news
stringlengths
299
12.4k
class
class label
3 classes
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
PRO KABADDI ప్రొ కబడ్డీ బెంగళూరు జట్టు సభ్యులు వెల్లడి బెంగళూరు:దేశ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ప్రో కబడ్డీ సుదీర్ఘ ఐదో సీజన్‌ ఈనెల 28నుంచి ప్రారంభం కాబోతుంది. ఈసీజన్‌లో 132 లీగ్‌ మ్యాచ్‌లు ఉండటంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఈమ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, గత సీజన్లలో చక్కది ఆటతీరుతో అదరగొట్టిన బెంగుళూరు బుల్స్‌ జట్టు సభ్యుల పేర్లు వెల్లడించింది. బెంగుళూరు బుల్స్‌ జట్టుకు స్టార్‌ రైడర్‌ రోహిత్‌ కుమార్‌ సారథ్యం వహిస్తుండగా, వైస్‌ కెప్టెన్‌గా డిఫెండర్‌ రవీందర్‌ పవాల్‌ను ఎంపిక చేశారు. ఈ జట్టుకు అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు, అర్జున పురస్కార గ్రహీత రణ్‌ధీర్‌ సింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఈలీగ్‌లో బెంగుళూరు జట్టు కొత్త జెర్సీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బెంగుళూరు బుల్స్‌ జట్టు సభ్యులు వీరే రోహిత్‌ కుమార్‌ (కెప్టెన్‌), రవీందర్‌ పహల్‌ (వైస్‌ కెప్టెన్‌), హరీశ్‌ నాయక్‌, గుర్వీందర్‌ సింగ్‌, అంకిత్‌, సంగ్వాన్‌, మహేంద్ర సింగ్‌, ప్రీతమ్‌ చిల్లర్‌, అశిశ్‌ కుమార్‌, సచిన్‌ కుమార్‌, అమిత్‌ షెరాన్‌, శినోథరన్‌, ప్రదీప్‌, అజ§్‌ు కుమార్‌, సునీల్‌, సుమిత్‌, అంజ§్‌ు శ్రేష్ఠ, కులదీప్‌ సింగ్‌
2sports
Visit Site Recommended byColombia దశాబ్దకాలంగా ప్రపంచంలోని మేటి ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన డేల్ స్టెయిన్ .. భుజం గాయం కారణంగా ఏడాది నంచి క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. అయితే.. ఇటీవల ఫిటెనెస్ సాధించి జింబాబ్వేతో ఏకైక టెస్టుకి ఎంపికయ్యాడు. కానీ.. తుది జట్టులో మాత్రం అతనికి అవకాశం ఇవ్వలేదు. గాయం నుంచి పూర్తి స్థాయిలో ఫిటెనెస్ సాధించలేదా..? అనుకుంటే.. జింబాబ్వేతో టెస్టుకి ఎంపిక చేశారు కాబట్టి ఆ వాదనలో వాస్తవం ఉండకపోవచ్చు. భారత్‌కి షాకిచ్చే ఉద్దేశంతో గాయం నుంచి కోలుకుని నూతన ఉత్తేజంతో ఉవ్విళ్లూరుతున్న స్టెయిన్‌ని.. నేరుగా తొలి టెస్టులో ప్రయోగించాలనేది సఫారీల వ్యూహం కావొచ్చు..! అయితే.. అనారోగ్యం కారణంగా స్టెయిన్‌ని తొలి టెస్టులో ఆడించలేదని దక్షిణాఫ్రికా చెప్పుకొస్తోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కొంచెం స్వింగ్.. వికెట్ పడగొట్టిన భువీ పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే వికెట్ పడగొట్టి భారత శిబిరంలో TNN | Updated: Oct 25, 2017, 02:08PM IST పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే వికెట్ పడగొట్టి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. పిచ్‌ నుంచి స్వింగ్‌ లభిస్తుండంతో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌ (11: 9 బంతుల్లో 2x4) వికెట్‌ని భువీ పడగొట్టాడు. భువీ విసిరిన ఔట్ స్వింగర్ బంతిని అంచనా వేయడంలో విఫలమైన గప్తిల్.. వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆరంభంలోనే స్వింగ్‌కి పిచ్ సహకరిస్తుండటంతో భువీ ఎక్కువగా ఆఫ్‌ స్టంప్‌కి సమీపంలో బంతులు విసురుతూ వచ్చాడు. ఇలా విసిరిన బంతిని.. బ్యాట్ ఫుట్‌పై ఆడుతూ వచ్చిన గప్తిల్.. మూడో ఓవర్‌లో మాత్రం.. ప్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బంతి బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి ధోనీ చేతుల్లో పడింది. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 2.4 ఓవర్లలో 20 పరుగులు.
2sports
Hyd Internet 112 Views air india Air India న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా దేశీయ విమానాల్లో ఎకానమీ తరగతి వారికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఎకానమీ తరగతి టికెట్లపై 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఐతే ఈ ఆఫర్‌ విద్యార్ధులు, సీనియర్‌ సిటిజన్స్‌, సైనికులకు వర్తిస్తుందని తెలిపింది. ఈ అవకాశం పొందాలంటే మాత్రం ప్రయాణానికి ఏడు రోజుల ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందనేది ఎయిర్‌ ఇండియా వెల్లడించలేదు. ఎయిర్‌ ఇండియా అధికార వెబ్‌సైట్‌, కార్యాలయాల్లో టికెట్లను పొందవచ్చు.
1entertainment
internet vaartha 97 Views న్యూఢిల్లీ : ఎన్‌ఐఐటి టెక్నాలజీస్‌ మొదటి త్రైమాసికంలో నికరలాభం 28.6 కోట్లుగా ప్రకటించింది. వన్‌టైమ్‌ కేటాయింపులకింద 36.1 కోట్లు కేటాయింపులు జరపడంతో నికరలాభం తగ్గింది. అంతకు ముందు సంవత్సరం ఎన్‌ఐఐటి నికరలాభం 54.4కోట్లుగా ఉంది. కంపెనీ రాబడులు 4.5శాతం పెరిగి 670.7 కోట్లకు చేరాయి. అంతకుముందు 642.1 కోట్లుగా ఉన్నాయి.  ప్రభుత్వ కాంట్రాక్టుల పరంగా బకాయిలు రావాల్సి ఉండటంతో 36 కోట్లు ఈ మొత్తాలకు కేటాయించడం వల్ల నికరలాభం తగ్గిందని కంపెనీ సిఇఒ ఎండి అరవింద్‌ ఠాకూర్‌ వివరించారు. దేశీయ బిజినెస్‌ 26.5శాతం క్షీణించింది.
1entertainment
spencer’s భారీ స్టోర్లవైపే ‘స్పెన్సర్స్‌ విస్తరణ ప్రణాళిక ముంబై,: గోయంకాగ్రూప్‌నకు చెందిన స్పెన్సర్స్‌ రిటైల్‌ ఐపిఒ జారీకి రంగం సిద్ధంచేసుకుంటున్నది. ప్రతి చదరపు అడుగుకు 1500 రూపాయల నుంచి 1741 రూపాయలుగా ఈ ఆదాయం వస్తున్నది. గ్రూప్‌ ఛైర్మన్‌ సంజీవ్‌గోయంకా ఆలోచనలకు అనుగుణంగా స్పెన్సర్స్‌ రిటైల్‌ను స్టాక్‌ ఎక్ఛేంజిల్లో జాబితా చేయడం ద్వారా మరింతపటిష్టంచేయాలని చూస్తున్నారు. నష్టాలుగడచిన కొన్నేళ్లుగా కొనసాగుతున్నా రాబడులు మాత్రంపెరుగుతున్నాయి. స్పెన్సర్స్‌ 12శాతం రాబడుల్లో వాటా ను పెంచుకుని 1865 కోట్ల రూపాయలు ఆర్జించింది. ప్రాథమికంగా 142కోట్ల రూపాయలునష్టాలు చవిచూసింది. ఎక్కువ ముడివనరులు, ఎక్కువగా ఉత్పత్తులు కొనుగోలుచేయడం వల్ల నిర్వహణ వ్యయం పెకరిగిందని ంచనా. 2014-15లో నష్టం 152కోట్లుగా ఉంది. 2016లో కూడా 53 కోట్లు చవిచూసింది. అంతకుముందు ఏడాది 67 కోట్ల నష్టంతో పోల్చితే తగ్గింది. లాభదాయకతలేని స్టోర్లను ముగించడం ద్వారా స్పెన్సర్స్‌ కొంత నష్టాలు తగ్గించుకుంది. ముంబైనుంచి వైదొలిగింది. మేనేజ్‌మెంట్‌ టీమ్‌ను ప్రక్షాళనచేసింది. ఖర్చుల్లో కోత విధించింది. 2011-12లో స్పెన్సర్స్‌ రిటైల్‌ స్టోర్‌ 182 ఉన్నాయి. 2014-15నాటికి 126కు తగ్గించింది. 2015-16లో 118కిచేరింది. ప్రస్తుతం 35 నగరాల్లో 120 స్టోర్లు నిర్వహి స్తోంది. 1.1మిలియన్‌ల చదరపు అడుగుల వైశాల్యం ఉంది. మొత్తం 50-60శాతం హైపర్‌హార్కెట్‌ తరహాలో స్టోర్సు నిర్వహిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో ఇదేవిధానం అనుసరి స్తుంది. కంపెనీ ఇకపై భారీఫార్మాట్‌స్టోర్లనే ఎంపిక చేసుకుంది. కొన్నేళ్లుగా ప్రైవేటు బ్రాండ్స్‌ను విక్రయించడం ద్వారా నికరలాభం పెంచింది. స్మార్ట్‌ఛాయిస్‌, టేస్టీ వండర్స్‌ పరిచయంచేసింది. స్పెన్సర్స్‌ క్లీన్‌హోమ్‌; మరూన్‌ గృహావసరాల ఉత్పత్తుల పోర్టుఫోలియోను ముందుకు తీసుకెళ్లింది. అలాగే వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపరంగా కూడా కొంత లాభదాయకత పెంచుకుంటన్నది. అసంఖ్య, ఐలాండ్‌ మాంక్స్‌ పేరిట కొత్త రెడిమేడ్‌గార్మెంట్ల దుస్తులను పరిచయం చేసింది. మూడోబ్రాండ్‌ కూడా విడుదలచేస్తోంది. ఇతరబ్రాండ్‌ల కంటే దుస్తుల విభాగం ఎక్కువ మార్జిన్లు తెస్తున్నది. గ్రూప్‌ రిటైల్‌ డివిజన్‌ నష్టాలను కొంతవరకూ తగ్గిస్తున్నాయి. కొత్తప్రైవేటు లేబుల్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక కొత్త టీమ్‌ను నియమించింది. రానున్న రోజుల్లో ఫ్యాషన్‌, గార్మెంట్‌ ఔట్‌లెట్లకు కూడా విస్తరించాలని చూస్తున్నారు. ఆహార ఉత్పత్తులు, వస్త్ర వ్యాపారం రానున్న రోజుల్లో భారీగా ఉంటుందని గోయంకా వెల్లడించారు. ఆహార ఉత్పత్తుల వ్యాపారం రాబడుల్లో 80శాతంవరకూ ఉంది. దుస్తుల విభాగం ఐదుశాతం మాత్రమే ఉన్నట్లు అంచనా. ఏదిఏమైనా స్పెన్సర్స్‌ రానున్న రోజుల్లో భారీ ఫార్మాట్‌స్టోర్లపైనే దృష్టిపెట్టింది.
1entertainment
బాహుబలి కలెక్షన్స్.. లేటెస్ట్... ఏపీ తెలంగాణ Highlights గత సినిమాల కలెక్షన్ల రికార్డులు చెరిపేసిన బాహుబలి2 బాహుబలి2 బ్రేక్ ఈవెన్ కు చేరుకోవటంతో ఇక పంపిణీదారులకు లాభాల పంట ఏపీ, తెలంగాణల్లో  5రోజుల్లోనే  రూ. 109 కోట్ల షేర్ దక్కించుకున్న బాహుబలి2 తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి కీర్తిని తెచ్చిపెట్టిన బాహుబలి చిత్రం ఏప్రిల్ 28న విడుదలై  ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. వసూళ్ల పరంగా ఈ చిత్రం రోజుకో కొత్త రికార్డును నెలకొల్పుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రేక్షకులు ఈ చిత్రానికి కాసుల వర్షం కురిపిస్తున్నారు. ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లు దాదాపు హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి. దీంతో 5 రోజులకే రూ. 100 కోట్ల షేర్ ను దక్కించుకున్న ఈ చిత్రం 6వ రోజు కూడా అదే జోరును కొనసాగించింది.   ఆరు రోజులకు గాను నైజాం ఏరియాలో రూ. 32.09 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఇతర ప్రాంతాలైన సీడెడ్లో రూ. 19. 05 కోట్లు, నెల్లూరులో రూ. 4. 33 కోట్లు, గుంటూరులో రూ. 11. 44 కోట్లు, కృష్ణాలో రూ. 7. 87 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9. 01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 11. 45 కోట్లు, ఉత్తరాంధ్రలో 14. 05 కోట్లు వసూలు చేసి మొత్తంగా రూ. 109. 29 కోట్ల షేర్ ను తన ఖాతాలో వేసుకుంది. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
Recommended byColombia అంకితం నీకే అంకితం నాగార్జున వచ్చీరాగానే మన టీవీ ద్వారా హౌస్‌మేట్స్‌ను పలకరించారు. వాళ్లకు ఒక గేమ్‌ను పరిచయం చేశారు. ‘‘అంకితం నీకే అంకితం’’ ఆ గేమ్ పేరు. ప్రతి ఒక కంటెస్టెంట్ తమ ముందున్న కవర్లలో ఒకటి తీసి పేపర్‌పై ఉన్న పాటను చూడాలి. దాన్ని బయటికి చదవకుండా ఆ పాటను మిగిలిన హౌస్‌మేట్స్‌లో ఎవరికో ఒకరికి అంకితం ఇవ్వాలి. ఆ తరవాత ఆ పాటకు సరదాగా స్టెప్పులేయాలి. ఆ పాటను అంకితం చేసినందుకు సరైన కారణం చెప్పాలి. ఇలా పాటను అంకితం ఇచ్చే మొదటి అవకాశాన్ని నాగార్జున శ్రీముఖికి కల్పించారు. శ్రీముఖి ఆ పాటను రాహుల్‌కి అంకితం ఇచ్చారు. ఇంతకీ ఆ పాట ‘సై’ సినిమాలోని ‘పంతం నీకా నాకా సై’. ఈ పాటను రాహుల్‌కి ఇవ్వడానికి గల కారణాన్ని నాగార్జున అడగగా.. ‘‘ఇది ఇంకొకిరి షూట్ అవ్వదు సార్. అంది అందరికీ తెలిసిందే’’ అని కెప్టెన్సీ టాస్క్ సమయంలో జరిగిన గొడవను ఉద్దేశించి చెప్పారు. ఈ గేమ్‌లో ఒక్కో కంటెస్టెంట్ పాటను అంకితం చేసిన జాబితా, పాట ఇలా ఉంది.. శ్రీముఖి - రాహుల్ - పంతం నీకా నాకా సై శివజ్యోతి - అలీ - మౌనంగానే ఎదగమని బాబా భాస్కర్ - తమన్నా - ఒక్కమగాడు పునర్నవి - రవికృష్ణ - ఓ చక్కనోడ హిమజ - బాబా భాస్కర్ - నువ్వు విజిలిస్తే ఆంధ్ర సోడా బుడ్డి వరుణ్ సందేశ్ - వితికా షెరు - కన్నుల్లో నీ రూపమే రాహుల్ - రోహిణి - చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అశు రెడ్డి - వితికా షెరు - గోవిందా గోవిందా రవికృష్ణ - అలీ రజా - లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ రోహిణి - బాబా భాస్కర్ - దొంగ దొంగ వచ్చాడే వితికా షెరు - శివజ్యోతి - నాలో నేను లేనే లేను అలీ రజా - రవికృష్ణ - నీ దూకుడు తమన్నా - రవికృష్ణ - మగాళ్లు వట్టి మాయగాళ్లు మహేష్ విట్ట - పునర్నవి - అమ్మ బ్రహ్మదేవుడో కొంప ముంచినావురో ఈ గేమ్‌లో బాబా భాస్కర్ తన స్టెప్పులతో సందడి చేశారు. తమన్నాతో ఒక్కమగాడు సాంగ్‌కు స్టెప్పులేసిన బాబా.. రోహిణి, హిమజలతోనూ అంతే జోష్‌తో డ్యాన్స్ చేశారు. ఇక పునర్నవితో రవికృష్ణ, మహేష్ డ్యాన్స్ చేసినప్పుడు ఎక్కడో కాలుతున్న వాసన వస్తోందంటూ రాహుల్‌ను ఉద్దేశించి నాగార్జున సరాదాగా ఆటపట్టించారు. మహేష్‌తో పునర్నవి డ్యాన్స్ చేసే సమయంలో అయితే అలీ ఏకంగా కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్‌ను తీసుకొచ్చేశారు. అదెందుకు అని నాగార్జున అడిగితే కాలిపోయిన వాసన వస్తోంది సార్ ఒకవేళ మంటలు వస్తే ఆర్పుదామని సరదాగా సమాధానం ఇచ్చారు అలీ. మొత్తానికి ఈ గేమ్ చాలా సరదాగా సాగింది. ఈ గేమ్ మధ్యలోనే అశురెడ్డిని నాగార్జున స్టోర్ రూంలోకి వెళ్లి అక్కడున్న సూట్‌కేసును తీసుకురమన్నారు. దానిపై ఉన్న పేరును చూపించొద్దని అశుకు చెప్పారు. ఆమె కూడా సీక్రెట్‌గా సూట్‌కేసును తీసుకొచ్చి సోఫాల వెనుక పెట్టారు. ఆ తరవాత నాగార్జున ఐదు అంకెలు లెక్కబెట్టారు. వెంటనే అశురెడ్డి రాహుల్ పేరును ప్రకటించారు. అంటే, ఈ వారం ఎలిమినేషన్‌లో మొదటిగా సేఫ్ జోన్‌లోకి వెళ్లింది రాహుల్. ఆ తరవాత పునర్నవిని సేఫ్ జోన్‌లో వేశారు. వెన్నెల కిషోర్ సందడి ‘మన్మథుడు 2’ సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వెన్నెల కిషోర్‌ను వేదికపైకి నాగార్జున ఆహ్వానించారు. కిషోర్ వచ్చినా హౌస్‌లో ఉన్నవారెవరూ నవ్వలేదు. దీంతో ‘‘ఇదేంటి సార్ ఎవ్వరూ నవ్వట్లేదు.. నా కెరీర్ అప్పుడే అయిపోయిందా?’’ అని నాగార్జునను కిషోర్ అడిగారు. నేనే నవ్వొద్దన్నానులే, నవ్వితే బయటికి పంపిస్తే అని వార్నింగ్ ఇచ్చా అని నాగ్ చెప్పారు. ‘‘నాకే డిప్రెషన్‌గా ఉంది సార్. కాస్త నవ్వమని చెప్పండి’’ అని కిషోర్ రిక్వెస్ట్ చేశారు. దీంతో హౌస్‌మేట్స్ నవ్వించడానికి వారికి ‘మన్మథుడు 2’ ట్రైలర్ వేసి చూపించారు. ఆ తరవాత కిషోర్ మాట్లాడుతూ తాను బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్నానని చెప్పారు. తాను చూశాను అనడానికి సాక్ష్యంగా ఒక్కో హౌస్‌మేట్ యాక్టివిటీ గురించి చెప్పుకొచ్చారు. కిషోర్ ద్వారానే సేఫ్ జోన్‌లోకి వెళ్లిన మూడో వ్యక్తి పేరును ప్రకటించారు. ఆ మూడో వ్యక్తి బాబా భాస్కర్. కిషోర్‌ని షో నుంచి దగ్గరుండి పంపించిన తర్వాత మళ్లీ వచ్చిన నాగార్జున బాబా భాస్కర్‌ను సోఫా వెనకున్న సూట్ కేసును తీసుకురమన్నారు. ఆ సూట్ కేసును ప్రాపర్టీలా వాడుకుని బిగ్ బాస్ థీమ్ మ్యూజిక్‌కు డ్యాన్స్ చేయాలని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే బాబా భాస్కర్ డ్యాన్స్ చేశారు. ఆ తరవాత తమన్నా, వితికాలలో తమన్నా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ప్రేక్షకులు తమన్నాకే తక్కువ ఓట్లు వేసినట్లు నాగార్జున చెప్పారు. బాబా భాస్కర్‌కు కూతురిగా పుట్టుండాల్సింది.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తమన్నా ఎంతో జోష్‌తో వేదికపైకి వచ్చారు. నాగార్జున నోటి వెంబడి తన పేరు రావడం తన అదృష్టమని తమన్నా అన్నారు. బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టడం తన కల అని ఆ కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ షోలోకి వచ్చి తాను చాలా నేర్చుకున్నానని వెల్లడించారు. ఆ తరవాత తమన్నాకు నాగార్జున ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో ఉన్న వాళ్ల ఒక్కో హౌస్‌మేట్ ఫొటోను చూపిస్తూ వాళ్ల గురించి ఒక్క నిమిషంలో ఆగకుండా మాట్లాడమన్నారు. తమన్నా చెప్పే విషయాలను మన టీవీ ద్వారా హౌస్‌మేట్స్ చూస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరి గురించి తమన్నా తనకు తోచిన విధంగా చెప్పారు. అయితే, బాబా భాస్కర్ విషయంలో ఆమె కాస్త ఎమోషన్ అయ్యారు. ‘‘నా తల్లి, నా తండ్రి, నా గురువు అన్నీ బాబా భాస్కర్. నిజంగా బాబా భాస్కర్‌కే నేను పుట్టుంటే సూపర్ లేడీ అయ్యేదాన్ని’’ అని తమన్నా కంటతడి పెట్టుకున్నారు. రోహిణి హౌస్‌లో నటిస్తోందని, ఆమె ఈ షోకే వేస్ట్ అని తీసిపారేశారు. ఇక రవికృష్ణను ఇప్పటికైనా చిన్నపిల్లాడిలా కాకుండా మగాడిలా ఆడాలని సూచించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 10, Sep 2019, 4:37 PM IST Highlights విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు  చాలా కాలం క్రితం అంటే జనవరిలో నూతన సంవత్సర కానుకగా తన కొత్త సినిమాని ప్రకటించారు. ఓ చిన్న పందిపిల్లతో ‘అదుగో’ సినిమాతో ముందుకొచ్చి ప్రేక్షకులను నిరాశపర్చిన దర్శకుడు, నటుడు రవిబాబు మరో కొత్త ప్రయోగానికి రెడీ అయ్యారు.    దిల్ రాజు చెయ్యపడితే అది రాంగై పోదులేరా అని ప్రేక్షకులు ఫిక్సై థియోటర్స్ దగ్గర క్యూ కడతారు. అలా ఉంటాయి ఆయన లెక్కలు. ఓ సినిమాని ఆయన నిర్మించినా, డిస్ట్రిబ్యూషన్ కు తీసుకున్నా ట్రేడ్ లో అంచనాలు పెరిగిపోతాయి. రాత్రికు రాత్రి లెక్కలు తారు మారైపోతాయి. ఇప్పుడు రవిబాబు చిత్రం  ‘ఆవిరి’ ని దిల్ రాజు టేకప్ చేస్తున్నారు. దాంతో ఆ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యిపోయింది. ఎంతో కొంత విషయం లేకపోతే దిల్ రాజు ఎందుకు తీసుకుంటారని అంటున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు  చాలా కాలం క్రితం అంటే జనవరిలో నూతన సంవత్సర కానుకగా తన కొత్త సినిమాని ప్రకటించారు. ఓ చిన్న పందిపిల్లతో ‘అదుగో’ సినిమాతో ముందుకొచ్చి ప్రేక్షకులను నిరాశపర్చిన దర్శకుడు, నటుడు రవిబాబు మరో కొత్త ప్రయోగానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి ‘ఆవిరి’ అనే టైటిల్‌ని ప్రకటించారాయన. అంతేకాదు.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్రం కాన్సెప్ట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.   గాజు సీసా లోపల అమ్మాయి ఉండటం.. ఆ సీసా మూతని ఎవరో ఓపెన్‌ చేస్తుంటే ఆవిర్లు బయటికి వస్తుండటం.. వంటి వాటితో విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్‌ ఆకట్టుకుంది. ‘‘ఇది ఒక ఆఫ్‌ బీట్‌ చిత్రం. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను, నటీనటులను ప్రకటిస్తాం’’ అని చెప్పిన రవిబాబు సైలెంట్ అయ్యిపోయారు.  అయితే ఇప్పుడా సినిమా షూటింగ్ పూర్తై పోయిందని సమాచారం. దిల్ రాజు కు సినిమా చూపించారని, ఆయన కు కాన్సెప్టు నచ్చి రిలీజ్ చేయటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. Last Updated 10, Sep 2019, 4:37 PM IST
0business
Suresh 125 Views న్యూఢిల్లీ: తాజాగా ప్రకటించిన ఎటిపి ర్యాంకింగ్స్‌లో భారత్‌ టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ సు మిత్‌నగల్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో కెరీర్‌ అత్యుత్తమ 129 ర్యాంకు సాధిం చా డు.ఎటిపి ఛాలెంజర్‌ పోటీల్లో గతవారం ఫైనల్‌ చేరిన అతడు అర్జెంటీనాకు చెందిన జువాన్‌ ఫికోవిచ్‌ చేతిలో ఓటమిచెందాడు. ఏకపక్షంగాసాగిన మ్యాచ్‌లో సుమిత్‌ 4-6,1-6 తేడాతో ఓడిపోయాడు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం జరిగిన బ్యూనస్‌ ఎయిర్స్‌ఎటిపి ఛాలెంజర్‌ ఈవెంట్‌లో సుమిత్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించాడు.ఈ విజయంతో ఒకేసారి 26స్థానాలు ఎగబాకి 135వ ర్యాంక్‌ సాధించాడు.ఈనేపథ్యంలో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సుమిత్‌ఆరుస్థానాలు మెరుగుపడి 129వ ర్యాంకు చేరుకున్నాడు. తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/
2sports
United States, First Published 4, Sep 2018, 10:54 AM IST Highlights యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది.. స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్‌ ఓటమి పాలయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన జాన్ మిల్‌మాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-6, 7-5, 7-6, 7-6 సెట్ల తేడాతో ఫెదరర్ పరాజయం పాలయ్యాడు.   యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది.. స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్‌ ఓటమి పాలయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన జాన్ మిల్‌మాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-6, 7-5, 7-6, 7-6 సెట్ల తేడాతో ఫెదరర్ పరాజయం పాలయ్యాడు.
2sports
తాజావార్తలు కొనుగోళ్ల జోరు.. లాభాల్లో సూచీలు ముంబయి: దాదాపు తొమ్మిది రోజుల నష్టాల తర్వాత దేశీయ సూచీలు బుధవారం భారీ లాభాలను గడించాయి. ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా లోహ, ఇన్‌ఫ్రా, ఐటీ, బ్యాంక్‌, ఆటో, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో స్టాక్‌మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది. ఉదయం 190 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ను ఆరంభించింది. అటు నిఫ్టీ 10,650 పైనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ చివరి గంటలో పరుగులు పెట్టింది. అదానీ పోర్ట్స్‌, వేదాంత షేర్లు భారీ లాభాల్లో పయనించడం మార్కెట్లకు కలిసొచ్చింది. చివరి గంటలో కొనుగోళ్లు వెలువెత్తడంతో సెన్సెక్స్‌ 403.65 పాయింట్లు లాభపడి 35,756.26 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 131.10 పాయింట్లు లాభపడి 10,735.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.08 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ షేర్లు దాదాపు 6 శాతం లాభపడ్డాయి. టాటా స్టీల్‌, వేదాంత లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో షేర్లు భారీగా లాభపడగా.. డా.రెడ్డీస్‌, హీరోమోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. Tags :
1entertainment
Mar 15,2018 లాభాల స్వీకరణతో.. నష్టాల్లోకి ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా, ఆసియా మార్కెట్లు ఎరుపెక్కడం.. ఆమెరికా వాణిజ్య యుద్ధం వంటి ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌ను నష్టాలతో మొదలు పెట్టాయి. అనంతరం అమ్మకాల ఒత్తిడి తీవ్రతరం కావడంతో మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్‌ సెషన్‌లో సెన్సెక్స్‌ దాదాపు 200 పాయింట్ల నష్టాల్లోకి జారింది. మరోసారి భారీ నష్టాలు తప్పవనే అంచనాలు వస్తుండగా.. ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో చివరి గంటలో మార్కెట్లు కోలుకున్నాయి. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైన మార్కెట్లు చివరకు నష్టాలతోనే ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 21.04 పాయింట్లు నష్టపోయి 33,835.74 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 15.95 పాయింట్ల నష్టంతో 10,410.90 పాయింట్లకు వద్ద స్థిరపడింది. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యస్‌ బ్యాంకు, టెక్‌ మహింద్రా, అంబుజా సిమెంట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 3 శాతం వరకు లాభపడగా.. టాటా స్టీల్‌, ఐఓసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌పీసీఎల్‌లు 3 శాతం మేర కిందకి పడిపోయాయి. మరోవైపు భారతి ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌పీసీఎల్‌, హీరో మోటోకార్ప్‌, ఓఎన్‌జీసీ, టాటాస్టీల్‌ తదితర కంపెనీల షేర్లు నష్టాల్లోనే నిలిచాయి. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మదుపరులు లాభల స్వీకరణకు దిగడం కారణంగానే మార్కెట్లు బుధవారం ఆద్యంతం నష్టాల్లో కదలాడినట్టుగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Maha 10మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తిలక్ష్యం హైదరాబాద్‌, నవంబరు 7: మైహోం సిమెంట్స్‌ తమిళనాడు క్యూటికోరన్‌ లో ఏర్పాటుచేస్తున్న కొత్త యూనిట్‌ తో మొత్తం పది మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం లక్ష్యంగా విస్తరణ ప్రణాళిక అమలుచేస్తున్నట్లు మై హోంగ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాంబశివరావు వెల్లడించారు. కంపెనీ కొత్తగా రూపొందించిన మహాసిమెంట్స్‌లోగోను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండుదశాబ్దాలుగా సిమెంట్‌రంగంలో పటిష్టమైన వాటాతో ఉందన్నా రు. ఐర్లాండ్‌కు చెందిన సిఆర్‌హెచ్‌ కంపెనీతో 50 శాతం వాటా భాగస్వామ్యం మైహోంగ్రూప్‌తో ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోను, తూర్పుప్రాంత రాష్ట్రాల్లోను మంచి ఉనికిని కలిగి ఉన్న మహా సిమెంట్స్‌ త్వరలోనే ఉత్తరాదిప్రాంతాలకు విస్తరించ నున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాలీనా 50-70 శాతం ఉత్పత్తిసామర్ధ్యం వినియోగం అవుతుంద న్నారు. మహాగ్రూప్‌ లోగోతో మరింతగా చొచ్చుకు వెళ్లే లక్ష్యంతో ఉన్నట్లు సాంబశివరావు వివరించా రు. ప్రస్తుతం ఉన్న 8.2 మిలియన్‌ టన్నులు వచ్చే జనవరినాటికి 10 మిలియన్‌ టన్నులకు చేరుతుం దని ఆయన వివరించారు. ట్యూటికోరన్‌ ప్లాంట్‌కు రూ.250 కోట్లు పెట్టుబడులు కేవలం అంతర్గత నిధులతోనే ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. మహాగ్రూప్‌కు విద్యుత్‌ప్లాంట్లు మూడు ఉన్నాయ న్నారు. ఇప్పటివరకూ 15 మెగావాట్లు, 60 మెగా వాట్లతోపాటు అదనంగా ప్రస్తుతం పది మెగావాట్లు ఉత్పత్తియూనిట్‌ఏర్పాటవుతోందన్నారు. మహాగ్రూప్‌ ప్రస్తుతం సిమెంట్‌, నిర్మాణరంగం, విద్యుత్‌, ట్రాన్స్‌పోర్టురంగాల్లో విస్తరించిందని, త్వరలోనే ఫార్మారంగాలకు సైతం వెళుతున్నట్లు వివరించారు. గుంటూరులో 7.5 మిలియన్‌ టన్నుల సామర్ధ్యం ఉన్న యూనిట్‌ ఏర్పాటు చేస్తామని, కర్నూలులో జైజ్యోతి, మేళ్లచెరువులో కూడా మూడువేల ఎకరా లను లీజుకు తీసుకుంటున్నట్లు వివరించారు. విస్తరణబాటలో అవసరమైతే విక్ర యానికి సిద్ధంగా ఉన్న సిమెంట్‌ యూనిట్లను కొనుగోలు చేస్తామని సాంబశివరావు వివరించారు. కంపెనీ ఫ్లాగ్‌షిప్‌బ్రాండ్‌ మహాసిమెంట్‌బ్రాండ్‌ కు కొత్త గుర్తింపును తెచ్చేవిధంగా కొత్తలోగో ఆవిష్కరించామని, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ మార్కెట్లతో పాటు తూర్పుప్రాంతంలో ఒడిశా, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి ప్రాంతాల్లో కూడా పటిష్టమైన నెట్‌వర్క్‌ ఉందన్నారు. మీడియా సమా వేశంలో మార్కెటింగ్‌ డైరెక్టర్‌ విజ§్‌ువర్ధన్‌రావు, డైరెక్టర్‌ ఫైనాన్స్‌దేవ్‌జగత్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పిజె మత్త§్‌ు తదితరులు పాల్గొన్నారు.
1entertainment
Visit Site Recommended byColombia అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.280 పెరిగింది. దీంతో ధర రూ.36,620కు చేరింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. రూ.70 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,840కు చేరింది. Also Read: పీఎఫ్ డబ్బును ముందుగానే విత్‌డ్రా చేస్తున్నారా? నష్టపోతారు జాగ్రత్త! ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరుగుదలతో రూ.38,600కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 పెరుగుదలతో రూ.37,400కు ఎగసింది Also Read: ఎస్‌బీఐ హెచ్చరిక.. అలా చేయొద్దంటూ కస్టమర్లకు స్ట్రాంగ్ వార్నింగ్..! బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.70 పెరిగింది. దీంతో ధర రూ.48,840కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. Also Read: లోన్ తీసుకుంటే రూ.లక్షకు కేవలం రూ.853 ఈఎంఐ.. వారికి మాత్రమే! అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.22 శాతం తగ్గుదలతో 1,469.95 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం తగ్గుదలతో 16.97 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. Also Read: ఆధార్ కార్డు ఉందా? ఈ తప్పు చేస్తే రూ.10,000 జరిమానా..! బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సల్మాన్‌పై సానుభూతి వ్యక్తం చేసిన అక్తర్..! కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో దోషిగా తేలి.. జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ Samayam Telugu | Updated: Apr 6, 2018, 12:20PM IST సల్మాన్‌పై సానుభూతి వ్యక్తం చేసిన అక్తర్..! కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో దోషిగా తేలి.. జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సానుభూతి వ్యక్తం చేశాడు. 1998లో సల్మాన్‌పై కేసు నమోదవగా.. గురువారం ఐదేళ్లు జైలు శిక్ష, రూ. 10వేలు జరిమానా విధిస్తూ జోధ్‌పూర్ న్యాయస్థానం తీర్పుని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్షాకాలం మూడేళ్ల కంటే ఎక్కువగా ఉండటంతో.. శుక్రవారం బెయిల్ పిటిషన్‌‌ని సల్మాన్ ఖాన్ దాఖలు చేసుకోగా.. విచారణను శనివారానికి కోర్టు వాయిదా వేసింది.
2sports
Noaval Taata టాటాసన్స్‌ ఛైర్మన్‌ రేసులో నోవల్‌టాటా! న్యూఢిల్లీ, డిసెంబరు 3: టాటాసన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ పల్లోంజిమిస్త్రీని తొలగించినతర్వాత రతన్‌టాటా తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతున్న టాటాగ్రూప్‌ కంపెనీలకు త్వరలోనే కొత్త అధ్యక్షుణ్ణి నియామకం చేయాల్సి ఉంది. సైరస్‌మిస్త్రీ బావ మరిది నోయల్‌ నావల్‌టాటాపేరు ప్రముఖంగా విని పిస్తోంది. ఆయన మిస్త్రీకి బావమరిది, రతన్‌టాటా కు సవతిసోదరుడు. టాటాసన్స్‌ ఛైర్మన్‌పదవి రతన్‌టాటాసోదరుడు నోయల్‌ టాటాకే దక్కే అవకాశం ఎక్కువ అని కార్పొ రేట్‌రంగం విశ్లేషిస్తోంది. ప్రస్తుతం టాటా ఇంటర్నేషనల్‌కు ఛైర్మన్‌గా ఉన్న నోయల్‌టాటా కొత్తఛైర్మన్‌ ఎంపిక చేసేందుకు ఏర్పాటుచేసిన కమిటీ పరిశీలనలో ఆయన పేరున్నట్లు సమాచారం. టాటాగ్రూప్‌లో ఉన్న టాప్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి కమిటీ ముగ్గురుపేర్లను పరిశీలనలోనికి తీసుకుంది. వారిలో నావల్‌టాటాతో పాటు టిసిఎస్‌ సిఇఒ ఎండి నటరాజన్‌ చంద్రశేఖ రన్‌, జాగ్వార్‌ ల్యాండ్‌ఱోవర్‌ సిఇఒ రాల్ఫ్‌స్ఫేత్‌ వంటివారున్నారు. గత అక్టోబరు 24న నిర్వహిం చిన బోర్డు సమావేశంలో టాటాసన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌మిస్త్రీకి ఉద్వాసన చెప్పారు. ప్రస్తుత రతన్‌టాటానే తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వ హిస్తున్నారు. నోయెల్‌టాటాపేరు కొన్నిరోజుల క్రితమే బైటకురాగా టాటాగ్రూప్‌లోని వారితోపాటు బయటివ్యక్తులను కూడా పరిశీలన చేస్తుండటంతో జాప్యంజరిగిందని అంచనా. ఈ పదవి నిర్వహణకు నోయెల్‌టాటా సిద్ధంగా ఉన్నారా లేదా అనే అంశం పై స్పష్టతలేదు. గతంలో రతన్‌టాటా చేసిన వ్యాఖ్యల ప్రకారం అయితే నోయెల్‌టాటా పెద్ద బాధ్యతలకు సిద్ధంగాలేరని పలువురు చెపుతున్నా రు. నోయెల్‌ సన్నిహితులు కూడా ఆయనకు వివాదాల్లోనికి ప్రచారంలోనికి రావడం వంటివి పెద్దగా ఇష్టం ఉండదని చెపుతారు. టాటాగ్రూప్‌కు చెందినరిటైల్‌ విభాగంట్రెంట్‌కు ఛైర్మన్‌గానోయెల్‌ బాధ్యతలు నిర్వహించారు. ఈ సంస్థకు సిఇఒ ఎండిగా 2010 ఆగస్టు వరకూ కొనసాగారు. నోయెల్‌ తనహయాంలో ఇండియాలోనే మొదటిప్రైవేట్‌ లేబుల్‌ను విడుదలచేసా రు. రిటైలింగ్‌ వెంచర్‌ట్రెంట్‌ను లాభా ల్లోనికి తీసుకెళ్లడమే కాకుండా టెస్కోతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోగలిగారు. ఒక్క ఔట్‌లెట్‌ను క్లోజ్‌చేయకపోవడం నోయెల్‌ టాటా ప్రత్యేకతగా చెపుతారు. సైరస్‌మిస్త్రీ, రతన్‌ టాటాల మాదిరిగానే లోప్రనొఫైల్‌ను కొన సాగించేం దుకే నోయెల్‌ నవాల్‌ టాటా ఇష్టపడతారని అందుకే ఆయన వ్యవహారశైలి దృష్ట్యా టాటాసన్స్‌ ఛైర్మన్‌ పోస్టుకు ఎంపికచేసే అవకాశం ఉందని అంచనా.
1entertainment
తారక్, చరణ్ ఇద్దరు కలసి ట్రిప్ కి వెళ్తున్నారట.? Highlights ఎన్టీఆర్ రామ్ చరణ్ లు తర్వాత చేయబోయే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. రాజమౌళి దీని గురించి అధికారిక ప్రకటన చేయనప్పటికీ షూటింగ్ ప్రారంభోత్సవం వరకు ఇది ఇలాగే గోప్యంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారట.​ ఎవరికి వారు తమ తమ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు తర్వాత చేయబోయే టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ అప్ డేట్స్ తీసుకుంటూనే ఉన్నారు. రాజమౌళి దీని గురించి అధికారిక ప్రకటన చేయనప్పటికీ షూటింగ్ ప్రారంభోత్సవం వరకు ఇది ఇలాగే గోప్యంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారట.  ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతోంది అనే వార్తే అప్పట్లో కలకలం రేపింది. రియల్ మల్టీ స్టారర్ అంటూ ఫాన్స్ కూడా ఉద్వేగాన్ని షేర్ చేసుకున్నారు. మొదలుపెట్టడానికి ఇంకా ఎలాగూ సమయం ఉంది కాబట్టి ఆ లోపు తమ ఇద్దరి బాండింగ్ ని ఇంకా బలంగా మార్చుకునే పనిలో పడ్డారు ఈ ఇద్దరు మిత్రులు. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం తారక్ చరణ్ ఇద్దరు కలిసి ఒక హాలిడే ట్రిప్ కోసం యూరోప్ వెళ్ళబోతున్నారు. తారక్ భార్య ప్రణతి ప్రసవం కాగానే ఇది ఉండొచ్చని టాక్. వీరితో పాటు రాజమౌళి కూడా జాయిన్ అయ్యి తాము అనుకున్న ప్రాజెక్ట్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పటి దాకా రాసుకున్న స్క్రిప్ట్ ముగ్గురికి సింక్ అయ్యేలా ఉందా లేదా అనే చర్చలు కూడా చేస్తారట. త్రివిక్రమ్ సినిమా కోసం తన ఒంటిని వింటిలా మార్చి జిమ్ లో కష్టపడుతున్న తారక్ అదే లుక్ అలాగే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అంత హైప్ వచ్చే సినిమాగా దీని మీద అప్పుడే ట్రేడ్ రకరకాల అంచనాలు మొదలుపెట్టుకుంది. మల్టీ స్టారర్స్ ట్రెండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతోనే ప్రారంభమైనప్పటికి ఒకే జెనరేషన్ స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకుల కోరిక. ఆ రకంగా చరణ్- ఎన్టీఆర్ సినిమా కొత్త చరిత్రకు నాంది పలికినట్టే. అప్పుడెప్పుడో ఎన్టీఆర్-ఎఎన్ ఆర్ కలిసి 14 సినిమాల్లో కలిసి నటించారు. 80 దశకం దాటాక రెండో తరం నుంచి ఇవి పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇది ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తుందనే నమ్మకంతో ఉంది టాలీవుడ్.  Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
Jun 09,2018 లాట్‌ మొబైల్స్‌ స్టోర్స్‌లో బ్లాక్‌బస్టర్‌ డీల్స్‌ హైదరాబాద్‌: ప్రముఖ స్మార్ట్‌ రిటైల్‌ దిగ్గజం లాట్‌ మొబైల్స్‌.. 'తేజ్‌' సినిమా కథా నాయకా నాయకిలు సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమే శ్వరన్‌ సహా పలువురి ప్రముఖుల సమక్షంలో సంస్థ ప్రతినిధులు బ్లాక్‌బస్టర్‌ డీల్స్‌ను ప్రారంభించారు. ప్రతిమొ బైల్‌పై కచ్చితమైన బహుమతి పొందే ఈ ఆఫర్లలో...మొబైల్‌ కొనుగో లుపై టీవీ, టవర్‌ ఫ్యాన్స్‌, రైస్‌ కుక్కర్లు ఉచితంగా, సెల్‌ఫోన్లపై 55 శాతం వరకు డిస్కౌంట్స్‌, 0శాతం ఫైనాన్స్‌ సదుపాయం, బ్రాండెడ్‌ యాక్ససరీస్‌పై 25, 50, 75శాతం వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్స్‌ అందజేస్తున్నారని ఈ సందర్భంగా సినీప్రము ఖులు తెలిపారు. వీటితోపాటు 1జీబీ ర్యామ్‌ గల ఫోన్‌ రూ. 2999లకు, 2 జీబీ ఫోన్‌ రూ. 4999లకు, 3జీబీ ఫోన్‌ రూ. 5999లకు, 4జీబీ ర్యామ్‌ గల మొబైల్‌ 8999లకేనని సంస్థ ప్రకటించింది. అన్ని క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో మొబైల్స్‌ కొనుగోలు చేసుకోవచ్చని, ఫోన్లపై ఇన్సురెన్స్‌, ఆఫ్టర్‌ సేల్స్‌ సర్వీసెస్‌ అందిస్తున్నామని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. యాక్టర్‌ అల్లు అర్జున్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న తమ సంస్థలో 2000మందికి పైగా ఉద్యోగులున్నారని తెలిపారు. అలాగే అన్ని బ్రాండెడ్‌ మొబైల్స్‌, లేటెస్ట్‌ యాక్సెసరీస్‌ తమ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయని సంస్థ ప్రతినిధి వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
రాశి ఉన్నా వాసి కనిపించడం లేదు - నియమాకాలకు అదే పెద్ద 'కొరత' - 58% కంపెనీల మాట ఇది            ముంబయి: భారత్‌లో చదువుకున్న వారు లక్షలు, కోట్లలో ఉంటున్నప్పటికీ వారిలో ఉద్యోగాల్లోకి తీసుకొనేందుకు అవసరమైన ప్రతిభ, నైపుణ్యం గల వారు దొరకడం లేదంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ఈ అంశమే ఇప్పుడు పరిశ్రమ వర్గాలను కలవరపరుస్తోంది. ఈ కారణం చేతనే నియామకాలు చేపట్టడం కష్టంగా మారిందన్నది వారి వాదన. దేశీయంగా ఉద్యోగాలను ఇచ్చే 58% కంపెనీలు ఈ విషయంలోనే ఆవేదన వ్యక్తం చేసినట్లు 'మ్యాన్‌ పవర్‌ గ్రూపు' సర్వే తేల్చింది. ఈ సంస్థ నిర్వహించిన 'వార్షిక ప్రతిభ కొరత' సర్వే ఇదే విషయమై పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించింది. 2014 తో పోలిస్తే ఈ ఏడాది ఇది 6 శాతం మేర తగ్గినట్లు నివేదిక తెలిపింది. అంతకుముందు సంవత్సరం ఈ కొరత 64 శాతంగా ఉంది. నివేదికలోని ఇతర అంశాలు.. - ఉద్యోగాలను ఇచ్చేవారిలో 9 శాతం మంది ప్రతిభ కొరత తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. కానీ వీరిలో కొందరు ఉన్న వారిలోంచే మెరుగైన వారిని తీసుకొని తమ అవసరాల మేరకు వ్యూహాత్మకంగా తగిన శిక్షణనిచ్చి ముందుకు సాగుతున్నారు. - అంతకు ముందు ఏడాది కేవలం తగిన ప్రతిభ గల వారితో అకౌంటింగ్‌ ఫైనాన్స్‌ స్టాఫ్‌, సేల్స్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీ మాత్రమే పరిశ్రమ వర్గాల వారికి చాలా కష్టంగా ఉండేది. - ప్రస్తుత సంవత్సరం అకౌంటింగ్‌, ఆర్థిక సర్వీసులు, ఐటీ, సెక్రెటరీస్‌, పీఏలు, ఆఫీసు సపోర్ట్‌ స్టాఫ్‌ను నియమించుకోవడం కూడా ఒక గొప్ప సవాలుగానే మారుతోంది. - ప్రతిభా లోపం గల వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం వల్ల వినియోగదారుల అవసరాలను అందుకోవడంలో ప్రతికూల ప్రభావం పడుతుందని 13 శాతం మంది ఉద్యోగదాతలు అభిప్రాయపడుతున్నారు. - ఇలాంటి నియామకాలు చేపట్టడం వల్ల పోటీతత్వం లోపించడం, ఉత్పాదకత తగ్గడం, ఉద్యోగిపై వ్యయం పెరగడం, ఎక్కువ పనిని ధైర్యంగా అప్పగించేందుకు వీలుపడకపోవడం వంట ప్రతికూల ప్రభావాలు ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. - ప్రతిభ కొరత నేపథ్యంలో కూడా వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని ప్రజలూ ఆశవహగానే ఉన్నారు. అవకాశం దొరికితే ఉద్యోగంలో చేరాక తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చన్న దృక్పథంతో వారున్నారు. - విషయంపై పట్టు తగిన అనుభవం కలిగిన వారికి తీసుకొనేందుకు కంపెనీలు ఆసక్తిని చూపుతున్నాయి. - బిగ్‌డాటా, డాటా అనెలిటిక్స్‌ సోషల్‌ మీడియా, మోబైల్‌, అనెలిటిక్స్‌, క్లౌడ్‌ రంగాలలో మెరుగైన ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి. - 2015లో ఎక్కువగా అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, ఐటీ, రిసప్షెనిష్ట్‌, టీచర్లు, ఇంజినీర్లు, మార్కెటింగ్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, అమ్మకాల విభాగంలో మేనేజర్లు, మేనేజ్‌ మెంట్‌, న్యాయ సంబంధిత, పరిశోధన విభాగాలలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభించే ఆస్కారం ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Michel Stark కోహ్లీకి గట్టిపోటీ ఇవ్వనున్న మిచెల్‌ స్టార్క్‌ న్యూఢిల్లీ: కోహ్లీ సేనను కట్టడి చేయాలంటే ఆస్ట్రేలియా బౌలర్లు సమి ష్టిగా సత్తా చాటాలని పలువురు ఆసీస్‌ మాజీ క్రికెటర్లు చెబుతుం డటాన్ని మనం చూశాం.ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైక్‌ హస్సీ మాత్రం ఈ సిరీస్‌ల కోహ్లీకి ఆస్ట్రేలియాపేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ గట్టి సవాల్‌ విసురుతాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.స్టార్‌ తెలివైన బౌలర్‌.ఉపఖండంలో పరిస్థితు లకు బాగా సరిపోతాడు.కొత్త బంతి తో ఖచ్చితమైన వేగాన్ని స్వింగ్‌ను రాబడతాడు అని హస్సీ వివరిం చాడు.స్టార్క్‌ అద్భుతమైన రివర్స్‌ స్వింగ్‌ చేస్తాడు.ఖచ్చితంగా ఈ సిరీస్‌ మొత్తం కోహ్లీకి అతడు గట్టి పోటీ ఇస్తాడు అని హస్సీ పేర్కొ న్నాడు. స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో టీమిండియా చాంపియన్‌ అనే విషయాన్ని పక్కన బెడితే ఉపఖండంలో విజయం సాధిం చాలంటే ఆసీస్‌ స్పిన్నర్లు లియోన్‌,ఓ కీఫీలను సమర్థంగా ఉపయోగిం చుకోవాలన్నాడు. ఆసీస్‌ స్పిన్నర్లపై కెప్టెన్‌ స్మిత్‌ నమ్మకం పెట్టాలన్నాడు.ఈ విషయంలో స్మిత్‌ చాలా ఓపికగా వ్యవహరిం చాలని హస్సీ సూచించాడు.భారత్‌లో ఉండే భిన్నమైన పిచ్‌లపై రకరకాల సవాళ్లు ఎదురవుతాయని చెప్పిన హస్సీ వీటిని వార్నర్‌,స్మిత్‌ ధీటుగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారీ స్కోరు చేయాలని కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌తో పాటు,వార్నర్‌లపై ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది.వీళ్లు కూడా పరుగులదాహంతో ఉన్నారని పేర్కొన్నాడు. భారత్‌ నుంచి గట్టి సవాల ఎదురవుతుందని,ఈ సిరీస్‌లో స్మిత్‌,వార్నర్‌లు స్పష్టమైన ముద్ర చూపుతారన్నాడు. భారత పర్యటన కోసం ఆస్ట్రేలియా గత కొంత కాలంగా ప్రత్యేకంగా దృష్టి సారించిందని,ఈ సిరీస్‌ సన్నాహకాలు కూడా బాగున్నాయని హస్సీ తెలిపాడు.భారత పర్యటనపై క్రికెట్‌ ఆస్ట్రేలియా కూడా దృష్టి పెట్టిందని,ఇక మైదానంలో మన ప్రదర్శన ఒక్కటే మిగిలుందన్నాడు. ఈ సిరీస్‌కు ముందు మరికొన్ని వార్మప్‌ మ్యాచ్‌లు ఉంటే బాగుండే దనే అభిప్రాయాన్ని హస్సీ వ్యక్తం చేశాడు. భారత టాప్‌ స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాను ఎదుర్కోవాలంటే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాల్సిందేనని హస్సీ వెల్లడించాడు.
2sports
అండర్‌-19 ప్రపంచ కప్‌ విజేత వెస్టిండీస్‌ భారత్‌ – 145 ఆలౌట్‌ (45.1 ఓవర్లు) వెస్టిండీస్‌ – 146/5 (49.3 ఓవర్లు) పేలవంగా ఆడిన భారత్‌ టాపార్డర్‌ సర్ఫరాజ్‌ ఒంటరి పోరాటం ఢాకా : అండర్‌-19 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరిఇన ఫైనల్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ విజయాన్ని సాధించి టోర్నీ సొంతం చేసుకుంది.చివరి వరకు పోరాడిన కార్టీ, పాల్‌ తమ జట్టుకు విజయాన్ని అందించారు. కాగా భారత్‌ నిర్దేశించిన 145 పరుగుల టార్గెట్‌ ఛేదనలో వెస్టిండీస్‌ నిలకడగా ఆడింది. ఓపెనర్లు పోప్‌ 2,ఇమ్లచ్‌ 15 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం హెట్మెర్‌ 23 పరుగుల వద్ద వెనుదిరగగా, స్ప్రంగర్‌ 3 పరుగులకే వెనుదిరిగాడు.కాగా 3 పరుగులు చేసి గూలీ దాగర్‌ బౌలింగ్‌లో ఔట్‌కాగా 5 వికెట్లు కోల్పోయిన విండీస్‌ 49 ఓవర్లకు 143 పరుగులు చేసింది.కార్టీ 51 పరుగులు, పాల్‌ 38 పరుగులతో కొనసాగగా, అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా ప్రారంభం నుంచి తడబడింది. ఓపెనర్‌గా వచ్చిన ఆర్‌ఆర్‌ పంత్‌ 1 పరుగు,మరో ఓపెనర్‌ ఇషాంత్‌ కిషన్‌ 4 పరుగుల చేసి వెంట వెంటనే పెవిలియన్‌కు వెళ్లిపోయారు.ఆ తరువాత అన్మోల్‌ ప్రీత్‌సింగ్‌ 3 పరుగులు,వాషింగ్టన్‌ సుందర్‌ 7 పరుగులు, ఆర్మాన్‌ జాఫర్‌ 5 పరుగులకే వెనుదిరిగారు. ఎంకె లామ్రర్‌ 19 పరుగులకు ఔటయ్యాడు.అనంతరం ఎస్‌ఎప్‌ఖాన్‌ 51 పరుగులతో ఆడి జాస్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దాగర్‌ 8 పరుగులకే ఔటయ్యాడు. కాగా బంగ్లాదేశ్‌ బౌలర్లలో జోపెస్‌,జాన్‌ ఒక్కొక్కరు 3 వికెట్లు తీసుకోగా,పాల్‌ 2 వికెట్లు,హూల్డర్‌,స్పింగర్‌ ఒక్కొక్కరు ఒక వికెట్‌ తీసుకున్నారు. భారత్‌ తక్కువ స్కోరు నమోదు… వరల్డ్‌ కప్‌-19లో బాగా ఆడిన భారత్‌ ఫైనల్‌లో తక్కువ స్కోరు నమోదు చేశారు. టాపార్డర్‌లో సర్పరాజ్‌ 51 పరుగులతో హాఫ్‌ సెంచరీతో ఒంటరి పోరాటం చేయడం మినహా ఇతర ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ఫైనల్‌ పోరులో భారత్‌ 146 పరుగులు టార్గెట్‌ను నిర్ధేశించింది. యువ భారత్‌ 45.1 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది.సర్పరాజ్‌కు తోడు మహిపాల్‌ లోమ్రోర్‌ 19 పరుగుల,రాహుల్‌ బాథమ్‌ 21 పరుగులు చేయడం మినహా ఇతర బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌ దాటలేకపోయారు. కాగా ఓపెనర్‌ రిషబ్‌ పంత్‌ 1 పరుగు చేసి తొలి ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఆ వెంటన్‌ ఆన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌ 3 పరుగులు చేసి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.భారత్‌ 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తరువాత ఇషాన్‌ కిషన్‌ 4 పరుగులతో పాటు వాషింగ్టన్‌ సుందర్‌ 7 పరుగులు,ఆర్మన్‌ జాఫర్‌్‌ 5 పరుగులే ఔట్‌ కావడంతో భారత్‌కు ఇబ్బంది కలిగింది.దీంతో 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కాగా ఈ దశలో 100 లోపు పోరాటం ముగుస్తుందనిపించింది. అయితే సర్పరాజ్‌ ఒంటరి పోరాటం చేసి జట్టుకు ఆదుకున్నాడు. అతనికి లోమ్రోర్‌ కొద్దిసేపు అండగా నిలిచాడు.కాగా హాఫ్‌ సెంచరీ చేసిన సర్పరాజ్‌ ఔటయ్యాక భారత్‌ ఇన్నింగ్స్‌ ఎక్కువసేపు సాగలేదు. తొలిసారి విండీస్‌క కప్‌… భారత్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో వెస్టిండీస్‌ విజయం సాధించి తొలిసారి కప్‌ను దక్కించుకుంది. దీంతో అండర్‌ -19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పోరులో యువ భారత్‌కు నిరాశ కలిగింది.కాగా తుది జట్లు అయిదు వికెట్ల తేడాతో పరాజయంతో రన్నరఫ్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.భారత్‌ నిర్ధేశిత టార్టెగ్‌ 146 పరుగులను ఛేదించడానికి బరిలోకి దిగిన విండీస్‌ ఇంకా మూడు బంతులుండగానే విజయం సాధించింది. వరుసగా నాలుగవ సారి కప్‌ను సాధించాలనుకున్న భారత్‌ కోరిక నెరవేరలేదు.కాగా 2000,2008,2012 సంవత్సరాలలో వరల్డ్‌ కప్‌ గెలుచుకుని రికార్డు టైటిల్‌ పై కన్నేసిన యువ భారత పేలవ ప్రదర్శన కారణంగా ఓడిపోయింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.కాగా అండర్‌్‌ -19 వరల్డ్‌ కప్‌లో రెండవ సారి ఫైనల్‌కు చేరిన విండీస్‌ అందరి అంచనాలను తలకిందులు చేసి తమలోని ప్రతిభకు కొదవ లేదని నిరూపించింది.
2sports
Apr 17,2017 బ్యాంకులకు రుణగండం ముంబయి: కొండలా పేరుకుపోయిన మొండి బాకీలతో కుదేలైన బ్యాంకులు ఇప్పుడు కొత్త చిక్కుల్లో కూరుకుపోయాయి. అప్పుల కుప్పలు పెరగడం,కార్పొరేట్‌ డిమాండ్‌ పడిపో వడంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రుణాల(పరపతి) వృద్ధి అంతకుముందు ఏడాదితో పోలిస్తే 10.7 నుంచి 5.08 శాతానికి పతనమైంది. గత ఏడాది బ్యాంకుల రుణ వితరణ రూ 75 లక్షల కోట్లు కాగా ఈ ఏడాది మార్చి నాటికి అది కేవలం 5 శాతం వృద్ధితో రూ 78.81 లక్షల కోట్లకే పరిమితమైంది. బ్యాంకుల రుణాల జారీ ఇంత తక్కువ వృద్ధి కనబరచడం 1953-54 తర్వాత ఇదే కావడం గమనార్హం.ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధితో నిలకడగా ముందుకు వెళుతున్నదని ప్రభుత్వం ఘనంగా చాటుతున్న క్రమంలో రుణ వృద్ధి మునుపెన్నడూ లేనంత నిరాశాజనకంగా ఉండటం పట్ల విస్మయం వ్యక్తమవుతున్నది. బ్యాంకులు ఇప్పటికే మొండి బాకీలతో సతమతమవుతూ కొత్త రుణాలకు నిరాకరి స్తుండటం,కొన్ని కంపెనీలు కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించుక ుంటుండటంతో బ్యాంకులకు రుణాల కోసం తాకిడి తగ్గింది. వడ్డీ రేట్లు తగ్గినా రుణాలకు డిమాండ్‌ ఊపందుకోకపోవడంతో బ్యాంకుల వద్ద పోగుపడిన నిధుల నిర్వహణ సంక్లిష్టంగా మారింది.ఇక మొండి బకాయిలు పేరుకున్న అప్పుల్లో రూ 3.16 లక్షల కోట్ల అప్పులు కేవలం 40 మంది భారీ పారిశ్రామికవేత్తలే కావడం గమనార్హం. ఇక నోట్ల రద్దు నేపథ్యంలో 2017 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల వృద్ధి 11 శాతం మేర పెరిగింది.అ ంతకుముందు ఏడాది దాదాపు రూ 90లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకు డిపాజిట్లు 2017 మార్చి నాటికి రూ కోటి పదిలక్షల కోట్లకు పైగా పెరిగాయి. పరపతి పతనమైతే... పరపతి సంక్షోభంతో బ్యాంకుల వద్ద రూ లక్షల కోట్లు అందుబాటులో ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే రంగాలకు ఊతమివ్వని పరిస్థితి.నిధులు దండిగా ఉన్నా రుణాల జారీలో బ్యాంకుల చిన్నచూపుకు గురవు తున్న చిన్న,మధ్యతరహా పరిశ్రమల ఉనికి,విస్తరణ ప్రమాదంలో పడి లక్షలాది కొలువులు కోల్పేయే ప్రమాదం తలెత్తు తుంది. మరోవైపు కార్పొరేట్లకు రుణాల రద్దు చేస్తున్న బ్యాంకులు నిధుల లభ్యత ఉన్నా సంక్షోభంలో కూరుకుపోయిన పరిశ్రమలకు నిధుల ఊతమిచ్చే పరిస్థితిలేదు. ఖాయిలా పరిశ్రమలను కాపాడితే ఆ మేర వేలాది ఉద్యోగాలను నిలుపుకునే వెసులుబాటు ఉంటుంది.ఉపాధి రంగాలను నిర్లక్ష్యం చేయకుండా నిధుల లభ్యత పెంచితేనే ప్రస్తుత సంక్షోభం నుంచి బ్యాంకులతో పాటు ఆర్థిక వ్యవస్థా గట్టెక్కుతుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV World Cup 2019: భారత్ VS పాక్ మ్యాచ్‌పై స్పందించిన ఐసీసీ ఉగ్రదాడి‌తో అసువులు బాసిన జవాన్ల కుటుంబాల గురించి మేము కూడా చింతిస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన ఘటన. దాడి తర్వాత జరుగుతున్న పరిణామాలను ఐసీసీ గమనిస్తోంది. -ఐసీసీ సీఈవో రిచర్డ్‌సన్ Samayam Telugu | Updated: Feb 20, 2019, 11:23AM IST హైలైట్స్ ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలు జూన్ 16న పాకిస్థాన్‌తో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఆడనున్న భారత్ ఆ మ్యాచ్‌ను బహిష్కరించి పాక్‌ దుశ్చర్యని ప్రపంచానికి తెలియజేయాలని టీమిండియాకి అభిమానులు సూచన ఇప్పటి వరకూ ప్రపంచకప్ షెడ్యూల్‌ మార్పుపై అధికారిక సమాచారం లేదని ఐసీసీ సీఈవో వ్యాఖ్య పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. పాకిస్థాన్‌తో జూన్ 16న జరగనున్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తుండటంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పందించింది. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్‌ మొదలుకానుండగా.. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం జూన్ మూడో వారంలో దాయాది దేశాలు ఢీకొననున్నాయి. కానీ.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడితో 40 మంది జవాన్లు అమరులైన నేపథ్యంలో.. ఆ దేశంతో భారత్ క్రికెట్ ఆడకుండా మ్యాచ్‌ను బహిష్కరించాలని హర్భజన్ సింగ్‌తో పాటు బీసీసీఐ మాజీ కోశాధికారి, అభిమానులు కోరుతున్నారు. రెండు రోజుల క్రితం ఈ మ్యాచ్ గురించి ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. దేశం కంటే క్రీడలు ముఖ్యం కాదని.. అయితే మ్యాచ్‌పై ప్రస్తుతం తాము కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు. ఐపీఎల్ ఛైర్మన్ వ్యాఖ్యలతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించబోతోందంటూ వార్తలు పెరిగాయి. దీంతో.. ఐసీసీ సీఈవో రిచర్డ్‌సన్ స్పందించాడు. ‘ఉగ్రదాడి‌తో అసువులు బాసిన జవాన్ల కుటుంబాల గురించి మేము కూడా చింతిస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన ఘటన. దాడి తర్వాత జరుగుతున్న పరిణామాలను ఐసీసీ గమనిస్తోంది. అయితే.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించడంపై ఇప్పటి వరకూ మాకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. షెడ్యూల్ ప్రకారమే అన్ని మ్యాచ్‌లూ జరుగుతాయి’ అని వెల్లడించాడు. ఒకవేళ భారత్ ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. పాక్‌కి రెండు పాయింట్లు కేటాయించనున్నారు.
2sports
chris gayle awarded usd 221,000 in defamation case Chris Gayle: పరువు నష్టం కేసులో క్రిస్‌గేల్‌కి పరిహారం..! క్రిస్‌గేల్‌ సిడ్నీలోని తన డ్రెస్సింగ్‌ రూమ్‌‌కి మహిళా మసాజ్‌ థెరపిస్టును పిలిపించుకున్నాడు. ఆమె ముందు అసభ్యకరంగా తన మర్మాంగాలను ప్రదర్శించాడు -2016లో ఫెయిర్‌ఫాక్స్‌ ఓ కథనంలో ఇలా..! Samayam Telugu | Updated: Dec 3, 2018, 02:33PM IST ఆస్ట్రేలియా మీడియా సంస్థపై వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్‌ ఘన విజయం సాధించాడు. 2016 జనవరిలో తనపై అసభ్యకర తప్పుడు కథనాల్ని ప్రచురించిన ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రిస్‌గేల్ .. అప్పట్లో న్యూసౌత్‌వేల్ సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఈ కేసుపై ఈరోజు అంతిమ తీర్పుని వెలువరించిన కోర్డు.. తప్పుడు కథనాల్ని ప్రచురించినందుకు క్రిస్‌గేల్‌కి పరిహారం రూపంలో 2,20,770 అమెరికన్ డాలర్లని చెల్లించాలని ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే..? ఐసీసీ వన్డే ప్రపంచకప్‌- 2015 సమయంలో క్రిస్‌గేల్ తన హోటల్‌ రూములోకి వచ్చిన మహిళా మసాజ్ థెరపిస్ట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫెయిర్‌ఫాక్స్‌ మీడియా న్యూస్‌ పేపర్స్‌.. ది ఏజ్‌, ది సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ది కాన్‌బెర్రా టైమ్స్‌ 2016 జనవరిలో వరుస కథనాల్లో ఆరోపించాయి. అందులో ‘క్రిస్‌గేల్‌ సిడ్నీలోని తన డ్రెస్సింగ్‌ రూమ్‌‌కి మహిళా మసాజ్‌ థెరపిస్టును పిలిపించుకున్నాడు. ఆమె ముందు అసభ్యకరంగా తన మర్మాంగాలను ప్రదర్శించాడు’ అని ప్రచురించాయి.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV జియోకు పోటీగా ఎయిర్‌టెల్ '3 జీబీ డేటా' ప్లాన్‌! సంచలన టెల్కో 'జియో'ను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. జియో అందిస్తున్న రూ.509 ప్లాన్‌కు పోటీగా రూ.558తో కొత్త ప్లానును ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. TNN | Updated: May 20, 2018, 04:52PM IST జియోకు పోటీగా ఎయిర్‌టెల్ '3 జీబీ డేటా' ప్లాన్‌! సంచలన టెల్కో 'జియో'ను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. జియో అందిస్తున్న రూ.509 ప్లాన్‌కు పోటీగా రూ.558తో కొత్త ప్లానును ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటాతోపాటు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియో రూ.509 ప్లాను కాలపరిమితి 28 రోజులు కాగా... ఎయిర్‌టెల్ 82 రోజుల కాలపరిమితితో ఈ కొత్తప్లానును తీసుకొచ్చింది. జియో ఆఫర్‌లో రోజుకు 3 జీబీ డేటాతోపాటు, 100 మెసేజ్‌లు అందుతున్నాయి. మరో టెలికామ్ సంస్థ వొడాఫోన్ కూడా ఇటీవలే రూ.511, రూ.569 ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ.511 ప్లాన్ కింద రోజుకు 2 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాలు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. రూ.569 ప్లాన్ కింద రోజుకు 3 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాలు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల అందిస్తోంది. ఈ రెండు ప్లాన్ల కాలపరిమితి 84 రోజులు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
LENOVA లెనోవో నుంచి ఫ్యూచర్‌రెడీ ల్యాప్‌టాప్‌ హైదరాబాద్‌, ఆగస్టు 14: భావితరం ఫీచర్లతో ఫ్యూచర్‌రెడీ ల్యాప్‌టాప్‌లనుప్రముఖ లాప్‌టాప్‌ కంపెనీ లెనోవో ఆవిష్కరించింది. ప్రీమియంకేర్‌ సపోర్టును కూడా అందిస్తూ ప్రీమియం నోట్‌బుక్స్‌ నిరంతర సేవలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది.ప్రీమియంకన్వర్టబుల్స్‌యోగా 720, యోగా 520, అల్ట్రాధిన్‌, లైట్‌పవర్‌ హౌసెస్‌, ఐడియాపాడ్‌ 520ఎఫ్‌, 320ఎస్‌, పూర్తి మల్టీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ ల్యాప్‌టాప్‌లు ఐడియాపాడ్‌520,320లు కూడా అందుబాటులోనికి వచ్చాయని కంపెనీ వివరిం చింది. ఇంటెల్‌ 7జి ప్రాసెసర్లు ఏర్పాటుచేసా మని, నివిడియాగ్రాఫిక్స్‌, ఫుల్‌ హెచ్‌డిఐపిఎస్‌ డిస్‌ప్లే, నారోబీజిల్స్‌, ఇంటిగ్రేటెడ్‌ డాల్బీ ఆడియోప్రీమియం అట్మాస్‌టెక్నాలజీ వంటివి ఉన్నాయి. హర్మాన్‌ స్పీకర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. వేలిముద్రల రీడింగ్‌, విండోస్‌ 10 హోమ్‌పర్సనల్‌ అసిస్టెన్స్‌ కోర్టానా కూడా ఉంది. దక్షిణభారత్‌మేనేజర్‌ అంజన్‌ బార్హు మాట్లా డుతూ అత్యంత నాజూకైన ఉత్పత్తులను కస మర్లకు అందిస్తున్నామన్నారు. యోగా 720 రూ.74,500లు, నుంచి యోగా వై720 1.49,800రూపాయలవరకూ వివిధ కేటగిరీలధరలున్నట్లు ఆయన తెలిపారు.
1entertainment
Visit Site Recommended byColombia బట్లర్ 2014 తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో శతకం చేయలేదు. భారత్‌తో సిరీస్ తర్వాత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. కానీ సెలెక్టర్లు అనూహ్యంగా అతణ్ని పాకిస్థాన్‌‌తో టెస్టు సిరీస్‌కి ఎంపిక చేశారు. ఐపీఎల్ కారణంగానే టెస్టులోకి పునరాగనం చేసి రాణించానని బట్లర్ చెప్పాడు. ఐపీఎల్‌లో సత్తా చాటడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఈ ఇంగ్లిష్ క్రికెటర్ చెప్పాడు. ఒత్తిడిలో, జనం ముందు, విదేశీ ఆటగాడిగా రాణించడం ఎంతో నమ్మకం కలిగించిందని బట్లర్ తెలిపాడు. ఈ ఏడాది రాజస్థాన్ తరఫున ఐపీఎల్‌ ఆడిన బట్లర్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సాధించడంతోపాటు 13 మ్యాచ్‌ల్లో 548 పరుగులు చేశాడు. తొలి టెస్టులో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్టులో అద్భుతంగా పుంజుకుంది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకొని 1-1తో సిరీస్‌ను సమం చేసింది. గత ఏడాది లార్డ్స్‌లో వెస్టిండీస్ మీద గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ టెస్టుల్లో గెలవడం మళ్లీ ఇదే తొలిసారి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి అంతర్జాతీయంగా ధరలు తగ్గడం, స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వరుసగా రెండో రోజు బంగారం ధరలు పతనమయ్యాయి. Samayam Telugu | Updated: Dec 17, 2018, 08:26PM IST Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి బులియన్ మార్కెట్‌లో నేటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు పతనం కాగా, మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ముగుస్తుండటం, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో బులియన్ మార్కెట్లో సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 190 తగ్గింది. దీంతో రాజధాని ఢిల్లీలో సోమవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 32,000కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగాధరం ధర రూ. 31,850 అయింది. ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. రూ.25,000 ధర వద్ద కొనసాగుతోంది. స్థానికంగా డిమాండ్ వచ్చినా వెండి ధరలలో ఎలాంటి మార్పులేదు. నేటి ట్రేడింగ్‌లోనూ రూ.38,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక వారంతపు వెండి ధరలు 124 తగ్గి రూ.37,930కి చేరుకుంది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.74,000 ఉండగా.. అమ్మకం ధర రూ.75,000 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్‌లో ఎలాంటి మార్పు లేదు. అమెరికా గోల్డ్ 0.1శాతం పెరిగింది. స్పాట్ గోల్డ్, అమెరికా గోల్డ్ ధరలు ఒక ఔన్స్‌కు వరుసగా 1,238.12, మరియు 1,242.1లకు చేరుకున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
ముఖేష్‌ సంపద 2.50 లక్షల కోట్లు - బ్లూమ్‌బర్గ్‌ సంపన్నుల సూచీలో 19వ స్థానానికి.. - ఆసియాలోనే మూడో అత్యంత ధనిక వ్యక్తిగా ఘనత - వందలోపు అపర కుబేరుల్లో నలుగురు భారతీయులు న్యూఢిల్లీ: రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మరోసారి 'బ్లూమ్‌బర్గ్‌ బిలినియర్స్‌ ఇండెక్స్‌' (బీబీఐ)లో సత్తా చాటాడు. బ్లూమ్‌బర్గ్‌ బిలీనియర్స్‌ టాప్‌ 100 ఇండెక్స్‌లో అంబానీ 19వ స్థానంలో నిలిచారు. మొత్తం 38.3 బిలియన్‌ డాలర్లు (రూ.2,49,160 కోట్లకు పైగా) సంపదతో ముఖేష్‌ అంబానీ ఈ స్థానంలో నిలిచారని బీబీఐ వివరించింది. ఇక బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ టాప్‌ 100 జాబితాలో అంబానీతో పాటు మరో నలుగురు భారతీయులకు స్థానం దక్కింది. లక్ష్మీ మిట్టల్‌(51వ స్థానం), పల్లోంజీ మిస్త్రీ (61వ స్థానం), విప్రో చైర్మెన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ (66వ స్థానం), హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ శివ్‌ నాడార్‌ (85వ స్థానం)లు 100 బిలియనీర్ల జాబితాలో ఉన్నారు. తాజాగా విడుదల చేసిన బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ టాప్‌ 500 జాబితాలో మొత్తం 24 మంది భారతీయులకు చోటు దక్కింది. దీనికి తోడు ఆసియాలోనే మూడో అత్యంత ధనిక వ్యక్తిగా కూడా ముఖేష్‌ అంబానీ తన ప్రత్యేకతను చాటారు. కాగా, ఈ కుబేరుల జాబితాలో అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బిజోస్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద ఈ ఏడాది 21.8బిలియన్‌ డాలర్లు పెరిగింది. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఉన్నారు. ఆయన సంపద ఈ ఏడాది 1.36 బిలియన్‌ డాలర్లు తగ్గింది. అమెరికన్లను మినహాయిస్తే, కేవలం ఇద్దరు యూరోపియన్లు మాత్రమే ఈ ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఆసియా నుంచి 47.2బిలియన్‌ డాలర్ల సంపదతో ఇక అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్‌ జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు. జాక్‌ మా, టెన్సెంట్‌ కో-ఫౌండర్‌, సీఈవో పోనీ మా లు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
kj yesudas 76th birthday ఆయన స్వరమే ఓ స్ట్రెస్ రిలీఫ్ జేసుదాస్ 7 సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలచే 43 సార్లు ఉత్తమ గాయకుడి అవార్డు అందుకున్నారు TNN | Updated: Jan 10, 2017, 01:02PM IST ఎక్కడో కేరళలో పుట్టి దేశమంతా ఆయనను తమవాడుగా భావించుకునేలా ఉండటమంటే మాటలు కాదు. ఏ భాషలో పాడినా ఆయనను శ్రోతలు తమవాడిగానే భావించి ప్రేమిస్తారు. సాధారణమైన పాటకు ఆయన తన గళంతో మరింత మెరుగులద్దుతారు. విరహం, విచారం, భక్తి...ఏదైనా ఆయన గొంతులో అలవోకగా పలుకుతుంది. .ఆయనే కట్టసం జోసెఫ్ జేసుదాస్. కే.జే. జేసుదాసుగా ఆయన దేశ విదేశాల్లో సుప్రసిద్దుడు. 1940 జనవరి 10వ తేదీన కొచ్చిన్ లో ఎలిజబెత్, ఆగస్టీన్ జోసెఫ్ దంపతులకు తొలి సంతానంగా ఆయన జన్మించారు. తండ్రి గాయకుడు, హార్మోనిస్టు. క్రిస్టియన్ కు కర్ణాటక సంగీతం ఏమిటని హేళన చేసినా లెక్కజేయకుండా కుమారుడికి సంగీతం నేర్పించారు. అప్పటినుంచి సంగీతమే ఆయన ధ్యాస, శ్వాసగా మారిపోయింది. ఆ క్రమంలోనే సినిమాలో అవకాశాల కోసం మద్రాసు చేరారు. తమిళ, తెలుగు, మళయాళం, హిందీతో సహా పలు భాషల్లో అజరామరమైన పాటలు పాడారు. అస్సామీ, కాశ్మీరీ రెండు భాషల్లో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ జేసుదాస్ పాటలు పాడారు. సినిమా హిట్ కాకున్నా అందులోని పాటలు మాత్రం జేసుదాస్ వల్లే సూపర్ హిట్ ఐన సందర్భాలు చాలా ఉన్నాయి. హిందీలో ఆయనను చిత్ చోర్ సినిమాతో పరిచయం చేసిన సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ జేసుదాస్ గొంతులోని భావుకతకు పులకించిపోయారు. అంధుడైన ఆయన ‘‘నాకు గాని కళ్లుంటే జేసుదాస్ మొహాన్ని ఒక్కసారైనా చూడాలని ఉంది’’ అన్నారంటే గాన మాధుర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. జేసుదాస్ 7 సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలచే 43 సార్లు ఉత్తమ గాయకుడి అవార్డు అందుకున్నారు. 1973లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు. Visit Site Recommended byColombia సంగీత సాధనలో మాత్రమే కాక సమాజసేవలోనూ ఆయన ముందున్నారు. పేద హృద్రోగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించడం కోసం హృదయతాళం ఆర్గనైజేషన్‌ స్థాపించారు. దీనిద్వారా ఇప్పటి వరకు 300 మందికి హృద్రోగ శస్త్రచికిత్సలు చేయించారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఇందుకు నిధులు సేకరిస్తున్నారు. జేసుదాస్, ఆయన కుమారుడు, అతని స్నేహితులు కలసి ఈ సంస్థని నిర్వహిస్తున్నారు. ఇక తెలుగులో ఆయన పాడిన అయ్యప్ప గీతాలు ఎందరినో శబరిమల దారి పట్టించాయి. సినిమాల్లోనూ ఆయన పాటకు లెక్కలేనంతమంది అభిమానులు తెలుగునాట ఉన్నారు. హీరో మోహన్ బాబు సినిమా తీస్తే జేసుదాస్ పాట ఉండాల్సిందే. తెలుగు చిత్రాలైన 'స్వయంవరం, మేఘసందేశం, రుద్రవీణ, తాండ్రపాపారాయుడు,సీతాకోక చిలుక, నిరీక్షణ, విష్ణు, వజ్రం, అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, తదితర తెలుగు చిత్రాల్లో ఆయన పాడిన పాటలు ఎంతో హిట్టయ్యాయి. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, అందమైన కోవెలలోనా అచ్చతెలుగు పడుచువలే, ఆలనగా, పాలనగా అలసిన వేళను అమ్మవుగా, గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం, ఆకాశదేశాన, ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా, దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడక, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, తెలవార దేమో స్వామీ, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, అందమైన కోవెలలోనా అచ్చతెలుగు పడుచువలే, ఆలనగా, పాలనగా అలసిన వేళను అమ్మవుగా, గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం, ఆకాశదేశాన, ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా, దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడక, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, తెలవార దేమో స్వామీ, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు,అపురూపమైనదమ్మ ఆడజన్మ, స్వరరాగ గంగా ప్రవాహమే, ఇలా చెప్పుకుంటూపోతే ఆయన పాడిన ప్రతి తెలుగుపాట సినిమా బ్రతికున్నంతకాలం నిలిచిఉంటాయి. ప్రముఖ సంగీత దర్శకులు రవీంద్రజైన్ సంగీత దర్శకత్వం,లో "చిత్ చోర్" చిత్రం ద్వారా ఆయన పాడిన పాటలు అపూర్వ ప్రజాదరణ పొంది ఆల్ టైం హిట్ గా నిలిచాయి. ఇలా చెప్పుకుంటూపోతే ఆయన పాడిన ప్రతి తెలుగుపాట ఆణిముత్యమే. ఆయన స్వరం వినటమే ఓ స్ట్రెస్ రిలీఫ్. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని కోరదాం.... ఆయన గానం చేసిన కొన్ని మధుర గీతాలు సమయం పాఠకుల కోసం....
0business
టాటా సన్స్‌కు సుస్లీవాడియా నోటీసు టాటాస్టీల్‌ నుంచి తొలగింపుపై నిరసన తనపరువుకు నష్టం కలిగించారని వాడియా   న్యూఢిల్లీ, నవంబరు 22: వాడియాగ్రూప్‌కంపెనీల ఛైర్మన్‌ టాటాగ్రూప్‌ సంస్థల్లో కొన్నింటికి స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహఱిస్తున్న నుస్లీ వాడి యా టాటాసన్స్‌కు పరువునష్టం నోటీసులు జారీచేసారు. టాటాస్టీల్‌ బోర్డునుంచి ప్రత్యేక నోటీస్‌తో తనను తలించడం అనేది తన పరు వును భంగం కలిగించేదిగా ఉందని వాదించారు. టాటాస్టీల్‌ బోర్డు నుంచి తనను ప్రత్యేకనోటీస్‌ద్వారా తొలగించాలన్న నిర్ణయంలో టాటా సన్స్‌ కూడా వాడియా ఇతర స్వతంత్ర డైరెక్టర్లను కూడగడుతున్నట్లు గా ఉందని టాటాగ్రూప్‌ వాదిస్తోంది. వాడియా తన టాటాగ్రూప్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న వాదనను ఆయన ఖండించారు. తన ప్రతిష్టకు కావాలనే భంగం కలిగించేదిగా టాటాగ్రూప్‌ వ్యవహరిస్తోం దని వాడియా తనపరువునష్టం నోటీసుల్లో పేర్కొన్నారు. తనకు వ్యతి రేకంగా చేసిన తీర్మానం స్వార్ధంతో చేసినదేనని టాటాసన్స్‌ తక్షణమే ఈ చర్యను ఉపసంహరించుకుని ఆరోపణలను కూడా ఉపసంహరిం చుకోవాలని డిమాండ్‌చేశారు. టాటాసన్స్‌ ఈ వ్యవహారంపై అధికార ప్రతినిధి స్పందిస్తూ సమయానుకూలంగా తాము స్పందిస్తామని వెల్ల డించారు. వాడియా టాటాసన్స్‌కు రెండురోజుల గడువునిస్తూ స్పెషల్‌ నోటీస్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. టాటాస్‌, సైరస్‌ మిస్త్రీ అంతర్గతపోరులో మొట్టమొదటి న్యాయపరంగా సవాల్‌ ప్రారం భం అయింది. ఇందుకు నుస్లీవాడియా శ్రీకారం చుట్టినట్లయింది. టాటాలుకావాలనే తనపై వ్యక్తిగతకక్షతో వ్యవహరిస్తున్నారని వాడియా టాటాసన్స్‌కు ఇచ్చిన నోటీస్‌లో పేర్కొన్నారు.అంతకుముందు జరిగిన బోర్డుసమావేశంలో వాడియా మిస్ట్రీకి మద్దతుగా వచ్చారు. కంపెనీలో ఆయన సీనియర్‌ స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహఱిస్తున్నారు. అంతే కాకుండా ఛైర్మన్‌గా మిస్త్రీని తొలగించడంప ఆయన తీవ్ర అసంతృప్తిని సైతం వెళ్లగక్కారు. రతన్‌టాటా, వాడియాలమధ్య ఉన్న స్నేహం బీటలు వారింది. టాటాస్టీల్‌ విదేశీ ఆస్తులకొనుగోలుకు సంబంధించి విపరీతనష్టం వాటిల్లుతున్నదని వాడియా వాదించారు. టాటా కెమి కల్స్‌పరంగా కూడా విదేశీ కంపనీ కొనుగోలును వ్యతిరేకించారు. అలాగే నానోప్రాజెక్టుకు వాడియాపూర్తి వ్యతిరేకతవ్యక్తంచేశారు. టాటా మోటార్స్‌ నిర్వహణ ఖర్చులరూపంలో 25 వేల కోట్లు నష్టపోయినట్లు తేలిందన్నారు. ఈనెల 11వ తేదీ కంపెనీ సిఒఒ, కంపెనీ సెక్రటరీ ఎఫ్‌ఎన్‌ సుబేదార్‌ ఈ నోటీస్‌ జారీ అయింది. మిస్త్రీతో ఏకం అయి వాడియా టాటాగ్రూప్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టాటాగ్రూప్‌ సంక్షేమానికి పనిచేయడంలేదని నోటీస్‌లో ఆరోపించారు. తాను మిస్త్రీకి అనుకూలంగా పనిచేసినట్లుకానీ, లేదా టాటాలకు వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆధారాలు చూపించాలని ఆయన కోరారు. టాటా గ్రూప్‌కు అనుకూలంగా పనిచేయాలని కోరడంలో ఉన్న ఆధారాలు కూడా వెల్లడించాలని, అలాగే టాటా గ్రూప్‌కు వ్యతిరేకంగా పనిచేసినట్లున్న సాక్ష్యాలు రుజు వులు కావాలని వాడియా డిమాండ్‌చేశారు. తనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించడం సెబీ పరిధిలోని ఎల్‌ఒడిఆర్‌ నిబంధనలు, టాటా నైతిక నియమావళికి విరుద్ధంగా ఉందన్నారు. టాటాకెమికల్స్‌లో స్వతంత్ర డైరెక్టర్ల మద్దతు ప్రకటించడం వల్ల టాటాస్టీల్‌ బోర్డు నుంచి తనను తొలగించారని ఆరోపించారు. టాటా స్టీల్‌బోర్డు ప్రొసీడింగ్స్‌ వివరాలు రికార్డు చేయాలని, తాను స్వతంత్రడైరెక్టర్లను కూడగట్టే ఎలాంటిపని చేయలేదని వాడియా ప్రకటించారు. టాటాస్టీల్‌బోర్డు లతో తాను 1979నుంచి కొనసాగుతున్నట్లు వివరిం చారు. జెఆర్‌డి టాటా ఆశయాలకు అనుగుణంగా టాటాసన్స్‌బోర్డు వ్యవహరించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండురోజుల్లోపు ఉపసంహరించు కోకపోతే సివిల్‌క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని, పరువు నష్టం పరంగా మరింత న్యాయపోరాటం చేస్తామని వాడియా స్పష్టం చేయ డం టాటా, మిస్త్రీల అంతర్గతపోరు మరింత వేడెక్కిందని తెలుస్తోంది.
1entertainment
ఆసియాలో సెక్సీయెస్ట్ విమెన్ గా ప్రియాంక.. లిస్ట్ లో శ్రీదేవి.. ఇంకా.. Highlights ఆసియాలో సెక్సీయెస్ట్ విమెన్ గా ప్రియాంక చోప్రా లండన్ కేంద్రంగా పనిచేసే ఈస్టర్న్ ఐ వీక్లీ సర్వేలో టాపర్ ప్రియాంక చోప్రా నెంబర్ వన్ గా నిలవగా లిస్ట్ లో టాప్ 50లో శ్రీదేవి యూకెలో నిర్వహించిన ఓ ఆన్ లైన్ సర్వేలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సెక్సియెస్ట్ ఏసియన్ ఉమెన్‌గా నిలిచింది. మొత్తం టాప్ 50 సెక్సియెస్ట్ ఉమెన్ జాబితా విడుదల చేయగా ఇందులో ప్రియాంక చోప్రా మొదటి స్థానం దక్కించుకుంది. లండన్ బేస్డ్ వీక్లీ 'ఈస్టర్న్ ఐ' ఈ సర్వే నిర్వహించింది. 2016లో నెం.1 స్థానంలో ఉన్న దీపిక ఈ ఏడాది సర్వేలో 3వ స్థానానికి పడిపోయారు.   తనకు సెక్సియెస్ట్ ఉమెన్ గా నెం.1 స్థానం దక్కడంపై ప్రియాంక చోప్రా స్పందిస్తూ... ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ నా జీన్స్, మీ దృష్టికోణానికే దక్కుతుంది. తనకు ఓటు వేసిన అందరికీ థాంక్స్ అని అన్నారు. ఇండియన్ టీవీ నటి నియా శర్మ ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ స్టార్ దీపికను వెనక్కి నెట్టి ఆమె ఈ స్థానం దక్కించుకోవడం విశేషం.   దీపిక 3వ స్థానంలో, అలియా భట్ 4వ స్థానంలో, పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ 5వ స్థానంలో నిలిచారు. 6వ స్థానంలో ద్రష్టి ధామి, 7వ స్థానంలో కత్రినా, 8వ స్థానంలో శ్రద్ధా కపూర్, 9వ స్థానంలో గౌహర్ ఖాన్, 10వ స్థానంలో రుబీనా దిలైక్ నిలిచారు.   ఈ లిస్టులో మరో కొత్త అమ్మాయికి కూడా చోటు దక్కింది. ‘యే రిష్టా క్యా కెహల్తా హై' అనే సీరియల్ నటి, 19 ఏళ్ల శివంగి జోషికి 16వ స్థానం దక్కింది. ఈలిస్టులో ప్రముఖ నటి శ్రీదేవికి 49వ స్థానం దక్కింది. 50 మందితో కూడిన ఈ జాబితాలో అందరి కంటే వయసు ఎక్కువ ఉన్న మహిళ కూడా ఈవిడే. శ్రీదేవి వయసు 54 సంవత్సరాలు. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాథ పాత్రలో మెప్పించిన కాజల్ వరుస ఆఫర్లతో మళ్లీ దూసుకెళ్తున్న కాజల్ కు తేజ మరో ఆఫర్ లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన చందమామ కాజల్ ఇప్పుడు దశాబ్దం తర్వాత సౌత్ లో టాప్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సంపాదించింది. ఖైదీనెంబర్ 150కి ముందు కాజల్ కెరీర్ అయిపోయిందని అనిపించినా మళ్లీ ప్రస్తుతం వరుస సినిమాలతో కాజల్ మంచి ఊపుమీదున్నట్టు కనిపిస్తోంది.   ఇటీవల రానా సరసన నేనేరాజు నేనే మంత్రి సినిమాలో రాధమ్మగా నటించి హిట్ కొట్టిన కాజల్..  ప్రస్తుతం మరో రెండు పెద్ద ప్రాజెక్టులు ఓకే చేసిందని తెలుస్తోంది. వాటిలో తనని వెండితెరకు పరిచయం చేసిన తేజ డైరక్షన్ లో వెంకటేష్ తో రాబోయే సినిమా కావడం విశేషం. లక్ష్మి కళ్యాణం తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించిన కాజల్ తేజ డైరక్షన్ లో ముచ్చటగా మూడో ఛాన్స్ కూడా పట్టేసింది. తేజ దగ్గర ఓనమాలు దిద్దించుకున్న ఈ చందమామ  మళ్లీ ఇప్పుడు స్టార్ అయ్యాక అతని డైరక్షన్ లో చేయడం గొప్ప విషయమని చెప్పాలి.   ప్రస్తుతం తేజ ఎన్.టి.ఆర్ బయోపిక్ కు స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు. ఈలోగా వెంకటేష్ సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. గురు తర్వాత వెంకటేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్ తో ఏకె ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది. కాజల్ తో వెంకటేష్ రొమాన్స్ చేయడం కూడా ఇదే మొదటిసారి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మొత్తానికి తేజ మాత్రం కాజల్ ని వదిలేదే లేదంటున్నాడు. Last Updated 25, Mar 2018, 11:41 PM IST
0business
Apr 27,2018 మూడు నెలల గరిష్టానికి సెన్సెక్స్‌ ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ జిగేలుమన్నాయి. అనూహ్యంగా చివరి గంటలో ఐటీ, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ స్టాక్‌లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు, ఏప్రిల్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో గురువారం ప్రారంభం నుంచే దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్తబ్దుగా కదలా డాయి.. చివరి గంటలో ఐరోపా మార్కెట్ల నుంచి అందిన సానుకూలత నేపథ్యంలో తాజా కొనుగోళ్ల అండతో ఒక్కసా రిగా దూసుకెళ్లాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్‌ నాలుగేళ్ల సరికొత్త గరిష్టమైన 3.035 శాతాన్ని తాకడానికి సిద్ధంగా ఉండటంతో, గ్లోబల్‌ మార్కెట్లన్నీ మంచి లాభాల్లో ముందు కు సాగాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభప డగా.. నిఫ్టీ మళ్లీ 10,600 మార్క్‌ను దాటేసింది. ఉదయం దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు నేపథ్యంలో ఒకింత ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీలు చాలా సేపటి వరకు నెమ్మదిగా సాగాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోనూ సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో ట్రేడ్‌ అయ్యింది. అయితే ఒక్కసారిగా సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 212 పాయింట్లు ఎగబాకి 34,714 వద్ద స్థిరపడింది. ఇది దాదాపు మూడున్నర నెలల గరిష్టం కావడం గమనార్హం. అటు నిఫ్టీ కూడా 47 పాయింట్ల లాభంతో 10,618 పాయింట్ల వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 28, Sep 2018, 5:24 PM IST Highlights ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే సినిమా విడుదల కాబోతోందని రూమర్స్ వచ్చాయి.  ఇటీవల ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. అందువల్ల ఎలాంటి ఆర్బాటం లేకుండా సినిమా విడుదల కావచ్చని టాక్ వచ్చింది. తమ హీరోల సినిమాలకు సంబందించిన ఈవెంట్స్ జరుగుతున్నాయి అంటే అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అయితే నందమూరి అభిమానులు గత కొన్ని రోజులుగా ఒక గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే సినిమా విడుదల కాబోతోందని రూమర్స్ వచ్చాయి.  ఇటీవల ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. అందువల్ల ఎలాంటి ఆర్బాటం లేకుండా సినిమా విడుదల కావచ్చని టాక్ వచ్చింది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ ఈవెంట్ జరపకపోతే సినిమా బిజినెస్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఒక నిర్ణయినికి వచ్చినట్లు టాక్.  అక్టోబర్ 2న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో భారీగా నిర్వహించాలని దర్శక నిర్మాతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంబందించిన వివరాలను మీడియాకు తెలపనున్నారు. ఇక సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.   Last Updated 28, Sep 2018, 5:24 PM IST
0business
భరత్ అనే నేను లో ఛాన్స్ అడిగితే... బట్టలు విప్పి చూపించమన్నాడు Highlights భరత్ అనే నేను లో ఛాన్స్ అడిగితే... బట్టలు విప్పి చూపించమన్నాడు శ్రీరెడ్డి కి  మద్దతాదారులు రోజురోజుకు ఎక్కువవుతున్నారు అన్నది వాస్తవం. నిన్న కేంద్రం నుండి మద్దతు కూడా వచ్చేసింది దానికితోడు చాలా ఉద్యమ సంఘాల మద్దతు కూడా ఉండనే ఉంది.  ఇప్పుడిప్పుడే సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డితో కలిసి మరికొందరు మహిళలు కూడా నోరు విప్పడమే కాదు.. నేరుగా ఆయా వ్యక్తుల పేర్లను చెప్పేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నిర్మాత వాకాడ అప్పారావును కామాంధుడిగా అభివర్ణిస్తూ పలువురు ఆరోపణలు చేశారు. ఖైదీ నంబర్ 150మూవీలో చిరంజీవి గారి సినిమాలో కనిపించేందుకు ఆరాటపడితే.. కమిట్మెంట్ అడిగాడని ఆరోపించారు. అలాగే భరత్ అనే నేను మూవీ కోసం ఛాన్స్ అడిగితే.. ఒక కో డైరెక్టర్ బట్టలు విప్పి చూపించమని అన్నాడని ఓ ఆర్టిస్ట్ చెప్పుకొచ్చింది.  స్క్రీన్ మీద హీరోలుగా వెలిగిపోతున్న వాళ్లు.. ఈ అంశంపై స్పందించరా అని డిమాండ్ చేశారు వారంతా. చిరంజీవి.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. మహేష్ బాబు.. వీళ్లంతా ఆన్ స్క్రీన్ మాత్రమే హీరోలా.. వారికి ఈ విషయాలు తెలియవా.. తెలిసి కూడా ఊరుకుంటున్నారా.. వారి సినిమాల సమయంలో కూడా ఇలాంటివి జరుగుతున్నపుడు కచ్చితంగా వారు స్పందించాల్సిందే అంటున్నారు టాలీవుడ్ నే నమ్ముకున్న మహిళలు. Last Updated 13, Apr 2018, 10:55 AM IST
0business
Jul 11,2016 అత్యుత్తమ బ్యాకింగ్‌ అధినేత పూరీ ముంబయి: దేశంలో రెండో అతిపెద్ద బ్యాకింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఆదిత్య పూరీ ఆసియాలోనే అత్యుత్తుమ బ్యాంకింగ్‌ సీఈఓ ఘనతను దక్కించుకున్నారు. 'ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ మేగజైన్‌' ఆసియా వ్యాప్తంగా 'ఆల్‌- ఆసియా ఎగ్జిక్యూటివ్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌-2016' పేరుతో నిర్వహించిన సర్వేలో ఆయన అత్యుత్తుమ బ్యాంకింగ్‌ సీఈఓగా నిలిచారు. ఈ సర్వేలో ఆసియాలోనే 18 రంగాలకు చెందిన 1541 కంపెనీలు కూడా పాల్గొన్నాయి. దాదాపు 582 ఆర్థిక సంస్థలకు చెందిన 1,394 ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోఫెషనల్స్‌ కూడా పాల్గొన్న ఈ సర్వేలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పలు ఇతర విభాగాల్లోనూ మేటిగా నిలిచింది. ఇదే బ్యాంక్‌నకు చెందిన సీఎఫ్‌వో శశీ జగదీషన్‌ ఆసియాలోనే మేటి సీఎఫ్‌ఓగా జాబితాలో నిలిచారు. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అత్యుత్తమ ఐఆర్‌ కంపెనీగా కూడా ఈ సర్వేలో చోటు దక్కించుకొంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 3, Nov 2018, 10:58 AM IST Highlights టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ మధ్య కాలంలో సినిమాల గురించి కాకుండా ఇతర విషయాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో ఓ లెటర్ రాశాడు. అది చదివిన వారంతా.. ఈ హీరో పాలిటిక్స్ లోకి వెళ్ళబోతునన్నాడని అనుకున్నారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ మధ్య కాలంలో సినిమాల గురించి కాకుండా ఇతర విషయాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో ఓ లెటర్ రాశాడు. అది చదివిన వారంతా.. ఈ హీరో పాలిటిక్స్ లోకి వెళ్ళబోతునన్నాడని అనుకున్నారు. ఇదే విషయమై ఆయన్ని ప్రశ్నించగా.. ప్రజలకి ఏదో చేయాలనుకుంటున్నానని రాజాకీయాల రంగు పూయకండని అన్నారు. అయితే అసలు మంచు మనోజ్ ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలని అనుకున్న ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఆయన్నే ప్రశ్నించాడు. నీ ప్లాన్ ఏంటి..? గోల్ ఏంటి..? అంటూ మనోజ్ ని ప్రశ్నించగా.. దానికి సమాధానంగా.. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే..? నేనున్న చోట స్పోర్ట్స్, ఉచిత ఆహారం లేదంటే తాగునీటి సదుపాయం కల్పించాలనేది నా గోల్ అని వెల్లడించాడు. ఆ తరువాత ఓ ఖాళీ ప్రదేశంలో తీసుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. 'పేద విద్యార్ధులు, రైతుల కోసం ఏదో చేయాలన్న నా కల ఈ ఖాళీ ప్రదేశం ద్వారా నెరవేరబోతుంది. ఇక్కడ ఏదోకటి ప్రారంభించాలి' అంటూ ట్వీట్ చేశారు.  ఇవి కూడా చదవండి..
0business
READ ALSO: ‘ఆమె’లో అంతా విప్పేసింది.. ఈసారి అమలా పాల్ అరాచకమే ఈ పోస్ట్‌కు నవదీప్ రిప్లై ఇస్తూ.. ‘మై ప్లెజర్ సన్నీ. యూ ఆర్ సో ఫన్నీ’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ‘రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్’ ఓ ఎరాటిక్ హారర్ సిరీస్. 2014లో ‘రాగిని ఎంఎంఎస్ 2’ టైటిల్‌తో ఓ హారర్ సినిమా విడుదలైంది. ఇందులో సన్నీ లియోనీ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఇప్పుడు ఇదే టైటిల్‌తో వెబ్ సిరీస్‌ నిర్మించాలని నిర్మాత ఏక్తా కపూర్ భావిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా దక్షిణాది నుంచి నవదీప్‌ను ఎంచుకున్నారు. మరోపక్క నవదీప్.. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. అల్లు అర్జున్, పూజా హెగ్దే ఇందులో జంటగా నటిస్తున్నారు. READ ALSO: ‘నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండి’ తెలుగులోనూ సన్నీ లియోనీ తన అందచందాలను ఆరబోసింది. ‘కరెంటు తీగ’ చిత్రంలో టీచర్ పాత్రలో కుర్రకారు మతిపోగొట్టింది. ఆ తర్వాత ప్రముఖ నటుడు రాజశేఖర్ నటించిన ‘పీఎస్‌ఎల్‌వీ గరుడవేగ’ చిత్రంలో ‘డియో డియో’ అనే స్పెషల్ సాంగ్‌లో సన్నీ ఆడిపాడింది. ఆమె తమిళంలో ‘వీరమహాదేవి’ అనే హిస్టారికల్ సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాను ఆపాాలని తమిళనాడుకు చెందిన పలు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ మాత్రమే విడుదలైంది. సన్నీ లియోనీ కానీ వీర మహాదేవి చిత్రవర్గాలు కానీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడంలేదు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
అంచనాలను మించిన ఇన్ఫీ ఫలితాలు! - తృతీయ త్రైమాసిక లాభాల్లో 38% వృద్ధి - రూ.17,794 కోట్లకు రెవెన్యూ - ఏప్రిల్‌లో రోడ్‌ మ్యాప్‌: కొత్త సీఈవో సలీల్‌ వెల్లడి బెంగళూరు: దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాల్లో భళా అనిపించింది. మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి లాభాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో ఇన్ఫీ 37.6 శాతం వృద్ధితో రూ.5,129 కోట్లు సాధించింది. రూ.3800 కోట్లకు అటు, ఇటూగా లాభాలు ఆర్జించవచ్చని విశ్లేషకులు తొలుత అంచనా వేశారు. కాగా సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.3,726 కోట్ల లాభాలు నమోదు చేసింది. గత క్యూ3లో కంపెనీ రెవెన్యూ 3 శాతం పెరిగి రూ.17,794 కోట్లకు చేరింది. 2017-18లో ఈ కంపెనీ రెవెన్యూలో 5.5-6.5 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో తాము పటిష్ట వృద్ధిని సాధించామని ఇన్ఫోసిస్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సలీల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. గతేడాది ఇదే త్రైమాసికం ఫలితాలతో పోల్చితే 8 శాతం వృద్ధి చోటు చేసుకుందన్నారు. ఆపరేటింగ్‌ మార్జిన్లలో ఏకంగా 24.3 శాతం పెరుగుదల ఉందన్నారు. వచ్చే ఏప్రిల్‌లో కంపెనీ ప్రాధాన్యతలపై రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నామని సలీల్‌ చెప్పారు. ఇందులో ఖాతాదారులు, ఉద్యోగుల బలోపేతానికి ప్రణాళికలు ప్రకటించనున్నామన్నారు. అదే విధంగా కంపెనీకి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టనున్నామన్నారు. శుక్రవారం బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ షేర్‌ విలువ 0.26 శాతం పెరిగి రూ.1,078.40 వద్ద ముగిసింది. 1200 చేరువలో క్లయింట్లు.. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ నికరంగా 3,251 మంది ఉద్యోగులను తీసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2.01 లక్షలకు చేరింది. గత మూడో త్రైమాసికంలో కొత్తగా 100 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ఒక క్లయింట్‌ను పొందింది. 75 మిలియన్ల విలువ చేసే మూడు క్లయింట్లు, 50 మిలియన్ల కేటగిరీలో ఒక్క ఖాతాదారున్ని పొందింది. అదే విధంగా 25 మిలియన్ల కేటగిరీలో 1, 12 మిలియన్ల కేటగిరీలో 12 మంది, 5 మిలియన్ల కేటిగిరీల్లో నలుగురు చొప్పున నమోదు చేసింది. మొత్తంగా సెప్టెంబర్‌ నాటికి ఉన్న 1,173 కీలక ఖాతాదారులు డిసెంబర్‌ ముగింపు నాటికి 1,191కి చేరారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
New Delhi, First Published 5, May 2019, 10:45 AM IST Highlights జెట్ ఎయిర్వేస్ సంస్థ పునరుద్దరణ పట్ల బ్యాంకర్లు సాచివేత ధోరణిని ప్రదర్శిస్తున్నారు. వారంలోగా కొత్త వాటాదారును ఎంపిక చేయకుంటే మరో వారంలో జెట్ ఎయిర్వేస్ సంస్థకు గల విదేశీ ఫ్లయింగ్ రైట్స్‌ను ఇతర సంస్థలకు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకోనుంది. ఆర్థిక నష్టాల్లో కూరుకుని.. తాత్కాలికంగా మూసివేతకు గురైన జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ శాశ్వతంగా మూతపడే అవకాశాలు క్రమంగా బలపడుతున్నాయి. సంస్థకు కొత్త వాటాదారును కనుగొనే ప్రక్రియలో ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకర్లు జాప్యం చేస్తుండడంతో జెట్‌ ఎయిర్వేస్‌కు పెను ముప్పు ముంచుకొస్తోంది. వారంలోగా కొత్త వాటాదారు ఎంపిక జరుగకుంటే.. వారంలోగా జెట్‌ ఎయిర్వేస్ సంస్థను ఆర్థిక కష్టాల నుంచి వెంటనే బయటపడేసేలా కొత్త వాటాదారు ఎంపిక జరగకపోతే ఆ సంస్థకు తీరని నష్టం కలుగనుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థకు గల విదేశీ ఫ్లయింగ్‌ హక్కులను ప్రభుత్వ త్వరలోనే ఇతర వైమానిక సంస్థలకు పంపిణీ చేయనుంది. మరో వారంలో జెట్ ఎయిర్వేస్ విదేశీ ఫ్లయింగ్ హక్కుల కేటాయింపు  మరో వారంలో జెట్ ఎయిర్వేస్ సంస్థకు గల విదేశీ ఫ్లయింగ్ హక్కుల కేటాయింపు ప్రక్రియను పౌరవిమానయాన శాఖ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్‌ విమానాలు నిలిచిపోయిన రూట్లలో తాము విమానాలను తిప్పనున్నట్టుగా ఇప్పటికే పలు సంస్థలు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాయి.  జెట్ ఎయిర్వేస్ బంగారు బాతు లాంటి రూట్లివే జెట్‌ ఎయిర్వేస్ సంస్థకు బంగారు బాతులా సొమ్మును ఆర్జించిపెట్టిన సింగపూర్‌, థాయిలాండ్‌, మధ్య ప్రాచ్యం మార్గాల్లో ప్రస్తుతం విమానాల కొరత ఉంది. జెట్‌ మూతపడడంతో ఈ కొరత మరింతగా పెరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ పేమెంట్ యాప్‌లకు భారీ జరిమానా ఫోన్‌పేతో సహా నిబంధనలు ఉల్లంఘించిన ఐదు ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ) సంస్థలకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా భారీ జరిమానా విధించింది. ముఖ్యంగా వొడాఫోన్ ఎం-పేసా, ఫోన్‌ పే మొబైల్ పేమెంట్స్, వై-క్యాష్ తదితర సంస్థలు ఉన్నాయి.  అమెరికా సంస్థలకూ జరిమానా వడ్డింపు వీటితో పాటు ప్రమాణాలు పాటించని అమెరికా సంస్థలు వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్‌పైనా ఆర్బీఐ కొరడా ఝళిపించింది.  చెల్లింపులు, సెటిల్మెంట్స్ వ్యవస్థల చట్టం- 2007 కింద ఆయా సంస్థలకు ద్రవ్య పెనాల్టీ విధించినట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. వొడాఫోన్ ఎం-పైసాకు రూ.3.05 కోట్ల జరిమానా వొడాఫోన్‌ ఎం-పేసాకు రూ.3.05 కోట్ల జరిమానా, మొబైల్ పేమెంట్స్, ఫోన్ పే, ప్రైవేట్ అండ్ జీఐ టెక్నాలజీలకు రూ.1 కోటి చొప్పున జరిమానా విధించింది. వై-క్యాష్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కి కూడా రూ. 5 లక్షల పెనాల్టీ విధించింది. వీటితోపాటు  వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్ సంస్థలకు వరుసగా రూ. 29.66 లక్షలు, రూ. 10.11 లక్షల మేర ఆర్‌బీఐ జరిమానా విధించింది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV అభిమానులూ.. బాటిల్ విసిరితే అరెస్టే..! మైదానంలో ఆటగాళ్లకి సమీపంలో అభిమానులు వాటర్ బాటిల్స్‌ విసిరితే వెంటనే వారిని అరెస్ట్ చేస్తామని TNN | Updated: Aug 30, 2017, 06:51PM IST మైదానంలో ఆటగాళ్లకి సమీపంలో అభిమానులు వాటర్ బాటిల్స్‌ విసిరితే వెంటనే వారిని అరెస్ట్ చేస్తామని శ్రీలంక పోలీసులు బుధవారం హెచ్చరించారు. గత ఆదివారం పల్లెకలె వేదికగా భారత్‌తో ముగిసిన మూడో వన్డేలో శ్రీలంక ఓటమిని జీర్ణించుకోలేక స్టేడియంలోని ప్రేక్షకులు వాటర్ బాటిల్స్‌ని విసిరి మ్యాచ్‌కి అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అభిమానులు ఎంతకీ శాంతించకపోవడంతో వారిని స్టేడియం నుంచి వెలుపలకి తరలించి అధికారులు తిరిగి మ్యాచ్‌ని కొనసాగించారు. దీంతో దాదాపు అరగంట పాటు ఆట నిలిచిపోయింది. గురువారం కొలంబో వేదికగా నాలుగో వన్డే జరగనున్న నేపథ్యంలో అభిమానులకి కొన్ని హెచ్చరికలతో పాటు పలు సూచనల్ని కూడా పోలీసులు చేశారు. ‘అభిమానులు ఎవరైనా ఆందోళనకారుల తరహాలో ఆటగాళ్లకి సమీపంలో వాటర్ బాటిల్స్‌ లేదా తమ వస్తువులను విసిరితే వారిని వెంటనే అరెస్ట్ చేస్తాం’ అని పోలీసులు ప్రకటించారు. 35 వేల సీట్ల సామర్థ్యం ఉన్న కొలంబో స్టేడియంలో భద్రత కోసం అదనంగా మరో వెయ్యి మంది పోలీసుల్ని మొహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్టాండ్స్‌లో ఆందోళనకారుల్ని గుర్తించేందుకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన శ్రీలంక ఐదు వన్డేల సిరీస్‌లోనూ 0-3తో వెనకబడిన విషయం తెలిసిందే.
2sports
Apr 01,2015 లక్ష్యాన్ని చేరని ప్రత్యక్ష పన్నుల వసూళ్లు          ముంబయి : గత ఆర్ధిక సంవత్సరం 2014-15లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ ఏడాదిలో రూ.6.30 లక్షల కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయని ఐటి శాఖ అధికారి పేర్కొన్నారు. 2014-15లో ఏకంగా రూ.7.36 లక్షల కోట్లు రాబట్టుకోవాలని ప్రభుత్వం ముందుగా అంచనా వేసుకుంది. తర్వాత పెద్ద పురోగతి లేకపోవడంతో దీన్ని రూ.7.05 లక్షల కోట్లకు కుదించింది. సవరించుకున్న అంచనాలను కూడా ప్రభుత్వం చేరలేకపోయిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్చి 24 నాటికి కేవలం రూ.6.30 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు నమోదయ్యాయి. 2013-14లో రూ.5.83 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
భారత మహిళల శుభారంభం బంగ్లాదేశ్‌పై ఘన విజయం బెంగళూరు : వరల్డ్‌ కప్‌ మహిళల టి20లో భారత్‌కు తొలి విజయం లభించింది. బంగ్లాదేశ్‌పై 72 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. కాగా 164 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ క్రీడాకారిణి అయషా రహ్మన్‌ 2 పరుగులకే వెనుతిరగడంతో ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన సంజీదా ఇస్లాం,రుమన అహ్మద్‌,కౌతన్‌ వెనె వెంటనే ఔటయ్యారు. మరో ఓపెనర్‌ షర్మిణ్‌ అక్తర్‌ 21 పరుగులు,నిగర్‌ సుల్తాన్‌ 26 పరుగులు చేశారు.భారత బౌలర్లలో అనుజా పాటిల్‌,పూనమ్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీసుకున్నారు.కాగా అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.భారత్‌ ఓపెనర్లు మిథాలీ రాజ్‌ 42 పరుగులు,వెల్లస్వామి వనిత 38 పరుగులతో తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తరువాత దిగిన మందన డకౌట్‌తో నిరుత్సాహ పరిచినా హర్మాన్‌ ప్రీత్‌ కౌర్‌ 40 పరుగులు,వేద కృష్ణమూర్తి 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమ్‌కు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు.బంగ్లా బౌలర్లు రుమన ఆహ్మాద్‌,ఫహిమా కౌతన్‌ రెండు వికెట్లు తీయగా,వహిదా అక్తర్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు.
2sports
Jan 03,2017 చిన్న మొత్తాల వడ్డీరేట్లు యథాతథం న్యూఢిల్లీ: వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదింపు చేసిన వారికి శుభవార్త. పీపీఎఫ్‌, కిసాన్‌ వికాస పత్రం, సుకన్య సమృద్ధి యోజనా, జాతీయ పొదుపు సర్టిఫికెట్‌, సీనియర్‌ సిటిజన్‌ పథకాల్లోని డిపాజిట్లపై ప్రస్తుత (జనవరి-మార్చి) త్రైమాసికానికి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గత అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో కనసాగిన వడ్డీరేట్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కొనసాగనున్నాయి. పీపీఎఫ్‌ ఖాతాల డిపాజిట్లపై 8 శాతం, అయిదు సంవత్సరాల కాల పరిమితి కలిగిన జాతీయ పొదుపు సర్టిఫికెట్‌, కిసాన్‌ వికాస పత్రం పెట్టుబడులపై 7.7 శాతం (112 నెలల మెచ్యూరిటీ), సుకన్యా సమృద్ధి యోజనా ఖాతాలపై 8.5 శాతం, అయిదు సంవత్సరాల కాల పరిమితి కలిగిన సీనియర్‌ సిటిజన్‌ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేట్లు కొనసాగుతాయని సర్కారు తెలిపింది. సామాజిక భద్రతను కొరుకొనే చిన్న మధ్య తరగతి ప్రజలు ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డిపాజిట్‌ చేస్తుంటారు. అయితే గత ఏప్రిల్‌ నుంచి ఇలాంటి మదింపులపై ప్రతి మూడు నెలలకో మారు వడ్డీరేట్లను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Aug 09,2015 విలువ కోల్పోతున్న 'నిల్వలు' ముంబయి: బంగారం ధరలు కుంగుతుండడం, డాలరు బలోపేతమవుతుండడం తదితర కారణాలతో దేశంలో విదేశీ మారకపు ద్రవ్యం నిల్వలను బాగా ప్రభావితం అవుతున్నాయి. జులై 31తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకపు నిల్వలు 187.6 మిలియన్‌ డాలర్ల మేర కుంగి 353.46 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వరుస పతనాల తరువాత విదేశీ మారకపు నిల్వలు అంతకు ముందు వారంలో (జూలై 24) 322 మిలియన్‌ డాలర్ల మేర పెరిగినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నివేదికలో పేర్కొంది. ఆర్‌బీఐ చేపట్టిన చర్యల కారణంగా విదేశీ మారక నిల్వలు బాగా పెరిగాయని అయితే ఇదే సమయంలో బంగారం ధరలు బాగా పడిపోవడంతో లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 212 Views రూ.10 లక్షలు రివార్డు ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ సూపర్‌సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో విజేతగా నిలిచిన సైనా నెహ్వాల్‌కు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్‌ అయిన సైనా రెండో ర్యాంకర్‌ అయిన చైనాకుచెందిన సున్‌యాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
2sports
సిరీస్‌ గెలిచి అమరజవాన్లకు అంకితమిస్తాం టీమిండియా బౌలర్‌ మహమ్మద్‌ షమీ ఇంటర్నెట్‌ డెస్క్‌: మరో నాలుగు రోజుల్లో టీమిండియా-ఆసీస్‌ మధ్య టీ20 సిరీస్‌ పోరు మొదలు కాబోతోంది. ఇందుకోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇరుజట్ల మధ్య ఇటీవల ఆసీస్‌ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌, వన్డేలను టీమిండియా చేజిక్కించుకుంది. టీ20 సిరీస్ మాత్రం డ్రాగా ముగిసింది. దీంతో స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌ను దక్కించుకోవడంపై టీమిండియా దృష్టి సారించింది. మరో వైపు సొంతగడ్డపై ఎదురైన పరాభావాన్ని ఈ పర్యటనలో తీర్చుకుని లెక్క సరిచేయాలని కంగారూ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్‌ మహమ్మద్‌ షమీ మీడియాతో మాట్లాడాడు.గెలవడానికి శాయశక్తులా కృషి చేస్తామని అన్నాడు. ‘సొంతగడ్డపై టీ20 సిరీస్‌ గెలవాలని టీమిండియా నిబద్ధతతో సాధన‌ చేస్తోంది. గెలవడానికి ఎలా కష్టపడాలో అలా కష్టపడతాం. సొంతగడ్డపై టీ20 సిరీస్‌ గెలిచి అమరజవాన్లకు అంకితమిస్తాం. పుల్వామా ఘటన ఎంతో బాధించింది. ఇదో భయంకర ఘటన. భారత ప్రజల్ని కాపాడటానికి జవాన్లు వారి జీవితాలను ప్రమాదంలో పెట్టుకుంటున్నారు. మనం ఇలా ఉన్నామంటే 24x7వారు కష్టపడం వల్లే. కాబట్టి వారికి మేం ఈ రకంగా నివాళి ఇవ్వాలనుకుంటున్నాం’ అని తెలిపాడు. ఐదు రోజుల క్రితం పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడికి బలైన వారి కుటుంబాలకు షమీ ఆర్థిక సాయం చేశాడు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల భార్యల సంక్షేమ సంఘానికి షమీ రూ.5లక్షలు విరాళంగా ఇచ్చాడు. షమీతో పాటు శిఖర్‌ ధావన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు. Tags :
2sports
పొంచిఉన్న యాత్రీకరణ ముప్పు ఉద్యోగులను హెచ్చరించిన ఐటి యాజమాన్యాలు   ముంబై, జనవరి 3: భారత్‌లోని రెండు టాప్‌ ఐటి టెక్నా లజీ సేవలకంపెనీలు ఇన్ఫోసిస్‌, విప్రోసంస్థలు తమతమ ఉద్యోగులను అప్రమత్తంచేస్తూ ప్రపంచ వ్యాప్తంగా రాజ కీయంగాను, బౌగోళిక, ఆర్థిక తారతమ్యాలు పెరుగుతు న్నాయని ఫలితంగా ఐటి విధివిధానాలకు గండిపడే అవ కాశం ఉందని హెచ్చరించాయి. ఉద్యోగులు తమ శక్తి, ప్రతిభాపాటవాలను మరింత మెరు గుపరుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంద ని, ఇన్ఫోసిస్‌ సిఇఒ విశాల్‌సిక్కా హెచ్చరిం చారు. తనవార్షిక నివేదికలో సిబ్బందికి సిక్కా పలు హెచ్చరికలు జారీచేసారు. యాంత్రీ కరణ, డిజిటైజేషన్‌ ముందున్న ముప్పు అని హెచ్చరించారు. అలాగే విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ ఇటీవలిరాజకీయ ,సామాజిక అంశా లు ప్రపంచీకరణ జరిగిన ఐటి సేవల రంగా నికి తీవ్ర విఘాతంగా ఉంటాయని వివరించా రు. ఎలాంటి ప్రత్యేక అంశాలజోలికి వెళ్ల కుండా పలు ప్రపంచీకరణ అంశాలను ప్రస్తా వించారు. ఆసియాలోని రెండు అతిపెద్ద ఐటిసేవల రంగ సంస్థటిసిఎస్‌ వంటి దిగ్గజాలు కూడా కొంతమంది కార్పొ రేట్‌ కస్టమర్లను చేజార్చుకున్నాయి. కంపెనీలుక్లయింట్లు తమ ఐటి వ్యయాన్ని నియంత్రించుకోవడమే ఇందుకు కీలకం. బ్రిటన్‌, అమెరికా వంటి అతిపెద్ద దేశాల్లో నెల కొన్న రాజకీయ, ఆర్థిక మార్పులు ఇందుకు దోహదం చేసాయనే అంచనా. భారత్‌లోని 108 బిలియన్‌ ఐటి సేవలకు నాలుగొంతుల రాబడులు అన్నీ విదేశాలనుంచే వస్తున్నాయి. బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలగాలన్న నిర్ణయం కొంత అనిశ్చితిని లేవనెత్తింది. ఐటి వ్యయంపై కోతలు పడ్డాయి. అమెరికా అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్‌ట్రంప్‌ విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి విదేశీ వర్క ర్ల రాకపై ఆంక్షలు తప్పకుండా ఉంటాయన్న హెచ్చరికలు సంకేతాలు కూడా ఇందుకుకీలకం అవుతున్నాయి. భారత్‌ ఐటిరంగసంస్థ నాస్కామ్‌ నవంబరునెల వృద్ధి అంచనాల్లో కోతలు పరంగా రాబడుల్లో కొంత తగ్గింది. ఇందుకు సంబంధించి సాంకేతికపరిజ్ఞానాన్ని మరింత పెంచుకుం టూ, కొత్త సృజనాత్మకధోరణులకు అలవాటుపడాలని ఇన్ఫోసిస్‌ విశాల్‌ సిక్కా వివరించారు. విప్రో ప్రేమ్‌జీ కూడా 2016 అడ్డంకులను ఈ సందర్భంగా ప్రస్తావిం చారు. రాజకీయరంగపరంగాచూస్తే నిష్క్రమణ, వివా దాలు, సందేహాలనడుమ ప్రపంచ ఆర్థికవ్యవస్థ మెరుగు పడాల్సి ఉందని ఈ దృష్ట్యానే ఐటిరంగానికి ముందున్న గడ్డుపరిస్థితులను పునఃసమీక్షించుకో వాలని రెండుసంస్థలు యాజమా న్యాలు తమతమ ఉద్యోగులను హెచ్చరించాయి. ఇక రానున్న కాలం లో యాంత్రీకరణ, డిజిటైజేషన్‌లు ఐటిరంగానికి అతిపెద్ద విధ్వంసక శక్తులుగా ఉంటాయని, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ట్రంప్‌ విధి విధా నాలకంటే ఇవి ప్రమాదకరమని ఐటి రంగనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్లనే ఐటిసంస్థలు ఇన్ఫోసిస్‌, విప్రోలు తమతమ ఉద్యోగులను ప్రతిభా నైపుణ్యాలను నేటితరం టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకోవాలని సూచిస్తు న్నాయి. బ్రెగ్జిట్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పెద్దనోట్ల రద్దు, సైబర్‌ సెక్యూరిటీ, శరణార్ధులు, ఉగ్రవాద పరి స్థితులు వంటివి ప్రపంచ స్థితిగతులను ఎంతో మార్చి వేశాయని ఈరెండుసంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
1entertainment
Read Also: రాహుల్, పునర్నవిలకు పెళ్లి చేస్తాం.. వాళ్ల ఇష్టమే మా ఇష్టం: రాహుల్ పేరెంట్స్ సీజన్ 3లో బాబా నెంబర్ 3 బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు వచ్చిన అనంతరం బాబా భాస్కర్ తనను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ ప్రయాణం నాకు చాలా నేర్పింది. నా జీవితంలో ఇదో పెద్ద లెసన్. మా 17 మంది ఇంటి సభ్యుల కోసం వెనుక 300 మంది పనిచేసేవారు. సీజన్ 3లో నేను ఓ మంచి టీంతో ఆట ఆడను. గట్టిపోటీ ఎదుర్కొన్నాను. ప్రేక్షకులు అందరూ నాకు మూడో స్థానం ఇవ్వడం ఆనందంగా ఉంది. బిగ్ బాస్ సీజన్ 3లో బాబా భాస్కర్ నెంబర్ 3 రావడం ఆనందంగా ఉంది. శ్రీముఖి గెలుస్తుందనుకున్నా.. మంచి వాళ్లకు సపోర్ట్ చేస్తే బాగుండేది బిగ్ బాస్‌లో మనం ఊహించింది జరగదు. నాకు ఇంట్లో శ్రీముఖి, వరుణ్, రాహుల్‌లలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారని అనిపించింది. ఈ ముగ్గుర్లో శ్రీముఖి ఖచ్చితంగా విన్నర్ అవుతుందని అనుకున్నా. అయితే రాహుల్ విన్నర్ అయ్యాడు. అయినా నో ప్రాబ్లమ్.. వాడికి మంచి లైఫ్ రావాలని కోరుకున్నా. జనం ఇంకా మంచి వాళ్లను సపోర్ట్ చేసి ఓట్లు వేస్తే ఇంకా బాగుండేది. మా ఫ్యామిలీలో విభేదాలు లేవు.. ఇక నేను బిగ్ బాస్ హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌తో క్లోజ్‌గా ఉన్నానని మా ఫ్యామిలీలో గొడవలు వచ్చాయంటున్నారు. అవన్నీ రూమర్స్.. నేను ఇప్పుడే వచ్చా. ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు రావడం పోవడం సహజం. అప్పుడే కదా అది ఫ్యామిలీ అవుతుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
బిగ్ బాస్2: కౌశల్ కి ఫోన్ కాల్.. ఎవరినీ నమ్మొద్దని చెప్పిన భార్య Highlights బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఇందులో ఓ మెలిక కూడా పెట్టారు. బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఇందులో ఓ మెలిక కూడా పెట్టారు. ఫోన్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తి క్లూ చెప్తారు.. ఆ క్లూ కనిపెట్టి అది ఎవరికి వచ్చిందో వారికి ఫోన్ ఇవ్వాలి. అవతలి వ్యక్తి క్లూ చెప్పకపోయినా, ఫోన్ ఎత్తివారు క్లూ సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయినా.. ఫోన్ కట్ అవుతుంది. ఈ క్రమంలో ముందుగా గీతామాధురి ఫోన్ ఎత్తగా కౌశల్ భార్య చెప్పిన క్లూ గుర్తుపట్టి అతడికి ఫోన్ ఇచ్చేసింది. కౌశల్ తన భార్య, పిల్లలతో మాట్లాడి ఎమోషనల్ అయ్యాడు. కౌశల్ భార్య మీరు ఎంతో అభిమానం పొందారని, అలాగే గేమ్ ఆడమని సూచించింది. అలానే హౌస్ లో మీరు కొందరికి మంచి చెబుతున్నా వారు చెడుగా  అర్ధం చేసుకుంటున్నారని నందిని పేరు చెప్పింది. ఆమెతో మాట్లాడినంతసేపు కౌశల్ ఎమోషనల్ అయ్యాడు. తన కొడుకు ఐ లవ్ యూ పప్పా ఆల్ ది బెస్ట్ అని చెప్పగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు కౌశల్.  Last Updated 25, Jul 2018, 7:12 AM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV జీఎస్టీ సింగిల్ పేజీ రిటర్నుల‌కు కౌన్సిల్ ఆమోదం జీఎస్టీ మండ‌లి 27వ స‌మావేశంలో జీఎస్టీ రిట‌ర్నుల ప్ర‌క్రియ‌ను స‌ర‌ళీక‌రించేందుకు అమోదం ల‌భించింది. ప్ర‌తి నెలా ఒకే ఒక సింగిల్ పేజీతో స‌రికొత్త రిట‌ర్నులు స‌మ‌ర్పించే కొత్త విధానాన్ని ఆరు నెల‌ల్లో అమ‌ల్లోకి తీసుకు రావాల‌ని మండ‌లి తీర్మానానికి మండ‌లి ఆమోదం తెలిపింది Samayam Telugu | Updated: May 4, 2018, 07:41PM IST జీఎస్టీ మండ‌లి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నేతృత్వంలో స‌మావేశమైన జీఎస్టీ మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. రిట‌ర్నుల దాఖ‌లు చేయ‌డాన్ని సుల‌భ‌త‌రం చేసే దిశ‌లోనే ఈ స‌మావేశంలో ప్ర‌ధాన చ‌ర్చ జ‌రిగింది. జీఎస్టీ మండ‌లి 27వ స‌మావేశంలో జీఎస్టీ రిట‌ర్నుల ప్ర‌క్రియ‌ను స‌ర‌ళీక‌రించేందుకు అమోదం ల‌భించింది. ప్ర‌తి నెలా ఒకే ఒక సింగిల్ పేజీతో స‌రికొత్త రిట‌ర్నులు స‌మ‌ర్పించే కొత్త విధానాన్ని ఆరు నెల‌ల్లో అమ‌ల్లోకి తీసుకు రావాల‌ని మండ‌లి తీర్మానానికి మండ‌లి ఆమోదం తెలిపింది. అప్ప‌టి దాకా ప్ర‌స్తుతం ఉన్న విధానామే కొన‌సాగుతుంద‌ని నిర్ణ‌యించారు. జీఎస్టీ నెట్వ‌ర్క్(జీఎస్టీఎన్)ను ప్ర‌భుత్వ కంపెనీగా మార్చే ప్ర‌తిపాద‌న‌పై కూడా అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి చ‌ర్చ జ‌రిపింది. మొత్తానికి ప‌రస్ప‌ర అంగీకారంతో జీఎస్టీ నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం జీఎస్టీఎన్లో హెచ్డీఎఫ్‌సీ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్ఎస్ఈ స్ట్రాట‌జిక్ ఇన్వెస్ట్ మెంట్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ల‌కు 51% వాటా ఉంది. జీఎస్టీ మండ‌లి 27వ స‌మావేశం చక్కెరపై వస్తుసేవల పన్నుకు అదనంగా సుంకం విధించడంపై నిర్ణయాన్ని జీఎస్టీ మండలి వాయిదా వేసింది. ఆ అంశంపై తదుపరి సమావేశం నాటికి తగిన సిఫార్సులు చేసే బాధ్యతను ఐదు రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కూడిన బృందానికి అప్పగించింది. డిజిటల్‌ చెల్లింపులు జరిపిన వారికి రెండు శాతం ప్రోత్సాహం అందించడంపై సూచనలు అందించాలని మరో ఐదు రాష్ట్రాల ఆర్థికమంత్రుల బృందాన్ని జీఎస్టీ మండలి కోరింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ... ‘‘ ప్రస్తుతం జీఎస్టీఎన్‌లో ప్రభుత్వానికి 49శాతం, ఇతర సంస్థలకు 51శాతం వాటా ఉంది. ప్రైవేటు సంస్థల దగ్గరున్న 51శాతం వాటాను ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. జీఎస్టీఎన్‌లో ఇకపై కేంద్ర ప్రభుత్వం 50శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిపి 50శాతం వాటా కలిగి ఉంటాయి. జీఎస్టీ రిటర్నుల దాఖలుకు ప్రత్యామ్నాయంపైనా చర్చ జరిగింది’’ అని వివరించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
Kuala Lumpur, First Published 4, Apr 2019, 7:16 PM IST Highlights మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సుంగ్‌ జీ హ్యూన్ చేతిలో ఓటమి పాలయ్యారు మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సుంగ్‌ జీ హ్యూన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సింధూ... రెండో గేమ్‌లో కనీసం పోరాటం చేయడంలో విఫలమై 18-21, 7-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత యువ సంచలనం కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.  Last Updated 4, Apr 2019, 7:16 PM IST
2sports
sandhya 120 Views stock market stock market ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. భారత్‌-అమెరికా మధ్య వాణిజ్యం తీవ్రమయ్యే అవకాశాలు కనిపించడంతో మార్కెట్లు వెనకంజవేశాయి. సెన్సెక్స్‌ 186 పాయింట్లు నష్టపోయి 38,544 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 11,494 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
1entertainment
sumalatha 175 Views air india , fuel-dues Air India న్యూఢిల్లీ: ఏడు నెలలుగా రూ. 4500 కోట్ల పాత ఇంధన బకాయిలను చెల్లించకపోవడంతో ఆరు విమానాశ్రయాలలో ఇంధన సరఫరాను నిలిపివేయాలని మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి. కోచ్చి, పుణె, పాటాన, రాంచి, వైజాగ్, మొహాలి విమానాశ్రయాలలో ఎయిర్ ఇండియా విమానాలకు ఇంధనాన్ని గురువారం మధ్యాహ్నం నుంచి నిలిపివేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బిపిసిఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) నిర్ణయించాయి. ఎయిర్ ఇండియాకు 90 రోజుల వరకు రుణ బకాయిలను చెల్లించడానికి వెసులుబాటు ఉంటుందని, ఈ గడువు 200 రోజులు దాటిపోయినా ఎయిర్ ఇండియా ఇప్పటివరకు ఎటువంటి చెల్లింపులు చేయడం లేదని ఒక చమురు సంస్థ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/editorial/
1entertainment
రెండు నెలలపాటు సైన్యంతో కలిసి విధుల్లో మాజీ కెప్టెన్ MS Dhoni to start guard duty in Kashmir న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత విలక్షణమైన వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను దేశ సేవ కోసం కల్లోలభరిత కాశ్మీర్ లోయలో కాలుమోపాడు. ధోనీ ఆర్మీ అనుబంధ పారాచూట్ రెజిమెంట్ లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ అని తెలిసిందే. తన ఉద్యోగానికి న్యాయం చేసేందుకు ధోనీ రెండు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా, విధుల్లో చేరిన ధోనీకి ఆర్మీ అధికారులు గార్డు డ్యూటీ కేటాయించారు. పెట్రోలింగ్ విధులతో పాటు, అవుట్ పోస్టు డ్యూటీ కూడా ధోనీ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ‘విక్టర్ ఫోర్స్’ కమెండోలతో కలిసి 15 రోజుల పాటు వివిధ రకాల పోరాట పంథాలపై శిక్షణ పొందనున్నాడు. ఈరోజు నుంచి కాశ్మీర్‌ లోయలో ధోనీ సైన్యం దుస్తుల్లో డ్యూటీ చేయనున్నాడు. తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/
2sports
"నువ్వు తోపురా"తో నిన్నటితరం కథానాయిక నీరోషా రీఎంట్రీ Highlights నైంటీస్ లో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నిరోషా చాలా కాలం తర్వాత తిరిగి వెండితెరపై అలరించనున్న నిరోషా నువ్వు తోపురా చిత్రంలో ప్రత్యేక పాత్రలో అలరించనున్న నిరోషా హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" ఫేమ్ సుధాకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "నువ్వు తోపురా". యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధాకర్ కోమాకుల సరసన నిత్యా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నిన్నటితరం కథానాయకి నిరోష ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది. "సావిత్రి" అనే పాత్రతో నిరోష రీఎంట్రీ ఇస్తుండడం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. "సీనియర్ హీరోయిన్ నిరోష గారు మా సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుండడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బరువైన పాత్రలో నిరోష కనిపించనున్నారు. ఆమె పాత్ర పేరు "సావిత్రి". సినిమాకి ఆమె పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మా దర్శకుడు హరినాధ్ బాబు.బి తెరకెక్కిస్తున్నారు" అన్నారు.  Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0business
Hyderabad, First Published 24, Sep 2018, 4:16 PM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2 మరో వారం రోజుల్లో ముగియనుంది. కౌశల్, గీతామాధురి, దీప్తి నల్లమోతు, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మొదటి నుండి సేఫ్ గేమ్ ఆడుతూ వస్తోన్న దీప్తి ఫైనల్స్ వరకు చేరుకోవడం విశేషమనే చెప్పాలి.  బిగ్ బాస్ సీజన్ 2 మరో వారం రోజుల్లో ముగియనుంది. కౌశల్, గీతామాధురి, దీప్తి నల్లమోతు, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మొదటి నుండి సేఫ్ గేమ్ ఆడుతూ వస్తోన్న దీప్తి ఫైనల్స్ వరకు చేరుకోవడం విశేషమనే చెప్పాలి. మొదట్లో కౌశల్ విషయంలో ఆమె స్టాండ్ తీసుకోలేదని కౌశల్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడ్డారు. ఆ సమయంలో దీప్తి ఎలిమినేట్ అవుతుందని కూడా అనుకున్నారు. అయితే కెప్టెన్సీ టాస్క్ లలో ఆమె తన ఫైటింగ్ స్పిరిట్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. టాస్క్ ఓడిపోయినా.. తన బలంతో పురుషులను ఎదుర్కొని నిల్చున్న కారణంగా ఆమెకి మహిళా ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ పెరిగింది. నాని కూడా శనివారం ఎపిసోడ్ లో దీప్తి గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతుందని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కౌశల్ ఫ్యాన్స్ దీప్తిని టార్గెట్ చేస్తున్నారు. ఓట్ల విషయంలో కౌశల్ కంటే దీప్తికి ఎక్కువ వస్తుండడంతో ఆమె ఓ ఏజెన్సీతో టైఅప్ అయిందని ఆమెకి వస్తోన్న ఓట్లన్నీ ఫేక్ అంటూ కౌశల్ ఆర్మీ ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో కౌశల్ యాంటీ ఫ్యాన్స్.. దీప్తికి మద్దతు తెలుపుతున్నారు. కౌశల్ ఆర్మీ.. దీప్తికి వస్తోన్న ఓట్ల విషయంలో ఇన్వెస్టిగేట్ చేయమని బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేస్తుండగా.. కౌశల్ యాంటీ ఫ్యాన్స్ ముందు కౌశల్ ఆర్మీ సంగతేంటని.. అలా అయితే మొదటి నుండి ఓటింగ్స్ అన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్  రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గత రెండు వారాలుగా చూసుకుంటే కౌశల్ కంటే దీప్తికి ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయి. కౌశల్ ని హేట్ చేసే వారు ఇప్పుడు దీప్తికి ఓట్లు వేయడం మొదలుపెట్టారు. కౌశల్ ఆర్మీ మహిళా కంటెస్టెంట్స్ మీద కామెంట్స్ చేస్తోన్న తీరు నచ్చని మహిళలు సైతం ఇప్పుడు కౌశల్ ని ఓడించడానికి అన్నట్లుగా దీప్తికి ఓట్లు వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కౌశల్ వర్సెస్ దీప్తి అన్నచందంగా సాగుతోంది. ఇప్పటివరకు కౌశల్ గెలుస్తాడనుకుంటే ఇప్పుడు లైన్ లోకి దీప్తి వచ్చింది. మరి బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో చూడాలి! Last Updated 24, Sep 2018, 4:16 PM IST
0business
Hyderabad, First Published 6, Oct 2018, 8:51 PM IST Highlights త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. అయితే సినిమాకు సంబందించిన కొన్ని విషయాలను తారక్ మీడియా ముందు వివరించారు.  తారక్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్ నాకు దర్శకుడు కాకముందు నుంచే మంచి మిత్రుడు. ఆయనతో సినిమా చేయాలనీ చాలా కాలంగా కల కన్నాను. ఆ కల అరవింద సమేత ద్వారా నెరవేరింది. చాలా కాలంగా మిత్రులమైనప్పటికీ సినిమా చేయడానికి సమయం చాలా పట్టింది. ఎన్నిసార్లు అనుకున్నప్పటికీ కుదరలేదు. ఈ సినిమాతో నెరవేరడం హ్యాపీగ ఉందని అన్నారు.  ఇక అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ గురించి వివరిస్తూ.. ప్రతి మగాడి ఆయుధం ఓ మహిళ.నిజంగా ఇది అద్భుతమైన టైటిల్. దేవుళ్లను సైతం.. లక్ష్మీ సమేత నరసింహ స్వామి, సీతా సమేత శ్రీరాముడు అంటూ పిలుస్తుంటాం. అందుకే టైటిల్ పై ఎలాంటి డౌట్ అవసరం లేదు. త్రివిక్రమ్ సినిమా అంటే కథ గురించి ఆలోచించే అవసరం లేదు. కథతో పాటు మంచి మాటలు ఉంటాయి. మా ఇద్దరి కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా రావాలో అలాంటి సినిమానే వస్తోంది అని ఎన్టీఆర్ తెలిపారు.    Last Updated 6, Oct 2018, 8:51 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV తమిళంలోకి నాగార్జున హిట్ సినిమా! తమిళంలో నాగార్జున హిట్ సినిమా! | Updated: Jan 18, 2017, 04:08PM IST క్రమక్రమంగా నాగార్జునకి కోలీవుడ్‌లో కూడా మార్కెట్ పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. గతేడాది నాగ్, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఊపిరి మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, నాగ్ నటించిన మరో హిట్ సినిమా ఇప్పుడు కోలీవుడ్‌లో డబ్బింగ్ అవుతోంది. 2015 సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయిన నాగార్జున సినిమా సోగ్గాడే చిన్నినాయన మూవీ తమిళ డబ్బింగ్ వెర్షన్ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. సోగ్గాడే చిన్నినాయన మూవీ బాగా నచ్చడంతోపాటు తమిళతంబీల అభిరుచికి అనుగుణంగా వుందట. అంతేకాకుండా ఈ చిత్రంలో నటించిన లీడింగ్ లేడీస్ రమ్యక్రిష్ణ, అనుష్క, లావణ్యా త్రిపాఠి, హంసానందిని వంటి వాళ్లంతా తమిళ ఆడియెన్స్‌కి కూడా సుపరిచితమే. ఇక నాగ్ విషయానికొస్తే, ఇటీవలే ఊపిరి మూవీతో కోలీవుడ్ ఆడియెన్స్‌కి దగ్గరయ్యాడు నాగ్. అలా మొత్తానికి 'సోగ్గాడు' కోలీవుడ్ బాట పట్టినట్టు సమాచారం. ఇదే ఫిబ్రవరిలో నాగ్ లేటెస్ట్ మూవీ 'ఓం నమో వేంకటేశాయ' సైతం రిలీజ్‌కి రెడీ అవుతోంది.
0business
READ ALSO: ‘నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండి’ సినిమా కాన్సెప్ట్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉందని అగ్ర కథానాయిక సమంతతో పాటు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కూడా అమలపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఆమె సినిమాలో బోల్డ్, బ్యూటిఫుల్, బ్యాడాస్‌గా ఉన్నారని కరణ్ అన్నారు. అందుకే హిందీలో మంచి విజయం అందుకున్న ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోన్నీ స్క్రూవాలా. తెలుగులో ఎవర్ని తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్న సమయంలో ‘ఆమె’ అంటూ అమలా పాల్ అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్‌లో అమలను తీసుకోవాలని అనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ‘ఓ బేబీ’ దర్శకురాలు నందినీ రెడ్డి దీనిని డైరెక్ట్ చేస్తారు. లస్ట్ స్టోరీస్ READ ALSO: ‘పెళ్లయ్యాక కూడా ఆ సీన్లలో నటిస్తే ఎవరు ఊరుకుంటారు?’ నాలుగు భాగాలుగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌కు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి కూడా డైరెక్ట్ చేస్తారు. ఫస్ట్ సిరీస్‌లో ప్రముఖ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సిరీస్ ఇంకా స్క్రిప్టింగ్ స్టేజ్‌లోనే ఉందట. అంతా పూర్తయ్యాక త్వరలో షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తోంది. ఇంతకీ ఈ లస్ట్ స్టోరీస్ కాన్సెప్ట్ ఏంటంటే.. లస్ట్ అంటే సెక్స్ ‌కోసం తహతహలాడటం. అలాగని ఇది పెద్ద తప్పు పదం ఏమీ కాదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కోరుకునేదే. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. అయితే మహిళలకు కూడా సెక్సువల్ ప్లెజర్ అనేది ఉంటుంది అని, వారికీ విభిన్నమైన లవ్ స్టోరీస్ ఉంటాయని తెలియజేయడానికి ఈ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV RRRలో బాలీవుడ్ బ్యూటీ? సినిమాలో బాలీవుడ్ బబ్లీ గర్ల్ పరిణీతి చోప్రాను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ టీమ్ పరిణీతితో మాట్లాడి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయగా ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. Samayam Telugu | Updated: Jan 25, 2019, 01:28PM IST RRRలో బాలీవుడ్ బ్యూటీ? హైలైట్స్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇచ్చేందుకు నిర్మాత సిద్ధంగా ఉన్నాడట దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి... ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. RRR వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య సుమారు రూ.300కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. రెండ్రోజుల క్రితమే రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, తారక్‌పై కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు సమాచారం. అక్టోబరుకల్లా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలన్నది జక్కన్న ఆలోచనట. అన్ని పనులు పూర్తిచేసుకుని 2020 సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సెకండ్ షెడ్యూల్‌ ప్రారంభమైనప్పటికీ RRRలో హీరోయిన్లు ఎవరన్నదీ ఇప్పటికే తెలియడం లేదు. సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని చెబుతున్నారు. ఇందుకోసం అనేకమంది తారల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటనేదీ లేదు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ బబ్లీ గర్ల్ పరిణీతి చోప్రాను తీసుకోవాలని యూనిట్ ఆలోచిస్తోందట. ఇటీవల ఆర్ఆర్ఆర్ టీమ్ పరిణీతితో చర్చలు జరపగా.. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మొత్తమైనా ఇచ్చేందుకు నిర్మాత సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పరిణీతిని ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లో ఎవరికి జోడీగా తీసుకుంటున్నారన్న దానిపైనా క్లారిటీ లేదు. దీనిపై చిత్ర యూనిట్ స్పందిచాల్సి ఉంది. బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమను విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి నెక్ట్స్ సినిమా కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచనాలున్నాయి. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసం రాజమౌళి సరికొత్త టెక్నాలజీ వాడుతున్నట్లు వార్త బయటకు రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Volvo v40 భారత్‌ మార్కెట్‌కు వోల్వో వి40 కొత్త కార్లు న్యూఢిల్లీ, డిసెంబరు 15: లగ్జరీకార్ల తయారీ కంపెనీ వోల్వో కార్స్‌ వి40, వి40క్రాస్‌కంట్రీ వెర్షన్‌ కొత్త కార్లను విడుదలచేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంధరలుగావి340 ధరలు 25.49 లక్షల నుంచి గరిష్టంగా 28.53లక్షల వరకూ ఉన్నట్లు వివరించారు. 150 హెచ్‌పి, 320 ఎన్‌ఎం టార్క్స్‌ అత్యధిక పనితీరున్న ఆడియో, బ్లూటూత్‌, ఫుల్‌లెడ్‌థార్‌ హ్యామ్మ ర్‌ హెడ్‌ల్యాంపులు, అత్యధిక నాణ్యతకలిగిన లెదర్‌సీట్లు, విద్యుత్‌సాయం తో ముందుసీట్ల సర్దుబాటు, ఎయిర్‌బ్యాగ్‌లు ఇతర కార్లలో ఉన్న అధునా తన ఫీచర్లన్నీ ఉన్నాయి. వోల్వో ఆటోఇండియా ఎండి టామ్‌ వాన్‌ బాన్స్‌ డార్ఫ్‌ మాట్లాడుతూ ఈ రెండు కొత్త వాహనాలు కోచిలోని కొత్త 3ఎస్‌ యూనిట్‌లో విడుదల చేశామని, మధ్యకాలికం గాచూస్తే 10శాతం మార్కె ట్‌ వాటా సాధించగలమబన్నారు. కేరళ మార్కెట్‌లో తాము పటిష్టంగా ఉన్నామని కేరళ వోల్వోను కొత్త భాగస్వామిగా ఎంపికచేసి కోచిలో కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించినట్లు వివరించారు. రానున్న రోజుల్లో వోల్వో ఈ రెండు కొత్త వెర్షన్లు భారత్‌ మార్కెట్‌ను శాసించగలవన్న ధీమా వ్యక్తం చేశారు.
1entertainment
ప్రశ్నార్థకంగా ధోనీ కెప్టెన్సీ?   న్యూఢిల్లీ: మూడు ఫార్మెట్లలో టీమిండియాకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించే సమయం ఆసన్నమైందని మాజీ డాషింగ్‌ క్రికెటర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.కాగా గత రెండు సంవత్సరా లుగా టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కోహ్లీ మెరుగైన ఆటతీరుతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.కాగా ఈ క్రమంలో ధోనీని తప్పించి మూడు ఫార్మెట్లలో కెప్టెన్సీ బాధ్య తలను కోహ్లీకి అప్పగించాల్సినసమయం వచ్చిందని క్రికెట్‌ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.ముఖ్యంగా 2016 కోహ్లీకి బాగా కలిసి వచ్చింది.కాగా ఈ ఏడాదికోహ్లీ అటు కెప్టెన్‌గా, ఇటు ఆటగాడిగా అనేక రికార్డులను సృష్టించాడు. కెప్టెన్‌ అయిన తరువాత కోహ్లీ మరింతగా రాటుదేలాడా? అన్న సందేహం కలుగుతుంది. కాగా మధ్య కాలంలో కోహ్లీ ఇన్నింగ్స్‌నూ చూస్తే టెస్టులతో పాటు వన్డేల్లోను బాగా ఆడుతున్నాడు.ముంబై వేదికగా జరిగిన నాలుగవ టెస్టు మ్యాచ్‌ అనంతరం టివి షోలో పాల్గొన్న సెహ్వాగ్‌ బహిరంగంగానే కోహ్లీ నాయ కత్వాన్ని సమర్థించాడు. కాగా మూడు ఫార్మెట్ల లో భారత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు కోహ్లీ తయారై ఉన్నాడని, సెలక్టర్లు ఆ బాధ్యతలను కోహ్లీకి అప్పగిస్తే సమర్థవంతంగా నిర్వహించగలడని సెహ్వాగ్‌ వెల్లడించాడు. ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ధోనీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే నానాటికి కోహ్లీ తనప్రదర్శనను మెరుగు పర్చుకుంటూ ముందుకు వెళ్లడంతో ధోనీ కెప్టెన్సీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాగా మరో రెండన్నర సంవత్సరాల్లో ఇంగ్లండ్‌లో జరుగ నున్న వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీలో టీమిండియాకు ఎవరు నాయకత్వం వహిస్తారన్నది కీలక ప్రశ్నగా మారింది. ఉపఖండం బయట టీమిండియా ఆడిన చివరి వన్డే సిరీస్‌ ఆస్ట్రేలియాలో జరిగింది. కాగా ఈ వన్డే సిరీస్‌లో టీమిండియా 4-1తో పరాజయం చెందింది.అయితే ధోనీ,కోహ్లీ ఇద్దరు భారత్‌కు మరుపురాని విజయాలను అందించిన వారే.కివీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో కోహ్లీ సేవలను మ్యాచ్‌ సమయంలో తాను ఉపయో గించుకుంటున్నట్లు ధోనీ బాహాటంగా వెల్లడిం చాడు. టెస్టు క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటిం చిన తరువాత కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న కోహ్లీ టీమిండియాకు వరుసగా అయిదు టెస్టు సిరీస్‌ విజయాలను అందించాడు.కాగా ఈ క్రమంలో మూడు ఫార్మెట్లకు కోహ్లీని కెప్టెన్‌గా చేయాలంటూ పలువురు మాజీలు గళం విప్పారు.ధోనీని కెప్టెన్‌గా కొనసాగించాలా? లేదా మార్పులు చేయాలా? అన్నది త్వరలో తేలిపోయే అవకాశముంది. వచ్చే సంవత్సరం వేసవికి ఇంగ్లండలో చాంపియన్స్‌ ట్రోఫీ నాటికి ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశ ముంది.అప్పుడే సెలక్టర్లు 2019 వరల్డ్‌ కప్‌ వరకు ఎవరు జట్టు కెప్టెన్‌గా ఉండాలో నిర్ణ యించే అవకాశం ఉందని భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
2sports
మంచు మనోజ్ "ఒక్కడు మిగిలాడు" రివ్యూ Highlights చిత్రం : ఒక్కడు మిగిలాడు నటీనటులు : మంచు మనోజ్‌, అనీషా ఆంబ్రోస్​, అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి, మిలింద్‌ గునాజీ, పోసాని కృష్ణ మురళీ సంగీతం : శివ ఆర్‌ నందిగాం దర్శకత్వం : అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి నిర్మాత : ఎస్‌ఎన్‌ రెడ్డి ఆసియానెట్ రేటింగ్ : 3/5 ప్రయోగాత్మక చిత్రాలతో ఎప్పటికప్పుడు విభిన్నంగా కనిపించేందుకు యత్నించే మంచు మనోజ్‌ ఒక భారీ హిట్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. కమర్షియల్‌ ఫార్ములాను పక్కనబెట్టి మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మనోజ్. శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు సినిమాలో రెండు విభిన్న పాత్రలో నటించాడు. మరి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ సాదించాడా..? కథ : తన ప్రమోషన్‌ కోసం ఓ కాలేజ్‌ ప్రొఫెసర్‌ తన స్టూడెంట్స్‌ అయిన ముగ్గురమ్మాయిలను మోసం చేసి ఓ మినిస్టర్‌ (మిలింద్‌ గునాజీ) కొడుకుల దగ్గరకు పంపిస్తాడు. విషయం తెలుసుకున్న అమ్మాయిలు వాళ్లనుంచి తప్పించుకునేందుకు మరో దారిలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారు. బయటి ప్రపంచానికి అసలు విషయం తెలియకుండా వాళ్ల వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరిస్తారు. నిజం తెలుసుకున్న విద్యార్థి నాయకుడు సూర్య(మంచు మనోజ్‌)  విద్యార్థి ఉద్యమానికి పిలుపునిస్తాడు. కానీ మినిస్టర్‌ తన బలాన్ని ఉపయోగించి ఉద్యమాన్ని అనచివేసి సూర్యని అరెస్ట్‌ చేయిస్తాడు. కేసు కూడా  నమోదు చేయకుండా చిత్ర హింసలు పెట్టి ఎన్‌కౌంటర్‌ చేయాలని ప్లాన్‌ చేస్తారు. వారి కుట్రల నుంచి సూర్య ఎలా తప్పించుకున్నాడు..? సూర్యకు శ్రీలంక శరణార్థలు కోసం పోరాడిన విప్లవనాయకుడు పీటర్‌ (మంచు మనోజ్‌)కు సంబంధం ఏంటి..? ఈ పోరాటంలో చివరకు సూర్య గెలిచాడా..లేదా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటికే నటుడిగా ప్రూవ్‌ చేసుకున్న మంచు మనోజ్‌ ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విద్యార్థి నాయకుడిగా మనోజ్‌ నటన చాలా సహజంగా అనిపించింది. ఎక్కువగా అల్లరి క్యారెక్టర్‌ లు మాత్రమే చేసిన మనోజ్‌ ఈ సినిమాతో బరువైన ఎమోషన్లు కూడా పండించగలడని ప్రూవ్‌ చేసుకున్నాడు. సూర్య పాత్రలో నేచురల్‌ గా కనిపించిన మనోజ్‌, పీటర్‌ పాత్రలో కాస్త డ్రమెటిక్‌గా కనిపించాడు. మరో కీలక పాత్రలో నటించిన దర్శకుడు అజయ్‌ ఆండ్రోస్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సముద్రం మీద తెరకెక్కిన సన్నివేశాల‍్లో అజయ్‌ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. బోట్‌ ప్రయాణంలో కనిపించిన వారంతా నేచురల్‌ గా నటించి మెప్పించారు. సిన్సియర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్రలో పోసాని కృష్ణమురళీ మరోసారి తన  మార్క్‌ చూపించాడు. జర్నలిస్ట్‌ పాత్రలో అనీష ఆంబ్రోస్‌ పరవాలేదనిపించింది. ఇతర పాత్రల్లో సుహాసిని, మిలింద్‌ గునాజీ, బెనర్జీ తమ​ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా వుందంటే : శ్రీలంకలో శరణార్థుల సమస్యల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు అజయ్‌, సినిమాను రియలిస్టిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అక్కడి ప్రజల సమస్యలను వాళ్లు పడుతున్న ఇబ్బందులను, అక్కడి నుంచి శరణార్థులగా తప్పించుకొని వస్తున్న వారు ఆ ప్రయత్నంలో ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. సినిమాను రియలిస్టిక్‌ గా తెరకెక్కించటంతో కమర్షియల్‌ సినిమాగా కన్నా ఓ డాక్యుమెంటరీ సినిమాలా అనిపించింది. ఇక శ్రీలంక పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాల్లో పాత్రల నటన చాలా డ్రమెటిక్‌ గా అనిపిస్తుంది. బోట్‌ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కినా.. నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ఎమోషనల్‌ డ్రాగా తెరకెక్కిన సినిమాలో కథను పక్కదారి పట్టించే పాటలు లేకపోవటంతో సినిమా అంతా ఒకే మూడ్‌లో సాగుతుంది. అక్కడక్కడ వినిపించిన బిట్‌ సాంగ్స్‌ సన్నివేశాలు మరింత ఎలివేట్‌ అయ్యేందుకు హెల్ప్‌ అయ్యాయి. నేపథ్యం సంగీతం కూడా సినిమా మూడ్‌ ను క్యారీ చేసింది. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫి, శ్రీలంకలోని పోరాట సన్నివేశాలతో పాటు బోటు ప్రయాణం సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ :
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Kagiso Rabada దెబ్బ.. పుజారా డకౌట్, మయాంక్ ఔట్ రాంచీ టెస్టు ఆరంభంలోనే భారత్‌కి ఊహించని షాక్ తగిలింది. తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు బాది సూపర్ ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్‌తో పాటు చతేశ్వర్ పుజారాని కూడా రబాడ 4 పరుగుల వ్యవధిలో ఔట్ చేసేశాడు. Samayam Telugu | Updated: Oct 19, 2019, 10:45AM IST హైలైట్స్ రాంచీ టెస్టు తొలి సెషన్‌లో భారత్‌కి ఎదురుదెబ్బలు మయాంక్ అగర్వాల్, చతేశ్వర్‌ పుజారా వికెట్లు పడగొట్టిన రబాడ డకౌట్‌గా వెనుదిరిగిన పుజారా.. డీఆర్‌ఎస్ కోరిన సఫారీలు ఇప్పటికే సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యం దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా శనివారం ఆరంభమైన మూడో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టుకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. సఫారీ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ .. కేవలం 4 పరుగుల వ్యవధిలోనే మయాంక్ అగర్వాల్, చతేశ్వర్‌ పుజారాలను పెవిలియన్ బాట పట్టించాడు. వైజాగ్, పుణె టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శతకాలు సాధించగా.. చతేశ్వర్ పుజారా నిలకడగా రాణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లి (8) ఉండగా.. 12 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 25/2తో కొనసాగుతోంది. Read More: ఇదెక్కడి వింత..?టాస్‌కి సఫారీ కెప్టెన్ సబ్‌స్టిట్యూట్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన కగిసో రబాడ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ బంతిని వెంటాడి స్లిప్‌లో డీన్ ఎల్గర్ చేతికి దొరికిపోయాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా రబాడ విసిరిన బంతిని ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (10: 19 బంతుల్లో 2x4) ముందుకు ఫుష్ చేయబోయాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లో గాల్లోకి లేచింది. దీంతో.. పక్కకి డైవ్ చేస్తూ ఫీల్డర్ ఎల్గర్ క్యాచ్ అందుకున్నాడు. IND vs SA 3rd Test Live Score బోర్డు కోసం క్లిక్ చేయండి..! అనంతరం క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా కనీసం ఖాతా కూడా తెరవకుండానే వికెట్ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసేందుకు పుజారా (0: 9 బంతుల్లో) ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వెళ్లి అతని ఫ్యాడ్స్‌ని తాకింది. దీంతో.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం సఫారీలు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. దీంతో.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ డీఆర్‌ఎస్‌కి వెళ్లాడు. రిప్లైలో బంతి నేరుగా వెళ్లి వికెట్లను గీరాటేస్తున్నట్లు కనిపించడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
2sports
మెగా అల్లుడి ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా బాలయ్య.? Highlights మెగా అల్లుడి ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా బాలయ్య.? 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఫంక్షన్ సందర్భంగా ఒకే వేదికపైన కనిపించిన చిరంజీవి, బాలకృష్ణలు... మరోసారి స్టేజ్ ను షేర్ చేసుకోబోతున్నారని విశ్వసనీయ సమాచారం. మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'విజేత'. ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 24న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరగనుంది. ఈ ఫంక్షన్ కు చిరంజీవి విచ్చేస్తున్న సంగతి తెలిసిందే.  కాగా, బాలయ్య కూడా ఈ వేడుకకు వస్తున్నారని చెబుతున్నారు. చిరంజీవితో ఉన్న సన్నిహిత సంబంధాలు, వారాహి సంస్థతో ఉన్న అనుబంధం నేపథ్యంలో వేడుకకు వచ్చేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నారని ఫిలిం నగర్ టాక్. ఇదే జరిగితే... టాలీవుడ్ అగ్ర హీరోలిద్దరినీ మరోసారి ఒకే వేదికపై చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది. Last Updated 23, Jun 2018, 12:49 PM IST
0business
బాలయ్య డైలాగ్స్ తో దుమ్ము దులిపిన బుడతడు (వీడియో) Highlights బాలయ్య డైలాగ్స్ తో దుమ్ము దులిపిన బుడతడు  నేడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఊరూరా సంబరాలతో మునిగితేలుతున్నారు. విజయవాడ లో అంగరంగ వైభవంగా మహానాడు జరిగిన విషయం తెలిసిందే. ఆటలతో, పాటలతో హోరెత్తిపోయింది. మఖ్యంగా ఒక బుడతడు మాత్రం తన డైలాగ్స్ తో అందరిని పిచ్చెక్కించాడు. బాలక్రిష్ణ సినిమాలలోని డైలాగ్స్ చెప్తుంటే అందరు చప్పట్లతో  హోరెత్తించారు.  ఒకసారి ఈ చిచ్చరపిడుగు డైలాగ్స్ మీరు వినండి.
0business
పవన్ కల్యాణ్ తో క్రిష్...ఈ సారి పక్కా Highlights పవన్ కల్యాణ్ కోసం కథ రెడీ చేసిన క్రిష్ గతంలోనే పవన్ కల్యాణ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రాజెక్ట్ వుండే అవకాశం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఫుల్ ఫాలోయింగ్ వుండే హీరోతో సినిమా చెయ్యాలని ప్రతీ డైరెక్టర్ కు వుంటుంది. స్టార్ హీరోతో సినిమా అంటే అందరికీ ఒక సౌలభ్యం ఉంటుంది. ఆ హీరో ని కొత్తగా చూపిస్తే తమ మార్కెట్ రేంజ్ కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఏ హీరో దృష్టిలో పెట్టుకుని ఏ డైరెక్టర్ కథ రాస్తున్నాడనేది చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ నే టార్గెట్ గా చేసుకుని కథ రాస్తున్నాడు అని తెలుస్తోంది. గ‌మ్యం, వేదం, కృష్ణంవందే జ‌గద్గురుమ్‌, గౌత‌మిపుత్ర‌…. ఇలా వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ఓమార్క్ సృష్టించుకొన్నాడు క్రిష్‌. ఇప్పుడు బాలీవుడ్‌లో కంగన లీడ్ రోలల్ లో ఝాన్సీ రాణి పాత్రలో మ‌ణిక‌ర్ణిక చిత్రం రూపొందిస్తున్నాడు.   ఆ తరవాత తెలుగులో ఒక సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడు దాని కోసం పవన్ కళ్యాణ్ తో కలిసి చెయ్యాలని కోరుకుంటూ ఉన్నాడు క్రిష్. క్రిష్ కూడా 'కంచె' సినిమాకు ముందు పవన్‌తో సినిమా చేయడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ఎలాగైనా సంపాదించాలని కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు క్రిష్. ఈ ఏడాది 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంతో సక్సెస్ అందుకున్న క్రిష్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో చారిత్రక నేపధ్యం గల 'మణికర్ణిక' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్‌కు తన సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నాడు. ఈ సినిమా తరువాత క్రిష్ చేయబోయే సినిమా తెలుగులోనే అని తెలుస్తోంది. ఆయన తదుపరి సినిమా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఉంటుందనే మాటలు వినిపించాయి. మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే దర్శకుడు క్రిష్ అని అంతా అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాతో పాటు క్రిష్.. పవన్ సినిమాకు కూడా కథను సిద్ధం చేస్తున్నాడని టాక్. తన కథతో పవన్‌‌ను మెప్పించి అతడి అంగీకారం పొందాలని చూస్తున్నాడు.   అయితే ప్రస్తుతం పవన్.. త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. అలానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో మరో సినిమా లైన్‌లో ఉంది. మరోవైపు 2019 ఎన్నికల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తి సమయాన్ని పాలిటిక్స్‌ పై పెట్టేందుకు ప్రణాళికలు రచించుకున్నారు. వీలైనంత తొందరకు షెడ్యూల్ అయిన మూవీలను కంప్లీట్ చేసి రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు కొత్త సినిమాలేవీ పవన్ ఒప్పుకునే పరిస్థితిలేదు. మరి క్రిష్ చెప్పిన కథ పవన్‌కు అటు రాజకీయంగానూ ఉపయోగపడుతుందని అందుకే ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చంటూ వార్తలు వస్తున్నాయి. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
Hyd Internet 105 Views susheel kumar , wrestler susheel kumar, wrestler ఇండోర్‌: జాతీయ సీనియర్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 74 కేజీల విభాగంలో బరిలో దిగిన సుశీల్ కుమార్ మూడు నిమిషాల్లోపే స్వర్ణం కైవసం చేసుకున్నాడు. మ్యాట్‌పై సుశీల్‌ ప్రత్యర్థులతో తలపడింది కేవలం 2 నిమిషాల 33 సెకన్లే. తొలి రెండు బౌట్లలో గెలిచి ముందంజ వేసిన సుశీల్‌.. క్వార్టర్‌, సెమీస్‌, చివరికి ఫైనల్లోనూ వాకోవర్‌లు లభించాయి. అంటే అతను కేవలం మూడు నిమిషాల్లోపే పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో అతను ప్రవీణ్‌ రాణాతో తలపడాల్సి ఉండగా.. అతను గాయం కారణం చెబుతూ తప్పుకున్నాడు. కానీ సుశీల్‌కు ఇలా మూడు వాకోవర్‌ ఇవ్వడంపై విమర్శలు రేగుతున్నాయి. మరోవైపు ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌, గీత ఫొగట్‌ స్వర్ణం గెలుచుకున్నారు. మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి., పూజ తోమర్‌ (హరియాణా)ను చిత్తు చేయగా, గీత (59 కేజీలు).. కవితను ఓడించి పసిడి నెగ్గింది. గీత భర్త పవన్‌ కుమార్‌ (86 కేజీలు) కూడా స్వర్ణం నెగ్గాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV డీఎస్పీగా హర్మన్‌ప్రీత్‌కి తొలగిన అడ్డంకులు..! భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ పంజాబ్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగుమమైంది. గత TNN | Updated: Feb 22, 2018, 06:51PM IST భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ పంజాబ్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగుమమైంది. గత ఏడాది జులైలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ని ఫైనల్‌కి చేర్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భీకర హిట్టింగ్‌తో కౌర్ 171 పరుగులు చేయడంతో ఈ క్రికెటర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ ప్రదర్శన తర్వాత పంజాబ్ ప్రభుత్వం హర్మన్‌ప్రీత్‌కి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే.. అప్పటికే వెస్ట్రన్ రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న హర్మన్‌ప్రీత్.. ఐదేళ్ల బాండ్‌పై సంతకం చేసి ఉండటంతో కొత్తగా పోలీస్ డీఎస్పీగా బాధ్యతలు చెప్పటేందుకు ఆమెకి అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో బాండ్ సమస్యని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దృష్టికి హర్మన్‌ప్రీత్ తీసుకెళ్లగా.. అతను రైల్వే మంత్రి పీయూస్ గోయల్‌కి లేఖ రాసి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. ‘పంబాబ్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. బాండ్‌ సమస్యని పరిష్కరించేందుకు చొరవ చూపిన అమరీందర్‌జీకి ధన్యవాదాలు. మీ సహకారం, ప్రోత్సాహం కెరీర్‌లో నన్ను మరింత అత్యుత్తమ ప్రదర్శన చేసేలా స్ఫూర్తి నింపుతోంది. ఈ విషయంలో సహకరించిన రైల్వే మంత్రి పీయూస్ గోయల్‌కి కూడా ధన్యవాదాలు’ అని ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్ ఆడుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్ ట్వీట్ చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలవగా.. దక్షిణాఫ్రికా మూడో టీ20లో విజయం సాధించింది. బుధవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. చివరి టీ20 శనివారం జరగనుంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 98 రూపాయలకే '5 జీబీ' డేటా...! తన ప్రీపెయిడ్ వినియోగదారులకు టెలికామ్ దిగ్గజం ఎయిర్‌టెల్ తీపికబురు అందించింది. కేవలం రూ.98కే 5జీబీ డేటాను అందుబాటులోకి తెచ్చింది. TNN | Updated: Feb 21, 2018, 04:45PM IST తన ప్రీపెయిడ్ వినియోగదారులకు టెలికామ్ దిగ్గజం ఎయిర్‌టెల్ తీపికబురు అందించింది. కేవలం రూ.98కే 5జీబీ డేటాను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఈ ప్లాన్‌ కింద 2 జీబీ డేటాను అందించేవారు... కాగా ఇప్పుడు దీన్ని 5 జీబీకి పెంచారు. ఈ ఆఫర్ ద్వారా వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌‌లు లభించవు. కేవలం డేటా మాత్రమే లభిస్తోంది. ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. దీనికి ఎలాంటి రోజువారీ డేటా పరిమితి లేదు. రిలయెన్స్ జియో ఇప్పటికే తన వినియోగదారులకు రూ.98 ప్లాన్‌‌ను అందిస్తోంది. దీని ద్వారా 28 రోజుల కాలపరిమితితో 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తున్నాయి. జియోకు దీటుగా ఎయిర్‌టెల్ కూడా.. రూ.98 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
1entertainment
మార్చి 23న భారత మార్కెట్లోకి నానో Hanumantha Reddy| Last Modified బుధవారం, 4 మార్చి 2009 (12:03 IST) ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన లక్ష రూపాయల నానో కారు మార్చి 23న భారత మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ విషయాన్ని టాటా మోటార్స్ కంపెనీ ఛీఫ్ రతన్ టాటా అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని గతంలోనే టాటా మోటార్స్ వెల్లడించినప్పటికీ.. స్వయంగా ఆ కంపెనీ ఛీఫ్ నానో కారు విడుదల తేదీని ఖరారు చేస్తూ ప్రకటన చేయడం విశేషంగా మార్కెట్ వర్గాలు తెలిపాయి. జెనీవాలో 79వ మోటార్‌షోలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో రతన్ టాటా మాట్లాడుతూ, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా టాటా నానోకు చక్కటి ఆదరణ లభించిందని తెలిపారు. అయితే ప్రకటించిన తేదీ కన్నా ముందే నానో కారు మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలను ఆయన ఖండించారు. విదేశీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తయారు చేయనున్న నానో ఐరోపాను మరో రెండేళ్లలో ఐరోపా మార్కెట్లోకి ప్రవేశపెడతామన్నారు. చక్కటి ఇంధన సామర్థ్యంతో ఎక్కువ మైలేజీని ఇచ్చే కారుకు యూరప్ మార్కెట్లో డిమాండ్ ఉన్నందున నానో కారును ఇక్కడ విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. సంబంధిత వార్తలు
1entertainment
Hyderabad, First Published 1, Apr 2019, 1:00 PM IST Highlights టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన సమంత దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది.  టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన సమంత దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలను కూడా కవర్ చేసింది. అయితే ప్రభాస్ తో మాత్రం ఇప్పటివరకు కలిసి నటించలేదు. త్వరలోనే ఈ కాంబో సినిమా రానుందని సమాచారం. నిర్మాత దిల్ రాజు ఈ కాంబినేషన్ ని తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల ఓ కథ విన్న దిల్ రాజు అందులో ప్రభాస్ హీరోగా చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం  ఈ కథని డైరెక్ట్ చేసే టాలెంటెడ్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు. '96' సినిమా రీమేక్ కి సమంతని సంప్రదించిన సమయంలోనే దిల్ రాజు ఆమెతో మూడు ప్రాజెక్ట్ లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు.  అందులో భాగంగా ఇప్పుడు ప్రభాస్, సమంతలను ఒకే తెరపై చూపించాలని భావిస్తున్నాడు. ప్రభాస్ గనుక ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తెరపై ఓ క్రేజీ కాంబినేషన్ ని చూసే ఛాన్స్ అభిమానులకు దక్కుతుంది.  Last Updated 1, Apr 2019, 1:00 PM IST
0business
Australia 3 test వెంట వెంటనే ఆస్ట్రేలియా తడబాటు రాంచీ: ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది.. భారత్‌తో రాంచీ లో జరుగుతున్న మూడో టెస్టు చివరి రోజున ఆటలో వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.. ఇషాంత్‌ శర్మ రెన్‌సాను, జడేజా స్మిత్‌ను పెవిలియన్‌కు పంపారు.దీంతో ఆస్ట్రేలియా 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే ఇంకా 89 పరుగులు వెనకబడి ఉంది.
2sports
sandhya 100 Views India Vs New Zealand toss మాంచెస్టర్‌: మాంచెస్టర్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ సెమీస్‌ సమరంలో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచింది. టాస్‌ గెలిచిన కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇక టీమిండియాలో కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో చాహల్‌ జట్టులోకి రాగా, న్యూజిలాండ్‌ జట్టులో సౌథీ బదులు లాకీ ఫెర్గుసన్‌ జట్టులోకి వచ్చాడు. టాస్‌ ఓడిపోయిన అనంతరం కోహ్లి మాట్లాడుతâ..పిచ్‌ చాలా ఫ్రెష్‌గా ఉందని, టాస్‌ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగే ఎంచుకునే వాళ్లమని తెలిపాడు. తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/
2sports
అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొంటున్న "సాక్ష్యం" Highlights అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొంటున్న "సాక్ష్యం" బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాక్ష్యం" ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. 15 రోజుల షెడ్యూల్ లో అమెరికాలోని సుదరమైన లొకేషన్స్ లో చిత్ర బృందం చిత్రీకరణ జరపనుంది. న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూజెర్సీ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది.  బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్-పూజా హెగ్డేల నడుమ ఒక సాంగ్ ను కూడా షూట్ చేయనున్నారు. హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
0business
warner మరోసారి స్పిన్‌కు వెనుదిరిగిన వార్నర్‌ రాంచీ: భారత్‌లోని స్పిన్‌ పిచ్‌లపై ఆడటానికి ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి స్పిన్‌ఉచ్చుకే బలయ్యాడు.టీమిండియాతో గురువారం ఆరంభమైన మూడవ టెస్టులో వార్నర్‌్‌ స్పిన్‌ బౌలింగ్‌లో ఔట య్యాడు.దీంతో ఈ సిరీస్‌లో నాలుగు సార్లు స్పిన్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరిన అపప్రదను మూటగట్టుకున్నాడు.అయితే ఈ సిరీస్‌లో మూడుసార్లు అశ్విన్‌కు చిక్కిన వార్నర్‌,మూడవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో భాగంగా నాలుగవ బంతికి వార్నర్‌ 19 పరుగుల వద్ద రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔట య్యాడు.సుమారు సంవత్సరం కాలంగా మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్‌ భారత్‌ తో సిరీస్‌లో మాత్రం పేలవ మైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.తమకు కీలక ఆటగాడు వార్నర్‌ వరుస వైఫల్యాలు తీవ్రంగా కలవర పరుస్తున్నాయి.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రే లియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.తొలి రెండు టెస్టుల్లో ఇరు జట్లు ఒక్కొక్కరు ఒక టెస్టు గెలిచి సమంగా ఉన్న సమ యంలో మూడవ టెస్టు కీలకం కానుంది. ఇక్కడ గెలిచిన జట్టుకే సిరీస్‌ సాధించే అవకాశాలు ఉంటాయి. దీంతో గెలుపుకోసం టీమిండియా, ఆసీస్‌ జట్లు తీవ్ర పోరాటం కొనసాగించే అవకాశం ఉంది.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV లంకపై గెలిచిన బంగ్లా.. ఇక భారత్‌తో ఢీ ముక్కోణపు టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కి చేరింది. ఆతిథ్య శ్రీలంకతో శుక్రవారం రాత్రి జరిగిన TNN | Updated: Mar 17, 2018, 08:33AM IST లంకపై గెలిచిన బంగ్లా.. ఇక భారత్‌తో ఢీ ముక్కోణపు టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కి చేరింది. ఆతిథ్య శ్రీలంకతో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ (50: 42 బంతుల్లో 4x4, 2x6), మహ్మదుల్లా (43 నాటౌట్: 18 బంతుల్లో 3x4, 2x6) మెరుపులు మెరిపించడంతో 160 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఒక బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. టోర్నీలో ఇప్పటికే ఫైనల్‌కి చేరిన భారత్ ఆదివారం బంగ్లాదేశ్‌తో ఢీకొట్టనుంది. టోర్నీలో ఒక్కో జట్టు మరొక జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడగా.. లీగ్ దశలో టీమిండియా చేతిలో రెండు మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్ పరాజయం చవిచూసింది. అయితే.. ఈ బంగ్లాదేశ్ చేతిలోనే ఆతిథ్య శ్రీలంక కూడా రెండుసార్లూ ఓడిపోవడం కొసమెరుపు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఓపెనర్లు గుణతిలక (4), కుశాల్ మెండిస్ (11) నిరాశపరిచినా.. కుశాల్ పెరీరా (61: 40 బంతుల్లో 7x4, 1x6), తిసార పెరీరా (58: 37 బంతుల్లో 3x4, 3x6) అర్ధశతకాలతో రాణించారు. దీంతో.. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఛేదనలో చివరి 4 బంతుల్లో 12 పరుగులు చేయల్సి దశలో మహ్మదుల్లా ఒత్తిడిని అధిగమించి వరుసగా 4, 2, 6 బాదేసి బంగ్లాదేశ్‌ని గెలిపించేశాడు. దీంతో 19.5 ఓవర్లలో బంగ్లా 160/8తో విజయాన్ని అందుకుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV తమిళనాడుకి ముఖ్యమంత్రి అవుతా-త్రిష త్రిషకి వివాదాలు కొత్తేంకాదు, ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం ఎలాంటి వివాదాలజోలికి పోకుండా తన మనసులోని కోరికను బయటపెట్టింది. TNN | Updated: Oct 28, 2016, 11:25AM IST ఏ నటికైనా డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది కాని త్రిష నటించాలని కలలుకంటున్నపాత్ర వింటే షాక్ అవ్వాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లుదాటినా ఇంకా రాణిస్తూనే ఉంది ఆ భామ. వివాదాలు తనకేం కొత్తేంకాదు, ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం ఎలాంటి వివాదాలజోలికి పోకుండా తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా నటిస్తున్న త్రిష చేతినిండా సినిమాలతో ఎప్పడూ బిజీగానే ఉంటుంది. సీనియర్ నటులతోనే కాకుండా యంగ్ హీరోలతో ఆడిపాడిన ఈ భామ చాలా రకాల పాత్రలతో అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఆ బ్యూటీ ధనుష్‌కు జంటగా కోడి చిత్రంలో రాజకీయనాయకురాలి గెటప్‌లో దర్శనం ఇస్తుంది. ‘కోడి’ సినిమా శుక్రవారం అభిమానుల ముందుకు రాబోతుండటంతో ఆ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న త్రిష తనకు సి.ఎం కావాలని ఉందని కోరికను బయటపెట్టింది. అయితే నిజజీవితంలో కాదట తెరమీద సి.ఎం పాత్రలో నటించాలని ఉందని, తమిళనాడు సి.ఎం జయలలిత క్యారెక్టర్‌లో యాక్ట్ చేయాలని ఆశగా ఉందని చెప్పుకొచ్చింది. ఇటీవల జయలలితచేతుల మీదగా ప్రత్యేక అవార్డును అందుకున్న త్రిష రాజకీయనాయకురాలి పాత్రతోనే సరిపెట్టుకుంటుందో లేక రియల్ పొలికల్ లీడర్‌లా మారుతుందో చూడాలి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 'శ్రీమంతుడు' కెరీర్ లో మరో రికార్డు శ్రీమంతుడు మూవీతో మహేష్ బాబు కెరీర్ లో మరో రికార్డు వచ్చిచేరింది. TNN | Updated: Aug 8, 2015, 06:11PM IST 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా నటించిన శ్రీమంతుడు మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే తన గత చిత్రాలతో ఎన్నో రికార్డులు కైవసం చేసుకున్న మహేష్ బాబు కెరీర్ లో మరో రికార్డు వచ్చిచేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా మొదటి రోజే రూ. 12.87 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఫస్డ్ డే కలెక్షన్ల పరంగా మహేష్ బాబు కెరీర్ లో ఇదే మొదటి రికార్డు. టాలీవుడ్ లో 'బాహుబలి' తర్వాత అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగానూ 'శ్రీమంతుడు' మరో రికార్డుని సొంతం చేసుకుంది. శ్రీమంతుడు మూవీ మొదటి రోజు వసూళ్ల వివరాలిలా వున్నాయి. నైజాం రూ.3.56 కోట్లు
0business
BSE మార్కెట్లలో మందగమనం ముంబై, నవంబరు 16: పార్లమెంటు శీతాకాల సమా వేశాల్లో ప్రధాని మోడీ ప్రకటించిన నోట్లరద్దు అంశం వాడివేడిగా చర్చలకురావడంతో ఈక్విటీమార్కెట్లపై ప్రభా వం చూపించింది. బుధవారం మార్కెట్లు నత్తనడకన ముగిసాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ ఆరు పాయింట్లు దిగువన 26,298 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి మూడు పాయింట్ల ఎగువన 8111 పాయింట్లవద్ద స్థిర పడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.56 శాతం, 0.05శాతంగా పెరిగాయి. ఇంట్రాడే డీల్స్‌లో బెంచ్‌మార్క్‌ సూచీలు ర్యాలీతీసాయి. ఐఇరంగ షేర్లలో రూపాయిబలహీనత ఆధారంగా వృద్ధి కనిపించింది. ఇక రిటైల్‌ద్రవ్యోల్బణం తగ్గడంతో వచ్చేనెల వడ్డీరేట్ల కుదింపు ఉంటుందన్న అంచనాలు మార్కెట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్‌లో 1547 కంపెనీలు నష్టపోతే 1055 కంపెనీ లు లాభాల్లో ముగిసాయి. పార్లమెంటుశీతాకాల సమా వేశాలు, అమెరికా ఆర్థిక విధానాలు మార్కెట్లకు దిశానిర్దే శం చేస్తాయని బిఎన్‌పిపరిభాస్‌ వినోద్‌నాయర్‌ పేర్కొ న్నారు. రిటైల్‌ద్రవ్యోల్బణం వడ్డీరేట్లను తగ్గించే అవకాశం కల్పించిందన్నారు. వినియోగరంగ ఉత్పత్తులదరలు 4.20శాతం అక్టోబరులో పెరిగాయి. 14నెలల కనిష్టంలో ఉన్నాయి. అయితే అమెరికాలో వడ్డీరేట్లు పెరిగితే ఆర్‌బిఐ ఫిబ్రవరివరకూ యధాతథµ స్థితి కొనసాగిస్తుందని ఆర్థిక వేత్తల అంచనా. ఏసియన్‌పెయింట్స్‌ గతంలో 20శాతం నష్టాల నుంచి రికవరీ అయి ఐదుశాతం లాభపడింది. ఐటి ఎగుమతిదారులు రాబడుల వృద్ధిని తగ్గించడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది. టాటాగ్రూప్‌ కంపెనీ టిసిఎస్‌ 3శాతంపెరిగితే ఇన్ఫోసిస్‌ రెండుశాతం పెరిగింది. ఆటో, ఆర్థికరంగం, వినియోగరంగ ఉత్పత్తుల కంపెనీలషేర్లు రికవరీలోఉన్నాయి. దిగువస్థాయిలో స్వల్ప స్థాయి కొనుగోల్లు జరిగాయి. టాటాగ్లోబల్‌ బేవరేజెస్‌ 7.1శాతంపెరిగాయి. ఇక జెఎం ఫైనాన్షియల్‌ షేర్లు ఐదు శాతం ఇంట్రాడేలో పెరిగాయి. కంపెనీ అనుబంధ సంస్థ జెఎంఫైనాన్షియల్‌ ప్రొడక్ట్సు ఇండియా హోమ్‌లోన్‌ సంస్థ లో 1.9మిలియన్‌షేర్లను కొనుగోలుచేసింది. 17శాతం వాటాలు సాధించింది. కంపెనీ షేర్లు గడచిన నటాలు గ్రేటింగ్‌లలో 23శాతం దిగజారాయి. ఇక గ్లోబల్‌ బాండ్ల మార్కెట్‌లో భారీ పెరుగుదల కనిపించింది. మోర్గాన్‌స్టాన్లీ కేపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఆసియా పసిఫిక్‌షేర్లు జపాన్‌ బైటిప్రాంతంలో 0.6శాతం పెరిగాయి. జపాన్‌ నిక్కీ 1.1శాతం పెరిగింది. చైనా షాంఘై కాంపోజిట్‌, హాం కాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ సూచీలు ప్రతికూలంగా ముగిసాయి. యూరోపియన్‌ షేర్లపరంగాచూస్తే బుధవారం ఉత్పత్తి అనుబంధ రంగాల షేర్లు మందగించాయి. స్టాక్స్‌ 600జాబితా 0.6శాతం పెరిగింది. 5.2శాతం బేయ ర్‌ దిగజారింది. జర్మనీ డాక్స్‌సూచీలో భారం పెం చింది. యూరోపియన్‌ మార్కెట్లలో ఎక్కువశాతం నిల కడగాను మందగమనంతోనే ముగిసినట్లు అంచనా.
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అమ్మాయిల ఐపీఎల్ మ్యాచ్ ఆకట్టుకునేనా..? ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న టోర్నీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గత పదేళ్ల నుంచి కొనసాగుతోంది. ఈ టోర్నీకి పోటీగా చాలా Samayam Telugu | Updated: May 21, 2018, 08:32PM IST అమ్మాయిల ఐపీఎల్ మ్యాచ్ ఆకట్టుకునేనా..? ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న టోర్నీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గత పదేళ్ల నుంచి కొనసాగుతోంది. ఈ టోర్నీకి పోటీగా చాలా దేశాలు సరికొత్త హంగులతో లీగ్‌లను తెరపైకి తెచ్చినప్పటికీ.. ఐపీఎల్ తరహాలో అవి ఏవీ క్లిక్ కాలేదు. 2008లో బీసీసీఐ ఈ ఐపీఎల్‌ని ప్రవేశపెట్టగా.. ఈ ఏడాది 11వ సీజన్‌ కొనసాగుతోంది. ఈ తరహాలోనే మహిళలకి కూడా ఓ ఐపీఎల్‌ని నిర్వహించాలని గత కొంతకాలంగా వినతులు వస్తున్న నేపథ్యంలో.. బీసీసీఐ ఆ దిశగా అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం వాంఖడే వేదికగా ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను నిర్వహించనుంది. రాత్రి 7 గంటలకి సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుండగా.. అంతకంటే ముందు.. అంటే మధ్యాహ్నం 2.30 గంటలకి ఈ మ్యాచ్‌ జరగనుంది.
2sports
Suresh 114 Views tea తేయాకు తోటల్లో ఉత్పత్తి మాంద్యం కోల్‌కతా, ఆగస్టు 7: గూర్ఖాలాండ్‌ ఉద్యమం ఫలితంగా డార్జిలింగ్‌ టీ ఎస్టేట్‌లు మొత్తం ఆర్థికమాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గడచిన జూన్‌ 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకారణంగా టీ తోటల్లో పనులులేవు. డార్జిలింగ్‌ టీ సముదాయాలు కూడా ఈ సమ్మెకారణంగా మూతపడ్డాయి. తేయాకు తోటల చరిత్రలో మొదటిసారిగా డార్జిలింగ్‌ టీ ఎస్టేట్‌లు రెండునెలల పాటు మూత పడటం విస్మయం కలిగిస్తోంది.ఉత్పత్తి నిలిచిపోవడంతో మార్కెట్‌ లో డార్జిలింగ్‌ తేయాకు లేనేలేదు. మూసివేతకు ముందు టీఎస్టేట్లు 30శాతం ఉత్పత్తినిసాధించేవి. డార్జిలింగ్‌ టీ అసోసియే షన్‌ ముఖ్యసలహాదారు సందీప్‌ముఖర్జీ అంచనాలప్రకారం మొత్తం ఈ రెండునెలల్లోను వార్షిక ఉత్పత్తిలో 30శాతం దెబ్బ తిన్నట్లు అంచనావేసారు. గత ఏడాది డార్జిలింగ్‌ టీ 8.45 మిలి యన్‌ కిలోలను ఉత్పత్తిచేసింది. డార్జిలింగ్‌ తేయాకు ఎస్టేట్‌లలో నాలుగుసీజన్లు ఉంటాయి. మొదటిది, రెండోది, రుతుపవనాలు, వేసవి సీజన్లుగా ఉంటాయి. మొదటిసీజన్‌ ఫిబ్రవరి మధ్యస్తం నుంచి ఏప్రిల్‌ చివరివరకూ ఉంటుంది. రెండోసీజన్‌ మేమధ్యస్తం నుంచి జూన్‌ చివరివరకూ ఉంటుంది. ఈ రెండుసీజన్ల తేయాకునే ఎక్కువగా ఎగుమతిచేస్తారు. డార్జిలింగ్‌ టీకి ఈరాబడులు ఏడాది కాలం అక్కరకు వస్తాయి. తేయాకుతోటలపరంగా రెండోప్రీమి యం తేయాకును ఉత్పత్తి తీయలేవు. రెండోసారి వచ్చేతేయాకును పూర్తిగా ధ్వంసంచేస్తారు. ప్రస్తుతంప్రపంచం మొత్తం డార్జిలింగ్‌ టీ మార్కెట్‌ పడిపోయింది. ఉత్పత్తిలో కోత ఇందుకు ప్రధాన కారణం. వేలం సంస్థల వద్ద కూడా నిల్వలు కరిగిపోవడంతో ధరలు ప్రీమియంకు వెళ్లాయి. పరిశ్రమపరంగా ఇప్పటివరకూ రూ.250 కోట్లు నష్టం చవిచూసిందని సలహాదారు వెల్లడించారు. డార్జిలింగ్‌టీకి గతంలో రూ.500 కిలోకు ధరలుగా ఉన్నాయి. కిలోకు ఇపుడు రూ.1000గా విక్రయిస్తున్నారు. మొదటిగ్రేడ్‌ తేయాకు డార్జిలింగ్‌టీ గత ఏడాది కిలో ఒక్కటి రూ.1000గా ధరలు పలికింది. ప్రస్తుతం కిలోకు రూ.2వేలు ధర పలుకు తోంది. నాసరికరం తేయాకు కూడా కిలో ఒక్కింటికి రూ.500 నుంచి రూ.800కి పెరిగిందని కోల్‌కత్తా టీట్రేడర్స్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ అన్షుమన్‌ కనోరియా వెల్లడించారు. డార్జిలింగ్‌ టీ ఎస్టేట్స్‌ మూసివేత వల్ల ఎగుమతి ఆర్డర్లు నష్టపోతున్నామని అన్నారు. దీనివల్ల ఈ లోటును కొనుగోలుదారులు నేపాల్‌, చైనా, శ్రీలంకల నుంచి కొనుగోలుచేసి భర్తీ చేస్తున్నారు. డార్జిలింగ్‌ టీకి ఉన్న ప్రతిష్ట మొత్తం అడుగంటిపోతోందని కనోరియా వెల్లడించారు. డార్జిలింగ్‌ కొండకోనల్లో మొత్తం 87 తేయాకుతోటలు పెరుగు తున్నాయి. డార్జిలింగ్‌ తేయాకును 50 దేశాలు కొనుగోలు చేస్తున్నాయి వాటిలో యూరోపియన్‌ యూనియన్‌కూడా ఉంది. మూసివేత కారణంగా ఈ ఆర్డర్లు నష్ట పోతున్నట్లు ముఖర్జీ వెల్లడించారు. మూసివేత కారణంగా కార్మికులు సైతం ఉపాధి కోల్పోతున్నారు. 60వేలమందికి పైగా శాశ్వత కార్మికులు, 40వేలమందికి పైగా సీజనల్‌ కార్మి కులు పనిచేస్తున్నారు. మొత్తం 87కిపైగా ఉన్న ట్లీ ప్లాంటేషన్లలో నాలుగులక్షలమంది ఆధారపడి నివసిస్తు న్నట్లు అంచనా. డార్జిలింగ్‌ ఫరిసరాల్లో 17,500 హెక్టార్ల ఆయకట్టులో తేయాకు సాగవుతోంది. సమ్మెలు, సమస్యల కార ణంగా ఈ ఏడాది కనీసం పదిశాతం ఉత్పత్తిని కూడా రాబట్టలేమని డార్జి లింగ్‌లో 13 తోటల అధినేత చమన్‌గ్రూప్‌ ఛైర్మన్‌ అశోక్‌ లోహియా వెల్లడించారు. మొత్తం మీద డార్జి లింగ్‌లో గూర్ఖాల్యాండ్‌ ఉద్యమం వల్ల తేయాకు తోటల్లో పనులు స్తంభించిపోయాయి. ఫలితంగా ఉత్పత్తి మందగించింది.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV దాని గురించి ఆందోళ‌న అక్క‌ర్లేదు: గార్గ్‌ సీఐఐ స‌మావేశంలో ఆర్థిక వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి గార్గ్ మాట్లాడుతూ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కరెంటు ఖాతా లోటు (సీఏడీ) 2.5 శాతంగా ఉన్న‌ప్ప‌టికీ ఆందోళన చెందవలసిన అవసరం లేదని దాన్ని ఎదుర్కొనే స‌త్తా భార‌త్‌కు ఉంద‌న్నారు. Samayam Telugu | Updated: Jun 20, 2018, 10:29AM IST దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కరెంటు ఖాతా లోటు (సీఏడీ) 2.5 శాతంగా ఉన్న‌ప్ప‌టికీ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, విదేశీ నిధులు తరలిపోవడం వల్ల ఏదైనా అసమతుల్యత ఏర్పడితే, దానిని చక్కదిద్దడానికి అవసరమైన పరిష్కారం ప్రభుత్వం వద్ద ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. జీడీపీ వృద్ధిలో త‌లెత్తే చిన్న‌పాటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనే స‌త్తా భార‌త్‌కు ఉంద‌న్నారు. ‘2 శాతం నుంచి 2.5 శాతం వరకు సీఏడీ వల్ల మాకు ఎలాంటి సమస్య ఉండదు. స్థిరత్వం ఉంటే, జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రస్తుత సంవత్సర క్యాపిటల్ అకౌంట్ (ఇన్‌ఫ్లోస్) బాగుండి తీరాలి. అప్పుడు కరెంటు ఖాతా లోటు 2.5 శాతానికి పెరిగినా ఇబ్బంది ఉండదు’ అని గార్గ్ మంగళవారం ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. క‌రెంటు ఖాతా లోటు విదేశీ మారకద్రవ్యం రాక, పోకలకు మధ్య గల వ్యత్యాసమే కరెంటు ఖాతా లోటు. ఈ కరెంటు ఖాతా లోటు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 48.7 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. అంటే జీడీపీలో 1.9 శాతానికి చేరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఉన్న దేశ కరెంటు ఖాతా లోటు 14.4 బిలియన్ డాలర్ల (జీడీపీలో 0.6 శాతం)తో పోలిస్తే బాగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ తగ్గిపోవడం, ఫారిన్ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు తరలిపోవడం వంటి వాటివల్ల కరెంటు ఖాతా లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత పెరుగుతుందేమోననే ఆందోళన నెలకొని ఉంది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV పెళ్లికి పిలుస్తావ్ కదా.. కూతురితో తండ్రి పాపులర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. దర్శకుడు ఎన్ శంకర్ శిష్యుడు ప్రతాప్ తాతంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రిద్ధి కుమార్, రాధాలు హీరోయిన్లుగా నటించారు. Samayam Telugu | Updated: Oct 27, 2018, 06:24PM IST పెళ్లికి పిలుస్తావ్ కదా.. కూతురితో తండ్రి చేతిలో కళ పెట్టుకుని చంద్రకళ కోసం వెంటబడే కుర్రాడు ‘అనగనగా ఓ ప్రేమకథ’ అంటూ రొటీన్ లవ్ స్టోరీని వినిపిస్తున్నాడు. పాపులర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. దర్శకుడు ఎన్ శంకర్ శిష్యుడు ప్రతాప్ తాతంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రిద్ధి కుమార్, రాధాలు హీరోయిన్లుగా నటించారు. ఈ టీజర్ విషయానికి వస్తే.. తొలిచూపులో అమ్మాయి ప్రేమలో పడటం, ఎలాగోలా అమ్మాయిప్రేమను సాధించడం.. పెళ్లికి అమ్మాయి తండ్రి అడ్డు చెప్పి విలన్‌గా మారడం.. చివర్లో ఫైట్ చేసి హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం. సింపుల్‌గా ఇదే ‘అనగగనగా ఓ ప్రేమ కథ’ సినిమా అని టీజర్‌ని బట్టి ఓ అంచనాకు వచ్చేయొచ్చు. ‘పెళ్లికి చెప్తావా? అని తండ్రి కూతుర్ని ఆటపట్టించడం.. కూతురు నాన్నా.. అంటూ అలగడం’ ఆసక్తికరంగా ఉంది. అయితే డెబ్యూ అంటే కాస్త రొటీన్‌కి భిన్నంగా పాత చింతకాయ కథలకు దూరంగా ఉండటం ఎందుకు దండగ అనుకున్నాడో ఏమో కాని దర్శకుడు రొటీన్ కమర్షియల్ కథనే మళ్లీ కొత్త జాడీలో పెట్టి చూపిస్తున్నారు. ‘అనుబంధాలు ఉన్న సంబంధం చూడమన్నా.. అక్రమ సంబంధం ఉన్న సంబంధం చూడమననేదు’ అంటూ కమెడియన్ వేణు జబర్దస్త్ స్థాయి జోక్‌లు పేల్చే ప్రయత్నం చేశారు. అయితే టెక్నికల్ పరంగా టీజర్ చాలా రిచ్‌గా ఉంది. విదేశీ లొకేషన్స్ చాలా గ్రాండ్ లుక్‌లో ఉన్నాయి. స్టంట్స్ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సింది.. బక్కపలచగా ఉన్న హీరో ఎగెరెగిరి మరీ విలన్లను చితక్కొట్టేయడం రియలస్టిక్‌కి దూరంగా ఉంది. కె.సి అంజన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్ X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
వర్మ జీఎస్టీ 2 కు మియా మల్కోవాను మించిన అందగత్తె Highlights జీఎస్టీ 2 కు రెడీ అవుతున్న వర్మ మియా మల్కోవా కంటే అందగత్తెతో జీఎస్టీ 2 గదిలో చేసేది సినిమాగానా అంటూ విమర్శలు  దీంతో ఈసారి మంచి ఐలాండ్ లో తీస్తానంటున్న వర్మ నాలుగు గోడల మధ్య జరిగే శృంగారాన్ని సినిమాగా తీస్తారా అంటూ రామ్ గోపాల్ వర్మ జీఎస్టీపై మహిళా సంఘాలు, సంప్రదాయవాదులు మండిపడుతుంటే వీరికి ఇంత కాలం ధీటుగా బదులిస్తూ వచ్చాడు వర్మ. తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు, తిట్లు, ఆందోళనలు, కేసులతో చిర్రెత్తుకొచ్చిందో ఏమో గాని... వర్మ ఏకంగా జీఎస్టీ 2 సినిమాను బహిరంగ ప్రదేశంలోనే చిత్రీకరిస్తానని ప్రకటించేశాడు.   జీఎస్టీ సినిమాను యూరప్ లో షూట్ చేసినట్లు గానే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ 2ను... అద్భుతమైన ముత్యాల దీవిలో మెత్తటి ఇసుక తిన్నెల మీద షూట్ చేస్తానని ప్రకటించారు. చిత్ర నిర్మాణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. అయితే ఈ సినిమాను మియామాల్కోవాతో నిర్మిస్తారా లేదంటే ఆమెను మించిన అందగత్తెను ప్రేక్షకులకు పరిచయం చేస్తారా అనేది వేచి చూడాలి.  సమాజం ద్వారా అణిచివేయబడ్డ స్త్రీలోని సహజమైన శృంగార భావాలను జీఎస్టీ సినిమాలో చిత్రీకరించిన వర్మ... మరి ఈసారి ఏ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని జీఎస్టీ 2 నిర్మిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కిందటి సారి మియామాల్కోవా అందాలకు కిరవాణి సంగీతం జతకలిసి రక్తి కట్టించింది. మరి ఈసారి ఎవరు సంగీతాన్ని అందిస్తారనేది కూడా హాట్ టాప్ గా మారింది. #StrikeForceGst is planning the shoot of God, Sex and Truth 2 in an exotic Island in sharp contrast to the first God,Sex and Truth which was shot completley indoors #GodSexTruth — Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2018 Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
Suresh 99 Views Roelant Oltmans Roelant Oltmans దిల్లీ: హాకీ జాతీయ కోచ్‌ రోయిలెంట్‌ ఓల్ట్‌మన్స్‌కు హాకీ ఇండియా ఉద్వాసన. అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన ప్రదర్శన లేకపోవడం కారణమని సమాచారం. నూతన కోచ్‌ను ఎంపిక చేపే వరకు హై పెర్పామెన్స్‌ సంచాలకుడు డేవిడ్‌ జాన్‌ జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు. మూడు రోజులుగా హాకీ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన, అభివృద్ధి కమిటీ సమావేశం ముగింపున ఈ నిర్ణయం వెలువడింది. హాకీ జట్టు ఫిట్‌నెస్‌, సమన్వయ పెంచడంలో ఓల్ట్‌మన్స్‌ పాత్ర ఉత్తమంగా ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు, విజయాల్లో నిలకడ లోపం ఎక్కువగా ఉన్నట్లు హాకీ ఇండియా గ్రహించింది. 2016, 17సంవత్సరాల్లో జట్టు ప్రదర్శన బాగానే కనిపిస్తున్నా ఆసియా కప్‌ గెలవడమే బెంచ్‌మార్క్‌్‌ కాదని సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ హర్బిందర్‌ సింగ్‌ వెల్లడించారు. 2018 ఆసియా క్రీడలు, ప్రపంచ కప్‌, 2020 ఒలింపిక్‌ క్రీడల సందర్భంగా ఇప్పుడు కఠిన చర్య తీసుకోక తప్పలేదన్నారు.
2sports
Visit Site Recommended byColombia తాజాగా మెగా హీరో రాంచరణ్‌ కూడా తుఫాన్ బాధితులకు అండగా నిలిచారు. తిత్లీ తుఫాన్ ప్రభావానికి గురైన ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘తిత్లీ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటన సందర్భంగా బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నాకు సూచించారు. గ్రామాన్ని దత్తత తీసుకుని బాధితులకు నా వంతు సాయం చేసేందుకు నా పేరును సూచించిన బాబాయ్‌కి ధన్యవాదాలు. ఈ విషయంపై మా టీమ్‌తో చర్చించా. త్వరలో దత్తత గ్రామం వివరాలు వెల్లడిస్తానని’ రాంచరణ్ పోస్ట్ చేశారు. కాగా తుఫాన్ బాధితుల సహాయార్థం బాలకృష్ణ, అల్లు అర్జున్‌లు రూ. 25 లక్షల చొప్పున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.15 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ.5 లక్షలు, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ రూ. 5 లక్షల చొప్పున, కొరటాల శివ రూ. 3 లక్షలు, సంపూర్ణేశ్ బాబు రూ. 50 వేలు అందజేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) తమ వంతు సాయంగా 5 లక్షల విరాళం ఇచ్చింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
balakrishna to do a movie titled ramarao garu? బాలయ్య 103: రామారావు గారు..? ‘పైసావసూల్’ తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమా ఏది? అంటే.. TNN | Updated: Sep 4, 2017, 02:58PM IST ‘పైసావసూల్’ తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమా ఏది? అంటే.. ఆసక్తిదాయకమైన టైటిల్ వినిపిస్తోంది. బాలయ్య 103వ సినిమాగా రూపొందే దాని టైటిల్ పేరు ‘రామారావు గారు’ అనే మాట వినిపిస్తోంది. ఆసక్తి రేపుతున్న ఈ టైటిల్ కు సంబంధించిన కథను ఇప్పటికే బాలయ్యకు వివరించాడట దర్శకుడు అనిల్ రావిపూడి . ఇది వరకూ కల్యాణ్ రామ్ తో ‘పటాస్’ వంటి హిట్ ను కొట్టిన ఈ దర్శకుడు బాలయ్య కోసం ‘రామారావు గారు’ కథను తయారు చేసుకున్నాడట. టైటిల్ ఇలా ఉన్నా.. ఇది ఎన్టీఆర్ బయోపిక్ కాదు. ఇదో ఎంటర్టైనర్ అని, బాలయ్య ఇమేజ్ కు తగిన కథ అని తెలుస్తోంది. కథాంశం బాలయ్యకు నచ్చిందని, పూర్తి స్థాయి స్క్రిప్ట్ పూర్తి అయ్యాకా ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. తండ్రి పేరు మీద బాలయ్య సినిమా చేస్తే.. దానిపై అంచనాలు పతాక స్థాయికి చేరతాయని వేరే చెప్పనక్కర్లేదు.
0business
News Room 365 WATCH LIVE TV నాకు ఒంటరిగా వుండాలనుంది నాకు ఒంటరిగా వుండాలనుంది అంటున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. TNN | Updated: Jul 29, 2015, 05:30PM IST నాకు ఒంటరిగా వుండాలనుంది అంటున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ . పంజాబ్ లో ని గుర్దాస్ పూర్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం, ఆ తర్వాత మాజీ రాష్ర్టపతి ఏపీజే అబ్ధుల్ కలాం ఆకస్మిక మరణం వంటివి షారుఖ్ ని కొంత ఆవేదనకు గురిచేశాయట. అన్నింటికిమించి ఇటీవలే తనతో కలిసి పనిచేస్తున్న ఓ స్పాట్ బాయ్ కూడా చనిపోవడం ఖాన్ పై బాగా ప్రభావం చూపించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వరుసగా ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటుండపట్ల కొంత అప్ సెట్ అయిన షారుఖ్.. తనకు ఒంటరిగా వుండాలని వుంది అని ట్వీట్ చేశాడు. ఎటువంటి బాధలు, సమస్యలు లేనివాళ్లెవరయినా వుంటే వారిని కలవాలనుంది.... కానీ ఈ లోకంలో అలాంటి వాళ్లెవ్వరూ వుండబోరు కనుకే తనకి ఒంటరిగా వుండాలనుంది అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ''చెన్నై ఎక్స్ ప్రెస్'' ఫేమ్ రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న దిల్ వాలే సినిమాలో షారుఖ్ నటిస్తున్నాడు. బల్గేరియాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
0business
Hyderabad, First Published 13, May 2019, 12:38 PM IST Highlights సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ముగ్గురు నిర్మాతలు దిల్ రాజు, పివిపి, అశ్వనీదత్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. తొలి వారంలో మొత్తం నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా రూ.47.89 కోట్ల షేర్ ని రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.8.08 కోట్లు రాబట్టింది. తొలిరోజే రూ.24 కోట్ల షేర్ ని రాబట్టిన ఈ సినిమా లాంగ్ వీకెండ్ ని మాత్రం సరిగ్గా వినియోగించుకోలేకపోయిందనే  కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఓవర్సీస్ లో కూడా మొదటి రెండు రోజులు బాగానే వసూళ్లు వచ్చినప్పటికీ ఇప్పటికి మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సమాచారం. సినిమాకి మిశ్రమ స్పందన రావడం, సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ ఎక్కువ కావడమే దానికి కారణాలుగా చెబుతున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆశిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!  Last Updated 13, May 2019, 12:38 PM IST
0business
Tax రూ.448.02 కోట్ల పన్నుబకాయి న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుశాఖ మొత్తం 29 సంస్థల బకాయి పడిన జాబితానుప్రకటించింది. మొత్తం 448.02కోట్ల రూపాయలు పన్నుల రూపం లో బకాయిపడినట్లు ఐటిశాఖ వెల్లడించింది. నేమ్‌ అండ్‌షేమ్‌ విధానంలో పన్నుబకాయిలను రాబట్టేందు కు ఐటిశాఖ కసరత్తులు ముమ్మరంచేసింది. పెద్ద మొత్తం బకాయిదారులపై ముందు దృష్టిసారించిన ఐటిశాఖ 29 మంది పేర్లను వెల్లడించింది. జాతీయ స్థాయి దినపత్రికల్లో వ్యాపారప్రకటనలు కూడా జారీ చేసింది. ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నులు బకా యి ఉన్నట్లు తేలింది. వెంటనే బకాయిలతో సహా చెల్లించాలని వారికి సూచించింది. ఈశాఖ తనకసరత్తులను మరింతగా ముందు కు తీసుకువెళుతు కనీసం 67కుపైగా ఇలాంటి సంస్థలు భారీ మొత్తం పన్ను బకాయిలు పడినట్లు చెపుతున్నారు. వీరంతా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న ఆచూకీ తెలియడంలేదు. అలాగే వారి స్థిరచరాస్తులను సైతం గుర్తించేందుకు అందుబాటులో ఎక్కడా కనిపించకపోవడం విస్మయం కలిగిస్తోంది. పాన్‌కార్డు నంబరుసాయంతో వ్యక్తి లేదా సంస్థల జాబితా లను రూపొందించి బహిర్గతం చేసామన్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు ఐటిశాఖపరంగాచూస్తే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయి దారులను ముందుగానే గుర్తించి వారిపేర్లను బకా యి మొత్తాలను ఫోటోలతో సహా వెల్లడిస్తే వెను వెంటనే వసూలు చేయవచ్చన్న భావనతో ఉంది. తన అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఇప్పటికే వీరి పేర్ల జాబితాను బహిర్గతంచేసిన ఐటిశాఖ ఇకపై ప్రముఖ దినపత్రికల్లో కూడా వీరివివరాలపై ప్రకటనలు జారీచేసివారినుంచి బకాయిలువసూలు చేయడంతో పాటు పన్నులచట్రం నుంచి తప్పించుకోలేనివిధంగా వారిపైఉచ్చు బిగిస్తున్నది.
1entertainment
Hyderabad, First Published 19, Mar 2019, 4:18 PM IST Highlights సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ ల కోసం హీరోలు ఇతర ప్రదేశాలకు వెళ్తుంటారు. లేదంటే హైదరాబాద్ లోనే సెట్ లు వేసి షూటింగ్ కానిచ్చేస్తుంటారు.  సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ ల కోసం హీరోలు ఇతర ప్రదేశాలకు వెళ్తుంటారు. లేదంటే హైదరాబాద్ లోనే సెట్ లు వేసి షూటింగ్ కానిచ్చేస్తుంటారు. చాలా మంది హీరోలు అవుట్ డోర్ షూటింగ్ అంటే పెద్దగా అభ్యంతరం చెప్పరు. స్టార్ హీరోలు సైతం దీనికి అతీతం కాదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం అవుట్ డోర్ షూటింగ్ అంటే రావడానికి మొరాయిస్తున్నాడట. దానికి బదులుగా సెట్ వేయాలని నిర్మాతలను డిమాండ్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 'మహర్షి' సినిమాలో కొన్ని సన్నివేశాలు పల్లెటూరి  నేపధ్యంలో తీయాల్సి వచ్చింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో కానీ, లేదంటే కేరళలో తీయాలని భావించిందట చిత్రబృందం. అయితే మహేష్ బాబు దానికి నో చెప్పినట్లు తెలుస్తోంది. మహేష్ కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పల్లెటూరి సెట్ వేశారు. దానికి కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. సినిమాలో ఓ సన్నివేశం కోసం రాయలసీమ ప్రాంతంలో బీడువారిన భూమిని చూపించాల్సి వచ్చిందట. ఆఖరికి దానికోసం కూడా చాలా ఖర్చు పెట్టి సెట్ వేశారట. మహేష్ లాంటి హీరోలు అవుట్ డోర్ వెళ్తే అక్కడ అభిమానుల తాకిడిని తట్టుకోలేరు. అది నిజమే కానీ దానికోసం కోట్లు, కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతలతో సెట్టింగులు వేయిస్తుండడంఎంత వరకు సబబు. సినిమా హిట్ అయి పెట్టిన మొత్తం తిరిగి వచ్చేస్తే మంచిదే కానీ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయితే ఆ బాధ్యత వహించాల్సింది నిర్మాతే కదా..! Last Updated 19, Mar 2019, 4:18 PM IST
0business
Hyderabad, First Published 23, Mar 2019, 5:11 PM IST Highlights సమీర్ ఖాన్ హీరోగా శైలజ, సునీత పాండే, ఆశీర్వయ్, అర్షత, నందిత, శ్రద్ద హీరోయిన్స్ గా చంద్రశేఖర మూవీస్ పతాకంపై షేర్ దర్శకత్వంలో కె వెంకటరాం రెడ్డి నిర్మించిన సస్పెన్స్ హార్రర్ చిత్రం కెఎస్100. బేబీ పూర్వీ ప్రత్యేక పాత్రలో నటించారు. నవనీత్ చారి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మార్చ్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. సమీర్ ఖాన్ హీరోగా శైలజ, సునీత పాండే, ఆశీర్వయ్, అర్షత, నందిత, శ్రద్ద హీరోయిన్స్ గా చంద్రశేఖర మూవీస్ పతాకంపై షేర్ దర్శకత్వంలో కె వెంకటరాం రెడ్డి నిర్మించిన సస్పెన్స్ హార్రర్ చిత్రం కెఎస్100. బేబీ పూర్వీ ప్రత్యేక పాత్రలో నటించారు. నవనీత్ చారి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మార్చ్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమంలో హీరో సమీర్ ఖాన్, హీరోయిన్స్ ఆశీర్వయ్, అర్షత, నందిత, శ్రద్ద, సంగీత దర్శకుడు నవనీత్ చారి, దర్శకుడు షేర్, నిర్మాత కె వెంకట రామ్ రెడ్డి, విలన్ సుమన్, లయన్ సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.. ప్రత్యేక అతిధి భవారి, సాయి వెంకట్ కెఎస్100 ఆడియో సీడీలను రిలీజ్ చేశారు. మాంగో మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.  అలాగే ఈ కార్యక్రంలో ప్రత్యేక పాత్రలో నటించిన బేబీ పూర్వీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని పోస్టర్ ని రిలీజ్ చేశారు. అనంతరం "కెఎస్100" చిత్రం ప్రోమోస్ ని తెరపై ప్రదర్శించారు.. దర్శకుడు షేర్ మాట్లాడుతూ... ఒక ఆడియన్ గా ఎలాంటి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో నాకు ఒక ఐడియా ఉంది. అలాగే ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా తెరకెక్కించాను. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జోనర్ లో సినిమా ఉంటుంది. యూత్ కి కావాల్సిన రొమాంటిక్ సన్నివేశాలు కూడా చిత్రం లో ఉన్నాయి.  అమ్మాయిలు ప్రస్తుతం సమాజంలో ఏ విధంగా సఫర్ అవుతున్నారు. అనే పాయింట్ తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఇన్ స్పైరింగ్ గా ఈ చిత్రం ఉంటుంది. నటీనటులు అందరూ బాగా చేశారు. గ్యారెంటీ గా ఈ చిత్రం హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది అన్నారు.                             నిర్మాత కె వెంకట రామ్ రెడ్డి మాట్లాడుతూ... షేర్ చెప్పిన స్టోరీ ఇన్స్పైరింగ్ గా ఉండటంతో ఈ సినిమా తీశాను. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది..అన్నారు. లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ... ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా మంది ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పారు. అంత బాగా క్రేజ్ ఉంది ఈ సినిమాకి. దాదాపు 200 థియేటర్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'ఆర్ ఎక్స్100' కంటే ఈ చిత్రం బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను... అన్నారు.  భవారి మాట్లాడుతూ... నా స్నేహితురాలు తనయుడు షేర్ కష్టపడి తీసిన ఈ సినిమా మంచి హిట్ కావాలి. ట్రైలర్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను.. అన్నారు. డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది.. ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాము....అని హీరోయిన్స్ అన్నారు.. Last Updated 23, Mar 2019, 5:20 PM IST
0business
Hyderabad, First Published 13, Aug 2019, 6:09 PM IST Highlights యాక్టర్ గానే కాకుండా చిలసౌ సినిమాతో దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్ సెకండ్ స్టెప్ లో మాత్రం కాస్త తడబడ్డాడు. అక్కినేని నాగార్జున తో చేసిన మన్మథుడు 2 ఉహించినంతగా సక్సెస్ కాలేదు.  యాక్టర్ గానే కాకుండా చిలసౌ సినిమాతో దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్ సెకండ్ స్టెప్ లో మాత్రం కాస్త తడబడ్డాడు. అక్కినేని నాగార్జున తో చేసిన మన్మథుడు 2 ఉహించినంతగా సక్సెస్ కాలేదు. రెండవరోజు కలెక్షన్స్ కూడా ఒక్కసారిగా తగ్గాయి. అయితే రాహుల్ కి చిలసౌ సినిమా చేసిన తరువాత చాలా మంది నిర్మాతల నుంచి ఆఫర్స్ వచ్చాయి.  అందులో నిర్మాత నాగవంశీ కొరికే మేరకు సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో చేయడానికి రాహుల్ ఒప్పుకున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే రాహుల్ నెక్స్ట్ సినిమా నానితోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సితారా బ్యానర్ లో నాని జెర్సీ సినిమా చేసిన సంగతి తెలిసిందే. మరో సినిమా కూడా చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడు. నాని కోసం దర్శకులను వెతుకుతున్న నిర్మాత నాగవంశీ నానిని డైరెక్ట్ చేసే అవకాశం రాహుల్ కి ఇస్తున్నట్లు టాక్ వస్తోంది.  అయితే మన్మథుడు 2 ప్లాప్ కావడంతో నాని రాహుల్ తో వర్క్ చేయడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది సందేహంగా ఉంది. ప్రస్తుతం నాని మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న V సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే గ్యాంగ్ లీడర్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా పనులను నాని పూర్తి చేశాడు. V సినిమా తరువాత నాని సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చేయనున్నాడు.      Last Updated 13, Aug 2019, 6:09 PM IST
0business