news
stringlengths
299
12.4k
class
class label
3 classes
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ధోనీ.. భారత్‌కు అరుదైన ఆరో క్రికెటర్! ఇంతకు ముందు ఇన్ని మ్యాచ్‌లు ఆడింది కేవలం ఐదుగురే.. వారు.. TNN | Updated: Aug 31, 2017, 01:04PM IST కొలంబో వేదికగా నేడు శ్రీలంకతో జరగనున్న వన్డే మ్యాచ్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి 300 మ్యాచ్ అనే అంశం భారతక్రికెట్ అభిమానులకు తెలియనిది ఏమీ కాదు. ధోనీని అమితాభిమానంతో ఆరాధించే, అభిమానించే అభిమానులు ఈ రికార్డు ఫీట్ గురించి అవగాహనతోనే ఉన్నారు. ఇటీవలే.. యువరాజ్ సింగ్ తన కెరీర్ లో మూడు వందల వన్డే మ్యాచ్ లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆ ఫీట్ ను సాధించిన ఐదో భారత క్రికెటర్ గా యువీ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ ఆరో ఆటగాడిగా ఆ జాబితాలో స్థానం సంపాదించబోతున్నాడు. మరి యువీ, ధోనీలకు ముందు కేవలం నలుగురు భారత క్రికెటర్లకే మూడొందలు, అంతకు మించిన సంఖ్యలో మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. ఆ నలుగురు ఎవరంటే.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మహ్మద్ అజారుద్ధీన్, సౌరవ్ గంగూలీ.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Hyderabad, First Published 3, Jul 2019, 1:22 PM IST Highlights బాలీవుడ్ లో బయోపిక్ ల హవా ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా మంది క్రీడాకారుల జీవితాలు తెరపైకి వస్తున్నాయి. ఇక మరో లేడి క్రికెటర్ బయోపిక్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  బాలీవుడ్ లో బయోపిక్ ల హవా ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా మంది క్రీడాకారుల జీవితాలు తెరపైకి వస్తున్నాయి. ఇక మరో లేడి క్రికెటర్ బయోపిక్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాప్సి ఆ ప్రాజెక్ట్ లో దాదాపు ఫిక్స్ అయినట్లే.  రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మిథాలీ రాజ్ బయోపిక్ పై అమ్మడు వివరణ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే మాట్లాడటం సరి కాదని, ప్రాజెక్ట్ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్నట్లు తెలిపింది. ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందంటూ.. ఈ ప్రాజెక్ట్ పై నేను మాట్లాడటం కన్నా వాళ్లు అధికారికంగా చెబితేనే బావుంటుందని తాప్సి ఒక వివరణ ఇచ్చింది.  ఇక నార్త్ మీడియా సమాచారం ప్రకారం సినిమా నెక్స్ట్ ఇయర్ లోనే రిలీజ్ అయ్యే విధంగా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా సినిమాకు దర్శకుడు ఎవరనేది నిర్ణయించలేదు. ప్రముఖ రచయితలతో కలిసి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న సీనియర్ నిర్మాతలిద్దరు సినిమాని నిర్మించేందుకు సిద్ధపడుతున్నట్లు టాక్.  Last Updated 3, Jul 2019, 1:22 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ‘గుంటూరోడు’కి చిరంజీవి వాయిస్ ఓవర్ మంచు మనోజ్ ప్రేమ విషయాలను చిరంజీవి తొలుత ప్రేక్షకులకి చెప్పనున్నాడు... TNN | Updated: Feb 20, 2017, 06:19PM IST మెగాస్టార్ చిరంజీవి తన గళాన్ని యువ హీరోల సినిమాలకి అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. రానా హీరోగా చారిత్రక యుద్ధ నేపథ్యంతో ఇటీవల విడుదలైన ‘ఘాజీ’ కోసం వాయిర్ ఓవర్ చెప్పిన చిరంజీవి.. తాజాగా మంచు మనోచ్ చిత్రం గుంటూరోడుకి కూడా వాయిర్ ఓవర్ ఇచ్చాడట. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ రాక్ స్టార్ మంచు మనోజ్ నటించిన మా చిత్రానికి వాయిర్ ఓవర్ ఇచ్చిన కూలెస్ట్ మెగా స్టార్ చిరంజీవికి ధన్యవాదాలు’ అనే పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో మనోజ్‌కి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుండగా.. సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అనవసర రీట్వీట్‌తో పరువు పోగొట్టుకున్న ఐసీసీ తనకు ఎంత మాత్రం సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకున్న ఐసీసీ చివరకు నారాయణ నారాయణ అంటూ చెంపలేసుకుంది. Samayam Telugu | Updated: Apr 25, 2018, 05:30PM IST అనవసర రీట్వీట్‌తో పరువు పోగొట్టుకున్న ఐసీసీ మైనర్ బాలిక రేప్ కేసులో జోధ్‌పూర్ కోర్టు ఆశారాం బాపూను దోషిగా తేల్చిన వేళ ఐసీసీ అనవసర వివాదంలో తలదూర్చింది. ప్రధాని నరేంద్ర మోదీతో ఆశారాం బాపూ ఉన్న పాత వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి రీట్వీట్ చేసింది. దీనికి ‘‘నారాయణ్ నారాయణ్’’ అనే కామెంట్‌ను జత చేసింది. Visit Site Recommended byColombia ఐసీసీ క్రికెట్ యేతర వ్యవహారాల్లో ఐసీసీ జోక్యం చేసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే అప్రమత్తమై ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. ఈ రోజు ఉదయం క్రికెట్‌కు సంబంధం లేని ట్వీట్‌ను రీ ట్వీట్ చేయడం పట్ల ఐసీసీ క్షమాపణలు చెప్పింది. ఈ ట్వీట్‌ను వెంటనే తొలగించినప్పటికీ.. ఎవరైనా మనస్థాపం చెందితే క్షమించాలని వేడుకుంది. ఈ ఘటన ఎలా జరిగిందో విచారణ చేపట్టనున్నట్టు ట్వీట్ చేసింది. ICC is dismayed at a non-cricket related tweet appearing on its Twitter feed earlier today. We would like to extend… https://t.co/wq40aYzL2T — ICC (@ICC) 1524653797000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Credit cards వ్యక్తిగత రుణాలకు క్రెడిట్‌కార్డు బకాయిల బదిలీ ముంబయి, జూన్‌ 2: జీతాలు పొందే ఉద్యోగులకు ఆన్‌లైన్‌లోనే రుణపరపతిని కల్పించే లోన్‌ట్యాప్‌ డాట్‌ఇన్‌ సంస్థ గడచిన రెండేళ్లుగా విపరీతమైన వ్యక్తిగత రుణాలకోసం సంప్రదించడం కనిపిస్తున్న ట్లు వెల్లడించింది. కేవలం మూడు, నాలుగునెల ల్లోనే 15శాతం వృద్ధిని కనబరిచింది. 30శాతం వ్యక్తిగత రుణాలు కేవలం క్రెడిట్‌కార్డు రుణాలు చెల్లించేందుకు మాత్రమే వినియోగిస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు సత్యంకుమార్‌ పేర్కొన్నారు. వాస్తవానికి వ్యక్తిగత రుణాలు నేరుగా వినియోగ రంగంలో కొనుగోళ్లకు తీసుకుంటారు. పెళ్ళిళ్లు, ఇతర శుభకార్యాలకు సైతం తీసుకుంటారు. ఎక్కు వ సందర్భాల్లో వ్యక్తిగత రుణాలను తమవద్ద పెరు గుతున్న రుణభారం తగ్గించుకునేందుకు కూడా తీసుకుంటుంటారు. వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీ రేట్లకు అందుతాయి. దీర్ఘకాలంలో తిరిగి చెల్లించే అవకాశం ఉండటంతో ఎక్కువ ఒత్తిడి ఉండదు. నెలవారీ చెల్లింపులకు అవకాశం ఉంటుందని కుమార్‌ వెల్లడించారు. క్రెడిట్‌కార్డుపై ఉన్న కనీస చెల్లింపుల బకాయిని సైతం చెల్లించలేని వారికి ఈ నిల్వలను వ్యక్తిగత రుణానికి బదలాయించే అవ కాశం ఉంటుందని, అయితే ఇందుకు కొంత క్రమ శిక్షణ అవసరమని క్రెడిట్‌ మంత్రి వ్యవస్థాపకులు రంజిత్‌ పుంజా వెల్లడించారు. ఎక్కువశాతం క్రెడిట్‌ కార్డు బకాయిలు వ్యక్తిగత రుణాలకు బదలాయించి వాటిని ముందు వదిలించుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నారు. తదనంతరం ఆన్‌లైన్‌ సంస్థ లకు నెలవారీ వాయిదాల్లో చెల్లింపుల కు వస్తున్నా రు. దీనివల్ల వడ్డీరేట్లు కూడా కొంత తగ్గుతుం డటంతో వ్యక్తిగత రుణాలు తీసుకుని ముందు క్రెడిట్‌కార్డు బకాయిలు చెల్లిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి లక్ష రూపా యలు బకాయి ఉంటే నెలవారీగా ఐదువేలు చెల్లిస్తు న్నారు. అయితే ఎక్కువ వడ్డీరేట్ల కారణంగా ఈ నగదు వడ్డీలకే వెళ్లిపోతున్నది. ప్రిన్సిపల్‌ మొత్తం అలాగే ఉంటున్నది. దీనివల్ల కస్టమర్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. క్రెడిట్‌కార్డులపై వడ్డీరేట్లు సహజంగానే 24శాతం, 36శాతం, ఒకదశలో 48 శాతం కూడా ఉంటున్నది. ప్రీమియంకస్టమర్లకు మాత్రం క్రెడిట్‌కార్డు పరిమితుల ఆధారంగా తక్కువ వడ్డీకి ఆఫర్‌చేస్తున్నాయి. వడ్డీకే ఈ వాయి దాలు పోతుంటే లక్షరూపాయల అసలు మాత్రం అదేరీతిలో కొనసాగుతుండటంతో బకాయిలు పేరు కుంటున్నాయి. ఇక పొదుపు రంగంలో వడ్డీరేట్లు వార్షిక పద్ధతిలో చూస్తే 17-18శాతంగా ఉంటుం ది. వార్షికంగా 24-25శాతంగా ఉంటుంది. వ్యక్తి గత రుణాలకు 18-24శాతం వడ్డీతోపాటు రుణ పరపతి సామర్ధ్యంపై కూడా వడ్డీ ఆధారపడి ఉం టుంది. క్రెడిట్‌కార్డు రుణం 48శాతం వడ్డీకంటే వ్యక్తిగతరుణంపై 24శాతం వడ్డీరేటు ఎంతో గిట్టు బాటు అవుతున్నందున ఎక్కువశాతం కస్టమర్లు క్రెడిట్‌కార్డు రుణాలు చెల్లించుకునేందుకు వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తున్నారు. క్రెడిట్‌కార్డు బకాయి లను వ్యక్తిగత రుణానికి బదలాయించడం వల్ల క్రెడిట్‌ స్కోరు కూడా మెరుగుపడుతుంది. అయితే బ్యాంకులు మాత్రం ఇందుకు రుణాలిచ్చేందుకు సుముఖంగా ఉండవు. అందువల్లనే ఆన్‌లైన్‌ రుణ పరపతి సంస్థలవైపు జీతాల ఉద్యోగులు మొగ్గు చూపిస్తున్నారు. సులువైన పద్దతుల్లో రుణంపొంది వాటిని క్రెడిట్‌కార్డు బకాయిలకు చెల్లించి నెలవారీ వాయిదాల్లో ఆన్‌లైన్‌ రుణాలు చెల్లించుకుంటున్నా రు. ఈవిధానంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌ రుణపరపతి సంస్థలకువ్యక్తిగతరుణం మంజూరుకోసం వచ్చే సంప్రదింపులు రెట్టింపవ్ఞతున్నట్లు తెలుస్తోంది.
1entertainment
Badminton Player jayaram క్వార్టర్‌ ఫైనల్‌కు కశ్యప్‌, జయరాం ఆల్మెరె: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అజ§్‌ు జయరాం, పారుపల్లి కశ్యప్‌లు నెదర్లాండ్స్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరకున్నారు. గురువారం జరిగిన పురుషలు సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో జయరాం 21-7, 21-9 తేడాతో బల్గేరియా ఆటగాడు ఫిలప్‌ షిసోవ్‌పై , మరో మ్యాచ్‌లో కశ్యప్‌ 21-11, 17-21, 21-10 తేడాతో డెన్మార్క్‌కు చెందిన రాస్మస్‌ పై విజయం సాధించారు.
2sports
అదే నిజమైతే మెగా డాటర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే..! Highlights అదే నిజమైతే మెగా డాటర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే..! టాలీవుడ్ పరిశ్రమకు చెందిన కొణిదల వారి అమ్మాయి నిహారిక ఒక మనసు చిత్రంతో నటిగా మారింది. తొలి ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా కూడా నిహారిక నటిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒక మనసు చిత్రం తరువాత నిహారిక ఆచి తూచి అడుగులు వేస్తోంది. కేవలం తెలుగులో మాత్రమే కాక తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది.   ఇప్పుడిప్పుడే నటిగా రాణిస్తున్న మెగా డాటర్ నిహారికకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. తన పెదనాన్న, మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నిహారికకు ప్రత్యేక పాత్రలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.   కొణిదల కుటుంబం నుంచి నటిగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి నటి నిహారిక. ఒక మనసు చిత్రంతో నిహారిక హీరోయిన్ గా మారింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ నిహారికకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నిహారిక కేవలం తెలుగు చిత్రాల్లోనే కాక తమిళ చిత్రాల్లో సైతం నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే తెలుగులో సుమంత్ అశ్విన్ సరసన హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో నటిస్తోంది.   నిహారిక తాజాగా ఓ బంపర్ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు నిహారికకు అవకాశం వచ్చిందనేది ఈ వార్తల సారాంశం. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చా సుదీప్ తదితర ప్రముఖ నటులు సైరా చిత్రంలో నటిస్తున్నారు.   సైరా చిత్రంలో నటించే అవకాశం రావడం నిహారిక కెరీర్ కు పెద్ద బూస్ట్ అని అంటున్నారు. నిహారిక ఈ చిత్రంలో ఎలాంటి రోల్ లో కనిపించబోతోంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది. నిహారిక రోల్ ఖాయమైతే సైరా చిత్రం గురించి మెగా అభిమానుల్లో జోరుగా చర్చ జరగడం ఖాయం.   ఇక సైరాను అత్యద్భుతంగా తీర్చిదిద్ది అభిమానులని రంజింపజేయాలని నిర్మాత రాంచరణ్ భావిస్తునాడు. సైరా చిత్రం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఖర్చు ఎంతైనా వెనకాడకుండా బాహుబలి తరహాలో అద్భుత దృశ్యకావ్యాన్ని తెరకెక్కించాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నారు. Last Updated 4, Apr 2018, 1:57 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ​ పాకిస్థాన్ ఓపెనర్లపై నిషేధం వేటు..? స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడిన పాకిస్థాన్ సీనియర్ ఓపెనర్లు షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్‌లపై నిషేధం వేటు TNN | Updated: Aug 29, 2017, 03:11PM IST స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడిన పాకిస్థాన్ సీనియర్ ఓపెనర్లు షర్జీల్ ఖాన్ , ఖలీద్ లతీఫ్‌లపై నిషేధం వేటు దగ్గర్లో పడనుందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ తరహాలో పాక్ నిర్వహించిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఈ ఇద్దరు ఓపెనర్లు స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ తేల్చింది. అప్పట్లో దాదాపు ఐదు మంది ప్రధాన క్రికెటర్లపై ఆరోపణలు రాగా.. ప్రస్తుతం ఈ ఓపెనర్ల చుట్టూ భారీగా ఉచ్చు బిగిసింది. ‘షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్‌‌లపై నిషేధం వేటు తప్పదు. వారి భవితవ్యం త్వరలోనే తేలిపోతుంది’ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ ఇద్దరు క్రికెటర్లకి కనీసం 2-5ఏళ్లలోపు నిషేధం వేటు తప్పదని.. దీంతో పాటు అదనంగా రూ.20 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముందని మాజీ జడ్జి ఒకరు వెల్లడించారు. టోర్నీ ఆరంభంలోనే ఫిక్సింగ్ పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో వేగంగా ఆధారాలు సేకరించిన పాక్ బోర్డు.. వెంటనే ఈ ఇద్దరు క్రికెటర్లను దుబాయ్ నుంచి స్వదేశానికి పంపించేసింది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆఖరి బంతి మ్యాజిక్.. కివీస్‌పై ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ ఆఖరి బంతికి ఫోర్ కొడితే టై, సిక్స్ కొడితే విన్. క్రీజ్‌లో కెప్టెన్ విలియమ్సన్. కానీ అద్భుత బంతితో ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించిన క్రిస్ వోక్స్. TNN | Updated: Mar 3, 2018, 05:30PM IST ఆఖరి బంతి మ్యాజిక్.. కివీస్‌పై ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. కెప్టెన్ విలియ్సమన్ ఆఖరి వరకూ పోరాడినప్పటికీ.. కివీస్ విజయం ముందు బోల్తాపడింది. ఇన్నింగ్స్ చివరి బంతికి న్యూజిలాండ్‌కు ఐదు పరుగులు అవసరమైన దశలో.. వికెట్లకు దూరంగా క్రిస్ వోక్స్ విసిరిన యార్కర్‌ను ఆడటంలో విలియమ్సన్ విఫలమయ్యాడు. సెంచరీతో అజేయంగా నిలిచినప్పటికీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. Visit Site Recommended byColombia టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటయ్యింది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్ మీద లక్ష్య చేధనకు దిగిన కివీస్ 12 పరుగులకే ఓపెనర్ గప్టిల్ వికెట్‌ను కోల్పోయింది. కానీ మున్రో (49), విలియ్సమన్ (112 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. మున్రో అవుటయ్యాక మిడిలార్డర్ నిరాశపర్చడంతో.. న్యూజిలాండ్ జట్టు 103 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో విలియమ్సన్ అజేయ సెంచరీతో పోరాడాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. చివర్లో శాంట్నర్ (41) సాయంతో జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ 45.2 ఓవర్లలో విజయానికి 35 పరుగుల దూరంలో శాంట్నర్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. కివీస్ విజయానికి ఆఖరి ఓవర్లో 15 రన్స్ అవసరమయ్యాయి. వోక్స్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి విలియమ్సన్ రెండు పరుగులు రాబట్టాడు. మూడో బంతికి సిక్స్ బాది విజయంపై ఆశలు రేపాడు. నాలుగో బంతికి రెండు పరుగులు చేసిన అతడు.. ఐదో బంతికి పరుగులు చేయలేకపోయాడు. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో.. వోక్స్ వికెట్‌కు దూరంగా విసిరిన యార్కర్‌ను ఆడటంలో విలియమ్సన్ విఫలమయ్యాడు. దీంతో నాలుగు పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ సంబరాల్లో మునిగిపోగా.. ఓటమి బాధలో విలియమ్సన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 14, Mar 2019, 10:33 AM IST Highlights ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్ ని భారత్ కోల్పోయింది. మొదటి రెండు మ్యాచ్ లు టీం ఇండియా గెలుచుకోగా.. మిగిలిన మూడు ఆసిస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్ ని భారత్ కోల్పోయింది. మొదటి రెండు మ్యాచ్ లు టీం ఇండియా గెలుచుకోగా.. మిగిలిన మూడు ఆసిస్ కైవసం చేసుకుంది. దీంతో.. సిరిస్ చేజార్చుకోవాల్సి వచ్చింది. కాగా.. దీనిపై కోహ్లీ స్పందించారు. అనుకున్నదానికంటే 15–20 పరుగులు ఎక్కువే ఇచ్చినా లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం.  ఆసీస్‌కు గెలిచే అర్హత ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో ఒత్తిడిలో వారు పట్టుదలగా నిలబడ్డారు. ఓటమికి సాకులు చెప్పదల్చుకోలేదు. ప్రపంచ కప్‌కు ముందు తప్పులు సరిదిద్దుకునేందుకు ఇలాంటి ఓటములు మంచిదే. సిరీస్‌ ఓడినా గత కొంతకాలంగా మా జట్టు ఆడిన తీరు పట్ల గర్వపడుతున్నా. చివరి మూడు వన్డేల్లో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాం. అయితే ఓటమికి మార్పులు కారణం కాదు. వరల్డ్‌ కప్‌కు ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసం మాలో ఉంది. ఈ ఓటమితో మేం ఏం కుంగిపోవడం లేదు. జట్టు కూర్పుకు సంబంధించి దాదాపుగా ఎలాంటి సమస్యలు లేవు.  మహా అయితే ఒక స్థానం గురించి మాత్రమే కాస్త ఆలోచించాల్సి ఉంది. పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హార్దిక్‌ పాండ్యా పునరాగమనంతో జట్టు బ్యాటింగ్‌ బలపడుతుంది. అలాగే బౌలింగ్‌ విభాగంకు కూడా మద్దతుగా ఉంటుంది. ప్రస్తుత  పరిస్థితుల్లో ప్రపంచకప్‌ బరిలో దిగే ఏ జట్టు హాట్‌ ఫేవరేట్‌ కాదు. మాతో పాటు వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా సమతూకంగా ఉంది. పాకిస్తాన్‌ను తక్కువ అంచనా వేయలేం.’ అని చెప్పుకొచ్చాడు Last Updated 14, Mar 2019, 10:32 AM IST
2sports
17న మా అబ్బాయి గా వస్తున్న శ్రీవిష్ణు Highlights శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ''మా అబ్బాయి' ఈ నెల 17 న విడుదలకు సిద్దమవుతున్న మూవీ ప్రేమ ఇష్క్ కాద‌ల్‌', 'ప్ర‌తినిధి', 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ''మా అబ్బాయి' చిత్రం ఈ నెల 17 న విడుదలకు సిద్దమవుతోంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బేబీ సాక్షి సమర్పణలో కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత బలగ ప్రకాష్ రావు మాట్లాడుతూ - "అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. శ్రీవిష్ణు ఇమేజ్ ని మరింత పెంచే సినిమా అవుతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ అంశాలన్నీ ఈ సినిమా లో పుష్కలంగా ఉన్నాయి. మా వెన్నెల క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాతో ఇండస్ట్రీలో నిలబడిపోతుందనే గట్టి నమ్మకం ఉంది. దర్శకుడు కుమార్ వట్టి కొత్తవాడైనా , అనుభవజ్ఞుడిలా   మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. " అని చెప్పారు. దర్శకుడు కుమార్ వట్టి మాట్లాడుతూ - "ఈ సినిమాలో లవ్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.శ్రీ విష్ణులోని మాస్ యాంగిల్ ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది " అని తెలిపారు. శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః థ‌మ‌శ్యామ్,సంగీతంః సురేష్ బొబ్బిలి, పాట‌లుః కందికొండ‌, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, సురేష్ బ‌నిశెట్టి,  ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంక‌టేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వండాన రామ‌కృష్ణ‌, నిర్మాతః బ‌ల‌గ ప్ర‌కాష్ రావు,క‌థ‌,స్ర్కీన్ ప్లే,మాట‌లు,ద‌ర్శ‌క‌త్వం-కుమార్ వ‌ట్టి.  Last Updated 26, Mar 2018, 12:01 AM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV గిరిజనుల కోసం క్రీడాఅకాడమీలు! మహారాష్ట్రలో గిరిజనుల కోసం ప్రత్యేక క్రీడా అకాడమీలు ప్రారంభం కానున్నాయి. PTI | Updated: Nov 29, 2015, 07:36PM IST గిరిజనుల్లో స్వతహాగా దాగున్న ప్రతిభను వెలికితీసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం ఒకటి తీసుకుంది. వారి కోసం మూడు ప్రత్యేక క్రీడా అకాడమీలను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహా గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి విష్ణు సవర ఈ విషయాన్ని ఆదివారం నాడు వెల్లడించారు. వాటిని ఇగాత్పురి , పల్ఘార్, నదూర్బార్ ప్రాంతాల్లో నెలకొల్పుతామని చెప్పారు.
2sports
నన్ను చూసి మమ్మీ నువ్వు చచ్చిపోవద్దు అంటూ నా కూతురు ఏడ్చింది Highlights నీతోనే డాన్స్ షోతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రేణు దేశాయి షోలో తన అనుభవాలను పంచుకుంటున్న పవన్ మాజీ భార్య రేణు దేశాయి మెడిసిన్ తీసుకుని తాను నిద్రపోతే అమ్మా చచ్చిపోకంటూ కూతురు ఏడ్చిందన్న రేణు పవన్‌ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ చాలా కాలం తర్వాత... ప్రేక్షకుల ముందుకు నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌తో వచ్చిన విషయం తెలిసిందే. పవన్ నుంచి విడిపోయిన తర్వాత జరిగిన ఒక్కో సంఘటనను ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తను చెప్పిన ఓ సంఘటన మాత్రం ప్రతి ఒక్కరికి కళ్లు చెమర్చేలా చేసింది.   కొంతకాలం క్రితం తాను తీవ్రమైన జ్వరం, 'ఆర్థో ఇమ్యూన్ కండిషన్' బారిన పడినప్పుడు కోలుకోవడానికి చాలాకాలం పట్టిందని, అదే సమయంలో గుండెలో సమస్యతో, ఇంటికీ, ఆసుపత్రికీ తిరుగుతూ ఇబ్బందులు పడిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఘటన గురించి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చికిత్సలో భాగంగా మాత్రలు వేసుకోవడంతో గాఢ నిద్రలోకి వెళ్లానని, స్కూలు నుంచి వచ్చిన తన కుమార్తె ఆద్య లేపేందుకు ప్రయత్నించి, విఫలమై, అమ్మ చనిపోతుందేమోనన్న ఆందోళనతో ఏడ్చేసిందని రేణూ పేర్కొన్నారు. తనకు మెలకువ వచ్చే సరికి ‘ప్లీజ్‌ మమ్మీ, నువ్వు చచ్చిపోవద్దు ప్లీజ్‌' అని ఒకటే ఏడుపు లంకించుకుందట.   దీంతో తాను కూడా ఏడిస్తే కూతురు భయపడుతుందని భావించి, బాధను దాచుకుంటూ, "నేను చనిపోనులే నీతోనే ఉంటాను. ప్రామిస్. అసలు నేను చనిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? నేను చనిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?" అని చెప్పి ఓదార్చిందట. అమ్మను త్వరగా తీసుకు వెళ్లవద్దని దేవుడిని ప్రార్థించమని చెబితే, దేవుడి ముందు పాప ఎంత సేపు కూర్చుందో కూడా తనకు తెలియలేదని రేణూ చెప్పింది. Last Updated 26, Mar 2018, 12:00 AM IST
0business
Realestate రియాల్టీలో పెట్టుబడులకు అనుమతి ముంబై: రియల్‌ఎస్టేట్‌ కంపెనీలకు ఆర్‌బిఐ నిర్ణయాలు ఊతం ఇచ్చాయి. బ్యాంకులు రియాల్టీకి అనుగుణంగా ఏర్పాటుచేసిన రీట్స్‌లోను, ఇన్విట్స్‌లోను 20శాతం వరకూ పెట్టుబడులు పెట్టవచ్చన్న ఆర్‌బిఐ నిర్ణయాలు రియాల్టీ రంగానికి ఎంతో మద్దతునిచ్చాయి. ఆరుశాతం వరకూ రియాల్టీ కంపెనీలు వృద్ధిని నమోదుచేసాయి. రియల్‌ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లలో పెట్టుబడులు పెట్టవచ్చన్న సడలింపులే ఇందుకుకీలకం. డిఎల్‌ఎఫ్‌, యునిటెక్‌, గోద్రెజ్‌, ఓబరా§్‌ు, హెచ్‌డిఐఎల్‌, శోభా, ఇండియా బుల్స్‌ వంటి సంస్థలు ఒకటినుంచి ఆరుశాతంవరకూ బిఎస్‌ఇ ఇంట్రాడేలో పెరిగాయి. బిఎస్‌ఇ రియాల్టీ సూచి ఇతర సూచీలన్నింటికంటే భారీ స్థాయిలో లాభ పడింది. రెండుశాతంపెరిగి 1707 పాయింట్లవద్ద స్థిర పడింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 0.18శాతం దిగజారితే రియాల్టీ సూచి మాత్రం పెరిగింది. రియాల్టీ సూచి తాజాగా 52 వారాల గరిష్టస్థాయిని నమోదుచేసింది. 1719.87 పాయింట్లకు చేరింది. సెబి కూడా రీట్స్‌, ఇన్వెట్స్‌కు సంబంధించిన నియమనిబంధనలు సిద్ధం చేసింది. రిజర్వుబ్యాంకు ఇందుకు సంబంధించి బ్యాంకులు ఈ స్కీంలలో పెటుట్బడులు పెట్టేందుకు అనుమతించాలని రిజర్వుబ్యాంకునుకోరింది. ప్రస్తుతం బ్యాంకులు ఈక్విటీఆధారిత మ్యూచువల్‌ఫండ్స్‌, వెంచర్‌ కేపిటల్‌ఫండ్స్‌, ఈక్విటీల్లో 20శాతం వరకూ పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే ఇకపై బ్యాంకులు రీట్స్‌, ఇనిఎవట్స్‌లలో కూడా ఈ పరిమితి మేరకే పెట్టుబడులు పెట్టవచ్చని ఆర్‌బిఐ వెల్లడించింది. సమగ్ర మార్గదర్శకాలను మేనెలాఖరు నాటికి విడుదలవుతాయని ఆర్‌బిఐ వెల్లడించింది.
1entertainment
Feb 03,2019 పబ్లిక్‌ ఇష్యూ ద్వారా వాటాల విక్రయం న్యూఢిల్లీ: ఏప్రిల్‌ నుంచి ప్రారంభంకానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలను (పీఎస్‌యూ) పబ్లిక్‌ ఇష్యూ బాట (ఐపీవో) పట్టించనున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో దాదాపు పది ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రాథమిక మార్కెట్లోకి రానున్నాయని 'డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌' (దీపమ్‌) కార్యదర్శి అటను చక్రబొర్తి తెలిపారు. 2019-20 సంవత్సరానికి గాను పీఎస్‌యూలలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.90,000 కోట్ల వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. 2018-19లో రూ.80వేల కోట్ల వాటాల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరకుంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ పీఎస్‌యూలల భారీగా వాటాల విక్రయానికి ఎత్తుగడలు రూపొందిస్తోందని సమాచారం. ఈ క్రమంలో భాగంగా నే ఇప్పటికే 10 ఐపీవోలు వరసలో ఉన్నాయని చక్రబొర్తి తెలిపారు. చాలా కంపెనీలు ఇంకా కనీస పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ లక్ష్యాన్ని చేరాల్సి ఉందన్నారు. గడిచిన 10 నెలల్లో కేంద్ర పీఎస్‌యుల్లో రూ.36,000 కోట్ల విలువ చేసే వాటాలను ఉపసంహరించుకుంది. వచ్చే నెల మార్చి ముగింపు నాటికి మరో రూ.44,000 కోట్ల వాటాలను విక్రయించాలని కేంద్రం నిర్దేశించుకుందని.. దీంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్న రూ.80,000 కోట్ల వాటాల ఉపసంహరణ లక్ష్యం నెరవేరనుందని చక్రబొర్తి పేర్కొన్నారు. 2019 మార్చి కల్లా పవన్‌ హాన్స్‌లో కీలక వాటాలను విక్రయించనున్నామన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.90వేల కోట్ల వాటాలను ఉపసంహరణకు ఇప్పటికే తాము ప్రణాళికలు రూపొందించామన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Sep 08,2018 రూపీ పతనంతో పెరుగనున్న రుణ భారం న్యూఢిల్లీ: దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకు పడిపోతుండడం దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా పరిణమి స్తోంది. రూపా యి పతనం కారణంగా దేశ చమురు దిగుమతుల బిల్లు పెరగడంతో పాటు పలు ఇతర సమస్యలు ఆర్థికానికి భారం కానున్నాయి. ఈ ఏడాది దేశీయ కరెన్సీ రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే దాదాపు 11% వరకు పతనమైంది. దీంతో రానున్న రోజుల్లో చెల్లించాల్సిన స్వల్పకాలిక రుణాలు మరింత భారంగా మారనున్నాయి. తీసుకున్న మొత్తానికి వడ్డీయే కాకుండా రూపాయి పతనం కారణంగా మరో రూ.68,500 కోట్ల మేర అధికంగా చెల్లింపులు జరపాల్సిన పరిస్థితి కనిపిస్తోందని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) వెల్లడించింది. భారత కరెన్సీ గురువారం నాటికి డాలర్‌తో పోలిస్తే రూ.72 రూపాయిలకు దిగజారింది. అయితే ఈ ఏడాదిలో భారత కరెన్సీ విలువ డాలరుతో పోతిస్తే రూ.73ల సగటుగా భావించడం, 2018 ద్వితియార్ధంలో పీపా ముడి చమురు ధర 76 డాలర్ల సగటకు చేరుతుందని భావిస్తే దేశ చమురు బిల్లు రూ.45,700కోట్లు పెరుగుతుందని ఎస్‌బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ విశ్లేషించారు. 2017లో ప్రవాస డిపాజిట్లు, కంపెనీలు విదేశీ సంస్థల నుంచి సమీకరించిన రుణాల మొత్తం 217.6 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని ఆయన అన్నారు. దీనిలో సగం మొత్తాన్ని ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో చెల్లించి ఉండడం కానీ.. లేక చెల్లింపులను వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవడంగానీ చేసినట్టుగా భావిస్తే, భారత్‌ ఇంకా రూ.7,10,000 కోట్ల మొత్తాన్ని సగటున డాలరు ఒక్కింటికి రూ.65.1ల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి డాలరు సగటు విలువ రూ.71.4కు చేరుతుందని భావిస్తే భారత్‌ తాను తీసుకున్న రుణం కంటే దాదాపు రూ.70,000 కోట్లు అదనంగా రూ.7,80,000 కోట్ల మొత్తాన్ని విదేశీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని ఆయన విశ్లేషించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం హిరోయిన్ రాధిక మెహ్రోత్రా గ్యాలరీ First Published 14, Aug 2017, 5:54 PM IST ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఫేం రాధిక మెహ్రోత్రా Recent Stories
0business
అన్నపూర్ణ అగ్ని ప్రమాదం సమంత "లెగ్" మహిమనా? Highlights అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ అగ్ని ప్రమాదం ఇటీవలే అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత సమంత లెగ్ వల్లే ప్రమాదం అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం సమంత అక్కినేని వారింట అడుగుపెట్టిన వేళా విశేషం నాగార్జున నటించిన రాజుగారి గది 2 సినిమా హిట్ అవటం అలా జరిగిపోయింది. ఈ మూవీలో సమంత కూడా నటించడంతో ఒకే దెబ్బకు రెండుపిట్టలన్నట్లు మామా కోడళ్లకు ఒకేసారి మూవీ సక్సెస్ దక్కింది.  అదీ  సమంత రుత్ ప్రభుత కాస్తా సమంత అక్కినేనిగా మారిన తర్వాత. అంతా ఆ ఆనందంతో వున్నారు. పైగా ఈ పన్నెండో తేదీనే గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసారు నాగ్. సినీ రాజకీయ ప్రముఖులంతా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.   సినీ నటుడు నాగార్జున ట్విట్టర్ ద్వారా తన ఎమోషన్స్ ని పంచుకున్నారు. సమంత నాగ చైతన్య ల పెళ్లి జరిగిన నెల తరవాత గ్రాండ్ పార్టీ ఇచ్చిన నాగార్జున ఇప్పుడు తన మనసులో భావోద్వేగాలు పంచుకుంటున్నారు. " ఈ వారం అంతా కూడా ఉద్వేగభరితంగా గడిచింది.  నవ్వుకున్నాం ఏడ్చాం. అంతా 'మనం' అనే ప్రేమే " అంటూ రాసుకొచ్చారు ఆయన.   మొన్న సమంత - చైతన్య ల గ్రాండ్ రిసెప్షన్ తరువాత నిన్న అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ లు మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిది సినిమాల  సెట్ ల వరకూ కాలి బూడిద అయ్యాయి. మొత్తంగా 3 కోట్లు నష్టం వాటిల్లింది అంటున్నారు.   ఇక హలో టీజర్ 16న రిలీజ్  చేయబోతున్నట్లు చెప్పారు నాగ్. దానికి సంబంధించిన ప్రమోషన్ పోస్టర్ అఖిల్ ట్విటర్ నుంచి ఈ14నే రిలీజ్ చేశారు. ఓ వైపు చై, సమంతల రిసెప్షన్ హడావుడి, మరోవైపు అఖిల్ తాజా చిత్రం 'హలో'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనులతో నాగార్జున ఫ్యామిలీ ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.   ఇంతలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకుని సెట్స్ అన్నీ తతగలబడి భారీగా ఆస్తి నష్టం సంబవించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా వుంటే అసలు ఈ ప్రమాదానికి కారణం సమంత 'లెగ్' మహిమ అంటూ  అగ్నిప్రమాదం గురించి కొందరు మూర్ఖంగా పబ్లిసిటీ చేయడం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. సోషల్ మీడియా లో కొందరు అగ్ని ప్రమాదం లెగ్ మహిమ వల్లే జరిగిందనీ, ఇన్నేళ్ళ అన్నపూర్ణ స్టూడియోస్ చరిత్ర లో ఎప్పుడూ ఇలా జరగలేదు అని మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి వుంటుందా.. Last Updated 25, Mar 2018, 11:58 PM IST
0business
internet vaartha 201 Views – యూనుస్‌ఖాన్‌ కరాచీ : వన్డేల నుంచి వైదొలగాలనే ఆకస్మికంగా నిర్ణయం తీసుకోలేదని పాకిస్థాన్‌ సీనియర్‌ క్రికెటర్‌ యూనుస్‌ఖాన్‌ స్పష్టం చేశాడు.కాగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు తనపై నమ్మకం లేకపోవడం వల్లే అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు చెప్పినట్లు యూనుస్‌ ఖాన్‌ వివరించాడు.తనది ఎంత మాత్రం ఆకస్మిక నిర్ణయం కాదంటూ తొలిసాపి పెదవి విప్పిన యూనుస్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓటమికి తనకు పరోక్షంగా బాధ్యుణ్ని చేశారని యూనిస్‌ ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.తాను వన్డేల నుంచి ఆకస్మికంగా తప్పుకోవడం వల్లే జట్టు ఆ సిరీస్‌లో ఓటమి పాలైందని కోచ్‌ వకార్‌ యూనిస్‌ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడటానికి నిరాకరించిన యూనిస్‌ఖాన్‌  దానికి తగిన సమయం వచ్చినపుడు అతనినే అడుగుతాఆనన్నాడు.ఇది చాలా దురదృష్టం,ఇంగ్లండ్‌తో సిరీస్‌కు తాను కారణం కాదన్నాడు,నేను ఇంకా చాలా కాలం ఆడదామనుకున్నా నాపై జట్టుకు నమ్మకం లేదు,అది కోచ్‌ వకార్‌ యూనస్‌ కావచ్చు,వేరే ఎవరైనా కావొచ్చు,దానివల్లే బయటలకు వచ్చా అని యూనుస్‌ పేర్కొన్నాడు.తాను ఎప్పుడో వన్డేల నుంచి తప్పుకున్నానని,అయితే వరల్డ్‌ కప్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కలేని కారణంగానే ఇంతకాలం నిరీక్షించాల్సి వచ్చిందన్నాడు.కాగా తనది ఆకస్మిక నిర్ణయం ఎంతమాత్రం కాదని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాడు. కాగా టెస్ట్‌లకు గుడ్‌ బై చెప్పే సమయం వచ్చినపుడు ఆ ఫార్మెట్‌ నుంచి కూడా వైదొలుగుతానన్నాడు.అది ఎప్పుడనేది తన స్వీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని టెస్ట్‌ల్లో 9 వేల పరుగులు చేసి పాకిస్థాన్‌ తొలి ఆటగాడిగా నిలిచిన యూనున్‌ పేర్కొన్నాడు.గత ఏడాది నవంబర్‌్‌లో ఇంగ్లండ్‌తో తొలి వన్డే అనంతరం యూనిస్‌ఖాన్‌ వన్డేల నుంచి వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన తండ్రికి అద్భుత నివాళి కార్గిల్ యుద్ధంలో నేలకొరిగిన ఓ సైనికుడికి అతడి కుమారుడు అద్భుత రీతిలో నివాళి అర్పించాడు. తండ్రి వీరమరణం పొందిన 19 ఏళ్ల తర్వాత తండ్రి పని చేసిన బెటాలియన్‌లోనే చేరాడు. Samayam Telugu | Updated: Jun 11, 2018, 12:07PM IST కార్గిల్ యుద్ధంలో నేలకొరిగిన ఓ సైనికుడికి అతడి కుమారుడు అద్భుత రీతిలో నివాళి అర్పించాడు. తండ్రి వీరమరణం పొందిన 19 ఏళ్ల తర్వాత తండ్రి పని చేసిన బెటాలియన్‌లోనే చేరి.. తండ్రికి తగ్గ వారసుడనిపించాడు. జూన్ 12, 1999న హితేష్ కుమార్ తండ్రి బచన్ సింగ్ కార్గిల్‌ యుద్ధంలో చనిపోయాడు. అప్పటికీ హితేష్‌ వయసు ఆరేళ్లు మాత్రమే. ఆర్మీలో చేరాలని, తండ్రిలా దేశానికి సేవ చేయాలని అంత చిన్న వయసులోనే హితేష్ నిర్ణయించుకున్నాడు. ఇటీవలే డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న హితేష్ పాసింగ్ ఔట్ పెరేడ్ పూర్తి చేశాడు. తండ్రి పని చేసిన రాజ్‌పుతానా రైఫిల్స్ రెండో బెటాలియన్‌లో లెఫ్టినెంట్ హోదాలో చేరాడు. సైన్యంలో చేరగానే తండ్రి బచన్ సింగ్‌‌కి నివాళులు అర్పించాడు. 19 ఏళ్ల నా కల నెరవేరింది. మా అమ్మ కూడా నేను సైన్యంలో చేరాలని కోరుకుంది. దేశానికి నిజాయతీతో సేవలు అందిస్తానని హితేష్ తెలిపాడు. ‘ఆయన వీరమరణం పొందిన తర్వాత కుటుంబ పోషణ కష్టమైంది. ఇద్దరు అబ్బాయిలను పెంచడానికి కష్టపడ్డాను. హితేష్ సైన్యంలో చేరడం గర్వంగా ఉంది. పెద్దబ్బాయిలాగే రెండో వాడు కూడా సైన్యంలో చేరేందుకు సిద్ధం అవుతున్నాడ’ని హితేష్ తల్లి చెప్పింది. కార్గిల్‌లోని లోలోలింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులపై పాక్ దాడికి పాల్పడింది. ఆ రాత్రి బచన్ సహా 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని రిషిపాల్ సింగ్ అనే సైనికాధికారి తెలిపారు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఛాంపియన్‌షిప్‌లో కిదాంబి శ్రీకాంత్ బోణి..! మ్యాచ్ ఆరంభంలోనే 6-1తో దూసుకెళ్లిన శ్రీకాంత్ ఎక్కడా.. ప్రత్యర్థిని దరిచేరనీయలేదు. తనదైన శైలిలో TNN | Updated: Aug 21, 2017, 09:32PM IST ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ బోణి కొట్టాడు. టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే రష్యా క్రీడాకారుడు సెర్గీ సిరాంత్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించి ఘన విజయాన్ని అందుకున్నాడు. కేవలం 28 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-13, 21-12 తేడాతో వరుస సెట్లలో అలవోకగా గెలుపొందాడు. మ్యాచ్ ఆరంభంలోనే 6-1తో దూసుకెళ్లిన శ్రీకాంత్ ఎక్కడా.. ప్రత్యర్థిని దరిచేరనీయలేదు. తనదైన శైలిలో దూకుడు కొనసాగించి నిమిషాల వ్యవధిలోనే ఆధిక్యం 11-6, 15-7కి పెంచుకుని 21-13‌తో తొలిసెట్‌ని కైవసం చేసుకున్నాడు. అనంతరం రెండో సెట్‌లో తొలుత 2-2తో సెర్గీ పోటీనిచ్చినా.. అతని బలహీనతలను సొమ్ము చేసుకున్న శ్రీకాంత్ 9-2తో ఆధిక్యం సాధించి చివరికి 21-12తో ముగించేశాడు. ఇటీవల వరుసగా రెండు సూపర్ సిరీస్‌ టైటిళ్లు గెలిచి కిదాంబి అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
2sports
టీ20ల్లో కోహ్లీ నెం.1 రికార్డ్‌కి రోహిత్ ఎసరు..? Samayam Telugu| Nov 2, 2019, 07.40 AM IST Rohit Sharma, Virat Kohli టీ20ల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నెం.1 రికార్డ్‌పై ఓపెనర్ రోహిత్ శర్మ కన్నేశాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా తలపడనుండగా.. ఈ సిరీస్‌ నుంచి కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు రోహిత్ శర్మ చేతికి టీమ్ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో.. అంతర్జాతీయ టీ20ల్లో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా ఉన్న కోహ్లీని రోహిత్ శర్మ అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి. Read More: ప్రమాదం అంచున క్రికెటర్లు.. వేదిక మార్పునకి బీసీసీఐ నో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాని ఓసారి పరిశీలిస్తే..? భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం 67 ఇన్నింగ్స్‌ల్లో 2,450 పరుగులతో నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ 90 ఇన్నింగ్స్‌ల్లో 2,443 పరుగులతో ఉన్నాడు. దీంతో.. బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు చేస్తే చాలు అతనికి అగ్రస్థానం దక్కనుంది. కోహ్లీ, రోహిత్‌తో పాటు మార్టిన్ గప్తిల్ (2,285 పరుగులు), షోయబ్ మాలిక్ (2,263), బ్రెండన్ మెక్‌కలమ్ (2,140) టాప్-5లో కొనసాగుతున్నారు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్న కేదార్..! శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత ఫీల్డర్ కేదార్ జాదవ్ కళ్లు చెదిరే రీతిలో TNN | Updated: Aug 20, 2017, 06:25PM IST శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత ఫీల్డర్ కేదార్ జాదవ్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ 35వ ఓవర్ వేసిన అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ హసరంగ (2) భారీ షాట్ ఆడాడు. బంతి లాంగాన్‌లో చాలా ఎత్తుకి లేచింది. అందరూ.. అది సిక్స్‌గా వెళ్తోందని ఊహించారు. కానీ.. బంతి లాంగాన్‌లోని బౌండరీ లైన్‌కి లోపలే కిందకి పడుతుండటంతో.. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కేదార్ జాదవ్ స్పందించాడు. మిడాన్ నుంచి వేగంగా బంతిని చూస్తూ అలానే వెనక్కి వెళ్లిన జాదవ్.. ఏ మాత్రం తడబడకుండా చివరి క్షణంలో డైవ్ చేస్తూ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. సాధారణంగా ఫీల్డర్ మైదానంలో ఎంత దూరమైనా.. ముందుకు వెళ్లి అలవోకగా క్యాచ్ అందుకోగలడు. కానీ.. వెనక్కి వెళ్తూ.. అదీ ఎక్కువ ఎత్తు నుంచి వస్తున్న బంతి గమనాన్ని పరిశీలిస్తూ అందుకోవడం అంత సులువు కాదు. క్యాచ్ అందుకున్న తర్వాత.. పట్టుతప్పి కేదార్ వెనక్కి అలానే పడిపోయాడు. కానీ.. బంతిని వదల్లేదు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV స్వ‌ల్పంగా త‌గ్గిన పెట్రోలు ధ‌ర‌ ఆసియా మార్కెట్ల‌లో ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టికీ భార‌త‌దేశంలో మాత్రం పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గాయి Samayam Telugu | Updated: Jun 22, 2018, 12:18PM IST ఆసియా మార్కెట్ల‌లో ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టికీ భార‌త‌దేశంలో మాత్రం పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గాయి. మ‌రో వైపు డీజిల్ ధ‌ర‌లలో ఎటువంటి మార్పుల్లేవు. దేశ‌వ్యాప్తంగా పెట్రోలు రేటును లీట‌రుకు 14 పైస‌లు త‌గ్గించారు. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో పెట్రోలు ధ‌ర అత్య‌ధికంగా 83.74గా ఉంది. డీజిల్ ధ‌ర బెంగుళూరు, ఢిల్లీలో త‌క్కువ‌గా ఉండ‌గా మిగిలిన న‌గ‌రాల్లో 70కి పైనే ఉంది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖ న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి. న‌గ‌రం
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
HARMAN PREET కోహ్లీని కలిసిన హర్మన్‌ ప్రీత్‌, స్మృతి మందాన బెంగళూరు: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని మహిళా క్రికెటర్లు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్మృతి మందాన కలిశారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం బెంగుళూరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో వన్డే జరిగిన సంగతి తెలి సిందే. ఈ వన్డేను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హర్మన్‌, స్మృతి వచ్చారు. ఈనేపథ్యంలో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కోహ్లీని కలిశారు. ఈ సందర్భంగా కోహ్లీతో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను బిసిసిఐ సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకుంది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్‌లో హర్మన్‌, స్మృతిలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే.
2sports
JIO డేటా స్పీడ్‌లో దూసుకుపోతున్న జియో న్యూఢిల్లీ: జియో డేటా స్పీడ్‌లో తన హవా కొనసా గిస్త్తోంది.అత్యధిక సగటు డేటా స్పీడ్‌లో వరుసగా ఏడునెలల నుంచి జియోనే టాప్‌లో కొనసా గుతుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటి ఆఫ్‌ ఇం డియా మంగళవారం విడుదల చేసిన డేటాలో జులై నెలలోనూ రిలియన్స్‌ జియోనే టాప్‌లో నిలిచినట్లు వెల్లడైంది.జియో తన టెలికాం సర్వీసులను వాణి జ్యపరంగా లాంచ్‌ చేసి సెప్టెంబర్‌ 5 నాటికి సంవత్సర కాలానికి చేరుకుంది.లాంచ్‌ చేసినప్పటి నుంచి ఇతర టెల్కోలకు జియో చుక్కులు చూపి స్తుంది. గత ఏడు నెలల నుంచి భారతీ ఎయి ర్‌టెల్‌, వోడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యూ లార్‌లకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా జియోనే ట్రా§్‌ు స్పీడ్‌ చార్జ్‌లో అగ్రగామిగా నిలు స్తుంది. జులై నెలలో సగటు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 18.331 ఎంబిపిఎస్‌,ఎయిర్‌టెట్‌ స్పీడు 9.266 ఎంబిపిఎస్‌,ఐడియా సెల్యులర్‌ స్పీడ్‌ 9.325 ఎంబిపిఎస్‌ అని తెలుస్తుంది.అధికారిక వర్గాల సమాచారం మేరకు మొబైల్‌ డేటా వినియోగం.ఈ సంవత్సరంలో భారత్‌లో నెలకు 20 కోట్ల జిబి నుంచి 150 కోట్ల బిజికి పెరిగింది.దీనిలో జియో నెలకు 100 కోట్ల జిబి డేటా పైననే నమోదవు తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.2016 సెప్టెంబరు 5 నుంచి మొత్తం 22 సర్విస్‌ ప్రాం తాల్లో జియో తన వైర్‌లెస్‌ టెలికమ్యునికేషన్‌ సర్వీసులను ప్రారంభించింది.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి నిలకడగా కొనసాగుతున్నాయి. TNN | Updated: Oct 1, 2016, 08:39AM IST బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : హైదరాబాద్ మార్కెట్ లో రూ. 31 వేల 600 ఉండగా.. విజయవాడలో 32 వేల 201, ప్రొద్దుటూరులో రూ.31 వేల 380 , చెన్నై రూ. 31, 760 , ముంబైలో రూ.31 వేల 350 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్ లో రూ.30 వేల 10 రూపాయలు ఉండగా.. విజయవాడలో 29 వేల 996, ప్రొద్దుటూరులో 29 వేల 080, చెన్నై లో రూ.29 వేల 700, ముంబైలో రూ.31 వేల 200 రూపాయలుగా ఉంది.. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 45 వేల 600, విజయవాడలో46 వేల 490, ప్రొద్దుటూరులో రూ.45 వేల 400, చెన్నై లో రూ.46 వేల 175, ముంబై మార్కెటో రూ. 45 వేల 315 రూపాయలుగా ఉంది.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ఆ గానగంధర్వుడు తన పాటతో బ్రతికే ఉంటాడు 'మేరే సపునోంకి రాణి కబ్ ఆయేగీ తూ' ఈ పాట మనలో ప్రతీ ఒక్కరు ఒక్కసారైనా విని ఉంటారు. ఈపాట పాడింది ఇండియన్ లెజెండరీ సింగర్ అభాస్ కుమార్ గంగూలీ అలియాస్ కిషోర్ కుమార్. ఈరోజు కిషోర్ కుమార్ 87వ జయంతి... TNN | Updated: Aug 4, 2016, 04:36PM IST 'మేరే సపునోంకి రాణి కబ్ ఆయేగీ తూ' ఈ పాట మనలో ప్రతీ ఒక్కరు ఒక్కసారైనా విని ఉంటారు, పాడుకొని ఉంటారు. నా కలలో కనిపించే నా రాణి నువ్ ఎప్పుడొస్తావ్ అంటూ సాగే ఈ పాట పాడింది ఇండియన్ లెజెండరీ సింగర్ అభాస్ కుమార్ గంగూలీ అలియాస్ కిషోర్ కుమార్. ఈరోజు కిషోర్ కుమార్ 87వ జయంతి సందర్భంగా ఆయనను కోట్లాది మంది స్మరించుకుంటున్నారు. 1929, ఆగష్టు 4న మధ్యప్రదేశ్ లో జన్మించిన కిషోర్ కుమార్.. హిందీ, బెంగాలీ, మరాఠి, ఉర్దూ, కన్నడ, అస్సామీ, భోజ్ పురి, ఒడియా, గుజరాతీ, మళయాలీ భాషల్లో ఆయన పాడిన పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆనాటి బ్లాక్ అండ్ వైట్ కాలంలో రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర లాంటి వారి దగ్గర్నించీ అనిల్ కపూర్, సంజయ్ దత్ అలాగే మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ లాంటి అగ్ర హీరోలందకీ 1970-80 కాలంలో కిషోర్ కుమార్ పాట కావాల్సిందే. 'రూప్ తేరా మస్తానా.. ప్యార్ మేరా దివానా' అలాగే 'గాతా రహే మేరా దిల్.. తూహీ మేరా మంజిల్' అంటూ ఆయన పాడిన ప్రేమగీతాలు మనల్ని ప్రేమలో ముంచి తేలుస్తాయి, ఆయన గుండె నుంచి వచ్చిన విషాద గీతాలు వింటే బాధలో ఉన్న వారికి ఓదార్పునిస్తాయి. ఒంటరిగా ఉన్నవారికి ధైర్యాన్నిస్తాయి. 'ఓ కైకే పాన్ బనారస్ వాలా...' అనే పాట ఇప్పటికీ ఫెవరెట్ సాంగ్ లిస్టులో ఉంటుంది. ఇలా ఒకటా..రెండా ? వేల భావాలను పలికించే ఆయన గొంతు నుండి బయటికొచ్చిన ప్రతి అక్షరం కోట్లాది మంది గుండెలను తాకాయి. కిషోర్ కుమార్ కేవలం గాయకుడిగానే కాదు పాటల రచయితగా, సినిమా రచయితగా, సంగీత దర్శకునిగా, దర్శకునిగా, నిర్మాతగా, నటుడిగా సైతం ఆయన చెరగని ముద్ర వేశారు. ఇండియన్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా 8 ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్న కిషోర్ రికార్డును ఇంతవరకూ ఎవరూ బ్రేక్ చేయలేదు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా హిందీ సినిమా సంగీతానికి ఆయన చేసిన సేవలకు 'కిషోర్ కుమార్ అవార్డ్' ను ప్రారంభించింది.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV టీమిండియా కోసం ఒక విమానం కొనండి..! భారత జట్టు క్రికెటర్ల సౌలభ్యం కోసం బీసీసీఐ ఒక విమానం కొనుగోలు చేస్తే మంచిదని మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సూచించారు TNN | Updated: Sep 10, 2017, 05:27PM IST భారత జట్టు క్రికెటర్ల సౌలభ్యం కోసం బీసీసీఐ ఒక విమానం కొనుగోలు చేస్తే మంచిదని మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సూచించారు. మ్యాచ్‌ల కోసం విదేశాలకి వెళ్లేటప్పుడు ఎక్కువ సమయం విమాన ప్రయాణాలకే వృథాగా వెళ్తోందని ఆయన ఈ సందర్భంగా బీసీసీఐకి గుర్తు చేశారు. ప్రస్తుతం బోర్డుకి ఆదాయం కూడా మెండుగానే ఉండటంతో జట్టు కోసం ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేయడం ఏమాత్రం కష్టం కాదని కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డారు. ‘బీసీసీఐ ప్రస్తుతం బాగా డబ్బు గడిస్తోంది. బోర్డుకి ఒక సొంత విమానం కచ్చితంగా ఉండాలి. అది ఉంటే.. భారత జట్టుకి విదేశీ పర్యటనల్లో సౌలభ్యంగా ఉంటుంది. ఐదేళ్ల క్రితమే బీసీసీఐ ఒక విమానం కొనాల్సింది. కానీ.. ఏదో కారణంతో వెనకంజ వేసింది. కనీసం ఇప్పుడైనా కొనుగోలు చేస్తే మంచిది. అమెరికాలో గోల్ఫ్ క్రీడాకారులకి సొంత విమానాలు ఉంటాయి. క్రికెటర్లు కూడా కొంత మంది వాటిని కొనుగోలు చేశారు. మన ఆటగాళ్లు ఎందుకు కొనుగోలు చేయలేదో నాకు అర్థం కావట్లేదు. బోర్డు వద్ద విమానాలు ఉంటే.. క్రికెటర్లకి మ్యాచ్‌ల మధ్య ఎక్కువ విశ్రాంతి దొరుకుతుంది. ఒకవేళ క్రికెటర్లు విమానాలు కొంటే బీసీసీఐ పార్కింగ్ ఛార్జీలు కూడా చెల్లిస్తుందనుకుంటా’ అని కపిల్‌దేవ్ వివరించారు.
2sports
Hyderabad, First Published 15, Mar 2019, 4:54 PM IST Highlights ఆల్రెడీ సినిమా షూటింగ్ పూర్తై గుమ్మడికాయ కూడా కొట్టేసిన తరువాత ఇప్పుడు సినిమా క్లైమాక్స్ లో మార్పులు చేయడానికి సిద్ధపడుతున్నారు 'మహర్షి' మూవీ మేకర్స్.  ఆల్రెడీ సినిమా షూటింగ్ పూర్తై గుమ్మడికాయ కూడా కొట్టేసిన తరువాత ఇప్పుడు సినిమా క్లైమాక్స్ లో మార్పులు చేయడానికి సిద్ధపడుతున్నారు 'మహర్షి' మూవీ మేకర్స్. మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగిన మేజర్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తయింది. మే 9న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇటీవల సినిమా క్లైమాక్స్ చూసిన మహేష్, దిల్ రాజులకు పతాక సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయపడ్డారట. క్లైమాక్స్ లు రైతుల కోసం చెప్పే డైలాగులు, సొసైటీ కి ఇచ్చే మెసేజ్ డోస్ కాస్త ఎక్కువైందని, జనాలు క్లాస్ పీకుతున్నట్లుగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందని భావించి ఇప్పుడు ఆ సన్నివేశాలను సరిచేసే పనిలో పడ్డారు. వచ్చే వారం మరోసారి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి క్లైమాక్స్ పోర్షన్ రీషూట్ చేయాలని భావిస్తున్నారు. ఆ విధంగా మంచి అవుట్ పుట్ వస్తుందని నమ్ముతున్నారు. సో.. 'మహర్షి' కోసం కొత్త క్లైమాక్స్ రెడీ అవుతోందన్నమాట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.   Last Updated 15, Mar 2019, 4:54 PM IST
0business
Dec 06,2018 జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఎతిహాద్‌ మద్దతు..! న్యూఢిల్లీ : తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు అబుధాబీకి చెందిన ఎతిహాద్‌ ఎయి ర్‌లైన్స్‌ మద్దతునివ్వడానికి ముందు కు వచ్చినట్లు సమాచారం. ఇందుకో సం జెట్‌ ఎయిర్‌వేస్‌ సహా ఆ సంస్థకు రుణాలిచ్చిన ఎస్‌బీఐతో పాటు పలు బ్యాంకులతోనూ ఎతిహాద్‌ ఎయిర్‌లైన్స్‌ చర్చలు జరుపుతో ందని సమా చారం. ఇరు విమాన సంస్థలకు చెందిన ప్రతినిధులు ఇటీవల ముంబ యిలోని బ్యాంకులతో చర్చలు జరిపారని రిపోర్టులు వస్తున్నా యి. ఎతిహాద్‌ ఎయిర్‌లైన్స్‌కు ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటా ఉంది. భవిష్యత్తు ప్రణాళికకు జెట్‌ ఎయిర్‌వేస్‌ అంగీకరిస్తే సంస్థలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఎతిహాద్‌ ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ind vs ban 1st t20: bangladesh cricketers prepare for new delhi t20i wearing masks భారత్‌తో తొలి టీ20కి మాస్క్‌లతో బంగ్లా క్రికెటర్లు ఢిల్లీలో కాలుష్యం కారణంగా 2017 శ్రీలంక క్రికెటర్లు టెస్టు మ్యాచ్ ఆడుతూ వాంతులు చేసుకున్నారు. తాజాగా మరోసారి ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది. దీంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్క్‌లు ధరించి ఆడాలని బంగ్లాదేశ్ టీమ్ నిర్ణయించుకుంది. Samayam Telugu | Updated: Nov 3, 2019, 06:06PM IST Bangladeshi cricketer Soumya Sarkar భారత్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకి ప్రారంభంకానున్న తొలి టీ20‌కి బంగ్లాదేశ్ క్రికెటర్లు మాస్క్‌లు ధరించి మైదానంలోకి రానున్నారు. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పతాక స్థాయికి చేరడంతో ఆటగాళ్లు అనారోగ్యంపాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో.. గత రెండు రోజులుగా మాస్క్‌లు ధరించి ప్రాక్టీస్ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్లు.. ఈరోజు మ్యాచ్‌లో కూడా మాస్క్‌లు ధరించి ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. Read More: సమైరా తాకగానే పడిపోయిన శిఖర్ ధావన్ 2017‌లో ఇలానే ఢిల్లీలో కాలుష్యం కారణంగా.. శ్రీలంక క్రికెటర్లు టెస్టు మ్యాచ్ ఆడుతూ మైదానంలోనే వాంతులు చేసుకున్నారు. దీంతో.. అప్పట్లో లంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. తాజాగా అదే తరహాలో బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా ఈరోజు మాస్క్‌లు ధరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత క్రికెటర్లు మాత్రం.. సాధారణంగానే మ్యాచ్ ఆడే అవకాశాలున్నట్లు సమాచారం. కాలుష్యంతో తమకేమీ ఇబ్బందిలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి రెండు రోజుల క్రితమే భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
2sports
Hyderabad, First Published 8, Aug 2019, 12:05 PM IST Highlights  కెప్టెన్ టాస్క్‌ను తొలి నుండి సాఫ్ట్‌గా ఆడుతున్న యాంకర్ శ్రీముఖి పర్సనల్ ఎటాక్ చేయకపోతే గేమ్ గెలవడం కష్టమని భావించి డంబెల్ తో నిధి అద్దాలను పగలగొట్టాలని నిర్ణయించుకొని అంత పనీ చేసింది.  బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దొంగలు, ఊరి పెద్దలు, పోలీసుల నేపధ్యంలో ఈ టాస్క్ జరుగుతోంది. ఇక ఈ కెప్టెన్ టాస్క్‌ను తొలి నుండి సాఫ్ట్‌గా ఆడుతున్న యాంకర్ శ్రీముఖి పర్సనల్ ఎటాక్ చేయకపోతే గేమ్ గెలవడం కష్టమని భావించి డంబెల్ తో నిధి అద్దాలను పగలగొట్టాలని నిర్ణయించుకొని అంత పనీ చేసింది.  చుట్టూ  వరుణ్, వితికా, తమన్నా, మహేష్‌లు కాపలా ఉన్నా ధైర్యం చేసి డంబెల్‌తో నిధి అద్దాలను పగలగొట్టింది. ఇక అప్పుడే జైలు నుండి వచ్చిన రవిని సైతం పగలగొట్టమమని శ్రీముఖి సలహా ఇవ్వడంతోఅతను చేతితో అద్దాలను పగలగొట్టడంతో అతని చేతికి గాయమై రక్తం కారింది. శ్రీముఖి డంబెల్ తో అడ్డం పగలగొట్టమని రవికి చెబితే అతడు మాత్రం చేతితో పగలగొట్టాడు. అయితే రవికి గాయం కావడానికి కారణం శ్రీముఖి అంటూ వితికా, రాహుల్ లు ఆమెపై ఎటాక్ చేశారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కూడా ఈ టాస్క్ కంటిన్యూ అవుతుంది. తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. ఇందులో బిగ్ బాస్ శ్రీముఖికి వార్నింగ్ ఇస్తున్నారు.  హౌస్ నియమాలు ఉల్లఘించిన కారణంగా శిక్షగా శ్రీముఖిని ఇంటి నుండి బయటకి పంపడానికి అంటూ ప్రోమోని ఎండ్ చేశారు. నిజంగానే శ్రీముఖిని ఇంటి నుండి బయటకి పంపుతారా..? లేక ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా..? అనేది ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది!
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV రూ.10,000 వరకు తక్షణ రుణం.. బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇలా పొందండి! పండుగ సీజన్‌ నడుస్తోంది. షాపింగ్ చేసేందుకు చేతిలో డబ్బు లేదా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. రూ.10,000 వరకు తక్షణ రుణం పొందొచ్చు. దీని కోసం బ్యాంకుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. Samayam Telugu | Updated: Oct 14, 2019, 10:53AM IST రూ.10,000 వరకు తక్షణ రుణం.. బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇలా పొందండి! హైలైట్స్ ఎంపాకెట్ నుంచి రుణాలు ఇదొక ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ దీంతో రూ.10 వేల వరకు లోన్ పొందొచ్చు తీసుకున్న మొత్తాన్ని 3 నెలల్లోగా తిరిగి చెల్లించాలి దీపావళి వచ్చేస్తోంది. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక గిఫ్ట్ కొనుగోలు చేస్తారు. అది వారి కోసం కావొచ్చు. లేదంటే ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకైనాసరే కొంటుంటారు. పండుగ సీజన్‌లో కంపెనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తూ ఉంటాయి. డబ్బు అవసరం అయితే బ్యాంకుకు వెళ్లకుండానే సులభంగానే లోన్ పొందే అవకాశం అందుబాటులో ఉంది. ఎంపాకెట్ ( mPokket ) అనే డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే ఇప్పుడు సేవలు కేవలం కాలేజ్ స్టూడెంట్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎంపాకెట్ ఇన్‌స్టంట్ లోన్ యాప్‌తో కాలేజ్‌లో చదివే విద్యార్థులు రుణం పొందొచ్చు. ఎలాంటి క్రెడిట్ హిస్టరీ కూడా అవసరం ఉండదు. కనీస డాక్యుమెంట్లతో ఆన్‌లైన్‌లోనే సులభంగా త్వరితగతిన లోన్ లభిస్తుంది. ఎంపాకెట్ సేవలు దాదాపు 200 పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి. లోన్ తీసుకోవాలని భావించే వారు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారం అందించాలి. అవసరమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్ చేయాలి. ఇక్కడ అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ వివరాలు, కాలేజ్ వివరాలు, ఇతర బేసిక్ పర్సనల్ సమాచారం అందించాల్సి ఉంటుంది. Also Read: ఎస్‌బీఐ లేటెస్ట్ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్.. చార్జీల బాదుడు నుంచి ఇలా తప్పించుకోండి! మీరు ఇచ్చిన సమాచారం ధ్రువీకరణ తర్వాత క్రెడిట్ లిమిట్ వస్తుంది. ఇది యూజర్ ప్రాతిపదికన మారుతుంది. ఇందులో నుంచి మీకు అవసరమైన డబ్బును వెంటనే బ్యాంక్‌ అకౌంట్‌ను బదిలీ చేసుకోవచ్చు. రూ.500 నుంచి రూ.10,000 వరకు తక్షణ రుణం పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని 3 నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు నెలకు 3.5 శాతం నుంచి ప్రారంభమౌతుంది. Also Read: శుభవార్త.. రూ.2,100 పడిపోయిన బంగారం.. వెండి మరింత పతనం! అయితే తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే భారీ పెనాల్టీలు ఉంటాయని ఎంపాకెట్ ఫౌండర్, సీఈవో గౌరవ్ జలాన్ తెలిపారు. త్వరలోనే ఉద్యోగం చేసే వారికి కూడా రుణాలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అలాగే మైక్రో బిజినెస్, చిన్న ఎంట్రప్రెన్యూర్లకు రుణ సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు. Also Read: ఈపీఎఫ్‌వో దీపావళి బొనాంజా.. పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలోకి రూ.54,000 కోట్లు!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
Jul 23,2017 ప్రాంగణ నియమకాల్లో 'హ్యుందా'రు హైదరాబాద్‌: హ్యుందారు పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్‌ఆండ్‌డి) హైదరాబాద్‌ సెంటర్‌లో కొత్తగా 41 మంది ఇంజినీర్లను తీసుకున్నట్లు ఆ సంస్థ హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ ఇఎస్‌ యూన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు చెందిన వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల నుండి ప్రాంగణ ఎంపికల ద్వారా వీరిని తీసుకున్నామన్నారు. వీరంతా మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో నైపుణ్యవంతులని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి అత్యుత్తమ నైపుణ్యం కలిగిన 800 మందికి పైగా ఉన్న సిబ్బందితో కొత్తగా వీరు జత చేరతారన్నారు. కొత్తగా చేరబోయే వారితో పాటు వారి తల్లితండ్రులు సంస్థ గురించి వారికి ఒక మంచి అవగాహనను కల్పించడం కోసం ఫ్యామిలీ కనెక్ట్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామని హెచ్‌ఆర్‌ ఏజీఎం రమేష్‌ పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV '512 జీబీ' స్మార్ట్‌ఫోన్ కూడా రానుంది..! త్వరలో... ప్రపంచంలోనే అత్యధిక మెమొరి సామర్థ్యంతో పనిచేసే స్మార్ట్‌ఫోన్ మనముందుకు రాబోతుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయ్ ఈ ఫోన్‌ను తీసుకురానుంది. TNN | Updated: Mar 23, 2018, 04:50PM IST త్వరలో... ప్రపంచంలోనే అత్యధిక మెమొరి సామర్థ్యంతో పనిచేసే స్మార్ట్‌ఫోన్ మనముందుకు రాబోతుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయ్ ఈ ఫోన్‌ను తీసుకురానుంది. ' హువాయ్ పి20 ' పేరుతో త్వరలోనే మార్కెట్లోకి ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్.. దిగ్గజ సంస్థలైన స్యామ్‌సంగ్, యాపిల్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం మార్కెట్లో గరిష్ఠంగా 256 జీబీ సామర్థ్యంతో పనిచేసే స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 'హువాయ్ పి20' రాకతో వినియోగదారులు... 512 జీబీ సామర్థ్యంతో పనిచేసే స్మార్ట్‌ఫోన్లు పొందనున్నారు. 6 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే మార్కెట్లో లభించే మాక్‌బుక్ కన్నా... ఎక్కువ మెమొరి సామర్థ్యం ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. మార్చి 27న ప్యారిస్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. హువాయ్ పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఆవిష్కరించనున్నారు. ఇక ఈ ఫోన్ ధరల విషయానికొస్తే... హువాయ్ పి20 ధర రూ.54,400; హువాయ్ పి20 ప్రొ ధర రూ.72,200 స్థాయిలో ఉండవచ్చు. స్యామ్‌సంగ్ కూడా 512 జీబీ స్మార్ట్‌ఫోన్ తెచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
1entertainment
internet vaartha 177 Views ముంబై : అనిల్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ పవర్‌ నికర లాభం మూడో త్రైమాసికంలో 38శాతం పెరిగి 351.81కోట్లకు చేరింది అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 254.44 కోట్లు మాత్రమే ఉన్న కంపెనీ నికరలాభం 38శాతం పెరిగింది. మార్కెట్‌ అంచనాలను సైతం కంపెనీ అధిగమించింది. 36శాతం పెరిగింది. విద్యుత్‌ ఉత్పత్తిపరంగా 10,548 మిలియన్‌ యూనిట్లకుపెరిగింది. మూడురెట్లు పెరిగిందని కంపెనీ ప్రకటిం చింది. తన మొత్తం ఉత్పత్తి సామర్ధ్యం ఆరువేల మెగావాట్లనుంచి కంపెనీ గణనీయంగా ఉంది. రెవెన్యూ పరంగాకూడా 46శాతం పెరిగి 2666 కోట్లరూపాయలుగా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదేనెలలో 1827 కోట్లుగా ఉన్నట్లు అంచనా. పన్నుల చెల్లింపులకు ముందు నిర్వహణ లాభం 1230కోట్లుగా ఉంది. 96శాతం పెరిగింది ససన్‌లోని అల్ట్రా మెగాపవర్‌ప్లాంట్‌ మధ్యప్రదేశ్‌ ప్లాంట్‌ పరంగా 8158 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తిచేసింది. ఇక యుపిలోని రోసా ఉత్పత్తి ప్లాంట్‌ 1342 మిలి యన్‌ యూనిట్లుగా ఉంది. బూటిబోరి విద్యుత్‌ ప్లాంట్‌ మహారాష్ట్రలో 1022 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసింది. కంపెనీ 100 మెగావాట్ల కాన్సెంట్రేడెడ్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును ధుర్‌సార్‌లో ప్రారంభించింది.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV హీరోలకు మనవరాలిగా నటించి... వాళ్ల పక్కనే హీరోయిన్‌గా మెప్పించిన శ్రీదేవి అతిలోక సుందరిగా ఇండస్ట్రీలో తనకంటు ప్రత్యేక స్థానం సంపాదించిన శ్రీదేవి ఎన్నో అరుదైన రికార్డుల్ని సొంతం చేసుకుంది. బాలనటిగా అరంగేట్రం చేసిన శ్రీదేవి ఆ తర్వాత హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. నాలుగు దశాబ్దాల పాటు అతిలోక సుందరిగానే జనం నీరాజనాలు అందుకున్న శ్రీదేవి నాలుగైదు తరాల స్టార్ హీరోలందరితోనూ నటించింది. TNN | Updated: Feb 25, 2018, 11:11AM IST అతిలోక సుందరిగా ఇండస్ట్రీలో తనకంటు ప్రత్యేక స్థానం సంపాదించిన శ్రీదేవి ఎన్నో అరుదైన రికార్డుల్ని సొంతం చేసుకుంది. బాలనటిగా అరంగేట్రం చేసిన శ్రీదేవి ఆ తర్వాత హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. నాలుగు దశాబ్దాల పాటు అతిలోక సుందరిగానే జనం నీరాజనాలు అందుకున్న శ్రీదేవి నాలుగైదు తరాల స్టార్ హీరోలందరితోనూ నటించింది. బాలనటిగా తెలుగులో బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్ మనుమరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత కాలంలో అదే ఎన్టీఆర్ సరసన 16 ఏళ్ల వయసులో వేటగాడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో వేటగాడు, సర్దార్ పాపారాయుడు, గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, అనురాగదేవత వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో శ్రీదేవి నటించింది. Visit Site Recommended byColombia ఎన్టీఆర్‌తో పాటూ ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో చేశారు. వారి సినిమాల్లో మనవరాలిగా, కూతురిగా నటించిన శ్రీదేవి.. అదే హీరోల సరసన కథానాయికగానూ నటించి మెప్పించారు. ఏఎన్నార్‌-శ్రీదేవి కాంబినేషన్‌లో ముద్దుల కొడుకు అనే సినిమా వచ్చింది. దీని తర్వాత ముద్దుల మొగుడు, శ్రీరంగనీతులు, బంగారు కానుక, ప్రేమ కానుక, ప్రేమాభిషేకం, సత్యం శివం అనే సినిమాలు వచ్చాయి. వీటిలో ప్రేమాభిషేకం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కృష్ణ-శ్రీదేవి కాంబినేషన్‌లో కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కృష్ణ సరసన శ్రీదేవి నటించిన తొలి చిత్రం బుర్రిపాలెం బుల్లోడు. దీని తర్వాత సమాజానికి సవాల్, రామ్ రహీమ్, రాబర్ట్, ఘరానా దొంగ, దేవుడిచ్చిన కొడుకు, చుట్టాలున్నారు జాగ్రత్త, బంగారు బావ, గడసరి అత్త సొగసరి కోడలు, కలవారి సంసారం, బంగారు భూమి, వజ్రాయుధం సహా పలు సినిమాల్లో నటించింది ఈ జంట. వీటిలో వజ్రాయుధం బంపర్ హిట్. కృష్ణంరాజు-శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం పులిబిడ్డ. దీని తర్వాత ఈ జంట త్రిశూలం, అడవి సింహాలు, బాబులు గాడి దెబ్బ అనే సినిమాల్లో నటించింది. ఇందులో రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన త్రిశూలం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అందాల నటుడు శోభన్‌బాబుకి కూతురిగా చేసిన శ్రీదేవి... పలు సినిమాల్లో నటించారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం కార్తీకదీపం. దీని తర్వాత బంగారు చెల్లెలు, మోసగాడు, ఇల్లాలు, కృష్ణార్జునులు, దేవత, కోడెత్రాసు అనే సినిమాల్లో నటించింది ఈ జంట. ఇందులో రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన దేవత ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు ఏఎన్నార్‌తో హీరోయిన్‌గా చేసిన శ్రీదేవి... తర్వాత కుమారుడు నాగార్జునతో కూడా సినిమాలు చేయడం విశేషం. టాలీవుడ్‌లో తొలి తరంతో పాటు... తర్వాత తరం హీరోలతో పాటూ హీరోయిన్‌గా అలరించారు. ఇక కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే శ్రీదేవి రూప్ కి రాణి చోరోం కా రాజా చిత్రంలో దుష్మన్ దిల్ కా వో హై పాట కోసం 25 కేజీలు బరువైన గోల్డెన్ డ్రెస్ ధరించారు. ఆమె పదిహేను రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారంటే ఒక పాత్ర కోసం ఆమెకున్న కమిట్‌మెంట్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల తమిళ పులి మూవీలో 20కేజీల బరువైన కాస్ట్యూమ్స్‌ను ఆమె ధరించి అందర్నీ అందంతో మెస్మరైజ్ చేశారు.
0business
Hyd Internet 155 Views Snap deal Snap deal న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ సేవల దిగ్గజం స్నాప్‌డీల్‌ మూడు రోజుల పాటు ఫెస్టివల్‌ ఆఫర్‌ ప్రకటించింది. శుక్రవారం నుండి ఆదివారం వరకు సాగే ఆ ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని స్నాప్‌డీల్‌ తెలిపింది. ఈ అమ్మకాల్లో ఫ్యాషన్‌, ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నట్లు పేర్కొంది. తమ వినియోగదారులకు నచ్చేలా రెండంకెల్లో డిస్కౌంట్‌ ఆఫర్లను ఇస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్‌ కార్డులను వాడితే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని, ఈ డిస్కౌంట్‌ ఉపయోగించుకోవాలంటే కనీసం 2500 విలువైన షాపింగ్‌ చెయ్యాల్సి ఉంటుందని సూచించింది.
1entertainment
sumalatha 169 Views HimaDas , PM Modi , Sachin Tendulkar Hima Das న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌ను కొనియాడారు. హిమ్‌దాస్‌ను చూసి దేశం గర్విస్తుందని, నెల వ్యవధిలోనే ఐదు అంతర్జాతీయ స్వర్ణాలు దేశానికి అందించినందుకు అభినందలు తెలిపారు. పరుగుల తార హిమదాస్‌ నెల వ్యవధిలోనే ఐదు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించింది. దీనిపై భారత ప్రధాని స్పందిస్తూ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా అద్భుతంగా రాణిస్తున్న హిమదాస్‌ను చూసి దేశం గర్విస్తోంది. దేశం తరఫున ఐదు అంతర్జాతీయ స్వర్ణాలను సాధించినందుకు ఆమెను చూసి అందరూ సంతోషిస్తున్నారు. ఆమెకు అభినందలు. భవిష్యత్తులో మరింత రాణించాలని కోరుకుంటున్నాను.గ అని ట్వీట్‌ చేశారు. 19 ఏళ్ల స్ప్రింటర్‌ హిమదాస్‌కు భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందుల్కర్‌ కూడా అభినందలు తెలియజేశాడు. తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/
2sports
కృష్ణను కలిసిన చంద్రబాబు.. మహేష్ తో బాలయ్య (ఫొటోస్) First Published 30, Jun 2019, 5:37 PM IST తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులతో విజయ నివాసానికి వచ్చి కృష్ణ, మహేష్ బాబులను కలిశారు. ఆయనతో పాటు బాలకృష్ణ నారా లోకేష్ కూడా ఉన్నారు.    విజయనిర్మల కుటుంబాన్ని కలిసిన చంద్రబాబు కృష్ణను పరామర్శించారు విజయనిర్మల ఫోటోకి పూలతో నివాళులర్పించిన చంద్రబాబు అనంతరం ఆమెకు సంబందించిన ఫోటోలను వీక్షించారు. మహేష్ తో బాలకృష్ణ కొంతసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, లోకేష్ కూడా కృష్ణను ప్రత్యేకంగా కలుసుకొని పరామర్శించారు. Recent Stories
0business
sumalatha 124 Views cricket , Imam-ul-haq , Pakistan , PCB Imam ul Haq లాహోర్‌: ఇమామ్‌ ఉల్‌ హక్‌ గత ఐదారు నెలలుగా పలువురు యువతులను తన స్టార్‌డమ్‌తో మభ్యపెట్టి ప్రేమపేరుతో మోసగించి వారికి అసభ్యకరమైన సందేశాలు పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని తీవ్రంగా మందలించింది. పీసీబీ ఇమామ్‌తో మాట్లాడి గట్టిగా మందలించాం. జరిగిన దానిపై అతడు పశ్చాత్తాపం వ్యక్తంచేశాడు. అలాగే బేషరతు క్షమాపణలు కూడా చెప్పాడు. అదంతా అతడి వ్యక్తిగత విషయమే అయినా ఒక ఆటగాడిగా అత్యుత్తమ విలువలు పాటించాలని స్పష్టంగా చెప్పాముగ అని పాక్‌ బోర్డు ఎండీ వసీంఖాన్‌ చెప్పుకొచ్చాడు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
2sports
Visit Site Recommended byColombia ఒకప్పుడు సచిన్ అత్యధిక టెస్టు రికార్డుల్ని బ్రేక్ చేసేలా కనిపించిన కుక్ తర్వాత ఢీలా పడిపోయాడు. తొలి వంద టెస్టుల్లో 25 సెంచరీలు చేసిన ఈ ఇంగ్లాండ్ క్రికెటర్.. తర్వాతి 50 టెస్టుల్లో కేవలం 6 శతకాలు మాత్రమే సాధించాడు. ఈ యాషెస్‌లో కుక్ సగటు 14 మాత్రమే. ఏ సిరీస్‌లోనైనా అతడికి ఇదే అత్యల్పం కావడం గమనార్హం. 2010-11 యాషెస్ సిరీస్‌లో 127.66 సగటుతో 766 పరుగులు చేసిన కుక్.. ఈసారి వరుసగా విఫలం అవుతుండటం ఇంగ్లాండ్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. పెర్త్ టెస్ట్ రికార్డులు: 8 - వాకాలో ఇంగ్లాండ్ వరుసగా 8 ఓటములు ఎదుర్కొంది. ఒకే వేదికపై ఒకే ప్రత్యర్థి చేతిలో మరే జట్టు కూడా ఇన్నిసార్లు ఓడిపోలేదు. 1931-76 మధ్య విండీస్ జట్టు ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓడింది. 259 – తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా సాధించిన ఆధిక్యం ఇది. గత 15 ఏళ్లలో యాషెస్ టెస్టులో ఇంత స్వల్ప ఆధిక్యంతో ఓ జట్టు గెలవడం ఇదే తొలిసారి. ఆసీస్ జట్టు 2002లో 210 పరుగుల ఆధిక్యంతో తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినప్పటికీ.. 51 పరుగుల తేడాతో గెలుపొందింది. 403 – తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 403 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పెర్త్‌లో ఓడిన జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. 7 – విదేశాల్లో ఇంగ్లాండ్‌కు వరుసగా ఏడో టెస్టు ఓటమి ఇది. భారత గడ్డ మీద గతేడాది నవంబర్లో వైజాగ్‌లో ఓడింది మొదలు.. ఆ జట్టు ఇప్పటి వరకూ విదేశాల్లో గెలుపు రుచి చూడలేదు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Visit Site Recommended byColombia మీటూపై నటి పూజా హెగ్దే కూడా మాట్లాడారు. ఆమె కథానాయికగా నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాకు సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ అతను ఇద్దరు నటీమణులను రేప్ చేశాడని ఆరోపణలు రావడంతో అతన్ని సినిమా నుంచి తప్పించారు. అతని స్థానంలో ఫర్హాద్ సంఝీని ఎంపిక చేసుకున్నారు. దీనిపై పూజ మాట్లాడుతూ.. ‘హౌస్‌ఫుల్ 4 సినిమాకు కథ రాసింది ఫర్హాదే. సాజిద్‌పై తప్పుడు ఆరోపణలు వచ్చాయి కాబట్టి అతని స్థానంలో ఫర్హాద్‌ని తీసుకోవడంలో తప్పు లేదు. మీటూకు నేను పూర్తి సపోర్ట్ ఇస్తున్నాను. తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా బయటపెట్టిన నటీమణులకు హ్యాట్సాఫ్ చెప్పాలి. వారు మున్ముందు మరింత ధైర్యంగా పోరాడాలని ఆశిస్తున్నాను. ఎవ్వరూ మీటూని చులకనగా భావించడకండి’ అని తెలిపారు. READ ALSO: భార్య చేతి వంట.. హీరోకు తెచ్చిన తంటా మీటూ ఉద్యమాన్ని ముందు మొదలుపెట్టింది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. 15 ఏళ్ల క్రితం నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అక్కడి నుంచి ఈ ఉద్యమం ఊపందుకుంది. అంతకుముందు మీటూ గురించి చాలా మంది మాట్లాడారు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. చూసీ చూడనట్లు వదిలేశారు. ఎప్పుడైతే తనుశ్రీ దత్తా తనకు జరిగిన అన్యాయం గురించి బయటపెట్టిందో అప్పుడే మీటూ ఉద్యమం సునామీ క్రియేట్ చేసింది. ఎందరో బాగోతాలు బయటపడ్డాయి. నిందితులను సినిమాల నుంచి తప్పించారు. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు తగ్గుముఖం పడుతున్నాయి.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV పీఎఫ్ ఖాతాదారులకు పండుగ బొనాంజా.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే నష్టపోవాల్సిందే! మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటు పెంచింది. ఈ పెంచిన వడ్డీ యాక్టివ్ యూఏఎన్ నెంబర్ ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల మీరు కూడా మీ యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోండి. Samayam Telugu | Updated: Oct 10, 2019, 01:20PM IST పీఎఫ్ ఖాతాదారులకు పండుగ బొనాంజా.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే నష్టపోవాల్సిందే! హైలైట్స్ పీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటు పెంపు 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు ప్రయోజనం అయితే యూఏఎన్ నెంబర్ యాక్టివ్‌గా ఉన్న వారికే ఈ సదుపాయం అందుకే వెంటనే యూఏఎన్ నెంబర్ తీసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోండి దీపావళి వచ్చేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) 6 కోట్ల మంది చందాదారులకు బిగ్ బొనాంజా ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీరేటును పెంచింది. అయితే ఈ ప్రయోజననం పొందాలంటే ఒక పని మాత్రం కచ్చితంగా చేయాలి. ఈపీఎఫ్‌వో యూఏన్ యాక్టివేషన్ చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే పెరిగిన వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. అంటే కంపెనీ నుంచి యూఏఎన్ నెంబర్ ఉన్న వారికే వడ్డీ పెంపు వర్తిస్తుంది. మీకు యూఏఎన్ నెంబర్ లేకపోతే ఈ ప్రయోజనం కోసం వేచిచూడాల్సిందే. యూఏఎన్ లేకపోతే మీ కంపెనీని అడిగి ఆ నెంబర్ తీసుకోండి. తర్వాత ఆన్‌లైన్‌లో దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ మేనేజర్ కార్తీక్ ఝవేరీ మాట్లాడుతూ.. 20 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులను కలిగిన కంపెనీలు కచ్చితంగా వారికి ఈపీఎఫ్‌వోలో చందాదారులగా చేర్చాలి. కంపెనీ ఈపీఎఫ్‌వో వద్ద రిజిస్టర్ అయితే అప్పుడు ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బేసిక్ వేతనం రూ.15,000 వరకు ఉంటుంది. అలాగే వీరు ఈపీఎఫ్‌లో కూడా చేరాలి. ఈపీఎఫ్ ఫండ్‌లో ఎంప్లాయీ, కంపెనీ 12 శాతం చొప్పున జమచేయాల్సి ఉంటుంది. Also Read: ఉద్యోగం మారితే.. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్/విత్‌డ్రా చేసుకోలేరు! కానీ.. పీఎఫ్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరికీ ఈపీఎఫ్‌వో యూఏఎన్ నెంబర్‌ను కేటాయిస్తుందని సెబీ రిజిస్టర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ మణికరన్ సింగ్ తెలిపారు. దీంతో ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే పీఎఫ్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. Also Read: ఈపీఎఫ్‌వో గుడ్ న్యూస్.. పీఎఫ్ ఖాతాదారులకు కొత్త సౌకర్యం అందుబాటులోకి! యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్, మెంబర్ ఐడీ, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ వంటి వివరాలు అవసరం అవుతాయి. మీరు వెంటనే కంపెనీ హెచ్ఆర్ అధికారులను అడిగి యూఏఎన్ నెంబర్ తీసుకోండి. ఈపీఎఫ్‌వో పోర్టల్‌కు వెళ్లి దాన్ని యాక్టివేట్ చేసుకోండి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
internet vaartha 124 Views 416 మంది అథ్లెట్ల బృందం బీజింగ్‌ : వచ్చే నెలలో జరుగనున్న ఒలింపిక్స్‌ కోసం చైనా భారీ టీమ్‌ను రియో  ఒలింపిక్స్‌కు పంపిస్తుంది.ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే రియో ఒలింపిక్స్‌కు 416 మంది అథ్లెట్లతో కూడిన బృందం చైనా పంపిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.వీరిలో 35 మంది ఒలింపిక్‌ చాంపియన్స్‌ ఉన్నారు.ఈ భారీ బృందంలో 160 మంది పురుషులు,256 మంది మహిళా అథ్లెట్స్‌ ఉండగా వీరు 201 ఈవెంట్స్‌లో పోటీపడనున్నారు.ఒలింపిక్స్‌కు చైనా పంపిస్తున్న అతిపెద్ద  బృందం ఇదేనని ఆదేశ క్రీడాధికారి కాయి జెన్‌హువా పేర్కొన్నారు. టెబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, జిమ్నాస్టిక్స్‌,వెయిట్‌ లిఫ్టింగ్‌,షూటింగ్‌,డైవింగ్‌ తదితర విభాగాల్లో స్వర్ణ పతకాలపై చైనా ఆశలు పెట్టుకుంది. గత లండన్‌ ఒలింపిక్స్‌లో పతకాల పట్టికలో అమెరికా తరువాత చైనా రెండవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 38 స్వర్ణాలు,27 రజత,23 కాంస్య పతకాలను ఆ దేశం కైవసం చేసుకుంది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Vithika Sheru: భీమవరం పాప ఇక్కడ వరకూ రావడమే గ్రేటూ.. టోటల్ డ్యామేజ్! Bigg Boss Telugu Elimination: ఆదివారం నాటి ఎపిసోడ్‌లో వితికా షెరు ఎలిమినేట్ అయ్యింది.. 13 వారాల పాటు భర్త వరుణ్‌తో కలిసి గేమ్ ఆడిన వితికా బిగ్ బాస్ బంధానికి బ్రేక్ పడటానికి కారణాలేమిటి? ఎక్కడ తేడా కొట్టింది? Samayam Telugu | Updated: Oct 21, 2019, 01:14PM IST బిగ్ బాస్ ఇదో మంచి ప్లాట్ ఫామ్. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత.. ఆడుకున్నోళ్లకు ఆడుకున్నంత. అవకాశాలు లేక అడ్రస్ లేని వాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఎలాగైతే మారుతుందో.. కాస్తో కూస్తో పాపులారిటీ ఉన్న వాళ్లని అధ:పాతాళానికి నెట్టేస్తుందన్నది కూడా అంతే నిజం. సీజన్ 1లో అర్చన, సీజన్ 2లో తేజస్విలకు రెమ్యూనరేషన్ పరంగా బిగ్ బాస్ హెల్ప్ అయినప్పటికీ షో ముగిసిన తరువాత వాళ్లకు కొత్తగా ఒరిగిందేమీ లేకపోగా.. ఉన్న ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అయ్యిందనే చెప్పాలి. కేరింత, ఐస్ క్రీమ్ అంటూ ప్రేక్షకుల్ని అలరించిన తేజస్వి అయితే అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకుచర్చకొచ్చిందంటే.. బిగ్ బాస్ సీజన్ 3 నుండి 13 వారంలో వరుణ్ వైఫ్ వితికా ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఈ షోకి రావడం వల్ల వచ్చిన ఇమేజ్ సంగతి పక్కనపెడితే డ్యామేజ్ కూడా అదే రేంజ్‌లో ఉంది. బిగ్ బాస్‌లో మొట్టమొదటి కపుల్‌గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్-వితికాల జంట సీజన్‌ 3లో జంటగా వచ్చి జంటగా బిగ్ బాస్ ఆట ఆడి ప్రేక్షకుల్ని 91 రోజుల పాటు అలరించారు. అయితే వరుణ్-వితికాల బిగ్ బాస్ బంధానికి ఆదివారం నాటితో బ్రేక్ పడింది. Read Also: వితిక ఔట్.. గట్టిగా హత్తుకుని ఏడ్చేసిన వరుణ్ సందేశ్ 13 వారం నామినేషన్స్‌కి ఇంటి సభ్యులందరూ వెళ్లగా.. వితికా షెరు ఆటకట్టిస్తూ హౌస్ నుండి బయటకు పంపారు. నామినేషన్స్ సందర్భంగా శివజ్యోతి కొట్టిన దెబ్బకు బిగ్ బాస్ నుండి బయటకొచ్చిపడింది వితికా. నామినేషన్స్ అప్పుడు వరుణ్.. తన భార్య వితికాను సేవ్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకుని అందరూ నేమినేషన్స్‌కి వెళ్లేలా చేసిన శివజ్యోతి తన పంతాన్ని నెరవేర్చుకుంది. వితికా ఇన్నిరోజులు హౌస్‌లో ఉండటమే ఎక్కువా..? ‘జంటగా బిగ్ బాస్ హౌస్‌కి వెళ్తున్నారు. ఆట మాత్రం ఒంటిరిగానే ఆడాలి?’.. ఇదీ వితికా, వరుణ్‌లను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించేటప్పుడు హోస్ట్ నాగార్జున చెప్పిన మాట. అయితే ఈ జంట 90 రోజుల పాటు బిగ్ బాస్ ఆటను జంటగానే ఆడారు తప్ప ఎవరి ఆట వాళ్లు ఆడిన సందర్భాలు లేవు. ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకుంటూనే కనిపించారు. రాహుల్-పునర్నవి కోసం త్యాగం చేయడం.. బాబా భాస్కర్-శ్రీముఖి కోసం త్యాగం చేయడం.. అలీ-శివజ్యోతి కోసం త్యాగం చేయగాలేనిది భర్త కోసం భార్య, భార్య కోసం భర్త త్యాగం చేయడంలో తప్పేం లేకపోవచ్చు. Read Also: రాహుల్‌పై వితికా షాకింగ్ కామెంట్స్.. అవకాశవాది అంటూ.! అయితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎవరి ఆట వాళ్లు ఆడుకుంటేనే మంచిదనే అభిప్రాయం ఉంటుంది. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుని గ్రూప్‌గా ఏర్పడి ఆట బాగా ఆడేవాళ్లను నామినేట్ చేయడం వల్ల మంచి కంటెస్టెంట్స్‌ని మిస్ అయ్యాం అనే అభిప్రాయం ప్రేక్షకులకు కలుగుతుంది. వాస్తవానికి వరుణ్ సందేశ్ ఉన్నందుకే వితికాను ఇన్నిరోజుల పాటు బిగ్ బాస్ ఉంచారనేది తప్పక ఒప్పుకోవాల్సిందే. లేదంటే హిమజ, రోహిణి, రవిక్రిష్ణ, అషు రెడ్డి మాదిరి ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిందే. ఈ షో వితికా షెరు లైఫ్‌లో పెద్ద అచీమ్‌మెంట్ అయినప్పటికీ తొలివారం ఆమె ఆటపై విమర్శలు తలెత్తాయి. ఆమెలో బిగ్ బాస్ విన్నర్ అయ్యే మెటీరియల్ కాదని తొలి నుండి వినిపిస్తున్న మాట. ముఖ్యంగా వరుణ్‌ని డ్యామినేట్ చేయడం.. తన ఆట తను ఆడకుండా వరుణ్‌కి గేమ్ ప్లాన్ చెప్పడం. వరుణ్ కెప్టెన్ అయితే వితికా పెత్తనం చెలాయించి అతన్ని ఫ్రూట్‌ని చేసి ఆడించడం విమర్శలకు తావిచ్చింది. ఇక వరుణ్ చాలా వరకూ మిస్టర్ కూల్‌గానే ఉన్నప్పటికీ.. టెంపర్ చూపించిన ప్రతి సందర్భంరానికి కారణం వితికానే అయ్యింది. మహేష్, రాహుల్, అలీలతో గొడవలకు సైతం వితికానే కారణం అయ్యింది. Read Also: పోల్ రిజల్ట్: వితికా ఆటకట్.. భీమవరానికి టిక్కెట్ రెడీ ఇక ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడకుండా వాళ్ల వెనుకు మాట్లాడటం. వాళ్ల ముందు ఒకలా.. తరువాత ఒకలా నెరేట్ చేసి చెప్పడం.. అలాగే టాస్క్‌లు, నామినేషన్స్ అప్పుడు గ్రూప్‌లు కట్టి ఎలాగోలా ఎస్కేప్ అయ్యిది. ఇక బ్యాటిల్ ఆఫ్ మెడాలియిన్ టాస్క్‌లో బాబా భాస్కర్‌ని బోల్తా కొట్టించి అడ్డదారిల మెడాలియన్ విన్ కావడంపై కూడా పలు విమర్శులు వచ్చాయి. ఇవన్నీ కాకుండా వితికా తప్పుగా గేమ్ ఆడుతున్న సందర్భంలో వరుణ్ ఆమె తప్పుని తప్పు అని చెప్పి ఆమె ఇమేజ్‌ని ఒక రకంగా డ్యామేజ్ చేశాడనే చెప్పాలి. పలు సందర్భాల్లో వరుణ్ మంచోడు.. వితికా చెడ్డది అని ప్రేక్షకుల బుర్రల్లో నాటుకుపోయేలా చేశారు. ‘భార్య అంటే సహనంతో ఉండాలి.. అంతే తప్ప భర్త ఆవేశాన్ని రెట్టింపుచేసి గొడవను పెద్దది చేసేదిగా ఉండకూడదని’ బాబా భాస్కర్ చెప్పినట్టుగా వితికా చిన్నదానికి పెద్దదానికి గొడవపెట్టుకోవడం ఆడియన్స్‌లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. మొత్తానికి భర్తతో కలిసి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన ఈ భార్య బిగ్ బాస్ జర్నీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది కాని.. వితికాను విజేతను చేయలేకపోయింది.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV డబ్బులిస్తే.. ఆ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నానో లేదో చెప్తా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. నటి రియా చక్రబోర్తి డేటింగ్‌లో ఉన్నారని చాలా కాలంగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీనిపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మీడియా ద్వారా స్పందించారు. Samayam Telugu | Updated: Sep 9, 2019, 12:10PM IST డబ్బులిస్తే.. ఆ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నానో లేదో చెప్తా ‘నేను అడిగినంత డబ్బిస్తే రియాతో డేటింగ్‌లో ఉన్నానో లేదో చెప్తాను’ అంటున్నారు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ . సుశాంత్.. ‘తూనీగ తూనీగ’ ఫేం రియా చక్రబోర్తితో డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసే విహారయాత్రలకు వెళుతున్నారు. దీనిపై మీడియా వర్గాలు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఏమీ లేదనే మాట దాటేస్తున్నారు. తాజాగా సుశాంత్ తన ప్రేమ వ్యవహారంపై ఎట్టకేలకు పెదవి విప్పారు. ‘మీరు సింగిల్‌గానే ఉన్నారా?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సుశాంత్ ఇచ్చిన సమాధానం షాక్‌కు గురిచేస్తోంది. ‘నేను ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదివాను. ఆ తర్వాత హీరో అయ్యాను. ఇదంతా నా అదృష్టం వల్ల జరగలేదు. నేను ఆ రకంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్లాను కాబట్టి జరిగింది. కాబట్టి నేను నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై సమాధానం ఇవ్వాలంటే నేను చాలా డబ్బు తీసుకుంటాను. నాకు ఓ పెద్ద పేరున్న మ్యాగజైన్‌పై నా ఫొటోతో పాటు డబ్బు కూడా కావాలి. అవి ఇస్తేనే నేను డేటింగ్‌లో ఉన్నానో లేనో చెప్తాను.’ అని చమత్కరించారు. గతంలో రియా గురించి సుశాంత్ మాట్లాడుతూ.. ‘నా ప్రేమ గురించి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ఫస్ట్ స్టేజ్‌లో ఉన్న విషయాల గురించి ప్రజలు అన్నీ తెలిసినట్లుగా ఏవేవో ఊహించకూడదు. ఒకవేళ నేను ప్రేమలో ఉన్నానో లేదో చెప్పాలంటే నేను ప్రేమించే వ్యక్తి నుంచి అనుమతి తీసుకోవాలి’ అంటూ మాటదాటేశారు. గతంలో సుశాంత్.. అంకితా లోఖాండే అనే బుల్లి తెర నటితో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ‘పవిత్ర రిష్తా’ అనే ధారావాహికలో కలిసి నటించారు. వీరి కెరీర్ ప్రారంభమైంది కూడా ఈ సీరియల్‌తోనే. ఆ తర్వాత సుశాంత్ దశ తిరిగింది. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా ‘కాయ్ పోచే’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు సుశాంత్. ఆ తర్వాత వచ్చిన ‘ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాతో ఆయన కెరీర్‌కు బ్రేక్ దొరికింది. ఇటీవల సుశాంత్ నటించిన ‘చిచ్ఛోరే’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని రాబడుతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 31, Oct 2018, 10:22 AM IST Highlights అల్లరి నరేష్, మహేష్ బాబు మధ్య స్నేహం..వింటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఓ కామెడీ హీరో, సూపర్ స్టార్ కలిసి కబుర్లు చెప్పుకుంటారా..నవ్వుకుంటారా అంటే అవుననే వినపడుతోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారట.  అల్లరి నరేష్, మహేష్ బాబు మధ్య స్నేహం.. వింటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఓ కామెడీ హీరో, సూపర్ స్టార్ కలిసి కబుర్లు చెప్పుకుంటారా.. నవ్వుకుంటారా అంటే అవుననే వినపడుతోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారట. మహర్షి సినిమా కోసం అల్లరి నరేష్ , మహేష్ కలిసారు.  ఈ సినిమాలో ఇద్దరూ స్నేహితులుగా కనిపిస్తారట. వాస్తవానికి మొదట నరేష్ పాత్ర లేదట. అయితే సెకండాఫ్ లో చాలా సీరియస్ గా కథ నడుస్తోంది..ఏదైనా ఫన్ పాత్ర ఉంటే రిలీఫ్ గా ఉంటుంది అని మహేష్ భావించటంతో..దర్శకుడు అల్లరి నరేష్ క్యారక్టర్ డిజైన్ చేసారట. ఆయన పాత్ర పల్లెలో ఉంటుందట. మహేష్ అమెరికా నుంచి వచ్చి పల్లెలో వ్యవసాయం చేసేటప్పుడు ఆయనకు సపోర్ట్ గా నిలబడే పాత్ర అని తెలుస్తోంది.  లోకల్ గా ఉండే ఈ పాత్ర గమ్యంలో నరేష్ పాత్రలా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ నేపధ్యంలో నరేష్, మహేష్ కొన్ని సార్లు కలవటం జరిగింది. నరేష్ పాత్రను ఇంప్రవైజ్ చేసే తీరు చూసి మహేష్ చాలా ఇంప్రెస్ అయ్యారట. మహేష్ జోవియల్ నేచర్... నరేష్ కు తెగ నచ్చేసిందట. దాంతో అప్పటినుంచి ఇద్దరూ టచ్ లో ఉండటం జరుగుతోందట. అలా వీళ్లిద్దరు మధ్య ఓ చక్కటి అనుబంధం ఏర్పడిందని, తెరపై కూడా అది ప్రతిఫలిస్తుందని, నిజ జీవిత స్నేహితులు తెరపై కూడా అలాగే కనపడితే ఆ సీన్స్ లో జీవం వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇదంతా దర్శకుడు వంశీ పైడిపల్లి ఊహించే...ఇలా వీళ్లిద్దరని కలిపారనే మరో టాక్ కూడా నడుస్తోంది.   ఇక చిత్రం షెడ్యూల్ వివరాల్లోకి వెళితే.. మహేష్  నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ అమెరికా షెడ్యూల్ పూర్తయింది. అక్టోబర్ 18  నుంచి నవంబర్ చివరి వరకూ వరకూ అమెరికాలో భారీ షెడ్యూల్ని ప్లాన్ చేసారు. కానీ , నవంబర్ 2 నాటికే 40రోజుల షెడ్యూల్ని ముగించి తిరిగి ఇండియాకి వస్తున్నారు. ఇక్కడికి   రామోజీ ఫిలింసిటీలో విలేజ్ సెట్లో భారీ షెడ్యూల్ ఉంటుందని తెలిసింది. ఏప్రిల్ 5న ఉగాది కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు. దిల్‌రాజు-, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  Last Updated 31, Oct 2018, 10:22 AM IST
0business
Hyderabad, First Published 2, Apr 2019, 10:02 AM IST Highlights ఓ సినిమా హిట్ టాక్ తో నడుస్తున్నప్పుడు దాన్ని గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే బాధ కలుగుతుంది.  ఓ సినిమా హిట్ టాక్ తో నడుస్తున్నప్పుడు దాన్ని గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే బాధ కలుగుతుంది. అదే ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్ నెగిటివ్ గా మాట్లాడితే..అది వైరల్ అయితే ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు అదే సమంత తాజా చిత్రం విషయంలో జరుగుతోంది. సమంత నటించిన ‘సూపర్‌ డీలక్స్’ చిత్రంపై ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్‌ నటరాజన్‌ సుబ్రహ్మణ్యం కామెంట్‌ చేశారు. అవి వైరల్ అయ్యాయి.  త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించిన  ‘సూపర్‌ డీలక్స్’  చిత్రంలో విజయ్‌ సేతుపతి హిజ్రా పాత్రలో, రమ్యకృష్ణ వేశ్య పాత్రల్లో నటించారు. సమంత చాలా విభిన్నమైన పాత్రలో కనిపించారు. గత వారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.  అయితే ఈ సినిమా  అందరికీ నచ్చలేదు. కొందరు చూసి సైలెంట్ అయ్యితే..మరి కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ వ్యాఖ్యానాలు చేసారు. ఈ సినిమా గురించి నటరాజన్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘నిజ జీవితంలో ఇలాంటి అసహ్యమైన అంశాలను ప్రోత్సహించడం, అభినందించడం కరెక్టేనా? ఇలాంటి తక్కువ స్థాయి అంశాలకు నేను దూరంగా ఉంటాను. ‘సూపర్‌ డీలక్స్’.. ఇది సినిమానా.. ఓ గాడ్‌.. అసలు భరించలేకపోయా’ అన్నారు. నటరాజన్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ట్వీట్‌ కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ సినిమా అభిమానులు మాత్రం నటరాజన్‌ వ్యాఖ్యల పట్ల ఆయన్ను తప్పుబడుతున్నారు. సినిమా నచ్చకపోయినంత మాత్రాన ఇలా నీచంగా కామెంట్‌ చేయకూడదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై సమంత స్పందించలేదు కానీ బాధపడినట్లు సమాచారం. గతంలో సమంత నటించిన అ...ఆ చిత్రానికి నటరాజన్ సినిమాటోగ్రాపర్ గా పనిచేసారు. Last Updated 2, Apr 2019, 10:02 AM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సీమ రెడ్ల చరిత్ర అంటున్న వర్మ! తన హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలవడం అలవాటుగా మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. TNN | Updated: Dec 14, 2017, 12:36PM IST తన హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలవడం అలవాటుగా మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ .. ఒకవైపు ఇప్పుడు నాగార్జున సినిమాతో బిజీగా ఉన్నాడని..వేరే హడావుడి చేయడాని అంతా అనుకున్నారు. అయితే అలా ఉండటం తన వల్ల కాదన్నట్టుగా ఆర్జీవీ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. వెబ్ సీరిస్ అంటూ.. వర్మ హడావుడి చేస్తున్నడిప్పుడు. ఇందుకు సంబంధించిన సబ్జెక్టును ఎంచుకున్న వైనంతో హాట్ టాపిక గా మారాడు. ‘రాయలసీమ రెడ్ల చరిత్ర’ మీద వెబ్ సీరిస్ తీస్తాను అనేది వర్మ తాజా ప్రకటన. అందులో ఒకటి రెడీ అయిపోయిందట. ‘కడప’ పేరుతో తీసిన ఇది రేపే రిలీజ్ కాబోతోందట. ఈ విషయాన్ని చెబుతూ కూలంకషంగా ఒక ఫేస్ బుక్ పోస్టు పెట్టాడు ఆర్జీవీ. అదిలా ఉంది... "కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర" వెబ్ సిరీస్ వెనుక నా సద్బుద్ధితో కూడిన దుర్బుద్ధికరమైన సదుద్దేశ్యం ఏమిటంటే... నేను డిజిటల్ ప్రపంచంలోకి రావడానికి ఒకే ఒక్క కారణం..వెండితెర మీద నన్ను నా ఇష్టం వచ్చినట్టు చెప్పనివ్వని కథల్ని ఎవడినీ కేర్ చెయ్యకుండా నాకిష్టం వచ్చినట్టు చెప్పడం కోసం. ఈ బ్యాక్ గ్రౌండ్ లో మొత్తం వరల్డ్ ప్రేక్షకుల కోసం ముంబై మాఫియా బ్యాక్ గ్రౌండ్లో నేను నిర్మిస్తున్న గన్స్ అండ్ థైస్ సిరీస్ తర్వాత నేను తీస్తున్న మొట్టమొదటి తెలుగు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ "కడప".
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ధోనీకి సాధ్యం కాలేదు.. కోహ్లి సాధిస్తాడు..! ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ కోహ్లి సారథ్యంలోని టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయగలదని మాజీ కెప్టెన్ సౌరవ్ TNN | Updated: Feb 27, 2018, 12:53PM IST ధోనీకి సాధ్యం కాలేదు.. కోహ్లి సాధిస్తాడు..! ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ కోహ్లి సారథ్యంలోని టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయగలదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియాకి’ మంగళవారం రాసిన వ్యాసంలో.. భారత్ పర్యటనల గురించి తన అభిప్రాయాన్ని వివరించిన గంగూలీ.. విరాట్ కోహ్లీ నాయకత్వంపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో తొలుత మూడు టెస్టుల సిరీస్‌ని 1-2తో చేజార్చుకున్న భారత్ జట్టు.. ఆరు వన్డేల సిరీస్‌ని 5-1తో, మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత్.. అనంతరం చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుంది. భారత్ జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చివరి పర్యటనల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పట్లో మహేంద్రసింగ్ కెప్టెన్సీలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనని 0-2తో, ఆస్ట్రేలియా టూర్‌ని 1-3తో పేలవ రీతిలో ముగించింది. అయితే.. గత వారం ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనని చూసిన తర్వాత.. కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు ఆ రెండు దేశాల్లో మెరుగైన ప్రదర్శన చేయగలదని గంగూలీ వివరించాడు. ‘ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో సిరీస్‌లు గెలవాలనేది ప్రతి పర్యాటక జట్టు కల. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. రాబోవు పర్యటనల్లో.. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా సత్తాచాటేలా ఈ ప్రదర్శన స్ఫూర్తి నింపుతుంది. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా చాల మెరుగ్గా బౌలింగ్ చేశారు. భారత బౌలింగ్ భవితవ్యం వారిపైనే ఆధారపడి ఉంది. సఫారీ గడ్డపై ఓటమితో సిరీస్‌ని ఆరంభించినా.. గెలుపుతో ముగించేలా భారత్‌ పుంజుకున్న విధానం అద్భుతం. ఈ జట్టు కచ్చితంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో అద్భుతాలు చేస్తుంది’ అని గంగూలీ వివరించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
దేశీయ వాహనాలకు ప్రాధాన్యం  ప్రభుత్వ కొనుగోళ్లలో తప్పనిసరి నిబంధనలు న్యూఢిల్లీ: పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌లో దేశీయంగా తయారైన వాహనాలకు ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది. దీనిని తప్పనిసరి చేస్తూ కేంద్ర భారీపరిశ్రమల మంత్రిత్వశాఖ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 'మేకిన్‌ ఇండియా' కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ స్థానిక తయారీని, వాటి ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. దేశీయంగా తయారైన ఉత్పత్తులుగా పరిగణించాలంటే అందులో కనీసం 65శాతం కంటెంట్‌ స్థానికంగా చెందినదిగా అయినా ఉండాలి. ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా ఇప్పటికే అమలులోకి ఉన్నాయి. అయితే వీటిపై వచ్చే ఏడాది మార్చి 31న కేంద్రం మరోసారి సమీక్ష నిర్వహించనుంది. కాబట్టి ఈ అంశంపై సవరణ నోటిఫికేషన్‌ జారీ అయ్యేవరకు ఈ నిబంధనలే అమలులో ఉండనున్నాయి. ఒకవేళ కొనుగోలు విలువ రూ. 10 కోట్లు దాటితే స్టాచ్యుటరీ ఆడిటర్‌ లేదా కంపెనీ కాస్ట్‌ ఆడిటర్‌ లేదా కాస్ట్‌ అకౌంటెంట్‌ లేదా చార్టెడ్‌ అకౌంటెంట్‌ నుంచి స్థానిక కంటెంట్‌ విషయంలో స్థానిక సప్లయర్‌ ఓ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
పాప కోసం.. ఏ ఫండ్‌ బెటర్‌? September 02, 2019, 11:22 IST నాకు నెల క్రితమే ఒక పాప పుట్టింది. ఆమెను డాక్టర్‌ చెయ్యాలనేది నా కల. ఆమె భవిష్యత్తు కోసం ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌... రిటైర్మెంట్‌కు ఎంత కావాలి? July 08, 2019, 12:43 IST ఈ తరం వారికి రిటైర్మెంట్‌ తర్వాత పెన్ష వచ్చే సదుపాయాలు ఉండడం లేదు.ప్రైవేటు రంగంలోని వారికి ఈపీఎఫ్‌ ఉన్నా కానీ, అదేమంత సరిపోయే మొత్తం కాదు.... మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌లో మంచి అవకాశాలు July 01, 2019, 11:21 IST ఎన్‌డీఏకు స్పష్టమైన విజయాన్ని ఇవ్వడంతో ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌ నెలకొంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగంలో పెట్టుబడులకు ఇది మంచి... రిలయన్స్‌ ఔట్‌.. ఫండ్స్‌పై ప్రభావం ఉంటుందా? June 17, 2019, 12:33 IST నేను, నా భార్య సీనియర్‌ సిటిజన్‌లం. మేం గత కొన్నేళ్లుగా నాలుగు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాం. అవి యాక్సిస్‌ లాంగ్‌టెర్మ్‌ ఈక్విటీ,... హెల్త్‌ ఇన్సూరెన్స్ చాలా అవసరం June 10, 2019, 09:22 IST వైద్య బీమా నేటి రోజుల్లో ఎంతో కీలకమైనదని, ముఖ్యంగా వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో దీని అవసరం ఎంతో ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్... నన్నడగొద్దు ప్లీజ్‌  May 15, 2019, 00:03 IST హాయ్‌ బాబాయ్‌..! మీరు అందరికీ మంచి సలహాలు ఇస్తుంటారు కదా. మరి నాకు కూడా ఓ మంచి సమాధానం ఇవ్వండి బాబాయ్‌. నేనొక అమ్మాయిని రెండేళ్ల నుంచి ప్రాణం కంటే... నన్నడగొద్దు ప్లీజ్‌   May 08, 2019, 01:15 IST హాయ్‌ అన్నయ్యా! ఈ మధ్యనే ఒక అబ్బాయిని కలిశాను. కలిసిన కొద్దిరోజుల్లోనే ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. కానీ తన జీవితంలో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు... నన్నడగొద్దు ప్లీజ్‌  May 01, 2019, 00:13 IST హాయ్‌ అన్నా! నేనొక అమ్మాయిని లవ్‌ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో నేను చూస్తుంటే తనూ చూడటం స్టార్ట్‌ చేసింది. అలా కొన్నిరోజుల తర్వాత తన ఫోన్‌ నంబర్‌... ఆర్థికంగా వెలిగిపోదాం! April 22, 2019, 09:04 IST నూతన ఆర్థిక సంవత్సరం 2019–20లోకి ప్రవేశించి మూడు వారాలు గడిచిపోయింది. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, వ్యయాలకు తోడు పన్ను బాధ్యతలు... బంగారాన్ని అందుకు కొంటున్నారా? April 15, 2019, 07:33 IST ఎస్‌బీఐ గోల్డ్‌ఫండ్‌లో 2012లో కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేశాను. ఈ ఫండ్‌కు సంబంధించి గ్రోత్‌ ఆప్షన్‌ డైరెక్ట్‌ ప్లాన్‌ను ఎంచుకున్నాను. ఈ ఫండ్‌ ఎన్‌ఏవీ... డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా? April 01, 2019, 00:58 IST మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి మూలధన లాభాలపై పన్నులు ఎలా  ఉంటాయో కొంత వరకూ అవగాహన ఉంది. అయితే పాక్షికంగా విత్‌డ్రాయల్స్‌ విషయంలో పన్నులు ఎలా ఉంటాయి... నన్నడగొద్దు ప్లీజ్‌  March 20, 2019, 00:45 IST హాయ్‌ సార్‌! నేనొక అమ్మాయిని లవ్‌ చేస్తున్నాను. మా ఆఫీస్‌లో నా పక్క సీట్‌లోనే కూర్చుంటుంది. ఎప్పుడూ ఏదో పాట పాడుతూనే ఉంటుంది. ఆ పాట నాకోసమే... నన్నడగొద్దు ప్లీజ్‌   March 13, 2019, 01:31 IST హాయ్‌ అన్నయ్యా! మీరు అమ్మాయిలకు ఇచ్చే సపోర్ట్‌ నాకు బాగా నచ్చుతుంది. నా చెల్లెలు ఒక అబ్బాయిని లవ్‌ చేసి మోసపోయింది. ఇప్పుడు తనకి పెళ్లి చేద్దామని... మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఎన్నికల ప్రభావం ఎంత? March 11, 2019, 01:00 IST త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాదని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే అధికంగా ఉన్నాయని మిత్రులంటున్నారు. ఈ పరిస్థితుల... ఎఫ్‌డీ.. డెట్‌ ఫండ్‌.. ఏది బెటర్‌? February 25, 2019, 01:14 IST నేను కొంత మొత్తాన్ని డెట్‌ ఫండ్‌లో నాలుగేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. 8 శాతానికి పైగా రాబడినిచ్చే డెట్‌ ఫండ్స్‌ ఉన్నాయా? బ్యాంక్‌... నన్నడగొద్దు ప్లీజ్‌  February 11, 2019, 03:02 IST హాయ్‌ సార్‌! మీరెప్పుడూ ఎందుకని అమ్మాయిలనే సపోర్ట్‌ చేస్తారు? నాకొకటి అనిపిస్తోంది. బహుశ ఒక ఆర్గనైజేషన్‌ నేమ్‌తో మీరు సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి... ఉమ్మడి రుణం.. ఉభయకుశలోపరి December 17, 2018, 02:28 IST సొంతింటిని సమకూర్చుకోవాలన్న కల ఎందరికో వుంటుంది. అయితే సొంతంగా ఇంటి కొనుగోలుకు సరిపడా డబ్బులను సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే... అమెరికాను బట్టి అంచనా వేయొద్దు! November 19, 2018, 01:28 IST బాండ్‌ ఫండ్స్‌ పనితీరు గత ఏడాది కాలంలో సంతృప్తికరంగా లేదు. బాండ్ల రాబడులు పెరగడం వల్ల ఈ బాండ్‌ ఫండ్స్‌ ఎలాంటి రాబడులనివ్వలేదు. కొన్నైతే నష్టాలనూ... అప్పుడు ఈఎల్‌ఎస్‌ఎస్‌లు ఆకర్షణీయం కాదు November 12, 2018, 02:09 IST నేను గత కొంతకాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో 3 లేదా 4 మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీలకు చెందిన ఫండ్స్‌ ఉన్నాయి.... బైక్‌ కోసం... ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ? October 29, 2018, 02:18 IST నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మ్యూచువల్‌ ఫండ్స్‌లో 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మల్టీక్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌... Advertisement
1entertainment
తిరిగి బిగ్ బాస్ హౌజ్ లో ముమైత్ ఖాన్..అర్థరాత్రి లైట్స్ ఆన్ Highlights తిరిగి బిగ్ బాస్ హౌజ్ లో ముమైత్ ఖాన్.. బిగ్ బాస్ హౌజ్ చేరుకోగానే అర్థరాత్రి లైట్స్ ఆన్ చేసిన ముమైత్ ముమైత్ రావటంతో పార్టిసిపెంట్స్ సంబరాలు, సందడి బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ కార్యక్రమంలో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన ముమైత్ ఖాన్ మళ్లీ ఇంటి సభ్యులతో జాయిన్ అయ్యింది. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో కల్పన ఓడిపోవడంతో ప్రిన్స్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక కల్పనకు వ్యతిరేకంగా ఇంటి సభ్యులు మాట్లాడుకోవడం, ఆమెకు వ్యతిరేకంగా ఓ బలమైన గ్రూప్ ఏర్పాటైనట్టు స్పష్టమవుతున్నది. కాగా ముమైత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య ఆనందం వెల్లువెత్తింది. కెప్టెన్ ఎంపిక కోసం బిగ్‌బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. గుర్రపు బొమ్మలపై ఊగుతూ ఎక్కువ సేపు ఎవరు ఉంటారో వారి కెప్టెన్‌ అవుతారని చెప్పారు. ఆ టాస్క్‌ లో కొంత సేపటి తర్వాత కల్పన కూప్పకూలింది. మధ్యలోనే శివబాలాజీ డ్రాప్ అయ్యాడు. దాంతో ప్రిన్స్‌ కు కొత్త కెప్టెన్‌  అవకాశం వచ్చింది. మరోవైపు కల్పన తీరుపై కత్తి కార్తీక, మధుప్రియ మనస్తాపానికి గురయ్యారు. తాము ఆమెకు ఎంతో క్లోజ్ గా ఉంటుంటే తమతో అలా వ్యవహరిస్తారా అనే చర్చించుకోవడం కనిపించింది. ఇక కల్పనకు కెప్టెన్ పదవిపై చాలా మోజు ఉంది. లేకపోతే ఆమె అలా వ్యవహరించదు. కెప్టెన్ పదవి వచ్చిన తర్వాత ఆమె బాడీ ల్వాంగ్వేజ్ మారిపోయింది. వామ్మో ఆమెను చూస్తుంటే చాలా భయమేస్తుంది అని అర్చన, సమీర్ కూడా గుసగుసలాడుకోవడం గమనార్హం. అలా కలహాలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం లాంటి ఘటనలతో శుక్రవారం ఎపిసోడ్ సాగింది. అర్థరాత్రి సమయంలో ఇంటి సభ్యులు నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇంటిలో లైట్లు వెలిగాయి. ముమైత్ మాటలు వినిపించడంతో ఇంటి సభ్యుల ముఖంలో ఆనందం వెల్లువెత్తింది. చాలా సేపు తనదైన శైలిలో, మాటలతో బిగ్‌బాస్ ఇంటిలో ముమైత్ అలజడి సృష్టించింది. చివరకి ముమైత్ ఇంటిలోకి రావడంతో ఇంటి సభ్యుల ముఖాలు వెలిగిపోయాయి. ముమైత్‌ను అందరూ కౌగిలించుకొని లోనికి ఆహ్వానించారు. అందరూ కౌగిలింతలతో ముమైత్‌ను ముంచెత్తారు. ధన్‌రాజ్, ముమైత్ మధ్య అనుబంధం మరోసారి ఆకర్షణగా నిలిచింది. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్‌బాస్‌లోకి మరో తార వస్తున్నదంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. యాంకర్లు అనసూయ, రష్మీ‌లను సంప్రదిస్తున్నా.. వాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపించట్లేదు. అయితే షట్లర్ గుత్తా జ్వాలాను కూడా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ గుత్తా జ్వాలా ప్రొఫైల్ కు సరిపడేలా కంటెస్టెంట్స్ లేరని ఆమె చెప్పినట్లు సమాచారం. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మంచు లక్ష్మీ వస్తుందా లేక తను కూడా మనసు మార్చుకుందా అనేది ప్రస్థుతానికి సస్పెన్స్. మొత్తంమీద ముమైత్ అయితే తిరిగి బిగ్ బాస్ గూటికి చేరింది. Last Updated 26, Mar 2018, 12:01 AM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సచిన్ బర్త్ డే స్పెషల్: ఆసక్తికర విశేషాలు మీకోసం.. భారత్‌లో ఒకప్పుడు క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్.. ఆటకు ఈ స్థాయి ఆదరణ తీసుకొచ్చిన సచిన్ గురించి ఆసక్తికర విశేషాలు.. Samayam Telugu | Updated: Apr 24, 2018, 12:12PM IST సచిన్ బర్త్ డే స్పెషల్: ఆసక్తికర విశేషాలు మీకోసం.. ‘ఇండియాలో క్రికెట్ ఓ మతమైతే.. సచిన్ టెండుల్కర్ దేవుడు’ ఈ మాటొక్కటి చాలు.. సచిన్ క్రేజ్ ఏంటో చెప్పడానికి. మాస్టర్ బ్లాస్టర్‌గా సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలు రాళ్లు సాధించిన టెండుల్కర్.. అనితర సాధ్యమైన ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. సెంచరీల సెంచరీ పూర్తి చేసుకున్న ఈ భారతరత్న 2013 నవంబర్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. కానీ ఆటకు మాత్రం దూరం కాలేదు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన సచిన్ టెండుల్కర్ ఏప్రిల్ 24న 45వ ఏట అడుగుపెట్టాడు. సచిన్ బర్త్ డే సందర్భంగా.. ఈ క్రికెట్ దేవుడి గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. * 1987 వరల్డ్ కప్‌లో భారత్, జింబాబ్వే మధ్య వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ బాల్ బాయ్‌గా పని చేశాడు. అప్పటికి సచిన్ వయసు 14 ఏళ్లు. * 1988లో పాకిస్థాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సచిన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడాడు. బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. * జూనియర్ క్రికెట్ ఆడే రోజుల్లో సచిన్ క్రికెట్ కిట్‌‌ను పక్కలో ఉంచుకొని నిద్రించేవాడు. * సచిన్ సొంతం చేసుకున్న మొదటి కారు మారుతి 800. * థర్డ్ అంపైర్ అవుటిచ్చిన తొలి అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండుల్కర్. 1992లో డర్బన్ టెస్టు రెండో రోజు జాంటీ రోడ్స్ సచిన్‌ను రనౌట్ చేశాడు. టీవీలో రిప్లే చూశాక థర్డ్ అంపైర్ కార్ల్ లిబెన్‌బెర్గ్ అవుటిచ్చాడు. * 19వ ఏట సచిన్ కౌంటీల్లో ఆడాడు. కౌంటీ క్రికెట్ ఆడిన పిన్న వయస్కుడైన భారతీయుడిగా సచిన్ రికార్డ్ నెలకొల్పాడు. * ఎవరు తనను గుర్తు పట్టొద్దనే ఉద్దేశంతో గడ్డం మీసాలు అతికించుకొని సచిన్ రోజా సినిమా చూసేందుకు వెళ్లాడు. 1995లో ఈ ఘటన జరగ్గా.. సినిమా హాల్లో ఆయన కళ్లద్దాలు జారిపడిపోవడంతో.. గుర్తుపట్టిన జనం ఆయన చుట్టూ చేరారు. * చిన్నప్పుడు సచిన్ మహా తుంటరి. వేసవి కాలంలో ఓ రోజు సాయంత్రం చెటెక్కి కింద పడిపోయాడు. దీంతో పనిష్మెంట్‌గా ఆయన అన్న అజిత్ సచిన్‌ను క్రికెట్ కోచింగ్ క్లాస్‌లో చేర్పించాడు. * సునీల్ గావస్కర్ బహుమతిగా ఇచ్చిన ప్యాడ్స్‌తో తన అరంగేట్రం మ్యాచ్‌లో సచిన్ పాకిస్థాన్‌పై బరిలో దిగాడు. * సచిన్‌కు టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడటమంటే ఇష్టం. * సచిన్‌కు అలనాటి సింగర్ కిషోర్ కుమార్, రాక్ గ్రూప్ డైర్ స్ట్రెయిట్స్ అంటే ఇష్టం. * గంగూలీని సచిన్ బాబూ మోషాయ్ అని పిలిస్తే.. సచిన్‌ను దాదా చోటా బాబూ అని పిలుస్తాడు. * సచిన్‌కు టెన్నిస్ మాజీ దిగ్గజం జాన్ మెకన్రోయ్ అంటే పిచ్చి. అతడిలాగే జుట్టు పెంచి దాని చుట్టూ ఓ బ్యాండ్ కట్టేవాడు. * సచిన్ రంజీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో అరంగేట్రం మ్యాచ్‌ల్లోనే శతకాలు బాదాడు. * సచిన్‌కు పెర్‌ఫ్యూమ్స్, వాచీలు కలెక్ట్ చేయడమంటే ఇష్టం. * సచిన్ తొలిసారిగా కనిపించింది ‘బూస్ట్’ ప్రకటనలో. కపిల్ దేవ్‌తో కలిసి చాలా యాడ్ ఫిల్మ్స్‌లో సచిన్ నటించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
మహానటి తెలుగు ప్రజల గుండల్లో గుర్తుండిపోయే సినిమా చిత్రం: మహానటి  నటీనటులు: కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు  సంగీతం: మిక్కీ జె మేయర్  సినిమాటోగ్రఫీ: డానీ సంచేజ్-లోపేజ్ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు  నిర్మాతలు: అశ్వనీదత్, స్వప్నా దత్మ ప్రియాంక దత్ దర్శకత్వం: నాగ్ అశ్విన్  విడుదల తేదీ: మే 9 శుక్రవారం   కథ:  అలనాటి మేటి కథానాయిక సావిత్రి గారి గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. ఆ కథను జర్నలిస్ట్ మధురవాణి(సమంత) ద్వారా అందరికీ చెప్పే ప్రయత్నం  చేశాడు దర్శకుడు. వెండితెరపై మధురవాణి ఈ కథను ఎలా చెప్పిందో తెలుసుకుందాం! సావిత్రి బాల్యం:  చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సావిత్రి తన తోటి స్నేహితుల తండ్రులను చూస్తూ తన నాన్న కూడా ఉంటే ఇలానే ఉండేవాడేమో అనుకొని తనలో తనే మథనపడేది. తన తల్లితో కలిసి పెదనాన్న ఇంట్లో ఉండే సావిత్రికి పట్టుదల చాలా ఎక్కువ. ఎవరైనా ఇది నీ వల్ల కాదు అంటే అసలు ఒప్పుకునేది కాదు. అసలు వాళ్ళు ఎవరు నా గురించి నిర్ణయం చేయడానికి అంటూ పట్టుదలతో అనుకున్న పనిని సాధించేది. పట్టుదలతో పాటు సహాయం చేసే గుణం కూడా చిన్నప్పటినుండి ఉండేది. తనతో పాటు చుట్టూ ఉన్న వారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేది. సినిమాల్లోకి రావడం: నాట్యం నేర్చుకుంటే బాగా సంపాదించొచ్చు అని సావిత్రి పెదనాన్నకు ఎవరో చెబితే ఈమెను డాన్స్ నేర్చుకోమని ప్రేరేపిస్తాడు. కానీ ఆమెకు ఇష్టం ఉండదు. మొండితనంతో డాన్స్ నేర్చుకుంటుంది. అలా కొన్నేళ్లకు నాటకాల్లో వేషాలు వేయడం మొదలుపెడుతుంది. సినిమాల్లోకి వెళ్తే బాగా డబ్బు వస్తుందని పెదనాన్న కెవి చౌదరి సావిత్రిని మద్రాస్ తీసుకొని వెళ్తాడు. కానీ అవకాశాలు మాత్రం రావు. అదే సమయంలో మొదటిసారిగా జెమినీ గణేషన్.. సావిత్రిని చూస్తాడు. చూసిన రోజే భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతావ్ అని చెబుతాడు. కొన్ని ఫోటోలను కూడా తీస్తాడు. మద్రాస్ నుండి ఊరికి వెళ్ళిపోయిన సావిత్రిని వెతుక్కుంటూ ఓ సినిమా అవకాశం వస్తుంది. ఒక మేనేజర్ సావిత్రిని సినిమాలో నటించమని అడుగుతాడు. ఆ విధంగా ఎల్ వి ప్రసాద్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంటుంది.  సినిమాల్లో అగ్రస్థానం:  డైలాగ్స్ సరిగ్గా చెప్పలేకపోవడంతో వచ్చిన అవకాశం చేజారిపోతుంది. ఎల్ వి ప్రసాద్.. నటన నీ వల్ల కాదని అనడంతో పట్టుదలతో నటించి నెగ్గుతుంది. రామారావు, నాగేశ్వరావు  వంటి అగ్ర హీరోల కోసం దర్శకనిర్మాతలు ఎదురుచూస్తుంటే ఆ స్టార్లు మాత్రం సావిత్రి కోసం ఎదురుచూసేవారు. సినిమాలో చేస్తోన్న సమయంలోనే జెమినీ గణేషన్ ను ప్రేమిస్తుంది  సావిత్రి. తనకు పెళ్ళయిన విషయం చెప్పడంతో ఆయనకు దూరంగా ఉంటుంది. కానీ వారి ప్రేమ ఇద్దరినీ ఒకటిగా చేస్తుంది. అలా ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాస్తారు. కొన్నిరోజులకు తెలియడంతో ఇంట్లో ఎవరూ అంగీకరించరు. దాంతో ఇంటి నుండి బయటకు వెళ్లిపోతుంది సావిత్రి. పెళ్ళయిన తరువాత కూడా నటిగా కొనసాగుతుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలు ఆమెను అగ్ర స్థానంలో నిలబెడుతాయి.  సావిత్రి జీవితంలో చీకటి కోణం:  మొదటి నుండి కూడా సావిత్రికి సహాయం చేసే గుణం ఉండడంతో తనకు తెలిసిన వారందరికీ డబ్బులూ నగల రూపంలో సహాయం చేస్తూ వస్తుంటుంది. భర్త జెమినీ గణేషన్ డబ్బుకి  సంబంధించిన విషయాలు చూసుకుంటూ ఉంటారు. ఇద్దరూ టాప్ స్టార్స్ కావడంతో బాగా డబ్బు సంపాదించేవారు. ఒక స్టేజ్ లో జెమినీ గణేషన్ క్రేజ్ తగ్గిపోతుంది. ఆ సమయంలో  భార్యకు క్రేజ్ ఎక్కువవ్వడం, తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో అతడి ఈగో హర్ట్ అవుతుంది. ఆ విధంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. జెమినీ గణేషన్  మరో మహిళతో ఉండడం చూసి తట్టుకోలేని సావిత్రి మద్యానికి బానిస అవుతుంది. భర్తను దూరం చేసుకుంటుంది. కొన్నాళ్లకు తాను నమ్మిన వారు కూడా ఆమెను డబ్బు కోసం మోసం చేస్తారు. ఐటి అధికారులు ఆమె ఇంటిపై దాడి చేసి డబ్బు, నగలు మొత్తం సీజ్ చేస్తారు. ఇద్దరు పిల్లలతో కలిసి ఎన్నో కష్టాలను భరిస్తుంది. కానీ ఏనాడూ కూడా ఆమెలో ధైర్యం చావదు. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తుంది. కొన్నాళ్ళకు షుగర్ వ్యాధితో మంచాన పడుతుంది. 18 నెలల పాటు కోమాలో ఉండి కొన్నాళ్ళకు మరణిస్తుంది.  ఇలా సావిత్రి జీవితంలో ప్రతి ఒక్క అంశాన్ని టచ్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ ను మెచ్చుకొని తీరాల్సిందే. నేటి తరం వారికి సావిత్రి గొప్పతనాన్ని చెప్పిన అశ్విన్ ను భుజం తట్టి  అభినందించాలి. కీర్తి సురేష్ అద్భుత నటనతో ప్రేక్షకులు మైమరిచిపోతారు. కొన్నిచోట్ల సావిత్రినే చూస్తున్నామా అనే భావన కలుగుతుంది. అంతగా తన పాత్రలో ఇమిడిపోయింది. తన కాస్ట్యూమ్స్, మేకప్ ప్రతిదీ ఎంతో అందంగా ఉంది. జర్నలిస్ట్ మధురవాణిగా సమంత, ఫోటోగ్రాఫర్ గా విజయ్ దేవరకొండ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్యను చూడడం ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎన్టీఆర్ పాత్ర తెరపై ఒక్క ఫ్రేంలో తలుక్కున మెరుస్తుంది. డిజిటల్ టెక్నాలజీ ద్వారా నిజమైన ఎన్టీఅర్ ను ఆ పాత్రలో చూపించడం విశేషం. జెమినీ గనేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడు. తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ పెద్దగా తెలియకపోయినా.. జెమినీ గనేషన్ ఇలానే ఉంటాడేమో అన్నట్లుగా తన నటనతో మెప్పించాడు. అతడి పాత్రలో కొంత నెగెటివ్ షేడ్ కూడా చూపించారు. అలనాటి మహానటుడు ఎస్.వి.రంగారావు పాత్రలో మోహన్ బాబు చక్కగా నటించారు. మాయాబజార్ ఎపిసోడ్ లో ఆయన జీవించేశారంతే.. సావిత్రి పెదనాన్నగా రాజేంద్రప్రసాద్ నటన బాగుంది. సావిత్రి ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో ఆయన వచ్చి పలకరించే సన్నివేశాలు ఎమోషనల్ గా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి. చక్రపాణిగా ప్రకాష్ రాజ్, దర్శకుడు కెవి రెడ్డిగా క్రిష్, ఎల్.వి.ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ ఇలా ప్రతిఒక్కరూ పోటీ పడినటించారు. సినిమాలో పాటలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతీదీ సందర్బానుసారంగా ఉంటుంది. 'చివరకు మిగిలేది', 'మహానటి' టైటిల్ సాంగ్ హైలైట్ గా నిలిచాయి. సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్లాక్ అండ్ వైట్, కలర్ వేరియేషన్ చూపిస్తూ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. కొన్ని సన్నివేశాల కోసం ఫిల్మ్ ను ఉపయోగించడం మెచ్చుకోవాల్సిన విషయం. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ప్రొడక్షన్ డిజైన్ శివంలతో కలిసి తోట తరణి వేయించిన సెట్స్ వంక పెట్టలేనివిధంగా వున్నాయి ఎడిటింగ్ వర్క్ బాగుంది. సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు సినిమా స్థాయిని పెంచాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పక చూడాల్సిన అద్భుత కావ్యమిది.  'మహానటి' రేటింగ్: 3.5/5
0business
మరోసారి మెరిసిన రషీద్ ఖాన్ : డెహ్రాడూన్ టీ20లో బంగ్లాపై అప్ఘాన్ ఘన విజయం Highlights మూడు వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్ బంగ్లాదేశ్ తో టీ20 సీరీస్ లో భాగంగా డెహ్రాడూన్ లో జరిగిన ఫస్ట్ టీ20 లో అప్ఘానిస్థాన్ జట్టు ఘప విజయం సాధించింది.  ఇటీవల  ఐపిఎల్ 11 లో ఎస్ఆర్ఎచ్ తరపున తన బౌలింగ్ తో అదరగొట్టిన అప్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇతడు విజృంబించడంతో 167 పరుగల లక్ష్యాన్ని చేదించడంలో బంగ్లా చతికిల పడింది.    భారత్‌తో చారిత్రక టెస్ట్‌కు సిద్ధమవుతున్న ఆఫ్ఘానిస్థాన్‌... దానికి ముందు బంగ్లాదేశ్‌తో మూడు టీ20 మ్యాచ్ లు ఆడుతోంది. ఇందులో భాగంగా డైహ్రాడూన్ లో రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్‌ 45 పరుగులతో గెలుపొందింది.    ముందుగా అఫ్గానిస్తాన్‌ 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అప్ఘానిస్థాన్ ఆటగాడు షహజాద్‌(40 పరుగులు) అద్భుతంగా బ్యాటింగ్ చేసి అప్ఘాన్ కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం అప్ఘాన్ బౌలర్ల దాటికి బంగ్లా విలవిల్లాడిపోయింది.  19 ఓవర్లలో 122 పరుగులకే బంగ్లా జట్టు ఆలౌటైంది. అప్ఘాన్ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ 13 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నర్ గా నిలిచి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచాడు.
2sports
Jadeja జడేజా అరుదైన ఘనత చెన్నై: ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో భారత ఆల్‌రౌండర్‌ జడేజా అరుదైన ఘనత సాధించాడు.కాగా చివరి రోజు ఆటలో కెప్టెన్‌ అలెస్టర్‌ కుక్‌ను 49 పరుగులు వద్ద జడేజా ఔట్‌ చేశాడు.జడేజా సంధించిన ప్రమాదకరమైన బంతని కుక్‌ ఆడటంలో విఫలమైన లెగ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కెఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.దీంతో ఇంగ్లండ్‌ 103 పరుగులు వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. అయితే కుక్‌ వికెట్‌ను సాధించే క్రమంలో జడేజా ఒక అరుదైన ఫీట్‌ను సాధించాఉ.కాగా ఈ సిరీస్‌లో ఆరుసార్లు జడేఆజ బౌలింగ్‌లో కుక్‌ ఔటయ్యాడు.ఇలా ఒక సిరీస్‌లో అత్యథికంగా ఒకే బౌలర్‌ చేతిలో కుక్‌ ఔట్‌ కావడం ఇదే తొలిసారి.అయితే ఈ సిరీస్‌లో జడేజా బౌలింగ్‌ వేసే క్రమంలో కుక్‌ యావరేజ్‌ 12.50గా నమోదైంది.నాలుగవ టెస్టులో రెండుసార్లు జడేజాకు చిక్కిన కుక్‌ అయిదవ టెస్టులో రెండుసార్లు జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు.కాగా అంతకు ముందు మూడవ టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగ్‌లో కుక్‌ ఔట్‌ కాగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగ్‌లో కుక్‌ పెవిలియన్‌కు చేరాడు.కాగా అయిదవ టెస్టు చివరి రోజు ఆట మొదలైన కొద్ది సమయానికే జడేజా చేతికి కోహ్లీ బంతి ఇచ్చాడు.ఉదయం సెషన్‌లో 19వ ఓవర్‌ తరువాత జడేజా చేతికి కోహ్లీ బంతి ఇచ్చాడు.కాగా తన ప్రయోగంలో కోహ్లీ మరోసారి సఫల మయ్యాడు. జడేజా వేసిన 39ఓవర్‌ నాలుగవ బంతికి కుక్‌ ఔటయ్యాడు. ఆ తరువాత జెన్నింగ్స్‌ 54 పరుగులు వద్ద జడేజా పెవిలియన్‌కు పం పాడు.దీంతో ఇంగ్లండ్‌ 110 పరుగుల వద్ద రెండవ వికెట్‌ నష్టపోయింది.
2sports
Apollo అపోలోతో ఆర్‌ఎంఎస్‌రీగ్రో టైఅప్‌ హైదరాబాద్‌,జూన్‌ 20: ఎముకుల చికత్సలకోసం అపోలో గ్రూప్‌ యాజమాన్యం కొత్తగా ఆర్‌ఎంఎస్‌ రీగ్రో తో ఒప్పందంచేసుకుంది. సెల్‌థెరపీతో ఆర్థోపెడిక్‌ రోగులకు చికిత్స అందించేందుకు వీలు కలిగిస్తుందని అపోలో చెపుతోంది. ప్రత్యేకించి ఎముకల సమస్యలపై ఎక్కువ పనిచేస్తుంది. ఓస్రాన్‌ బోన్‌ కార్డిలేజ్‌ సమస్యలపై ఓస్రాన్‌, చాండ్రాన్‌ ఉత్పత్తులను వినియోగించి ఎముకల సమస్యలను నివారించవచ్చని చెపుతోంది. ఆర్థోపేడిక్‌ డాక్టర్లకు పునరుత్పత్తి వైద్యవిధానంద్వారా సర్జికల్‌ వర్కుషాపులు, సిఎంఇలు వంటివి వైద్యులకు నిర్వహించి అవగాహన పెంపొందిస్తున్నది. అపోలో గ్రూప్‌ ఛైర్మన్‌ డా.ప్రతాప్‌ సిరెడ్డి మాట్లాడుతూ హెల్త్‌కేర్‌ రంగంలో చేపట్టిన సృజనాతఓమక పద్దతులద్వారా అనేకమంది రోగులకు చికిత్సలు చేరువ అవుతున్నాయని అపోలో గ్రూప్‌ ఈ చికిత్సల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఆర్‌ఎంఎస్‌ రీగ్రోతో తమ అను బంధం చికిత్సల్లో మరింత అధు నాతన విధానాలను అనుసరిం చేందుకు దోహదం చేస్తుందన్నా రు. ఆర్‌ఎంఎస్‌ రీగ్రో సిఇఒ యాష్‌ సంఘ్వి మాట్లాడుతూ అపోలోతో భాగస్వామ్యం ఎంతో హర్షణీయమన్నారు. అపోలో లాంటి అత్యాధునిక వసతులు న్న ఆసుపత్రులతో టైఅప్‌ వల్ల ఎముకల సమస్యలకు సంబంధించి ఆర్‌ఎంఎస్‌ రీగ్రో అందించే ఉత్ప త్తులకు ఎంతో మార్కెట్‌ ఉంటుందన్న ధీమా వ్యక్తంచేసారు. ఇప్పటికే ఆర్‌ఎంఎస్‌ రీగ్రో దేశవ్యాప్త సేవల్లో ముందున్నదన్నారు. ఎనిమిదేళ్ల అంకితభావంతో చేసిన సేవలు విప్లవాత్మక ఉత్పత్తులను తీసుకువచ్చినట్లు యాష్‌ సంఘ్వి వివరించారు.భారత్‌లో ప్రతి ఏటా 15వేలకుపైగా వివిధ ఎముకల చికిత్స విధానాలు అమలువుతున్నాయని వీటిలో సెల్‌థెరపీ విధానం అత్యంత కీలకంగా మారింద న్నారు. అపోలో జెఎండి సంగీతారెడ్డి మాట్లాడుతూ వైద్యప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందు కు అపోలో ఎప్పటికప్పుడు అధునాతన విధానాలను ప్రవేశపెడుతుందని ప్రస్తుతం అపోలో ఆర్‌ఎంఎస్‌ రీగ్రోతో ఇదే ఒప్పందం చేసుకున్నదని పేర్కొన్నారు. దీనివల్ల ఎముకల సమస్యలున్న రోగుల కు ఎంతో అధునాతన వైద్యవిధానం అందుబాటులోకి తెచ్చినట్లవుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసారు.
1entertainment
Suresh 153 Views   ఇస్లామాబాద్‌: డోపింగ్‌ టెస్టులో విఫలమై ఐసిసి సస్పెన్షన్‌కు గురైన పాక్‌ లెగ్‌స్పిన్నర్‌ యాసిర్‌ షా కోసం పాక్‌ క్రికెట్‌ బోర్డు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌కు అప్పీలు చేయనుంది. గత ఏడాది నవంబర్‌లో పాక్‌-ఇంగాండ్‌ జట్ల మధ్య జరిగిన క్రికెట్‌ సిరీస్‌ సందర్బంగా పాక్‌ లెగ్‌స్పిన్నర్‌ యాసిర్‌షా డోపింగ్‌ టెస్టులో నిషేధిక ఉత్ప్రేరకం వాడినట్టు నిర్దారణ అవ్వగా అతన్ని ఐసిసి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే..
2sports
sumalatha 73 Views bse , NSE , stock market sensex ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 292 పాయింట్లు లాభపడి 38,506కి చేరుకుంది. నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 11,428కి ఎగబాకింది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/national/
1entertainment
internet vaartha 117 Views హైదరాబాద్‌ : భారత్‌లో యువ నైపుణ్యా న్ని ప్రోత్సహిస్తామని టెలినార్‌ సిఇఒ శరద్‌ మెహరోత్రా తెలిపారు. యువనియామకాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని యువతీ యువకుల్లో నైపుణ్యానికికొదవలేదని అయితే అందుకు తగినంత ప్రోత్సాహం లభించడంలేదన్నారు. తామునియమించిన వారు ఆసియా దేశాలు, యూరప్‌ దేశాల నుంచి వచ్చే యువనేతలతో కలిసి పనిచేస్తారని ఒక సంవత్సరంపాటు వివిధ ప్రాజెక్టు ప్రణాళికల్లో వీరు భాగం అవుతారన్నారు.
1entertainment
Jun 14,2018 స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న మార్కెట్లు ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో మేటి లాభాల్లో దూసుకుపోయిన సూచీలు.. చివరి గంటలో నమోదైన భారీ అమ్మకాలతో ఒక్కసారిగా కిందకు జారి స్వల్ప లాభాలతోనే సర్దుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే ట్రేడింగ్‌ ముగిసే సమయానికి మార్కెట్లు ప్రారంభ లాభాలన్ని కోల్పోయాయి. చివరకు సెన్సెక్స్‌ 47 పాయింట్ల లాభంతో 35,739 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 14 పాయింట్ల లాభంలో 10,856 వద్ద స్థిరపడ్డాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూల పవనాలు కనిపించినప్పటికీ అమెరికా కేంద్ర బ్యాంక్‌ 'ఫెడరల్‌ రిజర్వ్‌' పరపతి విధాన సమీక్షలో భాగంగా వడ్డీరేట్లను మరోమారు తగ్గించే అవకాశాలున్నట్టుగా వార్తలు రావడంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. చివరి గంటలో భారీగా స్టాక్స్‌ అమ్మకాలకు మొగ్గు చూపారు. రంగాల వారీగా ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకింగ్‌ స్టాక్స్‌ ఎక్కువగా లాభపడగా.. ఆటో, ఇన్‌ఫ్రా, మెటల్‌ రంగాలు నేటి ట్రేడింగ్‌లో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రోలు మేటిగా రాణించాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కారు బోల్తా, హీరోయిన్ ప్రణీతకు గాయాలు నల్గొండ జిల్లా మోతె సమీపంలో టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. TNN | Updated: Feb 14, 2016, 01:49PM IST గండం నుంచి గట్కెన టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత నల్గొండ: టాలీవుడ్ హీరోయిన్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఆదివారం ఖమ్మం నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో నల్గొండ జిల్లా మోతె సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఆమె స్వల్పగాయాలతో బయటపడినట్లు సమాచారం. కారులో ప్రణీతతో పాటు ఆమె తల్లికూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న బైకు ను తప్పించబోయి కారు అదుపుతప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రణీత గండం నుంచి గట్టెక్కడంతో టాలీవుడ్ సినీ రంగంతో పాటు ఆమె అభిమానులు ఊపరిపీల్చుకున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
పెళ్లయ్యాక తొలిసారి రెచ్చిపోయిన సమంత Highlights పెళ్లయ్యాక తొలిసారి సామ్ హాట్ పిక్ టూ పీస్ బికినీలో రెచ్చిపోయిన సమంత అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా మారిన సమంత పెళ్లయ్యాక కూాడా సినిమాల్లో నటిస్తోంది. ప్రస్థుతం తెలుగులో రామ్ చరణ్ సరసన రంగస్థలం చిత్రంలో నటిస్తున్న సమంత.. తమిళంలో విజయ్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. తాజాగా సమంత సమ్మర్ నేపథ్యంలో హాట్ బికినీలో రిలాక్స్ అవుతూ తీసుకున్న ఫోటో తన సోషల్ మీడియా సైట్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఈ పిక్ లో యమా హాట్ గా కనిపిస్తోంది. పెళ్లయ్యాక సమంత ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఇదే తొలిసారి.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV లెమన్ ట్రీ హోటల్స్ ఐపీవో మొద‌టిసారి మార్కెట్లోకి ప్రవేశించాల‌నుకునే మ‌దుప‌ర్ల‌కు ఇది మంచి ఎంపిక అని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎక్కువ రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం ఉంటేనే దీని వైపు మొగ్గుచూప‌డం మంచిది. లేక‌పోతే వ‌ద్దు. TNN | Updated: Mar 26, 2018, 11:09AM IST ఢిల్లీకి చెందిన‌ లెమన్ ట్రీ హోటల్స్ ఐపీవో ఈనెల 26న(ఈ రోజు) ప్రారంభం కానుంది. ఈనెల 28న ముగిసే ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1039 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఐపీవో కోసం గత సెప్టెంబర్‌లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేయగా ఈ ఏడాది ప్రారంభంలో సెబీ అనుమతులిచ్చింది. ఇష్యూ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.54-56గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం 18,54,79,400 ఈక్విటీ షేర్లను జారీ చేసి 23.59 శాతం వాటాను విక్రయించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. శుక్రవారం(ఈనెల 23) యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రారంభం కాగా.. సోమవారం (ఈనెల 26) నుంచి ఇష్యూ ప్రారంభం కానుంది. ఈ ఇష్యూకు కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, CLSA ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యెస్ సెక్యూరిటీస్(ఇండియా) లిమిటెడ్‌లు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు BSE, NSEల్లో లిస్ట్ కానున్నాయి. ఈ ఇష్యూ ద్వారా వాటాదారులకు నగదు లభ్యత సమస్య తీరిపోవడమే కాకుండా హోటళ్ళకు చక్కని ప్రచారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాలు : 2002లో ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన లెమన్ ట్రీ హోటల్స్‌కి ప్రస్తుతం 28 పట్టణాల్లో 45 హోటళ్ళు ఉన్నాయి. విలాసవంతం, అందుబాటు ధరల్లో మొత్తం నాలుగు రకాల శ్రేణిలో 4697 గదులను(జనవరి 31, 2018 నాటికి) కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం రెడ్ ఫాక్స్, లెమన్ ట్రీ, లెమన్ ట్రీ ప్రీమియర్ పేరుతో 3 బాండ్లు ఉన్నాయి. NCR, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పాటు టైర్-1, టైర్-2 పట్టణాలైన పూణే, అహ్మదాబాద్, ఛండీఘడ్, జైపూర్, ఇండోర్, ఔరంగాబాద్ తదితర నగరాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌తో మిడ్ మార్కెట్ హోటల్స్‌లో అగ్రగామి సంస్థల్లో ఒకటి లెమన్ ట్రీ హోటల్స్‌లో ప్రస్తుతం 5వేల మందికి పైగా ఉపాధిని పొందుతున్నారు. లెమన్ ట్రీ ప్రీమియర్ అప్పర్ మిడిల్ క్లాస్ వర్గాలకు, లెమన్ ట్రీ హోటల్స్ మధ్యతరగతి ప్రజల కోసం కాగా, ఎకనామీ సెగ్మెంట్లో రెడ్ ఫాక్స్ సేవలు అందిస్తోంది. భారత దేశంలో వేగంగా విస్తరిస్తూ, అతిథుల మన్ననలు అందుకుంటోంది ఈ సంస్థ.
1entertainment
New Delhi, First Published 6, May 2019, 12:07 PM IST Highlights అక్షయ తృతీయను పురస్కరించుకుని ఈసారి బంగారం అమ్మకాలు రెట్టింపు అవుతాయని జ్యువెల్లర్ల అసోసియేషన్ అంచనా వేస్తోంది.  న్యూఢిల్లీ: అక్షయ తృతీయను పురస్కరించుకుని ఈసారి బంగారం అమ్మకాలు రెట్టింపు అవుతాయని జ్యువెల్లర్ల అసోసియేషన్ అంచనా వేస్తోంది.  ధరలు నిలకడగా ఉండటం, కొనుగోలుదారులు బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతుండటంతో ఈసారి అక్షయతృతీయ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది.  అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని బంగారినిక 20శాతం వరకు డిమాండ్ పెరుగుదల ఉంటుందని భారత బులియన్, జువెలర్ల అసోసియేషన్ అంచనా వేస్తోంది. అంతేగాక, దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగుస్తుండటం, వేతన జీవులకు జీతం అందుకునే సమయం కావడంతో అక్షయ తృతీయ సేల్స్ ప్రోత్సాహకరంగా  ఉంటాయని భారత బులియన్, జువెలర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షడు సౌరవ్ గాడ్గిల్ అభిప్రాయపడ్డారు.  మే 7వ తేదీన అక్షయ తృతీయ కావడంతో పలు జువెల్లరీ సంస్థలు, దుకాణాలు బంగారు ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఇ కామర్స్ దిగ్గజాలు, బ్యాంకులు కూడా బంగారంపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నాయి.  Last Updated 6, May 2019, 12:07 PM IST
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. రెండు నెలల్లోపే మూడో పెళ్లీ పెటాకులు! పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి కూడా పెటాకులైనట్లు వార్తలొస్తున్నాయి. ఇమ్రాన్‌తో వేగలేక ఆయన మూడో భార్య బుష్రా మనేకా ఇప్పటికే పుట్టింటికి వెళ్లిపోయినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రచురించింది. TNN | Updated: Apr 26, 2018, 12:57PM IST ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. రెండు నెలల్లోపే మూడో పెళ్లీ పెటాకులు! పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి కూడా పెటాకులైనట్లు వార్తలొస్తున్నాయి. ఇమ్రాన్‌తో వేగలేక ఆయన మూడో భార్య బుష్రా మనేకా ఇప్పటికే పుట్టింటికి వెళ్లిపోయినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రచురించింది. ఇమ్రాన్ తన ఆధ్యాత్మిక సలహాదారు బుష్రా మనేకాను ఫిబ్రవరి 18న రహస్యంగా వివాహం చేసుకున్నాడు. లాహోర్‌లోని మనేకా సోదరుడి నివాసంలో చాలా నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగింది. మనేకా బంధువులెవరూ వాళ్లతో పాటు ఎక్కువ రోజులు ఉండకూడదని ఇమ్రాన్ పెట్టిన నిబంధనకు ఆమె తలొగ్గిన తర్వాతే వీరి పెళ్లి జరిగింది. అయితే.. ఈ పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇమ్రాన్ పెళ్లి పెటాకులవడానికి కారణం కూడా వింతగానే ఉంది. ఇమ్రాన్ ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కలు ఇంట్లో ఉండటం మనేకాకు నచ్చలేదట. అదేవిధంగా.. మనేకాకు తన మొదటి భర్త ద్వారా కలిగిన కుమారుడు తమతో పాటు ఉండటం ఇమ్రాన్‌‌కు ఇష్టం లేదు. అంతేకాకుండా.. ఇమ్రాన్ మనేకాను పెళ్లి చేసుకోవడం అతడి చెల్లెళ్లకు అస్సలు ఇష్టం లేదట. ఇమ్రాన్‌ చెల్లెళ్లు కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. దీంతో వారి మధ్య ఘర్షణ మరింత పెరిగింది. చేసేదేంలేక ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ప్రస్తుతం తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేతగా తన రాజకీయ భవితవ్యం పరీక్షించుకుంటున్న ఇమ్రాన్‌కు తాజా వ్యవహారం మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇమ్రాన్ 1995లో బ్రిటిష్ జర్నలిస్టు జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నాడు. 9 ఏళ్ల తర్వాత ఆమెకు విడాకులిచ్చాడు. 2015లో టీవీ యాంకర్ రేహమ్‌ఖాన్‌ను పెళ్లి చేసుకున్నా.. 10 నెలలకే ఆ పెళ్లి పెటాకులైంది. ఇప్పుడీ మూడో పెళ్లి కూడా రెండు నెలల్లోపే ముగిసిపోవడం చర్చనీయంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV బిజినెస్‌మేన్‌కి అల్లుడు కాబోతున్న నిఖిల్! హ్యాపీడేస్ సినిమాతో సినీ పరిశ్రమకి పరిచయమై, ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుని చివరకు హీరోగా నిలదొక్కుకున్న నటుడు నిఖిల్... TNN | Updated: Aug 7, 2017, 10:18PM IST హ్యాపీడేస్ సినిమాతో సినీ పరిశ్రమకి పరిచయమై, ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుని చివరకు హీరోగా నిలదొక్కుకున్న నటుడు నిఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కి చెందిన తన చుట్టాలమ్మాయి తేజస్వినితో ఆగస్టు 24న ఎంగేజ్‌మెంట్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 1వ తేదీన జరగనున్న నిఖిల్-తేజస్వినిల పెళ్లి వేడుకకి అప్పుడే ఏర్పాట్లు జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. తేజస్విని ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయగా ఆమె తండ్రి హైదరాబాద్‌లో స్థిరపడిన ఓ బిజినెస్‌మేన్. తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అమ్మా నాన్నలు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని గతంలోనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన నిఖిల్ అన్నట్టుగానే అరేంజ్డ్ మ్యారేజ్‌కే ఓటేశాడు. 'స్వామిరారా' తర్వాత హీరోగా నిలదొక్కుకున్న నిఖిల్‌కి ఇప్పుడు ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం కన్నడంలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. నిఖిల్ పెళ్లిరోజే ఈ రీమేక్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కానుందని సమాచారం.
0business
Visit Site Recommended byColombia నేను.. శైలజ సినిమా అందరికీ నచ్చింది. కానీ నా నుండి డాన్స్, ఫైట్స్ ఆశించే ప్రేక్షకులు ఇంకా ఏదో ఆశిస్తారు. అలాంటి వారికి హైపర్ ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ హైపర్ గా ఉంటుంది. అలాంటి వాడు ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.. అందుకే క్యాప్షన్ గా అదే పెట్టాం. నిజానికి ఈ సినిమా టైటిల్ షూటింగ్ ఫైనల్ సమయంలో పెట్టాం. అందరూ నా కోసం ఇలాంటి టైటిల్ పెట్టారని అనుకుంటారని మొదట టైటిల్ చెప్పినప్పుడు కామ్ గా ఉండిపోయాను. ఆ తరువాత క్యాప్షన్ చెప్పగానే యాప్ట్ అనిపించింది. ఫాదర్ సెంటిమెంట్ తో చాలా సినిమాలొచ్చాయి. ఈ సినిమా ప్రత్యేకత ఏంటి..? ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఫాదర్ సెంటిమెంట్ తో ఉంటూ.. ఆడియన్స్ కు సందేశం ఇచ్చే విధంగా సినిమా ఉంటుంది. కానీ ఆ మెసేజ్ చెప్పడానికి నా వయసు సరిపోదు. అందుకే సత్యరాజ్ వంటి నటుడిని తండ్రి పాత్రలో తీసుకున్నాం. కమర్షియల్ ఎలిమెంట్స్ కు సుగర్ కోటెడ్ లా మెసేజ్ ఉంటుంది. కథ విన్నప్పుడు కూడా ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. సినిమాలో హీరో ఏం చేస్తుంటాడు..? .నా పాత్ర పేరు సూర్య, తండ్రి పేరు నారాయణ. సినిమాలో హీరో ఏం చేస్తున్నాడనే దానికి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. సినిమా చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ బట్టి సినిమాలో సత్యరాజ్, మీ కాంబినేషన్ సీన్స్ చాలా ఫన్ గా ఉంటాయనిపిస్తుంది..? అవునండీ.. ఇప్పటివరకు సత్యరాజ్ గారు తెలుగులో సీరియస్ గా ఉండే పాత్రల్లోనే కనిపించారు. కానీ ఈ సినిమాలో ఆయన కామెడీ యాంగల్ ను చూపించాం. ప్రతి కొడుకికి తన తండ్రి మీద ప్రేమ ఉంటుంది. కానీ ఎక్స్ప్రెస్ చేయరు. లోపల చచ్చేంత ప్రేమ ఉంటే ప్రతి క్షణం ఆ ప్రేమను చూపించడానికి ప్రయత్నిస్తారు. మీ నిజజీవితంలో కూడా ఫాదర్ తో అలానే ఉంటారా..? అందరిలానే నేను కూడా.. నాన్న అంటే గౌరవం ఉంది కానీ భయం లేదు. కందిరీగకు, హైపర్ కు డైరెక్టర్ శ్రీనివాస్ లో ఏదైనా మార్పు గమనించారా..? కందిరీగ సమయంలోనే శ్రీనివాస్ చాలా మెచ్యూర్డ్ గా ఉండేవాడు. ఇప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెరిగాయి. అయినా కందిరీగ, హైపర్ రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. కొన్ని సినిమాలు హిట్ అయితే పేరొస్తుంది. ఈ సినిమా హిట్ అయితే గౌరవం వస్తుంది. మీ వరకు మీ డైరెక్టర్ హైపర్ అంటారా..? లేక నిర్మాతలా..? డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ హైపర్ ఉన్నవాళ్లే.. లేకపోతే సినిమా ఇంత తొందరగా పూర్తయ్యేది కాదు. నిజానికి 14 రీల్స్ లో మొదటి సినిమా నేను చేయాల్సివుంది. కానీ కుదరలేదు. అప్పటినుండి అనుకుంటే ఇప్పటికీ కుదిరింది. సక్సెస్ తరువాత సినిమా చేయడం.. ఫెల్యూర్ తరువాత సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది..? టెన్షన్ పడాలనుకుంటే ప్రతిదానికి పడాలి. హిట్ వచ్చింది.. తరువాత సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని ప్రెషర్ లో ఉండొచ్చు.. అలానే ఫ్లాప్ వచ్చింది.. నెక్స్ట్ ఎలా అయినా.. హిట్ కొట్టాలనే టెన్షన్ పడొచ్చు. నా వరకు నేను దేనికి టెన్షన్ పడను. సినిమా అంటే రోలర్ కోస్టర్ రైడ్. సక్సెస్ చూసా.. ఫెల్యూర్ చూశాను. ఇప్పుడు లాజికల్ గా ఆలోచిస్తున్నాను. నాకు ఆ స్టెబిలిటీ వచ్చిందని భావిస్తున్నా.. ఎలాంటి దర్శకులతో పని చేయాలనుకుంటున్నారు..? నేను.. శైలజ సినిమా తరువాత నాకు చాలా కథలు ఆఫర్స్ వచ్చాయి. నటుడిగా నా పరిణితిని రోజురోజుకి పెంచుకోవాలి. రామ్ ను ఇలా కూడా చూపించొచ్చు అని కొత్తగా ఆలోచించే వారితో పని చేయాలానుకుంటాను. అందుకే డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ తో పని చేస్తుంటాను.. నాలో తెలియని యాంగల్ ను ప్రొజెక్ట్ చేస్తే అదే నాకు ఎక్కువ తృప్తినిస్తుంది. తమిళ సినిమాల్లో ఏమైనా నటిస్తున్నారా..? ఒక్క తమిళం అని కాకుండా తెలుగు, తమిళ భాషల్లో రూపొందే సినిమా కోసం చూస్తున్నాను. కథలు వింటున్నా కానీ రెండు భాషలకు సెట్ అయ్యే కథ దొరకడం లేదు. దొరికితే చేస్తా.. ఈ సినిమాలో హీరోయిన్ కామెడీ చేయాలి. సుప్రీం సినిమా చూసిన తరువాత రాశి అయితే ఈ కథకు యాప్ట్ అనిపించింది. అందుకే సెలెక్ట్ చేసుకున్నాం. కమర్షియల్ సినిమాలు ప్రయోగాత్మకంగా చేస్తారా..? నేను నటించిన 'జగడం','ఎందుకంటే ప్రేమంట' సినిమాలు ఆ జోనర్ లోకే వస్తాయి. అయితే కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి.. కొన్ని ఫ్లాప్ అవుతాయి. వారికి నచ్చే విధంగా ఉండే కమర్షియల్ ఎక్స్పెరిమెంట్ కథలు దొరికితే చేస్తాను. అనిల్ రావిపూడి, కరుణాకరన్, కిషోర్ తిరుమల వంటి దర్శకులతో పని చేయబోతున్నారని విన్నాం..?
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Visit Site Recommended byColombia అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.30 తగ్గింది. దీంతో ధర రూ.36,220కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే, వెండి ధర మాత్రం పైకి నడిచింది. రూ.50 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,750కు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. ధర స్థిరంగా కొనసాగుతోంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,200 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా రూ.37,000 వద్ద కొనసాగుతోంది. Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి మాత్రం.. బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,750కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. Also Read: ఎల్ఐసీ అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ.12తో రూ.లక్ష..! అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదలతో 1,458.55 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 16.75 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. Also Read: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లోన్.. రూ.15,000 జీతం ఉంటే.. రూ.50 వేల నుంచి రూ.40 లక్షల వరకు రుణం! బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. Also Read: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఈరోజు నుంచి 3 కొత్త రూల్స్ అమలులోకి.. కస్టమర్లపై ఎఫెక్ట్!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ప్చ్.. మన బంతి తిరగలేదు స్పిన్‌కి సహకరిస్తున్న పిచ్‌పై మన స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ఆదివారం కంగారూలను తేలిగ్గా పడగొడతారనుకుంటే TNN | Updated: Mar 5, 2017, 05:51PM IST భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బెంగళూరు టెస్టులో అందరి అంచనాలు తప్పుతున్నాయి. తొలిరోజు భారత్ భారీ స్కోరు చేస్తుందనుకుంటే 189 పరుగులకే కుప్పకూలిపోయింది. స్పిన్‌కి సహకరిస్తున్న పిచ్‌పై మన స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ఆదివారం కంగారూలను తేలిగ్గా పడగొడతారనుకుంటే ఆరు వికెట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా 237/6తో రెండో రోజు ఆటను గౌరవప్రదంగా ముగించింది. క్రీజులో మాథ్యూ వెడ్ (25), మిచెల్ స్టార్క్ (14) ఉన్నారు. ఇప్పటికే 48 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాను సోమవారం ఎంత తొందరగా ఆలౌట్ చేస్తారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. శనివారం ఆసీస్ స్పిన్నర్ లియాన్ ఒక్కడే ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. ఈ రోజు భారత్ ఇద్దరు స్పిన్నర్ల కలిసి పడగొట్టింది నాలుగు వికెట్లే. ఓవర్‌నైట్ స్కోరు 40/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టుకు తొలి సెషన్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (33) భారత స్పిన్నర్ అశ్విన్ విసిరిన బంతిని అంచనా వేయడంలో తడబడి క్లీన్ బౌల్డయ్యాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (8: 52 బంతుల్లో)తో కలిసి మరో ఓపెనర్ రేన్‌షా (60) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ.. రక్షణాత్మకంగా ఆడిన స్మిత్ జట్టు స్కోరు 82 వద్ద జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ దశలో రేన్‌షాతో కలిసి షాన్ మార్ష్ (66) మూడో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆసీస్‌ని పోటీలోకి తెచ్చాడు. చివరికి ఈ జోడీని అద్భుతమైన బంతితో జడేజా.. రేన్‌షాను ఔట్ చేయడం ద్వారా విడదీయగా.. హాండ్స్ కబ్ (10) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయాడు.
2sports
Hyderabad, First Published 10, Apr 2019, 5:50 PM IST Highlights మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన మజిలీ సినిమా మొదటి మూడు రోజులు బాక్సాఫీసుని షేక్ చేసేస్తోంది. ఎఫ్ 2 సినిమా తర్వాత ఆ స్దాయిలో హౌస్ ఫుల్ బోర్డ్ లు రెండు రాష్ట్రాల్లోనూ కనిపించాయి. మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన మజిలీ సినిమా మొదటి మూడు రోజులు బాక్సాఫీసుని షేక్ చేసేస్తోంది. ఎఫ్ 2 సినిమా తర్వాత ఆ స్దాయిలో హౌస్ ఫుల్ బోర్డ్ లు రెండు రాష్ట్రాల్లోనూ కనిపించాయి. మొన్న శుక్రవారం విడుదలైన మజిలీ సినిమా మంచి ఓపినింగ్స్ ని రాబట్టి... నాగ చైతన్య కెరీర్ లో  ఫస్ట్ డే ... సెకండ్ హైయ్యెస్ట్ గ్రాస్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.  సమ్మర్ హాలిడేస్ లో వచ్చిన  మొదటి సినిమా కావడం, సమంత - చైతన్య కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ కారణంగా సినిమాకి స్టన్నింగ్ కలెక్షన్లు వచ్చయనటంలో సందేహం లేదు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ బాగానే రాబట్టినా సోమవారం నుంచి డ్రాప్ కనపడింది. అయితే ఎక్కువ రేంజ్లో డ్రాప్ రాలేదు. నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.  అయితే మంగళవారం బాగా డ్రాప్ అయింది. బుధవారం కూడా పెద్దగా కోలుకున్నట్లు కనపడటం లేదు. ఆంధ్రాలో అయితే ఎలక్షన్ వేడితో జనం సినిమాలపై దృష్టి పెట్టడం లేదు అంటున్నారు. ఎల్లుండి నుంచి అంటే  మళ్లీ ఈ వీకెండ్ ఈ సినిమా పుంజుకుంటుందని భావిస్తున్నారు  ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ సినిమా ఇప్పటికే హిట్ అనిపించుకోవటంతో అక్కినేనికుటుంబం ఫుల్ జోష్ లో ఉంది.  అయితే ఈ సక్సెస్ రేంజ్ ఏంటనేది వచ్చే వీకెండ్ భాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ ఫార్మ్ చేస్తుందనే విషయంపై ఆధారపడుతుంది. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ నటించిన "చిత్రలహరి" సినిమాతో ఈ వీకెండ్ ఈ మూవీ పోటీపడాలి.   ఈ సినిమాకు నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చిన సంగీతం సినిమాకు ఎమోషనల్ కనెక్టివిటిని సెట్ చేస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మొత్తానికి డైరక్టర్  శివ నిర్వాణ ద్వితీయ విఘ్నాన్ని సక్సెస్‌ఫుల్‌గా దాచేశాడు.  Last Updated 10, Apr 2019, 5:50 PM IST
0business
Hyderabad, First Published 24, Oct 2018, 4:31 PM IST Highlights విభిన్న పాత్రలతో కెరీర్ లో ఎన్నో హిట్స్ అందుకున్న సూర్య సౌత్ లో ఒక మంచి మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. తెలుగులో అతనికి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.  విభిన్న పాత్రలతో కెరీర్ లో ఎన్నో హిట్స్ అందుకున్న సూర్య సౌత్ లో ఒక మంచి మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. తెలుగులో అతనికి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి సూర్య ఎప్పుడు కనిపించని రైతు పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం ఈ స్మార్ట్ హీరో సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్ జీక' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమాలో సూర్య చేసే పాత్ర గురించి గత కొంత కాలంగా అనేక వార్తలు వస్తున్నాయి. ముందుగా ఒక రాజకీయ నాయకుడి రోల్ చేయనున్నాడని టాక్ వచ్చింది. ప్రస్తుతం సూర్య సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం సూర్య ఒక వ్యవసాయం చేసే రైతులా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తమ్ముడు కార్తీ చినబాబులో ఒక రైతుగా కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు.  ఇక ఇప్పుడు సూర్య కూడా అ పాత్రలో కనిపించి మెప్పించాలని అనుకుంటున్నాడు. దర్శకుడు సెల్వా రాఘవన్ కూడా సూర్య క్యారెక్టర్ ను స్పెషల్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.  Last Updated 24, Oct 2018, 4:31 PM IST
0business
Padma Awardees పద్మ అవార్డులకు పారాలింపిక్స్‌ విజేతల పేర్లు:కేంద్రమంత్రి గోయల్‌ న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారిని దేశంలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులకు సిఫారసు చేయనున్నట్లు కేంద్ర క్రీడల మంత్రి విజ§్‌ు గోయల్‌ పేర్కొన్నాడు.కాగా ఈనెల 7 నుంచి 18 వరకు జరిగిన పారాలింపిక్స్‌లో దేశం తరపున పాల్గొని పతకాలు సాధించిన నలుగురు అథ్లెట్ల పేర్లను సిపారసు చేయనున్నట్లు విజ§్‌ు గోయల్‌ వెల్లడించాడు.పురుషుల హైజంప్‌లో స్వర్ణ పతకం సాధించిన మరియప్పన్‌ తంగవేలు,పురుషుల జావెలిన్‌ గ్రోలో స్వర్ణ పతకం సాధించిన దేవేంద్ర ఝుఝూరియా,మహిళల షాట్‌పుట్‌ విభాగంలో రజత పతకం సాధించిన దీప మాలిక్‌,పురుషుల హై జంప్‌లో కాంస్య పతకం సాధించిన వరుణ్‌ బాటి పేర్లను హోం శాఖకు సిఫారసు చేయనున్నట్లు గోయల్‌ వివరించాడు.
2sports
రారండోయ్‌ వేడుక చూద్దాం' నాకు మెమొరబుల్‌ మూవీ, పెళ్లంటారా.. - నాగచైతన్య Highlights రారండోయ్ వేడుక చూద్దాం నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా కథ పేరుకి తగ్గట్టే వేడుకలా ఉంటుంది నా పెళ్లి అక్టోబర్ లో.. ఇండియాలోనే చేయాలని ప్లాన్ చేస్తున్నారు-నాగచైతన్య సినిమా రిలీజవుతోంది కదా! టెన్షన్‌ ఏమైనా...?  - నాన్న సినిమా చూసి చాలా హ్యాపీగా వున్నారు. అలాగే మా టీమ్‌ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. కానీ నాకే కొంచెం భయంగా వుంది. ఫస్ట్‌టైమ్‌ కొత్త జోనర్‌లో ట్రై చేసాను. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా 'రారండోయ్‌' చిత్రాన్ని రూపొందించాం.  ఈ చిత్రంలో మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?  - ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్‌ అంతా కంప్లీట్‌ డిఫరెంట్‌గా వుంటుంది. ఫుల్‌ ఎనర్జిటిక్‌ క్యారెక్టర్‌. త్రూ అవుట్‌ ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. ఇలాంటి ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ ఎంటర్‌టైనింగ్‌ క్యారెక్టర్‌ని ఇంతవరకూ చేయలేదు. వెరీ లవబుల్‌ క్యారెక్టర్‌. ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని కొంచెం టెన్షన్‌గా వుంది. ఫాదర్‌ అండ్‌ సన్‌ రిలేషన్‌, హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చే సీన్స్‌ బాగా పండాయి. సినిమా అందరికీ నచ్చుతుంది.  ఈ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయింది?  - 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా రిలీజ్‌కి ముందే కళ్యాణ్‌ కృష్ణతో టైమ్‌ ఎక్కువ స్పెండ్‌ చేసేవాడ్ని. బేసిగ్గా తను మంచి రైటర్‌. నా ఇమేజ్‌, స్పాన్‌ని ఇంకా ఎక్కువ పెంచుకోవాలనే కోరిక వుండేది. ఎగ్జాక్ట్‌గా నా బాడీలాంగ్వేజ్‌కి సరిపోయే కథని కళ్యాణ్‌ చెప్పారు. నాన్న, నేను, మా టీమ్‌ అంతా కూర్చొని 'నిన్నే పెళ్లాడతా' ఫ్లేవర్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తియ్యాలని అనుకున్నాం. ఫ్యామిలీ ఎమోషన్స్‌, రిలేషన్స్‌ మీద ఎక్కువ ఫోకస్‌ చేసి ఈ కథని రెడీ చేశాడు కళ్యాణ్‌. కళ్యాణ్‌ మాస్‌ పల్స్‌ బాగా తెల్సు. ఈ సినిమా ప్రజెంటేషన్‌ చాలా కొత్తగా వుంటుంది. నా యాక్టింగ్‌ లెవెల్స్‌ని నెక్స్‌ట్‌ స్టెప్‌కి తీసుకెళ్లేవిధంగా చేయించాడు.  ఈ సినిమాకి కాస్టింగ్‌ పరంగా స్పెషల్‌ కేర్‌ తీసుకున్నట్లున్నారు?  - ఔనండీ! సినిమా ప్రీ ప్రొడక్షన్‌లోనే అన్నీ పర్‌ఫెక్ట్‌గా చూసుకుని సెట్స్‌కి వెళ్లాం. అద్భుతమైన ప్యాడింగ్‌ కుదిరింది. అలాగే కాస్ట్యూమ్స్‌ అన్నీ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా వుంటాయి. సినిమా చూస్తున్నంతసేపు ఒక ఫెస్టివల్‌ మూడ్‌లో వున్నట్లుంటుంది. బయటికి వచ్చాక చాలా రిలాక్స్‌డ్‌గా హ్యాపీగా వుంటారు. మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.  మీ హోమ్‌ బేనర్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేయడం ఎలా అన్పించింది?  - చాలా సంతోషంగా వుంది. ఇంత పెద్ద స్కేల్‌ వున్న మూవీలో ఆపర్చ్యునిటీ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. జగపతిబాబుగారు, సంపత్‌, దేవిశ్రీప్రసాద్‌, రకుల్‌ ప్రీత్‌, ఇంకా నెంబరాఫ్‌ ఆర్టిస్ట్‌లు ఈ చిత్రంలో నటించారు. అందరూ తమ తమ క్యారెక్టర్స్‌కి పూర్తి న్యాయం చేశారు. నాన్న చాలా కేర్‌ తీసుకుని ఈ సినిమా నిర్మించారు. డెఫినెట్‌గా ఈ సినిమా సక్సెస్‌ అయి నా కెరీర్‌కి చాలా హెల్ప్‌ అవుతుంది.  మీ నాన్న సినిమా చూసి ఏమన్నారు?  - ఫస్ట్‌ నుండి నాన్న ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చూసుకున్నారు. షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యాక ఎడిటింగ్‌ రూమ్‌లో ప్రతి సీన్‌ చూసేవారు. సినిమా కంప్లీట్‌ అయ్యాక చూసి చాలా హ్యాపీగా వున్నారు.  రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్యారెక్టర్‌ గురించి?  - ఫస్ట్‌టైమ్‌ రకుల్‌తో యాక్ట్‌ చేశాను. వెరీ ప్యాషన్‌ అండ్‌ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. అంతకుముందు సినిమాలో చాలా గ్లామర్‌గా చేసింది. ఫస్ట్‌టైమ్‌ ఈ చిత్రంలో చాలా పద్ధతిగల అమ్మాయిగా భ్రమరాంబ క్యారెక్టర్‌లో బ్యూటిఫుల్‌గా నటించింది. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో బంగార్రాజు క్యారెక్టర్‌ ఎంత హైలైట్‌ అయ్యిందో రారండోయ్‌ చిత్రంలో భ్రమరాంబ క్యారెక్టర్‌ అంత హైలైట్‌ అవుతుంది.  ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?  - దేవి మా బేనర్‌లో నిర్మించిన చిత్రాలన్నింటికీ బ్లాక్‌ బస్టర్‌ ఆడియో ఇచ్చారు. ఈ చిత్రానికి దేవి మ్యూజిక్‌ ఒన్‌ ఆఫ్‌ ది ఎస్సెట్‌గా నిలుస్తుంది. రీ-రికార్డింగ్‌ వండర్‌ఫుల్‌గా చేశాడు. ఫస్ట్‌టైమ్‌ కథ విని బాగా ఇంప్రెస్‌ అయి ఆర్‌.ఆర్‌. ఇలాగ చేస్తాను. నువ్‌ యాక్టింగ్‌ గ్రాఫ్‌ అలా పెంచుకో అని చెప్పాడు. అతను ఇచ్చిన ఇన్‌పుట్స్‌ నాకు బాగా హెల్ప్‌ అయ్యాయి. యాక్టర్‌గా నన్ను నేను ఇంప్రూవ్‌ చేసుకోడానికి దేవి ఇచ్చిన సలహాలు బాగా హెల్ప్‌ అయ్యాయి.  టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?  - కథకి యాప్ట్‌ అయ్యే టైటిల్‌ ఇది. 'రారండోయ్‌' టైటిల్‌ సాంగ్‌ వుంది. సినిమా చూశాక ఇదే కరెక్ట్‌ టైటిల్‌ అని అందరూ ఏకీభవిస్తారు. సినిమా చూశాక అందరూ మంచి ఫీలింగ్‌తో బయటికి వస్తారు.  మీ పెళ్లెప్పుడు?  - అక్టోబర్‌లో వుంటుంది. హిందూ, క్రిస్టియన్‌ రెండు సంప్రదాయ పద్ధతుల్లో జరుగుఅంది. మా ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా ఇండియాలోనే మా పెళ్లి జరపడానికి ప్లాన్‌ చేస్తున్నారు.  తర్వాతి చిత్రం ఎప్పుడు?  - సాయి కొర్రపాటి బేనర్‌లో ఒక థ్రిల్లర్‌ మూవీ చేస్తున్నాను. నెక్స్‌ట్‌ చందు మొండేటి లైన్‌ చెప్పాడు. నచ్చింది. ఒక నెలలో ఆ సినిమా డీటైల్స్‌ తెలుస్తాయి. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్‌లో ఒక సినిమా ప్లాన్‌ చేస్తున్నాం'' అంటూ ఇంటర్వ్యూ ముగించారు యువసామ్రాట్‌ నాగచైతన్య. Last Updated 26, Mar 2018, 12:01 AM IST
0business
Visit Site Recommended byColombia గత సీజన్ వరకూ కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ ఢిల్లీకి మారడంతో.. దినేశ్ కార్తీక్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. బంగ్లాదేశ్‌పై నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో అతడిపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బలహీనంగా కనిపిస్తోన్న జట్టును అతడెలా ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఆ జట్టులో ప్రధాన హిట్టరయిన క్రిస్ లిన్ భుజం గాయంతో భాధపడుతున్నాడు. ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ గాయపడ్డాడు. మిచెల్ జాన్సన్ జిమ్‌లో గాయపడి కోలుకుంటున్నాడు. వీరి ఫిట్‌‌‌నెస్ కోల్‌కతాను టెన్షన్ పెడుతోంది. మరోవైపు ప్రధాన స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై వివాదం మొదలైంది. బ్యాటింగ్‌ ఆర్డర్లో దినేశ్ కార్తీక్ , రాబిన్ ఉతప్ప మాత్రమే పేరున్న బ్యాట్స్‌మెన్. అండర్-19 వరల్డ్ కప్‌లో సత్తా చాటిన శుభ్‌మన్ గిల్ వీరితోపాటు బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. బౌలింగ్‌లోనూ కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్ మాత్రమే ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. వీరితోపాటు వినయ్ కుమార్, పియూష్ చావ్లా, టీనేజ్ సంచలనం కమలేష్ నాగర్‌కోటి ఎలా రాణిస్తారనేది ముఖ్యం కానుంది. మిగతా జట్లతో పోలిస్తే బలహీనంగా ఉండటంతోపాటు.. కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్‌కు అంతర్జాతీయ అనుభవం లేదు. అతడు దేశవాళీ టోర్నీల్లో తమిళనాడుకు విజయ్ హజారే ట్రోఫీని అందించాడు. ఇండియా రెడ్ కెప్టెన్‌గా గతేడాది దిలీప్ ట్రోఫీని అందించాడు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి వనరుల్ని దినేశ్ కార్తీక్ ఎలా ఉపయోగించుకుంటాడు, ఎలాంటి వ్యూహాలు రూపొందిస్తాడనే దానిపైనే కోల్‌కతా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 2014లోనూ ఆటగాళ్ల గాయాలు, ఇతరత్రా సమస్యలతోనే బరిలో దిగిన కోల్‌కతా కప్‌ను ఎగరేసుకుపోయింది. ఈ ఏడాది కూడా అండర్ డాగ్స్‌గా బరిలో దిగుతున్న ఆ జట్టు దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి. బ్యాటింగ్‌, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్‌లో.. కార్తీక్ రాణిస్తే.. భారత జట్టులో అతడి స్థానం పదిలమైనట్లే. ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికినట్టే!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Sagarika Ghatge feels stressed as well as excited ahead of her wedding with Zaheer Khan జహీర్‌తో పెళ్లి.. ఒత్తిడి, ఉత్సాహం కలయిక భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌తో వివాహానికి ఒత్తిడి, ఉత్సాహంతో తాను సిద్ధమవుతున్నట్లు సినీనటి సాగరిక వెల్లడించింది. చెక్ దే ఇండియా TNN | Updated: Nov 2, 2017, 07:28PM IST భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌తో వివాహానికి ఒత్తిడి, ఉత్సాహంతో తాను సిద్ధమవుతున్నట్లు సినీనటి సాగరిక వెల్లడించింది. చెక్ దే ఇండియా సినిమాలో హాకీ క్రీడాకారిణిగా అందర్నీ మెప్పించిన సాగరిక‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో జహీర్ ఖాన్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం నవంబరు చివరి వారంలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ముంబయిలో షాపింగ్‌ చేస్తున్న సాగరిక‌తో మీడియా మాట్లాడింది. ‘పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ ఒకింత ఒత్తిడికి లోనవుతుంటారు. అదే సమయంలో మాటల్లో చెప్పలేనంత ఉత్సాహం కూడా వారిలో ఉంటుంది. ఎందుకంటే.. అలా ఆ శుభాకార్యం కోసం ప్లానింగ్ చేస్తాం. ప్రస్తుతం నేను ఆ ఫీలింగ్స్ అనుభవిస్తున్నాను’ అని సాగరిక వెల్లడించింది. ప్రస్తుతం హిందీ, పంజాబి, మరాఠి సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ భామ వివాహమైన తర్వాత నటనపై ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్తోంది. మరోవైపు జహీర్ ఖాన్.. క్రికెట్ మ్యాచ్ కామెంటేటర్‌గా చక్కగా రాణిస్తున్నాడు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అమెరికాలో 'మన ఊరి రామాయణం' ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న చిత్రమే 'మన ఊరి రామాయణం'. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న... TNN | Updated: Sep 11, 2016, 07:07PM IST ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న చిత్రమే ' మన ఊరి రామాయణం '. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా కంపోజ్ చేసిన ఈ సినిమా మ్యూజిక్‌ని ఆమెరికాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఇళయరాజా అమెరికాలో లైవ్ కన్‌సర్ట్స్‌తో బిజీగా వుండటమే అందుకు కారణం. త్వరలోనే ఇళయరాజా సాన్‌జోస్‌లో ఇవ్వనున్న ప్రదర్శనలోనే 'మన ఊరి రామాయణం' ఆడియో రిలీజ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ సరసన జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ఓ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
0business
first time in 262 tests no indian spinner has managed a single wicket in a home test భారత గడ్డపై తొలిసారిగా.. కోల్‌కతా టెస్ట్ స్పెషల్! ఈడెన్‌లోని పరిస్థితులు పేసర్లకు అనుకూలించిన వేళ.. భారత గడ్డ మీద తొలిసారిగా స్పిన్నర్లు నిరాశపరిచారు. TNN | Updated: Nov 20, 2017, 05:31PM IST కోల్‌కతా టెస్టులో మూడు వికెట్ల తేడాతో లంక ఓటమి గండం నుంచి తప్పించుకుంది. వర్షం కారణంగా మొదటి రెండు రోజులు ఆటలో కొద్ది ఓవర్లు మాత్రమే సాధ్యపడినప్పటికీ.. భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, షమీ అద్భుతం చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో వరుస విరామాల్లో వికెట్లు తీసి లంకను ఓటమి అంచుల్లోకి నెట్టారు. కానీ వెలుతురు మందగించడంతో లంక బతికిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తీసిన 17 వికెట్లూ పేసర్లకే దక్కడం గమనార్హం. అందులో భువీ 8 వికెట్లు తీయగా, షమీ 6 వికెట్లు తీశారు. ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. సొంత గడ్డ మీద జరిగిన భారత స్పిన్నర్లు ఒక వికెట్ కూడా తీయకుండా ఓ టెస్టు మ్యాచ్ ముగియడం ఇదే తొలిసారి కావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇప్పటి వరకూ సొంత గడ్డ మీద 262 టెస్టులు ఆడగా.. మెజార్టీ మ్యాచ్‌ల్లో స్పిన్నర్లే చెలరేగి వికెట్లు తీసేవారు. కాగా పిచ్ మీద పచ్చిక ఉండటం, వర్షంతో గాల్లో తేమ కారణంగా ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లి స్పిన్నర్లతో పది ఓవర్లే బౌలింగ్ చేయించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ 8 ఓవర్లు వేయగా, జడేజా ఒక ఓవర్ వేశాడు. మలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కు అసలు బౌలింగ్ వేసే అవకాశమే దక్కలేదు. జడేజా ఒక్క ఓవర్‌తోనే సరిపెట్టుకున్నాడు. ఈడెన్‌లోని పరిస్థితులు భారత జట్టు ముందే దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నాహకంగా ఉపయోగపడ్డాయి.
2sports
ఇదేం ట్రోలింగ్.. సోషల్ మీడియాపై దిల్ రాజు అసహనం Samayam Telugu| Aug 13, 2018, 08.58 PM IST భారతీయ సాంప్రదాయాల్లో వివాహం గొప్పతనాన్ని చాటిచెబుతూ దిల్ రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా సక్సెస్ మీట్ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో నితిన్‌తో పాటు హీరోయిన్ రాశీఖన్నా, నందితా శ్వేత, దర్శకుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు. ఈ సినిమాపై కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం నెగటివ్ టాక్ రావడంపై దిల్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. తన 15 ఏళ్లలో తాను 30 చిత్రాలు నిర్మించానని, కానీ.. ఏ సినిమాకు తానింత గందరగోళానికి గురికాలేదని తెలిపారు. ‘లవర్’ సినిమా వర్కవుట్ కాలేదని మూడో రోజే తెలిసిపోయింది. కానీ, ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చూసినవారంతా తమని మెచ్చుకుంటుంటే.. సోషల్ మీడియాలో మాత్రం నెగటివ్‌గా మాట్లాడటం బాధాకరమని తెలిపారు. ‘‘ప్రస్తుతం ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము ఈ సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకోడానికి శుభలేఖల రూపంలో ప్రేక్షుకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. ‘చాలా బాగుంది, బాగుంది, ఫర్వాలేదు, బాగాలేదు’ ఆప్షన్లు ఇస్తే 90 శాతం మంది ‘చాలాబాగుంది’ మీద టిక్ చేశారు. రాష్ట్రంలో 60 నుంచి 70 థియేటర్ల నుంచి ఈ అభిప్రాయాలు తీసుకున్నాం. ఈ సినిమాకు మంచి రెవెన్యూ కూడా వచ్చింది. ఏపీల్లో వర్షాలు కురుస్తున్నా సరే మంచి కలెక్షన్లు వచ్చాయి’’ అని దిల్ రాజు తెలిపారు. ‘‘ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన ఒకలా, యూత్ కామెంట్స్ ఒకలా ఉన్నాయి. సోషల్ మీడియాలో రివ్యూలు చూసి.. తొలిసారి కన్‌ఫ్యూజ్ అయ్యా’’ అని తెలిపారు. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న ఈ చిత్రానికి నెగటివ్ టాక్ ప్రచారం చేయడం చాలా బాధేస్తోంది. ఈ సినిమా చూసినవారు అభినందిస్తుంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మీకు ఈ సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పి మంచి సినిమాను ఆధరించేందుకు సహకరించండి’’ అని తెలిపారు.
0business
- 32 లక్షల కార్డుల సమాచార తస్కరణ మా వ్యవస్థ లోపమే - సంస్థ సిస్టమ్స్‌ నుంచి కార్డుల సమాచారం బయటకు పొక్కింది - అన్ని రక్షణ చర్యలు తీసుకున్నాం ొ అది అత్యాధునిక మాల్‌వేర్‌ - జరిగిన నష్టంపై స్పష్టత లేదు : హిటాచి పేమెంట్‌ సర్వీసెస్‌ ముంబయి: ఆన్‌లైన్‌ భద్రతకు సవాలు చేస్తూ గతేడాది అక్టోబరులో వెలుగులోకి వచ్చిన 32 లక్షల డెబిట్‌ కార్డుల సమాచారం తస్కరణ విషయమై క్రమంగా నిజాలు బయటకు వస్తున్నాయి. దేశంలోని బ్యాంకింగ్‌ చెల్లింపుల వ్యవస్థలోని భద్రతకు సవాలు విసురుతూ.. అప్పట్లో సంచలనంగా నిలిచిన ఈ సంఘటనలో తమ తప్పిదం ఉందని జపాన్‌కు చెందిన హిటాచి పేమెంట్‌ సర్వీసెస్‌ సంస్థ ఎట్టకేలకు అంగీకరించింది. అత్యాధునిక మాల్‌వేర్‌ (దొంగ సాఫ్ట్‌వేర్‌) కారణంగా తమ సిస్టమ్స్‌ ప్రభావితమైనట్టు తెలిపింది. దేశంలోని దాదాపు 32 లక్షల డెబిట్‌ కార్డుల డేటా తస్కరించబడినట్టుగా ఒప్పుకుంది. ఇప్పటి వరకు తమ వ్యవస్థలో లోపాలేమీ లేవంటూ బుకాయిస్తూ వచ్చిన సంస్థ పేమెంట్లు, ఇన్‌ఫర్‌మేషన్‌ సెక్యూరిటీ ఆడిట్‌ సంస్థ 'సిసా ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ' ఈ కేసు విచారణ తుది నివేదిక అందిన నేపథ్యంలో హిటాచి తన తప్పిదాన్ని ఒప్పుకోవడం విశేషం. సమాచార తస్కరణకు పూర్తి అత్యాధునిక మాల్‌వేర్‌ను వ్యవస్థలోకి జోప్పించడం జరిగిందని నివేదిక తేల్చింది. ఇది చెల్లింపు వ్యవస్థలో భాగంగానే ఉంటూ తెరవెనుక నుంచి కార్డులకు సంబంధించిన సమాచారం చైనా హ్యాకర్ల చేతుల్లోకిి వెళ్లిందని తెలిపిందే. మాల్‌వేర్‌ ప్రవర్తన, నెట్‌వర్క్‌లో దాని వ్యాప్తికి సంబంధించిన డీకోడింగ్‌ చాలా అత్యాధునికంగా జరిగినట్టుగా హిటాచి పేర్కొంది. మాల్‌వేర్‌లోని సురక్షిత డిలీషన్‌ వ్యవస్థ కారణంగా ఎంత మొత్తంలో కార్డుల డేటా బయటకు పొక్కిందనే విషయంపై స్పష్టత లేదని సంస్థ వివరించింది. 2016 మే 21 నుంచి జులై 11 మధ్య కాలంలో ఈ ఉల్లంఘన జరిగినట్టుగా గుర్తించారు. 'నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా' ఇదే విషయమై స్పందిస్తూ దాదాపు 600 మంది ఖాతాదారులు తాము మోసపోయినట్టుగా ఫిర్యాదు చేశారని.. దాదాపు రూ.1.3 కోట్ల సొమ్ము నష్టపోయినట్టుగా ఫిర్యాదుల అందినట్టుగా వెల్లడించింది. ఈ తప్పిదం వల్ల జరిగిన అసౌకర్యానికి తాము విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా హిటాచి వెల్లడించింది. ఈ విషయమై సంస్థ ఎండీ లోనీ ఆంథోని మాట్లాడుతూ 2016 మధ్యభాగంలో మా సెక్యూరిటీ వ్యవస్థ కొంత ఉల్లంఘనలకు గురైందని ఒప్పుకున్నారు. అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన డేటా భద్రతా విధానాలను అవలంభించడం, తగిన భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా ఆయన తెలిపారు. జరిగిన సంఘటనలకు ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ ఖాతాదారుల వివరాలను భద్రంగా ఉంచడానికి బ్యాంక్స్‌, డెబిట్‌ కార్డు స్కీములను తీసుకువస్తున్నట్టు తెలిపారు. డెబిట్‌ కార్డుల డేటా బయటకు పొక్కిన నేపథ్యంలో అప్పట్లో బ్యాంకులు ఏటీఎం పిన్‌ నంబర్లను మార్చుకోవాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే. ఒక ప్రయివేటు బ్యాంకునకు చెందిన ఏటీఎం ద్వారా ఈ మాల్‌వేర్‌ను వ్యవస్థలోకి జొప్పించబడినట్టుగా తాము అనుమానిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఆంధ్రా బ్యాంకు వ‌డ్డీ రేట్ల‌లో మార్పు ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. Samayam Telugu | Updated: May 15, 2018, 11:15AM IST ఆంధ్రా బ్యాంకు ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఐదు కాల ప‌రిమితులకు సంబంధించిన మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేసుడ్‌ లెండింగ్‌ రేటు (ఎంసిఎల్‌ఆర్‌)లను సవరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఒక్క రోజుకు 7.95 శాతం, నెలకు 8.00 శాతం, మూడు నెలలకు 8.20 శాతం, ఆరు నెలలకు 8.35 శాతం, ఏడాదికి 8.50 శాతం చొప్పున ఎంసిఎల్‌ఆర్‌ను నిర్ణయించినట్లు వెల్లడించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
internet vaartha 115 Views టెస్టు చరిత్రలో ఇది రెండవసారి కాన్పూర్‌ : టీమిండియా ఆడిన 500వ చారిత్రాత్మక మ్యాచ్‌లో అరుదైన చరిత్ర లిఖించబడింది. కాగా మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్టులో 10 హాఫ్‌ సెంచరీలు నమోదు కావడం సరికొత్త రికార్డుకు దోహదం చేసింది. ఒక మ్యాచ్‌లో కనీసం ఒక్క సెంచరీ కూడా లేకుండా 10 హాఫ్‌ సెంచరీలు నమోదు కావడం టెస్టు చరిత్రలో ఇది రెండవ సారి మాత్రమే. కాగా ఈ మ్యాచ్‌ భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్ 65 పరుగులు,ఛటేశ్వర్‌ పుజారా 62 పరుగులతో హాఫ్‌ సెంచరీ చేయగా న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో లాథమ్‌ 58 పరుగులు,విలియమ్సన్‌ 75 పరుగులతో హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు.కాగా ఇరు జట్ల రెండవ ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్ 76 పరుగులు,పుజారా  78 పరుగులు,రోహిత్‌ శర్మ 68 పరుగులు,జడేజా 50 పరుగులు,లూయక్‌ రోంచీ 80 పరుగులు,సాంట్నార్‌్‌ 71 పరుగులు సాధించారు.దీంతో మొత్తం సెంచరీ లేకుండా 10 హాఫ్‌ సెంచరీలు నమోదు కావడం కొత్త అధ్యాయాన్ని లిఃంచింది.కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌ 197 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.టెస్టు కెరీర్‌లో 500వ మ్యాచ్‌ ఆడిన భారత్‌ చారిత్రాత్మక గెలుపును సొంతం చేసుకుంది.చివరి రరోజు ఆటలో అశ్విన్‌,షమీలు విజృంభించడంతో కివీస్‌ ఘోర పరాజయం చవిచూసింది.కాగా భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో ఒక న్యూజిలాండ్‌ ఆటగాడు అయిదు వికెట్లు,50కు పైగా పరుగులు చేయడం 1988 తరువాత ఇదే తొలిసారి.సాంట్నార్‌ ఈ ఘనత సాధించాడు.అంతకు ముందు 1986-89 సీజన్‌లో జాన్‌ బ్రాస్‌ వెల్‌ అయిదు వికెట్లు 50కి పైగా పరుగుల ఘనత నమోదు చేశాడు.ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చివరి అయిదు వికెట్లను ఏడు పరుగుల వ్యవధిలో కోల్పోవడం ఆ జట్టుకు రెండవ అత్యల్పం.కాగా 1992-93 సీజన్‌లో న్యూజిలాండ్‌ చివరి సారి అయిదు పరుగులకు అయిదు వికెట్లను నష్టపోయింది.తన కెరీర్‌లో రెండవ టెస్టు ఆడుతున్న ల్యూకో రోంచీ రెండు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌ రెండవ ఇన్నింగ్స్‌లో రోంచీ హాఫ్‌ సెంచరీ చేయగా అంతకు ముందు అరంగేట్రం మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV సింహాచలంలో రామ్‌చరణ్.. పోరాట సన్నివేశాలు లీక్! చెర్రీ, బోయపాటీల సినిమా వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలోని ఓ ఫైట్ సీన్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. Samayam Telugu | Updated: Oct 14, 2018, 09:35PM IST సింహాచలంలో రామ్‌చరణ్.. పోరాట సన్నివేశాలు లీక్! మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ వైజాగ్ చేరుకుంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్, బోయపాటి శ్రీను , నిర్మాత డీవీవీ దానయ్యలు సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సింహాచలం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కప్ప స్తంభానికి ఆలింగనం చేసుకున్నారు. పుజానంతరం ఆలయ అధికారులు స్వామికి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. ఈ సినిమాలో చెర్రీ సరసన కైరా అద్వానీ నటిస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్ల ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. ఇందులో చరణ్ కత్తి పట్టుకుని ఫైట్ చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
New Delhi, First Published 4, Oct 2018, 12:03 PM IST Highlights ముడి చమురు ధరల పెరుగుదల, ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం దరిమిలా విదేశీ ఇన్వెస్టర్లు రూ.1550 కోట్ల మదుపు ఉపసంహరణ వంటి అంశాలతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా గురువారం అమెరికా డాలర్‌పై రూపాయి విలువ సరికొత్త రూ.73.78 జీవితకాల కనిష్ట రికార్డును నెలకొల్పింది.  కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఆర్థికశాఖ, ఆర్బీఐ నిష్క్రియా పరత్వం పుణ్యమా? అని అమెరికా డాలర్‌పై రూపాయి పతనాన్ని నిలువరించలేకపోతున్నారు. ఏ రోజుకారోజు జీవితకాల కనిష్ట స్థాయికి పతనం అవుతూనే ఉన్నది. తాజాగా గురువారం అమెరికా డాలర్‌పై రూపాయి పతనం రూ.73.78 వద్ద దిగజారిపోయింది. ముడి చమురు ధరల పెరుగుదల, కరంట్ ఖాతా లోటు పెరుగుతుందన్న ఆందోళన, విదేశీ పెట్టుబడుల నిష్క్రమణ వంటి అంశాలతో రూపాయి నేను నిలువజాలనంటూ దిగువకు పరుగులు పెడుతోంది. ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ రూపాయి- డాలర్ మారకం 73.60-74.20 వద్దకు చేరవచ్చునని అంచనా వేశారు.  సోమవారం ముగింపు 72.91 నుంచి బుధవారం 43 పైసలు పెరిగి రూ.73.42 వద్ద స్థిరపడింది. అయితే బుధవారం ఒక్కరోజు విదేశీ మదుపర్లు రూ.1,550 కోట్ల విలువైన షేర్లు అమ్మేశారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ క్లయింట్ గ్రూప్ అండ్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటర్జీ అధిపతి వీకే శర్మ మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వ రంగ ముడి చమురు సంస్థలు విదేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేయడానికి అవసరమైన డాలర్లను సరఫరా చేసేందుకు స్పెషల్ విండో ఏర్పాటు చేయడానికి ఆర్బీఐ నిరాకరించింది. ఫలితంగా రూపాయి విలువ మరింత పతనం కావడానికి దారి తీసింది. డాలర్ మరింత బలోపేతం అవుతుండగా, ఇతర దేశాల కరెన్సీలు మరింత బలహీనపడ్డాయి’ అని చెప్పారు.  వచ్చేనెల నుంచి ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పైపైకి పెరిగిపోయే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల్లోనే ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుందన్న సందేహాల మధ్య మరోవైపు శుక్రవారం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీరేట్లు పెంచుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ క్రమంలో రూపాయికి మద్దతుగా కేంద్ర ముడి చమురు సంస్థలు 10 బిలియన్ల డాలర్ల విదేశీ వాణిజ్య రుణాలు పొందేందుకు మాత్రం ఆర్బీఐ అనుమతించింది.  ఇదిలా ఉంటే గురువారం రూపాయి విలువ పతనం, ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం వంటి పరిణామాల నేపథ్యంలో దలాల్ స్ట్రీట్‌లో గందరగోళం నెలకొంది. బీఎస్ఈ ఇండెక్స్ 36 వేల, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 10,900కు దిగువనే పతనమయ్యాయి. డీబీఎస్ బ్యాంక్ ట్రేడింగ్ హెడ్ అవీష్ వైద్య మాట్లాడుతూ ముడి చమురుతోపాటు అంతర్జాతీయ సూక్ష్మ పరిస్థితుల నుంచి ఒత్తిడి రావడంతో రూపాయి మరింత పతనమైంది’ అని తెలిపారు. బ్యాంకింగ్ షేర్లు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మారుతి సుజుకి షేర్లు పతనమయ్యాయి.  Last Updated 4, Oct 2018, 12:03 PM IST
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV మయాంక్‌ను బౌన్సర్‌తో బోల్తాకొట్టించిన కమ్మిన్స్ షార్ట్ పిచ్ బంతితో విహారిని ఔట్ చేసిన పాట్ కమ్మిన్స్.. మరో బౌన్సర్‌తో మయాంక్‌నూ బోల్తా కొట్టించాడు. మీదికి దూసుకొచ్చిన బౌన్సర్‌ను అంచనా వేయడంలో తికమక పడిన మయాంక్ ఔట్‌గా వెనుదిరిగాడు. Samayam Telugu | Updated: Dec 26, 2018, 10:13AM IST మయాంక్‌ను బౌన్సర్‌తో బోల్తాకొట్టించిన కమ్మిన్స్ హైలైట్స్ హాఫ్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ ఔట్ బౌన్సర్‌తో మయాంక్‌ను బోల్తా కొట్టించిన పాట్ కమ్మిన్స్ పుజారాతో కలిసి 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మయాంక్ మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సరిగ్గా లంచ్ బ్రేక్‌కు ముందు హనుమ విహారి(8) రూపంలో తొలి వికెట్‌ను చేజార్చుకున్న భారత్.. రెండో వికెట్‌ కోల్పోయి టీ విరామానికి వెళ్లింది. ఆరంగేట్ర టెస్టులోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్(76; 161 బంతుల్లో 8×4, 1×6) రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. షార్ట్ పిచ్ బంతితో విహారిని ఔట్ చేసిన పాట్ కమ్మిన్స్.. మరో బౌన్సర్‌తో మయాంక్‌నూ బోల్తా కొట్టించాడు. మీదికి దూసుకొచ్చిన బౌన్సర్‌ను అంచనా వేయడంలో తికమక పడిన మయాంక్ దాన్ని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి చేతి గ్లౌజులను రాసుకుంటూ కీపర్ టిమ్ పైన్ చేతిలో పడింది. దీంతో ఓ మంచి ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది.
2sports
Suresh 95 Views profits ఆర్థికవృద్ధి 7.5% కష్టమే! న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఆర్ధికవృద్ధి ఈ ఆర్ధికసంవత్సరంలో 6.75శాతంనుంచి 7.5శాతం మధ్యకు చేరడం కొంతమేర సంక్ల్టిమేనని కేంద్రం ప్రకటించింది. స్థూల దేశీయోత్పత్తి 2018 మార్చితోముగిసిన ఆర్ధిక సంవత్సరానికి మధ్యంతర ఆర్ధికసర్వేలో ఎక్కువ సమస్యలు,సవాళ్లు ఉన్నందున సాధించడం క్టమేనని వెల్లడించింది. ఈ సర్వే నుంచి జిడిపి వృద్ధి, రూపాయి పట్టిం కావడం, వ్యవసాయ రుణమాఫీ వంటివి ఆస్తిఅప్పుల పట్టీలను కొంత ఒత్తిడితెస్తాయని అంచనావేసింది. అలాగే విద్యుత్‌, టెలికమ్యూనికేన్స్‌, వ్యవసాయరంగపరంగా ఒత్తిళ్లు ఉంటాయని, జిఎస్‌టి అమలు తొలినాళ్లలో ఉన్న కష్టాలు కూడా జిడిపి వృద్ధికి ప్రతిబంధకం అవుతాయని అంచనా వేసారు. ద్రవ్యవిధానపరపతి సమీక్షలో వడ్డీరేట్లను సడలిస్తే కొంతమేరప్రభావం ఉంటుందని, కొంతమేర ధరల ఒత్తిళ్లు కూడా ఇందుకు దోహదంచేస్తాయని ఆర్ధికసర్వే రెండోనివేదిక ఉటంకించింది. జనవరిలో ఆర్ధికసర్వే దేశ స్థూలదేశీయోత్పత్తి 6.75శాతంనుంచి 7.5శాతంగా ఉంటుందని వెల్లడించింది. అయితే శుక్రవారం ప్రభుత్వం తన రెండో మధ్యంతర ఆర్ధికసర్వేను పార్లమెంటుకు సమర్పించింది. ఈ ఏడాది ప్రారంభంనుంచి ఆర్ధికవ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను ఈ నివేదికలోప్రస్తావించింది. ఆర్ధికవ్యవస్థ దిగువప్రాంతంలో కొంత సమస్యలు ఎదురవు తాయని, ఎగువ ప్రాంతంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంతమేలుచేస్తాయని భావించింది. భారతీయ రిజర్వుబ్యాంకు రానిబాకీల సమస్యలను పర్కిరించేందుకు అధికారాలను కట్టబెట్టడం,బ్యాంకులు, కార్పొరేట్‌లలో అత్యధికస్థాయిలో పేరుకుపోయిన మొండిబకాయిల పరిష్కారం వీటిలో కీలకంగా ప్రస్తావించింది. స్వల్ప కాలంలో మార్కెట్లకు కొంత బూస్ట్‌ఇచ్చిందని అంచనా. అయితే కార్పొరేట్‌ ఆస్థి అప్పుల పట్టీలు రుణపరపతి, పెట్టుబడుల సమతుల్యంతో వృద్ధిచెందాల్సిన అవసరం ఉందని, బ్యాంకు ఆస్థి అప్పుల పట్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ రుణపరపతిని పెంచా ల్సిన అవసరం ఉందని ఆర్ధికసర్వే ఉటంకించింది. స్వల్పకాలంలో జిఎస్‌టి అమలు వల్ల కొన్ని సమస్యలున్నా ఆర్ధిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు అందిస్తుందని పేర్కొన్నారు. చెక్‌పోస్టుల ఎత్తివేత కారణంగా రవాణారంగంలోని సమస్యలు సులువుగా అధిగమించ వచ్చని సర్వేలో ప్రస్తావించారు. ఇక ద్రవ్యోల్బణం కూడా మధ్యకాలికంగా ఆర్‌బిఐ లక్ష్యం నాలుగు శాతంగా ఉంటుందని 2018 మార్చినాటికి లక్ష్యాలు సాధించాలని వెల్లడించారు. రిటైల్‌ద్రవ్యోల్బణం 1.54శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. గడచిన ఐదేళ్లలో ఇదే అత్యంత కన్టిస్థాయి అని తేలింది. తక్కువస్థాయిలో నమోదయిన ద్రవ్యోల్బణం వల్లనే రిజర్వుబ్యాంకు గత వారంలో నిర్వహించిన సమీక్షలో 25బేసిస్‌ పాయింట్లను తగ్గించి ఆరుశాతానికి రెపోరేట్లను సవరించేందుకు దోహదంచేసింది. 2010 నవంబరునుంచి చూస్తే ఇదే అత్యంత తగ్గుదల అని రానున్నరోజుల్లో కూడా ఆర్‌బిఐ మరింతగా రెపో రట్లను సవరిస్తుందని నిపుణులు చెపుతున్నారు.
1entertainment
internet vaartha 155 Views న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌ ధోనీ టి20ల్లో వెయి పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు.కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా సాధించకుండానే ధోనీ ఈ ఘనతను సాధించడం విశేషం.ఇంతవరకు 67 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 1026 పరుగులు చేశాడు.ఇందులో 2012లో సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుపై చేసిన 48 పరుగులే అత్యధిక స్కోరుగా నమోదైంది.టి20ల్లో వెయి పరుగుల క్లబ్‌లో ధోనీ కంటే ముందు యువరాజ్‌,రైనా,కోహ్లీ ఉన్నారు.టి20 వరల్డ్‌ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ధోనీ వెయి పరుగుల క్లబ్‌లో చేరాడు.
2sports
May 23,2018 ఏడు నెలల్లో 39 లక్షల కొలువులు! న్యూఢిల్లీ: వాస్తవానికి మార్కెట్లో కొత్త కొలువులనవే కనిపించకుండా పోతు న్నప్పటికీ.. గత సెప్టెంబరు-మార్చి మధ్య (ఏడు నెలల) కాలంలో దాదాపు 39.36 లక్షల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్టు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌వో) సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. మార్చితో ముగిసిన ఏడు నెలల కాలంలో ఈ మేరకు కొత్తవారు కొలువుల్లోకి ఎక్కినట్టుగా ఈపీఎఫ్‌వో తెలిపింది. కేవలం ఒక్క మార్చి నెలలోనే దాదాపు 6.13 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయని భవిష్యనిధి సంస్థ తెలిపింది. గత ఫిబ్రవరిలో 5.89 లక్షల ఉద్యోగాలే కల్పించబడినట్టుగా సంస్థ తెలిపింది. కొత్తగా ఉద్యోగాల కల్పన జరిగిన రంగాలలో విద్యత్తు, యంత్రాలు, సాధారణ ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల తయారీ రంగాలతో పాటు భవన నిర్మాణం, వాణిజ్యం, కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌, జౌళి రంగాలు ఉన్నట్టుగా ప్రభుత్వ శాఖ తెలిపింది. అయితే కొత్తగా సృష్టించబడిన 39.36 లక్షల కొలువుల్లో సగం ఉద్యోగాలు మహరాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లోనే నమోదైయినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మిగతా సగం ఉద్యోగాలు మగిలిన 23 రాష్ట్రాల్లో నమోదు కావడం విశేషం. అయితే ఈపీఎఫ్‌వో విడుదల చేసిన గణాంకాలు పూర్తిగా నమ్మాల్సిన సంఖ్యలు కావని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఉద్యోగాలు మారి కొత్త కొలువుల్లో చేరినప్పుడల్లా ఆయా సంస్థలు వారిని ఈపీఎఫ్‌వో రోల్స్‌లో చూపిస్తూ వస్తాయని దీంతో సంఖ్య అధికంగా కనిపిస్తుందన్నది వారి వాదన. న మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 124 Views bse , NSE , stock market SENSEX DOWN ముంబయి: అమ్మకాల ఒత్తిడితో వరుసగా రెండో రోజు స్టాక్‌ మార్కెట్లు పతనమైనవి.నేటి ట్రేడింగ్‌ను సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. 200 పాయింట్లు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఆ తర్వాత మరింత పతనమైంది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా దిగజారి రోజు కనిష్ఠానికి పడిపోయింది. చివరకు కాస్త కోలుకున్నా నష్టాలు తప్పలేదు. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 383 పాయింట్లు పతనమై 37,069 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 10,948 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.76గా కొనసాగుతోంది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/
1entertainment
Mumbai, First Published 9, May 2019, 1:14 PM IST Highlights గురువారం(మే9) ఉదయం నుంచి కూడా  ట్రేడింగ్‌ను దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా పతనంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  ముంబై: మంగళవారం కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కొంత కోలుకున్నట్లు కనిపించినప్పటికీ గురువారం మళ్లీ నష్టాలనే నమోదు చేశాయి.  గురువారం(మే9) ఉదయం నుంచి కూడా  ట్రేడింగ్‌ను దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా పతనంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  అంతర్జాతీయ మార్కెట్లు కూడా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయంతో నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా అదేబాటలో కొనసాగుతున్నాయి.  గురువారం ఉదయం 10గంటల సమయానికి సెన్సెక్స్ 103.43 పాయింట్ల నష్టంతో 37685 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11,328 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హీరో మోటోకార్ప్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, మారుతి షేర్లు ఎన్ఎస్ఈలో అధిక లాభాల్లో కొనసాగుతున్నాయి.  ఇక యస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక డాలరు మారకంతో రూపాయి విలువ 14 పైసలు తగ్గి రూ. 69.85 వద్ద కొనసాగుతోంది. Last Updated 9, May 2019, 1:14 PM IST
1entertainment
జయమ్ము.. సినిమా హిట్.. బయ్యర్లు ఫట్! TNN| Dec 15, 2016, 12.52 PM IST jayammu nischayammu raa సినీ రంగం చాలా విచిత్రమైంది. ఒక్క హిట్ ఖాతాలో పడితే హీరో రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. నిర్మాతలకు, బయ్యర్లకు లాభాల పంట పండుతుంది. అదే ఒక్క సినిమా ఫ్లాఫ్ అయితే హీరో పాతాళానికి పడిపోకపోవచ్చు.. కానీ నిర్మాత, బయ్యర్లు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతారు. కొన్ని సినిమాలది మరో రకమైన విచిత్రమైన పరిస్థితి. సినిమా బాగుందనే టాక్ వస్తుంది. నటించిన వాళ్లకు కూడా పేరొస్తుంది. కానీ నిర్మాతకు, బయ్యర్లకు మాత్రం లాభాల మాట అటుంచి నష్టాలే వెక్కిరిస్తాయి. ఈ పరిస్థితినే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాను కొనుగోలు చేసిన ఓ ప్రొడ్యుసర్ ఎదుర్కొంటున్నాడు. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా ​ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పాజిటివ్ టాక్‌తో జనంలోకి వెళ్లింది. ఈ సినిమా మీద అతి నమ్మకంతో ఓ నిర్మాత ఏడు కోట్ల రూపాయలు పెట్టి మొత్తం సినిమా అమ్మకం హక్కులను దక్కించుకున్నాడు. సినిమా బావుందనే టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం ఆ మేరకు లేవని సమాచారం. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సినిమా కలెక్షన్లు తగ్గాయి. దీంతో ఈ సినిమాను కొన్న నిర్మాతకు రూ.4 కోట్ల మేర నష్టాలు మిగిలాయట. సినిమాను ముందే అమ్మేయడంతో చిత్ర నిర్మాతకు లాభం వచ్చింది. కానీ సినిమా మీద నమ్మకంతో కొనుగోలు చేసిన బయ్యర్లు మాత్రం ఘోరంగా నష్టపోయారు. కంటెంట్ ఉందనే నమ్మకంతో సినిమా కొనుగోలు చేస్తే నష్టాలే మిగిలియని వాపోతున్నారు.
0business
mahesh kathi strong counter to swetha reddy over bigg boss telugu casting couch controversy Kathi Mahesh: ‘బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే వాళ్లంతా ఆ టైపేనా? నీ వ్యాఖ్యలు నీచం శ్వేతా రెడ్డి’! Bigg Boss Telugu News: బిగ్ బాస్ హౌస్‌ కాదు.. అది బ్రోతల్ హౌస్ అంటూ సంచలన ఆరోపణలు చేసిన యాంకర్ శ్వేతా రెడ్డిపై ఫైర్ అయ్యారు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. ఈ సందర్భంగా ఫేస్ బుక్‌లో పోస్ట్ వదిలారు. Samayam Telugu | Updated: Jul 17, 2019, 04:08PM IST బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఒక్కొక్కరుగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో మీడియా కెక్కుతున్నారు. యాంకర్ శ్వేతా రెడ్డితో పాటు వివాదాస్పద నటి గాయత్రి గుప్తా.. బిగ్ బాస్ నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు చేయగా తమలాంటి మరో 40 మంది అమ్మాయిల్ని ఇదే రీతిలో మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. Read Also: తొక్కలో శ్వేతా రెడ్డి.. నువ్వో సెలబ్రిటీవా? అనే వాళ్లకి నా ట్రాక్ రికార్డ్ ఇదిగో! ఇదిలా ఉంటే మరో వారంలో ప్రారంభమయ్యే.. బిగ్ బాస్ సీజన్ 3కి హైప్ తీసుకువచ్చేందుకే ఈ ఇద్దరు రంగంలోకి దిగారని.. ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాగా బిగ్ బాస్ హౌస్‌ని బ్రోతల్ హౌస్ అంటూ సంచలన కామెంట్స్ చేసిన శ్వేతా రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ వదిలారు బిగ్ బాస్ సీజన్ 1 కంటెంస్టెంట్స్, మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. Read Also: నాకు డబ్బు అవసరం.. అందుకే దానికి ఒప్పుకున్నా: గాయత్రి గుప్తా ఈ సందర్భంగా శ్వేతారెడ్డివి నీచమైన అపవాదులు అంటూ ఫైర్ అయ్యారు మహేష్ కత్తి. ‘శ్వేతారెడ్డి పోరాటంతో నాకు సమస్య లేదు. కానీ ఇలా బిగ్ బాస్‌కి వెళ్లిన ప్రతి మహిళా కాస్టింగ్ కౌచ్ రూట్లోనే వెళ్లింది. కాబట్టి అది బ్రోతల్ హౌస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను బిగ్ బాస్ 1 లో భాగం. అక్కడికి వచ్చిన ఏ మహిళా తన ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి ఆ షోలో భాగం అవ్వలేదు. ఈ మాట నేను ఖరాఖండిగా చెప్పగలను. వాళ్ళు నాకు స్నేహితులు, అక్కలు, చెల్లెల్లు. వాళ్ళ మీద ఇంత నీచమైన అపవాదులు వెయ్యడం ఏవిధమైన పోరాటమో నాకు అర్ధం కావడం లేదు’ అంటూ శ్వేతా రెడ్డి ఆరోపణలను ఖండించారు కత్తి మహేష్.
0business