news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కోహ్లి చిన్ననాటి కోచ్.. ఇప్పుడు ఢిల్లీ జట్టుకి..!
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ తాజాగా ఢిల్లీ అండర్-23 జట్టుకి కోచ్గా ఎంపికయ్యాడు
TNN | Updated:
Aug 28, 2017, 09:00PM IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ తాజాగా ఢిల్లీ అండర్-23 జట్టుకి కోచ్‌గా ఎంపికయ్యాడు. పశ్చిమ ఢిల్లీలోని క్రికెట్ అకాడమీలో శర్మ వద్దే కోహ్లి క్రికెట్ ఓనామాలు నేర్చుకున్నాడు. తదనంతరం కోహ్లి అండర్-19 జట్టుకి ఎంపికవడం.. కెప్టెన్‌గా జట్టుని విశ్వవిజేతగా నిలపడంతో టీమిండియా నుంచి పిలుపొచ్చింది.
ఢిల్లీ అండర్-23 జట్టుతో పాటు ఢిల్లీ రంజీ జట్టుకి కూడా కోచ్, సహాయ కోచ్‌లను నియమిస్తూ క్రికెట్ అఫైర్స్ కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గంభీర్‌తో గొడవపడి వార్తల్లో నిలిచిన రంజీ కోచ్ భాస్కర్‌ని తిరిగి కోచ్‌గా నియమించి కమిటీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏడాది వ్యవధిలో ఢిల్లీ జట్టు అటు రంజీల్లో, విజయ్ హజారే ట్రోఫీలోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంది. ఈ సమయంలో కోచ్ భాస్కర్ జట్టులోని యువ క్రికెటర్లని భయబ్రాంతులకి గురి చేస్తున్నాడని గంభీర్ ఆరోపించాడు. దీంతో ఇద్దరి మధ్య మీడియా వేదికగా పెద్ద గొడవైంది. | 2sports
|
స్మార్ట్ఫోన్ ఏ రూ.500!
- రూ.60-70 రీచార్జ్కే మేటి ఆఫర్లు
- 'ఫీచర్'ఫోన్ వాడకందారులే లక్ష్యం
- జియో పోటీ సంస్థల కొత్త ఎత్తుగడ
- చర్చల్లో ఎయిర్టెల్, ఐడియా. వొడా
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ టెలికాం రంగంలో పోటీ రానురాను మరింత తీవ్రతరం అవుతోంది. మార్కెట్లో గట్టి పోటీదారే లేకుండా చేసుకోవాలన్న వ్యూహంతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పావులు కదుపుతుంటే.. బరిలో నిలిచేందుకు పోటీ సంస్థలు కూడా శాయశక్తులా కృషి చేస్తున్నాయి. తమతమ వ్యూహాల్లో భాగంగా జియో సంస్థ ఇటీవల మార్కెట్లో తమ వాటాను పెంపొందించుకొనే వ్యూహంలో భాగంగా సబ్సిడీ ధరలకే 4జీ ఫీచర్ ఫోన్లను అందింస్తుండడం.. కేవలం రూ.49 నుంచి మొదలుకొని రూ.153ల స్వల్ప ధరల ప్లాన్లతో అపరిమిత కాలింగ్ సౌలభ్యం, 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను అందించే ఆకర్షణీయమైన పథకాలను తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోటీ సంస్థలైన ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థలు కూడా మార్కెట్లో పట్టు నిలుపుకొనేందుకు గాను త్వరలోనే రూ.500ల కంటే తక్కువ ధరకే 4జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేసే వ్యూహంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం ఆయా సంస్థలు మొబైల్ కంపెనీలతో చర్చిస్తున్నట్టు సమాచారం. అంతేగాక.. నెలకు రూ.60 నుంచి 70 రీఛార్జ్తోనే అధిక డేటా, వాయిస్ కాల్ ఆఫర్లను ఇవ్వాలని యోచిస్తున్నాయని తెలుస్తోంది.
ఎందుకంత తక్కువకంటే..
దేశంలో అత్యధిక జనాభా దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలలోనే ఉన్నారు. వీరు ఎక్కువగా మొబైల్ ఫోన్లను వాయిస్ కాల్స్ నిమిత్తమే వాడుతూ వస్తున్నారు. ఇందుకోసం 2జీ ఆధారితంగానే పని చేసే వాయిస్ సేవలను వీరు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దాదాపు 100 కోట్లకు పైగా ఉన్న మొబైల్ వాడకందారుల్లో వీరి వాటా సుమారు 65 నుంచి 70 కోట్ల వరకు ఉంది. టెలికాం రంగానికి మొత్తం వస్తున్న ఆదాయంలో దాదాపు సగం రెవెన్యూ ఈ ఫీచర్ఫోన్ వినియోగదారుల నుంచే వస్తుండడం విశేషం. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు సంపన్నులు ఇప్పటికే అత్యాధునిక టెలికాం సేవల నిమిత్తం స్మార్ట్ఫోన్లను వాడేస్తున్నారు. వేగవంతమైన డేటా నిమిత్తం వీరిలో చాలా మంది 4జీ సేవలకు అప్డేట్ అయిపోయారు కూడా. ఈ నేపథ్యంలో స్మార్ఫోన్ల వాడకందారుల మార్కెట్ గరిష్ట స్థాయికి విస్తరించింది. ఇకపై ఈ విభాగంలో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదు కావడానికి అవకాశం లేదు. దీంతో తాజాగా టెలికాం సంస్థలన్నీ ఫీచర్ ఫోన్ల వాడకందారుల వైపు దృష్టి సారిస్తున్నాయి. తక్కువ ధరకు మేటి ఫ్రీ వాయిస్ సేవలతో పాటు డేటా ఫీచర్లను కూడా రుచి చూపించి తమ మార్కెట్ను విస్తృత పరుచుకోవాలని టెలికాం సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన ఫీచర్ ఫోన్ను అందించేందుకు జియో సంస్థ ముందుకు రాగా.. తమ వినియోగదారులను కాపాడుకొనేందుకు ఇప్పుడు మిగతా టెలికాం సంస్థలు రూ.500ల కంటే తక్కువకే స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. తొలత జియో ఫోన్' పేరుతో రిలయన్స్ సంస్థ ఫీచర్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ.1500 సెక్యూరిటీ బాండ్తో పూర్తి ఉచితంగా ఈ ఫోన్ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దెబ్బతో ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ లాంటి ప్రముఖ టెలికాం కంపెనీలు కూడా బడ్జెట్ ఫోన్లపై దృష్టి సారించాయి. మొబైల్ తయారీ సంస్థలతో కలిసి రూ. 1500 కంటే తక్కువ ధరలోనే ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నాయి. అయితే తాజాగా రూ. 500కే 4జీ స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయట. ఇందుకోసం మొబైల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.న
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
2-0 తేడాతో ఆసీస్పై టీమిండియా ఘనవిజయం
టీమిండియా 184 /3 ( 20 ఓవర్లు)
ఆస్ట్రేలియా 157/8 ( 20 ఓవర్లు)
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టి20లో టీమిండియా విజయం సాధించింది. కాగా సమిష్టిగా పోరాటం చేయడంతో సిరీస్ భారత్కు దక్కింది.మొదట బ్యాటింగ్తో ఆకట్టుకున్న టీమిండియా అనంతరం బౌలింగ్,ఫీల్డింగ్లో కూడా బాగా ఆడి 27 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.టీమిండియా నిర్ధేశిత 185 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 157 పరుగులకే పరిమితమై పరాజయం పొందింది.దీంతో టీమిండియా 2-0 తేడాతో సిరీస్ను సాధించింది.ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ ఆరోన్ పించ్ 48 బంతులు ఆడి 8 బౌండరీలు,2 సిక్సర్లతో 74 పరుగులు మినహా ఎవరూ సరిగా ఆడలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా ఓడిపోయింది.షాన్ మార్ష్ 23 పరుగులు, లాయన్ 2 పరుగులు,మ్యాక్స్వెల్ 1 పరుగు,షేన్ వాట్సన్ 15 పరుగులు, ఫాల్కనర్ 10 పరుగులతో నిరాశపరిచారు. కాగా మొదటి వికెట్కు 94 పరుగులు జోడించిన ఆసీస్ ఆ తరువాత వరుసగా వికెట్లను చేజార్చుక్చుకుని ఆసీస్ ఓటమి చెందింది.టీమిండియా బౌలర్లలో జడేజా,బూమ్రాలకు ఒక్కొక్కరికి రెండు వికెట్లు లభించగా, అశ్విన్,పాండ్యా, యువరాజ్లకు ఒక్కొక్కరికి ఒక వికెట్ దక్కింది.
రోహిత్,ధావన్లతో భారీ ఇన్నింగ్స్…
టీమిండియా ఓపెనర్లు రోహిత్శర్మ,శిఖర్ ధావన్లతో భారీ ఇన్నింగ్స్ సాధ్యమైంది. టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.కాగా రోహిత్శర్మ,శిఖర్ ధావన్ తమదైన శైలిలో ఆస్ట్రేలియా బౌలర్లలపై విరుచుకుపడి భారీ ఇన్నింగ్స్ ఏర్పడటానికి సహకరించారు. ఓపెనర్ రోహిత్శర్మ 47 బంతులు ఆడి 5 బౌండరీలు,2 సిక్సర్లతో 60 పరుగులు చేయగా,మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 32 బంతుల్లో 3 బౌండరీలు,2 సిక్సర్లతో 42 పరుగులు చేశారు.కాగా ఈ జోడీ 97 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో మ్యాక్స్వెల్ బౌలింగ్ షాట్కు యత్నించి మొదటి వికెట్గా పెవిలియన్కు చేరాడు.అనంతరం ఫస్ట్ డౌన్లో వచ్చిన కోహ్లీ మొదట్లోనే ఆచితూచి ఆడినా తరువాత రెచ్చిపోయాడు.ప్రత్యేకంగా 14వ ఓవర్లో హేస్టింగ్ బౌలింగ్లో మూడు బౌండరీలు కొట్టిన కోహ్లీ తరువాత బోలాండ్ వేసిన ఓవర్లో సిక్స్ కొట్టి తన మార్క్ ఆటను చూపెట్టాడు.అయితే జట్టు స్కోరు 143 పరుగుల వద్ద అనవసర పరుగు కోసం యత్నించిన రోహిత్శర్మ రనౌట్గా ఔటయ్యాడు.అనంతరం ధోనీతో కలిసి కోహ్లీ 33 బంతుల్లో 7 బౌండరీలు,1 సిక్సర్తో 59 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.అదే ఊపును కొనసాగించి హాఫ్ సెంచరీ చేశాడు.ఇదిలా ఉండగా చివరి ఓవర్లో ధోనీ 14 పరుగులకు ఔటయ్యాడు.కాగా టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.ఆస్ట్రేలియాలో ఆసీస్పై 68 బంతుల్లో 100 పరుగులు నమోదు చేసిన రెండవ జట్టుగా టీమిండియా గుర్తింపు సాధించింది.కాగా 2013 బ్రిస్బేన్లో వెస్టిండీస్ 67 బంతుల్లో 100 పరుగులు సాధించింది. టి20 మ్యాచ్ మెల్బోర్న్ గ్రౌండ్లో భారత్ నమోదు చేసిన 184 పరుగులకే అత్యధిక స్కోరు.అంతకు ముందు 2008-09లో దక్షిణాఫ్రికా 182 పరుగులు చేసింది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
PSPK25..లొకేషన్ నుంచి ఇంకో ఫొటో!
యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న పవన్ కల్యాణ్ 25 వ సినిమాకు సంబంధించి
TNN | Updated:
Nov 16, 2017, 02:07PM IST
యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న పవన్ కల్యాణ్ 25 వ సినిమాకు సంబంధించి మరొ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే యూరప్ లోని లొకేషన్స్ నుంచి కొన్ని ఫొటోలు అప్ లోడ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఫొటోను విడుదల చేశారు.
షూటింగ్ కోసం అక్కడ ఉన్న హీరో పవన్ కల్యాణ్, హీరోయిన్ కీర్తి సురేష్, దర్శకుడు త్రివిక్రమ్, సినిమా ఇతర యూనిట్ ఉంది ఫొటోలో. పవన్ కల్యాణ్ పాతికవ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇంకా మిస్టరీగానే ఉన్నా, ఈ ఫొటోలు మాత్రం ఫ్యాన్స్ ను ఆనంద పెడుతున్నాయని వేరే చెప్పనక్కర్లేదు. | 0business
|
sumalatha 146 Views bse , NSE , stock market
Sensex
ముంబయి: ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 39 పాయింట్లు లాభపడి 37,350కి పెరిగింది. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 11,048 వద్ద స్థిరపడింది. కాగా నేటి మార్కెట్లో పవర్ గ్రిడ్, మారుతీ సుజుకీ, యస్బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడగా.. టీసీఎస్, వేదాంతా, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ను ముగించాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/telengana/ | 1entertainment
|
షాక్..! నయనతార ఇంట్లోనే డ్రగ్స్ అమ్ముతుందట
Highlights
నయనతార ఇంట్లోనే డ్రగ్స్ అమ్ముతుందట
లేడీ సూపర్స్టార్ నయనతార స్మగ్లర్ అవతారమెత్తారట. ఈ బ్యూటీ నటించిన చిత్రాలకిప్పుడు యమ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ చేతి నిండా అవకాశాలు ఉన్నాయి. మరిన్ని చిత్రాలు ఈ అమ్మడి కోసం వెయిటింగ్లో ఉన్నాయి. స్టార్ హీరోల చిత్రాలకు దీటుగా నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాలకు మార్కెట్ ఉంది. తన తాజా చిత్రంలో డ్రగ్స్ స్మగ్లర్గా ఈ అగ్ర నటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నది తాజా సమాచారం.
ఇటీవల అనిరుద్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ కొలమావు కోకిల చిత్రంలో నయనతార ఇంట్లోనే మాదక ద్రవ్యాలను విక్రయించే యువతిగా నటిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమె అలా డ్రగ్స్ స్మగ్లర్గా ఎందుకు మారారన్నది చిత్రంలో ఆసక్తికరమైన అంశంగా ఉంటుందని చెప్పారు. ఏదేమైనా కొలమావు కోకిల చిత్రం డార్క్ హ్యూమర్ కథా చిత్రంగా అందరికీ వినోదాన్ని పంచుతుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రం కోసం నటుడు శివకార్తీకేయన్ ఒక పాటను రాయడం విశేషం.
Last Updated 18, May 2018, 12:39 PM IST | 0business
|
ప్రపంచ ఆకర్షణీయ ఆర్థిక గమ్యస్థానంగా భారత్: పాటిల్
Hanumantha Reddy|
ప్రపంచ ఆర్ధిక మాంద్య ప్రభావం భారత్పై పరిమితంగా వుందని పేర్కొన్న భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ స్థిరంగా అధిక వృద్ధిని నమోదు చేస్తున్న భారత ఆర్ధికవ్యవస్థ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ఆదివారం తెలిపారు.
"భారత వృద్ధి పరస్పర లాభదాయకమైన అవకాశాలను సృష్టిస్తున్నది. 2003 నుంచి స్థిరంగా అధిక వృద్ధి రేటును నమోదుచేస్తున్న భారత ఆర్ధికవ్యవస్థపై ప్రపంచ ఆర్థిక మాంద్య ప్రభావం పరిమితంగానే ఉంది" అని ప్రతిభా పాటిల్ చెప్పారు.
మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ కుమార్తె, స్విట్జర్లాండ్లో భారత రాయబారి చిత్రా నారాయణ జెనీవాలో ఇచ్చిన విందులో పాల్గొన్న పాటిల్ మాట్లాడుతూ పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వ్యాపారానికి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని తెలిపారు.
భారత్ 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి భారత కంపెనీలు అంతర్జాతీయ పోటీని ఎదుర్కోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్రను వేయగల్గుతున్నాయని స్విట్జర్లాండ్లో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు సమాజంలో అన్ని వర్గాలు ప్రత్యేకించి పేద వర్గాలకు చేరాల్చివుందని ఈ సందర్భంగా ఆమె ఆకాక్షించారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
నేడే చూడండి: ఈవారం కొత్త సినిమాలు
ఈ శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు విడుదలయ్యాయి. మరి ఈ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద ఏయే సినిమాలు సందడి చేస్తున్నాయో ఒకసారి చూద్దాం...
TNN | Updated:
Aug 5, 2016, 01:05PM IST
ఈ శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు విడుదలయ్యాయి. మరి ఈ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద ఏయే సినిమాలు సందడి చేస్తున్నాయో ఒకసారి చూద్దాం.
తెలుగు..
శ్రీరస్తు శుభమస్తు: సినిమా శైలి - రొమాన్స్ ; నటీనటులు - అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి.
మనమంతా: సినిమా శైలి - ఫ్యామిలీ డ్రామా ; నటీనటులు - మోహన్ లాల్, గౌతమి, విశ్వంత్, అనీషా అంబ్రోస్
మరల తెలుపనా ప్రియా: సినిమా శైలి - రొమాన్స్ ; నటీనటులు - ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్
హిందీ..
బుదియా సింగ్: సినిమా శైలి - స్పోర్ట్స్, బయోగ్రఫీ ; నటీనటులు - మాస్టర్ మయూర్ మహేంద్ర, మనోజ్ బాజపాయ్, తిలోత్తమ
ఫీవర్: సినిమా శైలి - రొమాన్స్ , థ్రిల్లర్; నటీనటులు - రాజీవ్ ఖండేల్ వాల్, గౌహార్ ఖాన్, క్యాథరీనా, గెమ్మా అటిక్సన్
ద లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా: సినిమా శైలి - రొమాన్స్ ; నటీనటులు - అర్షద్ వర్శీ, అదితి రావ్
హై అప్నా దిల్ తో ఆవారా: సినిమా శైలి - కామెడీ ; నటీనటులు - సహిల్ ఆనంద్, నియతి జోషి
హాలీవుడ్..
సూసైడ్ స్క్వాడ్: సినిమా శైలి - యాక్షన్ ; నటీనటులు - విల్ స్మిత్, మార్గట్ రాబీ
జేసన్ బోర్నె: సినిమా శైలి - థ్రిల్లర్ ; నటీనటులు - మట్ డామన్, జూలియా స్టిలస్, అలిషియా వికాండర్. | 0business
|
ఛీ.. ఛీ...ఇంత ఘోరమైన బూతులా.. సిగ్గుతో తలదించుకునేల ఉంది (వీడియో)
Highlights
ఛీ.. ఛీ...ఇంత ఘోరమైన బూతులా.. సిగ్గుతో తలదించుకునేల ఉంది
ఈ మధ్య ఏ ప్రోగ్రామ్ చూసిన కుటుంబంతో కలిసి చూడలేని పరిస్థితి. జబర్ధస్త్ పటాస్ లాంటి ప్రోగ్రామ్ లు అయితే మరీను. వాళ్లు మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్ లకు హద్దు అదుపు లేకుండా పోతుంది. రీసెంట్ గా పటాస్ లో జరిగిన ఒక ఎపిసోడ్ లో నరేష్ ఫోన్లో సంబాదించే డైలాగ్స్ లో అతను మాట్లాడిన తీరు సిగ్గుపరిచేలా ఉంది. ఎన్నీ కేసులు పెట్టిన ఏమి చేసిన మా తీరు ఇంతే అనేలా ఉంది. | 0business
|
hmd global to launch nokia smartphones on april 4
నోకియా నుంచి మరో మూడు స్మార్ట్ఫోన్లు...!
హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ భారత్లో మరో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదలచేయనుంది. నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో, నోకియా 6 (2018) పేర్లతో ఈ ఫోన్లను వినియోగదారులకు అందించనుంది.
TNN | Updated:
Apr 1, 2018, 05:55PM IST
హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ భారత్లో మరో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదలచేయనుంది. నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో, నోకియా 6 (2018) పేర్లతో ఈ ఫోన్లను వినియోగదారులకు అందించనుంది. వీటితోపాటు 'నోకియా 8110' పేరుతో4జీ ఫీచర్ ఫోన్ను కూడా తీసుకురానుంది. ఏప్రిల్ 4న ఈ ఫోన్లను విడుదల చేయాలని సంస్థ నిర్ణయించింది. ఇక ఈ ఫోన్ల ధరల విషయానిక వస్తే... రూ.32 వేలకు 'నోకియా 7 ప్లస్', రూ.60వేలకు 'నోకియా 8 సిరోకో', రూ.20 వేలకు 'నోకియా 6 (2018)' ఫోన్లు లభ్యమయ్యే అవకాశం ఉంది.
నోకియా 7 ప్లస్ మోడల్లో.. 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు రానున్నాయి. ఈఫోన్.. 4 జీబీ ర్యామ్తో 64 జీబీ స్టోరేజ్తో రానుంది. 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఇవ్వనున్నారు. ఇందులో 3800 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.
నోకియా 8 సిరోకో మోడల్లో... 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు రానున్నాయి. ఈఫోన్.. 6 జీబీ ర్యామ్తో 128 జీబీ స్టోరేజ్తో రానుంది. 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఇవ్వనున్నారు. ఇందులో 3260 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.
నోకియా 6 (2018) మోడల్లో... 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు రానున్నాయి. ఈఫోన్.. 3/4 జీబీ ర్యామ్తో 32/64 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్ రానుంది. 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఇవ్వనున్నారు. ఇందులో 3000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. | 1entertainment
|
internet vaartha 111 Views
జెకె పేపర్స్ అధినేత సింఘానియా
ముంబై : భారత్లోని కాగిత పరిశ్రమకు 2030 నాటికి 90వేల కోట్ల పెట్టుబడులు అవసరంఅవుతాయని, ప్రస్తుతం గడచిన ఐదేళ్లుగా 20వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు అందినట్లు జెకెపేపర్స్ సీఎండి హర్షపతి సింఘానియా వెల్లడించారు. భారత్లో కాగితపరి శ్రమ ఏడుశాతం వార్షికవృద్ధితో ఉందని, ఇకపై సాలీనా నాలుగుశాతం పెరుగుతూ 2030 నాటికి 27 మిలియన్టన్నుల సామర్ధ్యానికి చేరుతుంద న్నారు. కాగితపరిశ్రమపై జరిగిన సదస్సులో ఆయన పలు వివరాలు వెల్లడించారు. కాగిత వినియోగం భారత్లో సగటున 11 కిలోలుమాత్రమే ఉందని, ఆసియాలో 26 కిలోలు, ప్రపంచ వ్యాప్తంగాచూస్తే 56కిలోలు తలసరి వినియోగం ఉందన్నారు. భారత్ లోని 50వేల కాగితపరిశ్రమ నాలుగులక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధిని అందిస్తున్నదని, 15 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. మేకిన్ఇండియాతోభారత్లో ప్యాకింగ్ రంగానికిమంచి ఊతంఇస్తుందని, ఎఫ్ఎంసిజి ఉత్ప త్తుల ప్యాకింగ్కు కాగితపరిశ్రమ కీలకమని అన్నారు. హెల్త్కేర్, రిటైల్ రంగపరంగాను, కౌంటర్ సేల్స్పరంగాను కాగిపరిశ్రమకు మద్దతు లభిస్తుం దన్నారు. ఇటీవలే భుజించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార ఉత్పత్తులకు కూడా ప్యాకింగ్ పేపర్బోర్డు ఎక్కువ అవసరంఅవుతుందని సింఘానియా వెల్లడించారు. ఇక ప్రింటింగ్, రాతపేపర్ ప్రస్తుతం ఉన్న 4.8 మిలియన్ టన్నుల నుంచి 2018-19 నాటికి 5.8మిలియన్ టన్నులకు చేరగలదని ఆయ న ధీమా వ్యక్తంచేసారు. ఈరంగం సాలీనా ఐదు శాతం చొప్పున వృద్ధిని సాధిస్తోందన్నారు. ఇమామి పరంగా 1.50 లక్షల మెట్రిక్టన్నులు, టిఎన్పిఎల్ రెండులక్షల మెట్రిక్టన్నులు సామ ర్ధ్యంతో ఉన్నాయన్నారు. గత ఏడాదే ఈ రెండుమిల్లులు ప్రారంభించినట్లు తెలిపారు. 2020 నాటికి 20 మిలతియన్ టన్నులకు అధిగమిస్తామన్నారు. ప్రస్తుతం 15మిలియన్ టన్నుల వరకూ ఉందన్నారు. భారత్ కాగిత పరిశ్రమకు ప్రస్తుతం పది మిలియన్ టన్నుల కలప అవసరం అవుతుందని, అయితే కేవలం 9 మిలియన్టన్నులు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. వచ్చే రెండు, మూడేళ్ల లో మరింత పెరుగుతుందన్నారు. జెకెపేపర్పరంగా చూస్తే 4.55లక్షల టన్నులు సాలీనా ఉత్పత్తిచేస్తు న్నట్లు వివరించారు. రెండువేల కోట్లు అదనపు పెట్టుబడులు పెట్టామన్నారు. 15శాతం వృద్ధిని సాధించామని, స్థూల రాబడులు మూడువేల కోట్లుగా ఉన్నాయన్నారు. జెకెపేపర్స్ ప్రస్తుతం మైన్మార్లో ప్లాంటేషన్లకు పెట్టుబడులు పెట్టే యోచనలో ఉందన్నారు. ఆదేశంలో ఇప్పటికే పైలట్ప్రాజెక్టుగా ప్రారంభించామన్నారు. మైన్మార్తోపాటు ఇతర ఆఫ్రికా దేశాల్లో ప్లాంటేషన్లలో పెద్ద ఎత్తున పెట్టు బడులు పెడతామని సింఘానియా వివరించారు. | 1entertainment
|
అనుకూలతలతో అనూహ్య లాభాలు
- 11 నెలల గరిష్టానికి సెన్సెక్స్
- ఒకే రోజు 500 పాయింట్ల ర్యాలీ
ముంబయి: మార్కెట్లు కొత్త ట్రేడింగ్ వారానికి శుభారంభం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన పలు అనుకూల పరిణామాలు.. దేశీయంగా ప్రోత్సాహకర అంశాల నేపథ్యంలో సోమవారం మార్కెట్లు పరుగులు పెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల మేర పెరిగి 27,627 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది 11 నెలల గరిష్టస్థాయి కావడం గమనార్హం. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 144.7 పాయింట్ల మేర ఎగిసి 8,468 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికాలో ఉపాధి రేటు మెరుగుపడినట్లుగా గణంకాలు వెలువడడం, జపాన్లో అధికార పార్టీ కూటమి విజయంతో ఉద్దీపన పథకాలు ముందుకు సాగనున్నాయన్న ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు దూసుకుపోయాయి. ఈ పరిణామాలకు తోడు రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించి మెరుగైన వర్షాలు పడుతున్నాయన్న వార్తలు, జీఎస్టీ బిల్లుకు త్వరలోనే మోక్షం లభించనుందన్న అంచనాలతో పాటు టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థలు గురు, శుక్రవారాల్లో ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో మదుపరులు భారీగా కొనుగోళ్లకు దిగారు. ఫలితంగా మార్కెట్లు ఉదయం నుంచే పరగులు పెట్టాయి. మే25 తరువాత ఒక్కరోజులో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరగడం ఇదే తొలిసారి. అమెరికా మార్కెట్లలో బలమైన ప్రదర్శనను ప్రతిబింబిస్తూ ఆసియా మార్కెట్లు ఉదయం నుంచే లాభాల్లోకి దూకాయి.
బలంగా మార్కెట్ విస్తృతి..
బీఎస్ఈలోని రంగాల్లో లోహ రంగ సూచీ 2.46 శాతం, ఆటో సూచీ 2.19 శాతం, బ్యాంకింగ్ రంగ సూచీ 2.07 శాతం, పీఎస్యూ సూచీ 2.06 శాతం, స్థిరాస్తి సూచీ 2.05 శాతం మేర పెరిగాయి. రిటైల్ ఇన్వెష్టర్ల భారీ కొనుగోళ్ల మూలంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.49 శాతం,0.79 శాతం మేర పెరిగాయి. మార్కెట్ విస్తృతి బలంగా కనిపించింది. 1718 స్టాక్స్ లాభాల్లో నిలవగా... 1040 స్క్రిప్లు నష్టాలలో నడిచాయి. మార్కెట్ టర్నోవర్ రూ.3,286.93 కోట్లుగా నమోదు అయింది. సెన్సెక్స్లో ఒక్క యాక్సిస్ బ్యాంక్ మినహా మిగతా 29 స్టాక్లు రాణించాయి.
జపాన్, ఐరోపా మార్కెట్ల దూకుడు
జపాన్ నిక్కీ 3.98 శాతం, హాంగ్సంగ్ 1.54 శాతం, సింగపూర్ మార్కెట్ సూచీ 0.97 శాతం, షాంఘై కాంపొజిట్ సూచీ 0.23 శాతం మేర పెరిగాయి. ఆసియా మార్కెట్ల బాటలోనే ఐరోపా మార్కెట్లు కూడా పరుగులు పెట్టాయి. ఫ్రాంక్ఫర్ట్ డీఏఎక్స్ 1.20 శాతం, ప్యారిస్ సీఏసీ 0.70 శాతం, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ 0.70 శాతం మేర పెరిగాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
శ్రీలంకపై ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో సోమవారం జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ
Samayam Telugu | Updated:
Mar 12, 2018, 08:22PM IST
శ్రీలంకపై ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ సమయం దాదాపు గంటసేపు వృథా కావడంతో అంపైర్లు ఆటని 19 ఓవర్లకి కుదించారు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే శ్రీలంక చేతిలో ఓడిన భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. 214 పరుగులు చేసినా శనివారం రాత్రి పనికూన బంగ్లాదేశ్ చేతిలో ఓడిన శ్రీలంక ప్రస్తుతం ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. | 2sports
|
స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్!
Highlights
మరో కంపనీకు ప్రచారకర్తగా విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది
టాలీవుడ్ లో రెండే రెండు హిట్ సినిమాలతో టాప్ లీగ్ లోకి చేరిపోయాడు విజయ్ దేవరకొండ. స్టార్ హీరోలతో సమానంగా కాకపోయినా తనకంటూ ఓ రేంజ్ ను బిల్డప్ చేసుకున్నాడు ఈ నటుడు. సోషల్ మీడియాలో తన అభిమానులతో తరచూ ముచ్చటిస్తూ వారికి మరింత దగ్గరవుతున్నాడు. ప్రస్తుతం ఏ హీరో లేనంత బిజీగా వరుస ఉన్నాడు విజయ్ దేవరకొండ. త్వరలోనే అతడు నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి.
ఓ పక్క సినిమాలలో హీరోగా నటిస్తూనే మరోపక్క యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని కంపనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న విజయ్ దేవరకొండ తాజాగా మరో కంపనీకు ప్రచారకర్తగా వ్యవహరించబోతున్నాడు. ఒక మొబైల్ స్టోర్ సంస్థ విజయ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొబైల్ స్టోర్స్ వాళ్లు విజయ్ ఫోటోలను వాడుకోవచ్చు.
అలానే విజయ్ పై యాడ్ కూడా షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికోసం హీరో గారు అందుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ తినాల్సిందే. దాదాపు కోటి రూపాయల రెమ్యునరేషన్ ను విజయ్ కు అందించారు. ఇప్పటివరకు స్టార్ హీరోలు మాత్రమే యాడ్స్ కోసం ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. అలాంటిది వారితో సమానంగా విజయ్ కు పారితోషికం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భవిష్యత్తులో తన రేంజ్ ను ఇంకెంతగా పెంచుకుంటాడోచూడాలి!
Last Updated 4, Jul 2018, 5:05 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్: మరోసారి ఆకట్టుకున్న తమన్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు.
Samayam Telugu | Updated:
Nov 4, 2019, 10:45PM IST
‘చిత్రలహరి’ చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ అంటూ తెలుగు ప్రేక్షకులకు పండగలాంటి సినిమాను అందించేందుకు సిద్ధమవుతున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశీ ఖన్నా హీరోయిన్గా ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అమెరికాలో జరిగింది. ఈ సినిమాలో టైటిల్ సాంగ్కు మంచి ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ సినిమాలో మంచి సందర్భంలో ఈ పాట వస్తుంది. అలాంటి టైటిల్ సాంగ్ని సోమవారం విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తమన్ స్వరపరిచిన ఈ పాటకు కేకే సాహిత్యం అందించారు. శ్రీకృష్ణ ఆలపించారు. ఈ మధ్య కాలంలో తమన్ మంచి స్వరాలను అందిస్తున్నారు. మొన్నీమధ్యే ‘అల.. వైకుంఠపురములో...’ రెండు అద్భుతమైన పాటలను స్వరపరిచిన తమన్.. ఇప్పుడు తేజూ కోసం మరో ఆసమ్ ట్యూన్ను ఇచ్చారు.
‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్
X
కాగా, ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు.. ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే మంచి ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్గా చూపించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్టైన్మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Shakeela: రియల్ షకీలాతో రీల్ షకీలా.. వాస్తవ జీవితం ఇది
ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన షకీలా.. హీరోయిన్గా ఎదగాలని ఆశపడిన ... చివరికి శృంగార తారగా ఎలా మారిందో ఇప్పటికే ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడామె జీవిత కథ సినిమాగా రానుంది.
Samayam Telugu | Updated:
Oct 31, 2018, 03:52PM IST
Shakeela: రియల్ షకీలాతో రీల్ షకీలా.. వాస్తవ జీవితం ఇది
దక్షిణాది చిత్ర పరిశ్రమలో శృంగార తారగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన షకీలా 250 చిత్రాల్లో నటించి సత్తా చాటింది. ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన షకీలా.. హీరోయిన్గా ఎదగాలని ఆశపడిన ... చివరికి శృంగార తారగా ఎలా మారిందో ఇప్పటికే ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడామె జీవిత కథ సినిమాగా రానుంది.
ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రిచా చద్దా లీడ్ రోల్ పోషిస్తుంది. పాత్రలో పర్ఫెక్షన్ కోసం ఈ బయోపిక్లో నటిస్తున్న రిచా స్వయంగా షకీలాను కలిసి ఎన్నో విషయాలని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. ‘బయోపిక్కి సంబంధించి నేను దర్శకుడికి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. నా కెరీర్, జీవితం గురించి ఉన్నది ఉన్నట్లుగా దర్శకుడికి చెప్పాను. నిజాలు దాచుకుంటే.. ఇక బయోపిక్ తీయడమెందుకు..? రిచాకి నాకు ఫిజికల్ సిమిలారిటి ఉంది. అంతేకాకుండా ఆలోచన విధానం కూడా మా ఇద్దరిదీ ఒకలానే ఉంటుంది. నా పాత్రని అర్థం చేసుకుని నటించగల నటి అని నేను నమ్ముతున్నా’ అని షకీలా వెల్లడించింది. ఈ చిత్రంలో షకీలా కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండటం మరో విశేషం. మలయాళ నటుడు రాజీవ్ పిళ్లై షకీలా ప్రేమికుడు అర్జున్ పాత్రలో కనిపించనున్నారు. హిందీ, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
internet vaartha 289 Views
వెల్లింగ్టన్ : పాకిస్థాన్ జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్న అమీర్కు న్యూజిలాండ్ పర్యటన కోసం ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా మంజూరు చేశారు.కాగా స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి అయిదేళ్ల నిషేదం ఎదుర్కొన్న మొహమద్ అమీర్ న్యూజిలాండ్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది.ఇటీవల పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న అమీర్కు న్యూజిలాండ్ దేశం నుంచి వీసా లభించే విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది.అయితే న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎట్టకేలకు అతనికి వీసా మంజూరు చేశారు.దీంతో 23 సంవత్సరాల అమీర్ న్యూజిలాండ్ పర్యటన బయల్దేరే పాక్ జట్టుతో కలిసి విమానం ఎక్కనున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ తలపడే వన్డే, టి20 పాకిస్థాన్కు స్థానం లభించిన సంగతి తెలిసిందే.అమీర్ పునరాగమనంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చినా అతనికి గట్టిగా మద్దతు పలికిన పాక్ బోర్డు,ఇటీవల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని ఎంపికపై తమ వాదనను సమర్ధించుకుంది.కాగా 2010లో లార్డ్స్ టెస్ట్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన అమీర్ అయిదేళ్ల నిషేదం ఎదుర్కొనడంతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు.ఇటీవల సెప్టెంబర్లో అతడిపై నిషేదం ముగియడంతో పాక్ దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు.ఆ తరువాత బంగ్లాదేశ్ ప్రీమియర్లో కూడా బాగా ఆడాడు. | 2sports
|
Johnson
ఆక్టిలియాన్ కొనుగోలుచేసిన జాన్సన్అండ్జాన్సన్
న్యూఢిల్లీ, జనవరి 26: అమెరికా ఫార్మాదిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ కొత్తగా ఆక్టిలియాన్ ఫార్మాగ్రూప్ను 30 బిలియన్ డాలర్లకు కొనుగోలుచేస్తోంది. యూరోప్ లోని అతిపెద్ద బయోఫార్మాకంపెనీ స్విట్జర్లాండ్ కేం ద్రంగా ఉన్న ఆక్టిలియాన్ను కొనుగోలుచేస్తున్నట్లు ్కంపెనీ స్వయంగా ప్రకటిం చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాకంపెనీగా ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ స్విస్ కంపెనీని కొనుగోలుచేయడం వెనుక ఫార్మారంగంలో ప్రపంచ వ్యాప్తంగా లీడర్గా ఎదగాలన్నదే ఆకాంక్షగా తెలుస్తోంది. కంపెనీ ఆక్టిలియాన్పరంగా బిపికి సంబంధించిన మందులను ఉత్పత్తిచేస్తోంది. అంతేకాకుండా స్విస్లో జాబితా అయినీ సంస్థ ఆర్అండ్డి న్యూకో గా అవతారం ఎత్తుతుంది. కొత్తగా మందులు, వివిధకొత్తరకాలను తయారీకోసం పరిశోధనలు నిర్వహిస్తుందని కంపెనీలు ఒక సంయుక్తప్రకటనలో వెల్లడించాయి. జాన్సన్ కంపెనీ ఆక్టిలి యాన్లోని షేర్లను ఒక్కొక్కటి 280 డాలర్లు చొప్పున కొనుగోలుకు రెండు కంపెనీల బోర్డులు అంగీకరించాయి. ఫిబ్రవరి మధ్యస్తం నుంచి టెండర్ ఆఫర్ద్వారా ఈ షేర్ల కొనుగోలు జరుగుతుంది ఆక్టిలియాన్ సిఇఒ జీన్పాల్ క్లోజెల్ కొత్త ఆర్అండ్డి కంపెనీ సరికొత్త ఒరవడికి నాందిపలుకుతుందని అన్నారు. జాన్సన్ షిఇఒ ఛైర్మన్ అలెక్స్ గోర్స్కీ మాట్లాడుతూ ఆక్టిలియాన్ కొనుగోలు రెండు కంపెనీల వాటాదారులకు మరింతమేలు జరుగుతుందన్నారు. ఆక్టిలియాన్ వ్యవ స్థాపకులు క్లోజెల్ కొత్త ఆర్అండ్డి కంపెనీని ఏర్పాటుచేస్తారు. ఇందులో 16శాతం వాటా అమెరికా కంపెనీకి ఉంటుంది. మరో 16శాతం వాటాలను కూడా అవసర మైతే కొనుగోలుకు ఆధారం ఉంది. మొత్తం 1.27లక్షల మంది ఉద్యోగులు జాన్సన్ లో పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య ఉత్పత్తుల కంపెనీగా జాన్సన్కు పేరుంది. చిన్నపిల్లల ఉత్పత్తులు, బ్యాండ్ ఎయిడ్స్కు జాన్సన్ పెట్టిందిపేరు. | 1entertainment
|
డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీళ్లే..
Highlights
టాలీవుడ్ లింకులతో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు
బాలీవుడ్ లోనూ వెలుగు చూసిన అనేక డ్రగ్స్ స్కాండల్స్
డ్రగ్స్ ఉచ్చులో సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, విజయ్ రాజ్,మమతా కులకర్ణి, సుజానే
కారణమేదైనా సెలెబ్రిటీలు డ్రగ్స్ కు బానిసవడం చాలా కాలంగా చూస్తూనే వున్నాం. తాజాగా.. టాలీవుడ్ డ్రగ్ స్కాండల్ లో పలువురు ప్రముఖుల ప్రమేయంపై... తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిట్ ఉక్కుపపాదం మోపిన నేపథ్యంలో విచారణాధికారులకు అంతర్జాతీయ కాల్స్ చేసి మరీ బెదిరిస్తున్న తరుణంలో ఈ డ్రగ్ మాఫియాకు ఎంతటి నెట్ వర్క్ వుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా టాలీవుడ్ కు సంబంధించి కెల్విన్ అనే తీగ లాగితే.. డొంకంతా కదిలి.. టాప్ దర్శకుడు పూరీ జగన్నాథ్ సహా రవితేజ, ఛార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, తరుణ్, నవదీప్ లాంటి పలువురు ప్రముఖ టాలీవుడ్ పర్సనాలిటీస్ విచారణ ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే పూరీ, కెమెరామన్ శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్ తదితరులు విచారణ ఎదుర్కోగా.. ముమైత్ ఖాన్, ఛార్మి సహా పలువురు ఇతర టాలీవుడ్ సెలెబ్రిటీలను కూడా సిట్ విచారించనుంది. మొత్తానికి టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా.. డ్రగ్స్ కు సెలెబ్రిటీలు బానిసలవుతున్నారనే వాస్తవం సినీ హీరో హిరోయిన్లను అభిమానించే ప్రేక్షకులకు మింగుడు పడటంలేదు.
ఇటీవల కాలంలో బాలీవుడ్ లోనూ డ్రగ్స్ స్కాండల్స్ బాగానే వెలుగు చూసాయి. డ్రగ్స్ మూలంగా పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు.. డ్రగ్స్ కు బానిసలై తమ కెరీర్ లు నాశనం చేసుకున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ స్వయంగా డ్రగ్స్ వాడినట్లు వెల్లడించడంతో బాలీవుడ్ లోనూ కలకలం రేపింది. ముఖ్యంగా పబ్స్ లో, డిస్కో థెక్స్ లో యువతను టార్గెట్ చేస్తున్న డ్రగ్స్ మాఫియా సినిమా పర్సనాలిటీలు దొరికితే పండగ చేసుకుంటోంది. జూన్ 25న యాంటీ డ్రగ్స్ జరుపుకుని నెల కూడా గడవని తరుణంలో... టాలీవుడ్ లో డ్రగ్స్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రస్థుతం పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటుండగా బాలీవుడ్ లోనూ డ్రగ్స్ స్కాండల్ బాగానే ప్రభావం చూపిందని అంతా గుర్తు చేసుకుంటున్నారు. 2001లో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫిరోజ్ ఖాన్ కుమారుడు హీరో ఫర్దీన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. ఇక బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ 1982లో వయసులో వున్నప్పుడే డ్రగ్స్ కేసులో ఇన్ వాల్వ్ అయి పట్టుబడి 5 నెలలు జైలు శిక్ష అనుభవించాడు.
ఇక రీసెంట్ టైమ్స్ లో రాక్ స్టార్ మూవీ కోసం తాను కూడా డ్రగ్స్ సేవించానని రణ్ బీర్ కపూర్ అంగీకరించడం సంచలనం సృష్టించింది. ఇక ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ విజయ్ రాజ్ 2005లో దుబయి ఎయిర్ పోర్ట్ లో డ్రగ్స్ తో పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఇక యోయో హనీ సింగ్ కూడా డ్రగ్స్ కు బానిసై తన కెరీర్ నాశనం చేసుకున్న వారిలో వున్నాడు. తన ఖాతాలో అనేక హిట్స్ వున్నా.. డ్రగ్స్ కు బానిసై చాలాకాలంగా ఫేమ్ లో లేకుండా కనుమరుగయ్యాడు.
సుష్మితా సేన్ లాంటి మిస్ యూనివర్స్ తో ర్యాంప్ వాక్ చేసిన ప్రముఖ మోడల్ గితాంజలి నాగ్ పాల్ దీనస్థితిలో దిల్లీలో పార్క్ సమీపంలో గుడివద్ద.. దారుణమైన పరిస్థితుల్లో కనిపించడం అప్పట్లో సంచలనమైంది. ఇక షారుఖ్ సతీమణి గౌరి ఖాన్ కూడా... బెర్లిన్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా డ్రగ్స్ కలిగి వున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరితోపాటు బాలీవుడ్ హేండ్ సమ్ హీరో హృతిక్ రోషన్ మాజీ సతీమణి సుజానే కూడా డ్రగ్స్ బానిసైనట్లు, అందువల్లే 2014 నవంబర్ లో హృతిక్ విడాకులు తీసుకున్నట్లు ఒక ప్రచారం జోరుగా సాగింది.
ఇక బాలీవుడ్ అలనాటి ప్రముఖ హీరోయిన్ మమతా కుల్ కర్ణి కూడా భారీ డ్రగ్స్ దందాలో ఇన్ వాల్వ్ అయినట్లు ముంబై పోలీసులతో కలిసి యూఎస్ పోలీసులు చేపట్టిమన ఎంక్వయిరీలో తేలింది. ఇకక సెలెబ్రిటీ కాకున్నా.. ప్రముఖ రాజకీయ నేత ప్రమోద్ మహాజన్ కుమారుడు, రాహుల్ మహాజన్ కూడా డ్రగ్స్ ఓవర్ డోస్ తో అడ్డంగా బుక్కయ్యాడని, కొకైన్ అధిక మోతాదులో తీసుకోవడం వల్లే రాహుల్ ఓ సారి అత్యవసర చికిత్స కూడా తీసుకున్నాడని తెలిసిందే. ఇలా డ్రగ్స్ కు బానిసలై జీవితంలో నష్టపోయిన వారే తప్ప ఉద్ధరించిన సెలెబ్రిటీలెవరూ లేరు. మరి టాలీవుడ్ డ్రగ్స్ దందాలపై ఇంకెన్ని విషయాలు వెలుగులోకొస్తాయో.. ఎంత మంది తెలుగు సినీ ప్రముఖులు బయట పడతారోననే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
Hyderabad, First Published 8, Sep 2019, 4:24 PM IST
Highlights
సుజీత్ ...లార్గో వించ్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ అస్సలు చూడలేదని అనటం కామెడీ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో అంత 350 కోట్లు పెట్టి సినిమా తీసిన దర్శకుడు చెప్తుంటే మీరు నమ్మకపోతే ఎలా అంటూ బ్రహ్మానందం ఎక్సపెషన్ పెడుతున్నారు.
సాహో వచ్చి వారం దాటి పోయింది. మొదట భారీగా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం టీమ్ ఆ తర్వాత హిందీ వెర్షన్ కు మంచి రెస్పాన్స్ రావటంతో కాస్త రిలాక్స్ ఫీలైంది. అయితే తమిళంలో, మళయాళంలో, ఓవర్ సీస్ లో డిజాస్టర్ అవటం, తెలుగులో సగానికి పైగా నష్టం వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే దర్శకుడు సుజీత్ ...మీడియాకు ఇంటర్వూలు ఇచ్చారు. ఆ ఇంటర్వూని ఇప్పుడు అడ్డం పెట్టి డైరక్టర్ ని వెటకారం చేస్తున్నారు.
దర్శకుడు సుజీత్ ...లార్గో వించ్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ అస్సలు చూడలేదని అనటం కామెడీ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో అంత 350 కోట్లు పెట్టి సినిమా తీసిన దర్శకుడు చెప్తుంటే మీరు నమ్మకపోతే ఎలా అంటూ బ్రహ్మానందం ఎక్సపెషన్ పెడుతున్నారు.
అలాగే "బాబూ ..నువ్వు లార్గో వించ్ చూడలేదు.. అందులోంచి ఒక్క సీన్ కూడా కాపీ కొట్టలేదు. మరి సినిమా నిండా ఆ ఫ్రెంచ్ సినిమా సీన్లే ఎలా కనిపించాయి...వాళ్లే చాలా ఏళ్ల క్రితం నీ సినిమా నుంచి కాపీ కొట్టారేమో?," అని సుజీత్ ని డైరక్టర్ గా ట్యాగ్ చేసి అడుగుతున్నారు.
అలాగే సాహోలో ఏదైనా అర్థంకాకపోతే మరోసారి చూడాలని మాటను కూడా కామెడీ చేస్తున్నారు. సుజిత్ ..క్రిటిక్స్ కాస్త సంయమనం పాటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. రివ్యూలు పోస్ట్ చేసే ముందు ఇంకాస్త వేచి చూస్తే బాగుండేదని, ఆక్యుపెన్సీని అది ప్రభావితం చేస్తుందని అంగీకరించాడు. దీన్ని హైలెట్ చేస్తున్నారు.
ఇక బీహార్ నుంచి తనకు చాలామంది కాల్స్ చేస్తున్నారని తెలిపాడు. అంతేకాదు.. బీహార్ లో పుట్టి ఉంటే సాహో సినిమా తీసినందుకు సుజీత్ కు వాళ్లు గుడికట్టి ఉండేవారని అన్నారు.దాంతో బాబూ నీ స్టాండర్డ్ బీహార్ కు సరిపోతుంది..అక్కడకు వెళ్లి సినిమాలు చేసుకో...గుళ్లు కట్టించుకో అని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సుజీత్ ని మరీ అంతలా ఆడుకోవాల్సిన పని లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓ పెద్ద హీరోని డైరక్ట్ చేసేటప్పుడు రకరకాల ప్రెజర్స్ ఉంటాయి. వాటిని తట్టుకుంటూ సినిమాని తడబడకుండా పూర్తి చేయాలి. అందులో చాలా భాగం చిన్న వయస్సు వాడైన సుజీత్ సక్సెస్ సాధించినట్లే. | 0business
|
Hyderabad, First Published 5, Nov 2018, 4:07 PM IST
Highlights
దీపావళి సంబరాలు తమిళ సినీ ప్రేక్షకులకు ఒక రోజు ముందే వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే విజయ్ సర్కార్ సినిమా రేపే రిలీజ్ కానుంది గనుక. తుపాకీ - కత్తి లాంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ తరువాత మురగదాస్ దర్శకత్వంలో విజయ్ చేస్తోన్న సినిమా కాబట్టి అంచనాలు ఆకాశానికి చేరాయి.
దీపావళి సంబరాలు తమిళ సినీ ప్రేక్షకులకు ఒక రోజు ముందే వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే విజయ్ సర్కార్ సినిమా రేపే రిలీజ్ కానుంది గనుక. తుపాకీ - కత్తి లాంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ తరువాత మురగదాస్ దర్శకత్వంలో విజయ్ చేస్తోన్న సినిమా కాబట్టి అంచనాలు ఆకాశానికి చేరాయి.
పక్క రాష్ట్రాల్లోనే సినిమా హడావుడి ఎక్కువగా ఉందంటే ఇక తమిళనాడులో ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. అభిమానులు 150అడుగుల కటౌట్స్ ఏర్పాటు చేసి విజయ్ మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నారు. ఇక దీవాళికి తమిళనాడులో ఉన్న 90% థియేటర్స్ లలో సర్కార్ బొమ్మనే కనిపించనుంది. కెరీర్ లో అత్యధిక థియేటర్స్ లో విజయ్ సినిమా రిలీజ్ అవుతోంది.
తమిళనాడులో రోజుకి ఆరు షోలను ప్రదర్శించడంతో సినిమా టాక్ బావుంటే ముందు రోజులల్లో కూడా అదే ఫార్మాట్ కొనసాగనుందని సమాచారం. ఇక అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా సినిమా అడ్వాన్స్ బుకింగ్ లలో కూడా రికార్డ్ సృష్టించింది. ఇక ఇప్పటికే 170k డాలర్స్ ని రాబట్టిన సర్కార్ మొదటి వారంలోనే ఊహించని కలెక్షన్స్ ను అందుకుంటుందని చెప్పవచ్చు. మెర్సల్ చిత్రం మొత్తంగా 270k డాలర్స్ ను రాబట్టిన సంగతి తెలిసిందే. | 0business
|
మేడమీద అబ్బాయి టీజర్ విడుదల! విశేష స్పందన
Highlights
అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి
జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో నిర్మిస్తున్న బొప్పన చంద్రశేఖర్
ట్విటర్ ద్వారా అల్లరి నరేష్ రిలీజ్ చేసిన టీజర్ కు 12 గంటల్లోనే 5లక్షల జెన్యూన్ వ్యూస్
వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. కాగా ఈ చిత్ర టీజర్ను శుక్రవారం హీరో అల్లరి నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. విడుదల చేసిన 12 గంటల్లోనే టీజర్ 5లక్షల పైగా వ్యూస్ను సాధించడం విశేషం.
ఈ సందర్భంగా హీరో నరేష్ మాట్లాడుతూ కొత్తదనంతో కూడిన కథతో చేస్తున్న విభిన్న చిత్రమిది. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చేశాననే భావన కలిగింది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ఈ మేడమీద అబ్బాయిని అందరూ మీ ఇంటి అబ్బాయిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.
నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ నవ్యమైన కథ కథనాలతో దర్శకుడు చిత్రాన్ని చక్కగా రూపొందిస్తున్నాడు. గమ్యం శంభో శివ శంభో తర్వాత ఆ తరహా సున్నితమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్ప్లే హైలైట్గా వుంటుంది. సహజమైన అంశాలతో థ్రిల్లింగ్ వుంటూనే నరేష్ శైలి వినోదం వుంటుంది. నరేష్ కేరీర్లో మరపురాని చిత్రంగా ఇది నిలిచిపోతుందనే నమ్మకం వుంది. విడుదల చేసిన 12 గంటల్లోనే టీజర్ 5లక్షల జెన్యూన్ వ్యూస్ను సాధించింది. ఈ నెలలోనే పాటలను విడుదల చేసి, సెప్టెంబరు మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.
అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.
Last Updated 26, Mar 2018, 12:03 AM IST | 0business
|
sumalatha 147 Views WhatsApp
whatsapp
హైదరాబాద్: వాట్సాప్ రాకతోనేటి యువత నేరుగా ఫోన్లో మాట్లాడేకంటే సందేశాలపైనే మొగ్గు చూపుతున్నారు. అయితే సాధారణంగా వాట్సాప్లో వీడియో, రాతరూప సందేశాలు పంపేముందు ఒకసారి పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల తప్పుడు సందేశాలు పంపే అవకాశం ఉండదు. కానీ సంక్షిప్త అడియో సందేశాలను పంపే ముందు వాటిని మరోసారి సరిచూసుకునేందుకు అవకాశం ఉండదు. నేరుగా అవతలి వ్యక్తికి చేరుకుంటాయి. ఆ రికార్డింగ్లో పొరపాట్లు జరిగితే ఇంకా అంతే సంగతులు. ఆ ఇబ్బందిని తొలగించేందుకు ఇపుడు వాట్సాప్ సంస్థ సన్నద్ధమౌతోంది. ఆడియో రికార్డింగ్ సందేశం పంపేముందు పరిశీలించుకునే విధంగా యాప్లో మార్పులు చేస్తోంది. ఈ ఫీచర్ ఐవోఎస్లో బీటా దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
తాజా యాత్ర వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/tours/ | 1entertainment
|
Hyderabad, First Published 27, Aug 2018, 12:32 PM IST
Highlights
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారాడనే చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, ఇతర హీరోల సినిమాలను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టడం వంటివి చేస్తూ అందరికి అభిమాన హీరోగా మారుతున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారాడనే చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, ఇతర హీరోల సినిమాలను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టడం వంటివి చేస్తూ అందరికి అభిమాన హీరోగా మారుతున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మహేష్ ఎంతో సన్నిహితంగా మెలుగుతారనే సంగతి తెలిసిందే. ముగ్గురూ కలిసి పార్టీలో ఫోటోలు దిగడం వాటిని అభిమానులను పంచడం వంటివి చేస్తూ తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, అభిమానుల మధ్య కూడా సఖ్యత మెలగాలంటూ సందేశాలు ఇస్తున్నారు.
అప్పటివరకు సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగేది. కానీ ఈ మధ్య కాలంలో అది బాగా తగ్గిందనే చెప్పాలి. మళ్లీ ఇన్నాళ్ల తరువాత విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ కారణంగా మహేష్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల విజయ్ 'మహర్షి' సినిమా సెట్స్ కి వెళ్లి అక్కడ మహేష్ తో ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు.
దీనికి మహేష్ వెంటనే రిప్లై ఇస్తూ విజయ్ ని పొగుడుతూ పోస్ట్ పెట్టాడు. అంతే.. ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మహేష్ పుట్టినరోజు నాడు తారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా. దానికి స్పందించని మహేష్.. విజయ్ ట్యాగ్ కూడా చేయకపోయినా వెంటనే స్పందించారంటూ మహేష్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి!
ఇవి కూడా చదవండి.. | 0business
|
arjun reddy actor vijay deverakonda next projects?
‘అర్జున్రెడ్డి’: ఇకపై అలాంటి పాత్రలే చేస్తాడట!
'అర్జున్ రెడ్డి' చిత్రంతో సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ.. ఆ సినిమా కారణంగా ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ సినిమా ప్రభావితం చేసిందని చెప్పారు.
TNN | Updated:
Sep 5, 2017, 03:18PM IST
' అర్జున్ రెడ్డి ' చిత్రంతో సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ .. ఆ సినిమా కారణంగా ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ సినిమా ప్రభావితం చేసిందని చెప్పారు. ఇకపై తనకు ఏది నచ్చితే అది చేయాలని, ఏదనిపిస్తే అది మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించాడు. ఇకపై కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని తనకు సూట్ అయ్యే పాత్రలు మాత్రమే అంగీకరిస్తానని నచ్చకపోతే ఆ విషయాన్ని చెప్పడానికి అసలు మొహమాటపడనని ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్ అంటూ చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో.
ఇదివరకు తన దగ్గరకు వచ్చిన కథలు నచ్చకపోతే ఆ విషయాన్ని చెప్పడానికి కాస్త ఇబ్బంది పడేవాడట విజయ్ దేవరకొండ. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి తెచ్చుకోనని ఇతర కారణాలు చెప్పి తప్పించుకోనని నచ్చకపోతే నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పేస్తానని అన్నాడు. ఇకపై ఎక్కువగా రియలిస్టిక్‌గా ఉండే సినిమాల్లోనే నటిస్తానని, అటువంటి పాత్రలే నాకు సెట్ అవుతాయని, ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారని స్పష్టం చేశాడు.
మొహమాటంతో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రాహుల్, భరత్ అనే ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు చేయబోతున్నాడు. అలానే నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా, గీతాఆర్ట్స్ బ్యానర్‌‌లో మరో సినిమా కమిట్ అయ్యాడు. | 0business
|
అది తిని ఒళ్లు పెంచావ్: కత్తి మహేష్ పై హైపర్ ఆది నిప్పులు
Highlights
శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహేష్ కత్తిపై హైపర్ ఆది నిప్పులు చెరిగారు. శ్రీరామ నవమి పానకం, ప్రసాదం తిని ఒళ్లు పెంచినట్టున్నావని ఆయన మహేష్ కత్తిపై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: సినీ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది నిప్పులు చెరిగారు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఇలా పోస్టు చేశారు.
"హాయ్ అండి నేను హైపర్ ఆదిని మాట్లాడుతున్నాను. కొన్నికోట్ల మంది దేవుడిగా కొలిచే రాముడ్ని కూడా తీసుకొచ్చి న్యూస్ ఛానెళ్లో కూర్చోబెట్టేశారండి. ఒకడేమో రాముడు దేవుడు కాదంటాడు. ఇంకొకడేమో సీతను రావణాసురుడి దగ్గర ఉంచితే మంచిది అంటాడు. ఇంకొకడైతే రాముడు దశరథుడికి పుట్టలేదంటాడు. ఇంకొకడైతే రాముడ్ని డైరెక్ట్గా దగుల్బాజీ అంటాడు. ఛీ ఛీ చీ.. ఏరా శ్రీరామనవమికి పెట్టే పానకం, వడపప్పు తిని ఒళ్లు పెంచినట్టున్నావ్. ఎలా వచ్చాయ్రా నీకా మాటలు" అని విరుచుకుపడ్డారు.
"నాకు క్రిష్టియన్స్, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్మస్, రంజాన్ వస్తే నేను వాళ్లింటికి వెళ్లి భోజనం చేస్తాను. సంక్రాంతి వస్తే వాళ్లు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. నేను ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో చర్చి, మసీదు, గుడి కనిపించినా దండం పెట్టుకుంటాను. ఇలా ఐకమత్యంగా ఉండే మనదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు" అని చెప్పారు.
"అరే.. మీ పబ్లిసిటీ కోసం మనుషుల మధ్యే కాకుండా దేవుడి మీదే రివ్యూలు రాసి.. మా హీరో మా హీరో అని కొట్టుకునే స్థాయి నుంచి మా దేవుడు మా దేవుడు అని కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. సూపర్. సార్.. మీ అందరికి.. హిందు మతాన్ని కించపరుస్తుంటే.. ఇది తప్పు అని చెప్పలేనంత బిజీగా ఉన్నారని నేననుకోవడం లేదు. కాబట్టి మీరు ఎవ్వరూ ఏ ప్రొఫెషన్లో ఉన్నా.. మీకిది తప్పు అని అనిపిస్తే ఖండించండి సార్" అని అన్నారు.
"అలాగే రేపు బొడుప్పల్ నుంచి యాదగిరి గుట్ట వరకు హిందూ ధర్మాగ్రహ యాత్రలో అందరూ పాల్గొనండి. ఇది తప్పు అనిపించిన ఎవరైనా మతబేధం లేకుండా అందరూ ఖండించండి. కానీ దేవుడ్ని తిట్టిన విషయంలో కూడా సపోర్ట్ చేయటం కరెక్ట్ కాదు సర్. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. అందరు దేవుళ్లు ఒకటే. థ్యాంక్యూ" అని అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
Last Updated 10, Jul 2018, 10:08 AM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Shoaib Akhtar: అక్తర్ నాకు బుర్ర లేదంటాడా..? సర్ఫరాజ్ ఫైర్
అక్తర్ వ్యాఖ్యలపై స్పందిస్తే..? అతను మరోసారి తిట్లదండకం అందుకుంటాడు. అతని దృష్టిలో మేము అసలు క్రికెటర్లమే కాదు. కానీ.. మేము ఏంటో..? నిరూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. -పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్
Samayam Telugu | Updated:
Jun 24, 2019, 01:00PM IST
హైలైట్స్
భారత్ చేతిలో ఓడిన అనంతరం పాక్ కెప్టెన్పై మండిపడిన అక్తర్
సర్ఫరాజ్ బుర్రలేని నిర్ణయం తీసుకున్నాడంటూ ఇటీవల విమర్శ
దక్షిణాఫ్రికాపై ఆదివారం మ్యాచ్ గెలిచిన పాకిస్థాన్ టీమ్
ఆ వ్యాఖ్యలపై స్పందిస్తే.. తిట్ట దండకం పెరుగుతుందని పాక్ కెప్టెన్ వెల్లడి
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తనని బుర్రలేని కెప్టెన్ అని విమర్శించడంపై సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్లో 49 పరుగుల తేడాతో పాకిస్థాన్ టీమ్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన సర్ఫరాజ్ అహ్మద్.. టీవీల ముందు కూర్చున్న వారు దేవుళ్లుగా భ్రమిస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇటీవల భారత్తో ముగిసిన మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఛేదనలో తడబడిన పాక్ జట్టు పేలవంగా 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో.. సర్ఫరాజ్ టాస్ నిర్ణయంపై అక్తర్ ఘాటుగా విమర్శలు గుప్పించాడు.
‘సర్ఫరాజ్ అహ్మద్ అంత బుర్ర తక్కువగా ఎలా ఆలోచించాడో..? నాకు అర్థం కావడం లేదు. పాకిస్థాన్ జట్టు ఛేదనలో బలహీనమని అతనికి తెలియదా..? పాక్ ప్రధాన బలం బౌలింగ్. భారత్పై మ్యాచ్లో టాస్ గెలవడం ద్వారా దాదాపు సగం మ్యాచ్ని పాక్ గెలిచేసింది. కానీ.. మ్యాచ్ని చేజార్చుకోవడానికే సర్ఫరాజ్ ఫీల్డింగ్ నిర్ణయం తీసుకున్నట్లున్నాడు.’ అని అక్తర్ ఇటీవల మండిపడ్డాడు.
అక్తర్ మాటల్ని తాజాగా సర్ఫరాజ్ ముందు ప్రస్తావించగా.. ‘ఆ వ్యాఖ్యలపై స్పందిస్తే..? అతను మరోసారి తిట్లదండకం అందుకుంటాడు. అతని దృష్టిలో మేము అసలు క్రికెటర్లమే కాదు. కానీ.. మేము ఏంటో..? నిరూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. అయితే.. మేము ఏది మాట్లాడినా అందులో జట్టు ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. కొంత మంది టీవీల ముందు కూర్చుని.. తామే దేవుళ్లమని భ్రమిస్తుంటారు’ అని పాక్ కెప్టెన్ మండిపడ్డాడు.
దక్షిణాఫ్రికాపై ఆదివారం మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని.. 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 259/9కే పరిమితమైంది. దీంతో.. అక్తర్ మాటలే నిజమయ్యాయి. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బడ్జెట్ ఎఫెక్ట్.. కుదేలైన స్టాక్ మార్కెట్లు
బడ్జెట్ ఎఫెక్ట్తో సెన్సెక్స్ 840 పాయింట్లు నష్టపోయింది. రెండున్నర సంవత్సరాల్లో భారీ పతనం ఇదే కావడం గమనార్హం.
TNN | Updated:
Feb 2, 2018, 05:26PM IST
బడ్జెట్ ఎఫెక్ట్‌తో సెన్సెక్స్ 840 పాయింట్లు నష్టపోయింది. రెండున్నర సంవత్సరాల్లో భారీ పతనం ఇదే కావడం గమనార్హం. మరో సూచీ నిఫ్టీ సైతం 10,800 మార్కు స్థాయి కంటే దిగజారింది. ఈక్విటీలపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను మరియు ఈక్విటీ-ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ నుండి పంపిణీ చేయబడిన ఆదాయంలో 10 శాతం పన్ను దేశీయ పెట్టుబడి వాతావరణాన్ని నిరుత్సాహపరుస్తుంది.
ఇంకా భారత మార్కెట్లో అధిక రుణ భారం కారణంగా భారత్ రేటింగ్ పెంపుదల సాధ్యం కాదన్న వ్యాఖ్యలు సైతం మార్కెట్ మరింత పతనమయ్యేలా చేసింది. మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్ 839.91 పాయింట్లు లేదా 2.34 శాతం క్షీణించి 35,066.75 వద్ద ముగిసింది. ఇది ఆగస్టు 24, 2015 నాడు 1,624.51 పాయింట్లు కోల్పోయిన దాని తర్వాత దేశీయ మార్కెట్లకు ఇదే అతిపెద్ద సింగిల్ సెషన్ పతనం. | 1entertainment
|
cash
రూ.6.78లక్షల కోట్లు చెలామణిలో !
న్యూఢిల్లీ,: పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్త నెట్లు ఆర్థికవ్యవస్థలోకి 6.78 లక్షల కోట్లు వచ్చి నట్లు ప్రభుత్వం, ఆర్బిఐ చెపుతున్నాయి. నవం బరు పదవ తేదీనుంచి జనవరి 13వ తేదీ మధ్య కాలంలో మొత్తం 6.78 లక్షల కోట్లు వచ్చాయని, దీనితో మొత్తంగా ఆర్థికవ్యవస్థలో కరెన్సీ చెలామణి 9.1 లక్షల కోట్లుగా ఉందని ప్రభుత్వం వెల్లడిం చింది. నగదును అందుబాటులోకి తెచ్చేప్రక్రియ మరింత వేగవంతం అవుతున్నదని, నవంబరు పదవ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకూ భారీ ఎత్తున కొత్తనోట్లను అందుబాటులోనికి తెచ్చినట్లు వివరించింది. కొన్నిచోట్లకు నగదు పంపిణీ విమా నాల ద్వారా వెళ్లాల్సివ చ్చిందని, రవాణా సమస్య లతో పంపిణీ వ్యవస్థలో లోపాలు తలెత్తాయని అన్నారు. మొత్తం 12.44 లక్షల నోట్లు కరెన్సీ చెస్ట్లకు వచ్చాయని కేంద్ర మంత్రి వివరించారు. నవంబరు 8వ తేదీనాటికి 94,899.23 మిలి యన్లనోట్లు చెలామణిలో ఉన్నాయని, 59,668.97 మిలియన్ల నాణేలు కూడా చెలా మణిలో ఉన్నాయని, అన్ని విలువలతో కూడిన నాణెలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. కొత్త రెండువేలు, 500నోట్లు ఇప్పటికే చెలామణి లో ఉన్నాయని, ఇతర విలువలున్న నోట్లు కూడా చెలామణిలో ఉంటాయని అన్నారు. కొత్తగా రూ.1000 నోటు అందుబాటులోకి వస్తుందన్నా రు. జన్ధన్ ఖాతాల నుంచి విత్డ్రాలపై కేంద్ర మంత్రి సంతోష్కుమార్ గాంగ్వార్ మాట్లాడుతూ 27,879.71 కోట్లు విత్డ్రా అయినట్లు వివరిం చారు. జన్ధన్ ఖాతాల్లో ఎంతమొత్తం పాతనోట్లు జమ అయ్యాయన్న అంశంపై గాంగ్వార్ మాట్లాడు తూ ఆర్బిఐవద్ద ఆనోట్ల వివరాలు లేవని అన్నారు. | 1entertainment
|
Devendar11
ఎలిమినేటర్ మ్యాచ్కు వర్షం అడ్డంకి
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపిఎల్ పదవ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్హైదరాబాద్ భారీ స్కోరు సాధించలేకపోయింది.కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమైంది. ఎలిమినటర్ మ్యాచ్ సందర్భంగా వర్షం అడ్డంకిగా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తరువాత కోల్కతాకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 35 బంతులు ఆడి 2 బౌండరీలు,2 సిక్సర్లతో 37 పరుగులే టాప్ స్కోరర్.ఉమేశ్యాదవ్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు,కౌల్టర్ నైల్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ పరుగులు చేయకుండా కట్టడి చేశారు
.కేన్ విలియమ్సన్ 26 బంతులు ఆడి 2 బౌండరీలు,1 సిక్సర్తో 24 పరుగులు చేయగా,విజ§్ు శంకర్ 17బంతులు ఆడి 2 బౌండరీలు,1 సిక్సర్తో ఫర్వాలేదనిపించాడు.టాస్ గెలిచిన కోల్కతా సారథి గంబీర్ సన్ రైజర్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో ఆరంభం నుంచి ఓపెనర్లు వార్నర్ శిఖర్ దావన్ ఆచితూచి ఆడుతూ వచ్చాడు.భారీ షాట్లకు ప్రయత్నించకుండా సింగిల్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ స్కోరు బోర్డును ముందుండి నడపించాడు.అయిదవ ఓవర్లో ఉమేశ్ యాదవ్ వేసిన చక్కటి బంతికి ధావన్ 13 బంతులు ఆడి 1 బౌండరీతో 11 పరుగులు చేసి వెనుదిరిగాడు.ఈ దశలో వార్నర్కు తోడుగా వచ్చిన కేన్ విలియమ్సన్ కోల్కతా బౌలర్లను ధాటిగానే ఎదుర్కొన్నాడు.చెత్త బంతులను అంచనా వేసి బౌండరీలు,సిక్సర్లతో చెలరేగాడు.
మరో ఎండ్లో ఉన్న వార్నర్ సైతం దూకుడుగానే ఆడే ప్రయత్నం చేశాడు. నైట్ వేసిన 12వ ఓవర్లో విలియమ్సన్ పెవిలియన్కు చేరాడు.వీరిద్దరు నెలకొల్పిన హాఫ్ సెంచరీ భాగస్వా మ్యానికి తెరపడింది.అనంతరం మూడు బంతుల వ్యవధిలోనే పియూశ్ చావ్లా బౌలింగ్లో వార్నర్ బౌల్డయ్యాడు. తన తొలి ఓవర్లోనే వికెట్ తీసిన చావ్లా కోల్కతా శిబిరంలో ఉత్సాహం నింపాడు.12.3 ఓవర్లకు సన్రైజర్స్ స్కోరు 3 వికెట్లకు 75 పరుగులు.కీలక మ్యాచ్లో జట్టును ఆదుకోవాల్సిన యువరాజ్ 9 బంతులు ఆడి 2 బౌండరీలతో 9 పరుగులు చేసి మరోసారి విఫలమయ్యాడు.
ఉమేశ్యాదవ్ బౌలింగ్లో భారీ షాట్ బాది బౌండరీ లైన్ వద్ద చావ్లా చేతికి చిక్కాడు.మరో ఎండ్లో ఉన్న విజ§్ు శంకర్ చక్కని షాట్లతో అలరించాడు. ఓవర్లు తగ్గిపోతున్న నేపథ్యంలో వేగం పెంచిన అతడు నైట్ వేసిన 19వ ఓవర్లో నిష్క్రమించాడు.ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో బౌల్డ్ కేవలం 7 పరుగులే ఇచ్చి నమన్ ఒజా వికెట్ తీయడంతో సన్ రైజర్స్ 128 పరుగు లకే పరిమితమైంది. | 2sports
|
news
mounaragam telugu serial written update 1 november 2019; bharat challenges ammulu
‘మౌనరాగం’ నవంబర్ 1 ఎపిసోడ్ : భరత్తో అమ్ములు సవాల్! ‘అంకిత్ వెంట్రుక కూడా పీకలేవు’
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్ 352 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. నేటికి 353 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
Samayam Telugu | Updated:
Nov 2, 2019, 03:44PM IST
‘మౌనరాగం’ నవంబర్ 1 ఎపిసోడ్ : భరత్తో అమ్ములు సవాల్! ‘అంకిత్ వెంట్రుక కూడా పీకల...
అమ్ములు భరత్ నిజస్వరూపం గురించి అంకిత్కి చెప్పేస్తుంది. అది భరత్ వినేస్తాడు. దాంతో కథ ఆసక్తిగా మారింది. పైగా వీళ్లని కలపడానికి లక్కీ కూడా సపోర్ట్గా మారడంతో అమ్ములు, అంకిత్లు కలుస్తారనే నమ్మకం కలుగుతుంది. తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న మౌనరాగం (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్లో ఏం జరిగిందో మీ సమయంలో మీకోసం.
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే...
అమ్ములు అంకిత్ మాట్లాడుకోవడం, భరత్తే నిన్ను చంపాలని చూస్తున్నాడని అమ్ములు అంకిత్కి చెప్పడం.. అంతా వెనుక ఉన్న గదిలో భరత్ చాటుగా ఉండి వినేస్తాడు. ఇంతలో సీనయ్య అమ్ములు కోసం వెళ్లడం గమనించి.. అమ్ములు, అంకిత్లను సీనయ్య చూడకుండా కాపాడేందుకు పరుగుతీస్తుంది లక్కీ. మొత్తానికి అమ్ముల్ని వెతుక్కుంటూ వెళ్లిన సీనయ్యకు అక్కడ అమ్ములు, లక్కీలు మాత్రమే కనిపిస్తారు. అంకిత్ పక్కకు దాక్కుంటాడు. సీనయ్య వెళ్లిన తర్వాత అమ్ములు, అంకిత్లు లక్కీకి థ్యాంక్స్ చెబుతారు. ‘వదినా(అమ్ములూ) నువ్వు నా సొంత వదినవి కావడానికి ఇక నుంచి నేనూ ప్రయత్నిస్తాను’ అంటూ నవ్వుతుంది లక్కీ. అమ్ములు కూడా సమ్మతమే అన్నట్లుగా నవ్వుతుంది.
Recommended byColombia
353 ఎపిసోడ్లో హైలైట్స్..
అమ్ములు వంట చేస్తుంటే భరత్ వచ్చి నిలబడతాడు ఓ పక్కనే. చుట్టూ అంతా ఉంటారు. ‘అమ్ములు ఇంత గటికురాలా? అమాయకురాలు అనుకున్నాను. నా గురించి తెలిసే ఏం తెలియనట్లు నటించిందా? ఇక లాభం లేదు డైరెక్ట్ అయిపోవడమే మంచిది..’ అని మనసులో అనుకున్న భరత్.. అమ్ములుతో మాట్లాడాలని అని.. పక్కకు తీసుకుని వెళ్తాడు. ‘ముసుగు లేకుండా మాట్లాడుకుందామా అమ్ములూ?’ అంటూ మాట్లాడటం మొదలుపెడతాడు.
Read Also: మీరు ‘మౌనరాగం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్లు ఇవిగో!
‘నీ కళా ప్రదర్శనతో నేను ఎలాంటివాడినో అంకిత్ చూపించడం నేను చూశాను. తప్పు చేశావు అమ్ములూ. నేను ఎలాంటి వాడినో తెలుసుకుని తప్పు చేశావు. నువ్వు వాడికి ఎంత దగ్గరైతే వాడికి చావు అంత దగ్గరవుతుంది’ అంటాడు భరత్ అమ్ములుతో... అమ్ములు షాక్ అవుతుంది. వెంటనే సైగలతో ‘నువ్వు అంకిత్ని ఏం చేయలేవు. నేను ఉండగా తనని ఏం చేయలేవు’ అంటుంది. ‘ఓకే మై డియర్ పార్వతీ.. అంకిత్ గాడ్ని ఎలా చంపాలో ప్లాన్ చేస్తాను. నా నుండి అంకిత్ గాడ్ని ఎలా కాపాడుకోవాలో నువ్వు ప్లాన్ చేసుకో. వాడ్ని చంపాక నిన్ను పెళ్లి చేసుకుంటాను’అంటాడు భరత్ ధీమాగా..
వెంటనే అమ్ములు.. ఓ బొగ్గు ముక్క తీసుకుని.. తాళి బొమ్మ వేసి అడ్డంగా కొట్టేసి.. ‘నేను నిన్ను పెళ్లి చేసుకోను. నీ గురించి అందరికీ తెలిసేలా చేస్తాను..’ అంటుంది. ‘అవునా? సరే అయితే.. నేను నీ మెడలో తాళి కట్టేలోపు నువ్వు నా నిజస్వరూపాన్ని అందరికీ తెలిసేలా చేయి.. ఆ లోపే అంకిత్ గాడ్ని నేను చంపేస్తాను. ఈ లోపు మన ఛాలెంజ్ విషయం ఎవరికైనా చెబితే.. అది మీ నాన్న అయినా సరే చంపేస్తాను’ అంటాడు భరత్. అమ్ములు అంతే ఆవేశంగా.. ‘నువ్వు అంకిత్ వెంట్రుక కూడా పీకలేవు’ అంటుంది. భరత్ షాక్ అవుతాడు. ‘ఇది.. ఇది అసలు మజా.. ఆడదానికి ఈ మాత్రం పొగరు ఉండాలి. అప్పుడే మజా వస్తుంది. ఇలాంటిప్పుడు నాకు కసి పెరుగుతుంది’ అంటూ సవాల్కి ఇద్దరూ సై అనుకుంటారు.మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! మౌనరాగం కొనసాగుతోంది.
భోజనాలు వడ్డిస్తుంటే.. వరుసగా అందరూ కూర్చుంటారు. అంకిత్ చిలిపిగా అమ్ములు వైపు చూసి నవ్వుతాడు. అమ్ములు కూడా నవ్వుతుంది. ‘ఇదిగో మాతో సంబంధం కలకాలం ఉండాలంటే కంచంలో ఒక్క మెతుకు కూడా ఉండకూడదు’ అంటుంది కాంతమ్మ. దాంతో అమ్ములు భరత్ కంచం నిండా పులిహోర వేసి తినమంటుంది. అటు వదల్లేక, ఇటు తినలేక చాలా ఇబ్బంది పడతాడు భరత్. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! మౌనరాగం కొనసాగుతోంది. | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
టాప్ డైరెక్టర్ కోసం బండ్ల గణేష్ ట్రయల్స్
లీడింగ్ స్టార్స్, టాప్ డైరెక్టర్లతోనే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేసే బండ్ల గణేష్.. తాజాగా మరో టాప్ డైరెక్టర్తో చర్చలు జరుతున్నాడు.
TNN | Updated:
Sep 11, 2015, 11:10AM IST
పెద్దపెద్ద స్టార్ హీరోలు , హీరోయిన్స్, దర్శకులతోనే సినిమాలు తీయడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చే నిర్మాత బండ్ల గణేష్ తాజాగా మరో టాప్ డైరెక్టర్తో సినిమాకి ట్రయల్స్ వేస్తున్నాడని తెలుస్తోంది. టాలీవుడ్ సర్కిల్స్ అప్డేట్ ప్రకారం.. శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివతో బండ్ల గణేష్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య సంప్రదింపులు కూడా అడ్వాన్స్ స్టేజ్లో వున్నాయనే టాక్ వినిపిస్తోంది. కానీ కొరటాల మాత్రం ఆల్రెడీ శ్రీమంతుడు మూవీని ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీస్ బ్యానర్కి మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొరటాల ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడా అనేదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బండ్ల గణేష్తో ప్రాజెక్ట్ ఓకే అయితే, మిర్చి , శ్రీమంతుడు వంటి సీరియల్ హీట్స్తో హ్యాట్రిక్ రేసులో వున్న కొరటాల ప్రాజెక్టులో నటించబోయే ఛాన్స్ ఎవరికి దక్కుతుందోననే సస్పెన్స్ కూడా నెలకొని వుంది. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
టీ బ్రేక్లోపే ముగించారు.. థ్యాంక్స్: పుజారా
చివరి రోజు మ్యాచ్ను త్వరగా ముగించినందుకు పుజారా.. అశ్విన్, జడేజాకు థ్యాంక్స్ చెప్పాడు.
TNN | Updated:
Feb 13, 2017, 08:21PM IST
చివరి రోజు ఏడు వికెట్లు కూల్చాల్సి ఉండటంతో హైదరాబాద్ టెస్టులో బంగ్లాపై టీమిండియా విజయం సాధించడం ఖాయమని నాలుగో రోజే తేలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో కొద్దిలో సెంచరీ మిస్సయినా షకీబుల్ హసన్ క్రీజులో ఉండటం.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శతకం బాదిన కెప్టెన్ ముష్ఫికర్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంకా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో.. చివరి రోజు బంగ్లా కడదాకా పోరాడుతుందేమో అనుకున్నారు. కానీ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ , రవీంద్ర జడేజా తలో నాలుగు వికెట్లు తీసి భారత్‌కు మధ్యాహ్నానికే విజయాన్ని ఖాయం చేశారు.
దీంతో త్వరగా మ్యాచ్‌ను ముగించినందుకు చటేశ్వర పుజారా అశ్విన్, జడేజాకు థ్యాంక్స్ చెప్పాడు. బౌలర్లు తొందరగా మ్యాచ్ ముగించినందుకు గర్వంగా ఉందన్నాడు. పుజారాకు బౌలర్లపై ఇంత ప్రేమ ఎందుకో తెలుసా? ఆదివారం పుజారా పెళ్లి రోజు. 2013లో సరిగ్గా ఇదే రోజున పుజారాకు పెళ్లయ్యింది. పెళ్లి రోజు సందర్భంగా.. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఇచ్చినందుకు పుజారా ఈ రకంగా థ్యాంక్స్ చెప్పాడు. ఎవరి తొందర వారిది బాస్. | 2sports
|
Hyderabad, First Published 15, Aug 2019, 2:31 PM IST
Highlights
ఫిజియోతో ప్రాథమిక చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి కోహ్లీ తన బ్యాటింగ్ కి కొనసాగించారు. తర్వాత సెంచరీ చేసి జట్టుు విజయానికి తోడ్పడ్డాడు. అయితే గాయం కావడంతో విండీస్తో తొలి టెస్టుకు కోహ్లి దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.
టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ .. వెస్టిండీస్ తో జరగనున్న టెస్ట్ మ్యాచ్ కి దూరం కానున్నాడా..? అవునే ప్రచారం జరుగుతోంది. వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లి గాయపడ్డాడు. విండీస్ నిర్దేశించిన టార్గెట్ను ఛేదించే క్రమంలో కీమర్ రోచ్ వేసిన 27 ఓవర్లో కోహ్లి కుడి చేతి వేలికి గాయమైంది.
అయితే.. ఫిజియోతో ప్రాథమిక చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి కోహ్లీ తన బ్యాటింగ్ కి కొనసాగించారు. తర్వాత సెంచరీ చేసి జట్టుు విజయానికి తోడ్పడ్డాడు. అయితే గాయం కావడంతో విండీస్తో తొలి టెస్టుకు కోహ్లి దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.
దీనిపై తాజాగా కోహ్లీ స్పందించారు. తన వేలికి గాయమైన విషయం వాస్తవమేనని, కాకపోతే అది అంత తీవ్ర గాయం కాదని పేర్కొన్నాడు. విండీస్తో తొలి టెస్టులో ఆడతానని స్పష్టం చేశాడు. ‘ అదృష్టవశాత్తూ వేలికి ఫ్రాక్చర్ కాలేదు. దాంతోనే నేను తిరిగి బ్యాటింగ్ కొనసాగించా. ఒకవేళ ఫ్రాక్చర్ అయ్యుంటే బ్యాటింగ్ చేయలేకపోయేవాడిని. అది చిన్నపాటి గాయమే. నేను బంతిని హిట్ చేసే క్రమంలో అది చేతి వేలికి తాకింది. తొలి టెస్టు ఆడటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు’ అని కోహ్లి పేర్కొన్నాడు.
Last Updated 15, Aug 2019, 2:31 PM IST | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
తమిళ దర్శకుడి సినిమాలో మహేష్ బాబు ?
కోలీవుడ్లో ఒక్క సినిమాతోనే సూపర్ అనిపించుకున్న డైరెక్టర్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమాకి సైన్ చేయనున్నారా
| Updated:
Apr 13, 2016, 05:49PM IST
కోలీవుడ్లో ఒక్క సినిమాతోనే సూపర్ అనిపించుకున్న డైరెక్టర్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమాకి సైన్ చేయనున్నారా అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవలే విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి సినిమా తెలుగు వెర్షన్ 'పోలీసోడు' ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన అట్లీ... పనిలోపనిగా హైదరాబాద్లోనే బ్రహ్మోత్సవం సినిమా సెట్స్లో మహేష్ బాబుని కలిశాడట. అక్కడే అట్లీ ఈ తరానికి సెట్ అయ్యేటటువంటి ఓ యాక్షన్ డ్రామా రొమాన్స్ స్టోరీ లైన్ వినిపించడం... అది నచ్చిన మహేష్ బాబు ఆ స్టోరీ లైన్ని స్క్రిప్టుగా డెవలప్ చేయమని చెప్పడం వెనువెంటనే జరిగిపోయాయని తెలుస్తోంది. ప్రస్తుతం 'తేరి' రిలీజింగ్ పనుల్లో బిజీగా వున్న అట్లీ.. అవి పూర్తయిన తర్వాత ఇక మహేష్ బాబు ప్రాజెక్టుపై కాన్సంట్రేట్ చేయనున్నాడని సమాచారం. వాస్తవానికి 2013లో ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీం ప్రధాన పాత్రల్లో వచ్చిన రాజా రాణి మూవీ చూడటంతోనే అట్లీకి తెలుగు నిర్మాతల నుంచి అవకాశాలు వచ్చినప్పటికీ... ఇప్పటివరకు 'తేరీ' ప్రాజెక్టుతో బిజీగా వుండటం వల్ల అతడు తెలుగు సినిమాలవైపు దృష్టిసారించలేకపోయాడు. అట్లీకి రాజా రాణి మొదటి సినిమా కాగా.. ఈ సినిమాతోనే డెబ్యూ డైరెక్టర్గా అట్లీకి మూడు అవార్డులు వరించాయి. అంతకన్నాముందు ఎంతిరన్ , నన్బన్ వంటి సినిమాలకి డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అట్లీకి 'తేరీ' రెండో సినిమా. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా సెట్స్పైకి వెళ్లినట్లయితే, అది ఆయన కెరీర్లో మూడో సినిమా అవుతుంది. | 0business
|
Hyderabad, First Published 3, Jul 2019, 10:36 AM IST
Highlights
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా బిగిల్. మెర్సల్ అనంతరం అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా బిగిల్. మెర్సల్ అనంతరం అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు.
అలాగే మధ్య వయస్కుడిగా మరో పాత్రలో కూడా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ తోనే దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు వేగంగా జరుగుతుండగా ఇటీవల హీరోయిన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రష్మిక మందన్నాను ఒక హీరోయిన్ పాత్రకు సెలెక్ట్ చేసేందుకు దర్శకుడు ముందు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
ఇక రీసెంట్ గా మరో హీరోయిన్ పాత్ర కోసం రాశి ఖన్నాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. ఇక ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి కానుకగా సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు.
Last Updated 3, Jul 2019, 10:36 AM IST | 0business
|
bse (file)
కొన్ని మెరుపులు–మరికొన్ని మరకలు!
ముంబై, నవంబరు 28: మార్కెట్లలో అనిశ్చితి చూస్తే గడచిన 12 నెలల్లో మరింత ఎక్కువగా ఉంది. 2008 ఆర్థికసంక్షోభంకు సమాంతరంగా ఉన్నట్లు నిపుణుల అంచనా. మొదటి రెండునెలల్లోనే 14 శాతం క్షీణించింది నిఫ్టీ 50సూచి 32శాతం సెప్టెం బరు మొదటివారంలో పెరిగితే నవంబరు చివరి నాటికి 11శాతం నష్టపోయింది. కేవలం ఎంపిక చేసిన కంపెనీల్లో మాత్రమే పటిష్టమైన రిటర్నులు కనిపించాయి. కమోడిటీ ఆధారిత కంపెనీలు, రసా యనాల వ్యాపారాలున్న కంపెనీలు మాత్రే కొంత మేర రిటర్నులు పెంచాయి. మణప్పురం ఫైనాన్స్ కంపెనీపరంగాచూస్తే గడచిన ఏడాదిగా చస్తే రాబ డులు రెట్టింపయ్యాయి. బంగారంధరల్లో పెరుగు దల ఇందుకు దోహదంచేసింది. అలాగే రిజర్వు బ్యాంకు విలువలకు తగ్గరుణం పరిమితిని పెంచ డంతో కొంత రిటర్నులు పెరిగాయి. 60 నుంచి 75శాతం విలులకు రుణం పరిమితిని పెంచింది. ఇక జెకెగ్రూప్ సొంతంగా నిర్వహిస్తున్న ఓరియంట్ పేపర్ కూడా ఎక్కువ విలువలు వృద్ధిచేసింది. వినియోగరంగ ఉత్పత్తులు, కాగిత ఉత్పత్తిసంస్థ మొదటి అర్ధసంవత్సరం నికరలాభాల్లో 500శాతం పెరిగాయి. ఇక గుజరాత్ నర్మదావ్యాలీ ఫెర్టిలైజర్, రసాయనాలు(జిఎన్ఎఫ్సి) గుజరాత్ అల్కాలీస్ అండ్ కెమికల్స్ కంపెనీలు ఎక్కువ విలువలు వృద్ధి చేయగలిగాయి. రసాయనాల ధరల్లో పెరుగుదల వీటికి కలిసొచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని తమతమ యూనిట్లను నిలిపివేయడం కూడా దేశీ యంగా ధరలవృద్ధికి ఊతం ఇచ్చింది. అనిల్ అగర్వాల్ అధీనంలోని వేదాంతకు ఈ ఉత్పత్తుల ధరల పెరుగుదలఒక్కసారిగా కలిసొచ్చిందనే చెప్పా లి. ఇక అత్యధికంగా నష్టపోయిన లేదా మార్కెట్ విలువలు దిగజారిన కంపెనీల్లో ఎక్కువ ఇన్ఫ్రా అంటే మౌలికవనరులరంగ కంపెనీలే ఉన్నాయి. ఎక్కువగా రుణభారం వీటినిపీడిస్తోంది. మంచి ఆర్డర్లు ఉన్నప్పటికీ కంపెనీలు ప్రతిభా ఇండస్రన్టీస్, ఎంబిఎల్ ఇన్ఫ్రా వంటివి రిటర్నులురాబట్టుకోలేక పోతున్నాయి. తక్కువ నిధులతో సతమతం అవు తూ మూలధన నిధులు అందుబాటులోనికి రావడం వల్ల ప్రాజెక్టుల అమలులో కూడా జాప్యం జరుగు తోంది. అలాగే ఈ కంపెనీలకు ప్రాజెక్టులపరంగా రావాల్సిన చెల్లింపుల్లో కూడా జాప్యం మరికొంత నగదు సమస్యను పెంచింది. ఇక లాభాలను పెంచి న సంస్థల్లో ముఖ్యంగా మణప్పురం ఫైనాన్స్ 231శాతం పెరిగితే ఓరియంట్పేపర్ ఇండస్ట్రీస్ 166.93శాతం, గుజరాత్ నర్మదావాలీ,ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 153.27శాతం,వేదాంత 122.68 శాతం, గుజరాత్అల్కాలీస్అండ్కెమికల్స్ 113.92 శాతంగా పెరిగాయి. మార్కెట్ విలువల్లో కోతకు గురైన సంస్థల్లో ప్రతిభా ఇండస్ట్రీస్ 74.83శాతం, కాస్టెక్స్టెక్నాలజీస్ 64.93శాతం,ఎంబిఎల్ ఇన్ఫ్రా 62.67శాతం, వొకార్డు 54.48శాతం, యునైటెడ్ స్పిరిట్స్ 47.79శాతం నష్టపోయినట్లు తేలింది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బెస్ట్ రికార్డుకి అడుగు దూరంలో కోహ్లి..!
శ్రీలంకతో సిరీస్లో మళ్లీ పరుగుల వేటని మొదలెట్టిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఏడాది బెస్ట్ స్కోరర్ రికార్డ్కి అడుగు దూరంలో ఉన్నాడు.
TNN | Updated:
Aug 22, 2017, 03:38PM IST
శ్రీలంకతో సిరీస్‌లో మళ్లీ పరుగుల వేటని మొదలెట్టిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఏడాది బెస్ట్ స్కోరర్ రికార్డ్‌కి అడుగు దూరంలో ఉన్నాడు. దంబుల్లా వేదికగా ఆదివారం ముగిసిన తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్‌ శతకంతో పాటు కోహ్లి 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ని 9 వికెట్ల తేడాతో గెలిపించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ రెండో వికెట్‌కి 192 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 217 పరుగుల లక్ష్యాన్ని కేవలం 28.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించేసింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు వన్డేల్లో దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్ 16 మ్యాచ్‌ల్లో మొత్తం 814 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతని తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 14 మ్యాచ్‌ల్లో 785 పరుగులతో ద్వితీయ స్థానంలో ఉండగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో 14వ వన్డే(ఏడాదిలో)ని పూర్తిచేసుకున్న కోహ్లి 769 పరుగులతో కొనసాగుతున్నాడు. తాజా సిరీస్‌లో ఇంకా 4 వన్డేలు మిగిలి ఉన్న నేపథ్యంలో కోహ్లి మరో 45 పరుగులు చేస్తే.. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు అందుకుంటాడు. రెండో వన్డే గురువారం జరగనుంది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రణ్వీర్ను కండోమ్ బాక్స్ తీసుకెళ్లమన్న ఫరాఖాన్!
ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ ఫరాఖాన్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా కరణ్ జోహర్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ టెలివిజన్ కార్యక్రమంలో ఫరాఖాన్ ఓ కొంటె ప్రశ్నకు సరదాగా సమాధానం ఇచ్చారు.
TNN | Updated:
Feb 9, 2017, 01:12PM IST
X
Bathukamma Song: మంగ్లీ బత...
ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ ఫరాఖాన్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా కరణ్ జోహర్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ టెలివిజన్ కార్యక్రమంలో ఫరాఖాన్ ఓ కొంటె ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్తూ పై విధంగా స్పందించారు. రణవీర్ సింగ్ పెట్టెల కొద్దీ కండోమ్స్ తీసుకెళ్లాలని బాహాటంగా చెప్పేసింది. ఒకవేళ రణవీర్ మరిచిపోతే రణబీర్ కపూర్ వాటిని తీసుకెళ్లాలని సూచించింది.
అసలు కండోమ్స్ గురించి వీరి మధ్య చర్చ రావడానికి కరణ్ జోహర్ అడిగిన వింత ప్రశ్నే కారణం. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్‌లు డేటింగ్ వెళ్తే వారికి నువ్విచ్చే సలహా ఏంటని ప్రశ్నించాడు. దీంతో ఆ కార్యక్రమంలో వెంట వెంటనే సమాధానాలు చెప్పాల్సి రావడంతో ఫరాఖాన్ కండోమ్ గురించి చెప్పేసి నాలుక కరుచుకుంది. ఆ సమయంలో ఆమె పక్కన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఉంది. దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
తెలుగులో ఆడకపోయినా తమిళంలోకి డబ్!
క్రిటిక్స్ ప్రశంసించారు కానీ.. కలెక్షన్లు అందుకు తగ్గట్టుగా రాలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టుకోలేకపోయింది
TNN | Updated:
Aug 16, 2017, 02:18PM IST
‘ఓం నమో వేంకటేశాయ’ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదల అయిన భక్తిరస చిత్రం. ఈ సినిమాను క్రిటిక్స్ ప్రశంసించారు కానీ.. కలెక్షన్లు అందుకు తగ్గట్టుగా రాలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టుకోలేకపోయింది. ‘అన్నమయ్య’ వంటి ఘనవిజయం సాధించిన సినిమాను రూపొందించిన కే రాఘవేంద్రరావు- నాగార్జున ద్వయం ‘ఓం నమోవేంకటేశాయ’తో మాత్రం పరాజయాన్నే ఎదుర్కొంది. అన్నమయ్య తరహాలో తెలుగు సినీ చరిత్రలో గొప్ప సినిమాగా మిగిలిపోలేకపోయింది ‘ఓం నమో వేంకటేశాయ’.
అయితేనేం.. ప్రేక్షకులకు తిరుమల గురించి బోలెడంత అవగాహనను పంచిన చిత్రం ఇది. అందుకే ఇప్పుడు తమిళంలోకి అనువాదం అవుతోంది. ‘బ్రహ్మాండనాయగన్’ పేరుతో ఈ సినిమా తమిళంలోకి డబ్ అవుతోంది. తిరుమల శ్రీవారికి తెలుగునాటతో తీసిపోని రీతిలో తమిళనాట కూడా భక్తులున్నారని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే వెంకటేశుడికి సంబంధించిన గాథతో రూపొందిన ఈ సినిమాను తమిళంలోకి అనువదిస్తున్నారు. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కొద్దిసేపటి కింద కుదిరిన గురి అప్పుడే తప్పింది
రియో ఒలింపిక్స్లో భారత మహిళల ఆర్చరీ టీమ్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకుందనే ఆనందంలో నుంచి తేలుకోకముందే మరో చేదు వార్త వచ్చింది.
TNN | Updated:
Aug 8, 2016, 02:10AM IST
రియో ఒలింపిక్స్లో భారత మహిళల ఆర్చరీ టీమ్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకుందనే ఆనందంలో నుంచి తేలుకోకముందే మరో చేదు వార్త వచ్చింది. లక్ష్మీరాణి, బాంబేలా దేవి, దీపిక కుమారితో కూడిన ఇండియా టీమ్ కొలంబియాపై విజయం సాధించిన విషయం తెలిసందే. కాగా క్వార్టర్ ఫైనల్లో రష్యాపై ఈ టీమ్ తన శాయశక్తుల పోరాడినా చివరకు ఓడిపోయింది. ఫస్ట్ సెట్ను భారత్ కోల్పొయింది. అయితే రెండు, మూడు సెట్లలో మనోళ్లదే పైచేయి అయింది. కానీ ఫైనల్ గా ఉండే నాలుగో సెట్ లో రష్యా రెండు పాయింట్ల తేడాతో మనోళ్లపై విజయం సాధించింది. మొదటి సెట్ లో భారత్ - రష్యా 48-55 స్కోర్ చేయగా, రెండో రౌండ్ లో 53-52, మూడో సెట్ లో 53-50 చేశాయి. కాగా చివరి రౌండ్ లో 55-53 తో రష్యా విజేతగా నిలిచింది. కానీ పోటీల్లో తాము గెలుస్తామనే ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండగా ఇలా జరిగిందని దీపిక కుమారి అన్నారు. ఇదంతా బ్యాడ్ లక్ అన్నారు. కాగా లండన్ తో పోల్చుకుంటే ఇక్కడ వాతావరణం కూడా అంతగా బాగోలేదన్నారు. అలాగే తాను ప్రతి సెట్ లో 10 -10 స్కోర్ చేయడానికి ప్రయత్నించానన్నారు.
WATCH: "Nahi laga to kya karoon?" Deepika Kumari after India's women's archery team exited the Rio Games #RioWithTOI https://t.co/A9gVcXfPt9 | 2sports
|
నిత్యామీనన్ లవ్ స్టోరీ
Rajesh Kalra, TNN & Agencies| Jul 7, 2015, 10.04 PM IST
ఆడియెన్స్ ని ఆకట్టుకునే రొమాంటిక్ లవ్ స్టోరీల్లో నటించి అతికొద్ది కాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సౌతిండియా హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. ఇటీవలే రిలీజైన మళ్లీమళ్లీ ఇది రానిరోజు సినిమాలో నిత్యా పర్ ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ లవ్ స్టోరీల్లో ఇంత చక్కగా హావభావాలు పలికించడం ఎలా సాధ్యమైందంటూ సినీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆమె.. అందుకు తన లవ్ స్టోరీయే కారణమని చెప్పిందట.
తన 18వ ఏట కాలేజీకి వెళ్లే రోజుల్లోనే లవ్ లో పడ్డానని... అందువల్లే ఈ లవ్ స్టోరీలు తనకి వీజీగా అనిపించాయని చెప్పిందట నిత్యా. ఏదేమైనా తనకిప్పుడు ఏ లవ్ స్టోరీలూ లేవు, తాను ఒంటరిగానే వున్నానని చెప్పుకొచ్చిన ఆమె.. ఆ లవ్ స్టోరీకి ఎలా ఫుల్ స్టాప్ పడిందో మాత్రం చెప్పకుండానే ఎస్కేప్ అయ్యింది. | 0business
|
Hyderabad, First Published 22, Oct 2018, 10:45 AM IST
Highlights
సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న స్థాయి నుండి ఓ మహాశక్తిగా ఎదిగాడు. సూపర్ స్టార్ ఇమేజ్ ని అందుకున్నప్పటికీ ఆయన ఇప్పటికీ ఒదిగే ఉంటాడు. తాజాగా ఆయన చేసిన ఓ పని అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. స్థానిక పోయస్ గార్డెన్ లో ఉన్న తన నివాసం నుండి తన కూతురు ఐశ్వర్య ఇంటికి వెళ్లడం కోసం రజినీకాంత్ ఆటోలో ప్రయాణించారు
సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న స్థాయి నుండి ఓ మహాశక్తిగా ఎదిగాడు. సూపర్ స్టార్ ఇమేజ్ ని అందుకున్నప్పటికీ ఆయన ఇప్పటికీ ఒదిగే ఉంటాడు. తాజాగా ఆయన చేసిన ఓ పని అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
స్థానిక పోయస్ గార్డెన్ లో ఉన్న తన నివాసం నుండి తన కూతురు ఐశ్వర్య ఇంటికి వెళ్లడం కోసం రజినీకాంత్ ఆటోలో ప్రయాణించారు. ఎప్పుడూ కార్ లోనే వెళ్లే రజినీకాంత్ ఈ విధంగా ఆటోలో ప్రయాణించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
రాజకీయాల పరంగా త్వరలోనే రజినీకాంత్ తన కొత్త పార్టీ పేరుని ప్రకటిస్తారని ఆయన సోదరుడు ప్రకటించారు. రజినీకాంత్ రాజకీయ ప్రవేశంలో బీజేపీ జోక్యం లేదని రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ తెలిపారు. వచ్చే డిసంబర్ నాటికి పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతాయని అన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తోన్న 'పేటా' అనే సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి.. | 0business
|
Feb 05,2017
9 శాతం పెరిగిన దివీస్ లాభాలు
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఔషధ తయారీ సంస్థ దివీస్ ల్యాబ్స్ డిసెంబరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.246.76 కోట్ల మేర నికర లాభాల్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.246.76 కోట్లతో పోలిస్తే ఇది 8.73 శాతం అధికం. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో సంస్థ నిర్వహణ ఆదాయం 13.58 శాతం మేర పెరిగి రూ.859.75 కోట్ల నుంచి రూ.976.48 కోట్లకు చేరింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో సంస్థ మొత్తం ఆదాయం రూ.2,646 కోట్ల నుంచి రూ.2,999 కోట్లకు చేరింది. ఇదే సమయంలో సంస్థ నికర లాభం స్వల్పంగా పెరిగి రూ.786 కోట్ల నుంచి రూ.792 కోట్లకు పెరిగింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Umar akmar
కోహ్లీతో నన్ను పోల్చవద్దు: అక్మల్
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ కోహ్లీతో తనను పోల్చడం సరికాదని పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి కోహ్లీతో పాటు ఉమర్ అక్మల్,అహ్మద్ షెహజాద్లు ఒకే సమయంలో అరంగేట్రం చేశారు. అయితే పాక్ అభిమానులు ఉమర్ అక్మల్ను కోహ్లీతో పోలుస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు.కోహ్లీతో తనను పోల్చడాన్ని ఉమర్ అక్మల్ జీర్ణించుకోలేకపోపోతున్నాడు.పాక్ అభిమానులతో పాటు,బోర్డు తనపై ఉంచిన అంచనాలను అందుకోవడంలో అక్మల్ విఫలమవుతున్నాడు.దీంతో పాకిస్థాన్ ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది.
ముఖ్యంగా పాక్ మీడియా ఉమర్ అక్మల్,అహ్మద్ షెహజాద్లను ప్యూచర్ స్టార్లని ప్రశంసలు కురిపిస్తుంటే గ్లోబల్ స్టేజిపై వీరిద్దరు ఆ అంచనాలకు చేరుకోవడంలో విఫలమవుతున్నారు.ఈ నేపథ్యంలో కోహ్లీతో తనను పోల్చవద్దని అక్మల్ తేల్చి చెప్పాడు.కోహ్లీ మూడవ స్థానంలో బ్యాటింగ్కు దిగుతాడు. దయచేసి నన్ను కోహ్లీతో పోల్చవద్దు.ఎందుకంటే నేను ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వస్తాను. ఒకవేళ పాక్ క్రికెట్ ప్యాన్స్,క్రీడా విశ్లేషకులు తనను కోహ్లీతో పోల్చాలనుకుంటే రెండు కండీషన్లు పాటించండి.ఒకటినా లాగే కోహ్లీని ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేయించడం, రెండవది కోహ్లీ లాగానే తనకు వన్డౌన్లోనే బ్యాటింగ్ చేసే ఛాన్స్ఇప్పించండి. ఇంకా చెప్పాలంటే మా జట్టు వన్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్తో కోహ్లీని పోల్చడం సరైన ఆలోచన అని ఉమర్ అక్మల్ వివరించాడు.పాక్ తరుపున 116 వన్డేలు ఆడిన అక్మల్ రెండు సెంచరీలు సాధించగా,టీమిండియా తరుపున 179 వనేడలు ఆడిన కోహ్లీ 27 సెంచరీలు చేశాడు.ఇక టెస్టు క్రికెట్ విషయానికి వస్తే కోహ్లీ వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేశాడు.అక్మల్కు పాక్ జట్టులో చోటు దక్కడమే కష్టమైపోయింది. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వర్షంతో రెండో వన్డేలో మూడు ఓవర్లు కోత..!
వర్షం కారణంగా భారత్, శ్రీలంక మధ్య పల్లెకలెలో జరుగుతున్న రెండో వన్డేలో మూడు ఓవర్ల కోత పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇన్నింగ్స్
TNN | Updated:
Aug 24, 2017, 08:16PM IST
వర్షం కారణంగా భారత్, శ్రీలంక మధ్య పల్లెకలెలో జరుగుతున్న రెండో వన్డేలో మూడు ఓవర్ల కోత పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం వర్షం రావడంతో దాదాపు అరంగటకిపైగా మ్యాచ్ సమయం వృథా అయ్యింది. దీంతో అంపైర్లు మూడు ఓవర్లు కోత విధించి భారత్ లక్ష్యాన్ని 47 ఓవర్లలో 231 పరుగులుగా నిర్ణయించారు.
అంతకముందు భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (4/43) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 236 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో సిరివర్దన (58: 58 బంతుల్లో 2x4, 1x6) మాత్రమే అర్ధ శతకంతో చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. బుమ్రాతో పాటు చాహల్ రెండు వికెట్లు, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Sachin Coach రమాకాంత్ ఆచ్రేకర్ కన్నుమూత
సచిన్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ముంబైలోని శివాజీ పార్కులో ఆచ్రేకర్ వేలాది మంది చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. ఆయన ద్రోణాచార్య అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
Samayam Telugu | Updated:
Jan 2, 2019, 07:23PM IST
Sachin Coach రమాకాంత్ ఆచ్రేకర్ కన్నుమూత
హైలైట్స్
సచిన్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ బుధవారం కన్నుమూశారు.
ఆయన వయసు 87 సంవత్సరాలు. ముంబైలోని శివాజీ పార్కులో ఆచ్రేకర్ వేలాది మంది చిన్నారులకు శిక్షణ ఇచ్చారు.
ఆచ్రేకర్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత కూడా.
క్రికెట్ దిగ్గజం సచిన్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ బుధవారం కన్నుమూశారు. సచిన్ను గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ఆచ్రేకర్ 87 ఏళ్ల వయసులో ముంబైలో తుదిశ్వాస విడిచారు. సచిన్, వినోద్ కాంబ్లిలకు పాఠశాల స్థాయిలో ఆచ్రేకర్ క్రికెట్లో శిక్షణ ఇచ్చారు. ముంబైలోని శివాజీ పార్కులో యువ క్రికెటర్లకు ఆచ్రేకర్ శిక్షణ ఇచ్చారు. రమాకాంత్ ఆచ్రేకర్ను ద్రోణాచార్య అవార్డుతోపాటు పద్మ శ్రీ కూడా వరించింది. 1983 వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడైన బల్వీందర్ సింగ్ సంధూ నుంచి.. అగార్కర్, సచిన్, కాంబ్లి వరకు అనేక మంది ఆటగాళ్లకు ఆచ్రేకర్ శిక్షణ ఇచ్చారు.
క్రికెటర్గా ఎంత ఎదిగినప్పటికీ.. సచిన్ తన గురువు పట్ల గౌరవభావం కనబర్చేవారు. ఏటా గురుపూర్ణిమ సందర్భంగా ఆచ్రేకర్ దగ్గర ఆశీస్సులు తీసుకోవడం సచిన్కు అలవాటు. ఈ మధ్యే తన చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లితో కలిసి సచిన్ ఆచ్రేకర్ దగ్గరకు వెళ్లి వచ్చాడు. ఆచ్రేకర్ న్యూ హింద్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున క్రికెట్ ఆడారు. మోయినుద్దీల్లా టోర్నీలో హైదరాబాద్పై ఆయన ఏకైక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడారు.
‘చదువుకునే రోజుల్లో నా స్కూల్ తరఫున జూనియర్ క్రికెట్ జట్టులో నేను సభ్యుడిని. వాంఖడే మైదానంలో హరీస్ షీల్డ్ ఫైనల్స్ పోటీలు రుగుతున్నాయి. మా స్కూల్ సీనియర్ జట్టు ఫైనల్కి చేరింది. అప్పుడు ఆచ్రేకర్ సర్ నా దగ్గరికి వచ్చి సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత వాంఖడే మైదానానికి వెళ్లి సీనియర్ జట్టుతో కలిసి ఆడమని సలహా ఇచ్చాడు. ఫీల్డింగ్ చేయవద్దని, నాలుగో స్థానంలో బ్యాటింగ్కి దిగమని సూచించారు. ఇది నా శిక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆ స్థానంలో బ్యాటింగ్కి దిగి పరుగులు ఎలా సాధించాలో నేర్చుకోవాలని అన్నారు.
సాయంత్రం స్కూల్ నుంచి వాంఖడే మైదానానికి వెళ్లాను. కానీ ఆచ్రేకర్ సర్ చెప్పినవన్నీ మర్చిపోయి గ్యాలరీలో కూర్చుని చప్పట్లు కొడుతూ ఆటగాళ్లను ప్రోత్సాహపరిచాను. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆచ్రేకర్ సర్ని చూశాను. ఆయన వచ్చి ఎన్ని పరుగులు చేశావు అని అడిగారు. దానికి నేను మ్యాచ్ ఆడలేదు అని బదులిచ్చాను. చప్పట్లు కొడుతూ సీనియర్ జట్టును ప్రోత్సాహపరిచాను అని చెప్పాను.
ఆగ్రహంతో ఆయన అందరు చూస్తుండగానే నాపై కేకలు వేశారు. ఇతరులకు చప్పట్లు కొట్టేందుకు నిన్ను ఇక్కడికి పంపించలేదు. ఆటపై దృష్టిపెట్టి ఏదైనా సాధిస్తే ప్రపంచమంతా ఏదో ఒక రోజు నిన్ను చూసి చప్పట్లు కొడుతుంది’ అని చెప్పినట్లు సచిన్ ఒకానొక సందర్భంలో తన కోచ్ గురించి తెలిపాడు. ఈ పాఠమే తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిపెట్టిందని, ఆ తర్వాత రోజు నుంచి ఒక్క మ్యాచ్ కూడా తాను మిస్ కాలేదని సచిన్ వివరించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఖైదీ ‘సుందరి’ సాంగ్.. కొత్త వెర్షన్ చూశారా?
ఖైదీలో ‘‘సన్నా జాజిలా పుట్టేసిందిరో... మల్లే తీగలా చుట్టేసిందిరో.. తేనెటేగల కుట్టేసిందిరో.. సుందరి... సాంగ్కు కొత్త వెర్షన్ వచ్చింది. ఇప్పుడది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
TNN | Updated:
Jan 18, 2017, 03:35PM IST
న్యూఢిల్లీ: ఖైదీలో ‘‘సన్నా జాజిలా పుట్టేసిందిరో... మల్లే తీగలా చుట్టేసిందిరో.. తేనెటేగల కుట్టేసిందిరో.. సుందరి... ఈ సుందరి’’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పాట విని... ఓ ప్రముఖ సింగర్‌, కొరియోగ్రాఫర్‌కు ఓ కొత్త ఆలోచన వచ్చింది. తన టీమ్‌తో కలిసి అదిరిపోయే డ్యాన్స్‌తో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలాడు. ఫేస్ బుక్‌లో ఇప్పటి వరకు దాదాపు 6.16 లక్షల మంది దీన్ని వీక్షించగా... 9.5వేల మంది షేర్ చేసుకున్నారు.
ఢిల్లీకి చెందిన శ్రేయ్ ఖన్నా.. బాలీవుడ్‌లో ABCD 2 సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. స్టార్ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘ఇండియా డ్యాన్సింగ్ సూపర్ స్టార్ (IDS)లో శ్రేయ్ ఖన్నా టీమ్ 2013 సీరిస్‌లో విజేతగా నిలిచింది. విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లో శ్రేయ్ ఖన్నా టీమ్ ప్రదర్శనలకు మాంచి క్రేజ్ ఉంది. మరి, వీళ్లు చిరంజీవి అభిమానులకు ఇచ్చిన కానుక ఎలా ఉందో మీరూ చూడండి... | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
దక్షిణాఫ్రికా జట్టు పగ్గాలు నాకివ్వండి
దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు ప్రస్తుతం తాను సిద్ధంగా ఉన్నట్లు ఆ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్ డుప్లెసిస్
TNN | Updated:
Aug 28, 2017, 02:52PM IST
దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు ప్రస్తుతం తాను సిద్ధంగా ఉన్నట్లు ఆ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్ డుప్లెసిస్ స్పష్టం చేశాడు. మూడు రోజుల క్రితం జట్టు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఏబీ డివిలియర్స్ అనూహ్యంగా తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో 50 ఓవర్ల ఫార్మాట్‌కి ఎవరిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే విషయమై ఆ దేశ మాజీ క్రికెటర్లతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చర్చిస్తోంది. జట్టు నాయకత్వ బాధ్యతలు తనపై తీవ్ర ఒత్తిడిని పెంచిందని రాజీనామా సమయంలో డివిలియర్స్ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘మూడు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా పనిచేసేందుకు నేను సిద్ధం. ఇంకా చెప్పాలంటే.. నాయకత్వ బాధ్యత నాలోని అత్యుత్తమ ఆటని వెలికితీస్తోంది’ అని డుప్లెసిస్ వెల్లడించాడు. అయితే.. గతంలో మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌‌గా పనిచేసిన డివిలియర్స్ క్రమంగా ఒత్తిడి పెరుగుతోందంటూ ఒక్కో ఫార్మాట్‌ నుంచి పక్కకి తప్పుకుంటూ వచ్చాడు. చివరికి అవిశ్రాంత క్రికెట్ కారణంగా గాయాలపాలై దాదాపు ఏడాదన్నర నుంచి టెస్టు క్రికెట్‌కి దూరమైపోయాడు. ఈ నేపథ్యంలో మళ్లీ డుప్లెసిస్‌‌కి మూడు ఫార్మాట్ల‌లో పగ్గాలు అప్పగించి మరో సాహసం చేయకూడదనే ఆలోచనలో కూడా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఉన్నట్లు సమాచారం.
Faf du Plessis , South Africa 's Test captain, has indicated that he's ready to lead the team in the 50-overs format of the game. The captaincy job became vacant after incumbent skipper, AB de Villiers , stepped down from leadership duties, even as he indicated a full-fledged return to all the three formats of the game. | 2sports
|
KOHLI
కోచ్ అంటే అపారమైన గౌరవం
న్యూఢిల్లీ: టెస్టు కెప్టెన్గా టీమిండియాకు ఎన్నో మెరుగైనవిజయాలు అందింస్తున్న కోహ్లీ ఇప్పటికే ఒక వ్యక్తి భయపడతానని వెల్లడించాడు. కోహ్లీ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా సీనియర్ జర్నలిస్టు విజ§్ు లోకపల్లి రచించిన డ్రెవెన్ ది కోహ్లీ స్టోరీ పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. కోహ్లీ అతని గురువు రాజ్కుమార్తపాటుమాజీ క్రికెటర్లు సెహ్వాగ్, కపిల్దేవ్, కుంబే, రవిశాస్త్రి , జడేజా పాల్గొన్నారు. కోచ్ అంటే తనకు అపారమైన గౌరవమని అన్నారు. | 2sports
|
sumalatha 234 Views Akaknsha Singh , Domestic Violence , yuvraj singh
Yuvraj Singh
న్యూఢిల్లీ: భారత స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పై అప్పట్లో గృహ హింస ఆరోపణలు రావడం తెలిసిందే. యువీ తమ్ముడు జొరావర్ సింగ్ మాజీ భార్య ఆకాంక్ష సింగ్ రెండేళ్ల కిందట తీవ్ర ఆరోపణలు చేసింది. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ యువీ కుటుంబంపై ఫిర్యాదు చేసింది. అప్పటినుంచీ ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. తాజాగా ఆకాంక్ష సింగ్ తన ఆరోపణలను వెనక్కి తీసుకుంది. దీనిపై యువరాజ్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.
చట్టం నుంచి తప్పించుకోలేనని భావించి ఆకాంక్ష సింగ్ తాను చేసిన ఆరోపణలు తప్పు అని ఒప్పుకుందని తెలిపారు. యువీకి పేరుప్రతిష్ఠలు ఉండడంతో, వాటిని అడ్డంపెట్టుకుని తమ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. యువరాజ్ ను ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో భాగం చేశారని వివరించారు. ఆకాంక్ష సింగ్ గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. యువీ తమ్ముడు జొరావర్ తో పెళ్లి ఆర్నెల్లలోపే పెటాకులైంది. అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. యువీ గంజాయి తాగుతాడని, యువీతో పాటు ఇంట్లో అందరికీ ఆ అలవాటు ఉందని తెలిపింది. ఆఖరికి తాను కూడా భర్తతో కలిసి గంజాయి తాగాల్సి వచ్చిందని పేర్కొంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/ | 2sports
|
TAX
పన్నువివాదాల పరిష్కారానికి గడువు పెంపు
న్యూఢిల్లీ, డిసెంబరు 31: కేంద్ర ప్రభుత్వం అనువర్తన పన్ను వివాదాలను పరిష్కరించుకునేందుకు ఆయా కంపెనీలు సంస్థలకు గడువును నెలరోజులపాటు పెంచింది. ప్రత్యేకించి భారత్లో వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ సంస్థలు అనువర్తన పన్నువివాదాలు ఎదుర్కొంటున్నాయి. ఆర్ధిక మంత్రి అరుణ్జైట్లీ ఈ ప్రత్యక్ష పన్నుల వివాదాల పరిష్కార పథకం కింద 2016-17 బడ్జెట్లో అనువర్తన పన్నువిధానం పాతకాలం నాటి పన్నువివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం 5.16 లక్షల కోట్ల రూపా యల విలువైన 2.6 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ వివాదాలను వాస్తవానికి ఈనెల 31వ తేదీలోపు పరిష్కరించుకోవాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు గడువును జనవరి 31వ తేదీవరకూ పొడిగించింది. ఈ ఏడాది మే 26వ తేదీ ప్రభుత్వం ఈ స్కీంను ప్రకటించింది. జూన్ ఒకటవ తేదీనుంచి డిసెంబరు 31వ తేదీలోపు పరిష్కరించుకునేందుకు గడువు ఇచ్చింది. ఈ స్కీం కింద వడ్డీ, జరిమానాలను మినహాయి స్తారు. అనువర్తన పన్నువిధానం పరిధిలోనికి ఈ పన్నువివాదం వస్తే ప్రిన్సిపల్ మొత్తం చెల్లించేవారికి వడ్డీ, జరిమానా మినహాయి స్తారు. అనువర్తన పన్నువిధానం కింద పన్ను చెల్లింపుదారులు తమ అప్పీళ్లు 2016 ఫిబ్ర వరి 29వ తేదీనాటికి కమిషనర్ ఐటి వద్ద పెండింగ్లో ఉంటే ఈ కేసులను అసెస్మెంట్ తేదీవరకూ వివాదాస్పన పన్ను, వడ్డీని చెల్లించి పరిష్కరించుకోవచ్చని సిబిడిటి వివరించింది. వివాదాస్పద పన్ను రూ.10 లక్షలలోపు ఉంటే పెనాల్టీ పోతుంది. పది లక్షలకుపైబడిన పన్నువివాదాలకు సంబంధించి పెనాల్టీ 25శాతం విధిస్తారు. ఇక పెనాల్టీ అప్పీళ్లకు సంబంధించి పన్నుచెల్లింపుదారులు కేవలం 25శాతం మాత్రమే జరిమానా చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం మరింతగా ఈ పాతపన్నుల వివాదాలను పరిష్కరించేందుకు వీలవుతోంది.
వొడాఫోన్గ్రూప్, కెయిర్న్ ఎనర్జీయుకె సంస్థలపరంగా ఈ వివాదాలు నడుస్తున్నాయి. మొత్తం పెండింగ్ సంఖ్యలో మూడోవంతు వివాదాలను పరిష్కరించాలని చూస్తోంది. కార్పొరేట్ కంపెనీల నుంచి స్పందన కరువవడంతో ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది. ఈ స్కీం కింద వడ్డీ, పెనాల్టీ రెండింటినీ రద్దుచేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్కీంను వినియోగించుకోదలిచిన కార్పొరేట్ సంస్థ ముందుగా ప్రిన్సిపల్ పన్ను మొత్తం 30రోజులకు ముందు సంబంధిత అధికార యంత్రాంగానికి చెల్లించాలి. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
ఇందుకు సమంతా గట్టిగానే సమాధానం చెబుతోంది. ఈ సందర్భంగా యోగీ అనే ఫాలోవర్ ఇండస్ట్రీలో వేదింపులు ఎదుర్కొంటున్న జూనియర్ ఆర్టిస్టుల గురించి ట్వీట్ చేశాడు. ‘‘చిన్మయికి మద్దతు తెలుపుతూ ఎన్నో ట్వీట్లు వస్తున్నాయి. సినీ రంగంలో సమస్యలు ఎదుర్కొంటున్న జూనియర్ ఆర్టిస్టులకు కూడా ఈ మద్దతు ఉంటుందా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు సమంతా ‘యెస్’ అని రిప్లే ఇచ్చింది.
Yes !! https://t.co/xWJYXrqvwu
— Samantha Akkineni (@Samanthaprabhu2) 1539180201000
గౌరవ్ ప్రధాన్ అనే వాణిజ్యవేత్త ట్వీట్ చేసిన ఓ జోక్పై కూడా సమంతా స్పందించింది. ‘‘ఈ రోజు నా కొడుకు మీటూ అంటే ఏమిటని అడిగాడు. ఇందుకు నేను సమాధానం చెబుతూ.. మహిళల రిటైర్మెంట్ ఇన్సురెన్స్ ప్లాన్. మహిళలు తమ కేరీర్ ముగియగానే ఈ బీమాను ఉపయోగిస్తారు. బర్ఖా, అర్నబ్ లాంటి వాళ్లు ఆధరణ కల్పిస్తారు’’ అని జోక్ పేల్చాడు. దీనిపై సమంతా స్పందిస్తూ.. ‘‘మరి, మీ కూతురు అడిగితే ఏమని చెబుతావు?’’ అని ప్రశ్నించింది.
And what will you tell your daughter ? https://t.co/ubVPyNsZCR
— Samantha Akkineni (@Samanthaprabhu2) 1539180081000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఫిలింఫేర్ రెడ్ కార్పెట్పై స్టార్స్ సందడి
బాలీవుడ్లో ఎప్పుడూ వార్తల్లో వుండే నటీనటులు, ఫేమస్ లవ్ కపుల్ అయిన రణ్వీర్ సింగ్, దీపికా పదుకునేలు మరోసారి వార్తల్లోకొచ్చారు.
| Updated:
Feb 7, 2016, 11:52PM IST
ఫిలింఫేర్ రెడ్ కార్పెట్పై స్టార్స్ సందడి
బాలీవుడ్లో ఎప్పుడూ వార్తల్లో వుండే నటీనటులు, ఫేమస్ లవ్ కపుల్ అయిన రణ్వీర్ సింగ్ , దీపికా పదుకునేలు మరోసారి వార్తల్లోకొచ్చారు. ఈసారి ఎప్పటిలా లవ్ వార్తలతో కాకుండా తమ పర్ఫార్మెన్స్కిగాను ఫిలింఫేర్ అవార్డులు అందుకుంటూ హెడ్ లైన్స్లో నిలిచిందీ జోడీ. 61వ బ్రిటానియా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమంలో రణ్వీర్ సింగ్( బాజీరావ్ మస్తానీ )కి ఉత్తమ నటుడు కేటగిరీలో, అలాగే దీపికా పదుకునే( పికు )కి ఉత్తమ నటి కేటగిరీలలో ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. | 0business
|
"సువర్ణ సుందరి" గా మారిన జయప్రద
Highlights
"సువర్ణ సుందరి". చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుందనే ట్యాగ్ లైన్ తో మూవీ
ఈ మూవీలో అలనాటి మేటి నటి జయప్రద ప్రధాన పాత్ర
జయప్రద డూప్ లేకుండా స్టంట్స్ చేశారంటున్న టీమ్
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడంతా హిస్టారికల్ మూవీస్ హవా నడుస్తోంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా భారీ నిర్మాణ సంస్థ లన్నీ చారిత్రాక చిత్రాల నిర్మాణంపై దృష్టి పెడుతూ.. అంతే భారీ విజయాలను అందుకుంటు న్నాయి. ఇప్పుడదే కొవలో రాబొతున్న చిత్రం "సువర్ణ సుందరి". చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుందనేది ట్యాగ్ లైన్. సూర్య దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్స్ బ్యానర్ పై ఎమ్.ఎల్.లక్ష్మి సువర్ణ సుందరి ని తెరకెక్కిస్తున్నారు.
అలనాటి నేటి మేటి నటిమణి జయప్రద ఓ కీ రోల్ పోషిస్తుండగా, ఈ పాత్రకు ఓ ప్రత్యేకత ఉందని, గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రద గారి పాత్ర ఉంటుందన్నారు దర్శకుడు. ఇక పూర్ణకు కూతురుగా జయప్రద నటిస్తుండటంతో పాటు, వారిద్దరి మధ్య ఉండే ఎమోషన్ ఈ సినిమాకు ఓ హైలెట్ గా చెప్పుకొవచ్చన్నారు. నిజ జీవితం తరహా లోనె జయప్రద రోల్ ఈ చిత్రంలోను చాలెజింగ్ గా ఉండటంతో పాటు .. పతాక సన్నివేశాల్లొ డూప్ లేకుండా కష్టపడి, ఇష్టపడి జయప్రద గారు చేసిన స్టంట్స్ సువర్ణ సుందరి విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఇటీవలె వీటికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందన్నారు దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్.
నిర్మాత ఎమ్.ఎల్.లక్ష్మి మాట్లాడుతూ..కంటెంట్ మరియు విజువల్ పరంగా సువర్ణ సుందరి ఆడియెన్స్ థ్రిల్ చెస్తుంది. బిజినెస్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఈ సినిమాకు తెరకెక్కించటం జరిగింది. ఫస్ట్ లుక్ కు వచ్చిన రెస్పాన్స్, మా టీమ్ కు మంచి ఉత్సాహాన్ని అందించింది. త్వరలొ టీజర్ ను, నవంబర్ ద్వీతియార్దం లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు.
పూర్ణ, జయప్రద, సాక్షిచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: పవ్రీణ్ పూడి.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST | 0business
|
ONGC111
ఒఎన్జిసి అధీనంలోకి హిందూస్థాన్ పెట్రోలియం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఆయిల్ నేచరల్ గ్యాస్ కార్పొరేషన్ మూడో అతిపెద్ద సంస్థ హిందూస్థాన్పెట్రోలియం కార్పొరేషన్ను కొనుగోలుచేస్తోంది. సుమారు 44 వేల కోట్ల ధరతో ఈ డీల్ ముగుస్తుందని అంచనా. ప్రభుత్వం చమురురంగంలో ఒకే అతిపెద్ద సంస్థను ఏర్పాటుచేసే లక్ష్యంతో భారీ చమురు దిగ్గజాన్ని ఏర్పాటుచేయాలన్న ఆలోచనలకు కీలకమే ఈ ప్లాంట్ కొనుగోలు అని తెలుస్తోంది.జైట్లీ తన బడ్జెట్ప్రసంగంలో భారత్చమురురంగంలో భారీ మెగా చమురు సంస్థను ఏర్పాటుచేసే లక్ష్యంతో ఉన్నట్లుప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే భారత్లోని అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తిసంస్థ ఒఎన్జిసి హెచ్పిసిఎల్లో ఉన్న 51.11 శాతం ప్రభుత్వ వాటాలను టేకోవర్చేస్తుంది.
ఇతర వాటాదారులనుంచి 26శాతం వాటాలను కొనుగోలుచేసేందుకు ఓపెన్ ఆఫర్ జారీచేస్తోంది. చమురుశుద్ధి కంపెనీ, చమురు ఉత్పత్తి సంస్థలు రెండింటినీ ఏకీకృతంచేసే అతిపెద్ద సంస్థగా రూపొందించే యత్నంలో ప్రభుత్వం ఉంది. చమురు రంగంలో మొత్తం ఆరు అతిపెద్ద కంపెనీలున్నాయి. ఒఎన్జిసి, ఆయిల్ ఇండియా చమురు ఉత్పత్తిచేస్తుంటే, ఐఒసి,హెచ్పిసిఎల్, భారత్పెట్రోలియంకార్ప్ చమురుశుద్ధి రంగంలో ఉన్నాయి. గెయిల్ గ్యాస్ పంపిణీ సంస్థగా బిజినెస్ చేస్తోంది. ఒఎన్జిసి విదేశ్, చెన్నై పెట్రోలియం కార్ప్, నుమాలిఘర్ రిఫైనరీ, మంగళూరు రిఫైనరీ ంటివి ఈ ఆరు ప్రభుత్వరంగ సంస్థల అనుబంధ సంస్థలుగా కొనసాగుతున్నాయి. చమురుశుద్ధి సంస్థలు రెండింటిని ఒఎన్జిసితో విలీనంచేయాలని, ఐఒసిని ఆయిల్ ఇండియాతో విలీనం చేయాలనే లక్ష్యంతో ఉన్నాయి. హెచ్పిసిఎల్ను ఒఎన్జిసితో విలీనం చేసి బిపిసిఎల్ను ప్రత్యేకించి కొనసాగించాలన్న ప్రతిపాదనలున్నాయి. బిపిసిఎల్ ఇప్పటికే భారత్పెట్రోరీసోర్సెస్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించి మరింత పటిష్టం అయ్యే వ్యూహంలో ఉంది. దీనితో మూడు ఇంధన రిటైలర్లు ఐఒఎసి, ఒఎన్జిసి హెచ్పిసిఎల్ సంయుక్తంగాను, బిపిసిఎల్ మరొక సంస్థగాను చమురు శుద్ధి,విక్రయాలు చేస్తాయి. హెచ్పిసిఎల్ 23.8 మిలియన్టన్నుల వార్షిక చమురుశుద్ధి సామర్ధ్యంతో ఉంది.
ఒఎన్జిసి పోర్టుఫోలియోఒలో దేశంలోనే మూడో అతిపెద్ద శుద్దిసంస్థగా నిలిచింది. ఐఒసి, రిలయన్స్తర్వాత హెచ్పిసిఎల్దే అగ్రస్థానం. ఎంఆర్పిఎల్ సంస్థలో ఒఎన్జిసికి మెజార్టీ వాటా ఉంది. 15 మిలియన్ టన్నుల రిఫైనింగ్ సామర్ధ్యంతో ఉంది. హెచ్పిసిఎల్ను ఒఎన్జిసి కొనుగోలుకు సంబంధించి రెండు విడతలుగా కేబినెట్ ఆమోదం అవసరం అవుతుంది. ప్రభుత్వం తనమొత్తం 51.11వాటాను ఒఎన్జిసికి విక్రయించడం, రెండోది ఒఎన్జిసికి నిధులు వ్యయంచేసేందుకు అంటే హెచ్పిసిఎల్ కొనుగోలుకు సంబంధించిన వ్యయంకు ఆమోదం తెలపడం మరోటి అని చెపుతున్నారు. ఒఎన్జిసి ప్రస్తుతం 561 రూపాయలతోట్రేడ్ అవుతుంది. ఒఎన్జిసి దీనివల్ల 51.11 శాతం వాటాలకు రూ.29,128 కోట్లు చెల్లించాలిస ఉంటుంది. అదనంగా ఉన్న మరో 26శాతం వాటాను ఓపెన్ ఆఫర్కిందకొనుగోలుచేస్తే అదనంగా రూ. 14,817 కోట్లు చెల్లించాలి. దీనివల్ల మొత్తం కొనుగోలు విలువలు రూ.44 వేల కోట్లుగా ఉంటాయి. ఈవిలీనంతో ప్రపంచ స్థాయి సంస్థలకు ధీటుగా భారత్ చమురు సంస్థ మెగా కంపెనీగా అవతరిస్తుందని అంచనా. 12 ఏళ్ల తర్వాత ప్రభుత్వరంగ చమురుసంస్థలను విలీనం చేసే ప్రతిపాదన వచ్చింది.
చమురుమంత్రి మణిశంకర్ అయ్యర్ ఈప్రతిపాదన తెచ్చారు. ప్రభుత్వరంగ సమీకృత మెగా చమురుసంస్థ ఏర్పాటుచేస్తున్నట్లు బడ్జెట్ప్రసంగంలో ఆర్ధిక మంత్రి ప్రకటించారు. మణిశంకర్ అయ్యర్ మొదటగా హెచ్పిసిఎల్, బిపిసిఎల్ను ఒఎన్జిసి, ఆయిల్ ఇండియాల్లో ఐఒసి విలీనం ప్రతిపాదించారు. దీనివల్ల రెండు మేజర్ చమురుసంస్థలు రూపొందినట్లవుతుందని ఆయన అంచనా. అయితే అత్యున్నతస్థాయి ప్యానెల్ విలీనం ప్రతిపాదనలపై ఆమోదించలేదు. వృత్తిపరంగా పర్యవేక్షణ ట్రస్టుకు ప్రభుత్వరంగ చమురుసంస్థల వాటాలను బదిలీచేసి మరింత పటిష్టంచేయాలని సూచించింది. నకిలీనివారణకు, అత్యధికంగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను కుదించుకునేందుకు చమురుధరలు ఎక్కువగా ఉన్న సమయంలోనే ప్రపంచ దేశాల్లో ఈ విలీనాలు జరిగాయని భారత్లో ఇపుడాపరిస్థితిలేదని సలహకా కమిటీ సూచించింది. గడచిన రెండేళ్లుగా అత్యంత కనిష్టస్థాయికి చమురుధరలు పడిపోయాయి. ప్రభుత్వరంగ సంస్థల అనుబంధ సంస్థను మాతృసంస్థల్లో విలీనంచేయాలని సూచించింది. కోచి రిఫైనరీని బిపిఇఎల్, చెన్నై రిఫైనరీని ఐఒసిల్లో కలపాలని సూచించింది. ఒఎన్జిసి పరంగాచూస్తే భారత్లో అతిపెద్ద చమురు,గ్యాస్ ఉత్పత్తి సంస్థగా కొనసాగుతోంది. అంతేకాకుండా అత్యధిక లాభదాయకమైన సంస్థగా కొనసాగింది. ఇండియన్ ఆయిల్కార్ప్ దేశంలోనే అతిపెద్ద చమురుశుద్ధి సంస్థగా నిలిచింది. గెయిల్ భారత్లో అతిపెద్ద పైపులైన్ ఆపరేటర్గా కొనసాగుతోంది. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా 2008 ఒలింపిక్స్‌‌లో బంగారు పతకం గెలిచిన అభినవ్ బింద్రా ఉండగా.. సభ్యులుగా భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్, ఫుట్‌బాల్ దిగ్గజం భూటియా, పారా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన దేవేంద్ర ఝఝరియా, ట్రాక్ ఆండ్ ఫీల్డ్‌ విభాగంలో అంతర్జాతీయ పోటీల్లో మూడు బంగారు పతకాలు గెలిచిన రీత్ అబ్రహాం, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ చీఫ్ ఎడిటర్ రాజేశ్ కల్రా ఉన్నారు.
2017లో భారత్‌కి చెందిన చాలా మంది అథ్లెట్స్ ప్రపంచ వేదికలపై అత్యుత్తమ ప్రదర్శనతో మెరిశారు. బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌ గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పగా.. పీవీ సింధు ర్యాంకింగ్స్‌లో నెం.2 స్థానానికి ఎగబాకింది. క్రికెట్‌లో మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ప్రపంచ రికార్డుల్ని బద్దలుకొట్టారు. వన్డేల్లో మిథాలీ 6వేల పరుగులు చేసి తొలి మహిళా క్రికెటర్‌గా రికారుల్లో నిలవగా.. జులన్ గోస్వామి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. పురుషుల క్రికెట్‌లోనూ కెప్టెన్ విరాట్ కోహ్లి శతకాల మోత మోగిస్తూ భారత్ జట్టుని విజయపథంలో నడిపిస్తున్నాడు. బిలియర్డ్స్‌లో పంకజ్ అద్వానీ 18 అంతర్జాతీయ టైటిల్స్‌ గెలవగా.. బాక్సర్ మేరీకోమ్ మళ్లీ బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగపెట్టింది. హాకీలో భారత ఫురుషుల జట్టుతో పాటు మహిళలూ ఆసియా కప్‌ గెలిచారు. ఇలా.. గత ఏడాది అథ్లెట్స్‌ తమదైన రంగంలో సత్తాచాటి అవార్డ్స్‌ నామినేషన్‌లో నిలిచారు. మరి అవార్డ్స్ ఎవరెవరకి దక్కనున్నాయో చూద్దాం..!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
ఇండియన్ ఐడల్ పై నటి శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్
Highlights
శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గత కొంత కాలంగా టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై సంచలన విషయాలు వెల్లడిస్తున్న నటి శ్రీరెడ్డి.. తాజాగా మరో బాంబ్ పేల్చింది. గతంలో వచ్చిన సుచీలీక్స్ తరహాలోనే ఇపుడు టాలీవుడ్ లో `శ్రీ రెడ్డి`లీక్స్ పెను దుమారం రేపుతున్నాయి. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములనుద్దేశించి శ్రీరెడ్డి పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేయడం...ఆ వ్యాఖ్యలకు శేఖర్ కమ్ముల కూడా పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం జరిగాయి. ఆ తర్వాత తాను శేఖర్ కమ్ములనుద్దేశించి ఆ పోస్ట్ పెట్టలేదని శ్రీరెడ్డి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత `నేచురల్ `హీరో అంటూ.. పేరు ప్రస్తావించకుండా ఓ టాలీవుడ్ హీరోపై కూడా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ గాయకుడు - ఇండియన ఐడిల్ శ్రీరామచంద్రపై కూడా శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.
సింగర్ శ్రీరామచంద్ర తనతో అసభ్యంగా చాట్ చేశాడని శ్రీరెడ్డి ఆరోపించింది. శ్రీరామ చంద్ర తనతో వాట్సాప్ లో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘మన ఇండియన్ ఐడిల్ చాట్ చూడండి.. శ్రీరామ్ సిగ్గుపడాలి..ముందు నీ పేరులోనుంచి శ్రీరామ్ ను తొలగించు. ఆ పేరుతో పిలిపించుకునేందుకు నువ్వు అర్హుడివి కాదు’ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.
అయితే శ్రీరెడ్డి స్క్రీన్ షాట్లు చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్లలో పూర్తి చాట్ హిస్టరీ లేదని - ఎడిట్ చేసి ఉందని అంటున్నారు. అయితే ఆ చాట్ లో సంభాషణ ఇద్దరికీ ఇష్టపూర్వకంగానే...సరదాగా సాగిందని అంటున్నారు. శ్రీరామ చంద్ర సరదాగా పెట్టిన కామెంట్లకు శ్రీరెడ్డి సీరియస్ అయినట్లు ఆ స్క్రీన్ షాట్లలో లేదని - శ్రీరెడ్డి కూడా అతడి మెసేజ్ లకు సరదాగానే రిప్లై ఇచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు.
Last Updated 6, Apr 2018, 8:38 AM IST | 0business
|
Hyderabad, First Published 5, Feb 2019, 11:58 AM IST
Highlights
రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాకి ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను నిర్మాతలు లాభాలకు అమ్ముకున్నప్పటికీ కొన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయారు.
రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాకి ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను నిర్మాతలు లాభాలకు అమ్ముకున్నప్పటికీ కొన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయారు.
ఈ సినిమా ఫ్లాప్ పై రామ్ చరణ్ అభిమానుల కోసంఓ లెటర్ రాశాడు. ''ప్రియమైన అభిమానులకు మరియు ప్రేక్షకులకు నా పట్ల మరియు నా సినిమాల పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానాలకు వినమ్రపూర్వక ధన్యవాదాలు'' అంటూ మొదలుపెట్టాడు.
'వినయ విధేయ రామ' సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అంటూ చెప్పారు. నిర్మాత దానయ్య గారు అందించిన సహకారం మాటల్లో చెప్పలేనని, సినిమాను నమ్మిన పంపిణీదారులు, బయ్యర్లకు కృతజ్ఞన్యుడనై ఉంటానని చెప్పారు.
ప్రేక్షకులను ఉద్దేశిస్తూ.. ''మీ అందరికీ నచ్చి, మిమ్మల్ని వినోదింపజేసే సినిమా అందించడానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాని అందించలేక మీ అంచనాలను అందుకోలేకపోయామని'' చెప్పుకొచ్చారు.
ప్రేక్షకులు చూపిస్తోన్న ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో అందరికీ నచ్చే సినిమాలు చేయటానికి కృషి చేస్తానని చెప్పారు.
Last Updated 5, Feb 2019, 11:58 AM IST | 0business
|
Suresh 202 Views
ప్రపంచస్థాయి బ్యాంకుగా ఎస్బిఐ
హైదరాబాద్: తెలంగాణ లీడ్బ్యాకు స్టేట్బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ ఎస్బిఐలో విలీనం ప్రతిపానలపై ఆ బ్యాంకుతో చర్చించేందుకు ఎస్బిహెచ్ డైరక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఎస్బైతో తమ బ్యాంకు వ్యాపార విలీన, ఆస్తులు, అప్పులు వంటివాటి విలీనంపై మాతృబ్యాంకుతో చర్చలు జరిపేందకు డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్టు బిఎస్ఐకి తెలియజేసింది. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Bigg Boss Telugu 3: మాతో ఆటలాడు, జనాలతో కాదు.. ‘బిగ్ బాస్’ని ఏకిపారేసిన హిమజ
Himaja Elimination: బిగ్ బాస్ షో పదోవారంలో వివిధ సమీకరణాల ఆధారంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్న హిమజ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుండి బయటకు వచ్చిన అనంతరం బిగ్ బాస్ని ఏకిపారేసింది హిమజ.
Samayam Telugu | Updated:
Sep 24, 2019, 05:48PM IST
నిగ్రహం లేని విగ్రహం అంటూ ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టినా.. 64 రోజుల బిగ్ బాస్ ప్రయాణంలో డేరింగ్ డాషింగ్గా మారి తనదైన శైలి ఆటతో ఆకట్టుకుంది బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ. స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్న హిమజ తొమ్మిదో వారం ఎలిమినేషన్లో అనూహ్యంగా బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన అనంతరం.. హోస్ట్ నాగార్జున ముందే.. ‘బిగ్ బాస్ గేమ్ కూడా ఫెయిర్గా ఉండాలని కోరుకుంటున్నానని.. అందుకు నాకు మళ్లీ బిగ్ బాస్ హౌస్కి వెళ్లే అవకాశం మీరు ఇచ్చానా నేను వెళ్లను. అది ఫెయిర్ అనిపించుకోదంటూ కుండబద్దలు కొట్టేసింది.
పోల్
అంతేకాదు.. తాను ఎలిమినేట్ అయ్యానని క్రుంగిపోవడం లేదని.. అసలు ఆట ఇప్పుడు మొదలైందంటోంది. ‘హిమజతో బిగ్ బాస్ గేమ్ అయ్యిందంటే.. నాతో నా జీవితం అనే గేమ్ ఆగలేదు. బిగ్ బాస్ హౌస్లో ఎంటరైనప్పుడు హిమజ వేరు.. ఇప్పుడు వెళ్తున్న హిమజ వేరు’ అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది హిమజ. ఇక బిగ్ బాస్ షోని ప్రసారం చేస్తున్న తీరుపైన, ఇంటి సభ్యులపైన ఓటింగ్ విధానంపైన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు హిమజ. ‘బిగ్ బాస్ హౌస్ జైలు లాంటిది కాదు.. జైలే. ఫోన్ లేకుండా.. ఎవరితో కాన్టాక్ట్ లేకుండా ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉంటానని అనుకోలేదు. నేను ఇన్ని రోజులు ఉండటమే గ్రేట్.
Read Also: బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్లు.. ఇంట్రస్టింగ్ కథనాలు ఒక్క క్లిక్తో..
హిమజ బిగ్ బాస్
హీరో అవ్వాలన్నా.. విలన్ అవ్వాలనే స్క్రీన్ ప్లే అనేది కీ రోల్. బిగ్ బాస్ హౌస్లో వాళ్లు చూపించడాన్ని బట్టే ఎవరు హీరో.. ఎవరు విలన్ అనేది తేలిపోతుంది. వాస్తవం వేరు. అక్కడ ఏం జరుగుతుందో అదే చూపిస్తున్నారు కాని.. హిమజ సెల్ఫిష్ అని ముద్ర వేసేవాళ్లను కెమెరాలకు చూపించారు. మహేష్ ఎలిమినేషన్ అప్పుడు కూడా నేను కావాలని చేయలేదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో క్లారిటీ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది.
గ్రూప్లు ఫామ్ అయిపోయి బిగ్ బాస్నే ఆటాడిస్తున్నారు..
బిగ్ బాస్ హౌస్లో గ్రూప్లు ఉన్నాయి. కొంతమంది గ్రూప్లుగా ఉండి.. నామినేషన్ అప్పుడు మూకుమ్మడిగా తమకు ఇష్టం లేనివాళ్లను బయటకు పంపిస్తున్నారు. నేను రిజర్వ్డ్గానే ఉన్నాను.
బిగ్ బాస్ వాళ్లకు ముందే కండిషన్ పెట్టా..
బిగ్ బాస్ సీజన్ 3 ఒక్కటే కాదు.. సీజన్ 1, సీజన్ 2లకు కూడా నన్ను రమ్మని పిలిచారు. కాని నేను పెట్టిన ఒకే ఒక్క కండిషన్. ఫుడ్ విషయంలో నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారా అని. ఒక్కొక్కరికీ ఒక్కో వీక్ నెస్ ఉంటుంది. నాకు ఫుడ్ సరిగా లేకపోతే ఉండలేను. అలాగని ఒకేసారి ఎక్కువగా తినేయలేను. మీరు గమనిస్తే నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్లినప్పటికంటే ఇప్పుడు బాగా తగ్గిపోయా. అంటే సరైన ఫుడ్ లేదు. ఎట్లా ఉన్నాలన్నా తినాలి.
హిమజ
నాలుగే కూరగాయలతో రెండు నెలలు..
బిగ్ బాస్ హౌస్కి మహా అయితే నాలుగు రకాల కూరగాయలు పంపిస్తారు. ఈ రెండు నెలలు పప్పు, బంగాళదుంపలే. ప్రతిరోజు అవే కూరలంటే చచ్చిపోయేవాళ్లం. ఏదో కడుపు నిండాలి కాబట్టి తినేవాళ్లం. మధ్య మధ్యలో ఇలా నేను ‘గుడ్డులో బెడ్డు’, ‘గోదుమ అట్లు’ ట్రై చేసేదాన్ని.
శ్రీముఖితో మొదట్లో బాగానే ఉన్నా..
హౌస్లో ఉన్న వాళ్లలో అందరూ స్క్రీన్ కోసం నటించేవాళ్లు. వాళ్లలో జ్యోతి, శ్రీముఖి కాస్త బెటర్. అందుకే వాళ్లతో ఉండేదాన్ని. కిచెన్లో శ్రీముఖితో ఉండేదాన్ని. మూడ్ స్వింగ్స్ అందరికీ ఉంటుంది. కాకపోతే బిగ్ బాస్ చేస్తున్న స్క్రీన్ ప్లే మాయతో మూడ్ స్వింగ్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు.
ఎవర్ని సేవ్ చేయాలి? ఎవర్ని నామినేట్ డిసైడ్ చేసేది బిగ్ బాస్..
కంటెస్టెంట్స్లో ఎవర్ని సేవ్ చేయాలి? ఎవర్ని నామినేట్ చేయాలి అన్నది బిగ్ బాస్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటున్నాయి. బిగ్ బాస్ వాళ్లు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో అది ఎవరిదగ్గర ఉందో వాళ్లను సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. నాకోసం కూడా చేశారు. అది కాదనను.
బిగ్ బాస్ మాతో ఆడలాడు.. ఆడియన్స్తో కాదు
బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులు గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి.. నా ఫేవరేట్ కంటెస్టెంట్కి ఓటు వేయడం మరిచిపోతానేమో అని తపనతో ఓట్లు వేస్తున్నారు. కాని బిగ్ బాస్ ఆడియన్స్తో గేమ్స్ ఆడుతున్నారు. కొంతమందిని నామినేషన్స్కి రాకుండానే సేవ్ చేసి కాపాడుతున్నారు బిగ్ బాస్.
Read Also: ‘బిగ్ బాస్’ బోసిపోతోంది.. ఆటాడే వాళ్లు బయటకు, నెట్టికొచ్చేవాళ్లు ఇంట్లోనే!
రమ్యక్రిష్ణ హోస్ట్గా వచ్చిన వీక్లో నామినేషన్ చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. బురదను నెత్తిపై నుండి వేసుకోవాలన్నారు. మళ్లీ అందులో ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకోవచ్చన్నారు. ఆరుగును నామినేట్ అయితే అందులో ముగ్గుర్ని సేవ్ చేసేశారు. అది బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి. సరే ముగ్గురికి సీక్రెట్ టాస్క్లు ఇచ్చారు. ఇంతా ప్రాసెస్ చేసి.. ముగ్గురు నామినేషన్లో ఉన్నట్టుగా ప్రకటించి సోమవారం నాడు ఓటింగ్ ప్రాసెస్ మొదలుపెట్టేశారు.
దీంతో జనాలు పిచ్చిగా ఓట్లు వేయడం మొదలు పెట్టేశారు. తీరా అంతా కష్టపడి ఆడియన్స్ ఓట్లు వేస్తే.. రమ్యక్రిష్ణ వచ్చిన వీక్లో నో ఎలిమినేషన్ అనేశారు. ఆ వారం నేను, పునర్నవి, మహేష్లు నామినేషన్లో ఉన్నాం. బిగ్ బాస్ గేమ్లు ఆడితే మాతో ఆడాలి. జనాల ఎమోషన్లో ఎందుకు ఆడాలి. మీరు నామినేషన్ ప్రక్రియ అంతా చేసి చివర్లో నో నామినేషన్ అంటే మరి ఓట్లు వేసిన జనం ఏమవ్వాలి? వాళ్ల ఎమోషన్స్లో ఎందుకు ఆడుకోవాలి? నిజంగానే ఆవారం నామినేషన్ ఉండదని నిర్ణయించుకున్నప్పుడు ఓటింగ్ క్లోజ్ చేసేయాలి కదా.. వారం మొత్తం ఓట్లు వేయించుకుని చివర్లో నో ఎలిమినేషన్ అంటే షో చూసే ఆడియన్స్ అభిప్రాయానికి విలువ ఇచ్చినట్టు అవుతుందా? వాళ్లు విసుగు చెంది ఓట్లు వేయడం మానేస్తే ఏం కావాలి? ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకూడదని నా అభిప్రాయం.
బిగ్ బాస్ ఫెయిర్గా లేదు..
బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తరువాత నాకు మళ్లీ అక్కడకు వెళ్లే అవకాశం ఇచ్చినా వెళ్లను అని చెప్పేశా. కనిపించే కంటెస్టెంట్తో ఆట ఆడొచ్చు.. కనిపించని బిగ్ బాస్తో నేను ఆట ఆడలేను. ఆయన్ని ఓడించి ఎన్నిరోజులు ఉండగలం. తీరా గేమ్లో ఇన్వాల్వ్ అయిన తరువాత హౌస్లో ఉంచాలా? ఎలిమినేట్ చేయాలా అన్నది ఆయన ఇష్టమే. ఓటింగ్ లెక్కేలేదు. నామినేషన్ ఎవర్ని తీసుకురావాలన్నది కూడా బిగ్ బాస్దే ఫైనల్ నిర్ణయం. మనం ఎంత ఫెయిర్గా గేమ్ ఆడినా.. అసలు ఆట బిగ్ బాస్ ఆట ఆడేస్తున్నాడు.
హిమజ | 0business
|
- ఎంపి తీరుపై ఎన్నో సందేహాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు మల్లారెడ్డి ముఖ్యమంత్రిని పొగడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కేసులో టిడిపి పుట్టెడు కష్టాల్లో ఉన్న సమయంలో, మరోవైపు ఎంపి మాట్లాడిన తీరు టిడిపిలో అనుమానాలకు తెర లేపుతోంది. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎర వేసి లాగిన టిఆర్ఎస్ తాజాగా ఏమైన ఎంపిలకు సైతం గాలం వేస్తోందా ? అనే సందేహాలకు మల్లారెడ్డి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయని రాజకీయవర్గాల్లో చర్చనడుస్తోంది. శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి ఇళ్లపట్టాల పంపిణీ సందర్భంగా ఎంపి మల్లారెడ్డి మాట్లాడిన మాటలు టిఆర్ఎస్లో ఆనందాన్ని నింపగా, టిడిపికి పెట్టేలా ఉన్నాయి. టిటిడిపి నేతలు సైతం ఔరా ! అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో పార్టీలో విభిన్నమైన స్పందనలు వస్తున్నాయి. నిజానికి ఎంపి మల్లారెడ్డికి, ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఎమ్మెల్యే రేవంత్రెడ్డి మధ్య మొదటి నుంచి పడదు. సఖ్యత లేదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు సందర్భంగా ఇద్ధరి అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. మల్లారెడ్డికి టికెట్ రాకుండా రేవంత్రెడ్డి అప్పట్లో విశ్వప్రయత్నాలు చేశారన్న అరోపణలున్నాయి. పార్టీ అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పోరుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేవంత్రెడ్డి చర్లపల్లి జైల్లో ఉండటం, శనివారం నుంచి నాలుగురోజుల పాటు నాలుగు రోజులపాటు అంటే ఈనెల తొమ్మిదో తేదీ వరకు ఎసిబి కస్టడికి అప్పగించిన నేపథ్యంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకింత ఆశ్చర్యంగొల్పుతున్నాయి. రేవంత్ రడ్డిపై ప్రతీకారంగానే మాట్లాడారా ? లేక సభలో ముఖ్యమంత్రిని పొగిడితే భవిష్యత్తులో తనకు ఎలాంటి సమస్యలు ఉండవని అంతర్గత ఆలోచనతో వ్యవహరించారా ? అనుమానాలు సైతం వ్యక్తమవు తున్నాయి. మల్లారెడ్డి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో అనేక ఇంజనీరింగ్, ఫార్మసి కాలేజీలు ఉన్నాయి. ఇతర వ్యాపారాలు సైతం నడుస్తున్నాయి. బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తోనే సాధ్యమని బాహాటంగా చెప్పడం తన వ్యాపారా లావాదేవిలకు అడ్డురాకుండా ఉండేం దుకే మాట్లాడి ఉంటారన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎసిబి కేసు పెట్టేందుకు టిఆర్ఎస్ సన్నద్ధమవుతున్న తరుణంలో ఎంపి మాటలు ఎంత మాత్రం సహించరానివని అంటు న్నవారు లేకపోలేదు. అదే సందర్భంలో ఆయా యాదృ చ్ఛికంగానే మాట్లాడారని, ఇందులో నర్భగర్భం గా ఎలాంటి ఆలోచనలు లేవని చెబుతున్నవారూ ఉన్నారు. మల్లారెడ్డి పార్టీ మారనున్నారా అనే అనుమానాలు సైతం పెల్లుబుకు తున్నాయి. ఈనేపథ్యంలో టిటిడిపిలో అంతర్గత వాతావరణం వేడేక్కుతోంది. కాగా పార్టీ వర్గాలు మాత్రం అలాంటిదేమి ఉండదని, ముఖ్యమంత్రితో అనవసర సమస్యలు తెచ్చుకోరాదనే భావనతో వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి అలా మాటా ్లడి ఉండొచ్చని అంటున్నారు. మల్లారెడ్డి వ్యాఖ్యలను టిటిడిపి నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఇప్పుడైతే..కుంబ్లేను కోహ్లిపై రుద్దేవాడు!
- గంగూలీపై సీఓఏ మాజీ చీఫ్ రాయ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : పాలకుల కమిటీ (సీఓఏ) బీసీసీఐ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలన సంస్కరణల విషయంలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నది. కానీ క్రికెట్ విషయంలో పాలకుల కమిటీ ఒకే ఒక్క విపత్కర సమయాన్ని చవిచూసింది. క్రికెట్ జెంటిల్మెన్ అనిల్ కుంబ్లే 2017 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత చీఫ్ కోచ్గా తప్పుకున్నారు. భారత క్రికెట్లో ఇది పెద్ద దుమారానికి దారితీసింది. ఆ సంఘటనపై పాలకుల కమిటీ మాజీ చైర్మన్ వినోద్ రాయ్ తాజాగా పెదవి విప్పారు. అనిల్ కుంబ్లేను చీఫ్ కోచ్గా కొనసాగించేందుకు శతథా ప్రయత్నించానని, కానీ కెప్టెన్ కోహ్లి అందుకు అంగీకరించలేదని వెల్లడించారు. ' భారత్కు అందుబాటులో ఉన్న అత్యుత్తమ కోచ్ అనిల్ కుంబ్లే. కుంబ్లే హయాంలో భారత్ అన్ని ఫార్మాట్లలో ముందుకు సాగింది. ప్రత్యేకించి టెస్టు క్రికెట్లో అతి పెద్ద విజయాలు సాధించింది. కుంబ్లేపై ఎనలేని గౌరవం ఉంది. చీఫ్ కోచ్గా కొనసాగించేందుకు ఎటువంటి అవకాశం ఉన్నా, ఆ పని చేసేవాడిని. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మళ్లీ క్రికెట్ సలహా సంఘం వద్దకు వెళ్లాల్సి వచ్చింది. చాంపియన్స్ ట్రోఫీ సమయంలో సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీలతో సుదీర్ఘంగా చర్చించాను. విరాట్ కోహ్లితో మాట్లాడి ఒప్పించాలని కోరాను. నేనూ కోహ్లితో మాట్లాడాను. అప్పటికీ విరాట్ గురించి పెద్దగా తెలియదు. సచిన్, గంగూలీ స్థాయి వ్యక్తులు మాట్లాడినా పరిష్కారం కాని సమస్య నాతో ఏమవుతుంది? విరాట్ను వాళ్లే ఒప్పించలేకపోయారు, నేనేం చేయగలను?. డ్రెస్సింగ్రూమ్లో విభేధాలు ఉన్నాయని తెలిసిప్పుడు, మనం మార్పు చేయగలిగేది చీఫ్ కోచ్నే. ఈ విషయం ప్రజల్లోకి ప్రతికూలంగా వెళ్లిపోయింది. సీఓఏ సభ్యుడు రామచంద్ర గుహ రాజీనామా చేశారు. మహిళల జట్టు విషయంలో మిథాలీ-రమేశ్ పొవార్నూ ఇదే జరిగింది. డ్రెస్సింగ్రూమ్లో విభేదాలు వివాదానికి దారితీశాయి. కుంబ్లే-కోహ్లి విభేదాలు ఇప్పుడు జరిగినట్టైతే సౌరభ్ గంగూలీ కచ్చితంగా చీఫ్ కోచ్గా కుంబ్లేను కొనసాగించేవాడు. అది మరింత సమస్యలకు దారితీసేది. కానీ కోచ్గా తప్పుకున్న అనిల్ కుంబ్లే పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది' అని వినోద్ రారు గుర్తు చేసుకున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 2sports
|
- దేశ రాజకీయ సెగకు కుదేలైన 'స్టాక్స్
- 510 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 10,200 పాయింట్ల దిగువనకు నిఫ్టీ
- వారాంతంలో భారీ నష్టాల్తో ముగింపు
ముంబయి: స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ(తెదేపా) తెగదెంపులు చేసుకొని కూటమి నుంచి వైదొలగడం అనంతరం ప్రభుత్వంపై తెదేపా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిం చడంతో.. ఒక్కసారిగా దేశంలో రాజకీయ వేడి మొదలైంది. ఈ పరిణామాల ప్రభావం దేశీయంగా స్టాక్ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలతో ఆరంభం నుంచే కుదేలవుతూ వస్తున్న సూచీలు.. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారీ పతనం దిశగా సాగాయి. చివరన అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలిన సూచీలు భారీనష్టాలను నమోదు చేశాయి.
ప్రారంభం నుంచి నష్టాల్లోనే..
అమెరికా ట్రేడ్వార్ భయాల నేపథ్యాన అంతర్జాతీయంగా అందిన సంకేతాలతో చమురు, లోహ, ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడి గురయ్యాయి. దీంతో శుక్రవారం ఉదయం నుంచే స్టాక్మార్కెట్లు నష్టాలలో మొదలయ్యాయి. 137 పాయింట్ల నష్టంతో 33,548 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇక ఆ తరువాత తెదేపా అవిశ్వాస తీర్మానంపై దేశీయంగా రాజకీయ వేడి రగులుకోవడంతో సూచీలు మరింత పతనమయ్యాయి. ఒక దశలో 550 పాయింట్లకు పైగా కుంగిన సెన్సెక్స్ 33,120 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు కాస్త కోలుకున్నా.. భారీ నష్టాలను మాత్రం తప్పించుకోలేక పోయింది. దీంతా వారాంతంలో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 510 పాయింట్ల కోల్పోయి 33,176 వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా భారీగా కుదేలైంది. 50 పాయింట్ల నష్టంతో 10,300 మార్క్ వద్ద ఊగిసలాడుతూ ప్రారంభమైన నిఫ్టీ మదుపర్ల తీవ్ర అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో అంతకంతకూ పతనమైంది. ఒక దశలో 170 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అయిన సూచీ చివరకు 165 పాయింట్లు కోల్పోయి 10,195 వద్ద ముగిసింది. ట్రేడ్వార్ నేపథ్యంలో లోహ రంగపు షేర్లు కళ కోల్పోయాయి.. ఫలితంగా ఈ రంగపు సూచి దాదాపు 2 శాతం మేర పతనమైంది. ప్రధానంగా సెయిల్, వేదాంత, హింద్ కాపర్ షేర్లు ఎన్ఎస్ఈలో దాదాపు 3 నుంచి 5 శాతం నష్టాల్లో నడిచాయి.
పతనానికి ప్రధాన కారణాలివే..
- కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన తెదేపా ఒక్కసారిగా ఎన్డీఏ నుంచి వైదొలిగి, ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనికి తోడు ఇటీవల వెలువడిన లోక్సభ ఉప ఎన్నికల పలితాల్లో కూడా బీజేపీకి భంగపాటు కలగడంతో.. ఇక రానున్న రోజుల్లో దేశంలో ఒకే పార్టీకి ప్రభుత్వం నడపగలిగేంత మెజార్టీ వచ్చే అవకాశాలు లేవన్న వార్తా విశ్లేషణలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
- అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం వల్ల దుష్ ప్రభవాలు మరింత పెరగనున్నాయంటూ అక్కడి వ్యాపార వర్గాల వారు ట్రంప్ సర్కారుకు మొరపెట్టుకున్న నేపథ్యం.. అమెరికా ట్రేడ్వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళనలు ప్రపంచ మార్కెట్లను ప్రతికూల సంకేతాలను పంపాయి. దీంతో అమెరికా ఆసియా మార్కెట్లు రక్షణాత్మక దోరణిలో ఊగిసలాడాయి.
- గత ఏడాది అనూహ్యంగా లాభాలను నమోదు చేసుకొంటూ సరికొత్త రికార్డులను నమోదు చేసిన దేశీయ మార్కెట్లలో మంచి రోజులు దాదాపు ముగిసినట్టేనని.. ఇకపై మార్కెట్లలో లాభాలను ఆర్జించడం గతంలో ఉన్నంత సులువు కాదన్న వార్తలు మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో అధిక ధరల వద్ద స్టాక్స్ను అమ్మేందుకు మదుపరులు మొగ్గుచూపారు.
- మార్కెట్లను విశ్లేషిస్తూ రూపొందించే టెక్నికల్ చార్ట్లు కూడా ప్రతికూలతను సూచించడంతో.. మదుపరులు శుక్రవారం ఉదయం నుంచే అధిక ధరల వద్ద లాభాల స్వీకరణకు దిగడం కనిపించింది. ఈ అంశం కూడా మార్కెట్ పతనానికి ఆజ్యంపోసింది
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ADITYA BIRLA
రూ.27వేల కోట్ల ఆరోగ్యబీమా లక్ష్యం
హైదరాబాద్, డిసెంబరు 22: దేశంలో ఆరులక్షల కోట్ల హెల్త్కేర్ రంగం విస్తరించిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఆరోగ్యబీమా విస్తరించ లేదని, దేశంలో ఆరోగ్యబీమా వాణిజ్యం సాలీనా కేవలం ఆరువేల కోట్లకుపైబడి లేదని ఆదిత్యబిర్లా హెల్త్బీమా సంస్థ సిఇఒ మాయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. మార్కెట్కు రావడంలో జాప్యం జరిగినా ఆదిత్యబిర్లా హెల్త్బీమా పరంగా 27వేల కోట్ల బీమా లక్ష్యంతో ఉన్నట్లు ఆయన వివరించారు. యువత, ఆరోగ్యంపట్ల అప్రమత్తంతో ఉన్న వర్గానికి మరింతచేరువగా ఉండేలక్ష్యంతో ఎక్కువ రిటైల్ మార్కెట్పైనే దృష్టిపెట్టామని ఆయన అన్నారు. దేశంలోని మరో ఏడునగరాల్లో ఈ కీలక బీమా కొత్తపథకాన్ని ఆవిష్క రిస్తామన్నారు. ఆదిత్యబిర్లా హెల్త్ నుంచి మొట్టమొదటిసారిగా హెల్త్ఫస్ట్ను మార్కెట్కు తెచ్చింది. 2020 నాటికి బీమా మార్కెట్లో స్థిరమైన వాటా సాధించేలక్ష్యంతో ఆదిత్యబిర్లా హెల్త్ నిర్ణయించిం దన్నారు. హెల్త్ఫస్ట్ను హైదరాబాద్ మార్కెట్కు లాంఛనంగా విడుదలచేసారు.
వచ్చే ఐదేళ్లలోనే టాప్ బీమా సంస్థగా నిలుస్తామన్న ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఎపి మార్కెట్ మొత్తం బిజినెస్లో పది శాతం మార్కెట్తో ఉందని, 27వేల కోట్లకు ఉన్న మార్కెట్ సాలీనా 18-20శాతం వృద్ధిచెందుతోందని వివరించారు. ఎక్కువగా 35నుంచి 45 ఏళ్లలోపు ఉన్న రంగంపై దృష్టిసారించామని, అలాగే రిటైల్ మార్కెట్ ఫోకస్ ఎక్కువ ఉందన్నారు. బ్యాంకు లు, ఏజెన్సీలు, ఇతర బీమారంగంలోని అన్ని ఛానెళ్లను తాము వినియోగిస్తున్నట్లు మాయాం క్ వివరించారు. అలాగే ఒపిడి విభాగంపై కూడా ఆదిత్యబిర్లా దృష్టిసారించిందన్నారు. బీమారంగపరంగా భారత్లో అత్యంత తక్కు వగా ఉందని, అదే అమెరికాలో అయితే 78 శాతం ఉందని, 2.25 లక్షల కోట్ల డాలర్లుగా ఉందన్నారు.చైనాలో 168 బిలియన్ డాలర్ల కు ఉందని, భారత్లో అయితే కేవలం 3.5 బిలి యన్ డాలర్ల టర్నోవర్తో ఉందని మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం అంతర్జాతీయ సంస్థ ఎంఎంఐ హోల్డింగ్స్తో జాయింట్ వెంచర్తో వస్తున్నదని, 51ః49శాతం వాటానిష్పత్తిలో ఈరెండు సంస్థలు పనిచేస్తాయన్నారు.
దక్షిణాఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా నిలిచిన ఎంఎంఐ సేవలు భారత్లో సంయుక్తంగా అందచేస్తామన్నారు. ఆదిత్యబిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజ§్ు కకర్ మాట్లాడుతూ ఎంఎంఐతో భాగస్వామ్యంతో ఆదిత్యబిర్లా హెల్త్ ఆవిష్కరణచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. పోటీమార్కెట్లో ఆదిత్యబిర్లా హెల్త్కేర్ బీమారంగంలో కూడా వృద్ధిని సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. మొత్తం ఏడు నగరాల్లోను, మొదటిశ్రేణి నగరం ఒక మెట్రోలోను ప్రారంభించామని, కొద్దికాలంలోనే మరిన్ని నగరాలకు విస్తరిస్తామన్నారు. టాప్ ఫండ్ మేనేజర్లలో ఒకటిగా నిలిచిన ఆదిత్యబిర్లా నిర్వహణ ఆస్తులు 2,17,840 కోట్లుగా ఉన్నాయి. రుణ పరపతి విలువ 31,823కోట్లుగా ఉన్నాయి. బీమా, స్థిరాస్తి నిర్వహణ, ప్రైవేటు ఈక్విటీ, కార్పొ రేట్ రుణపరపతి, వ్యవస్థీకృత రుణపరపతి, సాధారణ బీమా, బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, ఈక్వి టీ, కరెన్సీ, కమోడిటీ బ్రోకింగ్, ఆన్లైన్ వ్యక్తిగత ఫైనాన్స్, హౖౌెసింగ్ఫైనాన్స్, పిఎఫ్ నిర్వహణ, ఆరోగ్యబీమా వ్యాపారాలతో ఆదిత్యబిర్లా బ్రాండ్ ప్రతిష్ట ప్రస్తుత హెల్త్ఫస్ట్కు ఉపకరిస్తుందన్నారు. | 1entertainment
|
దేశంలో ఎల్పీజీ కొరత లేదు: మంత్రి దేవ్రా
న్యూఢిల్లీ (ఏజెన్సీ)| PNR| Last Modified మంగళవారం, 4 డిశెంబరు 2007 (13:25 IST)
దేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా వంటగ్యాస్ (ఎల్పిజి) కొరత లేదని కేంద్రం ప్రకటించింది. మంగళవారం రాజ్యసభ కార్యక్రమాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవ్రా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పబ్లిక్ సెక్టార్ ఆఫ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ (ఓఎంసీ) ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో ఎక్కడా ఎల్పీజీ కొరత లేదని చెప్పారు.
అలాగే.. ఆయిల్ కంపెనీలకు కేంద్రం కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినట్టు చెప్పారు. పెట్రోలియంను లిక్విడేట్ చేయాలని, సెలవు రోజుల్లో కూడా బాటిలింగ్ ప్లాంట్ను నడపాలని, పని సమయాన్ని పెంచాలని కేంద్రం ఆదేశించినట్టు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్జీసి తాజాగా ఒరిస్సా కోస్తా తీరంలోని మహానదిలో రెండు గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నట్టు మంత్రి దేవ్రా చెప్పారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘అల... వైకంఠపురములో...’ కథ ఇదే: మిడిల్ క్లాస్ టు బిలియనీర్!
‘అత్తారింటికి దారేది’లో అత్త సెంటిమెంట్, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లో నాన్న సెంటిమెంట్ చూపించిన త్రివిక్రమ్ ఇప్పుడు ‘అల... వైకుంఠపురములో...’లో సిస్టర్ సెంటిమెంట్ను పండించనున్నారు.
Samayam Telugu | Updated:
Nov 6, 2019, 03:01PM IST
అల్లు అర్జున్
త్రివిక్రమ్ సినిమా అంటే కేవలం మాటలు, వినోదం మాత్రమే కాదు.. బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఆ ఎమోషన్స్ చుట్టూనే కథను నడుపుతూ ఉంటారు. తన సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్స్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు త్రివిక్రమ్. ఇప్పటి వరకు ఆయన చిత్రాల్లో ప్రధానంగా కనిపించింది ఇదే. ఇలాంటి సెంటిమెంట్స్, ఎమోషన్స్తో కూడిన కథకు కాస్త వినోదం జోడించి ప్రేక్షకులకు అందిస్తుంటారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తోన్న ‘అల... వైకుంఠపురములో...’ సినిమా కూడా ఇదే కోవకు చెందుతుందని ఇండస్ట్రీ టాక్.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లో ఫాదర్ సెంటిమెంట్ చూపించారు. అయితే, ‘అల... వైకుంఠపురములో...’ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ చూపించబోతున్నారని సమాచారం. ఈ మేరకు స్టోరీ లైన్ బయటికి వచ్చింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె పుట్టినరోజును పురష్కరించుకుని ఇటీవల పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే, టబు ఈ సినిమాలో అల్లు అర్జున్కు అక్కగా నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది.
Also Read: నందమూరి అభిమానులకు నిరాశ.. వారసుడి ఎంట్రీపై బాలయ్య క్లారిటీ
ఈ సినిమాలో హీరోది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట. అయితే, టబు బాగా డబ్బున్న హైక్లాస్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్తుందట. కానీ, ఆ ఇంటికి వెళ్లిన తరవాత టబుకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయట. అక్క సమస్యలను పరిష్కరించడానికి బన్నీ రంగంలోకి దిగుతారు. ఇదే అసలు కథ అని టాక్. అంతేకాదు, బన్నీ నేరుగా తన అక్క ఇంటికి వెళ్లి అక్కడే ఉండి సమస్యలను పరిష్కరిస్తారట. బన్నీ వాళ్ల అక్క ఇంటిలోకి అడుగుపెట్టే విధానం, అక్కడ జరిగే తతంగం చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా, ప్రీ క్లైమాక్స్లో బన్నీ బిలియనీర్గా కనిపిస్తారట. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి బిలియనీర్ ఎలా అయ్యాడు అనేది కూడా ఆసక్తికరమైన అంశం.
నిజానికి ‘అల... వైకుంఠపురములో...’ ఫస్ట్ లుక్ను పరిశీలిస్తే అందులో బన్నీ సూటుబూటు వేసుకుని చాలా క్లాస్గా ఉంటారు. ఆయన వెనుక ఖరీదైన బెంట్లే లగ్జరీ కారు కూడా ఉంది. కానీ, ఒక టేబుల్పై కూర్చొని బన్నీ బీడీ కాలుస్తూ ఉంటారు. బాగా బలిసినోడు ఇలా బీడీ కాల్చడమేంటిరా బాబూ అని ఈ ఫస్ట్లుక్ పోస్టర్ వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నారు. అయితే, అతను సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయి కాబట్టే బిలియనీర్ అయినప్పటికీ బీడీ కాలుస్తూ ఉంటారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బాలీవుడ్లో కాజల్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
స్టార్ నటి కాజల్ అగర్వాల్కు టాలీవుడ్లో ఉన్నంత డిమాండ్ బాలీవుడ్లో లేదు. ఇక్కడ ఆమె సినిమా చేయాలంటే రెమ్యునరేషన్ కోటికి తక్కువ తీసుకోలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం కాజల్ ఇంకా స్ట్రగ్లర్ అనే చెప్పాలి.
Samayam Telugu | Updated:
Sep 5, 2019, 05:03PM IST
బాలీవుడ్లో కాజల్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ని సినిమాలో కథానాయికగా ఎంపిక చేసుకోవాలంటే ఎంతకాదన్నా నిర్మాతలు ఆమెకు కోటి రూపాయలు సమర్పించుకోవాల్సిందే. ఇక్కడ ఆమెకున్న డిమాండ్ అలాంటిది. టాలీవుడ్లో క్లిక్ అయినంతగా బాలీవుడ్లో ఆమె పేరు తెచ్చుకోలేకపోయారు. ఆమె బాలీవుడ్లో నటించిన తొలి సినిమా ‘సింగం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత ‘దో లఫ్జోంకీ కహానీ’ అనే చిత్రంలో అంధురాలి పాత్రలో నటించారు. ఈ సినిమా మ్యూజిక్కు మంచి స్పందన వచ్చింది కానీ సినిమా అట్టర్ ఫ్లాపైంది. దాంతో ఇక ఆమె బాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడదని అనుకున్నారు అభిమానులు.
కానీ ఇటీవల కాజల్ హిందీలో ఓ సినిమాకు సంతకం చేసింది. సినిమా పేరు ‘ముంబయి సాగా’. జాన్ అబ్రహం ఇందులో కథానాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇందులో కాజల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు, ఓ పాటలో మాత్రమే ఆమె కనిపిస్తారట. ఇందుకోసం కాజల్ తీసుకున్న పారితోషికం రూ.30 లక్షలు. బాలీవుడ్లో ఆర్టిస్ట్లు తీసుకునే పారితోషికంతో సమానమది. దీనిని బట్టే అర్థమవుతోంది ఆమె బాలీవుడ్లో A లిస్ట్ నటి కాదు. దక్షిణాదిలో డిమాండ్ చేసినంతగా బాలీవుడ్లో డిమాండ్ చేయలేనని ఆమె క్యాస్టింగ్ బృందానికి తెలిపారట. కనీసం ఈ సినిమాతోనైనా బాలీవుడ్లో తన దశ మారుతుందని కాజల్ ఆశిస్తున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నాది కూడా ఇదే పరిస్థితి. ‘హిమ్మత్వాలా’ అనే సినిమాలో తమన్నా అజయ్ దేవగణ్కు జోడీగా నటించారు. ఈ సినిమా ఫ్లాప్ కా బాప్గా నిలిచింది. ఆ తర్వాత ‘హమ్షకల్స్’ అనే సినిమాలో నటించారు. ఇందులో నటిస్తున్నప్పుడే సినిమా ఆడదని కొందరు నటీనటులు అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా ఒక్కసారి కూడా చూడలేనంతగా ఫ్లాప్ అయింది. దాంతో ఇక తాను హిందీ సినిమాల్లో నటించబోనని ఒకానొక సమయంలో తమన్నా మీడియాతో చెప్పారు. తనకు దక్షిణాదిలో ఇంత మంది అభిమానులు ఉన్నప్పుడు హిందీలో నటించాల్సిన అవసరం ఏంటని అన్నారు. కానీ ఆమె ప్రస్తుతం ‘ఖామోషి’ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. అంతేకాదు నవాజుద్దిన్ సిద్దిఖికి జోడీగా ‘బోలే చూడియా’ సినిమాకు కూడా సంతకం చేశారు. అంటే తెలుగులో ఓ రేంజ్లో వెలుగుతున్న భామలకు బాలీవుడ్లో జీరో డిమాండ్ ఉందని అర్థమవుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నందిపై లెజెండ్ స్పందన: మాటల్లేవ్.. చేతలే!
టాలీవుడ్లో నంది అవార్డుల ప్రకటన వేడి రాజేసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన నంది అవార్డులపై తీవ్రస్థాయిలో విమర్శలు తలెత్తుతున్నాయి.
TNN | Updated:
Nov 18, 2017, 05:43PM IST
టాలీవుడ్‌లో నంది అవార్డుల ప్రకటన వేడి రాజేసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన నంది అవార్డులపై తీవ్రస్థాయిలో విమర్శలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య నటించిన ‘లెజెండ్’ మూవీకి ఏకంగా 9 అవార్డులు ప్రకటించడంపై ఇండస్ట్రీ నుండి భిన్న స్వరాలు వినపడుతున్నాయి. కాగా ఈ వివాదంపై 2014 నంది అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.
‘లెజెండ్’ సినిమా 9 నంది అవార్డులను గెలుచుకుంది అంటే.. అది సమిష్టి విజయంతోటే సాధ్యమయ్యిందన్నారు. ఇక వివాదంపై స్పందిస్తూ... ‘లెజెండ్’ మూవీకి వివాదాలు కొత్తేం కాదన్నారు. ఈ టైటిల్‌ను అనౌన్స్ చేసినప్పడే వివాదం రేగిందని అయితే.. తమ సినిమా ఏంటో తమకు తెలుసు.. చూసిన ప్రేక్షకులకు తెలుసు అందుకే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందన్నారు. మా ‘లెజెండ్’ సినిమా మాటలు కాదు అన్నీ చేతలతో చూపించిందన్నారు. దీనికి ఆ సినిమా సాధించన రికార్డులే సాక్ష్యం అన్నారాయన. ఇలాంటి సినిమాపై అవార్డుల వర్షం కురిపించిన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ. | 0business
|
SYNCRONIKY
సింక్రోనికి హైదరాబాద్ కీలక మార్కెట్
హైదరాబాద్, జూలై 8: సింక్రోని ఫైనాన్షియల్స్ కొత్తగా హైటెక్సిటీలోని నాలెడ్జ్సిటీ వద్ద ఉన్న కొత్తభవనంలోకి వెళ్లింది. నగరంలో తన రెండో కార్యాలయాన్ని కూడా విశాలమైన ప్రాంగణంలో ప్రారంభించింది. అమెరికన్ కాన్పులేట్ జనరల్ ప్రారంభించారు మూడంతస్తుల్లో ఉన్న ఈకార్యా లయం ఏర్పాటుద్వారా తెలంగాణ అవసరాలు తీర్చగలుగుతామని సంస్థ ప్రకించింది. సంస్థ లీడ్గోల్డ్ ధృవీకరించిన గ్రీన్ బిల్డింగ్గా అవతరించింది. సింక్రోని ఫైనాన్షియల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఫైసల్ ఉద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్లో మా ఉనికిని విస్తరించడం వల్ల ఎంతో సంతోషంగా ఉంద న్నారు. అమెరికా వెలుపల సింక్రోని ఫైనాన్షియల్కు అత్యంత కీలకమైన సైట్ అతిముఖ్యమైన మార్కెట్ హైదరాబాద్ కావడంతో అత్యాధునిక వసతులతో కూడినకార్యాలయం ప్రారంభించామని వెల్లడించారు. | 1entertainment
|
Hyd Internet 94 Views Amir khan and Virat kohli
Amir khan and Virat kohli
ముంబయి: ఈసారి దీపావళి మరింత ప్రత్యేకం కానుంది. ఇద్దరు పెద్ద సెలబ్రిటీలు తొలిసారి ఒకే షోలో అలరించబోతున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, టీం ఇండియా రథసారథి విరాట్ కోహ్లీ. ఓ హిందీ టీవీ ఛానెల్ ఆమిర్, కోహ్లీతో చాట్ షో నిర్వహించబోతోంది.ఈ చాట్ షోలో కోహ్లీ, ఆమిర్ తమ వ్యక్తిగత, వృత్తికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకోబోతున్నారట. ఈ షోని దీపావళికి ప్రసారం చేయనున్నారు. ఈ షోతో ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్ కూడా ఓ రేంజ్లో పెరగబోతున్నాయట. షో కోసం సదరు ఛానెల్ ఆమిర్, కోహ్లీకి భారీ మొత్తంలోనే పారితోషికం ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. | 2sports
|
internet vaartha 194 Views
న్యూఢిల్లీ : కీలకమైన వెస్టిండీస్ పర్యటనకు భారత క్రికెట్ జట్టు బయలుదేరనున్న వేళ టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ జట్టులోని లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇప్పటి వరకు వన్డేలు,టి20ల మూడ్లో ఉన్న ఆటగాళ్లు అంత త్వరగా సుదీర్ఘ మ్యాచ్లు ఆడటానిని సన్నద్ధం కాలేరని, మన వాళ్లకు దూకుడు అధికమని,అది టెస్ట్ ఫార్మాట్కు సరిపడదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఎట్టి పరిస్థితుల్లోనూ దూకుడు షాట్ల జోలికి పోయి వికెట్లు పారేసుకోరాదని సలహా ఇచ్చాడు.రివర్స్ స్వింగ్లో వచ్చే బంతులను ఎదుర్కొవడంలో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారని,స్వీప్ షాట్ ఆడటంలో మరింత ప్రాక్టీస్చేయాల్సి ఉందన్నాడు. మేము ఆడిన ఆఖరి టెస్ట్ సిరీస్ దక్షిణాఫ్రికా నుంచి చాలానే నేర్చుకున్నామని, ఏదైనా విరామ సమ యానికి ముందు, తరువాత వికెట్లు చేజార్చు కోకుండా ఉంటే మెరుగైన స్కోరు చేయవచ్చని తెలుసుకున్నాం. ఆటలో ఆధిప్యం చూపిస్తూ ఉండాలి, వికెట్లను త్వరగా కోల్పోరాదు అని వివ రించాడు.కాగా సమీప భవిష్యత్లో భారత జట్టు 17 టెస్టు మ్యాచ్లను ఆడనుంది.టీమిండియాను ఒక మంచి జట్టుగా మలచడానికి ఈ మ్యాచ్లు ఆత్యంత కీలకమని క్రికెట్ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.ఇక అనిల్కుంబ్లే కోచ్గా వచ్చిన తరువాత,ఆయనకున్న విదేశీ అనుభవం జట్టుకు ఎంతో ఉపకరిస్తుందన్నాడు.అనిల్ అన్న జట్టుతో ఉండటంతో ఆటగాళ్లకు ఎంతో ధైర్యంగా ఉంటుంది.బౌలర్లు తమకు మరింత మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.దేశం తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా చరిత్ర సృష్టించిన కుంబ్లే సలహాలు మాకెంతో ముఖ్యం అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
ఒక్కో టెస్టుపై దృష్టిపెడతూ ముందుకు
నిరంతరం మారే ర్యాంకులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆడదని కోహ్లీ స్పష్టం చేశాడు.అలాగే రానున్న రోజుల్లో జరగబోయే టెస్టు మ్యాచ్లకు తామెలా సన్నద్ధమయ్యామో వెస్టిండీస్ పర్యటన తేలుస్తుందని,తమ టార్గెట్ నెంబర్ వన్కు చేరడం కాదని,మంచి క్రికెట్ ఆడటమే తమకు ముఖ్యమని తేల్చాడు. వెస్టిండీస్తో ఈనెల 21 నుంచి భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది.అయితే ఈ సిరీస్ను 4-0తో క్లీన్ స్వీప్ చేస్తే భారత్ నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంటుంది.ఒక టెస్టు జట్టుగా మాకు మేము సవాల్ను ఎదు ర్కొంటూ ఓక అంచనాకు రావడానికి ఇదే సరైన అవకాశం.భవిష్యత్తులో మేమెలా ఆడతామో కొన్ని నెలల్లో తేలుతుంది.
కాగా ఈ ఫార్మెట్లో నెంబర్ వన్ ర్యాంకు పొందడం మా టార్గెట్ కాదు, మా ప్రధాన టార్గెట్ మంచి క్రికెట్ ఆడటమేనన్నాడు. ఒక్కో టెస్టుపై దృష్టి పెడుతూ ముందుకు సాగుతాం, టెస్టు జట్టులో కెఎల్ రాహుల్ ఉన్నా కీపర్గా తమ తొలి ప్రాధాన్యం వృద్ది మాన్ సహాకేనని తేల్చాడు.సుమారు 15 నెలలు టీమిండియాకు దూరంగా ఉన్న పేసర్ షమీ నాణ్యమైన బౌలర్ అని కొనియాడాడు. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నన్ను ఓ హంతకుడు, తీవ్రవాది అన్నట్టు చూశారు -ధోనీ
వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్ కెప్టేన్ ఎం.ఎస్. ధోనీ రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన 'ఎం.ఎస్. ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ'...
TNN | Updated:
Sep 16, 2016, 09:56PM IST
వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్ కెప్టేన్ ఎం.ఎస్. ధోనీ రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన 'ఎం.ఎస్. ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ' సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా న్యూయార్క్లో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్లో పాల్గొన్న ధోనీ.. తన పాత జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు. 2007లో వరల్డ్ కప్ నుంచి ఇండియన్ టీమ్ నిష్క్రమించినప్పుడు తమ పట్ల భారత మీడియా వ్యవహరించిన తీరు చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తంచేశాడు ధోనీ. వెస్ట్ ఇండీస్ నుండి వచ్చి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేటప్పటికీ భారత మీడియా బయట తమని చుట్టుముట్టింది. టైట్ పోలీసు సెక్యురిటీ మధ్య తమని ఓ పోలీసు స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లేటప్పుడు కూడా మీడియా వాళ్లు తమ కెమెరాలు, లైట్లతో వాహనాల్లో మమ్మల్ని వెంబడించారు. దాదాపు మేమేదో పెద్ద నేరం చేసిన హంతకుడిగానో లేక ఉగ్రవాదిగానో ట్రీట్ చేశారు. అప్పుడే మా ఇంటిపై రాళ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. జీవితంలో ఎటువంటి సందర్భాన్ని ఎలా డీల్ చేయాలని అప్పుడే నాకు తెలిసొచ్చింది. మనసులో ఏ భావోద్రేకాలున్నా... అవి మనసులోనే దాచుకోవాలని అప్పుడే నేర్చుకున్నా. ఒక విధంగా ఆ సందర్భం నా జీవితాన్ని మార్చేసింది అని ధోనీ ఆనాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాడు. | 2sports
|
ఓ షాపింగ్ మాల్ లాంచ్ కార్యక్రమంలో ప్రగ్యా జైశ్వాల్ తళుకులు
First Published 9, Sep 2017, 3:18 PM IST
ఓ షాపింగ్ మాల్ లాంచ్ కార్యక్రమంలో ప్రగ్యా జైశ్వాల్ తళుకులు
ఓ షాపింగ్ మాల్ లాంచ్ కార్యక్రమంలో ప్రగ్యా జైశ్వాల్ తళుకులు
ఓ షాపింగ్ మాల్ లాంచ్ కార్యక్రమంలో ప్రగ్యా జైశ్వాల్ తళుకులు
ఓ షాపింగ్ మాల్ లాంచ్ కార్యక్రమంలో ప్రగ్యా జైశ్వాల్ తళుకులు
ఓ షాపింగ్ మాల్ లాంచ్ కార్యక్రమంలో ప్రగ్యా జైశ్వాల్ తళుకులు
Recent Stories | 0business
|
amitabh bachchan and madhuri dixit feature on elections campaign posters in pakistan
పాక్ ఎన్నికల్లో అమితాబ్, మాధురీ దీక్షిత్.. ఫొటోలు వైరల్!
పాకిస్థాన్లో మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పీటీఐ (పాకిస్థాన్ తెహ్రీక్ - ఎ - ఇన్సాఫ్) పార్టీకి చెందిన ఓ పోస్టర్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
Samayam Telugu | Updated:
Jul 23, 2018, 05:08PM IST
పాకిస్థాన్లో మరో రెండు రోజుల్లో (జులై 25) సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పీటీఐ (పాకిస్థాన్ తెహ్రీక్ - ఎ - ఇన్సాఫ్) పార్టీకి చెందిన ఓ పోస్టర్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టర్లపై పార్టీ అభ్యర్థి ఫొటోతో పాటు బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్ ఫొటోలు ఉండటమే అందుక్కారణం. పాకిస్థాన్లోని ముల్తాన్లో ఓ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న సర్దార్ అబ్బాస్ డోగార్ తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పోస్టర్లలో బిగ్ బి, మాధురి ఫొటోలను వాడుకుంటున్నట్లు పాకిస్థానీ జర్నలిస్టు ఒకరు ట్వీట్ చేశారు.
ఈ పోస్టర్లపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ‘పాకిస్థాన్ ఎన్నికల బరిలో బాలీవుడ్ దిగ్గజాలు మాధురి, అమితాబ్..’ అంటూ ఓ నెటిజన్ కామంట్ పెట్టగా, పాక్ రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లనున్న దిగ్గజాలు అంటూ మరో నెటిజన్ ఛలోక్తి విసిరారు.
‘భారతీయ సినిమాలను పాక్లో విడుదల చేయడాన్ని అడ్డుకుంటారు.. కానీ, బాలీవుడ్ నటీనటులను మాత్రం తమ ప్రచారం కోసం వాడుకుంటున్నారు’ అంటూ ఓ నెటిజన్ పెదవి విరిచాడు. పాక్లో బాలీవుడ్ సినిమాల విడుదలపై ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
Oh, khair. Sardar Dogar aap par Sardar Bachchan aur Sardarni Dixit qurban. https://t.co/SgW39qy30k
— Nadeem Farooq Paracha (@NadeemfParacha) 1532282380000
@NadeemfParacha When a legend take politics to a new level :P
— Hammad (@Hammad_Rza) 1532284905000
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి.. అమితాబ్, మాధురితో పాటు ఓ చిన్నారి ఫొటోను కూడా వాడుకోవడం గమనార్హం. ఆ చిన్నారి ఎవరనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. పాక్లో హిందువుల ఓట్లను ఆకర్షించడానికే సదరు అభ్యర్థి ఈ వినూత్న ప్రచారానికి తెరతీసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దిగ్గజాలకు పాక్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉన్న విషయం తెలిసిందే. | 0business
|
internet vaartha 187 Views
తాజాగా హైదరాబాద్కు పెరుగుతున్న ప్రాధాన్యం
బెంగళూరు : దేశంలో ఐటిరంగం, ఐటి సేవలరంగం వృద్ధికారణంగా రియాల్టీ, ఆఫీస్ స్పేస్ రంగాలకు భారీ డిమాండ్ ఏర్పడుతున్నది. మొత్తం ఆఫీస్ రియల్ఎస్టేట్ రంగానికి సంబంధించి 58 శాతం వరకూ ఐటి కంపెనీలే కొనుగోలుచేసాయి. లేదా లీజుకు తీసుకున్నాయని సర్వేలు వెల్లడిస్తు న్నాయి. ఇందుకు కారణం దేశీయ, విదేశీ ఐటి కంపెనీలు బహుళజాతి సంస్థలు బహుముఖంగా ప్రజ్వరిల్లడమే ఇందుకు కీలకం. పూణేలో ఐటి రంగం 74శాతం ఆఫీస్ రియాల్టీ స్పేస్ వినియోగి స్తోంది. తదనంతరం దేశంలో గుర్గావ్ 64శాతం వాటాతో ఉంది.
మూడోస్థానంలో బెంగలూరు 57 శాతం ఆఫీస్ స్పేస్ను ఐటి ఐటిసేవల సంస్థలే ఆక్ర మించినట్లు తేలింది. కేవలం ఈ మూడునగరాల్లోనే ఐటి సంస్థలు ఎక్కువ ఆఫీసు స్థలాలు తీసుకున్నాయి. ఎందుకంటే ఈ నగరాల్లోనే ఎక్కువ మంది ప్రతిభావంతులు ఉండటం, గ్రేడ్ ఎ కేటగిరీ భవనాలు తక్కువ అద్దెలకు లభించడం కూడా ఒక కారణమన్నది తెలుస్తోంది. కొల్లియర్స్ ఇండియా అసోసి యేట్ డైరెక్టర్ సురభిఅరోరా మాట్లాడుతూ భారీ గాను, విశాలంగా ఉన్న భవనాలను ఐటి సంస్థలు ఎక్కువ కోరుతున్నాయి. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, పార్కింగ్ సౌలభ్యం, కఫెటేరియా, జిమ్ వంటి సౌకర్యాలు కూడా కోరుతున్నట్లు అంచనా. భారత్లో ఇందుకు అనువైన వాతావరణం ఉంది. భూస్వాములు కూడా టెక్నాలజీ సంస్థలకే ఎక్కువ కేటాయించేందుకు ఇష్టపడుతున్నట్లు తేలిందన్నారు. సింగపూర్లో టెక్నాలజీ సంస్థలు ఎక్కువగా ప్రీమియం గ్రేడ్ఎ భవనాలకు ప్రాధా న్యతనిస్తారు. అదికూడా సెంట్రల్ బిజినెస్ జిల్లాల్లోనే ఉంటాయి. లేదా బిజినెస్ పార్కుల్లో ఎక్కువ కోరుకుంటాయని నివేదిక స్పష్టంఅయిం ది. భారత్లాంటి ఎక్కువవృద్ధి ఉన్న మార్కెట్ల లో క్యాంపస్తరహా గ్రేడ్ ఎ భవనాలు సిబిడి, సెకండరీ బిజినెస్ జిల్లా ప్రాంతాల్లో ఎక్కువ కోరుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎది గింది. రెండేళ్లపాటు రాజకీయ అనిశ్చితిలో ఉన్న నగరం ఇపుడిపుడే పునరుద్ధరణ జరుగుతోంది. గూగుల్, యూబర్, యాపిల్ వంటి కంపెనీలు భారీస్థాయిలో ఆఫీస్ స్పేస్ను హైదరాబాద్లో తీసుకున్నట్లు అంచనా. | 1entertainment
|
Midhali Raj
భారత్ స్కోరు 281-2 : ఇంగ్లండ్ లక్ష్యం 282
లండన్: లండన్ వేదికగా ప్రారంభమైన విమెన్స్ వరల్డ్ కప్ తొలిమ్యాచ్లో భారత్ జట్టు 50 ఓవర్లలకు 2 వికెట్ల నష్టానికి 281 పరుగుల చేసింది.. ఓపెనర్లు పూనమ్ రౌట్ (86), స్మృతలి మంధాన (90) అద్భుత ఆరంభం అందించారు.. తర్వాత మిథాలీ రాజ్ (71), రెచ్చిపోయి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ప్రదర్శన చేసింది.. హర్మన్ ప్రీత్ కౌత్ 24 పరుగులతో రాణించింది.. దీంతో ఇంగ్లండ్కు 282 విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.. | 2sports
|
Apr 03,2015
కేజీ బేసిన్లో చమురు అన్వేషణకు ఓఎన్జీసీ భారీ పెట్టుబడి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) కృష్ణా-గోదావరి బేసిన్లో తాజాగా చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ కోసం దాదాపురూ.40.000 కోట్ల మేర నిధులను ఖర్చు చేయనుంది. సంస్థ ఛైర్మన్ దినేష్ కె సరాఫ్ ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. కేజీ బేసిన్లో నిక్షేపాల అన్వేషణకు తాము క్లస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరంలోని రెండో ఆర్థభాగంలో తాము ఈ కొత్త విధానానికి సంబంధించిన పూర్తి ప్రణాళికను ప్రభుత్వానికి అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం తూర్పు తీరంలోనే రూ.40000 కోట్ల మొత్తాన్ని వినియోగించనున్నట్లు ఆయన వివరించారు. తమ సంస్థ ఒక ప్రాంతంలోనే అన్వేషణ కొరకు ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే ప్రప్రథమన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Visit Site
Recommended byColombia
2014 పర్యటనలో ఆరు ఇన్నింగ్స్ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాధించిన పుజారాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని పుజారాకు గుర్తుకు చేయగా.. విమర్శకుల నోళ్లూ మూయించాల్సిన అవసరం నాకు లేదని స్పష్టం చేశాడు. ‘అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు.. నేను పరుగులు చేస్తే చాలు.. రన్స్ చేయడాన్ని నేను ఇష్టపడతా. మిగతా వ్యవహారాల్లో తలదూర్చాల్సిన అవసరం నాకు లేద’ని పుజారా తెలిపాడు. నా బాధ్యత పరుగులు చేయడం, స్వదేశమైనా, విదేశమైనా.. నేను పరుగులు చేస్తూనే ఉంటాన’ని పుజారా చెప్పుకొచ్చాడు. మెల్బోర్న్ సెంచరీని ముఖ్యమైందిగా పేర్కొన్న పుజారా.. అడిలైడ్లో జట్టు విజయానికి దోహదం చేసిన శతకాన్ని ప్రత్యేకమైందిగా అభివర్ణించాడు.
2014లో పుజారా తొలిసారి ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టు సిరీస్ ఆడాడు. ఆ సిరీస్ను బాగానే ఆరంభించిన పుజారా.. తొలి ఇన్నింగ్స్లోనే అర్ధ శతకం బాదాడు. కానీ మిగతా ఇన్నింగ్స్ల్లో ఆకట్టుకోలేకపోయాడు. గత పర్యటనలో ఎక్కువగా పరుగులు చేయలేకపోయానన్న పుజారా.. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని చెప్పాడు. గత పర్యటన నేర్పిన పాఠాల వల్లే ఈసారి శతకాలు చేయగలుగుతున్నానని చెప్పాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
petition filed in the hyderabad high court to stop bigg boss telugu show
‘బిగ్ బాస్’ బూతు షో.. నిలిపివేయండి: హైకోర్టులో పిల్
‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షోకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు కేసులు పెట్టారు. ఇప్పుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
Samayam Telugu | Updated:
Jul 16, 2019, 01:26PM IST
ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో సీజన్ 3 వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేస్తూ జర్నలిస్టు శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు నలుగురు నిర్వాహకులపై కేసులు కూడా నమోదు చేశారు. ఇదిలా ఉంటే, ఈ రియాలిటీ షోను పూర్తిగా నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హోస్ట్ నాగార్జునతో పాటు షో నిర్వాహకులు పదిమందిని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.
బిగ్ బాస్ షోను నిలిపివేయడం సాధ్యంకాని పక్షంలో రాత్రి 11 గంటల తర్వాతే ఎపిసోడ్స్ను ప్రసారం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. సినిమా మాదిరిగా ప్రతి ఎపిసోడ్ సెన్సార్ చేశాకే టీవీలో ప్రసారం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ‘బిగ్ బాస్’ బూతు షో మాదిరిగా తయారైందని, దీని ప్రభావం జనాల మీద చాలా ఉంటోందని పిటిషనర్ పేర్కొన్నారు. | 0business
|
హాట్ సమ్మర్,, కూల్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తున్న చెర్రీ-ఉపాసన
Highlights
సుకుమార్, రామ్ చరణ్ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్
హాట్ సమ్మర్,, కూల్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తున్న చెర్రీ-ఉపాసన
ఏడు గంటలపాటు నాన్ స్టాప్ ట్రెకింగ్ చేసి చాలా కేలరీలు కరిగిచ్చారట
మెగాపవర్స్టార్ రామ్చరణ్ తేజ్ ఇప్పుడు రెండు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే.. నిర్మాతగానూ మారారు. ఇటీవల ‘ధృవ’తో కథానాయకుడిగా, ‘ఖైదీ నెంబర్ 150’తో నిర్మాతగా ఘనవిజయాలను అందుకున్నారు. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న చరణ్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 151వ సినిమాను నిర్మిస్తున్నారు.
సుకుమార్ సినిమా కోసం మండుటెండల్లో గోదావరి జిల్లాలో షూటింగ్లో పాల్గొన్నారు చెర్రీ. ఇప్పుడు కాస్త బ్రేక్ దొరకింది. దీంతో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి లండన్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా యూరప్లోని ఓ మంచుకొండపై భార్యతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లారు. దాదాపు ఏడుగంటలపాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి పర్వతశిఖరానికి చేరుకున్నారట. ఈ ట్రెక్కింగ్ ద్వారా ఎన్నో కేలరీలను కరిగించేశామని ఉపాసన ట్విట్టర్లో ఓ పోస్ట్ షేర్ చేసింది.
Last Updated 25, Mar 2018, 11:53 PM IST | 0business
|
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్ (ఫోటోలు)
First Published 3, Nov 2018, 10:32 AM IST
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను లాంచ్ చేసిన టాప్ మోడల్స్
Recent Stories | 0business
|
Mar 26,2017
సీఐఐ 'దక్షిణాది' చైర్మెన్గా విక్రమ్ కిర్లోస్కర్
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం : కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ) 2017-18 సంవత్సరానికి దక్షిణాది రీజియన్ చైర్మెన్గా టాయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రయివేట్ లిమిటెడ్ వైస్ చైర్మెన్ (బెంగళూరు) విక్రమ్ కిర్లోస్కర్ నియమితులయ్యారు. డిప్యూటీ చైర్మెన్గా టీవీ సుందరం అయ్యంగర్ అండ్ సన్స్ ప్రయివేటు లిమిటెడ్ (మధురై) జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ డినేష్ ఎంపికయ్యారు. 2016-17 సంవత్సరానికి గానూ దక్షిణాది రిజియన్ సీఐఐ డిప్యూటీ చైర్మెన్గా విక్రమ్ కిర్లోస్కర్ సేవలదించారు. 2012 నుంచి సీఐఐ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఆయన కొనసాగుతున్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అల యెన్స్ (జీఐటీఏ) చైర్మెన్ గా విక్రమ్ వ్యవ హారి స్తున్నారు. దీంతో పాటు సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యు ఫాక్చర్స్ (సీయామ్)కు అధ్యక్షునిగా కూడా ఆయన పని చేశారు. ఇక డిప్యూటీ చైర్మెన్గా ఎంపికైన దినేష్ సీఐఐ కీలక సభ్యుడుగా ఉన్నారు. గతంలో తమిళనాడు రాష్ట్ర కౌన్సిల్ సీఐఐ చైర్మెన్గా కూడా ఆయన పనిచేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 18, Aug 2018, 5:43 PM IST
Highlights
ప్రభాస్ తో ఆమె నటించడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ మాత్రం పూజాకి బదులుగా మరొక హీరోయిన్ ని చూడమని దర్శకనిర్మాతలకు సూచించినట్లు సమాచారం. హీరోయిన్ గా ఇప్పటివరకు ఆమె ఖాతాలో సరైన హిట్టు లేదు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత ప్రభాస్ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి పని చేయనున్నాడు. 'జిల్' సినిమా తరువాత రాధాకృష్ణ కుమార్.. ప్రభాస్ తో కలిసి పని చేయాలని ఎదురుచూస్తున్నాడు.
త్వరలోనే ప్రభాస్ ఈ సినిమా మొదలుపెట్టనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేని తీసుకోవాలని దర్శకుడు రాధాకృష్ణ అనుకున్నారు. ప్రభాస్ తో ఆమె నటించడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ మాత్రం పూజాకి బదులుగా మరొక హీరోయిన్ ని చూడమని దర్శకనిర్మాతలకు సూచించినట్లు సమాచారం. హీరోయిన్ గా ఇప్పటివరకు ఆమె ఖాతాలో సరైన హిట్టు లేదు.
ఈ కారణంగానే ప్రభాస్ తన సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా వద్దనుకుంటున్నాడట. దీంతో ఇప్పుడు మరొక హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. ప్రభాస్ తీసుకున్న డెసిషన్ తో చేసేదేంలేక సైలెంట్ గా ఉండిపోయింది పూజా. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత', అలానే మహేష్ సరసన 'మహర్షి' సినిమాల్లో నటిస్తున్నారు.
Last Updated 9, Sep 2018, 12:34 PM IST | 0business
|
JIO
నంబర్వన్ బ్రాడ్బాండ్ ‘ఆర్జియో
ముంబయి, మే 21: రిలయన్స్జియో దేశంలోనే నంబర్వన్ బ్రాడ్బ్యాండ్ పంపిణీ సంస్థగా నిలిచిం ది. 108.68 మిలియన్ల చందాదారులతో జియో మొదటిస్థానంలోఉంటే భారతి ఎయిర్టెల్ 47.04 మిలియన్ల చందాదారులతో నిలిచింది. వొడాఫోన్ 37.71 మిలియన్లు, ఐడియా 24.70 మిలియన్ల చందాదారులతో వరువెంబడిస్థానాల్లో నిలిచింది. భారతి మొత్తం చందాదారులసంఖ్య 273.65 మిలియన్లుగా ఉంది. వొడాఫోన్ 209.06 మిలియన్ల మంది ఉంటే ఐడి యా సెల్యులర్ చందాదారులు 195.37 మిలియన్లుగా ఉంది.
జియో మొత్తం చందాదారుల సంఖ్య 108.68 మిలి యన్లుగా ఉంది. రిలయన్స్జియో ఇన్ఫో కామ్ మొత్తం ఏడునెలలకాలంలోనే 108 మిలియన్ల చందాదారులను రాబట్టింది. భారత్జనాభా 120 కోట్లుగా ఉంటే మొబైల్ చందాదారులసంఖ్య 119.45 కోట్లుగా ఉంది. టెలికాం చందాదారుల సంఖ్య మార్చినెలలో 0.5శాతం పెరిగిం ది. రిలయన్స్జియో కొంత కారణం అయితే, దేశంలో ఫిక్సెడ్లైన్ కనెక్షన్లలో మంచి వృద్ధిని భారత్ సాధిస్తోంది. ఫిబ్ర వరి చివరినాటికి 118.85 కోట్లమందిగా అంచనా వేస్తే మార్చి చివరినాటికి 119.46 కోట్ల మంది చందాదారులున్నట్లు అంచనావేసారు. ట్రా§్ు విడుదలచేసిన గణాంకాలను పరిశీలిస్తే దేశ జనాభా కు సరిసమానంగా మొబైల్చందాదారులున్నట్లు అంచనా. అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ఫోన్ తప్పని సరి అవుతున్నది.
వైర్లెస్ విభాగంలోనే ఎక్కువ మంది ఉన్నారు. 117.1 కోట్ల మంది ఉన్నారు. 5.98 మిలియన్ల జనాభా కొత్తగా మొబైల్ చందా దారులుగా ఉన్నారు. ఇక ఫిక్సెడ్లైన్ కనెక్షన్ల పరంగా చూస్తే క్రమానుగత వృద్ధితో ఉన్నాయి. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ రికవరీ దిశగా సాగుతోంది. వైర్లైన్ చందాదారులు 24.35 మిలియన్లుగా ఫిబ్రవరిలో ఉంటే మార్చి చివరినాటికి 24.40మిలియన్ల మందివరకూ ఉన్నా రు.
2003 తర్వాత ఫిక్సెడ్లైన్ల వృద్ధి గణనీయం గా తగ్గుతూ వస్తోంది. 40.3 మిలియన్ల వైర్లైన్ కనెక్షన్లు దేశంలో 2007జనవరి ఒకటవ తేదీనాటికి రిజిస్టరు అయి ఉన్నాయి. మొబైల్ టెలిఫోని విభా గం 5.83 మిలియన్ల మంది చందాదారులను జియో రాబట్టింది.
భారతిఎయిర్టెల్ నికర చందాదారులు అదనంగా 2.99 మిలియన్ల మంది ఉన్నారని అంచనా. ఐడియాకు అదనంగా 2.09 మిలియన్ల కస్టమర్లు బిఎస్ఎన్ఎల్కు 2.07 మిలియన్ల కస్టమర్లు ఈనెలలో వచ్చి చేరారు. వొడా ఫోన్ 1.83 మిలియన్ల మంది కొత్తచందాదారులుం టే ఎంటిఎన్ఎల్ 286 మంది కొత్త కస్టమర్లను చేర్చుకున్నది. ఇకఈనెలలోనే టెలినార్ తన బిజినెస్ ను ఎయిర్టెల్కు అమ్మేస్తే సిస్టెమాశ్యాం, ఎయిర్సెల్ కంపెనీలు ఆర్కామ్తో విలీనానికి వస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ 44వేల మంది కొత్త కస్టమర్లను రాబట్టిం ది. టాటా టెలిసర్వీసెస్, భారతి ఎయిర్ టెల్, వొడా ఫోన్ వంటి కంపెనీలు కొత్త కస్టమర్లను ఎక్కువమందిని రాబట్టుకోగలి గాయి. బ్రాడ్ బ్యాండ్ విభాగంలోచందా దారులు 276.52 మిలియన్లకు చేరారు. ఫిబ్రవరిలో 261.3 మిలియన్ల నుంచి మరింతగాపెరిగారు.
రిలయన్స్జియో ఆఫర్లవల్లనే 4జి మొబైల్ సేవలపరంగా మరింతగా వృద్ధిని సాధించింది. మొత్తం ఐదు టెలికాం కంపెనీలు 87.48 శాతం మార్కెట్ వాటాను సాధించా యి. రిలయన్స్జియో 108.68 మిలి యన్లు, ఎయిర్టెల్ 49.13 మిలియన్లు, వొడా ఫోన్ 37.72 మిలియన్లు, ఐడియాసెల్యులర్ 24.70 మిలియన్లు, బిఎస్ఎన్ఎల్ 21.67 మిలి యన్ల మంది ఉన్నారని అఈంచనా. మొత్తం వైర్ లెస్ చందాదారు బేస్ పరంగాచూస్తే 1170.18 మిలియన్లుగాఉంది. వీరిలో 1016.38 మిలియన్ల మంది ఇప్పటికీ చందాదారులుగా కొనసాగుతున్నారు. | 1entertainment
|
South Afrika won
శ్రీలంకపై దక్షిణాఫ్రికా విజయం
జోహన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికా అయిదు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకపై జరిగిన మూడవ వన్డేలో విజయం సాధించింది.దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ను సొంతం చేసుకుంది.డే అండ్ నైట్ మ్యాచ్లో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న సఫారీలు,ఇంకా రెండు వన్డేలు మిగిలుండగానే సిరీస్ను దక్కించుకున్నారు.శ్రీలంక నిర్ధేశిత టార్గెట్ను దక్షిణాఫ్రికా 32 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిఛేదించిన హసీమ్ అమ్లా 34 పరుగులు,డెప్లెసిస్ 24 పరుగులు,ఢి కాక్ 8 వికెట్లును దక్షిణాఫ్రికా కోల్పోగా ఆ తరువాత ఏబి డివిలియర్స్ 60 నాటౌట్,డుమినీ 28 పరుగులు నాటౌట్ మరో వికెట్ పడకుండా ఆడి జట్టుకు గెలుపును అందించారు.అంతకు ముందు బ్యాట్ిం చేసిన శ్రీలంక 39.2 ఓవర్లలో 163 పరుగులక ఆలౌటయ్యారు.ఓపెనర్లు డిక్వెల్లా 74 పరు గులు,ఉపల్ తరంగా 31 పరుగులు,మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికి మిగతా ఆటగాళ్లుఘోరంగా విఫలమ య్యారు. ఏడుగురు శ్రీలంక ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమి తంకావడంతో ఆ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది.ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేల్లో శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్లో కూడా రెండువందల మార్క్ను చేరకపోవడం గమనార్హం.రెండవ వన్డేలో శ్రీలంక 186 పరుగులకే ఆలౌటైతే,తొలి వన్డేలో 181 పరుగులు నమోదు చేశారు. | 2sports
|
Hyderabad, First Published 2, Sep 2019, 8:50 PM IST
Highlights
ఇలియానా.. ఒకప్పుడు కుర్రకారుని ఊపేసిన పేరిది. దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పోకిరి చిత్రంతో సెన్సేషనల్ గా మారిపోయింది. ఈ నడుము సుందరి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.
ఇలియానా.. ఒకప్పుడు కుర్రకారుని ఊపేసిన పేరిది. దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పోకిరి చిత్రంతో సెన్సేషనల్ గా మారిపోయింది. ఈ నడుము సుందరి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. దాదాపు 6ఏళ్లకు పైగా ఇలియానా టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ సరసన నటించింది.
టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న సమయంలోనే సౌత్ చిత్రాలకు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. కానీ ఇలియానాకు ఆశా భంగమే కలిగింది. బాలీవుడ్ లో ఎక్కువకాలం నిలబడలేకపోయింది. దీనితో టాలీవుడ్ దర్శకులు కూడా ఆమెని మరచిపోయారు. గత ఏడాది రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం మళ్ళీ సౌత్ లో పుంజుకునేందుకు ఇలియానా తన సర్కిల్స్ లో గట్టి ప్రయత్నాలే చేస్తోందట. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన నయనతార, తమన్నా లాంటి ఇలియానా జనరేషన్ బ్యూటీ లని వెతుకుతున్నారు.
నయనతార, తమన్నా కొరటాల చిత్రంలో నటించబోవడం లేదనే వార్తలు రావడంతో ఇలియానా ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందట. వెంటనే తన మేనేజర్ ని కొరటాల శివ వద్దకు పంపి ప్రాధమిక చర్చలు జరిపినట్లు టాక్. రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవని ఎలాగైనా ఈ చిత్రంలో ఛాన్స్ దక్కితే చాలానే ఉద్దేశంతో ఇలియానా ఉన్నట్లు తెలుస్తోంది.
కొరటాల శివ, చిరు ఈ గోవా బ్యూటీ పేరుని పరిశీలిస్తారో లేదో చూడాలి.
Last Updated 2, Sep 2019, 9:22 PM IST | 0business
|
HYUDAI111
నాలుగేళ్లలో హుండై నుంచి 8 కొత్తకార్లు
న్యూఢిల్లీ: కొరియా ఆటోమేజర్ హుండై వచ్చే నాలుగేళ్లలో ఎనిమిది కొత్తకార్లను విడుదల చేయాలనిచూస్తోంది. వీటిలో మూడు కార్లు కొత్త సెగ్మెట్ల నుంచి వస్తుండగా మరో ఐదు కార్లు అప్గ్రేడ్ వెర్షన్తో వస్తున్నాయి. హుండై ఇండియా ఎండివైకె కూ మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్లలో కంపెనీ కనీసం పది కొత్త ఉత్పత్తులు భారత్కు తెస్తుందన్నారు. వీటిలో ఎనిమిది కొత్త కార్లు ఉంటాయన్నారు. ఈ ఏడాదే హుండై గ్రాండ్ ఐ10 ఆధునీకరించిన మోడల్ భారత్లో విడుదలచేసింది. 2018లో కూడా కొత్తకార్లను మోటార్షోలో ప్రదర్శి స్తుంది. ఆటోసెర్వ్2018లో ప్రదర్శన కు సిద్ధంచేస్తోంది.ఎలాంతా సెగ్మెంట్ లోనే కాకుండా ఎంపికచేసిన మోడళ్లు హైబ్రిడ్ఫార్మాట్లో వస్తాయన్నారు. కాంపాక్ట్ సెగ్మెంట్లోపటిష్టంగా ఉన్నా మిడ్సెగ్మెంట్లో అంతగాలేదు. ఇందు కోసం టెక్నాలజీ ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తోంది. 2018 అర్ధభాగంకల్లా హుండై కొత్త డిజైన్కారు విడుదలవు తుందన్నారు.మొత్తం ప్యాసింజర్కార్ల సెగ్మెంట్లో 51శాతంగా ఉంటుంది హుండై గ్రాండ్ ఐ10, ఐ20 క్రెటా వంటి వాటిలో పటిష్టమైన మార్కెట్ ఉందన్నారు. 2017లో కంపెనీకి 17-18శాతం మార్కెట్ వాటా లభిస్తుందని వివరించారు. గతఏడాది కంపెనీ ఐదులక్షల యూనిట్లను భారత్లో విక్రయించిందని, ఉత్పత్తి 6.50లక్షలు జరిగిందని కూ వివరించారు.
చెన్నై సమీపంలో కొత్త యూనిట్ను కూడా వచ్చే 3-4ఏళ్లలో ప్రారంభించి ఉత్పత్తి సామర్ధ్యం పెంచుతామన్నారు. ఆఫ్రికా, మధ్యతూర్పు దేశాల మార్కెట్ మందగమనమే విక్రయాల్లో వెనుకబాటుకు కారణమన్నారు. అయితే దేశీయంగా ఉన్న డిమాండ్కు కంపెనీ సరఫరా చేస్తోందని వివరించారు. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
4వ స్థానం నుంచి ఏడో స్థానానికి జుకర్ బర్గ్
2018 ఏడాది ప్రపంచ ధనవంతులకు దెబ్బ మీద దెబ్బ వేస్తోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు కుదేలవడంతో సంపన్నులకు చెందిన లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది.
TNN | Updated:
Mar 24, 2018, 05:37PM IST
2018 ఏడాది ప్రపంచ ధనవంతులకు దెబ్బ మీద దెబ్బ వేస్తోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు కుదేలవడంతో సంపన్నులకు చెందిన లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. ఈ ఏడాది జనవరి 26 నుంచి ఇప్పటివరకు టాప్ 500 ప్రపంచ కుబేరులు 436 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 28.33లక్షల కోట్లకు పైమాటే. ఒక్క ఈ వారంలోనే ఆ 500మంది 181 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూశారు.
ఇందులో ఎక్కువగా సోషల్మీడియా సంస్థ ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ నష్టపోయారు. జనవరి 26 నుంచి జుకర్బర్గ్ 10.3 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. దీంతో బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీలో జుకర్బర్గ్ 4వ స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయారు. ఇక ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ 7 బిలియన్ డాలర్లు నష్టపోయారు. బెర్క్షైర్ హాత్వే ఛైర్మన్ వారెన్ బఫేట్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆల్ఫాబెట్ సీఈవో ల్యారీ పేజ్ సంయుక్తంగా 17 బిలియన్ డాలర్లు కోల్పోయారు. దీంతో బ్లూమ్బర్గ్ సూచీ ప్రకారం 500 ప్రపంచ కుబేరుల మొత్తం సంపద 5.2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. | 1entertainment
|
cris
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లీన్కు గంభీర్ ప్రశంస
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ క్రిస్ లీన్పై కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. క్రిస్ లీన్ ప్రపంచంలో హార్డెస్ట్ హిట్టర్ అని కితాబిచ్చాడు.బంతిని బలంగా బాదడంలో అతడిని మించిన వాడు లేడన్నాడు.గాయం నుంచి కోలుకున్న వెంటనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని క్రిస్ లీన్ని ఆకాశాని కెత్తేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో బంతని బలంగా కొట్టడంలో క్రిస్ లీన్ అందరికంటే ముందుంటాడు. పునరాగమనం ఇంత ఘనంగా చాటుతానని అతడు కూడా అనుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే గాయంతో నెల రోజులు ఆటకు దూరమై బరిలోకి దిగిన వెంటనే నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడటం మామూలు విషయం కాదు. అని గంభీర్ పేర్కొన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఊహించని రీతిలో అతడు చెలరేగాడు.సునీల్ నరైన్, క్రిస్ లీన్ ఇద్దరూ రెండు వైపులా హిట్టింగ్ చేశారు.ఇలాంటి ఇన్నింగ్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆరు ఓవర్లలో 105 పరుగులు చేస్తారని ఎవరూ ఊహించరు. నరైన్ ఓపెనర్గా పంపడం మంచి ఫలితాన్ని ఇచ్చింది అని గంభీర్ వివరించాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సునీల్ నరైన్, క్రిస్ లిన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.నరైన్ 17 బంతులు ఆడి 6 బౌండరీలు,4 సిక్సర్లతో 54 పరుగులు చేయగా క్రిస్ లిన్ 22 బంతులు ఆడి 5 బౌండరీలు, 4 సిక్సర్లతో 50 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
యమహా కొత్త బైక్ ‘ఎఫ్జెడ్ ఎస్ వీ3.0’ అదుర్స్
కంపెనీ 2019 ఎఫ్జెడ్ వీ3.0 బైక్ను కొత్త ఫీచర్లతో అప్గ్రేడ్ చేసింది. ఇందులో పూర్తిగా కొత్త డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన పనితీరు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) వంటి ప్రత్యేకతలున్నాయి.
Samayam Telugu | Updated:
Jan 21, 2019, 01:23PM IST
హైలైట్స్
ధర రూ.95,000 నుంచి ప్రారంభం
స్టాండర్డ్ ఫీచర్గా ఏబీఎస్
దేశవ్యాప్తంగా బైక్ బుకింగ్స్ ప్రారంభం
జపాన్కు చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ యమహా తాజాగా సరికొత్త ఎఫ్జెడ్ బైక్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎఫ్జెడ్ సిరీస్లో ఇది మూడో జెనరేషన్ బైక్. ఇది రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఒకటేమో ఎఫ్జెడ్ ఎఫ్ఐ వీ3.0. దీని ధర రూ.95,000. మరొకటేమో ఎఫ్జెడ్ఎస్ ఎఫ్ఐ వీ3.0. దీని ధర రూ.97,000. ధరలన్నీ ఎక్స్షోరూమ్ ఢిల్లీవి. 150 సీసీ ఇంజిన్లో తన ఆధిపత్యం కోసం కంపెనీ ఈ బైక్ను ఆవిష్కరించింది.
కంపెనీ 2019 ఎఫ్జెడ్ వీ3.0 బైక్ను కొత్త ఫీచర్లతో అప్గ్రేడ్ చేసింది. ఇందులో పూర్తిగా కొత్త డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన పనితీరు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) వంటి ప్రత్యేకతలున్నాయి. కాగా 2019 ఏప్రిల్ నుంచి 125 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యపు ఇంజిన్లు కలిగిన బైక్లలో ఏబీఎస్ స్టాండర్డ్ ఫీచర్గా ఉండనుంది.
యమహా ఎఫ్జెడ్ ఎస్ వీ3.0 బైక్ కొత్త లుక్తో మార్కెట్లోకి వస్తోంది. ఇందులో ఫుల్ ఎల్ఈడీ డ్యూయెల్ పాడ్ హెడ్ల్యాంప్ యూనిట్, స్టెపప్ స్టైల్ సింగిల్ సీట్, కొత్త అలాయ్ వీల్స్, డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ కన్సోల్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. అలాగే ఈ బైక్లో 149 సీసీ సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, 5 స్పీడ్ గేర్ బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
యమహా కొత్త బైక్ హోండా సీబీ హార్నెట్ 160 ఆర్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 వంటి బైక్స్కు గట్టిపోటీనివొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యమహా డీలర్షిప్స్లలో యమహా ఎఫ్జెడ్ వీ3.0 బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
యువరాజ్ ఓ ఫీనిక్స్ పక్షి.. మళ్లీ వస్తాడు
చితిలో దహనమైపోయినా.. మళ్లీ బూడిద నుంచి ఫీనిక్స్ పక్షి బతికొస్తుందని
TNN | Updated:
Sep 11, 2017, 05:36PM IST
భారత్ జట్టులో చోటు కోల్పోయిన యువరాజ్ సింగ్‌ మళ్లీ ఫామ్ చాటుకుని తప్పకుండా పునరాగమనం చేస్తాడని మాజీ సెలక్టర్ సబా కరీమ్ ధీమా వ్యక్తం చేశారు. పట్టు వదలకుండా పోరాడటంలో యువరాజ్ సింగ్ ఒక ఫీనిక్స్ పక్షిలాంటోడని ఆయన ప్రశంసించాడు. చితిలో దహనమైపోయినా.. మళ్లీ బూడిద నుంచి ఫీనిక్స్ పక్షి బతికొస్తుందని గ్రీకు పురాణంలో ఓ కథగా ప్రసిద్ధి. ఇప్పుడు తనపై వస్తున్న విమర్శలకి ఆటతోనే సమాధానం చెప్పి వారి అభిప్రాయాలు తప్పు అని యువరాజ్ సింగ్ నిరూపిస్తాడనే నమ్మకం తనకుందని కరీమ్ వెల్లడించారు.
‘యువరాజ్ సింగ్‌ని జట్టు నుంచి తప్పించారు. అతను మళ్లీ.. మళ్లీ తన ప్రత్యేకతని చాటుకునే ఫీనిక్స్ పక్షిలాంటోడు. అతను ఈ విమర్శల్ని ఇష్టపడతాడు. అవన్నీ తప్పుడు అభిప్రాయాలని తప్పకుండా నిరూపిస్తాడు. అవును, అతని ఆటలో కొన్ని బలహీనతలు వెలుగు చూశాయి. వాటిని సరిదిద్దుకునేందుకు అతను ప్రయత్నిస్తున్నాడు. కానీ.. ఇంతలోనే జట్టు నుంచి తప్పించేశారు. అతనో ఛాంపియన్ ఆటగాడు. ఈ విషయాన్ని యువీనే త్వరలో నిరూపిస్తాడు’ అని కరీమ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌‌కి విశ్రాంతి పేరుతో యువీని పక్కనపెట్టిన సెలక్టర్లు.. ఆదివారం ప్రకటించిన ఆస్ట్రేలియాతో తలపడే జట్టు‌కి కూడా ఎంపిక చేయకుండా మొండిచేయి చూపారు. | 2sports
|
కారునే పడకగదిగా మారుస్తున్నారు.. శ్రీరెడ్డి సంచలన కామెంట్స్
Highlights
దర్శకనిర్మాతలు అవకాశాల పేరుతో హీరోయిన్లను ఎలా వాడుకుంటారనే విషయంపై సంచనల కామెంట్స్ చేసింది. నటులు, దర్శకనిర్మాతలు హీరోయిన్లను లాంగ్ డ్రైవ్ అని చెప్పి బయటకు తీసుకువెళ్లి కారులోనే పని కానిస్తున్నారని.. కారునే పడకగదిగా మారుస్తున్నారని విమర్శలు చేసింది
మొన్నటివరకు టాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ పై పడింది. అక్కడ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ లు పెట్టిన శ్రీరెడ్డి ఏకంగా చెన్నైకి వెళ్లి మరీ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఆమె కోలీవుడ్ తారలపై చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ అలానే కోశాధికారిగా పని చేస్తోన్న కార్తీ అన్నారు.
ఆధారాలు ఉంటే పోలీస్ కంప్లైంట్ చేయాలి కానీ ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం ఏంటని కార్తీ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన శ్రీరెడ్డి.. తనను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించమని.. లాజిక్కులు మాట్లాడొద్దని కార్తీకి కౌంటర్ ఇచ్చింది. నడిగర్ సంఘం ఉన్నది.. సమస్యలు తీర్చాడడానికి కానీ ఉచిత సలహాలు ఇవ్వడానికి కాదు అంటూ ఫైర్ అయింది శ్రీరెడ్డి.
ఇది ఇలా ఉండగా.. తాజాగా దర్శకనిర్మాతలు అవకాశాల పేరుతో హీరోయిన్లను ఎలా వాడుకుంటారనే విషయంపై సంచనల కామెంట్స్ చేసింది. నటులు, దర్శకనిర్మాతలు హీరోయిన్లను లాంగ్ డ్రైవ్ అని చెప్పి బయటకు తీసుకువెళ్లి కారులోనే పని కానిస్తున్నారని.. కారునే పడకగదిగా మారుస్తున్నారని విమర్శలు చేసింది. విదేశాల్లో షూటింగ్ అని చెప్పి అక్కడ చేసే నిర్వాహకం కూడా ఇదేనంటూ చెప్పింది. తమ కోరికను తీర్చుకోవడం కోసం మేకప్ మ్యాన్ నుండి దర్శకనిర్మాతల వరకు అందరూ హీరోయిన్లను వాడుకుంటున్నారని తెలిపింది.
Last Updated 23, Jul 2018, 11:22 AM IST | 0business
|
Sensex
స్టాక్ మార్కెట్లకు టోకు ధరల సూచి మద్దతు
ముంబయి,జూన్ 15: బెంచ్మార్క్ స్టాక్ సూచీలు స్వల్పంగా పెరిగాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ టోకుధరల సూచి గణాంకాల ను విడుదలచేయడం మేనెలలో 2.17 శాతానికి తగ్గడం మార్కెట్లకు ఊతం ఇచ్చిం ది. ఫెడ్రిజర్వు వడ్డీరేట్ల పెంపు సంకేతా లపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ అమెరికా విధాననిర్ణయాలపై ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నారు. 25బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపు ఉంటుందన్న అంచనాలున్నాయి. లేమాన్బ్రదర్స్ సంక్షోభం తర్వాత 2008 ఆపైన ఒకటిశాతం వడ్డీరేట్లు పెంచిన సంగ తి తెలిసిందే. బిఎస్ఇ సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 31,156 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి ఏడుపాయింట్లు పెరిగి 9614పాయింట్ల వద్ద స్థిరపడింది. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్సూచీలు 0.4శాతం వద్ద లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, డా.రెడ్డీస్లాబ్స్, ఐసిఐసిఐబ్యాం కు, హిందూస్థాన్ యూనిలీవర్, సెన్సెక్స్లో లాభ పడ్డాయి. సిప్లా, ఐటిసి, హెచ్డిఎఫ్సి, విప్రో సంస్థ లు నష్టం చవిచూసాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 శాతం లాభపడింది. కంపెనీ ఆర్జియో చందా దారులసంఖ్య 11.26 కోట్లకు పెరగడమే ఇందుకు కీలకం. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ 1.4శాతం పెరిగింది. కంపెనీ మిర్యాలగూడ ప్లాంట్ఫై అమెరికా ఎఫ్డిఎ తనిఖీ నివేదిక ఇచ్చిందని ప్రకటించింది. నిఫ్టీ పిఎస్యు బ్యాంకుసూచి ఒకటిశాతం పెరిగింది. రిజర్వుబ్యాంకు 12 మంది అతిపెద్ద బకాయిదారుల జాబితాను గుర్తించి వాటిని దివాళా నియమావళి చట్టంపరిధిలో చర్యలకు ఆదేశించడమే కీలకంగా మారింది.
అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు,ఐడిబిఐబ్యాంకు, యూనియన్ బ్యాంకులు2-7శాతంమధ్య పెరిగాయి. నష్టాల్లో విప్రో 1.2వాతం నష్టపోయిం ది. ఐటి కన్సల్టింగ్సంస్థ డ్రైవ్స్ట్రీమ్లో 5.12కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది. విప్రో 19,679 షేర్లు నగదురూపంలోను, కామన్ స్టాక్స్ పరంగా 27,865స్టాక్స్ కొనుగోలుచేసి నట్లు విప్రో బిఎస్ఇకి వెల్లడించింది. యూరోపియన్ ఈక్విటీ మార్కెట్ల పరంగా చూస్తే యూరోపియన్ స్టాక్స్ 0.6శాతంపెరిగింది.పారిశ్రామికరంగం, ఆర్థికరంగాలపరంగా కొంతమాత్రం ఇచ్చింది. వాల్ స్ట్రీట్ స్టాక్స్ రికార్డుస్థాయికి పెరిగాయి. ఆసియా పసిఫిక్ప్రాంతంలోని .జపాన్ బయటిప్రాంత షేర్లు 0.1శాతం పెరిగాయి. నిక్కీ 0.08శాతం క్షీణించింది. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Zero trailer: షారుఖ్ ‘జీరో’ ట్రైలర్.. అందుకే పొట్టిగా పుట్టాడట!
షారుఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ‘జీరో’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. నవ్వులు పూయిస్తూ.. భావోద్వేగాలతో నింపేసే ఈ ట్రైలర్పై మీరూ ఓ లుక్కేయండి.
Samayam Telugu | Updated:
Nov 2, 2018, 06:33PM IST
Zero trailer: షారుఖ్ ‘జీరో’ ట్రైలర్.. అందుకే పొట్టిగా పుట్టాడట!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన నటించిన ‘జీరో’ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో షారుఖ్ మరుగుజ్జు పాత్రలో జీవించేశారు. అనుష్క శర్మ వికలాంగురాలిగా, మద్యానికి బానిసైన సెలబ్రిటీ పాత్రలో కత్రినా కైఫ్ నటించారు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. బవ్వే సింగ్ పాత్రలో షారుక్ నవ్వులు పూయించాడు. ట్రైలర్ చివర్లో భావోద్వేగ సన్నివేశాలతో కంటితడి పెట్టించాడు. షారుఖ్ పొట్టిగా ఉండటం వల్ల అతడిని ఎవరూ పెళ్లి చేసుకోరు. దీంతో అతను మ్యారేజ్ బ్యూరోకి పిల్లను వెతికే పని అప్పగిస్తాడు. ఈ సందర్భంగా అతను అనుష్క శర్మ ఫొటో చూసి మనసు పారేసుకుంటాడు. ఆ ఫోటో చూసిన మ్యారేజ్ బ్రోకర్ ఆమె నీకు తగినది కాదు అంటాడు. ఆ మాటలు పట్టించుకోకుండా షారుఖ్ ఆమెను కలవడానికి వెళ్తాడు. ఓ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమంలో అతిథిగా ఉన్న ఆమెను వీల్ ఛైర్లో చూసి షారుఖ్ షాకవ్వతాడు. ‘‘అరే, నాకు ఫొటోలో చక్రాల కుర్చీ కనిపించలేదే’’ అనుకోవడం నవ్వు తెప్పిస్తుంది.
అతడు ఎంతో అభిమానించే సెలబ్రిటీగా కత్రినా కైఫ్ కనిపిస్తుంది. మద్యానికి బానిసైన ఆమెను షారుఖ్ ఎలా మార్చాడు? వీరిద్దరిలో ఎవరు అతని పెళ్లి చేసుకుంటారు? అనేది మిగతా కథాంశం. అయితే, ఈ ట్రైలర్లో మరో సన్నివేశం మిమ్మల్ని తప్పకుండా కడుపుబ్బా నవ్విస్తుంది. తండ్రితో పెళ్లి కోసం గొడవ పడుతున్న సన్నివేశంలో.. ‘‘నీ చెడు అలవాట్ల వల్లే నేను పొట్టిగా పుట్టాను’’ అని షారుఖ్ అంటాడు. ‘‘నా అలవాట్ల వల్ల నువ్వెందుకు పొట్టిగా పుడతావ్??’’ అని అడిగితే.. ‘‘నువ్వు గుట్కా ఎక్కువగా తింటావు. దాని వల్ల నీకు స్పెరమ్ (వీర్యం) తగ్గిపోయి.. నేను ఇలా పుట్టా’’ అంటాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గౌరీ ఖాన్ నిర్మించారు. డిసెంబరు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘జీరో’ ట్రైలర్:
షారుఖ్ ‘జీరో’ ట్రైలర్... అందుకే పొట్టిగా అయిపోయాడట!
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Delhi Dare devils1
రైజింగ్ పుణేపై ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం
ఐపిఎల్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్షా కొట్టా మైదానంలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్పై 7 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం సాధించింది.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిరీ€త 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం 129 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన పుణే లక్ష్యాన్ని చేధించలేకపోయింది.. చివరి 6 బంగుల్లో 25 పరుగులు చేయాల్సి ఉండగా, కిమన్స్ వేసి అన్ని బంతులను ఎదుర్కొన్న మనోజ్ తివారీ (60) తొలి రెండు బంతుల్లో వరుసగా సిక్సర్లు బాదాడా.. తర్వాత మరో ఫోర్ కొట్టాడు. చివరి బంతికి 8 పరుగులు చేయాలిస ఉండగా, క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. దీంతో తివారీ హాఫ్సెంచరీ వృధాగా అయిపోయింది.. బౌలింగ్లో హీర్ఖాన్, కమిన్స్, మహ్మద్ షమీ చెరో వికెట్ పడగొట్టారు. | 2sports
|
IND vs BAN 1st Test LIVE Score బోర్డు కోసం క్లిక్ చేయండి..!
మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ తొలి సెషన్లోనే ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ తలో వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. ఓపెనర్లు సదామన్ ఇస్లామ్ (6), ఇమ్రూల్ ఖయ్యూస్ (6) సింగిల్ డిజిట్ స్కోరుతోనే సరిపెట్టగా.. మహ్మద్ మిథున్ (13) తేలిపోయాడు. ఆ తర్వాత రెండో సెషన్లో స్పిన్నర్ అశ్విన్ మాయ మొదలైంది.
Read More: బంగ్లాదేశ్పై తొలి టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డ్
కెప్టెన్ మొమినుల్ (37: 80 బంతుల్లో 6x4) వికెట్తో ఆ జట్టు పతనాన్ని కొనసాగించిన అశ్విన్.. మహ్మదుల్లా (10)నీ బోల్తా కొట్టించేశాడు. ఇక ఆఖర్లో మళ్లీ షమీ, ఇషాంత్ శర్మ చెరొక వికెట్ పడగొట్టగా.. హుస్సేన్(2)ని ఆఖర్లో బౌల్డ్ చేయడం ద్వారా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్కి ఉమేశ్ యాదవ్ తెరదించాడు. ఆ జట్టులో ముష్ఫికర్ రహీమ్ (43: 105 బంతుల్లో 4x4, 1x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ (3/27), ఇషాంత్ శర్మ (2/20), అశ్విన్ (2/43), ఉమేశ్ యాదవ్ (2/47) మెరిశారు. తైజుల్ ఇస్లామ్.. జడేజా విసిరిన త్రో కారణంగా రనౌటయ్యాడు.
Read More: నెటిజన్లకి మళ్లీ చిక్కిన కోచ్ రవిశాస్త్రి.. బాదుడే
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
internet vaartha 253 Views
బర్డ్ఫ్లూ వైరస్ భయాలే ఇందుకుకీలకం
బెంగళూరు : పర్షియన్ గల్ఫ్దేశం కువైట్ భారతీయ పౌల్ట్రీ ఉత్పత్తులపై మరోసారి నిషేధం విధించింది. ఈశాన్య రాష్ట్రం త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో పౌల్ట్రీరంగంపై ఆవియన్ ఇన్ఫ్లుయేంజా లేదా బర్డ్ఫ్లూ వ్యాపించిందన్న ప్రచారం విస్తృతం కావడంతో కువైట్ ఈ చర్యలు తీసుకుంది. ప్రభుత్వరంగంలోని గాందీ గ్రామ్లో నిర్వహిస్తున్న కోళ్లఫారంలో హెచ్5ఎన్1 వైరస్ లేదా బర్డ్ఫ్లూ వైరస్ గుర్తించినట్లు ప్రకటించడం, వెనువెంటనే నివారణ చర్యలు తీసుకోవడం జరిగిం ది. అయితే భారత్నుంచి ఎగుమతయ్యే కోళ్లు సంబంధిత ఉత్పత్తుల్లో అవశేషాలు ఉండొచ్చన్న భావనతో కువైట్ప్రభుత్వం మరోసారి నిషేధం విధించిందని భారత్లోని అపెడా తన వెబ్సైట్లో వెల్లడించింది. భారత్ పౌల్ట్రీ ఉత్పత్తుల పరంగా కువైట్కు అతితక్కువశాతం మాత్రమే జరుగుతున్నప్పటికీ ఈ విస్తృత ప్రచారం వల్ల దేశీయ మార్కెట్కు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పౌల్ట్రీరైతులు భయపడుతున్నారు. ఇప్పటికే నిర్వహణ వ్యయం, పౌల్ట్రీ మేత ధరలుపెరగడం, అనిశ్చిత పరిస్థితిలో ఆర్థికస్థితిగతులు అలుముకున్న పౌల్ట్రీరంగం పై ఈ నిషేధం వంటి ఆంక్షలు కొంతమేర ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్నది అంచనా. భారత్నుంచి పౌల్ట్రీ ఎగుమతులు గత ఏడాది మొదటి తొమ్మిదినెలల్లో 584 కోట్ల రూపాయలమేర ఉన్నాయి. అంతకుముందు ఏడాది 484 కోట్ల నుంచి గణనీయంగా పెరిగాయి. అపెడా ఇందుకు సంబంధించి ఎగుమతి ఆధా రిత నాణ్యతాప్రమాణాలతో కట్టుదిట్టంగా వ్యవహరించి పౌల్ట్రీరంగాన్ని ప్రోత్సహి స్తుండటంతోనే ఎగుమతులు పెరిగాయి. అయితేఇటీవలి బర్డ్ఫ్లూ వంటి కారణా లతో కొన్ని దేశాలు వీటిపై నిషేధంవిధించడం కేవలం ఆయా దేశాల్లోని ఉత్పత్తు లకు ధరలు పెంచుకోవడానికేనని తెలుస్తోంది. అలాగే భారత్ పరంగాచూస్తే ఇప్పటికే ఈ వైరస్రహిత దేశంగాప్రకటించింది. మారుమూల ప్రాంతంలోని ఒక ప్రభుత్వ ఫారంలో మాత్రమే బైటపడితే వెనువెంటనే గుర్తించి చికిత్సలు చేసినట్లు ప్రకటించింది. గత ఏడాది అక్టోబరులో కువైట్ నిషేధాన్ని ఎత్తివేసింది. 2013లో నిషేధంవిధిస్తే ప్రపంచ పశుఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేస్తూ భారత్ అవియన్ఇన్ఫ్లుయేంజా రహిత దేశంఅని వెల్లడించింది. అంతే కాకుండా భారత్ కూడా గత ఏడాది జూలైలో ఈ వైరస్రహిత దేశంగా స్పష్టం చేసింది. దీనితో నిషేదాన్ని కువైట్ సడలించింది. అలాగే గతంలో హాంకాంగ్ భారతీయ పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం ప్రకటించింది. గత ఏడాదికువైట్ ఎత్తివేసిన రెండు నెలల తర్వాత హాంకాంగ్ భారతీయ పౌల్ట్రీఉత్పత్తుల దిగుమతులకు అనుమతించింది. 2012లో బర్డ్ఫ్లూవైరస్ ఉందన్న నిర్ధారణపై హాంకాంగ్ కూడా నిషేధం ప్రకటిం చింది. వాస్తవానికి ప్రపంచ పశుఆరోగ్య సంస్థ వైరస్రహిత దేశంగా భారత్ను ప్రకటించిన మూడునెలల తర్వాత ఈనిషేధం ఎత్తివేసింది. హాంకాంగ్ ఫుడ్ డైరెక్టరేట్ గుడ్లు, గుడ్డపౌడర్, గుడ్డుసొనలు వంటి వాటిని దిగుమతి చేసుకునేం దుకు అనుమతించింది. దేశీయంగా ఉన్న 80వేలకోట్ల పౌల్ట్రీరంగం ఈ నిషేధం ఎత్తివేతవల్ల హాంకాంగ్కు రెండుబిలియన్ మార్కెట్ పున రుద్ధరించుకున్నట్ల యింది. మళ్లీ తిరిగి కువైట్ నిషేధం విధించడం వల్ల తిరిగి భారత్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందని అంచనావేస్తున్నారు. ప్రభుత్వపరంగా అపెడావంటి సంస్థ లు వ్యవసాయ, వాణిజ్యమంత్రిత్వశాఖలు సంయుక్తంగా కృషిచేస్తే తప్ప ఈ నిషేధా జ్ఞలు, ఆంక్షలు ఎత్తివేసే అవకాశంలేదని పౌల్ట్రీరంగ యజమానులు చెపుతున్నారు. | 1entertainment
|
Women Team india met PM
మోడీకి మహిళా క్రికెటర్లు సరదా ప్రశ్నలు
న్యూఢిల్లీ: ఇంగ్లాండ్లో ముగిసిన ఐసిసి మహిళల ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన భారత్ జట్టుని ఇటీవల ప్రధాన మంత్రి మోడీ అభినందించారు. ఈసందర్భంగా మోడీని జట్టులోని కొంతమంది మహిళా క్రికెటర్లు సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారట. వాటిని మోడీ అంత సరాదాగా సమాధానమిచ్చి ఆకట్టుకున్నట్లు తెలిసింది. ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్తో భారత్ పరువు నిలిపిన పూనమ్ రౌత్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ చాలా స్పూర్తివంతమైన మాటలు చెప్పారు. మోడీని మేము కొన్ని సరదాగా ప్రశ్నలు కూడా అడిగాం. దేశాన్ని పరిపాలించే మీరు ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు…? అని ప్రశ్నించగా…ధ్యానం, యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించు కుంటానని సమాధానం ఇచ్చారు అని ఓపెనర్ వెల్లడించింది. సెమీ ఫైనల్లో 171 పరుగులతో ఒంటిచేత్తో భారత్ని ఫైనల్కు చేర్చిన హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ మీ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా ఎవరినైనా డిజైనర్గా నియమించుకున్నారా…? అని ప్రశ్నించగా….అహ్మద్బాద్లో ఒక టైలర్ ఉన్నాడని…అతనే గత కొన్నేళ్లుగా తనకు కావాల్సిన దుస్తులను కుట్టిస్తుంటాడని సమాధానం ఇచ్చారు. అని ఈ హిట్టర్ వివరించింది. ఈసారి ప్రపంచకప్ గెలిచిన తర్వాత మళ్లీ మీతో కలుస్తానని మోడీ చెప్పినట్లు మహిళా క్రికెటర్లు వివరించారు. | 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.