news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
గుంటూరులో 'అఆ' సక్సెస్ మీట్ ఫంక్షన్
మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం అఆ.
| Updated:
Jun 10, 2016, 05:15PM IST
మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో నితిన్ , సమంత , అనుపమ పరమేశ్వరన్లతో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన 'అఆ' చిత్రం ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం సాధించిన ఘన విజయం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 12న గుంటూరులో 'అఆ' విజయోత్సవ వేడుకను జరుపనున్నట్లు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన గుంటూరులోని 'సిద్ధార్ధ గార్డెన్స్'లో ఆదివారం (జూన్ 12) సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ విజయోత్సవ వేడుకలో త్రివిక్రమ్, హీరో నితిన్, సమంత, అనుపమ, నదియ, నరేష్, రావు రమేష్, అజయ్, హరితేజ, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, మధునందన్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్యలతో పాటు పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు, పలువురు రాజకీయనాయకులు పాల్గొంటున్నట్లు నిర్మాత తెలిపారు. | 0business
|
శ్రీరెడ్డి ‘ఆత్మ హత్య’ యత్నం వైరలవుతున్న న్యూస్
Highlights
శ్రీరెడ్డి ‘ఆత్మ హత్య’ యత్నం
గత రెండు రోజులుగా పవన్ గొడవ పై నానా రచ్చ జరుగుతూనే ఉంది. ఈ చర్చ మధ్య ఇపుడొక సన్సేషన్ వార్త వెలువడింది. శ్రీరెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని వార్త గురువారం ఉదయం గుప్పు మంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా లో అది వైరలయింది. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను బంజారాహిల్స్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చేర్పించినట్టు సమాచారం. ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి బయటకు చెప్పడానికి వైద్యులు నిరాకరిస్తున్నారు అనే వార్తలు మీడియాలో సంచలనం రేపాయి. కానీ ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ఆమె సన్నిహితులు, మిత్రులు అంటున్నారు. ఆమె ఎపుడు,ఎలా ఎక్కడ ఆ అఘాయిత్యానికి పూనుకున్నారనే వివరాలు ఏవైపు నుంచి రావడం లేదు. ఆసుపత్రి ఏదో కూడా తెలియడం లేద. అయితే, వార్త మాత్రం తెగ ప్రచారమవుతూ ఉంది. ఫీల్డో లోనే కాదు, సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీరెడ్డి ఈ న్యూస్ ఇంత వైరల్ అవుతున్నా...ఎందుకు స్పందించట్లేదు అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే శ్రీరెడ్డి స్వయంగా ఏదయినా చెబితో తప్ప ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Last Updated 19, Apr 2018, 4:18 PM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నమ్మలేని నిజం: సంజయ్ దత్ బిచ్చమెత్తుకున్నారు!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. కానీ, ఆయన నిజ జీవితం పూర్తి భిన్నం. ఆయన జీవితంలో ఎన్నో మలుపులు, ఒడుదొడుకులు. అత్యంత ధనవంతుల ఇంట్లో పుట్టి ఎన్నో కష్టాలు పడ్డారు.
Samayam Telugu | Updated:
Jun 16, 2018, 01:29PM IST
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. కానీ, ఆయన నిజ జీవితం పూర్తి భిన్నం. ఆయన జీవితంలో ఎన్నో మలుపులు, ఒడుదొడుకులు. అత్యంత ధనవంతుల ఇంట్లో పుట్టి ఎన్నో కష్టాలు పడ్డారు. ఒక దశలో డ్రగ్స్కు బానిసయ్యారు. అక్రమ ఆయుధాల కేసులో జైలు పాలయ్యారు. లగ్జరీ కార్లు, భవంతుల్లో గడిపిన వ్యక్తి ఒకానొక దశలో అత్యంత దుర్భర జీవితం గడిపారు. ఆయన జీవితం నేటి యువతకు ఓ పాఠం లాంటిది. అందుకే ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఆయన జీవిత కథను సినిమాగా తీస్తున్నారు.
సంజయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ‘సంజు’. టైటిల్ రోల్లో నటించిన రణ్బీర్ కపూర్ మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెరపై సంజయ్నే చూసినంత అద్భుతంగా ఆ పాత్రలో రణ్బీర్ ఒదిగిపోయారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సంజయ్ గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉందంటున్నారు దర్శకుడు హిరాణీ. సంజు సినిమాకు సంబంధించి రోజుకో కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ ఆయన అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో సంజయ్కి సంబంధించి సంచలన విషయం తెలిపారు. ఒకానొక దశలో సంజయ్.. అమెరికాలోని రోడ్లపై బిచ్చమెత్తుకున్నాడని చెప్పారు.
‘సంజు జీవిత ప్రయాణం ఎన్నో ఒడుదొడుకులతో కూడుకుంది. కొన్ని విషయాలు మీరు నమ్మలేని విధంగా ఉంటాయి. సంజు కథ తెలిస్తే నమ్మలేరు, కానీ ఇది నిజం’ అంటూ హిరాణీ ట్వీట్లో పేర్కొన్నారు. డ్రగ్స్కు బానిసైన సంజయ్ చికిత్స కోసం అమెరికా వెళ్లారని, ఆ సందర్భంలో ఓసారి అక్కడి రిహాబ్ సెంటర్ నుంచి పారిపోయి తన స్నేహితుల ఇళ్లకు వెళ్లడానికి అక్కడి రోడ్లపై డబ్బుల కోసం బిచ్చమెత్తుకున్నాడని హిరాణీ తెలిపాడు.
సోనమ్ కపూర్, దియా మీర్జా, అనుష్క శర్మ కీలక పాత్రలు పోషించిన సంజు సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంజయ్ తల్లి నర్గిస్ పాత్రలో మనీశా కోయిరాలా, సంజయ్ తండ్రి సునీల్దత్ పాత్రలో పరేశ్ రావల్ నటించారు..
Sanju’s journey is marked by many ups and downs. Some moments suspend you into disbelief. See these postcards i.. E… https://t.co/Cs3Ew04Dgm
— Rajkumar Hirani (@RajkumarHirani) 1528955757000 | 0business
|
Newzeland
చాపెల్-హ్యాడ్లీ ట్రోఫీ న్యూజిలాండ్ సొంతం
హామిల్టన్: న్యూజిలాండ్ చాపెల్-హ్యాడ్లీ ట్రోఫిని సొంతం చేసుకుంది.ఆదివారం జరిగిన చివరి మూడవ వన్డేలో న్యూజిలాండ్ 24 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫిని సాధిం చింది.న్యూజిలాండ్ నిర్ధేశిత టార్గెట్ 282 పరుగులు చేధించే క్రమంలో ఆస్ట్రేలియా 47 ఓవర్లలో 257 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది.తద్వారా న్యూజిలాండ్ 2-0 తో ట్రోఫిని చేజిక్కించుకుంది.రెండవ వన్డే వర్షం కారణంగా రదైంది.మూడవ వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 281 పరుగులు నమోదు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ల రాస్ టేలర్ 107 పరుగులతో సెంచరీ చేయగా కేన్ విలియమ్సన్ 37 పరుగులు,సాంత్నారర్ 38 పరుగులతో ఫర్వాలేదనిపించారు.అనంతరం సాధారణ టెర్గెట్ల బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు కివీస్ బౌలర్లు చుక్కలు చూపించారు.ప్రధానంగా ఆసీస్ ను కివీస్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చావు దెబ్బ తీశాడు.10 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఆరు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ను కకావికలు చేశాడు. ఇదివన్డే బౌల్ట్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనగా నమోదు కావడం విశేషం.అతనికి తోడుగా సాంత్నార్ రెండు వికెట్లు తీయగా,విలిమయ మ్సన్ను ఒక వికెట్ తీసుకున్నాడు.ఆసీస్ జట్టు లో ఆరోస్ పించ్ 56 పరుగులు,హెడ్ 53 పరుగులతో హాఫ్ సెంచరీలు చేయగాస్టోయివిష 42 పరుగులతో సత్తా చాటి మిగతా వారి నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. తొలి వన్డేలో న్యూజిలాండ్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి విజయం సాధించింది. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Mumbai, First Published 15, Sep 2019, 1:27 PM IST
Highlights
ఈ కామర్స్ దిగ్గజాలకు షాకిచ్చేలా ఇండియన్ ట్రేడర్ బాడీ- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్రానికి సంచలన ప్రతిపాదనలు చేసింది.
ముంబై: ఒకవైపు రానున్న పండుగల సందర్భంగా అమెజాన్, ప్లిప్కార్ట్ రిటైల్ ఆన్ లైన్ దిగ్గజాలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు అఫర్లతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజాలకు షాకిచ్చేలా ఇండియన్ ట్రేడర్ బాడీ- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్రానికి సంచలన ప్రతిపాదనలు చేసింది.
రానున్న పండుగల సందర్భంగా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫెస్టివ్ సేల్స్ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఏఐటీ విజ్ఞప్తి చేసింది. భారీ డిస్కౌంట్ల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను అతిక్రమిస్తున్నాయని పేర్కొంది.
ఈ మేరకు వాణిజ్య మంత్రికి శుక్రవారం ఒక లేఖ రాసింది. రానున్న దసరా, దీపావళి, క్రిస్మస్ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు పండుగల సమయంలో భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ నిర్వహిచే ఫెస్టివల్ సేల్ను నిషేధించాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిని సియాట్ కోరింది. ఇవి ప్రకటిస్తున్న భారీ ఆఫర్లు సాధారణ ట్రేడర్లను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. 10-80 శాతం దాకా భారీ తగ్గింపులను అందించి, ఈ కంపెనీలు ధరలను స్పష్టంగా ప్రభావితం చేస్తున్నాయన్నది.
కాగా ఈ పండుగ సీజన్లో వాల్మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్కార్ట్ సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు వరుసగా ఆరు రోజుల పాటు డిస్కౌంట్ సేల్ అందిస్తోంది. అమెజాన్ కూడా తేదీలు ప్రకటించాల్సి ఉంది.
Last Updated 15, Sep 2019, 1:29 PM IST | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బంగ్లాదేశ్పై ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నీలో గురువారం బంగ్లాదేశ్పై టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్
TNN | Updated:
Mar 8, 2018, 06:45PM IST
బంగ్లాదేశ్పై ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నీలో గురువారం బంగ్లాదేశ్‌పై టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మంగళవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసిన భారత్.. టోర్నీలో ఈరోజైనా బోణి కొట్టాలని ఆశిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌ కూడా పసికూన ముద్రని చెరిపేసుకునేందుకు ఈ టోర్నీని వినియోగించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
శ్రీలంకతో మ్యాచ్‌లో బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా భారత్ 175 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయినప్పటికీ.. తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో మార్పు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. దీంతో అదే జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతోంది. మరోవైపు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ గాయం కారణంగా జట్టుకి దూరమవడంతో తాత్కాలిక కెప్టెన్ మహ్మదుల్లా నాయకత్వంలో బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడుతోంది.
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, విజయ్ శంకర్, జయదేవ్ ఉనద్కత్, చాహల్, శార్ధూల్ ఠాకూర్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
internet vaartha 137 Views
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : స్టాక్ మార్కెట్లలో నాలుగురోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఐటి భారీ కంపెనీలు ఇన్ఫోసిస్, టిసిఎస్ వంటి కంపెనీలు తమతమ ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. యూరోపియన్ మార్కెట్లలో నీరసించిన ధోరణలు, ఫ్రాన్స్లోని నీస్లో దాడులు వంటివి ఇన్వె స్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 108 పాయింట్లు దిగజారి 27,837 పాయింట్ల వద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి 24 పాయింట్లు క్షీణించి 8541వద్ద ముగిసింది. జియో జిత్ బిఎన్పి పరిభాస్ ముఖ్య మార్కెట్ వ్యూహకర్త ఆనంద్జేమ్స్ మాట్లాడుతూ ఇన్ఫోసిస్ ఫలితాలు కొంతమేర పదిశాతం దిగజార్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు కొంతమేర ఎగువన ముగిసాయి. మూల ధన వనరుల సమీకరణ నిబంధనలను సడలించాలన్న ప్రభుత్వ నిర్ణయమే ఇందుకు దోహదం చేసింది. చైనా రెండో త్రైమాసిక జిడిపి గణాంకాలు అంచనాలను అధిగమించడం కూడా కొంతదోహదం చేసింది. ఇక ఫ్రాన్స్లోని నీస్ దాడులు యూరోపి యన్ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. ఇన్ఫోసిస్ తొమ్మిదిశాతం దిగజారాయి. కంపెనీ ఆర్థికసంవత్స రానికి రాబడులు తగ్గుతాయని అంచనావేసింది. టిసిఎస్ కూడా కొంతమేర దిగజారింది. 0.46 శాతంగా ఉంది. ఇక విదేశీస్టాక్ మార్కెట్లలో ఆసియా షేర్లు వాల్స్ట్రీట్ షేర్లు రికార్డుస్థాయికి పెరగడమే కీలకంగా మారింది. చైనాషేర్లు స్వల్పంగా లాభపడ్డా యి. షాంఘై కాంపోజిట్ 0.09శాతం పెరిగింది. హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ సూచి 0.04శాతం పెరిగింది. ఆసియా మార్కెట్లలో చమురు దిగజారింది. బ్యారెల్కు 40 డాలర్లుగా వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక డాలరుతో రూపాయి మారకం విలువలు 12పైసలు క్షీణించి 67.03 రూపాయలవద్ద ముగిసింది. ఐటి కంపెనీల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ ఐటిసూచి నాలుగు శాతం క్షీణించింది. ఇన్ఫోసిస్ స్థిరమైన కరెన్సీ రాబడుల వృద్ధి 10.5శాతం నుంచి 12శాతం ఉంటుందని అంచనా వేసింది. వ్యక్తిగతంగా చూస్తే ఇన్ఫోసిస్ తొమ్మిదిశాతం దిగజారి 1075వద్ద ట్రేడింగ్ ముగించింది. ఇక టిసిఎస్, సైయింట్, విప్రో, టెక్మహీంద్ర, ఎన్ఐటి టెక్నాలజీస్ 3-ఆరుశాతం క్షీణించాయి. టిసిఎస్ మూడుశాతం క్షీణించింది. హైదరాబాద్ కేంంగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ సైయింట్ లాభాల్లో స్వల్ప క్షీణత ఎదురయింది. 73.97 కోట్లు ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 75.64కోట్లు ఆర్జించింది.కంపెనీ షేర్లు ఒకటి శాతం క్షీణించాయి. ఆటోమొబైల్ కంపెనీల షేర్లు జీవితకాల గరిష్టస్థాయికిచేరాయి. రుతుపవనా ల ప్రభావం, ఏడో వేతన సంఘం సిఫారసులే కీలకమని తేలింది. హీరోమోటోకార్ప్, మహీం ద్ర అండ్ మహీంద్ర రికార్డు గరిష్టస్థాయికి చేరాయి. టాటామోటార్స్ 52 వారాల గరిష్ట స్థాయికిచేరింది. బజాజ్ఆటో, మారుతిసుజుకి ఇండియా 52వారాల గరిష్టం నమోదయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటిశాతం పెరిగింది. భారతి ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం 50శాతం డేటాను ఆదా చేసుకునే అవ కాశం కల్పించింది. మూడు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ ఈ సదుపాయం ఉంది. కంపెనీ షేర్లు మూడు శాతం పెరిగాయి. హెచ్డిఎఫ్సి జంటసంస్థలు 1నుంచి రెండుశాతం పెరిగాయి. హెచ్డిఎఫ్సి మసలాబాండ్ల రెండు, మూడురెట్లు కొనుగోళ్లు జరిగాయి. టాటాస్టీల్ 3.56శాతం పెరిగి 372వద్ద నిలిచింది. ఎల్అండ్టి ఒకటిశాతం పెరిగింది. కంపెనీ 15శాతం తన అనుబంధ సంస్థ టెక్నాలజీ సేవలసంస్థలు ఐపిఒకు వస్తోంది. | 1entertainment
|
sumalatha 273 Views Coffee-Day , Enterprises
Coffee Day Enterprises
ముంబయి: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి సిద్ధార్థ మరణంతో కాఫీడే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. వరుసగా రెండో రోజు కంపెనీ షేరు విలువ 20శాతం కుంగింది. ఈరోజు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆరంభమైన కాసేపటికే కంపెనీ షేర్లు మళ్లీ 20శాతం పతనమయ్యాయి. బీఎస్ఈలో షేరు ధర 52 వారాల కనిష్ఠానికి తగ్గి రూ. 123.25గా ఉంది. ఎస్ఎస్ఈలోనూ ఏడాది కనిష్ఠాన్ని తాకి రూ. 122.75 వద్ద ట్రేడ్ అయ్యింది. కేవలం రెండు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ విలువ 1,463.32కోట్లు తగ్గి.. రూ. 2,603.68 కోట్లకు పడిపోయింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/ | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పాకిస్థాన్ గడ్డపైకి వెస్టిండీస్ జట్టు వెళ్తోంది..!
పాకిస్థాన్ క్రికెట్కి మళ్లీ మంచి రోజులు వస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ జట్ల అంతర్జాతీయ ఆటగాళ్లు
TNN | Updated:
Sep 13, 2017, 04:25PM IST
పాకిస్థాన్ క్రికెట్‌కి మళ్లీ మంచి రోజులు వస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ జట్ల అంతర్జాతీయ ఆటగాళ్లు వరల్డ్ ఎలెవన్ జట్టుగా ఏర్పడి పాకిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ముగిసి తొలి టీ20 మ్యాచ్‌లో అన్ని రంగాల్లో సత్తాచాటిన పాకిస్థాన్ 20 పరుగుల తేడాతో వరల్డ్ ఎలెవన్ జట్టుని ఓడించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజామ్ సేథీ చెప్పిన అధికారిక మాట పాక్ క్రికెట్ అభిమానులకి నూతన ఉత్తేజాన్ని ఇస్తోంది.
‘పాకిస్థాన్‌తో లాహోర్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్‌ అంగీకరించింది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఈ ఏడాది నవంబరులో వెస్టిండీస్ జట్టు సిరీస్ ఆడేందుకు లాహోర్‌కి రానుంది. మరోవైపు శ్రీలంకతో కూడా చర్చలు జరిపాం. కనీసం రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఇక్కడికి రావాలని అభ్యర్థించాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు’ అని సేథీ వెల్లడించారు. 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై మిలెటెంట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఏ అగ్రశ్రేణి జట్టు కూడా పాక్ గడ్డపై అడుగుపెట్టే సాహసం చేయలేదు. | 2sports
|
శాతకర్ణితో సీతయ్యను గుర్తు చేసిన బాలయ్య
Highlights
గౌటమిపుత్ర శాతకర్ణి చిత్రంలో వయసు మీద పడ్డట్టు స్పష్టంగా కనిపించిన హీరో
శాతకర్ణిలో సీతయ్యను గుర్తు చేసిన నటసింహం బాలకృష్ణ
షూటింగ్ వేగంగా పూర్తవాలనే తొందరలో కొన్ని కీలక విషయాలను పట్టించుకోని క్రిష్
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీపై రాను రాను అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. వందో చిత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలకృష్ణ అంతే ప్రతిష్టాత్మకంగా తన బాడీ లాంగ్వేజ్ కూడా తీసుకుని ఉంటే బాగుండేది. ఈ అంశంపై దర్శకుడు క్రిష్ పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. అయితే దానికి కారణం లేకపోలేదు. బాలకృష్ణతో డైలాగులు చెప్పించుకుని సినిమాని లాగేయొచ్చనే ఉద్దేశం అతనిలో ఉన్నట్లు కనిపించింది.
ఒక చారిత్రక పురుషుడు అందునా ఒక శకపురుషుడు.. వందల యేళ్ల వరకు భరత ఖండంపై దండయాత్రలకు విదేశీయులు సాహసం చేసేందుకు ఆలోచించేందుకు కూడా జడుసుకునేలా చేసిన ధీరుడు, గౌతమిపుత్రుడు శాతకర్ణి. అంతటి మహనీయుడి గురించి సినిమా తెరకెక్కిందంటే... ఆ మహానుభావుడి చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న సగటు ప్రేక్షకుడు ఈ సినిమా చూడటం ఖాయం. అయితే సినిమా చూసాక.. క్రిష్ యుద్ధాలు తెరకెక్కించారు తప్ప శాతకర్ణికి సంబంధించిన చరిత్ర ఏ మాత్రం సంతృప్తి కలిగించేలా తెరకెక్కించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక చరిత్ర సంగతి అటుంచితే... ఒక యుగ పురుషుడికి ఉండాల్సిన శరీర సౌష్టవం ఈ చిత్ర హీరోలో కనిపించలేదంటే అతశయోక్తి ఎంత మాత్రం కాదు. శరీర సౌష్టవం మాట అటుంచితే.. కనీసం అంతటి మహానుభావుడి పాత్రలో నటించిన హీరోను ఎలా చూపించాలన్న అంశంపై దర్శకుడు పెద్దగా శ్రద్ధ పెట్టినట్టు కనిపించదు. అందుకే బాలయ్య శాతకర్ణిలా కాకుండా సీతయ్యలా కనిపించాడు. సీతయ్య ఎవరిమాటా వినడు. అలానే శాతకర్ణి సినిమాలో బాలయ్య కూడా. ఇంతకీ సీతయ్యకీ బాలయ్యకీ సారూప్యత ఏంటి... ఈ సందర్భంలో ఎందుకు అంటారా... ఎందుకంటే హీరో వయసు మళ్లిన ఛాయలు..శాతకర్ణి చిత్రం ఫ్రేము ఫ్రేములో కనిపించాయి. బహుశా ఇలాంటి చిన్న చిన్న అంశాలపై కూడా దృష్టి పెట్టకుండా సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా సినిమాను పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేసినందుకే ఈ చిత్రం అంత తక్కువ కాలంతో పూర్తయింది. అయితే మరింత సమయం తీసుకుని ఉండి, హీరో శరీర సౌష్టవంపై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేంది.
ఇక యుద్ధ వ్యూహాలు కూడా బాహుబలి ప్రభావం ఉన్నా,.. ఆస్థాయి వ్యూహాలు మాత్రం కనిపించలేదు. ఏదో యుద్ధాలు పదే పదే సా...గినా.. వాటిలో వ్యూహాలు ఆకట్టుకునే స్థాయిలో కనిపించలేదు. ఇక బాలయ్య కత్తిపట్టిన తీరు కూడా ఒక శక పురుషుడి ఠీవీని మరిపించలేదు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సిగరెట్ తీసి వెలిగించినప్పుడు కనిపించే స్టైల్, ఆ ఫీల్ కూడా ఈ చిత్రంలో ఏ ఫ్రేములో కనిపించలేదు. మరికొంత సమయం తీసుకుని స్క్రీన్ ప్లేని, యుద్ధ వ్యూహాలను మరింత ఆకట్టుకునేలా తీర్చి దిద్ది ఉంటే... శక పురుషుని కథ ఎంచుకున్నందుకు సార్థకత లభించేది. ఏది ఏమైనా సినిమా ట్రయలర్ చూసి ఆనందిద్దాం. శాతకర్ణి సినిమాలో తన చరిత్ర కోసం ఆశలు తగ్గిద్దాం. జయహో శాతకర్ణి. | 0business
|
internet vaartha 146 Views
న్యూఢిల్లీ : జలందర్లోని భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ ఇంటికి ఒక విశిష్ట అతిథి వెళ్లి అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తన కుస్తీ పోరాటాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించు కున్న దిలీప్సింగ్ రానా (గ్రేట్ కాళీ) తన ఇంటికి వచ్చాడంటూ భజ్జీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. మా ఇంటికి గ్రేట్ కాళీ రావడం చాలా ఆనందంగా ఉంది, మా ఇద్దరి మధ్య జరిగిన చిన్న ప్రేమ పూర్వక సమావేశంలో తను ఎన్నో సరదా విషయాలు నాతో పంచుకున్నాడంటూ భజ్జీ వివరించాడు. కాగా ఈ సమావేశంపై కాళీ కూడా స్పందించాడు. నేను ఈ రోజు జలందర్లో హర్భజన్ సింగ్ను కలిశాను, అతను ఎలాంటి బేషజాలులేని వ్యక్తి అంటూ కాళీ వివరించాడు. ఈ ఏడాది పిబ్రవరిలో జరిగిన ఓ ఫైట్లో విదేశీ రెజ్లర్ చేతిలో తీవ్రంగా గాయపడిన కాళీ నాలుగు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని మళ్లీ వారిని డెహ్రాడూన్లో ఓడించిన విషయం తెలిసిందే. | 2sports
|
Hyderabad, First Published 20, Apr 2019, 12:06 PM IST
Highlights
చిన్న సినిమాలకు కొత్తదనమే ప్రధాన ఆయుధం. సినిమా బడ్జెట్ స్టార్ క్యాస్టింగ్ వంటి విషయాలను పక్కనపెడితే సినిమా కథ కథనం ఎంత డిఫరెంట్ గా ఉందన్నదే ముఖ్యం.
చిన్న సినిమాలకు కొత్తదనమే ప్రధాన ఆయుధం. సినిమా బడ్జెట్ స్టార్ క్యాస్టింగ్ వంటి విషయాలను పక్కనపెడితే సినిమా కథ కథనం ఎంత డిఫరెంట్ గా ఉందన్నదే ముఖ్యం. యువ హీరో విష్ణు నుంచి గత కొంత కాలంగా అలాంటి కథలే ఎక్కువగా వస్తున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉన్న సాఫ్ట్ కథలను వదలడంతో మనోడి స్టయిలే వేరు.
ఇక ఇప్పుడు బ్రోచేవారెవరురా అనే మరో సినిమాతో ఎదో కొత్తగా చూపించాలని ట్రై చేస్తున్నట్లు అర్ధమవుతోంది. సినిమాకు సంబందించిన టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ పరవాలేదు అనిపించే విధంగా క్రేజ్ అందుకుంటోంది. నివేత పేతురేజ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సత్య దేవ్ - ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఇక మెంటల్ మదిలో సినిమాకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్ కోసం కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
Last Updated 20, Apr 2019, 12:06 PM IST | 0business
|
హైదరాబాద్ విమానాశ్రయానికి అరుదైన ఘనత
- 3వ మేటి విమానాశ్రయంగా ఏసీఐ సంస్థ ర్యాంకింగ్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' (జీహెచ్ఐఏఎల్) నిర్వహిస్తున్న 'హైదరబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం' (ఆర్జీఐఏ) మరోమారు ప్రపంచంలోనే మూడో మేటి ఏయిర్పోర్ట్ ఘనతను సొంతం చేసుకుంది. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వెల్లడించిన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్ఈ) ర్యాకింగ్లలో హైదరాబాద్ విమానాశ్రయం మేటి ఎయిర్పోర్ట్ల సరసన మూడో స్థానంతో నిలిచింది. సాలీనా 50-150 లక్షల ప్రయాణి సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల విభాగంలో ఆర్జీఐఏకు ఈ ర్యాకింగ్ లభించింది. ఈ సందర్భంగా జీహెచ్ఐఏఎల్ సంస్థ సీఈఓ ఎస్జీకే కిషోర్ మాట్లాడుతూ తమ విమానాశ్రయం కార్యకలాపాలు మొదలుపెట్టిన ఏడాది నుంచి వరుసగా ఆర్జీఐఏ ఈ ఘనతను సొంతం చేసుకొంటూ వస్తున్నట్లు తెలిపింది. వరుసగా ఏడాసారి హైదరాబాద్ విమానాశ్రయానికి ఈ ఘనత లభించినట్లు తెలిపారు. సంస్థపై నమ్మకం ఉంచిన ప్రయాణికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారిచ్చిన తోడ్పాటుతోనే ఈ ఘనత సొంతమైనట్లు వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
sumalatha 138 Views interest rates , Nirmala Sitharaman
Nirmala Sitharaman
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీలు) అధిపతులతో పాటు హచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్ అధిపతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి రుణ రేట్ల ప్రయోజన బదిలీపై చర్చించారు. బ్యాంకర్లందరూ ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష ప్రకారం, రుణ రేట్లను సవరించేందుకు అంగీకారం తెలిపినట్లు సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2018 డిసెంబరు నుంచి ఆర్బీఐ మూడు దఫాలుగా పావు శాతం చొప్పున కీలక రేట్లను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నిర్ణయం 7న (బుధవారం) వెల్లడి కానుంది. ఈ సమీక్షలోనూ పావు శాతం మేర కీలక రేట్ల కోత ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.
తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/ | 1entertainment
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
EPFO గుడ్ న్యూస్.. పీఎఫ్ ఖాతాదారులకు ఒకే రోజు 2 శుభవార్తలు!
ఈపీఎఫ్వో తాజాగా అదిరిపోయే శుభవార్త అందించింది. కంపెనీలపై ఆధారపడకుండా ఇక నేరుగా ఈపీఎఫ్వో వెబ్సైట్ నుంచే యూఏఎన్ నెంబర్ పొందొచ్చు. అలాగే పెన్షనర్లకు కూడా మరో తీపికబురు అందించింది.
Samayam Telugu | Updated:
Nov 2, 2019, 10:07AM IST
హైలైట్స్
కొత్త సర్వీసులు లాంచ్ చేసిన ఈపీఎఫ్వో
యూఏఎన్ నెంబర్ ఆన్లైన్లోనే పొందొచ్చు
దీని కోసం కంపెనీపై ఆధారపడాల్సిన అవసరం లేదు
అలాగే పెన్షన్ డాక్యుమెంట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) తన సబ్స్క్రైబర్లకు తీపికబురు అందించింది. యూనివర్సల్ అకంట్ నెంబర్ పొందడాన్ని సులభతరం చేసింది. ఇకపై యూఏఎన్ నెంబర్ కోసం ఉద్యోగులు కంపెనీపై ఆధారపడాల్సిన అసవరం ఉండదు. ఆన్లైన్లోనే యూఏఎన్ నెంబర్ పొందొచ్చు.
ప్రస్తుతం యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) పొందాలంటే కంపెనీ ద్వారా అప్లై చేసుకోవాలి. దీంతో ఉద్యోగులు యూఏఎన్ కోసం కంపెనీపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కంపెనీతో పనిలేకుండానే ఆన్లైన్లో యూఏఎన్ పొందొచ్చు. దీంతో ఉద్యోగం మారేటప్పుడు కూడా పీఎఫ్ బ్యాలెన్స్ను సులభంగానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది ఉద్యోగి జీవిత కాలంపాటు ఒకేలా ఉంటుంది. మారదు. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత్పై ఫించ్ చెలరేగుతాడు: అలెక్స్ కేరీ
‘ఆస్ట్రేలియా టీమ్లో గర్వించదిగిన ఆటగాళ్లలో అరోన్ ఫించ్ కూడా ఒకరు. అతను భారీ స్కోరుతో జట్టుకి విజయాన్ని అందించడం ద్వారా ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నాడు. నెట్స్లో అతను శ్రమిస్తున్న తీరు చూస్తుంటే..?
Samayam Telugu | Updated:
Jan 14, 2019, 12:39PM IST
భారత్పై ఫించ్ చెలరేగుతాడు: అలెక్స్ కేరీ
భారత్తో చివరి రెండు వన్డేల్లోనూ ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ చెలరేగుతాడని ఆ జట్టు వైస్ కెప్టెన్ అలెక్స్ కేరీ ధీమా వ్యక్తం చేశాడు. అడిలైడ్ వేదికగా మంగళవారం ఉదయం 8.50 గంటల నుంచి రెండో వన్డే ప్రారంభంకానుండగా.. ఈరోజు మీడియాతో అలెక్స్ మాట్లాడాడు. గత శనివారం ముగిసిన తొలి వన్డేలో 11 బంతులు ఎదుర్కొన్న అరోన్ ఫించ్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔటయ్యాడు. ఈ వన్డేనే కాదు.. భారత్తో ఇటీవల ముగిసిన టీ20, టెస్టు సిరీస్లోనూ ఈ ఓపెనర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఎంతలా అంటే.. అతను చివరిగా ఆడిన 11 ఇన్నింగ్స్ల్లో అత్యధిక స్కోరు 47కాగా.. ఏకంగా ఏడుసార్లు 7 పరుగులలోపే పెవిలియన్ చేరాడు.
‘ఆస్ట్రేలియా టీమ్లో గర్వించదిగిన ఆటగాళ్లలో అరోన్ ఫించ్ కూడా ఒకరు. అతను భారీ స్కోరుతో జట్టుకి విజయాన్ని అందించడం ద్వారా ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నాడు. నెట్స్లో అతను శ్రమిస్తున్న తీరు చూస్తుంటే..? తప్పకుండా భారత్పై చివరి రెండు వన్డేల్లో భారీ స్కోరు సాధించేలా కనిపిస్తోంది. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా అతను మంచి నాయకుడు’ అని కెప్టెన్కి మద్దతుగా అలెక్స్ కేరీ నిలిచాడు.
జింబాబ్వేతో గత ఏడాది జూలైలో జరిగిన టీ20 మ్యాచ్లో కేవలం 76 బంతుల్లోనే 16x4, 10x6 సాయంతో అరోన్ ఫించ్ 172 పరుగులు చేశాడు. కానీ.. ఆ తర్వాత ఇప్పటి వరకూ అన్ని ఫార్మాట్లలో కలిపి 25 ఇన్నింగ్స్లు ఆడిన ఫించ్.. సాధించింది రెండు అర్ధశతకాలు మాత్రమే..!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
TEAM INDIA
భారత్ 3-1తో సిరీస్ కైవసం
కింగ్స్టన్: కరీబియన్ గడ్డపై టీమ్ ఇండియాకు అద్భుత విజయం సాధించి సిరీస్ కైవసం చేసు కుంది. నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. నాలుగో వన్డే ఓటమికి టీమిండియా బదులిచ్చింది. బ్యా టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో సమిష్టిగా సత్తాచాటి తమకు తిరుగులేదని మరోమారు నిరూ పించుకుంది. వెస్టిండీస్పై ఐదు వన్డేల సిరీస్ను 3-1తో చేజిక్కించుకుంది. నాలుగో వన్డేలో అనూ హ్యవిజయం సాధించిన హోల్డర్ సేన చివరిదైన ఐదోవన్డేలో పోరాటపటిమ ప్రదర్శించలేక పోయింది. గత మ్యాచ్లో లాగే ఛేదనలో భారత్ ను కట్టడిచేసి సిరీస్ను సమం చేయాలనుకున్న విండీస్ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 115బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సులతో 111పరుగులు చేసి అజేయ శతకం ముందు తేలిపోయింది. గురువారం కింగ ్స్టన్లో జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్పై 8వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో 3-1తేడాతో సిరీస్ను కోహ్లీ సేన సొంతం చేసు కుంది.
తొలివన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఐదోవన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి న విండీస్, మహ్మద్ షమీ(4/48), ఉమేష్ యా దవ్ (3/53) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9వికెట్లకు 205 పరుగులు చేసింది. హోప్ సోద రులు షె§్ు (51), కైల్(46) రాణించడంతో విం డీస్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. అనంతరం భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ శతకం, దినేశ్ కార్తీక్ అర్థశతకంతో రాణించడంతో భారత్ 36.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అల వోకగా ఛేదించింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను విరాట్ కోహ్లీ అందుకోగా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ను అజింకా రహానే అందుకున్నాడు. 205పరుగులకే పరిమితమైన వెస్టిండీస్: తొలుత టాస్ గెలిచిన విండీస్ సారధి హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయ గలిగింది. ఓపెనర్ టూయిస్ (9)ను హర్తిక్ పాం డ్యా తక్కువ పరుగులకే ఔట్ చేసినప్పటికీ, కెఏ హోఫ్(46), ఎస్డి హోప్ (51) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వీరి భాగస్వామ్యాన్ని ఉమేష్ యాదవ్ విడగొట్టాడు. ఒక చక్కటి బంతితో కెఏ హోప్ను బోల్తా కొట్టిం చాడు. అనంతరం ఎస్డి హోప్ను షమీ పెవిలి యన్కు పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ హోల్డర్ (36), పావెల్ (31) మినహా ఎవరూ ఆకట్టు కోలేదు. ఇద్దరు ఖాతా తెరవకుండా ఔటయ్యాడు. షమీ 4, ఉమేష్ యాదవ్ 3, పాండ్యా, జాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. విజృంభించిన భారత బౌలర్లు: తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్కు శుభారంభం లభిం చింది.
ఒక ఎండ్లో ఎవిన్ లూయిస్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే మరో ఎండ్లో కైల్ హోప్ బౌండరీలతో చెలరేగాడు. జట్టు స్కోరు 39 వద్ద యువ సంచలనం హార్థిక్ పాండ్యా బౌలింగ్లో లూయిస్ (9) వెనుదిరిగాడు. కైల్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగు లెత్తించాడు. ఉమేశ్ వేసిన 16వ ఓవర్ ఐదో బంతికి ఫీల్డర్ దావన్ చేతికి క్యాచ్ ఇచ్చి కైల్ ఔట య్యాడు. తర్వాత బంతికే ఛేస్ ఎల్బీగా డకౌట్గా వెను తిరిగాడు. అప్పటికి 15.6ఓవర్లకు విండీస్ స్కోరు 3వికెట్లకు 76పరుగులు. ఈ దశలో క్రీజులో ఉన్న షె§్ు..మహ్మద్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పటిష్ట భారత్ బౌలింగ్ను ఎదు ర్కొంటూ పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు.
అయినప్పటికీ పర్యాటక జట్టు బౌలింగ్ దళం క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే ఉంది. జాదవ్ బౌలింగ్లో మహ్మద్ (16) ఔటవ్వ డంతో క్రీజులోకివచ్చిన హోల్డర్ ధాటిగానే ఆడాడు. 34 బంతులాడిన హోల్డర్ 4ఫోర్లు, సిక్సర్ సాయంతో 36 పరుగులు రాబట్టాడు. అర్ధశతకం పూర్తి చేసుకున్న షె§్ు ఎక్కువ సేపు నిలవలేదు. 42వ ఓవర్లో క్రీజులో పాతుకుపోయిన షె§్ును షమీ పెవిలియిన్ చేర్చాడు. ఆఖర్లో పావెల్ రెండు సిక్సర్లతో చెలరేగి 31 పరుగులు సాధించడంతో విండీస్ 205 పరుగులు చేయగలిగింది. భారత స్పిన్నర్లు జడేజా,కులదీప్ యాదవ్ వికెట్లు తీయక పోయినప్పటికీ ప్రత్యర్థి బౌలర్లను కట్టడి చేశారు. శతక్కొట్టిన విరాట్: 206 పరుగుల ఛేదనలో భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోసెఫ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆఖరి బంతికే శిఖర్ దావన్(4) ఔటయ్యాడు. సిరీస్లో వరుసగా మూడో మ్యాచ్లో విఫలమై నిరాశపరి చాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ మరో ఓపెనర్ రహానే వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
హోల్డర్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతిని రహానే కవర్ పాయింట్ దిశగా కట్ చేయ డంతో బంతి నేరుగా బిషూ చేతిలో పడింది. కానీ అతడు బంతిని జారవిడవడంతో రహానె బతికి పోయాడు. ఈ సమయంలో కోహ్లీ సైతం క్రీజులో కుదురుకునేందుకు ఎక్కువ సేపు శ్రమించాడు. మరో ఎండ్లో రహానే అడపదడపా బౌండరీలు బాదుతూ నిదానంగా స్కోరు వేగం పెంచాడు. హోల్డర్ వేసిన ఆరో ఓవర్లో మూడు ఫోర్లు బాది 12పరుగులు రాబట్టాడు. జోసెఫ్ వేసిన తర్వాత ఓవర్లో విరాట్ రెండు ఫోర్లు కొట్టి 9పరుగులు సాధించాడు. 7ఓవర్లకు భారత్ స్కోరు 40/1. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్ప టికీ భారత బ్యాట్స్మెన్ సంయమనంతో వ్యవహ రించారు.
చెత్తబంతులను బౌండరీలు దాటిస్తూ, వీలుచిక్కినప్పుడల్లా సింగిల్స్ తీస్తూ లక్ష్యం వైపు అడుగులేశారు. భారీ భాగస్వామ్యం వైపు దూసు కెళ్తున్న ఈ జోడీ దేవేంద్ర బిషూ విడదీశాడు. 19వ ఓవర్ ఆఖరి బంతికి రహానే 51బంతుల్లో 5ఫోర్లతో 39పరుగులు చేసి ఎల్బీగా వెనుదిరి గాడు. నర్స్ వేసిన 22వ ఓవర్లో ఫోర్ బాదిన కోహ్లీ 67బంతుల్లో అర్థశతం పూర్తి చేసుకున్నాడు. 22 ఓవర్లకు భారత్ 108/2 స్థితిలో నిలిచింది. సాధించాల్సిన రన్రేట్ తక్కువగా ఉండటంతో విరాట్ గేర్ మార్చాడు. వికెట్ల వేటలో పడిన విండీస్ బౌలర్లకు ఏమాత్రం అవకావం ఇవ్వకుండా భారీ షాట్లతో చెలరేగాడు. మరో ఎండ్లో ఉన్న దినేశ్ కార్తీక్ క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చాడు.
ముఖ్యంగా కోహ్లీ చాలా రోజుల తర్వాత తన కళాత్మక షాట్లతో అలరించాడు. లక్ష్యానికి దగ్గరవుతున్నా కొద్దీ కోహ్లీ, కార్తీక్ ద్వయం భారీ షాట్లతో విరుచుకపడ్డారు. విలియమ్స్ వేసిన 35వ ఓవర్లో ఫోర్ బాదిన విరాట్ వన్డే కెరీర్లో 28వ శతకాన్ని సాధించాడు. 108బంతులాడిన విరాట్ 12ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అనంరతం 37వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసిన కార్తీక్ 52బంతుల్లో 5ఫోర్లతో అర్ధశతకంతో మెరిశాడు. అదే ఓవర్లో ఐదో బంతిని విరాట్ భారీ సిక్సర్ కొట్టి భారత ఇన్నింగ్స్ను విజయంతో ముగించాడు. తేలిపోయిన వెస్టిండీస్ బౌలర్లు: నాలుగో వన్డేలో 189పరుగుల స్కోరును కాపాడుకోవడంలో సమి ష్టిగా రాణించి విజయవంతమైన విండీస్ బౌలర్లు ఈ మ్యాచ్లలో తేలిపోయారు. భారత ఫేసర్లు విజృంభించిన పిచ్పైనే వీళ్లు ప్రభావం చూపలేక పోయారు.
జోసెఫ్, బిషూచెరో వికెట్ పడగొట్టారు. సచిన్ రికార్డును అధిగమించిన కోహ్లీ: కరీబియన్ గడ్డపై టీమిండియా ఐదో వన్డేలో అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. లక్ష్య ఛేదన చేసే క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిం చాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 28వ సెంచరీ కాగా ఛేదనలో 18వ సెంచరీ కావడం విశేషం. ఇప్పటి వరకు ఛేజింగ్లో అత్యదిక సెంచరీల రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (17) పేరిట ఉంది. విండీస్పై జరిగిన చివరి వన్డేలో చేసిన సెంచరీతో సచిన్ రికార్డును అధిగమించాడు. ఛేదనలో 17సెం చరీలు సాధించడానికి సచిన్కు 232 ఇన్నింగ్స్లు పట్టగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 102 ఇన్నింగ్స్ల్లో 18 సెంచరీలు సాధించాడు. మూడో స్థానంలో శ్రీలంక వెటరన్ క్రికెటర్ దిల్షాన్ (116 ఇన్నిం గ్స్ల్లో 11సెంచరీలు), క్రిస్ గేల్ (139 ఇన్నిం గ్స్ల్లో 11 సెంచరీలు) చేశారు. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రోడ్డు ప్రమాదంలో హీరోయిన్కి గాయాలు
అమెరికాలో జరుగుతున్న షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ ఇండియన్ హీరోయిన్ తృటిలో రోడ్డు ప్రమాదం బారి...
TNN | Updated:
Oct 15, 2016, 03:59PM IST
అమెరికాలో జరుగుతున్న తన సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఇండియన్ హీరోయిన్ కంగనా రనౌత్ తృటిలో ఓ రోడ్డు ప్రమాదం బారి నుంచి బయటపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ప్రస్తుతం కంగనా నటిస్తున్న సిమ్రాన్ మూవీ షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. హన్సాల్ మెహతా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగించుకుని అట్లాంటాలోని తమ హోటల్‌కి బయల్దేరింది మూవీ యూనిట్. యూనిట్ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. 381 నెంబర్ హైవేపైవున్న స్పీడ్ ట్రాక్‌(పూర్తి ఎడమవైపున వున్న ట్రాక్)లో వాహనం వెళ్తున్న సమయంలో, వాహనం నడిపిస్తున్న డ్రైవర్‌కి అకస్మాత్తుగా ఊపిరి ఆడనంత దగ్గు రావడం.. ఆ తర్వాత వాహనం అదుపుతప్పడం వెనువెంటనే జరిగిపోయాయని తెలుస్తోంది. డ్రైవర్ పక్కనే కూర్చున్న కంగనా రనౌత్ బాడీగార్డ్ స్టీరింగ్‌ని తన చేతుల్లోకి తీసుకుని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే అదుపుతప్పిన వాహనం.. కుడిపక్కన వున్న మూడు హైవై ట్రాక్‌లని దాటుకుని వెళ్లి రోడ్డుపక్కనే వున్న ఐరన్ ఫెన్సింగ్‌ని ఢీకొంది.
అదృష్టంకొద్దీ వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్లంతా స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కంగనా నుదురు, చేతులకి స్వల్ప గాయాలయ్యాయి. వాహనం పక్కనున్న ట్రాక్స్‌లోకి దూసుకెళ్లిన సమయంలో అటువైపుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విచిత్రం ఏంటంటే, ఇంత షాకింగ్ ఇన్సిడెంట్ తర్వాత కూడా కంగనా తర్వాతి రోజే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంది. షూటింగ్‌కి కొంత విరామం ఇవ్వడానికి దర్శకుడు, నిర్మాతలు రెడీగా వున్నప్పటికీ.... కంగనా మాత్రం షూటింగ్ బ్రేక్ చెప్పలేదు. షెడ్యూల్ ప్రకారమే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ తర్వాతి ప్రాజెక్ట్సులో బిజీ అవ్వాలనేది కంగనా ప్లాన్ అని తెలుస్తోంది. అందుకే షూటింగ్‌కి బ్రేక్ తీసుకోకుండా మళ్లీ పనిలో లీనమైపోయింది. | 0business
|
పెళ్లి పుకార్లపై ఘాటు రిప్లై ఇచ్చిన తమన్నా
Highlights
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ తమన్నా పెళ్లి చేసుకోబోతోదంటూ వస్తున్న వార్తలు తెలిసిందే. ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిందని, ఆమె ఓ డాక్టర్ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ తమన్నా పెళ్లి చేసుకోబోతోదంటూ వస్తున్న వార్తలు తెలిసిందే. ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిందని, ఆమె ఓ డాక్టర్ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. గతంలో కూడా తమన్నాపై ఇటువంటి వార్తలు వ్యాపించడం, ఆ తర్వాత తమన్నా ఖండించడం వంటివి జరిగాయి. తాజాగా మరోసారి తమన్నా.. తన పెళ్లి వార్తలను ఖండిస్తూ ట్వీట్ చేసింది. అయితే ఈసారి కాస్త ఘాటుగానే స్పందించింది తమన్నా.
ట్వీట్టర్ తమన్నా ఏం తెలిపిందంటే.. ‘‘ఒకప్పుడు యాక్టర్తో నా పెళ్లి అన్నారు. మరోసారి క్రికెటర్తో అన్నారు. ఇప్పుడేమో డాక్టర్తో అంటూ రాస్తున్నారు. ఇలాంటి వార్తలను వింటుంటే నేను భర్త కోసం షాపింగ్ చేస్తున్నానేమో అనే ఫీలింగ్ కలుగుతోంది. నాకు ప్రేమ అనే భావన ఇష్టమే కానీ, పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి రూమర్స్ పుట్టించడమే సరికాదు. ప్రస్తుతం నేను సింగిల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు నాకోసం వరుడిని వెతికే పనిలో లేరు. ప్రస్తుతం నేను సినిమాలకు సంబంధించిన వ్యవహారాలతో రొమాన్స్ చేస్తున్నాను. నా పనిలో నేను బిజీగా ఉంటే.. ఇలాంటి రూమర్స్ ఎందుకు పుట్టిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటాను. సో.. అప్పటి వరకు మీ ఊహలతో నాకు పెళ్లి చేయడం మానుకోండి..’’ అంటూ వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 27, 2018
Last Updated 28, Jul 2018, 10:37 AM IST | 0business
|
Jul 09,2016
బీఎస్ఈ నుంచి ఎనిమిది కంపెనీలు ఔట్
న్యూఢిల్లీ : లిస్టింగ్ నిబంధనలను పాటించని ఎనిమిది కంపెనీల షేర్లపై సస్పెండ్ చర్యలకు బాంబే స్టాక్ ఎక్స్ఛ్ంజే (బీఎస్ఈ) ఉపక్రమించనుంది. నేరుగా రెండు త్రైమాసికాల నుంచి లిస్టింగ్ నిబంధనలను అమలుపరచటంలో ఈ కంపెనీలు విఫలమవడంతో ఈ సస్పెండ్ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ సస్పెన్షన్ జులై 29 నుంచి అమలులోకి వస్తుందని బీఎస్ఈ పేర్కొంది. ప్రమోటర్ల చెందిన పూర్తి వాటాలను తదుపరి నోటిస్ ఇచ్చేంత వరకు స్తంభింప చేయనుంది. సస్పెండ్ నోటిసులు అందుకున్న వాటిలో గంగోత్రి ఐరన్ అండ్ స్టిల్ కంపెనీ, గుప్తా సింథటిక్స్, ఎంసీఎస్, నిరజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, మిన్ఓ్లటా ఫైనాన్స్, సాప్ట్టెక్ ఇన్ఫ్నియమ్ సోల్యూషన్స్, యూనిమిన్ ఇండియా, జైలాగ్ సిస్టమ్స్ కంపెనీలు వున్నట్టు బీఎస్ఈ ఓ ప్రకటనలో పేర్కొంది. సెబీ నిబంధనల పాటించే వరకు కంపెనీలపై సస్పెన్షెన్ కొనసాగుతుంది. పదిహేను రోజుల తర్వాత నిషేధిత షేర్లకు ట్రేడింగ్ అనుమతి ఇస్తుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Virat Kohli: స్మిత్పై వేటు కోహ్లికి కలిసొచ్చిందిలా!
ఐసీసీ అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ కోహ్లి హ్యాట్రిక్ సాధించాడు. స్మిత్పై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేయడం కూడా ఈసారి కోహ్లికి కలిసొచ్చింది. 2017 ఐసీసీ అవార్డుల్లో మిస్సయ్యింది.. ఈసారి కలిసొచ్చింది.
Samayam Telugu | Updated:
Jan 22, 2019, 03:56PM IST
Virat Kohli: స్మిత్పై వేటు కోహ్లికి కలిసొచ్చిందిలా!
హైలైట్స్
ఐసీసీ అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ కోహ్లి హ్యాట్రిక్ సాధించాడు.
స్మిత్పై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేయడం కూడా ఈసారి కోహ్లికి కలిసొచ్చింది.
2017 ఐసీసీ అవార్డుల్లో మిస్సయ్యింది.. ఈసారి కలిసొచ్చింది.
ఐసీసీ అవార్డుల్లో విరాట్ కోహ్లి హ్యాట్రిక్ సాధించాడు. ఐసీసీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన విరాట్.. గ్యారీ సోబెర్స్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వన్డే ప్లేయర్, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ అవార్డులను సైతం కోహ్లి సొంతం చేసుకున్నాడు. తద్వారా ఒకే ఏడాది ఈ మూడు అవార్డులను దక్కించుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. గత ఏడాది ఐసీసీ టెస్టు ప్లేయర్ మినహా మిగతా రెండు అవార్డులను కోహ్లి సొంతం చేసుకున్నాడు. టెస్టు ప్లేయర్ అవార్డును నాటి ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ సొంతం చేసుకున్నాడు.
బాల్ ట్యాంపరింగ్ కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్పై ఏడాది వేటేయడం కోహ్లికి కలిసొచ్చింది. ఐసీసీ టెస్టు ప్లేయర్గా నిలవడానికి తన ఆటతీరే కారణమైనప్పటికీ.. స్మిత్ గైర్హాజరీ కూడా విరాట్కు ఉపయోగపడింది. 2017లో టెస్ట్ ప్లేయర్గా నిలిచిన స్మిత్.. టెస్టుల్లో అగ్రస్థానంతో ఆ ఏడాదిని ముగించాడు. 947 పాయింట్లతో బ్రాడ్మన్ (961) తర్వాత అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గత ఏడాదితో పోలిస్తే 2017లోనే కోహ్లి టెస్టుల్లో ఎక్కువ పరుగులు సాధించాడు. కానీ విరాట్ కంటే మిన్నగా స్మిత్ ఆడాడు.
గత ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనలో బాన్క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడటం.. తదనంతర పరిణామాలతో స్మిత్, వార్నర్లపై ఏడాదిపాటు నిషేధం వేటు పడింది. దాదాపు 9 నెలలపాటు ఆటకు దూరమైనా స్మిత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్-5లో నిలిచాడంటే అతడి ఆట ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్మిత్పై నిషేధం వేటు పడిన తర్వాత.. గత ఏడాది ఆగష్టులో కోహ్లి టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకోగలిగాడు. స్మిత్ 2018లోనూ క్రికెట్ ఆడి ఉంటే.. టెస్టు ప్లేయర్ రేసులో విరాట్కి గట్టి పోటీ ఇచ్చేవాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Suresh 102 Views pulses
మార్కెట్లలో పెరిగిన పప్పుదినుసుల ధరలు
ఇండోర్, ఆగస్టు 7: పప్పుదినుసులకు కీలకమార్కెట్ అయిన ఇండోర్లో కొత్తసరుకుల రాక భారీగా తగ్గడం తో మార్కెట్లలో పప్పుదినుసులధరలు పెరిగాయి. ప్రభుత్వం కూడా కొన్నిరకాల పప్పుదినుసుల విత్త నాలపై ఎగుమతికి ఆస్కారం కల్పించడంకూడా ఇందు కు మరికొంతకారణం అయింది. కందిధరలు క్వింటా లుకు 3350గా నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2900 నుంచి మూడువేల వరకూ కొనసాగింది. కందిధరలు మధ్యస్తంగా ఉన్న రకం క్వింటాలుకు రూ.4100 నుంచి రూ.4200గా నిలిచింది. ఇక పెద్దగుళ్లు మినుములు క్వింటాలు రూ.4300నుంచి రూ.4400గా నడిచాయి. పెసర పెద్దవి క్విం టాలుకు రూ.4500నుంచి రూ.4600గా ఉంటే మధ్యరకం పెసలు క్వింటాలుకు రూ.3800నుంచి 4000గా నడిచాయి. పెసలధరలలు పెరగడం వల్ల పప్పుదినుసుల్లో కూడా పెరిగింది. మద్యరకం పెసర పప్పు క్వింటాలు రూ.5వేల నుంచి రూ.5100గాను, పెద్దపప్పు రూ.5200 నుంచి రూ.5400 గాను ఉంటుంది. పొట్టుపెసరపప్పు క్వింటాలుకు రూ.5700 నుంచి రూ.5800గా నిలిచింది. | 1entertainment
|
సచిన్ ట్వీట్కు స్పందించిన కోహ్లీ
న్యూఢిల్లీ: వరుసగా నాలుగు సిరీస్ల్లో నాలుగు డ బుల్ సంచరీలు చేసి కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొ ల్పిన నేపథ్యంలో సచిన్ చేసిన ట్వీట్పై టీమిండియా సారథి కోహ్లీ స్పం దించాడు.ఈ సందర్భంగా ధన్యవాదాలు సచిన్,మీరు తెలిపిన అభినందనలు నాకు ప్రపంచంతో సమానం అని కోహ్లీ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్పై కోహ్లీ డబుల్ సెంచరీ సాధించడంతో నీ బ్యాట్ స్వీట్ స్పాట్ నువ్వు ఎంత గొప్ప ఫామ్లో ఉన్నావో చెబుతుంది.ఇంకా ఏ స్కోరు బోర్డులు అవరసంలేదు. నీ బ్యాట్ను ఆ దేవుడు ఎప్పుడు ఇలాగే ఉంచుతాడని ఆశిస్తున్నా అని సచిన్ ట్వీట్ చేశాడు.బంగ్లాదేశ్పై 208పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన తరు వాత కొద్దిరోజులకు కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.ఎప్పుడు తనకు సచిన్ ఆదర్శ మని పేర్కొనే కోహ్లీ ఆయన చేసిన ట్వీట్పై కొంచెం ఆలస్యంగానే స్పందించాడు. | 2sports
|
12 రోజులు పడుకొమ్మన్నారు.. కారు,ఫ్లాట్ అన్నీ ఇస్తామన్నారు
Highlights
కాస్టింగ్ కౌచ్ పై మరోసారి ఆవేదన వెలిబుచ్చిన ఫిదా గాయత్రి
ఇటీవలే ఓ యుట్యూబ్ ఛానలె ఇంటర్వ్యూలో దీనిపై గాయత్రి స్పందన
మరోసారి కాస్టింగ్ కౌచ్ పై ఓ ఛానెల్ డిస్కషన్ లో తన అనుభవాలు పంచుకున్న గాయత్రి
ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ సంచలనం ఎవరంటే ఫిదా ఫేం గాయత్రి. దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో వున్నా ఫిదా' సినిమాతో గానీ పాపులర్ కాలేకపోయిన నటి గాయిత్రి గుప్తా. ఈ చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవి ఫ్రెండ్ పాత్ర పోషించింది. గాయిత్రి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా బయట పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ టీవీ ఛానల్ 'కాస్టింగ్ కౌచ్' అంశం గురించి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గాయిత్రి గుప్తా... మరోసారి తనకు ఎదురైన అనుభాలను వివరించారు.
సినిమా నిర్మాత, డైరెక్టర్, ఆర్టిస్టులు కాకుండా మేనేజర్స్ లెవల్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ మొదలవుతాయన్నారు. వాళ్లు మనల్ని ఒక సినిమా కోసం సంప్రదించినపుడు కమిట్మెంటుకు (పడుకోవడానికి) ప్రిపేర్ అయి ఉన్నావా? లేదా? అని ముందే ఎలాంటి మొహమాటం లేకుండా అడిగేస్తారు.. అని గాయిత్రి గుప్తా తెలిపారు.
అసలు మూవీ అనేది ఒక కళ. సినిమాల్లో అవకాశం ఇవ్వాలంటే నీకు యాక్టింగ్ టాలెంట్ ఉందా? సింగింగ్ టాలెంట్ ఉందా? డాన్సింగ్ టాలెంట్ ఉందా? అని చూడాలి. కానీ అది(పడుకోవడం) దానికి అర్హత ఎలా అవుతుంది? దానికోసం ఒక సెక్టర్ ఉంది కదా? అంటూ... గాయిత్రి గుప్తా ప్రశ్నించారు.
అందరూ అలా ఉన్నారని అనడం లేదు. నేను ఇప్పటి వరకు 11 సినిమాలు చేశాను. అందులో హిట్టయిన మూవీ ‘ఫిదా'. ఇండస్ట్రీలో అలాంటి వారు కొంత మంది అయితే ఉన్నారు. ఆ కొంత మంది కూడా ఆడ పిల్ల తన పరువు కోసం బయటకు మాట్లాడదు కదా అనే ఉద్దేశ్యంతో ఇలాంటివి చేస్తుంటారు. ఇది ఎక్కడైనా జరుగుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది అని గాయిత్రి గుప్తా తెలిపారు. ఇక్కడ అలాంటి సంఘటనలు ఎదురైతే ఎవరికి కంప్లయింట్ చేయాలో కూడా చాలా మందికి తెలియదు. వారు ఇష్టంతో చేయరు. తెలియక చేసి అందులో పడిపోతుంటారు... అని గాయిత్రి గుప్తా తెలిపారు.
రెండేళ్ల క్రితం ఓ బాలీవుడ్ మూవీ ఆఫర్ కూడా వచ్చిందని... మంచి క్యారెక్టరని అయితే.. 12 రోజులు కమిట్మెంట్ ఇస్తే ఒక ప్లాట్ గిఫ్ట్ ఇస్తాను, ఒక కారు కొనిస్తాను, 10 లక్షల పేమెంట్ ఇస్తామని చెప్పటంతో ఆఫర్ వద్దని చెప్పి వచ్చేశానని గాయిత్రి గుప్తా తెలిపారు. 12 డేస్ కమిట్మెంట్ అంటే ఏమిటి? 12 రోజులు నటించడమా? అని యాంకర్ ప్రశ్నించగా.. కమిట్మెంట్ అంటే 12 రోజులు వారితో పడుకోవాలి అని గాయిత్రి గుప్తా తెలిపారు. అప్పటి నుండి మేనేజర్స్ ను కలవడం మానేశాను అని గాయిత్రి గుప్తా తెలిపారు.
Last Updated 26, Mar 2018, 12:01 AM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆసీస్ గడ్డపై భారత్ ఫేవరెట్ కాదు: గిల్క్రిస్ట్
2003-04లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత్ జట్టు సిరీస్ని డ్రాగా ముగించగా.. 2003-04లో ధోనీ నాయకత్వంలో సిరీస్ని 1-2తో చేజార్చుకుంది.
Samayam Telugu | Updated:
Nov 29, 2018, 01:16PM IST
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు టెస్టు సిరీస్ని గెలిచే అవకాశాలు తక్కువేనని ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. డిసెంబరు 6 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ జట్టు తలపడనుండగా.. సుదీర్ఘకాలంగా ఇప్పటి వరకూ ఆ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ని కూడా టీమిండియా గెలవలేకపోయింది. అయితే.. మునుపటితో పోలిస్తే ఇప్పుడు భారత్ జట్టు మంచి సమతూకంతో ఉండటం, మరోవైపు డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్ లేకపోవడంతో ఆసీస్ జట్టు బలహీనంగా కనిపిస్తుండటతో.. కోహ్లీసేన కచ్చితంగా టెస్టు సిరీస్ గెలుస్తుందని భారత మాజీ క్రికెటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో భారత్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే..! 2003-04లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత్ జట్టు సిరీస్ని డ్రాగా ముగించగా.. 2003-04లో ధోనీ నాయకత్వంలో సిరీస్ని 1-2తో చేజార్చుకుంది. అలానే 2014-15లో విరాట్ కోహ్లి ఏకంగా 4 శతకాలు బాదినా.. భారత్ జట్టుకి మాత్రం 0-2తో ఓటమి తప్పలేదు. తాజాగా ఈ రికార్డుల్ని ప్రస్తావించిన గిల్క్రిస్ట్.. సిరీస్లో భారత్ ఫేవరెట్ కాదని తేల్చేశాడు. | 2sports
|
Dubai - United Arab Emirates, First Published 24, Sep 2018, 12:21 PM IST
Highlights
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లు అనేక రికార్డులు బద్ధలు కొట్టారు. ఆదివారం నాటి మ్యాచ్లో వీరిద్దరూ సెంచరీలతో కదంతొక్కి జట్టును గెలిపించారు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లు అనేక రికార్డులు బద్ధలు కొట్టారు. ఆదివారం నాటి మ్యాచ్లో వీరిద్దరూ సెంచరీలతో కదంతొక్కి జట్టును గెలిపించారు.
తొలి వికెట్కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తద్వారా లక్ష్య ఛేదనలో తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యాన్ని సాధించిన జోడిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకు ముందు 2009లో సెహ్వాగ్-గంభీర్లు న్యూజిలాండ్పై 209 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అలాగే తొలి వికెట్కు ఎక్కువసార్లు 100 పరుగులు సాధించిన రెండో భారత ఓపెనింగ్ జోడిగా రోహిత్-ధావన్లు నిలిచారు. ఒకే మ్యాచ్లో పాక్పై ఇద్దరు బ్యాట్స్మెన్ సెంచరీలు చేయడం ఇది మూడోసారి ఇంతకు ముందు సచిన్-సిద్ధూ, సెహ్వాగ్-ద్రవిడ్, ఇలా ఒకే మ్యాచ్లో పాకిస్తాన్పై సెంచరీలు చేశారు. అలాగే వన్డేల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాట్స్మెన్గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఘనతను కేవలం 181 ఇన్నింగ్స్ల్లోనే రోహిత్ అందుకున్నాడు. | 2sports
|
Hyderabad, First Published 1, Aug 2019, 2:38 PM IST
Highlights
బాలీవుడ్లో మరో జంట వివాహ బంధానికి గుడ్బై చెప్పింది. నటి దియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటిస్తూ అభిమానులను షాక్కు గురిచేశారు.
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ లు చాలా కామన్ గా జరుగుతుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటి కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా బాలీవుడ్ లో మరో జంట వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది. నటి దియా మీర్జా తన భర్త నుండి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటిస్తూ అభిమానులను షాక్ కి గురి చేసింది. పదకొండు సంవత్సరాలు ఒకరితో ఒకరు జీవితాలను పంచుకొని ఇప్పుడు పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని, కానీ ఎప్పటికీ స్నేహితుల్లాగే ఉంటామని, ఒకరినొకరం గౌరవించుకుంతామని అన్నారు.
మా ప్రయాణాలు విభిన్న మార్గాలను ఎంచుకున్నప్పటికీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని గౌరవిస్తూనే ఉంటామని, మమ్మల్ని అర్ధం చేసుకొని సహకరించినందుకు మా కుటుంబసభ్యులకు, స్నేహితులకు, మీడియా సన్నిహితులకు ధన్యవాదాలు అని చెప్పారు. ఈ సమయంలో తనకు ప్రైవసీ కల్పించాలని కోరారు.
ఇక నుండి ఈ విషయంపై తను ఎలాంటి కామెంట్ చేయాలనుకోవడం లేదని చెప్పింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సాహిల్ సంఘాని చాలా కాలం ప్రేమించి 2014 అక్టోబర్ లో వివాహం చేసుకొంది దియా. ఢిల్లీలోని చత్తార్ పూర్ లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Last Updated 1, Aug 2019, 7:36 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
డీప్-నెక్ గౌనులో కాజల్ అగర్వాల్
కాజల్ కి ఏమైంది? ఇలా తయారైంది... సినిమా అవకాశాలు తగ్గినందు వల్లే ఇలా చేస్తోందా? ఇప్పుడు టాలీవుడ్ జనాల్లో ఇదే టాక్.
TNN | Updated:
Jan 20, 2016, 10:29AM IST
డీప్-నెక్ గౌనులో కాజల్ అగర్వాల్
కాజల్ కి ఏమైంది? ఇలా తయారైంది... సినిమా అవకాశాలు తగ్గినందు వల్లే ఇలా చేస్తోందా? ఇప్పుడు టాలీవుడ్ జనాల్లో ఇదే టాక్. కాజల్ హఠాత్తుగా ఎందుకింద సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిందా అని ఆలోచిస్తున్నారా? మొన్ననే ముంబయిలో 61వ బ్రిటానియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్ జరిగింది కదా. దానికి కాజల్ హాజరైంది. ఆమె వేసుకున్న డ్రెస్ ని చూసి వావ్ అన్నారంతా... గులాడీ రంగు లాంగ్ గౌనులో, జుట్టు వదిలేసి అందంగానే ఉంది కాజల్. కాకపోతే లోనెక్ గౌను అది. బాలీవుడ్ జనాలకు అది పెద్దగా కొత్తగా అనిపించదు. కానీ కాజల్ పదేళ్లుగా చూస్తున్న టాలీవుడ్ జనాలు... ఇన్నేళ్లలో కాజల్ అలా ఎప్పుడు చూడలేదు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చాలా లోనెక్ గౌనులో... కాజల్ హాలీవుడ్ సెలబ్రిటీలా కనిపిస్తోంది. ఆ ఫోటోని మీరు చూసి తరించండి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Hyderabad, First Published 1, Mar 2019, 1:33 PM IST
Highlights
దేశీయ పౌర విమాన యాన సంస్థ జెట్ ఎయిర్వేస్ అన్నీ అనుకున్నట్లు జరిగితే యాజమాన్యం చేతులు మారనున్నది. అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ఎతిహాద్ వాటాలను కొనుగోలు చేయనున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ చైర్మన్ హోదాలో ఉన్న నరేశ్ గోయల్ ఆ పదవిని వదులుకోనున్నారు. ఈ మేరకు బ్యాంకర్ల రుణాలను ఈక్విటీలుగా మార్చిన తర్వాత సదరు బ్యాంకర్లు గోయల్, ఎతిహాద్ సీఈఓ టోనీ డగ్లస్ మధ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగేందుకు నరేశ్ గోయల్ అంగీకరించినట్లు సమాచారం. పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్లో మెజార్టీ వాటా కొనుగోలు ప్రక్రియను రుణ సంస్థలు వేగవంతం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాధ్యతల నుంచి వైదొలిగేందుకు నరేశ్ గోయల్ అంగీకరించారంటూ వచ్చిన వార్తలపై జెట్ ఎయిర్వేస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం వైస్ ప్రెసిడెంట్ రాగిణి చోప్రాను సంప్రదించగా.. తనకు ఆ విషయం తెలియదని చెప్పారు.
ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ బిలియన్ డాలర్ల అప్పులు, రుణ బాధలు, నిధుల లేమి, కనీసం పైలట్లకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో చిక్కుకున్నది. దీన్ని చక్కదిద్దే కసరత్తులో భాగంగా జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయెల్ సంస్థనుంచి వైదొలగనున్నారు.
ప్రస్తుతం 51శాతం వాటా కలిగిన ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్గా గోయల్ తప్పుకునేందుకు అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నష్టాలతో కునారిల్లుతూ, నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్ ఎయిర్వేస్కు వాటా దారైన ఇతిహాద్ ఎయిర్లైన్స్ బెయిల్అవుట్ ప్యాకేజీతో ముందుకు వచ్చిన నేపథ్యంలో గోయల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు ఇరు విమానయాన సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోన్నుయని ఇప్పటికే వార్తలు బిజినెస్ వర్గాల్లో వ్యాపించాయి.
ఇతిహాద్కు ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్లో 24శాతం వాటా ఉండగా, మరో రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయని ఇప్పటికే పలు మీడియా సంస్థలు నివేదించాయి
ఈ డీల్ ఓకే అయితే ఇతిహాద్ వాటా మరింత పెరగనుంది. అటు ఫౌండర్ నరేష్ గోయల్ వాటా 20శాతానికి పడిపోతుంది. అలాగే రూ. 3000 కోట్ల రుణాలు అందించడానికి రుణదాతలు ముందుకొచ్చాయని సమాచారం. అయితే తాజా పరిణామంపై జెట్ ఎయిర్వేస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
మరోవైపు జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే ఉద్యోగులకు ఇచ్చిన సమాచారం ఆసక్తికరంగా మారింది. మున్ముందు సంస్థ మరింత కఠిన పరిస్థితులను ఎదుర్కోబోతోందని సిబ్బంది సహనంగా ఉండాలని పేర్కొన్నారు.
కంపెనీ నిలదొక్కుకునే ముందు కొన్ని ఇబ్బందులు తప్పవని, కానీ ఉద్యోగుల సంపూర్ణ మద్దతు, నిబద్ధతతో సమిష్టి కృషితో భవిష్యత్లో బలమైన సంస్థగా నిలబడతామనే ధీమాను వ్యక్తం చేశారు.
మరోవైపు జెట్ ఎయిర్వేస్కు అతిపెద్ద రుణదాత స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం, ఛైర్మన్ నరేష్ గోయల్, ఇతిహాద్ సీఈఓ టోనీ డగ్లస్ మధ్య ఒక అత్యవసర భేటీని ఏర్పాటు చేసింది.
అనంతరం జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించేందుకు త్వరలోనే ఒక పరిష్కారం దొరుకుతుందంటూ గత నెల 25వ తేదీన, కొంతమంది ముఖ్య వాటాదారులతో కలిసి ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
తాజా పరిమాణాలతో జెట్ ఎయిర్ వేస్ రుణ బాధలనుండి బయట పడే అవకాశం ఉందని అంచనా. తాజాగా అద్దె చెల్లించక గురువారం మరో ఆరు విమానాల కార్యకలాపాలను ఆపేశారు. ఈ నెలలో ఇలా కార్యకలాపాలు ఆపేసిన విమానాల సంఖ్య 19కి చేరినట్లైంది.
జెట్ ఎయిర్వేస్ కొన్ని నెలలుగా తీవ్ర నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో విమానాల అద్దెలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. | 1entertainment
|
యంగ్ హీరో రాజ్ తరుణ్ కొంతకాలంగా విజయాలు లేక సతమతమవుతున్నాడు
నటీనటులు : రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు
సంగీతం : గోపి సుందర్
సినిమాటోగ్రఫర్ : రాజాశేఖర్
నిర్మాత : సుంకర రాంబ్రహ్మం
దర్శకత్వం: సంజనా రెడ్డి
యంగ్ హీరో రాజ్ తరుణ్ కొంతకాలంగా విజయాలు లేక సతమతమవుతున్నాడు. సంక్రాంతి బరిలో విడుదలైన అతడి సినిమా 'రంగులరాట్నం' కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈసారి క్లెప్టోమేనియా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన 'రాజుగాడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా అతడికి ఎలాంటి విజయాన్ని అందించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
చిన్నప్పటినుండి తనకు తెలియకుండానే దొంగతనాలు చేస్తుంటాడు రాజు(రాజ్ తరుణ్). క్లెప్టోమేనియా అనే వ్యాధి కారణంగా దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకొని ఆ వ్యాధిని తగ్గించాలని చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రయోజనం ఉండదు. పెరిగేకొద్దీ అతడిలో దొంగతనాలు చేసే అలవాటు కూడా పెరుగుతుంది. ఇతడి ప్రవర్తన కారణంగా తన తండ్రి(రాజేంద్రప్రసాద్) ఎప్పుడూ ఇబ్బందుల్లో పడుతూనే ఉంటాడు. ఒకరోజు తన్వి(అమైరా దస్తూర్) అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు రాజు. ఆమె కూడా అతడిని ఇష్టపడుతుంది. కానీ తన క్లెప్టోమేనియా అనే జబ్బు ఉన్న విషయాన్ని మాత్రం ఆమె దగ్గర దాస్తాడు. అలా చేయడం వలన రాజు ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు..? తన ప్రేమను చివరకు దక్కించుకున్నాడా..? అనేదే మిగిలిన సినిమా.
కళాకారుల పనితీరు:
రాజ్ తరుణ్ మరోసారి తన నటనతో ఇంప్రెస్ చేశాడు. నిజంగానే దొంగతనాలు అలవాటున్న వ్యక్తిగా చక్కటి హావభావాలు కనబరిచాడు. తన పాత్రతో కొన్ని చోట్ల ఆడియన్స్ ను నవ్వించాడు. ఇక హీరోయిన్ అమైరా దస్తూర్ ఓకే అనిపిస్తుంది. సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది రాజేంద్రప్రసాద్ నటన. కొడుకు కారణంగా తిప్పలు పడే తండ్రి పాత్రలో అతడి నటనను మెచ్చుకోవాల్సిందే. సెకండ్ హాఫ్ ఈ పాత్ర ద్వారా కామెడీ పండించే ప్రయత్నం చేశారు. నాగినీడు,రావు రమేష్, సితార వంటి సీనియర్ ఆర్టిస్టులు తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమాలో మిగిలిన పాత్రలేవీ కూడా పెద్దగా నోటీస్ అవ్వవు.
సాంకేతికవర్గం పనితీరు:
కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయాలని దర్శకురాలు రాసుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే మాత్రం పేలవంగా తయారైంది. దీంతో కొన్ని చోట్ల కామెడీ సన్నివేశాలు తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏదీ లేకుండా పోయింది. కొత్త దర్శకులు తమదైన వైవిధ్యమైన చిత్రాలతో టాలెంట్ చూపిస్తుంటే సంజనా మాత్రం కనీసపు అంచనాలను అందుకోలేకపోయింది. నిర్మాతలు మాత్రం సినిమాపై బాగానే ఖర్చు పెట్టారు. గోపి సుందర్ మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగుకి వచ్చేసరికి మాత్రం అతడు సరైన మ్యూజిక్ చేయలేకపోతున్నాడు. బ్యాక్గ్రౌండ్ పరంగా కూడా కేర్ తీసుకోలేదనిపిస్తుంది సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సివుంది. సంభాషణలు సహజంగా ఉన్నప్పటికీ ఆకట్టుకోవు.
విశ్లేషణ:
టైటిల్ని బట్టి, ప్రోమోస్ చూసి ఇదొక మంచి కామెడీ ఎంటర్టైనర్ అనే భావన కలుగుతుంది కానీ ఇందులో వినోదం కంటే కూడా విచారమే ఎక్కువుంది. ప్రథమార్ధమంతా రెండు మూడు కామెడీ సన్నివేశాలు, రొటీన్ లవ్ ట్రాక్ తో సాగుతుంది. హీరో క్యారెక్టర్ గ్రామంకి చేరగానే అసలు కథ మొదలవుతుంది. కానీ ఆ ఎపిసోడ్ ను ఆసక్తికరంగా రూపొందించలేకపోయారు. సెకండ్ హాఫ్ లో రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకులతో బలవంతంగా నవ్వించేలా ఉన్నాయి. ఎక్కడికక్కడ సినిమా నిడివి పెంచడానికి సన్నివేశాలను యాడ్ చేస్తూ పోవడం వలన కథ ఫ్లో అనేది మిస్ అయింది. వినోదాత్మకంగా మొదలైన సినిమా కొద్దిసేపటికే బోర్ కొట్టే విధంగా మారిపోతుంది. టైంబాంబ్, పాత సినిమాలను ఇమిటేట్ చేసే ఎపిసోడ్లు ప్రేక్షకుల సహనానికి పరీక్ష. పొందికలేని కథనం, ముందుకి కదలనంత నిదానం వెరసి ఈ చిత్రాన్ని భారంగానే మార్చాయి. ఎంటర్టైన్మెంట్ కోసం వీకెండ్ లో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది.
రేటింగ్: 2/5 | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ ఉన్నా కార్తీక్ని ఆడించండి..!: KKR కోచ్
ఐపీఎల్ 2019 సీజన్లో ఇప్పటికే ఏడు మ్యాచ్లాడిన దినేశ్ కార్తీక్ ఒక అర్ధశతకం మాత్రమే సాధించి.. 111 పరుగులు చేశాడు. అతని సగటు కేవలం 18.50గా ఉంది. కానీ.. ప్రపంచకప్లో.. అదీ నెం.4లో ఆడించాలని కోల్కతా బ్యాటింగ్ కోచ్ సూచిస్తున్నాడు.
Samayam Telugu | Updated:
Apr 17, 2019, 12:59PM IST
ధోనీ ఉన్నా కార్తీక్ని ఆడించండి..!: KKR కోచ్
హైలైట్స్
ధోనీ ఆడని మ్యాచ్లో మాత్రమే కార్తీక్ ఆడతాడని స్పష్టం చేసిన భారత సెలక్టర్లు
కానీ.. నెం.4 స్థానంలో కార్తీక్ని ఆడించాలని సూచిస్తున్న సైమన్ కటిచ్
ఇప్పటికే నెం.4 విజయ్ శంకర్ ఆడతాడని వెల్లడించిన చీఫ్ సెలక్టర్
మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలు
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్లో రిజర్వ్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ని కూడా భారత్ తుది జట్టులో ఆడించాలని కోల్కతా నైట్రైడర్స్ బ్యాటింగ్ కోచ్ సైమన్ కటిచ్ సూచించాడు. వరల్డ్కప్ కోసం 15 మందితో కూడిన భారత్ జట్టుని సోమవారం సెలక్టర్లు ప్రకటించగా.. దినేశ్ కార్తీక్కి రెండో వికెట్ కీపర్గా అవకాశం దొరికిన విషయం తెలిసిందే. అయితే.. రెస్ట్ లేదా గాయం కారణంగా ధోనీ మ్యాచ్లో ఆడలేకపోతే అప్పుడు కార్తీక్ని ఆడిస్తామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. కానీ.. ధోనీ టీమ్లో ఉన్నా సరే.. కార్తీక్ని మిడిలార్డర్లో.. అదీ నెం.4లో ఆడించాలని తాజాగా కటిచ్ సూచించాడు. నెం.4లో విజయ్ శంకర్ని ఆడించబోతున్నట్లు ఇప్పటికే సెలక్టర్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అజేయ శతకంతో ఆసీస్పై ప్రతీకారం తీర్చుకున్న డివిలియర్స్
డర్బన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రనౌట్ అవమానానికి డివిలియర్స్ ప్రతీకారం తీర్చుకున్నాడు. అజేయ శతకంతో సఫారీలకు ఆధిక్యం అందించాడు.
Samayam Telugu | Updated:
Mar 11, 2018, 05:20PM IST
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టులో డివిలియర్స్ అజేయ శతకంతో సత్తా చాటాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయిన ఏబీ.. ఈ టెస్టులో తన కసినంతా చూపించాడు. 146 బంతుల్లో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన డివిలియర్స్ 20 ఫోర్లు, ఒక సిక్సర్ బాదడం విశేషం. మొదటి టెస్టులో వేగంగా సింగిల్ తీయడానికి ప్రయత్నించిన ఏబీ రనౌట్ అయ్యాడు. బంతితో వికెట్లను కూల్చిన స్పిన్నర్ లియాన్.. డైవ్ చేసి కింద పడిపోయిన డివిలియర్స్ ఛాతి మీదకు బంతిని విసిరాడు. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో.. ఆసీస్ స్పిన్నర్‌ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.
డివిలియర్స్‌ను రనౌట్ చేశాక లియాన్ అత్యుత్సాహం ప్రదర్శించడం క్రికెట్ అభిమానులను కలచి వేసింది. ఏబీ కెరీర్లోనే తొలిసారిగా పరుగులేమీ చేయకుండా రనౌట్ అయిన బాధ కంటే.. ఆసీస్ ఆటగాళ్ల తీరే బాధించింది. దీనికి ప్రతీకారంగా అన్నట్టుగా.. రెండో టెస్టులో డివిలియర్స్ అజేయ శతకంతో కదం తొక్కాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ధాటిగా ఆడి పరుగులు రాబట్టాడు. టెస్టుల్లో 22వ శతకం సాధించిన ఏబీ.. చివరి వరుస ముగ్గురు బ్యాట్స్‌మెన్‌తో కలిసి 155 పరుగులు జోడించాడు. దీంతో సఫారీలు 382 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ జట్టుకు 139 పరుగుల ఆధిక్యం లభించింది.
డర్బన్‌లో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 162 పరుగులకు ఆలౌట్ కాగా.. డివిలియర్స్ 71 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
former hyderabad captian mv sridhar passes away at 51
హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ కన్నుమూత
హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
TNN | Updated:
Oct 30, 2017, 07:14PM IST
హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 51 ఏళ్ల శ్రీధర్ గుండె పోటుతో ఇంట్లో కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆయన ఇటీవలే బీసీసీ జనరల్ మేనేజర్ పదవికి రాజీనామా చేశారు. శ్రీధర్‌కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన శ్రీధర్ 1988 నుంచి 2000 మధ్య క్రికెట్ ఆడారు. 97 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు 21 ఫస్ట్ క్లాస్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నారు.
ట్రిపుల్ సెంచరీ సాధించిన ముగ్గురు హైదరాబాద్ క్రికెటర్లలో శ్రీధర్ ఒకరు. కాగా మరో ఇద్దరు వీవీఎస్ లక్ష్మణ్, అబ్దుల్ అజీమ్. 1994లో ఆంధ్రాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో శ్రీధర్ 366 పరుగులు చేశారు. ఇది రంజీ ట్రోఫీలో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. విజయవాడలో జన్మించిన ఆయన వైద్య విద్యను అభ్యసించారు.
కూతురు పక్కన ఉండగానే..
సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నలతగా అనిపించడంతో ఆయన తన కజిన్‌ను పిలిపించారని శ్రీధర్ సన్నిహితుడు, హెచ్‌సీఏ సభ్యుడు నర్సింగ్ రావు తెలిపారు. కానీ తర్వాత గంటకే తీవ్రమైన గుండె పోటు రావడంతో కుప్పకూలారని చెప్పారు. నవంబర్ 2న కూతురి పుట్టిన రోజు జరపాలని భావిస్తుండగా.. తను పక్కన ఉండగానే శ్రీధర్ కన్నుమూయడం బాధాకరం.
బీసీసీఐలో..
శ్రీధర్ 2013లో బీసీసీఐ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన దేశవాళీ క్రికెట్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆటగాళ్లు, సెలెక్టర్లు, బీసీసీఐ మేనేజ్‌మెంట్ మధ్య ఆయన అనుసంధాన కర్తగా వ్యవహరించారు. వివిధ కమిటీల్లో పని చేశారు. ఐసీసీ సమావేశాల్లో పాల్గొనడం, షెడ్యూళ్లు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. గత సెప్టెంబర్లోనే పదవి నుంచి తప్పుకున్నారు.
మంకీ గేట్‌లో...
శ్రీధర్ కమ్యూనికేషన్లో దిట్ట. ఆటగాళ్లతో ఆయన వ్యవహరించే తీరు ఆకట్టుకునేది. అందుకే వాళ్లు ఆయన్ను ఎంతగానో గౌరవించేవారు. 2008లో ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్, హర్భజన్ సింగ్ మధ్య మంకీ గేట్ వివాదం సమయంలో ఆయన చాకచక్యంగా వ్యవహరించారు. భజ్జీపై మూడు మ్యాచ్‌ల నిషేధం పడకుండా చర్చల ద్వారా సమస్యన పరిష్కరించారు. ఆసీస్ పర్యటన సందర్భంగా శ్రీధర్‌ను తొలిసారి కలిసి భజ్జీ.. ఆయన చాలా మంచి వ్యక్తని, ఆయన పనితీరు, మాటతీరు ఎంతో బాగుంటుందని ప్రశంసించాడు. | 2sports
|
internet vaartha 189 Views
ముంబై : టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్ గాయంతో బాధపడుతున్నందు వల్ల అతని స్థానంలో మనీష్ పాండేను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వరల్డ్ టి20లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తొడ కండరాల గాయంతో సతమతమైన యువరాజ్ సెమీఫైనల్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసీస్ మ్యాచ్ సందర్భంగా చేజింగ్ దిగిన అనంతరం అయిదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన యువరాజ్ కండరాలు పట్టేశాయి.దీంతో యువరాజ్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు తీవ్ర ఇబ్బంది పడ్డాడు.కాగా ఈ నేపథ్యంలో గురువారం వెస్టిండీస్తో జరిగే సెమీ ఫైనల్లో యువరాజ్ పాల్గొనడం అనుమానమే.ఒకవేళ ఆ మ్యాచ్ సమయానికి యువరాజ్ పిట్ కాని పక్షంలో మనీష్ పాండ్యాను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది.విండీస్తో మ్యాచ్కు యువరాజ్ దూరమైతే మనీష్ను తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ ఆడిన మనీష్ సెంచరీతో ఆకట్టుకుని భారత జట్టు విజయంలో కీలక పాత్ర షోషించిన సంగతి తెలిసిందే. | 2sports
|
ఎయిర్టెల్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్!
- కొత్తగాఖాతాలు తెరవొద్దంటూ సరికొత్తగా ఆంక్షలు
ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కొత్తగా ఏర్పాటైన ఎయిర్టెల్ పేమెంట్స్ బాంక్కు మరో షాక్నిచ్చింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త ఖాతాదారులను చేర్చు కోరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త కస్టమర్ల రిజిస్ట్రేషన్లను నిలిపి వేయాలని ఆదేశిం చింది. మార్గదర్శకాల ఉల్లంఘన నేపథ్యంలో కంపెనీపై దర్యాప్తు చేస్తున్నందున రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ విషయాన్ని ఎయిర్టెల్ కూడా ధ్రువీకరించింది. 'ఆర్బీఐ ఆదేశాల ప్రకారం జనవరి 5,2018 నుంచి కొత్త కస్టమర్లను తీసుకోవట్లేదు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను మేం అధికారులకు అందజేశాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం' అని ఎయిర్టెల్ ప్రతినిధి తెలిపారు. నో యువర్ కస్టమర్(కేవైసీ) నిబంధనలు పాటించకుండా ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది మార్చిలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు ఆర్బీఐ రూ.5కోట్ల జరిమానా విధించింది. ఖాతాదారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే వారి ఖాతాలు ప్రారంభించినట్లు గత ఏడాది నవంబరు 20-22 తేదీల మధ్య ఆర్బీఐ నిర్వహించిన పరిశీలనలో తేలింది. దాదాపు 23 లక్షల ఖాతాలు ఇలా తెరిచినట్లు తేటతెల్లమవడంతో జనవరి 15న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ తరువాత విచారణ జరిపి దాదాపు రూ.5 కోట్ల జరిమానా విధించింది. వంటగ్యాస్పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సీడీ లబ్ధిదారుల రెగ్యులర్ బ్యాంక్ ఖాతాల్లో కాకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 1, Sep 2019, 10:20 AM IST
Highlights
తమిళ స్టార్ హీరో శింబు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఆయనపై వరస పెట్టి నిర్మాతలు కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన బిహేవియర్ ఏమీ బాగోలేదని, సినిమాలు చేస్తానని ఒప్పుకుని వాటిని మధ్యలోనే వదిలేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ విషయమై ఇప్పటికి ఐదుగురు పెద్ద నిర్మాతలు కంప్లైంట్ చేసారు. ఈ నేపధ్యంలో విచారణ ప్రారంభించినట్లు తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది.
తమిళ స్టార్ హీరో శింబు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఆయనపై వరస పెట్టి నిర్మాతలు కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన బిహేవియర్ ఏమీ బాగోలేదని, సినిమాలు చేస్తానని ఒప్పుకుని వాటిని మధ్యలోనే వదిలేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ విషయమై ఇప్పటికి ఐదుగురు పెద్ద నిర్మాతలు కంప్లైంట్ చేసారు. ఈ నేపధ్యంలో విచారణ ప్రారంభించినట్లు తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది.
ఆ కంప్లైంట్స్ లో మొదటిగా ...శింబు ప్రధాన పాత్ర పోషించిన 'అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్' చిత్రంతో తనకు రూ.20 కోట్ల నష్టం వచ్చిందని నిర్మాత మైఖేల్ రాయప్పన్ పేర్కొన్నారు. ఆ చిత్రం సెకండ్ పార్ట్ తీయడానికి శింబు అంగీకరించలేదన్నారు.
ఇక నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన ఫిర్యాదులో.. శింబు హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని, షూటింగ్ పనులు ప్రారంభమైనప్పటికీ ఆయన సహకరించక పోవడంతో ఆ చిత్రం షూటింగ్ ఆగిపోయిందన్నారు.
ఎస్కేప్ ఆర్ట్స్కు చెందిన నిర్మాత మదన్ చేసిన కంప్లైంట్ లో.. తన చిత్రంలోనూ శింబును నటింపజేయడానికి ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందం జరిగి రోజులు గడుస్తున్నా ఆయన సహకరించని కారణంగా నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చిందన్నారు.
ఆదే తరహాలోనే తాను మోసపోయినట్లు గొరిల్లా చిత్ర నిర్మాత సురేష్ ఫిర్యాదు చేశారు. సురేష్ కామాక్షి అనే మరో నిర్మాత కూడా శింబు హీరోగా తాను నిర్మించతలపెట్టిన 'మానాడు' చిత్రం షూటింగ్ అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయిందన్నారు.
ఇలా వరసపెట్టి కంప్లైంట్స్ సంఖ్య పెరుగుతుండడంతో నిర్మాతల మండలి చర్యలు మొదలెట్టింది. ఆరోపణల్లో వాస్తవమున్న పక్షంలో శింబు చేత సంబంధిత నిర్మాతలకు నష్ట పరిహారం ఇప్పించడం, ఆయనపై చర్యలు తీసుకోవడం వంటివి ఘటనలు జరిగే అవకాశం ఉందని నిర్మాతల మండలి సభ్యులు మీడియా తెలిపారు.
Last Updated 1, Sep 2019, 10:23 AM IST | 0business
|
Hyderabad, First Published 29, Jun 2019, 4:54 PM IST
Highlights
శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం 'రణరంగం'. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు.
శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం 'రణరంగం'. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. శర్వానంద్ రఫ్ లుక్ లో కనిపించిన ఫస్ట్ లుక్ చిత్రంపై ఆసక్తి పెంచేసింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
శర్వానంద్ ప్రజెంట్ లో మిడిల్ ఏజ్డ్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు. ' దేవుణ్ణి నమ్మాలంటే భక్తి ఉండాలి.. అదే మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాలి' అనే డైలాగ్ చాలా బావుంది. ఇక కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1990 నేపథ్యంలో ఈ చిత్రంలో ప్లాష్ బ్యాక్ ఉండబోతున్నట్లు దర్శకుడు టీజర్ ద్వారా తెలియజేశాడు.
ఫ్లాష్ బ్యాక్ లో శర్వానంద్ యువకుడిగా కనిపిస్తాడు. అతడు ఎలా గ్యాంగ్ స్టర్ గా మారాడనేదే ఈ చిత్ర కథ. కొంత మందికి అతడు క్రిమినల్.. మిగిలిన వారికి అతడు హీరో అనే లైన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే స్థితిలో మనం ఉండకూడదు అని శర్వానంద్ టీజర్ చివర్లో వినిపించే డైలాగ్ హైలైట్ గా నిలుస్తోంది.
ఆగష్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
internet vaartha 190 Views
ఒడిదుడుకుల్లోనూ పనితీరులో మెరుగుదల
హైదరాబాద్ : డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ మూడోత్రైమాసికంలో నికర రాబడులు579.2 కోట్ల రూపాయలుగా ప్రకటించింది. రష్యా, సిఐఎస్ దేశా లు, రొమేనియా దేశాల్లో విక్రయాలు నీరసించడంతో ఆ ప్రభావం లాభాలపై చూపింది. కంపెనీ అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో 574.5 కోట్ల నికరరాబడులుఆర్జించింది. స్వల్పస్థాయిలో మాత్రమే వృద్ధి ఉన్నట్లు కంపెనీ సిఒఒ అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. విక్రయాలు, సేవలద్వారా ఆదాయం 3967.9 కోట్లు రూపాయలుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 3843.1 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు డా.రెడ్డీస్ సిఒఒ వెల్లడిం చారు. మార్కెట్లపరంగా బహుళసవాళ్లు ఎదురైనప్ప టికీ తట్టుకునిఆర్థికంగా నిలదొక్కుకోగలిగామని కీలక మార్కెట్లలో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించామని సహచైర్మన్ సిఇఒ జివిప్రసాద్ బిఎస్ఇకి నివేదిక ఇచ్చారు. ఇదిలాఉండగా విభిన్న ఆర్థికఅంశాల పరం గా కంపెనీ పనితీరు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఒత్తిడికి గురయింది. వర్ధమాన మార్కెట్లలో రాబడులు 639.9కోట్ల రూపాయలుగాఉన్నాయి. అంతకుముం దు ఏడాది ఇదేకాలంలో 884.3 కోట్ల రూపాయలు ఆర్జించిన కంపెనీ ఈ త్రైమాసికంలో 28శాతం దిగ జారింది. కొత్త ఔషధ అప్లికేషన్స్ (ఎన్డిఎ)లకు ఆమోదం లభించిందని కంపెనీ సిఎఫ్ఒ సౌమేన్ ఛటర్జీ పేర్కొన్నారు. ఇక కంపెనీపరంగా అమ్మకాలు, సాధారణ, పరిపాలన ఖర్చులు 1200 కోట్ల వరకూ ఉన్నాయి. పన్నుల చెల్లింపులకు ముందు నిర్వహణ లాభాలు 10.1 బిలియన్ రూపాయలుగా ఉన్నాయి. నికరలాభం 580కోట్లుగా ప్రకటించింది. ప్రతివాటా కు రాబడి 33.9డాలర్లుగా ఉన్నట్లు కంపెనీ ప్రకటిం చింది. కంపెనీ తొమ్మిదినెలల కాలానికిగాను 1171 కోట్ల రూపాయలు ఆదాయం సాధించినట్లు ప్రకటిం చింది. తొమ్మిదినెలల కాలంలో నిర్వహణ లాభం పన్నుల చెల్లింపులకుముందు 314కోట్ల రూపాయలు గా ఉంది. ఇక పన్నులచెల్లింపుల తర్వాతనికరలాభం 193కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రతి వాటాకు రాబడులు 112.6 డాలర్ల చొప్పున రాబడులు వచ్చినట్లుతేలింది. అంతర్జాతీయంగా జన రిక్స్ విభాగంలో 336కోట్ల రూపాయలు రాబడులు సాధించినట్లు ప్రకటించింది. ఏడుశాతంవృద్ధి కనిపి స్తోంది. ప్రత్యేకించి ఉత్తర అమెరికా, యూరోప్ భారత్లనుంచే రాబడులు ఎక్కువ ఉన్నాయి. ఉత్తర అమెరికానుంచి రాబడులు 194కోట్లు రూపాయలు ఉన్నాయి. వార్షిక పద్ధతిన చూస్తే 18శాతం ఉంది. ఇంజక్టబుల్ ఉత్పత్తుల మార్కెట్ వాటా పెరగడం వల్ల రాబడి పెరిగింది. కొత్త జనరిక్స్ మందులకోసం అమెరికాలో మూడు ఎఎన్డిఎలు, ఒక ఎన్డిఎ దాఖలు చేసినట్లు ప్రకటించింది. ఇక వర్ధమాన మార్కెట్లనుంచి 640 కోట్ల రూపాయలు రాబడులు సాధించింది. వార్షిక పద్ధతిన చూస్తే 28శాతం వృద్ధి కనిపిస్తోంది. రష్యా నుంచి 310 కోట్లు రూపాయలు సాధించింది. రూబుల్ తగ్గుదలతో 21శాతం క్షీణించిందని కంపెనీ ప్రకటించింది.వార్షిక పద్ధతిన చూస్తే రాబడులు ఐదుశాతం పెరిగినట్లు చెపుతు న్నారు. సిఐఎస్ దేశాలు, రొమేనియా మార్కెట్లు 0.9 బిలియన్ రూపాయలు సాధించింది. ఇతర ప్రపంచ దేశాల మార్కెట్ల నుంచి 240కోట్ల రూపా యలు రాబడులు వచ్చాయి. వార్షిక పద్ధతిన చూస్తే 38శాతం తగ్గినట్లు కంపెనీ ప్రకటించింది. భారత్లో మాత్రం రాబడులు 580 కోట్లు రూపాయలుగా ఉన్నాయి. ఏటికేడాది వృద్ధి 34శాతంగాఉంది. యూరోప్ దేశాలనుంచి రాబడులు 190కోట్ల రూపా యలుగా ఉన్నాయి. 14శాతం వృద్ధి ఉందని కంపెనీ ప్రకటించింది. ఆరిపిప్రాజోల్, ప్రనెగాబాలిన్ ఉత్ప త్తుల విక్రయాలు మార్కెట్ వాటాను పెంచాయి. ఫార్మాసేవలు, క్రియాశీలక ముడివనరుల (యాక్టివ్ ఇన్గ్రెడియంట్స్)పరంగా చూస్తే 510 కోట్ల రూపా యలుగా ఉన్నట్లు ప్రకటించింది. ఏటికేడాది చొప్పు న 17శాతంవృద్ధి కనిపిస్తోంది. ఈ త్రైమాసికంలో ఆదాయవనరులపరంగా స్థూల లాభాల మార్జిన్ 59.5శాతంగా ఉంది. 130బేసిస్ పాయింట్లు వృద్ధి చెందినట్లు సిఎఫ్ఒ సౌమేన్ ఛటర్జీ వెల్లడించారు. సేవలు,సాధారణపరిపాలన ఖర్చులు 12 బిలియన్ రూపాయలకు చేరాయి. ఇక పరిశోధన అభివృద్ధి రంగాలకు 410 కోట్లు ఖర్చుచేసినట్లు స్టాక్ ఎక్ఛేం జిలకు ఇచ్చినఫైలింగ్లో వెల్లడించింది. మూల ధన వ్యయం 310కోట్ల రూపాయలుగా ఉంది. ప్రతి వాటాకు రాబడులు 33.9 రూపాయలుగా ఉంది. నికరవడ్డీ ఆదాయం 2.9 కోట్ల రూపాయలుగా ఉంది. తీవ్ర ఒడిదుడుకుల సమస్యలు ఎదురైనప్ప టికీ రెడ్డిలాబ్స్ తన పనితీరును మెరుగుపరుచు కోగలిగిందని సిఒఒ అభిజిత్ముఖర్జీ వెల్లడించారు. | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Rate: ధన త్రయోదశి.. పెరిగిన బంగారం ధరలు
ధన త్రయోదశి సందర్భంగా బంగారం ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ ఏ మాత్రం తగ్గలేదు ఆరేళ్ల గరిష్ఠం వద్దే ఊగిసలాడుతోంది.
Samayam Telugu | Updated:
Nov 5, 2018, 12:37PM IST
Gold Rate: ధన త్రయోదశి.. పెరిగిన బంగారం ధరలు
పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. పసిడి ధర బులియన్ మార్కెట్లో గత ట్రేడింగ్లో మరోసారి ఆరేళ్ల గరిష్ఠస్థాయి (రూ.32,940) కి చేరువకు వెళ్లి రూ.32,780 వద్ద ట్రేడైంది. అనంతరం రూ.150 తగ్గి రూ.32,650 వద్ద ముగిసింది. అయితే ఓ దశలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ.32,550, 22 క్యారెట్ల ధర రూ.32,400 వద్ద ట్రేడ్ అయ్యాయి. కాని డిమాండ్ పెరగడంతో కోలుకున్న బంగారం ధర చివరకు రూ.100 పెరిగింది. చివరకు 24 క్యారెట్ల ధర రూ.32,650, 22 క్యారెట్ల ధర రూ.32,500 వద్ద ముగిశాయి.
అంతకు ముందు ట్రేడింగ్తో పోలిస్తే రూ.20 పెరిగిందన్నమాట. వెండి ధర రూ.70 తగ్గి రూ.39,530 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. సింగపూర్లో ఔన్సు బంగారం ధర 1,233.80 డాలర్ల నుంచి 1,233.20 డాలర్లకు దిగొచ్చింది. ఇక వెండి ధర 14.82 డాలర్లుగా ఉంది.
నవంబరు 5న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం | 1entertainment
|
హోమ్ క్రీడలు క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో మంటలు
క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో మంటలు
August 24, 2019, 12:39 PM IST
Share on:
కేరళలోని భారత క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కేరళలో ఎడప్పల్లిలోని ఆయన నివాసంలో శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో శ్రీశాంత్అ క్కడ లేరు. ఆయన భార్య, బిడ్డ అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. వారెవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాగా ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి.
సంబంధిత వార్తలు | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
జియో ఫోన్లలో వాట్సప్ ఫీచర్ సైతం!
Wabetainfo.com)వెబ్సైట్ కథనం ప్రకారం బ్లాక్ బెర్రీ, విండోస్ ఫోన్ 8 వంటివాటికి సపోర్ట్ ఆపేసిన తర్వాత ప్రముఖ సామాజిక మాధ్యమం వేరే ఫోన్లకు యాప్ డెవలప్ చేసే యోచనలో ఉందని, అదే విధంగా జియో ఫోన్లకు సైతం వాట్సప్ కోసం ప్రత్యేక యాప్ రూపొందించే పనిలో ఉందని బుధవారం వెల్లడించింది.
TNN | Updated:
Mar 22, 2018, 03:32PM IST
లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో నడుస్తున్న రిలయన్స్ జియో ఫోన్లలో త్వరలో వాట్సప్ సదుపాయం సైతం రావొచ్చు. వాబెటయిన్ఇన్ఫో.కామ్(Wabetainfo.com) వెబ్సైట్ కథనం ప్రకారం బ్లాక్ బెర్రీ, విండోస్ ఫోన్ 8 వంటివాటికి సపోర్ట్ ఆపేసిన తర్వాత ప్రముఖ సామాజిక మాధ్యమం వేరే ఫోన్లకు యాప్ డెవలప్ చేసే యోచనలో ఉందని, అదే విధంగా జియో ఫోన్లకు సైతం వాట్సప్ కోసం ప్రత్యేక యాప్ రూపొందించే పనిలో ఉందని బుధవారం వెల్లడించింది.
వచ్చే డిసెంబరు 31 తర్వాత వాట్సప్ నొకియా ఎస్40 ఫోన్లలో ఆగిపోతుంది.అయితే కేఏఐవోఎస్ సాయంతో నడిచే ఫోన్లకు మాత్రం సపోర్ట్ ఉంటుందని ఈ వెబ్సైట్ వెల్లడించింది. బేసిక్ ఫోన్లలో స్మార్ట్ ఫోన్లలో ఉండే కొన్ని సదుపాయాలను కేఏఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా అందించే వీలుంటుంది. ''ఎంతో మంది వాడే సోషల్ మీడియా యాప్ ఇకపై కేఏఐవోఎస్ ఫీచర్ ఫోన్లతో సైతం రాబోతోంది. దేశీయ కేఏఐవోఎస్ యాప్ సాయంతో యూజర్లు ఫేస్ బుక్ వాడుకునేందుకు సైతం వీలు కలుగుతుంది. తద్వారా ఎక్కువ మంది యూజర్లు వారి బంధువులు, స్నేహితులతో టచ్లో ఉండొచ్చు.'' అని గత నెలలో బ్లాగ్ పోస్ట్లో కేఏఐఓఎస్ వెల్లడించింది.
మోజిల్లా ఫైరా్ ఫాక్స్ సాయంతో మొదట ఓపెన్ సోర్స్ రూపంలో ప్రారంభమైన ఈ ఓఎస్ 2011 నుంచి పనిచేస్తోంది. 2016 నుంచి మోజిల్లా నుంచి విడివడి స్వతంత్రంగా నడుస్తోంది. యూఎస్ మార్కెట్లో కేఏఐవోఎస్ మొదటిసారిగా 2017లో ప్రజా బాహుళ్యంలోకి వచ్చింది. ఈ మొబైల్ ఓఎస్ 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ తదితర ఫీచర్లను తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. | 1entertainment
|
చై, సామ్ పెళ్లికి స్పెషల్ గెస్ట్ లు వీరే..
Highlights
అక్టోబర్ 6న చై, సామ్ ల వివాహం
అతిథులను ఆహ్వానిస్తున్న అక్కినేని కుటుంబం
స్పెషల్ గెస్ట్ ల జాబితాలో సినీ ప్రముఖులు
టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంతలు వివాహ బంధంతో ఒకటి కావడానికి మరెంతో దూరం లేదు. పెళ్లి.. అక్టోబర్ 6న గోవాలో జరగనుంది. తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. అయితే.. పెళ్లికి కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. మొత్తం 175మంది జాబితాను తయారు చేశారు. ఆ జాబితాలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.
పెళ్లికి పిలవాలనుకున్న అత్యంత సినీ ప్రముఖులకు నాగార్జున స్వయంగా తన చేతులతో వెడ్డింగ్ కార్డులు పంచుతారని సమాచారం. నాగ చైతన్య, సమంతలు ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా ఎన్టీఆర్, రానాలను పెళ్లికి ఆహ్వానించారట. అంతేకాకుండా చైతూ.. తన స్నేహితులు అల్లు శిరీష్, నితిన్ లను పిలిచారట. ఇక నాగార్జున వైపు నుంచి చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ లు మొదటి వరసలో ఉన్నారు. రామ్ చరణ్, ఉపాసనలు కూడా వ్యక్తిగతంగా ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది.
ఇక సమంత వైపు నుంచి ఆమె కుటుంబ సభ్యులతోపాటు ఆమె పర్సనల్ స్టైలిస్ట్ కోన నీరజ ను పిలిచారని టాక్. తనతో కలిసి నటించిన హీరోయిన్లను పెళ్లికి ఆహ్వానించలేదట సమంత. ఇక వారందరినీ.. రిసెప్షన్ కి పిలిచే అవకాశం ఉంది. ఈ పెళ్లికి ఆహ్వానించిన వారందరినీ గోవాలో మూడు రోజులు ఉండేలా రావాలని కోరుతున్నారట. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు టాలీవుడ్ టాక్.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST | 0business
|
రుణ గ్రహీతలకు శుభవార్త!
- వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ
ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. నవంబర్ 1 నుంచి అన్ని రకాల రుణాలపై వడ్డీ రేటులో 5 బేసిస్ పాయింట్లు కోత పెట్టినట్టు గురువారం ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్ఆర్) కింద ఉన్న రుణాలపై ఇప్పటి వరకు ఏడాదికి 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. తాజాగా దీన్ని 7.95 శాతానికి తగ్గించింది. కొత్త వడ్డీరేట్ల ప్రకారం గృహ రుణాలు 8.30 శాతానికి, వాహన రుణాలు 8.70 శాతానికే అందించనుంది. ఈ వడ్డీరేట్లు అర్హులైన వేతన కస్టమర్లందరికీ వర్తిస్తాయని, రూ.30 లక్షల వరకున్న రుణాలకు వార్షికంగా 8.30 శాతం వడ్డీరేటును విధించనున్నట్టు బ్యాంకు తెలిపింది. కారు రుణాల వడ్డీరేట్లు వార్షికంగా 8.70 శాతం నుంచి 9.20 శాతం మధ్యలో ఉండనున్నాయి. అంతకముందు ఈ శ్రేణీ 8.75 శాతం నుంచి 9.25 శాతం మధ్యలో ఉంది. తాజా రేట్లు కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. అసలైన రేటు రుణ మొత్తం, వ్యక్తి క్రెడిట్ స్కోర్పై ఆధారపడి ఉంటుందని ఎస్బీఐ తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
రాజు అయ్యాడిలా మోసగాడు
సత్యం స్కాం నుంచి తీర్పు వరకు
బిజినెస్ డెస్క్ : ప్రపంచ ఐటి పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో సోమవారం ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించడంతో, మళ్లీ ఈ ఉదాంతం తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సత్యం కంప్యూటర్స్ ఛైర్మన్ రామలింగ రాజు సహా ఇతర డైరెక్టర్లకు శిక్షలు ఖారారయ్యాయి. 2009లో బయటపడిన సత్యం కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. సికిందాబాద్లో 1987లో రామలింగరాజు దీన్ని చిన్నగా ప్రారంభించి, బిలియన్ డాలర్లకు చేర్చారు. 2009లో తనంతట తానై కుంభకోణం బయట పెట్టేంత వరకు ఐటి పరిశ్రమలో రారాజుగా వెలిగారు. భారీగా కృత్రిమ లాభాలు చూపిస్తు సత్యం కంప్యూటర్స్లోని లాభాలను తాన కుమారుడి పేరుపై ప్రారంభించిన మైటాస్ సంస్థలకు బదిలీ చేశారు. ఈ క్రమంలో అప్పట్లో భారీగా రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగడంతో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి వరుసగా సత్యం షేర్లను విక్రయిస్తూ వచ్చారు. ఓ దశలో సత్యం కంపెనీ నిధులు పెద్ద మొత్తంలో మళ్లించి ఆ సంస్థలో అకౌంటింగ్ కుంభకోణానికి తెరలేపారు. మరోవైపు తనఖా పెట్టిన షేర్లను విడిపించుకోవడానికి నిధులు లేకుండా పోయాయి.
వాస్తవానికి సత్యం కంపెనీ క్షీణిస్తున్న దశలో భారీగా లాభాలు పెంచి చూపారు. ఈ అంశంలో మాజీ చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్స్ బి రామరాజు, శ్రీనివాస్ వడ్లమాని, భాగస్వాములు ఎస్ గోపాలక్రిష్ణన్, తలూరి శ్రీనివాస్, ఇంటర్నల్ ఆడిటర్స్ బి సత్యనారాయణ రాజు, ప్రభాకర్ గుప్తా, ఫైనాన్స్ హెడ్ జి రామక్రిష్ణ కీలక భాగస్వామ్యం వహించారు.
చిన్న ఇంటి నుంచి...
రామలింగ రాజు పశ్చిమ గోదావరి జిల్లా బీమవరం మండలం గరగపర్రు గ్రామంలో బుర్రాజు సత్యనారాయణ దంపతులకు 1955 సెప్టెంబర్ 16న జన్మించారు. 10వ తరగతి వరకు భీమవరం, హైదరాబాద్, యెండకండి ప్రాంతాల్లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్, బికాం విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం అమెరికా హార్వర్డ్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఎంబిఎ చేశారు.
కుటుంబంలో ఆయనే పెద్దవాడు. 1977లో పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. ఇదే సమయంలో దనుంజయ హౌటల్స్, సత్యం స్పిన్నింగ్ మిల్స్ వ్యాపారం ప్రారంభించారు. అనంతరం 1987లో సికింద్రాబాద్లోని పిఅండ్టి కాలనీలో ఓ చిన్న ఇంటిలో సత్యం కంప్యూటర్స్ను ప్రారంభించారు. క్రమంగా ప్రపంచ ఐటి మార్కెట్లోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా మైటాస్ కంపెనీ స్థాపించి నిధులు మళ్లించడం ఇతర పరిణామాలు సత్యంను బొర్లా బొక్కలా పడేలా చేసింది.
లెక్కల మోసంతో జైలుకు..
కృత్రిమ లాభాలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసిన సత్యం రామలింగరాజు తాను తోడుకున్న గోతిలో తానే పడి ప్రస్తుతం ఊచలు లెక్కించే దుస్తితి తలెత్తింది. 2009 జనవరి 7న సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల్లోనే సిఐడి కేసు నమోదు, రామలింగ రాజు అరెస్టు చేయడమూ జరిగి పోయాయి. ఈ కేసులో ప్రధాన భాగస్వాములైన రామరాజు, సూర్యనారాయణ రాజు, వడ్లమాని శ్రీనివాస్, ఆడిటర్లు గోపాలకృష్ణన్, తాళ్లూరి శ్రీనివాస్, మాజీ ఉద్యోగులు రామకృష్ణ, వెంకటపతి రాజు, శ్రీశైలం, అంతర్గత ఆడిటర్ ప్రభాకర్ గుప్తాలపై కేసు నమోదైంది. ఐపిసి 120బి, 420, 409, 419, 467, 471,477ఎ, 201 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. 2009 ఫిబ్రవరి 16న సిబిఐ రంగంలోకి దిగింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటు, న్యాయమూర్తిగా బివిఎల్ఎన్ చక్రవర్తి నియామకం జరిగింది. మూడు అభియోగ పత్రాలను కలిపి ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. జ్యుడిషయల్ కస్టడిలో ఉన్న రాజుకు 2011 నవంబర్ 4న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుతో మదుపరుల నష్టంతో కలిపి రూ.14 వేల కోట్ల కుంభకోణంగా సిబిఐ ప్రకటించింది. ఈ కుంభకోణంలో రాజు సహా ఇతర నిందితులు మొత్తంగా రూ.2743 కోట్లు అక్రమంగా సంపాదించారు. ఈ కేసులో కోర్టు 226 మందిని విచారించింది. 3115 దస్థ్రాలను పరిశీలించింది.
సత్యం ఎగిసి.. పడిందిలా...
- 1987- సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ను రామలింగరాజు ప్రారంభించారు.
- 1991లో బాంబే స్టాక్ ఎక్సేంజీలో సత్యం ఐపిఒకు 17 రెట్ల స్పందన.
- 1991లో యువ ఔత్సాహికవేత్త, అత్యధిక సంపాదించే వాడిగా గుర్తింపు.
- సెప్టెంబర్ 23న : సత్యంకు కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ కంప్లాయిన్స్ నుంచి గోల్డెన్ పికాక్ అవార్డు.
- డిసెంబర్ 16న : తన కుమారుడు నిర్వహించే మౌలిక వసతుల కంపెనీ మైటాస్ను 1.6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు.
- డిసెంబర్ 17న : ఈ కొనుగోలుపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు.
- డిసెంబర్ 23 : సెక్యూరింగ్ కాంట్రాక్టుల విషయంలో సత్యం అవకతవకలకు పాల్పడిందని ప్రపంచ బ్యాంకు 8 ఏళ్ల పాటు నిషేదించింది. దీంతో షేర్లు నాలుగేళ్ల కనిష్టానికి పడ్డాయి.
- డిసెంబర్ 25 : సత్యం ప్రపంచ బ్యాంకును క్షమాపణ కోరారు.
- డిసెంబర్ 26 : సత్యం బోర్డు నుంచి మంగళం శ్రీనివాసన్తో పాటు వినోద్ ధమ్, క్రిష్ణ పలెపు వైదొలిగారు.
- 2006-బిలియన్ డాలర్ల రెవెన్యూకు చేరింది. సత్యం నాస్కామ్ ఛైర్మన్గా నియమితులయ్యారు.
- 2009
- జనవరి 2 : వ్యవస్థాపకుల వాటా మూడో వంతు నుంచి 5.13 శాతానికి తగ్గిందని సత్యం వెల్లడి.
- జనవరి 6 : సత్యం కంపెనీ ఎకౌంటింగ్లో అవకతవకలకు పాల్పడుతుందని ఓ బ్యాంకు సెబీ దృష్టికి తీసుకెళ్లింది.
- జనవరి 6 : తాను మోసానికి పాల్పడ్డానని సత్యం తన ఉద్యోగులకు లేఖ రాశారు.
- జనవరి 7 : రూ.7,000 కోట్ల లెక్కలు తప్పుగా చూపించారని ప్రాథమిక అంచనా. సత్యం రాజీనామా చేశారన్న వార్తలు గుప్పుమన్నాయి.
- జనవరి 8 : సత్యంకు చెందిన 30 ఖాతాలను సిటీ బ్యాంకు రద్దు చేసినట్లు ప్రకటించింది. ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించలేమని స్పష్టం చేసింది.
- జనవరి 9 : రామలింగరాజుతో ఆయన సోదరుడు బి రామరాజు అరెస్ట్. ప్రభుత్వం సత్యం బోర్డును రద్దు చేసింది.
- జనవరి 10 : సత్యంలో పెద్ద మొత్తంలో వాటాలు కలిగిన వారిని బోర్డులో సభ్యత్వం కోసం సెబీ దరఖాస్తులు కోరింది.
- జనవరి 23 : ఇద్దరు ఆడిటర్లను సిఐడి అరెస్ట్ చేసింది.
- ఏప్రిల్ 6 : సత్యం వ్యవస్థాపకులతో పాటు మరో 8 మందిపై సిబిఐ ఛార్జ్షీట్ నమోదు.
- 2010
- ఆగస్టు 18న : సత్యం మాజీ చీఫ్ రామలింగరాజుకు బెయిల్ మంజూరు.
- 2011
- అక్టోబర్ 29 : సత్యం బెయిల్ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం.
- నవంబర్ 23 : సత్యం కేసులో రామలింగరాజును సెబీ విచారణ,
- 2012
- మార్చి 21 : సత్యం కంప్యూటర్స్, టెక్ మహీంద్రాలో విలీనం. దీంతో దేశంలోనే ఐదో అతిపెద్ద ఐటి ఎగుమతుల కంపెనీగా ఆవిర్బావం.
- 2013
- సెప్టెంబర్-17న సత్యం కేసులో అమెరికా కోర్టు తాజా వివరాలు అందిచాలని ఆదేశం.
- 2014
- జులై 16 : రామలింగరాజును మార్కెట్ల నుంచి 14 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు సెబీ ప్రకటన. ఈ కేసులో రూ.1849 కోట్ల జరిమాణ చెల్లించాలని ఆదేశం.
- 2015
- జనవరి 25 : రాజు అనుబంధ కంపెనీలపై ఆర్బిఐ నిఘా.
- మార్చి 9 : ఈ కేసులో తుది తీర్పును ఏప్రిల్ 9న ప్రకటిస్తామని న్యాయస్థానం వెల్లడి.
- ఏప్రిల్ 9 : ఛైర్మన్ రామలింగరాజుతో పాటు 9 మంది దోషులకు శిక్ష విధిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు ఆదేశాలు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 30, Mar 2019, 10:21 AM IST
Highlights
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గతేడాది డిసెంబర్ లో నిక్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గతేడాది డిసెంబర్ లో నిక్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి జరిగి నాలుగునెలలు కూడా కాలేదు కానీ అప్పుడే వారి వివాహ బంధంపై ఇంటర్నేషనల్ మీడియాలో షాకింగ్ కథనాలు వస్తున్నాయి.
ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని, వారి వైవాహిక బంధం విడాకుల దిశగా పయనిస్తోందని బ్రిటన్ కి చెందిన 'ok!' మ్యాగజైన్ రీసెంట్ గా సంచలన కథనం ప్రచురించింది. ప్రియాంక, నిక్ ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారని.. ఎవరు రాజీ పడడం లేదని కథనంలో రాసుకొచ్చారు.
ఇప్పుడు ఇద్దరి విడిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని రాసుకొచ్చారు. కొన్ని విషయాల్లో ప్రియాంక టెంపర్ చూపిస్తుందని, ఆ విషయం నచ్చని నిక్ ఆమెతో గొడవ పడుతున్నాడని రకరకాలుగా రాశారు.
పైకి మాత్రం తమ మధ్య గొడవలు లేవన్నట్లుగా కవర్ చేస్తూ నటిస్తున్నారని, ఎక్కువ రోజు వారి బంధం నిలిచేలా లేదని అంటున్నారు. నిక్ కుటుంబ సభ్యులు కూడా ప్రియాంక ప్రవర్తనతో విసిగిపోయారని రాశారు. ఇప్పుడు ఈ వార్తలు విన్న ప్రియాంక, నిక్ అభిమానులు అప్సెట్ అవుతున్నారు. ఈ వార్తలు నిజం కాకూడదని కోరుకుంటున్నారు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘మౌనరాగం’ నవంబర్ 12 ఎపిసోడ్ : లక్కీ మీద సీనయ్య కోపం! కథ మళ్లీ మొదటికి..?
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్ 361 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. నేటికి 362 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
Samayam Telugu | Updated:
Nov 12, 2019, 07:03PM IST
మౌనరాగం నవంబర్ 12
తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న మౌనరాగం (నవంబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్లో ఏం జరిగిందో మీ సమయంలో మీకోసం.
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే...
సీనయ్య మెకానిక్ షెడ్ జోసఫ్ది కావడం, అతడు తన కూతురు చదువుకు దాన్ని అమ్ముకోవాడానికైనా, లేక సీనయ్య దాన్ని కొనుక్కుని 10 లక్షలు ఇవ్వడానికైనా ఒప్పుకోమని జోసఫ్ కోరడం.. అంతా తెలుసుకున్న లక్కీ పుట్టింటికి వెళ్లి.. తల్లి నందినిని ఒప్పించి.. 10 లక్షలు చెక్ రాయించుకుని తీసుకొచ్చింది.(విష్ణు బలవంతంగా అయిష్టంగా సంతకం చేస్తాడు). అయితే లక్కీ పుట్టింటికి వెళ్లిందని తెలియని సీనయ్య, నీలవేణీలు అమ్ముల్ని ‘లక్కీ ఎక్కడుంది?’ అని అడగడంతో కంగారు పడుతుంది అమ్ములు. ఇంతలో లక్కీ వచ్చేస్తుంది.
362 ఎపిసోడ్లో హైలైట్స్...
లక్కీని చూడ్డంతో అమ్ములు టెన్షన్ అంతా తగ్గుతుంది. లక్కీ.. అమ్ములు ముందు నిలబడి.. ‘ఇదిగో వదినా.. 10 లక్షల చెక్.. తేవడమైతే తెచ్చాను కానీ.. మావయ్యగారికి ధైర్యంగా ఇవ్వలేకపోయాను.. ప్లీజ్ వదినా ఇది నువ్వే మావయ్యగారికి ఇవ్వు’ అంటుంది. వెంటనే అమ్ములు కూల్గా.. ‘రేపు నువ్వే ఇవ్వు లక్కీ’ అంటూ సైగ చేస్తుంది.
Read Also: మీరు ‘మౌనరాగం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్లు ఇవిగో!
జోసఫ్ 10 లక్షల విషయం తెలుసుకోవడానికి వస్తాడు. దాంతో సీనయ్య కూల్ ‘ఆ స్థలం నువ్వే తీసుకుని అమ్మేసుకోరా.. ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఇవ్వలేను’ అంటాడు. ఇంతలో లక్కీ వచ్చి.. ‘మావయ్యగారూ నేను ఈ ఇంటి మనిషినే అనుకుంటే నేను ఇస్తున్న ఈ చెక్ తీసుకోండి’ అని కన్విన్స్ చేస్తుంది. అయితే సీనయ్య అందుకు ఒప్పుకోడు.
‘మావయ్యగారూ అప్పుగానే తీసుకోండి’ అనడంతో.. పేపర్ పెన్ తీసుకొచ్చిన సీనయ్య.. ‘బైరపునేని సీనయ్య అను నేను.. బైరపునేని లక్ష్మీ దేవి దగ్గర 10 లక్షలు అప్పుగా తీసుకుంటాన్నాను’ అంటూ లక్కీ చేతా రాయించి సంతకం పెట్టి.. చక్రీకి ఆ పత్రాలను ఇస్తూ.. ‘భార్యకు సంబంధించిన ప్రతీదీ భర్తకు సంబంధం ఉంటుంది. అందుకే ఇది నీ దగ్గర ఉంచు.. అవసరానికి ఆడుకున్నందుకు కృతజ్ఞతలు’ అంటాడు. అది చక్రీకి కాస్త బాధ కలిగిస్తుంది. ఆ సీన్ ప్రేక్షకుల మనసుని కాస్త తడిచేస్తుంది.
జోసఫ్కి అ చెక్ ఇవ్వడంతో అతడు వెళ్లిపోతాడు. అమ్ములు, నీలవేణి, కాంతమ్మ అంతా సంతోషిస్తారు. తర్వాత చక్రీ మాత్రం.. లక్కీని తిడతాడు. ఈ సంగటనతో నా తండ్రిని మరింత దూరం చేశావు అంటూ తన బాధని చెప్పుకుంటాడు. అయితే విష్ణు.. బ్యాక్ మేనేజర్కి ఫోన్ చేసి.. (లక్కీకి ఇచ్చిన 10 లక్షల చెక్కుకు సంబంధించిన విషయం) చెక్ చెల్లకుండా చేయాలని చెబుతాడు.
కమింగ్ అప్లో..
సీనయ్య ఆవేశంగా వచ్చి కాలితో బిందెను గట్టిగా తన్నుతాడు. లక్కీతో సహా అంతా షాక్ అవుతారు. ‘ఈ ఇంట్లో వాళ్లని నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది’ అంటూ గట్టిగా అరుస్తాడు. ‘జోసఫ్ అన్నయ్యకు ఇచ్చిన చెక్ మీ దగ్గర ఉందేంటండీ’ అని అడుగుతుంది నీలవేణి. ‘ఆ విష్ణుగాడు 10 లక్షలు ఇచ్చింది నాకు సాయం చేయడానికి కాదు నన్ను అవమానించడానికి. బ్యాక్లో ఈ చెక్ చెల్లదని చెప్పారు’ అంటాడు సీనయ్య. లక్కీ షాక్లో ఉండిపోతుంది. మొత్తానికి విష్ణు అనుకున్నది చేశాడు. ఈ కథ మళ్లీ మొదటికి వచ్చింది. లక్కీ, చక్రీ దూరం అయితే నందిని, సీనయ్యల కుటుంబం కూడా దూరమైపోతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. మౌనరాగం కొనసాగుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Jadeja becomes father of a baby girl
స్పిన్నర్ జడేజాకి తియ్యటి వార్త..!
ఛాంపియన్స్ ట్రోఫీ ముగియకుండానే భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా సంబరాలు చేసుకునేంత తియ్యటి....
TNN | Updated:
Jun 8, 2017, 04:33PM IST
ఛాంపియన్స్‌ ట్రోఫీ ముగియకుండానే భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా సంబరాలు చేసుకునేంత తియ్యటి వార్త. అతని భార్య రీవా సోలంకి గురువారం పండంటి పాపకి జన్మనిచ్చింది. శ్రీలంక‌తో మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుందన్న సమయంలో ఈ టెస్టు నెం.1 బౌలర్‌కి సంతోషకరమైన వార్త తెలిసింది. దీంతో భారత్ జట్టులో సందడి వాతావరణం నెలకొందట.
గత ఏడాది ఆరంభంలో రీవాతో వివాహ జీవితాన్ని ఆరంభించిన జడేజా.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తన భార్య గర్భవతని మీడియాకి వెల్లడించాడు. ‘తల్లిదండ్రులు, ప్రస్తుతం గర్భవతిగా ఉన్న నా భార్యను విడిచి ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యా. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి భారత్ జట్టులో నేను ఉండటం చాలా అవసరం. కుటుంబం కంటే.. దేశానికే నా మొదటి ప్రాధాన్యత. ఆటపై నాకు ఉన్న అంకిత భావాన్ని కుటుంబ సభ్యులు కూడా గౌరవిస్తున్నారు’ అని జడేజా అప్పట్లో చెప్పుకొచ్చాడు. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బాధ లేదు ..వీరుడి చేతిలో ఓడిపోయాం - మాక్స్ వెల్
ఆసీస్ పై వీరోచిత ఇన్నింగ్ ఆడి భారత్ ను విజయతీరాలకు చేర్చిన కోహ్లీ పై ఇంటా బయట ప్రశంసల జల్లు కురిస్తోంది.
TNN | Updated:
Mar 28, 2016, 08:00PM IST
టి 20 వరల్డ్ కప్లో భాగంగా ఆసీస్ పై వీరోచిత ఇన్నింగ్ ఆడి భారత్ ను విజయతీరాలకు చేర్చిన కోహ్లీ పై ఇంటా బయట ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ మాక్స్ వెల్ విరాట్ ప్రతిభను కొనియాడారు. తాము భారత్ చేతిలో ఓడిపోయినందుకు బాధపడటం లేదని.. ఒక అత్యన్నత జట్టుపై .. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచపు అత్యుత్తమ క్రికెటర్ చేతిలో ఓడిపోయామన్నాడు. కోహ్లీ ఓ విభిన్న ఇన్నింగ్ ఆడాడని.. ఓటమి అంచులో ఉన్న జట్టును తన ప్రతిభతో విజయ తీరాలకు చేర్చాడని ప్రశంసించాడు. విరాట్ ప్రతిభ మాటల్లో చెప్పాలేనిదని అభిప్రాయపడ్డాడు. నంబర్ వన్ క్రికెటింగ్ జీనియస్ చేతిలో ఓటమి పాలైనందుకు తామ గర్విస్తున్నామని ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ మాక్స్ వెల్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు | 2sports
|
Hyderabad, First Published 21, Mar 2019, 2:51 PM IST
Highlights
టాలీవుడ్ లో సినీ ప్రముఖలందరికి బాగా పరిచయమున్న రమేష్ వర్మ హిట్టు కొట్టి చాలా కాలమవుతోంది. జనాలకు ఎక్కువగా కనిపించని ఈ దర్శకుడు చాలా వరకు కథను వినిపించడంలో సిద్దహస్తుడని టాక్. 2009లో రైడ్ సినిమాతో హిట్ కొట్టిన రమేష్ ఆ తరువాత మరో హిట్ అందుకోలేదు.
టాలీవుడ్ లో సినీ ప్రముఖలందరికి బాగా పరిచయమున్న రమేష్ వర్మ హిట్టు కొట్టి చాలా కాలమవుతోంది. జనాలకు ఎక్కువగా కనిపించని ఈ దర్శకుడు చాలా వరకు కథను వినిపించడంలో సిద్దహస్తుడని టాక్. 2009లో రైడ్ సినిమాతో హిట్ కొట్టిన రమేష్ ఆ తరువాత మరో హిట్ అందుకోలేదు.
2011లో రవితేజతో వీర అనే సినిమా తీసినప్పటికి హిట్ దొరకలేదు. ఆ తరువాత రమేష్ మధ్యలో అబ్బాయితో అమ్మాయి అనే సినిమా చేసినా అది జనాలకు పెద్దగా టచ్ అవ్వలేదు. ఫైనల్ గా కొన్నేళ్ల తరువాత స్టార్ హీరో ఈ దర్శకుడిని నమ్మి అవకాశం ఇస్తున్నాడు.
జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను ఓకే లెవెల్లో కొనసాగిస్తున్న నితిన్ రమేష్ స్క్రిప్ట్ ను గట్టిగానే నమ్ముతున్నాడు. పైగా సినిమా మ్యూజిక్ కోసం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆగస్ట్ లో సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నితిన్ భీష్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఛలో దర్శకుడు వెంకీ కుడుములు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Last Updated 21, Mar 2019, 2:52 PM IST | 0business
|
Suresh 183 Views
బాక్సింగ్కు ప్రోత్సాహమేదీ
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే తరంలో భారత్ నుంచి సాధ్యమైనంత మహిళా బాక్సర్లు ప్రాతినిధ్యం వహిస్తారనే విషయం ఖచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. భారత్లో బాక్సింగ్లో పోటీలు ఎక్కువగా జరగటం లేదని, జాతీయస్థాయిఓల పోటీలు నిర్వహించటానికి పెద్దగా ఆసక్తి కనబర్చటం లేదని ఆవేదన వ్యక్త చేసింది. రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తూ భారత్లో జాతీయస్థాయిలో బాక్సింగ్ పోటీలు జరగలేదని పేర్కొంది. | 2sports
|
Hyderabad, First Published 12, Apr 2019, 6:00 AM IST
Highlights
వరుసగా ఆరు డిజాస్టర్స్ తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుచి వచ్చిన చిత్రం చిత్ర లహరి. ఈ సారి సాయి కమర్షియల్ హంగుల్ని కాస్త పక్కనెట్టి ఏమోషనల్ థాట్ తో ఓ కొత్త ప్రయోగం చేశాడు. నేడు విడుదల కానున్న చిత్రలహరి సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో కొద్దిసేపటి క్రితం ప్రదర్శించారు. ఇక ఆ టాక్ విషయానికి వస్తే..
వరుసగా ఆరు డిజాస్టర్స్ తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుచి వచ్చిన చిత్రం చిత్ర లహరి. ఈ సారి సాయి కమర్షియల్ హంగుల్ని కాస్త పక్కనెట్టి ఏమోషనల్ థాట్ తో ఓ కొత్త ప్రయోగం చేశాడు. నేడు విడుదల కానున్న చిత్రలహరి సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో కొద్దిసేపటి క్రితం ప్రదర్శించారు. ఇక ఆ టాక్ విషయానికి వస్తే..
ఈ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ నేమ్ సాయి తేజ్ గా మారింది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా టైటిల్స్ లో సాయి తేజ్ అనే వేశారు. ఇక కథ విషయానికి వస్తే.. సింపుల్ లైన్ అయినప్పటికీ దర్శకుడు ఎమోషన్స్ తో స్క్రీన్ పై కొత్తగా ప్రజెంట్ చేశాడు. కోర్ట్ లో ఒక సీన్ ద్వారా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో సినిమా కథ మొదలవుతుంది. టివి సర్వీస్ సెంటర్ లో వర్క్ చేసే సాయిని బ్యాడ్ లో ఓ రేంజ్ లో వెంటాడుతుంది. ఇక అతను ఐడియాలను ఎవరు పట్టించుకోరు.
అప్పటికే కల్యాణి ప్రియదర్శినితో సాయి లవ్ లో ఉంటాడు. అయితే అతని బ్యాడ్ లక్ వల్ల ప్రేయసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తరువాత సాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, లైఫ్ లో అపజయాలను చూసే వ్యక్తి ఎలాంటి ఆలోచనలతో ముందుకు సాగాడు అనే పాయింట్స్ దర్శకుడు తెరపై తనదైన శైలిలో ప్రజెంట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే నివేత పేతురాజ్ సాయికి హెల్ప్ చేసే క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఇక సునీల్ ఒక క్రిస్టియన్ సింగర్ పాత్ర చేశాడు.
ఫస్ట్ హాఫ్ మొదట్లో పాత్రలను పరిచయం చేసిన విధానం బావుంది. కానీ అక్కడక్కడా రొటీన్ సీన్స్ చిరాగ్గా అనిపిస్తాయి. సినిమాలో రొటీన్ కామెడీ డోస్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే దర్శకుడు కిషోర్ తిరుమల మార్క్ ఏమోషన్ అయితే పర్ఫెక్ట్ గా క్లిక్ అయ్యిందని చెప్పవచ్చు. ప్రస్తుతం పరుగులు తీసే జీవితాలకు ఎదో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు.
విజయ్ పాత్రలో సాయి లైఫ్ అండ్ లవ్ ఫెయిల్యూర్ క్యారెక్టర్ కి పూర్తిగా న్యాయం చేశాడు. ఇక వెన్నెల కిషోర్ పోసాని కృష్ణ మురళి వంటి పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. ఫైనల్ గా చిత్రలహరి సమ్మర్ లో కొంచెం కూల్ మూవీ అని చెప్పవచ్చు. అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళితే బావుంటుందనే టాక్ వస్తోంది. మరి ఈ సినిమాతో సాయి ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
Last Updated 12, Apr 2019, 6:14 AM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అదరగొడుతున్న ‘జనతా గ్యారేజ్’ టీజర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ టీజర్ యూట్యూబ్లో సత్తా చాటుతోంది. రంజాన్ కానుకగా విడుదలైన ఈ టీజర్కు
TNN | Updated:
Jul 12, 2016, 10:48AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ టీజర్ యూట్యూబ్లో సత్తా చాటుతోంది. రంజాన్ కానుకగా విడుదలైన ఈ టీజర్కు యూట్యూబ్ లో వారంలోపే 40 లక్షల హిట్స్ వచ్చాయి. యూట్యూబ్లో రిలీజ్ చేసిన గంటలోపే ఈ టీజర్ను పది లక్షల మందికిపైగా వీక్షించారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఎక్కువ హిట్స్ సాధించిన రెండో దక్షిణాది చిత్రంగా ‘జనతా గ్యారేజ్’ నిలిచింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలీ’ తర్వాతి స్థానంలో ఈ సినిమా నిలిచింది. 'జనతా గ్యారేజ్'కు కొరటాల శివ దర్శకత్వ వహిస్తుండగా, ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన టీజర్గా రికార్డు బద్దలు కొట్టిన ' జనతా గ్యారేజ్ ' రిలీజ్ అయ్యాక మరెన్ని రికార్డులు బద్దలు కొట్టనుందో. | 0business
|
Jan 11,2017
ఫిబ్రవరి చివరి నాటికి సాధారణ స్థితి : ఎస్బీఐ
అహ్మాదాబాద్ : నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర కష్టాలకు ఫిబ్రవరి చివరి నాటికి తెర పడగలదని ఎస్బీఐ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే నెల చివరి నాటికి వ్యవస్థలో నగుదు లభ్యత సాధరణ స్థితికి చేరుకోగలదని ఆమె అన్నారు. ఆర్థిక వ్యవస్థను డిజిటలై జేషన్ దిశగా ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 'వెబ్రెంట్ గుజరాత్' 8వ అంతర్జాతీయ సదస్సులో ఆమె మాట్లాడుతూ ఎస్బీఐ ఖాతాదారులు నగదు కోసం క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఉండదన్నారు. సరిపడా డబ్బును బ్యాంకు శాఖలకు సరఫర చేస్తామ న్నారు. దీనివల్ల ఖాతాదారులు వారి అవసరా లకు తగినట్టు డబ్బును ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. అలాగే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే అంశంపై చర్చిస్తున్నామన్నారు. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 1, Aug 2019, 11:01 PM IST
Highlights
బిగ్ బాస్ సీజన్లో రెండో వారం రంజుగా సాగుతోంది. గొడవలు, గోలలు, ఇంట్రస్టింగ్ టాస్క్లతో హోరా హోరీగా టైటిల్ కోసం పోటీపడుతున్నారు కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ సీజన్ 3 పన్నెండో ఎపిసోడ్ కి ఎంటర్ అయింది. లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని సాధించిన కంటెస్టెంట్స్ ఒకవైపు ఆనందంలో ఉంటే.. జైలు పాలైన వరుణ్ సందేశ్.. తమన్నాలు విషాదంలో ఉన్నారు.
ఇక గురువారం ఎపిసోడ్ హైలైట్స్ విషయానికొస్తే.. వరుణ్ సందేశ్ తన బిహేవియర్ బాలేకపోవడంతో రియలైజ్ అయ్యి తనకు తానుగా జైలుకి వెళ్లాడని హిమజ, శివజ్యోతితో మాట్లాడుతుండగా.. వితికాకి కోపం వచ్చింది. తన భర్త ప్రవర్తన బాలేదని నువ్ ఎలా అంటావంటూ హిమజతో వాదనకి దిగింది.
ఈ విషయాన్ని తన భర్త వరుణ్ సందేశ్ కి చేరవేసింది వితికా.. అది విన్న వరుణ్ వాళ్లతో డిస్కషన్ పెట్టకని సర్ద్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై కల్పించుకున్న అలీ.. హిమజతో వాదనకు దిగారు. తన తప్పుచేసి జైలుకి వెళ్లాడనే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ హిమజకి చురకలేసే ప్రయత్నం చేశారు.
అయితే అతడి ప్రయత్నాన్ని తిప్పికొడుతూ 'నువ్ నన్ను కావాలంటే ఎలిమినేట్ చేసుకోగానీ.. తప్పుగా కన్వే చేయకని' హిమజ.. అలీతో చెప్పింది. మధ్యలో పునర్నవి ఇన్వాల్వ్ అవ్వడంతో ఆమెపై హిమజ ఫైర్ అయింది.
Last Updated 1, Aug 2019, 11:01 PM IST | 0business
|
సినిమా పేరు ట్రేడ్ మార్క్ చేయించిన హిరో విజయ్
Highlights
మెర్సాల్ అనే మూవీలొ నటిస్తున్నాడు తమిళ్ హిరో విజయ్
ఈ మూవీ పేరును ట్రేడ్ మార్క్ చేయించాడు హిరో విజయ్
ఇక ఈ పేరును ఎవరు వాడకూడదట
ఒక సినిమాకు ఒక పేరు పెట్టుకున్నాం. ఆ పేరేమీ కొత్త పదం కాదు. ఎక్కడో ఎప్పుడో విన్న పదమే ఉంటుంది. కాకపోతే ఆ పేరును కాస్త కొత్త తరహాలో జనాలకు రీచ్ అయ్యేలా చేస్తాం అంతే. కాని ఎవరన్నా ఆ పేరు నాదే అంటూ ఇప్పుడు ట్రేడ్ మార్క్ చేయించుకున్నారు అనుకోండి.. అది ఎలా ఉంటుంది? 'ఇంద్ర' అనే పేరు నాది అని మెగాస్టార్ చిరంజీవి చెప్పినా.. 'పైసా వసూల్' అనే పదాలను ఎవ్వరూ వాడకూడదని బాలయ్య చెప్పినా.. వినడానికి వెటకారంగా ఉంటుంది. అయితే ఇది నిజంగానే జరిగింది తెలుసా.
తమిళ హీరో విజయ్ ఇప్పుడు మెర్సాల్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ అవుతోంది కాబట్టి.ఎవరన్నా ఇష్టం వచ్చినట్లు 'మెర్సాల్ ఇడ్లీ' - 'మెర్సాల్ సాంబార్' - 'మెర్సాల్ పట్టుచీరలు' - 'మెర్సాల్ కబడ్డీ టీమ్' అని పేర్లు పెట్టుకోకుండా.. మనోళ్ళు 'మెర్సాల్' అనే టైటిల్ ను ట్రేడ్ మార్క్ చేయించారు. ఒక ప్రొడక్టు ఉందనుకోండి. అంబికా దర్బార్ బత్తి అని ఇంకొకరు పేరు పెట్టుకోకుండా ట్రేడ్ మార్క్ చేస్తారు కాని. ఇలా మూడు నెలలు ధియేటర్లో ఆడిపోయే సినిమా టైటిల్ ను కూడా ట్రేడ్ మార్క్ చేయిస్తారా? కాని వీళ్ళు చేయించారు. ఇక మీద ఎవరైనా ఈ మెర్సాల్ పేరును వాడాలంటే మాత్రం రాయల్టీ చెల్లించుకోవాలట. జస్ట్ అతితో సరిపెట్టకుండా.. ఆ అతిని పీక్స్ రేంజుకు తీసుకెళితే ఇలాగే ఉంటుందేమో.
అయితే సన్నిహితులు కొందరు విప్పేసిన సీక్రెట్ ఏంటంటే.. ఎవరో ప్రొడ్యూసర్ ఆల్రెడీ మెర్సాల్ అనే పదం వచ్చేలా ఒక టైటిల్ ను ఎప్పుడో రిజిష్టర్ చేయించారట. అందుకే ఇప్పుడు వీళ్ళు 'మెర్సాల్' అనే పదాన్ని తమదే అంటూ ట్రేడ్ మార్క్ చేయించారు. రేపు కోర్టులో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో రిజష్టర్ చేయించిన టైటిల్ కంటే.. వీళ్ళు చేయించిన ట్రేడ్ మార్కుకే పవర్ ఎక్కువ ఉంటుంది. సో టైటిల్ కొట్టేయడానికే ఇలా చేశారనేది ఒక రూమర్. అది సంగతి.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
దుబాయ్లో టీమిండియాకు ఘన స్వాగతం
విరాట్ కోహ్లికి విశ్రాంతి నేపథ్యంలో రోహిత్ శర్మ జట్టును ఏ మేరకు లీడ్ చేస్తాడన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Samayam Telugu | Updated:
Sep 14, 2018, 11:15AM IST
ఆసియా కప్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు దుబాయ్ చేరుకుంది. టీమిండియాకు దుబాయ్ ఎయిర్ పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టులో భారత క్రికెటర్లు నూతన ఉత్సాహంతో కనిపించారు. రేపటి (సెప్టెంబర్ 15) నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్తో పాటు ఆసియాకు చెందిన శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, హాంకాంగ్, అఫ్గానిస్థాన్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత్ మినహా అన్ని జట్లు ఇదివరకే దుబాయ్ చేరుకుని ప్రాక్టీసు మొదలుపెట్టేశాయి.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ నాయకత్వంలోని మహేంద్ర సింగ్ ధోనీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, చహల్, మరికొందరు ఆటగాళ్లు గురువారం దుబాయ్ బయలుదేరారు. అక్కడికి చేరుకున్న భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ పద్ధతిలో నిర్వాహకులు ఆటగాళ్లకు స్వాగతం పలికారు. కెప్టెన్ రోహిత్ శర్మతో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. మరోవైపు రోహిత్ భార్య రితిక అక్కడే నిలుచుని రోహిత్ కోసం ఎదురుచూసింది.
ఇంగ్లాండ్ పర్యటన నుంచి వచ్చిన భారత ఆటగాళ్లు ఆదివారం దుబాయ్ వెళ్తారు. టెస్ట్ సిరీస్ ఆడిన కేఎల్ రాహుల్, బుమ్రా, దినేష్ కార్తీక్, శార్దూల్ ఠాకూర్, శిఖర్ ధావన్, పాండ్యాలు ఆదివారం దుబాయ్ చేరుకుంటారు. విరాట్ కోహ్లికి విశ్రాంతి నేపథ్యంలో రోహిత్ శర్మ జట్టును ఏ మేరకు లీడ్ చేస్తాడన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఆసియా కప్ 2018లో భాగంగా 18న హాంకాంగ్తో, 19తో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమిండియా తలపడనుంది. | 2sports
|
Suresh 175 Views
బెంగళూరుపై ముంబై ఘనవిజయం
బెంగళూరు: ఐపిఎల్ 9 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లకుగానూ 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులుచేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 153 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. | 2sports
|
Hyderabad, First Published 21, Aug 2018, 3:39 PM IST
Highlights
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఈరోజు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఈరోజు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు రామ్ చరణ్ తో పాటు అతడి తల్లి సురేఖ అలానే నానమ్మ అంజనా దేవి కూడా హాజరయ్యారు. తన కొడుకు నటించిన 'సై రా' టీజర్ అదిరిపోయిందని అంజనా దేవి అన్నారు. అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''12 ఏళ్లుగా ఈ సినిమా చేయాలని పరుచూరి బ్రదర్స్ నాన్నగారితో ఈ సినిమా చేయాలనుకున్నారు.
ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆయనకి ఈ సినిమా గురించి చెప్పమని అనేవారు. వారి పన్నెండేళ్ల సంకల్పం ఈ సినిమా. ఇంత బడ్జెట్ లో సినిమా తీస్తున్నామని ఇప్పుడే నంబర్స్ రివీల్ చేయాలనుకోవడం లేదు. భారీ బడ్జెట్ తో అయితే సినిమా తీస్తున్నాం. నాన్న గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి దేనికి వెనుకాడకుండా సినిమా నిర్మిస్తున్నాం. దీనిపై మేము ఎలాంటి లాభాలు ఆశించడం లేదు. వస్తే అది బోనసే అవుతుంది.
నాన్నగారు నాతో ఒక మాట అన్నారు. నిన్ను చూస్తే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. రెండో సినిమాకే మంచి సోషియో ఫాంటసీ, కాస్ట్యూమ్ డ్రామా సినిమా చేసావు. నేను ముప్పై ఏళ్లలో 150 సినిమాలు చేశాను కానీ ఒక్క కాస్ట్యూమ్ డ్రామా కూడా రాలేదని'' అన్నారు. అందుకే ఈ సినిమా విషయంలో ప్రాఫిట్స్ గురించి ఆలోచించకూడదని ముందే అనుకున్నాం.
ఇవి కూడా చదవండి.. | 0business
|
Hyderabad, First Published 4, Apr 2019, 11:48 AM IST
Highlights
వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు అనీల్ రావిపూడి. 'పటాస్', 'సుప్రీం', 'రాజా ది గ్రేట్' లతో విజయాలను అందుకున్న ఈ దర్శకుడు ఈ ఏడాదిలో 'ఎఫ్ 2'తో పెద్ద సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు అనీల్ రావిపూడి. 'పటాస్', 'సుప్రీం', 'రాజా ది గ్రేట్' లతో విజయాలను అందుకున్న ఈ దర్శకుడు ఈ ఏడాదిలో 'ఎఫ్ 2'తో పెద్ద సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల షేర్ ని సాధించింది. ఈ సినిమాతో అనీల్ రావిపూడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అనీల్.
ఈ సినిమా కోసం అతడు ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడో తెలుసా..? రూ.12 కోట్లు. నిర్మాతలు కూడా అనీల్ అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల వంటి వారు రెమ్యునరేషన్ గా పది నుండి పదిహేను కోట్లు తీసుకుంటూ ఉంటారు.
ఇప్పుడు అనీల్ కూడా ఆ క్లబ్ లో చేరిపోయాడు. త్వరలోనే సినిమాకి వచ్చిన లాభాల్లో వాటా తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం అనీల్ రావిపూడి.. మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నాడు. ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మమతా బెనర్జీ సాయం కోరనున్న షమీ భార్య..!
షమీ ఓ సెలబ్రిటీ.. కాబట్టి అతను నన్ను ఏమైనా చేయగలడు. అతడ్ని అరెస్టు చేసేందుకు నాకు సహకరించండి. షమీ నాతో పాటు చాలా మంది మహిళల జీవితాల్ని
Samayam Telugu | Updated:
Mar 20, 2018, 03:21PM IST
మమతా బెనర్జీ సాయం కోరనున్న షమీ భార్య..!
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తున్న అతని భార్య హసీన్ జాహన్.. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే ఆమె ఫిర్యాదు మేరకు షమీపై గృహ హింస, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన కోల్కతా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే.. వెంటనే షమీని అరెస్టు చేయాలని గత నాలుగు రోజులుగా పోలీసుల్ని డిమాండ్ చేస్తున్న ఆమె.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అపాయింట్మెంట్ కోసం మంగళవారం దరఖాస్తు చేసుకుంది. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మగాళ్లకు తెలిసింది పిల్లల్ని కనడం ఒక్కటే కదా అంటున్న తాప్సి
తాప్సి, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాండ్ కీ ఆంఖ్’. ఈ సినిమాలోని ‘ఉమనియా’ అనే పాటను తాజాగా విడుదల చేశారు.
Samayam Telugu | Updated:
Oct 3, 2019, 12:22PM IST
సాండ్ కీ ఆంఖ్
‘మగాళ్లకు తెలిసింది పిల్లల్ని కనడం ఒక్కటే కదా’ అని అంటున్నారు బాలీవుడ్ నటి తాప్సి. ఇది చదవగానే ఆమెను తిట్టుకోకండి. తాప్సి కావాలని అనలేదు. ఆమె నటించిన ‘సాండ్ కీ ఆంఖ్’ అనే సినిమాలోని డైలాగ్ అది. తాప్సి, భూమి పెడ్నేకర్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని ‘ఉమనియా’ అనే పాటను తాజాగా విడుదల చేశారు.
Visit Site
Recommended byColombia
ప్రభుత్వం కుటుంబ నియంత్రణ రూల్ను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో సాగే పాట ఇది. ఈ పాట మొదలవడానికి ముందు తాప్సి హుక్కా తాగుతూ.. ‘ఈ మగాళ్లకు పిల్లల్ని కనడం మాత్రమే వచ్చు. ప్రభుత్వం దానిని కూడా రద్దు చేస్తే ఎలా?’ అని భూమిని అడుగుతంది. ఇందుకు భూమి స్పందిస్తూ.. ‘నేనైతే జీవితాంతం మగాళ్ల జీవితం కుటుంబ నియంత్రణపైనే ఆధారపడి ఉండాలి. అప్పుడైనా మనం మన జీవితాలను ప్రశాంతంగా బతుకుతాం’ అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ పాటకు డ్యాన్స్ చేయడం మొదలుపెడతారు.
READ ALSO: Kanchana రీమేక్.. షాకిస్తున్న అక్షయ్ కుమార్ హిజ్రా లుక్
ఉత్తర్ప్రదేశ్లోని జోహ్రి అనే గ్రామానికి చెందిన చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండేవారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడంతో కుటుంబం కోసమే తమ జీవితాన్ని వెచ్చించారు. తమలా తమ కుమార్తెల జీవితాలు కాకూడదని భావించి 50 ఏళ్ల వయసులో తుపాకీ చేతపడతారు. వారి చదువులను అడ్డుకోవాలని చూసేవాళ్లని తుపాకీలతో బెదిరించేవారు. ఈ నేపథ్యంలో తుపాకీతో టార్గెట్ మిస్సవకుండా దేన్నైనా కొట్టగలిగే సామర్ధ్యం తమలో ఉందని వారికి తెలుస్తుంది. అలా వారు జాతీయ స్థాయిలో జరిగిన రైఫిల్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇద్దరూ దాదాపు 300లకు పైగా పతకాలు సాధించారు.
READ ALSO: సాండ్ కీ ఆంఖ్ ట్రైలర్: ఇద్దరు బామ్మలు.. గురిచూసి కొడితే బుల్లెట్ దిగాల్సిందే
వారి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమే ‘సాండ్ కీ ఆంఖ్’. ఈ మహిళా షూటర్లకు యూపీలో ‘షూటర్ దాదీస్’గా మంచి పేరుంది. ఈ షూటర్ దాదీస్ గురించి తెలుసుకోవడానికి తాప్సి, భూమి వారి స్వస్థలమైన బాగ్పట్ జిల్లాకు కూడా వెళ్లారు. కొన్ని రోజులు వారి ఇంట్లోనే ఉండి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు. అవన్నీ సినిమాకు ఉపయోగపడ్డాయని తాప్సి, భూమి తెలిపారు. సినిమా చిత్రీకరణ మొత్తం బాగ్పట్లోనే జరిగింది. దీపావళి సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను తీయడానికి దర్శకుడు తుషార్ ఎందరో నటీమణులను సంప్రదించారు. కానీ 60 ఏళ్ల బామ్మ పాత్రలో నటించడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. దీపావళి సందర్భంగా ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘సాండ్ కీ ఆంఖ్’ రెండో పాట
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఘనంగా కబాలీ ఆడియో విడుదల కార్యక్రమం
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కబాలీ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం సాయంత్రం హైదరాబాదులో ఘనంగా జరిగింది.
TNN | Updated:
Jun 26, 2016, 09:41PM IST
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కబాలీ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం సాయంత్రం హైదరాబాదులో ఘనంగా జరిగింది. పలువురు టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర రంగ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో విడుదల చేసిన పాటలు చాలా చక్కగా ఉన్నాయని ఆహుతులు తెలిపారు. సాధారణంగా రజినీ కాంత్ చిత్రాలంటే అందరిలోనూ క్రేజీ ఉంటుందని, కబాలీ చిత్రానికి గతంలో రజినీ నటించిన చిత్రాలకన్నా మరింత క్రేజీ పెరిగిందన్నారు. యువనటుడు నాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రజినీ అంటే తనకు ఆరాధన అన్నారు. ఈ సందర్భంగా రజినీ డైలాగులు కొన్నింటిని చెప్పినప్పుడు ఆడియో కార్యక్రమం మొత్తం విజిల్స్ తో, చప్పట్లతో మారుమోగిపోయింది. లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తారనే విషయాన్ని రజినీ సార్ గతంలో ఎన్నో మార్లు నిరూపించారని, ఇప్పుడు అది పునరావృతం కాబోతోందన్నారు. రోబో-2 కన్నా, కబాలీ కోసమే తన ఆతృతన్నారు. ఈ సందర్బంగా డ్యాన్సర్లు కబాలీ చిత్రంలోని పాటలకు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. | 0business
|
ఫొటోస్: అల్లు అర్జున్ హోలీ సెలబ్రేషన్స్
First Published 21, Mar 2019, 6:24 PM IST
తన కుటుంబ సభ్యులతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హోలీని కలర్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబందించిన ఫొటోస్
అల్లు అర్జున్ హోలీ సెలబ్రేషన్స్
అల్లు అర్జున్ హోలీ సెలబ్రేషన్స్
అల్లు అర్జున్ హోలీ సెలబ్రేషన్స్
అల్లు అర్జున్ హోలీ సెలబ్రేషన్స్
అల్లు అర్జున్ హోలీ సెలబ్రేషన్స్
అల్లు అర్జున్ హోలీ సెలబ్రేషన్స్
Recent Stories | 0business
|
Hyderabad, First Published 29, Aug 2018, 10:07 AM IST
Highlights
ఎమోషనల్ ట్వీట్ చేసిన నాగార్జున
సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ హరికృష్ణ ఆకస్మిక మరణం సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు. ‘కొన్ని వారాల క్రితమే ఆయన నాతో.. నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని అన్నారు. ఇప్పుడు ఆయన ఇక లేరు. మిస్ యూ అన్న’ అంటూ హీరో నాగార్జున ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు.
‘‘ఈ వార్త వినడం చాలా బాధ కలిగించింది. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్, కళ్యాణ్తో పాటు కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని నటి కాజల్ ట్వీట్ చేశారు.
read more news | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లంకకి కెప్టెన్ గండం.. నెలలోనే ఐదుగురు
శ్రీలంక జట్టు సంక్షోభంలో కూరుకుపోతోందా..? రాజకీయ కారణాలు, జట్టు మేనేజ్మెంట్ ఉదాసీనత ఆ దేశ క్రికెట్ చరిత్రని
TNN | Updated:
Aug 30, 2017, 03:06PM IST
శ్రీలంక జట్టు సంక్షోభంలో కూరుకుపోతోందా..? రాజకీయ కారణాలు, జట్టు మేనేజ్‌మెంట్ ఉదాసీనత ఆ దేశ క్రికెట్ చరిత్రని మసకబార్చుతున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి.. ఇటీవల జరిగిన అనూహ్య పరిణామాలు. భారత్‌తో టెస్టు, వన్డే సిరీస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మంగళవారం సనత్ జయసూర్య అధ్యక్షుడిగా ఉన్న సెలక్షన్ కమిటీ తమ పదువులకి రాజీనామా చేయగా.. అభిమానులు మూడో వన్డేలో మైదానంలోకి వాటర్ బాటిల్స్‌ని విసిరి మ్యాచ్‌కి అరగంట పాటు అంతరాయం కలిగించారు. కొలంబో వేదికగా భారత్‌తో జరగనున్న నాలుగో వన్డేకి తాజాగా లసిత్ మలింగని కెప్టెన్‌గా నియమించారు. తొలి వన్డేకి కెప్టెన్‌గా ఉపుల్ తరంగపై స్లో ఓవర్ రేట్ కారణంగా నిషేధం వేటు పడగా.. మూడో వన్డేలో కెప్టెన్‌గా ఉన్న కపుగెదర గాయంతో సిరీస్‌కి దూరమయ్యాడు.
భారత్‌తో నెల క్రితం ఈ సుదీర్ఘ సిరీస్ ఆరంభమవగా.. తొలి టెస్టుకి సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తర్వాత మిగిలిన రెండు టెస్టులకి దినేశ్ చండిమాల్‌ నాయకత్వం వహించాడు. ఇక వన్డేల్లో తీసుకుంటే.. తొలి రెండు వన్డేలకూ ఉపుల్ తరంగ.. మూడో వన్డేకి కపుగెదర.. తాజాగా గురువారం జరిగే నాలుగో వన్డేకి మలింగ కెప్టెన్‌గా వ్యవహరించానున్నాడు. అంటే.. ఒక సిరీస్‌లో ఐదు మంది కెప్టెన్లు మారారు. మరోవైపు భారత్ మాత్రం.. కెప్టెన్ విరాట్ కోహ్లి నాయకత్వంలోనే ఓటమి ఎరుగకుండా మొత్తం సిరీస్ ఆడుతోంది. లంక మేనేజ్‌మెంట్ ఉదాసీనత కారణంగా.. ఆటగాళ్ల ఫిటెనెస్ స్థాయి ఘోరంగా పడిపోయిందని ఇప్పటికే ఆ దేశ క్రీడల మంత్రి హెచ్చరించిన విషయం తెలిసిందే. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కెప్టెన్ స్టీవ్స్మిత్ అతి చేయొద్దు..!
ఇంగ్లాండ్తో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్స్మిత్కు ఆ దేశ మాజీ కెప్టెన్ స్టీవ్వా కొన్ని సూచనలు చేశాడు. మైదానంలో
TNN | Updated:
Oct 27, 2017, 03:07PM IST
ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌‌కు ఆ దేశ మాజీ కెప్టెన్ స్టీవ్‌వా కొన్ని సూచనలు చేశాడు. మైదానంలో హద్దుల్లో ఉంటూ.. భావోద్వేగాలను కొంచెం నియంత్రించుకోవాలని హెచ్చరించాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ నవంబరు 23 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌‌ని యుద్ధంతో పోలుస్తూ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
‘స్టీవ్‌స్మిత్‌కి నేను చెప్పే సూచన ఒక్కటే. మైదానంలో అతిగా భావోద్వేగాలను ప్రదర్శించకు. ఎందుకంటే.. కెప్టెన్‌పైనే ఎక్కువ కెమెరా కన్ను ఉంటుంది. నువ్వు నెగటివ్‌గా ప్రవర్తించడం లేదా పిచ్‌ను కాలితో తన్నుతూ అసహనం ప్రదర్శిస్తే క్షణాల వ్యవధిలోనే రిప్లైలో వందసార్లు దాన్ని చూపిస్తారు. ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడిచినా.. బౌలర్లు సరిగా బౌలింగ్ చేయకపోయినా.. కెప్టెన్‌గా వెలుపలికి భావాలు కనిపించకుండా నాలో నేను మాట్లాడుకునేవాడ్ని. నువ్వు అలా కాకుండా సహచరులపై కోపాన్ని ప్రదర్శిస్తే.. స్టేడియంలోని పెద్ద స్క్రీన్లపై అది వెంటనే కనిపిస్తుంది. ఇది ఆటపై కూడా ప్రభావం చూపుతుంది’ అని స్టీవ్‌వా హెచ్చరించాడు. | 2sports
|
T 20 : India Won The Match Againest Australia
టి 20: చేతులెత్తేసిన కంగారులు.. ధోనీసేన విక్టరీ
టీమిండియా భారీస్కోరు ముందు కంగారులు లొంగిపోయారు.
| Updated:
Jan 26, 2016, 06:12PM IST
టి-20: ఆడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఉంచిన 188 పరుగుల భారీ టార్గెట్ చేధించే క్రమంలో ఆసీస్ బ్యాట్స్ మెన్లు బోల్తా పడ్డారు. ఫలితంగా 19.3 ఓటర్లకు 151 పరగులు మాత్రమే చేసి ఆసీస్ ఆలౌటైంది. దీంతో టీమిండియా 37 పరుగుల తేడాతో మ్యాచ్ నెగ్గింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లకు 188 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (90) పరుగుల వరద పారిచడం..మిగిలిన బాట్స్ మెన్లు తమ వంత సహకారాన్ని అందించడంతో ఈ స్కోర్ సాధ్యపడింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కంగారులు తొలుత ధాటిగానే ఆడారు. వార్నర్ (17) ఔట్ తో కంగారులు నెమ్మదించారు. రన్ రేట్ పెరుగుతుండంతో ఒత్తిడికి లోనై వికెట్లు చేజార్చుకున్నారు. ఆసీస్ తరుఫున ఫించ్ ఒక్కడే (44) కాస్త పర్వాలేదని పించాడు. ఇలా ఆసీస్ పతనం ప్రారంభమై అంతిమంగా లక్ష్యానికి 37 పరుగుల దూరంలో ఉండి ఆలౌటైంది. దీంతో టీమిండియా ఖాతాలో ఓ విజయం వచ్చిపడినట్లయింది. టీమిండియా తరఫున బర్మా 3 వికెట్లు తీయగా.. అశ్విన్ , జడాజా , పాండ్యా లు తలో రెండు వికెట్లు తీసి రాణించారు. | 2sports
|
రెమ్యునరేషన్ తగ్గించిన రకుల్
Highlights
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కిరీటం రకుల్ ప్రీత్ సింగ్ చేయి జారిపోతోంది
ప్రస్తుతం రకుల్ తెలుగు సినిమాలన్నీ చర్చల్లో తప్ప చేతుల్లో ఏమీ లేవు
రెమ్యునరేషన్ కూడా తగ్గించింది కాబట్టి తెలుగులో మరిన్ని అవకాశాలు తలుపుతట్టే అవకాశం ఉంది
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కిరీటం రకుల్ ప్రీత్ సింగ్ చేయి జారిపోతోంది. ప్రస్తుతం రకుల్ తెలుగు సినిమాలన్నీ చర్చల్లో తప్ప చేతుల్లో ఏమీ లేవు. ఒకప్పుడు టాప్ హీరోయిన్లందరికీ ఆమె ఒక్కతే ఛాయిస్ గా ఉండేది. ఈమధ్య ఆమె బాలీవుడ్ సినిమాపై ఫోకస్ పెట్టడం.. ఇక్కడేమో కాంపిటీటర్లు పెరగడంతో టాలీవుడ్ లో ఛాన్సులు తగ్గిపోయాయి.
టాప్ హీరోయిన్ గా ఉన్న రోజుల్లో ఓ సినిమాలో నటించాలంటే రకుల్ కళ్లు తిరిగే మొత్తం డిమాండ్ చేసేదని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేక పోవడంతో రెమ్యునరేషన్ బాగానే తగ్గించుకుంటోందని తెలుస్తోంది. ఈ సమాచారం నెమ్మదిగా నిర్మాతల చెవికి చేరినా ఇంకా దర్శక - నిర్మాతల ఫోకస్ ఆమెపై పడలేదు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే సినిమాలో రకుల్ ఓ హీరోయిన్ గా నటిస్తుందనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ రోల్ కు కూడా ఆమెను తీసుకోవడం లేదని... రాజమౌళి ఇంకో హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.
టాలీవుడ్ టైం కలిసిరాకపోయినా కోలీవుడ్ లో మాత్రం లక్కు బాగానే కలిసొస్తోంది. గతేడాది కార్తి హీరోగా నటించిన తీరన్ అదిగారమ్ ఒండ్రు సినిమాలో నటించిన రకుల్ కు మరోసారి కార్తి సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది. దీంతోపాటు అతడి అన్న సూర్య హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీలోనూ ఆమే హీరోయిన్ గా చేస్తోంది. అల్రెడీ తన బాడీ వెయిట్ తగ్గించుకున్న రకుల్.. ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా తగ్గించింది కాబట్టి తెలుగులో మరిన్ని అవకాశాలు తలుపుతట్టే అవకాశం ఉంది. సెక్సీ సిన్నది తగ్గింది కాబట్టి.. చూద్దాం మరి.
Last Updated 25, Mar 2018, 11:38 PM IST | 0business
|
మహేష్ ని కలుసుకోవాలని ఉందా?
Highlights
మహేష్, రకుల్ జంటగా స్పైడర్
ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు స్పైడర్
స్పైడర్ టీం ని కలిసే అవకాశం కల్పిస్తున్న టికెట్ న్యూ
మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘స్పైడర్’. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్.. అభిమానులను ఆకట్టుకుంటోంది.
Hey Hyderabad!Find Blood splatter,Broken finger,Knife,Keys,Wallet & Rope. Circle the objects & share. Lucky Winners will meet #SPYder team. pic.twitter.com/oYca5ZT1zN
— TicketNew (@TicketNew) 19 September 2017
ఇక అసలు విషయానికి వస్తే.. మహేష్ బాబు అభిమానులకు టికెట్ న్యూ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్పైడర్ చిత్ర బృందాన్ని కలుసునే అవకాశాన్ని కల్పిస్తోంది. టికెట్ న్యూ ట్విట్టర్ లో ఒక పజిల్ పెట్టింది. దానిని పూర్తి చేసి తమకు పంపిన వారిలో విజేతను ఎంపిక చేసి.. వారు స్పైడర్ మూవీ టీం ని కలిసే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
టికెట్ న్యూ కంపెనీ.. తమ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టర్ ని ఉంచింది. ఆ పోస్టర్ లో రక్తపు మరక, కత్తి, తాడు, కీ, చేతి వేలు లాంటి వాటిని గుర్తించి.. వాటిని సర్కిల్ చేసి తమకు షేర్ చేస్తే స్పైడర్ టీమ్ ని కలుసుకోవచ్చని చెప్పింది. ఇప్పటికే పలువురు వాటిని కనుగోనే పనిలో పడ్డారు. మరికొందరు కనుక్కొని షేర్ చేస్తున్నారు. మీరు కూడా మహేష్ అభిమాని అయితే.. ఇంకెందుకు ఆలస్యం టికెట్ న్యూ ఓపెన్ చేయండి. | 0business
|
హోమ్ క్రీడలు కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు
కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు
August 28, 2019, 11:31 AM IST
Share on:
ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఢిల్లీలోని ప్రఖ్యాత ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని నిశ్చయించుకుంది. ఇకమీదట ఢిల్లీ స్టేడియాన్ని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా పిలవనున్నారు. ఈ మేరకు డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మీడియాకు తెలిపారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో జైట్లీ చేసిన కృషి అసామాన్యమని, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, రిషబ్ పంత్ వంటి అనేకమంది క్రికెటర్లు జైట్లీ సపోర్ట్ తో భారతదేశం గర్వించేలా ప్రదర్శన చేశారని, చేస్తున్నారని శర్మ పేర్కొన్నారు. అంతటి గొప్పవ్యక్తికి ఇది తగిన గౌరవంగా భావిస్తున్నామని వెల్లడించారు.
సంబంధిత వార్తలు | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మరో చంటిగాడిని చూపించిన పూరీ!
‘రోగ్’ హీరో ఇషాన్ ఫస్ట్లుక్ను డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విడుదల చేసారు.
TNN & Agencies | Updated:
Feb 22, 2017, 09:32AM IST
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజా చిత్రం ‘రోగ్’. ‘మరో చంటిగాడి ప్రేమకథ’ ఉప శీర్షిక. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రం ద్వారా ఇషాన్ అనే కొత్త కుర్రాన్ని హీరోగా పరిచయం చేస్తున్నాడు పూరీ. సినిమా మొదలైనప్పటి నుంచి ఈ చంటిగాడిని ప్రేక్షకులకు చూపించలేదు. అందుకనే బుధవారం అర్ధరాత్రి ‘రోగ్’ హీరో ఇషాన్ ఫస్ట్‌లుక్‌ను పూరీ ట్విట్టర్‌లో విడుదల చేసారు. అలాగే ఓ టీజర్‌ను కూడా యూట్యూబ్‌లో ఉంచారు.
పూరీ గత సినిమాల హీరోలానే ఇషాన్ కూడా రఫ్‌గా ఉన్నాడు. తొలిసినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. కాగా, జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ బ్యానర్‌పై డాక్టర్ సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌. గోపి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా నిర్మాత సి.ఆర్. హనోహర్ కుమారుడే ఈ ఇషాన్. ‘రోగ్’లో ఇషాన్‌కు జోడిగా ఏంజెలా క్రిస్లింజ్కి, మన్నారా చోప్రా నటిస్తున్నారు. | 0business
|
Sunil Gavaskar Questions Team India Selection for Second Test
ధావన్ని బలి పశువు చేస్తున్నారు: గవాస్కర్
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ని టీమిండియా మేనేజ్మెంట్ బలిపశువుగా చూస్తోందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్
TNN | Updated:
Jan 13, 2018, 06:59PM IST
భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌ని టీమిండియా మేనేజ్‌మెంట్‌ బలిపశువుగా చూస్తోందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో శనివారం ఆరంభమైన రెండో టెస్టులో శిఖర్ ధావన్, సాహా, భువనేశ్వర్‌ కుమార్‌లను తుది జట్టు నుంచి తప్పించిన మేనేజ్‌మెంట్ .. వారి స్థానంలో కేఎల్ రాహుల్, పార్థీవ్ పటేల్, ఇషాంత్ శర్మలకి అవకాశం కల్పించింది. ఈ ఎంపిక ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని గవాస్కర్ పెదవి విరిచారు. జట్టులో మార్పులు చేయాలనుకుంటే.. మొదట శిఖర్ ధావన్ పేరే వినిపిస్తోందని ఈ మాజీ క్రికెటర్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘జట్టులో శిఖర్ ధావన్ బలి పశువుగా తయారయ్యాడు. వేటు వేయాలనుకుంటే తొలుత అతని పేరే వినిపిస్తోంది. నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మని తీసుకోవాల్సిన అవసరం ఏంటి..? అతను తొలి టెస్టులో మొదటి సెషన్‌లోనే మూడు వికెట్లు పడగొట్టాడు.. మొత్తంగా ఆరు వికెట్లతో సత్తా చాటాడు కదా..? ఇషాంత్ కచ్చితంగా జట్టులో ఉండాలని అనుకుంటే షమీ లేదా బుమ్రాపై వేటు వేయచ్చు. కానీ.. అలా జరగలేదు. ఎందుకో..?’ అని గవాస్కర్ ప్రశ్నించాడు. ఒక టెస్టులో విఫలమవగానే ధావన్‌పై వేటు వేయడంలో అంతర్యం అర్థంకావడం లేదని.. సాహాకి గాయం కారణంగా పార్థీవ్‌ని జట్టులోకి తీసుకున్నామనే మాటలో వాస్తవమెంతో తెలియాలన్నారు. | 2sports
|
Hyderabad, First Published 9, Oct 2018, 11:20 AM IST
Highlights
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా బయటకొచ్చి తమ అనుభవాలను చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ఆర్టిస్టులతో పాటు జర్నలిస్ట్ లు కూడా ఈ విషయంపై స్పందించారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా బయటకొచ్చి తమ అనుభవాలను చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ఆర్టిస్టులతో పాటు జర్నలిస్ట్ లు కూడా ఈ విషయంపై స్పందించారు.
హాలీవుడ్ లో మొదలైన ఈ మీటూ మూమెంట్ ఇప్పుడు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ కి కూడా పాడింది. టాలీవుడ్ ప్రముఖ సింగర్ చిన్మయి చిన్నతనంలో తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. అయితే కొందరు ఈ మీటూ మూమెంట్ ని సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ మీటూ ఉద్యమంపై స్పందించింది. ''#మీటూ మూమెంట్ లో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడడానికి చాలా మంది మహిళలు ధైర్యంగా ముందుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ ధైర్యం కొనియాడదగినది.
కొందరు వ్యక్తులు మాత్రమే కాకుండా ఇతర మహిళలు కూడా మిమ్మల్ని అనుమానిస్తూ అవమానిస్తూ ఆధారాల గురించి అడగడం సిగ్గు చేటు. మీరు చెబుతున్న విషయాలతో ఎందరో చిన్నారులకి రక్షణగా నిలుస్తున్నారని తెలుసుకోండి. థాంక్యూ. #మీటూ మూమెంట్ ని నేను సపోర్ట్ చేస్తున్నాను'' అని సమంత వెల్లడించింది.
ఇది కూడా చదవండి.. | 0business
|
Gold
30.5% దిగజారిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ, డిసెంబరు 19: బంగారం దిగుమతులు ఏప్రిల్-నవంబరు నెలలమధ్యకాలంలో 30.5శాతం దిగజారాయి. విలువల్లో చూస్తే 15.74 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు జరిగాయి. దిగుమతులపరంగాచూస్తే అంతకుముందు ఏడాది ఇదేనెలలో 22.64 బిలియన్ డాలర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా పసిడి ధరలు కొంతమేర దిగజారడమే ఇందుకుకీలకం అని తేలింది. అయితే బంగారం దిగుమతులు నెలవారీగాచూస్తే నవంబరులో పెరిగాయి. 23.24శాతంపెరిగి 4.36 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సెప్టెంబరు నుంచి ఇప్పటివరకూ కూడా దిగుమతి ఆర్డర్లు తగ్గుతున్నట్లు తేలింది. బంగారం దిగుమతులు పెరగడం వల్ల వాణిజ్య లోటు కూడా రెండున్నరేళ్ల గరిష్టస్థాయికి పెరిగి 13 బిలియన్ డాలర్లుగా నిలిచింది. అంతకుముందు ఏడాది నవంబరునెలలో వాణిజ్యలోటు 10.33 బిలియన్ డాలర్లుంటే ఈ సారి మరికొంత పెరిగిం ది. చైనా తర్వాత ప్రపంచంలో బంగారం దిగుమ తుల్లో రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. 2015- 16 ఆర్థిక సంవత్సరానికిగాను కరెంటుఖాతా లోటు 22.1బిలియన్ డాలర్లుగా ఉంది. స్థూల దేశీయో త్పత్తిలో 1.1శాతం వాటాతో ఉంది.2014-15లో 26.8 బిలియన్ డాలర్లుగా ఉన్న లోటు జిడిపిలో 1.3శాతంగా ఉంది. పరిమాణం పరంగాచూస్తే మొత్తం అధికారిక బంగారం దిగుమతులు 60 టన్నులకు తగ్గాయి. అంతకుముందు ఏడాదితో 250 టన్నులతో పోలిస్తే భారీగా తగ్గాయి. 2015 -16లో భారత్ 650 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది. నవంబరు నెలలో 100 టన్నులకు చేరి స్థిరంగా ఉన్నాయి. నగదు సంక్షోభం కారణంగా దిగుమతులు కూడా తగ్గాయి. కొనుగోళ్లు మందగించడంతో రిటైలర్లు, జ్యుయెలర్లు, తయారీ దారులు కూడా అంతగా ఆసక్తి చూపించలేదు. కొత్తనోట్ల కొరత కారణం గా గ్రామీణప్రాంతంలో డిమాండ్ దెబ్బ తిన్నది. ప్రపంచపసిడిమండలి అంచనాల ప్రకారం చూస్తే జూలై, సెప్టెంబరు నెల ల్లో పసిడి డిమాండ్ 28శాతం పెరిగి 194.8 టన్నులుగా ఉంది. ధరలు పెరగ డం, చట్టపరమైన మార్పుల కారణంగా తగ్గిందని అంచనా. పూర్తి సంవత్సరానికిగాను డిమాండ్ 650 నుంచి 750టన్నులకు మించక పోవ చ్చని ప్రపంచ పసిడి మండలి అంచనా వేస్తోంది. ====== మార్కెట్లపై విదేశీ ఒత్తిళ్లు ముంబై, డిసెంబరు 19: అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు ప్రతికూలంగా కనిపిం చడంతో బలహీనంగా ప్రారంభం అయిన దేశీయస్టాక్ మార్కెట్లు రోజు మొత్తం నీరసంగానే నడిచాయి. చివరివరకూ ఊగిసలాడి ఓమోస్తరు నష్టాలతో ముగిసాయి. అయితేచివరి అర్ధగంటలో ఉన్నట్టుండి ఊపందుకున్న అమ్మకాల కారణంగా సెన్సెక్స్ 140పాయింట్ల దిగజారగా ఎన్ఎస్ఇ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 8100 దిగువకు చేరింది. చివరినిమిషంలో కాస్తకోలుకుని 35 పాయింట్ల నష్టానికి 8104 వద్ద నిలి చింది. సెన్సెక్స్ కూడా 115 పాయింట్లు దిగజారి 26,375పాయింట్లవద్ద స్థిరపడిం ది. ఎన్ఎస్ఇలో ఐటిరంగం యధాతథంగా నిలవగా పిఎస్యుబ్యాంకు,రియాల్టీ, మెటల్, ఫార్మా, ఆటో 1-0.6శాతంమధ్య క్షీణించాయి. ఇక బ్లూచిప్ షేర్లలో ఇన్ఫ్రాటెల్, ఏసియన్ పెయింట్స్, సన్ఫార్మా అల్ట్రాటెక్, హెచ్డిఎఫ్సి, ఎసిసి, అదానిపోర్టులు మారుతి, భారతి ఎయిర్ టెల్, ఎస్బిఐ 3-13శాతం మధ్య వెనుకంజ వేసా యి. గెయిల్ అత్యధికంగా 2.3శాతం ముందుకు దూకింది. ఇదేబాటలో అరబిందో, టాటాపవర్, గ్రాసిమ్, హెచ్సిఎల్ టెక్, ఐసిఐసిఐ 1-0.5శాతం లాభపడటం ద్వారా కొంత మార్కెట్లను అందుకున్నాయి. ఇక ట్రేడింగ్లో మార్కెట్ల బాటలోనే చిన్నషేర్లు కూడా నేల చూపులు చూసాయి. బిఎస్ఇలోమిడ్, స్మాల్క్యాప్ సూచీ లు 0.5శాతం చొప్పున వెనుకడుగు వేసాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1547 నష్టపోతే 1081 లాభపడ్డాయి. మిడ్క్యాప్స్లో ఒబెరా§్ు, రియాల్టీ, నాల్కో,పిరమల్, యూపిఎల్, బజాజ్ ఫిన్, యూనియన్బ్యాంకు, బెర్జర్ పెయింట్స్, శ్రీరామ్ట్రాన్స్, క్రిసిల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఐడిఎఫ్సి బ్యాంకు తదితర సంస్థలు 5.5 నుంచి 2.00శాతం మధ్య దిగజారాయి. స్మాల్క్యాప్స్ ట్రేడింగ్లో ట్రీహౌస్ 20శాతం దిగువకు రాగా స్వాన్ ఎనర్జీ 18శాతం, కెఎస్కె 17శాతం చొప్పున దిగజారాయి. ఇదేబాటలో అలం కిత్, అనూహ్పార్మా, 8కెమైల్స్, ఉజాస్, మణప్పురం, క్లారిస్, భారత్ ఫైనాన్షి యల్, ఆండ్రాయల్, గీతాంజలి, టివి టుడే, ఎంబిఎల్, సునీల్ హైటెక్, ఎంఎస్ఆర్, హెచ్ఇజి, ఇఐడి ప్యారీ, జిలెర్న్ తదితర సంస్థలు 4.5 నుంచి ఏడుశాతం మధ్య పతనం అయ్యాయి. డేటా మాటిక్స్ 13శాతం లాభపడగా ఆస్టెక్, జిఎస్ఎఫ్ సి, నిప్పో,హైగ్రౌడ్, జైకార్ప్, గ్లోబల్ ఆఫ్షోర్, ఎంటిఎన్ఎల్, సొనాటా సాఫ్ట్వేర్, మాంటెకార్లో, గాయత్రి ప్రాజెక్ట్సు, ఆర్పిజిలైఫ్, డైమండ్ పవర్ తదితర సంస్థలు 5-9శాతం మధ్య జంప్చేశాయి. | 1entertainment
|
ఛాంపియన్స్ ట్రోఫీకి
ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుల ఆతిథ్యం
దుబా§్ు: వచ్చే ఏడాది జరుగనున్న ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ 2017 కోసం టికెట్ బ్యాలెట్ను భారత కాలమానం ప్రకారం గురువారం ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఐసిసి ప్రకటించింది.జూన్ 1 నుంచి 18 వరకు జరిగే ఈ టోర్నమెంట్కు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు ఆతిథ్యమిస్తున్నాయి.టోర్నీలో భాగంగా మొత్తం 15 మ్యాచ్లు జరుగుతాయి.చిన్న పిల్లలకు 5,పెద్దవారికి 20 పౌండ్లుగా టికెట్ ధరలను నిర్ణయించారు.కాగా ఈ రోజునుంచి 30 రోజుల పాటు టికెట్ బ్యాలెట్ అందుబాటులో ఉంటుందని ఐసిసి అధికారిక వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యడబ్ల్యు, ఐసిసి.క్రికెట్.కామ్ టికెట్స్ ద్వారా క్రికెట్ అభిమానులు టికెట్ను కొనుగోలు చేయవచ్చు.కాగా ఈటికెట్ బ్యాలెట్ భారతకాలమానం ప్రకారం 1, అక్టోబరు 12.30 గంటలకు క్లోజ్ అవుతుంది. ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ఈ టోర్నీపై మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే ఈవెంట్ కోసం ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు.ఈ టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లండ్ తన తొలి మ్యాచ్ను ఓవల్ మైదానంలో బంగ్లాదేశ్తో తలపడ నుందని వెల్లడించాడు.ఇక ఐసిసి ఛీప్ ఎగ్జిక్యూటివ్ డెవిడ్ రిచర్డ్స్సన్ మాట్లాడుతూ వన్డేల్లో అత్యత్తమ జట్టు ఏదని తెలియజేసేందుకే ఈ చాంపియన్స్ ట్రోపీని నిర్వహిస్తున్నామని, ఇంగ్లండ్, వేల్స్లోని మూడు వేదికల్లో టోర్నీ జరుగుతుందన్నాడు. అభిమానులకు అందుబాటులోనే టికెట్ ధరలను ఉంచామని పేర్కొన్నారు.
బ్యాలెట్ ద్వారా విక్రయించడం ద్వారా మిగిలిన టికెట్లను అక్టోబరు చివరి నాటికి జనరల్ సేల్లో విక్రయించనున్నట్లు ఆయన వివరించారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఆన్లైన్లో బ్యాలెట్ ద్వారా 15 మ్యాచ్లకు అందుబాటులో ఉంచామని,ఒక్కో దరఖాస్తుదారునికి కేవలం 10 టికెట్లు లభిస్తాయని పేర్కొన్నారు.వన్డే క్రికెట్లో సెప్టెంబరు 30 నాటికి టాప్ 8లో ఉన్న 8 జట్లు ఐసిసి చాంపియన్ ట్రోఫీలో పాల్గొంటా యని వెల్లడించారు.జూన్ 1 నుంచి 18 వరకు జరుగనున్న టోర్నీలో తొలి మ్యాచ్కు ఓవల్ మైదానంలో ఆతిథ్యమిస్తుంది. కార్డిప్ వేల్స్ మైదానంలో నాలుగు మ్యాచ్లు జరుగనుండగా అందులో జూన్ 14న జరిగే సెమీ ఫైనల్మ్యాచ్ కూడా ఉంది.ఎడ్జిబాస్టన్ మైదానం ఆతిథ్యమిచ్చే నాలుగు మ్యాచ్ల్లో రెండవ సెమీఫైనల్తో పాటు ఇండియా వర్సెస్ పాకిస్థాన్,అదేవిధంగా ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లు ఉన్నాయి. | 2sports
|
Hyd Internet 121 Views tirumanne and mathewes
tirumanne and mathewes
కొలంబోః శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి తరంగ (48) ఔటయ్యాడు. మరో రెండు పరుగులు చేస్తే హాఫ్ సెంచరీ పూర్తి చేసే క్రమంలో తరంగ ఔట్ కావడం ఆయన అభిమానులను నిరాశపరిచింది. కాగా, ఇప్పటివరకు భువనేశ్వర్ రెండు వికెట్లు తీసుకోగా, బుమ్రా ఒక వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం క్రీజ్ లో తిరిమన్నె, మ్యాథ్యూస్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం స్కోరు 14.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేశారు. | 2sports
|
KOHLI
ఉద్యోగాలకు రాజీనామా చేయండి
ముంబయి: టీమిండియాకు బిసిసిఐ షాకిచ్చింది. క్రికెటర్లు ఏ ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగం చేయకూడదంటూ కోహ్లీసేనకు బిసిసిఐ నోటీసులు పంపించింది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు రాజీనామా చేయాలని సూచించింది. బిసిసిఐ తాజా నిర్ణయంతో భారత జట్టులోని పలువురు క్రికెటర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు శిఖర్ ధావన్, అజింకే రహానె, ఇషాంత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, గౌతం గంబీర్లు ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగులుగా ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓఎన్జిసిలో మేనేజర్గా ఉన్నారు. గతంలో ఓఎన్జిసి నిర్వహించిన అనేక స్థానిక టోర్నీల్లో ఆడిన సందర్భాలున్నాయి. ఢిల్లీకి చెందిన పలువురు క్రికెటర్లకి ఓఎన్జిసి ఉద్యోగావకాశాలు కల్పించింది. వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంబీర్ లాంటి క్రికెటర్లు ఓఎన్జిసిలో గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు నియమించిన పరిపాలన కమిటీ సూచన మేరకే బిసిసిఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. | 2sports
|
Hyderabad, First Published 15, Apr 2019, 4:56 PM IST
Highlights
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో తప్ప అన్ని చోట్ల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో తప్ప అన్ని చోట్ల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో సినిమా రిలీజ్ కాకుండా హైకోర్టు స్టే ఇచ్చింది.
దీంతో చిత్రబృందం సుప్రీం కోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల తరువాతైనా ఏపీలో సినిమా రిలీజ్ అవుతుందనుకుంటే అది కూడా జరగలేదు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తులు సినిమాను చూసి తీర్పుని సోమవారం నాటికి వాయిదా వేశారు.
ఈరోజు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సినిమా విడుదలపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సిందిగా సూచించింది. దీంతో మరోసారి సినిమా విడుదలపై క్లారిటీ రాకుండా పోయింది.
మరోపక్క ఈ సినిమా విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు మోహన్ రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Last Updated 15, Apr 2019, 4:56 PM IST | 0business
|
ilayaraja not interested to react on disputes with balu
ఆ వివాదంపై ఇళయారాజా నో కామెంట్!
ఆ వివాదం తనకూ ఆ గాయకుడికి మధ్యన అని అన్నారు.
TNN | Updated:
Sep 7, 2017, 09:44AM IST
ఇళయరాజా- ఎస్పీ బాలసుబ్రమణ్యం.. ఈ కాంబినేషన్ దక్షిణాది సినీ సంగీత ప్రియులను ఎంతగానో మైమరపించింది. రాజా సంగీత సారధ్యంలో బాలూ స్వరంలో సూపర్ హిట్స్ గా నిలిచిన పాటలలకు లెక్కే లేదు. అలాగే వ్యక్తిగతంగా కూడా బాలూ, ఇళయారాజాలు స్నేహితులు. సినీరంగంలో ఫేమస్ గాక ముందు నుంచినే చెన్నైలో వీరి స్నేహం చిగురించింది. దశాబ్దాల పాటు ఆ స్నేహం కొనసాగింది. అయితే ఇటీవలే వీరి మధ్యన చిన్న వివాదం తలెత్తింది.
విదేశాల్లో బాలూ ఆధ్వర్యంలో జరిగే మ్యూజికల్ నైట్స్ లో తను స్వరకల్పన చేసిన పాటలు పాడటానికి వీల్లేదని ఇళయరాజా చట్టపరంగా నోటీసులు పంపించారు. ఆ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా అందరికీ తెలిపారు బాలూ. ఇళయరాజా నోటీసులు పంపించిన నాటి నుంచి ఇప్పటి వరకూ తను ఎక్కడా, ఎప్పుడూ ఆయన సంగీత దర్శకత్వం వహించిన పాటలేవీ పాటలేదని ఎస్పీ బాలూ ఇటీవల కూడా ప్రకటించారు. తనకు ఎంతో సన్నిహితుడు అయిన రాజా నుంచి అలాంటి నోటీసులు అస్సలు ఊహించలేదని కూడా బాలూ వ్యాఖ్యానించారు. | 0business
|
May 12,2016
అందుకే శాఖలు తెరవడం లేదు!
లండన్: భారత్ క్రెడిట్ రేటింగ్ దిగజారిన నేపథ్యంలో విదేశీ బ్యాంకులు భారత్లో శాఖలను తెరిచేందుకు వెనకడుగు వేస్తున్నట్టుగా 'భారతీయ రిజర్వు బ్యాంక్' (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. భారత్ రేటింగ్ 'అత్యధిక ప్రమాదకరం' (బీఏఏ) స్థాయికి చేరడం, ఫలితంగా అధిక మొత్తంలో మూలధనాన్ని పక్కపెట్టుకావాల్సి ఉండడం తదితర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ శాఖలను తెరవడం ఏ మాత్రం లాభసాటి కాదని విదేశీ బ్యాంకుల భావిస్తున్నట్టుగా రాజన్ తెలిపారు. ఇక్కడి స్థానిక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 'వై బ్యాంక్స్' అనే అంశంపై మార్షల్ లెక్చర్ 2015-16' అందించారు. ఆర్థిక సంక్షోభం పరిస్థితుల తరువాత కేంద్ర బ్యాంకులు ఆయా బ్యాంకులను అధిక మొత్తంలో మూలధనాల్ని పక్కన పెట్టుకొని వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాలని కోరుతున్నాయని.. ఈ నేపథ్యంలో అధిక మొత్తంలో నిధులను భారత్లో పక్కనపెట్టి ఫబ్యాంకింగ్ నిర్వహించడం లాభదాయకం కాదని విదేశీ బ్యాంకులు భావిస్తున్నట్టుగా ఆయన వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 3, Oct 2019, 6:03 PM IST
Highlights
దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలు ఎంకరేజ్ చేసి చిన్న చిత్రాలను విడుదల చేస్తూండటంతో ఉత్సాహంగా కొత్త కాన్సెప్టులతో సినిమా లు చేస్తున్నారు యంగ్ ఫిల్మ్ మేకర్స్. అలా ఓ విభిన్న కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’.
దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలు ఎంకరేజ్ చేసి చిన్న చిత్రాలను విడుదల చేస్తూండటంతో ఉత్సాహంగా కొత్త కాన్సెప్టులతో సినిమా లు చేస్తున్నారు యంగ్ ఫిల్మ్ మేకర్స్. అలా ఓ విభిన్న కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. దిల్ రాజు విడుదల చేస్తున్న ఈ సినిమా.. ఈ జనరేషన్లో ఉన్నకులం సమస్యను ఎంటర్ టైనింగ్గా ప్రస్తావించినట్లు చెప్తున్నారు. కులం ఓ లవ్ స్టోరీలో సమస్యను ఎలా సృష్టించిందో ఫన్ గా చెప్పారని తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ని చూస్తే అర్దమవుతోంది.
సినిమా వివరాల్లోకి వెళితే...రాకేశ్ వర్రే హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. గార్గేయి యల్లాప్రగడ హీరోయిన్ గా నటించారు. బసవ శంకర్ దర్శకత్వంలో క్రేజీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమా ఈనెల 22న విడుదలకానుంది.
రాకేశ్ వర్రే మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత తరంలో ఉన్న సమస్యను బసవ శంకర్గారు వినోదాత్మకంగా హ్యాండిల్ చేశారు.సినిమా మొదటి నుంచీ చివరి వరకూ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ శర్మ, కెమెరా: విజయ్ జె.ఆనంద్. | 0business
|
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
First Published 4, Jul 2017, 4:36 PM IST
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
దీక్షా పంత్ ఫోటో గ్యాలరీ
Recent Stories | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మళ్లీ వాయిదా: ‘టాక్సీవాలా’ వెనక్కి.. మాస్ రాజా ముందుకు
‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్గా రయ్ మంటూ దూసుకొచ్చిన విజయ్కి ‘నోటా’ చిత్రం పరాజయంతో బ్రేక్ పడినట్టయ్యింది. అయితే టాక్సీవాలా చిత్రంతో టాప్ గేర్లో పాత స్పీడ్ను అందుకునేందుకు ‘టాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Samayam Telugu | Updated:
Nov 4, 2018, 01:20PM IST
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ విడుదలకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్గా రయ్ మంటూ దూసుకొచ్చిన విజయ్కి ‘నోటా’ చిత్రం పరాజయంతో బ్రేక్ పడినట్టయ్యింది. అయితే ‘టాక్సీవాలా’ చిత్రంతో టాప్ గేర్లో పాత స్పీడ్ను అందుకునేందుకు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
రాహుల్ సంకృత్యాన్ అనే నూతన దర్శకుడితో.. జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రం ‘గీతా గోవిందం’ ముందే విడుదల కావాల్సి ఉండగా.. పలు వాయిదాల అనంతరం నవంబర్ 16న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు అఫీషియల్గా ప్రకటించారు. అయితే మరోసారి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూ.. కొత్త విడుదల తేదీని ప్రకటించారు. విజయ్ వెనక్కి తగ్గటానికి మాస్ రాజా రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రమే కారణం. | 0business
|
Dec 28,2018
నెలాఖరుకు రూ.28,615 కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీల) కొత్త జవసత్వాలను నింపేందుకు వీలుగా ప్రతిపాదించిన మూలధనీకరణ కార్యక్రమాన్ని సర్కారు వేగవంతం చేయనుంది. ఈ నెలాఖరు నాటికి పీఎస్బీలకు దాదాపు రూ.28,615 కోట్ల మేర మూలధన సాయం అందించేందుకు గాను రంగం సిద్ధం చేసినట్టుగా ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం తాజాగా అందించనున్న మూలధన సాయంలో దాదాపు రూ.2,159 కోట్లు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, రూ.1,678 కోట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, రూ.10,086 కోట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, రూ.3056 కోట్లు యూకో బ్యాంక్కు, రూ.5500 కోట్లు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్నకు, రూ.4,498 కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రనకు, రూ.1,638 కోట్లు సిండికేట్ బ్యాంక్నకు మూలధన సాయంగా అందనుందని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి ముగింపు నాటికి దాదాపు మరో రూ.83,000 కోట్ల మేర నిధులను ప్రభుత్వం బ్యాంకులకు అందజేయనుందని.. దీంతో పీఎస్బీలకు ఉద్దేశించిన మూలధన సాయం రూ.1.06 లక్ష కోట్లకు చేరనుందంటూ ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను మరో రూ.41,000 కోట్ల మేర అదనపు వ్యయానికి ప్రభుత్వం పార్లమెంట్ అనుమతి కోరిన విషయం తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రంజుగా ప్లేఆఫ్ రేసు.. ఐదింటిలో అర్హత సాధించే రెండు జట్లేవి?
పంజాబ్పై ముంబై గెలుపొందడంతో.. ప్లేఆఫ్ రేసు ఉత్కంఠగా మారింది. రెండు స్థానాల కోసం ముంబై, కోల్కతా, పంజాబ్, రాజస్థాన్, బెంగళూరు జట్లు పోటీ పడుతున్నాయి.
Samayam Telugu | Updated:
May 18, 2018, 11:02AM IST
బుధవారం రాత్రి పంజాబ్తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో ముంబై గెలుపొందడంతో ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఈ విజయంతో రోహిత్ సేన పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరగా.. పంజాబ్ ఆరో స్థానానికి పడిపోయింది. ముంబైతోపాటు రాజస్థాన్, పంజాబ్ల ఖాతాలోనూ 12 పాయింట్లే ఉన్నప్పటికీ.. మెరుగైన రన్రేట్ ఉండటంతో డిఫెండింగ్ ఛాంపియన్స్ టాప్-4లోకి వెళ్లింది.
కోల్కతా జట్టు 14 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచినప్పటికీ.. ఆ జట్టు ఇంకా ప్లేఆఫ్ చేరలేదు. 50 మ్యాచ్లు పూర్తయినా.. సన్రైజర్స్, సూపర్ కింగ్స్ మాత్రమే ప్లే ఆఫ్ చేరాయి. మిగతా రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. తదుపరి దశకు చేరుకోవడానికి ఈ జట్లు ఎలా ఆడాలో చూద్దాం.
Updated: చదవండి: ఐదు మ్యాచ్లు.. ఐదు జట్లు.. ప్లేఆఫ్ చేరే రెండు జట్లేవి?
ముంబై ఢిల్లీపై గెలిస్తే..
ముంబై జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్పై గెలిస్తే.. 14 పాయింట్లతో లీగ్ దశను ముగిస్తుంది. ఒకవేళ ఢిల్లీ చేతిలో ఓడినా.. పంజాబ్ ఆఖరి మ్యాచ్లో చెన్నై చేతిలో ఓడటంతోపాటు సన్రైజర్స్ చేతిలో ఆర్సీబీ, రాజస్థాన్ ఓడాలి. అలా జరిగితే ముంబై, పంజాబ్, బెంగళూరు, రాజస్థాన్ జట్లు 12 పాయింట్లతో లీగ్ దశను ముగిస్తాయి. మెరుగైన నెట్ రన్రేట్ ఆధారంగా డిపెండింగ్ ఛాంపియన్ ప్లేఆఫ్కు అర్హత సాధిస్తుంది.
పంజాబ్ ప్లే ఆఫ్ చేరాలంటే..
పంజాబ్ జట్టు ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో చెన్నైపై గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు చేరతాయి. అదే సమయంలో ఢిల్లీ ముంబైని ఓడించడంతోపాటు.. సన్రైజర్స్, రాజస్థాన్ చేతుల్లో బెంగళూరు ఓడాలి. మిగతా మూడు జట్లు 12 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. పంజాబ్ ప్లేఆఫ్ చేరుతుంది.
రాజస్థాన్ టాప్-4లో నిలవాలంటే..
రహానే నాయకత్వంలోని రాజస్థాన్ చివరి మ్యాచ్లో బెంగళూరుపై గెలిచి.. ముంబై చివరి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడితే.. ఆ జట్టు ప్లేఆఫ్ చేరుతుంది.
బెంగళూరు.. రెండు మ్యాచ్లూ గెలవాల్సిందే..
పంజాబ్పై భారీ తేడాతో గెలుపొందిన బెంగళూరు నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకుంది. గురువారం సన్రైజర్స్పై, శనివారం రాజస్థాన్పై గెలిస్తే.. కోహ్లి సేన ఖాతాలో 14 పాయింట్లు చేరతాయి. అదే సమయంలో ముంబై లేదా కోల్కతా జట్లలో ఒకటి లేదా ఆ రెండు జట్లు తమ చివరి మ్యాచ్ల్లో ఓడాలి.
కోల్కతా ప్లేఆఫ్ చేరాలంటే..
ముంబై జట్టు పంజాబ్పై గెలవడంతో కోల్కతా పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది. సన్రైజర్స్తో శనివారం జరిగే చివరి మ్యాచ్లో గెలిస్తే 16 పాయింట్లతో ఆ జట్టు ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ చివరి మ్యాచ్లో ఆ జట్టు ఓడి.. ముంబై, బెంగళూరు జట్లు తదుపరి మ్యాచ్ల్లో గెలిస్తే మాత్రం రన్రేట్ మెరుగ్గా లేని కోల్కతా కథ ముగిసినట్టే. | 2sports
|
Suresh 99 Views SBI
ముంబాయిః స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తమ బ్యాంకులోని సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేట్లను 0.5 శాతం తగ్గించింది. ఇది నేటినుంచి అమల్లోకి వచ్చింది. కోటి రూపాయిల వరకూ ఉన్న ఖాతాలకు 3.5 శాతం వడ్డీని చెల్లిస్తుంది. గతంలో ఇది 4 శాతంగా ఉంది. కోటి రూపాయిలకంటే ఎక్కువ ఉంటే 4 శాతం వడ్డీని చెల్లించనున్నట్లు బ్యాంకు పేర్కొంది. | 1entertainment
|
Priyanka Chopra voted 'Sexiest Asian Woman' in UK poll
సెక్సీయెస్ట్ ఏషియన్ ఉమన్గా ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా బాలీవుడ్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తన హవా చాటుకుంటోంది.
TNN | Updated:
Dec 10, 2015, 07:24PM IST
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా బాలీవుడ్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తన హవా చాటుకుంటోంది. నటిగా బిజీగా వుంటూనే అవకాశం దొరికినప్పుడల్లా గాయనిగానూ తనని తాను నిరూపించుకుంటున్న ప్రియాంక చోప్రా గ్లామర్లోనూ తానే నెంబర్ 1 అని ప్రపంచానికి చాటుకుంటోంది. తాజాగా లండన్కి చెందిన ఈస్టెర్న్ ఐ అనే వీక్లీ న్యూస్ పేపర్ నిర్వహించిన ' పాపులర్ 50 సెక్సీయెస్ట్ ఏషియన్ ఉమెన్ పోల్ 'లో ప్రియాంకనే నెంబర్ 1గా నిలిచి సెక్సీయెస్ట్ ఏషియన్ ఉమన్ టైటిల్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ఈస్టెర్న్ ఐ నిర్వహించిన ఈ పోలింగ్లో ప్రియాంకకి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపించింది. ఆ ఫ్యాన్ ఫాలోయింగే ఆమెని సెక్సీయెస్ట్ ఏషియన్ ఉమన్ని చేసింది. అమెరికన్ టెలివిజన్ థ్రిల్లర్ క్వాంటికోతోపాటు తన మ్యూజిక్ ఆల్బమ్స్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకుంది ప్రియాంకాచోప్రా. అందుకు నిదర్శనమే ఈ విజయం. ఎందుకంటే ఈ పోలింగ్లో ప్రియాంకాకి ఓటు వేసిన వారిలో ఆసియాకి చెందినవారికన్నా ఇతరులే ఎక్కువున్నారు. తన టాలెంట్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకోవడం వల్లే ఆమెకి ఈ గెలుపు సాధ్యపడిందని ఈస్టెర్న్ ఐ వీక్లీ న్యూస్ పేపర్ ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ అస్జద్ నజీర్ అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే తనకి ఓటు వేసిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంకా చోప్రా.. ఓ ఏడాదిపాటు 'సెక్సీయెస్ట్ ఏషియన్ ఉమన్' టైటిల్ని ఆస్వాదించొచ్చన్నమాట అంటూ ఆనందం వ్యక్తంచేసింది. | 0business
|
28 ఏళ్ల క్రితం ఇదే రోజున!
Highlights
ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ 'మహానటి'. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది
ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ 'మహానటి'. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇండస్ట్రీకు చెందిన ప్రతి ఒక్కరు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఒక విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సరిగ్గా 28 ఏళ్ల క్రితం ఇదే రోజున 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా విడుదలైందని వెల్లడించారు. పెద్ద సినిమా తీశామనే ఆనందం ఒక వైపు ఎలా ఆడుతుందనే భయం మరోవైపు. అదే సమయంలో భారీ వర్షం. ఆ వరద ఎప్పుడు ఆగుతుందనే ఎదురుచూపు.
ఎట్టకేలకు సాయంత్రం నుండి జనాలు సినిమాకు రావడం మొదలుపెట్టారు. మా దత్(అశ్వనీదత్) గారికి ఆరోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికీ మర్చిపోలేదు. అదే రోజున నేడు మహానటి విడుదలైంది. అప్పుడు జగదేకవీరుడు అతిలోక సుందరి నిర్మించాలంటే ఎంత ధైర్యం కావాలో ఇప్పుడు మహానటి చేయడానికి కూడా అంతే ధైర్యం కావాలి. సావిత్రి గారి చరిత్రను తరతరాలకు అందించిన వైజయంతి మూవీస్ కు ధన్యవాదాలు. కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో జీవించింది. దుల్కర్ నటన అద్భుతం, నాగ్ అశ్విన్ కు చిత్రబృందానికి అభినందనలు అని తెలిపారు.
Last Updated 9, May 2018, 7:35 PM IST | 0business
|
న్యూజిలాండ్ 153/8 (20 ఓవర్లు)
ఇంగ్లండ్ 159/3 (17.1 ఓవర్లు)
78 పరుగులతో రాయ్ సత్తా
సెమీఫైనల్ వద్ద నిలిచిన న్యూజిలాండ్
న్యూఢిల్లీ : వరల్డ్ టి20 టోర్నీ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ విజయం సాధించి ఫైనల్కు చేరింది.కాగా టాస్ గెలిచి ఇంగ్లండ్ మొడట న్యూజిలాండ్ను బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరింది.దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.అనంతరం ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేయగంతో న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా న్యూజిలాండ్ ఆదిలోనే విధ్వంసకర ఆటగాడు గుప్తిల్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ సమయంలో విలియమ్సన్ 28 బంతులు ఆడి 3 బౌండరీలు,1 సిక్సర్తో 32 పరుగులు,మున్రో 32 బంతులు ఆడి 7 బౌండరీలు 1 సిక్సర్తో మెరుగ్గా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు.కాగా జోడి రెండవ వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో న్యూజిలాండ్ పది ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. అయితే కోరీ అండర్సన్ 28 పరుగులు మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు.దీంతో న్యూజిలాండ్ గౌరవ ప్రదమైన స్కోరుకు పరిమితమైంది.ఇంగ్లండ్ బౌలర్లలలో బెన్ స్టోక్స్ మూడు వికెట్లు సాధించగా,విల్లే,జోర్డాన్,ప్లంకెట్,మొయిన్ అలీలకు ఒక్కొక్కరికి ఒక వికెట్ లభించింది.
చెలరేగిన ఇంగ్లండ్
న్యూజిలాండ్ తరువాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ చెలరేగిపోయింది.ఒకవైపు జానస్ రాయ్ తనదైన శైలిలో దూకుడును ప్రదర్శిస్తే,అతనికి అలెక్స్ హేల్స్ 20 సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు.కాగా ఈజోడి 8.2 ఓవర్లలో తొలి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ పటిష్ట స్థితికి చేరింది.ఇదే క్రమంలో జానస్ రాయ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కాగా జట్టు స్కోరు 110 పరుగుల వద్ద ఉండగా రాయ్,మోర్గాన్లు వరుస బంతుల్లో ఔట్ కావడంతో ఇంగ్లండ్ కొంత తడబడినట్లు కనబడింది.ఆ తరువాత జో రూట్ 22 బంతుల్లో 3 బౌండరీలతో 27 పరుగులు,బట్లర్ 17 బంతుల్లో 2 బౌండరీలు,3 సిక్సర్లతో 32 పరుగులతో దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ 17 బంతులు ఉండగానే విజయాన్ని సాధించింది. దీంతో టి20 ఫార్మట్ వరల్డ్ కప్లో తొలిసారి ఫైనల్కు చేరాలన్న కివీస్ ఆశలు తీరలేదు. | 2sports
|
FUNDS
రిటైల్ ఇన్వెస్టర్లకు ఫండ్ గేలం
ముంబయి, ఆగస్టు 18: ఈఫండ్లో నాలుగు లక్షలు పెట్టుబడిపెట్టండి 15 ఏళ్ల తర్వాత కోటిరూపాయలు అవడం ఖాయం అంటూ ఫండ్సంస్థలు భారీగా ఆఫర్లు జారీచేస్తున్నాయి. ఇన్వెస్టర్లను మరింతగా ఊరించేందుకు ఫండ్స్ పెట్టుబడులపై అవగాహనపెంచేందుకు తమవంతుగా భారీ యత్నాలు చేస్తున్నాయి. రిలయన్స్ బ్యాంకింగ్ ఫండ్ నిర్వహణ ఆస్తులు జూన్ చివరినాటికి 2816 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. రిలయన్స్మ్యూచువల్ఫండ్ గడచిన 2003 మే 26వ తేదీ ప్రారంభించింది. 2003లో ఈఫండ్లో పెట్టుబడులు పెట్నివారికి 15ఏళ్లలోపే వారికి కోటి రూపాయలు వచ్చే రిటర్నులను చూపుతున్నట్లు చెపుతోంది. రిలయన్స్బ్యాంకింగ్ ఫండ్ నికర ఆస్తులవిలువ రూ.10 నుంచి 263.24రూపాయలకు పెరిగింది. ఈనెల 4వ తేదీ నాటికి విలువలు భారీగాపెరిగాయి.
సంఘటిత వృద్ధి 14ఏళ్లలో 25.52శాతంగా ఉంది. దీన్నిబట్టి చూస్తే ఇన్వెస్టర్ల సంపద ప్రతి 2.8 సంవత్సరాలకు రెట్టింపుగా మారింది. రిలయన్స్ బ్యాంకింగ్ఫండ్ బ్యాంకింగ్, ఆర్థికరంగ సేవలకోసం కేటాయించినఫండ్గా చెపుతుంది. ఓపెన్ ఎండెడ్ ఈక్విటీఫండ్గాను ఎలాంటిప్రవేశం, నిష్క్రమణలపై ఆంక్షలు లేవు. క్రియాశీలక ఫండ్ యాజమాన్యం ద్వారా ఈ ఫండ్ భారీ రిటర్నులు సాధిం చడమే లక్ష్యంగా పేర్కొంది. ఈఫండ్కు నిఫ్టీ500 బ్యాంక్స్ సూచీ ని 450 బేసిస్ పాయింట్లకుపైబడి అధిగమించింది. బ్యాంకింగ్ ఆర్ధికరంగ సేవల రంగం భారత్లో ఇప్పటివరకూ అత్యుత్తమంగా రిటర్నులు సాధిస్తున్న రంగాలుగా నిలిచాయి. ప్రభుత్వపరంగా ఆర్థికచేకూర్పు ఈ రంగాలను మెరుగుపరిచింది. అసంఘటితరంగ రుణపరపతి నుంచి సంఘటితరంగ రుణపరపతివైపు అనేకమంది మరలుతున్నారు.
బంగారం, రియల్ఎస్టేట్లనుంచి రాబడులు తగ్గిపోవడంతో మరింత ఎక్కువమంది దేశీయంగా ఇన్వెస్టర్లు ఆర్ధికపొదుపులు మరింతగా పొందేందుకు ఫండ్స్పెట్టుబడులకు ఆకర్షి తులవుతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఫండ్లో అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూటులో మధ్యకాలిక స్థాయినుంచి దీర్ఘకాలిక సంపదను సృష్టించేందుకు పెట్టుబడులు పెడుతున్నారు. వాల్యూరీసెర్చి వెబ్సైట్ అంచనా లను చూస్తే నెలసరి సిప్లో వెయ్యిరూపాయలు ఇ ఫండ్లో పెట్టుబడులుపెట్టినపక్షంలో 2003 మే 28వ తేదీన ఈ పెట్టుబడులు కాస్తా 2018జూలై 28వ తేదీనాటికి 1.71 లక్షలుగా మారతాయి.
కనీసమొత్తంగా రూ.9.6లక్షలు గా ఉంటుంది. 22శాతం సంఘటిత వృద్ధి ఉంటుందని అంచనా. సెక్టార్ఫండ్స్ హైరిస్క్ కేటగిరీలోను, ఎక్కువ రిటర్నుల కేటగిరీల్లో ఉన్నాయి. ఒకనిర్దిష్టమైన రంగంలో ఫండ్స్ పనితీరు మెరుగ్గా ఉంటే పటిష్టమైన రిటర్నులు ఇస్తుంది. రెగ్యులర్గా ఉండే ఫండ్స్కంటే కొంత రిస్క్ అనిపించినా ఈ ఫండ్స్లో ధైర్యంచేసి పెట్టుబడులు పెడితే భారీ రిటర్నులు సాధించేందుకు అవకాశాలు మెండు అని ఇన్వెస్టర్లకు ఫండ్ మేనేజర్లు గేలం వేస్తున్నారు. | 1entertainment
|
బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలి: విత్తమంత్రి
న్యూఢిల్లీ (ఏజెన్సీ)| PNR| Last Modified శనివారం, 5 జనవరి 2008 (16:48 IST)
బ్యాంకులు తమ ఆస్తుల విలువను బేరీజు వేసుకుని డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఛైర్పర్సన్స్తో న్యూఢిల్లీలో జరిగిన త్రైమాసిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... బ్యాంకు డిపాజిట్లు మరియు రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు తాను కోరుకుంటున్న మేరకు తగ్గుతాయే లేదో చెప్పలేమని చిదంబరం పేర్కొన్నారు.
వడ్డీ రేట్లు తగ్గించే ముందు... బ్యాంకులు ఆస్తులు మరియు అప్పులను బేరీజు వేసుకోవాల్సి ఉందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం అనుకూలంగా ఉంటే వడ్డీరేట్లు మధ్యకాలికంగా నిలకడ మరియు తగిన స్థాయిలో ఉండవచ్చన్నారు. వడ్డీరేట్లు తగ్గించినప్పటికీ డిపాజిట్ల వృద్ధి సంతృప్తికరంగానే ఉందన్నారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
First Published 13, Oct 2018, 1:23 PM IST
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
వెస్టిండీస్, ఇండియా టెస్టు తొలి రోజు ఆట (ఫొటోలు)
Recent Stories | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
పీఎన్బీ కేసులో సీబీఐ ఛార్జిషీట్
పీఎన్బీ కేసులో సుదీర్ఘ దర్యాప్తు జరిపిన తరువాత, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం బ్యాంకు మోసంలో తమ ప్రమేయం ద్వారా భారతీయ చట్టాన్ని ఉల్లఘించారని ఆరోపిస్తూ సీనియర్ బ్యాంక్ ఉద్యోగులపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది
Samayam Telugu | Updated:
May 15, 2018, 12:12PM IST
పీఎన్బీ కేసు
పీఎన్బీ కేసులో సుదీర్ఘ దర్యాప్తు జరిపిన తరువాత, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం బ్యాంకు మోసంలో తమ ప్రమేయం ద్వారా భారతీయ చట్టాన్ని ఉల్లఘించారని ఆరోపిస్తూ సీనియర్ బ్యాంక్ ఉద్యోగులపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.సీబీఐ అధికారులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి) లో 2 బిలియన్ డాలర్ల మోసానికి సంబంధించి సోమవారం సీనియర్ బ్యాంకు అధికారులపై ఆరోపణలు చేసింది.
దేశ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మోసం కేసులో కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి అలహాబాద్ బ్యాంక్ సీఈవో ఉషా అనంత సుబ్రమణియన్తో పాటు పీఎన్బీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటు దిశగా ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్లకి ఉన్న ఆర్థికపరమైన, ఎగ్జిక్యూటివ్పరమైన అధికారాలకు పీఎన్బీ బోర్డు కత్తెర వేసింది.
పీఎన్బీ కేసు
ఇదే తరహాలో పీఎన్బీ మాజీ చీఫ్ కూడా అయిన ఉషా అనంత సుబ్రమణియన్ అధికారాలను కూడా తొలగించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అలహాబాద్ బ్యాంకు బోర్డుకు ప్రభుత్వం సూచించినట్లు కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఆయా బ్యాంకుల బోర్డుల నుంచి డైరెక్టర్ల తొలగింపునకు నిర్దిష్ట ప్రక్రియ ఉంటుందని, ప్రస్తుతం ఆ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన వివరించారు.
ప్రభుత్వ నామినీ డైరెక్టర్ సూచనల ప్రకారం సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించిన పీఎన్బీ బోర్డు.. ఇద్దరు ఈడీలకు ఉన్న అధికారాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉషా అనంతసుబ్రమణియన్ విషయంలో ఒకట్రెండు రోజుల్లో అలహాబాద్ బ్యాంకు బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రూ.13,000 కోట్ల పీఎన్బీ స్కామ్కు సంబంధించి సీబీఐ తొలి చార్జిషీటు దాఖలు చేసిన గంటల వ్యవధిలోనే కేంద్రం ఈ చర్యలు ప్రకటించడం గమనార్హం. అలహాబాద్ బ్యాంక్ ప్రస్తుత సీఈవో, ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్.. 2015 నుంచి 2017 దాకా పీఎన్బీ చీఫ్గా వ్యవహరించారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Sep 30,2017
రద్దుతో రూ.5,400 కోట్లు వెలుగులోకి..
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు కారణంగా దాదాపు రూ.5,400 కోట్ల మేర పన్ను పరిధిలో చూపని నగదు వెలుగులోకి వచ్చినట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కూడా 15.7 శాతం మేర పెరిగి రూ.3.7 లక్షల కోట్లకు చేరినట్టుగా ఆయన వివరించారు. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు 14.5 శాతం మేర పెరిగి రూ.8,49,818 కోట్లకు చేరువయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఆర్థిక శాఖ కన్సెల్టేటివ్ కమిటీ ఏర్పాటుచేసిన 'ఇనిషేటివ్స్ ఆఫ్ ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్' అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఇటీవలి కాలంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య విశేషంగా పెరిగిందని అన్నారు. 2012-13లో 4.72 కోట్లుగా ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2016-17 నాటికి 6.26 కోట్లకు చేరిందని అన్నారు. నోట్లరద్దు అమలులో ఉన్న సమ యంతో దాదాపుగా అనుమానితులపై 1,100 దాడులు నిర్వహించి రూ.610 కోట్ల మేర నగదును సీజ్ చేసినట్టుగా వివరించారు. దాదాపు 400 కేసులను నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ కేసులను ఈడీ, సీబీఐలకు విచారణ నిమిత్తం అప్పగించామని అన్నారు. గడిచిన రెండేండ్ల కాలంలో పన్ను ఆదాయం పెంచడంలో ఐటీ శాఖ అధికారుల కృషిని ఆయన ప్రశంసించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రోహిత్ ‘డబుల్’ ధమాకా.. లంక చిత్తు
ధర్మశాల వన్డేలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియా మళ్లీ పుంజుకుంది. ఎంతలా అంటే ఎవరూ ఊహించని
TNN | Updated:
Dec 13, 2017, 07:23PM IST
ధర్మశాల వన్డేలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియా మళ్లీ పుంజుకుంది. ఎంతలా అంటే ఎవరూ ఊహించని విధంగా.. అందరూ చర్చించుకునేలా సిరీస్‌లో కదం తొక్కింది. తొలి వన్డే గెలుపుతో విర్రవీగిన శ్రీలంక బౌలర్లని కనికరం లేకుండా కెప్టెన్ రోహిత్ శర్మ (208 నాటౌట్: 153 బంతుల్లో 13x4, 12x6) డబుల్ సెంచరీతో తొలుత ఉతికారేయగా.. అనంతరం బౌలర్లు ఆ జట్టు బ్యాట్స్‌మెన్ల పనిపట్టారు. దీంతో మొహాలి వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో 141 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్ మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసి.. సిరీస్‌ ఆశలు నిలుపుకుంది. ఇక విజేత నిర్ణయాత్మక మూడో వన్డే విశాఖపట్నం వేదికగా ఆదివారం జరగనుంది. జట్టులో రోహిత్ శర్మతో పాటు శ్రేయాస్ అయ్యర్ (88: 70 బంతుల్లో 9x4, 2x6), శిఖర్ ధావన్ (68: 67 బంతుల్లో 9x4) అర్ధశతకాలు సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో టీమిండియా బౌలర్ల ధాటికి శ్రీలంక 251/8కే పరిమితమైంది.
రోహిత్ శర్మ విధ్వంసంతో భారత్ ఇన్నింగ్స్‌ ముగిసే సరికే మానసికంగా కుంగిపోయిన శ్రీలంక జట్టు 393 పరుగుల భారీ లక్ష్య ఛేదన‌లో ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆ జట్టులో మాజీ కెప్టెన్ మాథ్యూస్ (111 నాటౌట్: 132 బంతుల్లో 9x4, 3x6) ఒంటరి పోరాటం చేసినా.. అతనికి సహకారం అందించేవారు కరవయ్యారు. భారత్ బౌలర్లు చాహల్ (3/60), బుమ్రా (2/43) ధాటికి ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. గుణతిలక (16), ఉపుల్ తరంగ (7), తిరుమానె (21) జట్టు స్కోరు 100 దాటే లోపే పెవిలియన్ చేరిపోగా.. డిక్విల్లా (22), కెప్టెన్ తిసార పెరీరా (5) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకుని జట్టుని మరింత ఒత్తిడిలోకి నెట్టేశారు. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
World Cup 2019: ప్రపంచ కప్ సవాళ్లకు మేం రె‘ఢీ’: శిఖర్ ధావన్
తాజా ఐపీఎల్లో రాణించిన బ్యాట్స్మెన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్, టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఒకడు. 16 మ్యాచ్లాడిన ధావన్.. 521 పరుగులు సాధించి ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
Samayam Telugu | Updated:
May 14, 2019, 07:58PM IST
హైలైట్స్
ఐపీఎల్ 12 సీజన్లో నిలకడగా రాణించిన ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్
పృథ్వీ షాతో ఎలా ఆడానో, రోహిత్ శర్మతో కూడా అదే తీరుగా ఉంటాను
ప్రపంచ కప్ కోసం మంచి జట్టుతో సిద్ధంగా ఉన్నాం: భారత ఓపెనర్ ధావన్
దాదాపు రెండు నెలలపాలు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 12వ సీజన్ ఆదివారం ముగిసింది. పొట్టి క్రికెట్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్కు అలవాటు పడేందుకు క్రికెటర్లకు కాస్త టైమ్ పడుతుంది. అయితే టీ20 నుంచి వన్డే క్రికెట్కు మారేందుకు అంతగా శ్రమించాల్సిందేమీ లేదని శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు.
తాజా ఐపీఎల్లో రాణించిన బ్యాట్స్మెన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్, టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఒకడు. 16 మ్యాచ్లాడిన ధావన్.. 521 పరుగులు సాధించి ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అయితే ఢిల్లీ తరఫున పృథ్వీ షాతో ఓపెనింగ్ చేసిన తనకు టీమిండియాలో రోహిత్ శర్మతో కలిసి మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించడం ఇబ్బంది కాదన్నాడు. తరచుగా రోహిత్తో టచ్లో ఉంటారా అని అడిగిన ప్రశ్నకు.. ఎప్పుడూ టచ్లో ఉండటానికి రోహిత్ తనకేమీ భార్య కాదంటూ చమత్కరించాడు ‘గబ్బర్’. ఏ జట్టు విజయాలలో అయినా టాపార్డర్ ఆటగాళ్ల పరుగులు, ఫామ్ కీలకమని పేర్కొన్నాడు.
‘చాలా ఏళ్లుగా రోహిత్తో కలిసి ఆడుతున్నా. ఇప్పుడు ప్రత్యేకంగా రోహిత్ నా గురించి, నేను అతడి గురించి తెలుసుకోవాల్సిన పనిలేదు. ఆట అనేది మా ఇద్దరి మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకరు పరుగులు సాధిస్తున్నప్పుడు అవతలి బాట్స్మన్ స్ట్రైక్ రొటేస్ట్ చేస్తూ సహకరించాలి. మైండ్ సెట్ మార్చుకుంటే ఐసీసీ లాంటి కీలక టోర్నీల్లోనూ సులువుగా పరుగులు చేయవచ్చు. ఒత్తిడికి గురికాకుండా నా ఫెవరెట్ షాట్ ఆడేందుకు యత్నిస్తా. నిజం చెప్పాలంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు.
ఐపీఎల్ను మినహాయిస్తే ఆస్ట్రేలియాతో సిరీస్లోనూ రాణించాను. ఓ ఫార్మాట్ నుంచి మరో ఫార్మాట్కు మారేందుకు ఏ ఇబ్బంది లేదు. వన్డే ప్రపంచ కప్ కోసం సన్నద్ధమవుతున్నాం. ప్రస్తుతం భారత బౌలింగ్ అటాక్ బాగుందని మాజీలు చెబుతున్నారు. నిజానికి మా బౌలర్లు అందుకు అర్హులు. జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీతో పాటు హార్ధిక్ పాండ్యా ఉండటం అదనపు బలం. నాణ్యమైన స్పిన్నర్లున్నారు. నాతో పాటు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్మెన్లతో జట్టు ఇప్పుడు సమతూకంగా ఉంది.
Read: ధోని చిట్కాలు బెడిసికొట్టాయి: కుల్దీప్ యాదవ్
ప్రపంచ కప్ లాంటి కీలక టోర్నీలకు టాలెంట్తో పాటు అనుభవం అవసరమని నమ్ముతాను. అవసరమైన సమయాలలో మేం నలుగురం (కోహ్లీ, ధోనీ, రోహిత్, నేను) యువ ఆటగాళ్లకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకెళ్తాం. ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని’ శిఖర్ ధావన్ వివరించాడు. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.