news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఒక ఇంటివాడైన ఆది..
రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన ధృవ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసిన కంపోజర్స్ ద్వయంలో...
TNN | Updated:
Dec 1, 2017, 06:57PM IST
రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన ధృవ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసిన కంపోజర్స్ ద్వయంలో ఒకరైన హిప్ హాప్ తమీఝ ఆది ఓ ఇంటివాడయ్యాడు. తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆది ఆ విషయాన్ని ట్విటర్ స్టేటస్ ద్వారా అభిమానులకి తెలియపర్చాడు. తాను ఇంకా ఒంటరిని కానని, ఇప్పుడు తనకి మీ అందరి ఆశీర్వాదం కావాలని ఆది తన ట్విటర్ స్టేటస్‌లో పేర్కొన్నాడు.
తొలుత ఆది కేవలం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని, ఇంకా పెళ్లి కాలేదని వార్తలొచ్చాయి కానీ ఇదే విషయమై టైమ్స్ ఆఫ్ ఇండియా అతడిని సంప్రదించగా ఆది అసలు విషయం చెప్పాడు. తాను పెళ్లి చేసుకుంది నిజమేనని, కేవలం సమీప బంధువులు, అత్యంత సన్నిహిత మిత్రుల సమక్షంలో తన పెళ్లి జరిగింది అని చెప్పిన ఆది... తన భార్య డీటేల్స్ వెల్లడించడానికి మాత్రం నిరాకరించాడు. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఉద్యోగులను తొలగించే పనిలో 'అమెజాన్'..!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ 'అమెజాన్' ఇండియా ఉద్యోగులను తొలగించే పనిలోపడింది. ఇప్పటికే...60 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలిపింది. మరికొందరిని కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
TNN | Updated:
Apr 3, 2018, 01:34PM IST
ఉద్యోగులను తొలగించే పనిలో 'అమెజాన్'..!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ 'అమెజాన్' ఇండియా, ఉద్యోగులను తొలగించే పనిలోపడింది. ప్రాథమికంగా ఇప్పటికే...60 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలిపింది. మరికొందరిని కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. పేటీఎం, ఫ్లిఫ్కార్ట్ సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్రపోటీ నేపథ్యంలో, గతేడాది డిసెంబరులోనే... 25 శాతం మంది ఉద్యోగులకు పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ లేఖలు పంపిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా తన కార్యకలాపాల్ని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపు అనివార్యం చేసింది.
తమ సంస్థలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని... వారికి మరోచోట ఉపాధి కల్పిస్తామని అమెజాన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నాలుగు వేల కొత్త ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు తెలిపారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
internet vaartha 179 Views
ఆస్ట్రేలియా ఓపెన్లో సంచలనం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో మంగళవారం సంచలనం నమోదైంది.కాగా మాజీ చాంపియన్,ప్రపంచ అయిదవ ర్యాంకర్ రఫెల్ నాదల్ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో స్పెయిన్కు చెందిన నాదల్కు స్వదేశానికి చందిన 45వ ర్యాంకర్ ఫెర్నాండో వెర్డాస్కో షాకిచ్చాడు. ఫెర్నాండో 7-6(6),4-6, 3-6,7-6(4),6-2 స్కోరుతో నాదల్పై పోరాడి గెలిచాడు. కాగా తొలిసెట్ను కోల్పోయిన నాదల్ వెంటనే పుంజుకుని వరుసగా రెండవ సెట్లను గెల్చుకున్నాడు. అయినా ఆ తరువాత ఫెర్నాండో వరుసగా రెండు సెట్లను గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. | 2sports
|
sandhya 201 Views stock market
stock market
ముంబై: నేడు మార్కెట్లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం బిఎస్ఈ సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 40,030 వద్ద కొనసాగుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 26 పాయింట్లు నష్టంతో 11,995 దగ్గర ట్రేడ్ అవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69.42గా ఉంది. బంగారం విలువ రూ. 54 పెరిగి రూ. 32,734గా ఉంది.
తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/latest-news/ | 1entertainment
|
internet vaartha 226 Views
ఎన్డిఎ ప్రభుత్వంలోనే అనూహ్యవృద్ధి
న్యూఢిల్లీ : భారత్లోని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగం 1.28 లక్ష లకోట్ల టర్నోవర్ను అధిగమించిందని ఐటి మంత్రి రవిశంకర్ప్రసాద్ వెల్లడించారు. తమ ప్రభుత్వం 2014లో అధికా రంలోనికి వచ్చేనాటికి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగం కేవలం 11,700 కోట్లు టర్నోవర్తో మాత్రమే ఉండేదని, కేవలం రెండురోజుల క్రితమే రెండేళ్ల తర్వాత 1.28 వేల కోట్లకు పైబడిందని కేంద్ర మంత్రి వివరించారు. మేకిన్ ఇండియాతో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి హబ్గా భారత్ ను రూపదిద్దాలన్న లక్ష్యంతో ఉందని, కేంద్రం, రాష్ట్రాలు కూడా ఈ విధానంలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. టెక్నాలజీని సత్వరమే అందుకునే దేశంగా భారత్ నిలిచిందని, ఈ ఏడాది చివరినాటికి 50 మిలియన్ల జనాభా ఇంటర్నెట్ వినియోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రానున్న 2.5 మూడేళ్లలో ఇంటర్నెట్ వినియోగదారులు 200 నుంచి 300 మిలియన్లకు చేరుకుంటారని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చెపుతున్నట్లు 400 మిలియన్లకు కూడా చేరే అవకాశం ఉందన్నారు. 2017 నాటికి 500 మిలియన్ల కస్టమర్లకు చేరుకోవాలని అయితే ఈ లక్ష్యం ఈ ఏడాది చివరికే సాధించేటట్లు కనిపిస్తోందని మంత్రి సంతోషం వ్యక్తంచేశారు. టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన డిజిటల్ ఇండియా సదస్సు సందర్భంగా మంత్రి కీలక ప్రసంగం చేశారు డిజిటల్ సమాజం నిర్మాణం మాత్రమే కాదని, భారత్ను డిజిటల్ సాధికారత కలిగిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోం దన్నారు. మొదట భారతీయులు టెక్నాలజీని పరిశీలిస్తారని వెనువెంటనే వాటిని అమలు చేస్తారని అందువల్లనే ఎక్కువ సాధికారత ఏర్పడుతున్నదన్నారు. ఎన్డిఎ ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ భారత్లో ప్రస్తుతం 100 కోట్లకు పైబడిన మొబైల్ఫోన్ కనెక్షన్లు, ఆధార్ కార్డులు న్నాయని, వీటిద్వారానే 50 వేల కోట్లను ప్రభు త్వం ఆధార్ ఆధారిత బ్యాంకు ఖాతాలకు జమచేస్తోందన్నారు. ఈకామర్స్ రంగం భారత్ లో 60శాతం వృద్ధి చెందుతోందని, ఆన్లైన్ మార్కెట్వ్యవస్థ చిన్నపట్టణాల్లో సైతం వృద్ధి సాధించిందన్నారు. దేశంలోని 2.50 లక్షల పంచాయితీలకు ఆప్టికల్ఫైబర్నెట్వర్క్ ఉందని, మరో 1.30 లక్షల కిలోమీటర్లమేర నెట్వర్క్ ఏర్పాటవుతోందన్నారు. ఇప్పటికే 1.10 లక్షల కిలో మీటర్లమేర ఆప్టికల్ ఫైబర్ను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పంచాయితీలు బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్తో లింకు అయిన పక్షంలో ఇబిజినెస్, ఇఎడ్యుకేషన్, ఇహెల్త్వంటి ఇతర ప్రాజెక్టులు కూ డా అన్ని గ్రామాల్లోప్రారంభం అవుతాయన్నారు. ప్రభుత్వ లక్ష్యం చిన్న పట్టణాల్లో కూడా బిపిఒలను ఏర్పాటుచేయాలని అన్నారు మొత్తం 78 కంపెనీలు 190 కేంద్రాల్లో బిపిఒ సెంటర్లు ఏర్పాటుచేసేందుకు ముందుకువచ్చాయని అన్నారు మొత్తం 190 కేంద్రాల్లో లక్షా 25 వేలమందికిపైగా అవకాశాలు కల్పించవచ్చన్నారు. బిపిఒ ప్రోత్సాహక పథకం కింద బిపిఒ/ ఐటిఇఎస్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా ప్రారంభిస్తామని రూ.493 కోట్ల రూపాయలమేర ప్రణాళిక అమలుచేస్తామన్నారు 12వ పంచవర్ష ప్రణాళికలోనేఈ లక్ష్యం పూర్తిచేస్తామని కేంద్ర ఐటిశాఖ మంత్రి వెల్లడించారు. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వారు దేశ గౌరవ చిహ్నాలు...
లాస్ ఏంజెల్స్ నగరంలో జరిగిన ప్రపంచ ప్రత్యేక వేసవి ఒలింపిక్ క్రీడల విజేతలను భారత ప్రధాని అభినందించారు.
TNN | Updated:
Aug 5, 2015, 01:32PM IST
లాస్ ఏంజెల్స్ నగరంలో జరిగిన ప్రపంచ ప్రత్యేక వేసవి ఒలింపిక్ క్రీడల విజేతలను భారత ప్రధాని అభినందించారు. ఈ క్రీడల్లో పాల్గొన్న భారతీయ క్రీడాకారులు ఆయా క్రీడాంశాల్లో 173 పతకాలను సాధించారు. ఈ విజయాల గురించి మోడీ తన ట్విట్టరు ఖాతాలో ప్రస్తావించారు. ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ట్వీట్ చేసారు. ఆ విజేతలను భారత దేశానికి గర్వకారణంగా పేర్కొన్నారు. వారి విజయాలు తనను ఆనందంలో ముంచెత్తాయన్నారు. ప్రత్యేక ఒలింపిక్ క్రీడలు నిజమైన క్రీడాస్ఫూర్తికి క్రీడాకారుల అంకితభావానికి నిదర్శనాలుగా వర్ణించారు. ఈ క్రీడల్లో భారతదేశం తరఫున పాల్గొన్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు. ఈ క్రీడల్లో మొత్తం 275 సభ్యుల భారత బృందం పాల్గొనగా, 14 క్రీడాంశాల్లో 47 స్వర్ణ, 54 రజత, 72 కాంస్య పతకాలను మనం గెలుచుకున్నాము. | 2sports
|
ఇప్పుడు జాకీచాన్తో ఎఫైర్: దిశాపటానీ
Highlights
కెరీర్లో ఎంతోమంది హీరోలతో నటించిన కొందరే మనసుకి నచ్చుతారు అంటున్న దిశాపటానీ
అయితే మనసుకు నచ్చినవాళ్ళంతా బాయ్ఫ్రెండ్స్ అయిపోలేరు కదా అంటున్న ముద్దుగుమ్మ
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్తో పీకల్లోతు ప్రేమాయణంలో వుందంటూ దిశా పటానీ గురించి గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అన్నట్టు, టైగర్ ష్రాఫ్ ఏ హీరోయిన్తో కలిసి సినిమా చేసినా, ఆ హీరోయిన్తో అతనికి ఎఫైర్ వుందంటూ గాసిప్స్ పుట్టుకొచ్చేస్తుంటాయి. ఈ ఎఫైర్ గాసిప్స్ మీ మీదే ఎందుకు ఎక్కువగా వస్తాయి. అని ప్రశ్నిస్తే, 'ఇలాంటి ప్రశ్నలు సరదాగా వుంటాయ్.. సర్లే, అలాగే అనుకోండి.. వాళ్ళంతా నా గర్ల్ఫ్రెండ్స్ అనుకోడానికి ఫీలింగ్ బాగుంది కదూ..అంటూ నవ్వేశాడు ఓ సందర్భంలో.
ఇక, టైగర్ ష్రాఫ్, దిశా పటానీ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారంటూ ఆ మధ్య గాసిప్స్ ఓ రేంజ్లో విన్పించాయి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారనీ ప్రచారం జరిగింది. ఇంతకీ, టైగర్తో పరిచయం ఎలాంటిది.? అనడిగితే, దానికి సమాధానమిస్తూ, 'హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్.. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్ కంటే ఎక్కువ.. అలాగని, ప్రేమికుడు కాదు..' అని చెప్పింది దిశా పటానీ. ప్రతి సినిమా సమయంలోనూ హీరోలతో హీరోయిన్లకు ఎఫైర్ వుంటే, నాకిప్పుడు జాకీచాన్తో ఎఫైర్ వుండి వుండాలి కదా.. అంటూ నవ్వేసిందీ బ్యూటీ.
Last Updated 26, Mar 2018, 12:01 AM IST | 0business
|
Suresh 108 Views SUNIL GAVASKAR
Sunil Gavaskar
న్యూఢిల్లీ: భారత క్రికెట్ సెలక్షన్ కమిటీనేనా అంటూ విమర్శించారు. వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును ప్రకటించే క్రమంలో సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నాడు. ఇదొక కుంటి బాతు సెలక్షన్ కమిటీలా ఉంది. ముందుగా వెస్టిండీస్ పర్యటనకు కోహ్లీ దూరం అవుతాడని సెలెక్టర్లు చెప్పారు. ఒక్కసారిగా విండీస్ పర్యటనకు కోహ్లీనే కెప్టెన్ అంటూ ప్రకటించారు. మూడు ఫార్మట్లకు అతనే కెప్టెన్ అంటూ వెల్లడించారు. దీంతో అనేక ప్రశ్నలకు తావిచ్చారు బిసిసిఐ సెలక్టర్లు. సెలక్షన్ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా…లేక కోహ్లీ నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా అనే విమర్శలు వచ్చాయి. ఈ తరహా సెలక్షన్ విధానం సరైంది కాదు. మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కోహ్లీ కెప్టెన్సీ అనేది వరల్డ్కప్ వరకే. ఆ తర్వాత కెప్టెన్ను ఎంపిక చేసే అధికారం సెలెక్టర్లకు ఉంది. మారి అలా చేయకుండా కోహ్లీనే కెప్టెన్గా తిరిగి కొనసాగిస్తూ ఆగమేఘాలపై ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ కోహ్లీని కెప్టెన్గా తిరిగి ఎంపిక చేయాలను కుంటే దానిలో సాధారణ సమావేశం నిర్వహించి అప్పుడు ప్రకటించాల్సింది అని ఎంఎస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై గవాస్కర్ ధ్వజమెత్తారు. అదే సమయంలో ప్రపంచకప్లో ఆడిన కొంత మంది ఆటగాళ్లను ఏరకంగా తప్పించారని గవాస్కర్ నిలదీశాడు. ఒకవేళ ఆయా ఆటగాళ్ల ప్రదర్శన బాగాలేదో అనుకుంటే, మరి భారత జట్టు ఫైనల్కు అర్హత సాధించకపోయినా కెప్టెన్గా కోహ్లీనే కొనసాగించడం తప్పుడు సంకేతాలకు దారితీయదా అని ప్రశ్నించారు. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సినీతారల ఇళ్లపై ఐటీ దాడులు
సినీతారల ఇళ్లపై ఇన్ కంటాక్స్ అధికారులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు.
TNN | Updated:
Sep 30, 2015, 11:06AM IST
సినీతారల ఇళ్లపై ఇన్ కంటాక్స్ అధికారులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. తమిళనాట, తెలుగులోనా వెలుగుతున్న నయనతార, సమంత, హీరో విజయ్ ఇళ్లపై ఒకేసారి వివిధ చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. తిరువనంతపురం, కోచి, చెన్నైలోని నయనతార నివాసాలలో, చెన్నై, హైదరాబాద్ లోని సమంత ఇళ్లలో, చెన్నైలోని విజయ్ ఇంటితో పాటూ, ఆయన బంధువు ఇళ్లలో ముమ్మరంగా సోదాలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం తెల్ల వారడంతోనే అధికారులు ఇళ్ల దగ్గరికి చేరుకున్నారు. అలాగే పులి సినిమాకి పనిచేసిన పాతికమంది ఇళ్లల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కౌశల్ కథలో నీతి: ఆటా నాదే.. వేటా నాదే.. బిగ్ బాస్ టైటిల్ నాదే
‘అనగనగా ఓ రాజ్యం.. ఆ రాజ్యానికి ఓ రాజు. కాని ఆ రాజ్యానికి వారసుడు మాత్రం ఉండడు. దీనిపై ఆలోచించిన రాజు నక్షత్రం అనే జట్టుని ఏర్పాటు చేసి.. రాజ్యం మొత్తం తిరిగి కండ బలం, గుండె బలం, బుద్ధిబలం ఉన్న 16 మంది వీరుల్ని వెతికిపట్టి తీసుకురావాలంటారు.
Samayam Telugu | Updated:
Sep 24, 2018, 12:02AM IST
బిగ్ బాస్లో ఒకే ఒక్క వారం మిగిలి ఉండంటంతో ఆదివారం నాటి ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్ నుండి క్యాంపెయిన్ మొదలు పెట్టాల్సిందిగా కంటెస్టెంట్స్ను కోరారు నాని. మీకు ప్రేక్షకులు ఎందుకు ఓటు వెయ్యాలి? మిగిలిన కంటెస్టెంట్స్ కంటే మీరు ఎందుకు బెస్ట్ అనే విషయాన్ని చెప్పాలంటూ.. మొదటిగా కౌశల్తో ప్రారంభించారు.
Read Also: బిగ్ బాస్ సీజన్ 2 అన్ని ఎపిసోడ్ల పూర్తి సమాచారం ఒక్క క్లిక్తో..
కౌశల్ కథలో పులివేట.. రాజు అతడే
తన క్యాంపెయిన్ను కథతో వివరించారు కౌశల్. కథ ఏంటంటే.. ‘అనగనగా ఓ రాజ్యం.. ఆ రాజ్యానికి ఓ రాజు. కాని ఆ రాజ్యానికి వారసుడు మాత్రం ఉండడు. దీనిపై ఆలోచించిన రాజు నక్షత్రం అనే జట్టుని ఏర్పాటు చేసి.. రాజ్యం మొత్తం తిరిగి కండ బలం, గుండె బలం, బుద్ధిబలం ఉన్న 16 మంది వీరుల్ని వెతికిపట్టి తీసుకురావాలంటారు. రాజు ఆదేశాల మేరకు ఆ జట్టు 16 మందిని వెతికిపట్టి తీసుకువచ్చి రాజు ముందు ప్రవేశ పెడతారు.
ఆ వీరుల ముందు ఓ పులి బోనులో ఉంచి ఆ పులి బయటకు విడిచిపెట్టిన తరువాత ఎవరైతే దాన్ని బంధించి పట్టుకుంటారో.. వాళ్లని ఈ రాజ్యానికి రాజుని చేయడం మాత్రమే కాకుండా, నా కూతుర్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తానంటారు. అందులో ఒక్కడు తప్ప మిగిలిన 15 మంది జట్టుగా ఏర్పడి ఆ పులిని పట్టుకోవాలనుకుంటారు. కాని మిగిలిన ఒక్కడికి ఆ పులి.. ఆ పులి కన్నుతప్ప ఇంకేమీ కనిపించవు. తన కసి పట్టుదలతో పులిని వేటాడి వేటాడి పట్టుకోవాలని కసితో పోరాడుతాడు. ఇది గమనించిన మిగిలిన వేటగాళ్లు మనం వేటాడాల్సింది పులిని కాదు.. ఆ పులిని వేటాడుతున్న ఆ ఒక్క వేటగాడ్ని అంటూ ఆ వేటగాడిపై వరుస బాణాలు వదులుతారు. ఆ బాణాలు తగిలిఒరిగిపోతాడు. రక్తం కారుతున్నా.. తన వేటను ఆపేయడు. ఈ పోరాటాన్నంతా జనం చూస్తూ ఉంటారు.
ఆ జనం మధ్యలో ఉన్న లల్లీ అనే రెండేళ్ల పాప లే.. నువ్ పోరాడు అంటూ ప్రోత్సహిస్తుంది. ఆమెతో పాటు జనం కూడా లేచి పోరాడాలని ప్రోత్సహిస్తారు. జనం స్పందన చూశాక మిగిలిన వేటగాళ్లు కూడా లే అంటూ కేకలు వేస్తారు. ఆ శబ్ధం ఆ వేటగాడిలో చలనం ఇస్తుంది. గుండెల్లో గుచ్చుకున్న బాణాలను తీసి పులిని పట్టుకుంటాడు. చివరికి ఆ పులి అతడికి లొంగిపోతుంది. రాజు ఆ వేటగాడికి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేస్తారంటూ ఈ కథలో ఆ వేటగాడ్ని తానే అని మిగిలిన జట్టు సభ్యులు మిగిలిన కంటెస్టెంట్స్ అంటూ ఎప్పటిలాగే రోల్ రైడా, దీప్తి, తనీష్, సామ్రాట్, గీతా మాధురిలపై విమర్శలు గుప్పించారు కౌశల్. ఫైనల్ ఈ బిగ్ బాస్ టైటిల్ వేటలో.. ఆటా నాదే.. వేటా నాదే.. బిగ్ బాస్ టైటిల్ నాదే అంటూ చెప్పకనే చెప్పాడు కౌశల్. | 0business
|
గ్లామర్ పాత్రలు చేసేందుకు రెడీ- దర్శకుడు హీరోయిన్ ఈషా
Highlights
ఈషాకు దర్శకుడులో ఫ్యాషన్ డిజైనర్ నమ్రతా పాత్ర
దర్శకుడులో రెండు సందర్భాల్లో హీరోని చెంపదెబ్బ కొట్టా
గ్లామర్ పాత్రలు చేయడానికి అభ్యంతరం లేదన్న ఈషా
అంతకు ముందు..ఆ తర్వాత, అమీతుమీ చిత్రాలతో నాయికగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ఇషా. ఈమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం దర్శకుడు. హరిప్రసాద్ జక్కా దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్, బీఎన్సీఎస్పీ విజయ్కుమార్, థామస్రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ఇటీవల కథానాయిక ఈషా పాత్రికేయులతో తన మనోభావాల్ని పంచుకుంది. ఆమె చెప్పిన సంగతులివి..
మనసుకు హత్తుకునే పాత్ర..
ఈ సినిమాలో నేను ఫ్యాషన్ డిజైనర్ నమ్రతా పాత్రలో కనిపిస్తాను. జీవితంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనే తపన వున్న యువతిగా నా పాత్ర చిత్రణ సాగుతుంది. ఓ ఔత్సాహిక సినీ దర్శకుడితో ఆమె పరిచయం ప్రేమకు ఎలా దారితీసింది? ప్రేమ ప్రయాణంలో వారిద్దరికి ఎదురైన అనుభవాలేమిటి? వృత్తిపరమైన లక్ష్యాలు, ప్రేమ మధ్య వారు ఎటువంటి సంఘర్షణను ఎదుర్కొన్నారు? అనే అంశాల సమాహారంగా చిత్ర కథ నడుస్తుంది. నేటి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని సైతం మెప్పించే అందమైన ప్రేమకథగా ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుంటుంది.
జానపద నృత్యం చేశాను...
నేను ఇప్పటివరకు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా నా పాత్ర వుంటుంది. ప్రతి పనిలో ఉత్సాహ ప్రదర్శించే ఈతరం చలాకీ అమ్మాయిగా కనిపిస్తాను. ఒక మాస్ పాటలో జానపదనృత్యం చేయడం సరికొత్త అనుభూతినిచ్చింది. సుకుమార్గారి సంస్థలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నా నటన చాలా బాగుందని సుకుమార్గారు మెచ్చుకున్నారు. ఆయన మాటల్ని గొప్ప కాంప్లిమెంట్ అనుకుంటున్నాను.
హీరోని కొట్టాల్సి వచ్చింది...
కథానుగుణంగా రెండు సందర్భాల్లో హీరోని చెంపదెబ్బ కొట్టాల్సి వచ్చింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సినిమా చూస్తే అర్థవమవుతుంది. నిజజీవితంలో ఇప్పటివరకు నేను ఏ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టలేదు (నవ్వుతూ). సినిమా నేపథ్యంలో దర్శకుడు చిత్ర కథ సాగినప్పటికీ ఇందులో సినిమా కష్టాలు వుండవు. ఓ ఔత్సాహిక దర్శకుడి ప్రేమాయణానికి దర్పణంలా వుంటుంది. ప్రస్తుతం తెలుగు అమ్మాయిలకు పరిశ్రమలో మంచి అవకాశాలొస్తున్నాయి. ఇదొక శుభపరిమాణంగా భావిస్తున్నాను.
గ్లామర్ పాత్రలకు ఓకే...
పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాల్లో నటించాలని వుంది. హద్దులు దాటని గ్లామర్ పాత్రలు చేయడానికి అభ్యంతరం లేదు. నటిగా నా ప్రతిభను ప్రదర్శించే ఛాలెంజింగ్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. ఫిదా చిత్రంలో భానుమతి పాత్ర బాగా నచ్చింది. నాకు ఆ సినిమాలో భానుమతి పాత్ర పోషించే అవకాశం వస్తే తప్పుకుండా న్యాయ చేసేదాన్ని. ప్రస్తుతం కెరీర్ ఆనందంగా సాగిపోతున్నది. చాలా చిత్రాలు చర్చల దశలో వున్నాయి.
Last Updated 25, Mar 2018, 11:51 PM IST | 0business
|
Telecome
టెలికాం రంగ షేర్ల ర్యాలీ
ముంబై: టెలికాం రంగంలో కొనసాగుతున్న విలీనాల కసరత్తులతో ఆకంపెనీల షేర్లకు స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ కనిపించింది. గురువారం నాటి ట్రేడిం గ్లో టెలికాం సేవల కంపెనీలు 11శాతం పెరిగి నట్లు తేలింది. భారతి ఎయిర్టెల్ 11శాతం పెరిగి 52 వారాల గరిష్టస్థాయికి చేరింది. రూ.397కు చేరింది. కంపెనీ టెలికనార్ ఇండియాలోని ఆరు సర్కిళ్ల కార్యకలాపాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకుకీలకం. తొలివిడతగా రిలయన్స్ జియో ఆఫర్లతో రిల్ షేర్లు ఒక్కసారిగా 11శాతం పెరిగిన సంగతి తెలి సిందే. దీనితో ఇతర కంపెనీలు కూడా అప్రమత్తం అయ్యాయి.
టెలినార్ దక్షిణాసియా ఇన్వెస్ట్ మెంట్స్ నుంచి టెలినార్ ఇండి యా కమ్యూనికేషన్స్ను కొను గోలు చేస్తున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. ఏడు సర్కిళ్లు అంటే ఎపి, బీహార్, మహా రాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్ ఈష్ట్, ఉత్తర్ప్రదేశ్ వెస్ట్, ఆస్సాం సర్కిళ్లలో కంపె నీ కొనుగోళ్లు జరుపుతోంది. అంతేకాకుండా ఎయిర్ టెల్కు ఈ కొనుగోలుతో ఏడుసర్కిళ్లలో తన ఉనికి ని నెట్వర్క్ను మరింత పటిష్టం చేసుకునే వీలుం టుంది. 43.4 ఎంహెచ్జడ్ స్పెక్ట్రమ్, 1800 ఎంహెచ్జడ్ బ్యాండ్లలో అదనపు నెట్వర్క్ను జోడించినట్లవుతుంది. ఇతర టెలికాం కంపెనీల షేర్లు కూడా ఐడియా సెల్యులర్పరంగా ఆరు శాతం గరిష్టంగా 120కి చేరింది. ఒకదశలో 122 కు కూడా పెరిగాయి. కంపెనీ స్టాక్ 52వారాల గరిష్టస్థాయిలో అంటే 128కి సైతం తాకింది. గత ఏప్రిల్ 28వ తేదీ ఈ గరిష్టస్థాయిని నమోదు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నాలుగు శాతం పెరిగి 37కు చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీ స్ ఒకటిశాతం పెరిగి 1221 రూపాయలకు పెరి గింది. బుధవారం రిల్షేర్లు 11శాతం పెరిగాయి. ఇక బిఎస్ఇ టెలికాం సూచి ఇతర అన్ని సూచీల కంటే ఎక్కువలాభపడింది. 4.5శాతం పెరిగింది. | 1entertainment
|
- రెపొరేటు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు
- ఆరు శాతానికి చేరనున్న రివర్స్రెపొ రేటు
- బ్యాంకులలో పెరగనున్న నగదు నిల్వలు
- తక్కువ వడ్డీకే రుణాల లభ్యతకు ఆస్కారం
- దేశ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊతం..
- ఈ ఏడాది మన వృద్ధిరేటు 7.6 శాతానికి
- ఆర్బీఐ 'పరపతి' విధాన సమీక్షను వెల్లడించిన రాజన్
ముంబయి: ద్రవ్య లభ్యతను సులభతరం చేస్తూ ..ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే ధోరణితో 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్బీఐ) ముందుకు సాగుతున్నట్లు మరోమారు స్పష్టమైంది. మంగళవారం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలో నిర్వహించిన ఆర్బీఐ 'ద్రవ్య పరపతి విధాన' సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజా ఆర్బీఐ విధానం తక్కువ పొదుపు.. ఎక్కువ వ్యయం ధోరణి వైపునకు ప్రజలను మళ్లించేలా ఉంది.
నగదు లభ్యత పెంచేలా చర్యలు...
2016-17 ఆర్థిక సంవత్సరం తొలి పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ మార్కెట్ వర్గాలు ఊహించినట్లుగా రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ కీలక వడ్డీరేటు 6.5 శాతానికి చేరింది. దాదాపు అయిదేండ్ల (మార్చి 2011) తరువాత రెపోరేటు ఇంత తక్కువ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఆర్బీఐ చర్యతో తక్కువ వడ్డీరేట్లకే ఎక్కువ మొత్తంలో రుణ లభ్యత పెరగనుంది.
తాజా విధానంతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన రోజువారీ 'నగదు నిల్వల నిష్పత్తి' (సీఆర్ఆర్) 95 శాతం నుంచి 90 శాతానికి పరిమితం చేసింది. దీనికి తోడు బ్యాంకులు తమ వద్ద అధికంగా ఉన్న నిధులను ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచినందుకు కేంద్ర బ్యాంకు అందించే 'రివర్స్రెపో రేటు'ను ఆర్బీఐ ఆరు శాతానికి పెంచింది. గత కొంత కాలంగా తమ వద్ద చాలినంత నగదు లభ్యత లేని కారణంగా ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ఫలాలను వినియోగదారులకు చేర్చలేకపోతున్నట్లు చెబుతూ వస్తున్న బ్యాంకులకు ఈ దఫా సమీక్షతో రాజన్ ఊరట కలిగించారు. బ్యాంకుల వద్ద చాలినంత నగదు లభ్యత ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆయన సమీక్ష తరువాత తెలిపారు. ఇక బ్యాంకులు వీటిని సమాజంలోని అట్టడుగువర్గాల వరకు చేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రెపో రేటను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాది కాలంలో ఆర్బీఐ రెపోరేటును దాదాపు 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిందన్న రాజన్, పలు కారణాల వల్ల వాణిజ్య బ్యాంకులు కేవలం 60 బేసిస్ పాయింట్ల మేర ప్రయోజనాన్ని మాత్రమే వినియోగదారులకు అందిచాయని అన్నారు. చాలా బ్యాంకులు ఇప్పటికే వడ్డీరేట్లను తగ్గిస్తూ వచ్చాయన్న రాజన్ ఇకపై రుణ లభ్యతను మరింత చౌకగా మార్చనున్నట్లు తెలిపారు. బ్యాంకుల చర్యల కారణంగా రానున్న నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయంగా నగదు లభ్యత పెరగుతుందని ఆశిస్తున్నట్లు వివరించారు. ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బ్యాంకులలో నిరర్ధక ఆస్తుల తగ్గింపుతో పాటు బ్యాలెన్స్షీట్ల ప్రక్షాళన ప్రక్రియ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ ప్రథమ ప్రాధాన్యత అన్నారు.
పనామా విచారణలో పాలుపంచుకుంటాం..
పనామాలో నల్లదొరల భాగోతంపై ఆర్బీఐ దృష్టి సారించినట్లుగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. ఈ జాబితాలో ఉన్న 500 మంది భారతీయులైన నల్లధన వీరుల ముసుగు లెక్కలు తేల్చే వ్యవహారపు విచారణలో ఆర్బీఐ కూడా పాలుపంచుకుంటుందని ఆయన వివరించారు. ప్రవాసంలో సంపన్నులు ఖాతాలు తెరిచేందుకు పలు వ్యవస్థాపరమైన కారణాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయమై డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ మాట్లాడుతూ పలు సంస్థతో కూడిన విచారణ మొదలైందని అన్నారు. విచారణకు కొన్ని అంశాలు అనుమతిస్తుండగా మరికొన్ని అడ్డంకిగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం లో ఇంకా వెలుగులోకి రాని అంశాలు చాలా ఉన్నట్లు తెలిపారు. విచారణ పూర్తయిన తరవాతే సమగ్ర సమాచారం వెలుగులోకి వస్తుందని అన్నారు.
ఈ ఏడాది వృద్ధి 7.6 శాతానికి..
ఆర్బీఐ ఈ ఏడాది వృద్ధి అంచనాలను పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం మేర వృద్ధి చెందగలదని తాము భావిస్తున్నట్లుగా ఆర్బీఐ తెలిపింది. రెపోరేటు తగ్గింపు చర్య దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మేరకు తీసుకున్న సరైన చర్య అని రాజన్ అన్నారు. ఈ ఏడాది చాలినంత వర్షపాతం లేకుంటే 7.6 శాతం జీడీపీ వృద్ధిని అందుకోవడం కష్టతరమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విజరు మాల్యా విషయమై ఆర్బీఐ గవర్నర్ స్పందిస్తూ.. ఇలాంటి కీలక విషయాలను మీడియా విచారణ జరపకూడదన్నారు ఏయే బ్యాంకులు ఎంత మొత్తంలో అప్పులను అందించాయి.. ఎలాంటి పరిస్థితుల నేపథ్యంలో అవి రుణాలను మంజూరు చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని తాము తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. పరిస్థితుల ఆధారంగా తీసుకున్న నిర్ణయం మేరకు వారిపై క్రిమినల్ చర్యలను పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి..
దేశంలోని పలు కీలక రాష్ట్రాలలో ఎన్నికల దృష్ట్యా నగదు ప్రవాహంపై ఆర్బీఐ అప్రమత్తం అయింది. ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో పాటు వాటి చుట్టు పక్కల రాష్ట్రాలలో కూడా నగదు ప్రవాహం పెరిగిపోతుండడంపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు. ఈ మారు జరగునున్న ఎన్నికలలో ఇది రూ.50- 60 వేల కోట్లుగానీ లేదా అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ విషయమై విచారణ జరపాల్సి ఉందని అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Priya Varrier Tattoo: ప్రియా వారియర్ పచ్చబొట్టు అసలు గుట్టు!
‘లవర్స్ డే’ పేరుతో ప్రేమికుల దినోత్సవం నాడు లవర్స్ని పలకరించబోతుంది కన్నకొట్టుడు పిల్ల ప్రియా వారియర్. ఆమె నటించిన ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ఆడియో వేడుకకు హైదరాబాద్ వచ్చిన ప్రియా వారియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Samayam Telugu | Updated:
Jan 24, 2019, 02:11PM IST
హైలైట్స్
‘లవర్స్ డే’ ఆడియో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియా వారియర్
కెమెరాల ఫోకస్ మొత్తం ఆమె పచ్చ బొట్టుపైనే
ఇంతకీ ఆ పచ్చబొట్టుకి అర్ధం ఏంటి?
కన్నుగీటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసిన మలయాళ సుందరి ప్రియా ప్రకాష్ వారియర్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆ ఒక్క సన్నివేశంతో ‘ఒరు ఆడార్ లవ్’ మలయాళ చిత్రానికి సింగిల్ హ్యాండ్తో తిరుగులోనే క్రేజ్ని తీసుకువచ్చింది ప్రియా. దీంతో ఈ చిత్రాన్ని ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్లో ఆడియో వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వేడుకలో నాజూకు అందాలతో కవ్వించే కళ్లతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది మల్లూ బ్యూటీ ప్రియా వారియర్. కన్నుగీటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కెమెరాలను తనవైపు తిప్పుకున్న ఈ బ్యూటీ.. నిన్న జరిగిన ఆడియో వేడుకలోనూ కెమెరాలకు రెస్ట్ లేకుండా చేసింది. అయితే ప్రియా అందాలతో పాటు ఆమె చాతిపై భాగంలో ఉన్న పచ్చబొట్టుపై అన్ని కెమెరాలు ఫోకస్ అయ్యాయి. | 0business
|
Hyderabad, First Published 3, Aug 2019, 3:15 PM IST
Highlights
బాలీవుడ్ లో ఏ ఎఫైర్ ఎటు మలుపు తీసుకుంటుందో అస్సలు చెప్పలేం. అర్బాజ్ ఖాన్ కు మలైకా విడాకులు ఇచ్చినప్పుడు, ఆమె అర్జున్ కపూర్ తో కలుస్తుందని చాలామంది ఊహించలేకపోయారు. దియా మీర్జా విడాకుల విషయంలో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్త సాహిల్ కి విడాకులు ఇవ్వబోతున్నట్లు, కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఇద్దరూ విడిపోతున్నట్లు తెలిపింది. అయితే దీనికి కారణంగా రాఘవేంద్రరావు కోడలు, ప్రకాష్ కోవెలమూడి భార్యా కనికా థిల్లాన్ అంటూ కొన్ని బాలీవుడ్ వెబ్ సైట్లు వార్తలు ప్రచురించాయి.
దియా మీర్జా భర్త సాహిల్, కనికా కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారని.. ఆమె కారణంగానే సాహిల్-దియాలు విడిపోతున్నారని ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లంటూ స్పందించింది దియామీర్జా. సాహిల్ తో తను విడిపోవడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమని.. తమ విడాకుల వ్యవహారంలో తమ సన్నిహితుల పేర్లు బయటకి తీసుకొచ్చి వాళ్ల ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని.. ఓ మహిళగా మరో మహిళ ప్రతిష్టను దెబ్బతీసేలా వస్తోన్న అబద్ధాలను ఖండిస్తున్నట్లు చెప్పింది.
సాహిల్ తో తన విడిపోవడానికి మూడో వ్యక్తి కారణం కాదని స్పష్టం చేసింది. ఇకనైనా పుకార్లు ఆపాలని, తమ వ్యక్తిగతానికి మీడియా గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పింది. తమ విడాకుల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది.
మీడియా కాస్త సంయమనం పాటించి.. తన అభిప్రాయాలను గౌరవిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. దియా ఇంత ఓపెన్ గా చెబుతున్నా.. బాలీవుడ్ లో మాత్రం పుకార్లు ఆగడం లేదు.
Last Updated 3, Aug 2019, 3:15 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మార్చి 31 లోగా 2015-16, 2016-17 పన్ను రిటర్నులు సమర్పించవచ్చు
2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్లు సమర్పించని వేతన జీవులు ఈ నెల మార్చి 31వతేదీలోగా ఫైల్ చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ తాజాగా ప్రకటించింది.
TNN | Updated:
Mar 28, 2018, 05:41PM IST
మీరు గత రెండేళ్లుగా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయలేదా? అయితే మీకు శుభవార్త. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్లు సమర్పించని వేతన జీవులు ఈ నెల మార్చి 31వతేదీలోగా ఫైల్ చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ తాజాగా ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను వేతన జీవులు తమ ఐటీ రిటర్న్ను సమర్పించేందుకు చివరి తేదీ జులై 31 అని ఐటీశాఖ ప్రకటించింది.
ఆదాయపు పన్ను రిటర్నులు మార్చి 31 లోగా సమర్పించాలి
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైన్ కట్టి రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువు సైతం మార్చి 31 కావడం గమనార్హం. ప్రస్తుతం ఐటీ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. సరైన సమయంలో రిటర్నులు ఫైల్ చేయకపోతే రికవరీ కోసం నోటీసులు పంపడంతో పాటు పెనాల్టీలు విధిస్తుంది. డీఫాల్ట్ ట్యాక్స్ పేయర్లకు ప్రాసిక్యూషన్ నోటీసులు సైతం పంపుతున్నారు. | 1entertainment
|
నయన్, త్రిష ఇప్పుడు కాజల్
Highlights
నయన్, త్రిషల్లా తనూ మారిపోనున్న కాజల్ అగర్వాల్
ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన కాజల్
ఇక లేడీ ఓరియెంటెడ్ కేరక్టర్ తో అలరించనుమ్మ ముద్దుగుమ్మ
నయనతార, అనుష్క, త్రిష లాంటి వారు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నంటిచి బాగా రాణిస్తున్నారు. ఇప్పుడు కాజల్అగర్వాల్కు కూడా అదే బాట పట్టనుంది. గ్లామర్ పాత్రల్లో నటిస్తూ.. టాప్ లీగ్ లో కొనసాగుతున్న కాజల్ ఇక గ్లామర్ కే కాక ప్రతిభ గల లేడీ పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతోంది.
ఇప్పటి దాకా గ్లామర్ పాత్రలకే పరిమితవైున ఈ గుజరాతీ బ్యూటీ కెరీర్ మధ్యలో కాస్త డౌన్ అయినా మళ్లీ గాడిలో పడింది. ప్రస్తుతం అజిత్తో వివేకం చిత్రంలోనూ, విజయ్ 61వ సినిమాలోనూ నటిస్తోంది. ఇక నుంచి తను గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ... నటించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అనుకున్నది అమలు చేసే అవకాశం చేజిక్కించుకుంది.
దర్శకుడు డీకే నయనతార కోసం ఒక హీరోయిన్ సెంట్రిక్ స్టోరీ రెడీ చేసుకున్నాడు. ఈ పాత్రలో ఇప్పుడు నటి కాజల్అగర్వాల్ను ఎంపిక చేసుకున్నాడు. కాజల్ ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో కవలైవేండామ్ చిత్రంలో నటించింది. ఆ స్నేహం కారణంగానే ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం కాజల్ను వరించిందని తెలుస్తోంది. మొత్తం మీద కాజల్ కూడా నయనతార, త్రిషల వరుసలో చేరబోతున్నందుకు సంతోషంగా పీలవుతోందట.
Last Updated 25, Mar 2018, 11:47 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
లూసింగ్ మై రిలీజియన్: రణ్వీర్ పోస్ట్పై రచ్చ!
పద్మావతి సినిమాకు ఇప్పటికే పలు వివాదాలు చుట్టుకోగా.. తాజాగా రణ్వీర్ సింగ్ చేసిన పోస్టు మరో దుమారం రేపుతోంది. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘పద్మావతి’ చిత్రంలో రణ్వీర్ అలనాటి అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో ఒదిగిపోయిన సంగతి తెలిసిందే.
TNN | Updated:
Nov 11, 2017, 03:56PM IST
పద్మావతి సినిమాకు ఇప్పటికే పలు వివాదాలు చుట్టుకోగా.. తాజాగా రణ్వీర్ సింగ్ చేసిన పోస్టు మరో దుమారం రేపుతోంది. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘పద్మావతి’ చిత్రంలో రణ్వీర్ అలనాటి అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో ఒదిగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బాలీవుడ్ నటుడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ హెయిర్ స్టయిల్తో ఉన్న ఓ ఫొటోను పెట్టి.. ‘లూసింగ్ మై రిలీజియన్’ అని కామెంట్ పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై భారీ చర్చ నడుస్తోంది.
అలాంటి చారిత్రక పాత్రకు వన్నె తెచ్చిన గొప్ప నటుడు రణ్వీర్.. ఇలాంటి తరుణంలో ఇలా వ్యాఖ్యానించడం సరికాదు అంటూ కొంత మంది నెటిజన్లు మండిపడుతున్నారు. ‘నటుడు అంటేనే మతాలకు అతీతం.. ఇప్పుడు కొత్తగా మతం కోల్పోవడానికి ఏముంది’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర హావభావాలను తెరపై అచ్చుగుద్దినట్లు ఆవిష్కరించడానికి ఇన్ని రోజులు అలుపెరగని కృషి చేసిన రణ్వీర్.. ఆ షూటింగ్ నుంచి బయటపడుతున్నట్టు వైవిధ్యంగా చెప్పాలనుకున్నాడా.. లేదా మరేదైనా కారణంతో ఇలా పోస్టు పెట్టాడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. ఇప్పుడు మరో వివాదంతో పద్మావతి చిత్రానికి మరింత ప్రచారం రావడం ఖాయం. అన్నట్టూ.. ‘Losing My Religion’ అనేది అమెరికా రాక్ బ్యాండ్కు సంబంధించిన గుర్తింపు పొందిన సాంగ్ అనే విషయాన్ని కూడా గుర్తించాలి!
A post shared by Ranveer Singh (@ranveersingh) on
Nov 9, 2017 at 9:06pm PST | 0business
|
Hyderabad, First Published 3, May 2019, 9:01 PM IST
Highlights
ఆకాశమంతా అంచనాలతో సినిమాను తెరకెక్కించి ఎలాగైనా ఫస్ట్ షో చూడాలనే కోరికను కలిగించగల దర్శకుడు శంకర్. అయితే రోబో తరువాత శంకర్ అనుకున్నంతగా మెప్పించలేకపోతున్నాడు. పైగా ఆయన సినిమాలు షూటింగ్ దశలోనే ఇబ్బందులు ఎదుర్కోవడం హాట్ టాపిక్ గా మారుతోంది.
ఆకాశమంతా అంచనాలతో సినిమాను తెరకెక్కించి ఎలాగైనా ఫస్ట్ షో చూడాలనే కోరికను కలిగించగల దర్శకుడు శంకర్. అయితే రోబో తరువాత శంకర్ అనుకున్నంతగా మెప్పించలేకపోతున్నాడు. పైగా ఆయన సినిమాలు షూటింగ్ దశలోనే ఇబ్బందులు ఎదుర్కోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. 2.0 తరహాలో ఇండియన్ 2 సినిమాకు బ్రేకులు పడుతున్నాయి.
కమల్ హాసన్ చేస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ కి ఇటీవల బ్రేక్ పడింది. మళ్ళీ మొదలవ్వడమనేది అనుమానంగా మారింది. సినిమాను బాలీవుడ్ బడా ప్రొడక్షన్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ టేకప్ చేసే అవకాశం ఉంది.
దీంతో శంకర్ భారతీయుడు 2ప్రాజెక్ట్ ని పక్కనెట్టి మరో సినిమాను మొదలెట్టాలని చూస్తున్నాడు. అది కూడా భారీ మల్టీస్టారర్ అని తెలుస్తోంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు శంకర్ కూడా తనదైన శైలిలో ఒక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం.
అందులో విజయ్ - విక్రమ్ నటించే అవకాశం ఉన్నట్లు టాక్. విజయ్ తో ఇదివరకే శంకర్ స్నేహితుడు (3 ఇడియట్స్ రీమేక్) చేశాడు. ఇక విక్రమ్ తో అపరిచితుడు - ఐ సినిమాలు చేశారు. మరి 200 కోట్ల మార్కెట్ ఉన్న ఈ ఇద్దరి స్టార్ హీరోలతో శంకర్ ఎలాంటి సినిమాను చేస్తాడో చూడాలి.
Last Updated 3, May 2019, 9:01 PM IST | 0business
|
తక్కువ వర్షాలతో ఇబ్బంది లేదు..
- ధరలు పెరగకుండా చర్యలు
- మూలధన వ్యయం బాగా పెరగొచ్చు
- విదేశీ మదుపరులు దేశం వదిలి వెళ్లిపోవడం లేదు..
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ స్థాయిలో వర్షాలు కురిసినా పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ దేశ ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది వర్షపాతం పై వివిధ సంస్థలు అందజేస్తున్న నివేదికలను ఆధారంగా చేసుకొని దేశంలో ధరలు పెరుగుతాయనో.. కరవు లాంటి భయానక పరిస్థితులు నెలకొననున్నాయని ఒక నిర్ణయానికి వచ్చేయడం సబబు కాదని ఆయన అన్నారు. గతాన్ని విశ్లేషించి చూస్తే వాతావరణ పరిస్థితులపై వివిధ సంస్థలు వేసిన అంచనాలు అన్ని వేళలా నిజం కాలేదని అన్నారు. గణాంకాల సమేతంగా వాటిని వివరించారు.
ఆహారధాన్యాల ధరలు పెరగవు..
వర్షాభావం కారణంగా దేశంలో ధరలు బాగా పెరిగిపోతాయన్న వార్తలు సరికావని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దేశంలో సరిపడా ఆహార నిల్వలు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి వివరించారు. దేశంలోని దక్షిణ, మధ్య, ఈశాన్య ప్రాంతాలలో సాధారణంగానే వర్షాలు ఉంటాయని ఐఎండీ వెల్లడించిన విషయాన్ని ఆయన ఆ సందర్భంగా గుర్తు చేశారు. దేశ వాయువ్య ప్రాంతాలలోనే సాధారణం కంటే వర్షపాతం తగ్గే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోందని తెలిపారు. అయితే వాయువ్య భారతంలో సరిపడా నీటిపారుదల వసతులు ఉన్నాయని వివరించారు. ఈ కారణంగా దేశంలో వర్షాభావంతో ధరలు పెరిగేందుకు, కరువు వచ్చేందుకు అవకాశమే లేదని ఆయన అన్నారు. ఐఎండీకి చెందిన సీనియర్ అధికారులతో తాను ఈ విషయమై చర్చించినట్లు మంత్రి తెలిపారు.
మూలధన వ్యయం పెరగొచ్చు..
వార్షాభావం కారణంగా ఈ ఏడాది కారణంగా మూలధన వ్యయం పెరిగే అవకాశం ఉందని మంత్రి ఇక్కడ అభిప్రాయపడ్డారు. రానున్న నెలల్లో ఇది సాధారణ స్థాయిని మించి పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన వివరించారు. ఒకటి రెండో రోజులుగా మార్కెట్లు పడడాన్ని బట్టి విదేశీ మదుపరులు దేశాన్ని వదిలి వెలుతున్నారని విశ్లేషించడం సబబు కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలలో వాటా విక్రయం విషయంలో తాము ముందుకే సాగనున్నట్లు మంత్రి వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ASWIN
45వ టెస్టు మ్యాచ్లో అశ్విన్ సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన స్పిన్నర్ అశ్విన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.అత్యంత వేగంగా250 టెస్టు వికెట్లను సాధించిన ఘనతను అశ్విన్ తాజాగా సాధించాడు.గతంలో 200 వికెట్లను అత్యంత వేగ వంతంగా సాధించిన అశ్విన్ అదే ఫామ్ను కొనసాగిస్తూ 250 వికెట్ల మార్క్ను కూడా వేగవంతంగా చేరాడు. బంగ్లాదేశ్తో ఏకైక టెస్టు మ్యాచ్లో భాగంగా తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లను సాధించడం ద్వారా అశ్విన్ 250వికెట్ల క్లబ్లో చేరాడు.తన 45వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ షకీబుల్ హసన్ ముష్పికర్ వికెట్లను తీసుకున్నాడు.తన టెస్టు కెరీర్లో ఇప్పటి వరకు 24 సార్లు అయిదు వికెట్లను సాధించిన అశ్విన్ పది వికెట్లను ఏడుసార్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 388 పరుగులకు ఆలౌటైన సంగతి తెలి సిందే. బంగ్లాదేశ్ కెప్టెన్ముష్పికర్ రహీమ్ 262 బం తులు ఆడి 16 బౌండరీలు,2 సిక్సర్లతో 127 పరుగు లతో సెంచరీ చేయగా,షకీబుల్ 82పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు.ఇక మోహిది హసన్ మిరాజ్ 51 పరుగులతో హాఫ్ సెంచరీ చేయడంతో బంగ్లాదేశ్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించగలిగింది. | 2sports
|
Visit Site
Recommended byColombia
ప్రేక్షకుల నుండి టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్ల కంటే తక్కువ ఓట్లు రావడంతో ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు అలీ రెజా. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రెండో సారి బిగ్ బాస్ హౌస్కి వెళ్లినా విజేత కాలేకపోయాడు అలీ.
తొలివారంలోనే హేమ ఇంటి ముఖం పట్టగా.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. అలాగే, మూడో వారం తమన్నా సింహాద్రి, నాలుగో వారం రోహిణి, ఐదోవారం అషు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఇక ఆరోవారం ఎలిమినేషన్ ఎత్తివేగగా.. ఏడోవారంలో అలీ రాజా, ఎనిమిదో వారంలో శిల్పా చక్రవర్తి, తొమ్మదో వారంలో హిమజ, పదో వారంలో రవి, 11వ వారంలో పునర్నవి, 12 వారంలో మహేష్ విట్టా, 13 వారంలో వితికా, 14 వారంలో శివజ్యోతి ఇలా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ, రాహుల్లు బిగ్ బాస్ సీజన్ 3లో ఫైనల్ వార్తో తలపడేందుకు టాప్ 5 కంటెస్టెంట్స్గా నిలిచారు. అయితే ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ మధ్య జరిగిన ఫైనల్ వార్లో 5 స్థానంతో సరిపెట్టుకున్నాడు అలీ రెజా.
సెంటిమెంట్ ఫలించలేదు..
బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా నిలిచిన శివ బాలాజీ, సీజన్ 2 విజేత కౌశల్లు కూడా 11వ కంటెస్టెంట్స్గానే హౌస్లో అడుగుపెట్టి విజేతలయ్యారు. ఇప్పుడు సీజన్ 3లో 11వ కంటెస్టెంట్గా అలీ రజా అడుగుపెట్టడంతో ఈ సీజన్కి కూడా 11 సెంటిమెంట్ను ఫాలో అవుతారంటూ అలీ బిగ్ బాస్ విన్నర్ అని అప్పట్లో వార్తలు షికారు చేసాయి. అయితే అలీ ఫినాలేలో ఎలిమినేట్ కావడంతో ఈ నంబర్ న్యూమరాలజీ వర్కౌట్ కాలేదు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
పూనమ్ కౌర్ ట్వీట్.. మళ్లీ Pawan Kalyanనే టార్గెట్ చేసిందా?
పూనమ్ కౌర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. అబద్ధాల కోరు అంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించేనా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పూనమ్ ఘాటుగా స్పందించింది.
Samayam Telugu | Updated:
Oct 30, 2019, 09:39AM IST
పూనమ్ కౌర్
ప్రముఖ నటి పూనమ్ కౌర్ మరోసారి తన ట్వీట్తో వార్తల్లోకెక్కింది. ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేస్తూ అందరి నోళ్లలో నానుతూ ఉండే పూనమ్ ఇప్పుడు మరో ట్వీట్ చేసింది. ‘ఓ అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడేమో కానీ నాయకుడు కాలేడు’ అని ట్వీట్ చేసింది. దాంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్గా మారింది. పూనమ్ టార్గెట్ చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నే అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జనసేనాని అభిమానులేమో అనవసరంగా ఆయన్ను ఈ వివాదంలోకి లాగొద్దు అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా సేపటి వరకు ఈ ట్వీట్పై చర్చ జరిగింది.
READ ALSO: ‘నా మాజీ భర్త మంచోడు.. నా కొత్త ప్రియుడికి ఓపికెక్కువ’
దాంతో పూనమ్ దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. ‘నా ఆలోచనల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మీ ఆలోచనలన్నీ ఊహాగానాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పెయిడ్ మీడియా వర్గాలు సొమ్మలు చేసుకోవాలని అనుకుంటున్నాయి. నేను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తిని. మీరు మీ ఊహా ప్రపంచంలోనే ఉండండి. మీలాంటివారిపై నాకు జాలేస్తుంటుంది. గాడ్ బ్లెస్’ అని పూనమ్ పేర్కొంది. పూనమ్ చేసే ట్వీట్లకు స్పందించి అనవసరంగా ఆమెకు ప్రచారం కల్పిస్తున్నారని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నోటికొచ్చినట్లు చేసే ట్వీట్లకు అసలు స్పందించకపోవడమే మంచిదని అంటున్నారు. ఏమైనా గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న పూనమ్ కౌర్.. తన ఒక్క ట్వీట్తో మరోసారి వార్తల్లో నిలిచింది.
READ ALSO: యాంకర్కు లిప్ కిస్ ఇచ్చిన స్టార్ నటి.. వీడియో వైరల్
గతంలో పూనమ్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఎన్నో ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ తనకు ముందు ‘అఆ’ సినిమాలో అవకాశం ఇస్తానన్నారని కానీ ఇవ్వలేదని ఆరోపించింది. అసలు పూనమ్ ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశిస్తూ చేసిందో ఎందుకు చేసిందో తనకే తెలియాలి. ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు కూడా లేవు. కనీసం ఈ రకంగా ట్వీట్లు చేస్తే అయినా పాపులారిటీ వస్తుందని ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ సినిమా రంగానికి చెందిన ఆమె రాజకీయాల్లో తలదూర్చకపోవడమే మంచిదని పలువురు నెటిజన్లు సూచనలు ఇస్తున్నారు. | 0business
|
ARJUN TENDULKAR
మహిళల జట్టుకి అర్జున్ టెండూల్కర్ సాయం
న్యూఢిల్లీ: ఐసిసి మహిళల ప్రపంచకప్లో భారత జట్టుకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ చిరు సాయం అందించాడు. ఫైనల్కు ముందు లార్డ్స్లో జట్టు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా…అక్కడికి వెళ్లిన అర్జున్ బంతిని అందుకుని కాసేపు భారత్ బ్యాట్స్వుమెన్ బౌలింగ్ చేశాడు. ఎడమచేతి వాటం పేస్ బౌలింగ్ చేసి అర్జున్ గత కొద్ది రోజుల నుంచి ఇంగ్లాండ్లోనే క్రికెట్ శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో భారత హిట్టర్ వేద కృష్ణమూర్తికి పదునైన బంతులతో కాసేపు అర్జున్ టెండూల్కర్ పరీక్ష పెట్టినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం లార్డ్స్లో ఇంగ్లాండ్ జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా…అర్జున్ విసిరిన యార్కర్ బంతిని అడ్డుకోవడంలో తడబడి మిడిలార్డర్ బ్యాట్స్మెన్ బారిస్టో గాయపడిన విషయం తెలిసిందే. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఆ గానగంధర్వుడు తన పాటతో బ్రతికే ఉంటాడు
'మేరే సపునోంకి రాణి కబ్ ఆయేగీ తూ' ఈ పాట మనలో ప్రతీ ఒక్కరు ఒక్కసారైనా విని ఉంటారు. ఈపాట పాడింది ఇండియన్ లెజెండరీ సింగర్ అభాస్ కుమార్ గంగూలీ అలియాస్ కిషోర్ కుమార్. ఈరోజు కిషోర్ కుమార్ 87వ జయంతి...
TNN | Updated:
Aug 4, 2016, 04:36PM IST
'మేరే సపునోంకి రాణి కబ్ ఆయేగీ తూ' ఈ పాట మనలో ప్రతీ ఒక్కరు ఒక్కసారైనా విని ఉంటారు, పాడుకొని ఉంటారు. నా కలలో కనిపించే నా రాణి నువ్ ఎప్పుడొస్తావ్ అంటూ సాగే ఈ పాట పాడింది ఇండియన్ లెజెండరీ సింగర్ అభాస్ కుమార్ గంగూలీ అలియాస్ కిషోర్ కుమార్. ఈరోజు కిషోర్ కుమార్ 87వ జయంతి సందర్భంగా ఆయనను కోట్లాది మంది స్మరించుకుంటున్నారు. 1929, ఆగష్టు 4న మధ్యప్రదేశ్ లో జన్మించిన కిషోర్ కుమార్.. హిందీ, బెంగాలీ, మరాఠి, ఉర్దూ, కన్నడ, అస్సామీ, భోజ్ పురి, ఒడియా, గుజరాతీ, మళయాలీ భాషల్లో ఆయన పాడిన పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆనాటి బ్లాక్ అండ్ వైట్ కాలంలో రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర లాంటి వారి దగ్గర్నించీ అనిల్ కపూర్, సంజయ్ దత్ అలాగే మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ లాంటి అగ్ర హీరోలందకీ 1970-80 కాలంలో కిషోర్ కుమార్ పాట కావాల్సిందే.
'రూప్ తేరా మస్తానా.. ప్యార్ మేరా దివానా' అలాగే 'గాతా రహే మేరా దిల్.. తూహీ మేరా మంజిల్' అంటూ ఆయన పాడిన ప్రేమగీతాలు మనల్ని ప్రేమలో ముంచి తేలుస్తాయి, ఆయన గుండె నుంచి వచ్చిన విషాద గీతాలు వింటే బాధలో ఉన్న వారికి ఓదార్పునిస్తాయి. ఒంటరిగా ఉన్నవారికి ధైర్యాన్నిస్తాయి. 'ఓ కైకే పాన్ బనారస్ వాలా...' అనే పాట ఇప్పటికీ ఫెవరెట్ సాంగ్ లిస్టులో ఉంటుంది. ఇలా ఒకటా..రెండా ? వేల భావాలను పలికించే ఆయన గొంతు నుండి బయటికొచ్చిన ప్రతి అక్షరం కోట్లాది మంది గుండెలను తాకాయి. కిషోర్ కుమార్ కేవలం గాయకుడిగానే కాదు పాటల రచయితగా, సినిమా రచయితగా, సంగీత దర్శకునిగా, దర్శకునిగా, నిర్మాతగా, నటుడిగా సైతం ఆయన చెరగని ముద్ర వేశారు. ఇండియన్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా 8 ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్న కిషోర్ రికార్డును ఇంతవరకూ ఎవరూ బ్రేక్ చేయలేదు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా హిందీ సినిమా సంగీతానికి ఆయన చేసిన సేవలకు 'కిషోర్ కుమార్ అవార్డ్' ను ప్రారంభించింది. | 0business
|
Recommended byColombia
మ్యూచువల్ ఫండ్లు
మ్యూచువల్ ఫండ్లలో మొదటిసారి ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. దీనికి సంకేతమే కొత్తగా వచ్చి చేరుతున్న ఫోలియోలు. కేవలం ఏప్రిల్ నెలలోనే కొత్తగా 8 లక్షల ఫోలియోలు మ్యూచువల్ ఫండ్లలో జతయ్యాయి. దీంతో 2018 ఏడాది ఏప్రిల్ చివరికి మ్యూచువల్ ఫండ్ల రంగంలో మొత్తం ఫోలియోల సంఖ్య 7.23 కోట్లకు చేరింది. ఇక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు సంఖ్యను ఫోలియోగా పేర్కొంటారు. ఈ ప్రకారం ఒక ఇన్వెస్టర్కు ఎన్నిఫోలియోలు అయినా ఉండొచ్చు.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండియా గణాంకాల ప్రకారం 42 ఏఎంసీలు మొత్తం నిర్వహిస్తున్న ఫోలియోల సంఖ్య 7 కోట్లకు పైగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి వీటి సంఖ్య 7.13 కోట్లు. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాల్లో ఫోలియోల పెరుగుదల 7.35 లక్షలుగా ఉండగా.. బ్యాలెన్స్ఢ్ విభాగంలో పెరుగుదల ఒక లక్షగా ఉంది. ఇన్కమ్ ఫండ్స్ విభాగంలో మాత్రం ఫోలియోలు తగ్గాయి. మొత్తం ఫోలియోల్లో ఈక్విటీ ఫోలియోలు 5.43 కోట్లు కావడం గమనార్హం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అఖిల్ హీరోయిన్ కు తెలుగులో మరోసారి !
'అఖిల్' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయిన నటి సయేషా సైగల్. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా.. సయేషా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన క్యూట్ లుక్స్, అందంతో యూత్ ను బాగానే ఆకట్టుకుంది...
TNN | Updated:
Jul 25, 2016, 02:37PM IST
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ ను హీరోగా లాంఛ్ చేస్తూ 'అఖిల్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయిన నటి సయేషా సైగల్ . సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా.. సినిమాలో సయేషా నటనకు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. తన క్యూట్ లుక్స్, అందంతో యూత్ ను బాగానే ఆకట్టుకుంది. 'అఖిల్' సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించినా ఈ సినిమా మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. అయితే సయేషా నటించిన మొదటి సినిమానే ఫ్లాప్ అయినప్పటికీ తెలుగులో ఈ అమ్మడుకి అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. రాజ్ తరుణ్ హీరోగా అనిల్ సుంకర రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఒక చిత్రంలో హీరోయిన్ గా నటించమని సయేషాను సంప్రదించినట్లు సమాచారం. కథ నచ్చడంతో తను కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. కాగా, అయేషా ప్రస్తుతం బాలీవుడ్ లో యాక్షన్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న 'శివాయ్' చిత్రంలో నటిస్తుంది. | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రైతులకు రూ.100లతో ప్రతినెలా రూ.3,000 పెన్షన్!
రైతులకు ఎల్ఐసీనే పెన్షన్ డబ్బులను అందిస్తుంది. మోదీ 2.0 గవర్నమెంట్ తొలి కేబినెట్ రైతులకు ప్రత్యేకమైన పెన్షన్ స్కీమ్కు ఆమోదం తెలిపింది. తొలి మూడేళ్లలో 5 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలని కేంద్రం భావిస్తోంది.
Samayam Telugu | Updated:
Jun 14, 2019, 08:53AM IST
హైలైట్స్
పీఎం కిసాన్ పెన్షన్ యోజన స్కీమ్కు కేబినెట్ ఆమోదం
రైతులు పెన్షన్ ఫండ్కు నెలకు రూ.100 చెల్లించాలి
కేంద్రం కూడా మీరు చెల్లించే డబ్బుకు సమానమైన మొత్తాన్ని పెన్షన్ ఫండ్కి జమ చేస్తుంది
అందరికీ అన్నంపెట్టే రైతన్నలకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ పెన్షన్ యోజన పథకంలో భాగంగా అర్హులైన రైతులకు ప్రతినెలా రూ.3,000 పెన్షన్ ఇవ్వాలని యోచిస్తోంది.
పెన్షన్ పొందాలంటే రైతులు పెన్షన్ ఫండ్కు నెలకు నామమాత్రంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పెన్షన్ ఫండ్కు మీరు చెల్లించిన డబ్బుకు సమానమైన మొత్తాన్ని జమచేస్తుంది. దిగ్గజ బీమా కంపెనీ ఎల్ఐసీ ఈ పెన్షన్ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
sunflower oil
దేశీయ దిగుబడులతో తగ్గిన వంటనూనెల దిగుమతి
అహ్మదాబాద్: భారత్ వంటనూనెల దిగుమతులు గడచిన ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదునెలల్లోనే అంటే నవంబరు అక్టోబరు సీజన్లో ఎనిమిదిశాతం తగ్గాయి. దేశీ యంగా నూనెగింజల పంటలు దిగుబడులు పెరగడమే ఇందుకుకీలకం. తాజా గణాంకాల ప్రకారంచూస్తే సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ అందించిన వివరాలను బేరీజు వేసుకుంటే వంటనూనెల దిగుమతులు నవంబరునుంచిమార్చి వరకూ 5.79 మిలియన్ టన్నులవరకూ ఉన్నట్లు అంచనా. అదే అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 6.31 మిలియన్ టన్నులుగా ఉన్నట్లు ఎస్ఇఎ వెల్లడించింది. నూనెగింజల్లో అంచనాలకు మించిన దిగుబడులు వంటనూనెల వినియోగంలో కొంతమేర మందగమనం కూడా దిగుమతులను తగ్గించిందని చెపుతున్నారు. భారత్లోని నూనెగింజల ఉత్పత్తి 33.60మిలియన్టన్నులవరకూ ఉంది. అంతకుముందు రెండేళ్లలో 25.25మిలియన్ టన్నులు, 27.51 మిలియన్ టన్నులతో పోలిస్తే గరిష్టంగా పెరిగింది. ఒక్క మార్చినెలలోనే వంటనూనెలదిగుమతులు ఏడు శాతం దిగజారి1.10 మిలియన్ టన్నులకు చేరాయి. అదే గతఏడాది మార్చి నెలలో 1.19మిలియన్ టన్నులుగా ఉంది. ఐదునెలలకాలంలో పామాయిల్ దిగుమతులు కూడా 3.6 మిలియన్టన్నుల నుంచి 3.5మిలియన్ టన్నులకు దిగజారాయి. అయితే పామాయిల్ ఉత్పత్తులు 57శాతం నుంచి 63శాతానికి పెరిగాయి. ఆర్బిడి పామోలిన్ దిగుమతులు కూడా పెరిగి నట్లు ఎస్ఇఎ వెల్లడించింది. సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆముదంనూనె వంటివి కూడా 2.1 మిలియన్టన్నులకు పడిపోయాయి. గత ఏడా ది ఇదే ఐదునెలల కాలంలో 2.6 మిలి యన్ టన్నులుగా ఉంది. దిగుమతిదారులు మాత్రం పొద్దుతిరుగుడుపరంగా ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నారు. సోయాఆయిల్ కంటే మరిం త ఆకర్షణీయంగా మారడంతో ఎక్కువ పొద్దుతిరుగుడు పైనే ఆసక్తిచూపిస్తు న్నారు. దీనికితోడు డాలరుతో రూపాయి మారకం విలువలు కూడా కొంత మద్దతునిస్తున్నాయి. రూపాయి పటిష్టంకావడం కూడా దిగుమతులు పెంచు కునేందుకు దోహదం చేసింది. గతఏడాది నవంబరునెలలో 11,75,464 టన్నుల దిగుమతులు జరిగితే డిసెంబరునెలలో 12,09,685 టన్నులు కాగా. జనవరిలో 10,24,859 టన్నులు, ఫిబ్రవరిలో 12,70,443 టన్నులు, మార్చినెలలో 11,09,825 టన్నులమేర దిగుమతులు జరిగాయి. మొత్తంగా చూస్తే 57,97,276 టన్నుల వంటనూనెల దిగుమతులు జరిగాయి. | 1entertainment
|
india vs sri lanka, 1st test: kl rahul, shikhar dhawan lead ind fightback
ఓపెనర్ల దూకుడు: నాలుగో రోజు మనదే!
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓపెనర్లు కదం తొక్కడంతో వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది.
TNN | Updated:
Nov 19, 2017, 05:50PM IST
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓపెనర్లు కదం తొక్కడంతో వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధావన్ దూకుడు చూపిస్తూ స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్- రాహుల్‌లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ధావన్ సెంచరీ చేరువలో వేగంగా పరుగుల కోసం ప్రయత్నించి 94 పరుగుల వద్ద (116 బంతులు 11ఫోర్లు, 2 సిక్స్‌లు) శనక బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 166 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో రాహుల్‌(73 నాటౌట్‌),పుజారా(2 నాటౌట్‌)లు ఉన్నారు. దీంతో, శ్రీలంకపై భారత్ 49 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇక నాలుగో రోజు 165/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 83.4 ఓవర్లలో 294 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, షమీలకు నాలుగు వికెట్లు దక్కగా.. ఉమేశ్‌ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక చివరి రోజు మాత్రమే మిగిలిఉండటంతో కోల్‌కతా టెస్ట్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రాంచీ టెస్టులో డికాక్ పాదం తాకి.. చెప్పు వదిలిన ఫ్యాన్
వైజాగ్, పుణె టెస్టు తరహాలోనే ఓ అభిమాని కారణంగా రాంచీలోనూ టెస్టు మ్యాచ్ కొన్ని నిమిషాలు నిలిచిపోయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ పాదం తాకేందుకు వచ్చిన అభిమాని.. కాసేపు హల్చల్ చేశాడు.
Samayam Telugu | Updated:
Oct 21, 2019, 11:15AM IST
హైలైట్స్
రాంచీ టెస్టులోనూ అభిమాని కారణంగా మ్యాచ్కి అంతరాయం
డికాక్ పాదం తాకేందుకు వచ్చిన అభిమాని.. కంగారుపడిన సఫారీ ఓపెనర్
అభిమాని చెప్పుని మైదానం వెలుపలికి విసిరిన డికాక్
సిరీస్లో ఇలా ఓ అభిమాని మైదానంలోకి రావడం ఇది మూడోసారి
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో ఆటగాళ్ల భద్రతలోని డొల్లతనం మరోసారి బయటపడింది. రాంచీ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ పాదం తాకేందుకు ఓ అభిమాని మైదానంలోకి ప్రవేశించి హల్చల్ చేశాడు. తాజా సిరీస్లో ఇలా అభిమానులు మైదానంలోకి వచ్చి ఆటకి అంతరాయం కలిగించడం ఇది మూడోసారి. వైజాగ్ టెస్టులో విరాట్ కోహ్లీ వద్దకి వెళ్లిన ఓ అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నించగా.. పుణె టెస్టులో రోహిత్ శర్మ పాదాన్ని తాకేందుకు అభిమాని ట్రై చేయడంతో పక్కకి తప్పుకునే ప్రయత్నంలో రోహిత్ శర్మ కిందపడిపోయిన విషయం తెలిసిందే.
IND vs SA 3rd Test Live Score బోర్డు కోసం క్లిక్ చేయండి..!
రాంచీ టెస్టులో బ్యాక్వర్డ్ పాయింట్లో డికాక్ ఫీల్డింగ్ చేస్తుండగా.. వెనక నుంచి సడన్గా వచ్చిన అభిమాని అతని పాదాలపై పడిపోయాడు. దీంతో.. కంగారుపడిన డికాక్ పక్కకి తప్పుకున్నాడు. అప్పటికే అప్రమత్తమైన సిబ్బంది అభిమాని వెంట పరుగెత్తుకుంటూ వచ్చి.. అతడ్ని మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. భద్రతా సిబ్బందితో జరిగిన పెనుగులాటలో సదరు అభిమాని చెప్పు మైదానంలోనే జారిపోయింది. దీంతో.. ఆ చెప్పుని తీసుకుని బౌండరీ లైన్ సమీపం వరకూ నడిచిన డికాక్.. మైదానం వెలుపలికి విసిరాడు. ఆదివారం సఫారీ తొలి ఇన్నింగ్స్లో డికాక్ 4 పరుగులకే ఔటైన విషయం తెలిసిందే.
https://t.co/n5glWqPoGS
— Cricket (@cricketvideos13) 1571571560000
భారత్ గడ్డపై గత కొంతకాలంగా అభిమానులు ఇలా మైదానంలోకి రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇటీవల పుణె టెస్టు ఘటనపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ‘స్టేడియంలోని సెక్యూరిటీ సిబ్బంది ఉండేది ఉచితంగా మ్యాచ్ చూడటానికా..?’ అంటూ ఘాటుగా ప్రశ్నించాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇలా గ్రౌండ్లోకి అభిమానులు రావడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అక్కడ భద్రతా సిబ్బంది స్టేడియంలోని గ్యాలరీల వైపు కూర్చీలు వేసుకుని బౌండరీ లైన్ వద్ద కూర్చుంటారు. కానీ.. భారత్లో మాత్రం రివర్స్లో మ్యాచ్ని చూస్తూ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. దీంతో.. అభిమానులు సులువుగా భద్రతా సిబ్బందిని బోల్తా కొట్టిస్తూ మైదానంలోకి వచ్చేస్తున్నారు. | 2sports
|
Resevedine
ఇష్టమైన రెస్టారెంట్కోసం ‘రిజర్వుడైన్
హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ రాజధాని కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్టెక్కంపెనీ రిజర్వుడైన్ ను ఆవిష్కరించింది. సంస్థ వ్యవస్థాపకులు అహ్మద్ షరీఫ్మాట్లాడుతూ వచ్చే ఏడాదిచివరి నాటికి మరో ఏడు నగరాలకు విస్తరిస్తామని, అలాగే 100 కోట్ల డాలర్ల క్లబ్ కంపెనీల్లో చేరేదిశగా తమ వ్యాపా రాభివృద్ధికి కృషిచేస్తున్నట్లు వివరించారు. నగరంలో రిజర్వుడైన్ లోగోను ఆవిష్కరించారు. ఆన్లైన్లోనే రెస్టారెంట్ల రిజర్వేషన్లు, ఒప్పందాలు, సామాజిక వేదికలు, సమీక్షలు, విశ్లేషణలు వంటివాటిని అందించే ఒక విస్తృతమైన వేదిక అని కంపెనీ ప్రకటించింది. కొత్త విధానంలో రెస్టారెంట్ ఆవిష్క రణ వేదికగా రిజర్వ్డైన్ కొత్త ఏర్పాట్లుచేస్తోందని కంపెనీ వెల్లడించింది. నగరానికి పరిసరాల్లోని రెస్టా రెంట్లు తమ యాప్ద్వారా కస్టమర్లు పొందే వీలుం టుంది. ఆహారప్రియులకు స్నేహితులద్వారా రెస్టారెంట్లు, బార్లు, కెఫేలకు సంబంధించి సమాచారం పొందేవీలుంది. రిజర్వుడైన్ వేదికకు ఇప్పటికే మూడువేలకుపైగా రెస్టా రెంట్లను అందుబాటులోకి తెచ్చిందని, 50 శాతం వరకూ డిస్కౌంట్ ఇచ్చేవిధంగా రెస్టారెంట్లతో చర్చలు జరిపామని తెలిపారు. వచ్చే ఏడాది చివరినాటికి రిజర్వుడైన్ మరో ఏడు నగరాలకు విస్తరించాలని, 2019 నాటికి రిజర్వుడైన్ 100 కోట్ల డాలర్ల క్లబ్లో చేరేలక్ష్యంతో ఉన్నట్లుకంపెనీ సహవ్యవస్థా పకులు కనిష్క్బేడీవివరించారు.సమావేశంలో సేల్స్ హెడ్ శశాక్కె, ఆపరేషన్స్ఫుడ్ నిపుణులు మహ్మద్ జుబేర్ ఆలీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘Rx100’ ఫస్ట్రైడ్: పెద్దలకు మాత్రమే.. ఇవేం పనులు బాబోయ్
‘Rx100’ ఫస్ట్ రైడ్ అంటూ విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేసింది.
Samayam Telugu | Updated:
May 21, 2018, 07:37PM IST
‘Rx100’ ఫస్ట్రైడ్: పెద్దలకు మాత్రమే.. ఇవేం పనులు బాబోయ్
‘Rx100’ ఫస్ట్ రైడ్ అంటూ విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేసింది. రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ రైడ్లో వర్మ శైలిని మించి మరీ మసాలా దట్టించేశాడు దర్శకుడు. హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ రైడ్ వీడియో యూత్ని టార్గెట్ చేస్తూ.. పూర్తి రొమాంటిక్గా సాగింది. మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలానే ఉన్నాయి ఈ టీజర్లో.
ఏన్ ఇన్క్రెడిబుల్ లవ్స్టోరీ అనే ఉప ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఆర్ ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయ, పాయల్ రాజ్పుట్లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు రాంజీ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించారు. ఇక తాజాగా విడుదలైన ‘ఆర్ ఎక్స్ 100’ ఫస్ట్ రైడ్ వీడియో భావోద్వేగాలు మేళవించిన ప్రేమకథా చిత్రంగా తెలుస్తోంది.
ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య వర్మ స్టైల్లో పచ్చిగా తెరకెక్కించిన సన్నివేశాలు ఈ మూవీకి సెన్సార్ నుండి A సర్టిఫికేట్ను అందించేటట్టే కనిపిస్తున్నాయి. ‘నన్ను దగ్గరకు లాక్కో.. అని హీరోయిన్ అనడం హీరో తన కౌగిట్లో ఉక్కిరి బిక్కిరిచేయడం.. సముద్రం పక్కన బీచ్లో నగ్నంగా కనిపిస్తుండటం.. ఒక ఎత్తైతే లిప్ లాక్లకు కౌగిలింతలకూ కొదువేలేదు.
అరిటితోటలో హీరోయిన్ పై వస్త్రాలకు తొలగిస్తూ.. ఒంటిపై నూలు పోగు లేకుండా హీరో ఎదపై కాలి వేలితో ముగ్గులేస్తుండటాన్ని బట్టి ఈ సినిమాలో శృంగార సన్నివేశాలు ‘ఆర్ ఎక్స్ 100’ బైక్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ హీరోపై రొమాన్స్ చేసేందుకు ఎగబడుతుండటం.. ఇది ఓన్లీ ఫర్ యూత్ అని హింట్ ఇచ్చేసింది.
ఇక ‘అర్జున్ రెడ్డి’ ఇచ్చిన స్పూర్తితో ఈమధ్య కాలంలో చిన్న చిత్రాల్లోనూ అశ్లీలత మరీ ఎక్కువైంది. అయితే అర్జున్ రెడ్డి సినిమా చూసిన తరువాత చాలా మందిలో అభిప్రాయం మారింది. ముఖ్యంగా లిప్లాప్ సీన్లైతే హా.. అదేం తప్పుకాదులే అంటూ యూత్ ఎగబడి మరీ చూశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాగానే ఆదరించారు. మరి ‘ఆర్ఎక్స్ 100’ మూవీ ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. ఈలోపు ‘ఆర్ఎక్స్ 100’ ఫస్ట్ రైడ్ స్పీడ్పై ఓ లుక్కేయండి.
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
May 17,2018
చేతులెత్తేసిన సహారా
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన మాట నిలుపుకోవడంలో సహారా సంస్థ మరోమారు విఫలమైంది. సెబీ-సహారా రీఫండ్ ఖాతాలో రూ.750 కోట్లు జమ చేయడంలో ఆ సంస్థ విఫలమైన నేపథ్యంలో సహారా గ్రూప్లోని ప్రతిష్టాత్మకమై ఆంబీ వ్యాలీలో ఆస్తుల వేలాని ముందుకు తీసుకుపోనున్నట్టుగా సుప్రీ కోర్టు స్పష్టం చేసింది. రీఫండ్ ఖాతాలో సొమ్ము డిపాజిట్ చేసేందుకు ఇచ్చిన ఆఖరి గడువు మంగళవారంతో ముగిసింది. గడువులోపు డబ్బులు జమ చేయడంలో తాము విఫలమైనట్టు సహారాకు ప్రాతినిథ్యం వహిస్తున్న న్యాయవాది వికాస్ సింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోరు, జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనానికి వెల్లడించారు. దీంతో ఆస్తుల వేలం కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది. బుధవారం లోపు ఆస్తులను సొంతంగా విక్రయించుకోవచ్చని లేదంటే వేలం వేస్తామని కోర్టు అంతకు ముందు సహారాకు స్పష్టంగా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్ వేలం ప్రక్రియ ఆరంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఆంబీ వ్యాలీ వేలం కొరకు మే 21 నుంచి 31 వరకు బిడ్లను ఆహ్వానిస్తామని జూన్ 2 నుంచి వేలం ప్రారంభిస్తామని లిక్విడేటర్ తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Vaani Pushpa 147 Views mohammad nabi , test cricket
mohammad nabi
చోట్టాగ్రామ్: అప్గానిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన టెస్టు కెరీర్కు ముగింపు పలకడానికి సిద్ధమయ్యాడు. తన కెరీర్లో కేవలం మూడు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడిన నబీ..ఎర్రబంతి క్రికెట్కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత నబీ సుదీర్ఘ ఫార్మట్కు గుడ్బై చెప్పనున్నాడు. బంగ్లాదేశ్తో ఆడుతున్న జట్టులో రిజర్వ్ బెంచ్కే పరిమితమైన నబీ…ఇక టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనే విషయాన్ని బోర్డుకు తెలిపాడు. ఈవిషయాన్ని అప్గానిస్తాన్ టీమ్ మేనేజర్ నజీమ్ జర్ అబ్దుర్రాహీమ్ జ§్ు స్పష్టం చేశారు. అవును…బంగ్లాదేశ్ తో టెస్టు తర్వాత నబీ రిటైర్ అవుతున్నాడు. నబీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. టెస్టు ఫార్మట్ నుంచి నబీ తప్పుకోవడానికి గల కారణాలను మేము అర్థం చేసుకోగలమని నజీమ్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ అఫ్గానిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్లో 342 పరుగులుకే ఆలౌటైంది. రహ్మత్షా సెంచరీ చేయగా, అస్గర్ ఆఫ్గాన్ (92) తృటిలో శతకం కోల్పోయాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/ | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
యూపీఐ ద్వారా... అమెజాన్ పేమెంట్స్!
అమెజాన్ ఇండియా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా నగదు చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చింది.
TNN | Updated:
Feb 6, 2018, 01:58PM IST
అమెజాన్ ఇండియా పేమెంట్లను ఇకపై యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ద్వారా కూడా చెల్లించవచ్చు. దీనిద్వారా రూ.10,000 వరకు లావాదేవీలు చేసే అవకాశం ఉంది. అమెజాన్ మొబైల్ యాప్‌కు మాత్రమే ఇది వర్తిస్తోంది. అమెజాన్ డెస్క్‌టాప్ సైట్ ద్వారా షాపింగ్ చేసేవారికి ఈ సదుపాయం ఉండదు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్ వాటి ఈకామర్స్ సైట్ల ద్వారా యూపీఐ నగదు చెల్లింపు సేవలను అందిస్తున్నాయి.
యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేయదలచినవారు మొదటగా అమెజాన్ ఇండియా మొబైల్‌ అప్లికేషన్‌లోకి వెళ్లాలి. నగదు చెల్లింపు చేసే క్రమంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ ఆప్షన్స్‌తోపాటు యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు చెల్లించవచ్చు. | 1entertainment
|
చెన్నయ్ మార్కెట్లోకి స్ప్లిట్ ఏసీలను ప్రవేశపెట్టిన గోద్రెజ్
PNR|
WD
WD
ప్రముఖ గృహోపకరణాల ఉత్పత్తి సంస్థ గోద్రెజ్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్లో తాజాగా కొత్తరకం స్ప్లిట్ ఏసీలను మార్కెట్లోకి విడుదల చేసింది. వేసవి కాలం సమీపిస్తుండటంతో వీటిని ప్రవేశపెడుతున్నట్టు ఆ సంస్థ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు కమల్ నందిని గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యేడాది జరిగిన ఏసీ అమ్మకాల్లో తాము 9.5 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు వివరించారు. ఈయేది 12 శాతం విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
మారుతున్న కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా తాము గృహోపకరణాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ప్రధానంగా, ఇంటి గోడ రంగుతో మ్యాచ్ అయ్యేలా ఏసీ యంత్ర పరికాలు ఉండాలని కోరుకుంటున్నారన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఈసీ యంత్రాలను తయారు చేసినట్టు చెప్పారు.
గోద్రెజ్ ఈఓఎన్ వోగ్యు పేరుతో విడుదల ఏసీలన్నీ ఫైవ్స్టార్ రేంజ్ కలిగివున్నాయని, వీటి ద్వారా 29 శాతం విద్యుత్ను ఆదా చేయవచ్చన్నారు. ఈ ఏసీల ధర 29 నుంచి 35 వేల రూపాయల వరకు ఉందన్నారు. ప్రస్తుతం తమ సంస్థ మొత్తం 41 మోడళ్ళలో ఏసీలను విక్రయిస్తున్నట్టు ఆయన వివరించారు.
అంతేకాకుండా, తమ సంస్థకు దేశ వ్యాప్తంగా మొత్తం 458 గుర్తింపు పొందిన సర్వీస్ సెంటర్లు ఉన్నాయన్నారు. ఈ కేంద్రాల్లో గోద్రెజ్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులకు సర్వీస్ చేస్తారన్నారు. ఈ కేంద్రాల్లో 500 మంది ఇంజనీర్లు విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Arun Jaitley: మధ్యంతర బడ్జెట్లో కీలక ప్రకటనలు ఉంటాయా?
బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంప్రదాయాలకు భిన్నంగా వెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే బడ్జెట్ను విలీనం చేయడం ఇందులో ఒకటి.
Samayam Telugu | Updated:
Jan 18, 2019, 02:04PM IST
హైలైట్స్
అవసరమైనప్పుడు సంప్రదాయాలకు భిన్నంగా వెళ్లొచ్చు
దేశ ప్రజానీకానికి ఏం అవసరమో అదే బడ్జెట్లో ఉంటుంది
వీడియో లింక్లో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్.. ఓట్ ఆన్ అకౌంట్ కన్నా ఎక్కువ స్థాయిలోనే ఉండొచ్చని సంకేతాలిచ్చారు. ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పుడు మరీముఖ్యంగా వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించేందకు కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ విధానాలకు భిన్నంగా వెళ్లొచ్చని తెలిపారు. గురువారం ఒక టీవీ చానల్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో జైటీ వీడియో లింక్ ద్వారా మాట్లాడారు.
‘ఎన్నికల ఏడాది బడ్జెట్ అంటే అది మధ్యంతర బడ్జెట్ అనే సంప్రదాయం ఉంది. అయితే దేశ ప్రజలకు ఏం అవసరమో అదే బడ్జెట్లో ఉంటుంది’ అని అరుణ్ జైట్లీ తెలిపారు. వ్యవసాయ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ఆహార పదార్థాల ధరలు తగ్గాయని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగ సవాళ్లపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజాకర్షక విధానాలను కాకుండా హేతుబద్దమైన విధానాలను కలిగి ఉందనే అంశాన్ని మార్కెట్ వర్గాలు అర్థం చేసుకుంటాయన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటు లక్ష్యానికి కట్డుబడి ఉందని తెలిపారు. ద్రవ్య క్రమశిక్షణ వల్ల ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాలు ద్రవ్య లోటు కట్టడి లక్ష్యాలను అధిగమించినప్పుడు తలెత్తిన పరిణామాలను గమనించామన్నారు.
బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంప్రదాయాలకు భిన్నంగా వెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే బడ్జెట్ను విలీనం చేసింది. అలాగే కేంద్ర బడ్జెట్లోనే జీఎస్టీని ప్రకటించింది. సాంప్రదాయబద్ధంగా చూస్తే మధ్యంతర బడ్జెట్లో పెద్ద ప్రకటనలేవీ ఉండవు. అయితే ఈసారి కేంద్రం రైతులకు నగదు బదిలీ పథకాన్ని ఆవిష్కరించొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గే చర్యలు తీసుకోవచ్చని తెలిపాయి.
కాగా ప్రస్తుతం అరుణ్ జైట్లీ కేన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఆయన ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. ప్రభుత్వ అధికారులేమో బడ్జెట్ సమయానికల్లా జైట్లీ రావొచ్చని పేర్కొన్నారు. | 1entertainment
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మందుకొట్టిన ‘టాక్సీవాలా’ భామ.. ఫుల్ కిక్లోనే షూట్
పార్టీలోనో.. ఫ్రెండ్స్తో కలిపో కాదు షూటింగ్ స్పాట్లోనే వోడ్కాని గుటక మీద గుటకలేసిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా వోడ్కా సాక్షిగా బయటపెట్టింది.
Samayam Telugu | Updated:
Nov 6, 2018, 04:14PM IST
మందుకొట్టిన ‘టాక్సీవాలా’ భామ.. ఫుల్ కిక్లోనే షూట్
మందేసిన మగువ.. అవును ‘టాక్సీవాలా’ హీరోయిన్ ప్రియాంకా జువాల్కర్ చుక్కమీద చుక్కలేస్తూ పెగ్గు మీద పెగ్గులు లాగించేసిందట. పార్టీలోనో.. ఫ్రెండ్స్తో కలిపో కాదు షూటింగ్ స్పాట్లోనే వోడ్కాని గుటక మీద గుటకలేసిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా వోడ్కా సాక్షిగా బయటపెట్టింది. అయితే నేను తాగింది సరదా కోసమో.. సందడి కోసమో.. కిక్కు కోసమో కాదు సుమీ!! నా కసలే మందన్నా మందు వాసనన్నా గిట్టదు. అయినా కష్టపడి తాగా.. ఎందుకో తెలుసా అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది.
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘టాక్సీవాలా’. ఈ చిత్రంలో విజయ్కి జోడీగా నటిస్తుంది ప్రియాంకా జువాల్కర్. ఈమెతో పాటు మరో హీరోయిన్ మాళవికా నాయర్ కూడా నటిస్తోంది.. అది వేరే విషయం కాని జువాల్కర్ మందు కొట్టిన విషయానికి వస్తే.. ఆమె నటించిన టాక్సీవాలా పలు వాయిదాల అనంతరం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రానికి తానెంత కష్టపడ్డానో చెప్పుకొచ్చింది ఈ వోడ్కా బ్యూటీ.
ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో భాగంగా తాగినట్టు నటించాల్సి వచ్చిందని.. అయితే ఎంత కష్టపడ్డా క్యారెక్టర్ పండకపోవడంలో తాగిన పాత్రలో పరకాయ ప్రవేశం కోసం.. తాగినట్టు నటించడం ఎందుకు? అదేదో తాగితే జీవించొచ్చు కదా అని వోడ్కా బాటిల్ ఎత్తేసి నటించడం మొదలు పెట్టిందట. ఇంకేముంది అసలే అందమైన మగువ ఆపై మందు తాగింది కట్ చేస్తే.. సీన్ చిరిగిపోయిందట. అయితే వోడ్కా లోపలికి వెళ్లాక కుదురుగా ఉండేది కాదట.. సీన్ పూర్తైనా కూడా పనిచేయడం మొదలు పెట్టేదట. దీంతో చెప్పలేనంత నవ్వు వచ్చేదట. దాన్ని కంట్రోల్ చేసుకోవడం తిప్పలు పడేదట. అంతే మరి వోడ్కా అంటే మాటలా.. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లనే కంట్రోల్ తప్పేలా చేసింది ఈమె ఓ లెక్కా. ఇంతకీ ఈమె చేసిన వోడ్కా సీన్ పండిందా? లేదా అనేది చూడాలంటే.. ఈనెల 17 వరకూ ఆగాల్సిందే.. అప్పటి వరకూ.. హే స్టడీ!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Oct 11,2018
ఐడీబీఐ కొత్త అధినేతగా రాకేశ్ శర్మ
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఐడీబీఐ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా రాకేశ్ శర్మ బుధవారం పగ్గాలు చేపట్టారు. ఆయన నియమకం వెంటనే అమలులోకి వచ్చింది. ఐడీబీఐకి కొత్త బాస్గా రాకేశ్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం 5వ తేదీన ఉత్తర్వూలు జారీ చేసిన సంగతి తెలిసిందే. శర్మ ఐడీబీఐ బ్యాంక్ అధినేతగా ఆరు నెలల పాటు కొనసాగునున్నారు. అంతకు ముందు కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవోగా సేవలందించిన శర్మ ఈ ఏడాది జులై 31న పదవీ విరమణ పొందారు. కెనరా బ్యాంక్లో చేరక ముందు శర్మ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా కూడా పని చేశారు. శర్మ తన బ్యాంకింగ్ జీవితాన్ని మొదట స్టేట్ బ్యాంక్ ఇండియా నుంచి ప్రారంభించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Dec 23,2017
హువాయి 'డిజిటలీకరణ'
న్యూఢిల్లీ: ప్రముఖ ఐసీటీ ఉత్పత్తుల కంపెనీ హువాయి భారత్లోని అన్ని సంస్థలను క్లౌడ్ నెట్వర్క్లోకి తీసుకురావడానికి రోడ్మ్యాప్ను రూపొందిం చుకున్నట్టు ప్రకటించింది. వృద్ధికి డిిజిటలీకరణ దోహదం చేస్తుందని హువాయి టెలికమ్యూనికేషన్స్ ఇండియా సీఈవో జారు చెన్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Oct 27,2017
ఎయిర్పోర్ట్లో చెకింగ్లకు చెక్..
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్ విమానాశ్రయంలో తనిఖీలను తగ్గించేలా టెక్నలాజీని అందిపుచ్చుకుంటున్నామని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ (ఆర్జీఐఎల్) సీఈవో ఎసజీకే కిశోర్ తెలిపారు. ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించింది మొదలు విమానం ఎక్కే వరకు కూడా ఎలాంటి తనిఖీ లేని విధంగా కసరత్తు చేస్తున్నామన్నారు. ఇందుకోసం వేలిముద్ర లేదా కంటిపాప (ఐరిష్)ను వినియోగిం చుకోనున్నామన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు 2016-17లో 15.24 మిలియన్ ప్యాసింజర్లను నమోదు చేశామన్నారు. ప్రస్తుత ఏడాదిలో ఇది 17 మిలియన్లకు చేరనుందని అంచనా వేశారు. క్రితం ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల సంఖ్యలో ఏకంగా 56 శాతం పెరుగుదల చోటు చేసుకుందన్నారు. ప్రయాణికుల సంఖ్య 2.5 కోట్లకు చేరగానే రెండో టెర్మినల్ను అందుబాటులోకి తేనున్నామని కిశోర్ తెలిపారు.
మలేషియాతో ఒప్పందం..
హైదరాబాద్ (భారత్), మలేషియా మధ్య పర్యటకులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గురువారం హైదరాబాద్లో టూరిజం మలేషియన్ (టీఎం), మలేషియన్ ఎయిర్పోర్ట్సు హోల్డింగ్స్ బెర్హాడ్ (ఎంఏహెచ్బీ)తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మలేషియా హై కమిషనర్ హిదాయత్ అబ్దుల్ హమీద్ సమక్షంలో కిశోర్, ఎంఏహెచ్బీ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మాద్ బడ్లిషమ్ ఘజాలి, ఎంటీపీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ ఖనీ డాడ్లు ముగ్గురు సంయుక్తంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
- సాయిరాం కృష్ణ హోండా షోరూం
ప్రారంభోత్సవంలో మంత్రి ఈటల రాజేందర్
గోదావరి ఖని : నాణ్యమైన సేవలందించి కస్టమర్ల అభిమానాన్ని చూరగొనాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఆదివారం కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో సాయిరాం కృష్ణ హోండా షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హోండా ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. హోండా కంపెనీ ఉత్పత్తులను కొనుగోలుచేసేందుకే ఎక్కువ మంది వినియోగదారులు ఆసక్తి కనబరుస్తారని తెలిపారు. అంతకుముందు ప్రముఖ సినీ నటి ప్రణీత షోరూం ప్రారంభోత్సవ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తెలంగాణ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, రామగుండం శాసనసభ్యులు సత్యనారాయణ మాట్లాడారు. సేల్స్, సర్వీస్, స్పేర్స్, సేఫ్టిలను ప్రాధాన్యతాంశాలుగా తీసుకొని గోదావరి ఖని వినియోగదారుల సౌకర్యార్ధం హోండా షోరూంను నెలకొల్పిన సాయిరాం కృష్ణ యాజమాన్యాన్ని అభినందించారు. ఎస్ఆర్కె ( సాయిరాం కృష్ణ) సంస్థకు ఆంధ్రప్రదేశ్లో వోల్వో కార్ల డీలర్షిప్తో పాటు పెట్రోల్ బంక్లు, రైస్ మిల్లులు, ఇనుప నిక్షేపాలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలున్నాయి. ప్రజా శ్రేయస్సునే తమ పరమావధిగా భావించి ఎస్ఆర్కె సంస్థ నాణ్యమైన సేవలందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతోందని కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అభిప్రాయపడ్డారు. అనంతరం హోండా జోనల్ సేల్స్ మేనేజర్ రితేష్ నాయర్, సర్వీస్ జోనల్ మేనేజర్ సచిన్ జైన్లు మాట్లాడుతూ హోండా వాహనాల సేల్స్ పెంచేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రతినెల 8వేల వాహనాలకు సర్వీస్ అందించగలిగే అధునాతన పరిజ్ఞానంతో కూడిన ఉపకరణాలు సాయిరాం కృష్ణ హోండా షోరూంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హోండా కంపెనీ దాదాపు 39లక్షల షైన్ వాహనాలను విక్రయించి ప్రజాధరణను సొంతం చేసుకుందని సాయిరాం కృష్ణ హోండా షోరూం మేనేజింగ్ డైరెక్టర్ ప్రమోద్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎస్పీ డేవిస్, షోరూం చైర్మన్ మంచికట్ల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Nov 10,2016
శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయి: ఆర్బీఐ
బడానోట్ల రద్దు కారణంగా వ్యవస్థలో ఏర్పడిన చిన్న విలువ కలిగిన కరెన్సీ నోట్ల కొరతను తీర్చేందుకు గాను సర్కారు సమాయత్తమవుతోంది. భారీ డిమాండ్ను దృష్టిలోఉంచుకోని బ్యాంకులు వచ్చే శని, ఆదివారాల్లో (12, 13వ తేదీల్లో) కూడా పని చేస్తాయని 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్బీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి తోడు కొన్ని బ్యాంకులు గురువారమే తమ కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు సమయత్తమయ్యాయి. గురువారంఉదయం 10 నుంచి రాత్రి ఏడు గంటల వరకు పని చేస్తామని పలు బ్యాంకులు వెల్లడించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎండీ, సీఈవో ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేస్తూ తమ బ్యాంక్ శాఖలు గురు, శుక్ర వారాల్లో (10,11 తేదీల్లో) రాత్రి ఏడు గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. కాగా ఎస్బీఐ రద్దీని తట్టుకొనేందుకు తాము అదనపు కౌంటర్లను తెరవనున్నట్టుగా వివరించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Visit Site
Recommended byColombia
వేధింపుల కేసులో క్లీన్చిట్ వస్తే అసోసియేషన్లోకి తీసుకోవాలని, నిందితులుగా ఉన్నవారిని ‘అమ్మ’లోకి ఆహ్వానించడాన్ని మహిళా ఆరిస్టులు, హీరోయిన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిర్దోషిగా తేలే వరకు దిలీప్ను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ నటీమణులు రేవతి, పద్మప్రియ , పార్వతిలు మరోసారి లేఖ రాశారు. అక్టోబర్ 7న కోచిలోని క్రౌన్ ప్లాజా హోటల్లో బాధితురాలికి మద్దతుగా కొందరు ఆర్టిస్టులు సమావేశం కానున్నారు. అయితే రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన కారణంగా కొన్నిరోజుల వరకు సమసిపోయినట్లు కనిపించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
బాధితురాలికి నిజంగా న్యాయం జరగాలంటే ఆమెకు మద్దతుగా నిలవడంతో తప్పు చేసిన వారిపై వేటు వేయాల్సిందేనని మరికొందరు ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, దిలీప్ను మూవీ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ‘అమ్మ’ నుంచి రీమా కల్లింగల్, గీతు మోహన్దాస్, రెమ్యా నంబీసాన్, వేధింపులకు గురైన హీరోయిన్ కొంతకాలం కిందట రాజీనామా చేశారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
T20 Rankings: పాకిస్థాన్ టాప్.. భారత్ ఎక్కడో..?
టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ తర్వాత 262 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ఇంగ్లాండ్ (261), ఆస్ట్రేలియా (261), భారత్ (260) టాప్-5లో నిలిచాయి.
Samayam Telugu | Updated:
May 3, 2019, 04:33PM IST
T20 Rankings: పాకిస్థాన్ టాప్.. భారత్ ఎక్కడో..?
హైలైట్స్
టీ20 ర్యాంకింగ్స్ని విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న పాకిస్థాన్
ఐదో స్థానానికి పడిపోయిన టీమిండియా
టీ20 ర్యాంకింగ్స్లో 80 జట్లకి తొలిసారిగా చోటు
వన్డే, టెస్టుల్లో గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న పాకిస్థాన్ టీ20ల్లో మాత్రం ఆధిపత్యం చెలాయిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో 286 పాయింట్లు సాధించిన పాకిస్థాన్ నెం.1 స్థానంలో నిలిచింది. టెస్టుల్లో అగ్రస్థానం, వన్డేల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న భారత్ జట్టు అనూహ్యంగా 260 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోవడం గమనార్హం.
ICC Test, ODI Rankings: భారత్, ఇంగ్లాండ్ మధ్య పోటాపోటీ..!
టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ తర్వాత 262 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ఇంగ్లాండ్ (261), ఆస్ట్రేలియా (261), భారత్ (260) టాప్-5లో నిలిచాయి. ఇక ఆరో స్థానంలో న్యూజిలాండ్ (254) ఆ తర్వాత అఫ్గానిస్థాన్ (241), శ్రీలంక (227), వెస్టిండీస్ (226), బంగ్లాదేశ్ (220) టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. 2016 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్.. ఏకంగా 9వ స్థానానికి పడిపోవడం విశేషం. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది.
ఐసీసీ ఇక నుంచి 80 జట్లకి సంబంధించిన టీ20 ర్యాంకింగ్స్ను ప్రకటించనుంది. ఈ మేరకు జాబితాలో యూఏఈ, నమీబియా, హాంకాంగ్, నెదర్లాండ్స్, గన్యా, నైజీరియా, దక్షిణ కొరియా తదితర జట్లు కూడా చేరాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
May 01,2018
హెచ్డీఎఫ్సీ లాభం 2846 కోట్లు
న్యూఢిల్లీ: గృహ రుణాల దిగ్గజ సంస్థ హెచ్డీఎఫ్సీ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో సంస్థ స్టాండ్ఎలోన్ నికర లాభం 39 శాతం మేర పెరిగి రూ.2044 కోట్ల నుంచి రూ.2,846 కోట్లకు చేరుకుంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి చూస్తే హెచ్డీఎఫ్సీ సంస్థ లాభంలో 63 శాతం వృద్ధి నమోదు అయింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.7,443 కోట్లుగా ఉన్న సంస్థ లాభం గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.12,164కోట్లకు చేరుకుంది. మేటి ఫలితాల నేపథ్యంలో సంస్థ బోర్డు రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.16.50 తుది డివిడెండ్కు సిఫారసు చేసింది. దీంతో సంస్థ మార్చితో ముగిసిన త్రైమాసికానికి ప్రకటించిన డివిడెండ్ మొత్తం రూ.20లకు చేరుకుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
టీమిండియా సెలక్షన్పై బెంగలేదు: అశ్విన్
మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి కెప్టెన్గా ఉన్న అశ్విన్ మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు.
Samayam Telugu | Updated:
Mar 9, 2019, 05:46PM IST
టీమిండియా సెలక్షన్పై బెంగలేదు: అశ్విన్
హైలైట్స్
రెండేళ్లుగా భారత్ వన్డే జట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్న రవిచంద్రన్ అశ్విన్
మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలు
ఐపీఎల్ 2019 సీజన్ కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్న అశ్విన్
టీమిండియా సెలక్షన్ గురించి బెంగలేదని సీనియర్ స్పిన్నర్ వ్యాఖ్య
మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ రాకతో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో దాదాపు కనుమరుగైపోయాడు. ఎంతలా అంటే..? అశ్విన్ వన్డేల్లో ఆడి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. వెస్టిండీస్తో 2017లో జరిగిన వన్డేలో చివరిసారి ఆడిన ఈ ఆఫ్ స్పిన్నర్ ఆ తర్వాత కేవలం టెస్టులకే పరిమితమైపోయాడు. అయితే.. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలవనున్న నేపథ్యంలో.. టీమిండియాలోకి పునరాగమనం కోసం తాను శ్రమిస్తున్నట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు. | 2sports
|
బ్యాంకుల బాస్లతో శక్తికాంత భేటీ
- పీసీఏ నిబంధనలపై చర్చలు
- గంటన్నర పాటు మంతనాలు
- నేడు ఆర్బీఐ బోర్డు కీలక మీట్
ముంబయి: బ్యాంకులు ఎదుర్కొంటున్న నిరర్థక ఆస్తుల సమస్య నుంచి బయటపడేందుకు గాను భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కఠినంగా అమలులోకి తెచ్చిన సరైన దిద్దుబాటు చర్యలు (పీసీఏ) నిబంధనల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు త్వరలోనే ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్తో సమావేశమైన ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలు తమ బేటీలో పీఏసీ నిబంధనల విషయమై ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. బ్యాంకులను పీఏసీ ప్రతిబంధకాలను విధించడం కూడా ఆర్బీఐ-ప్రభుత్వానికి మధ్య విభేదాలు రావడానికి ప్రధానాంశంగా నిలిచిన సంగతి తెలిసిందే. పీఏసీ నిబంధనలను అమలులోకి తెచ్చిన ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసి కొత్త గవర్నర్ అధికారంలోకి రాగానే బ్యాంకులు పీఏసీ కఠిన నిబంధనలను సవరించాలంటూ మళ్లీ గళం విప్పడం గమనార్హం. కాగా ఈ అంశంలో ప్రభుత్వం కూడా బ్యాంకర్ల వైపే ఉండడం విశేషం. ప్రస్తుతం పీసీఏలో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. శుక్రవారం జరగనున్న ఆర్బీఐ బోర్డు సమావేశంలో పీసీఏ నిబంధనలను సవరించే అంశంపై చర్చ జరిగే అవకాశం కని పిస్తోంది. దాదాపుగా గంటన్నర పాటు ఆర్బీఐ గవ ర్నర్, నలుగురు డిప్యూటీ గవర్నర్లతో బ్యాంకర్ల భేటీ జరిగింది. ఈ సమావేశంలో కొత్త గవర్నర్ పీసీఏ వల్ల సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిం చారని బ్యాంకర్లు పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యుబీఐ, సెంట్రల్ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అధినేతలు, అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. నూతన గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన శుక్రవారం ఆర్బీఐ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ భేటీలో పలు కీలకాంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. | 1entertainment
|
బెల్లంకొండ సురేష్ కు బెదిరింపులు.. కేసు నమోదు
Highlights
తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బెల్లంకొండ సురేష్ ఫిర్యాదు
చెల్లించాల్సిన డబ్బు చెల్లించినా వేధిస్తున్నారని పోలీస్ కంప్లైంట్
గతంలోనే పేమెంట్ ఇవ్వనందుకు కేసు నమోదు చేశామంటున్న ప్రతివాది
నిర్మాత బెల్లం కొండ సురేష్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయనమీద మాదాపూర్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే ఫిర్యాదు దారుల మీద బెల్లం కొండ కూడా తిరిగి కంప్లైంట్ చేసారు. తన కుమారుడు సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన ఓ సినిమాకు సంబంధించి పాట చిత్రీకరణలో భాగంగా లైట్లు ఏర్పాటు చేసిన వ్యక్తికి తాను డబ్బులు చెల్లించినప్పటికీ అందుకు సంబంధం లేని వ్యక్తి తనపై బెధిరింపులకు పాల్పడుతున్నాడంటూ ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ హీరోగా 'జయ జనాకీ నాయక' చిత్ర నిర్మాణం గత ఏడాది డిసెంబర్ 26 నుంచి గత జనవరి 2వ తేదీ వరకు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఇందులో పాట చిత్రీకరణ కోసం లైట్ల ఏర్పాటుకు ఓ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చామని, పని పూర్తయిన తరువాత అతడికి రూ.2.75 లక్షల బిల్లు చెల్లించినట్లు తెలిపాడు.
అయితే ఈ కాంట్రాక్ట్ తనదంటూ అశోక్ రెడ్డి అనే వ్యక్తి తెరపైకొచ్చి... రూ.10.75 లక్షల బిల్లు చెల్లించాలని తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, తనపై ఒత్తిడి తెస్తున్నాడని, తరచూ ఫోన్లు చేసి వేధిస్తున్నందున తన పనులకు ఆటంకం కలుగుతున్నదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా తనకు లైట్లు అమర్చినందుకు గాను రూ. 10.75 లక్షలు రావాల్సి ఉందని గతంలోనే మాదాపూర్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసానని అశోక్ రెడ్డి చెప్తున్నాడు. నిజానిజాలు కనుక్కునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated 25, Mar 2018, 11:45 PM IST | 0business
|
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
First Published 11, Jul 2017, 1:45 PM IST
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
Recent Stories | 0business
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
Rahul Sipligunj పబ్లిక్ టాక్: శ్రీముఖి ఓవరాక్షన్.. రాహుల్ బిగ్ బాస్ విన్నర్!
Bigg Boss Telugu 3 Winner: బిగ్ బాస్ సీజన్ 3 విజేత ఎవరు కాబోతున్నారు. ప్రస్తుతం నామినేషన్స్లో ఉన్న ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది. ఎవరికి పట్టం కడుతున్నారో చూద్దాం.
Samayam Telugu | Updated:
Oct 25, 2019, 08:46PM IST
బిగ్ బాస్ విన్నర్ ఎవరు?
బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ దశకు చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్గా 17 మంది కంటెస్టెంట్స్తో ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో మరో వారంలో ముగియనుంది. ప్రస్తుతం హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉండగా.. వీరిలో ఈవారం ఒకరు ఎలిమినేట్ అయ్యి.. ఫైనల్లో ఐదుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం తలపడనున్నారు.
పోల్
అయితే హౌస్లో రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, అలీ, శివజ్యోతి శ్రీముఖిలు ఉండగా.. వీరిలో రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే టాస్క్ విజేత కావడంతో అతనికి ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఇక మిగిలిన ఐదుగురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతుండగా.. నలుగురు ఫైనల్కి వెళ్లనున్నారు.
Read Also: హాట్ టాపిక్గా శ్రీముఖి లవ్ ఎఫైర్.. యాంకర్ రవికి వాచిపోతుందిగా!
కాగా ఫైనల్కి వెళ్లే ఆ ఐదుగురు ఎవరు? అసలు బిగ్ బాస్ సీజన్ 3 విజేత ఎవరు కాబోతున్నారన్నదానిపై ‘తెలుగు సమయం’ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంది. అయితే ఇందులో చాలా మంది రాహుల్ సిప్లిగంజ్ పేరు చెప్పడం విశేషం. శ్రీముఖి పుల్లలు పెడుతుందని.. ఆమె ఓవరాక్షన్ చేస్తుందంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడొచ్చు.
పబ్లిక్ టాక్: శ్రీముఖి ఓవరాక్షన్.. రాహులే విన్నర్
X | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రూ.60 కోట్లకు అమ్ముడుబోయిన ధోనీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రూ.60 కోట్లకు అమ్ముడు పోయాడు. అందుకేనా విండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో చివరి బంతికి పరుగుతీయకుండా అవుట్ అయ్యాడు?
TNN | Updated:
Aug 29, 2016, 12:33PM IST
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రూ.60 కోట్లకు అమ్ముడు పోయాడు. అందుకేనా విండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో చివరి బంతికి పరుగుతీయకుండా అవుట్ అయ్యాడు? అనుకుంటున్నారా. అదేం కాదులేండి. దేశం కోసం ఆడే విషయంలో ధోని వ్యక్తిత్వాన్ని తప్పుబట్టలేం. మరి ఇంతకూ అతడు అమ్ముడుబోయింది దేనికో తెలుసా? ‘ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ పేరిట అతడి బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తన జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు రూ.60 కోట్లు తీసుకుంటున్నాడట. ఇప్పటికే ధోనీకి నిర్మాతలు రూ.20 కోట్లు ఇచ్చారట. మూవీ విడుదలయ్యాక మిగతా మొత్తాన్ని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ సినిమాలో ధోనీ ప్రేమ సహా అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పొందుపరచనున్నారనే సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా సాంగ్ టీజర్ను ఇటీవలే విడుదల చేశారు. రాంచీలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధోనీ విజయవంతమైన భారత జట్టు కెప్టెన్గా ఎదిగిన తీరు సినిమా స్టోరీకి చక్కగా సరిపోతుందనడంలో సందేహం లేదు కదూ. | 2sports
|
Visit Site
Recommended byColombia
బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసి తర్వాతి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన పుజారా.. ఒకే మ్యాచ్లో శతకం బాది డకౌట్ కావడం కావడం ఇది రెండోసారి. 2015లో శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్లో 145 రన్స్ చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్లో డకౌటయ్యాడు. మెల్బోర్న్ టెస్టులోనూ ఇలాగే అవుటవడంతో.. ఈ రాజ్కోట్ బ్యాట్స్మెన్ సచిన్ సరసన చేరాడు. మాస్టర్ బ్లాస్టర్ కూడా ఇలా రెండుసార్లు అవుటయ్యాడు.
1999లో పాకిస్థాన్పై తొలి ఇన్నింగ్స్లో సెంచరీ బాది మలి ఇన్నింగ్స్లో డకౌటయిన సచిన్.. 2002లో వెస్టిండీస్పై కూడా ఇలాగే అవుటయ్యాడు. సర్ డాన్ బ్రాడ్మన్, వివియన్ రిచర్డ్స్, గార్ఫీల్డ్ సోబెర్స్, జాక్వెస్ కలిస్, డార్లీ కుల్లినన్లు ఈ జాబితాలో ఉన్నారు. విండీస్ క్రికెటర్ శివనారయణన్ చంద్రపాల్ అత్యధికంగా మూడుసార్లు ఒకే టెస్టులో సెంచరీతోపాటు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
పాలిటిక్స్లోకి బిగ్ బాస్ విన్నర్.. గ్రామం దత్తత అందుకేనా?
బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? ఆ వైపుగా అడుగులు పడుతున్నాయా? కౌశల్ మాటల్లో ఆంతర్యం ఏమిటి?
Samayam Telugu | Updated:
Oct 31, 2018, 04:36PM IST
పాలిటిక్స్లోకి బిగ్ బాస్ విన్నర్.. గ్రామం దత్తత అందుకేనా?
బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ ఇప్పటికే కౌశల్ ఆర్మీ అండతో సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్గా అయ్యారు. తాజాగా ఉత్తరాంధ్రాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు కౌశల్ ఫ్యాన్స్. కోట్లాది మంది అభిమానుల ఆదరాభిమానాలతో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావడమే కాకుండా ఆ ప్రైజ్ మనీ మొత్తం రూ. 50 లక్షల్ని క్యాన్సర్ బాధితుల కోసం డొనేట్ చేసి కోట్లాదిమంది హృదయాలను గెల్చుకున్నాడు కౌశల్. అయితే కౌశల్ గురి సినిమాపై కాకుండా రాజకీయం ఎదిగేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీనికి తగ్గట్లుగానే కౌశల్ కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పొలిటికల్ ఎంట్రీకి వ్యూహం రచిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
#KaushalArmy Official account for donation is going to be announced tomorrow, So if u want to donate anything to… https://t.co/Cr3W3o1QWr
— KaushalArmy ✊ (@kaushalarmy1) 1540106019000
బిగ్ బాస్ విన్నర్ కాగానే.. బ్రెస్ట్ క్యాన్సర్తో ఇబ్బందిపడ్డ నా తల్లి రుణాన్ని ఎలాగూ తీర్చుకోలేకపోయాను. వీళ్లకైనా సాయం చేసి ఆ రుణాన్ని తీర్చుకుందామనే నా ఫ్రైజ్ మనీ రూ. 50 లక్షల్ని విరాళంగా ఇచ్చా. అంతేకాదు త్వరలో నా తల్లి పేరుమీద కౌశల్ ఆర్మీ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది తల్లులకు సాయపడాలన్నది తన కోరిక అని తెలిపిన కౌశల్ అన్నట్లుగానే ఓ ఫౌండేషన్ను స్థాపించాడు. అనంతరం ఈ ఫౌండేషన్ కార్యక్రమాల్లో భాగంగా తొలిత శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం తన ఫౌండేషన్కు డొనేషన్లు సేకరించే పనిలో ఉన్నారు. కౌశల్ పిలుపు మేరకు ఆయన అభిమానులు డొనేషన్లు పంపుతున్నారు.
#KaushalArmy done my part for this month https://t.co/0cXnJHyNU4
— madhusudhanappl (@madhusudhanappl) 1540307771000
కౌశల్ ఫౌండేషన్లో భాగంతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. తాజాగా కర్నూల్లో సందడి చేసిన కౌశల్.. తన అభిమానుల్ని కలుసుకున్నారు. కౌశల్ ఫౌండేషన్ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. వీటిన్నింటినీ చూస్తుంటే.. కౌశల్ పొలిటికల్ ఎంట్రీ త్వరలోనే ఉండొచ్చనేది ఎక్కువగా వినిపిస్తుంది.
అయితే కౌశల్ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు. రాజకీయాల్లోకి రావడం అంటే ప్రజలకు సేవ చేయడమే.. పాలిటిక్స్లోకి రాకుండా కూడా ప్రజలకు సేవ చేయొచ్చనేది తన అభిప్రాయం అంటున్నారు. అంతేకాదు సాయం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరికీ కౌశల్ ఆర్మీ అండగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని.. భవిష్యత్ వస్తే రావొచ్చని అంటున్నాడే కాని.. ఈయన మాటలు చూస్తుంటే త్వరలోనే ఏదో ఒక పార్టీ జెండా ఎగరేసేందుకు రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది.
#KaushalArmy Ananthapuram Success meet.. ✊ @Megastar_Trends @KaushalArmy12 @supportKaushal https://t.co/ZlEiMLgu5M
— Kaushal Manda Fans Forever ✊ (@peoplestarhero) 1540741097000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Visit Site
Recommended byColombia
‘2004 నుంచి 2009 వరకు నేను ఇంజినీరింగ్ చేశాను. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. నాకు ఎటూ సినిమాలంటే ఆసక్తి. సినీ పరిశ్రమలో ఇంటర్వ్యూలు ఉండవు కాబట్టి జీవితంలో ఒకసారైనా టై కట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్లాలని ఉండేది. అలా అన్ని రౌండ్లు పూర్తి చేయడం, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం సెలెక్ట్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి. అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది. కానీ దానిని నేను చించేసి మరీ సినిమాల్లోకి వచ్చాను’ అని తెలిపారు.
READ ALSO: ‘ఇలా ట్వీట్లు చేస్తూనే ఉంటావా? సినిమాలు చేసేదేమన్నా ఉందా?’
అనంతరం తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల గురించి మాట్లాడుతూ.. ‘కరణ్ జోహార్ మమ్మల్ని పార్టీకి పిలిచారు. అప్పటికే నేను మూడు రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్నాను. పది రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాను. కాస్త కోలుకున్నాక కరణ్ పార్టీకి పిలిచారు కదా అని వెళ్లాను. మొదట మమ్మల్ని వీడియో తీసినప్పుడు మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఆ తర్వాత బాగా ఎంజాయ్ చేసి నీరసించిపోయాం. వీడియోను నేను ముక్కు తుడుచుకుంటూ కనిపించాను. దాంతో నేనేదో డ్రగ్స్ తీసుకున్నాననుకుని ప్రచారం చేశారు’ అని పేర్కొన్నారు.
కత్రినాతో లింకప్ రూమర్స్ | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Sep 13,2018
ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తాం..
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: ప్రీమియం మిల్క్షేక్స్, థిక్షేక్స్ తయారీ కంపెనీ 'మేకర్స్ అఫ్ మిల్క్షేక్' వచ్చే డిసెంబర్ ముగింపు నాటికి 100 స్టోర్లకు విస్తరించనున్నట్లు ప్రకటి ంచింది. బుధవారం హైదరాబాద్లో ఆ కంపెనీ ఫౌండర్ రాహుల్ తిరుమల ప్రగడ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం దక్షిణాదిలో తమకు 75 అవుట్లెట్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో రెండు సొంతవని, మిగితా 73 ఫ్రాంచైజీల ద్వారా ఏర్పాటు చేసినవని తెలిపారు. తెలంగాణలో 50, ఆంధ్రప్రదేశ్లో 15 చొప్పున స్టోర్స్ను కలిగి ఉన్నామన్నారు. ఎపిలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అన్నవరం తదితర పట్టణాల్లో విస్తరించి ఉన్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని ద్వితీయ శ్రేణీ పట్టణాల్లో ఔట్లెట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తమ వద్ద రూ.140-250 విలువ చేసే 105 వేరియంట్లు లభిస్తాయన్నారు. 2019 ముగింపు నాటికి దేశ వ్యాప్తంగా మొత్తంగా 200 స్టోర్లకు పెంచనున్నామని తెలిపారు. వచ్చే రెండు నెలల్లో పూణెలో రెండు స్టోర్లు తెరువనున్నామని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 1, Feb 2019, 4:12 PM IST
Highlights
నలుగురు కుర్రాళ్లు, ఓ అమ్మాయి...వాళ్లంతా కలిసి ఓ అడవిలోకి వెళ్లటం అనే పాయింట్ తో అప్పట్లో తెగ సినిమాలు వచ్చాయి. అయితే ఆ ట్రెండ్ మారింది. హర్రర్ , హర్రర్ కామెడీలు మొదలయ్యాయి
--సూర్య ప్రకాష్ జోశ్యుల
నలుగురు కుర్రాళ్లు, ఓ అమ్మాయి...వాళ్లంతా కలిసి ఓ అడవిలోకి వెళ్లటం అనే పాయింట్ తో అప్పట్లో తెగ సినిమాలు వచ్చాయి. అయితే ఆ ట్రెండ్ మారింది. హర్రర్ , హర్రర్ కామెడీలు మొదలయ్యాయి. ఓ స్టార్ హీరోయిన్,కొందరు కామెడీ టీమ్ తో కానీ ఈ సినిమాలు తెరకెక్కిస్తూంటారు. అయితే ఈ సారి ఆ హీరోయిన్ కు పెట్టే ఖర్చు కూడా ఎందుకు అనుకున్నారో ఏమో కానీ కొందరు కొత్త వాళ్లను పోగేసి ...దెయ్యం సినిమా అంటూ మనకు పొగేసారు. పెద్దగా ఖర్చులేని వ్యవహారం కాబట్టి లాభ,నష్టాల గురించి పెద్దగా మాట్లాడునేందుకు ఏమీ ఉండదు. వచ్చిందా వచ్చింది. లేదా పోయిందేముంది అనిపిస్తుంది. అలాంటి ఓ సినిమానే ‘రహస్యం’.టైటిల్ కాస్త ఇంట్రస్ట్ గా అనిపించే ఈ సినిమా ఏదో కాలక్షేపానికి సరదాగా చుట్టేసిన సినిమానా లేక ...సీరియస్ గానే భయపడదామని చేసిన హర్రర్ ప్రయత్నమా రివ్యూలో చూద్దాం.
కథేంటి..
డైరక్షన్ ఛాన్స్ లు కోసం ట్రై చేస్తున్న రవి (శైలేష్)కు నిర్మాత రామ సత్యనారాయణ నుంచి పిలుపు వస్తుంది. నీ షార్ట్ ఫిలిం చూసి ఇంప్రెస్ అయ్యాను మంచి హర్రర్ కథ రాసుకుని రా అని ఆఫర్ ఇస్తాడు. అయితే హర్రర్ కథ రాయాలంటే కాస్తంత దెయ్యాలతో టచ్ ఉంటే మంచిదని, వాటి గురించి అన్వేషిస్తూ..ఓ మాంత్రికుడు (జబర్దస్త్ అప్పారావు) దగ్గరకు వెళ్తారు. అక్కడ వీళ్లను ఓ దెయ్యం దివ్య (రితిక) తగులుకుంటుంది. నీ సినిమాలో నన్ను హీరోయిన్ గా పెట్టి తీయి అని వెంటబడుతుంది. వేరే దారిలేక మొత్తానికి ఆ దెయ్యాన్ని పెట్టి సినిమా చేస్తాడు. ఇంతకీ దెయ్యానికి ఈ సినిమా హీరోయిన్ కావాలనే పిచ్చ ఏమిటి...రవి సినిమాలోనే నటిస్తానని ఎందుకు వెంటపడింది, ఆమె ప్లాష్ బ్యాక్ ఏమిటి, చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆ రహస్యం ఛేధించాల్సిందే.
ఎలా ఉంది..
దెయ్యానికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండటం అనే కథను చూస్తూంటేై ఆ మధ్యన తమన్నా, ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన దేవి సినిమా గుర్తుకు రాకమానదు. అయితే ఆ సినిమా భారీ కాస్టింగ్ తో వచ్చింది. ఈ సినిమాలో ఎవరు హీరో, ఎవరు క్యారక్టర్ ఆర్టిస్ట్ లు అనే తేడా కూడా తెలియన సిట్యువేషన్ లో తయారైంది. అలాగే సినిమా కు ఏదో ఒక లైన్ అనుకుని ,సరిగ్గా స్కిప్టు రాసుకోకుండానే షూటింగ్ వెళ్లిపోయారనిపిస్తుంది. దాంతో అనవసరమైన సీన్స్ అడుగడుగడుక్కి తగులుతాయి. ఎక్కడా టెన్షన్ ఉండదు. ఉన్నంతలో హీరోయిన్ ప్లాష్ బ్యాక్ సీన్సే కాస్త నయం. కాస్తంత ఎమోషనల్ డెప్త్ తో ఉంటాయి. ముఖ్యంగా డైరక్టర్ కు స్క్రిప్ట్ పై అవగాహన లేకపోవటమో ఏమో కానీ రిపీట్ సీన్స్ అయితే కోకొల్లలు. ఇంతకి మించి ఈ సినిమాలో చెప్పుకోదగ్గ రహస్యాలు ఏమీ లేవు.
నటీనటులు, మిగతా డిపార్టమెంట్ లు..
హీరోగా నటించిన శైలేష్ లో మంచి నటుడు ఉన్నాడు. సానపడితే తెలుగుకు మంచి ఆర్టిస్ట్ దొరుకుతాడు. ఇక రితిక కూడా ఓకే..తన పరిధిలో తాను బాగానే మెప్పించింది. అద్బుతం ఆశించకపోతే ఫరవాలేదనిపిస్తుంది. మిగతావాళ్లు సోసో. ఈ సినిమా కు ఈ మాత్రం చాలు అన్నట్లు చేసుకుంటూ వెళ్లారు.
ఇక సినిమాలో సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటర్ ఈ సినిమాలో రిపీట్ సీన్స్ ని ఎడిట్ చేసినా ఓ అరగంట ప్రేక్షకుడుకి రిలీఫ్ దొరికేది. ఇక నిర్మాణ విలువలు విషయానికి వస్తే సోసోగా ఉన్నాయి.నటుడుగా రాణించిన శైలేష్... డైరక్టర్ గా సక్సెస్ కాలేదు.
ఫైనల్ థాట్
రామ సత్యనారయణ సినిమాలు చూడనివారికి ఇదేం సినిమారా అనిపిస్తుంది. ఆయన సినిమాలు పరిచయం ఉన్నవారికి స్టాండర్డ్స్ పెరిగాయే అనిపిస్తుంది.
నటీనటులు : శైలేష్ , శ్రీ రితిక, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జబర్దస్త్ ఫేమ్ అప్పారావు తదితరులు.
దర్శకత్వం : సాగర్ శైలేష్ | 0business
|
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?
Highlights
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా చిత్రం తెరకెక్కించనున్న వర్మ
లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక జరిగిన ఘటనలపై మూవీ
ఈ మూవీలో రోజాకు ప్రాధాన్యత గల పాత్ర ఆఫర్ చేస్తున్నామన్న వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదంతో రచ్చ చేస్తునే వుంటారు. ఇటు సినిమాలతోనే గాక, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ తాజాగా ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా కూడా నటిస్తుందని వర్మ ప్రకటించారు.
వర్మ ఆఫర్పై ఆర్కే రోజా సానుకూలంగా స్పందించారు. తన దర్శకత్వంలో రాబోతోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో రోజాకు అవకాశం ఇస్తానని వర్మ చెప్పిన నేపథ్యంలో రోజా కూడా పాజిటివ్ గా స్పందించింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మంచి రోల్ ఇస్తే తప్పక నటిస్తానన్నారు. వర్మ ఏ రోల్ ఇవ్వాలనుకుంటున్నారో తనకు తెలియదని ఆమె చెప్పారు. వర్మతో చర్చించాక అన్ని వివరాలూ వెల్లడిస్తానన్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రోజా ఇటీవలి కాలంలో సినిమాల్లో నటించడం లేదు. రాజకీయాలతోపాటు టీవీ షో లతో ఆమె బాగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆఫర్పై ఆమె సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించిన వర్మ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టిన తర్వాత జరిగిన పరిణామాలను సినిమాగా తీస్తానని వర్మ ప్రకటించారు. సినిమాకు వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని పలమనేరులో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఇంటికి దర్శకుడు రాంగోపాల్వర్మ వెళ్లారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ... ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన చనిపోయే దాకా జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తామన్నారు. చిత్రంలో పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరనీ నిర్ణయించలేదని తెలిపారు.
అయితే ఈ చిత్రంలో ఎమ్మెల్యే రోజాకు మాత్రం తప్పనిసరి అవకాశం ఉంటుందని వర్మ అన్నారు. ఎన్టీ రామారావు జీవిత చరిత్రపై సినిమా తీయడం తనకెంతో సంతోషమన్నారు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఎంత ఖర్చయినా భరిస్తానని నిర్మాత రాకేష్ రెడ్డి అన్నారు.
Last Updated 25, Mar 2018, 11:55 PM IST | 0business
|
వైరల్ : లీకైన మెగాస్టార్ సైరా లుక్
Highlights
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు
రీఎంట్రీలోనే బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపిన చిరు
టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే మూవీని చేస్తున్నారు చిరు.
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. రీఎంట్రీలోనే బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపిన చిరు.. తర్వాతి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైరా నరసింహా రెడ్డి అంటూ.. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే మూవీని చేస్తున్నారు చిరు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ మూవీ షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల్లో నిర్మించిన సెట్స్ లో సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని.. రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి కూడా చెప్పారు. షూటింగ్ స్పాట్ నుంచి.. సినిమా అప్ డేట్స్ లీక్ కాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ ఎలా ఉండనున్నారనే లుక్ ఒకటి బయటకు వచ్చేసింది. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి పక్క బిల్డింగ్ మీద నుంచి తీసిన ఈ లుక్ లో.. నరసింహారెడ్డి పాత్రలో చిరు లుక్ ను లీక్ చేసేస్తోంది.
ఈ ఫోటోలో ఉన్నది చిరంజీవే అని అర్ధమవుతున్నా.. మరీ అంత స్పష్టంగా లేకపోవడం ఒక్కటే సైరా టీంకు అనుకూలించే విషయం. అయితే.. టీజర్ పోస్టర్ లో చిరంజీవి లుక్ ను వెనుక నుంచి చూపించగా.. ఇప్పుడు ఈ లీక్డ్ పోస్టర్ లో మెగాస్టార్ పాత్ర రూపం ఎలా ఉండనుందనే సంగతి కొంతమేరకు తెలిసిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో సైరా లీక్డ్ లుక్ వైరల్ గా మారిపోయింది.
Last Updated 26, Mar 2018, 12:02 AM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రెండో సినిమాకే కోటిన్నర పారితోషకమా?
‘తొలిప్రేమ’ సినిమాతో కమర్షియల్ హిట్ను సొంతం చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.
Samayam Telugu | Updated:
Jun 11, 2018, 11:29AM IST
‘తొలిప్రేమ’ సినిమాతో కమర్షియల్ హిట్ను సొంతం చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ను వాడుకునే సాహసం చేసి, ఫర్వాలేదనిపించుకున్నాడు ఇతడు. వరుణ్ తేజ్ కు ‘ఫిదా’ తర్వాత మంచి హిట్టే ఇచ్చాడు. దర్శకుడిగా కూడా తన సత్తా చూపించాడు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడికి మరో యంగ్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందని సమాచారం. తొలి సినిమాతో ప్రేమకథను డీల్ చేసిన ఈ దర్శకుడు రెండో సినిమాతో అలాంటి సబ్జెక్ట్తోనే రాబోతున్నాడని, అఖిల్ను లవర్ బాయ్గా చూపబోతున్నాడని అంటున్నారు. ఇదే సమయంలో ఈ దర్శకుడి పారితోషకం విషయంలో కూడా కొత్త ప్రచారం ఊపందుకుంది.
రెండో సినిమాకే వెంకీ ఏకంగా కోటిన్నర రూపాయల పారితోషకం తీసుకొనబోతున్నాడని టాక్. తొలి సినిమా హిట్ కావడం, రెండో సినిమా అఖిల్ వంటి హీరోతో చేస్తుండటంతో ఈ దర్శకుడికి ఇలా మంచి పారితోషకమే అందుతోందట. ఏ యంగ్ డైరెక్టర్కు అయినా రెండో సినిమాకు ఇది భారీ పారితోషకమే. హిట్ ప్రభావం అంటే ఇలాగే ఉంటుందేమో! | 0business
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి | 1entertainment
|
internet vaartha 186 Views
బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలు సుమారుగా కోల్పోయిన బంగ్లాదేశ్ నిరాశలో కూరుకుపోయింది.ఎన్నో అంచనాలతో భారత్లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్,ఆస్ట్రేలియా జట్ల చేతిలో ఓడిపోయింది.షేన్ వాట్సన్, జాన్హేస్టింగ్ ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేయకుండా ఉంటే ఫలితం మరోలా ఉండేదని బంగ్లాదేశ్ కెప్టెన్ ముఫ్రాఫె మొర్తజా పేర్కొన్నాడు.విజయానికి అవసరమైన పరుగులు చేసినప్పటికి ఫీల్డింగ్లో తప్పిదాలు తమ కొంపముంచాయని మొర్తజా వివరించాడు.
అయితే ఆసీస్తో ఓటమి పాలైనప్పటికి భారత్తో జరిగే మ్యాచ్లో బాగా ఆడేందుకు అవసరమైన మానసిక ధృఢ సంకల్పం పెరిగిందన్నాడు.కాగా నేడు బంగ్లాదేశ్ జట్టు టీమిండియాతో ఆడనుంది.పాక్పై గెలిచి,భారత్ జట్టు మంచి జోరు మీదుండగా,రెండు మ్యాచ్లలో ఓడి బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించేందకు సిద్దంగా ఉంది. | 2sports
|
actress sri reddy satirical comments on rakul preet singh over manmadhudu 2
Sri Reddy: ‘రకుల్ ఐరన్ లెగ్.. మా నాగ్ బాబాయ్కి అనసూయ బెటర్’
Rakul Manmadhudu 2: కెరియర్ స్టార్ అయ్యి పదేళ్లు అవుతున్నా రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షోతోనే నెట్టికొస్తుంది తప్ప.. తనలోని పూర్తి స్థాయి నటిని బయటకు తీయలేదు. అయితే మన్మథుడు 2 చిత్రంలో కెరియర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది.
Samayam Telugu | Updated:
Aug 15, 2019, 07:54AM IST
‘మన్మథుడు 2’ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. 17 ఏళ్ల తరువాత ‘మన్మథుడు ’ చిత్రానికి సీక్వెల్గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.
Visit Site
Recommended byColombia
‘రారండోయ్ వేడుక చూద్దాం’ అంటూ నాగ్ కొడుకు నాగచైతన్య సరసన ఆడిపాడిన రకుల్.. ఈ చిత్రంతో నాగార్జునతో రొమాన్స్ చేసింది. అయితే ఈ చిత్రంలో ఆమె కెరియర్లోనే
Rakul Preet Singh
బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు కావొస్తున్నా.. స్టార్ హీరోలందరితోనూ జోడీ కట్టినా కేవలం గ్లామర్తోనే లాక్కొచ్చిన రకుల్ నటిగా పూర్తి స్థాయి పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. అయితే ‘మన్మథుడు 2’ చిత్రంలో బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చింది రకుల్.
Read Also: నా డ్రెస్ నా ఇష్టం.. సుమలా నేను కాదు.. నాలా సుమ ఉండొచ్చుగా: అనసూయ
ఇదిలా ఉంటే టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి.. తొలి నుండి రకుల్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె బాడీ షేమింగ్స్పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి మరోసారి రకుల్ టార్గెట్ చేసింది.
ఈ మధ్య నాగార్జునని బాబాయ్ అని పిలుస్తోంది శ్రీరెడ్డి. బాబాయ్ ఎలా అయ్యాడంటే.. దగ్గుబాటి అభిరామ్ (దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు) ఫ్యామిలీతో నాగార్జునకు బంధుత్వం ఉండటంతో ఇలా వరస కలిపేసుకుంది శ్రీరెడ్డి. ఈ వరసల సంగతి పక్కన పెడితే.. అభిరామ్ తనను శారీరకంగా వాడుకుని వదిలించుకున్నాడనే కోపంతో ఆ కుంటుబాన్ని టార్గెట్ చేస్తున్న శ్రీరెడ్డి పనిలో పనిగా ఆ కుటుంబంతో సంబంధం కలుపుకున్న నాగార్జునను సైతం టార్గెట్ చేసింది.
మన్మథుడు 2 చిత్రం ఆగస్టు 10 విడుదల కాగా.. ‘మా బాబాయ్ సినిమా దె**** అంటగా.. అయ్యో అంటూ బూతు పురాణం అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ని వదల్లేదు. ‘రకుల్ ప్రీత్ సింగ్ ఐరన్ లెగ్.. పాపం మా బాబాయ్ (నాగార్జున) సినిమాకి హీరోయిన్ అన్నప్పుడే డిసైడ్ అయ్యా. మన్మథుడు 2 డిజాస్టర్ అని. ఆమె కంటే అనసూయ అయితే సూపర్ హిట్ అయ్యేది’ అంటూ రకుల్ గాలి తీసేసింది శ్రీరెడ్డి.
ఈ పోస్ట్పై ‘నువ్ చెప్పింది నిజమే అక్కో.. రకుల్ వేస్ట్’ అంటుంటే.. శ్రీరెడ్డి అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది బొమ్మ’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. | 0business
|
Aug 27,2015
మొబైల్ మెసెంజర్లలో యువతదే హవా
న్యూఢిల్లీ : మొబైల్లో మెసెంజర్ యాప్లను అత్యధికంగా యుక్త వయస్సు వారే వాడుతున్నారని ఓ సర్వేలో వెల్లడయ్యింది. 'వ్యూ రీసెర్చ్ సెంటర్' అనే సంస్థ 2015 మార్చి నుంచి ఏప్రిల్ వరకు మొత్తంగా 1600 మంది ఇంటర్కెట్ వినియో గదారులపై సర్వే చేసింది. ఇందులో యు వత వాట్సాప్, స్పావ్ ఛాట్, టాక్, లైన్ తదితర యాప్స్ను ఎక్కువగా ఉపయోగిస్తున్న వారిలో యువతే ముందున్నారని తేలింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 200 Views
కోల్కతా : ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు బంగ్లాదేశ్తో తలపడింది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్లో కెప్టెన్ ధోనీ నాలుగవ స్థానంలో వచ్చి బ్యాట్ ఝులిపించాడు. దీనిపై హర్భజన్ మాట్లాడుతూ నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేయమని తానే ధోనీకి చెప్పానని పేర్కొన్నాడు.ఫైనల్ మ్యాచ్లో ధోనీ ఆరు బంతుల్లో 20 పరుగులు చేశాడు. అందులో రెండు సిక్స్లు ఉన్నాయి. విన్నింగ్ షాట్ సిక్స్తో ధోనీ భారత్ను గెలిపిం చడంతో పాటు ఆసియా కప్ దక్కేలా చేశాడు. నాలుగవ స్థానంలో వెళ్లిన ధోనీ ధాటిగా ఆడాడు. దీనిపై హర్భజన్సింగ్ మాట్లాడుతూ హార్థిక్ పటేల్ను పంపించాలనుకుంటున్నానని ధోనీ తనతో చెప్పాడని, దానికి తాను మాత్రం వద్దని చెప్పానని, ప్రపచంంలో నువ్వే బెస్ట్ పినిషర్ కాబట్టి నీవే వెళ్లాలని సూచించానని భజ్జీ పేర్కొ న్నాడు. సీనియర్ల నుంచి తాను ఎంతో నేర్చుకు న్నానని, వారి సహకారం వల్ల ఉన్నత ఆటగాడిగా ఎదిగానని,నేను జూనియర్లతో అలాగే ఉంటానని, వారికి తన అనుభవాలను షేర్ చేస్తానని, ప్రపంచ కప్ ఖచ్చితంగా గెలుచుకుంటామమని హర్భజన్ ధీమా వ్యక్తం చేశాడు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
DDCA: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి సన్మానం రద్దు..!
తొలి రెండు వన్డేల్లో భారత్, తర్వాత రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా గెలవడంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో ప్రస్తుతం సమమవగా.. బుధవారం గెలిచిన జట్టే సిరీస్ను చేజిక్కించుకోనుంది. దీంతో.. మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Samayam Telugu | Updated:
Mar 12, 2019, 02:08PM IST
DDCA: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి సన్మానం రద్దు..!
హైలైట్స్
విరాట్ కోహ్లీ సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేసిన డీడీసీఏ
బీసీసీఐ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. అదే బాటలో నడిచినట్లు వెల్లడి
ఫిరోజ్ షా కోట్లాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం ఆఖరి వన్డే
గెలిచిన జట్టుదే వన్డే సిరీస్
ఆస్ట్రేలియాతో కీలకమైన ఐదో వన్డేకి ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి సన్మానం చేయాలని నిర్ణయించిన ఢిల్లీ డ్రిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) తాజాగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకి ఐదో వన్డే జరగనుండగా.. ఈ మ్యాచ్కి ముందు విరాట్ కోహ్లీతో పాటు ఢిల్లీకి చెందిన మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్లకి సన్మానం చేయాలని డీడీసీఏ తొలుత భావించింది.
రేపే భారత్ vs ఆస్ట్రేలియా ఆఖరి ఫైట్.. కోట్లాలో లెక్కలివే
కానీ.. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల ఐపీఎల్ 2019 ప్రారంభోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించినందున.. తాము కూడా ఈ సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు డీడీసీఏ వెల్లడించింది. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. దీంతో.. ఐపీఎల్ 2019 ప్రారంభోత్సవ వ్యయాన్ని అమర జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం బీసీసీఐ విరాళంగా ప్రకటించగా.. డీడీసీఏ కూడా రూ. 10 లక్షలు ఢిల్లీ పోలీసుల సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.
తొలి రెండు వన్డేల్లో భారత్ , తర్వాత రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా గెలవడంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో ప్రస్తుతం సమమవగా.. బుధవారం గెలిచిన జట్టే సిరీస్ను చేజిక్కించుకోనుంది. దీంతో.. మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Allu Arjun: అల్లు అర్జున్ ‘ఓకే’ చెప్పిన చిత్రానికి ‘నో’ చెప్పిన సమంత!
ఆ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయొద్దని, ఆ పాత్ర తాను చేయబోనని చెప్పిన సమంతనే.. ఇప్పుడు ఆ పాత్రలో నటించాలని కోరుతున్న దర్వక నిర్మాతలు.
Samayam Telugu | Updated:
Nov 16, 2018, 10:07PM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , నిర్మాత దిల్ రాజుల కాంబోలో త్వరలో మరో చిత్రం రాబోతున్నట్లు తెలిసింది. ఇటీవల తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘96’ సినిమాను తెలుగులో బన్నీ హీరోగా రీమేక్ చేయాలని భావిస్తున్నారు. విజయ్ సేతుపతి, త్రిషా జంటగా రూపొందిన ఈ హిట్ చిత్రం రీమేక్ హక్కులను నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
ఇందులో త్రిషా పాత్ర కోసం నిర్మాతలు సమంతను సంప్రదించినట్లు తెలిసింది. అయితే, ఇటీవల సమంత ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ.. దీన్ని తెలుగులో రీమేక్ చేయకూడదని తెలిపింది. త్రిషా పాత్రలో తాను నటించబోనంది. దీంతో, ఆమె ఈ సినిమాకు అంగీకరిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. తెలుగులో రీమేక్ చేసే ఈ చిత్రంలో ఇక్కడి ప్రేక్షకులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేయాలని దర్శకుడు ప్రేమ కుమార్కు బన్నీ సూచించినట్లు సమాచారం. దీనిపై దర్శక నిర్మాతల నుంచి ఇంకా స్పష్టత రావల్సి ఉంది. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రానికి సమంత ‘నో’ చెబితే.. ఆ అవకాశం ఎవరిని వరిస్తుందనే చర్చ జరుగుతోంది. | 0business
|
ఖతర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్లో
సానియా, మార్టినా పరాజయం
వరుస విజయాలకు బ్రేక్
దోహా : ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్లో సానియా, మార్టినాలు పరాజయం పొందారు. ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్ నెంబర్ వన్ జోడి చరిత్రకు మరికొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ఓటమితో మహిళల డబుల్స్లో 41 వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. క్వార్టర్స్లో సానియా, మార్టినా 2-6,6-4,10-5 తేడాతో రష్యాకు చెందిన ఎలినా వెస్నినా-డారియా కసాట్కినా చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 13 టోర్నమెంట్లలో ఓటమి అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్-స్విస్ జోడీకి పెద్ద షాక్ తగిలింది. 1994 తరువాత వరుసగా ఎక్కువగా 28 మ్యాచ్లు గెలిచిన రికార్డును మాత్రమే అందుకున్న సానియా-మార్టినా 1990లో జానా నవోత్సా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్ల రికార్డును చేధించే క్రమంలో కేవలం కొన్ని అడుగుల దూరంలో వెనుదిరిగారు. దీంతో సానియా, మార్టినాలు మహిళల డబుల్స్లో అత్యధిక వరుస విజయాల రికార్డును మూడవ స్థానంలో సరిపెట్టుకున్నారు.
కాగా మహిళల డబుల్స్లో ప్రపంచ రికార్డు టార్గెట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. 1983-85 మధ్య కాలంలో మార్టినా నవ్రతిలోవా- పామ్ ప్రిమర్లు వరుసగా 109 మ్యాచ్ల్లో నెగ్గడం ఆల్ టైం రికార్డుగా ఉంది. | 2sports
|
SENSEX
మార్కెట్లపై బ్రెగ్జిట్ ప్రకంపనలు
ముంబై, జనవరి 17: బెంచ్మార్క్ సూచీలు గురువారం దిగువస్థాయిలోనే ముగిసాయి. యూరోపియన్ మార్కెట్లు బ్రిటన్బ్రెగ్జిట్ ఆధారంగా బ్రిటన్ ప్రధాని థెరిస్సామే ప్రసంగం కీలకంగా మారడంతో ఐరోపా మార్కెట్లు క్షీణించాయి. ఇన్వెస్టర్లు థెర్సి ప్రసంగంపైనే ఎక్కు వ ప్రాధాన్యతనిచ్చారు. బ్రిటన్ వలస విధానాలు మరింత సంక్లిష్టంగా మారడంతో కొంతవరకూ బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కు విఘాతం కలిగిస్తాయని మార్కెట్నిపుణుల అంచనా. మార్కెట్లు ప్రారంభంలో గరిష్టస్థాయిలోనే ప్రారంభం అయి నా జిఎస్టి అమలులో కేంద్ర రాష్ట్రాలమధ్య ఏకాభిప్రాయ సాధనకు రాకపోవడం కొంత సెంటి మెంట్నుప్రభావితంచేసింది. బిఎస్ఇ సెన్సెక్స్ 27,235 పాయింట్ల వద్ద స్థిరపడింది. 52 పాయింట్లు క్షీణిస్తే నిఫ్టీ 50సూచి 15 పాయింట్లు క్షీణిం చి 8400వద్ద స్థిరపడింది. బిఎస్ఇ స్మాల్క్యాప్, 0.3శాతం పెరిగితే మిడ్క్యాప్సూచి స్థిరంగా ఉంది. మార్కెట్లలో ప్రత్యేకించి బిఎస్ఇలో 1379 కంపెనీలు క్షీణించాయి.
1365 కంపెనీ లు స్వల్పంగా పెరిగితే 177 కంపెనీల వాటాల్లో ఎలాంటి మార్పులులేవు. సెన్సెక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ నష్టపోయింది. 3.5శాతం క్షీణించి 1039వద్ద స్థిరపడింది. టెలికాం యూనిట్పై ఎక్కువ వ్యయాలే ఇందుకుకీలకం. కంపెనీ పదిశాతం వార్షిక వృద్ధిచొప్పున నికరలాభం 8022 కోట్లుగాప్రకటించింది. కొత్త పెట్రోకెమికల్ బిజినెస్ ఎక్కువ ఆదాయవనరులు తెచ్చిందని కంపెనీప్రకటించింది. ఫోర్టిస్ హెల్త్కేర్ 2.4శాతం దిగజారింది. డైచి శాంక్యో ఢిల్లీ హైకోర్టు లో పిటిషన్ వేసి మాజీరాన్బాక్సీ ల్యాబ్ప్రమోటర్లు మల్వీం దర్, శివేందర్సింగ్లను వాటాలు విక్రయించకుండా ఉత్తర్వు లు జారీచేయాలని కోరింది. ఫోర్టిస్ హెల్త్కేర్లో తమ వాటా వివాదంపై 2500 కోట్లు మధ్యవర్తిత్వం కేసును దాఖలు చేసింది. లాభాపరంగాచూస్తే రవాణా కంపెనీలషేర్లు వరు సగా రెండోరోజు పెరిగాయి. జిఎస్ఇ మండలిపరంగా చూస్తే పాలనాపరమైన నియంత్రణ ఇతర అంశాలు ఒక కొలిక్కి రాకపోవడంతో జిఎస్టి అమలు జూలై ఒకటికి వాయిదా పడింది.
ఇక రవాణసంస్థలపరంగా గతి, పటేల్ ఇంటిగ్రేటెడ్, స్నోమాన్, ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్కార్గో లాజి స్టిక్స్, సికాల్ లాజిస్టిక్స్, గేట్వే డిస్ట్రిపార్క్స్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ 1నుంచి 5శాతం పెరి గాయి. కెపి ఎనర్జీ47శాతంపెరిగింది. కంపెనీ బోనస్ షేర్ల జారీని పరిశీలిస్తోంది. ఏసియన్ ఆయిల్ఫీల్డ్ సర్వీసెస్ 3.5శాతంపెరిగింది. కంపెనీకి ఆయిల్ ఇండియా నుంచి 142.86 కోట్ల కాంట్రాక్టు లభించింది. ఇక యూరోపియన్షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. గనులు, ఆట ోమొబైల్ మార్కెట్లు క్షీణించాయి. బ్రిటన్బ్రెగ్జిట్ప్రభావమే ఇందుకు కీలకం. యూరోపియన్ స్టాక్స్సూచి 0.5శాతం క్షీణించింది. బ్లూచిప్ ఎఫ్టిఎస్ఇ తన నష్టాలను కొనసాగిం చింది. 0.4శాతం క్షీణించింది. ఆసియా మార్కెట్లపరంగా చూస్తే చైనా షాంఘై కాంపోజిట్ స్వల్పంగా పెరిగింది. హాంకాంగ్ హ్యాంగ్షెంగ్సూచి, తైవాన్టిఎస్ఇసి 0.5శాతం, 0.7శాతంగా ఉంది. జపాన్ నిక్కీ 1.5శాతం నష్టపోయింది. | 1entertainment
|
పవన్ మామ వెరీ కేరింగ్
Sep 22, 2015, 12.45 PM IST
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్, యంగ్ ఎనర్జిటిక్ లేడీ రెజినా జంటగా తెరకెక్కిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ రిలీజ్కి దగ్గర పడింది. తాజాగా సెన్సార్ కార్పక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ లభించింది. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో సినిమాని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డాడు సాయిధరమ్ తేజ్. ఈ నేపథ్యంలోనే మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సాయిధరమ్.. పనిలోపనిగా ముగ్గురు మామయ్యలతో తనకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. హార్లే డేవిడ్సన్ బైకు కొన్నానని తెలిసినప్పుడు తనకి పోన్ చేసిన పవన్ మామ.. మొదటిగా ఓ హెల్మెట్ కొనుక్కోమని అడ్వైజ్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు సాయిధరమ్. కొత్తగా కొన్న బైక్పై ఎప్పుడు బయటికెళ్లినా ఆ హెల్మెట్ ధరించే వెళ్లమని పవన్ మామ సూచించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన తన పట్ల అంత కేరింగ్గా వుంటాడని ఆనందం వ్యక్తంచేశాడు సాయిధరమ్. | 0business
|
Visit Site
Recommended byColombia
‘బీసీసీఐ నుంచి లెటర్ని మేము అందుకున్నాం. అందులో.. మహ్మద్ షమీ గత ఫిబ్రవరి 17, 18న దుబాయ్లోనే ఉన్నట్లు స్పష్టంగా ఉంది. ఇక ఈ కేసుకి సంబంధించిన మిగతా అంశాలపై విచారణ కొనసాగిస్తాం’ అని జాయింట్ సీపీ (నేర విభాగం) ప్రవీణ్ త్రిపాఠి మీడియాతో వెల్లడించారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ముగియగానే.. వన్డే, టీ20 జట్టులో తాను లేకపోవడంతో సుదీర్ఘ పర్యటన మధ్యలోనే మహ్మద్ షమీ భారత్కి వచ్చేశాడు. అయితే.. ఈ ప్రయాణం మధ్యలోనే అతను దుబాయ్కి వెళ్లినట్లు అతని భార్య ఆరోపించడంతో.. పోలీసులు వివరాల కోసం బీసీసీఐకి లేఖ రాశారు. ఈ పర్యటన ఖర్చు బీసీసీఐ భరించిందా..? లేదా మహ్మద్ షమీనే పెట్టుకున్నాడా..? అనే వివరాలను మాత్రం తెలియరాలేదు.
దుబాయ్లో షమీతో గడిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మహిళ అలిష్బా కూడా సోమవారం స్పందించిన విషయం తెలిసిందే. ‘మహ్మద్ షమీని నేను దుబాయ్లో కలిసిన మాట వాస్తవమే. అక్కడ నా సోదరి ఉంటుండటంతో.. నేను తరచూ దుబాయ్ వెళ్తుంటా. గత ఏడాది ఓ అభిమానిగా షమీతో పరిచయం ఏర్పడింది. అనంతరం చాట్ ద్వారా స్నేహితురాలినయ్యా. అలా పరిచయంలో భాగంగానే.. దుబాయ్లో అతను ఉన్నాడని తెలుసుకుని వెళ్లి.. కలిసి టిఫిన్ తిన్నాం. మా మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు’ అని అలిష్బా స్పష్టం చేసింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Oct 27,2018
అంబానీపౖౖె కోర్టుకెక్కిన 24 సంస్థలు!
న్యూఢిల్లీ: చట్టంలోని లొసుగు లను ఆసరాగా చేసుకొని వ్యాపా రాన్ని విస్తరిం చుకుందా మనుకున్న రిలయన్స్ కమ్యూని కషన్స్ అధినేత అనిల్ అంబానీకి ఆర్థిక కష్టాలు అంతకంతకు పెరుగు తున్నాయి. ఇటీవలే సుప్రీకోర్టు ఎరిక్సన్ సంస్థకు రూ.550 కోట్ల బకాయిలను పూర్తిగా డిసెంబ రులోగా చెల్లించండంటూ అంబానీకి ఆదేశాలను జారిచేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఎటూ తేలక ముందే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్కు వ్యతిరేకంగా పేటీఎం సహా 24 ప్రముఖ సంస్థలు న్యాయస్థానం తలుపు తట్టాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం నుంచి తమకు రావాల్సిన సొమ్మును వెంటనే ఇప్పించాలని కోరుతూ 'నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్'ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించాయి. వీటిలో 11 సంస్థలకు గతంలో ఆర్కామ్ ఒక సామరస్యపూర్వక పరిష్కారం చూపగా.. ఇంత వరకూ వాటికి రుణాల తాలుకు సొమ్మును చెల్లించలేదు. కొన్ని రుణ వివాదాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 13 సంస్థలకు బాకీ చెల్లింపునకు అంబానీ ఇంతవరకూ ఏ పరిష్కారమే చూపలేదని ఓ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. కోర్టును ఆశ్రయించిన సంస్థల్లో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, అసెండ్ టెలికాం, గతి లిమిటెడ్, లక్ష్యా మీడియా, సిస్కామ్ కార్పొరేషన్ సహా 24 సంస్థలు ఉన్నాయి. పేరుకుపోయిన సుమారు రూ.45 వేల కోట్ల బరాయినలు తీర్చేందుకు గతేడాది ఆర్కామ్ వ్యూహాత్మక రుణ చెల్లింపు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆర్కామ్కు చెందిన వైర్లెస్ స్పెక్ట్రమ్, టవర్లు, ఫైబర్నెట్, మీడియా సంస్థలను సోదరుడు ముఖేష్ అంబానీకి చెందిన జియోకు విక్రయించాల్సి ఉంది. అయితే వీటికి నియంత్రణ సంస్థల నుంచి పూర్తిస్థాయి అనుమతులు లభించాల్సి ఉంది. దీని ద్వారా సమకూరిన నిధులను రుణదాతలకు చెల్లించాల్సి ఉంది. కానీ రూ.3 వేల కోట్ల విలువైన ఆప్టికల్ ఫైబర్ ఆస్తులు, రూ.2 వేల కోట్ల ఇతర మీడియా ఆస్తులు మాత్రమే విక్రయించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
రంగస్థలం షాకింగ్ సెన్సార్ రిపోర్ట్
Highlights
రంగస్థలం షాకింగ్ సెన్సార్ రిపోర్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న భారీ చిత్రం రంగస్థలం. మార్చి 30న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. తాజాగా రంగస్థలం చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ - శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి సూపర్హిట్ చిత్రాల తర్వాత మా బ్యానర్లో రూపొందుతోన్న మోస్ట్ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ రంగస్థలం. రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో మాస్ యాక్టింగ్, సమంత గ్లామర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందనడంలో సందేహం లేదు. విలక్షణమైన కథలు, క్యారెక్టరైజేషన్స్ను తెరపై సిద్ధహస్తుడైన దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఉత్కంఠ రేపుతున్న రంగస్థలం ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలే ఆయనేంటో చెబుతాయి. మరోసారి తనదైన స్టయిల్లో విలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమాను సుకుమార్గారు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. రామ్ చరణ్, సమంత ఇంతకు ముందెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలు చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, రత్నవేలు సినిమాటోగ్రపీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి.
మా చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ వారు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. మార్చి 30న వరల్డ్వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం మా బ్యానర్ వాల్యూను పెంచడమే కాకుండా మా సంస్థకు హ్యాట్రిక్ హిట్ను అందించే చిత్రమవుతుంది అన్నారు. రామ్ చరణ్, సమంత, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్, ఆది పినిశెట్టి, అనసూయ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి, సాహిత్యం: చంద్రబోస్, ఫైట్స్: రామ్లక్ష్మణ్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సి.వి.ఎం), దర్శకత్వం: సుకుమార్.
Last Updated 26, Mar 2018, 4:33 PM IST | 0business
|
Ravi Narayan
ఎన్ఎస్ఇ వైస్ఛైర్మన్ రాజీనామా!
న్యూఢిల్లీ, జూన్ 3: నేషనల్ స్టాక్ఎక్ఛేంజిలో ఆల్గోరిథమ్ ట్రేడింగ్ కుంభకోణం కేసుపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తాజాగ ఆఎన్ఎస్ఇ వైస్ఛైర్మన్ రవినారాయణ్ పదవినుంచి తప్పు కుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఇ బోర్డుకు రాజీనామా సమ ర్పించారని ట్రేడింగ్ వర్గాలు చెపుతున్నాయి. ఆల్గో రిథమ్ ట్రేడింగ్ కుంభకోణం నిజాయితీగాను, పారదర్శకంగాను దర్యాప్తు జరిగేందుకే రవినారాయణ్ పదవినుంచి తప్పుకున్నా రన్న వార్తలు వెలువడుతున్నాయి. ఆల్గోస్కామ్లో నారాయణ్ ఎక్ఛేంజి ఎండి సిఇఒగా వ్యవహరించారు. మార్కెట్ల నియం త్రణ సంస్థ సెబి నుంచి జూన్ ఒకటవ తేదీ నారాయణ్ షోకాజ్ నోటీస్ అందుకున్నారు. దీనితో నారా యణ్ పదవినుంచి తప్పుకుంటున్నట్లు తన నిర్ణయాన్ని ఎక్ఛేంజి బోర్డుకు వెల్లడించారని తెలుస్తోంది. | 1entertainment
|
Hyderabad, First Published 29, Oct 2018, 10:12 AM IST
Highlights
బాహుబలి అనంతరం చాలా ఇండియన్ సినిమాలు చైనా లో రిలీజ్ అవుతున్నాయి. అక్కడ సక్సెస్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ఏ తెలుగు సినిమా చైనా మార్కెట్ టార్గెట్ పెట్టుకోలేదు కానీ ...బాలీవుడ్ మాత్రం ప్రతీ సారి అక్కడ తన ప్రతిభను పరిచయం చేయటానికి ఉత్సాహం పడుతుంది. పనిలో పనిగా పైసలు వెనకేసుకుంటోంది.
బాహుబలి అనంతరం చాలా ఇండియన్ సినిమాలు చైనా లో రిలీజ్ అవుతున్నాయి. అక్కడ సక్సెస్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ఏ తెలుగు సినిమా చైనా మార్కెట్ టార్గెట్ పెట్టుకోలేదు కానీ ...బాలీవుడ్ మాత్రం ప్రతీ సారి అక్కడ తన ప్రతిభను పరిచయం చేయటానికి ఉత్సాహం పడుతుంది. పనిలో పనిగా పైసలు వెనకేసుకుంటోంది. చైనావాళ్లు సైతం మెల్లిమెల్లిగా మన సినిమాలకు, మన ముఖాలకు అలవాటు పడుతున్నారు. దాంతో అక్కడ వంద కోట్లు దాటుతున్నాయి. అలాంటి మరో సినిమా రాణి ముఖర్జీ నటించిన ‘హిచ్కీ’.
ఈ సంవత్సరం మార్చిలో రిలీజైన ‘హిచ్కీ’ చిత్రం విమర్శకుల ప్రశంసలు సాధించింది. ఇక్కడ మనదేశంలో ఈ చిత్రం రూ. 76 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల ప్రక్కన నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
చైనాలో ఈ నెల 12న విడుదలయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, 100 కోట్ల మార్క్ను దాటేసినట్లు అఫీషియల్ బాలీవుడ్ ట్రేడ్ వార్త. ఈ విషయాన్ని రాణి ముఖర్జీ సైతం మీడియాకు తెలిపారు. విషయం ఉన్న సినిమాకు భాషతో, ప్రాంతంతో సంబంధం లేదని ‘హిచ్కీ’ మరోసారి నిరూపించిందని ఆమె పేర్కొన్నారు.
సిద్థార్థ్ మల్హోత్రా దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో రాణిముఖర్జీ టౌరెట్టీ సిండ్రోమ్ సమస్య ఉన్న టీచర్ పాత్రలో నటించింది. ఈ సమస్యతో ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్నపుడు మధ్య మధ్యలో చక్..చక్ అంటూ వింత శబ్దాలు చేస్తుంటారు. రాణీ ముఖర్జీ నైనామాథుర్ అనే టీచర్ పాత్రలో కనిపిస్తుంది. టీచర్ కావాలనే బలమైన లక్ష్యం...కానీ నోరు తెరచి ఏ మాట్లాడినా వింత శబ్దాలు చేసే జబ్బు... ఆ సమస్యను దాటుకొని లక్ష్యం చేరుకునే మహిళ నైనా మాథుర్ పాత్రలో ఆకట్టుకున్నారు.
ఇంతకు ముందు ఛైనా భాక్స్ ఆఫీస్ వద్ద...అమిర్ ఖాన్ ‘ధూమ్3’, ‘దంగల్’, ‘పీకే’, ‘సీక్రెట్ సూపర్ స్టార్స్’, సల్మాన్ ఖాన్ ‘బజరంగి భాయిజాన్’ సినిమాలు విజయాన్ని సాధించాయి. | 0business
|
dhoni inaugurates his first global cricket academy in uae
ధోనీ తొలి క్రికెట్ అకాడమీ ప్రారంభం
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నిర్ణయాలు ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి.
TNN | Updated:
Nov 12, 2017, 09:02AM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నిర్ణయాలు ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. టెస్టులకు ఆయన రిటైర్మెంట్.. వన్డే, టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం ఇలా అతని ప్రతి నిర్ణయంతో క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. సాధారణంగా ఆటకు గుడ్‌బై చెప్పిన చాలా మంది క్రికెటర్లు తమ పేరిట అకాడమీలు ప్రారంభించారు. కానీ ధోనీ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతూనే అకాడమీని మొదలుపెట్టాడు. అది కూడా భారత్‌లో కాదు.. తన తొలి క్రికెట్ అకాడమీని దుబాయ్‌లో ప్రారంభించాడు.
దుబాయ్‌లోని అల్‌ క్వాజ్‌ ప్రాంతంలోని స్ప్రింగ్‌డేల్స్‌ పాఠశాలలో ఈ అకాడమీని శనివారం ప్రారంభించారు. స్వయంగా ధోనీనే ఈ అకాడమీని ఆవిష్కరించాడు. దుబాయ్‌కి చెందిన పసిఫిక్‌ స్పోర్ట్స్‌, భారత్‌కు చెందిన ఆర్కా స్పోర్ట్స్‌ అనే రెండు క్లబ్బులు కలిసి ధోని భాగస్వామ్యంతో ఈ అకాడమీని ఏర్పాటు చేశాయి. దీనికి ‘ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ’ ( MSDCA ) అని పేరు పెట్టారు. దీని ఏర్పాటుకు సుమారు రెండు నెలలు తీవ్రంగా శ్రమించారు. మరో రెండు నెలల్లో ఈ అకాడమీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. | 2sports
|
bse
వారంలో నష్టాల బోణీ
ముంబై, డిసెంబరు 12: రెండురోజుల లాభాల ట్రేడింగ్కు గండికొడుతూ మార్కెట్లు స్వల్పనష్టా లకు గురయ్యాయి. సెన్సెక్స్ 232 పాయింట్లు దిగువన 26,515 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచీ 8170వద్ద స్థిరపడింది. 91 పాయింట్లు క్షీణించింది. మార్కెట్లపరంగాచూస్తే బిఎస్ఇలో 1529 కంపెనీలు దిగజారితే 1103 కంపెనీలషేర్లు పెరి గితే మరో 146కంపెనీల షేర్లు స్థిరంగా ఉన్నాయి. బిఎస్ఇలో ఆటో సూచి ఎక్కువ నష్టపోయింది. 1.73శాతం దిగజారింది. ఐషర్మోటార్స్, అమర్రాజా బ్యాటరీస్, కుమ్మిన్స్ ఇండియా, బజాజ్ ఆటో వంటివి ఎక్కువ నష్టాల్లో ఉన్నాయి. ఏసియన్ పెయింట్స్ 3.15 శాతం,యాక్సిస్బ్యాంకు 2.58శాతం, బజాజ్ ఆటో 2.52శాతం, టాటామోటార్స్ 2.05శాతం సెన్సెక్స్లో ఎక్కువ నష్టపోయాయి. ఐటిరంగ కంపెనీలు కూడా తమ నష్టాలను కుదించుకున్నాయి. విదేశీ వర్కర్లకు వీసా నిబంధనలు దుర్వినియోగం అయితే ఆ కంపెనీలను నిలిపివేస్తామన్న ట్రంప్ ప్రకటనతో కొంతమేర ఒత్తిళ్లకు లోనయిన సంగతి తెలిసిందే.
ఇన్ఫోసిస్ 2.44శాతం, టిసిఎస్ 1.47 శాతం, విప్రో 1.44శాతం చొప్పున క్షీణించాయి.
ఎంపిక చేసిన మిడ్క్యాప్, చిన్న ఐటికంపెనీలు లాభా లకు మళ్లాయి. 20శాతం వరకూ పెరిగినట్లు అంచ నా. రోల్టా ఇండియా, అల్లీడ్ డిజిటల్ సర్వీసెస్, ఇంటెన్స్ టెక్నాలజీస్, ఔరియాన్ప్రొ సొల్యూషన్స్, డిలింక్, స్మార్ట్లింక్ నెట్వర్క్క సిస్టమ్స్, టివిఎస్ ఎలక్ట్రానిక్స్, బార్ట్రోనిక్స్ ఇండియా వంటివి 10నుంచి 20శాతంపెరిగాయి. బిఎస్ఇ ఇంట్రాడే మార్కెట్ లో స్మార్ట్లింగ్నెటవర్క్, బ్రార్ట్రోనిక్స్ ఇండియా, టివిఎస్ ఎలక్ట్రానిక్స్, తాన్లా సొల్యూషన్స్, డేటా మేటిక్స్గ్లోబల్, హెచ్సిఎల్ఇన్షోసిస్టమ్స్, ఐటి సాప్ట్వేర్ వంటివి హార్డ్వేర్ కంపెనీలు 52 వారాల గరిష్ట స్థాయికి చేరాయి. చమురు రిటైల్ కంపెనీలు భారీ ఎత్తున పెరగనున్న ముడిచమురుధరల కారణంగా కొంత ఒత్తిడికి గురయ్యాయి. బిపిసిఎల్ 2.51శాతం, ఐఒసి 2.23శాతం దిగజారాయి. అయితే ఒఎన్ జిసి మాత్రం 2.54శాతం పెరిగింది. ముడిచమురుధరల పెరుగుదల తమకు లాభిస్తుందన్న అంచనా లున్నాయి. విదేశీ మార్కెట్లపరంగాయూరోపియన్ స్టాక్స్ రాజకీయ అనిశ్చితితో సతమతం అయ్యాయి. అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్ల పెంపు ప్రభావం ఉంటుందని ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఆసియా మార్కెట్లపరంగాచూస్తే మిశ్రమంగా ఉంది. నిక్కీ225 0.84శాతం గరిష్టంగా ముగిసింది. జపాన్ అక్టోబరు కీలకమెషినరీ ఆర్డర్లు మొదటిసారిగా పెరిగాయి. చైనా స్టాక్స్ గడచిన ఆరునెలల్లో ఎన్నడూలేని విధంగా దెబ్బతిన్నాయి. బ్లూచిప్ కంపెనీలు తాజా ప్రభుత్వ ఆంక్షలతో దిగజారాయి. బీమా కంపెనీలు జోరుగా పెట్టుబడులు పెట్టడంపై ఆంక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాండ్లరాబడులు పెరగడంతో ఈక్విటీ మార్కెట్లలో ఎక్కువ అమ్మకాలు జరిగాయి. బ్లూచిప్ సిఎస్ఐ3-00 సూచి 2.4శాతం దిగజారింది. షాంఘై కాంపోజిట్ సూచి 2.5శాతం నష్టపోయింది. హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ సూచి 1.4శాతం దిగజారింది. మొత్తం మీద రెండురోజుల లాభాలు వారం మొదటిరోజునే ఆవిరి అయ్యాయని ఇన్వెస్టర్లు కలవరం వ్యక్తం చేశారు. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
2019లో టీమిండియానే విశ్వవిజేత..!
భారత్ జట్టు ప్రస్తుతం సమష్టి కృషితో విజయాలు సాధిస్తోంది.. ఈ జోరు ఇలానే కొనసాగితే 2019 ప్రపంచకప్ని అలవోకగా
TNN | Updated:
Aug 21, 2017, 03:51PM IST
భారత్ జట్టు ప్రస్తుతం సమష్టి కృషితో విజయాలు సాధిస్తోంది.. ఈ జోరు ఇలానే కొనసాగితే 2019 ప్రపంచకప్‌ని అలవోకగా సాధిస్తుందని స్పిన్నర్ అక్షర్ పటేల్ ధీమా వ్యక్తం చేశాడు. శ్రీలంకతో ఆదివారం ముగిసిన తొలి వన్డేలో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్ 3/34తో టీమిండియా విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. ఇటీవల భారత్-ఎ జట్టు తరఫున అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో చివరి టెస్టు‌కి రవీంద్ర జడేజా స్థానంలో సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. ఆ టెస్టు తుది జట్టులో మాత్రం అక్షర్ చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే.. తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్‌ని బెంచ్‌కి పరిమితం చేసి కోహ్లి.. అక్షర్‌కి అవకాశమిచ్చాడు.
‘ప్రస్తుత భారత్ జట్టులో గొప్ప విషయం ఏంటంటే..? ఈ జట్టు ఏ ఒక్కరిపైనా ఆధారపడకుండా సమష్టిగా రాణిస్తోంది. లంకతో తొలి వన్డేలో ఇది మరోసారి నిరూపితమైంది. సిరీస్‌లో మిగిలిన నాలుగు వన్డేల్లోనూ ఇదే ఆటతీరు కనబరుస్తాం. జట్టులో చాలా మంది యువకులు ఉన్నారు. అందరి సరాసరి వయసు.. 26-27గా ఉంది. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా అందరం కలిసి సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నాం. ఈ జట్టు కచ్చితంగా 2019 ప్రపంచకప్‌ని గెలుస్తుంది’ అని అక్షర్ ధీమా వ్యక్తం చేశాడు. రెండో వన్డే పల్లెకలె వేదికగా గురువారం జరగనుంది. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Hyderabad, First Published 9, Apr 2019, 3:46 PM IST
Highlights
ఇప్పుడు సమంత వారికి లక్ష్మి దేవిలా ఒక మంచి సక్సెస్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మజిలీ సినిమా సక్సెస్ లో ఆమె పాత్ర చాలానే ఉంది.
అక్కినేని హీరోలు హిట్టు చూసి చాలా కాలమవుతోంది. కోడలు సమంత వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటుంటే హీరోలంతా వరుస ప్లాపులతో సతమతమయ్యారు. అయితే ఇప్పుడు సమంత వారికి లక్ష్మి దేవిలా ఒక మంచి సక్సెస్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మజిలీ సినిమా సక్సెస్ లో ఆమె పాత్ర చాలానే ఉంది.
రారొండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత యుద్ధం శరణం - శైలజా రెడ్డి అల్లుడు - సవ్యసాచి వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అంతకుముందే సమంత చైతుకి తనద్వారా ఒక మంచి హిట్టివ్వాలని నిర్ణయం తీసుకుంది. కథల కోసం వెతుకుతున్న తరుణంలో నిన్నుకోరి దర్శకుడు చెప్పిన మజిలీ కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సినిమా స్టార్టింగ్ టూ ఎండింగ్ సమంత ప్రతి విషయంలో కేర్ తీసుకుంది. తనకు సంబందించిన సీన్స్ కాకున్నా షూటింగ్ లో ఉంటూ దర్శకుడితో ప్రతి సీన్ గురించి డిస్కర్స్ చేసిందట. సీన్ లో తేడా కొడితే వెంటనే దర్శకుడితో మరోసారి రీ షూట్ చేయించిందట. అన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే నేడు సమంత మజిలీ సినిమాతో భర్తకే కాకుండా అక్కినేని ఫ్యామిలీ కి కూడా మంచి హిట్ ఇచ్చిందని చెప్పవచ్చు.
అఖిల్ - నాగ్ గత సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా మజిలీ తో అమ్మడు అక్కినేని ఫ్యామిలిలో ఒక పెద్ద పండగ తెచ్చింది.
Last Updated 9, Apr 2019, 3:46 PM IST | 0business
|
VIJENDAR
బాక్సర్ ఫ్ర్రాన్సిస్ చెకాతో డిసెంబర్ 17న విజేందర్ బౌట్
న్యూఢిల్లీ: పరాజయం లేకుండా ముందుకు దూసుకుపోతున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ తన ప్రొఫెషనల్ కెరీర్లో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోబోతున్నాడు.ప్రపంచ మాజీ చాంపి యన్, ప్రస్తుత ఖండాంతర ఛాంపియన్ అయిన టాంజానియా బాక్సర్ ప్రాన్సిస్ చెకాతో తలపడ బోతున్నాడు.కాగా ఈ భారీ బౌట్ ఢిల్లీలో డిసెం బర్ 17న జరుగుతుంది.కాగా 34 సంవత్సరాల ఈ సీనియర్ టాంజానియా బాక్సర్ తలపడిన 43 బౌట్లలో 32 విజయాలు సాధించాడు.వీటిలో 17 నాకౌట్లు ఉండటం విశేషం.ఇక విజేందర్ విషయానికి వస్తే అపజయాలు ఎరుగని ధీరునిగా భారత ప్రొఫెషనల్ బాక్సింగ్లో దూసుకెళ్తు న్నాడు. విజేందర్ ఇప్పటి వరకు తలపడిన 7 బౌట్లలో వరుసవిజయాలతో జోరు మీదున్నాడు.వీటిలో ఆరు నాకౌట్లు న్నాయి. చెకా అనుభవజ్ఞుడైన బాక్సర్ ఎన్నో బౌట్లలో విజయం సాధించాడు. అయితే ఇవేమీ నన్ను వెనక్కితగ్గేలా చేయవు,నేను అతని స్థాయికి చేరేం దుకు చాలా కఠిన శిక్షణను పొందు తున్నాను. తప్ప కుండా మరో విజయం సాధిస్తా అని విజేందర్ పేర్కొన్నాడు. భారత్తో జరిగే ఈ పోరులో గతం లో మాదిరిగానే తనకు భారీగా అభిమానుల మద్దతు లభిస్తుం దని, విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు వెల్లడించాడు. కాగా తాను గెలుచుకున్న డబ్ల్యూ బిఓ సూపర్ మిడిల్ వెయిట్ ఆసియా పసిఫిక్ టైటిల్ను నిలబెట్టుకుంటానని ధీమాగా చెబుతున్నాడు. మరోవైపు విజేందర్ను మట్టి కరిపిస్తానని చెకా మాటల యుద్ధానికి దిగుతున్నాడు | 2sports
|
పాటలు పాడి స్టెప్పులేయిచ్చిన స్టార్ యాక్టర్స్
First Published 18, Mar 2019, 5:06 PM IST
యాక్టింగ్ లోనే కాకుండా అప్పుడపుడు మంచి పాటలు పాడి మెప్పించగలమని మన యాక్టర్స్ నిరూపించారు. వారిపై ఓ లుక్కేద్దాం.. పదండి.
యాక్టింగ్ లోనే కాకుండా అప్పుడపుడు మంచి పాటలు పాడి మెప్పించగలమని మన యాక్టర్స్ నిరూపించారు. వారిపై ఓ లుక్కేద్దాం.. పదండి.
ఎన్టీఆర్: తెలుగు జాతి మనది (తల్లా పెళ్లామా మూవీ)
చిరంజీవి: మృగరాజు సినిమాలో ఛాయ్ పాట.. మాస్టర్ లో అరె తమ్ముడు సాంగ్..
జూనియర్ ఎన్టీఆర్: కంత్రి - నాన్నకు ప్రేమతో - కంత్రి - రభస, యమదొంగ, అదుర్స్ ఇలా తన సినిమాల్లోనే కాకుండా కన్నడ హీరో పునీత్ కోసం చక్ర వ్యూహ సినిమాలో గెలయా గెలయా అనే పాట కూడా పాడాడు.
పవన్ కళ్యాణ్: బిట్ సాంగ్స్ లోనే పవర్ స్టార్ మాస్ ఆడియెన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేశారు తమ్ముడు - జానీ - అత్తరింటికిదారేది లో ఆయన పాడిన సాంగ్స్ ఏ రేంజ్ లో క్లిక్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
నాగార్జున: సీతారామ రాజు సినిమాలో సిగరెట్ పై ఓ పాటేసుకున్న కింగ్.. నిర్మల కాన్వెంట్ సినిమాలో కొత్త కొత్త బాషా అంటూ లవ్ సాంగ్ తో డిఫరెంట్ గా ఎట్రాక్ట్ చేశారు.
నితిన్: ఇష్క్ - లచ్చమ్మా : గుండె జారీ గల్లంతయ్యిందే - డింగ్ డింగ్ డింగ్
రామ్ చరణ్: తుఫాన్ సినిమాలో ముంబై కె హీరో సాంగ్ లో అలా అలా సంగీతాన్ని టచ్ చేశాడు.
సిద్దార్థ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.. బొమ్మరిల్లు లో అపుడో ఎప్పుడో.. అనే సాంగ్ తరువాత మాక్సిమమ్ ప్రతి సినిమాలో పాడాడు. ఐ మై ఫ్రెండ్ - లవ్ ఫెయిల్యూర్ - ఆట - బావ సినిమాల్లో కూడా పాడాడు.
బిజినెస్ మెన్ - ఆగడు సినిమాల్లో టైటిల్ ట్రాక్స్ లలో కోరస్ అందించి తాను కూడా పాడగలనని నిరూపించాడు.
నిఖిల్: స్వామిరారా సినిమాలో యో.. యో అంటూ మంచి ప్రయత్నమే చేశాడు.
మాస్ రాజా రవితేజ: బలుపు సినిమాలో కాజల్ చెల్లివా అలాగే పవర్ లో నాటంకి వంటి పాటల్లో గాత్ర దానం చేసి పాటలకు ఊపు తెచ్చాడు.
విక్రమ్: విక్రమ్ మల్లన్న సినిమాలో నాలుగు పాటలు పాడి అందరిని మెప్పించాడు, అవకాశం వస్తే సింగర్ గా కూడా సత్తా చాటుతున్నాడు.
కలర్స్ స్వాతి: 100% లవ్ లో ఏ స్క్వైర్ బి స్క్వైర్ అంటూ రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే.
బాలకృష్ణ: పైసా వసూల్ లో మామా ఏక్ పెగ్ లా...
ప్యార్ మే పడిపోయా అంటూ పొటుగాడులో ఆలపించిన మనోజ్ కరెంట్ తీగలో దేవదాస్ అనే సాంగ్ కూడా పాడాడు.
సంపూర్ణేష్ బాబు: కొబ్బరిమట్ట సినిమాలో తొలిసారి సంపూ 'కొబ్బరి ఆకులు కలగలిపే' అనే సాంగ్ తో గాయకుడిగా మారాడు.
గబ్బర్ సింగ్ లో కోట శ్రీనివాసరావు మందుబాబులం అంటూ స్టేట్ మొత్తాన్ని ఊపారు.
Recent Stories | 0business
|
Hyderabad, First Published 17, Aug 2019, 3:12 PM IST
Highlights
బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ సాహో రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేదు. చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ డోస్ పెంచుతుండడంతో అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. ఇక ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకతో సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ సాహో రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేదు. చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ డోస్ పెంచుతుండడంతో అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. ఇక ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకతో సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
అసలు మ్యాటర్ లోకి వెళితే.. సినిమాకు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ లైన్ ను దర్శకుడు సుజిత్ ఇటీవల చెన్నై మీడియా సమావేశంలో బయటపెట్టాడు. సినిమా కథ అందరికి బాగా నచ్చుతుందని కాప్ గా కనిపించనున్న ప్రభాస్ పాత్ర సెకండ్ హాఫ్ సరికొత్త థ్రిల్ ఇస్తుందని అన్నారు. మెయిన్ గా ఎవరు ఊహించని ట్విస్ట్ అందరికి నచ్చుతుందని దర్శకుడు చెప్పాడు.
దీంతో ప్రభాస్ ఏ విధంగా మారతాడో అని అందరిలో ఉంత్కంట నెలకొంది. సినిమా ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.
Last Updated 17, Aug 2019, 4:09 PM IST | 0business
|
internet vaartha 127 Views
హైదరాబాద్ : తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా బ్రాండ్ ఇమేజ్గా ఎయిర్ఏసియా నిలిచింది. దేశీయ నెట్వర్క్లో కబాలిచిత్ర రజనీకాంత్ స్టిల్స్ ఉన్న విమానం బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, ఛండీగఢ్, జైపూర్, గౌహతి, ఇంపాల్, విశాఖపట్టణం, కోచి రూట్లలో ప్రయాణిస్తుందని ఎయిర్ ఏసియా ప్రకటించింది. కబాలికి అధికారిక ఎయిర్లైన్పార్టనర్గా ఎయిర్ఏసియా వ్యవహరిస్తోంది. చెన్నైనుంచి బెంగళూరు కు ప్రత్యేక కబాలి విమానం కూడా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. జూలై ఒకటవ తేదీ ఈ సినిమా విడుదలకావాల్సి ఉండగా 15వ తేదీకి వాయిదా వేసారు. ఈ నెల 22వ తేదీకి వాయిదాపడే అవకాశం ఉందని కూడా చెపుతున్నారు. ప్రస్తుతం ఎయిర్ఏసియా కబాలి విమానం శంషాబాద్ జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా వచ్చింది. | 1entertainment
|
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
First Published 31, Jul 2017, 9:01 PM IST
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
Recent Stories | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
మార్చి ఆఖరులో నయనతార దయ్యం సినిమా రిలీజ్
తమిళంలో హారర్ థ్రిల్లర్ ఫిలింస్ హవా ఇంకా అలా కొనసాగుతూనే వుంది. ఇప్పటికే గత కొన్నేళ్లలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్..
TNN | Updated:
Mar 2, 2017, 10:57PM IST
తమిళంలో హారర్ థ్రిల్లర్ ఫిలింస్ హవా ఇంకా అలా కొనసాగుతూనే వుంది. ఇప్పటికే గత కొన్నేళ్లలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టాయి. అందులో కొన్ని హిట్ అయితే, ఇంకొన్ని ఫట్ అయ్యాయి. తాజాగా నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో హారర్ చిత్రం 'దొర' ఈ నెలాఖరున తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో వుంది.
దాస్ రామస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని శర్కుణం నిర్మిస్తున్నాడు. ఈ మూవీని మార్చి 31న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సినిమా ట్రైలర్‌నిబట్టి చూస్తే, సినిమా ఆది నుంచి అంతం వరకు ఏదో తెలియని ఆత్మ నయనతారని వెంటాడుతున్నట్టుగా అర్థమవుతుంది. కానీ అసలు స్టోరీ ఏంటో తెలియాలంటే నెలాఖరు వరకు ఆగాల్సిందే. | 0business
|
రామ్చరణ్ సినిమాలో ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్
Highlights
10 సంవత్సరాల తర్వాత మళ్లీ సుకుమార్ సినిమా
హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్
త్వరలో షూట్లో జాయిన్ కానున్న ప్రకాష్ రాజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే గోదావరి జిల్లాలో ఒక కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో మరో షెడ్యూల్ జరుపుకుంటోంది. నగరంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ టీమ్ మాత్రం చిత్రీకరణ ఆపడంలేదు. చరణ్ కూడా గ్యాప్ అనేదే తీసుకోకుండా షూటింగ్లో పాల్గొంటూ చిత్రీకరణను మరింత వేగవంతం చేస్తున్నాడట.
ఇకపోతే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా త్వరలోనే ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో 2007 లో రిలీజైన ‘జగడం’ అనే సినిమాలో మాత్రమే నటించిన ప్రకాష్ రాజ్ మళ్ళీ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ కూడా ప్రకాష్ రాజ్ పాత్రను ప్రత్యేక శ్రద్ధతో రూపొందించినట్టు సమాచారం. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నైపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది.
Last Updated 26, Mar 2018, 12:04 AM IST | 0business
|
Visit Site
Recommended byColombia
బ్యాడ్మింటన్ (7) : సైనా నెహ్వాల్, పీవీ సింధు (మహిళల సింగిల్స్), కిడాంబి శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్), సుమిత్ రెడ్డి, మనూ అత్రి (పురుషుల డబుల్స్), గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్).
టెన్నిస్ (4) : లియాండర్ పేస్, రోహన్ బోపన్న, (పురుషుల డబుల్స్/మిక్స్డ్ డబుల్స్), సానియా మీర్జా, ప్రార్థన తొంబ్రే (మహిళల డబుల్స్/మిక్స్డ్ డబుల్స్).
ఆర్చరీ (4) : అతాను దాస్(పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం), దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి మాఝీ (మహిళల రికర్వ్ టీమ్, వ్యక్తిగత విభాగం)
టేబుల్ టెన్నిస్ (4) : ఆచంట శరత్ కమల్, సౌమ్యజిత్ ఘోష్, (పురుషుల సింగిల్స్) మనికా బాత్రా, మౌమా దాస్ (మహిళల సింగిల్స్)
బాక్సింగ్ (3) : శివ థాపా (బాంటమ్ వెయిట్-56 కేజీలు), మనోజ్ కుమార్ (లైట్ వెల్టర్ వెయిట్-64 కేజీలు), వికాస్ క్రిషన్ యాదవ్ (మిడిల్ వెయిట్-75 కేజీలు)
గోల్ఫ్ (3):అనిర్బన్ లాహిరి, శివ్ చౌరాసియా (పురుషుల విభాగం), అదితి అశోక్ (మహిళల విభాగం), వెయిట్లిఫ్టింగ్ (2), సతీశ్ శివలింగం (పురుషుల 77 కేజీలు), మీరాబాయి చాను (మహిళల 48 కేజీలు).
రెజ్లింగ్ (8):సందీప్ తోమర్ (పురుషుల ఫ్రీస్టయిల్-57 కేజీలు), యోగేశ్వర్ దత్ (65 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు), రవీందర్ ఖత్రీ (పురుషుల గ్రీకో రోమన్-85 కేజీలు), హర్దీప్ సింగ్ (98 కేజీలు), వినేశ్ ఫోగట్ (మహిళల ఫ్రీస్టయిల్ 48 కేజీలు), బబితా కుమారి (53 కేజీలు), సాక్షి మలిక్ (58 కేజీలు).
రోయింగ్ (1): దత్తూ బబన్ భోకనాల్ (పురుషుల సింగిల్ స్కల్స్).
షూటింగ్ (12)
అభినవ్ బింద్రా (పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), కైనన్ చెనాయ్, మానవ్జిత్ సింగ్ సంధూ (ట్రాప్), మేరాజ్ అహ్మద్ ఖాన్ (స్కీట్)ప్రకాశ్ నంజప్ప (50 మీటర్ల పిస్టల్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్,50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), జీతూ రాయ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్), చెయిన్ సింగ్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), గుర్ప్రీత్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్), అపూర్వీ చండేలా, అయోనికా పాల్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), హీనా సిద్ధూ (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్)
హాకీ (32)
పురుషుల జట్టు: సురేందర్ కుమార్, డానిష్ ముజ్తబా, రఘునాథ్, ఆకాశ్దీప్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, కొతాజిత్ సింగ్, మన్ప్రీత్ సింగ్, రమణ్దీప్ సింగ్, రూపిందర్పాల్ సింగ్, సర్దార్ సింగ్, శ్రీజేష్, ఎస్వీ సునీల్, నికిన్ తిమ్మయ్య, ఎస్కే ఉతప్ప, దేవిందర్ వాల్మీకి.మహిళల జట్టు: సవితా పూనియా, దీప్గ్రేస్ ఎక్కా, దీపికా ఠాకూర్, నమితా టొప్పో, సునీతా లాక్రా, సుశీలా చాను, లిలిమా మింజ్, రేణుకా యాదవ్, నిక్కీ ప్రధాన్, మోనికా మలిక్, నవ్జ్యోత్ కౌర్, అనురాధ దేవి, పూనమ్ రాణి, వందన కటారియా, ప్రీతి దూబే, రాణి రాంపాల్.
స్విమ్మింగ్ (2) : సజన్ ప్రకాశ్ (పురుషుల 200 మీటర్ల బటర్ఫ్లయ్), శివాని కటారియా (మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్)
జిమ్నాస్టిక్స్ (1) : దీపా కర్మాకర్ (మహిళల విభాగం)
జూడో (1) : అవతార్ సింగ్ (పురుషుల 90 కేజీలు). | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
చరణ్ ముహూర్తం ఫిక్స్ చేశాడు!
హీరోగా 'ధృవ' మూవీ, నిర్మాతగా ఖైదీనెం.150 సినిమాలతో వరుసగా రెండు హిట్లను అందుకున్న రాంచరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్కి కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అయ్యాడు.
TNN | Updated:
Jan 20, 2017, 05:34PM IST
హీరోగా 'ధృవ' మూవీ, నిర్మాతగా ఖైదీనెం.150 సినిమాలతో వరుసగా రెండు హిట్‌లను అందుకున్న రాంచరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అయ్యాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ' సినిమా రిలీజ్ పనుల్లో.. అలానే తన తండ్రి మెగాస్టార్ నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా పనుల్లో బిజీగా గడిపారు. ఇప్పుడు ఆ పనుల నుండి కాస్త విరామం దొరకడంతో ఇక తన తదుపరి ప్రాజెక్ట్‌‌పై దృష్టి పెట్టాడు. సుకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జనవరి 30 న నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, రత్నవేలు ఫోటోగ్రఫీ ఈ మూడు సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. దీనికి పోటీగా చరణ్ తన కొత్త లుక్‌తో ఎంటర్టైన్ చేయనున్నాడు. పూర్తి గ్రామీణ నేపధ్యంలో సాగే రొమాంటిక్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు.
దీంతో పాటు ఈ సినిమాలో ఇద్దరు రాశిలు కనిపించనున్నారు. ఒకరు ఒకప్పటి హీరోయిన్ రాశి ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తుండగా.. మరొకరు టాలీవుడ్ యంగ్ బ్యూటీ రాశీఖన్నా. ఈ సినిమాలో రాశికన్నా సెకండ్ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. 'ధృవ'తో సక్సెస్ కొట్టిన చెర్రీ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటాడో చూడాలి. | 0business
|
Apr 02,2015
పసిడి, వెండి మరింత ప్రియం
న్యూఢిల్లీ : బంగారం, వెండి దిగుమతులపై సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో పరిణామాల నేపధ్యంలో 10 గ్రాముల పసిడిపై దిగుమతి టారీప్ను 385 డాలర్లకు చేర్చింది. కిలో వెండిపై 543 డాలర్లుగా ప్రకటించింది. ఇది వరకు బంగారంపై 375 డాలర్లు, వెండిపై 512 డాలర్లుగా దిగుమతి సుంకం అమల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగివస్తున్న నేపధ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైస్ అండ్ కస్టమ్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా సింగపూర్ బులియన్ మార్కెట్ ధరలు భారత పసిడి ధరలను ప్రభావితం చేస్తుంది. బుధవారం దేశ రాజధానిలో పది గ్రాముల బంగారం ధర రూ.26,575గా, కిలో వెండి ధర రూ.37,200గా పలికింది. ముడి చమురు తర్వాత భారత్ అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల్లో బంగారం ద్వితీయ స్థానంలో ఉంది. కాగా పసిడిపై పెట్టుబడి పొదుపు చేయకూడదని ప్రభుత్వం ప్రజలను కోరుతుంది. దీని వల్ల దేశ కరెంట్ ఎకౌంట్ లోటు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
will bollywood actor shahid kapoor do justice to nani shraddha srinath film jersey
షాహిద్.. నాని పేరు మాత్రం చెడగొట్టకు
నాని కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జెర్సీని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ ఈ సినిమాలో నాని పాత్రను పోషించనున్నాడు. నాని పాత్రకు షాహిద్ న్యాయం చేయగలుగుతాడా?
Samayam Telugu | Updated:
Oct 27, 2019, 11:55AM IST
షాహిద్ కపూర్
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్కు రీమేక్లు బాగా కలిసొస్తున్నాయి. తెలుగులో మంచి విజయం అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్తో తెరకెక్కించారు. ఇందులో షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటించారు. సినిమా ఎంత వివాదాస్పదమైందో అంతకంటే ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు అదే నమ్మకంతో ‘జెర్సీ’ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కూడా షాహిద్ కపూరే నటించనున్నాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్ను కూడా తెరకెక్కింనున్నాడు. ఇందులో శ్రద్ధా కపూర్ను కథానాయికగా ఎంపిక చేసుకోవాలని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.
Visit Site
Recommended byColombia
మరి కబీర్ సింగ్ సినిమాలాగే షాహిద్ జెర్సీ రీమేక్కు కూడా న్యాయం చేయగలడా? నాని ఇమేజ్ను ఎక్కడా డ్యామేజ్ చేయకుండా సినిమా చేయగలడా? జెర్సీ రీమేక్ను ప్రకటించగానే సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలివి. బ్రో.. నాని పరువు మాత్రం తీయకు అంటూ పలువురు అభిమానులు కామెంట్లు కూడా చేశారు. అన్ని రీమేక్ సినిమాలు హిట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. అలాగని ఫ్లాప్ అవుతాయని కూడా లేదనుకోండి. కానీ కబీర్ సింగ్కి జెర్సీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకటేమో లవ్ ఫెయిల్యూ్ర్, ఆల్కహాల్ ఎడిక్షన్ కాన్సెప్ట్తో తెరకెక్కినది, మరొకటి కుటుంబం, ప్రేమ, కెరీర్ ఇలా ఓ ఎమోషనల్ రైడ్తో సాగేది. కబీర్ సింగ్ సక్సెస్ నుంచి షాహిద్ పూర్తిగా బయటికి వస్తే కానీ జెర్సీ రీమేక్లోని తన పాత్రలో ఒదిగిపోలేడు.
READ ALSO: ప్రియాంక భర్తను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసిన ఫ్యాన్
ఈ సినిమాను రీమేక్ చేయకపోవడమే మంచిదని పలువురు సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే కొన్ని సినిమాలు ఒక్కసారి తీస్తేనే బాగా వస్తాయి. రెండోసారి తీస్తే మొదటిసారి వచ్చినంత బాగా రాదు. జెర్సీలో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. వీరిద్దరిదీ కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారు. కానీ షాహిద్, శ్రద్ధా కపూర్ ఇదివరకే ‘బత్తీ గుల్ మీటర్ చాలూ’ అనే ఫ్లాప్ సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిందే. లక్ కలిసొచ్చి షాహిద్కు ఈ రీమేక్ కూడా హిట్ అయితే ఆయన కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కినట్లే. అసలే కబీర్ సింగ్కి ముందు వరకు వరుస ఫ్లాప్స్తో షాహిద్ సతమతమయ్యాడు. ఇప్పుడిప్పుడే ట్రాక్లోకి వస్తున్నాడు. మరి జెర్సీ రీమేక్ను జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురాగలడో లేదో వేచి చూడాలి. | 0business
|
Hyderabad, First Published 9, Apr 2019, 4:39 PM IST
Highlights
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమిళంలో జయలలిత జీవితం ఆధారంగా రెండు బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పుడు మరో బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''గతంలో ఎన్నో చిత్రాలను నిర్మించాను. అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ 'లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమా తీస్తున్నాను. ఇప్పుడు జయ లలిత బయోపిక్ కూడా తీయాలని అనుకుంటున్నాను. అన్ని రకాల కోణాల్లో ఈ సినిమాను తీయాలనుకుంటున్నాను. దీనికి 'శశిలలిత' అనే టైటిల్ ఫిక్స్ చేశాను'' అంటూ చెప్పుకొచ్చాడు.
అన్ని భాషల్లో ఈ సినిమా ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో జయలలిత జీవితానికి సంబంధించి సరికొత్త కోణం చూడబోతున్నారని చెప్పుకొచ్చారు. ఆమె గురించి తెలియని చాలా విషయాలు ఇందులో చూపించనున్నానని స్పష్టం చేశారు.
ఆమె బాల్యం, హీరోయిన్ గా ఎదుగుదల, లవ్ ఎఫైర్, శోభన్ బాబుతో ఆమె ప్రేమాయణం, ఆసుపత్రిలో చివరి రోజుల్లో ఆమె ఎలా గడిపారనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పారు. ఈ సినిమా కుంగిపోతున్న రాజకీయ వ్యవస్థకి ఎలిగెత్తి చాటే ఉత్తమ చిత్రమవుతుందని అన్నారు.
" | 0business
|
Visit Site
Recommended byColombia
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.320 క్షీణించింది. దీంతో ధర రూ.36,530కు దిగొచ్చింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఏకంగా రూ.400 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500కు దిగొచ్చింది.
ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గింది. దీంతో ధర రూ.38,500కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 తగ్గుదలతో రూ.37,300కు క్షీణించింది.
Also Read: పోస్టాఫీస్ స్కీమ్ అదిరింది.. నెలకు రూ.5,000తో చేతికి ఏకంగా రూ.3.6 లక్షలు..!
బంగారం ధర పడిపోతే.. కేజీ వెండి ధర కూడా పతనమైంది. రూ.400 క్షీణతతో రూ.48,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. నవంబర్ 1 నుంచి ఆ నిర్ణయం అమలులోకి!
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్స్కు 0.03 శాతం తగ్గుదలతో 1,491 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్కు 0.08 శాతం క్షీణతతో 17.81 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.
Also Read: ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేస్తే.. 5 లాభాలు..!
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
Also Read: 18 ఏళ్లకే మీ కొడుకు/కూతురి పేరుపై రూ.44 లక్షలు.. ఇలా చేయండి..!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Apr 13,2018
బీబీబీ కొత్త చైర్మెన్గా భాను ప్రతాప్ శర్మ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ 'బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో'ను (బీబీబీ) పునర్వ్యవస్థీకరించింది.బీబీబీ ప్రస్తుత చైర్మెన్గా వ్యవహరిస్తున్న మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రారు స్థానంలో భాను ప్రతాప్ శర్మను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనా వ్యవహారాలను మెరుగుపర్చేందుకు గాను 2016లో కేంద్ర ప్రభుత్వం బీబీబీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు భాను ప్రతాప్ శర్మ బీహార్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగాను.. డీఆర్డీవో నియామకాల కేంద్రపు చైర్మెన్గాను.. డీవోపీటీ డిప్యూటీ చైర్మెన్గాను పని చేసిన అనుభవం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఉన్నత నియామకాల్లో జోక్యం కలిపించుకోమన్న మాటకు కట్టుబడేలా కొత్తగా బీబీబీని పునర్ వ్యవస్థీకరించినట్టుగా ఆర్థిక సేవల సంస్థ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. వేదికా భండార్కర్ (మాజీ ఎండీ క్రెడిట్ సూయిస్ ఇండియా), ప్రదీప్ కుమార్ (మాజీ ఎండీ, ఎస్బీఐ), ప్రదీప్ పి షా (వ్యవస్థాపకుడు, ఎండీ క్రిసిల్)లను బీబీబీలో ఇతర సభ్యులుగా నియమించారు. బీబీబీ అధినేత పదవికి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మాజీ అధినేత్రి అరుంధతీ భట్టాచార్య ఎంపిక కానున్నారంటూ ఇటీవలి పలు ఊహాజనితమైన వార్తలు వెలువడినప్పటికీ.. అనూహ్యంగా ఆ పదవి శర్మాను వరించడం విశేషం. బ్యాంకింగ్ రంగంలో రోజుకో కుంభకోణం వెలుగులోకి వస్తూ సంస్కరణల పర్వం కొనసాగుతున్న వేళ బీబీబీ పాత్ర కీలకం కానుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 104 Views
హైదరాబాద్ : కార్పొరేట్ నాయకత్వంలో మానవవనరుల నిర్వహణ పరంగా సంక్లిష్టమైన సవాళ్లు ఎదురవుతున్నాయని బ్రాడ్రిడ్జ్ ఆర్థిక సేవలసంస్థ ఎండి వి లక్ష్మీకాంత్ పేర్కొన్నారు. మానవ వనరులపై సిఐఐ తెలంగాణ నిర్వహించిన ప్రత్యేక సదస్సులోపాల్గొని ప్రసంగించారు. సమాచార లోపం కొంత ఇందుకు ఉకారణం అవుతున్నదని, కీలకమైన సవాళ్ల సమయంలో తీసుకునే నిర్ణయాలు కూడా స్పష్టమైన ఫలితాలుఇవ్వడంలో చిక్కులు ఎదురవుతాయన్నారు. కార్పొరేట్ రంగం ప్రస్తుతం తమకు ఎవరు పోటీదారులన్న అంశం పై స్పష్టతకు రాలేకపోతున్నదని అన్నారు. ఇదే కీలకమైన సమస్యగాఉందని, ఈసమస్య వల్ల కార్పొరేట్రంగానికి మరింత సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. మానవ వనరుల నిపుణు లతో లక్ష్మీకాంత్ అన్ని అనుభవాలు అభిప్రాయాలను పంచుకున్నారు. నిర్ణయా లు తీసుకోవడంలో ఐటి కీలకపాత్ర వహిస్తుందని, నిర్ణయాల్లో కార్పొరేట్లకు అధికార వికేంద్రీకరణ, కేంద్రీకరణలు అత్యంత కీలకం అవుతాయన్నారు. లక్నో ఐఐఎం ప్రొఫెసర్ దేభశీష్ ఛటర్జీ మాట్లాడుతూ మానవవనరుల నిర్వహణ, మానవనరుల ధోరణులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వృద్ధి లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇందుకు సంబంధించి స్థిరమైన మానసిక చిత్తంతో వ్యవహరించాల్సిఉంటుందని అన్నారు. కొన్ని సందర్భాల్లో ధృఢచిత్తం ఉన్న వ్యక్తుల వైఖరి అవినీతికిసైతం దారితీస్తుందని అన్నారు. పని తీరుపైనే ఆధారపడకుండా మానవవనరుల నిర్వహణలో యాజమాన్యాలు వారి కున్న సామర్ధ్యం అంచనావేయాల్సి ఉంటుందని అన్నారు. మారుతున్న ధోర ణులకు అనుగుణంగా కార్పొరేట్ యాజమాన్యాల్లో మార్పులు అవసరం అవుతాయని ఎప్పటికప్పుడు వన రులను ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంద న్నారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ మాజీ ఛైర్మన్ ప్రదీప్ ధోబాలే మాట్లాడుతూ మానవనరుల పరంగా ఉద్యో గులు కార్మికుల్లో నైపుణ్యం, విజ్ఞానం, శిక్షణ, అను భవం, సరళీకృతవైఖరులు, వివిధ మెళుకు వలను జోడించడం వంటివి ఎంతో కీలకం అవుతాయని అన్నారు. సిఐఐ తెలంగాణ హెచ్ఆర్, ఐఆర్ ప్యానెల్ డైరె క్టర్ ఉమా దేవగుప్తాపు వందన సమర్పణ చేశారు. మొత్తం 200 మందికిపైగా మానవవనరుల నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వీరిలో మేధావులు, నిపుణులుగా ఉన్న సింక్రోని ఫైనాన్షియల్ సీనియర్వైస్ ప్రెసిడెంట్ మీర్ ఫైసల్ ఉద్దీన్, సైకుల్ సిఇఒ దీనానాధ్ హరపణహళ్లి, జిఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం చీఫ్ హెచ్ఆర్ అధికారి వెంకటేష్ పాలభట్ల తదితరులు ఉన్నారు. | 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.