలతో వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన త్రుష్ణ తీరలేదన్నారు. తాజాగా ఈయూ దేశాల నుంచి దిగుమతయ్యే చీజ్, హెలికాప్టర్లపై సుంకాలు విధించారు. వాషింగ్టన్: తన వాణిజ్య యుద్ధాలు ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టమైన సందేశం పంపారు. వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్‌, వరల్డ్‌బ్యాంక్‌ స్ప్రింగ్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏర్పాటైన ఆర్థిక విధాన కర్తల సమావేశంలో ఆయన ఈ సంగతి తెలిపారు. ‘నా వాణిజ్య యుద్ధాలు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. బలహీన పడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవప్థను ఎదుర్కొని తీరాల్సిందే’ అని ట్రంప్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి దిగుమతి అయ్యే 11 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్లు, చీజ్‌ వంటి వాటిపై పన్నులు విధించారు.  ఒక పక్క చైనాతో ఒప్పందం చేసుకొనేందుకు చర్చలు జరుపుతూనే మరోపక్క వివిధ దేశాలతో ఉన్న వాణిజ్య ఒప్పందాలను పునర్‌ లిఖించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. దీంతో ట్రంప్‌ చర్యలపై ఆర్థిక వేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ వృద్ధిరేటు తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వచ్చే దిగుమతులపై విధించిన టారీఫ్‌లు బోయింగ్‌కు లాభించనున్నాయి. కొత్త టారీఫ్‌లు ఎయిర్‌బస్‌ వ్యాపారంపై ప్రభావితం చూపనున్నాయి. ఇది బోయింగ్‌కు కలిసి వస్తుంది.  దీంతో ఎయిర్‌ బస్‌ డబ్ల్యూటీవో తలుపు తట్టనుంది. దీంతో డబ్ల్యూటీవో తీర్పు కోసం అమెరికా ఎదురు చూస్తోంది. యూరప్‌ తీరుపై ట్రంప్‌ ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు. ‘అమెరికా వాణిజ్య విధానాలను ఈయూ బాగా వాడుకొంది. త్వరలోనే దానికి ముగింపు పడుతుంది.’’ అని ట్రంప్‌ మంగళవారం ట్విటర్లో పేర్కొన్నారు.
1entertainment
Hyderabad, First Published 2, Apr 2019, 3:03 PM IST Highlights రియల్ లైఫ్ లో లవ్లీ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య - సమంత చాలా రోజుల తరువాత వెండితెరపై జోడిగా కనిపించారు. మజిలీ సినిమా ఈ నెల 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  ఇక సినిమా సెన్సార్ పనులను కూడా ముగించుకొని పాజిటివ్ టాక్ ను అందుకుంది/.  రియల్ లైఫ్ లో లవ్లీ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య - సమంత చాలా రోజుల తరువాత వెండితెరపై జోడిగా కనిపించారు. మజిలీ సినిమా ఈ నెల 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  ఇక సినిమా సెన్సార్ పనులను కూడా ముగించుకొని పాజిటివ్ టాక్ ను అందుకుంది.  మజిలీ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇక గతంలో నాగ చైతన్య - సమంత మనం చిత్రం తరువాత చేసిన ఆటో నగర్ సూర్య డిజాస్టరయిన సంగతి తెలిసిందే. మళ్ళి అయిదేళ్ల తరువాత కలిసి నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించాలని చాలా సార్లు అనుకున్నప్పటికీ సరైన కథలు దొరకలేదు. ఇక ఫైనల్ గా శివ నిర్వాణ మజిలీ కథ చెప్పగానే సమంత ముందుండి సినిమాను పట్టాలెక్కించింది.  శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా టీజర్ ట్రైలర్ అలాగే సినిమా సాంగ్స్ కూడా పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. దీంతో సమంత - చైతు కాంబో హిట్ కొట్టడం పక్కా అని తెలుస్తోంది. వారి పాత్రలు తెరపై సరికొత్తగా కనిపిస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది. మరి ఈ సినిమా అక్కినేని కపుల్స్ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.  Last Updated 2, Apr 2019, 3:05 PM IST
0business
పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ First Published 28, Oct 2017, 12:05 PM IST పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ గ్యాలరీ Recent Stories
0business
Mumbai, First Published 7, May 2019, 5:34 PM IST Highlights లాభాల బాటలోనే నడిచినట్లు అనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, దేశీయంగా జోరుగా కొనసాగిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేశాయి.  ముంబై: లాభాల బాటలోనే నడిచినట్లు అనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, దేశీయంగా జోరుగా కొనసాగిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేశాయి. దీంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి.  సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ 11,500 మార్క్‌ను కోల్పోయింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడం కూడా అంతర్జాతీయ మార్కెట్లను దెబ్బతీశాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.  మంగళవారం ఉదయం బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లు రాణించడంతో సూచీలు లాభాల బాటాలో నడిచాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 200 పాయింట్ల వరకు లాభపడింది. నిఫ్టీ కూడా 11,600పైన ట్రేడ్ అయ్యింది. అయితే, మధ్యాహ్నం నుంచి మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి.  టాటా మోటార్స్, ఐటీసీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటి దిగ్గజ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. దీంతో చివర గంటలోనే మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి.    మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 324 పాయింట్లు పతనమై 38,276 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 11,497 వద్ద స్థిరపడ్డాయి. ఫిబ్రవరి తర్వాత భారీ పతనం ఇదే కావడం గమానర్హం. Last Updated 7, May 2019, 5:34 PM IST
1entertainment
Kashmiri separatists celebrations for Pakistan winning over england పాక్ గెలిస్తే.. కశ్మీర్‌లో పటాకుల మోత వినొచ్చు! క‌శ్మీరీ వేర్పాటు వాద నేత మిర్వేజ్ ఉమ‌ర్ ఫ‌రూక్.. పాక్‌కు ఫైన‌ల్లో ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. TNN | Updated: Jun 15, 2017, 03:09PM IST ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో పాక్ జట్టు అతిథ్య ఇంగ్లండ్‌ను మట్టకరిపించి ఫైనల్‌కి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌ క్రికెట్ ప్రియులు సంబరాలు చేసుకోవడం సాధారణమే. కానీ, మన దేశంలోని కశ్మీర్‌లోనూ కొంత మంది పాక్ గెలిచినందుకు పటాకులు కాల్చి మరి పండగ చేసుకున్నారు. వీళ్ల‌కు వేర్పాటు వాదులు కూడా తోడవ్వడంతో సంబరాలు అంబరాన్నంటాయి. సెమీఫైనల్‌లో గెలిచినందుకు సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌కు శుభాకాంక్ష‌లు కూడా చెప్పారు. క‌శ్మీరీ వేర్పాటు వాద నేత మిర్వేజ్ ఉమ‌ర్ ఫ‌రూక్.. పాక్‌కు ఫైన‌ల్లో ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ఫైనల్లో పాక్ విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చినప్పుడు క‌శ్మీర్‌లో ఇంతకంటే పెద్దగా ప‌టాకుల మోత వినొచ్చ‌ని అతడు పేర్కొన్నాడు. As we were finishing taraweeh,could hear the fire crackers bursting, well played team #Paksitan . Best of luck for the finals! — Mirwaiz Umar Farooq (@MirwaizKashmir) June 14, 2017 ఇవాళ (జూన్ 15) రెండో సెమీ ఫైన‌ల్లో భారత్.. బంగ్లాపై గెలిస్తే, ఫైన‌ల్లో పాక్‌తో త‌ల‌ప‌డ‌నున్న విషయం తెలిసిందే. క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న తంతుపై భారత అభిమానులు గుర్రుగా ఉన్నారు. సొంత దేశం గెలిస్తే ఏమీ ప‌ట్ట‌న‌ట్లుండే క‌శ్మీర్ వాసులు.. శ‌త్రు దేశం గెలిస్తే ప‌టాకులు పేల్చి సంబురాలు జరుపుకోవడం పట్ల కొంత మంది మండి పడుతున్నారు. దీనికి టీమిండియా.. తన ఆటతీరుతోనే సమాధానం చెబుతుందని కొంత మంది వ్యాఖ్యానించారు.
2sports
Oct 11,2015 పెరిగిన 'పరోక్ష' వసూళ్లు       న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల వసూళ్లలో మెరుగైన పెరుగుదల నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వపు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింగ్‌ సబ్రమణ్యన్‌ అన్నారు. సెప్టెంబరుతో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధ భాగంలో పరోక్ష పన్నుల వసూళ్లు 35.8 శాతం (కొత్త చర్యలను పరిగణనలోకి తీసుకోకుండా 11.5 శాతం) మేర పెరిగాయనీ ఆయన వివరించారు. ఇవి దేశపు బలమైన వృద్ధిని ప్రతిబింబిస్తున్నాయని ఆయన వివరించారు. ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్యకాలంలో పరోక్ష పన్నుల వసూళ్లు వార్షిక వృద్ధైన 50 శాతాన్ని దాటేస్తూ.. రూ.3.24 లక్షల కోట్లకు చేరాయన్నారు. డీజిల్‌, పెట్రోలుపై ఎక్సైజ్‌ సుంకం పెంపు, మోటారు వాహనాలపై పన్ను మినహాయింపులను ఎత్తివేయడం, క్లీన్‌ ఎనర్జీ సెస్‌లో పెరుగుదలతో పాటు జూన్‌ నుంచి సేవా పన్ను పెరుగదల కారణంగా ఈ వృద్ధి నమోదు అయినట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.6.47 లక్షల కోట్ల మేర పరోక్ష పన్నులను వసూళు చేయాలని కేంద్ర ప్రభుత్వ తొలత బడ్జెట్‌లో నిర్ణయించుకుంది. ఇది అంతకు ముందు ఏడాది కంటే కూడా ఇది 18.8 శాతం అధికం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sensex 30 వేల పాయింట్ల సెస్సెక్స్‌కు పదేళ్లు ముంబయి: పదేళ్లక్రితం 20వేల పాయింట్లస్థాయిలో ఉన్న సెన్సెక్స్‌ 30వేల పాయింట్లు చేరుకోవడానికి పదేళ్లకాలం పట్టిందనే చెప్పాలి. ఇటీవలి కాలంలో సెన్సెక్స్‌ కీలకమైన 30వేలపాయింట్లకు చేరువ అయినట్లే అయిమళ్లీ దిగజారిన సంగతి తెలిసిందే. పశ్చిమ ఆసియా, మధ్యతూర్పుదేశాల్లో ఉన్న అనిశ్చితి భౌగోళిక ఉత్కంఠలు మినహా ప్రపంచ దేశాల నుంచి పెద్దగా వ్యతిరేకతలు ఏమీ కనపడించలేదు. ందుకే సెన్సెక్స్‌ పరుగులు పెడుతుందన్న అంచనాలు ఎక్కువ వినిపించాయి. అయితే చివరి పదివేల పాయింట్లను అధిగమించేందుకు దశాబ్దం పట్టినాముందు మాత్రం సెన్సెక్స్‌ పరుగులు తీసిందని నిపుణుల అంచనా. మొదటిసారిగా సెన్సెక్స్‌ ఫిబ్రవరి 2006లో పదివేల పాయింట్ల మార్క్‌ను దాటింది. ఆ తర్వాత 2008 కొత్త సంవత్సరం నాటికే అంటే రెండేళ్లలోపే మరో పదివేల పాయింట్లను అధిగమించింది. పదివేల పాయింట్లనుంచి 20 వేల పాయింట్లుకు చేరుకునేందుకు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే సాధ్యం అయితే ఇపుడు మరో పదివేల పాయింట్లు రాబట్టేందుకు పదేళ్లకాలం పట్టింది. అంటే మందగమనంతో నడిచినట్లేనని భావించాలి. కేవలం 50శాతం రిటర్నులకోసం పదేళ్లకాలం ఎదురు చూడా ల్సి వచ్చిందంటే ఆర్థికవ్యవస్థలో మందగమనమే కారణమని భావించాలి. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, లేమాన్‌ బ్రదర్స్‌ పతనం వంటివి 2008-2009 మధ్యకాలంలో మార్కెట్లను శాసించాయి. ఫలితంగా సెన్సెక్స్‌ తొమ్మిదివేల పాయింట్ల కనిష్టస్థాయికి చేరింది. డౌజోన్స్‌కు 17 ఏళ్లుపట్టింది. అదే సమయంలో అమెరికా మార్కెట్ల సూచీ డౌజోన్స్‌ను పరిశీలిస్తే ఈ సూచి పూర్తి ర్యాలీలో ఉన్న సమయంలో తొలిసారి 1999లో పదివేల పాయింట్లను అందుకున్నది. 2017 ప్రారంభంలోనే 20వేల పాయింట్లను చేరు కున్నది. అంటే రెట్టింపుస్థాయిని చేరుకునేందుకు డౌజోన్స్‌కు 17ఏళ్లకాలం పట్టిందనే చెప్పాలి. సెన్సెక్స్‌ 20వేల పాయింట్ల దశలో ఉన్నకాలంలో ఎసిసి, భారత్‌ టెలీ, భెల్‌, సిప్లా, డా.రెడ్డీస్‌, గ్రాసిం, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సిబ్యాంకు, హీరోహోండా, హిందా ల్కో, హెచ్‌ఎఎల్‌, ఐసిఐసిఐబ్యాంకు, ఇన్ఫోసిస్‌, ఐటిసి, ఎల్‌అండ్‌టి, మారుతి ఎన్‌టి పిసి, ఒఎన్‌జిసి, రాన్‌బాక్సీరిలయన్స్‌, రిలయన్స్‌ఎనర్జీ, రిలయన్స్‌కమ్యూనిక్స్‌, సత్యం కంప్యూటర్స్‌, ఎస్‌బిఐ టాటామోటార్స్‌, టిసిఎస్‌ టాటాస్టీల్‌ విప్రో వంటివి సెన్సెక్స్‌లో కొనసాగాయి. అయితే ఇపుడు ఏసియన్‌పెయింట్స్‌, అదానిపోర్ట్సు, కోల్‌ ఇండియా, లూపిన్‌, మహీంద్ర అండ్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, గెయిల్‌, యాక్సిస్‌బ్యాంకు అంటూ ఎనిమిది కొత్తస్టాక్స్‌ సెన్సెక్స్‌లో జతకాగా ఎసిసి గుజరాత్‌ అంబూజా, గ్రాసిమ్‌, రాన్‌బాక్సీ, రిలయన్స్‌ ఎనర్జీ, సత్యం రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ హిందాల్కో షేర్లు సెన్సెక్స్‌జాబితాననుంచే వైదొలిగాయి. గడచిన పదేళ్లలో ప్రభుత్వరంగం నుంచి పనితీరు ఆశాజనకంగా ఉంది. మూలధనం పెరగడంలో కాకుండా డివిడెండ్స్‌ రూపంలో ఇన్వెస్టర్ల కు మంచి రాబడులు అందించాయి. 2010లో ఐపిఒకి వచ్చినపుడు కోల్‌ ఇండియా అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌ గెయిల్‌ సూచీలోనికి ప్రటిష్టంగా ప్రవేశించింది. సిమెంట్‌ రంగానికి ఈసమయంలో డిమాండ్‌ భారీగా తగ్గింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌నుంచి తొలగించిన స్టాక్స్‌లో అనిల్‌ధీరూభా§్‌ు అంబానీగ్రూప్‌ స్టాక్స్‌ ఉన్నాయి. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌కమ్యూనికేషన్స్‌ వంటివాటికారణంగా ఇన్వెస్టర్లు ఇబ్బందులు పడ్డారన్న భావ నలు అప్పట్లో వెల్లువెత్తాయి. రికార్డుల్లో ఎనిమిదివేల కోట్ల లోటుచూపించిన సత్యం కంప్యూటర్స్‌ ఇదే జాబితాలోంచి వైదొలిగింది. అదానిగ్రూప్‌ షేర్లు పలుకారణాలతో తిరిగి ప్రవేశించాయి. మహీంద్ర స్టాక్‌సెన్సెక్స్‌లోకి వచ్చింది. యాక్సిస్‌బ్యాంకు, మరోబ్యాంక్‌తో విలీన ప్రతిపాదనలు కొనసాగిస్తుండటంతో మరో కంపెనీ కూడా ప్రవేశించేందుకు రూట్‌ క్లియర్‌ అవుతోంది. పనితీరు మెరుగుపడలేకోతున్న స్టాక్స్‌ను తొలగించడం కూడా సెన్సెక్స్‌ ఈ స్థాయిని అందుకోవడానికి కారణంగా చెప్పవచ్చు. గతంలో పదివేల పాయింట్లను సెన్సెక్స్‌ రెండేళ్లలో అందుకుందంటే అందుకు చాలా కారణాలున్నాయి. ఇపుడు మరో పదివేల పాయింట్లు పెంచుకునేందుకు పదేళ్ల వ్యవధిపట్టిందంటే సెన్సెక్స్‌ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనట్లు భావించాలి. అలాగే ఇన్వెస్టర్లు కూడా ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదుర్కొన్నట్లే భావించాలి. ఇన్వెస్టర్లు మార్కెట్లలో ఆచితూచి వ్యవహరిస్తుండటం వల్లనే సెన్సెక్స్‌ ఎదుగుదలకు మరింత వ్యవధి పడుతున్నదన్న భావన బ్రోకింగ్‌, ట్రేడింగ్‌, రేటింగ్‌ విశ్లేషణ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి.
1entertainment
Visit Site Recommended byColombia 2006లో హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో గత 12 సీజన్లుగా టాప్ రియాలిటీ షోగా వర్ధిల్లుతోంది. 2019 నాటికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా అవతరించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో విస్తరించింది. Read Also: ‘బిగ్ బాస్’ సీజన్ 3 కంటెస్టెంట్స్.. పటాసుల్లాంటి 15 మంది ఈ షోకి తెలుగులోనూ మంచి ఆదరణ ఉండటంతో గత రెండు సీజన్లుగా ప్రారంభమైంది. 2017 జూలై 16న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో బుల్లి తెరపై బిగ్ బాస్ సన్సేషనల్ హిట్ అయ్యింది. టాప్ రేటింగ్‌తో టీఆర్పీ రేటింగ్‌లో అగ్రభాగాన నిలిచింది. 70 రోజుల పాటు 16 మంది కంటెస్టెంట్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించింది. Read Also: Tv9 జాఫర్ ‘సంభ్రమాశ్చర్యం’‌తో నెటిజన్ల చెడుగుడు బిగ్ బాస్ 1లో పాల్గొన్న పోటీదారులు: అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, జ్యోతి, సింగర్ కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తీక, శివ బాలాజీ, ఆదర్శ్, హరి తేజ, ధనరాజ్, దీక్ష(వైల్డ్ కార్డ్), నవదీప్ (వైల్డ్ కార్డ్). ఈ 16 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్నారు. వీరిలో ఫైనల్ కన్టెస్టెంట్స్‌గా ఆదర్శ్, శివబాలాజీ, హరితేజ, నవదీప్, అర్చనలు పోటీ పడగా.. శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్‌గా నిలిచి రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ గెలుచుకున్నారు. Episode 02 Updates: బిగ్ బాస్ తొలి నామినేషన్‌లో శ్రీముఖితో పాటు ఐదుగురికి ఎర్త్ ఇక రెండో సీజన్ విషయానికి వస్తే.. 2018 జూన్‌లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభమైంది. ఈ సీజన్‌లో గీతా మాధురి, అమిత్ తివారీ, దీప్తి, తనీష్, బాబు గోగినేని, భాను శ్రీ, రోల్ రైడా, యాకర్ శ్యామల, కిరీటి, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి, గణేష్, సంజనా అన్నే, నూతన్ నాయుడు, నందినిలు కంటెస్టెంట్స్‌గా ఉండగా.. బుల్లి తెర నటుడు కౌశల్ బిగ్ బాస్ 2 విన్నర్‌గా అవతరించాడు. బిగ్ బాస్ సీజన్ 1, 2లు బుల్లితెరపై రేటింగ్స్‌ను కొల్లగొట్టగా.. సీజన్ 1 కంటే సీజన్ 2లో కాస్త ఊపు తగ్గిందని.. కంటెస్టెంట్స్ వీక్‌గా ఉండటంతో పాటు నాని హోస్టింగ్ ఎన్టీఆర్ కంటే మెరుగ్గా లేకపోవడంతో ఆడియన్స్ ఊహించినంత ఎంటర్‌టైన్మెంట్‌ను అందించలేకపోయింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 3ని బాధ్యతల్ని తీసుకున్నారు కింగ్ నాగార్జున. ‘మనసు కోతి లాంటిది.. మరి అలాంటి మనసున్న కొంతమంది మనుషులు ఒక ఇంట్లో చేరితే.. మమకారంతో వెటకారంతో వాళ్లను ఏకతాటిపైకి తీసుకువచ్చేది ఎవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహం నింపే శక్తిగల వ్యక్తి ఎవరు?.. అతను ఎవరో కాదు.. నేనే’ మీ కింగ్ నాగార్జున అంటూ బుల్లితెరపై సందడి చేసేందుకు వచ్చేశారు హోస్ట్ నాగార్జున. ఆ షో వివరాలు.. లేటెస్ట్ అప్డేట్స్ కొనసాగుతాయి. ✦ బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో ‘నడిచే స్టైల్ ఏమో రాకింగ్’ అంటూ కింగ్ సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ✦ వస్తూ రావడంతోనే షోకి గ్లామర్ ఇచ్చిన నాగార్జున.. గత రెండు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్, నానికి థాంక్స్ చెప్పారు. ✦ ఇక ఎంట్రీలోనే ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. గత రెండు సీజన్ల మాదిరిగా కాకుండా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చే 15 మంది కంటెస్టెంట్స్‌ని మీరే సెలెక్ట్ చేయాలంటూ నాగార్జునను బిగ్ బాస్ ఆదేశించారు. ✦ సెలెక్ట్ చేసిన చీటీలలో నుండి ఒక చీటీ తీసి తీన్మార్ సావిత్రి (శివజ్యోతి) ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌస్‌కి తీసుకువచ్చారు. ✦ రెండో కంటెస్టెంట్‌గా టీవీ యాక్టర్ రవిక్రిష్ణ ఎంట్రీ ఇచ్చారు. ✦ మూడో కంటెస్టెంట్‌గా డస్మాష్ స్టార్ అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. ✦ ఇక తొలి కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన తీన్మార్ సావిత్రి మాటల పటాసులు పేల్చడం మొదలు పెట్టింది. ✦ బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ కోసం ఉంచిన బెడ్స్‌లో సింగిల్ బెడ్‌ను ఎంచుకుంది సావిత్రి ✦ ఇక వచ్చీ రావడంతో ముగ్గురు కంటెస్టెంట్‌కి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ ✦ రాబోయే మిగిలిన సెలబ్రిటీలను అడిగేందుకు కొన్ని ప్రశ్నలు ఉంచామని వాటిని అడగాలంటూ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ ✦ ఇక నాలుగో సెలబ్రిటీగా టీవీ 9 యాంకర్ జాఫర్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ✦ అందర్నీ ప్రశ్నలు అడిగి విసిగించే జాఫర్‌ని అతని స్టైల్‌లోనే ప్రశ్నలు అడిగారు నాగార్జున. ✦ ఇక ఎప్పుడైనా తప్పుడు ఇంటర్వ్యూలు చేశారా అంటే అబ్బో చాలా చేశా అంటూ సమాధానం ఇచ్చారు జాఫర్. ✦ ఐదో సెలబ్రిటీగా బుల్లెట్ మీద వచ్చె బుల్ రెడ్డి అంటూ ఊరమాస్ సాంగ్‌తో గ్లామర్ ఎంట్రీ ఇచ్చింది హిమజ. ✦ నాగార్జునను తొలిసారి దగ్గర నుండి చూసిన హిమజ ఆనందంతో పొంగిపోయింది ఈ గుంటూరు సుందరి. ✦ నాగ్‌ని అడిగి మరీ ఓ సారి టచ్ చేయండని.. నమ్మలేకపోతున్నా ఒళ్లు చల్లబడిపోయింది అన్నారు హిమజ. ✦ ఇక బిగ్ బాస్ హౌస్‌కి పంపుతూ.. హగ్ ఇచ్చారు నాగార్జున ✦ ఆరో సెలబ్రిటీగా రాహుల్ సిప్లిగంజ్‌ హుషారైన సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ✦ నాగార్జున అడిగిమరీ ఆయనతో మరో పాట పాడించుకున్నారు ✦ ఇక హౌస్‌కి వెళ్లిన తరువాత కూడా పాటతో హుషారెత్తించారు రాహుల్ ✦ రాహుల్ ఎంట్రీ తరువాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ మన్మథుడినే మెప్పించిందే ఏడో కంటెస్టెంట్ రోహిణి. ✦ సోగ్గాడే చిన్నినాయనా అని పిలిచావ్..గా వచ్చాడు ఏం ఇస్తావ్ అని నాగార్జున అడగడంతో ‘మీరు ఏం అడిగినా ఇచ్చేస్తా’ అంటూ సిగ్గు మొగ్గైంది రోహిణి. ✦ మీరు ఏం ఇస్తావ్ అని అడగాల్సిన అవసరం లేదని.. ఇవ్వడానికి బోలెడు మంది రెడీగా ఉంటారు అంటూ ఎంట్రీలోనే అదరగొట్టింది రోహిణి. ✦ ఎనిమిదో కంటెస్టెంట్‌గా అదిరిపోయే స్టెప్‌లో స్టేజ్‌ను షేక్ చూస్తూ సూపర్ ఎంట్రీ ఇచ్చారు బాబా భాస్కర్ ✦ తొమ్మిదో కంటెస్టెంట్‌గా గ్లామర్ బ్యూటీ, ఉయ్మాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం డాన్స్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చింది. ✦ పదో కంటెస్టెంట్ గా నటి, పాపులర్ సెలబ్రిటీ హేమ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చింది. ✦ కింగ్ నాగార్జున ఆమెకు స్వాగతం పలుకుతూ వంట వచ్చా అని అడగడంతో చింపేస్తా.. అని సమాధానం ఇచ్చింది. ✦ బిగ్ బాస్ హౌస్‌లో కిచెన్‌ని స్వాధీనం చేసుకుంటా అనేసింది హేమ ✦ పదకొండో కంటెస్టెంట్‌గా అలీ రజా సిక్స్ ప్యాక్‌తో నడిచే స్టైల్ ఏమో రాకింగ్ అంటూ స్టైలిష్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ✦ 12 కంటెస్టెంట్‌గా కమెడియన్ మహేష్ విట్టా అదిరే ఎంట్రీ ఇచ్చారు.. వచ్చీ రావడంతోనే సీమ స్లాంగ్‌‌తో అదరగొట్టారు మహేష్ విట్టా. ✦ ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బుల్లితెర రచ్చపాప.. యాంకర్ శ్రీముఖి 13 కంటెస్టెంట్‌గా అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్‌తో స్టన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది శ్రీముఖి. ✦ స్టేజ్‌పై ఉన్నంత సేపూ హుషారెత్తించి శ్రీముఖి. ఇక బిగ్ బాస్ షో కి ఎందుకు వచ్చావు బిజీ షెడ్యూల్ వదలేసి అని నాగార్జున అంటే.. నాకు బిగ్ బాస్ కాన్సెప్ట్ అంటే చాలా అంటూ బదులిచ్చింది శ్రీముఖి. ✦ శ్రీమఖితో పాటు వచ్చిన అతని సోదరుడు.. ఒకసారి మా అక్కను హగ్ చేసుకుంటా అని నాగార్జునని రిక్వెస్ట్ చేయడంతో.. తప్పకుండా రండి.. బట్ మీరు నన్ను హగ్ చేసుకోండి. నేను తనని హగ్ చేసుకుంటా అనీ చమత్కరించారు నాగ్. ✦ అనంతరం స్టేజ్ పైకి వచ్చిన శ్రీముఖి సోదరుడు ఆమెను హగ్ చేసుకోగా.. నాగ్ సరదాగా అన్నాలే అని అతనికి హగ్ ఇచ్చారు. ✦ ఇక తొలి నుండి బిగ్ బాస్ షో కంటెస్టెంట్‌గా తొలి నుండి ప్రచారంలో ఉన్న కపుల్ జంట.. వరుణ్ సందేశ్, వితికా షెరు.. నిజంగా నేనేనా అంటూ అనే పాటతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ✦ ఇక స్టేజ్‌పైకి వచ్చిన తరువాత మీ ప్రేమకథ ఎలా మొదలైంది అని వరుణ్, వితికా షెరు లవ్ స్టోరీని అడిగితెలుసుకున్నారు. ✦ కపుల్‌గా ఎంట్రీ ఇచ్చిన మీరిద్దరూ ఫైనల్‌కి వస్తే ఏం చేస్తారు అని వితికాని నాగార్జునని అడగ్గా.. నేను గెలవాలనుకుంటా అంది. ✦ అదే ప్రశ్న వరుణ్‌ని అడిగితే.. తను గెలిచినా నేను గెలిచినట్టే ఎవరు గెలిచినా పర్లేదని ఆకట్టుకున్నారు వరుణ్ సందేశ్. ✦ కాగా.. బిగ్ బాస్ స్టేజ్ నుండి మీ భార్యను ఎత్తుకుని బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లగలవా? అని నాగార్జున అడగడంతో.. వితికాని ఎత్తుకుని బిగ్ బాస్ హౌస్‌కి తీసుకుని వెళ్లాడు వరుణ్. ✦ ఇక నేటి ఎపిసోడ్ మొత్తం కంటెస్టెంట్స్ 15 మంది హౌస్‌లో ఎంట్రీ ఇవ్వగా.. రేపటి ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ ఉండబోతుంది. ఎంట్రీ ఇచ్చి ఒకరోజు పూర్తి కాగానే.. శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షెరు, బాబా భాస్కర్, జాఫర్లను నామినేట్ అయ్యారంటూ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ ఐదుగురు షాక్‌‌లో ఉండగా.. మూడో సీజన్ తొలి ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడింది. ✦ అయితే బిగ్ బాస్ నామినేట్ అన్నారు కాని.. అది ఎలిమినేషన్‌ కోసమేనా అన్నది ట్విస్ట్‌గా మారింది. బిగ్ బాస్ సీజన్ 3 పూర్తి వివరాలు ఎపిసోడ్‌ల వారీగా..
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV విశాల్ ‘డిటెక్టివ్’ యమ యాక్టివ్ తెలుగు మాస్ అభిమానులు ఇష్టపడే తమిళ హీరోల్లో హీరో విశాల్‌ కూడా ఒకరు. గతంలో ఆయన నటించిన పందెంకోడి, పొగరు, భరణి చిత్రాలు తెలుగులోనూ మంచి వసూళ్లను రాబట్టాయి. TNN | Updated: Sep 19, 2017, 07:56PM IST విశాల్ ‘డిటెక్టివ్’ యమ యాక్టివ్ తెలుగు మాస్ అభిమానులు ఇష్టపడే తమిళ హీరోల్లో హీరో విశాల్‌ కూడా ఒకరు. గతంలో ఆయన నటించిన పందెంకోడి, పొగరు, భరణి చిత్రాలు తెలుగులోనూ మంచి వసూళ్లను రాబట్టాయి. అయితే ఎప్పుడూ మాస్‌ కమర్షియల్‌ జోనర్‌లోనే మూసదోరణితో సినిమాలు తీస్తుండటంతో ఈమధ్య కాలంలో ఈ హీరోని సరైన హిట్ పలకరించలేదు. దీంతో మనోడు సరికొత్త జోత్త జోనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ‘తుప్పారివాలన్’ మూవీ తమిళ్‌లో సెప్టెంబర్ 14 న విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించి హిట్ చిత్రాల లిస్ట్‌లో నిలిచింది. విశాల్ డిటెక్టివ్‌ అవతారంలో ఇంతకు ముందెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్‌లో అదరగొట్టేస్తున్నాడు. తమిళ్‌లో 'తుప్పరివాలన్‌'గా విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘డిటెక్టివ్’గా అక్టోబర్‌లో విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''తమిళ్‌లో 'తుప్పరివాలన్‌' పేరుతో రూపొందిన ఈ చిత్రం ఈవారం విడుదలై మొదటి వారంలోనే 30 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేస్తోంది. విశాల్‌ కెరీర్‌లోనే మొదటివారం హయ్యస్ట్‌ కలెక్షన్‌ సాధించిన చిత్రంగా 'తుప్పరివాలన్‌' రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని 'డిటెక్టివ్’పేరుతో విడుదల చేస్తూ.. డిటెక్టివ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసాము. ఈ చిత్రం తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. మాస్‌ హీరో విశాల్‌, అను ఇమ్మానుయేల్‌, ఆండ్రియా, ప్రసన్న, కె.భాగ్యరాజ్‌, సిమ్రాన్‌, జాన్‌ విజయ్‌, అభిషేక్‌ శంకర్‌, జయప్రకాష్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్‌ కొరెల్లి, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ వెంకట్రామన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్‌. ​   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Stoke market స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ మద్దతు ముంబై, : కేంద్రబడ్జెట్‌లో కొన్ని సానుకూల అంశాలు లభించడంతో స్టాక్‌ మార్కెట్లు బడ్జెట్‌ అంచనాలకు అనుగు ణంగానే పెరిగాయి. ఆర్థిక మంత్రి ప్రసంగంముగించే సరికే నిఫ్టీ, సెన్సెక్స్‌ రెండూ కూడా సాలనుకూలంగా పెరిగాయి. నిఫ్టీ 8700 స్థాయిని దాటగా బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 28వేల పాయింట్లస్థాయిని అధిగమించింది. దీర్ఘకాలిక మూలధన లబ్దిపై పన్ను వంటి వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా ఆర్థికలోటును 3.2శాతానికి తీసుకురావడం మంచిపరిణామంగా ఇన్వెస్టర్లు, ట్రేడ ర్లు భావించారు. సెన్సెక్స్‌ 486 పాయింట్ల ఎగు వన 28,141 పాయింట్లవద్ద స్థిరపడగా నిఫ్టీ 50 సూచి 155 పాయింట్ల ఎగువన 8716 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 1.7శాతం గరిష్టంగా పెరిగాయి. మార్కెట్లలో బిఎస్‌ఇపరంగాచూస్తే 1920 కంపెనీ లు లాభపడితే 901 కంపెనీలు స్వల్పంగా క్షీణిం చాయి. మొత్తంగా 111 కంపెనీలషేర్లు స్థిరంగా నిలి చాయి. ఇదొక కీలకమైన, సమర్ధవంతమైన బడ్జెట్‌ గా రేటింగ్‌సంస్థలు చెపుతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ ను పాటించిందని, స్థూల ఆర్థికవ్యవస్థపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అత్యధికశాతం జన అంచనాలకు అనుగుణంగా నడిచిందన్నారు. ఆర్థికలోటు 3.2 శాతం రానున్న సంవత్సరంలో 3శాతానికి పరిమి తం చేయడం అనేది కీలకం అవుతున్నదని ఏంజెల్‌ బ్రోకింగ్‌ సిఎండి దినేష్‌ ఠక్కర్‌ అన్నారు. ఎరువు లు, నీటిపారుదలరంగాలకు చెందిన కంపెనీల షేర్లు మూడుశాతం నుంచి ఏడుశాతంవరకూ పెరిగాయి. వ్యవసాయరంగం వచ్చే ఏడాది 4.1శాతానికి వృద్ధి సాధిస్తుందని అంచనా జరిగింది. దీపక్‌ ఫర్టిలైజర్స్‌, పెట్రోకెమికల్స్‌ 7.3శాతం పెరిగాయి. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ 5.2శాతం పెరిగింది. మద్రాసు ఫెర్టి లైజన్స్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ 5శాతం, మూడు శాతం చొప్పున పెరిగాయి. రియల్‌ఎస్టేట్‌కంపెనీలు ఏడుశాతం పెరిగాయి. రియాల్టీరంగానికి బడ్జెట్‌లో ఊతం ఇవ్వడమే ఇందుకుకీలకం. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, యూనిటెక్‌, ఓబరా§్‌ు రియాల్టీ, డిఎల్‌ఎప్‌, హౌసింగ్‌ డెవలప్‌ మెంట్‌ ఇన్‌ఫ్రా (హెచ్‌డిఐఎల్‌) ప్రెస్టిజ్‌ఎస్టేట్స్‌ ప్రాజెక్టుల పరంగా రియాల్టీ సూచీలో 2 నుంచి ఏడు శాతం పెరిగాయి. బిఎస్‌ఇ ఆయిల్‌గ్యాస్‌ సూచి కూడా 1.5శాతం పెరిగింది. ఐఒసి, బిపిజిఎల్‌, హెచ్‌పిసిఎల్‌ 2.5శాతం, 1.8శాతం, 3.4శాతం పెరిగాయి. ఆటోమొబైల్‌ కంపెనీలు పరంగా కూడా ఐదుశాతం పెరిగాయి. మహీంద్ర అండ్‌ మహీం ద్ర, మారుతిసుజుకి ఇండియా ఐదుశాతం పెరిగిం ది. 1298రూపాయలు, 6170 రూపాయలుగా పెరిగాయి. టాటా మోటార్స్‌, హీరోమోటోకార్ప్‌, ఐషర్‌మోటార్స్‌, టివిఎస్‌మోటార్‌ కంపెనీ రెండు, నాలుగుశాతం మేర పెరిగాయి. ఇక విదేశీ మార్కెట్లపరంగాచూస్తే ఆసియామార్కెట్లు వ్యూహా త్మకంగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ అమలుచేస్తున్న కొత్త విధానాలతో మార్కె ట్లు అనుగుణంగా పెరుగుతున్నాయి. చైనా, తైవాన్‌, మలేసియా, వియత్నాం వంటి మార్కెట్లు శెలవుతో మూతపడ్డాయి. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశాలు ఈరోజు నుంచి రెండురోజుల పాటు జరుగుతుండటంతో ఫెడ్‌ రిజర్వు విధా నాలు కూడా మార్కెట్లకు కీలకంగా మారాయి.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ఆసీస్ మీడియా చెంప చెల్లుమనిపించిన అమితాబ్ ఆసీస్ మీడియా ఓవర్ యాక్షన్ పట్ల భారత క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఆసీస్ మీడియాకు చురకలు అంటింటారు. TNN | Updated: Mar 22, 2017, 01:04PM IST బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మాటల యుద్ధంలో ఆసీస్ మీడియా అతి చేస్తోంది. ఆ దేశానికి చెందిన ఓ మీడియా సంస్థ కోహ్లిని జంతువులతో పోల్చి అవమానించగా.. మరో వార్తా సంస్థ విరాట్‌ని ట్రంప్‌తో పోల్చి తన తెంపరితనాన్ని చూపింది. ఆసీస్ మీడియా ఓవర్ యాక్షన్ పట్ల భారత క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఆసీస్ మీడియాకు చురకలు అంటించారు. స్మిత్ డీఆర్ఎస్ వివాదం సందర్భంగా విరాట్‌పై దుమ్మెత్తిపోసిన ఆసీస్ మీడియా.. రాంచీ టెస్టులో ఆ జట్టు డ్రాతో గట్టెడ్డక్కడంతో మరోసారి కోహ్లిపై విరుచుకుపడింది. విరాట్ క్రీడా రంగంలో ట్రంప్‌లా మారాడు, అనవసవరంగా మీడియాపై దుమ్మెత్తిపోస్తూ తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ డెయిలీ టెలీగ్రాఫ్ ఆర్టికల్ ప్రచురించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్ బీ.. ఆసీస్ మీడియా కోహ్లిని ట్రంప్‌తో పోలుస్తోంది. అవును అతడే విజేత. ట్రంప్ గెలిచాడని, ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యాడని అంగీకరించారు. థ్యాంక్యూ ఆసీస్ మీడియా అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. T 2471 - Aussi media calls Virat, Donald Trump of sports !! ... thank you Aussi media for accepting that he is a winner and the PRESIDENT !! pic.twitter.com/ZOoNtuhtC2 — Amitabh Bachchan (@SrBachchan) March 21, 2017 బెంగళూరు టెస్టులో స్మిత్ అవుటైన తర్వాత డీఆర్ఎస్ విషయమై డ్రెస్సింగ్ రూం వైపు చూడటంతో వివాదం మొదలైంది. రాంచీ టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు వివాదానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నామని, ఆటపై ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. కానీ మూడో టెస్టులో విరాట్ గాయపడిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆసీస్ ప్లేయర్లు కోహ్లిని టీజ్ చేస్తూ మరో కొత్త వివాదం క్రియేట్ చేశారు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు వీరే? టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్‌పై విచారణ వేగవంతం చేసిన సిట్ నిన్న 10 మంది సినీ ప్రముఖులకు, నేడు ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు అందజేసింది. TNN | Updated: Jul 13, 2017, 01:57PM IST టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్‌పై విచారణ వేగవంతం చేసిన సిట్ నిన్న 10 మంది సినీ ప్రముఖులకు, నేడు ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు అందజేసింది. విశ్వసనీయ పోలీసు వర్గాల సమాచారం మేరకు, బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రస్తుతం చేతుల్లో సినిమాలేమీ లేకుండా ఖాళీగా ఉన్న ఓ యువనటుడికి డ్రగ్స్ దందాలో ప్రధాన పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. అతడితో పాటు ఓ వర్ధమాన గాయకురాలి భర్తకు, ఆడియో ఫంక్షన్లు జరిగితే, తన పొగడ్తలతో హీరోలను ఆకాశానికి ఎత్తేసే ఓ నిర్మాత, తొలినాళ్లలో హీరోగా ప్రవేశించి, ఆపై సరైన విజయాలు లేక సెకండ్ హీరోగా స్థిరపడ్డ ఓ యువ నటుడు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చి తొలుత హిట్ చిత్రాల్లో నటించి, ప్రస్తుతం అడపాదడపా కనిపిస్తున్న నటుడు, సినిమాలు వేగంగా తీస్తాడని పేరు తెచ్చుకున్న ఓ టాప్ డైరెక్టర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. నేడు నోటీసులు అందుకున్న హీరోయిన్లలో బుల్లి తెరపై, ఇటు వెండి తెరపై రాణిస్తున్న ఓ నటి, సినిమా అవకాశాలు తగ్గినప్పుడు స్టేజ్ షోలు, న్యూ ఇయర్ పార్టీల్లో సందడి చేసే ఓ నటి, డైరెక్టర్లతో క్లోజ్‌గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలను కూడా నిర్వహించే ఓ హీరోయిన్ ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరి పేర్లను బయట పెట్టేందుకు తమకు అనుమతులు లేవని చెబుతూనే, వారి బయోడేటాలను మాత్రం బహిర్గతం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ప్రమేయముందని భావిస్తున్న ముగ్గురు తెలుగు హీరోయిన్లకు సిట్ కొద్దిసేపటి కిందట నోటీసులు పంపింది. నోటీసులు పంపినవారి పేర్లను బయటపెట్టకపోయినా, వీరంతా సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సిందేనని ఎక్సైజ్ డీఐజీ అకున్ సబర్వాల్ ఆదేశించారు. ఇప్పటికే సినీరంగంలోని పది మందికి నోటీసులు ఇచ్చామని చెప్పిన ఆయన, నేడు ముగ్గురు హీరోయిన్లతోపాటు మరో టాప్ డైరెక్టరుకు కూడా నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. వీరంతా 19 న సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనిని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
0business
Jan 19,2017 సీి9ను ఆవిష్కరించిన సామ్‌సంగ్‌ నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ మార్కెట్లోకి గెలాక్సీ సీరిస్‌లో సీి9ను విడుదల చేసింది. బుధవారం హైదరాబాద్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ సేల్స్‌ అండ్‌ మొబైల్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మహదీప్‌ సింగ్‌ ఆవిష్కరించారు. దీని ధర రూ.36,900గా నిర్ణయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో 41 శాతం వాటా ఉందన్నారు. 2016 డిసెంబర్‌ నాటికి 46.9 శాతానికి చేరిందన్నారు. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 220 మిలియన్ల యూనిట్లుగా ఉందన్నారు. ఈ ఏడాది రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుందన్నారు. సీ9ను ఆరు అంగుళాల డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్‌, డ్యూయల్‌ ఫ్లాష్‌తో ఫుల్‌ హెచ్‌డీ 16 ఎంపీ కెమెరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం తదితర ప్రత్యేక ఫీచర్లతో రూపొందించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
స్థిరాస్తి కొనేందుకు సరైన సమయం -  హైదరాబాద్‌లో రియాల్టీ పుంజుకుంటుంది -  ట్రెడా అధ్యక్షుడు దశరథ్‌ రెడ్డి వెల్లడి -  అక్టోబరు2 నుంచి'ట్రెడా ప్రాపర్టీ షో' -  హైటెక్స్‌ వేదికగా మూడు రోజుల 'స్థిరాస్తి' పండుగ    నవతెలంగాణ-వాణిజ్య విభాగం: రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌లో కొంత స్తబ్ధుగా ఉన్న స్థిరాస్తి రంగం తిరిగి పుంజుకుంటోందని 'తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌' (ట్రెడా) అధ్యక్షుడు పి.దశరథ్‌ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రెడా జనరల్‌ సెక్రటరీ విజరు సాయి, ట్రెజరర్‌ గోపాల్‌ క్రిష్ణ, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌ చంద్రారెడ్డి, చలపతిరావులతో కలిసి ఆయన స్థిరాస్తి రంగంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న విశేషాలను వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత స్థిరాస్తి ధరలు ఇప్పుడు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయని చెప్పారు. అయినా ధరలు తక్కువ స్థాయిల వద్దే ఉన్నాయని అన్నారు. ఈ రంగంలో పెట్టుబడులకు, స్థిరాస్తి కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని ఆయన వివరించారు. ప్రతి ఏడాది రియాల్టీ ధరలు 15-20 శాతం వరకు పెరుగుతున్నాయని వెల్లడించారు. మూడు దశల్లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 20పైగా పరిశ్రమలకు అనుమతిలిచ్చిందన్నారు. పెట్టుబడులు పెరగడంతోపాటు రియాల్టీకి మద్దతు లభిస్తోందని చెప్పుకొచ్చారు. గత ఆరేడు మాసాల నుంచి నూతన కార్యాలయాల స్థలాలకు డిమాండ్‌ పెరుగుతోందని వివరించారు. హైదరాబాద్‌ పరిసరాల్లోని ఆదిబట్ల, యాదగిరిగుట్ట, కందికిరి ప్రాంతాల్లో రియాల్టీ వేగంగా విస్తరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు ట్రెడా మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. అంగరంగ వైభవంగా 6వ ప్రాపర్టీ షో..    స్థిరాస్తి డెవలపర్స్‌ను కొనుగోలుదారులను ఒక్క వేదికపై పరిచయం చేసేందుకు గాను తాము అక్టోబర్‌ 2నుంచి హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ 6వ 'ట్రెడా ప్రాపర్టీ షో' నిర్వహించనున్నట్లుగా దశరథ్‌ రెడ్డి తెలిపారు. ఇందులో 170పైగా స్టాల్స్‌ ఏర్పాటుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. వీటికి తోడు వివిధ బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు కూడా ప్రాపర్టీ షోలో పాల్గొని సేవలందించనున్నట్లు వివరించారు. దాదాపు రూ.15 లక్షల నుంచి నిర్మాణాలు లభ్యమవుతాయన్నారు. ప్రాపర్టీ షోకు వచ్చిన సందర్శకుల్లో లక్కీ డ్రా నిర్వహించి విలువైన బహుమతులు కూడా అందించనున్నట్లుగా తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`లో క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్‌కుమార్‌ Highlights భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలకృష్ణ 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో నటించేందుకు అంగీకరించారు, దీంతో కన్నడ చిత్ర పరిశ్రమలోనూ గౌతమిపుత్ర శాతకర్ణి గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది, న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాకు ఇప్పుడు మ‌రో అద‌న‌పు ఆక‌ర్ణ‌ణ తోడు కానుంది. అదే క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ ఈ చిత్రంలో ముఖ్య‌పాత్ర లోన‌టించ‌డం. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు శివ‌రాజ్‌కుమార్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర‌మ‌లో కూడా `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాతలు వై. రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు మాట్లాడుతూ - ``గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రించిన క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్‌గారికి థాంక్స్‌. స్వ‌ర్గీయ క‌న్న‌డ సూప‌ర్ స్టార్‌, క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ త‌న‌యుడు శివరాజ్‌కుమార్ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణితో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌నుండ‌టం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్‌కుమార్ ఫ్యామిలీ స‌భ్యులు ఏ ఇత‌ర భాషా చిత్రాల్లో న‌టించ‌లేదు. శివ‌రాజ్‌కుమార్ న‌టించే సన్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు వ‌చ్చే వారం చిత్రీక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్ని గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో బిజినెస్‌ను పూర్తి చేసుకుంది. అన్నీ కార్యక్ర‌మాల‌ను పూర్తి సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.   నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శివ‌రాజ్ కుమార్,  హేమామాలిని,  శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి,  సంగీతంః చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్. Last Updated 25, Mar 2018, 11:45 PM IST
0business
సహకారం లేదు.. క్యాంపస్‌ వద్దు.. -  టెక్నోసిటీ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన ఇన్ఫోసిస్‌ తిరువనంతపురం (కేరళ): కేరళాలోని టెక్నోసిటీ క్యాంపస్‌ నిర్మాణ ప్రాజెక్టును తాము ఉపసంహరించుకుంటున్నట్లు ఐటీ రంగ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. క్యాంపస్‌ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో స్థానిక ప్రభుత్వం నుంచి సహకారం లోపించినందున తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక్కడ క్యాంపస్‌ ఏర్పాటు కోసం సంస్థ దాదాపు రూ.26 కోట్లను వ్యయం చేసింది. ఈ నెల 18న ఇన్ఫోసిస్‌ సంస్థ టెక్నోపార్క్‌ సీఈఓ గిరీష్‌ బాబు, రాష్ట్ర ఐటీ కార్యదర్శి పి.హెచ్‌.కురియన్‌లకు ఇన్ఫీ ఒక లేఖ రాస్తూ తమకు కల్పించాల్సిన మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం విఫలమైనట్లు పేర్కొంది. దీనికి తోడు తమకు లీజుగా ఇచ్చిన దాదాపు 50 ఎకరాల స్థలంలో ఒక దేవాలయం కూడా ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దీనికి గిరీష్‌ బాబు స్పందిస్తూ 2012లో ఇన్ఫోసిస్‌ రూ.47 కోట్లను చెల్లించి జీవితకాల లీజును పొందిందని, అయితే ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టలేదని అన్నారు. ప్రభత్వం నుంచి తగిన సహకారం లేదన్న ఇన్ఫీ ఆరోపణలను తోసిపుచ్చిన గిరీష్‌ ఐటీ పార్క్‌లో నిర్మాణాలను ప్రారంభించేలా భూసేకరణ జరిపిన ప్రాంతంలో తాము అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇన్ఫీ అభ్యర్థన మేరకు టెక్నోపార్క్‌ 49.84 ఎకరాల భూమిని 2013 మార్చిలో ఐటీ సంస్థకు అందించినట్లు ఐటీ కార్యదర్శి కురియన్‌ తెలిపారు. నిబంధనల మేరకు లీజు తీసుకున్న తేదీ లేదా కనీసం స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు ఇన్ఫోసిస్‌ ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాల్సిందని అన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ ఇప్పటి వరకు తమకు ఇన్ఫోసిస్‌ ప్రతిపాదిత భవన నమూనాలను కూడా అందజేయలేదని ఆయన అన్నారు. అయితే కొత్త క్యాంపస్‌ స్థాపన విషయంలో కొంత విముఖంగా ఉన్న ఇన్ఫోసిస్‌ సంస్థ టెక్నోపార్క్‌నకు దగ్గరలో ఉన్న ఫేజ్‌-2లోని క్యాంపస్‌నే విస్తరించాలని చూస్తున్నట్లు సమాచారం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ అజామ్ (51: 40 బంతుల్లో 6x4), ఫకార్ జమాన్ (40: 17 బంతుల్లో 6x4, 2x6) జట్టుకి శుభారంభమిచ్చారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 5.2 ఓవర్లలోనే 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో ఫకార్ ఔటైనా.. అనంతరం హుస్సేన్ (31)తో కలిసి స్కోరు బోర్డుని నడిపించిన బాబర్ అజామ్.. జట్టుని విజయతీరాలకి చేర్చాడు. చివర్లో ఆసిఫ్ అలీ (25 నాటౌట్: 16 బంతుల్లో 2x4, 1x6) బ్యాట్ ఝళిపించడంతో 16.5 ఓవర్లలోనే 154/2తో పాకిస్థాన్ విజయాన్ని అందుకుంది. గత ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 143 పరుగుల తేడాతో గెలుపొందిన పాకిస్థాన్.. సోమవారం జరిగిన రెండో టీ20లోనూ 82 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఆడేందుకు ఇప్పటికే భారత్‌కి చేరుకున్న వెస్టిండీస్ ప్రధాన క్రికెటర్లు ఈ పాకిస్థాన్ పర్యటనకి దూరంగా ఉన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV గోపిచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ ఆన్ ది వే! గోపిచంద్, నయనతార లేటెస్ట్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్ మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. TNN | Updated: Apr 29, 2017, 06:12PM IST వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న గోపీచంద్ నటించిన తాజా చిత్రం "ఆరడుగుల బుల్లెట్" విడుదలకు సిద్ధమవుతోంది. గోపీచంద్- బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాండ్ర రమేష్ నిర్మాత. గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను మే 19న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. "ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు యూత్, మాస్ ఆడియన్స్ కు నచ్చే అంశాలు మేళవించి దర్శకులు బి.గోపాల్ "ఆరడుగుల బుల్లెట్" చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ రచయితలు వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి మాటలు, బాల మురుగన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్స్‌గా నిలుస్తాయి.
0business
Hyderabad, First Published 13, May 2019, 8:03 AM IST Highlights ఐపీఎల్ 2019 ముగిసింది. ఆదివారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు హైదరాబాద్ వేదికగా హోరా హోరీగా తలపడ్డాయి.  ఐపీఎల్ 2019 ముగిసింది. ఆదివారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు హైదరాబాద్ వేదికగా హోరా హోరీగా తలపడ్డాయి. ఈ పోరులో... ఎట్టకేలకు విజయం ముంబయి ఇండియన్స్ ని వరించింది. ఐపీఎల్ సీజన 12 కప్ ని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దాడారు. అయితే...  కప్ చేతికి అందినా... ఆట మధ్యలో జరిగిన ఓ చిన్న వివాదం కారణంగా రోహిత్ శర్మ అప్ సెట్ అయినట్లు సమాచారం. ఇంతకీ మ్యాటరేంటంటే...టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు కొట్టిన డికాక్.. శార్దూల్ వేసిన అతడి రెండో ఓవర్‌ నాలుగో బంతికి  సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే డికాక్‌ను శార్దూల్ ఇంటికి పంపాడు. అతడు అవుట్ కావడంతో శార్దూల్ సంతోషం పట్టలేకపోయాడు. ‘నా బౌలింగ్‌లోనే సిక్సర్ కొడతావా?’ అన్నట్టు డికాక్ వైపు వేలు చూపిస్తూ ‘వెళ్లు, వెళ్లు’ అన్నట్టు సైగ చేశాడు. నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రోహిత్ ఇది చూసి తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. శార్దూల్ తీరుపై అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. శార్దూల్ వద్దకు వెళ్లిన అంపైర్ ఇయాన్ గౌల్డ్ అతడితో ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత శార్దూల్ నవ్వుతూ కనిపించడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది. Last Updated 13, May 2019, 8:03 AM IST
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV నేడు బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లు వీరే! కోట్లాది మంది భారతీయుల ఆశలను రియోకు మోసుకెళ్లిన భారత అథ్లెట్లలో ఈ రోజు పోటీలో పాల్గొననున్నది వీరే..! TNN | Updated: Aug 6, 2016, 02:17PM IST రియో ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ ద్వయం లియాండర్ పేస్, రోహన్ బోపన్న నేడు పోలాండ్ జోడీతో తలపడనుంది. భారత పురుషుల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వీ చండేలా, అయోనికా పౌల్‌లు పోటీలో ఉండగా, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్, గురుప్రీత్ సింగ్ పోటీ పడుతున్నారు. టేబుల్ టెన్నిస్‌ సింగిల్స్‌లో మౌమా దాస్, మౌనికా బత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ​రోయింగ్‌ విషయానికి వస్తే.. పురుషుల సింగిల్ స్కల్ హీట్ విభాగంలో దత్తు బబన్ పోటీ పడుతున్నాడు.
2sports
చైనాలో వెయ్యి కోట్లు వసూల్ చేసిన దంగల్ Highlights చైనాలో వెయ్యి కోట్లు వసూల్ చేసిన దంగల్ ఈ ఘనత సాధించిన తొలి విదేశీ సినిమాగా రికార్డు చైనా వసూళ్లతో బాహుబలి రికార్డును క్రాస్ చేసిన దంగల్ చైనాలో వెయ్యి కోట్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా 'దంగల్‌' రికార్డులకెక్కింది. మరే విదేశీ సినిమాకు సాధ్యం కాని ఈ అరుదైన ఘనతను 'దంగల్‌' తన ఖాతాలో వేసేసుకుంది. వెయ్యి కోట్లు.. అసలు ఇండియాలోనే సాధ్యమయ్యే రికార్డు కాదని, 'బాహుబలి ది కంక్లూజన్‌' విడుదలకు ముందు అంతా అనుకున్నారు. 'బాహుబలి' టీమ్‌ సైతం, వెయ్యి కోట్లను టార్గెట్‌గా పెట్టుకున్నా, ఆ స్థాయి వసూళ్ళు వస్తాయా? అన్న సందేహంతోనే వుంది. అయితే.. 'బాహుబలి ది కంక్లూజన్‌'  రిలీజై.. మొట్టమొదట వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా రికార్డులకెక్కింది. అయితే బాహుబలి రికార్డును క్రాస్ చేసి అంతకుముందెప్పుడో విడుదలైన హిందీ సినిమా 'దంగల్‌', చైనాలో విడుదలయ్యాక మళ్ళీ రికార్డులు షురూ చేసేసింది. 'బాహుబలి' - 'దంగల్‌' రికార్డుల్ని దాటేస్తే, 'దంగల్‌', 'బాహుబలి' రికార్డుల్ని కొల్లగొట్టేసింది. ఓవరాల్‌గా ఈ పోటీ అద్భుతం. ఈ పోటీ వుంటేనే, ముందు ముందు మరిన్ని సినిమాలు ఈ క్లబ్‌లో చేరడానికి వీలవుతుంది.   'దంగల్‌' చైనాలో వెయ్యి కోట్ల వసూళ్ళు సాధించడంతో, 'బాహుబలి ది కంక్లూజన్‌' చైనాలో ఎప్పుడు విడుదలవుతుందా.? అని 'బాహుబలి' అభిమానులు ఎదురుచూస్తున్నారు. చైనా వసూళ్ళ పుణ్యమా అని, 'బాహుబలి' సృష్టించిన కొన్ని రికార్డుల్ని అతి తక్కువ సమయంలోనే 'దంగల్‌' కొల్లగొట్టేసిన విషయం విదితమే. మరి బాహుబలి చైనాలో రిలీజై రికార్డులు తిరగరాస్తుందా లేదా చూడాలి. Last Updated 26, Mar 2018, 12:02 AM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘అదుగో’ పందిపిల్లతో పాదయాత్ర.. డేట్ & టైమ్ ఫిక్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు డైరెక్టర్ రవిబాబు. కామెడీ, లవ్, హర్రర్, సస్పెన్స్‌ ప్రాజెక్టులతో తన టాలెంట్‌ను ప్రువ్ చేసుకున్నారు. Samayam Telugu | Updated: Nov 1, 2018, 06:43PM IST ‘అదుగో’ పందిపిల్లతో పాదయాత్ర.. డేట్ & టైమ్ ఫిక్స్ సినిమా ప్రమోషన్స్‌లో కొత్తపుంతలు తొక్కుతున్నారు మన దర్శక నిర్మాతలు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ఒక్కొక్కటిగా విడుదల చేయడమే కాకుండా.. ప్రీ రిలీజ్, ఆడియో వేడుకల పేరుతో ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇదంతా పాత ట్రెండ్. ఒప్పుడో కొత్త ట్రెండ్‌‌కు శ్రీకారం చుట్టారు దర్శకుడు రవిబాబు . Visit Site Recommended byColombia డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు డైరెక్టర్ రవిబాబు. కామెడీ, లవ్, హర్రర్, సస్పెన్స్‌ ప్రాజెక్టులతో తన టాలెంట్‌ను ప్రువ్ చేసుకున్నాడు. మళ్లీ చాలా రోజుల తర్వాత ‘అదుగో’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి రోటిన్‌కు భిన్నంగా బంటీ అనే పంది పిల్లతో సినిమాను తెరకెక్కించారు. ‘అదుగో’ టీజర్.. పందిలోనూ ఫన్ ఉంది! X పలు వాయిదాల అనంతరం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రేపు (నవంబర్ 2) సాయంత్రం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ నుండి ఫిల్మ్ ఛాంబర్ వరకు పందిపిల్లతో పాదయాత్ర చేయబోతున్నారు రవిబాబు. అప్పట్లో నోట్ల రద్దు సమయంలో రవిబాబు ఈ పంది పిల్లను పట్టుకుని ఏటీఎం క్యూలో నిలబడి అదుగో సినిమాను ప్రమోట్ చేశారు. అనంతరం ఈ పంది పిల్లకు పళ్లు తోముతూ వీడియోతో హల్ చల్ చేశారు. ఇప్పుడు పందిపిల్లతో పాదయాత్ర అంటూ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. అయితే ఈ తరహా ప్రమోషన్స్ రవిబాబుకి కొత్తేం కాదు.. ఆసక్తిదాయకమైన రీతిలో పోస్టర్లను, కాన్సెప్ట్‌లను డిజైన్ చేయడంలో రవిబాబు ఆరితేరాడు. అప్పుడెప్పుడో ‘నచ్చావులే’ సినిమా పోస్టర్ డిజైన్‌లో కోతులను ఉపయోగించాడు. ఆ తర్వాత ‘అవును’ సినిమా పోస్టర్లో ఏనుగుతో హడలుగొట్టాడు. ఈ సారి పందిపిల్లతో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో పందిపిల్లను రియలస్టిక్‌గా చూపించడం కోసం ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే తొలిసారిగా పూర్తిస్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ ఉపయోగించారు. ఇందులో ర‌విబాబుతో పాటు అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తుండగా.. ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును2’లలో కీలక పాత్రలు చేసిన హీరోయిన్ పూర్ణ ఐటమ్ సాంగ్‌తో మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. రవిబాబు సొంతంగా ఈ సినిమాను నిర్మించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
sumalatha 199 Views Team India , Virat Kohli Virat Kohli న్యూఢీల్లీ: బుధవారం విండీస్ తో జరిగిన మూడో వన్డే 27వ ఓవర్ లో విండీస్ బౌలర్ కీయర్ రోచ్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ కుడి చేతికి గాయమైంది. అయినా విరాట్ గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలోనే గాయం కారణంగా విండీస్ తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు కోహ్లీ దూరం అవుతాడనే వార్తలు జోరుగా వచ్చాయి. ఈ వార్తలపై విరాట్ స్పందించాడు. మ్యాచ్ లో గాయమైన మాట వాస్తవమే, కానీ విండీస్ జరిగే తొలి టెస్టు మ్యాచ్ లో ఆడుతున్నానని ప్రకటించాడు. అయితే బుధవారం విండీస్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
2sports
NEW.WIN బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ విజయం న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ వరుస పరాజయాలతో ఢీలా పడిపోతుంది.కాగా తాజాగా నెల్సన్‌ వేదికగా న్యూజి లాండ్‌తో గురువారం జరిగిన రెండవ వన్డేలో బంగ్లాదేశ్‌ 67 పరుగుల తేడాతో పరాజయం చెందింది.మొదట నీల్‌ బ్రూమ్‌ 107 బంతుల్లో 8 బౌండరీలు,3 సిక్సర్లతో సెంచరీ చేయడంతో టాస్‌ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 251 పరుగులు చేయగలిగింది. అనంతరం టార్గెట్‌ చేధనకు దిగిన బంగ్లాదేశ్‌ అనూహ్యంగా తడబడింది.కాగా తొలి వన్డేలో కనీసం పోరాట పటిమ కనబర్చిన ఆ జట్టు రెండవ వన్డేలో 184 పరుగులకే కుప్పకూలిపోయింది.చేధనలో ఇమ్రాన్‌ కైన్‌ 89 బంతులు ఆడి 6 బౌండరీలతో 59 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీ సాధించి నిలకడగా ఆడటంతో ఒకానొక దశలో 2 వికెట్లకు 105 పరుగులతో బంగ్లాదేశ్‌ మెరుగైన స్థితిలోనే నిలిచినా మధ్య లో కివీస్‌ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుని ఒత్తిడిలోకి వెళ్లిపో యింది. కాగా సిరీస్‌లో చివరిదైన మూడవ వన్డే శనివారం జరుగనుంది
2sports
ఈ ఏడాది ఆడిలో మరిన్ని మోడళ్లు - రాష్ట్ర మార్కెట్లోకి కొత్త క్యూ3 కారు నవతెలంగాణ- బిజినెస్‌ బ్యూరో జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి మోటార్స్‌ ఈ ఏడాది మరిన్ని మోడళ్ల ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఆడి క్యూ3ని హైదరాబాద్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్బంగా ఆడి హైదరాబాద్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సంఘ్వీ మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా మార్కెట్లోకి మరో 3-4 మోడళ్లు రానున్నాయని చెప్పారు. లగ్జరీ కార్ల మార్కెట్లో ఆడి క్యూ3 2012 నుంచి మార్కెట్‌లో లీడర్‌గా ఉందన్నారు. నూతన ఆడి క్యూ3లో వినూత్నమైన సంకేతిక పరిజ్ఞానం, డిజైన్‌లోనూ పెద్ద మొత్తంలో మార్పులు చేశామన్నారు. హైదరాబాద్‌ షోరూంలో ఆడి క్యూ3 ధర రూ.29.74 లక్షల నుంచి రూ.34.32 లక్షలుగా నిర్ణయించామన్నారు. ఆన్‌రోడ్‌లో దీని ధర రూ. 36.24 లక్షల నుంచి రూ.49.87 లక్షలుగా ఉంటుందన్నారు. రెండంకెల వృద్ధి హైదరాబాద్‌ మార్కెట్లో లగ్జరీ కార్లకు భారీగా డిమాండ్‌ పెరుగుతుందని సంఘ్వీ అన్నారు. గతేడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధి చోటు చేసుకుందన్నారు. ఇక్కడ 454 యూనిట్లు, విశాఖలో 68 కార్లను విక్రయించిందన్నారు. గతేడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 520 యూనిట్లు అమ్మకాలయ్యాయన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 30 శాతం వృద్ధితో 140 యూనిట్లు అమ్మకాలయ్యాయని పేర్కొన్నారు. మొత్తంగా 2000 మంది కొనుగోలుదార్లకు దగ్గరయ్యామని చెప్పారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Are Virat Kohli and Anushka Sharma end up their relation? అనుష్క, విరాట్ కోహ్లీ బైబై చెప్పేసుకున్నారా? క్రికెటర్ విరాట్ కోహ్లీ నటి అనుష్క శర్మల ప్రణయానికి బ్రేక్ పడిందా? ఇద్దరూ ఒకరికి ఒకరు బైబై చెప్పేసుకున్నారా? అవునని సోషల్ మీడియా కోడై కూస్తోంది TNN | Updated: Feb 4, 2016, 07:54PM IST క్రికెటర్ విరాట్ కోహ్లీ నటి అనుష్క శర్మల ప్రణయానికి బ్రేక్ పడిందా ? ఇద్దరూ ఒకరికి ఒకరు బైబై చెప్పేసుకున్నారా ? అవునని సోషల్ మీడియా కోడై కూస్తోంది. నెటిజన్లు ఇందుకు ఆధారంగా ఇన్స్‌టాగ్రామ్‌ను చూపుతున్నారు. అందులో ఒకప్పుడు ఒకరిని ఒకరు తెగ ఫాలో అయిన ఈ ఇద్దరూ ఇప్పుడు అన్ ఫాలో చేసుకున్నారుట. విరాట్ కోహ్లీ , అనుష్కల పేర్లను కలిపి విరుష్క అని అభిమానులు ఎప్పుడో పేరు పెట్టారు. వారిద్దరూ అంతగా ఒకరంటే ఒకరు ఒకటే అన్నట్లు ప్రపంచానికి కనిపించడంతో ఆ పేరు పెట్టారు. ఇప్పుడిక ఆ పేరును ఉపయోగించే అవకాశం రాదని అంటున్నారు. అసలేమైంది.. ?
2sports
sumalatha 75 Views bse , NSE , stock market SENSEX DOWN ముంబయి: దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35లకు సెన్సెక్స్‌ 131 పాయింట్లు కోల్పోయి 37,265 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 11,042 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.89 వద్ద ట్రేడవుతోంది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/national/
1entertainment
WHEAT రబీ సాగులో పెంపు న్యూఢిల్లీ,జనవరి 29: ప్రస్తుత వ్యవసాయసీజన్‌లో సాధారణ రబీ ఆయకట్టుకంటే ఈ సారి ఎక్కువ ఆయకట్టు సాగయినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రకటించింది. మొత్తం రబీసీజన్‌లో ఇప్పటివరకూ చూస్తే గత ఏడాది 600.2 లక్షల హెక్టార్లలో సాగయితే ఈ ఏడాది 637.34 లక్షల హెక్టార్లలో సాగుచేసినట్లు తేలింది. సాధారణ రబీసాగు లక్ష్యం 638.37 లక్షల హెక్టార్లుగా ఉంది. రబీ పంటల సీజన్‌ సాధారణంగా నవంబరులో ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరివరకూ కొన సాగుతుంది. ఈ సారి రబీ సాగుకు గోధు మలు, వరి సాగు కొంత వృద్ధిని పెంచింది. గోధుమలు దేశవ్యాప్తంగాచూస్తే 315.55 లక్షల హెక్టార్లలోసాగుచేస్తే సాధారణ స్థాయి 301.49 లక్షల హెక్టార్లకంటే ఎక్కువ సాగ యింది. ఐదేళ్ల సాధారణ సగటును పరిగ ణనలోనికి తీసుకుని రబీ ఆయకట్టు సాగు ను నిర్ణయిస్తారు. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో ఎక్కువ సాగ యింది. అంతేకాకుండా పప్పుదినుసుల్లో కూడా భారీ వృద్ధిని సాధించింది. మొత్తం ఆయకట్టు ఇప్పటివరకూ 159.28 లక్షల హెక్టా ర్లు సాగయింది. సాధారణ సగటు 146.74 లక్షల హెక్టార్లతో పోలిస్తే ఎక్కువే. మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఎక్కువ పప్పు దినుసుల కవరేజి పెంచుకున్నాయి. ఇక వరి పరంగా 21.77లక్షల హెక్టార్లుగా ఉంది. సాధా రణ సగటు 21.15 లక్షల హెక్టార్లతో పోలిస్తే ఎక్కు వే. తెలంగాణ, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఎక్కువ సాగయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కొంత తగ్గింది. ఇక తృణధాన్యాలపరంగా స్వల్పంగా తగ్గింది. 58.71 లక్షల హెక్టార్ల సాధారణ సగటుకంటే 56.90 లక్షల హెక్టార్లుగా నమోద యింది. మధ్యప్రదేశ్‌, బీహార్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌రాష్ట్రాల్లో ఎక్కువ సాగయ్యాయి. నూనెగింజలపరంగా కూడా కొంతమేర ఆయ కట్టు తగ్గింది. 84.07 లక్షల హెక్టార్లు సాధా రణ సీజన్‌లో సాగువుతుంటే 83.84 లక్షల హెక్టార్లలో సాగయింది. రుతుపవనాల ప్రభా వంతో పాటు, ఆయకట్టులో సాగునీటిసరఫరా వంటివి వేగవంతం కావడంతో ఈపర్యాయం రబీసీజన్‌కు అన్ని వనరులు కలిసొచ్చాయని వ్యవసాయశాఖ అంచనావేస్తోంది. రబీసీజన్‌ ఉత్పత్తులకు గిట్టుబాటుధరలు లభించినపక్షంలో రైతుకు కొంత లాభదాయకత పెరుగుతుందని అంచనావేస్తోంది. అలాగే ఈ సీజన్‌లో వ్యవ సాయరంగపరంగా కేంద్ర బడ్జెట్‌లో రైతులకు చేకూర్చే వరాలపైకూడా రైతాంగం దృష్టిపెడు తోంది. పంట రుణాలతోపాటు, వడ్డీరేట్ల తగ్గింపు, రుణాల రీషెడ్యూలు వంటివి సకాలం లో అందితే మరింతగా సాగుచర్యలకు ఊతం ఇచ్చినట్లవుతుందని ఈ రంగం నిపుణులు కేంద్ర వ్యవసాయ శాఖ ద్వారా ఆర్థిక మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపించారు.
1entertainment
Suresh 278 Views రైనాకు కొంత విరామం గుజరాత్‌ లయన్స్‌ కెప్టెన్‌ సురేష్‌ రైనా ఐపిఎల్‌ మ్యాచ్‌ల్లో కొన్నింటిని మిస్సవుతున్నారడు.. తన భార్య ప్రియాంకచౌదరి గర్భవతి కావటంతో ఆమె చెంతనే ఉండేందుకు హాలెండ్‌ వెళుతున్నాడు. కాగా ప్రియాంక అతని చిన్ననాటి స్నేహితురాలు.. ఈ దశలో రైనా కొన్ని రోజులపాటు ఐపిఎల్‌లో ఆడే అవకాశం లేదంటున్నారు.. కాగా అతి బదులు లయన్స అరోన్‌పించ్‌ సారథ్యం వహించనున్నాడు.
2sports
May 24,2015 పెరిగిన విదేశీ మారకం నిల్వలు ముంబయి : మే 15తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకం నిల్వలు 1.7 బిలియన్‌ డాలర్లు పెరిగి 253.9 బిలియన్‌ డాలర్లకు చేరాయని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఇంతక్రితం వారంలో 252.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 64కు చేరడంతో డాలర్ల రాక ఎక్కువగా చోటు చేసుకుందని అంచనా వేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sri lanka pacer lasith malinga announces retirement from odis, icc tweets favourite memory of the pacer in odis వన్డేలకు గుడ్ బై చెప్పిన మలింగ.. వీడ్కోలు వీడియో సూపర్ Lasit Malinga | వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్టు శ్రీలంక పేసర్ మలింగ ప్రకటించాడు. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి వన్డే మ్యాచ్ తన కెరీర్లో ఆఖరి వన్డే అని తెలిపాడు. Samayam Telugu | Updated: Jul 23, 2019, 07:31PM IST శ్రీలంక పేసర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య కొలంబోలో జరిగే తొలి వన్డే మ్యాచ్ తన కెరీర్లో చివరి వన్డే అని మలింగ తెలిపాడు. రిటైర్మెంట్ వీడియోను తన భార్య ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన మలింగ.. తన ఆఖరి మ్యాచ్ చూసేందుకు రావాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. పొట్టి ఫార్మాట్‌కు మాత్రం తాను అందుబాటులో ఉంటానని చెప్పిన మలింగ.. వచ్చే ఏడాది అక్టోబర్లో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్‌ ఆడాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. నేను శ్రీలంక తరఫున టీ20 వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్నా. నా కంటే మెరుగైన ఆటగాళ్లు ఉంటే మాత్రం.. మెగా టోర్నీలో నేను ఆడకున్నా ఫర్వాలేదని మలింగ చెప్పాడు. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో శ్రీలంక తరఫున ఎక్కువ వికెట్లు తీసింది మలింగనే. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన మలింగ.. శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
2sports
Visit Site Recommended byColombia 2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నట్లు పేర్కొంది. టీ20 సిరీస్‌తో భారత పర్యటన ప్రారంభమవుతుంది. డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ మొదలవుతుంది. అనంతరం జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరుతుంది. తొలి టీ20 మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరగనుంది. అలాగే తొలి టెస్టు మ్యాచ్ అడిలైడ్‌లో ప్రారంభంకానుంది. ఇక సిడ్నీలో తొలి వన్డే జరుగుతుంది. ఇదిలా ఉంటే, బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఏడాది నిషేధానికి గురైన ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్‌, డేవిడ్ వార్నర్‌ ఈ మూడు సిరీస్‌ల్లో ఆడలేరు. వారిపై నిషేధం 2019 మార్చి వరకు ఉండటంతో ఈ సిరీస్‌కు దూరం కాక తప్పదు. ఇదే వివాదంలో 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న బాన్‌క్రాఫ్ట్‌ భారత్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య డే అండ్ నైట్ టెస్టు నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి భారత్ ఇప్పటి వరకు పింక్ బాల్‌తో ఆడలేదు. ఆసీస్ ఇప్పటి వరకు నాలుగు డే నైట్ టెస్టు సిరీస్‌లు ఆడగా అన్నింటిలోనూ గెలిచింది. ఇదీ షెడ్యూల్.. మొదటి టీ20: నవంబరు 21 - గబ్బా, బ్రిస్బేన్ రెండో టీ20: నవంబరు 23 - ఎంసీజీ, మెల్‌బోర్న్‌ మూడో టీ20: నవంబరు 25 - ఎస్‌సీజీ, సిడ్నీ మొదటి టెస్ట్: డిసెంబరు 6 - అడిలైడ్ ఓవల్, ఆడిలైట్‌ రెండో టెస్ట్: డిసెంబరు 14 - పెర్త్ స్టేడియం, పెర్త్‌ మూడో టెస్ట్: డిసెంబరు 26 - ఎంసీజీ, మెల్‌బోర్న్‌ (బాక్సింగ్‌ డే టెస్టు) నాలుగో టెస్ట్: జనవరి 3 - ఎస్‌సీజీ, సిడ్నీ మొదటి వన్డే: జనవరి 12 - ఎస్‌సీజీ, సిడ్నీ రెండో వన్డే: జనవరి 15 - అడిలైడ్ ఓవల్, ఆడిలైట్‌ మూడో వన్డే: జనవరి 18 - ఎంసీజీ, మెల్‌బోర్న్‌   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బిగ్ బాస్: మరి కౌశల్ ని నాని హెచ్చరిస్తాడా..? Highlights గతంలో తేజస్వి.. కౌశల్ ని 'వాడు.. వీడు..' అంటూ పిలిచినందుకు నాని వీకెండ్ లో పెద్ద క్లాస్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు కౌశల్.. బాబు గోగినేనిని మర్యాద లేకుండా మాట్లాడడాన్ని నాని ప్రశ్నిస్తాడా..? లేక కౌశల్ ఆర్మీతో పెట్టుకోవడం ఎందుకులే అని గమ్మునుండిపోతాడో..? బిగ్ బాస్ సీజన్ 2 నిన్నటితో 60 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ షో చాలా ఆసక్తికరంగా సాగింది. అంతిమయుద్ధం టాస్క్ కొనసాగడంతో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కొందరు మేల్ కంటెస్టెంట్స్ కి ఎమోషనల్ టాస్క్ ఇచ్చారు. టాస్క్ ల సంగతి పక్కన పెడితే ఈ ఎపిసోడ్ లో కౌశల్.. బాబు గోగినేనిపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. బాబు గోగినేనిని 'వాడు వీడు' అని పిలుస్తూ నూతన్ నాయుడు దగ్గర మాట్లాడాడు. నూతన్ నాయుడు.. బాబు గోగినేని దగ్గరకే వెళ్లి మాట్లాడొచ్చు కదా అంటే వాడితో మనం మాట్లాడేదేంటి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కనీసం ఆయన వయసుకి గౌరవం ఇవ్వకుండా కౌశల్ మాట్లాడిన మాటలను ఇప్పుడు ఆయన యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆయన లేని సమయంలో వాడు వీడు అని మాట్లాడడం బాగాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిగిలిన హౌస్ మేట్స్ అయితే ఆయన లేని సందర్భంలో కూడా బాబు గారు అని గౌరవించి మాట్లాడుతున్నారు. మరి కౌశల్ కి ఏమైందంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తేజస్వి.. కౌశల్ ని 'వాడు.. వీడు..' అంటూ పిలిచినందుకు నాని వీకెండ్ లో పెద్ద క్లాస్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు కౌశల్.. బాబు గోగినేనిని మర్యాద లేకుండా మాట్లాడడాన్ని నాని ప్రశ్నిస్తాడా..? లేక కౌశల్ ఆర్మీతో పెట్టుకోవడం ఎందుకులే అని గమ్మునుండిపోతాడో..? చూడాలి! Last Updated 9, Aug 2018, 4:08 PM IST
0business
-  పూర్తి వాటా విక్రయానికి నో! -  అవసరమైతే ఉద్యోగ వ్యవస్థ పునర్‌నిర్మాణానికి ప్రణాళికలు - రుణభారాన్నీ మరింతగా తగ్గించి అమ్మేందుకూ యోచన.. - సర్కారు చర్యలతో కార్పొరేట్లకే మేలంటున్న విశ్లేషకులు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో (ఏఐ) కీలక వాటా విక్రయానికి సంబంధించి సర్కారు సీరియస్‌గా అడుగులు వేస్తోంది. ఇటీవల సంస్థలో 76% వాటా విక్రయానికి గాను బిడ్లను ఆహ్వానించి.. స్పందన లభించక భంగపడ్డ ప్రభుత్వం ఈసారి మాత్రం ఎలాగైనా విజయం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకు గాను అవసరమైతే ఏఐని స్టాక్‌ మార్కెట్లలో నమోదు చేసేందుకూ సర్కారు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐలో వాటా విక్రయం విషయమై పలు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని.. అయితే ఏఐ మొత్తం యాజమాన్యాన్ని విదేశాలకు అప్పగించేందుకు మాత్రం సర్కారు సుముఖంగా లేనట్టు ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న విమానయాన శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఏఐలో 76% శాతం వాటాకు సమానంగా ఈక్విటీలను జారీ చేసి వాటిని స్టాక్‌ మార్కెట్లలో నమోదు చేయాలని సర్కరు ప్రతిపాదనలో ఉన్నట్టు సమాచారం. ఆ తరువాత సంస్థకు ఎదురయ్యే మూలధన అవసరాల నిమిత్తం.. అవసరమైతే సర్కారు వద్ద ఉన్న వాటాను కూడా దశల వారీగా విక్రయించి సంస్థను నిలబెట్టాలన్న ప్రతిపాదనా సర్కారు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో విడత సర్కారు సాయం... ప్రస్తుతం నిర్వహణ మూలధనం లేక ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎయిరిండియాను ఆదుకొనేందుకు గాను సర్కారు మరింత రుణాన్ని అందించనుందని విమానయాన శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా బిడ్లను ఆహ్వానించి విక్రయ ప్రక్రియ పూర్తయ్యేందుకు గాను కొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో.. సంస్థను నిలబెట్టేందుకు అవసరమైన తక్షణ రుణాన్ని సర్కారు ఏర్పాటు చేస్తుందని ఆయన వివరించారు. రానున్నది ఎన్నిక ఏడాది కానునందున.. సర్కారు రిస్క్‌ తీసుకొని నష్టానికి ఏఐని విక్రయించేందుకు పెద్దగా ఇష్టపడకపో వచ్చని ఆయన వివరించారు. రుణ భారాన్ని తగ్గించాలని యోచన.. భారీ రుణ భారంతో ఇబ్బంది పడుతున్న ఎయిరిండియాలో కీలక వాటాను సొంతం చేసుకొనేందుకు గాను కొనుగోలుదారులు వెనుకడుగువేస్తున్న వేళ.. సంస్థలో వాటా కొనుగోలును ఆకర్షణీయంగా మార్చేందుకు గాను రుణ భారాన్ని తగ్గించాలన్న ప్రతిపాదన కూడా సర్కారు యోచనలో ఉన్నట్టుగా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో భాగంగా మరికొంత రుణ భారాన్ని సర్కారే భరిస్తూ.. స్వల్ప రుణ భారాన్ని మాత్రమే విక్రేతల ఖాతాల్లోకి మళ్లించాలన్నది సర్కారు భావనగా కనిపిస్తోంది. సర్కారు ఆలోచన కార్పొరేట్‌లకు మేలు చేసేందుకే సర్కారు ఈ దిశగా యోచన చేస్తోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై సర్కారు కొద్ది రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకోనుందని సదరు అధికారి తెలిపారు. ఆ మేరకు బిడ్ల ఆహ్వానంలో నిబంధనలను సవరించనున్నట్టుగా ఆయన తెలిపారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మంచి ధర వస్తేనే ఈ ఏడాదే ఏఐలో వాటా విక్రయాన్ని పూర్తి చేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉందని సదరు అధికారి వివరించారు. ఉద్యోగులపై వేటు తప్పదా..! ఎయిరిండియాలో వాటా విక్రయానికిగాను ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్న భారీ రుణాలు, ఉద్యోగుల నిర్వహణ ఖర్చును తగ్గించాలన్నది సర్కారు మరో ప్రతిపాదనగా కనిపిస్తోంది. ఎయిరిండియాలో మొత్తం 27,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 40% మంది శాశ్వత ఉద్యోగులు. ఈ నేపథ్యంలో ఏఐ విక్రయాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు గాను సంస్థకు భారంగా ఉన్న ఉద్యోగ వ్యవస్థలో కూడా పునర్‌నిర్మాణం చేపట్టాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా ఎంతో కొంత సొమ్మునిచ్చి ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో ఇంటికి పంపడం, కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై వేటు వంటి అంశాలు ఈ సందర్భంగా పరిగణనలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
- స్వల్ప వడ్డీ పెంపుతోనే సరిపెట్టిన ఫెడ్‌ - ఊపిరి పీల్చుకున్న ప్రపంచ మార్కెట్లు - తొలిరోజే సెన్సెక్స్‌లో 309 పాయింట్ల వృద్ధ్గి ముంబయి: అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ వరుసగా నాలుగ సెషన్‌లోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మద్దతు లభించింది. గురువారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 309 పాయింట్లు లేదా 1.21 శాతం ర్యాలీతో 25,804కు చేరింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 93 పాయింట్లు లేదా 1.21 శాతం వృద్ధితో 7,844 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.6 శాతం, 1.7 శాతం చొప్పున రాణించాయి. మొత్తంగా మదుపర్ల మద్దతుతో 1,768 స్టాక్స్‌ పెరగ్గా, మరోవైపు 756 నష్టపోయాయి. చాలా సంవత్సరాల తర్వాత తొలిసారి అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను స్వల్పంగా 25 బేసిస్‌పాయింట్ల మేర పెంచింది. ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఫెడ్‌ నిర్ణయాన్ని బ్యాంకర్లు, పారిశ్రామికవర్గాలు సానుకూలంగా తీసుకున్నాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటుందన్న వార్తల నేపధ్యంలో మార్కెట్లకు మద్దతు లభించింది. రంగాల వారిగా లోహ సూచీ 2.46 శాతం, విద్యుత్‌ 1.44 శాతం, వైద్య 1.39 శాతం, ఆటో 1.33 శాతం చొప్పున అధికంగా పెరిగాయి. బిఎస్‌ఇ-30లో టాటా స్టీల్‌ 4.76 శాతం, వేదాంత 3.75 శాతం, హిందాల్కో 3.44 శాతం, రియలన్స్‌ 3.1 శాతం, బజాజ్‌ ఆటో 2.96 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు ఒఎన్‌జిసి 0.97శాతం, యాక్సిస్‌ బ్యాంకు 0.45 శాతం, గెయిల్‌ 0.28 శాతం, ల్యూపిన్‌ 0.14 శాతం, కోల్‌ ఇండియా 0.06 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. చమురు సూచీల్లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ 3 శాతం పెరిగి రూ.1,000కి చేరింది. ఒఎన్‌జిసి 1 శాతం తగ్గింది. విత్త సంస్థల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ షేర్లు 1.2 శాతం-1.6 శాతం వరకు పెరిగాయి. ప్రధాన ఐటి ఎగుమతిదార్లు ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌ షేర్లు 1.5 శాతం చొప్పున పెరిగాయి. ఫార్మా రంగంలో గ్లెన్‌మార్క్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో పార్మా, సిప్లా, నాట్కో పార్మా షేర్లు 0.6-3 శాతం వరకు పెరిగి మార్కెట్లకు మద్దతుచేశాయి. లోహ సూచీల్లో టాటా స్టీల్‌, సెయిల్‌, జెఎస్‌డబ్ల్యు స్టీల్‌ సూచీలు 2.6-6.5 శాతం వరకు పెరిగాయి. ఈ నెల 21న ఎస్‌బిఐ బోర్డు సమావేశం నేపధ్యంలో ఆ సంస్థ షేర్‌కు 1.6శాతం మద్దతు లభించింది. తెలంగాణలో ఎన్‌టిపిసి ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌కు అటవి, పర్యావరణ శాఖ ఆమోదం తెలపడంతో ఈ వెలుగుల కంపెనీ షేర్‌ 1.3శాతం రాణించింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ విలువ 2.3 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా ఆసియన్‌ మార్కెట్లు సానుకూలంగానే నమోదయ్యాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jun 21,2018 ఎస్‌బీఐ ఎండీకి ఐడీబీఐ బాధ్యతలు న్యూఢిల్లీ: భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.శ్రీరామ్‌కు ఐడీబీఐ అధినేత బాధ్యతలను అదనంగా అప్పగించ నున్నారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం.కె.జైన్‌ భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎంపికైన నేపథ్యంలో శ్రీరామ్‌కు ఆయన బాధ్యతలను అప్పగించాలని ఆర్థికశాఖ వర్గాలు నిర్ణయించినట్టుగా సమాచారం. శ్రీరామ్‌కు తన బాధ్యతలను అప్పగించిన తరువాత ఎం.కె.జైన్‌ శుక్రవారం నుంచి ఆర్‌బీఐలో కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలోనే వెల్లడి కానుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
bouns బోనస్‌షేర్ల జారీలో నిఫ్టీ కంపెనీలే ఎక్కువ! న్యూఢిల్లీ,జూన్‌ 8: నిఫ్టీలో నమోదయిన ఐదు భారీ సంస్థలు ఈ ఏడాదిలో ఇప్పటివరకూ బోనస్‌ షేర్లు ప్రకటించాయి. ఇంజనీరింగ్‌ నిర్మాణరంగ దిగ్గజం లార్సెన్‌ అండ్‌టౌబ్రో ప్రభుత్వరంగంలోని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ బిపిసిఎల్‌ వంటివి నిఫ్టీ 50 సూచి నుంచి గత వారంలో బోనరస్‌ షేర్లను 1ః2 నిష్పతిలో ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న ప్రతి రెండు ఈక్విటీ వాటాలకు ఒక బోనస్‌షేర్‌ను జారీచేసాయి. ఈ రెండింటితోపాటు మొత్త ంఐదు కంపెనీలు ఐసిఐసిఐబ్యాంకు, విప్రో, గెయిల్‌ ఇండియా కంపె నీలు బోనస్‌షేర్లను ప్రకటిం చాయి. నిఫ్టీ 50సూచి నుంచి ఉన్న కంపెనీలు ఎక్కువగా బోన స్‌షేర్లను కేటాయిస్తున్నాయి. గడచిన 11ఏళ్లలో గరిష్ట స్థాయి లో బోనస్‌షేర్లు జారీకి ముందు కు వచ్చాయి. 2006 కేలండర్‌ సంస్థరంలో ఏడు కంపెనీలు సిప్లా, టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, డా.రెడ్డీస్‌ లేబ్స్‌, ఎల్‌అండ్‌టి, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ బోనస్‌షేర్లు జారీచేసాయి. 2010, 2015లలో కూడా ఐదుకంపెనీలు నిఫ్టీ 50సూచినుంచే బోనస్‌ షేర్లు జారీచేసాయి. అరబిందోఫార్మా 2015లోను, బజాజ్‌ ఆటో జీఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు 2010 లోను బోనస్‌షేర్లు జారీచేసాయి. గత కేలండర్‌ సంవత్సరంలో ఒఎన్‌జిసి, బిపిసిఎల్‌, ఐటిసి బోనస్‌షేర్లు ప్రకటించాయి. 2015లో టెక్‌ మహీం ద్ర, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్ర బ్యాంకులు బోనస్‌షేర్లు ఇచ్చాయని కేపిటల్‌లైన్‌ ప్లస్‌ వెల్లడించింది. అదేబాటలో ఈ ఏడాది ఇప్పటివరకూ ఈక్విటీమార్కెట్లలో రికార్డు స్థాయిలో బోనస్‌షేర్ల జారీకి కంపెనీలు ముందుకు వచ్చాయి. నిఫ్టీ 50సూచి కూడా 17.5శాతం పెరి గింది. 2017 మొదటి ఐదునెలల్లో 36 కంపెనీలు బోనస్‌ షేర్లనుప్రకటించా యి. గత ఏడాది ఇదేకాలం లో25సంస్థలు బోనస్‌షేర్ల జారీని ప్రకటించాయి. 2015లో 114 కంపెనీలు బోనస్‌షేర్లు జారీచేస్తే 2013లో 49 కంపెనీలు, 2015లో 59 కంఎనీలు, 2016లో 69 కంపెనీలు బోనస్‌షేర్లుప్రకటించాయి. బోనస్‌షేర్లు జారీచేస్తున్నా యంటే కంపెనీలు నగదు సౌలభ్యాన్ని పెంచుకున్నాయనే అర్ధం. అంటే నగదు నిల్వలుఎక్కువ ఉన్నట్లు అంచనా. బోనస్‌ షేర్ల నిష్పత్తి ఆధారంగా వీటిధకలను కూడా నిర్ణయిస్తాయి. కంపెనీ మార్కెట్‌ విలువల ఆధా రంగా వీటిధరలు ఉంటాయి. భారీసంఖ్యలో ఉన్న ఇన్వెస్టర్ల తరపున బిజినెస్‌ మరింత పెంచు కోగలమన్న ధీమా వ్యక్తంచేసే కంపెనీలే బోనస్‌ షేర్లు జారీచేస్తాయి. ఎక్ఛేంజిల్లో ట్రేడింగ్‌ పరి మాణం కూడా పెచుగుతుందని, ఎక్కువ సంఖ్య లో షేర్లు ట్రేడ్‌ అవుతాయని నిపుణుల అంచనా.
1entertainment
భవిష్యత్తు హాలోగ్రామ్‌ టెక్నాలజీదే! నవతెలంగాణ-వాణిజ్య విభాగం బ్రాండ్‌ంగ్‌, అడ్వర్టైజింగ్‌లో ఉపయోగించే హాలోగ్రామ్స్‌ టెక్నలా జీని తామూ అందిస్తున్నామని క్రిప్‌ మీడియా సీఈవో కరణ్‌ భరధ్వాజ్‌ తెలిపారు. సోమవారం ఒక కార్యక్రమంలో ఆయన హాలోగ్రామ్‌ సాంకేతికతను ఆయన పరిచయం చేశారు. ఈ సందర్భంగా కరణ్‌ మీడియాతో మాట్లాడుతూ గత ఎనిమిది నెలల మాసంలో రూ.75 లక్షల విలువ చేసే ఆర్డర్లను తాము పొందామన్నారు. ఇప్పటి వరకు 15 మంది ఖాతాదారులను సొంతం చేసుకున్నామని, మరో 40 మంది వినియోగదారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు. తొలి ఏడాదిలోనే రూ.3-4 కోట్ల టర్నోవర్‌ అంచనా వేస్తున్నామన్నారు. ఈ హాలోగ్రామ్‌ ఒక్కోటి రూ.70-80వేల విలువ చేస్తుందని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV గేల్ డ్యాన్స్‌కు సెహ్వాగ్ ఫన్నీ కౌంటర్ పంజాబీ సాంగ్‌కు గేల్ భాంగ్రా స్టెప్పులతో ఇరగదీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. ఈ వీడియోకు సెహ్వాగ్ అదిరిపోయే కౌంటరిచ్చాడు. Samayam Telugu | Updated: Apr 2, 2018, 04:55PM IST గేల్ డ్యాన్స్‌కు సెహ్వాగ్ ఫన్నీ కౌంటర్ పంజాబీ సాంగ్‌కు గేల్ భాంగ్రా స్టెప్పులతో ఇరగదీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. ఈ వీడియోకు సెహ్వాగ్ అదిరిపోయే కౌంటరిచ్చాడు. ఒడిశాకు చెందిన ఓ యువకుడి ఫన్నీ డ్యాన్స్‌ వీడియోను షేర్ చేసిన వీరూ... గేల్‌ని కూడా ట్యాగ్ చేశాడు. అలాగే క్రిసన్ ప్రీత్ గిల్ అంటూ కొత్త పేరు కూడా పెట్టాడు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫన్నీ కామెంట్స్‌తో వాళ్లు కూడా గేల్‌ను ఆటపట్టిస్తున్నారు. ఈ పోస్ట్‌పై క్రిస్ గేల్ కూడా స్పందించాడు. లోల్ అంటూ చాలా సరదాగా తీసుకున్నాడు. ఈ ఇద్దరి సరదా వీడియోలను ఫ్యాన్స్ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు.
2sports
ముగిసిన తనీష్ సిట్ విచారణ Highlights ముగిసిన తనీష్ సిట్ విచారణ 4 గంటలపాటు విచారించిన సిట్ తెలిసిన సమాచారమంతా ఇచ్చానన్న తనీష్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి  తనీష్‌ను తర్వాత హీరోగా మారారు.  హీరోగా పెద్దగా సక్సెస్ సాధించక పోయేసరికి సైడ్ హీరోగా కూడా ట్రై చేశాడు.  ఆ మద్య  తనీష్‌ పై డ్రగ్స్ ఆరోపణ`లు వచ్చాయి. అంతే కాదు తండ్రి మరణం తర్వాత తనిష్ డిప్రెషన్ లోకి వెళ్లాడని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.  కానీ అవన్నీ పక్కన బెట్టి కృష్ణ వంశి తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం’ చిత్రంలో నటిస్తున్నాడు తనిష్.  ఈ చిత్రంలో మనోడు ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడట.     తాజాగా టాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో సోమవారం తనిష్ సిట్ ముందు హాజరయ్యారు. 4గంటల పాటు తనీష్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు. సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పినట్లు తెలిపారు. తండ్రి చనిపోయిన విషాదం నుండి ఇంకా దూరం కాలేదన్నారు. విందులు ,వినోదాలకు దూరమయ్యాను. ఏదైనా రాసే ముందు నిర్ధారణ చేసుకోవాలని ఆయన సూచించారు.     డ్రగ్ రాకెట్‌ ముఠాకు చెందిన కెల్విన్ అరెస్ట్ తర్వాత 12 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరీ జగన్నాథ్, రవి తేజ, చార్మీ కౌర్, శ్యాం కే నాయుడు, రవి తేజ డ్రైవర్, ముమైత్ ఖాన్ తదితరులు హాజరయ్యారు.  మొదట డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు జాబితాలో ఉండటంపై తనీష్ ఆందోళన వ్యక్తం చేశాడు.  మరోవైపు సినీ ప్రముఖులు అందిస్తున్న సమాచారం  సేకరించి ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్ దాతృత్వం.. తొలి మ్యాచ్ ఆదాయం విరాళం మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటికే మూడుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌కి ఐపీఎల్‌ టైటిల్‌ను అందించగా మరోవైపు విరాట్ కోహ్లీకి మాత్రం ఈ ఐపీఎల్‌ టైటిల్‌ అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. Samayam Telugu | Updated: Mar 21, 2019, 12:21PM IST CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్ దాతృత్వం.. తొలి మ్యాచ్ ఆదాయం విరాళం హైలైట్స్ చెపాక్ వేదికగా చెన్నై, బెంగళూరు మధ్య శనివారం తొలి మ్యాచ్ ఈ మ్యాచ్‌లో వచ్చే మొత్తం ఆదాయాన్ని విరాళంగా ప్రకటించిన చెన్నై టీమ్ మహేంద్రసింగ్ ధోనీ చేతుల మీదుగా మ్యాచ్ రోజు చెక్ అందజేత డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2019 సీజన్‌లోకి చెన్నై ఎంట్రీ ఐపీఎల్‌ 2019 సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) తన ఉదారతని చాటుకుంది. చెపాక్ స్టేడియంలో శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య టోర్నీ తొలి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో వచ్చే మొత్తం ఆదాయాన్ని ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలకి విరాళంగా ఇవ్వనున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం తాజాగా ప్రకటించింది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV సచిన్ అక్కడ ఫెయిల్ అయ్యాడట..! క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని విధంగా వంద శతకాలు బాదిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్. TNN | Updated: Sep 7, 2017, 03:18PM IST క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని విధంగా వంద శతకాలు బాదిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ .. చదువులో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడట. ఈ విషయాన్ని సచినే స్వయంగా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. పాఠశాల స్థాయిలోనే బ్యాట్‌తో రికార్డుల బూజు దులిపి.. సంచలన ఇన్నింగ్స్‌‌లకి మారుపేరుగా నిలిచిన తెందుల్కర్‌కి 16 ఏళ్ల వయసులోనే టీమిండియా నుంచి పిలుపొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సచిన్ తెందుల్కర్ తన చిన్నతనంలో చదువుకుంటున్నప్పుడు దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘ఈ ఫీల్డ్‌లో నేను ఎప్పుడూ మంచి స్కోరు చేయలేదు’ అని రాసుకొచ్చాడు. 1973లో జన్మించిన సచిన్ నవంబరు 15, 1989లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అనతికాలంలో మైదానంలో శతకాల మోత మోగించి మాస్టర్ బ్లాస్టర్‌గా అభిమానులతో ముద్దుగా పిలిపించుకుంటూ.. క్రికెట్ దేవుడిగా ప్రశంసలు అందుకున్నాడు. 2013‌లో రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 200 టెస్టులాడి.. 51 శతకాలు, 463 వన్డేలాడి 49 సెంచరీలు నమోదు చేశాడు.
2sports
Visit Site Recommended byColombia ఇదిలాఉంటే తక్కువ టైంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన కీర్తి, ఆ క్రేజ్‌ని అప్పుడే తలకెక్కించుకుందనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒక్క సినిమా హిట్ వచ్చి, దాని ద్వారా వరుస అవకాశాలు తలుపు తట్టడంతో ఈ బొద్దుగుమ్మకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫీక్‌లోకి వెలిపోయాయని, దాంతో షూటింగ్‌లకు డుమ్మా కొట్టే రేంజ్‌కి వెలిపోయిందట. తాజాగా నానితో చేస్తున్న ‘నేను లోకల్’సినిమాకి కీర్తి పెద్ద తలనొప్పిగా మారిందట. షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌కి హాజరుకాకపోవడంతో సినిమాకి మరింత ఆలస్యం అవుతుందని, కీర్తి సరిగా కో-ఆపరేట్ చేయడం లేదని, అందుకే డిసెంబరులో రిలీజ్ కావాల్సిన ఆ చిత్రం సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Visit Site Recommended byColombia ‘గ్రేగ్ చాపెల్‌‌తో నేను తొలిసారి మాట్లాడినప్పుడు.. అతనితో చాలా క్రికెట్‌ జ్ఞానం ఉందని భావించాను. ఆ విషయమే అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియాకి చెప్పగా.. అతను సున్నితంగా తిరస్కరిస్తూ వద్దన్నాడు. కానీ.. నేను దాల్మియాని ఒప్పించగలిగాను. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, చాపెల్ తమ్ముడు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ.. భారత జట్టుని నెం.1 స్థానంలో నిలిపే సామర్థ్యం అతనిలో ఉందని నేను నమ్మాను. అందుకే వారి ఆందోళలను నేను పట్టించుకోలేదు. కానీ.. నా క్రికెట్ కెరీర్‌ని చాపెల్ సర్వనాశనం చేశాడు. ముఖ్యంగా 2005లో నేను కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చింది. అవి నా కెరీర్‌లో చాలా దుర్భరమైన రోజులు. నాతో పాటు సచిన్‌ తెందుల్కర్‌ కూడా చాపెల్ తీరుతో ఇబ్బందిపడ్డాడు. పుస్తకంలో ఈ విషయాలు రాస్తున్నప్పుడు చాపెల్ గుర్తొచ్చి నాకు పట్టలేనంత కోపం వచ్చింది. ఏరికోరి తెచ్చినందుకు అతను నాకే ఎసరుపెట్టడం ఏమాత్రం క్షమార్హం కాదు’ అని గంగూలీ ఆ పుస్తకంలో వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Vaani Pushpa 147 Views nadal , us open winner nadal న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ గెలుచుకున్నాడు. ఉత్కంఠభరితగా సాగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో నాదల్‌ విజయం సాధించాడు. హోరాహోరీగా జరిగిన తుదిపోరులో ఐదో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో మట్టికరిఇంచాడు. ఈ విజయంతో కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తనఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ రికార్డుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు.ఉత్కంఠ ఊపేసిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో నాదల్‌, మెద్వెదేవ్‌ వీరోచితంగా పోరాడు. ఆఖరి వరకూ నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈమ్యాచ్‌ 4గం.ల 50నిమిషాల పాటు జరిగింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అడుగుపెట్టిన మెద్వెదేవ్‌ అంత సులువుగా తలవంచలేదు. మొదటి రెండు సెట్‌లు రఫెల్‌ గెలిచినప్పటికీ మెద్వదేవ్‌ కుంగిపోకుండా మొండి ధైర్యంతో పోరాడాడు. మూడు, నాలుగు సెట్లను దక్కించుకుని నాదల్‌కు చెమటలు పట్టించాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో రఫెల్‌ విజృంభించడంతో మెద్వెదేవ్‌ ఓటమి పాలయ్యాడు.నాదల్‌కు నాలుగు గంటల మద్ధతుగా 24వేల మంది అభిమానులు…మెద్వెదేవ్‌ని మాత్రం ఏడిపించే ప్రయత్నం చేశారు. టోర్నీ మూడో రౌండ్‌లో ప్రేక్షకులని అసభ్య సంజ్ఞలతో డానియల్‌ కోపం తెప్పించిన విషయం తెలిసిందే. దీంతో…ఫైనల్లోనూ అతనికి మద్ధతు లభించలేదు. అయినప్పటికీ ఈ రష్యా క్రీడాకారుడు గొప్పగా పోరాడాడు. ఇటీవలి కాలంలో మెద్వెదేవ్‌ కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటూ వస్తుఆ్నడు. ఎంతలా అంటే…? చివరిగా అతను ఆడిన 23 మ్యాచుల్లో 20 మ్యాచ్‌లను గెలిచాడు. ఈ క్రమంలోనే దిగ్గజ క్రీడాకారుల్ని వెనక్కి నెట్టి తొలిసారి యూఎస్‌ ఫైనల్‌కి చేరిన డానియల్‌ కొద్దిలో టైటిల్‌ను చేజార్చుకున్నాడు. చాంపియన్‌ రఫెల్‌కు 38,50,000డాలర్లు (రూ.27కోట్ల 59లక్షలు)…రన్నరప్‌ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ.13కోట్ల 62లక్షలు) ఫ్రైజ్‌మనీగా లభించాయి. 20గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో రోజర్‌ ఫెదరర్‌…నాదల్‌ కంటే ముందున్నాడు. మరో టైటిల్‌ సాధిస్తే ఫెదరర్‌ రికార్డును నాదల్‌ సమం చేస్తాడు. 30వ ఏట అడుగుపెట్టిన తర్వాత ఐదు మేజర్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా రఫెల్‌ నాదల్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఫెదరర్‌, నొవాక్‌ జకోవిచ్‌, రొడ్‌ లావెర్‌, కెన్‌ రోజ్‌వాల్‌ పేరిట ఉన్న రికార్డును నాదల్‌ బద్దలు కొట్టాడు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/
2sports
మొండిబాకీలు ఏ9.5 లక్షల కోట్లు - మార్చి నాటికి మరింత పెరగనున్న బ్యాంకుల ఎన్పీఏలు - ఏటా లక్ష కోట్లకుపైగా బ్యాంకులకు ఎగనామం - అసోచామ్‌-క్రిసిల్‌ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: బ్యాంకుల ఎన్‌పీఏలు (నిరర్థక ఆస్తులు) ఈ ఏడాది మార్చి చివరికల్లా రూ.9.5 లక్షల కోట్లకు చేరనున్నట్టు అసోచామ్‌-క్రిసిల్‌ సంయుక్త అధ్యయనంలో తేలింది. ఇవి గతేడాది మార్చి చివరికి రూ.8 లక్షల కోట్లు. అంటే.. ఒక్క ఏడాదిలోనే మొండి బకాయిలు లక్షన్నర కోట్లు అదనంగా చేరాయని అర్థం.కాగా వీటికి వడ్డీ మూడు లక్షల కోట్లు అదనం.ఈ బకాయిల్లో అధిక భాగం కార్పొరేట్‌ సంస్థలు, బడా కంపెనీలు తీసుకున్నవేనన్నది వివరాలు బయట పెడ్తే వెలుగు చూస్తుంది. ఎగవేతదారులు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారితో అంట కాగుతూ బ్యాంకింగ్‌ చట్టాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు కూడా వీరిని కట్టడి చేయలేకపోతున్నాయి. అందుకు ఉదాహరణ..బ్యాంకులకు సుమారు రూ.9000 కోట్లు ఎగ్గొట్టి దర్జాగా లండన్‌ చెక్కేసిన లిక్కర్‌ వ్యాపారి విజరుమాల్యా. అవినీతిపరులకు వణుకు పుట్టిస్తానంటూ ఘీంకరింపులు చేసే మోడీ ప్రభుత్వ హయాంలోనే విజరుమాల్యా విమానమెక్కి దేశం దాటారు. బ్యాంకులు ఇచ్చిన ఈ అప్పుల లెక్క అంతా బ్యాలెన్స్‌ షీట్లలో చూపించేది మాత్రమేనన్నది గమనార్హం. గతేడాది సెప్టెంబర్‌ నాటికే మొండి బకాయిల మొత్తం విలువ రూ.8.5 లక్షల కోట్లు దాటిందని ఇటీవలి పార్లమెంట్‌ సమావేశాల్లో ఆర్థికశాఖ సహాయమంత్రి శివప్రతాప్‌శుక్లానే స్వయంగా వెల్లడించారు. మొండి బకాయిల్ని కొంతకాలం తర్వాత బ్యాలెన్స్‌ షీట్ల నుంచి తొలగిస్తారు. వాటిని నష్టాల జాబితాలో రైటాఫ్ప్‌ పేరుతో పక్కన పెడ్తారు. ఇక వాటిని లెక్కల్లో చూపరు. అయితే, అలా చేయడానికి ముందు ఎగవేతదారుల ఆస్తులు జప్తు చేయాలి. కానీ, పలుకుబడి ఉన్న వ్యక్తులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని దొడ్డిదారిన సమకూర్చుకున్న ఆస్తుల్ని ఇతర కంపెనీల్లోకి మళ్లిస్తారు. దాంతో, రైటాఫ్స్‌ కింద పెట్టిన అప్పుల వసూలు పట్ల అధికారులు శ్రద్ధ చూపరు. గత పదేండ్లలో(2007-2017) ఇక వసూలు సాధ్యం కాదని భావించి బ్యాంకులు తమ ఆస్తుల జాబితాల్లోంచి తొలగించిన రైటాఫ్స్‌ విలువ రూ.3 లక్షల కోట్లు. 2017-18 మొదటి ఆరు నెలల్లోనే(ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) రైటాఫ్స్‌ కింద చేర్చిన మొండి బకాయిలు రూ.55,356 కోట్లు. ఈ లెక్కన ఏటేటా నిరర్థక ఆస్తుల జాబితాలోంచి కూడా తొలగిపోతున్న రుణాల విలువ రూ.లక్ష కోట్లకు పైమాటేనన్నది గమనార్హం. అంటే..మొండి బకాయిలు అలా ఉండగా బ్యాంకులకు ఏటా జరుగుతున్న నికర నష్టం రూ.లక్ష కోట్లకు పైగా అని అర్థం. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టేవారిలో అధికభాగం అధికార పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, వారి సన్నిహితులేనని పరిశీలకులు చెబుతున్నారు. స్వయంగా అధికార పార్టీల ఎంపీలు,వారి బినామీలు కూడా ఎగవేతదారుల్లో ఉన్నారన్నది తెలిసిందే. వీరిలో చాలామందికి కేంద్రంలో అధికారం ఎటు మారితే అటు వెళ్లడం(పార్టీలు మార్చడం) వెన్నతో పెట్టిన విద్య. కాంగ్రెస్‌ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వంగానీ, బీజేపీ నేతృత్వంలోని ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వంగానీ బడా ఎగవేతదారుల ముక్కు పిండి బ్యాంకుల్ని బలోపేతం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. బ్యాంకులను ప్రయివేటీకరించాలన్న ఆలోచన ఆ రెండు పార్టీల ఉదార ఆర్థిక విధానాల్లో ఉండటం గమనార్హం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
CK KHANNA రవిశాస్త్రికి సరైన ఆరంభం : సికె ఖన్నా న్యూఢిల్లీ: స్వదేశంలో శ్రీలంకను భారత్‌ మట్టికరిపించడంపై బిసిసిఐ ప్రస్తుత అధ్యక్షుడు సికె ఖన్నా స్పందించారు. టెస్టు సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా ఆడిం దని కితాబిచ్చారు. హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రికి ఇది మంచి ఆరంభమని అన్నారు. మ్యాచ్‌ ముగిసినఅనంతరం భారత క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మీడియాతో ముచ్చటించారు. టీం లోకి మహ్మద్‌ షమీ,ఉమేశ్‌ యాదవ్‌లను తీసుకోవడంపై క్లారిటీ ఇచ్చారు. గత సీజన్‌లో ఇరువురి పర్ఫార్మెన్స్‌ బాగుండటం వల్లే ఈ సిరీస్‌కు ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరూ తమ వల్ల టీంకు ఏదైనా లాభం చేకూరుతుందని అనుకునే బౌలర్లని అన్నారు.
2sports
Hyderabad, First Published 13, Sep 2019, 4:12 PM IST Highlights నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. జూ. ఎన్టీఆర్ తన కంటే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకున్నాడు. మాస్ లో క్రేజీ ఫాలోయింగ్ ఉండే హీరోలలో ఎన్టీఆర్ ఒకడు. ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.  గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పరాజయం తర్వాత జూ. ఎన్టీఆర్ కేంద్రంగా ఆసక్తికర చర్చ మొదలైంది. ఎప్పటికైనా జూ.ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందే అంటూ అభిమానుల్లో డిమాండ్ పెరుగుతోంది. తరచుగా కొందరు టిడిపి నేతలు, ప్రముఖులు ఎన్టీఆర్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.  టిడిపికి పూర్వ వైభవం రావాలంటే ఎన్టీఆర్ ని పార్టీలోకి ఆహ్వానించాలని అంటున్నారు. తాజగా సీనియర్ నటుడు గిరిబాబు జూ. ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయిందని గిరిబాబు అన్నారు. మరో ఐదేళ్ల తర్వాత కూడా జగన్ ప్రభుత్వమే వస్తుంది.  జూ. ఎన్టీఆర్ వస్తే టిడిపి బాగుపడుతుందని ఇప్పుడు అంతా అంటున్నారు. ఎన్టీఆర్ గురించి ఈ మాట నేను గతంలోనే చెప్పా. టిడిపి బతికి బట్టకట్టాలంటే జూ. ఎన్టీఆర్ ఆ పార్టీ పగ్గాలు చేపట్టాలి. ఎన్టీఆర్ ని ప్రస్తుతం పార్టీలోకి రానిస్తారా అని ప్రశ్నించగా.. ఎన్టీఆర్ ని రానివ్వకుంటే ప్రస్తుతం ఉన్నవారిని ప్రజలు బయటకు పంపుతారు అని గిరిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.  2009 ఎన్నికల్లో భాగంగా ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగి టీడీపీ కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ లో కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.  Last Updated 13, Sep 2019, 4:12 PM IST
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
CEMENT సిమెంట్‌ రంగంపై నోట్లరద్దు ఒత్తిడి ముంబై, జనవరి 3: పెద్దనోట్ల రద్దుకారణంగా సిమెంట్‌ రంగ వృద్ధి నాలుగుశాతం దిగజారింది. రుణభారం పై మరింతప్రభావం, ఒత్తిడి పెరిగింది. సిమెంట్‌ ఉత్పత్తి 2016-17 సంవత్సరంలో నాలుగుశాతం తగ్గింది. అంతకుముందు 4-6శాతంగా ఉన్న అంచనాల నుంచి నాలుగుశాతం వృద్ధి ఉంటుందని ఇండ్‌రా రేటింగ్స్‌ వెల్లడించింది. సంస్థ తాజాగా వెలువరించిన నల్లధనానికి చీకటిరోజులు అన్న శీర్షికన వెలువరించిన నివేదికలో పెద్దనోట్ల రద్దు ప్రభావం స్వల్పకాలికంగా ఈ రంగంపై ఎక్కువ పడుతుందని అంచనా. 216-17లో సిమెంట్‌ ఉత్పత్తి నాలుగుశాతం పెరుగుతుందని ఇండియారేటింగ్స్‌ అంచనా వేసింది. నవంబరు, డిసెంబరు నెలల్లోనే ఉత్ప త్తి తగ్గిందని అంచనావేసింది. ఏప్రిల్‌నుంచి నవంబరు మధ్యకాలంలో 4.3శాతం వృద్ధి ఉందని, నవంబరునెలలో మాత్రం స్వల్పంగా 0.5శాతం మాత్రమే వృద్ధిని నమోదుచేసిందని తేలింది. చిన్న, మధ్యతరహా సిమెంట్‌ కంపెనీ లు ఈ రెండుత్రైమాసికాల్లో తీవ్రఒత్తిడికి లోనవు తాయని, వాటి రుణభారం కూడా మరింత పెరుగుతుందని ఇండ్‌రా అంచనావేసింది. రియల్‌ఎస్టేట్‌ రంగం నోట్లరద్దు వత్తిడికి లోనవ డం వల్ల ఈ ప్రభావం సిమెంట్‌రంగంపూ చూపించింది. సిమెంట్‌, ఉక్కు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపింది. నవంబరు డిసెంబరునెలల్లో పెద్దనోట్లరద్దుతో దేశవ్యాప్తంగా సిమెంట్‌ అమ్మకాలు 20-25 శాతం తగ్గాయిన అంచనా. దేశవ్యాప్తంగాచూస్తే ప్రతి బస్తాకు 15-20 రూపాయలమేర తగ్గింది. సిమెంట్‌రంగానికి అత్యంతకీలకమైన ముడివనరు పెట్‌కోక్‌ టన్నుకు 60-70 రూపాయలకు పెరిగింది. అంతకుముందు 40 డాలర్లు మాత్రమే ఉన్న వీటిధరలు భారీగాపెరగడం కూడా సిమెంట్‌రంగానికి భారం అయింది. వ్యక్తిగత ఇళ్ల నిర్మాణదారులు రుతుపవనాలు మంచిగా ఉంటున్నందున గ్రామీణప్రాం తాల్లో వృద్ధి ఉంటుందని అంచనావేస్తే పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు అందుబాటులోకి రాగలిగితే బిల్డర్లు కొంతమేర కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ విశ్లేషించింది.
1entertainment
బిగ్ బాస్2: కౌశల్ పెద్ద వెధవ.. నోరుజారిన నందిని Highlights ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా 'నా రుణం బాగా తీర్చుకున్నావ్' అంటూ ఆమెపై సెటైర్ వేశారు. దీంతో ఫైర్ అయిన నందిని.. అమిత్, తనీష్ ల వద్ద 'వాడొక పెద్ద వెదవ..' అంటూ నోరు జారేసి కెమెరా ముందు సారీ చెప్పే ప్రయత్నం చేసింది. ఇక ఈ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నటి పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చారు. రాత్రి అందరూ పడుకున్న తరువాత బిగ్ బాస్ ఆమెను హౌస్ లోకి పంపించారు.  బిగ్ బాస్ సీజన్ 2 లో ఆదివారం తేజస్వి ఎలిమినేట్ కావడంతో సోమవారం ప్రారంభమైన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియ ఒకరి గురించి మరొకరు మాటలు అనుకునే పరిస్థితిలో జరిగింది. ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ లో మీకు నచ్చని ఇద్దరి వ్యక్తుల నెత్తిపై గుడ్డు పగల కొట్టాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ కాస్త సీరియస్ గా సాగింది. అందరూ మూకుమ్మడిగా కౌశల్ ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సామ్రాట్, గణేష్, తనీష్, రోల్, బాబు గోగినేని, అమిత్, నందిని అందరూ కౌశల్ నెత్తిపై గుడ్డు పగలగొట్టారు.  అతడు హౌస్ లో చేస్తోన్న పనులు అందరితో ప్రవర్తించే తీరు నచ్చక నామినేట్ చేస్తున్నట్లు ఒక్కొక్కరు వెల్లడించారు. ఈ వారం ఎలిమినేషన్ లో కౌశల్ తో పాటు, బాబు గోగినేని, గణేష్, అమిత్, దీప్తి  సునైనా, నందినిలు ఉన్నారు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో నందిని.. కౌశల్ ను నామినేట్ చేయడం భరించలేని కౌశల్ ''నిన్ను అనవసరంగా సేవ్ చేశాను.. నువ్వు స్నేహానికి అర్హురాలివి కాదు.. నువ్వు అడిగినప్పుడే నేను సలహాలు ఇచ్చాను గానీ.. నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు'' అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా 'నా రుణం బాగా తీర్చుకున్నావ్' అంటూ ఆమెపై సెటైర్ వేశారు. దీంతో ఫైర్ అయిన నందిని.. అమిత్, తనీష్ ల వద్ద 'వాడొక పెద్ద వెదవ..' అంటూ నోరు జారేసి కెమెరా ముందు సారీ చెప్పే ప్రయత్నం చేసింది. ఇక ఈ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నటి పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చారు. రాత్రి అందరూ పడుకున్న తరువాత బిగ్ బాస్ ఆమెను హౌస్ లోకి పంపించారు.
0business
33,500 కోట్ల విలువైన ఆస్తులు జప్తు - 390కిపైగా చార్జ్‌షిట్‌లు నమోదు.. - గడిచిన మూడేండ్లలో ఈడీ దూకుడిదీ.. న్యూఢిల్లీ: ఆర్థిక మోసాలు అంతకంతకు పెరుగుతున్న వేళ దేశంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఈడీ) విస్తృతంగా ఆస్తులం అటాచ్‌మెంట్‌ను చేపుడుతోంది. తాజా గణాంకాల ప్రకారం ఈడీ గడిచిన మూడేండ్ల కాలంలో దాదాపు రూ.33.500 కోట్ల విలువైన ఆస్తుతను అటాచ్‌ చేసింది.. దీనికి తోడు మనీ ల్యాండరింగ్‌కు సంబంధించి దాదాపు 390కి పైగా ఛార్జ్‌షీట్లను సంస్థ నమోదు చేసింది. సంస్థ అధినేత కర్నాల్‌ సింగ్‌ మూడేండ్ల పదవీ కాలం ఆదివారంతో ముగిసిపోనుంది. సింగ్‌ తరువాత ఈడీ బాధ్యతలను ప్రముఖ ఐఆర్‌ఎస్‌ అధికారి ఎస్‌.కె.మిశ్రా చేపట్టనున్నారు. ఈడీ తదుపరి బాస్‌గా మిశ్రా పేరును శనివారం ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 2015లో ఈడీ బాధ్యతలు స్వీకరించిన కర్నాల్‌ సింగ్‌ పలు కీలకమైన, ప్రముఖమైన కేసుల చేధిస్తూ.. ఛార్జ్‌షీట్లను నమోదు చేయడంతో పాటు ఆస్తులను జప్తు చేస్తూ వచ్చారు. అగస్టా వెస్ట్‌లాండ్‌ వీవీఐపీ చౌపర్‌ కేసు, 2జీ కేసు, బొగ్గు స్కామ్‌, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మనీ లాండరింగ్‌ కేసు, స్టెర్లింగ్‌ బైయోటెక్‌ మోసం కేసుతో పాటు కింగ్‌ ఫిషర్‌ విజరు మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ, మోహుల్‌ చౌక్సీ బ్యాంక్‌ మోసం కేసులను సింగ్‌ ధైర్యంగా దర్యాప్తు జరపుతూ ఆస్తుల జప్తు కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకు ముందు దశాబ్ద కాలంలో (2005-2015) ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ రూ.9003 కోట్లుగా ఉంటే.. 2015-18 మధ్య కాలంలో ఈడీ రికార్డుస్థాయిలో రూ.33.500 కోట్ల ఆస్తులను జప్తు చేయడం విశేషం. 2005-2015 మధ్య కాలంలో ఈడీ 173 ఛార్జి షీట్లు, ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదులు నమోదు చేయగా.. 2015-18 మధ్య కాలంలో వీటి సంఖ్య 390కి పెరగడం విశేషం. ఇదే సమయంలో 2005-2015 మధ్య కాలంలో ఈడీ 492 ఆస్తులకు సంబంధించిన అటాచ్‌మెంట్‌ ఆర్డర్స్‌ను జారీ చేయగా.. గడిచిన మూడేండ్ల కాలంలో వీటి సంఖ్య రికార్డు స్థాయిలో 565కు చేరిందని ఈడీ తెలిపింది. ఇదే కాలంలో ఈడీ ఫెమా చట్టం కింద దాదాపు 8,452 కేసులను నమోదు చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కార్ల పందెం వికటించింది.. స్పెయిన్లో రేసింగ్ కారు ఒకటి అదుపుతప్పి ప్రేక్షకులపైకి దూసుకుపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు TNN | Updated: Sep 8, 2015, 06:35PM IST స్పెయిన్లో రేసింగ్ కారు ఒకటి అదుపుతప్పి ప్రేక్షకులపైకి దూసుకుపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. వారిలో ఒక గర్భిణీ కూడా ఉన్నారు. వాయవ్య స్పెయిన్ ప్రాంతంలో కేరల్ అనే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు లైన్ల మట్టిరోడ్డుపై జరిగిన కార్ల పందెంలో చాలా కార్లు పాల్గొన్నాయి. అంతా ఉత్కంఠగా ఏ కారు ముందుకు దూసుకుపోయి విజయాన్ని దక్కించుకుంటుందో అని ఎదురుచూస్తుండగా.. అల్లంత దూరంలో దట్టంగా కమ్ముకుపోయిన దుమ్ములోనుండి ఉన్నట్లుండి ఒక కారు దూసుకురావడం వీడియో కెమేరాల కంటబడింది. కన్ను మూసి తెరిచేలోపే ఆ కారు అదుపుతప్పడం, ప్రేక్షకులు కూర్చున్న గ్యాలరీ మీదకు దూసుకురావడం జరిగిపోయింది. కార్ల పందేన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న టెలివిజన్ చానళ్లలో ఈ దృశ్యాలను దేశమంతా చూసి విస్తుపోయింది.
2sports
Visit Site Recommended byColombia ఈ వర్సిటీ ఏర్పాటుతో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు.. హీరో, ఇసుజి, కియ, టాటా, అశోక్‌ లేల్యాండ్‌ వంటి సంస్థలు తమకు అనువైన వారిని గుర్తించి.. వారికి ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధిని ఇచ్చేందుకు ముందుకు వస్తాయని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చెబుతోంది. విశాఖలో ఏర్పాటు చేసే స్కిల్స్‌ వర్సిటీలో ఏటా 20,000 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తారని పేర్కొంది. పైన పేర్కొన్న వాటితో పాటు ఏటా 5000 మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చే సామర్థ్యం కలిగిన మినీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఇనిస్టిట్యూట్‌లను విశాఖ, అమరావతి, తిరుపతిలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మినీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఇనిస్ట్టిట్యూట్‌లు కూడా భారతీయ పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఉన్నతాధికారవర్గాలు వివరిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా నెల నుంచి మూడు నెలల వ్యవధిలో కంప్యూటర్‌ లిటరసీ, కుట్లు, అల్లికలు, పచ్చళ్ల తయారీ వంటి వాటిలో శిక్షణను ఇస్తున్నారు. ఇవన్నీ నామమాత్రంగానే ఉంటున్నాయే తప్ప స్వయం ఉపాధికిగానీ, పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనకు గానీ దోహదపడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి వర్సిటీ నిరుద్యోగులకు కచ్చితమైన ఉపాధిని కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రఖ్యాత ఆటో దిగ్గజ సంస్థ కియాతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంప్రదింపులు జరిపింది. ఈ సంస్థ ముందుకొచ్చి.. తమకు అవసరమైన నైపుణ్యాలేమిటో స్పష్టం చేయడంలో కీలక అడుగు పడింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
మరో విజయం కోసం ఉవ్విళ్లూరుతూ టీమిండియా రెఢీ నేడు ఆస్ట్రేలియాతో 2వ టి20 మెల్బోర్న్‌ : టి20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో గెలిచిన ధోనీ సేన మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తుంది.కాగా వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఎలాగైనా సరే టి20 సిరీస్‌ను గెలువాలనే పట్టుదలతో ఉంది. కాగా జనవరి 29న మల్బోర్న్‌ వేదికగా రెండవ టి20 మ్యాచ్‌ జరుగనుంది.భారత కాలమానం ప్రకారం నేడు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.కాగా మరోవైపు ఆసీస్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు.ఏ ఫార్మెట్‌లోనైనా వెనుకబడిన ప్రతిసారి మళ్లీ అంతే స్థాయిలో ఆస్ట్రేలియా పుంజుకోవడాన్ని చాలా సందర్బాలలో చూశాం.కెప్టెన్‌ ఆర్‌న్‌ ఫించ్‌ ఆగా ఆడటంతో ఆ జట్టుకు బలంగా మారింది.భారీ షాట్లకు యత్నించి తొలిటి20లో ఆసీస్‌ వికెట్లను కోల్పోయింది.దీంతో రెండవ టి20లో నెమ్మదిగా ఆడాలని భావిస్తుంది.విరాట్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ఇందుకు ఉదాహరణగా చూపిస్తుంది.బౌలర్లు మరింత సమర్థవంతంగా బౌలింగ్‌ చేయాలని కెప్టెన్‌ సూచించారు.ఫీల్డిండ్‌ తప్పిదాలను పునరావృతం చేయరాదని ఆటగాళ్లకు జట్టు కోచ్‌ సూచించినట్లు తెలుస్తుంది. అదనపు పరుగులు,క్యాచ్‌లు జారవిడువడం తొలి టి20 ఓటమికి కారణమని, ఆసీస్‌ విశ్లేషకులు స్పష్టం చేశారు. కాగా రెండవ టి20లో అవి పునరావృతం చేయకూడదని భావిస్తున్నారు.దీంతో ఇరు జట్ల మధ్య మరో ఆసక్తికర పోరు తప్పకపోవచ్చు.వన్డే సిరీస్‌ను భారత్‌ 1-4 తేడాతో ఓటమి చెందడంతో టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చోటు చేసుకున్న  సంగతి తెలిసిందే.తొలి 20లో గెలిచిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా… ఆరోన్‌ ఫించ్‌ కెప్టెన్‌,డేవిడ్‌ వార్నర్‌,స్టీవ్‌ స్మిత్‌,గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌,షాన్‌ మార్ష్‌,క్రిస్‌ లిన్‌,జేమ్స్‌ ఫాల్కనర్‌,మాథ్యూవేడ్‌ వికెట్‌ కీపర్‌,నాథన్‌ లియోన్‌,కామెరాన్‌ బో§్‌ు్స,ట్రావిస్‌ హెడ్‌,జాన్‌ హేస్టింగ్‌స,స్కాట్‌,కేన్‌ రిచర్డ్సన్‌,ఆండ్రూ టై,షాన్‌ టైట్‌,షేన్‌ వాట్సన్‌. ఇండియా … ధోనీ కెప్టెన్‌,వికెట్‌ కీపర్‌,శిఖర్‌ ధావన్‌,రోహిత్‌శర్మ,విరాట్‌ కోహ్లీ యువరాజ్‌,సురేష్‌ రైనా,హార్దిక్‌ పాండ్యా,గురుకీర్త్‌సింగ్‌ మాన్‌,రిషి ధావన్‌,జడేజా,అశ్విన్‌,హర్బజన్‌సింగ్‌,జస్ప్రీత్‌ బూమ్రా,ఆశిష్‌ నెహ్రా,ఉమేష్‌ యాదవ్‌,అజింక్యా రహానే.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘కార్తీకదీపం’ నవంబర్ 5 ఎపిసోడ్ : సూపర్ హిమా! ‘డాక్టరమ్మా అనకుండా ఆంటీ అనేసింది!? బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 643 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 644 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. Samayam Telugu | Updated: Nov 5, 2019, 10:49PM IST ‘కార్తీకదీపం’ నవంబర్ 5 ఎపిసోడ్ : సూపర్ హిమా! ‘డాక్టరమ్మా అనకుండా ఆంటీ అనేసింది!... మౌనిత టార్గెంట్ మొత్తం హిమనే. ఎందుకంటే హిమ కొత్త అమ్మ కోసం వెతకడం, నేను అడిగితే కాదనకూడదని తండ్రి కార్తీక్ దగ్గర హిమ మాటల తీసుకోవడం.. అంతా మౌనితకి తెలుసు. హిమే స్వయంగా ‘మౌనితని పెళ్లి చేసుకో డాడీ..’ అనాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది మౌనిత. అయితే సీన్ బెడిసి కొట్టింది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (నవంబర్ 5) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే. గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. మురళీ కృష్ణ.. దీపకు కాల్ చేసి సౌర్య ఇంటికి వచ్చిందని, తండ్రి కోసం ప్రశ్నలు వేసిందని చెబుతాడు. దాంతో దీప వారణాసి మీద కోప్పడుతుంది. ‘దాన్ని అక్కడికి ఇక్కడికీ తీసుకుని వెళ్లడం ఎందుకురా? నువ్వే చెప్పేయ్.. దాని తండ్రి ఎవరో నీకు తెలుసుకదా.. అప్పుడైనా నీ కడుపు చల్లపడుతుంది..’ అంటూ తిట్టి బయటికి పొమ్మంటుంది. డినర్ చేసే టైమ్‌కి సౌందర్య, ఆనందరావు, హిమ, కార్తీక్, ఆదిత్య అంతా రెడీ అవుతుంటే.. కార్తీక్ ఆకలి వేయట్లేదు అంటాడు. ఇంతలో మౌనిత క్యారేజ్ పట్టుకుని వచ్చి.. ‘అలా అంటే ఎలా కార్తీక్.. నువ్వు మధ్యాహ్నం కూడా తినలేదటగా.. హాస్పెటల్‌లో చెప్పారు.. అందుకే మా వంటలక్క ప్రియమణితో వంట చేసించి తీసుకొచ్చాను.. పద తిందూగానే’ అంటుంది. అదంతా చూస్తున్న సౌందర్య అండ్ కో బ్యాచ్కి కాలిపోతుంటే హిమ మాత్రం మౌనిత మాటలకి బాగా ఇప్రెస్ అవుతుంది. ‘థ్యాంక్స్ డాక్టర్ అమ్మా’ అంటూ హగ్ చేసుకుంటుంది. 644 ఎపిసోడ్‌లో హైలైట్స్‌.. ‘హిమా.. నీకూ మీ డాడీకి చాలా ఇష్టమని రొయ్యలు కూర వండించి తీసుకొచ్చాను.. తిందురుగానే రండీ’ అంటూ మౌనిత హిమ ముందు ఓవర్ యాక్షన్ చేస్తుంటే.. సౌందర్య కావాలనే.. నవ్వుతూ.. ‘అవునా.. రొయ్యలంట హిమా.. తిందువుగానే పదా..’ అంటూనే.. ‘రా మౌనితా నువ్వు కూడా మాతో కలిసి తిందువుగానీ’ అంటూ తీసుకుని వెళ్లి.. ప్రేమగా సౌందర్య డిన్నర్‌కి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతూ.. ‘గెస్ట్ ఫస్ట్’ అంటుంది. వెంటనే మౌనిత మనసులో టెన్షన్ పడుతూ.. ‘ఈవిడేంటీ? ఇలా కూల్‌గా మాట్లాడుతోంది?’ అనుకుంటూనే కూర్చుంటుంది. వండన చేస్తూనే చురకలు వేయడం మొదలుపెడుతుంది సౌందర్య. Read Also: మీరు ‘కార్తీకదీపం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్‌లు ఒక్క క్లిక్‌తో! ‘పాపం.. మౌనితకి గానీ కరెక్ట్ టైమ్‌లో పెళ్లి అయితే మన హిమ అంత కూతురు ఉండేది’ అంటూనే.. ‘అసలు మౌనితకి పెళ్లి అయితే దాని మొగుడు మాత్రం రెండో రోజే దన్నం పెట్టి పారిపోయేవాడు.. ఎందుకంటే మౌనితకి అసలు వంటరాదుగా.. భార్యంటే భోజ్యేషు మాత. కానీ ఇంకేం నేర్చుకుంటుంది.. ఇలా ప్రియమణి లాంటి వాళ్ల మీద ఆధార పడ్డం తప్పా? అయినా పరాయి వాళ్ల ఇంటికి తీసుకుని రావడం కంటే ముందు తన భర్త పిల్లలకి పెట్టుకోవడం రావాలిగా’ అంటూ చాలా రకాలుగా.. హిమకు అర్థమయ్యేవిధంగా మాట్లాడుతుంది సౌందర్య. మౌనిత వేసుకునే డ్రెసింగ్ గురించి కూడా కామెంట్ చేస్తుంది. హిమ గమనించడంతో మౌనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. Read Also: ‘కోయిలమ్మ’ సీరియల్ : చిన్నీకి సమీర్ సపోర్ట్! ‘తప్పు చేశావంటే నేను నమ్మను వదినా!?’ ఇంతలో కార్తీక్ కూడా కలుగజేసుకుని.. ‘అది మాత్రం నిజం మమ్మీ.. కచ్చితంగా అదే జరిగేది. మౌనిత వాళ్ల ఆయన మాత్రం కచ్చితంగా సన్యాసం తీసుకుని పోయేవాడు’ అంటాడు. అదంతా హిమ గమనిస్తుంది. అంతా వింటూనే కాస్త అసహనంగా ముఖం పెడుతుంది. ‘అబ్బా హిమకు నా మైనెస్ లన్నీ చెప్పేస్తుందే’ అనుకుని.. చేయి కడుక్కుని ‘నేను వెళ్తాను ఆంటీ’ అంటూ పైకి లేస్తుంది. దాంతో సౌందర్య నవ్వుతూ.. ‘హిమా.. మౌనిత నీ కోసం ఎంతో కష్టపడి కర్రీ వండించి తీసుకొచ్చింది థ్యాంక్స్ చెప్పు’ అనడంతో.. అయిష్టంగా మౌనిత వైపు చూస్తూ.. ‘థ్యాంక్స్ మౌనితాంటీ’ అంటుంది హిమ. దాంతో మౌనిత షాక్ కాగా మిగిలిన వాళ్లంతా నవ్వుతారు. Read Also: ‘మౌనరాగం’ సీరియల్ : భరత్ హైడ్రామా! అంకిత్ కూడా నమ్మేశాడు? మొత్తానికి అక్కడ నుంచి బయటపడిన మౌనిత తనలో తనే చాలా బాధపడుతుంది. సౌందర్య కొట్టిన దెబ్బను తలుచుకుని తలకొట్టుకుంటుంది. ‘అమ్మో అత్తా పోట్లగిత్తా.. తెలివిగా కొట్టావే’ అంటూ తనలో తనే రగిలిపోతుంది. సౌర్య కావాలనే.. దీపని బయటకి పంపించేందుకు ‘సరోజక్కకి జ్వరం అంట.. చూసిరాపో’ అని పంపించి ఇళ్లంతా వెతుకుతుంది. దీపారాధన విహారీ రాసిన బుక్ కనిపిస్తుంది. అది గమనిస్తూ ఉంటుంది సౌర్య. సౌందర్య చేసిన పనికి ఆదిత్య, ఆనందరావులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పొగుడుతారు. హిమ మనసులో మౌనిత మీద ఉన్న ఫీలింగ్ పోగొట్టేశావ్ సూపర్ సౌందర్య నువ్వు అంటూ ఆనందరావు సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. Read Also: బిగ్ బాస్ రవి కృష్ణ నటించిన... ‘ఆమె కథ’.. మంచోడు మోసంగాడేనా? ఎంట్రీ అదిరింది! ఇంతలో హిమ రావడంతో.. సౌందర్య, ఆదిత్య, ఆనందరావు.. అంతా సైలెంట్ అయిపోతారు. హిమని పిలిచి.. మధ్యలో కూర్చోబెట్టుకుని.. ‘మీ డాడీకి ఎవరో కొత్తమ్మని చూస్తున్నా అన్నావ్‌గా ఏమైంది?’ అని అడుగుతుంది సౌందర్య. అయితే ‘మౌనితకి మంచి భార్యకు ఉండాల్సిన లక్షణాలు లేవని సౌందర్య అన్న మాటకు కార్తీక్ కూడా సపోర్ట్‌గా మాట్లాడటం గుర్తు చేసుకున్న హిమ.. ఏం సమాధానం ఇస్తుందో.. తరువాయి భాగంలో చూద్దాం.. కార్తీకదీపం కొనసాగుతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV బండ్ల ఈజ్ బ్యాక్.. బ్లేడ్ ఛాలెంజ్‌పై దిమ్మతిరిగే ఆన్సర్ చాలా రోజుల తరువాత కనిపించారు.. కాస్త నవ్వండి సార్.. బండ్ల గణేష్ గారూ.. ఎలా ఉన్నారు అని మీడియా పలకరిస్తే.. ఈ విధంగా స్పందించారు. Samayam Telugu | Updated: Dec 18, 2018, 12:52PM IST అర్హత లేని వాటికోసం ఆరాట పడకూడదు. అర్హతకి మించి పోరాడకూడదు. ఈ రెండు ప్రమాదమే. ఏమీ లేకుండా ఎగిరెగిరి పడేతే పళ్లు ఊడిపోవడం తప్ప ఏమీ ఉండదు. ముందు మైక్ ఉంది కాదా అని నోటి కొచ్చినట్లు మాట్లాడితే.. ఇదిగో పరిస్థితి బండ్ల గణేష్ మాదిరే ఉంటుంది. మాట జారితే దాని పర్యావసానం ఎలా ఉంటుందో బండ్ల గణేష్‌కి బాగా తెలిసొచ్చింది. అయితే గతంలో చాలా మంది నేతలు బాహాటంగానే మాటిచ్చి తప్పినా ఇంతిలా టార్గెట్ కాబడలేదు.. కాని బండ్ల గణేష్ విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. ఆయన ఒక్కసారి బ్లేడ్‌తో పీక కోసుకుంటా అన్న మాటకు సోషల్ మీడియాలో ఆయన పీకను జోకులు, కామెంట్స్‌తో బండ్ల గణేష్ పీకను పీస్ పీస్‌లుగా చేస్తున్నారు. ఎలక్షన్ రిజల్ట్ తరువాత అత్యధికంగా ట్రోల్ కాబడ్డారు బండ్ల గణేష్. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే పీక కోసుకుంటా అన్న మాటకు.. ఏకంగా బ్లేడ్ పట్టుకుని ఆయన ఇంటికే వెళ్లాడు ఓ అత్యుత్సాహపు రిపోర్టర్. కాగా.. ఎలక్షన్స్ రిజల్ట్ తరువాత నుండి అజ్ఞాతవాసంలో ఉన్న బండ్ల గణేష్ ఎట్టకేలకు మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల దైవ దర్శనం చేసుకున్న బండ్ల గణేష్ భక్తులకు వైకుంఠ ఏకాదశి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.
0business
Suresh 352 Views   చెన్నై: భారత క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు చాలా మంది అభిమానులున్నారు.కాగా అతను మాత్రం ఒకరికి వీరాభిమాని అని ఇటీవల పేర్కొన్నాడు.తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌,ప్రముఖ నటి త్రిష అంటే తనకు ఎంతో ఇష్టమని వారి వీరాభిమానని వెల్లడించాడు.ముఖ్యంగా త్రిషకు తాను ఎనిమిదవ తరగతి నుంచి వీరాభిమానిని అని చెబుతున్నాడు అశ్విన్‌.తమిళంలో త్రిష నటించిన లేసా లేసా సిసిమా చూసినప్పటి నుంచి ఆమెకు అభిమానిగా మారినట్లు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వివరించాడు.అంతేకాదు,హైస్కూల్‌లో చదవేప్పుడు స్నేహితులతో కలిసి త్రిష అభిమాన సంఘం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు.సంఘాన్ని ఏర్పాటు చేసినా దాని రిజిస్టర్‌ చేసుకోవాలన్న విషయం అప్పట్లో తెలియదన్నాడు.తమిళ సినిమాలంటే తన కిష్టమన్నాడు.ఇప్పటికీ వీలు కుదిరినప్పుడల్లా హాస్యం పాళ్లు ఎక్కువగా ఉన్న సినిమాలు చూసి,ఆనందిస్తానని పేర్కొన్నాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV యువరక్తానికి అలీబాబా పిక్చర్స్ శిక్షణ సినిమాలంటే ఇష్టం, ఆసక్తి ఉన్నవారికి ఓ మంచి అవకాశాన్ని ఇస్తోంది చైనా సంస్థ అలీబాబా పిక్చర్స్. TNN | Updated: Oct 29, 2015, 11:21AM IST సినిమాలంటే ఇష్టం, ఆసక్తి ఉన్నవారికి ఓ మంచి అవకాశాన్ని ఇస్తోంది చైనాకు చెందిన అలీబాబా పిక్చర్స్. అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయిన అలీబాబా గ్రూప్ ను చెందిందే ఈ అలీబాబా పిక్చర్స్. ఇంతకుముందు చైనా విజన్ మీడియాలో భాగస్వామిగా ఉండేది. ఆ కంపెనీలో ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేసి అలీబాబా పిక్చర్స్ గా పేరు మార్చింది. ఇప్పుడీ కంపెనీ చిత్రరంగంలో అడుగుపెట్టాలనుకునే యువరక్తానికి పూర్తి స్థాయిలో నైపుణ్యాలను అందించాలనే ఆశయంతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించబోతోంది. దీనికోసం ఏకం 156 మిలియన్ డాలర్లను కేటాయించింది. ఆ ఇన్‌స్టిట్యూట్లో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుంచైనా అభ్యర్థులు రావొచ్చు. వారి వయసు 45 ఏళ్లలోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియ గురించి ఇంకా వివరాలు తెలియలేదు. చాలా పరిమిత సంఖ్యలోనే అభ్యర్థులను తీసుకునే అవకాశం ఉంది. దానికి ఎంపికైన అభ్యర్థులకు ఆస్కార్ అవార్డులు అందుకున్న హాలీవుడ్ సినీరంగ ప్రముఖులు శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాదు అభ్యర్థులు వారితో కలిసి పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంటారు. యానిమేషన్, ఫిల్మ్ డిజైన్, స్పెషల్ ఎఫెక్ట్స్... ఇలా వివిధ అంశాలలో శిక్షణ ఉంటుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభ్యర్థులు లక్షల్లోనే పోటీపడతారని అంచనా.
0business
Visit Site Recommended byColombia 2015 ఐపీఎల్ సీజన్‌లో రూ. 16 కోట్లతో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డులు నెలకొల్పిన యువరాజ్ సింగ్ గత ఏడాదన్నరకాలంగా టీమిండియాకి దూరంగా ఉండటం, 2018 ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శన కారణంగా అతనిపై ఫ్రాంఛైజీలు అయిష్టం కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్‌ని ఎవరైనా కొనుగోలు చేస్తారా..? లేదా..? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. సుదీర్ఘకాలంగా బెంగళూరులోనే ఈ ఆటగాళ్ల వేలం జరుగుతుండేది. కానీ.. ఈసారి జైపూర్‌కి మార్చారు. స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌‌లో ఈ వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లోని 8 ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 70 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండగా.. 346 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఇందులో 246 మంది భారత క్రికెటర్లే ఉన్నారు. వాస్తవానికి ఐపీఎల్ వేలం కోసం 1,003 మంది క్రికెటర్లు రిజస్టర్ చేసుకోగా.. తుది జాబితానికి 346కి కుదించారు. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరతో 9 మంది క్రికెటర్లు వేలంలోకి రానుండగా భారత్‌ నుంచి ఈ జాబితాలో కనీసం ఒక్కరు కూడా లేకపోవడం కొసమెరుపు. ఐపీఎల్ 2018 సీజన్‌లో యువరాజ్ సింగ్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో అతడ్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ ఫ్రాంఛైజీ వేలంలోకి విడిచిపెట్టింది. దీంతో.. ఒత్తిడికి గురైన యువీ.. తన కనీస ధరని రూ. కోటికి తగ్గించుకున్నాడు. మరోవైపు 2018 సీజన్‌లో రూ.11.5 కోట్లకి అమ్ముడుపోయిన జయదేవ్ ఉనద్కత్‌ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ విడిచిపెట్టడంతో.. అతను తన ధరని రూ. 1.5 కోట్లకి తగ్గించుకుని వేలంలోకి వస్తున్నాడు. భారత్ తరఫున ఈ ఇద్దరు క్రికెటర్ల వేలంపై ఆసక్తి నెలకగా.. రూ. కోటి కనీస ధరతో అక్షర్ పటేల్ (స్పిన్నర్), వృద్ధిమాన్‌ సాహా (వికెట్ కీపర్), మహ్మద్ షమీ (ఫాస్ట్ బౌలర్) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇటీవల ఆటగాళ్లని రిలీజ్, రిటైన్ చేసుకున్న తర్వాత ఫ్రాంఛైజీల వద్ద మిగిలిన ఉన్న డబ్బుని ఓసారి పరిశీలిస్తే..! 1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వద్ద రూ. 36.20 కోట్లు, 2. కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ. 15.20 కోట్లు, 3. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 25.50 కోట్లు (ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇటీవల పేరు మార్చుకుంది), 4. ముంబయి ఇండియన్స్ వద్ద రూ. 11.15 కోట్లు, 5. రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 20.95 కోట్లు. 6. సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 9.70 కోట్లు, 7. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 18.15 కోట్లు, 8. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 8.40 కోట్లు   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
ఆదర్శంగా వుండాలి కదా రానా.. ఏంటి నానా Highlights జోగేంద్రకు కోపం వచ్చింది... యాంకరమ్మపై చిందులేశాడు... ఓ ఛానెల్ నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్ ఇంటర్వ్యూలో డ్రగ్స్ పై ప్రశ్న అసందర్భం అంటూ యాంకర్ పై శివాలెత్తిన రానా, దడుసుకున్న యాంకరమ్మ తెలుగు సినీ పరిశ్రమలో దగ్గుబాటి కుటుంబానికి ప్రత్యేక స్థానం. మూవీ మొఘల్ గా ఖ్యాతి సంపాదించిన దగ్గుబాటి రామానాయుడు.. తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివి. రామానాయుడు వారసులుగా ఆ కుటుంబం నుంచి వచ్చిన సురేష్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, వెంకటేశ్, రానాలు హీరోలుగా క్రేజ్ సంపాదించారు. టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ లో ఒకటైన.. దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా దగ్గుబాటి నటించిన తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి. ఇప్పటికే ఈ మూవీకి తెగ ప్రమోషన్స్ చేస్తూ... సందడి చేస్తున్న రానాకు సడెన్ గా కోపం వచ్చింది.   తాజాగా, నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్ లో భాగంగా రానా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ రెడీ అయ్యాడు. ఇంటర్వ్యూకు వచ్చిన రానాని.. ఛానెల్ యాంకరమ్మ ఇటీవలే సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు గురించి ఓ ప్రశ్న అడిగింది. దాంతో ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్ కోసం వస్తే... ఇదేం అర్థంలేని ప్రశ్న అంటూ రానా కూడా ఆ లేడీ యాంకరమ్మ మీద ఫుల్ గా సీరియస్ అయ్యాడు. సెలెబ్రిటీ లు అంటే ఆటలుగా ఉందా అంటూ యాంకర్ పై శివాలెత్తాడు.     యాంకరమ్మ వెనకంజవేయలేదు.  మీక్కూడా ఏదో పార్శిల్ వచ్చిందని, ఎక్సైజ్ అధికారులు మీ స్టూడియోకి వచ్చారనే వార్తలు వచ్చాయి... అసలేం జరిగిందని ప్రశ్నించింది. దాంతో సినిమా ప్రమోషన్ కోసం వస్తే ఇవేం దిక్కుమాలిన ప్రశ్నలు.. అంటూ రానా చాలా సీరియస్ గా ఫేస్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు నచ్చని ప్రశ్న అసందర్భంగా అడగటంతో కంట్రోల్ తప్పిన రానా... యాంకర్ కు వేలు చూపి చిట్క వేస్తూ వేస్తూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అఢగొద్దు అంటూ హెచ్చరించాడు. దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా కనిపిస్తోంది అంటూ సీరియస్ అయ్యాడు.   ఇటీవల డ్రగ్స్ కేసులో... మీడియా ఛానెళ్లు గోరంతలు కొండంతలు చేసి చూపిస్తున్నాయని ఛానెల్స్ పై రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు తమ అసహనం ప్రదర్శిస్తున్న ఘటనలు చూశాం. తాజాగా రానా ఆగ్రహం చూస్తే.. అంతటి సెలెబ్రిటీ ఇంత ఈజీగా కంట్రోల్ తప్పుతారా అని అనిపిస్తుంది. యాంకరమ్మ వేసే ప్రశ్నలు బయటి సమాజం నుంచే వచ్చాయి. అయినా... తమ పెతాపం చూపించడ సబబా?   అదే ఛానెల్ కు చెందిన ఓ యాంకర్ ఇటీవల ఓ కోలీవుడ్ టాప్ హీరోను కూడా ఇలాగే ప్రశ్నించి అతని ఆగ్రహానికి గురైంది. అయితే రానా ఒక యాంకర్ తో అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా హుందాగా వ్యవహరిస్తే బాగుండేదని అంతా అంటున్నారు. చాలా సింపుల్ గా కొశ్చన్ ఈ జ్ అవుటాఫ్ కాంటెక్స్ట్ అని చెప్తే సరిపోయేదని... రానా అలా రెచ్చిపోవడం సరికాదని జనం అనుకుంటున్నారు. బాహుబలితో గ్లోబల్ కీర్తి సంపాదించిన రానా లాంటి వాళ్లు.. ఆదర్శవంతంగా వుండాల్సింది పోయి.. ఇలా పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేయడం సరికాదనంటున్నారు. ఏదైమైనా.. ఈ మధ్య సెలెబ్రిటీలకు మీడియా పైన తెగ కోపమొస్తోందీ మధ్య. ఎందుకో ఆలోచించాలి Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఎన్నాళ్లకెన్నాళ్లకో.. చిరు, నాగ్‌, వెంకీ! టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు సీనియర్ అగ్రహీరోలు ఒకే వేదికపై కనిపించడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా పులకించిపోయారు. TNN | Updated: Nov 13, 2017, 01:04PM IST టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు సీనియర్ అగ్రహీరోలు ఒకే వేదికపై కనిపించడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా పులకించిపోయారు. మెగాస్టార్ చిరంజీవి, యువ సామ్రాట్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ముగ్గురూ వేదికపై తళుక్కుమనడంతో కెమెరా కన్నులు క్లిక్ మన్నాయి. అరుదుగా కనిపించే ఈ అపురూప దృశ్యం అభిమానులను ఖుషీ చేస్తుంది. అయితే ఈ ముగ్గురూ కొత్తగా సినిమా ఏం చేయడంలేదు కాని.. సమంత- నాగచైతన్యల వివాహ రిసెప్షన్‌లో ఈ ముగ్గురు హీరోలు సందడి చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన సామ్-చైతూ వివాహ రిసెప్షన్ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరుకాగా.. చిరు, వెంకటేష్, నాగార్జునలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాగా అక్టోబర్ 6న సమంత-నాగచైతన్యల వివాహం గోవాలో కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వివాహానికి టాలీవుడ్ చెందిన ప్రముఖులు హాజరు కాలేదు. దీంతో తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నాని, సూపర్ స్టార్ క్రిష్ణ ఫ్యామిలీ, క్రిష్ణంరాజు ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, రాఘవేంద్రరావు, మురళిమోహన్, నరేష్, కీరవాణి, దేవీశ్రీప్రసాద్‌, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే మొదలైన తారగణంతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
0business
రోహిత్ శర్మ జట్టుపై ప్రీతి జింటా దుమారం: మండిపడుతున్న ఫ్యాన్స్ Highlights ముంబై ఇండియన్స్ ఐపిఎల్ జట్టు ఓటమిపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, సినీ నటి ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. పూణే: ముంబై ఇండియన్స్ ఐపిఎల్ జట్టు ఓటమిపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, సినీ నటి ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.  ఆదివారం చెన్నై-పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఆమె హాజరైంది.  ముంబై ఇండియన్స్ జట్టుపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యల వీడియో కలకలం రేపుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ముంబై అభిమానులు ఆమెపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.   ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. ఆ విషయం తమ జట్టు మ్యాచ్ కోసం పూణేలో ఉన్న ప్రీతిజింటాకు తెలిసింది.  దీనికి ఆమె తెగ ఆనందపడిపోయి "నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముంబై ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. చాలా హ్యాపీగా ఉంది" అని తన పక్కన ఉన్న వ్యక్తితో అన్నట్లు టీవీలో ప్రసారమైంది.దాన్ని మొబైల్‌లో వీడియో తీసిన ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆమెపై ముంబై అభిమానులు సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టారు.   ఆమె ఆనందానికి కారణాలు లేకపోలేదు. తమ పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవాలి. అలాగే చెన్నై జట్టును పంజాబ్ 53 పరుగుల తేడాతో ఓడించాలి.  ఆమె కోరుకున్నట్లు ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఆమె సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. పంజాబ్ కూడా చెన్నై చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో పంజాబ్ జట్టు కూడా ప్లేఆఫ్ స్థానాన్ని కోల్పోయింది. Last Updated 21, May 2018, 12:32 PM IST
2sports
Sep 08,2017 అపోలో సంగీతారెడ్డికి గౌరవ డాక్టరేట్‌ నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు.. హెల్త్‌ ఐటీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నందుకు గాను అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతా రెడ్డికి గౌరవ డాక్టరేట్‌ లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన మాక్క్యూరీ విశ్వవిద్యాలయం గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సంగీతాకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. భారత ఆరోగ్య సంరక్షణలో చేపడుతున్న అనేక మార్పులతో పాటు దేశ, విదేశాల్లో హెల్త్‌ ఐటీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నందుకు సంగీతాకు ఈ డాక్టరేట్‌ అందిస్తున్నట్టుగా ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్‌ ఎస్‌ బ్రూస్‌ డౌటన్‌ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలికమైన, పరస్పర ప్రయోజనాల నిమిత్తం విద్యా మార్పిడి కోసం అపోలో హాస్పిటల్స్‌, మాక్క్యూరీ యూనివర్సిటీ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాకులు, చైర్మెన్‌ డాక్టర్‌ సి. ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వైద్యులను సమాజానికి అందించడానికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV గూగుల్ తల్లే.. బాలయ్యకి 104 ఏళ్లా? పాపం మొన్నేమో ఏకంగా బాలయ్యను చంపేశారు.. ఇప్పుడేమో 104 ఏళ్లు క్రాస్ చేశాడని అంటున్నారు. Samayam Telugu | Updated: Oct 11, 2018, 05:39PM IST గూగుల్ తల్లే.. బాలయ్యకి 104 ఏళ్లా? గూగుల్‌ మరోసారి తప్పులో కాలేసింది. అప్పట్లో మాజీ ప్రధాని నెహ్రూ ఫోటోకి బదులుగా మోదీ ఫోటోని.. నోబెల్‌ గ్రహీత ఠాగూర్ స్థానంలో ఆధ్యాత్మిక వేత్త శ్రీ అరబిందో ఫొటోని పెట్టి అభాసుపాలయ్యారు. ఇలాంటి పొరపాట్లనే అలవాటుగా చేసుకున్న గూగుల్ తల్లి ఇటీవల నందమూరి బాలకృష్ణను చంపేసింది. బాలయ్య పేరుతో ఉన్న వికీపీడియాలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. అయితే 23 ఏళ్ల క్రితమే అనగా.. 1995లోనే ఆయన మరణించినట్టుగా వికీపీడియాలో దర్శనం ఇచ్చింది. అంతేకాదు ఆయన బెంగుళూరులో మరణించినట్టుగా ప్లేస్ కూడా డిసైడ్ చేసేశారు. ఇది జరిగి వారం గడవక ముందే మళ్లీ బాలయ్య విషయంలో మరో తప్పిదం చేసింది గూగుల్ తల్లి. ‘బాల‌కృష్ణ‌ పుట్టినరోజు’ అని తెలుగులో సెర్చ్ చేస్తుంటే ఆయన వయస్సు 104 ఏళ్లు అని.. సెంచరీ క్రాస్ చేసి నాలుగేళ్లు అయ్యిందంటుంది గూగుల్. ఎప్పుడో 1913 నవంబర్ 2న బాలయ్య పుట్టినట్టుగా చెప్పుకొస్తుంది. అదేంటి బాలయ్య పుట్టింది 1960 జూన్ 10. ఇప్పటికి ఆయన వయసు 58 ఏళ్లు. మరి గూగుల్ తల్లేమో 104 అంటూ వందేళ్లు దాటిన వృద్దుడ్ని చేసేసింది. పాపం మొన్నేమో ఏకంగా బాలయ్యను చంపేశారు.. ఇప్పుడేమో 104 ఏళ్లు క్రాస్ చేశాడని అంటున్నారు. బాలయ్యకి ఆయన ఫ్యాన్స్‌కి తిక్కరేగి దబిడిదిబిడి వాయించకముందే జరిగిన తప్పును సరిదిద్దుకుంటే మంచిది గూగుల్.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV వంద మంది రైతులకు ఒకే ఆధార్ నంబర్.. ప్రహసనంలా ‘మహా’ రుణమాఫీ రైతులకు రుణ మాఫీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అభాసుపాలవుతోంది. TNN | Updated: Oct 25, 2017, 03:47PM IST రైతులకు రుణ మాఫీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అభాసుపాలవుతోంది. రుణ మాఫీ దరఖాస్తుల్లో వంద మందికి పైగా రైతులు ఒకే ఆధార్‌ సంఖ్య‌తో అనుసంధానం కావడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు తలపట్టుకున్నారు. వ్యవసాయ రుణాల మాఫీ కోసం రైతులు ఆధార్‌‌‌తో ఆన్‌‌లైన్‌‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది. డూప్లికేషన్లను అరికట్టడానికి, నకిలీలు రుణ మాఫీ పొందకుండా ఉండటం కోసం ఆధార్ లింకింగ్ ఉపయోగకరమని సర్కారు భావించింది. కానీ తీరా చూస్తే.. ఒకే ఆధార్‌ నెంబర్‌‌కు వంద మందికిపైగా రైతులు అనుసంధానం చేసుకున్నారు. దీంతో అధికారుల మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ప్రతిష్టాత్మక రుణ మాఫీ కాస్తా ఇప్పుడు ప్రహసనంగా మారింది. నకిలీ లబ్ధిదారులను గుర్తించడానికి ఆధార్ అనుసంధానం ఉపయోగపడుతుందని భావించాం. కానీ ఇంత మంది రైతులు ఒకే ఆధార్ సంఖ్యతో అనుసంధానం అవుతారని అనుకోలేదు. రైతుల వద్దకే వెళ్లి అన్నీ తనిఖీ చేయాలంటే కొన్ని వారాల సమయం పడుతుందని ఆన్‌‌లైన్‌ నమోదు ప్రక్రియ చేపట్టాం. కానీ పరిస్థితి ఇలా తయారైందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. రుణ మాఫీ అమలో జాప్యం కారణంగా రైతులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వారు చెప్పారు. రుణ మాఫీ అమలుకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, ఇతర అడ్డంకులను అధిగమించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌.. బ్యాంకర్లు, అధికారులతో భేటీ అయ్యారు. కొందరు రైతుల పేర్లు గల్లంతు కావడం, మరికొందరు రైతుల భూమి వివరాల్లో తేడాలు ఉండటం లాంటి సమస్యల్ని గుర్తించారు. కొందరు రైతులకైతే ఇచ్చే రుణ మాఫీకీ, వడ్డీకి పొంతన ఉండటం లేదు. దీంతో ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని తేల్చే వరకూ రుణ మాఫీ చేయలేమని బ్యాంకర్లు స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 34 వేల కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. తొలి విడతలో భాగంగా.. రూ. 4 వేల కోట్లను గత వారం విడుదల చేసింది.
2sports
Visit Site Recommended byColombia అయితే, ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్ హక్కుల కోసం కరణ్ జోహార్ ఏకంగా రూ.6 కోట్లు చెల్లించారని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే నిజమైతే.. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఏ రీమేక్‌కు చెల్లించనంత ఎక్కువ మొత్తం కరణ్ జోహార్ చెల్లించినట్లవుతుంది. ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమా ‘సింబా’గా రీమేక్ చేశారు. ఇప్పుడు లారెన్స్ ‘కాంచన’ చిత్రాన్ని ‘లక్ష్మీ బాంబ్’గా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాల రీమేక్ హక్కులకు చెల్లించిన మొత్తం ప్రస్తుతం కరణ్ జోహార్ చెల్లించనదాని కన్నా చాలా తక్కువ అని అంటున్నారు. వాస్తవానికి సాజిద్ నడియాద్వాలా, భూషణ్ కుమార్, మురద్ ఖేతాని, విజయ్ గలాని వంటి బడా నిర్మాతలు ‘డియర్ కామ్రేడ్’ రీమేక్ హక్కుల కోసం పోటీపడ్డారట. వీరందరికీ షాక్ ఇస్తూ కరణ్ జోహార్ రూ.6 కోట్ల భారీ ధరకు ‘డియర్ కామ్రేడ్’ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారట. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ మధ్య ఉన్న స్నేహం కూడా ఈ రీమేక్ హక్కులు కరణ్‌కు అందేలా చేసిందట. ఈ సినిమా హిందీ రీమేక్‌లో ఇషాన్ ఖట్టర్, జాన్వి కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా కోసం ఇంకా హీరోహీరోయిన్లను ఖరారు చేయలేదుని ఇటీవల కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. All the best and big success to the team of #DearComradeOnJuly26th ! Also a CLARIFICATION! No lead actors have bee… https://t.co/HSvaI6Z7u8 — Karan Johar (@karanjohar) 1564048742000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 1, Jul 2019, 6:36 PM IST Highlights బాలీవుడ్ లో శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న నటి మల్లికా శరావత్. ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, అందాల ఆరబోతతో మల్లికా కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించేది.  బాలీవుడ్ లో శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న నటి మల్లికా శరావత్. ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, అందాల ఆరబోతతో మల్లికా కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించేది. చాలా చిత్రాలు మల్లికా గ్లామర్ షోతోనే కాసుల పంట పండించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల మల్లికా శరావత్ బాలీవుడ్ లో సినిమాల జోరు బాగా తగ్గించింది. ప్రస్తుతం మల్లికా నటిస్తున్న చిత్రం 'బూ..సబ్కి ఫేటేగి' అనే చిత్రంలో నటిస్తోంది.  ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఇటీవల మల్లికా శరావత్ కపిల్ శర్మ షోలో పాల్గొంది. ఈ షోలో మల్లికా శరావత్ అందాల ఘాటుని వర్ణిస్తూ కపిల్ శర్మ ఫన్నీ కామెంట్స్ చేశాడు. గతంలో చపాతీలు వేడిగా ఉండడం కోసం ఓ హీరోయిన్ పోస్టర్స్ తో చుట్టేవారట నిజమేనా అని ప్రశ్నించగా.. నాకు తెలియదు అంటూ మల్లికా నవ్వుతూ సమాధానం ఇచ్చింది.  మీరు చెప్పింది చాలా సరదా విషయం. కానీ కొంతమంది నా అందాన్ని వికృతంగా ఉపయోగించుకోవాలనుకున్నారు అంటూ బాలీవుడ్ తనకు ఎదురైనా ఓ చేదు అనుభవాన్ని మల్లికా వివరించింది. ఓ సన్నివేశంలో భాగంగా నా నడుము, బొడ్డుని హైలైట్ చేయాలని దర్శకుడు, నిర్మాత భావించారు. ఆ విషయం నాతో చెప్పగా ఓకే అన్నాను. కానీ సెట్స్ కు వెళ్లిన తర్వాత నా నడుముపై కోడిగుడ్డు పెట్టి వికృతంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అలాంటి సన్నివేశాలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాను.  నాపై జరిగిన నెగిటివ్ ప్రచారం కారణంగా దాదాపు 30 చిత్రాల్లో అవకాశాలు కోల్పోయినట్లు మల్లికా వివరించింది. మల్లికా కోపిష్టి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది అంటూ కొంతమంది వ్యతిరేక ప్రచారం చేశారు. చాలా మంది హీరోలు నన్ను తప్పించి ఆ స్థానంలో తమ ప్రియురాళ్లని తీసుకునేవారని మల్లికా శరావత్ ఆరోపించింది.  Last Updated 1, Jul 2019, 6:36 PM IST
0business
Sharad Pawar: Lodha Committee report has 'destroyed' cricket ఆ కమిటీతో భారత్‌లో క్రికెట్ నాశనం..! బీసీసీఐ‌లో సంస్కరణల కోసం సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ అందించిన రిపోర్ట్ కారణంగా భారత్‌లో క్రికెట్ నాశనమైందని ఎన్సీపీ చీఫ్, TNN | Updated: Nov 10, 2017, 05:39PM IST బీసీసీఐ‌లో సంస్కరణల కోసం సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ అందించిన రిపోర్ట్ కారణంగా భారత్‌లో క్రికెట్ నాశనమైందని ఎన్సీపీ చీఫ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ఘాటుగా విమర్శించాడు. లోధా కమిటీ సిఫార్సు చేసిన కొన్ని సంస్కరణలను బోర్డులో అమలు చేస్తుండటంపై శరద్ పవార్ స్పందన అడగ్గా.. ఆయన పైవిధంగా స్పందించాడు. 2013 ఐపీఎల్ స్ఫాట్ ఫిక్సింగ్‌‌లో.. అప్పటి వరకు బీసీసీఐ ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి ప్రమేయం పరోక్షంగా ఉండటంతో బోర్డుని సంస్కరించాలని సుప్రీంకోర్టు ఆ కమిటీని 2015లో ఏర్పాటు చేసింది. కమిటీ రిపోర్ట్‌లో ఒక రాష్ట్రానికి.. ఒక ఓటు, ఒక వ్యక్తికి బోర్డులో ఒక పోస్ట్, బీసీసీఐలో ఏ స్థాయి ఉద్యోగికైనా వయో పరిమితి 70 ఏళ్లుగా నిర్ణయించడంతో.. కొన్నేళ్లపాటు బోర్డులో చక్రం తిప్పిన 76 ఏళ్ల శరద్ పవార్ లాంటి వ్యక్తులు తమ అధికారాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. ‘లోధా కమిటీ రిపోర్ట్ నిస్సందేహంగా భారత్‌లో క్రికెట్‌ని సర్వనాశనం చేసింది’ అని శరద్ పవార్ ఘాటుగా వ్యాఖ్యానించడం వెనుక అదే అసలు కారణమని తెలుస్తోంది.
2sports
శర్వానంద్ అలవాట్లు.. ఆ హీరోయిన్ ను ఇబ్బంది పెడుతున్నాయా..? Highlights శతమానం భవతి, మహానుభావుడు వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శర్వానంద్ టాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు హనురాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచే మనసు' అనే సినిమాలో నటిస్తున్నాడు.  శతమానం భవతి, మహానుభావుడు వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శర్వానంద్ టాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు హనురాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచే మనసు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. రీసెంట్ గా కలకత్తా షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్రబృందం కొత్త షెడ్యూల్ కు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ జరుపుకోవడం లేదని సమాచారం. దానికి కారణం శర్వానంద్ అని చెబుతున్నారు. తన వ్యక్తిగత అలవాట్ల కారణంగా శర్వానంద్ రోజు రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడంతో సెట్స్ కు ఉదయాన్నే రావడం లేదని సమాచారం. ఉదయాన్నే 8 గంటలకు షూటింగ్ మొదలుపెట్టాలి. హీరోయిన్ 7 గంటలకు సెట్స్ కు చేరుకొని మేకప్ వేసుకొని 8 గంటలకు సిద్ధంగా ఉన్నా.. శర్వానంద్ మాత్రం రావడం లేదట. మధ్యాహ్నం సమయానికి అతడు సెట్ కు చేరుకోవడంతో షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదని సమాచారం. శర్వా ప్రవర్తన ఇలానే ఉండడం పైగా దర్శకనిర్మాతలు కూడా అతడిని ప్రశ్నించకపోవడంతో సాయి పల్లవి అసహనానికి లోనైందని సమాచారం. చూసి, చూసి ఇక ప్రయోజనం లేదనుకొని నేరుగా దర్శకనిర్మాతలను, శర్వానంద్ ను ప్రశ్నించింది. వర్క్ విషయంలో నిబద్దత లేకపోవడంతో సాయి పల్లవి యూనిట్ పై ఫైర్ అయిందని సమాచారం. ఈ ఆలస్యం కారణంగా సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయింది. ఈ సినిమా పూర్తయ్యే నాటికి రూ.40 కోట్లు బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతకుమించి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇది శర్వా మార్కెట్ కు చాలా ఎక్కువనే చెప్పాలి. మరి ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తీసుకొస్తుందో లేదో చూడాలి!
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV DeepVeer wedding: దీపిక - రణ్‌వీర్ వెడ్డింగ్.. ఖరీదైన ప్రేమ పెళ్లి గత కొన్నేళ్లుగా లవ్ అండ్ డేటింగ్‌లో ఉన్న దీపిక, రణవీర్ సింగ్‌లు పెళ్లి బంధంతో ఒకటికానున్నారు. ఇటలీలోని లేక్ కోమోలో మరికొన్ని గంటల్లో వీరి వివాహం జరగబోతుంది. Samayam Telugu | Updated: Nov 13, 2018, 09:25PM IST DeepVeer wedding: దీపిక - రణ్‌వీర్ వెడ్డింగ్.. ఖరీదైన ప్రేమ పెళ్లి బాలీవుడ్ ప్రేమ జంట దీపిక ప‌దుకొనే, ర‌ణ‌వీర్ సింగ్ పెళ్లి హంగామా మొదలైంది. గత కొన్నేళ్లుగా లవ్ అండ్ డేటింగ్‌లో ఉన్న దీపిక, రణవీర్ సింగ్‌లు పెళ్లి బంధంతో ఒకటికానున్నారు. ఇటలీలోని లేక్ కోమోలో మరికొన్ని గంటల్లో వీరి వివాహం జరగబోతుంది. లేక్ కోమోలోని విల్లా దెల్ బాల్బియానెల్లా వీరి వివాహానికి వేదిక కానుంది. వీరి వివాహం రెండు రోజుల పాటు (నవంబర్ 14, 15) దక్షణ భారతీయ, సింధీ సాంప్రదాయాల్లో జరగనుంది. ఈ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కళ్లు చెదిరే ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత ఖరీదైన విల్లా డెల్‌ బాల్బినెల్లా సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివాహ అతిథుల కోసం లేక్ కోమో తూర్పు ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్టును బుక్ చేశారు. వారం రోజుల పాటు దీపిక, రణవీర్ ఫ్యామిలీ సభ్యులు ఇక్కడే స్టే చేయనున్నారు. ఇందులో మొత్తం 75 గదులకు గానూ రూ. 1.73 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో రూముకి రోజుకి రూ. 35 వేలు చెల్లిస్తున్నారు. ఇందులోనే బార్లు, రెస్టారెంట్టు, ఇండోర్ స్మిమ్మింగ్ ఫూల్ తదితర అధునాతన సదుపాయాలు ఈ రిసార్టులో ఉన్నాయి. ఇక స్విజర్లాండ్ నుండి చెఫ్‌లను, ఫ్లోరెన్స్ నుండి ఫ్లవర్ డెకరేషన్ నిపుణుల్ని రప్పించారు. ఇక సినిమాల్లో హీరోహీరోయిన్లు ఎంట్రీలాగే పెళ్లిలో రణవీర్, దీపికాల ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారట. నీళ్లపై ల్యాండ్ అయ్యే మినీ ప్లేన్‌లో వివాహ వేదిక వద్దకు రాబోతోందట వీర్‌దీప్ జంట. ఇక అతిథులు కూడా లగ్జరీ బోటులో నీటి మార్గం ద్వారా వివాహ వేదిక వద్దకు చేరుకోనున్నారట. ఈ ఖరీదైన పెళ్లిలో ఇంకెన్ని ఆర్భాటాలు ఉన్నాయో చూడాలి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Visit Site Recommended byColombia అయితే ఆఫర్ సేల్‌లో టిక్కెట్లు పరిమితంగానే ఉంటాయని, ప్రయాణికులు త్వరగా బక్‌చేసుకోవాలని జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. ఈ ఆఫర్‌ ఎకానమీ క్లాస్‌కు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహించే విమానాలపై మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని.. కోడ్‌షేర్‌, ఇంటర్‌లైన్‌పై ఇది వర్తించదని స్పష్టం చేసింది. కాగా, మే 31న కూడా జెట్ ఎయిర్‌వేస్ 24 గంటల ఆఫర్ సేల్‌ను ప్రకటించింది. భారత్ నుంచి వెళ్లే అంతర్జాతీయ విమానాల్లో ప్రీమియర్, ఎకానమీ క్లాస్ టిక్కెట్లకు 15 శాతం డిస్కౌంట్‌ను అందించింది. గత కొద్ది నెలలుగా భారత మార్కెట్లో విపరీతమైన పోటీని జెట్ ఎయిర్‌వేస్ ఎదుర్కొంటోందట. ఈ ఎయిర్‌లైన్‌లో వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గుతోందట. అందుకనే ఈ ఆఫర్ సేల్స్‌ను ప్రకటిస్తున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
ఓబీసీలో రూ.110 కోట్ల మోసం! - శింభోలీ షుగర్స్‌పై సీబీఐ కేసు - కీలక నిందితుడు పంజాబ్‌ సీఎం అల్లుడు గురుపాల్‌ సింగ్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకుల్లో మోసాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌కు (ఓబీసీ) రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ మరో కేసును నమోదు చేసింది. ప్రయివేటు చక్కెర ఉత్పాదక సంస్థ శింబోలీ షుగర్స్‌ ఓబీసీకి రూ.110కోట్ల మేర రుణాలు ఎగవేసిన కేసు విష యమై సీబీఐ ఈ కేసును నమోదు చేసింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన శింభోలీ షుగర్స్‌ తీసుకున్న రుణా లను తిరిగి చెల్లించే విషయంలో విఫలంకావడంతో ఓబీసీ బ్యాంక్‌ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కుమార్తె జై ఇందర్‌ సింగ్‌ భర్త గురుపాల్‌ సింగ్‌ కీలక నిందితుడుగా ఉన్నారు. కంపెనీ డిప్యూటీ డైరెక్టర్లలో ఒకరైన గురుపాల్‌ సింగ్‌, శింభోలీ సీఎండీ, సీఈవో, సీఎఫ్‌వో సహా మొత్తం 13మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మొత్తం ఎనిమిది కంపెనీల్లో గురుపాల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. 2011 లో చక్కెర రైతులు 5700 మందికి సహాయం చేసే ఉద్దేశంతో ఆర్‌బీఐ పథకం కింద రూ.150కోట్ల మేర రుణం మంజూరైంది. అయితే ఈ మొత్తం రైతులకు పంపణీ చేయకుండా అక్రమార్గాల్లో కంపెనీ అకౌంట్‌లో మళ్లించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ. శింభోలీ సిబ్బందితోపాటు బ్యాంక్‌ అధికారులు కొందరిపై సైతం కేసు రిజిస్టర్‌ అయింది. ఈ వార్తలతో శింబోలి షుగర్స్‌ షేరు 15 శాతానికి పైగా కుప్పకూలింది. ఈ కేసుకు సంబం ధించి ఢిల్లీ, హపూర్‌, నోయిడాలలో కంపెనీల డైరెక్ట ర్ల నివాసాలు, ఫ్యాక్టరీ, కార్పోరేట్‌ ఆఫీస్‌, రిజిస్ట్రేషన్‌ ఆఫీసు సహా ఎనిమిది చోట్ల విచారణ సంస్థ సోదాలు నిర్వహించినట్టుగా సీబీఐ వెల్లడించింది. నిందితుల పై నేరపూరిత కుట్ర, మోసం అవినీతి నిరోధక చట్టం కింత కేసు నమోదు చేసినట్టుగా వివరించింది. తొలత రూ.97.85 కోట్లుగా నమోదైన రుణ ఏగవే తను బ్యాంక్‌ అప్పట్లోనే నిరర్థక ఆస్తిగా ప్రకటించింది. అయితే దీనిని తీర్చేందుకు గాను అదే బ్యాంకు నుంచి జనవరి 28, 2015 లో రూ.110కోట్ల మరో కార్పొరేట్‌ రుణాన్ని మంజూరు చేసింది. ఇప్పుడు ఈ లోన్‌ సమస్యాత్మకంగా తయారైంది. అయితే ఈ మొత్తాన్ని 2016 నవంబరులో నిరర్థక ఆస్తిగా ప్రకటించింది. దీనికి తోడు 2017 నవంబరు 17న బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేయగా ఈ ఏడాది ఫిబ్రవరి 22న కేసు నమోదు చేయడం గమనార్హం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Dec 14,2015 రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న మైక్రోమాక్స్‌ నవతెలంగాణ వాణిజ్య విభాగం : హైదరాబాద్‌ ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మైక్రోమాక్స్‌ భారతీయ మార్కెట్‌లో రూ. 300 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనుంది. మొబైల్‌ హ్యండ్‌సెట్ల కోసం చైనాపై ఆధారపడకుండా మేకిన్‌ ఇండియాలో భాగంగా రాజస్థాన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వచ్చే ఏడాది నూతన మొబైల్‌ హ్యండ్‌సెట్ట తయారీ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తెలంగాణలో 20 ఎకరాల విస్తీర్ణంలో రాజస్థాన్‌లో 25 ఎకరాల విస్తీర్ణంలో మొబైల్‌ తయారీ కేంద్రాల నిర్మాణం జరుగుతుందని తెలిపంది. తర్వలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో తయారీ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నూతన తయారీ ప్లాంట్లతో ఒక్కో కేంద్రాన్ని రూ. 100 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. ఒక్కో ప్లాంట్‌ నుంచి 3500 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
- పన్ను సంస్కరణలు కొనసాగుతాయి -అమెరికాలో ఆర్థిక మంత్రి జైట్లీ      న్యూయార్క్‌: విదేశీ పారిశ్రామికవేత్తలు భారత్‌లో సులభంగా వ్యాపారం చేసుకోవ డానికి ద్వారాలు తెరిచామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. పన్ను చెల్లింపు విధానాల్లో సంస్కరణలు కొనసాగుతాయ న్నారు. వచ్చే మాసంలో వస్తు సేవల బిల్లు (జిఎస్‌టి)కి ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సబ్సీడీలను నియంత్రిస్తామ న్నారు. న్యూయార్క్‌లో జరిగిన పెట్టుబడి దారుల సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లా డుతూ రానున్న మూడు, నాలుగు మాసాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం సమ కూర్చుతామని చెప్పారు. ప్రస్తుత ఆర్ధిక సంవ త్సరంలో ప్రభుత్వరంగ బాంకులకు రూ.7,940 కోట్ల మూలధనం సమకూర్చడా నికి ప్రభుత్వం గత బడ్జెట్‌లో అంగీకరించింని వివరించారు. దేశంలో చేపడుతున్న సంస్కర ణాలు, రాజకీయాలు, ఆర్థిక సవాళ్లపై ఆయన ఇక్కడ మాట్లాడారు. మంత్రి అధికారికంగా 10 రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆయా బ్యాంకుల ప్రగతిని బట్టి డిమాండ్‌కు అనుగుణంగా మూలధనం సమకూర్చుతామని జూన్‌ 12న జరిగిన బ్యాంకర్ల సమావేశంలో జైట్లీ స్పష్టం చేశారు. 2014-15లో 9 పిఎస్‌బిలకు మొత్తంగా రూ.6,990 కోట్ల మూలధనం అందించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రభుత్వ రంగ బ్యాంకులకు సరిపడ మూలధనం లేదని రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముద్ర ఈ మధ్య కాలంలోనే అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 106 Views అమెరికా ఫెడ్‌రిజర్వు సమీక్ష ఫలితాలే కీలకం ముంబై, సెప్టెంబరు 18: దేశీయ స్టాక్‌మార్కెట్లలో వచ్చేవారం మొత్తం అమెరికా ఫెడ్‌రిజర్వు సమీక్షనిర్ణయాల ప్రభావమే ఎక్కువ ఉంటుందని అంచనా. ఫెడ్‌రిజర్వు పాలకవర్గ మావేశం 20వ తేదీ నుంచి రెండురోజులపాటు జరుగుతాయి. బుధవారం రాత్రి ఫెడ్‌ పాలసీ నిర్ణయాలు వెల్లడి అవుతాయి. రెండువారాల క్రితం జాపక్సన్‌హోల్‌లో జరిగిన ప్రపంచ దేశాల కేంద్రబ్యాంకు అధి పతుల సమావేశంలో ఫెడ్‌ఛైర్‌ పర్సన్‌ జన్నెట్‌ ఎల్లెన్‌ వడ్డీరేట్ల పెంపునకు అనువైన పరిస్థితులు నెలకొంటున్నాయన్న భావన వ్యక్తంచేశారు. ఆనాటికిధరలు, హౌసింగ్‌ విక్రయాలు, ఉపాధి గణాంకాలు వంటివి సానుకూలంగా ఉన్నాయని చెప్పాలి. అయితే గత వారం పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. ఆగస్టునెల రిటైల్‌ విక్రయాలు క్షీణించడం, పారిశ్రామికోత్పత్తి మందగమనం లాంటి అంశాలు అమెరికా ఆర్థిక పటిష్టతను ప్రశ్నార్ధకంగా మార్చా యి. వీటికితోడు ధరలు ఆశించినస్థాయిలో పటిష్టం కాలేదు. వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలను అందుకోలేక పోయాయి. వడ్డీరేట్ల పెంపుపై ఆచితూచి వ్యవహరించాల్సి ఉం టుందని ఫెడ్‌రిజర్వు భావించింది. ఉద్దీపనలను వేగంగా ఉపసం హరించడం సరికాదన్న సంకేతాలు కూడా మార్కెట్లకు అందాయి. దాదాపు పదేళ్లతర్వాల 2015 డిసెంబరులో ఫెడ్‌రిజర్వు తొలిసారి వడ్డీరేట్లను 0.25శాతం పెంచింది. ఆర్థికవ్యవస్థ గాడినపడు తోందన్న వాదనతో సహాయక ప్యాకేజిలు కూడా నిలిపివేసింది. వడ్డీరేట్లు మరోసారి పెంచేందుకు ముందుకురాకపోవడం ఇటీవలి పరిణామాలే కారణమని వ్యక్తం అవుతోంది. ఈ సారి వడ్డీపెంపు ఉండకపోవచ్చని, డిసెంబరు సమీక్షకు వాయిదాపడే అవకాశాలు న్నాయి. ఇదే జరిగితే దేశీయ స్టాక్స్‌లోనికి మరిన్ని విదేశీ పెట్టు బడులు వెల్లువెత్తే అవకాశాలున్నాయి. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ కూడా పరపతి సమీక్షను చేపడుతోంది. 21న ముగిసే ఈసమీక్ష నిర్ణయాలు కూడా మార్కెట్లకు కీలకం అవుతాయి. భారీస్థాయిలో ఉద్దీపనలను అమలుచేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ద్రవ్యో ల్బణం పుంజుకోలేదు. పాలసీని పూర్తిస్థాయిలో సమీక్షించాలని బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ నిర్ణయించింది. ఏడాదికి 80 లక్షలకోట్ల యెన్‌ లను ఉద్దీపనల ప్యాకేజికి వినియోగిస్తోంది. వీటికితోడు రుణరేట్లు కూడా డిపాజిట్లపై 0.1 శాతం మైనస్‌ వడ్డీరేట్లను అమలు చేస్తోం ది. దేశవ్యాప్తంగా వర్షపాతం కూడా విస్తరించింది. వర్షపాతం లోటు తగ్గుతుందని ప్రస్తుతానికి సాధారణసగటుకంటే ఐదుశాతం లోటు నమోదయినా భవిష్యత్తులోమూడుశాతానికి తగ్గుతుందని అంచనావేసింది. ఇది దేశీయస్టాక్‌మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం. గతవారం చివరిలో విదేశీ పెట్టుబడులు పుంజుకోవడం ఇందుకు జత కలిసింది. డాలరుతో రూపాయి మారకం విలువలు, ముడి చమురుధరల కదలికలు, యూరోప్‌ ఆసియా మార్కెట్ల తీరుతెన్నులు వచ్చేవారం స్టాక్‌ మార్కెట్ల ధోరణులను నిర్ణయిస్తాయని అంచనా.
1entertainment
Vaani Pushpa 88 Views world champtionship aruna reddy హైదరాబాద్‌: వచ్చే నెలలో జర్మనీలో జరిగే ప్రపంచ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. అక్టోబర్‌ 4 నుంచి 13 వరకు స్టుట్‌గార్ట్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ నుంచి ఆరుగురు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల విభాగంలో తెలంగాణ జిమ్నాస్ట్‌ బుద్ధా అరుణా రెడ్డితోపాటు ప్రణతి నాయక్, ప్రణతి దాస్‌లకు చోటు లభించింది. పురుషుల విభాగంలో ఆశిష్‌ కుమార్, ఆదిత్య సింగ్‌ రాణా (రైల్వేస్‌), యోగేశ్వర్‌ సింగ్‌ (సర్వీసెస్‌) భారత జట్టులోకి ఎంపికయ్యారు. 2018లో అరుణా రెడ్డి మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందింది.
2sports
ALLIANAC అలయన్స్‌ ఎయిర్‌ నుండి మరిన్ని విమానాలు న్యూఢిల్లీ, మే 3: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాంతీయ అనుసంధాన పథకం ఉడాన్‌ కింద మరిన్ని విమానాలను నడిపేందుకు ఎయిర ్‌ఇండియా అనుబంధ అలయన్స్‌ ఎయిర్‌ ప్రణా ళిక రచిస్తోంది. ఇందులోభాగంగా దుబా§్‌ు ఎరో స్పేస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నుండి 10 చిన్నపాటి విమా నాలను అద్దెకు తీసుకోనుంది. ఉడాన్‌ పథకం కింద తొలి విమానాన్ని గతవారం సిమ్లా నుండి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలయన్స్‌ ఎయిర్‌తో దీర్ఘకాలిక ఒప్పందాన్ని చేసుకున్నామ ని, ఇందులో భాగంగా 10 చిన్న విమానాలను అద్దెకు ఇస్తామని డిఎఇ తెలిపింది. 2017 ఏడాది మొత్తం వీటిని అద్దెకు ఇవ్వనున్నట్లు డిఎఇ వెల్ల డించింది. అలయన్స్‌ ఎయిర్‌తో భాగస్వామ్యం కావడాన్ని స్వాగతిస్తున్నామని దుబా§్‌ు ఎరోస్పేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఫిరోజ్‌ తారాపోర్‌ తెలి పారు. ఉడాన్‌పథకం కింద ఒక గంట ప్రయాణా నికి ఎంపిక చేసినరూట్లలో టికెట్‌ధరను గరిష్టంగా రూ.2,500 ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
1entertainment
Suresh 68 Views indiavs srilanka 3rd test india vs srilanka 3rd test పల్లెకలెః మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి కోహ్లీసేన 329/6తో నిలిచింది . తొలి సెషన్‌లో టీమిండియా ఓపెనర్లు పరుగుల వరద పారించగా.. రెండో సెషన్‌లో శ్రీలంక బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. చివరి సెషన్‌లో ప్రత్యర్థులు ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు ఆడారు. శిఖర్ ధావన్‌ శతకం, లోకేశ్‌ రాహుల్‌ అర్ధశతకాలతో రాణించారు. మొత్తానికి ఆతిథ్య జట్టు పట్టుదలగా ఆడ‌టంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుంది.
2sports
లాభాల్లో మార్కెట్లు, 39వేల ఎగువకు సెన్సెక్స్‌ Oct 23, 2019, 13:43 IST సాక్షి, ముంబై : దేశీ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన సూచీలు మిడ్‌సెషన్‌లో పుంజుకున్నాయి.  సెన్సెక్స్‌ 217 పాయింట్లు  ఎగిసి 39178 వద్ద,  నిఫ్టీ సైతం 53 పాయింట్లు  లాభపడి 11,642 వద్ద ట్రేడవుతోంది. టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్ ఫలితాలు నిరాశపరచడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడగా.. బ్రెక్సిట్‌ డీల్‌పై అస్పష్టతలోనూ యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి.  ప్రధానంగా ఆటో, రియల్టీ రంగాలు బలహీనంగానూ, ఐటీ బలంగానూ   ట్రేడ్‌ అవుతున్నాయి.  హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌, బ్రిటానియా, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, యాక్సిస్‌, టైటన్‌, ఐటీసీ, ఐసీఐసీఐ, ఏషియన్‌ పెయింట్స్‌ లాభపడుతుండగా, లాభాల స్వీకరణతో యస్‌ బ్యాంక్‌ 4 శాతం పతనమైంది. దీంతో పాటు  అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, జీ, గ్రాసిమ్‌, ఇండస్‌ఇండ్‌, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌  నష్టపోతున్నాయి.  Read latest Business News and Telugu News | Follow us on FaceBook , Twitter Tags:
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV దక్షిణాఫ్రికా జట్టు పగ్గాలు నాకివ్వండి దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు ప్రస్తుతం తాను సిద్ధంగా ఉన్నట్లు ఆ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్ డుప్లెసిస్ TNN | Updated: Aug 28, 2017, 02:52PM IST దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు ప్రస్తుతం తాను సిద్ధంగా ఉన్నట్లు ఆ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్ డుప్లెసిస్ స్పష్టం చేశాడు. మూడు రోజుల క్రితం జట్టు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఏబీ డివిలియర్స్ అనూహ్యంగా తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో 50 ఓవర్ల ఫార్మాట్‌కి ఎవరిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే విషయమై ఆ దేశ మాజీ క్రికెటర్లతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చర్చిస్తోంది. జట్టు నాయకత్వ బాధ్యతలు తనపై తీవ్ర ఒత్తిడిని పెంచిందని రాజీనామా సమయంలో డివిలియర్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మూడు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా పనిచేసేందుకు నేను సిద్ధం. ఇంకా చెప్పాలంటే.. నాయకత్వ బాధ్యత నాలోని అత్యుత్తమ ఆటని వెలికితీస్తోంది’ అని డుప్లెసిస్ వెల్లడించాడు. అయితే.. గతంలో మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌‌గా పనిచేసిన డివిలియర్స్ క్రమంగా ఒత్తిడి పెరుగుతోందంటూ ఒక్కో ఫార్మాట్‌ నుంచి పక్కకి తప్పుకుంటూ వచ్చాడు. చివరికి అవిశ్రాంత క్రికెట్ కారణంగా గాయాలపాలై దాదాపు ఏడాదన్నర నుంచి టెస్టు క్రికెట్‌కి దూరమైపోయాడు. ఈ నేపథ్యంలో మళ్లీ డుప్లెసిస్‌‌కి మూడు ఫార్మాట్ల‌లో పగ్గాలు అప్పగించి మరో సాహసం చేయకూడదనే ఆలోచనలో కూడా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఉన్నట్లు సమాచారం. Faf du Plessis , South Africa 's Test captain, has indicated that he's ready to lead the team in the 50-overs format of the game. The captaincy job became vacant after incumbent skipper, AB de Villiers , stepped down from leadership duties, even as he indicated a full-fledged return to all the three formats of the game.
2sports
సైనా నెహ్వాల్ దగ్గర బ్యాడ్నింటన్ నేర్చుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ Highlights సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ మూవీ బాలీవుడ్ చిత్రంలో సైనా పాత్ర పోషిస్తున్న శ్రద్ధా కపూర్ శ్రద్ధా కపూర్ కు బ్యాడ్మింటన్ మెళకువలు నేర్పిస్తున్న సైనా భారతీయ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ను బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సైనా పాత్రను హీరోయిన్ శ్రద్దాకపూర్ పోషిస్తోంది. దీంతో, బ్యాడ్మింటన్ లో కోచింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది శ్రద్ధ. పుల్లెల గోపీచంద్ అకాడెమీలో గోపీచంద్, సైనాలతో కలసి ఆమె ట్రైనింగ్ సెషన్ లో పాల్గొంది. ఈ ట్రైనింగ్ కు సంబంధించిన ఫొటోలను సైనా నెహ్వాల్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. 'గోపీ సర్.. శ్రద్ధాకపూర్.. నేను' అనే కాప్షన్ ను ఫొటోకు జత చేసింది.   ఇక ప్రభాస్ సరసన సాహో చిత్రంలోనూ నటిస్తున్న శ్రద్ధ తెలుగు నేర్చుకోవటంలోనూ తన ప్రతిభ కనబరుస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు నేర్పించాలని ప్రభాస్ తో డీల్ కుదుర్చుకుందట ఈ ఆశిఖి2 భామ. Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
Hyderabad, First Published 11, Sep 2019, 8:56 PM IST Highlights ఇళయదళపతి విజయ్ సేతుపతి సూపర్ ఫామ్ కొనసాగుతోంది. వరుస సక్సెస్ లతో విజయ్ దూసుకుపోతున్నాడు. విజయ్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా ఉన్నారు. రజనీ తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో అంటూ చర్చ జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శత్వంలో బిగిల్ చిత్రంలో నటిస్తున్నాడు.  విజయ్, అట్లీలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన తేరి, మెర్సల్ లాంటి చిత్రాలు ఘనవిజయాలుగా నిలిచాయి. భారీ అంచనాల నడుమ బిగిల్ చిత్రం నవంబర్ లో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగా విజయ్ తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.  ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించేందుకు విజయ్ ఒకే చెప్పాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతోందంటూ కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు కియారా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.  విజయ్ సరసన నటించేందుకు కియారా ఆసక్తి చూపింది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో నటించలేనని చెప్పేసింది. ప్రస్తుతం కియారా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. భరత్ అనే నేను చిత్రంతో కియారా సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  అంతకు ముందు చిత్ర యూనిట్ రష్మిక మందనని కూడా సంప్రదించారు. ఆమె విషయంలో కూడా ఇదే సమస్య. విజయ్ లాంటి స్టార్ హీరో సరసన నటించాలని ఉన్నా అంతకు ముందే కమిటైన చిత్రాల వల్ల రష్మిక డేట్స్ ఖాళీగా లేవు. సౌత్ లో క్రేజీ హీరోగా కొనసాగుతున్న విజయ్ కు ప్రస్తుతం హీరోయిన్ల కొరత ఏర్పడినట్లుంది.  Last Updated 11, Sep 2019, 9:06 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఐదు వికెట్లతో బుమ్రా మ్యాజిక్.. లంక 217/9 భారత బౌలర బుమ్రా తొలిసారిగా వన్డేల్లో ఐదు వికెట్ల హాల్ సాధించడంతో.. లంక జట్టు 9 వికెట్ల నష్టానికి 217 పరుగులు మాత్రమే చేసింది. TNN | Updated: Aug 27, 2017, 06:25PM IST పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకను బుమ్రా ఆదిలోనే దెబ్బతీశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన నిరోషాన్ డిక్వెల్లాను 13 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు. మరో ఓపెనర్ చండీమల్ 36 పరుగులు చేసినప్పటికీ.. నెమ్మదిగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా లంక బ్యాట్స్‌‌మెన్‌ను వణికించాడు. బుమ్రా కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. భారత బౌలర్ వన్డేల్లో ఐదు వికెట్ల హాల్ సాధించడం మూడేళ్ల ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా 2014లో స్టువర్ట్ బిన్నీ బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు తీశాడు. రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా లంక కెప్టెన్ ఉపుల్ తరంగపై వేటు పడగా.. అతడి స్థానంలో కపుగెదర ఈ మ్యాచ్‌లో జట్టుకు నాయకత్వం వహించాడు. ఉపుల్ తరంగ స్థానంలో జట్టులోకి వచ్చిన తిరిమన్నే ఒక్కడే 80 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో లంక జట్టు మరోసారి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో లంకకు శుభారంభం దక్కలేదు. లంక బ్యాట్స్‌మెన్‌లో ఐదుగురు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ లంక స్వల్ప స్కోరుకే పరిమితమైంది. తొలి వన్డేలో లంక 217 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో వన్డేలో 8 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. గుణతిలకె గాయపడటంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన దినేశ్ చండీమల్ కూడా ఈ మ్యాచ్‌లో గాయపడ్డాడు. కుడి చేతి బొటన వేలికి గాయం కావడంతో అతడు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ధోనీ రనౌట్ అవకాశం మిస్ చేయడంతో బతికిపోయిన చండీమల్ హార్ధిక్ పాండ్య బౌలింగ్‌లో గాయపడ్డాడు.
2sports
ASWIN అశ్విన్‌కు ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ అవార్డు ముంబయి: భారత ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ ఆశ్విన్‌ ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును గెలుచుకున్నారు. సియట్‌ క్రికెట్‌ రేటింగ్‌ (సిసిఆర్‌) ఇంటర్నేషనల్‌ 2017 అవార్డుకు అతడి ఎంపిక బుధవారమే జరిగింది. భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌, సియట్‌ ఛైర్మన్‌ హరీస్‌ గొయాంక చేతుల మీదుగా దీన్ని అందుకున్నాడు. గత ఏడాది కాలంలో భారత్‌ తానాడిన 13టెస్టుల్లో 10 టెస్టు విజయాలు సాధించింది. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలపై సిరీస్‌ విజయాలు సొంతం చేసుకుంది. గత 12నెలల కాలంలో అశ్విన్‌ మొత్తం 99 వికెట్‌లు సాధించాడు. ఇదిలావుంటే సుభ్‌మాన్‌ గిల్‌ ఎమర్జింగ్‌ (యువ) ప్లేయర్‌ అవార్డు అందుకోనున్నాడు. ఇంగ్లండ్‌ అండర్‌ 19 జట్టుతో ముంబయిలో జరిగిన వన్డే సిరీస్‌లో ప్రదర్శనకు గాను అతడ్ని ఈ అవార్డు వరించింది. చెన్నైలో తాను మొదటి సారి మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు గవాస్కర్‌ ఆటోగ్రాఫ్‌ను తాను తీసుకున్న సంగతిని అశ్విన్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు
2sports
భారత్‌లో వోక్స్‌వాగన్ న్యూఢిల్లీ (ఏజెన్సీ)| Srinivasulu| Last Modified సోమవారం, 5 మే 2008 (15:44 IST) వచ్చే ఏడాది చివరికల్లా భారత్‌లో 20 అవుట్‌లెట్లు ఏర్పాటు చేయనున్నట్టు జర్మనీ కారు తయారీ సంస్థ వోక్స్‌వాగన్ భారత విభాగ ప్రెసిడెంట్ జోర్జ్ ముల్లర్ తెలిపారు. ప్రస్తుత ఏడాది చివరికల్లా 15 అవుట్‌లెట్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. త్వరలోనే తమ నెట్‌వర్క్ భాగస్వాములను నిర్ణయిస్తామని తెలిపారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరులలో ప్రస్తుతం ఫ్రాంచైజీలు ఉండగా, తాజాగా హైదరాబాద్, లూధియానా, చండీఘర్, గుర్గావ్‌లతో పాటు ఢిల్లీలో మరో కొత్త ఫ్రాంచైజీని కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. భారత్‌లో డిమాండ్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో 2009కల్లా ఉత్పత్తి ప్రారంభించేలా పుణేలోని చకాన్‌లో మరో యూనిట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ ప్లాంట్ నుంచి ఫాబియా మోడెల్ ఉత్పత్తి ప్రారంభించనున్నందున దేశంలో తమ పెట్టుబడులు మరో 41శాతం మేర పెరగగలదని చెప్పారు. సంబంధిత వార్తలు
1entertainment
Hyderabad, First Published 17, Sep 2018, 12:56 PM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు కౌశల్. మొదటి నుండి హౌస్ మేట్స్ ఎవరితో కలవకుండా తన గేమ్ తను ఆడుకుంటూ అభిమానులను సంపాదించుకున్నారు.  బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు కౌశల్. మొదటి నుండి హౌస్ మేట్స్ ఎవరితో కలవకుండా తన గేమ్ తను ఆడుకుంటూ అభిమానులను సంపాదించుకున్నారు. గత వారంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా కౌశల్ రూల్స్ సరిగ్గా పాటించలేదనే కామెంట్స్ వినిపించాయి. హోస్ట్ నాని సైతం సంచాలకుడిగా నువ్వు డిజాస్టర్ అంటూ కౌశల్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సోమవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్, కౌశల్ మధ్య చర్చలు జరిగాయి. ముందుగా కౌశల్.. ''నాని గారంటే గౌరవం కాబట్టి ఆయనేం అన్నా నేను మాట్లాడలేదు'' అంటూ హౌస్ మేట్స్ తో కౌశల్ అనగా.. హౌస్ మేట్స్ అందరూఒక్కటై కౌశల్ ని టార్గెట్ చేశారు. ''అంటే మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారా..?'' అంటూ రోల్ రైడా ప్రశ్నించగా.. ''బిగ్ బాస్ రూల్స్ నేను ఫాలో అయ్యాను..'' అంటూ చెప్పే ప్రయత్నం చేయగా.. సీన్ లో తనీష్ ఎంటర్ అయ్యి.. ''మీరు ఫాలో అవ్వలేదని నాని చెప్పారు. సంచాలకుడుగా మీరు డిజాస్టర్ అని కూడా అన్నారని'' చెప్పగా.. ''సంచాలకుడిగా నా గేమ్ నేను ఆడుతున్నానని'' కౌశల్ అన్నాడు. దీనికి వెంటనే తనీష్.. ''అది మేటర్.. సంచాలకుడిగా ఆయన ఆడిన గేమ్ అది'' అని వ్యంగ్యంగా మాట్లాడారు. నేను తప్పు చేస్తే శిక్షకు సిద్ధమని కౌశల్ అన్న మాటకి తనీష్ మరోసారి అతడిపై ఫైర్ అయ్యాడు. గతంలో తను అదే స్టేట్మెంట్ ఇస్తే.. అంగీకరించని కౌశల్ ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ ఎలా చేస్తారని ప్రశ్నించగా ''ఆయన చేస్తే కరెక్ట్ మనం చేస్తే రాంగ్ అంటూ'' గీతా.. తనీష్ కి తన సపోర్ట్ అందించింది. వీరి మధ్య చర్చలు చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగుతుందనిపిస్తుంది.  Last Updated 19, Sep 2018, 9:28 AM IST
0business
Vaani Pushpa 125 Views aduiting , sun pharma fungicros sun pharma న్యూఢిల్లీ: సన్‌ఫార్మా సంస్థకు సంబంధించి 2016 మార్చి 31వ తేదీనుంచి 2017 మార్చి 31వ తేదీవరకూ జరిగిన ఆర్ధిక కార్యకలాపాలపై సెబీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించిందని సంస్థ స్టాక్‌ ఎక్ఛేంజిలకు నివేదికి చ్చింది. అలాగే 2018 మార్చి 31వ తేదీవరకూ జరిగిన లావాదేవీలనుసైతం ఆడిట్‌చేయాలని ప్రస్తుతం ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కొనసాగుతున్నదని వెల్లడించింది. అయితే ఎలాంటి లావాదేవీలపై ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించిందన్న అంశానికి సంబంధించి సన్‌ఫార్మా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వ్యక్తులు, సంస్థలకు సంబంధించి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అంటే మొత్తం ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను సమగ్రపరిశీలనచేయడం, ఈ లావాదేవీల పరిశీలన అవసరమైతే ఒక కోర్టు లేదా చట్టపరిధిలో లేక న్యాయపరమైన వివాదాల్లోసైతం వినియోగపడే విధంగా ఉంటుంది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించినా సంస్థ షేర్లు 1.30శాతంపెరిగి 431.95 రూపాయలుచొప్పునట్రేడ్‌ అయ్యాయి. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/
1entertainment
Suresh 166 Views Iswarya చెన్నై: తమిళ సినీనటుడు రజనీకాంత్‌ పెద్దకూతురు, నటుడు ధనుష్‌ సతీమణి సినీ దర్శకురాలు ఐశ్వర్య తాజాగా క్రీడారంగంలోకి అడుగిడుతున్నారు. త్వరలో ఢిల్లీలో జరగనున్న టేబుల్‌ లెన్నిస్‌ పోటీలకు చెన్నై జట్టు నిర్వాహకుల్లో ఒకరిగా ఐశ్వర్య భాగస్వామిగా మారారు. టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఢిల్లీ చెన్నై, పూణె,గోవా, కోల్‌కతా, ముంబై జట్లు పాల్గొననున్నాయి.
2sports
Lucky Vatnai స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌ విజేత లక్కీ వత్నాని హైదరాబాద్‌: తెలంగాణ ఓపెన్‌ స్నూకర్‌ ఛాంపియన్‌ షిప్‌లో నగరానికి చెందిన క్యూయిస్ట్‌ లక్కీ వత్నాని సత్తా చాటాడు. 214మంది క్రీడా కారులు తలపడిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో లక్కీ వత్నాని (హైదరాబాద్‌) 67-15, 7-57, 79-72, 74-47, 8-84, 49-50, 79-21, 61-04తో రాజీవ్‌ ఇనుగంటి (కాకినాడ)పై విజయం సాధించాడు. 15 రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ, ఎపి, సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
2sports
Construct న్యూఢిల్లీ: స్థిరాస్థి రంగంలో పారదర్శకత తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన స్థిరాన్ని నియంత్రణ చట్టం(రేరా),వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) వల్ల ఈ రంగానికి మేలు జరుగుతుందని స్థిరాస్తి వ్యాపారుల సంఘం క్రెడా§్‌ు,కన్సల్టింగ్‌ సంస్థ సిబిఆర్‌ఇ పేర్కొన్నాయి.ఎనిమిది సంవత్సరాల్లో ఈ రంగం మరో 80 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపాయి.2016లో స్థిరాస్తి రంగంలో 92 లక్షల మంది పనిచేస్తుండగా 2025 నాటికి ఈ రంగంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 1.72 కోట్లకు చేరుతుందని అంచనా వేశాయి.జిడిపిలో స్థిరాస్తి రంగ వాటా ప్రస్తుతం 6.3 శాతం కాగా,2025 నాటికి రెట్టింపు కంటే పెరిగి 13 శాతానికి పెరుగుతుందని దేశీయ స్థిరాస్తి రంగ ఆర్థిక ప్రభావం నివేదిక పేర్కొన్నాయి.నివేదికలో ఇతర ముఖ్యాంశాలు ఇవిగో.దీర్ఘ కాలానికి ఈ రంగం చాలా సానుకూలంగా ఉంది.2013లో సంవత్సరానికి 360 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు జరగ్గా 2025కు ఇది 820 కోట్ల చ.అ.కు చేరనుంది.పట్టణీకరణ అధికంగా జరగడం వల్ల కొత్త ఇళ్ల నిర్మాణాలకు గిరాకీ పెరుగుతుందని,రెండు-మూడవ అంచె నగరాల విస్తరణ కూడా స్థిరాస్తి రంగ వృద్దికి తోడ్పడనున్నాయి.అయితే స్థిరాస్తి రంగ విస్తరణకు సంబంధించిన అంచనాలన్నీ కూడా, అవకాశాల సమర్థ వినియోగం,అవరోదాలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వాలు తగిన విధానాలు రూపొందించి అమలు చేయడంపైపే ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది.స్థిరాస్తి రంగ వృద్ది వల్ల నేరుగా లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.అనుబంధంగా ఉండే 250 రకాల పరిశ్రమల విస్తరణకూ తోడ్పడుతుంది.అసంఘటితంగా, వృద్ది పరంగా స్తంభించిన ఈ రంగం స్థితి మారుతుంది.సంఘటిత మార్గంలో,అభివృది చెందిన దేశాల స్థాయిలో దూసుకెళ్లుంది.ఆసియా,పసిఫిక్‌ దేశాల్లో ఐటి పొరుగుదేశాలకు ఉత్తమంగా 2017లో భారత్‌ నిలిచింది.82 శాతం మంది భారతీయులు రాబోయే 3 సంవత్సరాల్లో దేశీయంగా సిబ్బందిని పెంచుకోవాలని భావిస్తున్నారు.ఇది ఆర్థిక వ్యవస్థ,స్థిరాస్తి రంగానికి కలిసి రానుంది.
1entertainment
internet vaartha 136 Views మాదాపూర్‌ :  ప్రముఖ సినీ నటుడు అక్కినేని అఖిల్‌ మాదాపూర్‌లో స్టార్టప్‌ క్రికెట్‌ లీగ్‌-2016ను ప్రారంభిం చారు. బుధవారం కావూరిహిల్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ఈ లీగ్‌లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా అఖిల్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా స్టార్టప్‌ అననుకూల వాతావరణం నేపథ్యంలో ఈ క్రికెట్‌ లీగ్‌ ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. స్టార్టప్‌ క్రికెట్‌ లీగ్‌ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్టార్టప్‌లను ప్రోత్సహించే విధంగా కార్యరూపం దాల్చిందన్నారు. ఈ లీగ్‌ ద్వారా వివిధ కేటగిరీలకు చెందిన స్టార్టప్‌లను ఒకే వేదిక మీదకు తీసుకురావడం సులభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు సాయికిరణ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV వేల్స్ ఇంటికి.. పోర్చుగల్ ఫైనల్‌కి సంచలన ప్రదర్శనతో యూరో కప్ సెమీస్ చేరిన వేల్స్ జట్టు ఫైనల్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. TNN | Updated: Jul 7, 2016, 10:21AM IST సంచలన ప్రదర్శనతో యూరో కప్ సెమీస్ చేరిన వేల్స్ జట్టు ఫైనల్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కీలక సమయంలో రాణించడంతో పోర్చుగల్ జట్టు యూరో కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో వేల్స్ జట్టును 2-0 తేడాతో పోర్చుగల్ ఓడించింది. 50 నిమిషంలో రొనాల్డో హెడ్డర్‌తో గోల్ చేయడంతో పోర్చుగల్ ఆధిక్యంలో నిలిచింది. మూడు నిమిషాల తేడాతో నాని మరో గోల్ చేయడంతో ఆ జట్టు ఆధిక్యం మరింత పెరిగి 2-0కి చేరింది. దీంతో 1958 తర్వాత ప్రధాన టోర్నీ ఫైనల్‌కి చేరాలన్న వేల్స్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఫ్రాన్స్, జర్మనీ జట్లు గురువారం రాత్రి సెమీఫైనల్లో తలపడనున్నాయి. ఈ రెండింటిలో విజేతగా నిలిచిన జట్టుతో పోర్చుగల్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. 2004లో చివరిసారి యూరో కప్ ఫైనల్ చేరిన పోర్చుగల్ జట్టు సొంత గడ్డపై జరిగిన తుది పోరులో గ్రీస్ చేతిలో ఓడింది.
2sports