news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Hyderabad, First Published 2, Oct 2019, 2:13 PM IST Highlights అంచనాల నడుమ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం నేడు థియేటర్స్‌లో విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.   మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో 'సైరా' హడావిడి మాములుగా లేదు. ఎక్కడ చూసిన థియేటర్లు మొత్తం సందడితో వెలిగిపోతున్నాయి. 'సైరా', 'సైరా' అంటూ అభిమానులు అరిచే అరుపులు మారు మోగుతున్నాయి. దసరా సీజన్, గాంధీ జయంతి సెలవు కావడంతో జనాలంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. గత రాత్రి నుండి థియేటర్ల వద్ద మెగాస్టార్ అభిమానులు హంగామా చేస్తున్నారు. భారీ కటౌట్లు, పూల మాలలు కడుతూ భారీగా స్వాగతం చెప్పారు.ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని మరింత పెంచేలా మెగాకోడలు ఉపాసన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తన మామ నటించిన సినిమా, పైగా తన భర్త నిర్మాత అలాంటప్పుడు ఉపాసన మాట్లాడుకుందా ఉంటుందా మరి..? అందుకే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.   విజయవాడలో మెగా ఫ్యాన్స్ చేస్తున్న హంగామా వీడియోను షేర్ చేసిన ఉపాసన.. 'లవ్ ది బెజవాడ బీట్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. భీమవరం, హైదరాబాద్‌లతో పాటు విదేశాల్లో మెగా అభిమానుల సందడి షేర్ చేశారు ఉపాసన.   — Upasana Konidela (@upasanakonidela) October 2, 2019 Last Updated 2, Oct 2019, 2:13 PM IST
0business
బన్నీ-త్రివిక్రమ్ ల సినిమా షురూ! First Published 13, Apr 2019, 2:36 PM IST బన్నీ-త్రివిక్రమ్ ల సినిమా షురూ బన్నీ-త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమాలు బన్నీ-త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమాలు బన్నీ-త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమాలు బన్నీ-త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమాలు బన్నీ-త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమాలు బన్నీ-త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమాలు Recent Stories
0business
Hyderabad, First Published 6, Apr 2019, 11:15 AM IST Highlights అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.  అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ లో సరైన సినిమాలు లేక మొహం వాచిపోయి ఉన్న ఆడియన్స్ కి ఈ సినిమా మంచి రిలీఫ్ ఇస్తోంది. ఉగాది కావడం, పైగా వీకెండ్ దీంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి రోజు మార్నింగ్ షో సినిమాకు వచ్చిన టాక్ చూసిన బయ్యర్లు వెంటనే థియేటర్ల సంఖ్య పెంచేశారు.దీంతో మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. గుంటూరులో ఈ సినిమా తొలిరోజు రూ.66 లక్షలు రాబట్టగా.. ఉత్తరాంధ్రలో రూ.76 లక్షలు వసూలు చేసింది. మిగిలిన ఏరియాల్లో ఎంత వసూలు చేసిందనే విషయం  తెలియాల్సివుంది. ఈ దూకుడు చూస్తుంటే ఈ సినిమా మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది. మొత్తానికి ఈ సినిమాతో నిర్మాతలు బాగా లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.    Last Updated 6, Apr 2019, 11:15 AM IST
0business
TEAM INDIA వెస్టిండీస్‌ పర్యటనకు భారత్‌ జట్టు న్యూఢిల్లీ: ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత్‌ జట్టును బిసిసిఐ గురువారం ప్రకటించింది. జూలై 23 నుంచి వెస్టిండీస్‌తో 5 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. ఈసిరీస్‌ నుంచి ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో పాటు ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌పంత్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు వెల్లడించారు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరుపున రిషబ్‌ పంత్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరుపున కుల్దీప్‌ యాదవ్‌ మెరుగ్గా రాణించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ, ప్రధాన కోచ్‌గా అనిల్‌ కుంబ్లే ఈపర్యటనకు కొనసాగుతారని బిసిసిఐ స్పష్టం చేసింది. వెస్టిండీస్‌ పర్యటనకు 15మందితో కూడిన జట్టు ఇదే విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శిఖర్‌ దావన్‌, రిషబ్‌ పంత్‌, అజింక్య రహానే, మహేంద్ర సింగ్‌ ధోనీ (కీపర్‌), యువరాజ్‌ సింగ్‌, కేదార్‌ జాదవ్‌, హార్థిక్‌ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, ఉమేష్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, తకుల్దీప్‌ యాదవ్‌, దినేష్‌ కార్తీక్‌.
2sports
Hyderabad, First Published 13, May 2019, 10:47 AM IST Highlights చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ వికెట్ కీపర్ ఘనత ధోనికి దక్కింది.  చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ వికెట్ కీపర్ ఘనత ధోనికి దక్కింది. ఈ ఘనతతో ధోనీ మరో మైలు రాయిని చేరుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో 132 వికెట్లు తీసిన ఘనత ధోనికి దక్కింది. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా... జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ధోనీ ఈ రికార్డు సాధించాడు. గత రాత్రి చెన్నై.. ఐపీఎల్ ట్రోఫీ కోసం ముంబయితో తలపడిన సంగతి తెలిసిందే. ధోనీ తొలిసారి దక్షిణాఫ్రికా కీపర్, బ్యాట్స్ మెన్ షార్డుల్ ఠాకూర్ ను ఔట్ చేశాడు. ధోనీ మొత్తం 132 ఔట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ధోనీ తర్వాతి స్థానంలో కార్తీక్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో రాబిన్ ఉతప్ప ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. ముంబయి ఇండియన్స్ నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే.  Last Updated 13, May 2019, 10:47 AM IST
2sports
Visit Site Recommended byColombia కాగా.. తనపై వస్తున్న ఆరోపణలను తనుజ్ ఖండించాడు. ముంబై పోలీసులు ఇంతవరకు తనను కలవలేదని తెలిపాడు. ఇలాంటి సంఘటన జరగడం నిజంగా బాధాకరమని, తన దగ్గర అలాంటి ఫొటోలు లేవని చెప్పాడు. అక్షర తనకు కేవలం మంచి స్నేహితురాలు మాత్రమేనని వెల్లడించాడు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. అసలేం జరిగింది? నటుడు, రాజకీయ నాయకుడు కమలహాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ ‘లో’ దుస్తులతో ఉన్న ఫొటోలు కొన్ని రోజుల కిందట ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. దీనిపై అక్షర ముంబై పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత ఫొటోలను లీక్ చేయడం దురదృష్టకరమని, ఇది తనను ఎంతో బాధించిందని అక్షర పేర్కొంది. తనుజ్, అక్షర దేశమంతా #MeToo ఉద్యమం సాగుతున్నా.. ఇంకా కొంతమంది తనలాంటి యువతుల ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని అక్షర వాపోయింది. ‘ఈ మధ్య నా ప్రైవేట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. ఇలా ఎవరు చేశారో, ఎందుకు చేశారో నాకు తెలియదు. కానీ, తప్పుడు బుద్ధితోనే ఇదంతా చేశారని అర్థమవుతుంది’ అని అక్షర పేర్కొంది. తన అభ్యంతరకర ఫొటోలను షేర్ చేసుకుంటూ వాటిని ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ ఈ వేధింపుల్లో భాగస్వాములే అని అక్షర రాసుకొచ్చింది. పనిలో పనిగా మీడియాపై కూడా మండిపడింది. ఎవరో బుద్ధిలేనివారు నీచపు పని చేస్తే.. మీడియా కూడా ఆ ఫొటోలను ఎలా ప్రచురిస్తుందని, ఆడపిల్ల మనోవేదనను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘తప్పకుండా ఆ వ్యక్తుల ఆచూకీ లభిస్తుంది. అప్పటి వరకు మీరు బతకండి. నన్నూ గౌరవంగా బతకనివ్వండి. ఇప్పటికైనా ఇంటర్నెట్ నన్ను మరింత వేధించదని భావిస్తున్నా. #MeToo’ అని అక్షర ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను అక్షర సోదరి, నటి శృతిహాసన్ రీట్వీట్ చేసింది.
0business
Hyderabad, First Published 6, Apr 2019, 9:43 AM IST Highlights జీవితా రాజశేఖర్ ల కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది. చాలా ప్రాజెక్ట్ ల తరువాత అడివి శేష్ హీరోగా 'టూ స్టేట్స్' రీమేక్ లో నటించడానికి నిర్ణయించుకున్నారు.  జీవితా రాజశేఖర్ ల కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది. చాలా ప్రాజెక్ట్ ల తరువాత అడివి శేష్ హీరోగా 'టూ స్టేట్స్' రీమేక్ లో నటించడానికి నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణం సగం పూర్తయిన తరువాత దర్శకుడి పనితనం నచ్చక ప్రాజెక్ట్ ని మధ్యలోనే  ఆపేసినట్లు సమాచారం. దీంతో అడివి శేష్ మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయారు. తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. ఈ రీమేక్ ని ఎంతో ఆసక్తిగా మొదలుపెట్టిన నిర్మాత సత్యనారాయణకి దర్శకుడు వెంకట్ పెద్ద షాక్ ఇచ్చాడట. ఇటీవల ఓ పెద్ద షెడ్యూల్ చేస్తే కనీసం ఔట్ పుట్ రాబట్టలేకపోయాడట. దీంతో ప్రాజెక్ట్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడితో సినిమాను పూర్తి చేయాలా..? లేక ప్రాజెక్ట్ వదిలేయాలా..? అనే విషయంలో ఓ నిర్ణయానికి  రాలేకపోతున్నారు.  Last Updated 6, Apr 2019, 9:43 AM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భారత్‌తో ఏకైక టెస్టుకి అఫ్గనిస్థాన్ జట్టు ప్రకటన భారత్‌‌తో జూన్ 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తాజాగా తమ జట్టుని ప్రకటించింది. బెంగళూరులోని Samayam Telugu | Updated: May 29, 2018, 03:41PM IST భారత్‌తో ఏకైక టెస్టుకి అఫ్గనిస్థాన్ జట్టు ప్రకటన భారత్‌‌తో జూన్ 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తాజాగా తమ జట్టుని ప్రకటించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ టెస్టు మ్యాచ్ జరగనుండగా.. 16 మంది సభ్యులతో కూడిన జాబితాని ఏసీబీ మంగళవారం విడుదల చేసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్పిన్నర్లు రషీద్ ఖాన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)లకి ఈ జట్టులో చోటు దక్కింది. వీరితో పాటు సన్‌రైజర్స్ తరఫున ఈ సీజన్‌లో తక్కువ మ్యాచ్‌లు ఆడిన మహ్మద్ నబీకి కూడా ఛాన్స్‌ దక్కింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్‌కి ఇదే తొలి టెస్టు మ్యాచ్. Visit Site Recommended byColombia అఫ్గానిస్థాన్ జట్టుకి కెప్టెన్‌గా అస్గర్‌ ఎంపికవగా.. జట్టులో నలుగురు స్పిన్నర్లకి సెలక్టర్లు చోటు కల్పించారు. భారత సెలక్టర్లు కూడా కూడా ఇప్పటికే ఈ టెస్టుకి సంబంధించిన జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి ఇంగ్లాండ్‌లో కౌంటీలు ఆడేందుకు వెళ్తున్నట్లు అప్పట్లో చెప్పడంతో అతని స్థానంలో అజింక్య రహానెని కెప్టెన్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు.. కరుణ్ నాయర్‌కి మిడిలార్డర్‌లో అవకాశమిచ్చారు. కానీ.. ఇటీవల మెడనొప్పి కారణంగా.. కౌంటీ మ్యాచ్‌లకి కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. భారత జట్టు : అజింక్య రహానె (కెప్టెన్), చతేశ్వర్ పుజారా, శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, శార్ధూల్ ఠాకూర్ అఫ్గానిస్థాన్ జట్టు: అస్గర్ (కెప్టెన్), మహ్మద్ షహజాద్ (వికెట్ కీపర్), జావెద్ అహ్మదీ, ఇషానుల్లా జనాత్, రహ్మాత్ షా, నజీర్ జమాల్, హస్మతుల్లా షాహిది, అప్సర్ జజాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, జహీర్ ఖాన్, హోతక్, సయ్యద్ షెర్జాద్, యామిన్, వాప్‌దర్ మహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Coach- Captain Relation is Very Important కోహ్లి-కుంబ్లే గొడవ భారత్‌కి చేటే: పాక్ కోచ్ విరాట్ కోహ్లి, కుంబ్లే మధ్య ఏం జరిగిందో నాకు స్పష్టంగా తెలీదు. కానీ.. ఒక జట్టు విజయపథంలో పయనించాలంటే మాత్రం TNN | Updated: Jun 3, 2017, 07:03PM IST భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి, జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే మధ్య విభేదాలు టీమిండియాకి చేటు చేస్తాయని పాకిస్థాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోన్న టీమిండియా మళ్లీ టైటిల్‌ నిలబెట్టుకునే అవకాశాలు ఈ గొడవలు కారణంగా దెబ్బతిన్నాయని ఆర్థర్ వివరించాడు. ‘విరాట్ కోహ్లి, కుంబ్లే మధ్య ఏం జరిగిందో నాకు స్పష్టంగా తెలీదు. కానీ.. ఒక జట్టు విజయపథంలో పయనించాలంటే మాత్రం కెప్టెన్, కోచ్ మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండాలి. ఆదివారం మ్యాచ్‌లో పరుగులు నియంత్రించడం కంటే మేము భారత్ వికెట్లను పడగొట్టడంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాం. అటాకింగ్ బౌలింగ్‌తో టీమిండియాను ఆలౌట్ చేయడమే మా లక్ష్యం’ అని ఆర్థర్ వివరించాడు.
2sports
పవర్ స్టార్ ను లైఫ్ లాంగ్ ఉపయోగించుకుంటానంటున్న నితిన్ Highlights లై చిత్రంతో ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తున్న నితిన్ పవర్ స్టార్ సినిమాల్లో సీన్స్ ను లైఫ్ లాంగ్ వాడతానంటున్న నితిన్ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానమన్న నితిన్ 'అఆ' వంటి సూపర్‌హిట్‌ మూవీ తర్వాత యూత్‌స్టార్‌ నితిన్‌ నటిస్తోన్న చిత్రం 'లై'. 'అందాల రాక్షసి', కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా వెంకట్‌ బోయిన్‌పల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై టేస్ట్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'లై'. ఈ చిత్రం పోస్టర్స్‌కి, ట్రైలర్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఫస్ట్‌టైమ్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. స్వర బ్రహ్మ మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. హాలీవుడ్‌ చిత్రాలకి ధీటుగా హను రాఘవపూడి 'లై' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఆగస్ట్‌ 11న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక స్క్రీన్‌లలో భారీగా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా యూత్‌స్టార్‌ నితిన్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు..  'అఆ' తర్వాత ఇంత గ్యాప్‌ తీసుకోవడానికి రీజన్‌?  - జూన్‌ 2న ఆ సినిమా రిలీజ్‌ అయ్యింది. అంత మంచి హిట్‌ తర్వాత ఏ సినిమా చెయ్యాలి? ఎలాంటి కథను ఎంచుకోవాలి అని కొంచెం డైలమాలో పడ్డాను. ఆ టైమ్‌లో త్రివిక్రమ్‌గారికి కాల్‌ చేశాను. నెక్స్‌ట్‌ రెగ్యులర్‌ మూవీ కాకుండా కొంచెం డిఫరెంట్‌ సినిమా చెయ్యమని సలహా ఇచ్చారు. చాలా కథలు విన్నాను. ఏదీ నచ్చలేదు. హను రాఘవపూడి అరగంట పాటు ఈ కథ చెప్పాడు. ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఈ కథ ఓకే చేశాను.  'లై' సినిమా ఎలా వుంటుంది?  - రెగ్యులర్‌ మూవీలా కాకుండా లవ్‌, ఎమోషన్‌, స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'లై' సినిమా వుంటుంది. హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ చాలా కొత్తగా వుంటుంది. వారి మధ్య వచ్చే చిన్న చిన్న అబద్ధాలు ఇంట్రెస్టింగ్‌గా వుంటాయి.  మెయిన్‌ 'లై' కాన్సెప్ట్‌ ఏమిటి?  - ఒక ఆవారాగా తిరిగే కుర్రాడు యు.ఎస్‌. వెళ్ళి బాగా డబ్బున్న అందమైన అమ్మాయిని పెళ్లాడి డాలర్స్‌ సంపాదించుకోవాలని అనుకుంటాడు. అలా యు.ఎస్‌. వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది మెయిన్‌ కాన్సెప్ట్‌. సినిమా స్టార్టింగ్‌ నుండి ఇంట్రెస్టింగ్‌గా, చాలా థ్రిల్లింగ్‌గా వుంటుంది.  అర్జున్‌గారితో వర్క్‌ చేయడం ఎలా అన్పించింది?  - 'శ్రీ ఆంజనేయం' తర్వాత అర్జున్‌గారితో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. ఫస్ట్‌టైమ్‌ ఆయన విలన్‌గా యాక్ట్‌ చేశారు. వెరీ స్టైలిష్‌గా ఆయన క్యారెక్టర్‌ వుంటుంది. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చి వుండేది కాదు. మా ఇద్దరి మధ్య జరిగే గేమ్‌ చాలా థ్రిల్లింగ్‌గా వుంటుంది. ఎత్తుకి పై ఎత్తులు వేసుకుంటూ ఇద్దరి క్యారెక్టర్స్‌ పోటా పోటీగా వుంటాయి. 'శ్రీ ఆంజనేయం' టైమ్‌లో అర్జున్‌గారు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే వున్నారు. ఆయన్ని చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.  14 రీల్స్‌ మేకింగ్‌ వేల్యూస్‌ ఎలా ఉన్నాయి?  - నా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని కథకు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి ఈ సినిమాని హాలీవుడ్‌ స్థాయిలో నిర్మించారు. ఫస్ట్‌ మా నిర్మాతలు రామ్‌, గోపీ, అనీల్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా ఎక్కువ శాతం యు.ఎస్‌లో షూటింగ్‌ జరిగింది. ఎవరూ చేయనటువంటి కాస్ట్‌లీ లొకేషన్స్‌లో షూటింగ్‌ జరిపారు.  యాక్షన్‌ పార్ట్‌ ఎంతవరకు వుంటుంది?  - యాక్షన్‌ సీన్స్‌ కోసం బ్యాంకాక్‌ వెళ్లి కొంత ట్రైనింగ్‌ తీసుకున్నాను. కిచ్చ మాస్టర్‌ ఫెంటాస్టిక్‌ యాక్షన్‌ సీన్స్‌ కంపోజ్‌ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ చాలా హైలైట్‌గా వుంటుంది. ఈ ఫైట్‌లో అర్జున్‌గారు డూప్‌ లేకుండా రియలిస్టిక్‌గా చేశారు.  ఈ సినిమా మీ కెరీర్‌కి ఎంతవరకు ప్లస్‌ అవుతుంది?  - డెఫినెట్‌గా 'లై' సినిమా ఒక కొత్త ఇమేజ్‌ని తెస్తుంది. అలాగే నా కెరీర్‌లో ఒక మెమొరబుల్‌ మూవీగా నిలుస్తుందని నమ్ముతున్నాను.  హిట్‌, ఫ్లాపులను మీరు ఏవిధంగా స్వీకరిస్తారు?  - 'జయం', 'దిల్‌', 'సై' వరుసగా నేను హిట్స్‌ ఇచ్చాను. ఫస్ట్‌ ఆడియన్స్‌ హీరోగా నన్ను యాక్సెప్ట్‌ చేశారు. ఆ తర్వాత హిట్‌, ఫ్లాప్‌లు వచ్చాయి. ఎప్పుడూ మంచి సినిమా చెయ్యాలని తాపత్రయపడుతుంటాను. ఫస్ట్‌ నుండి యాక్టింగ్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌ బాగా కసితో చెయ్యాలని ఇంట్రెస్ట్‌ ఎక్కువ వుంటుంది. సంవత్సరానికి చేసే ఒక్క సినిమా అయినా ఆడియన్స్‌కి నచ్చేలా వుండాలని పక్కా ప్లానింగ్‌తో చేస్తాను. హిట్‌, ఫ్లాపులు అనేవి ఎవరికైనా వస్తాయి. ఏ సినిమాకి అయినా కష్టపడి ఇష్టంతో పని చేస్తాం. హిట్‌, ఫ్లాపులు అనేవి ఆడియన్స్‌ చేతిలో వుంటుంది.  మీరు కథ విన్నప్పుడు స్క్రీన్‌పై చూసుకున్నప్పుడు ఎలా అన్పించింది?  - హను నాకు కథ చెప్పినప్పుడు ఎలాగైతే ఫీలయ్యానో, సినిమా చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్‌ కల్గింది. చెప్పిన దాని కన్నా హండ్రెడ్‌ పర్సెంట్‌ స్ట్రాంగ్‌గా ఈ సినిమా తీశాడు. ఒక ఎమోషన్‌తో, మంచి స్టైలిష్‌ సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఆడియన్స్‌ బయటికి వస్తారు.  మణిశర్మ మ్యూజిక్‌ సినిమాకి ఎంతవరకు ప్లస్‌ అయ్యింది?  - చాలామందిని అనుకుని ఫైనల్‌గా మణిశర్మగారిని ఓకే చేశాం. ఆయన ఒక లెజెండరీ పర్సన్‌. ఈ సినిమాకి ప్రాణం పెట్టి మ్యూజిక్‌ చేశారు. ముఖ్యంగా ఇలాంటి సినిమాకి రీ-రికార్డింగ్‌ చాలా ఇంపార్టెంట్‌. మణిశర్మగారు రీరికార్డింగ్‌ చేయటంలో దిట్ట. ఈ సినిమాకి ఆయన రీరికార్డింగ్‌ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. 'లగ్గం టైమ్‌', 'సన్‌షైన్‌', 'బొమ్మాట' సాంగ్స్‌ ఆల్‌రెడీ సూపర్‌హిట్‌ అయ్యాయి. హాలీవుడ్‌ రేంజ్‌లో మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. 'లై'తో మళ్లీ మణిశర్మగారు మంచి ఫామ్‌లోకి వచ్చారు.  ఈ సినిమాలో మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంతవరకు వుంది?  - హను, నేను వన్‌ ఇయర్‌ నుండి ట్రావెల్‌ అవుతున్నాం. ఫస్ట్‌ సార్‌.. సార్‌ అని పిలుచుకునేవాళ్లం. షూటింగ్‌ మధ్యలో పేర్లు పెట్టి పిలుచుకున్నాం. ఇప్పుడు ఏరా.. పోరా అనుకుంటున్నాం. అంతలా మా ఇద్దరి మధ్య బాండింగ్‌ కుదిరింది. ఎలాంటి సినిమా అయినా చేయగల సత్తా హనుకి వుంది అని స్ట్రాంగ్‌ ఫీలింగ్‌. ఈ సినిమాతో మేమిద్దరం చాలా క్లోజ్‌ అయ్యాం.  కామెడీ పార్ట్‌ ఎంతవరకు వుంటుంది?  - సెపరేట్‌ కామెడీ ట్రాక్‌ అని ఏమీ వుండదు. కథలో భాగంగా కామెడీ వుంటుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ హ్యూమరస్‌గా వుంటుంది. అలాగే మధు చేసిన కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఆల్‌ కమర్షియల్‌ ఇంగ్రీడియంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి.  హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?  - చైత్ర క్యారెక్టర్‌లో మేఘా ఆకాష్‌ నటించింది. బాగా రిచ్‌ అమ్మాయి. ఈ సినిమాకి బాగా యాప్ట్‌ అయ్యింది. మంచి టాలెంట్‌ వుంది. డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో బిగ్‌ హీరోయిన్‌ అవుతుంది.  ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ని ఇమిటేట్‌ చేశారని తెల్సింది?  - 'తమ్ముడు' సినిమాలోని లుంగి కట్టుకుని, బీడి కాల్చే డ్యాన్స్‌ సీన్‌ని ఈ చిత్రంలో ఉపయోగించాం. చాలామంది పవన్‌కళ్యాణ్‌గారిని నీ సినిమాలకి బాగా వాడుకుంటున్నావ్‌ అని అందరూ అడిగారు. కానీ నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకి పెద్ద వీరాభిమానిని. నా లైఫ్‌లాంగ్‌ చేసే సినిమాల్లో ఆయన చిత్రంలోని సీన్‌ ఏదో ఒకటి ఉపయోగిస్తాను. ఎందుకంటే ఆయనంటే నాకు అంత ఇష్టం.  క్యారెక్టర్‌ పరంగా ఎలాంటి కేర్‌ తీసుకున్నారు?  - దాదాపు అయిదారు నెలలు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేశాం. నా క్యారెక్టర్‌ పరంగా కానీ, లుక్స్‌పరంగా కానీ చాలా కేర్‌ తీసుకున్నాం. ఈ సినిమాకి అలెగ్జాండర్‌ విజయ్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌గా వర్క్‌ చేశారు. చాలామంది హీరోలకి తను చేస్తుంటాడు. ఈ సినిమాలో చాలా రకాల గెటప్‌లలో కన్పిస్తాను. కాస్ట్యూమ్స్‌ పరంగా, హెయిర్‌ స్టైల్‌ పరంగా ఒక కొత్త నితిన్‌ని ఈ సినిమాలో చూస్తారు. స్టైలిష్‌ అనేది సినిమాని బట్టి, క్యారెక్టర్‌ని బట్టి వుంటుంది. ఈ సినిమా చాలా కొత్తగా వుంటుంది.  మీ తదుపరి చిత్రాలు?  - ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌గార్లు నిర్మించే సినిమా చేస్తున్నాను. కృష్ణచైతన్య దర్శకుడు. మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కొన్ని కథలు వింటున్నాను. ఇంకా ఏదీ ఫైనలైజ్‌ కాలేదు. చర్చల దశలోనే వున్నాయి.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు యూత్‌స్టార్‌ నితిన్‌. Last Updated 26, Mar 2018, 12:01 AM IST
0business
రిసెప్షన్ ఏర్పాట్లలో బిజీబిజీ గా అక్కినేని కుటుంబం Highlights అక్టోబర్ 6న చైతు, సమంతల వివాహం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ పెళ్లి పనుల్లో బిజీ గా అక్కినేని కుటుంబం అక్కినేని కుటుంబం అంతా బిజీబిజీగా గడిపేస్తోంది. ఒక వైపు సినిమా షూటింగ్ లు, మరోవైపు చైతన్య, సమంత పెళ్లి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. టాలీవుడ్ ప్రేమ జంట.. నాగ చైతన్య, సమంతల పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నారన్న విషయం తెలిసిందే.   అయితే..వారి వివాహం మరెంతో దూరంలో లేదు. అక్టోబర్ 6వ తేదీన అత్యంత సన్నిహితుల మధ్య వివాహం జరిపిస్తున్నారు. రెండు సంప్రదాయాల్లో ఈ వివాహం జరిపిస్తుండగా..రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అక్టోబర్ 10వ తేదీనే సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించి రిసెప్షన్ నిర్వహించాలనేది నాగార్జున  ఆలోచన.   పెళ్లికి, రిసెప్షన్ మధ్య గ్యాప్ కూడా పెద్దగా లేదు. ఈ పెళ్లికి ముందుగానే నాగచైతన్య, సమంతలు తాము అంగీకరించిన సినిమాల షూటింగ్ పూర్తి చేసుకోవాలి అనుకుంటున్నారు. దీంతో ఫంక్షన్ పనులు ఎక్కడికక్కడే పడి ఉన్నాయట. దీంతో ఒక వైపు షూటింగ్ లకు హాజరౌతూనే నాగ్, చైతు, సమంతలు పెళ్లి పనులు చక్కపెట్టుకుంటున్నారట. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
Hyd Internet 83 Views SEHWAGH virendra sehwag ఢిల్లీ: స్లెడ్జింగ్‌కు మారుపేరుగా నిలిచే ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుత భారత పర్యటనలో స్లెడ్జింగ్‌కు దిగకపోవడానికి కారణం ఐపీఎల్‌ అని భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నారు. సెహ్వాగ్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లందరూ వేలంలో పాల్గొనాల్సి ఉంది. ఇలాంటి సమయంలో వన్డే సిరీస్‌లో భారత ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు పాల్పడితే ప్రాంఛైజీలు వారిని తీసుకునేందుకు ఆలోచిస్తాయి. ఆసీస్‌ స్లెడ్జింగ్‌కు పాల్పడకపోవడానికి ఇదీ ఒక కారణమని చెప్పొచ్చు అని ఆయన తెలిపారు.
2sports
New Delhi, First Published 19, Mar 2019, 10:49 AM IST Highlights భారత ఐటీ రంగంలో అనూహ్య పరిణామం చోటు చేసుకోనున్నది. బలవంతంగా గుప్పిట్లోకి తీసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైండ్ ట్రీ సంస్థను చేజిక్కించుకునేందుకు ఎల్ అండ్ ట్రీ ప్రయత్నాలు సాగిస్తున్నది.  భారత ఐటీ రంగంలోనే తొలి బలవంతపు టేకోవర్‌కు రంగం సిద్ధమైంది. ప్రమోటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. మౌలిక రంగ దిగ్గజంగా పేరొందిన ఎల్ అండ్ టీ అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ ఇన్ఫోకామ్.. మైండ్ ట్రీ అనే ఐటీ కంపెనీలో మెజారిటీ వాటా స్వాధీనానికి కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్లే సోమవారం రాత్రి పావులు కదిపింది.  66% వాటా కోసం రూ.10,800 కోట్ల ఆఫర్ మైండ్ ట్రీలో 66 శాతం వరకు వాటా కొనుగోలు చేసేందుకు రూ.10,800 కోట్లను ఆఫర్‌ చేసింది. అంతకుముందు కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ నుంచి 20.32% వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. అప్పుడే బహిరంగ మార్కెట్‌ నుంచి మరో 15 శాతాన్ని సొంతం చేసుకోవడానికి బ్రోకర్ల ద్వారా ఆర్డర్లు పెట్టింది. ప్రతిపాదిత కొనుగోలు 2019-20 తొలి త్రైమాసికంలో పూర్తవుతుందని సమాచారం.  మైండ్ ట్రీ, ఎల్ అండ్ ట్రీ మధ్య కొత్త మలుపులు దీంతో ఇటు మైండ్ ట్రీ వ్యవస్థాపకులు, అటు దిగ్గజ సంస్థ ఎల్‌అండ్‌టీ మధ్య పోరు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. కంపెనీపై పట్టు కోల్పోకుండా చూసుకునేందుకు మైండ్ ట్రీ వ్యవస్థాపకులు ప్రయత్నిస్తున్నారు. టేకోవర్‌ చేసేందుకు అటు ఎల్‌అండ్‌టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాఫీ డే ‘సిద్ధార్థ’ వాటా కొనుగోలు తర్వాత ఓపెన్ ఆఫర్‌పై ఇలా మెజారిటీ వాటాదారు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ వాటాలను కొనుగోలు తర్వాత  మైండ్ ట్రీ సంస్థకు ఓపెన్‌ ఆఫర్‌ కూడా ప్రకటిస్తున్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకూ తెలిపింది. టేకోవర్‌ తర్వాత కూడా మైండ్‌ట్రీ లిస్టెడ్‌ కంపెనీగానే కొనసాగుతుందని ఎల్‌అండ్‌టీ సీఈవో ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు.  సంస్థ నియంత్రణ కాపాడుకునేందుకు మైండ్ ట్రీ వ్యవస్థాపకులు కంపెనీ తమ చేతుల నుంచి చేజారిపోకుండా కాపాడుకునేందుకు మైండ్‌ట్రీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సుబ్రతో బాగ్చీ.. ఈ నెల 17న ఒడిశా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధిపతి పదవికి రాజీనామా చేశారు. తదుపరి మైండ్ ట్రీ మనుగడ కాపాడుకునే వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు.  ఇలా ‘ఎల్ అండ్ టీ’పై సుబ్రతో బాగ్చీ ట్వీట్స్ ‘మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్‌ చేసే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి, కంపెనీని కాపాడుకునేందుకు వెళ్లక తప్పడం లేదు. చెట్టును (ట్రీ) నరికేసి ఆ స్థానంలో షాపింగ్‌ మాల్‌ కట్టేందుకు బుల్‌డోజర్లు, రంపాలతో వచ్చిన వాళ్ల నుంచి కంపెనీని కాపాడుకోవాల్సి ఉంది’ అంటూ ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘మైండ్‌ ట్రీ అనేది కొనుగోలు చేయడానికి లేదా అమ్మే ఆస్తి కాదు. అది ఒక జాతీయ సంపద. విశిష్ఠ సంప్రదాయం కలిగి ఉంది. కార్పొరేట్‌ పాలనలో ప్రామాణికంగా మారింద’ని చెప్పుకొచ్చారు. సిద్ధార్థ నుంచి రూ.3,269 కోట్లకు వాటా కొనుగోలు ఒకవేళ మైండ్‌ట్రీని గానీ ఎల్‌అండ్‌టీ చేజిక్కించుకోగలితే దేశీ ఐటీ రంగంలో ఇది తొలి హోస్టైల్‌ టేకోవర్‌ కానుంది.  మైండ్‌ ట్రీలో పెద్ద వాటాదారు సిద్ధార్థ నుంచి వాటాల కొనుగోలు కోసం ఎల్‌అండ్‌టీ షేర్ ఒక్కింటికి రూ. 980 చొప్పున దాదాపు రూ. 3,269 కోట్లు వెచ్చిస్తోంది. ఓపెన్‌ మార్కెట్‌ నుంచి ఇంకో 15 శాతం కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 2,434 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు, షేర్ ఒక్కింటికి రూ. 980 చొప్పున రేటుతో మరో 31 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇందుకోసం దాదాపు రూ. 5,027 కోట్లు వెచ్చించాల్సి రానుంది. మూడంచెల్లో ఎల్ అండ్ టీకి 66.3% వాటాలు మొత్తం మీద మూడంచెల ఈ డీల్‌తో మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీకి 66.3% దాకా వాటాలు లభించే అవకాశం ఉంది. ఇందుకోసం మొత్తం రూ. 10,730 కోట్ల దాకా వెచ్చించే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌కు యాక్సిస్‌ క్యాపిటల్, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా సంస్థలు మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. టేకోవర్‌ యత్నాలను ఎదుర్కొనేందుకు మైండ్ ట్రీవ్యవస్థాపకులు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్ధార్థ వాటాల బైబ్యాక్ పై ఇతర మైండ్ ట్రీ వ్యవస్థాపకుల ఫోకస్ సిద్ధార్థ నుంచి వాటాలను బైబ్యాక్‌ చేయడంపైనా ఇతర మైండ్ ట్రీ వ్యవస్థాపకులు దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం గత రెండు నెలలుగా కేకేఆర్, బేరింగ్‌ ఏషియా, క్రిస్‌క్యాపిటల్‌ తదితర ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఇవేమీ ముందుకు సాగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు మూడు ప్రధాన కారణాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.  నియంత్రణ వదులుకునేందుకు మైండ్ ట్రీ మేనేజ్మెంట్ నో మైండ్ ట్రీ కంపెనీ యాజమాన్య అధికారాన్ని ఎక్కువగా వదులుకునేందుకు వ్యవస్థాపకులు సిద్ధంగా లేకపోవడం, ఎల్‌అండ్‌టీ ఇచ్చే ఆఫర్‌కి దీటుగా చాలా మటుకు ఇన్వెస్టర్లు నిధులు వెచ్చించే అవకాశాలు లేకపోవడం, ఎల్‌ & టీతో పోరాటమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం ఇందుకు కారణాలని తెలుస్తోంది.   ఇలా మైండ్ ట్రీ స్థాపన 1999లో సుబ్రతో బాగ్చీ, అశోక్‌ సూతా, నమకల్‌ పార్థసారథి, కృష్ణకుమార్‌ నటరాజన్, స్కాట్‌ స్టేపుల్స్‌ తదితరులు 10 మంది కలిసి మైండ్‌ట్రీ కన్సల్టింగ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. 2000లో వీజీ సిద్ధార్థ నుంచి తొలి విడత కొంత మేర పెట్టుబడులు సమీకరించారు. 2008లో మైండ్‌ట్రీ కన్సల్టింగ్‌ పేరు మైండ్‌ట్రీగా మారింది.  అశోక్ సూత వాటాల కొనుగోలుతో సిద్ధార్థ ఇలా కీలకం 2011లో వ్యవస్థాపక చైర్మన్‌ అశోక్‌ సూతా రాజీనామా చేసినప్పుడు ఆయన వాటాలను కూడా కొనుగోలు చేసిన సిద్ధార్థ.. అతి పెద్ద షేర్‌హోల్డర్‌గా మారారు. 2018లో మైండ్‌ట్రీ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పుకున్న సిద్ధార్థ.. తన వాటాలను విక్రయానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌తో సిద్ధార్థ చర్చలు కూడా జరిపారు. ఇలా ఎల్ అండ్ టీ ప్రయత్నాలు అదే సమయంలో ఐటీ కార్యకలాపాల విభాగం (ఎల్‌అండ్‌టీ  ఇన్ఫోటెక్‌ –ఎల్‌టీఐ) కూడా ఉన్న ఎల్‌అండ్‌టీ అప్పుడే ఇతర సంస్థల కొనుగోలు ప్రయత్నాల్లో ఉండటంతో.. దీనిపైనా దృష్టి సారించింది. మిగతా వ్యవస్థాపకులను కూడా ఒప్పించగలిగితే.. మరింత అధిక రేటు ఇస్తామంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎఎం నాయక్‌ ఆఫర్‌ ఇవ్వడంతో.. సిద్ధార్థ ఆ ప్రయత్నాలూ చేశారు.  ఎల్ అండ్ టీ ప్రపోజల్ కు మైండ్ ట్రీ నో కానీ, మైండ్ ట్రీ వ్యవస్థాపకులు ఇందుకు ఇష్టపడటం లేదు. రెండు సంస్థల నిర్వహణ తీరు, పని సంస్కృతిలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని వారు భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇదే సాకుతో సంస్థాగత ఇన్వెస్టర్లు, క్లయింట్లు,  ఉద్యోగులు ఈ డీల్‌పై విముఖంగా ఉన్నారంటూ ఇటీవలే ఎల్‌అండ్‌టీ బోర్డుకు కూడా వారు లేఖ రాసినట్లు సమాచారం.  సోమవారం మైండ్‌ట్రీ షేరు బీఎస్‌ఈలో 1.74 శాతం పెరిగి రూ. 962.50 వద్ద ముగిసింది. మైండ్ ట్రీ ప్లస్ పాయింట్స్ ఇవీ దాదాపు ఒక బిలియన్‌ డాలర్ల ఆదాయం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. క్లౌడ్, బిగ్‌ డేటా వంటి కొంగొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలు మైండ్‌ట్రీకి ప్లస్‌ పాయింట్లు కాగా, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ) దీనిపై ఆసక్తి కనబరుస్తోంది. ఎల్‌టీఐ నికర విలువ దాదాపు రూ. 4,387 కోట్లు. మైండ్ ట్రీ పరిస్థితి ఇది 2018 డిసెంబర్‌ నెలాఖరు నాటికి సంస్థ దగ్గర సుమారు రూ. 2,032 కోట్ల మేర నగదు, లిక్విడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. మైండ్‌ట్రీలో 51 శాతం వాటాలు దక్కించుకున్న పక్షంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఎల్‌టీఐకి అదనంగా మైండ్‌ట్రీ నుంచి రూ. 460 కోట్ల దాకా లాభాలు దఖలుపడతాయి. రెండూ కలిశాయంటే.. ఆదాయాలు 1.7 బిలియన్‌ డాలర్ల దాకా ఉంటాయని అంచనా.  దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఆరో స్థానం మైండ్ ట్రీ సంస్థను ఎల్ అండ్ టీ టేకోవర్ చేస్తే దేశీయ ఐటీలో ఆరు పెద్ద సంస్థ ఏర్పాటైనట్లవుతుంది. రెండింటికీ అమెరికా, యూరప్‌లే ప్రధాన మార్కెట్లు. టెక్నాలజీ, మీడియా, సర్వీసెస్‌ విభాగాల్లో మైండ్‌ట్రీ పటిష్టంగా ఉండటం.. ఎల్‌టీఐకి లాభించనుంది. మైండ్‌ట్రీ మొత్తం వ్యాపారంలో డిజిటల్‌ వాటా 49.5 శాతం కాగా ఎల్‌టీఐకి 37 శాతమే ఉంది. అంతేకాక ఉద్యోగిపై సగటు ఆదాయాన్ని చూస్తే ఎల్‌టీఐ కన్నా మైండ్‌ట్రీదే పైచేయిగా ఉంది. మైండ్‌ట్రీకి ప్రస్తుతం 19,908 మంది ఉద్యోగులు, 340 మంది క్లయింట్లు ఉన్నారు.  ఇప్పటికే ఎల్ అండ్ టీకి రెండు ఐటీ సంస్థలు ఎల్‌ అండ్‌ టీకి ఇప్పటికే ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ పేరిట రెండు ఐటీ కంపెనీలున్నా.. మైండ్‌ ట్రీని కూడా జత చేసుకుని క్లయింట్ల పరిధిని, ఉత్పత్తుల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది. ఎల్‌ అండ్‌ టీ గతంలోనూ కొన్ని పెద్ద కంపెనీలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. ఎంఫసిస్‌(2013), హెక్సావేర్‌(2012), ఈఎక్స్‌ఎల్‌ సర్వీసెస్‌(2011) వంటివాటిపై అప్పట్లో కన్నేసిందన్న వార్తలు వచ్చాయి. కానీ అవేవీ జరగలేదు.  మైండ్ ట్రీ వ్యాపార పురోగతికి నో డోకా మైండ్‌ ట్రీ 2018-19లో ఇప్పటిదాకా పొందిన కాంట్రాక్టుల విలువ 16.8% మేర పెరిగిందంటే.. ఆ సంస్థ వ్యాపార వృద్ధికి ఢోకా లేదని అర్థమవుతూనే ఉంది. 2018-2020లో 15.6 శాతం మేర డాలర్ల ఆదాయం పెరుగుతుందన్న ఆదాయాలూ ఉన్నాయి. ఇవన్నీ చూసే ఎల్‌ అండ్‌ టీ ఈ కంపెనీపై కన్నేసిందని అనుకోవాలి. మైండ్ ట్రీ ప్రమోటర్ల వాటా 13 శాతం ప్రస్తుతం మైండ్‌ట్రీ ప్రమోటర్ల గ్రూప్‌లో భాగమైన బాగ్చీ, పార్థసారథి, నటరాజన్, సీఈవో రోస్టో రవనన్‌ తదితరులకు 13 శాతం వాటాలు ఉన్నాయి. నటరాజన్‌కు 3.72 శాతం, పార్థసారథికి 1.43 శాతం, రావణన్‌కు 0.71 శాతం, బాగ్చీకి 3.1 శాతం వాటాలు ఉన్నాయి. కాఫీ డే, సిద్దార్థ వాటాల విక్రయం.. కాఫీ డేపైనే సిద్దార్థ ఫోకస్ ‘కాఫీ డే ట్రేడింగ్‌, వి.జి. సిద్ధార్థ, ఇతరులు కలిసి మైండ్‌ ట్రీలు తమకున్న మొత్తం వాటాను రూ.3,269 కోట్లకు విక్రయిస్తున్న’ట్లు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ నిధుల ద్వారా కాఫీ డే గ్రూప్‌ తన రుణాలను తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ వ్యాపార పునర్నిర్మాణం వల్ల మా పోర్ట్‌ఫోలియోను తగ్గించుకుని.. మా కాఫీ వ్యాపారంపై ఎక్కువ సమయం కేటాయించడానికి సమయం చిక్కుతుందని సిద్ధార్థ పేర్కొన్నారు.     ఎస్ఎం క్రుష్ణ అల్లుడే వీజీ సిద్దార్థ భారత విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి ఎస్‌.ఎమ్‌. కృష్ణ అల్లుడే ఈ సిద్ధార్థ. కాఫీ డేను వ్యవస్థాపించడం  ద్వారా ఈయన పేరు సంపాదించుకున్నారు. అతిపెద్ద కాఫీ ఎగుమతిదారు కూడా ఆయనే కావడం గమనార్హం. 1999లో తొలుత మైండ్‌ ట్రీలో 6.6 శాతం వాటాను కొనుగోలు చేసిన సిద్ధార్థ జూన్‌ 2011 నుంచి ఆ వాటాను పెంచుకుంటూ పోయారు. అయితే 10 నెలల కిందటి నుంచి కంపెనీ నుంచి నిష్క్రమించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాతే బోర్డు నుంచీ వైదొలగారు. ఇపుడు మైండ్‌ ట్రీ కొనుగోలులో ఎల్‌ అండ్‌ టీకి చుక్కానిలా మారారు. Last Updated 19, Mar 2019, 10:49 AM IST
1entertainment
Airtel ఎయిర్‌టెల్‌ నుంచి ఇంటర్నెట్‌ టివి హైదరాబాద్‌: ఎయిర్‌టెల్‌ కొత్తగా డిజిటల్‌ గృహాలకోసం ఇంటర్నెట్‌టివిని ప్రారంభించింది. మొట్ట మొదటి హైబ్రిడ్‌ డిటిహెచ్‌ సెట్‌టాప్‌బాక్స్‌్‌ ఆండ్రా యిడ్‌ టివితో ఆన్‌లైన్‌ ప్రపంచానికి చేరువ అవుతోంది. మొత్తం 500కిపైగా శాటిలైట్‌టివి ఛానళ్లు అందుబాటు లోకి వస్తాయి. ముందుగా లోడ్‌చేసిన నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, గూగుల్‌ప్లేగేమ్స్‌, ఎయిర్‌టెల్‌ మూవీస్‌, మరిన్ని ఫీచర్లు ఉంటాయి. గూగుల్‌ప్లేస్టోర్‌కు అత్యంత యాక్సెస్‌అవుతుంది. యాప్స్‌, గేమ్స్‌ను టివికి చేరువ చేసింది. టివినిస్మార్ట్‌టివిగా మార్చేందుకు అన్నివిధాలా అనువైన ఫీచర్లతో ఇంటర్నెట్‌టివిని ఎయిర్‌టెల్‌ ప్రవేశ పెట్టింది. డిటిహెచ్‌ ఎయిర్‌టెల్‌ సిఇఒ సునీల్‌తాల్దార్‌ మాట్లాడుతూ బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగం పెరుగుతున్న నేటిరోజుల్లో ఇంటర్నెట్‌ టివికి విస్తృతప్రాచుర్యం లభి స్తోందన్నారు. ఇంటర్నెట్‌ టివి కస్టమర్లు మైఎయిర్‌టెల్‌ యాప్‌లో మైహోమ్‌ ఫీచర్‌కింద రిజిష్టరుచేసుకుంటే 25జిబి నెట్‌ వినియోగించుకునే వెసులుబాటు ఉందని అన్నారు. ప్రతినెలా అదనపుడేటాగా అందుతుంది. ప్రస్తు త ఎయిర్‌టెల్‌ డిజిటల్‌టివి కస్టమర్లు నిర్దేశించిన నంబరు కు మిస్‌కాల్‌ ఇస్తే పూర్తి సమాచారం అందుతుంది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV IPL Craze: పెళ్లి రిసెప్షన్ రోజే ఐపీఎల్ ఫైనల్.. ఆ జంట ఏం చేసిందంటే..? ఐపీఎల్ ఫైనల్ రోజున మ్యారేజ్ రిసెప్షన్. దీంతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం తమ రిసెప్షన్‌కి ఎక్కడ ఎగ్గొడతారనుకున్నారే ఏమో. ఓ జంట వేదిక పక్కనే ఐపీఎల్‌ను లైవ్ ప్రసారం చేయించింది. Samayam Telugu | Updated: May 13, 2019, 10:39PM IST IPL Craze: పెళ్లి రిసెప్షన్ రోజే ఐపీఎల్ ఫైనల్.. ఆ జంట ఏం చేసిందంటే..? హైలైట్స్ ఐపీఎల్ ఫైనల్ రోజున మ్యారేజ్ రిసెప్షన్. దీంతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం తమ రిసెప్షన్‌కి ఎక్కడ ఎగ్గొడతారనుకున్నారే ఏమో. ఓ జంట వేదిక పక్కనే ఐపీఎల్‌ను లైవ్ ప్రసారం చేయించింది. ఐపీఎల్ ఫీవర్ దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఈ సమ్మర్లో ఐపీఎల్ మ్యాచ్‌లను ఆస్వాదించడానికి ఆసక్తి చూపారు. ఇక ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. ఆఖరి బంతికి ఒక్క పరుగు తేడాతో ముంబై గెలిచిన ఈ మ్యాచ్‌ క్రికెట్ ఫ్యాన్స్‌ని ముని వేళ్ల మీద నిలబెట్టింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న చెన్నై ఫ్యాన్స్ ఢీలా పడగా.. ముంబై అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఐపీఎల్ మ్యాచ్ ఉందని చెప్పి ఎక్కడ తమ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రారని భావించారో ఏమో.. ఓ జంట తమ పెళ్లి రిసెప్షన్లో పాటల ప్రోగ్రాంలు పెట్టడానికి బదులు ఎల్ఈడీ స్క్రీన్‌పై ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లైవ్ ప్రసారం చేసింది. రిసెప్షన్‌కు వచ్చిన వాళ్లంతా ఐపీఎల్ క్రేజ్ ఎంతలా ఉందంటే.. వధూవరులను పట్టించుకోవడం మానేసి ధ్యాస మొత్తం క్రికెట్ మ్యాచ్‌పై పెట్టారు. ఆఖర్లో మలింగ బౌలింగ్ చేస్తుంటే సైలెంట్‌గా చూస్తుండిపోయారు. చివరి బంతికి శార్దుల్ ఠాకూర్‌ను మలింగ ఎల్బీ చేయగానే సంబరాలతో హోరెత్తించారు. డప్పులు వాయిస్తూ.. ఈలలేస్తూ తెగ సందడి చేశారు. వాట్సప్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను క్రికెట్ స్టాటిషియన్ సారంగ్ భలేరావు ట్వీట్ చేశారు. This is from one of the wedding receptions. Cricket took the centre stage. Check out the celebrations in the end. T… https://t.co/PA0PJNFLgB — Sarang Bhalerao (@bhaleraosarang) 1557757162000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV అఖిల్ ప్రేమిస్తోంది ఎవరినో తెలుసా? నాగార్జున ముద్దుల కొడుకు అఖిల్ ఇప్పటికే తెరంగేట్రం చేసి హీరో అనిపించుకున్నాడు. TNN | Updated: Apr 23, 2016, 08:52AM IST నాగార్జున ముద్దుల కొడుకు అఖిల్ ఇప్పటికే తెరంగేట్రం చేసి హీరో అనిపించుకున్నాడు. ఓ స్టార్ హీరో కొడుకుగా అఖిల్ కి చిన్నప్పట్నించి క్రేజ్ ఉంది. కాగా అఖిల్ తన ప్రేమ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. తాను ప్రేమిస్తోంది ఎవరినో? తన మహారాణి ఎవరో చెప్పాడు. ఆ మహారాణి పేరు ‘ఖలిసి’. పేరు కొత్తగా ఉందా? ఉంటుంది మరి... ఎంతైనా కుక్క పేరు కదా. అవును ఖలిసి అనే ఆడకుక్క అంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడు. ట్విట్టర్లో ‘మై క్యూటీ... ఆమెను ప్రేమిస్తున్నా... పేరు ఖలిసి... నా జీవితానికి ఆమెనే మహారాణి’ అని ట్వీట్ చేశారు. ఖలిసితో కలిసి ఉన్న ఫోటోని కూడా పెట్టాడు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భారత్‌లో పోలీసులూ మ్యాచ్‌ల్ని చూస్తారు..! భారత్‌లో అభిమానుల్ని భద్రతా సిబ్బంది నియంత్రించడం కష్టం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో అయితే.. సెక్యూరిటీ సిబ్బంది అభిమానుల్ని గమనిస్తూ వారికి ఎదురుగా కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. కానీ.. భారత్‌లో రివర్స్ - సునీల్ గవాస్కర్ Samayam Telugu | Updated: Mar 6, 2019, 08:34PM IST భారత్‌లో పోలీసులూ మ్యాచ్‌ల్ని చూస్తారు..! హైలైట్స్ ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డే భారత్ జట్టు ఫీల్డింగ్ వెళ్తుండగా.. మైదానంలోకి ప్రవేశించిన అభిమాని భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఆకాశ్ చోప్రా అభిమానులతో పాటు సెక్యూరిటీ వాళ్లు మ్యాచ్‌ను చూస్తారని గవాస్కర్ సరదా వ్యాఖ్య ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీతో కరచాలనం కోసం అభిమాని వెంటపడటంపై చర్చ కొనసాగుతోంది. భద్రతా వలయాన్ని దాటుకుని మైదానంలోకి ప్రవేశించిన అభిమాని.. తనవైపు రావడాన్ని గమనించిన ధోనీ.. అతనికి అందకుండా పరుగెత్తగా.. అభిమాని కూడా వెంటపడిన విషయం తెలిసిందే. దీంతో.. అంతర్జాతీయ క్రికెటర్ల భదత్రలోని డొల్లతనంపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా మండిపడగా.. సునీల్ గవాస్కర్ మాత్రం సరదాగా స్పందించాడు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV లెక్కసరి.. రెండో టీ20లో వరల్డ్ ఎలెవన్‌ గెలుపు తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన పాక్ ఆటగాళ్లు.. రెండో మ్యాచ్‌లో చేతులెత్తేశారు. బ్యాటింగ్‌లో రాణించినా బౌలింగ్‌లో సత్తాచాటలేకపోయారు. TNN | Updated: Sep 14, 2017, 08:56AM IST తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన పాక్ ఆటగాళ్లు.. రెండో మ్యాచ్‌లో చేతులెత్తేశారు. బ్యాటింగ్‌లో రాణించినా బౌలింగ్‌లో సత్తాచాటలేకపోయారు. హసీం ఆమ్లా, తిసార పెరీర ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. దీంతో బుధవారం లాహోర్‌లో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో వరల్డ్ ఎలెవెన్ ఘన విజయం సాధించింది. ఇండిపెండెన్స్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిసీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (43: 34 బంతుల్లో 5x4)తో పాటు బాబర్ అజామ్ (45: 38 బంతుల్లో 5x4), షోయబ్ మాలిక్ (39: 23 బంతుల్లో 1x4, 3x6) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ ఎలెవెన్ ఓపెనర్ హసీం ఆమ్లా చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ (72 నాటౌట్: 55 బంతుల్లో 5x4, 2x6)తో చివరి వరకు నిలిచాడు. మరోవైపు శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారా పెరీర (47 నాటౌట్: 19 బంతుల్లో 5x6) సిక్సులతో హోరెత్తించాడు.
2sports
Hyderabad, First Published 13, Sep 2019, 6:19 PM IST Highlights నెక్స్ట్ ఈ దర్శకుడు ఎలాంటి కథతో వస్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. మహేష్ బాబుతో ఒక సినిమా సెట్టయ్యింది అని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ వాటిపై ఇంకా ఇరువురి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.  అర్జున్ రెడ్డి సినిమాతో సక్సెస్ అందుకున్న టాలీవుడ్ యువ దర్శకుడు సందీప్ వంగ అదే కథతో బాలీవుడ్ లో కూడా సాలిడ్ హిట్ అందుకున్నాడు. అయితే నెక్స్ట్ ఈ దర్శకుడు ఎలాంటి కథతో వస్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. మహేష్ బాబుతో ఒక సినిమా సెట్టయ్యింది అని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ వాటిపై ఇంకా ఇరువురి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.  ఫైనల్ గా బాలీవుడ్ లోనే ఈ దర్శకుడు ఒక సినిమా చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కబీర్ సింగ్ నిర్మాతలు సందీప్ తో మరో  సినిమాను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ తో ఆప్రాజెక్ట్ ను సెట్ చేసుకునేందుకు నిర్మాతలు దర్శకుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.  ఇప్పటికే సందీప్ షాహిదీ కి స్టోరీ లైన్ వినిపించాడట, కథ నచ్చడంతో అతను మరోసారి సందీప్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ స్టోరీని తెలుగులోనే చేస్తాడనుకున్న సందీప్ మళ్ళీ బాలీవుడ్ బాట పట్టడంతో ఇప్పట్లో అతను తెలుగు సినిమా చేయలేడు అనే టాక్ వైరల్ గా మారింది.  Last Updated 13, Sep 2019, 6:19 PM IST
0business
Visit Site Recommended byColombia దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌ల్లో ఒకర్ని రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసేందుకు ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మనకు బలమైన జట్టు అవసరం. ఐపీఎల్ ఆరంభానికి ముందే వరల్డ్ కప్‌ కోసం ఎంపిక చేసే జట్టు విషయంలో స్పష్టత అవసరం. ఒకరిద్దరు ఆటగాళ్లు ఐపీఎల్‌లో మెరుగ్గా ఆడకున్నా.. వారి వరల్డ్ కప్ అవకాశాలపై అది ప్రభావం చూపదని విరాట్ తెలిపాడు. బ్యాటింగ్ కాంబినేషన్లను మార్చడానికి సుముఖంగా ఉన్నామన్న కోహ్లి.. బౌలింగ్ కాంబినేషన్‌లో మార్పు ఉండదని తెలిపాడు. కేఎల్ రాహుల్‌కు జట్టులో చోటుపై కోహ్లి సానుకూల సంకేతాలిచ్చాడు. టీ20ల్లో ఆస్ట్రేలియా మెరుగ్గా ఆడటం వల్లే ఆ జట్టు సిరీస్ గెలుపొందిందన్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
READ ALSO: RRR భామ అండర్‌వాటర్ ఫొటోషూట్.. మరీ ఇంత సెక్సీగానా! దీనిని బట్టి చూస్తే గతంలో చెప్పిన కలెక్షన్స్‌కు 13 శాతం తక్కువ. ఏదేమైనప్పటికీ హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. వారు చూడని యాక్షన్ సినిమాలతో పోలిస్తే సాహోలో ఏమీ లేదు. అయినప్పటికీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు ఏర్పడిన క్రేజ్ వల్లో ఏమో కానీ సాహో సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రూ.424 కోట్లు వచ్చాయి. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. READ ALSO: Rana Daggubatiతో రకుల్ ప్రీత్ సింగ్ డేటింగ్? సాహో సినిమాను బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రభాస్ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. కానీ ఈ సినిమా ఆడియన్స్‌ ఆశించినంత స్థాయిలో లేదని ప్రభాస్‌కి కూడా అర్థమైంది. అందుకే ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని ప్రభాస్‌కు తెలిసొచ్చింది. ఇంకెప్పుడూ ఇంతటి భారీ బడ్జెట్‌ సినిమాలు తీయనని చెప్పేశారు. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తున్నారు. సినిమాకు ‘జాను’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. READ ALSO: ‘నన్ను ముట్టుకుంటావా, నేను సెలబ్రిటీని’   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 12, Mar 2019, 3:54 PM IST Highlights సీనియర్ నటుడు పృధ్వీరాజ్ తెలుగులో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా కనిపించి మెప్పించారు. తెలుగులో ఒక టైంలో బిజీ యాక్టర్ గా కొనసాగాడు.  సీనియర్ నటుడు పృధ్వీరాజ్ తెలుగులో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా కనిపించి మెప్పించారు. తెలుగులో ఒక టైంలో బిజీ యాక్టర్ గా కొనసాగాడు. అయితే అతడి నటన హీరోలను డామినేట్ చేసే విధంగా ఉందని ప్రచారం చేయడంతో అవకాశాలు తగ్గాయని, చాలా సినిమాల్లో తను నటించిన సన్నివేశాలకు కత్తెర పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో కోలివుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. నటుడిగా కొనసాగుతున్న సమయంలో కొన్ని వ్యాపారాలు చేశాడట పృధ్వీ. కానీ వాటి వల్ల నష్టాలు వచ్చాయని, వ్యాపారం అచ్చి రావడం లేదని, నటనపైనే దృష్టి పెట్టినట్లు తెలిపాడు. వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలో రెమ్యునరేషన్ రూపంలో రూ.10 లక్షలు రావడంతో, మంచి ప్రాపర్టీ కొనాలని అనుకున్నారట. ఆ సమయంలో  తెలిసిన వ్యక్తి హైదరాబాద్ లో వంద ఎకరాల స్థలం అమ్మకానికి ఉందని తీసుకెళ్లారట. పది లక్షలకు వంద ఎకరాలు వస్తుండడంతో కొనాలని  నిర్ణయించుకున్నారట. కానీ తన డ్రైవర్ ఇది మొత్తం రాతి నేల అని కొనడానికి పది లక్షలు, ఫెన్సింగ్ మరో ఇరవై లక్షలు అవుతుందని.. ఈ ల్యాండ్ ని మైంటైన్ చేయడం రిస్క్ అని చెప్పడంతో డ్రాప్ అయిపోయాడట పృధ్వీ. అదే ఇప్పుడున్న శంషాబాద్ ఏరియా అంటూ వెల్లడించాడు. ఆ విధంగా కోట్లు నష్టపోయినట్లు తెలిపాడు.  Last Updated 12, Mar 2019, 3:54 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆసియా జూనియర్ హాకీ భారతజట్టు ఇదే.. మలేసియాలో ఈ నెల 14 నుండి 22వ తేదీ వరకు జరగనున్న జూనియర్ పురుషుల హాకీ ఆసియా కప్ టోర్నీకి భారత జట్టు ఖరారయ్యింది. PTI | Updated: Nov 3, 2015, 05:09PM IST మలేసియాలో ఈ నెల 14 నుండి 22వ తేదీ వరకు జరగనున్న జూనియర్ పురుషుల హాకీ ఆసియా కప్ టోర్నీకి భారత జట్టు ఖరారయ్యింది. మొత్తం 18మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను భారత హాకీ సంఘం ప్రకటించింది. ఈ టోర్నీలో భారత్ సహా ఆసియాలోని ఎనిమిది దేశాలు తలపడబోతున్నాయి. జట్టు కెప్టెనుగా హర్జీత్ సింగ్ ఎంపికయ్యాడు. మలేసియాలోనే జరిగిన సుల్తాన్ కప్పు టోర్నీలో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన సంగతి తెలిసిందే. హర్జీత్ సింగ్ చక్కని ఆటతీరును కనబరచడం ద్వారా సుల్తాన్ కప్ రన్నరప్ గా భారత్ నిలిచింది. జట్టు వివరాలు
2sports
RICE కరవు, వరదలతో డిమాండ్‌ బెంగళూరు, ఆగస్టు 18:బంగ్లాదేశ్‌లో వరదలకారణంగాను, శ్రీలంకలో కరవుపరిస్థితుల ఫలితంగా భారత్‌లోని నాణ్యతకలిగిన బియ్యంరకాల కు మంచి డిమాండ్‌ పలికిగింది. ఎగుమతులు కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సోనామసూరి వంటిరకం బియ్యానికి మరింత డిమాండ్‌ ఉంది. బంగ్లాదేశ్‌ ఇటీవలే 1.5 లక్షల టన్నుల బియ్యం, ఉప్పుడు బియ్యం దిగుమతులకు టెండర్లు ఆహ్వానించింది. ఈనెల మొదటి వారంలోనే నాలుగో టెండర్‌ వస్తుం దని అంచనా. బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలు రెండూ కూడా లక్షటన్నుల వరకూ దిగుమతిచేసునే అవకా శం ఉందని పట్టాభిఆగ్రో ఎండి బివికృష్ణారావు వెల్ల డించారు. ఆఫ్రికాదేశాలతోపోలిస్తే వారు అంత పెద్ద కొనుగోలుదారులేమీ కాదని అయితే ఆదేశంలో నెల కొన్న డిమాండ్‌కారణంగా ఎగుమతులకు అవకాశం పెరిగిందన్నారు. ఎగుమతిధరలు 15శాతం పెరిగా యి. టన్నుకు 360నుంచి 370 డాలర్లు గత జనవరి లో పలికితే ప్రస్తుతం టన్నుకు 420 నుంచి 430 డాలర్లుగా ధరలు పలుకుతున్నాయి. కనీస మద్దతు ధరల్లో పెరుగుదల, డాలర్‌ రూపాయి మారకం విలువల్లో మార్పులు వంటివి కూడా ఎగుమతులకు కీలకం అవుతున్నాయి. కేంద్రం క్వింటాలుకు కనీస మద్దతుధర రూ.80 పెంచి క్వింటాలుధర 1550గా నిర్ణయించింది. గడచిన కొన్నినెలలుగా డాలరుతో రూపాయిమారకం విలువలు 68గా ఉంటే 64 రూపాయలుగా ఉంది. ఎగుమతిధరల్లో పెరుగుదల స్థానిక ధరలపై ప్రభావంచూపిస్తుందని స్థానికంగా వినియోగం లేని వెరైటీలు ఎక్కువ ఎగుమతులు అవుతున్నట్లుతేలింది. ఖరీఫ్‌ ప్రధాన పంటగా ఉన్న ధాన్యం ఇప్పటికే ప్రారంభించారు. వరి ఆయకట్టు 16.7 లక్షల హెక్టార్లకు పెరిగింది. గత ఏడాదికంటే ఐదుశాతం కూడా పెరిగినట్లు అంచనా. ఇక భారత్‌లో వరది దిగుబడులు 109.15 మిలి యన్‌ టన్నులుగా ఉంది. అసలు లక్ష్యం 108.5 మిలియన్‌ టన్నుల యితే మరింతపెరిగింది. కేంద్రం కూడా అదే ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశిం చింది. ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో కేంద్రం ఇప్పఇవరకూ 38.49 మిలియన్‌టన్నుల బియ్యం కొనుగోలుచేసింది. బియ్యం ఎగుమతుల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ఎక్కువగా థాయిలాండ్‌ వంటి దేశాల నుంచి పోటీ ఎదురవుతున్నా పాతనిల్వలు కరిగిపోయాయి. భారత్‌ వార్షిక బియ్యం ఎగుమతులు పది మిలియన్‌టన్నులుగా కొనసాగుతు న్నాయి. అఖిలభారత బియ్యం ఎగుమతిదారులసంఘం అధ్యక్షుడు విజ§్‌ు సేతియా మాట్లాడుతూ బాస్మతి పరంగాచూస్తే థాయిలాండ్‌ లో తగ్గుతున్న నిల్వల కారణంగా భారత్‌ ఎగుమతులకు అవకాశం పెరిగిందని అన్నారు. ఈప్లాస్టిక్‌ బియ్యం ప్రచారం ఎగుమతులపై ఎలాంటిప్రభావంచూపించలేదని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో బాస్మతి బియ్యం 3.89లక్షల టన్నులు ఎగుమతి అయితే వీటి విలువ 2420 కోట్లుగా ఉంది. ఇతర బియ్యం 4.75 లక్షల టన్నులు ఎగుమతిజరిగి 1241 కోట్లవిలువైన బియ్యంఎగుమతులు జరిగాయని అంచనా. 2016 -17లో బాస్మతి బియ్యం 21,604కోట్ల విలువైన 40 టన్నులు ఎగుమతి జరిగితే ఇతర మంచి రకాల బియ్యం వెరైటీలు 17,145కోట్ల విలువైన 68.2 లక్షల టన్నులు ఎగుమతిఅయ్యాయి. అయితే అంతకు ముందు 2014-15లో సాధారణ బియ్యం ఎగుమతు లు రికార్డుస్థాయిలో జరిగాయి. 20,248 కోట్ల విలు వైన 82.74లక్షల టన్నుల బియ్యం ఎగుమతిజరిగిం ది. అదే 2013-14లో 71.33 లక్షల టన్నుల ఎగు మతులు జరిగాయి. వీటి విలువ రూ.17,749 కోట్లు అని అంచనా. అలాగే బాస్మతి బియ్యం ఎగుమతులు కూడా గణనీయంగాపెరిగాయి. 37.57లక్షల టన్నుల ఎగుమతులు జరిగితే వీటి విలువ రూ.29,299 కోట్లుగా ఉంటుందని ఎగుమతిదారులు వెల్లడించారు. ఇక బాస్మతి బియ్యం 2015-16లో 40.45 లక్షల టన్నులుఎగుమతులుజరిగాయి. వీటివిలువ 22,718 కోట్లుగా ఉంటుందని అంచనా. అన్నింటికంటే గత ఏడాదే కొంతమేర ఎగుమతులు క్షీణించినా ఈ రెండుదేశాల్లో నెలకొన్న ప్రకృతి వైపరీత్యాలకారణంగా ఎగుమతులకు మంచి డిమాండ్‌ ఏర్ప డింది. అందులోనూభారత్‌ వెరైటీలను ఆదేశ ప్రజలు కోరుతుండ టంతో వీటికి డిమాండ్‌ ఉన్నట్లు ఎగుమతి సంఘాలు చెపుతున్నాయి.
1entertainment
- ప్రక్రియ మొదలెట్టిన గ్లాక్సో స్మిత్‌క్లిన్‌ సంస్థ -  ఫార్మాపై దృష్టితో హెల్త్‌డ్రింక్‌ వ్యాపారానికి బైబై - 25,000 కోట్లు పైగానే పలకొచ్చని మార్కెట్‌ అంచనా - రేసులో నెస్లే, యునిలీవర్‌, క్రాఫ్ట్‌హీన్‌, కోకాకోలా.. ముంబయి: భారతీయ మార్కెట్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ హెల్త్‌డ్రింక్‌ హార్లిక్స్‌ను విక్రయించాలని గ్లాక్సో స్మిత్‌ క్లిన్‌(జీఎస్‌కే) భావిస్తోంది. ఆరోగ్య సంరక్షణ రంగంపై పూర్తిగా దృష్టిపెట్టాలని నిర్ణయించిన కంపెనీ హార్లిక్స్‌ బ్రాండ్‌ను అమ్మివేయాలని నిర్ణయించినట్టుగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా తెలుస్తోంది. హార్లిక్స్‌తో సహా ఇతర పోషక ఉత్పత్తుల వ్యాపారంలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని గ్లాక్సో స్మిత్‌క్లిన్‌ నిర్ణయిం చినట్టుగా సమాచారం. 2018 చివరి నాటికి ఈ విక్రయాల్ని పూర్తి చేయాలని సంస్థ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఫార్మాస్యూటికల్స్‌, కన్జూమర్‌ హెల్త్‌కేర్‌పై దృష్టి సారించనున్న నేపథ్యంలో జీఎస్‌కే ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌ నుంచి భారత్‌కు విస్తరణ.. కాగా మాల్ట్‌ ఆధారిత డ్రింక్‌గా ప్రసిద్ధి చెందిన హార్లిక్స్‌ పౌష్టికాహారం, బిస్కెట్ల రంగంలోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. సుమారు 140 సంవత్సరాలుగా ఈ బ్రాండ్‌ ఇండియాలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. 1873లో బ్రిటీష్‌ సోదరులు జేమ్స్‌, విలియమ్‌ హార్లిక్స్‌ లు తొలిసారిగా షికాగోలో హార్లిక్స్‌ తయారీని ప్రారంభించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌ సైనికులతో పోరాడిన భారత సైనికులు హార్లిక్స్‌ బ్రాండ్‌ను భారత్‌కు తీసుకొచ్చారు. అలా మన దేశంలో ఈ బ్రాండ్‌ క్రమంగా విస్తరించింది. 1960లో హార్లిక్స్‌ పంజాబ్‌లో ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. భారత్‌లో జీఎస్‌కే సంస్థ ఆర్జిస్తున్న లాభాల్లో అధిక వాటా హార్లిక్స్‌దే. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం.. జీఎస్‌కేలో హార్లిక్స్‌ వాటా విలువ 3.1బిలియన్‌ డాలర్లకు పైమాటే. అయితే ఇటీవల జీఎస్‌కే సంస్థ నోవార్టీస్‌లో వాటాను కొనుగోలు చేసింది. ఇందులో పెట్టుబడుల కోసం హార్లిక్స్‌, ఇతర పోషక ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ విక్రయం ద్వారా దాదాపు 4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.26వేల కోట్లు) నిధులు వస్తాయని సంస్థ భావిస్తోంది. బడా సంస్థల ఆసక్తి హార్లిక్స్‌ వ్యాపార ఆదాయం 2017 లో 550 మిలియన్లు (రూ .5,050 కోట్లు)గా ఉంది. ఈ మొత్తంపై అధిక ప్రీమియంను ఆఫర్‌ చేసే సంస్థకు హార్లిక్స్‌ బ్రాడ్‌ను అప్పగించాలని జీఎస్‌కే భావిస్తోంది. హార్లిక్స్‌ను కొనుగోలు చేసేందుకు గాను నెస్లే, క్రాఫ్ట్‌ హీంజ్‌, యూనీలివర్‌తో పాటు కోకా-కోలా, పెప్సికో, సంటరీ, మోడెలిజ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 3, Sep 2018, 3:51 PM IST Highlights సమంత నటించిన 'యూటర్న్', నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలో ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి థియేటర్లోకి వచ్చి పోటీ పడనున్నారని సోషల్ మీడియాలో చెయ్ వర్సెస్ సామ్ అంటూ హ్యాష్ ట్యాగ్ లు ఇస్తున్నారు. సమంత నటించిన 'యూటర్న్', నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలో ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి థియేటర్లోకి వచ్చి పోటీ పడనున్నారని సోషల్ మీడియాలో చెయ్ వర్సెస్ సామ్ అంటూ హ్యాష్ ట్యాగ్ లు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సమంత చేసిన కామెంట్స్ వివాదస్పదంగా అనిపిస్తున్నాయి. 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాతో తన సినిమా పోటీ పడడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని సమంత తేల్చి చెప్పింది. ఈ విషయంపై దర్శకనిర్మాతలకు ఎంతగా చెప్పినా.. వారు మాత్రం తన మాట పెద్దగా పట్టించుకోలేదనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు.. 'యూటర్న్' దర్శకనిర్మాతలు సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలని, అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇలా చైతన్య సినిమాతో పోటీగా విడుదల చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మధ్యకాలంలో వివాదాలను సృష్టించుకొని విడుదలైన చాలా సినిమాలు సక్సెస్ సాధించాయనే మాట వాస్తవం. సమంత ఆ కోణంలోనే ఈ విధమైన కామెంట్స్ చేసిందని అంటున్నారు. ఇక ఈ రెండు సినిమాలు రెండు వేర్వేరు జోనర్లకు సంబంధించినవి. కాబట్టి రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయనే నమ్మకం తనకుందని సమంత చెప్పుకొచ్చింది.  Last Updated 9, Sep 2018, 2:04 PM IST
0business
Hyderabad, First Published 6, May 2019, 9:40 AM IST Highlights రీసెంట్ గా రిలీజై  సంచలనం సృష్టించిన 'అవెంజ‌ర్స్‌ ది ఎండ్ గేమ్' చిత్రానికి,  ఈ వారం రిలీజ్ అవుతున్న మహేష్ బాబు 'మ‌హ‌ర్షి' చిత్రానికి ఓ విషయంలో పోలిక ఉంది.  రీసెంట్ గా రిలీజై  సంచలనం సృష్టించిన 'అవెంజ‌ర్స్‌ ది ఎండ్ గేమ్' చిత్రానికి,  ఈ వారం రిలీజ్ అవుతున్న మహేష్ బాబు  'మ‌హ‌ర్షి' చిత్రానికి ఓ విషయం లో పోలిక ఉంది. కంగారుపడకండి అదేమీ కథ లేక స్క్రీన్ ప్లేనో మరొకటో కాదు లెంగ్త్ విషయంలో. ఎవేంజర్స్ చిత్రం దాదాపు మూడు గంటల ఐదు నిముషాల లెంగ్త్ ఉంది. మహర్షి చిత్రం రెండు గంటల 55 నిముషాల లెంగ్త్ ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద లెంగ్త్ ఉన్న సినిమాలు రావటం లేదు. దాంతో ఎంతో టైట్ గా స్క్రీన్ ప్లే ఉంటే తప్పించి ఎంగేజ్ చేయటం కష్టం. అవెంజ‌ర్స్‌ ఫస్టాఫ్ లో క్యారక్టర్స్ పరిచయం, వారి ప్లాష్ బ్యాక్ లు గుర్తు చేస్తూ ముందుకు వెళ్లారు.  అవెంజర్స్ గత చిత్రాలు చూసిన అభిమానులకు ఇలా పాత కథలు గుర్తు చేసుకోవటం ఆనందం కలిగించింది. మరి మహర్షి లో అలాంటి మ్యాజిక్ ఉంటుందా...ఎక్కడా ల్యాగ్ లేకుండా మూడు గంటలు ముందుకు లాక్కెళ్లటం అంటే మాటలు కాదు. దాదాపు ప్రతీ అరగంటకు ఓ మలుపు రావాల్సిందే. అలా కాకుండా ప్లాట్ గా కధ రన్ చేస్తే కష్టం గా ఉంటుంది.  అయితే దిల్ రాజు, డైరక్టర్ వంశీ పైడిపల్లి కు ప్రేక్షకుల పల్స్ తెలుసు. వారి గత చిత్రాలు ఆ విషయం మనకు చెప్తాయి. కాబట్టి ఖచ్చితంగా సినిమాలో ఆ జాగ్రత్తలు తీసుకునే డిజైన్ చేసి ఉంటారంటున్నారు. ఎమోషనల్ కంటెంట్ తో సినిమాని నింపారని, అదే ప్రేక్షకులను పట్టి ఉంచుతుందని దిల్ రాజు నమ్మకంగా ఉన్నారట. దానికి తగినట్లు టిక్కెట్టు  రేటు పెంచి మరీ  సినిమాని రిలీజ్ చేయ‌బోతున్నారు కాబ‌ట్టి ఫస్ట్ వీకెండ్ భారీ ఓపినింగ్స్, కలెక్షన్స్ కు లోటుండదు.  అవెంజ‌ర్స్ ప్ర‌పంచంలోని అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తే...మహర్షి సైతం తెలుగు సినిమా రికార్డ్ లను ఒంటి చేత్తో బ్రద్దలు చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  Last Updated 6, May 2019, 9:40 AM IST
0business
భరత్ అనే నేను హీరోయిన్ హాట్ వీడియో వైరల్ (వీడియో) Highlights భరత్ అనే నేను హీరోయిన్ హాట్ వీడియో వైరల్ సినిమాలలో అడల్ట్ కంటెంట్ చూపిస్తుంటే సెన్సార్ సమస్య వస్తుందని ఈ మధ్య కాలంలో దర్శకులు తము చెప్పాలనుకున్న విషయాల కోసం యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'లస్ట్ స్టోరీస్' అంటూ ఓ నెట్ సిరీస్ ను తీస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నెట్ ఫ్లిక్స్ దీన్ని ప్రెజంట్ చేస్తోంది. నలుగు టాప్ హీరోయిన్లను పెట్టి నలుగురు దర్శకులు ఈ నెట్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. రాధికా ఆప్టే, భూమి పడ్నేకర్, మనీషా కోయిరాలా, కియారా అద్వానీ వంటి హీరోయిన్లు ఈ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ లో ఒక్కో హీరోయిన్ ఇల్లీగల ఎఫైర్స్ నడిపిస్తుంటాడు. పెళ్లై భర్త ఉన్నా.. తన స్టూడెంట్ తో సంబంధం పెట్టుకున్న మహిళగా రాధికా ఆప్టే, మనసులో ఒకరిని పెట్టుకొని తన భర్తతో కాపురం చేసే మహిళగా కియారా ఆద్వానీ కనిపించనుంది. తన ఇంటి యజమాని కొడుకుతో ఎఫైర్ నడిపించే పాత్రలో భూమి పడ్నేకర్, భర్త స్నేహితుడిని ఇష్టపడే పాత్రలో మనీషా కోయిరాలా కనిపించనున్నారు. ఈ మొత్తం నాలుగు కథలను కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ వంటి టాప్ డైరెక్టర్లు తెరకెక్కిస్తున్నారు. జూన్ 15 నుండి నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను చూడొచ్చు!
0business
RAMACHANDRA ముగ్గురు దిగ్గజాలను అవమానించడం తగదు : రామచంద్ర గుహ ముంబయి: టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే తరహాలోనే ద్రావిడ్‌, జహీర్‌ ఖాన్‌ను బహి రంగంగా అవమానించడం తగదని చరిత్రకారుడు మాజీ బిసిసిఐ పాలకులకమిటీ సభ్యుడు, చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ సభ్యుడైన గుహ బిసిసిఐ నిర్ణయాలను వ్యతి రేకిస్తూ జూన్‌ల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టు సలహాదారులుగా దిగ్గజ క్రికెటర్లు రాహుల్‌ ద్రావిడ్‌, జహీర్‌ ఖాన్‌ను నియమించలేదని బిసిసిఐ, పాలకుల కమిటీ శనివారం స్పష్టం చేసింది. గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌తో కూడిన సలహా సంఘం సలహా దారులుగా ప్రకటించినా రవిశాస్త్రిని సంప్రదిచాకే వారి నియామకాన్ని ఆమోదిస్తామని తెలిపింది. ఈ ముగ్గురు దిగ్గజాలు మైదానంలో తమ శాయశక్తులా పోరాడినవారు. వీరిని బహి రంగంగా అవమానించడం సరికా దని గుహ ట్వీట్‌ చేశారు.
2sports
Visit Site Recommended byColombia వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని టెలికాం సెక్రటరీ అరుణ్‌ సుందరరాజన్‌ తెలిపారు. ఆధార్‌ కార్డు తప్పనిసరిపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొబైల్‌ సిమ్‌ పొందడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరికాదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆధార్ కార్డు పొందనివారు సిమ్ కార్డులు తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో పేర్కొంటూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఏప్రిల్ 27న ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించి వేగంగా నిర్ణయం తీసుకుంది. ‘ఆధార్‌ నెంబర్‌ లేదని వినియోగదారులకు సిమ్‌ కార్డు ఇవ్వడాన్ని నిరాకరించొద్దు. ఇతర కేవైసీ దరఖాస్తులు, డాక్యుమెంట్లను సమర్పించాలని కోరండి. సిమ్‌ కార్డుల జారీని కొనసాగించండి. అన్ని టెలికాం కంపెనీలకు ఈ ఆదేశాలు జారీచేస్తున్నాం’ అని సుందరరాజన్‌ తెలిపారు. గతంలో టెలికాం డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన ఆదేశాలతో మొబైల్‌ కంపెనీలు ఆధార్‌ వెరిఫికేషన్‌ను చేపడుతున్నాయి. ఈ నిర్ణయం నుంచి ఎన్‌ఆర్‌ఐలకు, విదేశీయులకు మినహాయింపు ఇచ్చారు. ఈ ఆదేశాలపై స్పందించడానికి మొబైల్‌ ఆపరేటర్లు నిరాకరించాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది..   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ద్ర‌వ్య‌లోటు చేరుకునే క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం గ‌తేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫివ్ర‌వ‌రి వ‌ర‌కూ ప్ర‌భుత్వ మొత్తం వ్య‌యం రూ.19.99 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. 2017-18 స‌వ‌రించిన అంచ‌నాల కంటే ఇది 90.1% ఎక్కువ‌. Samayam Telugu | Updated: Mar 29, 2018, 03:12PM IST ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరినాటికి ద్రవ్యలోటు రూ.7.15 లక్షల కోట్లకు (సవరించిన లక్ష్యంతో పోలిస్తే 120 శాతం) పెరిగిందని ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. మార్చి చివరినాటికి లోటు మరింత పెరగవచ్చని మార్కెట్‌వర్గాల్లో భయాందోళనలు పెరిగాయి. ఫలితంగా ఈక్వి టీ మార్కెట్‌ మళ్లీ నష్టాల బాటలో పయనించింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు కూడా బలహీనపడి రూ.65.18 స్థాయికి చేరుకుంది. అయితే లక్ష్యం మేరకు ద్రవ్యలోటును కట్టడి చేయగలుగుతామని కేంద్ర ద్ర‌వ్య‌లోటు చేరుకునే క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక శాఖ ధీమా వ్యక్తం చేసింది. 2017-18లో ద్రవ్యలోటును జిడిపిలో 3.2 శాతానికి పరిమితం చే యాలని తొలుత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ నియంత్రణ లక్ష్యాన్ని 3.5 శాతానికి సడలించింది. అప్పులు చేయ‌కుండా వ‌చ్చే మూల‌ధ‌న ఆదాయంలో రుణాల రిక‌వ‌రీ ద్వారా రూ.13,301 కోట్ల‌ను కేంద్రం ఆర్జించింది. ఇంకా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా ఫిబ్ర‌వ‌రి నాటికి రూ. 92,493 కోట్ల ఆదాయాన్ని సాధించ‌గ‌లిగింది. ప్ర‌భుత్వం ఆర్బీఐ నుంచి సైతం మ‌రింత ఎక్కువ డివిడెండు సొమ్మును ఆశిస్తోంది. గ‌తేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫివ్ర‌వ‌రి వ‌ర‌కూ ప్ర‌భుత్వ మొత్తం వ్య‌యం రూ.19.99 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. 2017-18 స‌వ‌రించిన అంచ‌నాల కంటే ఇది 90.1% ఎక్కువ‌.
1entertainment
అదే బాలయ్య.. కానీ అదే బాలయ్య Highlights బాలయ్య హీరోగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజైన పైసా వసూల్ పైసా వసూల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన యుఎస్ లో ఫుల్ రన్ లో  2.5 మిలియన్ డాలర్లు కూడా కష్టమేనంటున్న ట్రేడ్ వర్గాలు నందమూరి బాలయ్య గట్టిగా తొడగొడితే... ఆ సౌండుకే శత్రువు చచ్చిపోయే జమానా ఒకటుండేది. ప్లేసు నువ్వుచెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే అంటూ బాలకృష్ణ కాలు దువ్వాడంటే.. విలన్ ప్యాంటు తడవాల్సిందే. ఇక ఇటీవల వచ్చిన శాతకర్ణి సినిమాలో కూడా.. సమయం లేదు మిత్రమా.. శరణమా రణమా... అంటూ భారీ డైలాగులతో కాసుల వర్షం కురిపించాడు బాలయ్య. అంతటి పెద్ద హీరో అయినప్పటికీ ఓవర్సీస్‌కు వచ్చేసరికి బాలకృష్ణ చాలా వీక్.  నాని లాంటి యంగ్ హీరోలకు కూడా అక్కడ తిరుగులేని మార్కెట్ ఉండగా.. బాలయ్య సినిమాల పరిస్థితి మాత్రం దారుణం. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ముందు వరకు బాలయ్యకు అర మిలియన్ డాలర్ల సినిమా కూడా లేదు అమెరికాలో.  ఈ సినిమాకు ముందు వచ్చిన ‘డిక్టేటర్’ను భారీ ఎత్తున రిలీజ్ చేసి అక్కడి బయ్యర్ దెబ్బతిన్నాడు. ఓవర్సీస్ ప్రేక్షకులు ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, లవ్ స్టోరీల్నే ఇష్టపడతారు. బాలయ్య మాస్ సినిమాలు వాళ్లకు పట్టవు. భారీ డైలాగులకు థియేటర్ కు వచ్చేందుకు భయపడుతుంటారు.   ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో కథ మారింది. బాలయ్య సినిమాను కూడా అక్కడి జనాలు బాగానే ఆదరించారు. బాలయ్యకు ఇది తొలి మిలియన్ డాలర్ మూవీ అయింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 1.6 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం. ఈ సినిమాతో బాలయ్యపై అక్కడి జనాలకు కొంచెం గురి కుదిరింది. మంచి మార్కెట్ ఏర్పడింది యుఎస్‌లో. ఐతే ఆ మార్కెట్ మొత్తాన్ని ‘పైసా వసూల్’ ధ్వంసం చేసేసింది. ‘శాతకర్ణి’తో కొత్తదనం పంచిన బాలయ్య.. ఈసారి అదే రొటీన్ మాస్ మసాలా మూవీతో రావడంతో అక్కడి జనాలు తిప్పికొట్టారు.   ప్రిమియర్స్‌తోనే సినిమాకు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. మామూలుగా కొత్త సినిమాలకు అత్యధిక వసూళ్లుండే తొలి శనివారం రోజు ఈ సినిమా కేవలం 27 వేల డాలర్లు వసూలు చేసింది. ఇప్పటిదాకా ఈ చిత్రం 2 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఫుల్ రన్లో 2.5 లక్షల డాలర్ల మార్కును కూడా అందుకోవడం కష్టంగానే ఉంది. మొత్తానికి బాలయ్య ‘శాతకర్ణి’తో సాధించుకున్న పేరు, మార్కెట్ అంతా ‘పైసా వసూల్’తో పోయిందని చెప్పాలి. Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0business
Hyderabad, First Published 15, Apr 2019, 2:01 PM IST Highlights మాస్ మహారాజా రవితేజ నటించబోయే తదుపరి సినిమా షూటింగ్ ఈరోజు నుండి మొదలుకావాల్సివుంది. కానీ హీరో గారు సినిమా షూటింగ్ ఆపేసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ నటించబోయే తదుపరి సినిమా షూటింగ్ ఈరోజు నుండి మొదలుకావాల్సివుంది. కానీ హీరో గారు సినిమా షూటింగ్ ఆపేసినట్లు తెలుస్తోంది. రవితేజ ఈవిధంగా చేయడం ఇది మూడోసారి. 'డిస్కో రాజా' సినిమాను హోల్డ్ లో పెట్టిన తరువాత 'తేరి' సినిమా రీమేక్ చేయాలనుకున్నాడు రవితేజ. దీంతో దర్శకనిర్మాతలకు చెప్పి షూటింగ్ మొదలుపెట్టుకోమని చెప్పాడు. కాబట్టి వారు ఈరోజు నుండి షెడ్యూల్ ప్లాన్ చేశారు. తీరా షూటింగ్ సమయానికి రవితేజ హ్యాండ్  ఇచ్చేశాడని తెలుస్తోంది. సినిమా ఫైనల్ స్క్రిప్ట్ తో రవితేజ సంతృప్తి చెందలేదట. ఆ కారణంగానే షూటింగ్ ఆపాలని నిర్మాతలకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ తన కుటుంబం తో కలిసి సమ్మర్ ట్రిప్ కి వెళ్లబోతున్నారు. నెల రోజుల తరువాత తిరిగిరానున్నారు. ఆ తరువాతే తన తదుపరి సినిమా విషయంలో ఓ నిర్ణయానికి రానున్నాడు. మరి సగం షూటింగ్ చేసి ఆపేసిన 'డిస్కో రాజా'ని కంప్లీట్ చేస్తాడా..? లేక 'తేరి' రీమేక్ పై దృష్టి పెడతాడా..? అనే విషయంలో క్లారిటీ లేదు. ఇది ఇలా ఉండగా.. దర్శకుడు ప్రశాంత్ వర్మ, సుధీర్ వర్మ వంటి వారు రవితేజకి కథ చెప్పాలని తిరుగుతున్నారు. కనీసం వారితోనైనా సినిమా చేస్తారేమో చూడాలి! Last Updated 15, Apr 2019, 2:01 PM IST
0business
internet vaartha 224 Views ఆట డెస్క్‌ : 12వ దక్షిణాసియా క్రీడలు కేవలం పోటీలకు మాత్రమే కాదని అభివృద్ధికి దోహకాలని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం గౌహతిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో దక్షిణాసియా క్రీడలను ఓపెన్‌గా డిక్లేర్‌ చేశారు. 12 రోజులపాటు జరిగే పోటీలతో ఒకరి మధ్య ఒకరికి స్నేహసంబంధాలు ఏర్పడుతాయని అనటంలో సందేహం లేదన్నారు. అస్సాం,షిల్లాంగ్‌ రాష్ట్రాల్లో శాంతి, వాణిజ్యాభివృద్ధికి వారధి వంటి అన్నారు.
2sports
a date with 10 people on anchor syamala birthday, she reveals names of the ten lucky winners పది మందితో యాంకర్ శ్యామల డేట్.. లిస్ట్ వదిలింది Anchor Syamala Youtube Channel: తన యూట్యూబ్ ఛానల్‌ను జనంలోకి తీసుకువెళ్లేందుకు తన క్రియేటివిటీ మొత్తాన్ని వాడేస్తోంది యాంకర్ శ్యామల. ‘ఏం చెప్పారు శ్యామల గారూ’ అంటూ ఇటీవల ఓ ట్యూబ్ ఛానల్‌ను స్టార్ట్ చేసిన శ్యామల.. డేటింగ్ కాంటెస్ట్ నిర్వహించింది. Samayam Telugu | Updated: Oct 30, 2019, 08:39PM IST యాంకర్ శ్యామల యూట్యూబ్ ఛానల్ ‘ఏం చెప్పారు శ్యామల గారూ’.. ఇది ఆమెను పొగడటం కాదు కాని. ఇది ఆమె యూట్యూబ్ ఛానల్ పేరు. యాంకర్‌గా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా క్రేజ్ సంపాదించిన యాంకర్ శ్యామల తనకు ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఈ మధ్య కాలంలో ‘ఏం చెప్పారు శ్యామల గారూ’ అనే యూట్యూబ్ ఛానల్‌కి రిబ్బర్ కటింగ్ చేసింది. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలను షేర్ చేస్తూ గంట మోగించండి బాబులూ అంటూ ప్రచారం మొదలుపెట్టింది. అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెండు మూడు వీడియోలు షేర్ చేసేసరికి 20k సబ్‌క్రైబర్స్ వచ్చేశారు. దీంతో మరింతగా తన యూట్యూబ్ ఛానల్‌ని జనంలోకి తీసుకుని వెళ్లేందుకు తన బుర్రకు పదునుపెట్టి ఆడియన్స్‌కి ఓ కాంటెస్ట్ నిర్వహించింది శ్యామల.
0business
SENSEX రూ.6.4లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి! ముంబయి,ఆగస్టు 13: ఎలాంటి కార్యకలాపాలు లేని డొల్లకంపెనీలపై మార్కెట్ల నియంత్రణసంస్థ సెబీ వేటువేయడంతో బలహీనపడిన సెంటి మెంట్‌ తోడు విదేశీ అందోళనలు జతకలవడంతో గత వారం మరింత మార్కెట్లు దిగజారాయి. మొత్తం 331 డొల్లకంపెనీలను గుర్తించిన కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ జాబితాను సెబీకి అందించడంతో మార్కెట్‌ వర్గాల్లో ఆందో ళనలుమొదలయ్యాయి. వీటిపై చర్యలు తీసుకో వాలని సెబీ స్టాక్‌ ఎక్ఛేంజిలకు సూచించింది. గ్రేడ్‌4లోనికి వీటిని మార్చాలని ఆదేశించింది. దీనితో ఈస్టాక్స్‌లో నెలరోజుల్లో ఒకసారి మాత్రమే ట్రేడింగ్‌ వీలు అవుతున్నది. కీలక పాయింట్లను మార్కెట్లు కోల్పోయాయనేచెప్పాలి. సెన్సెక్స్‌ వారం మొత్తంగా 1112 పాయింట్లు దిగజారింది. 32 వేల పాయింట్ల మైలురాయికి నీళ్లొదిలింది. నిఫ్టీసైతం 356పాయింట్లు పతనం అయింది.సాంకేతికంగా కీలకమైన 10వేల పాయింట్ల ఎగువనుంచి 9700 పాయింట్ల స్థాయికి పడిపోయింది. సెన్సెక్స్‌31,213 వద్ద నిలవగా నిఫ్టీ 9711వద్ద స్థిరపడింది. మొదటి త్రైమాసికంలో మొండి బకాయిలు పెరగడంతో భారతీయస్టేట్‌బ్యాంకు వారం మొత్తంమీద ఎనిమిదిశాతం పతనం కాగా ప్రైవేటురంగ బ్యాంకులు యాక్సిస్‌, ఐసిఐసిఐలు మూడుశాతానికిపైగా క్షీణించాయి. ఆటోస్టాక్స్‌లో ఎంఅండ్‌ఎం, మారుతిసుజుకి,హీరోమోటో, బజాజ్‌ ఆటో 3-5శాతంమధ్యక్షీణించాయి. ఇక ఫలితాలు నిరాశకలిగించడంతో టాటామోటార్స్‌ 14శాతం దిగజారింది. ఈ బాటలో సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డిస్‌11శాతం, లూపిన్‌ ఐదుశాతం, సిప్లా 4.3శాతం పతనం కాగా టాటాస్టీల్‌ 3.6శాతం ఎగిసిపడింది. ఇదే విధంగా ఆదానిపోర్టులు ఆరుశాతం, కోల్‌ ఇండియా ఎన్‌టిపిసి ఐదుశాతం చొప్పున క్షీణించాయి. కేవలం నాలుగురోజుల్లోనే దేశీయ ఇన్వెస్టర్ల సంపద 6.4 లక్షలకోట్లు నష్ట పోయారు. అమెరికా, ఉత్తరకొరియా మధ్య యుద్దవాతావరణం నెలకొనడం, ఆర్ధికవృద్ధిరేటు అంచనాలపై భయాందోళనలతో స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి.అమ్మకాల ఒత్తిడిపెరగడంతో కేవలం నాలుగురోజుల్లోనే రూ.6.4లక్షలకోట్లు ఇన్వెస్టర్ల సొమ్ముకరిగిపోయింది. ఆగస్టు ఏడవ తేదీ రూ.139.5 లక్షలకోట్లుగా ఉన్న బిఎస్‌ఇ మార్కెట్‌విలువలు వారంతిరక్కుండానే రూ.133 లక్షల కోట్లకు పతనంఅయింది. గడచిన వారంలో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 1100 పాయింట్లు నష్టపో యింది. మరోవైపు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ 331 డొల్లకంపెనీలపై వేటు వేయడం, వీటిపై ట్రేడింగ్‌ నిలిపివేయడం ఇన్వెస్టర్ల సెంటి మెంట్‌నుప్రభావితంచేసింది. చైనాతోడోక్లాం వివాదంకూడా కొంతప్రభావంచూపించింది. ప్రపంచ మార్కెట్లుసైతం కుప్పకూలిన క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా లక్షకోట్ల డాలర్లమేర ఇన్వె స్టర్లు నష్టపోయారనిమార్కెట్‌నిపుణుల అంచనా
1entertainment
రియల్ లైఫ్ లోనూ "నేచురల్" నటుడు అంటూ... శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Highlights రియల్ లైఫ్ లోనూ "నేచురల్" నటుడు అంటూ... శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ వ్యవహారం హద్దులు మీరిందని, దీన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సి వుందని ఉద్యమం చేపట్టిన నటి శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ఎకౌంట్లలో పలు సంచలన కామెంట్స్ చేస్తూ... నిత్యం వార్తల్లో నిలుస్తూనే వుంది. తాజాగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సినీ నటి శ్రీరెడ్డి కొందరు సినీ ప్రముఖుల పేర్లను సోషల్ మీడియాలో బయటపెట్టిన సంగతి తెలిసిందే.   తాజాగా శ్రీ రెడ్డి తన పేస్ బుక్ పేజీలో ఓ సెన్సేషనల్ కామెంట్ చేసింది. నిజజీవితంలో కూడా నేచురల్‌గా నటిస్తావు.. ఇటీవలే నీకో కొడుకు పుట్టాడు కంగ్రాచ్యులేషన్స్ అంటూ.. శ్రీ రెడ్డి రాసిన ఆ కామెంట్ సోషల్ మీడియాలో పెను దుమారమే రేపింది. ‘‘నీవు రియల్ లైఫ్‌లో కూడా చాలా బాగా నటిస్తావు. ఆన్ స్క్రీన్‌లో చాలా నేచురల్‌గా నటిస్తావు. నేచురల్‌గా కనిపిస్తావు. కానీ అది నీ మాస్క్. నీవు నీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యానని ఎప్పుడూ చెబుతావు. కానీ అది ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసమే. నీకంటే తాతలు, తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్న పెద్ద హీరోలు బెటర్. వారంతా మంచి సభ్యతా సంస్కారం కలగిన వారు. చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌ వంటి గొప్ప కో స్టార్స్‌ను చూసి నేర్చుకో. వారెవరికీ గర్వం లేదు. కానీ నువ్వు చాలా యాటిట్యూడ్ చూపిస్తావు. నువ్వు చిన్న డైరెక్టర్‌లను, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న వారిని గౌరవించవు.   చాలా బ్యాడ్ యాటిట్యూడ్‌తో వుండే నీవు సక్సెస్ అయితే అయ్యావు. నీకు ఇటీవలే కొడుకు పుట్టాడు. చాలా చాలా అభినందనలు. కానీ జీవితంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండు. నీవు ఎంతో మంది అమ్మాయిలను వాడుకున్నావు. నీ కారణంగా బాధపడిన వారు ఇప్పటికీ ఏడుస్తున్నారు. దేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు గుర్తుంచుకో. కాకపోతే శిక్షించడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. కానీ నువ్వు బాధపడతావు. తప్పకుండా ఇండస్ట్రీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఇండస్ట్రీ నుంచి ఇలాంటివి ఈకలా రాలిపోవాలి.’’ అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. తెలుగు సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ వ్యవహారం హద్దులు మీరిందని, దీన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సి వుందని ఉద్యమం చేపట్టిన నటి శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ఎకౌంట్లలో పలు సంచలన కామెంట్స్ చేస్తూ... నిత్యం వార్తల్లో నిలుస్తూనే వుంది. తాజాగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సినీ నటి శ్రీరెడ్డి కొందరు సినీ ప్రముఖుల పేర్లను సోషల్ మీడియాలో బయటపెట్టిన సంగతి తెలిసిందే.   తాజాగా శ్రీ రెడ్డి తన పేస్ బుక్ పేజీలో ఓ సెన్సేషనల్ కామెంట్ చేసింది. నిజజీవితంలో కూడా నేచురల్‌గా నటిస్తావు.. ఇటీవలే నీకో కొడుకు పుట్టాడు కంగ్రాచ్యులేషన్స్ అంటూ.. శ్రీ రెడ్డి రాసిన ఆ కామెంట్ సోషల్ మీడియాలో పెను దుమారమే రేపింది. ‘‘నీవు రియల్ లైఫ్‌లో కూడా చాలా బాగా నటిస్తావు. ఆన్ స్క్రీన్‌లో చాలా నేచురల్‌గా నటిస్తావు. నేచురల్‌గా కనిపిస్తావు. కానీ అది నీ మాస్క్. నీవు నీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యానని ఎప్పుడూ చెబుతావు. కానీ అది ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసమే. నీకంటే తాతలు, తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్న పెద్ద హీరోలు బెటర్. వారంతా మంచి సభ్యతా సంస్కారం కలగిన వారు. చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌ వంటి గొప్ప కో స్టార్స్‌ను చూసి నేర్చుకో. వారెవరికీ గర్వం లేదు. కానీ నువ్వు చాలా యాటిట్యూడ్ చూపిస్తావు. నువ్వు చిన్న డైరెక్టర్‌లను, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న వారిని గౌరవించవు.   చాలా బ్యాడ్ యాటిట్యూడ్‌తో వుండే నీవు సక్సెస్ అయితే అయ్యావు. నీకు ఇటీవలే కొడుకు పుట్టాడు. చాలా చాలా అభినందనలు. కానీ జీవితంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండు. నీవు ఎంతో మంది అమ్మాయిలను వాడుకున్నావు. నీ కారణంగా బాధపడిన వారు ఇప్పటికీ ఏడుస్తున్నారు. దేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు గుర్తుంచుకో. కాకపోతే శిక్షించడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. కానీ నువ్వు బాధపడతావు. తప్పకుండా ఇండస్ట్రీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఇండస్ట్రీ నుంచి ఇలాంటివి ఈకలా రాలిపోవాలి.’’ అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది.
0business
Visit Site Recommended byColombia ప్రస్తుతం జక్కన్న ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేశారు. డిసెంబర్‌లో ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కించేందుకు రెడీ అవుతుండగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు మేకోవర్‌ మొదలుపెట్టేశారు. తాజాగా ఎన్టీఆర్ కోసం పాపులర్ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్‌ని రంగంలోకి దింపారు రాజమౌళి. ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్‌ సిక్స్ ప్యాక్‌లో చూపించిన లాయిడ్ స్టీవెన్‌ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం ఎన్టీఆర్‌ని సరికొత్త లుక్‌లో తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్నారు. ఇదిలాఉంటే.. రాజమౌళి ఆర్. ఆర్. ఆర్ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ చిత్రంపై క్రేజ్ దృష్ట్యా రకరకాల రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలపై రోజుకో వార్త హల్ చల్ చేస్తుంది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఇద్దరి హీరోలను బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడం అనేది సాహసం కూడుకున్నపనే. పాటలు, ఫైట్స్, సీన్స్ విషయంలో ఏమాత్రం తేడాలొచ్చినా.. ఫ్యాన్స్ నుండి ప్రతికూల పవనాలు వీచిన సందర్భాలు అనేకం. అందుకే దర్శకు నిర్మాతలు.. మల్టీస్టారర్ మూవీలో ఒక హీరోకి రెండు పాటలు, ఫైట్స్ ఉంటే మిగతా హీరోకి కూడా రెండు పాటలు, ఫైట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుని ఇద్దరికీ సమన్యాయం చేస్తుండేవారు. అయితే టాలీవుడ్‌లో నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసి ఓ నూతన ఒరవడికి నాంది పలికారు జక్కన్న. ఈ సందర్భంలో ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్నదానిపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ దొంగగా.. రామ్ చరణ్‌లు పోలీస్‌‌గా కనిపించబోతున్నారంటూ రూమర్స్ నడిచాయి. తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్‌గా కనిపించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ‘జై లవకుశ’ చిత్రంలో ‘జై’ పాత్రలో ప్రతినాయకుడిగా హడలెత్తించిన ఎన్టీఆర్.. తాజా చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నారట. రాజమౌళి సినిమాల్లో హీరోలతో విలన్‌లకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక విలనిజాన్ని పండించండంలో ఆరితేరిన తారక్ కోసం గ్యాంగ్‌స్టర్‌గా పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ని రెడీ చేశారట జక్కన్న. ఇందుకోసం ప్రతినాయకుడిగా ఎన్టీఆర్ పాత్ర మేకోవర్ కోసం బాలీవుడ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్‌ రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘ఘట్టం ఏదైనా.. పాత్ర ఏదైనా.. నేను రెడీ’ అనే ఎన్టీఆర్.. నాయకుడిగానైనా, ప్రతినాయకుడైనా నట విశ్వరూపం చూపించడం ఖాయమే అంటున్నారు ఆయన అభిమానులు. The much awaited confirmation you all have been waiting for since November 18th 2017... Its OFFICIAL.. The Massive… https://t.co/yDupJXzLeB — RRR Movie (@RRRMovie) 1521720659000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
internet vaartha 398 Views హైదరాబాద్‌ : ప్రపంచంలోనే టైర్‌ టెక్నాలజీ అగ్రగామి మిచెలిన్‌ దేశంలో ప్రీమియం రోడ్‌రేంజ్‌ మౌంటెన్‌ బైక్‌రేంజి, సిటీ ట్రెక్కింగ్‌ రేంజ్‌ అధునాతన టైర్లను మార్కెట్లకు విడుదలచేసింది. కంపెనీ డైరెక్టర్‌ప్రదీప్‌ జి థాంపి మాట్లాడుతూ ప్రీమియం సైకిల్‌ మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందిందని, ఆరోగ్యంపై పెరుగు తున్న అవగాహనతో లీజర్‌, సాహసకృత్య కార్యకలాపాలుగా సైక్లింగ్‌ ప్రాచుర్యంలోనికి వచ్చిందని అన్నారు. ఈ విభాగంలో ఏటా 25-30శాతం వార్షిక వృద్ధి ఉంటుందని ఆయన అంచనా వేసారు. స్పోర్ట్స్‌ రైడింగ్‌ కోసం రోడ్‌రేంజ్‌ విడుదలచేశామన్నారు. అత్యంత సామర్ధ్యం కోరుకునేవారికోసం మిచెలిన్‌ ప్రొ ఎండ్యూ రెన్స్‌, అలాగేమిచెలిన్‌ లిథియన్‌ 2, మిచెలిన్‌డైనమిక్‌ స్పోర్ట్స్‌ రోడ్‌ అనే వివిధ కేటగిరీల టైర్లు భారత్‌లో సైక్లిస్టులకు ఎంతో అనువుగా ఉంటాయని థాంపీ వెల్లడించారు. మిచెలిన్‌ సైకిల్‌ టైర్లు అన్నిస్టోర్లలోను లభిస్తాయి. ట్యూబ్‌ ధరలురూ.690నుంచి 2699ల వరకూ ఉన్నాయి.
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ‘రంగస్థలం’ మేకింగ్ వీడియో.. చిన్నారులతో చిట్టిబాబు! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘రంగస్థలం’. సమంత హీరోయిన్. Samayam Telugu | Updated: Mar 21, 2018, 05:35PM IST మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘రంగస్థలం’. సమంత హీరోయిన్. జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ‘రంగ రంగ రంగస్థలాన’ అంటూ సాగిన పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. చంద్రబోస్ రాసిన అద్భుతమైన సాహిత్యానికి దేవీశ్రీ ఇచ్చిన మ్యూజిక్ అదరహో అనిపించింది. ఇటీవలే ఈ పాట ప్రోమో వీడియో కూడా విడుదలైంది. ఇప్పుడు తాజాగా ఈ పాట మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 2 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోను బుధవారం యూట్యూబ్‌లో ఉంచింది. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చున్న డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. గోదావరి తీరాన ఈ పాటను చిత్రీకరించారు. సెట్టింగ్స్ వేయడం, రామ్ చరణ్ డ్యాన్స్ ప్రాక్టీస్ వంటివి ఈ వీడియోలో చూపించారు. అయితే షూటింగ్ మధ్యలో రామ్‌చరణ్ చిన్నారులతో ముచ్చటించిన సన్నివేశాలను కూడా వీడియోలో పొందుపరిచారు. ‘ఖైదీ నంబర్ 150’లో చిరంజీవి స్టెప్‌ను వేసి చూపించిన ఓ పిల్లాడిని చరణ్ అభినందించారు కూడా. అలాగే రామ్ చరణ్ హోటల్ గదిలో నుంచి అభిమానులకు అభివాదం చేయడం, చరణ్ కోసం షూటింగ్ స్పాట్ వద్ద అభిమానులు ఎగబడటం ఇలా చాలా సన్నివేశాలను రెండు నిమిషాల్లో చూపించేశారు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.. X
0business
3rd T20I: India won by 7 vickets to clean sweep series సిరీస్ గెలిచి సత్తా చాటుకున్న భారత్ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడిపోయిన కసిమీదున్న భారత జట్టు వెంటనే అదే గడ్డపై టీ20 సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసి తన సత్తా చాటుకుంది. TNN | Updated: Feb 4, 2016, 09:47AM IST వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడిపోయిన కసిమీదున్న భారత జట్టు వెంటనే అదే గడ్డపై టీ20 సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసి తన సత్తా చాటుకుంది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ని కైవసం చేసుకుంది భారత్. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు సాధించింది. అలా 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. చివర్లో అభిమానులని తీవ్ర ఉత్కంఠకి గురిచేసింది. చివరి ఓవర్‌లో భారత్ గెలవడానికి 17 పరుగులు అవసరం కాగా అదే సమయంలో క్రీజులో వున్న యువరాజ్ సింగ్ మొదటి రెండు బంతులని వరుసగా ఒక ఫోర్, ఒక సిక్సుతో జట్టుని విజయానికి చేరువ చేశాడు. దీంతో తర్వాతి నాలుగు బంతుల్లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ మరింత అధికమైంది. అలా చివరి వరకు కొనసాగిన సస్పెన్స్‌కి తెరదించుతూ చివరి బంతిని సిక్సర్‌గా మలిచి టీమిండియాకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు సురేష్ రైనా . ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (52), శిఖర్ ధావన్ (26), విరాట్ కోహ్లీ (50)లు రాబట్టిన పరుగులు టీమిండియా విజయంలో భాగమయ్యాయి. టీమిండియా విజయం ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. సిరీస్ గెలిచిన అనంతరం ట్రోఫీ అందుకున్న టీమిండియా కెప్టేన్ ఎంఎస్ ధోనీ ... ఈ సక్సెస్ క్రెడిట్‌ని మొదటిగా బౌలర్లకి ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. బ్యాట్స్‌మెన్ కూడా మంచి ప్రతిభే కనబర్చినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరింత ఫంటాస్టిక్‌గా ఆడారు అని బౌలర్లని ప్రశంసించాడు ధోనీ. అంతా అనుకున్నట్టే జరిగితే, పరిస్థితులనిబట్టి రెండు, మూడు మార్పులు చేర్పులు వుంటుండవచ్చేమో కానీ లేదంటే ఇక వరల్డ్ టీ20కి టీమిండియా జట్టు ఇలాగే వుంటుందని స్పష్టంచేశాడు ధోనీ. ఇదిలావుంటే, ఈ సిరీస్‌లకి ఆతిథ్యమిచ్చిన ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ కన్నా ముందుగా న్యూజీలాండ్‌లో జరగనున్న 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌తోపాటు ఆ వెంటనే మరో 2 టెస్ట్ మ్యాచ్‌‌ల సిరీస్‌లో పాల్గొననుంది. ఇక టీమిండియా విషయానికొస్తే, అదే టీ20 వరల్డ్ కప్ కన్నా ముందే సొంత గడ్డపై జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది.
2sports
David Warner న్యూజిలాండ్‌పై డేవిడ్‌ వార్నర్‌ సెంచరీ కాన్‌బెర్రా: ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి మెరిశాడు.కాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ వన్డేలో వార్నర్‌ 115 బంతులు ఆడి 14 బౌండరీలు,1 సిక్సర్‌తో 119 పరుగులతో సూపర్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 116 పరుగులు ఆధిక్యంలో గెలిచింది.కాగా మూడు మ్యాచ్‌ల చాపెల్‌-హ్యాడ్లీ వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంది.వార్నర్‌ కెరీర్‌లో ఇది పదవ సెంచరీ కాగా,ఈ ఏడాది ఆరవది కావడం విశేషం. ఒకే ఏడాదిలో అత్యధికంగా ఆరు సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా వార్నర్‌ గుర్తింపు పొందాడు.గతంలో పాంటింగ్‌ 2003,2007లో హేడన్‌ 2007లో ఒకే ఏడాది అయిదు సెంచరీలు చేశారు.ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 378 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 72 పరుగులు,ట్రానిస్‌ హెడ్‌ 57 పరుగులు,మిచెల్‌ మార్ష్‌్‌ 76 పరుగులు, ధాటిగా ఆడి హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు.కాగా 379 పరుగులు టార్గెట్‌లో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 47.2 ఓవర్లలో 262 పరుగులకు ఆలైటైంది.విలియమ్సన్‌ 81 పరుగులు,నీషమ్‌ 74 పరుగులు మూడవ వికెట్‌కు 125 పరుగులు జోడించారు. నీషమ్‌ ఔటయ్యాక కివీస్‌ ఇన్నింగ్స్‌ తడబడింది.
2sports
kapil dev cites sachin tendulkar's example in support of ms dhoni ధోనీపై విమర్శలు.. మధ్యలోకి సచిన్‌ను లాగిన కపిల్! తన ఆటతీరుపై కొంతమంది సీనియర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మహేంద్ర సింగ్ ధోనీకి భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అండగా నిలిచారు. TNN | Updated: Nov 12, 2017, 11:43AM IST తన ఆటతీరుపై కొంతమంది సీనియర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మహేంద్ర సింగ్ ధోనీకి భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అండగా నిలిచారు. శనివారం పుణేలో జరిగిన క్రిష్ణపట్నం పోర్ట్ గోల్డ్ ఛాంపియన్‌షిప్స్ వేడుకలో పాల్గొన్న ఈ క్రికెట్ లెజెండ్.. ధోనీ రిటైర్మెంట్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ధోనీ భారత జట్టుకు గొప్ప ఆస్తిగా కపిల్ అభివర్ణించారు. 2020లో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో కూడా ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని తాను భావిస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి అప్పటికి ధోనీ వయసు 40కి చేరుకుంటుంది. ధోనీ వయసు పైబడిందని, అతను వన్డే, టీ20ల నుంచి తప్పుకొని కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని వీవీఎస్ లక్ష్మణ్, అగార్కర్ వంటి సీనియర్ ఆటగాళ్లు సూచనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై విలేకరులు కపిల్ దేవ్‌ను ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం ధోనీ బాగానే ఆడుతున్నాడు. సగటున చూస్తే మంచి ప్రదర్శనలే ఇస్తున్నాడు. కానీ అతన్ని ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడంలేదు. దేన్నైనా సాధించడానికి వయసు అడ్డండి కాదు. వరల్డ్ కప్ సాధించినప్పుడు జట్టులో సభ్యుడైన సచిన్ వయసు 38 ఏళ్లు. అప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదు’ అని బదులిచ్చారు.
2sports
Hyd Internet 123 Views Pandya PANDYA చెన్నైః ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో ఆసీస్ జ‌ట్టు దుమ్ము దులిపిన టీమిండియా రెండు వికెట్లు తీసిన పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ, ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్ కు వస్తాడని, అతన్ని టార్గెట్ చేయాలని తాను, ధోనీ అనుకున్నామని చెప్పాడు. జంపా బౌలింగ్ లో ఎక్కువ పరుగులు చేయాల‌ని టార్గెట్ పెట్టుకున్నామ‌ని తెలిపాడు. జంపా బౌలింగ్ లో పాండ్యా వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మిల్లర్‌కు ఇచ్చిన లైఫ్‌లే దెబ్బకొట్టాయి: శిఖర్ ధావన్ దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన నాలుగో వన్డే ఓటమిపై భారత ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు. TNN | Updated: Feb 11, 2018, 03:59PM IST దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన నాలుగో వన్డే ఓటమిపై భారత ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు. రెండు వర్షం అడ్డుపడటం, డేవిడ్ మిల్లర్‌కు రెండు లైఫ్‌లు రావడం వల్లే తాము ఓడిపోయామని ధావన్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు మ్యాచ్ అనంతరం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ‘మ్యాచ్ చేజారడానికి ప్రధాన కారణం మిల్లర్ ఇచ్చిన క్యాచ్ వదిలేయడం, వెంటనే అతను బౌల్డ్ అయిన బంతి నోబాల్ కావడం. దీంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఇలా జరిగి ఉండకపోతే మేం మెరుగైన స్థితిలో ఉండేవాళ్లం’ అని ధావన్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఫలితంపై వర్షం కూడా ప్రభావం చూపిందని చెప్పాడు. వర్షం వల్ల పిచ్ స్వభావం మారిపోయిందని, అందువల్లే గత మూడు మ్యాచుల్లో బంతిని బాగా తిప్పిన తమ స్పిన్నర్లు ఈ వన్డేలో బంతిపై పట్టు కోల్పోయారని వివరించాడు. బంతి పొడిగా ఉంటే స్పిన్నర్ల ప్రదర్శన మరోలా ఉండేదని వెల్లడించాడు. అలాగే, తమ బ్యాటింగ్ మంచి ఫ్లోలో వెళ్తుండగా వర్షం వచ్చి దెబ్బకొట్టిందని ధావన్ చెప్పాడు. ఆట మధ్యలో వర్షం పడటంతో తమ బ్యాటింగ్ ఫ్లో దెబ్బతిన్నదని, అయినప్పటికీ తాము మంచి స్కోరే సాధించామని వివరించాడు. కానీ మళ్లీ ఇంకోసారి వర్షం పడటంతో అవుట్‌ఫీల్డ్ బాగా తడిగా మారిందని, ఇది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిందని తెలిపాడు.
2sports
Vikram to romance with nayan and nitya న‌య‌న్, నిత్యామీన‌న్‌ల‌తో విక్ర‌మ్‌ రొమాన్స్ విక్ర‌మ్ హిట్ అనే మాట విని చాలా కాల‌మైంది. అప‌రిచితుడు త‌ర్వాత ఆయ‌న న‌టించిన చిత్రాల‌న్నీ క‌మ‌ర్షియ‌ల్‌గా వైఫ‌ల్యాలుగానే మిగిలాయి. TNN | Updated: Dec 15, 2015, 04:56PM IST విక్ర‌మ్ హిట్ అనే మాట విని చాలా కాల‌మైంది. అప‌రిచితుడు త‌ర్వాత ఆయ‌న న‌టించిన చిత్రాల‌న్నీ క‌మ‌ర్షియ‌ల్‌గా వైఫ‌ల్యాలుగానే మిగిలాయి. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఐ , ప‌త్తు ఎండ్రాదుకుళ్ల చిత్రాలు అత‌డికి నిరాశ‌నే మిగిల్చాయి. అత‌డితో సినిమాలు చేయ‌డానికి త‌మిళ నిర్మాత‌లు వెనుక‌డుగు వేస్తున్నారు. ఓ హిట్‌తో విమ‌ర్శ‌కుల‌కు స‌మాధానాలు చెప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న విక్ర‌మ్‌ ప్ర‌స్తుతం క‌థ‌ల ఎంపిక‌లో త‌న పంథాను మార్చుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌యోగాలు ప‌క్క‌న‌పెట్టి క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌పై దృష్టిసారిస్తున్నారు. అంతేకాకుండా సినిమాల మ‌ధ్య గ్యాప్‌ను త‌గ్గించాల‌ని భావిస్తున్న ఆయ‌న ఇక నుంచి ఏడాదికి మూడు చిత్రాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచ‌న‌తోనే ప్ర‌స్తుతం అంగీక‌రించిన రెండు చిత్రాల‌ను ఒకే రోజున సెట్స్‌పైకి తీసుకురానున్న‌ట్లు తెలిసింది. ఆనంద్ శంక‌ర్‌, తిరు ఈ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ షూటింగ్‌ల‌లో ఏక‌కాలంలో పాల్గొన‌బోతున్న‌ట్లు తెలిసింది. ఆనంద్ శంక‌ర్ సినిమా కోసం న‌య‌న‌తార‌ , నిత్యామీన‌న్‌ల‌తో రొమాన్స్ చేయ‌బోతున్నారు విక్ర‌మ్‌. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాల షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV హోరా హోరీగా మూడో వన్డే భారత్ - సౌతాఫ్రికాల మధ్య మూడో వన్డే హోరాహోరీగా సాగుతోంది. TNN | Updated: Oct 18, 2015, 01:41PM IST భారత్ - సౌతాఫ్రికాల మధ్య మూడో వన్డే హోరాహోరీగా సాగుతోంది. రెండో వన్డేలో గెలిచిన భారత్ సిరీస్ 1-1 తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే టి-20 సిరీస్ ను కోల్పోయిన భారత్ వన్డే సిరీస్ నైనా నిలుపుకోవాలనే కసితో భారత్ ఉంది. ధోని మంచి ఫామ్ లో ఉండడం భారత్ కు కలిసివచ్చే అంశం. ఈ మ్యాచ్ లో గెలిచి తమ ఆధిపత్యం కొనసాగించాలని సఫారీలు భావిస్తున్నారు. గురజాత్ లోని రాజ్ కోట్ వేదికగా మధ్యాహ్నం 1:30కి జరగనున్న ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మ్యాచ్ కు భారీ భద్రత:
2sports
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి ఐదేండ్లలో 100 గిగావాట్‌ సోలార్‌ విద్యుత్‌! Fri 22 Dec 02:04:27.047917 2017 న్యూఢిల్లీ : వచ్చే 2022 నాటికి భారత్‌లో 100 గిగావాట్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యానికి చేరనున్నామని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ అంచనా వేశారు. డిసెంబ రూ.2000 నోటు వెనక్కి..! Thu 21 Dec 06:15:18.671532 2017 న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పెద్ద నోటు రూ.2,000ను తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్టులో పేర్కొంది. లేదా వీటి ముద్రణను న 24శాతం పెరిగిన కోటీశ్వరులు.. Thu 21 Dec 06:16:39.185032 2017 న్యూఢిల్లీ : దేశంలో వ్యక్తిగత కోటీశ్వరులు భారీగా పెరిగారని ఆదాయపు పన్ను శాఖ బుధవారం వెల్లడించింది. ఏప్రిల్‌ 2014 నుంచి మార్చి 2015 మధ్య ఈ వర్గం 23.5 శాతం పెరిగి 59,830కి నష్టాల్లోకి స్టాక్‌ మార్కెట్లు Thu 21 Dec 06:16:45.407829 2017 ముంబయి: వరుసగా ఐదు రోజులు లాభాల్లో సాగిన స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలు చవి చూశాయి. రిజర్వు బ్యాంకు విధాన సమీక్ష మినిట్స్‌ విడుదల నేపథ్యంలో బుధవారం మదుపర్ల లాభాల స్వీ పొంచి ఉన్న ద్రవ్యోల్బణ ముప్పు Thu 21 Dec 06:16:51.120429 2017 ముంబయి: ద్రవ్యోల్బణం పెరుగుదల వల్ల కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని రిజర్వు బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. డిసెంబర్‌ తొలి వారంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అధ్యక్షత ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును రద్దు చేయండి Thu 21 Dec 06:16:56.874724 2017 చెన్నై : దేశంలో బ్యాంకు డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ప్రజా వ్యతిరేక ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అదనపు భారంలో 350 ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు Thu 21 Dec 06:17:03.126282 2017 న్యూఢిల్లీ : దేశంలోని రూ.150 కోట్ల విలువ పైబడిన 350 మౌలిక వసతుల ప్రాజెక్టులు రూ.2.65 లక్షల కోట్ల అదనపు భారంలో ఉన్నాయని కేంద్ర స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అమలు శాఖ మ సామ్‌సంగ్‌ నుంచి అతిపెద్ద కర్వ్‌డ్‌ మానిటర్‌.. Thu 21 Dec 05:56:23.706901 2017 న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద కర్వ్‌డ్‌ (వంకర) క్యూలెడ్‌ మానిటర్‌ను సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 49 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ 'సీహెచ్‌జీ మార్కెట్లోకి ఆసూస్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ Thu 21 Dec 05:56:08.231064 2017 న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ఆసూస్‌ భారత మార్కెట్లోకి 'రోగ్‌ స్ట్రిక్స్‌ హీరో' ఎడిషన్‌లో స్ట్రిక్స్‌ జీఎల్‌503 గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. దీంతో తయారీ రంగం డీలానే.. Wed 20 Dec 01:32:16.016184 2017 ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగియనున్న మూడో త్రైమాసికంలో తయారీ రంగం పేలవ ప్రదర్శన కనబర్చనుందని ఫిక్కీ సర్వేలో వెల్లడయ్యింది. ఎన్‌ఎండీసీ గనులపై సీఎండీ సమీక్ష Wed 20 Dec 01:32:24.435551 2017 దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు ఎన్‌ఎండీసీ నిర్వహణ, గనులపై ఆ కంపెనీ సీఎండీ భాయిజేంద్ర కుమార్‌ సమీక్ష చేశారు. మంగళవారం 25% కంపెనీల్లోనే మహిళా డైరెక్టర్లు Wed 20 Dec 01:32:41.404451 2017 భారత్‌లోని 25 శాతం కంపెనీల్లో మాత్రమే మహిళ డైరెక్టర్లు ఉన్నారని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి పీ.పీ చౌదరీ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. 2015 ఏప్రిల్‌ నాటికి పెట్టుబడులకు ఎర్ర తివాచీ: యూపీ మంత్రి Wed 20 Dec 01:32:48.667243 2017 ఉత్తర ప్రదేశ్‌కు పెట్టుబడులతో వచ్చే వారికి ఎర్రతివాచీ వేస్తామని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సతీష్‌ మహన అన్నారు. తమ రాష్ట్రంలో కంపెనీలు నెలకొల్పే అమాంతం పడి.. లేచిన మార్కెట్లు Tue 19 Dec 01:28:11.934285 2017 ముంబయి: గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు దలాల్‌ స్ట్రీట్‌లో అలజడి లేపాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతుందన్న అంచనాలు, ఊహాగానాలు సోమవారం ఓ దశలో దేశీయ స్టాక్‌ మార్కెట్లను తీవ్ర రూ.8.50 లక్షల కోట్లకు చేరిన ఎన్‌పీఏలు Tue 19 Dec 01:28:19.662928 2017 ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థంలో బ్యాంకుల మొండి బాకీలు రూ.8.50 లక్షల కోట్లకు చేరాయని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్ భారీగా నిధులు సమీకరిస్తాం.. Tue 19 Dec 01:28:25.874299 2017 క్రియేటివ్‌ ఎక్స్‌పర్ట్స్‌కు చెందిన అంగో ఫ్రేమ్‌వర్క్‌ బ్రాండ్‌ వచ్చే మార్చి నాటికి మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6.7 కోట్లు) సమీకరించనున్నట్టు తెలిపింది. త్వరలో విమాన ప్రయాణికులకు ఊరట Tue 19 Dec 01:29:58.491102 2017 విమానయాన టికెట్ల రద్దు భారం నుంచి త్వరలోనే ఆ మంత్రిత్వ శాఖ ఉపశమనం కల్పించనుందని తెలుస్తోంది. దేశీయ విమానయాన సంస్థల్లో టికెట్ల రద్దు సమయంలో విధించే చార్జిల అదానీకి భారీ షాక్‌ Tue 19 Dec 01:28:35.270283 2017 ఆస్ట్రేలియాలోని బొగ్గు గని ప్రాజెక్టు విషయంలో అదానీ గ్రూపు తీవ్ర భంగపాటును ఎదుర్కొందని తెలుస్తోంది. ఈ దేశం క్వీన్స్‌లాండ్‌లోని కార్‌మైకేల్‌ గనికి విత్త సంస్థల నుంచి భారత వృద్ధి రేటు పెరుగొచ్చు Tue 19 Dec 01:30:05.523384 2017 వచ్చే కొన్ని ఏండ్లలో భారత వృద్ధి రేటు పెరుగొచ్చని ఐక్యరాజ్య సమితి ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. మరో 20 సంవత్సరాల్లో దేశ వృద్ధి రేటు 8 శాతానికి చేరొచ్చని అంచనా వేశారు. ఆ నోట్లకు రూ.5000 కోట్ల వ్యయం Tue 19 Dec 01:22:07.730076 2017 పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన కొత్త రూ.500 నోట్ల ముద్రణకు భారీ ఎత్తునే ఖర్చు అయ్యిందని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పి రాధా క్రిష్ణన్‌ తెలిపారు. ఈ నోట్ల ప్రిం నవంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు Tue 19 Dec 01:21:39.532589 2017 గత నవంబర్‌ జీఎస్టీ వసూళ్లు 10శాతం మేర తగ్గి రూ.85,931 కోట్లకు పరిమితమయ్యా యని మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా తెలిపారు. అక్టోబర్‌లోని రూ.95,132 కోట్ల ప్రయివేటుకు వాహన రిజిస్ట్రేషన్లు Sun 17 Dec 06:41:32.252766 2017 నవతెలంగాణ- వాణిజ్య విభాగం భారత్‌లో ఒకే లైసెన్స్‌-ఒకే దేశం విధానం అమలుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సైన్స్‌, టెక్నలాజీ అండ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ శాఖ మంత్రి వై ఫిబ్రవరి నుంచే ఇ-వే బిల్లు అమలు Sun 17 Dec 06:41:40.123667 2017 న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్‌టీి) అమలు అంశంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.50వేల కన్నా ఎక్కువ విలువైన సరకు రవాణాకు ఇ-వే బిల్లును తప్పనిసరిగా తీ గుజరాత్‌ ఫలితాలే కీలకం Sun 17 Dec 06:41:47.249967 2017 ముంబయి : డిసెంబర్‌ 18తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లను ప్రధానంగా గుజరాత్‌ శాసన సభ ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేప రూ.5000 కోసం ఇబ్బంది పడ్డాను Sun 17 Dec 06:41:54.870642 2017 న్యూఢిల్లీ : ఒకానొక తాను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని భారతీ ఎయిర్‌టెల్‌ అధిపతి సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ఒకానొక సమయంలో రూ.5000 కోసం అభ్యర్థించే దీన స్థితిలోకి నాట్కో ఫార్మా నిధుల సమీకరణ Sun 17 Dec 06:42:02.536727 2017 హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో క్వాలిఫైడ్‌ ఇన్స్‌ట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీి) ద్వారా రూ.915 కోట్ల నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించింది. దీనికి సబంధిం ఏసర్‌ నుంచి ఖరీదైన ల్యాప్‌టాప్‌ Sun 17 Dec 06:42:13.448464 2017 న్యూఢిల్లీ : ఏసర్‌ ఇండియా శుక్రవారం ప్రీడేటర్‌ 21 ఎక్స్‌ పేరుతో నూతన గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.6,99,999గా నిర్ణయించింది. బెర్లిన్‌లో 20 ఫార్మా కోసం అయాన్‌ ఎక్సేంజీ 'స్వీప్టు 5జీఎక్స్‌' Sun 17 Dec 00:53:32.736737 2017 హైదరాబాద్‌ : నీటిశుద్ధి, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిష్కారాల్లో పరిశ్రమ అగ్రగామీగా ఉన్న అయాన్‌ ఎక్సేంజీ ఇండియా లిమిటెన్‌ ఫార్మా పరిశ్రమ ప్రత్యేక అవసరాల కోసం ఇండి జీఎంఆర్‌ చేతికి మరో ఫిలిప్పీన్స్‌ ప్రాజెక్టు..! Sat 16 Dec 05:33:09.261722 2017 హైదరాబాద్‌ : ఫిలిప్పీన్స్‌ కేంద్రంగా పని చేస్తున్న మెగావైడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో జీఎంఆర్‌ గ్రూపు క్లార్క్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును ద మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్‌ జోష్‌! Sat 16 Dec 05:33:22.689988 2017 ముంబయి : గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం దక్కనుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు శుక్రవారం స్టాక్‌ మార్కెట్లకు ఊపునిచ్చాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ బీజేపీ గెలుపొందవచ్చన్న ఎన్‌ఎండీసీకి ప్రతిష్టాత్మక పురస్కారం Sat 16 Dec 05:33:33.349584 2017 న్యూఢిల్లీ: కార్పొరేట్‌ సామా జిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో ఎన్‌ఎండీసీ అందించిన సేవలకు గాను సీఐఐ-ఐటీసీ సస్టెయినేబిలిటీ అవార్డు 2017 లభించింది. న్యూఢిల్లీలో సిఐఐ ఏర్పాటు చేసిన ప్రతికూల ప్రభావాలు సమసిపోతాయి.. Sat 16 Dec 05:33:40.850715 2017 వాహింగ్టన్‌: పెద్దనోట్ల రద్దు ప్రయోజనాలను దీర్ఘకాలంలో పొందవ చ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అభిప్రాయపడింది. గతేడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.5 దిగుమతి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు ప్రియం! Sat 16 Dec 05:33:48.505698 2017 న్యూఢిల్లీ : విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు ప్రియం కానున్నాయి. ఈ ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచుతూ ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుం సామాజిక అవసరాలకు మిలాప్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ Sat 16 Dec 05:33:57.874891 2017 హైదరాబాద్‌ : అత్యవసర వైద్య చికిత్సలు, ఉన్నత చదువులకు, ఆటలలో నిపుణుల శిక్షణకు దూరమవుతున్న లేక ఇబ్బందులు పడుతున్న వారికి మిలాప్‌ఓఆర్‌జీ మద్దతునిస్తుందని ఆ సంస్థ అధ్యక్షులు నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. Sat 16 Dec 05:34:06.874676 2017 న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆధ్వర్యంలో శనివారం జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ కానుంది. ఈ 24వ కౌన్సిల్‌ సమావేశంలో ప్రధానంగా ఈ-వే బిల్‌పై చర్చించనున్నారని స జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌..! Fri 15 Dec 04:11:30.489929 2017 న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గత జులై నుంచి ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులు కూడా రావొచ్చని బిహార్‌ ఆర్ధిక శాఖ మార్కెట్లోకి ఇంటెక్స్‌ వైర్‌లెస్‌ స్పీకర్లు Fri 15 Dec 04:11:37.187731 2017 నవతెలంగాణ, బిజినెస్‌ డెస్క్‌: ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ దేశ మార్కెట్లోకి నూతన శ్రేణీ వైర్‌లెస్‌ 'డీజే' స్పీకర్లను విడుదల చేసింది. గురువారం హైదరాబాద్‌లో వీటిని ఆ కంపెనీ ఐటీ ప పెరిగిన టోకు ద్రవ్యోల్బణం Fri 15 Dec 04:11:43.152162 2017 న్యూఢిల్లీ : దేశంలో టోకు ద్రవ్యోల్బణం కూడా ఎగిసిప డుతుంది. ఉల్లి, కూరగాయల ధరలు పెరగడంతో ప్రస్తుత ఏడాది నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) 3.93 శాతానికి పెరిగిం ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు! Fri 15 Dec 04:11:50.239734 2017 వాషింగ్టన్‌ : ప్రస్తుత ఏడాదిలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు మూడోసారి వడ్డీ రేట్లను పెంచింది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) తాజా పరపతి సమీక్షలో 25 బ రాష్ట్రానికి తయారీ పార్కు.. Thu 14 Dec 06:40:06.71175 2017 నవతెలంగాణ, బిజినెస్‌ డెస్క్‌: తెలంగాణలో మౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఈక్విప్‌మెంట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ పార్కు) ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ అధిక ధరలతో కష్టాలే.. Thu 14 Dec 06:40:13.4989 2017 న్యూఢిల్లీ : దేశంలో వరుసగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్ధిక వ్యవస్థకు సవాళ్లను విసురనుంది. ప్రజల కొనుగోలు శక్తి హరించనుందని, పెట్టుబడులు కూడా పడిపోనున్నాయని విశ్లేషకులు హె డిజిటల్‌కు ప్రోత్సాహకాలు పెంచాలి.. Thu 14 Dec 06:40:20.129862 2017 హైదరాబాద్‌ : నగదు రహిత లావాదేవీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ హెచ్‌ఆర్‌ ఖాన్‌ అన్నారు. తద్వారా భారత్‌ నగదురహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యాని నాస్‌డక్‌లో 'లాంగ్‌ఫిన్‌' కార్ప్‌ ఐపీవో Thu 14 Dec 06:40:26.548369 2017 న్యూయార్క్‌ : గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ అయినా విత్త, ఎఫ్‌ఎక్స్‌ హెడ్డింగ్‌ సేవలు అందించే లాంగ్‌ఫిన్‌ కార్ప్‌ నాస్‌డక్‌లో ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో)కు సిద్దమయ్యింది. 360 మ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 'తక్షణ' రుణాలు Thu 14 Dec 06:40:33.342827 2017 హైదరాబాద్‌ : ప్రముఖ గృహ రుణాల సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తక్షణ గృహ రుణాలు అందిస్తున్నట్టు ప్రకటించింది. ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజులు లేకుండానే డిసెంబర్‌ 16 వరకు అర్హులైన వారికి ఎయిర్‌డెక్కన్‌ సేవలు పున:ప్రారంభం.. Thu 14 Dec 06:40:40.755247 2017 న్యూఢిల్లీ : దేశీయ బడ్జెట్‌ విమానయాన సంస్థ ఎయిర్‌డెక్కన్‌ తమ సేవలను పున:ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా కొంతమంది లక్కీ ప్రయాణికులకు ఒక్క రూపాయికే విమాన టి వృద్ధి రేటుకు కోత Thu 14 Dec 06:40:48.157761 2017 న్యూఢిల్లీ : ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) భారత వృద్ధి రేటు అంచనాలకు కోత పెట్టింది. మోడీ ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో అనుహ్యాంగా చేపట్టిన నోట్ల రద్దు, పన్ను మార్కెట్లకు చమురు ఎఫెక్ట్‌ Wed 13 Dec 03:43:06.472305 2017 ముంబయి: వరుసగా మూడు రోజులు లాభాలు ఆర్జించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలు చవి చూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, దేశీయంగా ద్రవ్యోల్బణంపై న మొత్తం పీఎఫ్‌ తీసేయొద్దు Wed 13 Dec 03:44:33.30012 2017 ఛండీగఢ్‌: చిన్న చిన్న కారణాలతో ఉద్యోగ భవిష్య నిధి(పీఎఫ్‌) ఖాతాలో వున్న సొమ్ము మొత్తాన్నీ ఒకేసారి విత్‌డ్రా చేయొద్దని సభ్యులైన ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో మంగళవారం సూచించింది. పీ ప్రీమియం వసూళ్లలో 30% వృద్ధి లక్ష్యం.. Wed 13 Dec 03:44:40.612091 2017 నవతెలంగాణ, బిజినెస్‌ డెస్క్‌: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 30 శాతం వృద్ధితో రూ.1700 కోట్ల ప్రీమియం వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నామని మునిచ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ మార్ షియోమీ నుంచి విద్యుత్‌ కార్లు Wed 13 Dec 03:44:47.164158 2017 న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల కంపెనీ షియోమీ భారత మార్కెట్లోకి విద్యుత్‌ కార్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. భారత్‌లో మరింత విస్తరించేందుకు ఆటోమ
1entertainment
internet vaartha 179 Views మెల్బోర్న్‌: భారత ఆటగాడు విరాట్‌ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు.కాగా ఇప్పటికే వేగవంతమైన 7 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా డివిలియర్స్‌ పేరున ఉన్న రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ,ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ను సైతం అధిగమించాడు.వేగవంతమైన సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పాంటింగ్‌ను అధిగమించాడు కోహ్లీ. అంతర్జాతీయమ్యాచ్‌ల్లో వేగంగా 24 సెంచరీలు చేసిన జాబితాలో కోహ్లీ చేరిపోయాడు. మెల్బోర్న్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో 117 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.దీంతో పాంటింగ్‌ పేరిట ఉన్న వేగవంతమైన పూర్తి సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేశాడు.అంతర్జాతీయ వన్డేల్లో 24 వేగవంతమైన సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. ఆస్ట్రేలియా పర్యటనలో రికీ పాంటింగ్‌ రికార్డును బ్రేక్‌ చేయడం విశేషం.కాగా 169 మ్యాచ్‌ల్లో 161 ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ 24 సెంచరీలు నమోదు చేశాడు.కాగా పాంటింగ్‌ 278 ఇన్నింగ్స్‌ల్లో 24 సెంచరీలు సాధించాడు. శ్రీలంక మాజీ ఆటగాడు సనత్‌ జయసూర్య 370 ఇన్నింగ్స్‌ల్లో కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ సాధించాడు. బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ 219 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.కాగా అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ అయిదవ స్థానానికి ఎగబాకాడు.కాగా 49 సెంచరీలతో సచిన్‌ టెండూల్కర్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా,30 సెంచరీలతో పాంటింగ్‌ తరువాత స్థానంలో ఉన్నాడు. టాప్‌ -5 సెంచరీలు సాధించిన ఆటగాళ్లు… 49-సచిన్‌ టెండూల్కర్‌ (463 మ్యాచ్‌లు) 30-రికి పాంటింగ్‌ (375 ఆస్ట్రేలియా) 28-సనత్‌ జయసూర్య (445 శ్రీలంక) 25-కుమార సంగక్కర (404 శ్రీలంక) 24- విరాట్‌ కోహ్లీ (169 మ్యాచ్‌లు)
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV సైలెంట్‌గా ముగిసిన ‘మా’ఎన్నికలు, ఏకగ్రీవం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఈ సారి చడీ చప్పుడు కాకుండా జరిగిపోయాయి. | Updated: Mar 2, 2017, 10:01PM IST టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఈ సారి చడీ చప్పుడు కాకుండా జరిగిపోయాయి. ‘మా’ అధ్యక్షుడిగా నటుడు శివాజీరాజా ఎన్నికయ్యారు. గతేడాది ఇరు వర్గాలుగా చీలిపోయి..ఎన్నికలు..ఒకరిపై ఒకరు విమర్శలు..ఇలా రచ్చరచ్చగా ‘మా’ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు సినీతారలపై విమర్శలు వచ్చాయి. రాజకీయ ఎన్నికలను తలపించాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ అనుభవం నేపథ్యంలో ఈ సారి ఎలాంటి హడావుడి లేకుండా....పోటీల మీద పోటీలు చేసుకోకుండా...ఎన్నికలు ఏకగ్రీవంగా అయ్యేలా ‘మా’ సభ్యులు చర్యలు తీసుకొని సక్సెస్ అయ్యారు. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ పదవీ కాలం ముగియనుండటంతో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శివాజీ రాజా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నరేష్ ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు ‘మా’ రాజేంద్రప్రసాద్, నరేష్ ల చొరవతో పాటు దాసరి నారాయణరావు, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి వారు కృషి చేశారు. ఇదిలా ఉండగా అధ్యక్ష కార్యదర్శులుగా రాజేంద్రప్రసాద్, నరేష్ లతో పాటు ఇతర సభ్యులు ఆర్టిస్టుల సంక్షేమం కోసం పాటుపడ్డారని ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా కొత్తగా ఎన్నికైన ‘మా’టీంను మార్చి 12న అధికారికంగా ప్రకటించాలని ‘మా’ నిర్ణయించింది.
0business
Visit Site Recommended byColombia హార్దిక్‌తో పాటు ఆ షోకి హాజరైన కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు’ అంటూ ప్రశంసించాడని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ఇద్దరిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగగా.. కనీసం రెండు వన్డేల నిషేధం విధించాలని బీసీసీఐ పరిపాలక కమిటీ ఇటీవల ప్రతిపాదించింది. హార్దిక్ పాండ్యాపై రెండు వన్డేల నిషేధం ప్రతిపాదన వార్త వెలుగులోకి రావడంతో అతని తండ్రి హిమాన్షు పాండ్యా తాజాగా స్పందించాడు. ‘హార్దిక్ పాండ్య కామెంట్స్‌ని ప్రేక్షకులు ఎందుకు ఇంత సీరియస్‌గా తీసుకుంటున్నారో..? నాకు అర్థం కావడం లేదు. అదొక ఎంటర్‌టైన్‌మెంట్ షో.. కాబట్టి.. హార్దిక్ సరదాగా ఆ కామెంట్స్ చేశాడు. అక్కడ అభిమానుల్ని అలరించాలనే ఉద్దేశంతో మాత్రమే హార్దిక్ అలా మాట్లాడాడు. కాబట్టి.. వాటిని ఎవరూ సీరియస్‌ లేదా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అతను చాలా అమాయకుడు. అలానే.. సరదా మనిషి కూడా’ అని హిమాన్షు చెప్పుకొచ్చాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV IPL 2019 Timings, CSK vs RCB: ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ విడుదల..! టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా.. గ్రూప్ దశలో ప్రతి జట్టూ 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ఏడు మ్యాచ్‌లు సొంతగడ్డపై.. మరో ఏడు ప్రత్యర్థి వేదికపై తలపడటం ఆనవాయితీగా వస్తోంది. Samayam Telugu | Updated: Mar 20, 2019, 12:06PM IST IPL 2019 Timings, CSK vs RCB: ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ విడుదల..! హైలైట్స్ మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు మొదలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఇటీవల రెండు వారాల మ్యాచ్‌ల షెడ్యూల్‌ని ప్రకటించిన బీసీసీఐ తాజాగా గ్రూప్ దశ వరకూ షెడ్యూల్ విడుదల తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు విడుదల చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇటీవల రెండు వారాల షెడ్యూల్‌ని విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా గ్రూప్ దశ వరకూ షెడ్యూల్‌ని ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొననుంది. గత సీజన్ తరహాలో గ్రూప్ దశ వరకూ మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకి, రాత్రి 8 గంటలకి ప్రారంభంకానున్నాయి.
2sports
Jun 15,2015 శుభ సూచికలతో లాభాల్లోకి.. ముంబయి: దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిలో పెరుగుదల, ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం, సగటు కంటే మెరగైన వర్షపాతం నమోదు అవ డం తదితర శుభ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు సోమవారం లాభాలలో నడిచాయి. ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు చాలా ప్రోత్సాహకరంగా ఉడడంతో పాటు వర్షాలు బాగా పడుతున్నందున 'రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా' తదుపరి ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న వార్తలతో మార్కెట్లలో సెంటిమెంట్‌ బలపడింది. ఈ మంచి పరిణామాల ఫలితంగా ఉదయం నుంచే మార్కెట్లు లాభాల్లో నడిచాయి. మంచి జోరు మీద కనిపించిన మార్కెట్లు మధ్యాహ్నం తరువాత గ్రీస్‌ భయాల నేపథ్యంలో కొంత నెమ్మదించాయి. మంచి షేర్లు తక్కువ ధరల వద్ద ట్రేడ్‌ అవుతున్నందున వాటిని మదుపరులు చేజి క్కించుకొనేందుకు ఆసక్తి చూపారు. ఈ అంశం కూడా మార్కెట్లు పెరగడానికి బాగా తొడ్పడింది. ఫలితంగా బీఎస్‌ఈ సూచీ సెన్సెక్‌ 161.25 పాయింట్ల మేర పెరిగి 26,586.55 పాయింట్ల వద్ద నిలిచింది. మరోవైపు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ కూడా 31 పాయింట్లు బలపడి 8,013.90 వద్ద స్థిర పడింది. నిఫ్టీ 8000 సైకలాజికల్‌ మార్కును నిలబెట్టుకుంది. మార్కెట్‌ విస్తృతి ఆరోగ్యకరంగానే కనిపించింది. ఆటోస్టాక్‌లకు మంచి డిమాండ్‌ కనిపించింది. బీఎస్‌ఈలో 1440 షేర్లు పెరిగాయి. 1207 వాటాలు కుంగాయి. 141 స్క్రిప్‌లలో ఎలాంటి హెచ్చుతగ్గులు నమోదు అవలేదు. బీఎస్‌ఈ టర్నోవర్‌ రూ.2345 కోట్లుగా నమోదు అయింది. అంతకు ముందు సెషన్‌లో ఇది రూ.2204.75 కోట్లుగా ఉంది. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.14 పాయింట్లు, స్మాల్‌ క్యాప్‌ సూచీ 44.62 పాయింట్ల మేర కుంగాయి. బీఎస్‌ఈ ఆటో సూచీ 1.12 శాతం పెరిగింది. ఆరోగ్య రంగ సూచీ (0.96%), చమురు-సహజ వాయు సూచీలు (0.87%) ఎగిశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 3, May 2019, 3:00 PM IST Highlights ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది.  ఆ జట్టు తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ కాగిసో రబడ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది.  ఆ జట్టు తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ కాగిసో రబడ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా రబడ ఆడలేదు. స్వల్పగాయం కారణంగా ఆ మ్యాచ్ కు హాజరు కాలేదు. కాగా ఇప్పుడు పూర్తిగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి తీసుకునేందుకు ఐపీఎల్‌ నుంచి వెంటనే వచ్చేయాలని అతడికి దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు కబురు పెట్టింది. ఫలితంగా అతడు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. రబడ లేకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి గెలుపు కష్టంతో కూడుకున్న పనే. మొన్న మ్యాచ్ లో కూడా రబడ లేకపోవడం వల్లే ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయిందనే వాదనలు వినిపించాయి. ప్రస్తుత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి రబడ టాప్‌లో కొనసాగుతున్నాడు. 12 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు దక్కించుకున్నాడు. కీలక దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును వీడి వెళుతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ తప్పడం లేదని రబడ పేర్కొన్నాడు. Last Updated 3, May 2019, 3:00 PM IST
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కోహ్లికి ఆశాభంగం.. కౌంటీ క్రికెట్‌కు దూరం! టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీ క్రికెట్‌కు దూరం కానున్నాడు. సర్రే తరఫున కౌంటీల్లో ఆడటం ద్వారా ఇంగ్లాండ్ పర్యటనకు సన్నద్ధం కావాలన్న కోహ్లి యత్నాలకు బ్రేక్ పడింది. Samayam Telugu | Updated: May 24, 2018, 02:46PM IST కోహ్లికి ఆశాభంగం.. కౌంటీ క్రికెట్‌కు దూరం! టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీ క్రికెట్‌కు దూరం కానున్నాడు. సర్రే తరఫున కౌంటీల్లో ఆడటం ద్వారా ఇంగ్లాండ్ పర్యటనకు సన్నద్ధం కావాలని కోహ్లి భావించాడు. ఇప్పటికే సర్రేతో ఒప్పందం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కానీ మెడ భాగంలో గాయం (హెర్నియేటెడ్ డిస్క్) కారణంగా కౌంటీ క్రికెట్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. కౌంటీలకు దూరంగా ఉండాలని దేశంలోని టాప్ ఆర్థోపెడిక్ సర్జన్ ఒకరు విరాట్ కోహ్లికి సలహా ఇచ్చారు. కౌంటీల్లో ఆడితే జూలైలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆ సర్జన్ కోహ్లిని హెచ్చరించారు. బుధవారం ముంబైలోని ఖార్ హాస్పిటల్‌కు వెళ్లిన కోహ్లి ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. మెడ భాగంలో నరాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వైద్యుల బృందం తెలిపింది. ప్రస్తుతానికి కోహ్లికి సర్జరీ అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. కౌంటీల్లో ఆడటం కోసం కోహ్లి అప్ఘాన్‌తో జరగనున్న చార్రితక టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నాడు. కానీ గాయం కారణంగా కౌంటీ క్రికెట్‌కు కూడా దూరం అవుతున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కౌంటీల్లో తాను ఆడబోవడం లేదని కోహ్లి ఇప్పటికే సర్రే జట్టుకు సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ కోహ్లి గాయపడ్డాడు. 2014లో ఇంగ్లాండ్‌‌లో తొలిసారి పర్యటించిన కోహ్లి ఐదు టెస్టులు ఆడి కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. స్వింగ్ బంతిని ఎదుర్కోవడంలో విఫలమైన విరాట్ ఆ సిరీస్‌లో నాలుగుసార్లు అండర్సన్‌కి వికెట్ సమర్పించుకున్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV రూ. 3వేలకే విదేశీ ప్రయాణం:ఎయిర్ ఏసియా ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా పండగ ఆఫర్లను ప్రకటించింది. 'ఫెస్టివల్ సేల్' పేరుతో తక్కువ ధరకే విదేశీ విమాన ప్రయాణం కల్పిస్తోంది... TNN | Updated: Sep 26, 2016, 04:28PM IST ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా పండగ ఆఫర్లను ప్రకటించింది. 'ఫెస్టివల్ సేల్' పేరుతో తక్కువ ధరకే విదేశీ విమాన ప్రయాణం కల్పిస్తోంది. ఇందులో భాగంగా భారత్ లోని ఎంపిక చేసిన నగరాల నుండి కౌలాలంపూర్ కి ఒక వైపు ప్రయాణానికి రూ. 3,699 మాత్రమే ఛార్జ్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. కేరళలోని కోచ్చి నుంచి కౌలాలంపూర్ మార్గంలో ఒక వైపు ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద వివిధ నగరాల నుంచి కౌలాలంపూర్ వరకు ప్రకటించిన ఛార్జీల ధరల ప్రకారం.. తిరుచినాపల్లి నుంచి రూ. 3,999, విశాఖపట్నం నుంచి రూ. 4,699, చెన్నై నుంచి రూ. 5,399, ​ హైదరాబాద్ నుంచి రూ. 5,699, కోల్ కతా నుంచి ​ రూ. 5,999 మరియు బెంగళూరు నుంచి కౌలాలంపూర్ వరకు రూ. 6,699గా ధరలు నిర్ణయించింది. ఆస్ట్రేలియాకు కూడా రూ. 10 లోపే టికెట్ ధరలను ప్రకటించింది. ఈ ఆఫర్ ఈరోజు నుంచి అక్టోబర్ 2, 2016 వరకు తమ అధికారిక వెబ్ సైట్లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికే వర్తిస్తుంది. టికెట్ బుక్ చేసుకున్నవారు సెప్టెంబర్ 27, 2016 నుంచి మార్చి 31, 2017 మధ్య కాలంలో ఏ రోజైనా ప్రయాణించవచ్చు. అలాగే ఇదే ఆఫర్ కింద అక్టోబర్ 8 నుంచి హైదరాబాద్ టూ కోచ్చి టికెట్ అన్ని పన్నులు కలుపుకొని ధర రూ. 2,999 నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఏసియా ప్రకటించింది.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఇరానీ కప్‌లో భారీ స్కోర్.. 28 ఏళ్ల రికార్డ్ బ్రేక్..! నాగ్‌పూర్ వేదికగా తాజాగా జరుగుతున్న ఇరానీ కప్‌లో 28 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో జరుగుతున్న TNN | Updated: Mar 17, 2018, 11:29AM IST ఇరానీ కప్‌లో భారీ స్కోర్.. 28 ఏళ్ల రికార్డ్ బ్రేక్..! నాగ్‌పూర్ వేదికగా తాజాగా జరుగుతున్న ఇరానీ కప్‌లో 28 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 800 పరుగుల రికార్డు స్కోరుతో గట్టి సవాల్ విసిరింది. వసీమ్ జాఫర్ (286: 431 బంతుల్లో 34x4, 1x6) భారీ డబుల్ సెంచరీతో చెలరేగగా.. అపూర్వ్ వాంఖడే (157: 221 బంతుల్లో 16x4, 6x6), గణేశ్ సతీశ్ ( 120: 280 బంతుల్లో 10x4, 2x6) శతకాలు బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 226.3 ఓవర్లలో 800/7 వద్ద మొదటి ఇన్నింగ్స్‌ని శనివారం డిక్లేర్ చేసింది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కోహ్లి సక్సెస్ సీక్రెట్.. టెస్టుల్లో అలా, వన్డేల్లో ఇలా.. కెప్టెన్‌గా వరుస విజయాలతో దూసుకెళ్తున్న విరాట్ కోహ్లి.. సక్సెస్ కోసం ఓ వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. వన్డేల్లో అయితే ఒకలా.. టెస్టుల్లో మరోలా.. TNN | Updated: Aug 24, 2017, 02:56PM IST టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి జట్టుకు చక్కటి విజయాలను అందిస్తున్నాడు. టెస్టులు, వన్డేలు ఫార్మాట్ ఏదైనా.. గత రెండేళ్లుగా భారత క్రికెట్ జట్టు విజయాలు సాధిస్తోంది. మెరుగైన ఆటగాళ్లు ఉండటంతోపాటు కోహ్లి నిర్ణయాలు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. మ్యాచ్‌లో గెలుపొందడానికి విరాట్ ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నాడు. టెస్టుల్లో టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటున్న కోహ్లి.. వన్డేల్లో టాస్ గెలిస్తే మాత్రం ఫీల్డింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నాడు. కెప్టెన్‌గా కోహ్లి గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 16 టెస్టుల్లో టాస్ నెగ్గిన కోహ్లి.. 15సార్లు ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వన్డేల్లో 15సార్లు టాస్ నెగ్గిన మన కెప్టెన్.. 14సార్లు ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. టెస్టుల్లో ముందుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే వ్యూహాన్ని అనుసరిస్తోన్న విరాట్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో వన్డేల్లో ఎంతటి స్కోరైనా ఛేదనకే ఇష్టపడుతున్నాడు. స్వతహాగా కోహ్లికి లక్ష్య చేధన అంటే మక్కువ అనే సంగతి తెలిసిందే. ఛేజింగ్‌లో 64 ఇన్నింగ్స్‌లోనే కోహ్లి 4 వేల పరుగుల మైలురాయి చేరుకొని సచిన్ రికార్డును కూడా ఈ మధ్యే బద్దలుకొట్టాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో తొలి వన్డేలో టాస్ నెగ్గి ఛేజింగ్ ద్వారా విజయం అందుకున్న విరాట్.. రెండో వన్డేలోనూ ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ ప్రతి మ్యాచ్‌లో టాస్ నెగ్గిన కోహ్లి.. అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాడు.
2sports
Suresh 70 Views Aditya Birla Capital Aditya Birla Capital ముంబయి: ఆదిత్యబిర్లా కేపిటల్‌ సంస్థ 2100 కోట్ల నిధులను ప్రాధాన్యతా షేర్ల కేటాయింపుతో నిధులు సమీకరించుకోవాలని నిర్ణయించింది. జోమేఇ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థకు ఈ వాటాలను జారీచేస్తోంది. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోటర్‌ అయిన జోమేయితో పాటు పిఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌కు సైతం షేర్లను కేటాయి స్తోంది. ఆదిత్యబిర్లా గ్రూప్‌లోని కీలకమైన సంస్థ ప్రస్తుతానికి 1000 కోట్ల మూలధన వనరులు అవసరమని భావిస్తోంది. 770 కోట్లు జోమేయి ఇన్వెస్ట్‌మెంట్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి సేకరిస్తుండగా పదికోట్లు వాటాలు, మరో 7.70 కోట్ల పూర్తి అధీకృత చెల్లింపు వాటాలను వంద రూపాయలు చపొ2న జోమేయి, గ్రాసిమ్‌లకు విడుదలచేస్తోంది. ఎబిసిఎల్‌ కంపెనీ 230 కోట్లు, మరో వందకోట్ల రూపాయలను ప్రమోటర్‌ గ్రూప్‌ పిఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌-1నుంచి సేకరిస్తోంది కంపెనీ 2.30 కోట్ల మేర వాటాలు జారీచేస్తుండగా వాటిలో కోటికిపైగా పూర్తి అధీ కృత చెల్లింపు ఈక్విటీవాటాలను రూ.100 చొప్పున ప్రమోటర్‌గ్రూప్‌, పిఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌-1కు కేటాయిస్తున్నది. ఈ వాటాల కేటా యింపు తర్వాతగ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ప్రమోటర్‌గ్రూప్‌ వాటాలు 54.29 శాతం,16.26 శాతంగా ఉంటాయి. జోమేయి, పిఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌-1 సంస్థలు 4.15శాతం, 3.86శాతం వాటాలతో ఉంటాయి. ఇందుకోసం ఎబిసిఎల్‌ ఇప్పటికే అత్యవసర సర్వసభ్యసమావేశం వచ్చే అక్టోబరు ఐదవ తేదీ నిర్వహిస్తోంది. ఈ ఈక్విటీ వాటాల ప్రాధాన్యతా కేటాయింపులను ఆమోదిం చుకునేందుకు యత్నిస్తోంది. సుమారు 3 లక్షల కోట్లకుపైబడ ఇనిర్వహణ ఆస్తులున్న ఆదిత్య బిర్లాగ్రూప్‌ రుణపరపతి బుక్‌ 61,900 కోట్లకు పైబడి ఉంది. ఇక అనుబంధసంస్థలు, జాయింట్‌ వెంచర్లుసైతం మంచి లాభదాయక స్థితిలోనే ఉన్నాయి. కంపెనీ నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌, హౌసింగ్‌ఫైనాన్స్‌, మ్యూచువల్‌ఫండ్‌, బీమా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, సాధారణబీమా బ్రోకింగ్‌, స్టాక్‌ సెక్యూరిటీల బ్రోకింగ్‌ వ్యాపారాలు నిర్వహిస్తోంది.
1entertainment
Visit Site Recommended byColombia ఈ-బిడ్ ద్వారా ఈసారి మీడియా హక్కులను విక్రయించగా.. గత ఐదేళ్లతో పోలిస్తే.. బీసీసీఐ రాబడి 59.39 శాతం పెరగనుంది. 2012-18 మధ్య కాలానికి భారత మ్యాచ్‌ల ప్రసారానికి స్టార్ ఇండియా రూ. 3851 కోట్లు చెల్లించింది. ఏప్రిల్ 15 నుంచి 2023 మార్చి 31 వరకు స్టార్ ఇండియా టీమిండియా ఆడే మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. ఈ ఐదేళ్ల కాలంలో భారత్ అన్ని ఫార్మాట్లు కలుపుకొని 102 మ్యాచ్‌లు ఆడనుంది. గత ఏడాది సెప్టెంబర్లో ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా స్టార్ ఇండియా దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2018-22 మధ్య కాలానికి స్టార్ ఇండియా ఏకంగా రూ.16,347.5 కోట్ల బిడ్ దాఖలు చేసింది. 2012లో భారత్ ఆడే మ్యాచ్‌ల కోసం స్టార్ ఇండియా రూ.3851 కోట్లకు బిడ్ వేయగా.. సోనీ రూ. 3700 కోట్లు బిడ్ వేసి కొద్ది తేడాలో ప్రసార హక్కులను కోల్పోయింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అవునా... లావణ్య డేటింగ్‌లో ఉందా? టాలీవుడ్‌లో అందాల రాక్షసి సినిమాతో తెరంగేట్రం చేసింది లావణ్య త్రిపాఠి. TNN | Updated: Jan 28, 2016, 09:39AM IST అవునా... లావణ్య డేటింగ్‌లో ఉందా? టాలీవుడ్‌లో అందాల రాక్షసి సినిమాతో తెరంగేట్రం చేసింది లావణ్య త్రిపాఠి . ఆ సినిమా తరువాత కెరీర్‌కి అంత ఊపు రాకపోయినా, గతేడాది చేసిన భలే భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. అనంతరం నాగార్జునతో ‘సోగ్గాడే...’ లో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా విజయంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఆ అమ్మడికి సంబంధించి ఓ వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. లావణ్య ప్రస్తుతం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమాలో నటించింది. అందులో లీడ్ రోల్ లావణ్యదే. అందాల రాక్షసిలో ఆమెతో కలిసి నటించిన నవీన్ చంద్రే ఈ సినిమాలోనూ హీరో. ఈ సినిమా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తనతో రెండు సినిమాలలో కలిసి నటించిన నవీన్ చంద్రతో లావణ్య డేటింగ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఫిల్మ్ నగర్లో గుప్పుమంది. ప్రస్తుతం ఈ విషయం సీక్రెట్ గా ఉన్నా... త్వరలో అందరికీ తెలుస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ధోని కెరీర్‌పై దాదా ఆసక్తికర వ్యాఖ్యలు Oct 23, 2019, 16:08 IST ముంబై: లాంఛనం పూర్తయింది. బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యలు తమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో గంగూలీ తొలి మీడియా సమావేశంలో మాట్లాడాడు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం బీసీసీఐకి సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో అవినీతి రహిత పాలన అందిస్తానని, బోర్డు విశ్వసనీయతను కాపాడతానని గంగూలీ హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోని కెరీర్‌పై ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు గంగూలీ ఆసక్తికర సమాధానమిచ్చాడు.   ‘భారత క్రికెట్‌లో ఎంఎస్‌ ధోనిది ప్రత్యేక స్థానం. ఆటగాడిగా, కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో అపూర్వ విజయాలను అందించాడు. ధోని పట్ల భారత్‌ గర్వంగా ఉంది. అతడు సాధించిన ఘనతలను కూర్చొని రాసుకుంటూ వెళితే ‘వావ్‌’ అనాల్సిందే. నేను పదవిలో ఉన్నంతకాలం ప్రతీ ఒక్కరికీ సరైన గౌరవం దక్కుతుందని హామీ ఇస్తున్నా. అయితే ధోని రిటైర్మెంట్‌ విషయం అనేది అతడి చేతుల్లోనే ఉంది. కెరీర్‌ గురించి అతడి ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి. అయితే ‘చాంపియన్లు తొందరగా నిష్క్రమించకూడదు’ ఈ అభిప్రాయం కేవలం నా ఒక్కడిదే కాదు యావత్‌ ప్రపంచానిది. నేను కూడా కొంత కాలం క్రికెట్‌ ఆడలేదు అనంతరం జట్టులోకి వచ్చి నాలుగేళ్లు ఆడాను. త్వరలోనే ధోనితో కూడా సమావేశమవుతా కోచ్‌, కెప్టెన్‌, ఆటగాళ్ల ఎంపిక అంతా సెలక్షన్‌ కమిటీ చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయాల్లో బీసీసీఐ తలదూర్చదు. అంతేకాకుండా గతంలో బీసీసీఐ అధ్యక్షులు, సారథులు మధ్య మంచి సఖ్యతే ఉంది. ఆలాంటి సఖ్యతే కొనసాగిస్తాను. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నాను. సుపరిపాలన అందించడానికి కృషి చేస్తాను’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇక బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా గంగూలీ ఈరోజు బాధ్యతలు చేపట్టడంతో 33 నెలల సుప్రీం కోర్టు నియమిత పరిపాలకుల కమిటీ(సీఓఏ) పాలనకు తెరపడింది. దాదాతో జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అరుణ్‌ సింగ్‌ ధూమాల్‌ కోశాధికారిగా ఈరోజు బాధ్యతలు చేపట్టారు.   చదవండి:
2sports
Visit Site Recommended byColombia వేలాదిమంది డ్రైవర్ పార్టనర్స్‌ తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారని ఎంఎన్‌ఎస్‌ అనుబంధ సంఘం ప్రకటించింది. యూనియన్ అధ్యక్షుడు సంజయ్ నాయక్ మాట్లాడుతూ, సమ్మెకు సహకరించమని జోతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తామని.. వినకపోతే ఎంఎన్‌ఎస్‌ శైలిలో సమాధానం చెబుతామంటూ హెచ్చరించారు. మరోవైపు తమ డ్రైవర్లకు భద్రత కల్పించాల్సిందిగా ఓలా, ఉబెర్‌ యాజమాన్యాలు పోలీసు అధికారులను కోరాయి. నగరంలో కాబ్ రైడ్ సమయంలో ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలను డిమాండ్‌ చేస్తూ ముంబై పోలీసులను కలిశామని ఓలా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు మరికొన్ని సంఘాలు ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాద్‌లో సమ్మెను పాటించడంలేదని ఇప్పటికే కొన్ని సంఘాలు ప్రకటించడం గమనార్హం. అయితే ముంబ‌యిలో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు పోలీసులు స‌మీక్షిస్తున్నారు. నిర‌వ‌ధిక స‌మ్మెకు క్యాబ్ డ్రైవ‌ర్లు మొగ్గుచూపుతుండ‌టంతో న‌గ‌రంలో పోలీసులు 149 సెక్ష‌న్ విధించారు. ఆ మేర‌కు ఈ సెక్ష‌న్ కింద మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన్ వాహ‌తుక్ సేన సంస్థ‌కు చెందిన సంజ‌య్ నాయ‌క్, అరిప్ షేక్, నితిన్ నంద‌గోక‌ర్ త‌దిత‌రుల‌కు నోటీసులు అందించారు. చ‌ట్టాన్ని అతిక్ర‌మించి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పడినా, ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీనియ‌ర్ పోలీసు అధికారి పండిత్ థోర‌ట్ చెప్పారు.
1entertainment
Feb 05,2016 బిర్లా చేతికి రిలయన్స్‌ సిమెంట్‌ న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా (ఆర్‌ ఇన్‌ఫ్రా)సంస్థ తమ సిమెంట్‌ వ్యాపారాన్ని బిర్లా కార్పొరేషన్‌కు విక్రయించనుంది. ఇందుకు సంబంధించి గురువారం ఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ ఎంపీ బిర్లా గ్రూపుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ సుమారు రూ.4800 కోట్లు. తాజా ఒప్పందం ప్రకారం ఆర్‌సీసీపీఎల్‌లో రిలయన్స్‌ 100 శాతం వాటాను బిర్లా కార్పొరేషన్‌ సొంత చేసుకోనుంది. రిలయన్స్‌ సిమెంట్‌ సంస్థకు మొత్తంగా 5.08 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ సంస్థకు మధ్య ప్రదేశ్‌లోని మహియార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కుందన్‌ గంజ్‌లలో ప్లాంటు ఉన్నాయి. దీనికి తోడు మహారాష్ట్రలోని భూతిబోరిలో 0.5 ఎంటీపీఏ సామర్థ్యం కలిగిన గ్రైండింగ్‌ యూనిట్‌ కూడా ఉంది. ఈ విక్రయం ద్వారా లభించే సొమ్మును ఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ స్టాండెలోన్‌ ప్రాతిపదికన తన రుణ భారాన్ని తగ్గించుకొనేందుకు వినియోగించనుంది. ఈ ఒప్పందానికి 'కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా' (సీసీఐ) అనుమతి లభించాల్సి ఉంది. ఈ వ్యవహారానికి ఎస్‌బీఐ క్యాపిటల్‌ ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తోంది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన పూర్తి రుణ విముక్తి పొందే దిశగా తమ సంస్థ వేస్తున్న మొదటి అడుగు ఇది అని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా వెల్లడించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 10, May 2019, 9:55 AM IST Highlights F2 సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ సక్సెస్ మూడ్ లో గ్యాప్ లేకుండా కథలు వినేస్తున్నాడు. ప్రస్తుతం మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న   ఆ సినిమాను డి సురేష్ బాబు నిర్మిస్తున్నారు.  F2 సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ సక్సెస్ మూడ్ లో గ్యాప్ లేకుండా కథలు వినేస్తున్నాడు. ప్రస్తుతం మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న   ఆ సినిమాను డి సురేష్ బాబు నిర్మిస్తున్నారు.  ఇక వెంకీ మామ అనంతరం దగ్గుబాటి హీరో ఎవరితో వర్క్ చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇటీవల విక్రమ్ వేధా రీమేక్ చేయబోతున్నట్లు టాక్ వచ్చినప్పటికీ అందులో నిజం లేదని సురేష్ ప్రొడక్షన్స్ నుంచి క్లారిటీ వచ్చింది. వెంకీ నెక్స్ట్ సినిమాపై  త్వరలోనే వివరణ ఇస్తామని కూడా చెప్పారు.  అయితే నెక్స్ట్ వెంకీతో వర్క్ చేయబోయే లిస్ట్ కాస్త పెద్దగానే ఉంది. పుట్టినరోజు సందర్భంగా గతంలోత్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంటుందని స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేశారు. ఇక నేను లోకల్ దర్శకుడు త్రివిక్రమ రావ్ నక్కినతో కూడా వెంకీ కథా చర్చలు జరిపారు. స్క్రిప్ట్ దాదాపు ఫైనల్ అయినట్లు టాక్.  అయితే ఇద్దరిలో ఫస్ట్ ఎవరి సినిమా పట్టాలెక్కనుందనే విషయం త్వరలో తెలియనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ అయితే బన్నీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది కానీ పూర్తికాదు. ఇక త్రినాథ రావ్ 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా అనంతరం ఎలాంటి ప్రాజెక్ట్ ని సెట్ చేసుకోలేదు. అతను వెంకీతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు.  ఆ మధ్య మరో హీరోతో కూడా సిట్టింగ్ వేసినట్లు టాక్ వచ్చినప్పటికీ అందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు. అయితే  వెంకీ మామ షూటింగ్ ఫినిష్ అయ్యే లోపు ఎవరు అందుబాటులో ఉంటే వారితోనే వెంకీ సినిమా చేస్తాడా? లేక మరో దర్శకుడిని సెలెక్ట్ చేసుకుంటాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.      Last Updated 10, May 2019, 9:55 AM IST
0business
Mar 17,2018 జియో 5జీకి సిద్ధమవుతోంది.. ముంబయి: దేశీయ టెలికాం రంగంలో సంచలనంగా నిలుస్తున్న రిలయన్స్‌ జియా తన కూతురిచ్చిన ఐడియాకు కార్యరూపమని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ వెల్లడించారు. గురువారం రిలయన్స్‌ సంస్థ 'డ్రైవర్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌' అవార్డు అందుకుంది. ఈ కార్యక్రమానికి ముఖేశ్‌ తన కుటుంబ సభ్యులతో సహా కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'జియో ఐడియా నా కూతురు ఇషాది. 2011లో దీని గురించి ఇషా నాకు వివరించింది. ఆ సమయంలో ఇషా సెలవుల నిమిత్తం అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. ఓ రోజు ఇంట్లో తన కోర్సుకు సంబంధించిన వర్క్‌ చేసుకుంటోంది. అప్పుడు 'డాడీ మన ఇంట్లో నెట్‌ అస్సలు బాలేదు' అంది. భవిష్యత్తులో ప్రపంచం డిజిటల్‌ టెక్నాలజీతోనే నడుస్తుందని ఇషా, ఆకాశ్‌ నాకు చెప్పారు. అలా వారి ఆలోచనల నుంచే ఈ జియో పుట్కుకొచ్చింది. జియెను 2016 సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టాను. ఇప్పుడు భారతదేశంలో జియో గేమ్‌ ఛేంజర్‌గా మారింది. దేశ వ్యాప్తంగా 2జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయడానికి భారతీయ టెలికాం రంగానికి 25 ఏళ్లు పట్టింది. కానీ 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి జియోకి కేవలం మూడేండ్లే పట్టింది. 5జీ కూడా సిద్ధమవుతోంది.' అని ముఖేశ్‌ వెల్లడించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Recommended byColombia డియర్ స్వాతి, ఆ మధ్యనేను రాసిన ప్రేమ లేఖ ఇంకా పచ్చిగానే నా మనసులో ఉంది. నీ ప్రతిభకు తగని పాత్రలో నువ్వు కనిపించి కష్టపెట్టిన నా మనసు గాయం మొన్నటివరకు తాజాగానే ఉండేది. కానీ..."లండన్ బాబులు" చూసాను. ముద్దుమాటల స్వాతి ఒక మెచ్యూర్ నటిగా ఎదగడం చూసాను. ఒక్క మాట కూడా అవసరం లేకుండా కళ్ళతో, పెదాలతో, నవ్వుతో, కనుబొమ్మల ముడితో, కనురెప్పల వాల్పుతో, విరిసీ విరియని నవ్వుతో, వంకించిన మెడతో, పదానికి పదానికి మధ్య పాజ్ తో నటించగల ప్రతిభని మళ్ళీ చూసాను. సూర్యకాంతంతో ప్రేమలో పడ్డాను. స్వాతి... నీతో మళ్ళీ ప్రేమలో పడ్డాను. మొదట జాలిపడి.. తరువాత అభిమానించి సహాయం చేసిన గాంధీ మాటలు రావని చెప్పి మోసం చేశాడని తెలిసిన క్షణంలో... మోసపోయాననే కోపం, అతని నిస్సహాయత మీద జాలి, మూగవాడు కాదనే ఆనందం ఇన్ని భావాల్ని ఒక్క క్షణంలో పలికించగల నటుల్ని వెళ్ల మీద లెక్క పెట్టగలం. ఆ వెళ్లలో మొదట పలికే పేరు ఇప్పుడు నీది. క్లైమాక్స్ లో గాంధీ పెళ్లి చేసుకుందామా అన్నప్పుడు... ప్రేమో కాదో తెలియని సందిగ్దత, అవధులు లేని అభిమానపు వెల్లువ, ఎక్కడో కాదనాలనే ఆత్మాభిమానం, ఎందుకు వద్దనాలి అనే తీవ్రమైన ప్రేమ. అనుమానం. ఆనందం. సహజమైన సిగ్గు. బిడియాన్ని పక్కకు నెట్టే ఆలోచన. నాకు కావలసింది నాకు తెలుసు అనే ధీమా. నిన్ను నేను నమ్ముతాను అనే భరోసా. ఇన్ని భావాల్ని ఒక్క విరిసివిరియని స్మైల్ లో చెప్పావు చూడు...హ్యాట్సాఫ్! అందుకే ఆగలేక. మనసు ఆపుకోలేక...రాసాను ఈ లేఖ. అందుకో ఈ ప్రేమ లేఖ. ఇట్లు
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV పద్మావతి సెట్స్ పై మళ్లీ దాడి ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. TNN | Updated: Mar 15, 2017, 03:20PM IST ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాణి పద్మిని జీవిత చరిత్రను ఆయన తెరకెక్కిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రం. రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కాగా కొన్ని వారాల క్రితం జైపూర్లోని జయఘడ్ కోటలో షూటింగ్ చేస్తుండగా కర్ణిసేన కార్యకర్తలు దాడి చేశారు. రాణిపద్మినిని అవమానించే విధంగా సినిమా తీస్తున్నారని ఆరోపించారు. భన్సాలీ జుట్టుపీకి, చేయి చేసుకున్నారు. అక్కడున్న సినిమా సెట్ అంతా నాశనం చేశారు. దీంతో భన్సాలీ షూటింగ్ ను కొన్ని రోజుల పాటూ వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ కొన్ని రోజుల నుంచి షూటింగ్ చేస్తున్నారు. మహరాష్ట్రలోని కొల్హాపూర్‌లో షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. దాంతో ఆసెట్ లో చాలా భాగం దగ్ధమైంది. ఆ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఎక్కడా షూటింగ్ చేసినా దాడులు జరుగుతుండడంతో ఆ చిత్ర యూనిట్ భయభ్రాంతులకు గురవుతోంది. ఈ సినిమాలో అందాల బొమ్మ రాణి పద్మినిగా దీపికా పదుకునే, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్ వీర్ సింగ్, రాజా రావల్ రతన్ సింగ్ గా షాహిద్ కపూర్ నటిస్తున్నారు. చరిత్రను మార్చి సినిమా తీస్తున్నారని రాజవంశస్థులు ఆరోపిస్తున్నారు.
0business
వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చు..! - యథాతథంగా కొనసాగించే అవకాశం - ఆర్థిక నిపుణుల అంచనా ొ రేపే ఆర్‌బీఐ 'ద్రవ్య' సమీక్ష న్యూఢిల్లీ : రిజయ్‌వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గురువారం నిర్వహించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రాయిటర్స్‌ 60 మంది ఆర్ధికవేత్తలతో నిర్వహించిన సర్వేలో మెజారిటీ విశ్లేషకులు ఇదే అభిప్రాయ పడ్డారు. క్రితం అక్టోబర్‌ నుంచి రెపోరేటు 6.25 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ఏప్రిల్‌ 6న జరగనుంది. కాగా ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్యోల్బణం, నగదు సరఫరా, పెద్ద నోట్ల రద్దును ఈ దఫా సమీక్షలో కీలకంగా తీసుకోనుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి మాసంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 3.65 శాతంగా చోటు చేసుకుంది. ఆర్‌బీఐ 4 శాతం లక్ష్యంగా పెట్టుకుంది. చివరగా క్రితం అక్టోబర్‌లో ఆర్‌బీఐ ఎవరూ ఊహించనంతగా కీలక వడ్డీ రేట్లకు కోత పెట్టింది. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా 2016 సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అక్టోబర్‌ నెలలో జరిపిన సమీక్షలో ఉర్జిత్‌ పటేల్‌ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఎంపీసీ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి సమావేశం కూడా ఇదే. ఇక అప్పటి నుంచి కీలక రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నారు. డిసెంబర్‌, ఫిబ్రవరి 8న చేపట్టిన సమీక్షలోనూ ఇదే వైఖరిని కొనసాగించారు. ద్రవ్యోల్బణం ధోరణి, ఆర్థిక వద్ధి, పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై మరింత స్పష్టత కోసం వేచిచూస్తున్నామని గత సమీక్షలో ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత డిసెంబర్‌, ఫిబ్రవరిలో జరిగిన సమీక్షల్లో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలు అంటే రెపోరేటు 6.25 శాతంగా ఉంది. బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు అంటే రివర్స్‌ రెపోరేటు 5.75 శాతంగా ఉంది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) 4 శాతంగా కొనసాగిస్తుంది. రానున్న సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేసే అవకాశం లేదని భావిస్తున్నామని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ ఉదరు కోటక్‌ ఇది వరకే వ్యాఖ్యానించారు. భవిష్యత్తు మాసాల్లో పరిస్థితులను బట్టి హెచ్చు, తగ్గులుంటాయని అంచనా వేశారు. 6న జరిగే పాలసీ సమీక్షలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని అని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ఎండి నరేశ్‌ టక్కర్‌ విశ్లేషించారు. ద్రవ్యోల్బణ భయాలు.. ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకుతుండటం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు ప్రధానంగా వడ్డీ రేట్ల తగ్గింపునకు అడ్డంకిగా మారనున్నాయి. ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంటేనే వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశం ఉండేదని 31 మందిలో 21 మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల, ఆర్‌బీఐ ఇప్పుడప్పుడే పాలసీ రేట్లను తగ్గించే ఆస్కారం లేదనేందుకు సంకేతాలు వస్తున్నాయి. అదే విధంగా దేశీ, విదేశీ అంశాల ఆధారంగా భవిష్యత్తులో రేట్లు పెంచినా పెంచొచ్చనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్రితం ఫిబ్రవరి సమీక్ష అనంతరం సరళ పాలసీ నుంచి తటస్థ విధానానికి మారుతున్నట్టు పేర్కొంది. దీంతో రేట్ల తగ్గింపు విధానానికి ఇక తెరపడినట్టేనని భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం సూచీ 6.55 శాతానికి ఎగబాకి 39 నెలల గరిష్టానికి చేరడం ఆర్‌బీఐని కలవరపర్చే విధంగా ఉంది. ఇదే మాసంలో ప్రధానంగా ఆహార, ఇంధన ధరల పెరుగుదలతో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.65 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం వడ్డీ రేట్ల తగ్గింపునకు ప్రధాన అడ్డంకిగా మారనుందని విశ్లేషకుల అంచనా. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రాహుల్ ఫిట్.. కోహ్లి ఫుల్ హ్యాపీ..! కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి స్విమ్మింగ్ ఫూల్ వద్ద ఎంజాయ్ చేస్తూ ఫొటోలకి పోజులిచ్చాడు. ఈ ఏడాది మార్చిలో ముగిసిన TNN | Updated: Jul 30, 2017, 05:28PM IST జ్వరం కారణంగా శ్రీలంకతో జరిగిన గాలె టెస్టుకి దూరమైన రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫిటెనెస్ సాధించాడు. తాజాగా అతను కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి స్విమ్మింగ్ ఫూల్ వద్ద ఎంజాయ్ చేస్తూ ఫొటోలకి పోజులిచ్చాడు. ఈ ఏడాది మార్చిలో ముగిసిన ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అనంతరం చేతి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న కేఎల్ రాహుల్ ఐపీఎల్‌, ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటలనకి దూరమయ్యాడు. శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌కి ఎంపికై.. వార్మప్ మ్యాచ్‌లో అర్ధశతకం బాదిన రాహుల్.. తీరా తొలి టెస్టుకి జ్వరంతో దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్‌కి తుది జట్టులో కోహ్లి చోటిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులకు ఔటై నిరాశపరిచిన అభినవ్.. రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో సత్తా చాటాడు. దీంతో గురువారం నుంచి ఆరంభంకానున్న రెండో టెస్టులో మళ్లీ ఛాన్సిస్తారా..? లేదా కేఎల్ రాహుల్‌ని బరిలోకి దించుతారో చూడాలి. కెప్టెన్ కోహ్లి ఎప్పటి నుంచో కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచుతూ వరుస అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో కొలంబో టెస్టులో అభినవ్ ముకుంద్ బెంచ్‌కే పరిమితమవుతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
2sports
staadium టెస్టు క్రికెట్‌కు 140 యేళ్లు  న్యూఢిల్లీ: ప్రపంచంలోని క్రికెట్‌ అభిమానులకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది.అంత ప్రత్యేకత ఏమిటని అంటారా? తొలి టెస్టు జరిగి బుధవారం నాటికి 140 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మొదటి టెస్టు 1877 మార్చి 15న ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో జరిగింది.ఈ మ్యాచ్‌ మార్చి 19న ముగిసింది.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 45 పరుగులు తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.అనంతరం 1977లో ఆస్ట్రేలియాలో వంద సంవత్సరాల పండుగ నిర్వహించారు.ఈ సందర్భంగా 1977 మార్చి 12న మెల్‌బోర్స్‌లోని ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ నిర్వహించారు. ఇందులోను ఆసీస్‌ 45 పరుగులు తేడాతో విజయం సాధించింది.2012 అక్టోబరులో ఐసిసి టెస్టు మ్యాచ్‌ల్లో కీలక మార్పులు చేపట్టింది.డే అండ్‌ నైట్‌ టెస్టులను నిర్వహించాలని ప్రతిపాదన తీసుకువచ్చింది.2015 నవంబర్‌ 27న ఆడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌ నిర్వహించారు.టెస్టు క్రికెట్‌లో మొత్తం 2,254 మ్యాచ్‌లు ప్రస్తుతం శ్రీలంక- బంగ్లాదేశ్‌తో జరు గుతున్న టెస్టు మ్యాచ్‌తో కలిపి జరిగాయి.ఇప్పటి వరకు ఇంగ్లండ్‌ అత్యధికంగా 983 టెస్టు మ్యాచ్‌లు ఆడగా,351 విజయాలు సాధించింది.ఆ తరువాత స్థానంలో ఆసీస్‌ 799,భారత్‌ 510 మ్యాచ్‌లు ఆడింది. భారత్‌ తొలి టెస్టును 1932 జూన్‌ 25న ఇంగ్లండ్‌తో ఆడింది.ఈ మ్యాచ్‌లో 158 పరుగులు తేడాతో పరాజయం చెందింది. ఇప్పటి వరకు 510 టెస్టులు ఆడిన భారత్‌ 138 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా,158 మ్యాచ్‌ల్లో పరాజం చెందగా 213 టెస్టులు డ్రాగా ముగి శాయి. టెస్టు క్రికెట్‌కు 140 సంవత్సరాలైన సం దర్భంగా గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొం దించింది.ఈ డూడుల్‌ లో బ్యాట్స్‌మెన్‌,బౌలర్లు, ఫీల్డర్లు కనిపిస్తారు.బ్యాట్స్‌మెన్‌ కొట్టిన బంతిని పట్టుకునేందుకు పీల్డర్లు ప్రయత్నిస్తున్నట్లు గూగుల్‌ ఈ ప్రత్యేక డూడుల్‌ను అందించింది
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘హలో గురు ప్రేమకోసమే’ పాటలు వచ్చేశాయ్ ‘హలో గురు ప్రేమకోసమే’ జూక్ బాక్స్.. మొత్తం ఐదుపాటలు.. రాక్ స్టార్ మళ్లీ అదరగొట్టాడుగా!! Samayam Telugu | Updated: Oct 8, 2018, 03:10PM IST ‘హలో గురు ప్రేమకోసమే’ పాటలు వచ్చేశాయ్ ‘హలో గురు ప్రేమకోసమే’ అంటూ కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా ‘సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్’ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘హలో గురు ప్రేమకోసమే’ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకువస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ కొన్నింటిని సోషల్ మీడియా ద్వారా విడదల చేయగా.. సోమవారం నాడు ఈ మూవీ అన్ని సాంగ్స్‌ జూక్ బాక్స్‌ ద్వారా విడుదల చేశారు.
0business
messi మెస్సీకి జైలు శిక్ష సబబే : స్పెయిన్‌ సుప్రీం కోర్టు ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్లేయర్‌ లియోనల్‌ మెస్సీకికు పన్ను ఎగవేత కేసులో జైలు శిక్ష…జరిమానా అర్జెంటీనా: పన్ను ఎగవేత కేసులో అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనల్‌ మెస్సీకి స్పెయిన్‌ సుప్రీం కోర్టు జైలు శిక్ష, జరిమానా విధింయడం సబబేనని స్పెయిన్‌ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తన ఇమేజ్‌తో పన్ను ఎగవేత మోసం కేసులో 21నెలల జైలు శిక్షతోపాటు 2.09మిలియన్‌ యూరోలను దాదాపు రూ.కోట్లను జరిమానా విధిస్తూ స్పెయిన్‌ సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. అతని తండ్రి జార్జ్‌ హోరాసియో మెస్సీకి జైలు శిక్షను మాత్రం 15నెలలకు తగ్గించింది. డానోన్‌, అడిడాస్‌, పెప్సీ-కోలా, ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబిల్‌, కువైట్‌ ఫుడ్‌ వంటి కంపెనీలతో తన ఇమేజ్‌తో ఒప్పందం కుదుర్చుకుని వచ్చిన ఆదాయంపై పన్ను చెల్లించకుండా ఎగవేస ినందుకుగాను కోర్టు శిక్షను ఖరారు చేసింది. బార్సిలోనా కోర్టు జూలై 2016లోనే మెస్సీకి అతని తండ్రి జార్జ్‌ హూరాసియో మెస్సీని దోషులుగా తేల్చి శిక్ష విధించింది. కాగా బార్సిలోనా కోర్టు తీర్పుపై మెస్సీ స్పెయిన్‌ సుప్రీంలో అప్పీలు చేయగా సుప్రీం సైతం బార్సిలోనా తీర్పును సమర్థిం చింది. పన్నులు ఎగవేత చేసేందుకు బెలీజీ, స్విర్జల్యాండ్‌, ఉరుగ్వే, బ్రిటన్‌ దేశాల్లో భోగస్‌ కంపెనీలు సృష్టించారు. విచారణ సందర్భంగా మెస్సీ తన వాదనలు వినిపిస్తూ ఆర్థిక వ్యవహా రాలు తన తండ్రికి వదిలేసినట్లు తెలిపాడు. ఆర్థిక విషయాల నిర్వహణ గురించి తనకేమి తెలియదన్నారు. తాను తన తండ్రిని పూర్తిగా విశ్వసించినట్లు పేర్కొన్నాడు. మెస్సీ వ్యాఖ్యలపై సుప్రీం స్పందిస్తూ నీ ఇమేజ్‌తో వచ్చిన సంపాదనలో ట్యాక్స్‌్‌ చెల్లించాల్సి ఉంటుందన్న విషయం తెలిసి ఉండాలని పేర్కొంది.అయితే కోర్టు విధించిన శిక్షను మెస్సీఅనుభవించే అవకాశాల్లేవు. ఎందుకంటే స్పెయిన్‌ చట్టాల ప్రకారం క్రిమినల్‌ రహిత కేసుల్లో తొలిసారి రెండేండ్ల కంటే తక్కువగా ఉండే శిక్షలను కొట్టేసే వెసులుబాటు ఉంది.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రహానెని మళ్లీ వెతుక్కుంటూ వచ్చిన కెప్టెన్సీ తాజా సీజన్ ఆరంభంలో రహానె కెప్టెన్సీలో 8 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ జట్టు ఏకంగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో.. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి స్మిత్‌కి పగ్గాలప్పగించగా.. అతను నాలుగు మ్యాచ్‌ల్లో ఏకంగా మూడింట్లో టీమ్‌ని గెలిపించాడు. Samayam Telugu | Updated: May 4, 2019, 02:08PM IST రహానెని మళ్లీ వెతుక్కుంటూ వచ్చిన కెప్టెన్సీ హైలైట్స్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ మళ్లీ మార్పు సీజన్ మధ్యలో రహానెని తప్పించి స్టీవ్‌స్మిత్ చేతికి పగ్గాలు తాజాగా ప్రపంచకప్ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన స్టీవ్‌స్మిత్ మళ్లీ రహానెకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన రాజస్థాన్ ఈరోజు ఢిల్లీతో మ్యాచ్‌.. గెలిస్తేనే ప్లేఆఫ్ రేసులో ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రెండోసారి కెప్టెన్‌ని మార్చింది. సీజన్ ఆరంభంలో టీమ్ వరుస ఓటములకి రహానెని బాధ్యుడ్ని చేస్తూ మధ్యలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన రాజస్థాన్.. స్టీవ్‌స్మిత్‌కి జట్టు పగ్గాలు అప్పగించింది. తాజాగా.. ప్రపంచకప్ నేపథ్యంలో స్టీవ్‌స్మిత్ (ఆస్ట్రేలియా) స్వదేశానికి వెళ్లిపోవడంతో మళ్లీ రహానెని కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా సీజన్‌లో ఇప్పటికే 13 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ జట్టు ఐదు విజయాలు సాధించి, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 11 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి. టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన జోస్ బట్లర్, జోప్రా ఆర్చర్, బెన్‌స్టోక్స్, స్టీవ్‌స్మిత్ ప్రస్తుతం జట్టుని వీడటంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి పోటీనివ్వడం రాజస్థాన్‌కి కత్తిమీద సామే..! తాజా సీజన్ ఆరంభంలో రహానె కెప్టెన్సీలో 8 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ జట్టు ఏకంగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో.. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి స్మిత్‌కి పగ్గాలప్పగించగా.. అతను నాలుగు మ్యాచ్‌ల్లో ఏకంగా మూడింట్లో టీమ్‌ని గెలిపించాడు. దీంతో మళ్లీ రహానెకి కెప్టెన్సీ ఇచ్చేందుకు రాజస్థాన్ ఫ్రాంఛైజీ మొగ్గుచూపదని అంతా భావించారు. కానీ.. ప్రత్యామ్నాయం లేకపోవడంతో.. తప్పలేదు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆసీస్ గడ్డపై ‘సిరీస్‌‌’ భారత్‌కి అందని ద్రాక్ష..! 1999-2000లో మూడు టెస్టుల సిరీస్‌ ఆడిన భారత్ జట్టు 0-3 తేడాతో క్లీన్‌స్వీప్‌నకి గురైంది. ఆ తర్వాత 2003-04లో నాలుగు టెస్టుల సిరీస్‌ని 1-1తో డ్రాగా ముగించింది. Samayam Telugu | Updated: Dec 5, 2018, 04:48PM IST ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘకాలంగా పర్యటిస్తున్న భారత్ జట్టు‌కి ‘టెస్టు సిరీస్’ ఓ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఆ గడ్డపై 11 సార్లు పర్యటించిన టీమిండియా.. కనీసం ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2014-15లో విరాట్ కోహ్లి అసాధారణరీతిలో చెలరేగి 4 శతకాలు బాదడంతో పాటు 692 పరుగులు చేసినా.. భారత్ జట్టుకి నాలుగు టెస్టుల సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమి తప్పలేదు. దీంతో.. కనీసం తాజా పర్యటనలోనైనా ఆ నిరీక్షణకి తెరదించాలని భారత్ ఆశిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం ఉదయం 5.30 గంటల నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు దశాబ్దాలుగా భారత్ పర్యటన చరిత్ర, ఫలితాలను ఓసారి పరిశీలిస్తే..! 1999-2000లో మూడు టెస్టుల సిరీస్‌ ఆడిన భారత్ జట్టు 0-3 తేడాతో క్లీన్‌స్వీప్‌నకి గురైంది. ఆ తర్వాత 2003-04లో నాలుగు టెస్టుల సిరీస్‌ని 1-1తో డ్రాగా ముగించింది. అనంతరం 2007-08లో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడి.. 1-2తో ఓడింది. ఇక 20011-12లో అయితే మరీ ఘోరంగా పరాజయాల్ని చవిచూసింది. నాలుగు టెస్టుల ఆ సిరీస్‌లో 0-4తో వైట్‌వాష్‌కి గురైంది. ఆఖరిగా 2014-15లో రెండు మ్యాచ్‌ల్ని డ్రాగా ముగించినా.. 0-2తో ఓటమి మాత్రం తప్పలేదు.
2sports
internet vaartha 117 Views హైదరాబాద్‌ : విద్యార్థినీ విద్యార్ధుల్లో సైతం ఇంటర్నెట్‌పై అవగాహన పెంచేందుకుగాను టెలినార్‌ కొత్తగా సేఫ్‌ ఎథాస్‌ను ప్రారంబించింది.కస్టమర్లే తమకు తొలిప్రాధాన్యత అని చెపుతున్న టెలినార్‌ నగరంలోని లిటిల్‌స్కాలర్స్‌ స్కూల్‌, జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌ విద్యార్థులకు చేపట్టింది. ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌లో భద్రతా చిట్కాలను అనుసరించి కొత్త ఆన్‌లైన్‌ మోసాలను గుర్తించి సైబర్‌ ప్రమాదాల బారినపడకుండా ఉండేలా వారికి శిక్షణ ఇచ్చినట్లు ఎపి, తెలంగాణ బిజినెస్‌ హెడ్‌ శ్రీనాద్‌ కొటియన్‌ వెల్లడించారు. డిజిటల్‌ వాతావరణం పెంచేందుకుగాను ఆరుసర్కిళ్లలోని 400 గ్రాహక్‌ శిక్షా కేంద్రాల్లో సురక్షిత ఇంటర్నెట్‌ శిబిరాలున ఇర్వహిస్తోంది. సేఫ్‌ఏథాన్‌లో భాగంగా ఎక్కువమంది వినియోగ దారులు, స్కూలు విద్యార్థులు, తల్లితండ్రులు, టీచర్లకు మరింత చేరువయ్యేందుకు టెలినార్‌ ఆరు సర్కిళ్లు ఢిల్లీల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సైటర్‌ ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు కొత్త ఆన్‌లైన్‌ ముప్పులను గుర్తించడంపైన నిర్వహించే వర్క్‌షాపుల్లో పదివేల మందికిపైగా పాఠశాల విద్యార్థులకు చేరువకావాలని టెలినార్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV బంగ్లాపై ప్రతీకారం తీర్చుకున్న పాకిస్థాన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌పై ప్రశంసలు గుప్పించినందుకుగాను స్వదేశం నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టేన్ షాహీద్ అఫ్రీది TNN | Updated: Mar 16, 2016, 08:27PM IST ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌పై ప్రశంసలు గుప్పించినందుకుగాను స్వదేశం నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టేన్ షాహీద్ అఫ్రీది బుధవారం ఆ దేశానికి ఓ మరిచిపోలేని విజయాన్ని అందించాడు. కొద్ది రోజుల క్రితం ఏ బంగ్లాదేశ్ పైనైతే ఓడిపోయి ఆసియా టీ20 కప్ ట్రోఫీ నుంచి ఔట్ అయ్యారో.. ఇప్పుడు అదే దేశంపై కసితీరా బ్యాటింగ్ చేసి 201 పరుగుల భారీ స్కోర్ సాధించడమేకాకుండా 55 పరుగుల తేడాతో గెలుపొంది ప్రతీకారం తీర్చుకుంది పాక్. 'టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన గ్రూప్ 2 సూపర్ 10 ఎన్‌కౌంటర్ మ్యాచ్‌లో పాక్ సేనని అన్నివిధాల ముందుండి నడిపించాడు షాహీద్. కేవలం 19 బంతుల్లో 49 పరుగులు చేయడమేకాకుండా బంగ్లాదేశ్‌పై తనదైన స్టైల్లో సూపర్‌ఫాస్ట్ లెగ్‌బ్రేక్స్ బౌలింగ్‌తో కేవలం 27 పరుగులు మాత్రమే సమర్పించుకుని రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. మొట్టమొదటే 9 బంతుల్లో 25 పరుగులు రాబట్టి బంగ్లా బౌలర్లకి చెమటలు పట్టించిన షాహీద్.. తన మొత్తం ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 4 ఫోర్లతో స్కోర్‌ని మరింత పరుగులుపెట్టించాడు. అంతకన్నా ముందే బ్యాటింగ్‌కి దిగిన అహ్మద్ షాహెజాద్ 39 బంతుల్లో 52 పరుగులు(8x4)రాబట్టగా... మొహమ్మద్ హఫీజ్ 42 బంతుల్లో 64 పరుగులు( 7x4, 2x6)సాధించాడు. ఇలా టీమ్ సమిష్టి కృషితో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల నష్టానికి 201 భారీ స్కోర్ సాధించింది పాక్. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. పాక్‌పై ఏ దశలోనూ పై చేయి సాధించలేకపోయింది. ఫలితంగా 20 ఓవర్లు ఆడి చివరివరకు పోరాడిన బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. విచిత్రం ఏంటంటే... అంతర్జాతీయ టీ 20 మ్యాచుల్లో పాకిస్థాన్ అత్యధిక స్కోర్ 205/5(2008, ఏప్రిల్లో) సాధించింది కూడా బంగ్లాదేశ్‌పైనే.
2sports
మీ పతివ్రత మాటలు ఆపండి..మీరు గ‌తంలో ఏం చేశారో మాకు తెలుసు : శ్రీరెడ్డి Highlights మీ పతివ్రత మాటలు ఆపండి..మీరు గ‌తంలో ఏం చేశారో మాకు తెలుసు : శ్రీరెడ్డి తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్యగా మారింది. అవ‌కాశాల పేరుతో నూతన న‌టీమ‌ణుల‌ను శారీర‌కంగా వాడుకుంటున్నారంటూ ఇటీవ‌ల కాలంలో శ్రీ‌రెడ్డి లాంటి వారు మీడియా సాక్షిగా ఆధారాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, క్యాస్టింగ్ కౌచ్ గురించి తాజాగా న‌టి ప‌విత్రా లోకేష్ స్పందించారు.   ఆమె పరోక్షంగా శ్రీ‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ చాలా సున్నిత‌మైన విషయం.  ఆడ వాళ్లను, మ‌గ‌వాళ్ల‌ను, మ‌గ‌వాళ్ల‌ను ఆడ‌వాళ్ల‌ు ఉప‌యోగించుకోవ‌డం అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే, ఆ ప‌ని చేసే స‌మ‌యంలో ఎందుకు చేస్తున్నామ‌ని ఆలోచించాల‌న్నారు. సినిమా రంగం చాలా చిన్న విషయం. బ‌త‌క‌డానికి బ‌య‌ట చాలా ప‌నులే ఉన్నాయి. అయినా, అందుకు ఒప్పుకునే ముందు మీ బుద్ధి ఏ మైంది..? మీరు ఒప్పుకోక‌పోతే.. వారెందుకు అలా చేస్తారు..? వారు అంత ధైర్యం చేశారంటే.. వారు ఎంత చ‌నువు ఇచ్చి ఉంటారో అర్థ‌మ‌వుతుంది అంటూ శ్రీ‌రెడ్డిపై ప‌విత్రా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పవిత్రా లోకేష్ మాటలకు శ్రీరెడ్డి స్పందిస్తూ..ఇలా ప‌తివ్రతలా మాట్లాడ‌టం ఆపండి. మీరు గ‌తంలో ఏం చేశారో మీకు తెలుసు. ఈ స‌మాజానికి భ‌య‌ప‌డే ఇలా మాట్లాడుతున్నారు అని శ్రీ‌రెడ్డి త‌న దైన శైలిలో ప‌విత్రా లోకేష్‌పై ఫైర్ అయింది. Last Updated 27, Jun 2018, 11:09 AM IST
0business
3rd test 1st day తొలిరోజు ఇంగ్లాండ్‌ 7వికెట్లకు 268 మొహాలీ: భారత్‌ ఇంగ్లాండ జట్ల మధ్య మూడో టెస్తు తొలిరోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్‌ జట్టు 7 వికెట్ల నష్టానికి 268 పరుగులుచేసింది.. నోక్స్‌ 21 పరుగులతోనూ, రిషీద్‌ 2 పరుగులతోనూ క్రీజ్‌లో ఉన్నారు.. భారత బౌలర్లలో జడేజా , జయంత్‌ యాదవ్‌ రెండేసి వికెట్లు చొపుపన తీసుకోగా, అశ్విన్‌, ఉమేష్‌యాదవ్‌, మహ్మద్‌ షీల ఒక్కో వికెట్‌ పడగొట్టారు.. కాగా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ స్టో ఒక్కటే నిలకడగా, రాణించి 89 పరుగులు చేశాడు.
2sports
బన్నీ-సుక్కు సినిమా.. నమ్రతాను కలిసిన అల్లు అరవింద్! Samayam Telugu| Mar 6, 2019, 01.43 PM IST టాలీవుడ్‌లో గడిచిన రెండు రోజులుగా దర్శకుడు సుకుమార్ వార్తల్లో నిలుస్తున్నారు. అల్లు అర్జున్‌తో తన తరవాత సినిమాను సుకుమార్ ప్రకటించడం.. ఆ వెంటనే సుక్కుతో తన చిత్రాన్ని రద్దుచేసుకున్నానని మహేష్‌బాబు స్పష్టం చేయడంతో వాతావరణం వేడెక్కింది. కొన్ని సృజనాత్మక విభేదాల కారణంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని మహేష్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చినప్పటికీ లోపల ఏదో జరిగిందనే అనుమానం అటు సూపర్ స్టార్, ఇటు స్టైలిష్ స్టార్ అభిమానుల్లో కలిగింది. ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఇప్పుడు మరో విషయం బయటికి వచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ప్రకటించడానికి ఒక్కరోజు ముందు అల్లు అరవింద్, నమ్రతా శిరోద్కర్ సమావేశమయ్యారట. మహేష్‌బాబు‌కు సుకుమార్ గతంలో చెప్పిన స్క్రిప్ట్ తన కుమారుడు బన్నీకి నచ్చిందని, ఈ ప్రాజెక్టును చేయాలనుకుంటున్నాడని నమ్రతాతో అరవింద్ చెప్పినట్లు సమాచారం. అయితే, నమ్రతా మాత్రం తన భర్త.. అనిల్ రావిపూడి, సుకుమార్‌ ప్రాజెక్టులతో ఏకకాలంలో పనిచేస్తున్నారని చెప్పారట. వీరు సమావేశమైన తరవాత రోజే అంటే మార్చి 4న బన్నీ-సుక్కు సినిమా ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే మహేష్‌బాబు కూడా ట్వీట్ చేశారు. అంటే, మహేష్‌బాబుకు చెప్పిన కథనే సుకుమార్ అల్లు అర్జున్‌కు చెప్పారా?.. తనకు చెప్పిన కథను బన్నీతో ఓకే చేసినట్టు మహేష్‌కు సుక్కు చెప్పలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుకుమార్ ప్రాజెక్టును వదులుకోవడంపై మహేష్‌బాబు పాజిటివ్‌గానే స్పందించినా అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయని స్పష్టమవుతోంది. బహుశా సుకుమార్ ప్రాజెక్టులో మార్పులను మహేష్‌బాబు సూచించి ఉంటారని.. అది నచ్చక సుకుమార్ ఆ కథను బన్నీకి చెప్పి ఉండొచ్చని ఇండస్ట్రీ టాక్.
0business
Also Read: ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో రూ.20 లక్షల ప్రయోజనం.. పూర్తి వివరాలు! దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.73.27 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.66.41 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర స్థిరంగా రూ.78.88 వద్దనే ఉంది. డీజిల్ ధర కూడా ఎలాంటి మార్పు లేకుండా రూ.69.61 నిలకడగా కొనసాగుతోంది. Also Read: ఎస్‌బీఐ ఖాతాదారులకు నవంబర్ 1 షాక్.. కొత్త నిర్ణయం అమలులోకి! అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.62 శాతం తగ్గుదలతో 59.05 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.90 శాతం క్షీణతతో 52.88కు తగ్గింది.
1entertainment
petrol diesel rate in hyderabad today 31st october 2019 and across metro cities Today Petrol Price: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా! పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉంటూ రావడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు పెరిగాయి. Samayam Telugu | Updated: Oct 31, 2019, 08:26AM IST Today Petrol Price: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా! హైలైట్స్ దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పైకి దేశీ ఇంధన ధరలు నిలకడగా కొనసాగాయి. గురువారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.77.54 వద్ద, డీజిల్ ధర రూ.71.81 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర స్థిరంగా రూ.77.16 వద్దనే ఉంది. డీజిల్‌ ధర కూడా రూ.71.11 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో పెట్రోల్ ధర రూ.76.80 వద్ద, డీజిల్ ధర రూ.70.77 వద్ద నిలకడగా ఉంది. Also Read: భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండిదీ ఇదే దారి! దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.72.92 వద్ద ఉంది. డీజిల్ ధర కూడా రూ.65.85 వద్ద నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.78.54 స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.69.01 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: ఓరినాయనో.. బంగారం, వెండిని ఎగబడి కొనేస్తున్న జనాలు..! అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.35 శాతం పెరుగుదలతో 60.45 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.24 శాతం పెరుగుదలతో 55.19కు ఎగసింది.
1entertainment
విండీస్‌ మహిళా జట్టు కెప్టెన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నీ కోల్‌కతా: మహిళల టి20 ప్రపంచ్‌ కప్‌ ఫైనల్‌లో అర్భుతమైన ఆటతీరు ప్రదర్శించి వెస్టిండీస్‌ను విశ్వవిజేతగా నిలిపిన వెస్టిండీస్‌ జట్టు కెప్టెన్‌ స్టెఫానిక్‌ టేలర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నీ దక్కింది.. టోర్నీలో 244 పరుగలు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో 66 పరుగులతో విజయతీరాలకు చేర్చిన మిండీస్‌ ఓపెనర్‌ హైలీ మాథ్యూస్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎపింకైంది.
2sports
- హెచ్చరించిన పరోక్ష పన్ను శాఖ అధికారులు - 30న నిరసనకు సన్నద్ధం న్యూఢిల్లీ : జీఎస్‌టీ కౌనిల్స్‌ ఇటీవల తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పలు పరోక్ష పన్ను అధికారుల అసోసియేషన్లు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించాయి. దీంట్లో దాదాపు 70 వేల మంది అధికారులు పాల్గొనున్నట్టు వెల్లడించాయి. శుక్రవారం జరగబోయే అంతర్జాతీయ కస్టమ్స్‌ దినోత్సవాన్ని బహిష్కరిస్త్నుట్టు ప్రకటించాయి. జనవరి 30న జరిగే అమరుల దినోత్సవం రోజు కూడా నల్ల బ్యాడ్జీలతో తమ నిరసన తెలుపనున్నట్టు వివరించాయి. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో జనవరి 16న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో అధిక శాతం నిరాశపరిచే నిర్ణయాలు తీసుకుని మోసం చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 12 నాటికళ్ల పరిధిలోని జలాలు, రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్‌ కిందనున్న పన్ను చెల్లింపుదారుల హక్కులూ 90శాతం రాష్ట్రాలకే ఇస్తున్నట్టు జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, దీనివల్ల తమ కెరీర్‌తో పాటు దేశ ప్రయోజనాలు ప్రమాదకరంలో పడతాయని ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ సెంట్రల్‌ బోర్డులోని ఏ,బీ,సీ గ్రూప్‌ ఉద్యోగుల సమాఖ్య చెప్పింది. ఆదాయం తగ్గడమేకాకుండా, భారత ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఉద్యోగుల సమాఖ్య పేర్కొంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Dec 17,2015 ముచ్చటగా మూడో రోజూ లాభాలే..       ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభించిన మద్దతుతో దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజైన బుధవారం కూడా లాభాల్లోనే నిలిచాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను పెంపును వెల్లడించనున్న నేపథ్యంలోనూ మార్కెట్లు తమ జోరును కొనసాగిస్తుండడం విశేషం. అంతకు ముందు రెండు సెషన్లలో 276.09 పాయింట్ల మేర పెరిగిన బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ బుధవారం దాదాపు 173.93 పాయింట్ల (0.69 శాతం) వృద్ధితో 25,794 పాయింట్లను చేరింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 0.65 శాతం వృద్ధితో ముందుకు సాగి 7751 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌, ఆటో రంగ సూచీలు తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే నిలిచాయి. సెన్సెక్స్‌లో ఓఎన్‌జీసీ (+3.99 శాతం), భారతీ ఎయిర్‌టెల్‌ (+3.83 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌ (+2.29శాతం), లూపిన్‌ (1.95 శాతం), ఇన్ఫోసిస్‌ (+1.72 శాతం మేర) లాభపడ్డాయి. మరోవైపు మహీంద్రా అండ్‌ మహీంద్రా (-5.44%), ఐటీసీ (-0.96%), విప్రో (-0.64%), హెచ్‌యూఎల్‌ (-0.3 శాతం) నష్టపోయాయి. ఫెడ్‌ రేటు పెంపు భయాలకు మార్కెట్లు ఇప్పటికే కనిష్ఠస్థాయులకు చేరుకున్నాయనీ.. ఇప్పుడు అవి పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుంటున్న కారణంగానే మార్కెట్లు పరుగులు పెడుతున్నట్లుగా మార్కెట్‌ వర్గాలు ఈ ర్యాలీని విశ్లేషిస్తున్నాయి. ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు ప్రభావం కొంత తప్పక పోవచ్చని అంటున్న వారు రానున్న సెషన్లలో కొంత మేర అమ్మకాల ఒత్తిడి కనిపించక మానదని చెబుతున్నారు. అమెరికా మార్కెట్లులో వృద్ధితో ఆసియా మార్కెట్లు పెరిగినకారణంగా దేశీయ మార్కెట్లు కూడా బుధవారం లాభాల బాటలో పయనించినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. మధ్యాహ్నం మొదలైన ఐరోపా మార్కెట్లు కూడా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో లాభాల బాటలోనే పయనించాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
zero balance savings account: sbi vs hdfc bank SBI, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు.. పూర్తి వివరాలు! కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ప్రారంభించొచ్చు. స్టేట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. Samayam Telugu | Updated: Nov 4, 2019, 09:49AM IST SBI, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు.. పూర్తి వివరాలు! హైలైట్స్ స్టేట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవొచ్చు ఈ అకౌంట్లపై పలు పరిమితులు ఉంటాయి బ్యాంక్ ప్రాతిపదికన అకౌంట్ ప్రయోజనాల్లో మార్పు ఉచిత ఏటీఎం కార్డు, పాస్‌బుక్ వంటి సేవలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని టాప్ 2 బ్యాంకులు ఇవి. దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా ఎస్‌బీఐ కొనసాగుతూ ఉంటే.. ప్రైవేట్ రంగంలో టాప్ బ్యాంక్‌గా హెచ్‌డీఎఫ్‌సీ కొనసాగుతోంది. చాలా మంది ఈ బ్యాంకుల్లో అకౌంట్ తెరవాలని భావిస్తూ ఉంటారు. వీరికి శుభవార్త. ఈ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి బ్యాలెన్స్ లేకుండానే అకౌంట్ తెరవొచ్చు. అయితే జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై కొన్ని పరిమితులు ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకుల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ల బెనిఫిట్స్, ఫీచర్లు వేర్వురుగా ఉంటాయి. అవేంటో చూద్దాం.. SBI zero balance savings account భారతీయ పౌరులందరూ ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ తెరవొచ్చు. ఒకరు లేదా ఇద్దరు కలిసి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. రెగ్యులర్ ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వడ్డీ రేటే ఈ ఖాతాలకు కూడా వర్తిస్తుంది. జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో డిపాజిట్లకు ఎలాంటి నియంత్రణ లేదు. Also Read: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ‘అకౌంట్ స్టేటస్‌’ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవద్దు.. లేదంటే.. కస్టమర్లు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేసుకున్నా కూడా చార్జీలు పడవు. ఖాతాదారులకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు ఇస్తారు. ఎలాంటి మెయింటెనెన్స్ చార్జీలు ఉండవు. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలు ఉచితం. నెలకు ఏటీఎం నుంచి 4 సార్లు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. HDFC Bank zero balance savings account హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో గతంలో ఎన్నడూ ఎలాంటి అనుబంధం లేని వారు జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్‌లో నెలకు రూ.50,000 మించి డబ్బులు ఉండకూడదు. అలాగే నెలకు రూ.10,000 వరకు మాత్రమే డబ్బులను విత్‌డ్రా లేదా ట్రాన్స్‌ఫర్ చేసుకోగలం. ఒక ఆర్థిక సంవత్సరంలో అకౌంట్ క్రెడిట్స్ విలువ రూ.లక్ష దాటకూడదు. Also Read: ఎస్‌బీఐ బంపరాఫర్.. 35 శాతం తగ్గింపు + 10 శాతం క్యాష్‌బ్యాక్.. 6 రోజులే గడువు! బ్యాంక్‌లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ కలిగి వారికి పాస్‌బుక్ ఉచితంగానే లభిస్తుంది. క్యాష్ డిపాజిట్, చెక్ బుక్ డిపాజిట్ సేవలు కూడా ఉచితమే. రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు అందజేస్తారు. నెలకు 4 సార్లు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
1entertainment
t subbarami reddy confirms chiranjeevi and pawan kalyan`s multistarrer చిరు-పవన్ మల్టీస్టారర్‌ పక్కా- టీఎస్ఆర్ కళాబంధు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి సుబ్బరామి రెడ్డి పార్టీ మారుతున్నారా అని వస్తున్న ఆరోపణలపై.. TNN | Updated: Sep 9, 2017, 05:42PM IST 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఎన్నో పదవులు పొందాను. కీలకమైన స్థానాలు అధిరోహించాను. ఇప్పుడు పార్టీ మారితే ప్రజలు హర్షించరు అని అన్నారు కళాబంధు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీ సుబ్బరామి రెడ్డి. తాను పార్టీ మారే యోచనలో వున్నట్టు వస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేస్తూ టీఎస్ఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన టీఎస్ఆర్.. కాంగ్రెస్ పార్టీతో తనకి వున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల కాంబినేషన్‌లో తాను నిర్మించనున్న మల్టీస్టారర్ గురించి ప్రస్తావించిన ఆయన.. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో వుందని స్పష్టంచేశారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆ సినిమాపైనే పనిచేస్తున్నారు అని చెప్పారు. ఈ మల్టీస్టారర్ సినిమాను డైరెక్ట్ చేయనున్న త్రివిక్రమ్ గొప్ప దర్శకుడని ప్రశంసించిన టీఎస్ఆర్.. ప్రస్తుతం పవన్‌తోనే త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారని అన్నారు. విశాఖపట్నం గురించి మాట్లాడుతూ.. ఇక్కడి హిందుస్థాన్ షిప్‌యార్డ్ ప్రైవేటు పరం కాకుండా పోరాటం చేస్తానని టి సుబ్బరామి రెడ్డి తేల్చిచెప్పారు.
0business
SENSEX అంతర్జాతీయ మార్కెట్లు, నైరుతి పవనాలే దిక్సూచి ముంబయి, ఆగస్టు 21: అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, భౌగోళిక స్థితిగతులు, నైరుతి కదలిక లు వచ్చేవారం మార్కెట్లకు దిక్సూచి అవుతాయని అంచనా. కంపెనీల త్రైమాసిక ఫలితాల సీజన్‌ ముగింపుస్థితికి చేరిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా విదేశీ అంశాలకే ప్రాధాన్యతనిస్తారు. గత వారం మొత్తం ఉత్తరకొరియా, అమెరికామధ్య తలెత్తిన యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. వారం చివరిలో యుద్ధమేఘాలు తొలగినప్పటికీ సిఇఒల రాజీనామాలతో అమెరికా ప్రెసిడెంట్‌ట్రంప్‌ రెండు వ్యూహాత్మక బిజినెస్‌ సలహా మండళ్లను రద్దుచేయడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. వీటికితోడు ఆశించిన స్థాయిలో ద్రవ్యోల్బణం బలపడక పోవడం వల్ల ఫెడ్‌ రిజర్వు కమిటీ వడ్డీరేట్ల పెంపునకు వెనుకంజ వేస్తోం ది. దీనితో అమెరికా యూరప్‌, ఆసియా మార్కెట్లు బలహీనం అయ్యాయి. గణేశ్‌చతుర్ధి సందర్భంగా వచ్చే శుక్రవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు ఉంటుంది. వచ్చేవారం ట్రేడింగ్‌ నాలుగురోజులకే పరిమితం కానుంది. వచ్చేవారం రేటింగ్స్‌సంస్త కేర్‌, క్యాస్ట్రాల్‌ ఇండియా, పిఅండ్‌జి, జిల్లెట్‌ ఇండియా త్రైమాసిక ఫలితాలు వెల్లడిస్తాయి. ఈనెల 16కల్లా దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాలిక సాధారణ సగటుకంటే నాలుగుశాతం తక్కువ నమోదయినట్లు వాతావరణశాఖ తాజాగా వెల్లడించింది. దీనితో ఇకపై రుతు పవనాల విస్తరణ సెంటిమెంట్‌కు కీలకంగా నిలుస్తోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు, డాలర్‌ రూపాయి మారకం విలువలు,ముడిచమురుధరలు వంటి అంశాలకుసైతం ప్రాధాన్యత లేకపో లేదు. ఇన్ఫోసిస్‌ సిఇఒ విశాల్‌సిక్కా హటాత్తుగా తన పదవికి రాజీనామా చేయడంతో శుక్రవారం మార్కె ట్లు పతనంఅయ్యాయి. ఇన్ఫోసిస్‌ బోర్డుశనివారం నాటి కీలక సమావేశంలో బైబాక్‌నిర్ణయాలను ప్రకటిం చనున్నది. ఈప్రభావంఅటు మార్కెట్లపైనా, ఇన్ఫోసిస్‌కౌంటర్‌పైనా ప్రతిఫలిస్తుందని నిపుణుల అంచనా.
1entertainment
Visit Site Recommended byColombia షో స్టార్టింగ్‌లో పౌర్ణ‌మి సినిమాలోని 'మువ్వ‌లా న‌వ్వ‌కిలా ముద్ద‌మందార‌మా..' సాంగ్‌కి యాంక‌ర్ అన‌సూయ.. స‌రికొత్త హొయ‌లొలికించింది. చీర‌లో సింగారాలుపోతూ వలపుల వయ్యారాలతో మ‌తులు పోగొట్టే ప్ర‌య‌త్నం చేసింది. య‌దావిధిగా రోజా, నాగ‌బాబులు జ‌డ్జ‌స్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. రాకెట్ రాఘ‌వ స్కిట్‌తో కామెడీ స్టార్ట్ అయ్యింది. ఎప్ప‌టిలానే ఆది.. సెన్సార్ జోకుల‌కు మ‌రి కాస్త మ‌సాలా జోడించగా... చ‌లాకీ చంటీ.. అప్పులిచ్చే వ‌డ్డీవ్యాపారిలా మారి న‌వ్వులు పుట్టించాడు. ఇక‌ అన్ని స్కిట్‌ల‌ని దాటుకుని అదిరే అభి.. టీం 'ప‌ర్ఫామ‌ర్ ఆఫ్ ది డే'గా నిల‌వ‌డ‌మే కాకుండా హ్యాట్రిక్ కొట్ట‌డం విశేషం. ఆ వివ‌రాలేంటో చూద్దాం! రాకెట్ రాఘ‌వ ఓ పెళ్లి సంబంధానికి వెళ్తాడు. అయితే పెళ్లి కూతురు తండ్రి.. రాఘ‌వ క్యారెక్ట‌ర్ ఎలాంటిదో తెలుసుకోవ‌డానికి ఓ డిటెక్టివ్‌ని నియ‌మిస్తాడు. ఆ డిటెక్టివ్ శాంతి కుమార్‌. రాఘ‌వ ఎక్క‌డుంటే అక్క‌డికి వెళ్తూ మాట్లాడ‌కుండా కేవ‌లం న‌వ్వుతాడు శాంతి కుమార్‌. దాంతో రాఘ‌వకి పిచ్చేక్కుతుంది. ''న‌న్ను చూసి ఎందుకు న‌వ్వుతున్నావ్‌? నేను మీకు ముందే తెలుసా? మ‌నం ఎప్పుడైనా అంత‌కు ముందు క‌లిసామా?'' అంటూ అడుగుతాడు కానీ శాంతి కుమార్ న‌వ్వుతాడు త‌ప్ప స‌మాధానం చెప్ప‌డు. చివ‌రికి పెళ్లికూతురు తండ్రికి పెళ్లికొడుకు(రాఘ‌వ‌) చాలా మంచివాడ‌ని.. ఎలాంటి చెడు అల‌వాట్లు లేవ‌ని ఫోన్ చేసి చెబుతాడు డిటెక్టివ్ శాంతి కుమార్‌. దాంతో కూతుర్ని తీసుకుని రాఘ‌వ ఇంటికి వెళ్తాడు పెళ్లికూతురు తండ్రి. అయితే అప్ప‌టికే రాఘ‌వ‌కు పిచ్చెక్కుతుంది. ప‌క్క‌వాళ్లు ఏం మాట్లాడినా అచ్చు శాంతి కుమార్‌లానే న‌వ్వుతూ ఉంటాడు మాట్లాడ‌కుండా. ఆ సీన్ బాగా న‌వ్వు తెప్పిస్తుంది. ఆది స్కిట్ విష‌యానికి వ‌స్తే.. మొద‌టంతా భార్య‌ని తిట్టిన ఆది.. ఉన్న‌ట్టుండి పొగుడుతాడు. ''ఏంటో 9.30 అయితే చాలు తెగ పొగిడేస్తారు ఎందుకో..'' అంటుంది భార్య‌. ''మొగుడు-పెళ్లాల జీవితం కూడా ఈ ఎపిసోడ్‌లాంటిదేనే.. 9.30 నుంచి పోరాడితే ప‌ద‌కొండింటికి చెక్కులిస్తారు. ఇది కూడా అంతే.. మిమ్మ‌ల్ని 9.30 నుంచి పొగిడితే.. ప‌ద‌కొండింటికి మాకు కావాల్సిందిస్తారు'' అంటూ త‌న‌దైన శైలిని ప్ర‌యోగించ‌డంతో.. 'షో'లో.. సెన్సార్ న‌వ్వులు పూసాయి. ఇక అస‌లు క‌థ‌లోకి వెళ్తే.. ఆది ఓ డిటెక్టివ్‌. క‌రాటీ క‌ళ్యాణి.. రైజింగ్ రాజు భార్య‌. వీళ్లిద్ద‌రూ ఆది ఇంటి ప‌క్క‌నే ఉంటారు. రాజు కూడా డిటెక్టివ్వే. ఇద్ద‌రూ క‌లిసి ఓ హ‌త్య కేసుని ప‌రిశీలించ‌డానికి వెళ్తారు. అయితే అక్క‌డ హ‌త్య చేసిన క‌త్తిని ఇద్ద‌రూ ప‌ట్టుకుని.. 'హ‌త్య ఎలా జ‌రిగింద‌'ని ఎంక్వేరీ చేసి.. చివ‌రికి ఆ ఇంటి య‌జ‌మాని కూతురే ఆ హ‌త్య చేసింద‌ని నిర్ధారిస్తారు. చివ‌రికి ఆ క‌త్తి మీద వేలు ముద్ర‌లు వీళ్ల‌వే కావ‌డంతో పోలీసులు వ‌చ్చి వీళ్ల‌ని అరెస్ట్ చేస్తారు. మ‌ధ్య మ‌ధ్య‌లో అల్టిమేట్ పంచ్‌ల‌తో ఆది స్కిట్ బాగా న‌డిపించాడు. ఇక అదిరే అభి స్కిట్ విష‌యానికి వ‌స్తే... రావ‌డం రావ‌డ‌మే..''మీకో విష‌యం చెప్పాలి''.. అంటూ మొద‌లుపెట్టి.. ..''కెమెరా మెన్స్ అంతా నా ద‌గ్గ‌రికి వ‌చ్చి న‌న్ను రిక్వ‌స్ట్ చేస్తున్నారు.. మీ స్కిట్స్‌లో కొంచెం కామెడీ త‌గ్గించండీ.. మేము న‌వ్వుతుంటే కేమెరా షేక్ అయిపోతుంది అని రిక్వ‌స్ట్ చేస్తున్నారు.. మొన్న మెడిక‌ల్ షాప్ వాళ్లంతా వ‌చ్చి స‌న్మానం చేశారు.. ఎందుకంటే మేము వేసే పంచుల‌కి న‌వ్వ‌లేక జ‌నాలంతా క‌డుపు నొప్పితో మెడిక‌ల్ షాప్‌కి వెళ్లి టాబ్లెట్స్ కొనుకుంటున్నార‌ట‌.. అందుకే మెడిక‌ల్ షాపులవారి బిజినెస్ పెరిగిపోతుంది'' అంటూ చెప్పుకుంటూ పోతుంటే... ఇంత‌లో అనసూయ .. ''క‌డుపు నొప్పికా..? త‌ల‌నొప్పికా..?'' అని అడ‌గ‌డంతో కామెడీ పండుతుంది. వెంట‌నే సీరియ‌స్‌గా చూస్తూ.. ''ఏంటీ రివ‌ర్స్ పంచ్‌లేస్తావ్'' అంటూ అనసూయ‌ని నిల‌దీస్తాడు అభి. ''ఉన్న‌ది చెప్పాను అభీ.. అయినా నేను నిజం చెబితే.. నువ్వు ఏం చేస్తావ్‌.. ఏం చెయ్య‌గ‌ల‌వ్‌?'' అంటుంది రివ‌ర్స్ అవుతుంది అన‌సూయ‌. వెంట‌నే అభి అన‌సూయ‌కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి.. ''అంత మంచి యాంక‌ర్.. ఇంత మంచి పంచులేస్తుంటే.. ముద్దు ఇవ్వ‌డం కంటే.. ఇంక మేమేం చేస్తాం..'' అంటూ అందరినీ న‌వ్విస్తాడు. ఇక అస‌లు క‌థ‌లోకి వెళ్తే.. న‌వీన్‌,తేజా, అభి ముగ్గురూ క‌లిసి లేడీ గెటెప్స్ వేసే.. రాముని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ప్ర‌తి చిన్న ప‌నికి రాముని పంపిస్తూ ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఓ చోట ఈవెంట్‌కి వెళ్తే వీళ్ల ముగ్గురినీ విడిచి.. రాముని సెలెబ్రెటీలా ట్రీట్ చేస్తారు. మెడ‌లో దండ‌లు లేసి, సెల్ఫీలు దిగుతారు. అయితే అందంతా రాము క‌ల కావ‌డం.. బాగా న‌వ్వు తెప్పిస్తుంది. మొత్తానికి ఈవారం జబర్దస్త్ ఎపిసోడ్ జబర్దస్త్‌ కామెడీ నింపింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
CURRENCY 9 కంపెనీల్లో రూ.1,05,357 కోట్ల పతనం ముంబయి,ఆగస్టు 14: కార్పొరేట్‌రంగంలోని పది టాప్‌ కంపెనీల్లో తొమ్మిదికంపెనీల మార్కెట్‌ విలువలు గత వారంలో భారీగా పతనం అయ్యాయి. 1,05,357 కోట్లరూపాయలవరకూ నష్టం వాటిల్లినట్లు వివరాలు చెపుతున్నాయి. రిలయన్స్‌, ఎస్‌బిఐ వీటిలో భారీగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్‌,నిఫ్టీ 1,11.82 పాయింట్లు నష్టపోతే నిఫ్టీ 335.60 పాయింట్లు దిగజారింది. ఒక్క ఇన్ఫోసిస్‌ మాత్రమేమార్కెట్‌ విలువల్లో కొంతమేర పెరిగింది. మిగిలిన తొమ్మిదికంపెనీలు టిసిఎస్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐటిసి, హచ్‌డిఎఫ్‌సి వంటిసంస్థలు శుక్రవారంతో ముగిసిన వారంలో నష్టాలు చవిచూసినట్లు తేలింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువలు 24,671.41 కోట్లు దిగజారి రూ.5,02,922.78 కోట్లకు చేరింది. భారతీయస్టేట్‌బ్యాంకు మార్కెట్‌ విలువలు కూడా 21,407.49 కోట్లు క్షీణించి రూ.2,42, 258.49 కోట్లకు పడిపోయాయి. ఐటిసి కూడా రూ.10,882.6 కోట్లు క్షీణించి రూ.3,30,560.46 కోట్లకుచేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మార్కెట్‌విలువలు 10,274.83కోట్లు క్షీణించి మొత్తం విలువలు రూ.4,50,997.65 కోట్లకు పడిపోయాయి. అలాగేమారుతిసుజుకి ఇండియా కూడా 9843.28 కోట్లు క్షీణించి రూ.2,25,135.74 కోట్లకు చేరింది. హిందూస్థాన్‌యూనిలీవర్‌ 8452.24కోట్లు క్షీణించి రూ.2,49,530.29కోట్ల రూపాయ లకు చేరింది. ఒఎన్‌జిసి కూడా రూ.8149.1 కోట్లు క్షీణించి రూ.2,05,588.43కోట్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్‌ విలువలు కూడా రూ.6172.46 కోట్లకు చేరి రూ.2,69,860.07కోట్లకు చేరాయి. టిసిఎస్‌ రూ.5503.57 కోట్లుక్షీణించి రూ.4,77,423.33కోట్లకుచేరింది. ఇన్ఫోసిస్‌ పరంగాచూస్తే రూ.551.27 కోట్లు పెరిగి 2,26,880.71 కోట్లకు మార్కెట్‌ విలువలు పెరిగాయి. ఇక టాప్‌పది సంస్థల ర్యాంకులపరంగాచూస్తే రిలయన్స్‌ మొదటిస్థానంలో నిలిస్తే ఆ తర్వాత స్థానాల్లో వరుసగా టిసిఎస్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి,హిందూస్థాన్‌యూనిలీవర్‌, భారతీయ స్టేట్‌బ్యాంకు, ఇన్ఫోసిస్‌, మారుతి, ఒఎన్‌జిసిసంస్థలునిలిచాయి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బీసీసీఐ తీరుతో క్రికెట్ ఆస్ట్రేలియా గరంగరం.. బీసీసీఐపై క్రికెట్ ఆస్ట్రేలియా గరంగరంగా ఉంది. ఆతిథ్య జట్టుకు డే అండ్ నైట్ టెస్టులను నిర్వహించే స్వేచ్ఛ కల్పించాలంటూ భారత క్రికెట్ బోర్డుపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తోంది. TNN | Updated: May 2, 2018, 09:01PM IST బీసీసీఐ తీరుతో క్రికెట్ ఆస్ట్రేలియా గరంగరం.. బీసీసీఐపై క్రికెట్ ఆస్ట్రేలియా గరంగరంగా ఉంది. ఆతిథ్య జట్టుకు డే అండ్ నైట్ టెస్టులను నిర్వహించే స్వేచ్ఛ కల్పించాలంటూ భారత క్రికెట్ బోర్డుపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తోంది. ఇంతకూ విషయం ఏంటంటే.. భారత జట్టు నవంబర్లో ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ ఏడాది నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. టీ20 సిరీస్‌తో భారత పర్యటన ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ మొదలవుతుంది. కాగా, తొలి టెస్టును పింక్ బాల్‌తో డే అండ్ నైట్ మ్యాచ్‌గా నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా పట్టుబడుతోంది. భారత్ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మేం 2015 నుంచి హోం సిరీస్‌లో డే అండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. మీరు కూడా ఆడాల్సిందేనని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్‌లాండ్ రిక్వెస్టింగ్‌గానే డిమాండ్ చేస్తున్నారు. కానీ సుప్రీం ఏర్పాటు చేసిన సీఓఏ కమిటీ చీఫ్ వినోద్ రాయ్ మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఫ్రస్టేషన్లో ఉన్న సదర్‌లాండ్.. మీరు టెస్టు సిరీస్ గెలవడానికే డే అండ్ నైట్ టెస్ట్ వద్దంటున్నారంటూ విమర్శలు ప్రారంభించారు. మన బోర్డు మాత్రం సారీ బాస్ అంటోంది. మిస్టర్ సదర్‌లాండ్ బీసీసీఐ డే అండ్ నైట్ టెస్ట్ ఆడనంటోంది. అంతేకానీ మీలాగా మా ఆటగాళ్లు మాత్రం విజయం కోసం బాల్ ట్యాంపరింగ్ లాంటి అడ్డదారులు మాత్రం వెతుక్కోరు. ఇది పక్కా..!!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
- ఆర్‌బీఐ ఉద్యోగుల 'నిరసన సెలవు' విజయవంతం - చెక్‌, ఫారెక్స్‌, సెటిల్‌మెంట్లపై తీవ్ర ప్రభావం న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఉద్యోగులు గురువారం తలపెట్టిన నిరసనాత్మక సామూహిక సెలవు ఆర్థిక లావాదేవీలపై బాగా ప్రభావం చూపింది. దేశీయ బ్యాంకింగ్‌ లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆర్‌బీఐ మనుగడకు విఘాతం కలిగించేలా కేంద్రం ప్రతిపాదిస్తున్న సంస్కరణలను వ్యతిరేకించడంతో పాటు.. మెరుగైన పదవీ విరమణ ప్రయోజనాలను కోరుతూ దేశ వ్యాప్తంగా 17,000 మంది ఆర్‌బీఐ ఉద్యోగులు గురువారం నిరసనాత్మక సామూహిక సెలవును చేపట్టిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల సెలవు కారణంగా చెక్‌ క్లియరెన్స్‌లు, చెల్లింపులు, సెటిల్‌మెంట్‌లు, ఫారెక్స్‌ కార్యకాలపాలకు బాగా అంతరాయం కలిగింది. ఆర్‌బీఐ అధికారులు, ఇతర ఉద్యోగులకు చెందిన నాలుగు గుర్తింపు పొందిన సంఘాల వారు ఈ నిరసన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సమ్మె అనుకున్న రీతిలోనే నూటికి నూరు శాతం విజయవంతం అయినట్లు 'ఆలిండియా రిజర్వు బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌' కార్యదర్శి క్రాంతి 'నవతెలంగాణ'కు తెలిపారు. ఆర్‌బీఐ ఉద్యోగుల సామూహిక సాధారణ సెలవుతో ఆర్‌బీఐ మనుగడకు విఘాతం కలిగిస్తున్న సంస్కరణలను తాము వ్యతిరేకిస్తున్నామన్న బలమైన సంకేతాలు యాజమాన్యానికి చేరాయని ఆయన అన్నారు. వివిధ మార్గాల్లో ప్రభుత్వం ఆర్‌బీఐ అధికారాలను తీసేసుకుంటోందని యూనైటెట్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ సమీర్‌ ఘోష్‌ తెలిపారు. పీడీఎంఏ ఏర్పాటు, ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఆర్‌బీఐ పరిధిలోని అంశమని దీనిలో కూడా ప్రభుత్వం పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజు సామూహిక సెలవు సమ్మె కారణంగా ముఖ్యమైన బ్యాంకింగ్‌ కార్యకాలాపాలపై తీవ్రంగా ప్రభావం చూపిందని అన్నారు. సాముహిక సెలవు నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నట్లు యునైటెడ్‌ ఫోరమ్‌ తెలిపింది. కొన్ని చోట్ల రీజినల్‌ డైరెక్టర్లు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు కూడా సీనియర్‌ అధికారులు కూడా నిరసన సెలవుకు మద్దతు ప్రకటించి విధులకు హాజరు కాలేదు. నాలుగు యూనియన్లకు చెందిన వాలెంటీర్లు దేశ వ్యాప్తంగా పలు శాఖల వద్ద ఆర్‌బీఐనీ దేశాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేయడం కనిపించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyd Internet 167 Views jio phone JIO phone హైదరాబాద్: హైద‌రాబాద్ న‌గ‌రంలో జియో ఫీచర్ ఫోన్లను బుక్ చేసి.. ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్న వాళ్లకు మరికొద్ది గంటల్లో ఫోన్లు అందనున్నాయి. నగరంలోని ప‌లు ప్రాంతాల్లో ఇప్పటికే ఫోన్లు డెలివరీ అయ్యాయని రిటైలర్లు చెబుతున్నారు. రూ. 500 చెల్లించి ప్రీబుకింగ్ చేసుకున్న వాళ్లందరూ బుకింగ్ రశీదుతో పాటు మిగిలిన వెయ్యి రూపాయల మొత్తాన్ని చెల్లించి ఫోన్లను పొందవచ్చని జియో రిటైలర్లు పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో జియో ఫోన్ల డెలివరీ పూర్తి స్థాయిలో మొదలవుతుందని, రెండు రోజుల్లో బుక్ చేసుకున్నవాళ్లందరికీ అందుతాయని చెప్పారు.
1entertainment
Investments రెండులక్షల కోట ్లడాలర్లకు చేరిన ఇన్వెస్టర్ల సంపద ముంబయి, జూలై 11: స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపద తాజాగా రెండులక్షల కోట్ల డాలర్లకు చేరింది. బిఎస్‌ఇ బెంచ్‌మార్క్‌ సెన్సెక్‌్‌స ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయికి చేరి 31,639.53 పాయింట్లకు చేరడమే ఇందుకు కీలకం. మొత్తం బిఎస్‌ఇలో జాబితా అయిన కంపెనీల మార్కెట్‌ విలువలు 1,29,24,327 కోట్లకు చేరాయి. అంటే డాలర్లలో చూస్తే రెండులక్షలకోట్ల డాలర్లుగా తేలింది. ఉదయం ప్రారంభంనుంచే మార్కెట్లు దూకుడుతో ర్యాలీ తీయడంతో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువలు లేదా సంపద వృద్ధి రెండు లక్షల కోట్ల డాలర్లకు పెరిగిపోయింది. బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ 249.51పాయింట్లు పెరిగి 31,639.53 పాయింట్లకు చేరింది. 30షేర్‌ సెన్సెక్స్‌ ఇప్పటివరకూ 4994.42 పాయింట్లు పెరిగి 18.75శాతం వృద్ధి నమోదు చేసింది. 30సెన్సెక్స్‌పరంగాచూస్తే 27 కంపెనీ ల స్టాక్‌భారీగాలాభపడ్డాయి. టిసిఎస్‌, లూపిన్‌, టాటామోటార్స్‌, ఒఎన్‌జిసి వంటివ ఇఎక్కువ ఉన్నాయి. మొత్తం అన్ని కంపెనీల మార్కెట్‌ విలువలు మొదటిసారిగాచూస్తే 2014 నవం బరు 28వ తేదీ 100 లక్షల కోట్ల రూపాయల కు చేరిందని నిపుణుల అంచనాలతో పాటు బిఎస్‌ఇ గణాంకాలు సైతం చెపుతున్నాయి. బిఎస్‌ఇ జాబి తా కంపెనీల్లో రిలయన్స్‌ భారీ విలువలున్న కంపెనీగా నిలిచింది. 4,86,125.34 కోట్లుతో నిలి చింది. తదనంతరం టిసిఎస్‌ 4,63,630.88 కోట్లుగాను, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 4,29,812.78 కోట్లుగాను, ఐటిసి 4,03,148.08కోట్లుగాను తేలింది. హెచ్‌డిఎఫ్‌ఇ 2,59,769.09 కోట్ల మార్కెట్‌ విలువలతో వరుస వెంబడి ర్యాంకులు సాధించాయి. అయితే ఎన్‌ఎస్‌ఇలో మాత్రం ఫ్యూచర్స్‌ ఆప్షన్స్‌, క్యాష్‌ ట్రేడింగ్‌ విభాగాల్లో సాంకేతికలోపాలు తలెత్తి మూడుగంటల పాటు ట్రేడింగ్‌ నిలిచిపోయింది.
1entertainment
తుదిపోరుకు స్మాషర్స్‌, మారేడ్‌పల్లి సీఎం కప్‌ బేస్‌బాల్‌ ఈనాడు, హైదరాబాద్‌: సీఎం కప్‌ బేస్‌బాల్‌ టోర్నీలో స్మాషర్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌, మారేడ్‌పల్లి ప్లేగ్రౌండ్‌ తుదిపోరుకు అర్హత సాధించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్మాషర్స్‌ క్లబ్‌ 9-0తో సర్దార్‌ పటేల్‌ బేస్‌బాల్‌ క్లబ్‌పై గెలిచింది. స్మాషర్స్‌ జట్టులో అర్జున్‌ (2), శ్రీకాంత్‌ (2), శివకుమార్‌ (1), సాయి సంతోష్‌ (1), అభినవ్‌ (1), శ్రీతేజ (1), నురన్‌ (1) రాణించారు. మరో మ్యాచ్‌లో మారేడ్‌పల్లి పీజీ 4-2తో హైదరాబాద్‌ ఛార్జర్స్‌పై నెగ్గింది. మారేడ్‌పల్లి తరఫున యోగేశ్‌ (1), సంతు (1), శుభన్‌ (1), శ్రీను (1).. ఛార్జర్స్‌ జట్టులో బాలరాజు (1), తరుణ్‌ (1) ప్రతిభ కనబరిచారు. ప్రధానాంశాలు
2sports
Oct 03,2018 టాటాస్కై నుంచి సోనీ చానెళ్లు అవుట్‌! ముంబయి: టాటాస్కై సంస్థ తన డీటీహెచ్‌ నెట్‌వర్క్‌ నుంచి సోనీ నెట్‌వర్క్‌కు చెందిన దాదాపు 32 చానెళ్లకు ఉద్వాసన పలికింది. సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా (ఎస్‌పీఎన్‌) సంస్థ తమ చానెళ్ల ప్రసారాలను వాడుకుంటున్నందుకు గాను అధిక మొత్తంలో ఫీజు కోరుతున్న నేపథ్యంలో టాటాస్కై ్థ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో టాటాస్కై వేదికపై ప్రసారమయ్యే సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌, సాబ్‌, మాక్స్‌, ఏఎక్స్‌ఎన్‌, సోనీ పిక్స్‌, ఆజ్‌తక్‌, ఇండియా టుడే వంటి పాపులర్‌ చానల్స్‌తో సహా మొత్తం 32 చానెళ్ల ప్రసారాలు సోమవారం నుంచి నిలిచిపోయాయి. దీంతో టాటాస్కై వాడకందారులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. వాస్తవానికి టాటాస్కై, ఎస్‌పీఎన్‌ల మధ్య మూడేండ్ల కిందట కుందిరిన పంపిణి ఒప్పందం జులై 31తో ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment