news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Mar 04,2016
హోండా నుంచి సరికొత్త అమేజ్
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ సంస్థ దేశీయ మార్కెట్లోకి సరికొత్త అమేజ్ కారును ఆవిష్కరించింది. దీని ధర మార్కెట్లో రూ.5.30 లక్షల (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) నుంచి మొదలు కానుంది. ఈ కొత్త కాంపాక్ట్ సెడాన్ కారు బుకింగ్లు మే నుంచి మొదలు కానున్నాయి. గత రెండు నెలలుగా అమేజ్ అమ్మకాలు పడిపోవడంతో సంస్థ మొత్తం విక్రయాలు పడిపోతున్న తరుణంలో కొత్త అమేజ్పై హోండా ఆశలు పెట్టుకుంది. ఈ విభాగంలో సీవీటీ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక అమేజ్ ధర రూ.8.20 లక్షలుగా (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. కొత్త అమేజ్ డిజిల్ వేరియంట్ ధర రూ.6.42 లక్షల నుంచి రూ.8.20 లక్షలుగా నిర్ణయించారు. కొత్త స్టైల్, మెరగైన ఇంటీరియర్ అద్భుతమైన ఫీచర్తో కూడిన కొత్త అమేజ్ వినియోగదారుల మనసు దోచుకుంటుందని హోండా కార్స్ అధ్యక్షుడు, సీఈఓ కత్సుషి ఇనౌయి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చే అన్ని వాహనాలు ఎయిర్బ్యాగ్ సౌలభ్యంతో లభిస్తాయని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
rbi
ఆర్బిఐకి అధికారాలొస్తే 9నెలల్లో 60 కేసుల రికవరీ!
ముంబయి, మే 6: రానిబాకీల సమస్యనుపరిష్క రించేందుకు రిజర్వుబ్యాంకుకు రికవరీ అధికారాలు దఖలుపరుస్తూ బ్యాంకింగ్ చట్టంలోని సెక్షన్లను సవరించి ప్రత్యేక ఆర్డినెన్స్ను జారీచేసిన కేంద్ర ప్రభుత్వ కసరత్తుకు దీటుగా ఆర్బిఐ కూడా ఆప రేషన్ క్లీన్బ్యాంక్ను చేపడుతోంది. కేవలం తొమ్మిది నెలల్లోనే దేశంలో అతిపెద్ద భారీ మొత్తాలున్న మొండి బకాయిలను రికవరీచేస్తామని ప్రకటించిం ది. ఇందుకోసం బకాయిల రికవరీకి అనుగుణంగా ప్రత్యేక సెక్రటేరియట్ను ఏర్పాటుచేస్తోంది. రుణపర పతి పొందినతర్వాత ఇప్పటికీ బకాయిలుపడ్డ భారీ మొత్తాలను పరిశీలనచేసేందుకు ఈ సెక్రటేరియట్ పనిచేస్తుంది. బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టాలకు సవరణలు తెచ్చేందుకు కేబినెట్ ఆమోదించిన తర్వాత ఇక ఆర్బిఐకి దేశంలోని ఆరులక్షల కోట్ల రానిబాకీల వసూళ్లు, రికవరీ అధికారాలు కూడా వస్తున్నాయి. రెండులక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్లాంటి దేశంలో బ్యాంకర్లకు ఎక్కువగా రానిబాకీలే గుదిబండలుగా మారాయి. మొండి బకా యిలు, రానిబాకీలు, పునర్వ్యవస్థీకరించిన రుణా లు, అడ్వాన్సులు వంటివి మొత్తం రుణాల్లో 17 శాతం వరకూ ఉన్నాయి. ఇతర భారీ ఆర్థికవ్యవస్థ లున్న దేశాలతో పోలిస్తే ఎక్కువే. ఈ నెలలోనే ఆర్బిఐ రానిబాకీల వ్యవస్థ కట్టడికి అనుగుణమైన నిబంధనలను రూపొందించే పనిలో ఉంది. రాని బాకీల రికవరీకి జారీచేసిన ఆర్డినెన్స్తో ఆర్బిఐకి మరింతగా సాధికారత లభిస్తుందని ఆర్థిక మంత్రి ఆరుణ్జైట్లీ అన్నారు. సర్ఫేసిచట్టం, డిఆర్టి చట్టం వంటి వాటి సవరణల అనంతరం ఆర్బిఐ వివిధ స్కీంల ద్వారా సమస్యాత్మక ఆస్తులను పరిరక్షించేం దుకు ఆర్బిఐకి అధికారాలు కల్పించాలని భావిం చింది. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న ఎన్పిఎలు బ్యాంకుల ఆర్థికపరిపుష్టిని దెబ్బతీస్తు న్నాయని, దేశ ఆర్థిక ప్రగతికి బ్యాంకింగ్రంగ వృద్ధి కీలకమని జైట్లీ వెల్లడించారు. బ్యాంకింగ్ క్రమబద్ధీ కరణ చట్టం 1949 సెక్షన్ 35ఎకు సవరణ తీసుకు వచ్చి పార్లమెంటు ఆమోదంకోసం కృషిచేస్తున్నది. 35ఎఎ సెక్షన్ 35ఎబిని చట్టంలోసవరణలు తెచ్చిం ది. ప్రత్యేక ఆర్డినెన్స్ద్వారా ఈ సవరణలు చట్టంలో పొందుపరిచినట్లు జైట్లీ వెల్లడించారు సమస్యాత్మక బాకీలకోసం వెంటనే కమిటీలను ఏర్పాటుచేసి బ్యాంకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు వీలుంటుందని అన్నారు. ప్రస్తుతం ఆరులక్షల కోట్లకుపైబడిన రానిబాకీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్దనే 5.21 లక్షల కోట్ల వరకూ ఉన్నట్లు అంచనా. బ్యాంకులు అందించిన నివేదికల ఆధారంగా ఆర్బిఐ నిరర్ధకా స్తులను పరిశీలించి కార్యాచరణకు ఉపక్రమిస్తుందని జైట్లీ వెల్లడించారు. ================ | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అమ్మకు మాటిచ్చా.. బైక్ నడపను: యువీ
బైక్ నడపటం నాకెంతో ఇష్టం. కానీ అమ్మకు మాటిచ్చా. అందుకే బైక్ ముట్టుకోను. నేను బైక్ రైడింగ్ చేసిన రోజు అమ్మ..
TNN | Updated:
Oct 28, 2017, 01:00PM IST
మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే యువరాజ్ సింగ్‌కు అమ్మ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. క్రికెటర్‌గా దూకుడుగా వ్యవహరించే యువీ.. అమ్మ దగ్గర మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతాడు. ఒంటి చేత్తో జట్టుకు వరల్డ్ కప్ అందించిన ఈ ఆల్‌రౌండర్‌కు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. ధోనీ తరహాలోనే బైక్ మీద దూసుకెళ్లేందుకు ఇష్టపడేవాడు. కానీ అమ్మకు ఇచ్చిన మాట కోసం బైక్ నడపడం లేదని చెప్పాడు.
బైక్ నడపడం అంటే నాకెంతో ఇష్టం. కానీ నాకో అమ్మ ఎంతగానో ఆలోచిస్తుంది. అందుకే ఏ రోజైతే నువ్వు బైక్ రైడ్ చేస్తావో.. అదే రోజు నేను నీ దగ్గర్నుంచి వెళ్లిపోతా అని చెప్పింది. బైక్ నడపొద్దని నా దగ్గర మాట తీసుకుందని యువీ ఇటీవల వెల్లడించాడు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రియో భారతీయ ఒలింపియన్లకు దన్నుగా మాస్టర్ బ్లాస్టర్
రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత ఒలింపియన్లకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
TNN | Updated:
Aug 6, 2016, 11:29PM IST
రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత ఒలింపియన్లకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. క్రీడల తొలిరోజు అయిన శనివారం నాడు సచిన్ రియో ఒలింపిక్ క్రీడల గ్రామాన్ని సందర్శించారు. అక్కడ బస చేస్తున్న మన ఆటగాళ్లను కలిసి వారితో చాలా సేపు గడిపారు. 1998 కౌలాలంపూర్ కామన్ వెల్త్ క్రీడల నాటి తన మధుర స్మృతులను ఈ సందర్భంగా సచిన్ గుర్తుచేసుకుని వాటిని క్రీడాకారులతో పంచుకున్నారు. ప్రపంచ క్రీడాసంరంభంలో భారత దేశం తరఫున పోటీపడుతున్న అత్యున్నత ఆటగాళ్లతో కలిసి తాను పాల్గొనడం మరపురాని అనుభూతినిస్తోందని ఇంతకు మించిన అదృష్టం ఏ క్రీడాకారునికైనా ఏముంటుదని హర్షం వ్యక్తం చేసారు. ఏ రకంగా చూసినా మన ఆటగాళ్లందరూ మిగిలిన దేశాల ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోరన్నారు. దేశం కోసం శ్రమించి పతకాలను తీసుకువస్తారనే విశ్వాసం తనకుందని ఈ సందర్భంగా సచిన్ వ్యాఖ్యానించారు. రియో ఒలింపిక్ క్రీడల బ్రాండ్ అంబాసిడరుగా సచిన్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్ భారత అథ్లెట్లతో గడిపిన క్షణాల ఫోటోలను తెలుగు సమయం మీకు అందిస్తోంది.
ఫోటో క్రెడిట్: సంజీవ్ కుమార్, ఎన్బీటీ | 2sports
|
- కార్మికుల ప్రయోజనాలను కాపాడుతాం
- బాలకార్మిక వ్యవస్థ పూర్తి నిర్మూలనకు చట్టం
- జెనీవా ఐఎల్వో సదస్సులో కేంద్ర మంత్రి దత్తాత్రేయ
న్యూఢిల్లీ: ప్రపంచంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జెనీవాలోని 104వ 'అంతర్జాతీయ కార్మిక సదస్సు'లో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం సమీకృత వ్యవస్థతో కూడిన స్థిరమైన అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంతో కేంద్రం ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. భారత్కు అతిపెద్ద దేశీయ మార్కెట్ ఉందని, అపారమైన యువశక్తి భారత సొంతమని ఆయన ఈ సందర్భంగా ప్రపంచ ప్రతినిధులకు వివరించారు. గతంలో దేశీయ వృద్ధి రేటు 5 శాతంగా ఉండేదని, అది ఇప్పుడు 7.4 శాతానికి చేరినట్లు మంత్రి దత్తాత్రేయ తెలిపారు. తమ ప్రభు త్వం కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు, కార్మికుల గౌరవం పెంపొం దించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. సమీకృత అభివృద్ధి, ఉపాధి కల్పన విషయమై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో), భారత్లు తమ నిబద్దతను పంచుకొని ముందుకు సాగాలని మంత్రి అభిలషించారు. ఐఎల్వో సంస్థతో తమ బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకోనున్నట్లు ఆయన వివరించారు. 14 సంవత్సరాల లోపు వారిని పనిలోకి తీసుకొనే విషయమై పూర్తి నిషేధం తెచ్చేందుకుగాను పార్లమెంట్లో చట్టం తేనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎన్సీఎల్పీ పథకం కింద భారత్లో దాదాపు 10 లక్షల మంది బాలకార్మి కులకు విముక్తి కలిగించి పాఠశాలలకు పంపినట్లు మంత్రి వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పూరీ బర్త్ డే వేడుకలో చార్మి భావోద్వేగం.. ఇస్మార్ట్కి ముందు రూ. 50 వేలు కూడా లేవు
ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. గోవాలో విజయ్ దేవకొండ సినిమా స్క్రిప్ట్ పనిలో ఉండగా.. ఆయన బర్త్ డే వేడుకలను హైదరాబాద్లో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు చార్మి.
Samayam Telugu | Updated:
Sep 29, 2019, 09:57AM IST
నేడు (సెప్టెంబర్ 28) డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్లో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు హీరోయిన్ చార్మి . ఈ సందర్భంగా.. ఇండస్ట్రీలో సినిమాలు లేక ఖాళీగా ఉన్న 20 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున ఆర్ధికసాయం అందించారు చార్మి.
ఈ పుట్టిన రోజు వేడుకలో ఎమోషనల్ స్పీచ్తో ఆకట్టుకున్నారు చార్మి. ఆమె మాట్లాడుతూ.. ‘నేను కెమెరా ముందు నటించడానికి, స్టేజ్ మీద మాట్లాడటానికి పెద్దగా భయపడను. కాని ఈరోజు ఎందుకో ఏం మాట్లాడాలి? దేనిపై మాట్లాడాలని టెన్షన్గా ఉంది. అప్పట్లో దాసరి గారు చెప్పారు.. పూరీ జగన్నాథ్ నా వారసుడు అని. ఆ మాట విన్న పూరీ గారు నా దగ్గర చాలా ఎమోషన్ అయ్యారు. ఆరోజు నా మనసులో అనిపించింది.. దాసరిగారు అంత పెద్ద మాట పూరీ గురించి అన్నప్పుడు దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ముందుకు వెళ్లాలని.
Read Also: నచ్చిన పనికోసం చచ్చిపోండి: పూరీ బర్త్ డే మెసేజ్
పూరీ ప్రొడక్షన్లో పనిచేస్తున్న నేను.. ఆయనకు ఏం కావాలో అది ఇవ్వడమేనా? సినిమాలు తీయడమేనా? హిట్లు కొట్టడమేనా? అనే ఆలోచన వచ్చినప్పుడు అయితే మా దగ్గర డబ్బులు లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి పూరీ నేను ఫైనాన్సియల్గా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ విషయాన్ని ఎప్పుడూ మేం ఎవరివద్ద డిస్కస్ చేయలేదు. ఎవరి సాయం కోరలేదు. ఆ టైంలో మా దగ్గర కేవలం రూ. 50 వేలు మాత్రమే ఉన్నాయి. ఆ టైంలో ఒకరికి ఒకరం బలంగా నిలబడ్డాం.
ఆ టైంలో పూరీ గారు.. నాకు ఒక మాట చెప్పారు. ‘రేయ్.. ఈరోజు మన దగ్గర డబ్బుల్లేవు చాలా కష్టాల్లో ఉన్నాం. కాని.. ముందు మనం మన హెల్త్ని బాగా చూసుకుందాం. నేను హెల్త్ని చూసుకుంటూ కథలు రాస్తా. నువ్ ఎక్కడ ఏ సినిమా చేయాలని మనం ప్లాన్ చేద్దాం. ఏమీ కాదు.. ఆస్తులు వస్తాయి పోతాయి. మనం స్ట్రాంగ్గా ఉందాం అని చెప్పారు. కాని ఇస్మార్ట్ శంకర్ సెట్ కావడానికి చాలా టైం పట్టింది.
హీరో రామ్.. రియల్ లైఫ్ హీరో అనిపించారు. పూరీ గారి కథ చెప్పినప్పుడు ఎలాంటి డౌట్లు లేకుండా ఆయన్ని నమ్మారు. మేం కష్టాల్లో ఉన్నామా? మాకు హిట్లు ఉన్నాయా? ఫ్లాప్లు ఉన్నాయా? ఇలాంటివేం చర్చించకుండా ఆయన పూరీతో చేయాలనే ఒకే ఒక్క నిర్ణయంతో ఓకే చేశారు. మనస్పూర్తిగా చెబుతున్నా.. సాయం చేసే గుణం అతనిలో చూశా. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆయన మళ్లీ హిట్ అందుకున్నారు. ఆయన సత్తా ఏంటో అందరికీ తెలిసింది’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు చార్మి.
అనంతరం పూరీ గారూ.. ఇక్కడకు రాలేకపోయారని కాని ఆయన బర్త్ డే సందర్భంగా మీకు చెప్పమని నాకో మెసేజ్ పంపించారు అంటూ ఆమె ఫోన్కి పంపించిన ఆడియో మెసేజ్ను అభిమానులకు వినిపించారు చార్మి. అందులో పూరీ మాట్లాడుతూ.. ‘మనం అందరం ఏదో సాధించాలని తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు. మిగతా వాళ్లు కాలేరు. అంతే వాళ్లు సక్సెస్ అయినట్టు మిగతా వాళ్లు ఫెయిల్ అయినట్టు కాదు. నా అభిప్రాయం ప్రకారం నిజమైన సక్సెస్ ఏంటంటే.. నీకిష్టమైన పనికోసం కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా దానికోసం చావడమే నిజమైన సక్సెస్. ఆ పని వల్ల పది రూపాయిలు రావచ్చు. కోటిరూపాయిలు రావచ్చు. ఇష్టమైన పనికోసం చావండి’ అంటూ పూరీ ఎమోషనల్గా మాట్లాడారు. | 0business
|
సూపర్ బైకులకు భలే గిరాకీ
- మార్కెట్లోకి ఐదు డిఎస్కె బెనెల్లి వాహనాలు
- 20 షోరూంలకు విస్తరిస్తాం
- ఛైర్మన్ శిరష్ కులకర్ణి వెల్లడి
నవతెలంగాణ- హైదరాబాద్
డిఎస్కె మోటో వీల్ ఇటాలియన్ సూపర్ బైక్ తయారీ సంస్థ బెనెల్లి అందించిన ఐదు కొత్త సూపర్ బైకులను హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. మరో 10-12 మాసాల్లో ఇంకో ఐదు మోడళ్లను ఆవిష్కరించనున్నామని డిఎస్కె బెనెల్లి ఛైర్మన్ శిరిష్ కుల్కర్ణి తెలిపారు. భారత్లో సూపర్ బైకుల అమ్మకాలు ప్రతి ఏడాది 50 శాతం చొప్పున పెరుగుతున్నాయన్నారు. బుధవారం హైదరాబాద్లో ఝాబక్ ఆటో భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కులకర్ణి మాట్లాడుతూ ఇది దేశంలోనే ఆరో షోరూం అని తెలిపారు. ఈ ఏడాది ముగింపు కల్లా 20 షోరూంలకు విస్తరించాలని నిర్దేశించుకున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాంతాలను గుర్తించామని, ఇందులో కొన్ని ద్వితీయ శ్రేణి నగరాలున్నాయన్నారు. పూణె కేంద్రంగా పని చేస్తోన్న డిఎస్కె గ్రూపు బెనెల్లితో భాగస్వామ్యమై భారత్లో విక్రయాలు చేస్తోంది.
త్వరలోనే 250 సిసి, 1131 సిసిలో రెండు కొత్త బైకులను ఆవిష్కరించనున్నామని కులకర్ణి తెలిపారు. సూపర్ బైకులపై ఆసక్తి కలిగిన వారికి 250 సిసి మోడల్తో ఆకర్షిస్తామన్నారు. కొత్తగా ఆవిష్కరించిన ఐదు మోడళ్ల ధరలు రూ.2.88 లక్షల నుంచి రూ.12.02 లక్షలుగా నిర్ణయించామన్నారు. ఇప్పటికే 400 ఆర్డర్లు వచ్చాయని, మరో నెలన్నర రోజుల్లో డెలవరీ చేయనున్నామని తెలిపారు. 250 సిసి పైబడిన మోటార్ సైకిళ్లు సూపర్ బైక్ విభాగంలోకి వస్తాయని, గతేడాది ఈ విభాగం అమ్మకాలు 50 శాం వృద్ధితో 10,500కు చేరాయన్నారు. ఈ ఏడాది కూడా 50 శాతం వృద్ధి అంచనా వేస్తున్నామన్నారు. బెనెల్లి ఈ ఏడాది 300 బైక్ అమ్మకాలతో 20 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 196 Views
లాహోర్ : తనకు పాకిస్థాన్ క్రికెట్ కోచ్గా చేసే ఉద్దేశం లేదంటూ ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ అకిబ్ జావేద్ స్పష్టం చేశాడు. కాగా ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన ఆపర్ను అకిబ్ తిరస్కరించాడు. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోచ్గా ఉన్న తాను పాక్ కోచ్ బాధ్యతలు చేపట్టాలనుకోవడం లేదు. గత వారం పాక్ జట్టు కోచ్ పదవిపై నా అభిప్రాయాన్ని తెలుసుకునేందకు పిసిబి నన్ను కలిసింది. అయితే వారి విన్నపాన్ని తోసిపుచ్చాను. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాన కోచ్గా ఉన్నా,ఒక విదేశీ కోచ్ను నియమించేందుకు పిసిబి సన్నాహం చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ క్రమంలో పాక్ కోచ్ పదవికి ఎటువంటి దరఖాస్తు చేసుకోవడం లేదు.యుఎఇ జట్టును విడిచి ఎక్కడికి వెళ్లాలను కోవడం లేదని జావేద్ పేర్కొన్నాడు. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
షమీ దుబాయ్లో రెండు రోజులు వాస్తవమే..!
దక్షిణాఫ్రికా పర్యటన నుంచి భారత్కి వస్తూ.. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రెండు రోజులు దుబాయ్లో ఉన్నమాట వాస్తవమేనని బీసీసీఐ నిర్ధారించింది.
Samayam Telugu | Updated:
Mar 20, 2018, 12:24PM IST
షమీ దుబాయ్లో రెండు రోజులు వాస్తవమే..!
దక్షిణాఫ్రికా పర్యటన నుంచి భారత్కి వస్తూ.. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రెండు రోజులు దుబాయ్లో ఉన్నమాట వాస్తవమేనని బీసీసీఐ నిర్ధారించింది. ఇటీవల మహ్మద్ షమీపై అతని భార్య హసీన్ జాహన్ గృహ హింస కేసు పెట్టడంతో పాటు మహిళలతో అక్రమ సంబంధాలు, ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్థాన్కి చెందిన మహిళతో షమీ రెండు రోజులు దుబాయ్లోని ఓ హోటల్లో గడిపాడని, ఆమె నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నాడని హసీన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో భాగంగా కోల్కతా పోలీసులు.. మహ్మద్ షమీ దుబాయ్ పర్యటన గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గత వారం లేఖ రాశారు. దీనికి మంగళవారం బీసీసీఐ సమాధానమిచ్చింది.
‘బీసీసీఐ నుంచి లెటర్ని మేము అందుకున్నాం. అందులో.. మహ్మద్ షమీ గత ఫిబ్రవరి 17, 18న దుబాయ్లోనే ఉన్నట్లు స్పష్టంగా ఉంది. ఇక ఈ కేసుకి సంబంధించిన మిగతా అంశాలపై విచారణ కొనసాగిస్తాం’ అని జాయింట్ సీపీ (నేర విభాగం) ప్రవీణ్ త్రిపాఠి మీడియాతో వెల్లడించారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ముగియగానే.. వన్డే, టీ20 జట్టులో తాను లేకపోవడంతో సుదీర్ఘ పర్యటన మధ్యలోనే మహ్మద్ షమీ భారత్కి వచ్చేశాడు. అయితే.. ఈ ప్రయాణం మధ్యలోనే అతను దుబాయ్కి వెళ్లినట్లు అతని భార్య ఆరోపించడంతో.. పోలీసులు వివరాల కోసం బీసీసీఐకి లేఖ రాశారు. ఈ పర్యటన ఖర్చు బీసీసీఐ భరించిందా..? లేదా మహ్మద్ షమీనే పెట్టుకున్నాడా..? అనే వివరాలను మాత్రం తెలియరాలేదు.
దుబాయ్లో షమీతో గడిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మహిళ అలిష్బా కూడా సోమవారం స్పందించిన విషయం తెలిసిందే. ‘మహ్మద్ షమీని నేను దుబాయ్లో కలిసిన మాట వాస్తవమే. అక్కడ నా సోదరి ఉంటుండటంతో.. నేను తరచూ దుబాయ్ వెళ్తుంటా. గత ఏడాది ఓ అభిమానిగా షమీతో పరిచయం ఏర్పడింది. అనంతరం చాట్ ద్వారా స్నేహితురాలినయ్యా. అలా పరిచయంలో భాగంగానే.. దుబాయ్లో అతను ఉన్నాడని తెలుసుకుని వెళ్లి.. కలిసి టిఫిన్ తిన్నాం. మా మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు’ అని అలిష్బా స్పష్టం చేసింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
- మూడు రోజుల నష్టాలకు తెర
- సెన్సెక్స్311 పాయింట్లు వృద్ధి
ముంబయి : వరుసగా మూడు రోజులుగా నష్టాలు చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం ఉపశమనం లభించింది. ఇప్పటికే షేర్ల ధరలు భారీగా పడిపోయి ఉండటానికి తోడు అమెరికా మార్కెట్లు పుంజుకోవడంతో దేశీయ మార్కెట్లకు మద్ధతు లభించింది. ఈ నేపథ్యంలోనే బిఎస్ఇ సెన్సెక్స్ 311.22 పాయింట్లు లేదా 1.22 శాతం పెరిగి 25,764.78కు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 106 పాయింట్లు లేదా 1.3 శాతం రాణించి 7,823 వద్ద నమోదయ్యింది. ఇంట్రా ట్రేడింగ్లో సెన్సెక్స్ 25,669-25,591 మధ్య, నిఫ్టీ 7,783-7,751 మధ్య కదలాడింది. ఇంతక్రితం మూడు సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 939 పాయింట్లు నష్టపోయింది.
బిఎస్ఇలో మిడ్క్యాప్ సూచీ 0.72 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.90 శాతం చొప్పున రాణించాయి. అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు సేవల రంగం పుంజుకుంటుందన్న సంకేతాల నేపథ్యంలో మార్కెట్లకు మద్దతు లభించింది. భారీగా పడిపోయిన షేర్ల ధరల నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారని బ్రోకర్లు పేర్కొన్నారు. మొత్తంగా బిఎస్ఇలో మదుపర్ల మద్దతుతో 1,718 స్టాక్స్ లాభాల్లో ముగియగా, మరోవైపు 970 స్టాక్స్ ప్రతికూలతలో నమోదయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 4పైసలు క్షీణించి 66.24 వద్ద ట్రేడింగ్ అయ్యింది. బుధవారం రూ.1,570 కోట్ల ఎఫ్ఐఐలు తరలిపోయాయి.
బిఎస్ఇలో రియాల్టీ సూచీ అత్యధికంగా 4.55 శాతం రాణించింది. లోహ సూచీ 2.43 శాతం, కాపిటల్ గూడ్స్ 1.98 శాతం, బ్యాంకింగ్ సూచీ 1.93 శాతం చొప్పున పెరిగాయి. కన్సూమర్ డ్యూరెబుల్స్, ఆటో, విద్యుత్ సూచీలు 1-2 శాతం వరకు పెరిగాయి. కెయిర్న్ ఇండియా అత్యధికంగా 5.78 శాతం పెరిగింది. టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు, అల్ట్రాటెక్ షేర్లు 4 శాతం చొప్పున రాణించాయి. మరోవైపు ఐడియా సెల్యూలర్, బిపిసిఎల్, లూపిన్, హీరో మోటో కార్ప్ షేర్లు 0.50 శాతం నుంచి 3.10 శాతం వరకు తగ్గాయి.
జెట్లైట్ ఇండియా లిమిటెడ్ సంస్థ జెట్ఎయిర్వేస్లో విలీనానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలుపడంతో జెట్ఎయిర్వేస్ షేర్ 2 శాతం పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాలను వేలం వేయడానికి కేబినెట్ ఆమోదం తెలుపడంతో జిందాల్ డ్రిల్లింగ్ అండ్ ఇండిస్టీస్ 11.5 శాతం ర్యాలీ చేసింది. విత్త రంగంలో హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్సిఐ, ఐసిఐసిఐ బ్యాంకు 1-4 శాతం వరకు రాణించాయి. టాటా మోటార్స్ షేర్లు 2 శాతం పెరిగాయి. బజాజ్ ఆటో 2 శాతం, ఒఎన్జిసి 2 శాతం చొప్పున పెరిగాయి. మార్కెట్లకు హిందాల్కో, భెల్, ఎల్అండ్టి, విప్రో, సిప్లా షేర్ల మద్దతు లభించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
షారుఖ్ కారుపైకి రాళ్ల దాడి
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కారుపైకి అహమ్మదాబాదులో ఆదివారం ఉదయం దుండగులు రాళ్లు రువ్వారు
TNN | Updated:
Feb 14, 2016, 04:54PM IST
షారుఖ్ కారుపైకి రాళ్ల దాడి
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కారుపైకి అహమ్మదాబాదులో ఆదివారం ఉదయం దుండగులు రాళ్లు రువ్వారు. అయితే వారెవరనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. షారుఖ్ కారుపై రాళ్లు రువ్వే సమయంలో వారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దాన్ని బట్టి వారు ఏ హిందూ అతివాద సంస్థ కార్యకర్తలయినా అయి ఉంటారని అనుమానిస్తున్నారు. షారుఖ్ ప్రస్తుతం అహమ్మదాబాదులో తన చిత్రం రయీజ్ షూటింగులో ఉన్నారు. గుజరాత్లోని భుజ్ ప్రాంతంలో కూడా ఈ నెల మొదట్లో షారుఖ్ ఈ చిత్ర షూటింగులో పాల్గొన్నారు. ఆ సమయంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళన చేశారు. షూటింగ్ అడ్డుకోవడానికి యత్నించారు. డిసెంబర్ నెల్లో అతగాడి దిల్వాలే చిత్రాన్ని బహిష్కరించాలంటూ గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హిందూ సంస్థలు ఆందోళన చేశాయి. గత ఏడాది నవంబరులో అసహనం అంశంపై తొలిసారిగా వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందూ సంస్థల ఆగ్రహానికి షారుఖ్ గురయ్యారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Amar Akbar Anthony: కిక్ ఇచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ పోస్టర్.. టీజర్ ఎప్పుడంటే!
రవితేజ, ఇలియానా జోడీగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ టీజర్ విడుదల తేదీ, సమయాన్ని ప్రకటించింది నిర్మాణ సంస్థ.
Samayam Telugu | Updated:
Oct 25, 2018, 07:08PM IST
Amar Akbar Anthony: కిక్ ఇచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ పోస్టర్.. టీజర్ ఎప్పుడంటే!
‘అమర్ అక్బర్ ఆంటోని’ టీజర్తో సందడి చేసేందుకు రెడీ అయ్యారు మాస్ రాజా రవితేజ. ‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ లాంటి వరుస హిట్లతో రవితేజకు మాస్ రాజా ఇమేజ్ ఇచ్చారు స్టార్ దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల శ్రీనువైట్ల బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ కాన్సెప్ట్ పివోట్కు మంచి రెస్పాన్స్ రావడంతో టీజర్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈనెల 29 (సోమవారం) సాయంత్రం 4 గంటలకు ఈ మూవీ టీజర్ను విడుదల చేస్తున్నట్టుగా పోస్టర్ను విడుదల చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ పోస్టర్లో రవితేజ సీరియస్ లుక్లో స్టైలిష్గా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో చాలా ఏళ్ల తరువాత మాస్ రాజాతో జోడి కడుతోంది నాజూకు సుందరి ఇలియానా. గతంలో ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో రవితేజతో జోడీ కట్టిన ఈ బ్యూటీ రీ ఎంట్రీలో రవితేజతో జోడీ కడుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
Here it goes !! Teaser out on the 29th at 4pm. @RaviTeja_offl @Ileana_Official @MusicThaman @MythriOfficial #AAA https://t.co/hirIXjl9A8
— Sreenu Vaitla (@SreenuVaitla) 1540470651000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సాఫ్ట్ వేర్ ఉద్యోగం కావాలా... ఇన్ఫోసిస్ స్వీట్ న్యూస్..!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మరో మాంద్యం వచ్చినట్టే అని, వేల.. లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతున్నారని.. భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద కుదుపే అని వరసగా
TNN | Updated:
Jun 3, 2017, 09:44AM IST
సాఫ్ట్ వేర్ ఉద్యోగం కావాలా... ఇన్ఫోసిస్ స్వీట్ న్యూస్..!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మరో మాంద్యం వచ్చినట్టే అని, వేల.. లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతున్నారని.. భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద కుదుపే అని వరసగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఐటీ ఉద్యోగ అశావహుల్లో ఆందోళన మొదలైన విషయం తెలిసిందే. అమెరికాలో ట్రంప్ ఎన్నిక, కంపెనీల్లో ఆటోమేషన్ పెరగడంతో భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. విప్రో వంటి కంపెనీలు పది శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నాయనే వార్తలు ఐటీ రంగంలో భయాందోళనలను పెంచాయి.
Visit Site
Recommended byColombia
అయితే వాటన్నింటికీ భిన్నంగా ఇన్ఫోసిస్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ఈ ఏడాది ఏకంగా ఇరవై వేల మంది కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్టుగా ఇన్ఫోసిస్ సీవోవో యూబీ ప్రవీణ్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నియామకాలను చేపడతామని ఆయన వివరించారు. ఇదే సమయంలో ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు అంశంపై కూడా ఆయన స్పందించారు. తొలగింపుల అంశాన్ని పెద్దది చేసి చూడవద్దని రావు అన్నారు.
తమ కంపెనీలో ఇప్పటి వరకూ కేవలం నాలుగువందల మంది ఉద్యోగులను మాత్రమే ఇంటికి వెళ్లమన్నామని, అది కేవలం వారి పనితీరు మీద ఆధారపడిన వ్యవహారం అని ఆయన అన్నారు. అలాంటి తొలగింపులు మాంద్యానికి నిదర్శనం కాదని తేల్చి చెప్పారు. ‘ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను క్రియేట్ చేస్తాం, అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగాల తొలగింపు ఉంటుంది. అది కూడా పనితీరు ప్రాతిపదికన మాత్రమే తొలగింపు ఉంటుంది..’ అనే మాటలతో ఐటీ ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకున్న వారికి భరోసాను ఇచ్చారు ఇన్ఫోసిస్ సీవోవో.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
భారత్, జపాన్ దూసుకుపోతున్నాయి..
- అక్కడ 'మేక్ ఇన్ ఇండియా' చర్యలు గర్వకారణం
- మారుతీ కార్లను దిగుమతి చేసుకోనున్న జపాన్
- ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొన్న నేపథ్యంలోనూ భారత్, జపాన్లు మెరుగైన వృద్ధి రేటుతో రాణిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని జపాన్ తమవంతు సహకారం అందించేందుకు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సరైన మార్గంలో ముందుకు దూసుకుపోతున్నాయని చెప్పడానికి ఇది తార్కాణమని ఆయన అన్నారు. జపాన్లో 1200 కోట్ల డాలర్ల నిధులóతో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ముందుకు సాగుతుండడం గర్వకారణమని ఆయన అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 'బిజినెస్ లీడర్స్ ఫోరమ్' లో జపాన్ ప్రధాని షింజో ఎబేతో కలిసి పాల్గొన్నారు.
చరిత్రలో మొదటిసారిగా భారత్ నుంచి జపాన్కు మారుతీ కార్లను దిగుమతి చేసుకోనున్నాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. మారుతీ కొత్తగా మార్కెట్లోకి తేనున్న బాలినో కారు భారత్లో తయారై జపాన్కు, విశ్వవ్యాప్తంగా ఎగుమతి కానుందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మందగమనపు పవనాలు నెలకొన్న నేపథ్యంలో సైతం జపాన్ మేటి వృద్ధితో దూసుకుపోతోందని ఆయన అన్నారు. ఇటీవలే విడుదలైన ఆ దేశ ఆర్థిక విశ్లేషణ నివేదిక కూడా ప్రోత్సాహకరంగా ఇదే విషయాన్ని వెల్లడించిందని ప్రధాని తెలిపారు. అదే మాదిరి తాజాగా భారత తయారీ రంగ వృద్ధి కూడా 10.6 శాతానికి, భారత పారిశ్రామికోత్పత్తి 9.8 శాతానికి చేరిందని ప్రధాని వివరించారు.
మెరుగైన విధానపరమైన నిర్ణయాలు, సమర్థమంతమైన అమలు, రాష్ట్రాలు కూడా అందుకు తగ్గ చర్యలతో ముందుకు సాగుతుండడం వంటి చర్యల కారణంగానే మెరుగైన వృద్ధి కనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. భారత్లో అపారమైన మానవ వనరులు ఉన్నాయనీ.. విశిష్టమైన మేథోసంపద జపాన్ సోంతమని మోడీ అన్నారు. ఈ రెండింటిని సరైన రీతిలో మేళవించుకొంటూ సహకరించుకొని ముందుకు సాగితే అద్భుతాలను సృష్టించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
వరుణ్ తేజ్ స్పేస్ ఫిల్మ్.. ఆగస్టు 15న టైటిల్, విడుదల తేదీ!
‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పేస్ అడ్వంచర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఏం పేరు పెడతారా అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Samayam Telugu | Updated:
Aug 12, 2018, 04:02PM IST
‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పేస్ అడ్వంచర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఏం పేరు పెడతారా అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా టైటిల్తో పాటు, విడుదల తేదీని కూడా ఆగస్టు 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రకటించనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేసింది. అంతరిక్షంలో శాటిలైట్కు దగ్గరగా ఓ వ్యోమగామి పోస్టర్లో కనిపిస్తున్నాడు. బహుశా ఆ వ్యోమగామి వరుణ్ తేజ్ కావచ్చు. ‘ఘాజీ’ సినిమాతో అండర్ వాటర్ థ్రిల్లర్ను చూపించిన దర్శకుడు సంకల్ప్.. ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు.
అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్లను హాలీవుడ్ నిపుణులతో కంపోజ్ చేయించారు. చిత్రీకరణలోనే అంతరిక్షం భావన రావడానికి సున్నా గురుత్వాకర్షణ శక్తి వద్ద షూటింగ్ చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సెట్స్ డిజైన్ చేశారు. వరుణ్ తేజ్తో పాటు ఇతర తారాగణం కూడా జీరో గ్రావిటీలో షూటింగ్ చేయడానికి శిక్షణ కూడా తీసుకున్నారు. ఆదిత్యరావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం కింద సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
కాగా, ఈ చిత్రంలో సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన జ్ఞాన శేఖర్ వీఎస్.. ఈ చిత్రానికి కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు. రాజీవ్ రాజశేఖరన్ సారథ్యంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ చేస్తున్నారు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వాంఖడేలో ధోనీ సిక్స్ గుర్తుందా..?
న్యూజిలాండ్తో సొంతగడ్డపై భారత్ జట్టు తొలి పోరుకి సిద్ధమవుతోంది. ఆదివారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో తొలి
TNN | Updated:
Oct 21, 2017, 03:09PM IST
న్యూజిలాండ్తో సొంతగడ్డపై భారత్ జట్టు తొలి పోరుకి సిద్ధమవుతోంది. ఆదివారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. వాంఖడే మైదానం అనగానే 2011 ప్రపంచకప్ ఫైనల్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కొట్టిన మ్యాచ్ ఫినిష్ సిక్స్ అభిమానులకి గుర్తొస్తుంది. 28 ఏళ్ల తర్వాత టీమిండియాకి వన్డే ప్రపంచకప్ అందించిన ఆ సిక్సర్ భారత్ క్రికెట్ చరిత్రపై చెరగని ముద్ర వేసింది. దీనిని మరోసారి గుర్తు చేస్తూ బీసీసీఐ ఓ వీడియోని అభిమానులతో తాజాగా పంచుకుంది.
మైదానంలో ఏర్పాటు చేసిన నెట్స్లో గత రెండు రోజులుగా ధోనీ హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ‘వాంఖడే స్టేడియంలో మహేంద్రసింగ్ ధోనీ ఎప్పుడు భారీ షాట్ కొట్టినా.. అది 2011 ప్రపంచకప్ ఫైనల్లో కొట్టిన ఫినిష్ సిక్స్ని గుర్తుకు తెస్తుంది’ అని బీసీసీఐ రాసుకొచ్చింది. భారత్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో తొలి ప్రాక్టీస్ వన్డేలో ఓడిన న్యూజిలాండ్.. రెండో వన్డేలో మాత్రం సాధికారికంగా బ్యాటింగ్ చేసి గెలుపొందింది. రాస్ టేలర్, టామ్ లాథమ్ శతకాలతో ఫామ్లో ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాని 4-1తేడాతో ఓడించిన భారత్ కూడా ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. | 2sports
|
Sri Lanka opt to bowl
భారత్పై ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
కీలక ఆటగాడు ఉపుల్ తరంగపై రెండు మ్యాచ్ల నిషేధ వేటు పడటం ప్రస్తుతం లంకేయులను
TNN | Updated:
Jun 8, 2017, 02:48PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత్ ఫుల్ జోష్‌లో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లు రోహిత్, ధావన్‌తో పాటు కోహ్లి, యువరాజ్‌లు ఫామ్ అందుకోవడం.. భారత్‌కి కలిసొచ్చే అంశం. మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన శ్రీలంక ప్రస్తుతం ఆందోళనలో ఉంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు‌లోని కీలక ఆటగాడు ఉపుల్ తరంగపై రెండు మ్యాచ్‌ల నిషేధ వేటు పడటం ప్రస్తుతం లంకేయులను ఆందోళనలోకి నెడుతోంది. పాక్‌తో బరిలోకి దిగిన జట్టు‌లో ఎలాంటి మార్పులు లేకుండానే.. భారత్ బరిలోకి దిగుతోంది.
భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్య, ధోని, కేదార్ జాదవ్, జడేజా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా | 2sports
|
Also Read: శుభవార్త.. రూ.1,950 పడిపోయిన బంగారం..!
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.73.22కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 6 పైసలు క్షీణతతో రూ.66.11కు దిగొచ్చింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.78.83కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 6 పైసలు క్షీణతతో రూ.69.29కు తగ్గింది.
Also Read: కారు కొనేవారికి ఎస్బీఐ రూ.2 లక్షల నుంచి రుణం!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.24 శాతం పెరుగుదలతో 59.10 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.24 శాతం పెరుగుదలతో 53.64కు ఎగసింది. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
యాషెస్ చివరి టెస్టులో ఆసీస్ ఆధిక్యం
ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా తిరుగులేని ప్రదర్శనని ఐదో టెస్టులోనూ కొనసాగిస్తోంది.
TNN | Updated:
Jan 6, 2018, 02:50PM IST
యాషెస్ చివరి టెస్టులో ఆసీస్ ఆధిక్యం
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తిరుగులేని ప్రదర్శనని ఐదో టెస్టులోనూ కొనసాగిస్తోంది. ఉస్మాన్ ఖవాజా (171: 381 బంతుల్లో 18x4, 1x6) భారీ శతకానికి తోడు.. షాన్ మార్ష్ (98 బ్యాటింగ్ : 207 బంతుల్లో 10x4), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (83: 158 బంతుల్లో 5X4), మిచెల్ మార్ష్ (63 బ్యాటింగ్: 87 బంతుల్లో 9x4, 2x6) అర్ధశతకాలు బాదడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 479/4తో మెరుగైన స్థితిలో నిలిచింది. అంతకముందు ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటవడంతో.. ప్రస్తుతం ఆసీస్‌ 133 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. | 2sports
|
Hyderabad, First Published 17, Oct 2018, 8:07 PM IST
Highlights
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ ను స్ట్రాంగ్ గా అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు కొంచెం స్లోగా వెళుతోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ ను స్ట్రాంగ్ గా అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు కొంచెం స్లోగా వెళుతోంది. ఈ వారంలో వచ్చే కలెక్షన్స్ బట్టి సినిమా కమర్షియల్ హిట్ అందుకుంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ రానుంది.
ఇకపోతే మొదటి సారి ఎన్టీఆర్ తో వర్క్ చేసిన త్రివిక్రమ్ తనదైన శైలిలో పొగుడుతూ వస్తున్నారు. సక్సెస్ మీట్ లో తారక్ ను సీనియర్ ఎన్టీఆర్ తో పోల్చిన త్రివిక్రమ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అపజయాల గురించి కూడా మాట్లాడాడు. అయితే ఆయన సినిమాల గురించి ప్రస్తావించలేదు గాని తారక్ నటనను హైలెట్ చేస్తూ మాట్లాడారు.
ఎన్టీఆర్ గత చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ అతను నటనలో ఎప్పుడు ఫెయిలవ్వలేదని ప్రశంసించారు. అదే విధంగా సినిమా రిజల్ట్ లో ఎంత తేడా ఉన్నా డ్యాన్స్ -ఫైట్స్ మరియు కామెడీ లలో తన బెస్ట్ పెర్ఫెమెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడని తెలుపుతూ అరవింద సమేతలో తన నటనతో ఆడియెన్స్ ని థియేటర్స్ వరకు రప్పిస్తున్నట్లు త్రివిక్రమ్ వివరించారు.
Last Updated 17, Oct 2018, 8:07 PM IST | 0business
|
జపాన్ లో లాంచ్ చేయనున్న కోకాకోలా
Coca-Cola
జపాన్: ప్రఖ్యాత శీతల పానీయాల కంపెనీ ”కోకాకోలా” మద్యం వ్యాపారంపై దృష్టి సారించింది. ఈ మార్కెట్ లో వాటా దక్కించుకునేందుకు వీలుగా సరికొత్త డ్రింక్స్ ను మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకు జపాన్ ను వేదికగా ఎంచుకుంది. ఈ ఏడాది అక్టోబర్ లో ఖలెమన్ ఫ్లేవర్ తో కూడిన ఆల్కహాలిక్ సాఫ్ట్ డ్రింక్గను జపాన్ మార్కెట్ లో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఉత్పత్తిని జపాన్ లోని క్యూషూ నగరంలో 2018, మే నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలించామని కోకాకోలా అధికార ప్రతినిధి స్కాట్ లిత్ తెలిపారు.తమ మద్యం ఉత్పత్తుల్లో ఆల్కహాలిక్ శాతం 3 నుంచి 7 శాతం వరకూ ఉంటుందని వెల్లడించారు. ఇతర సాఫ్ట్ డ్రింక్స్ తరహాలో ఓ చిన్న క్యాన్ లో మద్యం లభ్యమవుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ఉత్పత్తులు మిగతా దేశాల మార్కెట్లకు చేరుకోవడానికి మరికొంత సమయం పడుడుతుందని స్కాట్ తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/ | 1entertainment
|
Bank
నోట్ల రద్దువల్ల పనిభారం పెరిగింది !
న్యూఢిల్లీ, డిసెంబరు 10: పెద్దనోట్లరద్దు తర్వాత ఐటిశాఖ నల్లధన స్వాములకు నోటీసులు జారీచేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నోట్లరద్దు తర్వాత తమకు పనిభారం విపరీతంగా పెరిగిందని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని విరుగుడు సూచించాలంటూ రెండు యూనియన్లుప్రధాని నరేంద్రమోడీకి లేఖరాసాయి. అంతేకాకుండా ఇందుకు సంబంధించి సరిపడా సిబ్బందిని నియమించాలని, మౌలికవనరుల సౌక ర్యాలు పెంచాలని సూచించింది. కొన్ని వేలకోట్ల రూపాయల పన్ను ఎగవేతలకు సంబంధించి ప్రతి రిటర్నును పరిశీలించాలంటే పనిభారం, మానసిక వత్తిడి పెరుగుతుందని యూనియన్లు వెల్లడించా యి.
ఆదాయపు పన్ను ఉద్యోగుల సమాఖ్య (ఐటిఇ ఎఫ్) ఆదాయపుపన్ను గజిటెడ్అధికారుల సంఘం (ఐటిజిఒఎ) రెండు యూనియన్లలోను 97శాతం మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది కొరత వల్ల ప్రభుత్వ లక్ష్యాలను పూర్తిస్థాయిలో అమలుచేయలే కోతున్నామని, దిగువస్థాయిలో సిబ్బంది కొరత అత్యధికంగా ఉందని, అధికారుల కేడర్లలో కూడా స్తంభన నెలకొన్నందున పనిభారం అత్యధికం అవు తున్నదని ఇందుకు సంబంధించి తక్షణనియామ కాలు అవసరమని ఐటియూనియన్లు వివరించా యి. పెద్దనోట్ల రద్దు తర్వాత వివిధి కఠినతరమైన కార్యాచరణల వల్ల నల్లధనం, అవినీతిపై ఎక్కువ పోరుచేయాల్సివస్తోంది.
ఇందుకుప్రధానంగా ఆదా యపు పన్నుశాఖదే కీలకపాత్రగా ఉంది. ఈదిశగా లక్ష్యాలు చేరుకోవాలంటే కీలకస్థాయి ఉద్యోగాల్లో భర్తీతోపాటు, మౌలికవనరులనున పెంచాలని, సిబ్బందిని కూడా పెంచి వారిని చైతన్యపరచాల్సి ఉందని కమిటీ ప్రతినిధులు ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. నల్లధనం వెలికితీతకు అను సరించాల్సిన వ్యూహంపై ఈ రెండు యూనియన్లు కొన్ని సూచనలు చేశాయి. ముందు అదనపు కమిషనర్స్థాయిలోనే 30-35శాతం సిబ్బంది ఖాళీ ల కొరత ఉందని, ఐటి డిఫ్యూటీ కమిషనర్, ఐటి జూనియర్ అధికారుల స్థాయిలో మరిన్ని భర్తీ చేయాల్సిఉందని వివరించారు. అస్సెస్సింగ్ అధి కారులస్థాయిలో భారీఖాళీలున్నాయి. ఇ-గవర్నెన్స్ పరంగాచూస్తే ఇంటర్నెట్, ఇంట్రానెట్ కనెక్టివిటీ అత్యంత క్షీణస్థాయిలో ఉన్నదని, వీటి సామర్ధ్యం పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించా రు. ఈ రెండు యూనియన్లకుతోడు ఆదాయపు పన్నుశాఖలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ల పేరిట మరో యూనియన్ ఉంది. ఈ యూనియన్ లోటాప్స్థాయి అధికారులుమాత్రమే పనిచేస్తున్నారు. | 1entertainment
|
సన్నీ అనేది నా పేరు కాదు.. పోర్న్ స్టార్ ఆవేదన!
Highlights
ఈ సిరీస్ ను చూసిన సన్నీలియోన్ కన్నీటి పర్యంతమైందట. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సన్నీ.. ఈ సిరీస్ లో చూపించిన ప్రతి సన్నివేశం నిజమేనని, ప్రతీ కన్నీటి బొట్టు నిజమైందని, తనకు తానే పోర్న్ స్టార్ గా మారానని వెల్లడించింది
అడల్ట్ కంటెంట్ సినిమాలతో పాపులర్ అయిన నటి సన్నీలియోన్ ను బాలీవుడ్ కు తీసుకొచ్చి హీరోయిన్ గా అవకాశాలు ఇప్పించారు. అతి తక్కువ సమయంలో బాలీవుడ్ లో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. పోర్న్ స్టార్ నుండి ఫిలిం హీరోయిన్ గా తన ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది..? పోర్న్ స్టార్ గా ఆమె ఎందుకు మారిందనే..? విషయాల ఆధారంగా 'కరణ్ జిత్ కౌర్.. ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్' అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు.
సన్నీలియోన్ స్వయంగా ఈ సిరీస్ లో నటించడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ఈ సిరీస్ ను చూసిన సన్నీలియోన్ కన్నీటి పర్యంతమైందట. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సన్నీ.. ఈ సిరీస్ లో చూపించిన ప్రతి సన్నివేశం నిజమేనని, ప్రతీ కన్నీటి బొట్టు నిజమైందని, తనకు తానే పోర్న్ స్టార్ గా మారానని వెల్లడించింది.
ఇక సన్నీ అనేది తన పేరు కాదని.. తన అన్నయ్య పేరని.. ఆ పేరుతోనే పోర్న్ స్టార్ గా పాపులర్ అయినట్లు వివరించింది. ఇక ఈ సినిమా టైటిల్ లో కౌర్ అనే పదాన్ని ఉపయోగించడంతో ఆ పదాన్ని వెంటనే.. తొలగించాలని సిక్కుమత పెద్దలు భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
Last Updated 23, Jul 2018, 6:30 PM IST | 0business
|
సుధీర్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మి
Highlights
ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయితే.. వారికి ఆఫ్ స్క్రీన్ లో కూడా లింకులు ఉన్నాయంటూ ప్రచారం జరగడం మామూలే.
ఇప్పటివరకూ ఈ ట్రెండ్ సినిమాల్లో మాత్రమే కనిపించేది. దీన్ని కూడా ఇప్పుడు బుల్లితెర మీదకు తెచ్చేశారు ఓ జంట
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. పార్టిసిపెంట్ సుధీర్ బాబుల మధ్య ఏదేదో ఉందనే.. ఇంకేదో జరిగిపోతోందని అనే మాదిరిగా చాలానే హింట్స్ కనిపిస్తాయి.
ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయితే.. వారికి ఆఫ్ స్క్రీన్ లో కూడా లింకులు ఉన్నాయంటూ ప్రచారం జరగడం మామూలే. ఇప్పటివరకూ ఈ ట్రెండ్ సినిమాల్లో మాత్రమే కనిపించేది. దీన్ని కూడా ఇప్పుడు బుల్లితెర మీదకు తెచ్చేశారు ఓ జంట. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. పార్టిసిపెంట్ సుధీర్ బాబుల మధ్య ఏదేదో ఉందనే.. ఇంకేదో జరిగిపోతోందని అనే మాదిరిగా చాలానే హింట్స్ కనిపిస్తాయి.
అటు స్కిట్స్ లోను.. ఇటు డైలాగ్స్ లోను వీరిద్దరికి లవ్వు అన్న మాదిరిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. నిజంగానే వీరిద్దరూ ప్రేమికులు అని జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు. దీన్ని బేస్ చేసుకుని రీసెంట్ గా ఉగాది సందర్భంగా ప్రసారం చేసిన ఓ కార్యక్రమంలో సుధీర్- రష్మిల పెళ్లి చేసేశారు. సంగీత్ నుంచి పెళ్లి వరకు.. చివరకు ఫస్ట్ నైట్ సన్నివేశాన్ని కూడా చూపించారు. దీంతో వీరిద్దరు రియల్ లైఫ్ లో కూడా మ్యారేజ్ చేసుకోబోతున్నారనే ప్రచారం ఎక్కువ అయింది. ఈ అంశంపై ఇప్పుడు రష్మి క్లారిటీ ఇచ్చేసింది. అది కేవలం టీవీ ఎపిసోడ్ లో స్పైస్ నింపడానికి మాత్రమే చేశామని చెప్పింది రష్మి గౌతమ్.
రష్మి-సుధీర్ ల మధ్య ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏమీ ఉండదని చెబుతున్నారు తోటి వారంతా. రేటింగుల కోసం రియల్ లైఫ్స్ ను బేస్ చేసుకుని ఆన్ స్క్రీన్ పై తెగ డ్రామాలు ఆడేసే ట్రెండ్ తెలుగుతెరపై కూడా మొదలు అయిపోయిందన్న మాట.
Last Updated 26, Mar 2018, 12:01 AM IST | 0business
|
Aug 29,2015
దేశమంతటా ఎల్ఈడీ వీధిదీపాలే..
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో దేశంలోని వీధి దీపాలన్నింటినీ 'లైట్ ఎమిట్టింగ్ డియోడ్' (ఎల్ఈడీ) స్ట్రీట్ లైట్లుగా మార్చనున్నట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మంత్రి ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేసినట్లు విద్యుత్తు శాఖ కార్యాలయం తెలిపింది. దీని వల్ల విద్యుత్తు ఆదా అవడంతో పాటు మెరుగైన వెలుతురు లభిస్తుందని, పర్యావారణానికి కూడా మేలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. విద్యుత్తును సమర్థవంతంగా గరిష్ఠ స్థాయిలో వాడుకొనే విషయం కర్ణాటక ప్రభుత్వం కేంద్రంతో కలిసి పనిచేయాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. రానున్న అయిదేళ్లలో 1,75,000 మె.వా. విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో దాదాపు 1,00,000 మె.వా. సౌర విద్యుత్తు సాధనకు గాను ప్రభుత్వం ఇప్పటికే 'సోలార్ మిషన్'ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Dileep out of prison to perform father’s death anniversary rites
దిలీప్ కు జైలు నుంచి విముక్తి: రెండు గంటలే!
నటిని కిడ్నాప్ చేయించి వేధింపులకు గురించి చేసిన కేసులో నిందితుడిగా దాదాపు రెండు నెలల కిందట అరెస్టు అయిన
TNN | Updated:
Sep 7, 2017, 08:11AM IST
నటిని కిడ్నాప్ చేయించి వేధింపులకు గురించి చేసిన కేసులో నిందితుడిగా దాదాపు రెండు నెలల కిందట అరెస్టు అయిన మలయాళీ స్టార్ హీరో దిలీప్ జైలు నుంచి బయటకు వచ్చి, ఆ వెంటనే మళ్లీ జైల్లోకి వెళ్లిపోయాడు. ఇతడికి కోర్టు రెండు గంటలసేపు బెయిల్ ను ఇచ్చింది. అయితే ఆ రెండు గంటలపాటు కూడా దిలీప్ పోలీసుల పర్యవేక్షణలోనే ఉండాల్సి వచ్చింది. దిలీప్ పెట్టుకున్న విన్నపాన్ని అనుసరించి కోర్టు ఈ అనుమతిని ఇచ్చింది. దీంతో బుధవారం దిలీప్ ఆలువా జైలు నుంచి బయటకు వచ్చాడు.
తండ్రి సంవత్సరీకం కోసం, దిలీప్ జైలు నుంచి బయటకు రావడానికి కోర్టు అనుమతిని ఇచ్చింది. ప్రతియేటా తండ్రి వర్ధంతి రోజున పూజలు చేయడం తమ ఆనవాయితీ అని దిలీప్ కుటుంబం కోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం దిలీప్ కు రెండు గంటలసేపు సమయం ఇచ్చింది. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు పోలీసులు దిలీప్ ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. | 0business
|
బ్రేకింగ్ : జైలు శిక్ష పడడంతో డిప్రెషన్ తో మాత్రలు మింగిన సల్మాన్
Highlights
బ్రేకింగ్ : జైలు శిక్ష పడడంతో డిప్రెషన్ తో మాత్రలు మింగిన సల్మాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో 20 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడింది. జోధ్పూర్ కోర్టు అతడికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. తనను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు వెలువడగానే సల్మాన్ ఖాన్ తీవ్రమైన భావోద్వేగానికి గురైఏడ్చేశారు. కోర్టు తీర్పు సమయంలో పక్కనే ఉన్న సల్మాన్ సోదరీమణులు అర్పిత, అల్విరా ఖాన్ ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు.
తనను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు వెలువడగానే సల్మాన్ తీవ్రమైన డిప్రెషన్కు గురయ్యారు... ఏడ్చేశారు. దీంతో పక్కనే ఉన్న ఆయన చెళ్లెల్లు యాంటీ డిప్రెసెంట్లు అతడికి అందించారు. కోర్టు తీర్పు అనంతరం సల్మాన్తో పాటు ఆయన చెళ్లెల్లు కూడా కన్నీరుమున్నీరు అయ్యారు.
కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో సల్మాన్ ఖాన్ను పోలీసులు జోధ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పు వెలువడటానికి ముందే ఆయన కోసం జైలు అధికారులు ప్రత్యేకంగా గది కేటాయించి శుభ్రం చేయించారు.
సల్మాన్ ఖాన్ గురువారం రాత్రి జోధ్పూర్ జైల్లోనే గడపనున్నారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటీషన్ శుక్రవారం ఉదయం విచారణకు రానుంది. జోధ్పూర్ కోర్టు తీర్పును సల్మాన్ ఖాన్ రాజస్థాన్ హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సమాచారం.
ఈ కేసులో సల్మాన్ ఖాన్ గతంలో 1998, 2006, 2007లో మొత్తం 18 రోజుల పాటు జైల్లో గడిపాడు. కాగా, శుక్రవారం జరిగే విచారణలో సల్మాన్ ఖాన్కు బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్ కంకణి గ్రామంలో సంచరిస్తున్న రెండు కృష్ణ జింకలను తుపాకీతో కాల్చి చంపినట్లు ఆరోపణలు రుజువయ్యాయి. గ్రామంలోని బిష్నోయ్ వర్గానికి చెందిన వారు కృష్ణజింకను దైవంగా భావిస్తారు. అందుకే వారు దీన్ని సీరియస్గా తీసుకోవడంతో విషయం ఇక్కడి వరకు వచ్చింది. ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలమ్, టబును కోర్టు నిర్దోషులుగా తేల్చింది. | 0business
|
Hyd Internet 74 Views dhoni
Dhoni
చెన్నై: భారత్-అసీస్ మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ధనాధన్ ధోనీ(79)హార్థిక్ పాండ్యా(83)ఆర్థశతకాలతో రాణించడంతో భారీ స్కోర్ సాధించింది. టాప్
ఆర్డర్ ఘోర వైఫల్యం చెందిన ఈ మ్యాచ్లో ధోని, పాండ్యా సెంచరీ భాగస్వామ్యంతో పటిష్ట స్థితిలో
నిలిచింది. చివర్లో భువనేశ్వర్ కుమార్(32)బ్యాట్తో రెచ్చిపోవడంతో భారత్ నిర్ణీత 50ఓవర్లలో ఏడు
వికెట్ల నష్టానికి 281పరుగులు చేసింది. దీంతో అసీస్ విజయం లక్ష్యం 282 పరుగులుగా నిర్ధేశించింది. | 2sports
|
బిగ్ బాస్ భామ నడుము అందాలు.. వైరల్ అవుతున్న ఫొటోస్!
First Published 1, Sep 2019, 2:55 PM IST
గత ఏడాది నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో నందిని రాయ్ కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ నందినికి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కొన్ని చిన్న చిత్రాల్లో నందిని రాయ్ నటించింది.
(Photo Courtesy Instagram)నందిని రాయికి బిగ్ బాస్ షోతో గుర్తింపు లభించింది. నందినికి ఇప్పటివరకు నటిగా ఆశించిన గుర్తింపు లభించలేదు.
(Photo Courtesy Instagram) 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళీ భాషల్లో నటించింది.
(Photo Courtesy Instagram)నందిని రాయ్ సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది.
(Photo Courtesy Instagram)నందిని రాయ్ నటికి కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది. అందుకే ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
(Photo Courtesy Instagram)వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరతీసింది.
(Photo Courtesy Instagram)మోడ్రన్ లుక్ అయినా, ట్రెడిషనల్ లుక్ అయినా నందిని రాయ్ ఆకట్టుకునే అందంతో కనిపిస్తుండడం విశేషం.
(Photo Courtesy Instagram)తాజాగా నందిని రాయ్ చీరకట్టులో నడుము అందాలు ఆరబోస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
(Photo Courtesy Instagram) నందిని రాయ్ ఫోటో గ్యాలరీ
(Photo Courtesy Instagram) నందిని రాయ్ ఫోటో గ్యాలరీ
(Photo Courtesy Instagram) నందిని రాయ్ ఫోటో గ్యాలరీ
(Photo Courtesy Instagram) నందిని రాయ్ ఫోటో గ్యాలరీ
(Photo Courtesy Instagram) నందిని రాయ్ ఫోటో గ్యాలరీ
(Photo Courtesy Instagram) నందిని రాయ్ ఫోటో గ్యాలరీ
(Photo Courtesy Instagram) నందిని రాయ్ ఫోటో గ్యాలరీ
(Photo Courtesy Instagram) నందిని రాయ్ ఫోటో గ్యాలరీ
Recent Stories | 0business
|
Suresh 222 Views
టి20: ఫైనల్స్కు దూసుకెళ్లిన వెస్టిండీస్
టి20 ప్రపంచ కప్ ఫైనల్స్లోకి వెస్టిండీస్ దూసుకెళ్లింది.. గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో వెస్టీండీస్ జట్టు భారత్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యానికి ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఆదివారం జరిగే ఫైనల్స్లో ఇంగాండ్తో తలపడనుంది. | 2sports
|
Hyderabad, First Published 17, Oct 2018, 2:31 PM IST
Highlights
మాస్ హీరో విశాల్ కాన్సెప్ట్ ఉన్న కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నా.. టైమ్ బాగోకపోవడంతో సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. సోలో రిలీజ్ దొరకపోవడంతో పోటీ మధ్య సినిమాలను రిలీజ్ చేయడం ఒక కారణమని చెప్పొచ్చు. దాదాపు అతడి సినిమాలన్నీ కూడా పోటీ వాతావరణంలోనే విడుదల అవుతుంటాయి.
మాస్ హీరో విశాల్ కాన్సెప్ట్ ఉన్న కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నా.. టైమ్ బాగోకపోవడంతో సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. సోలో రిలీజ్ దొరకపోవడంతో పోటీ మధ్య సినిమాలను రిలీజ్ చేయడం ఒక కారణమని చెప్పొచ్చు.
దాదాపు అతడి సినిమాలన్నీ కూడా పోటీ వాతావరణంలోనే విడుదల అవుతుంటాయి. దీంతో ఆ ప్రభావం విశాల్ సినిమాపై బాగా పడుతోంది. విశాల్ నటించిన తాజా చిత్రం 'పందెంకోడి2' రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అటు తమిళంలో ఇటు తెలుగులో సినిమాకి గట్టి పోటీ ఎదురవుతోంది.
తమిళంలో ధనుష్ 'వడా చెన్నై'కి విపరీతమైన బజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. కానీ విశాల్ సినిమాకి మాత్రం కనీసపు బుకింగ్స్ లేవు. మరోపక్క తెలుగులో 'అరవింద సమేత' థియేటర్లలో ఉంది. హలో గురు ప్రేమకోసమే సినిమా కోసం దిల్ రాజు ఎక్కువ థియేటర్లు ఆక్రమించారు.
ఈ క్రమంలో విడుదలవుతున్న విశాల్ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లలో మాత్రం దెబ్బ పడే అవకాశం ఉంది. తెలుగులో ఈ మధ్యకాలంలో సరైన మాస్ సినిమా రాకపోవడంతో బి,సి సెంటర్స్ లో ఈ సినిమాకి మంచి ఆదరణ ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి!
Last Updated 17, Oct 2018, 2:31 PM IST | 0business
|
అందంతో రెచ్చగొడుతున్న ఈషా
Highlights
అందంతో రెచ్చ గొడుతున్న ఈషా
ప్రతి సినిమా హిట్ అవ్వకున్నా నటించిన ప్రతి సినిమాలో పాత్రకు న్యాయం చేస్తే స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ రేంజ్ లోనే ఇమేజ్ వస్తుంది. ఆ రేంజ్ లో గుర్తింపు రావాలంటే కథలో పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలి. ఆ రేంజ్ లో ఆలోచించే హీరోయిన్స్ లలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది. ఆమెనే ఈషా రెబ్బా.
ఈషా తెలుగులో ఆఫర్స్ ని చాలానే అందుకుంటోంది. అంతకు ముందు ఆ తరువాత అనే సినిమా తరువాత వెండి తెరకు పరిచయమై కొన్ని డిఫెరెంట్ సినిమాల్లో అవకాశాలను అందుకుంది. ఆ సినిమాలో ఈషా చేసిన పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది. ఇక త్వరలో ఆమె చేసిన అ! సినిమా కూడా ఈ వారం రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో కూడా అమ్మడు స్పెషల్ క్యారెక్టర్ చేసింది. ఇకపోతే ఎప్పుడు ఎక్కువగా హాట్ గా కనిపించని ఈషా చాలా హాట్ కనిపించింది.
ఓ రకమైన ఫ్యాషన్ డ్రెస్ లో తన డస్కీ అందాలతో ఈషా రెబ్బ దెబ్బ కొట్టింది. లెగ్స్ అందాలను ఆరబోయడంలో అమ్మడు చాలా ప్రత్యేకమని మొదటి సారి ఘాటైన టైటిల్స్ ను సొంతం చేసుకుంది. దానికి తోడు ఆ సెక్సీ స్మైల్ కూడా బలే సెట్ అయ్యింది. మొత్తానికి ఈషా కూడా హాట్ లుక్స్ తో రచ్చ చేస్తుందని స్వీట్ గా చెప్పేసింది. ఇక ఈషా నటించిన అ! సినిమా 16న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని నాని నిర్మిస్తున్నాడు. | 0business
|
ఎస్బీఐ కొత్త ఏడాది కానుక
- రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు
ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ గ్రహీతలకు కొత్త ఏడాది కానుకను ప్రకటించింది. ప్రస్తుత ఖాతాదారులకు 30 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించినట్టు సోమవారం ఆ బ్యాంకు తెలిపింది. ఈ నూతన వడ్డీ రేటు జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. కొత్త రుణ ఖాతాదారులకు కూడా వచ్చే మార్చి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు తెలిపింది. ఇతర బ్యాంకు నుంచి ఎస్బీఐకి రుణ బదిలీ చేసుకున్న వారికి కూడా దీన్ని వర్తింపజేస్తుంది. 2016 ఏప్రిల్కు ముందు బేస్ రేటు ఆధారంగా రుణాలు తీసుకున్న వారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది. దీంతో గృహ, విద్యా రుణాలు తీసుకున్న వారికి కొంత ఉపశమనం లభించనుంది.
అదే విధంగా కొత్త ఖాతాదారులకు మార్జినల్ కాస్ట్ బేసుడ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆఫర్ కొనసాగుతుంది. తాజా నిర్ణయంతో 80 లక్షల మంది ఖాతాదారులు లబ్ధి పొందనున్నారని ఎస్బిఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ మేనేజర్ పికె గుప్తా పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకు బేస్ రేటు 8.65 శాతంగా ఉంది. తగ్గించిన కొత్త బేస్ రేటు తమ ఖాతాదారులకు నూతన ఏడాది గిఫ్టుగా అందిస్తున్నామన్నారు. చాలా మంది ఖాతాదారులు తమ రుణ ఖాతాలను బేస్ రేటుకు అనుసంధానం చేసుకోవడం ద్వారా ఈ లబ్ధి పొందవచ్చన్నారు. రిజర్వు బ్యాంకు పాలసీలో భాగంగా ఇప్పటికే తగ్గించిన వడ్డీ రేట్లను ఖాతాదారులకు బదిలీ చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చాలా వరకు ఎంసిఎల్ఆర్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఎస్బీఐ బాటలో మరిన్ని బ్యాంకులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Suresh 98 Views bse
ఐదోరోజూ నష్టాలే
ముంబయి,ఆగస్టు 12: దేశీయ మార్కెట్సూచీలు వరుసగా ఐదోరోజు కూడా నష్టాల్లోనేముగిసాయి. గడచిన ఏడాదిన్నరకాలంలో మార్కెట్లు అత్యంత అధ్వాన్నంగా పనితీరుచూపించిన వారంగా కూడా చెప్పుకోవచ్చు. భారతీయ స్టేట్బ్యాంకు ఆర్ధికఫలితాలునిరాశకలిగించడం, ఉత్తరకొరియా ఉద్రిక్తతలతో మార్కెట్లు కొంతమేర సెంటిమెంట్ నీరసించిందని చెప్పాలి.
యూరోప్తో సహా ఆసియా మార్కెట్లు అన్నీ కూడా అమ్మకాలతో కుదేలయ్యాయి. దేశీయంగా కూడా సెంటిమెంట్కు దెబ్బతగలడంతో మార్కెట్లు భారీగా పతనం చెందాయి. ట్రేడింగ్ముగిసేనాటికి సెన్సెక్స్ 318 పాయింట్లు పతనం అయి 31,213 వద్ద నిలిస్తే నిఫ్టీ సూచీ 109 పాయింట్లు క్షీణించి 9711వద్ద ముగి సింది. ఉత్తరకొరియా అమెరికామధ్య కమ్ముకుం టున్న యుద్ధమేఘాలతో ప్రపంచ వ్యాప్తంగా అమ్మ కాలు జోరందుకున్నట్లు నిపుణులు చెప్పారు. కాగా ఇంట్రాడేలో సాంకేతిక నిపుణులు కీలకంగా భావించే 9700 స్థాయిని నిఫ్టీ కోల్పోవడం ప్రస్తావించదగ్గ అంశం. ఎన్ఎస్ఇలో అన్ని రంగాలు డీలాపడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి.
పిఎస్యు బ్యాంక్సూచీ ఐదుశాతం దిగజారింది. ఇదేబాటలో మెటల్ 3.4శాతం, ఆటో 14శాతంచొప్పున పతనం అయ్యాయి. నిఫ్టీ దిగ్గజాల్లో హిందాల్కో, వేదాంత, స్టేట్బ్యాంకు, బ్ో,బ్యాంక్ ఆఫ బరోడా, ఎంఅండ్ఎం, జీ, సన్ఫార్మా, ఒఎన్జిసి, రిల్ సంస్థలు 2.5 నుంచి 6.7శాతంమధ్య పతనం అయ్యాయి. అమ్మకాల తీవ్రత ఏస్థాయిలో ఉందో ఇట్టే అవగతం అవుతు న్నది. డాక్టర్ రెడ్డిస్, అరబిందో, గెయిల్, బిపిసిఎల్, ఎస్బ్యాంకు, ఇన్ఫోసిస్, యాక్సిస్, విప్రో, అల్రాటెక్, 0.5నుంచి నాలుగుశాతం మధ్య బలపడ్డాయి. మార్కెట్ల బాటలో చిన్నర్లుే డీలాపడ్డాయి. బిఎస్ఇలోడ్రేడ్ అయిన మొత్తం ర్లేలో 1549 న్టపోతే 979 లాభపడ్డాయి. ఎఫ్ఐఐల అమ్మకాలుకూడా నగదువిభాగంలో ముందు రోజు రూ.841కోట్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్న విదేశీఇన్వెస్టర్లు గురువారం కూడా రూ.1171 కోట్లకుపైగా స్టాక్స్ విక్రయించారు. బుధ వారం రూ.553కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టిన దేశీయ ఫండ్స్సంస్థలు గురువారం రూ.872 కోట్ల విలువైన స్టాక్స్ను కొనుగోలుచేశారు. | 1entertainment
|
Vaani Pushpa 138 Views bhushanpower , NCLT
JSW
న్యూఢిల్లీ: భూషణ్పవర్ అండ్ స్టీల్స్ కొనుగోలుకు జెఎస్డబ్ల్యు స్టీల్ప్రతిపాదించిన 19,700 కోట్ల బిడ్కు ఎన్సిఎల్టి ప్రిన్సిపల్ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. 138 పేజీల తీర్పులో ఈ దివాలాపరిష్కార ప్రణాళికను ఆమోదించినట్లు వెల్లడించింది. రుణదాతల కమిటీ, దివాలా వృత్తినిపుణులు ఇపుడు ఈ సంస్థకు పర్యవేక్షఖ ఏజెన్సీగా వ్యవహరిస్తారు. దివాలా వృత్తినిపుణులు కార్పొరేట్ దివాలా పరిష్కర సమయంలో ఆర్జించిన లాభాలను రుణదాతలకు సమంగా పంపిణీ చేస్తారు. ఎన్సిఎల్ఎటి తీర్పుకు అనుగుణంగా ఉంటుందని అంచనా. ఎస్సార్ స్టీల్కేసులో ఇదేవిధంగా వ్యవహరించారు. జెఎస్డబ్ల్యుస్టీల్ తమ ప్రకటనలో తాము తీర్పును అధ్యయనం చేస్తున్నామని తాము వెంటనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. ఇప్పటికే అకేక నేరదర్యాప్తు సంస్థలు క్రిమినల్ చర్యలకు సిద్ధం అవుతున్నాయి, రుణబకాయిలపై కేసులుసైతం నమోదయ్యాయి. చట్టపరంగా ఇవేమీ జెఎస్డబ్ల్యు దివాలా ప్రక్రియకు అడ్డంకి కాబోవని చెపుతున్నారు.
భూషణ్ పవర్ రూ.50వేల కోట్లు బ్యాంకర్ల కూటమికి బాకీపడింది. పంజాబ్నేషనల్బ్యాంకు ఈ కూటమి లీడర్గా ఉంది. మొత్తం 12 సమస్యాత్మక ఖాతాలు బ్యాంకులు గుర్తించాయి. వీటన్నింటినీ ఆర్బిఐ ఎన్సిఎల్టికి బదలాయించుకోవాలని ఆదేశించింది. ఇక భూషణ్పవర్ దివాలా ప్రక్రియలో సంస్థ తమకు 47,204 కోట్లు రుణదాతలకు బకాయిలున్నట్లు అంగీకరించింది. నిర్వహణ రుణదాతలు సైతం తమకు 730 కోట్లువరకూ ఉన్నాయని అంగీకరించారు. జెఎస్డబుల్య తొలుత 11 వేల కోట్లు గడచిన ఫిబ్రవరినెలలో ఆఫర్ ఇచ్చింది. ఆ తర్వాత 18వేల కోట్లకు మరో ఆఫర్ను జులై 26వ తేదీ ప్రకటించింది. మూడోసారి ఆగస్టు 13వ తేదీ గత ఏడాదిన మొత్తం 19,700 కోట్లకు ఆఫర్ ఇచ్చింది. ఇదే సంస్థ కొనుగోలుకు టాటాస్టీల్ వేసిన 17 వేల కోట్ల బిడ్లో ఎలాంటి మార్పులులేవు. భూషణ్పవర్ 47,204 కోట్లలో కేవలం 19,350 కోట్లు మాత్రమే రుణాలరికవరీ ఉంటుంది. కేవలం41శాతం మాత్రమే రికవరీ అవుతుంది. నిర్వహణ రుణదాతలకు సైతం 350 కోట్లు చెల్లిస్తారు. అంటే బకాయిల్లో 48శాతం చెల్లిపులకు కేటాయింపులున్నట్లు అంచనా. ఈ దివాలాప్రక్రియ తీర్పుకాపీని సాధించుకోవాలంటే లక్ష రూపాయలు చెల్లించాలని ఎన్సిఎల్టి జరిమానావేసింది. ఈమొత్తాన్ని సంజ§్ు సింగాల్, ఆర్తి సింగాల్లు సంబంధిత అధికారులకు స్వయంగా కలిసి చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
Suresh 247 Views
సిడ్నీ: తన దూకుడుకు గురించి కీలక విషయాన్ని భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బహిర్గతం పర్చాడు.కాగా అదేంటంటే దూకుడుగా ఉండటమన్నది తన రక్తంలోనే ఉందని పేర్కొన్నాడు ఈ స్టార్ బ్యాట్స్మెన్.తన కుటుంబం నుంచే ఈ దూకుడును నేర్చుకున్నట్లు వెల్లడించాడు.మా నాన్నది సింహరాశి,అన్నింటికీ పోట్లాడేవాడు,తన మీద తనకు నమ్మకం ఎక్కువ,అలా మా కుటుంభం నుంచి నాకు కొంచెం దూకుడు అలవడిందంటూ పైగా నేను పెరిగింది ఢిల్లీలో ఈ వ్యవస్థలో నెగ్గుకు రావాలంటే పోరాడాల్సిందే.అలా పోరాడినపుడు మనం మానసికంగా బలవంతులమవుతాం అని కోహ్లీ వివరించాడు.అంతేగాక మన చుట్టూ ఏం జరుగుతుందో అని ఎక్కువ ఆలోచించకుండా మన పని మీద మనం దృష్టిపెట్టాలి.అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినపుడు కేవలం 11 మందిలో ఒకడిగా ఉండాలనుకోలేదు,ప్రత్యర్థి జట్టంతా ముందు నా వికెట్ తీయాలని కోరుకోవాలనుకున్నా అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో మెరుగుపడటానికి తనకు సచిన్ స్పూర్తి నిచ్చాడని,అతను భారత జట్టు తరపున చేసిందంతా తానూ చేయాలనుకున్నానని కోహ్లీ పేర్కొన్నాడు.నా బ్యాటింగ్లో లోపాలుంటే సచిన్ నేరుగా వచ్చి వాటిని సర్దుకోమని చెప్పేవాడు,అతని స్థాయి ఆటగాడు ఇలా ఒక జూనియర్ దగ్గరకు వచ్చి పదే పదే వచ్చి చెప్పడం అరుదు,ఆ ప్రోత్సాహమే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అని కోహ్లీ వెల్లడించాడు. | 2sports
|
Cairn
కెయిర్న్ ఎనర్జీ పన్ను బకాయిపై ‘ఐటి నజర్
న్యూఢిల్లీ, జూన్ 20: కెయిర్న్ ఎనర్జీ పిఎల్సి తమకు చెల్లించాల్సిన పన్ను బకాయి 10,247 కోట్ల రూపాయలు రాబట్టేందుకు ఆదా యపు పన్నుశాఖ కసరత్తులు షురూచేసింది. బ్రిటిష్ఆయిల్ కంపె నీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్యానెల్ముందు సవాల్చేయడంలో విఫలం కావడంతో ఐటిశాఖ ప్రిన్సిపల్ మొత్తం, వడ్డీతోసహా రాబ ట్టేందుకు యోచిస్తోంది. కెయిర్న్ ఇండియాలో మిగిలి ఉన్న వాటా ను కూడా తీసుకోవడం, 104 మిలియన్ల డాలర్ల డివిడెండ్ తీసు కోవడం వంటి వాటిపై మొత్తం 1500 కోట్ల పన్ను రిఫండ్ కూడా ఉంది. గత వారం కెయిర్న్ ఎనర్జీ దాఖలు చేసిన అభ్యర్ధనను అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్యానెల్ అనుమతించకపోవడంతో ఐటిశాఖ బకాయిలు రాబట్టేందుకు కసరత్తులు ప్రారంభించింది. కెయిర్న్ ఎనర్జీలో ఉన్న 9.8శాతం మిగిలి ఉన్న వాటాలను కూడా టేకోవర్ చేసేందుకు ముందుకువచ్చింది. కెయిర్న్ ఎనర్జీ కూడా ఐటిశాఖ కార్యాచరణను ధృవీకరించింది. గడచిన 18వ తేదీ ఐటి శాఖ వేదాంత ఇండియాకు మొత్తం బకాయిలు చెల్లించాలని ఆదే శించింది.
కెయిర్న్ వేదాంత ఇండియా లిమిటెడ్ నుంచి మొత్తం 104 మిలియన్ డాలర్లుగా ఉంది. వాఇలో 53 మిలియన్ డాలర్ల డివిడెండ్ కూడా ఉంది. మరో డివిడెండ్ మొత్తం 51 మిలియన్ డాలర్లరూపంలో ఉంది. కెయిర్న్ఇండియా వేదాంత ఇండియా లిమిటెడ్ల విలీనం ఫలితంగా ఈ డివిడెండ్ వచ్చినట్లు ఐటిశాఖ భావిస్తోంది. భారత్బ్రిటన్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం పరిధి లో పూర్తిగా ఈ బకాయిలు చెల్లవని కెయిర్న్ వాదిస్తోంది. 2014 లోనే తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో ఐటిశాఖ అనువర్తన పన్నువిధానం అంటే పాత పన్నులతో సహా రాబట్టేం దుకు వీలుందని వాదిస్తే రెండుదేశాలమధ్య జరిగిన ఒప్పందం పరిధిలోకి ఐటిశాఖ కార్యాచరణ రాదని కెయిర్న్ వాదిస్తోంది. పాతకాలం నాటిపన్ను వివాదానికి సంబంధించి కంపెనీ తమకు మిగిలి ఉన్న వాటాను కూడా క్లెయించేస్తోంది.
కెయిర్న్ ఇండియా లో మిగిలి ఉన్న వాటాలను ఐటిశాఖ అటాచ్మెంట్ చేసింది. షూరుగా 100కోట్ల డాలర్లుగా ఉంటాయని అంచనా. వాస్తవానికి అసలు బకాయితోపాటు వడ్డీతో సహాకెయిర్న్ఎనర్జీ రూ.30,700 లుగా ఉంటుందని అంచనావేసి మొత్తం వసూలుకు నోటీసులు జారీచేసింది. వడ్డీ, జరిమానాలరూపంలో అసలుకంటే రెండురెట్లుబకాయి పెరిగిందని అంచనా. అసలు పన్ను డిమాండ్ 10,247 కోట్లు మాత్రమే ఉంటే జరిమానాలు, వడ్డీ మొత్తం కలుపుకుంటే చేంతాడంతగా మారింది. పదేళ్లకుపైబడిన కాలంలో కెయిర్న్ఎనర్జీ అంతర్గతవాటాల విక్రయంపై పన్నుబకాయి వివాదం నడుస్తోంది. కెయిర్న్ ఇండియా స్థానికంగా ఉన్న కెయిర్న్ యుకె హోల్డింగ్స్ ను కొనుగోలుచేసి యుకె సంస్థకు తిరిగి 69శాతం వాటాను ఇవ్వడంపై నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఐటిశాఖ ఆరోపి స్తోంది.
స్థానిక ఆస్తులను బదలాయించడంద్వారా వీటి విలువలు భారీగా ఉన్నాయని. రాజస్థాన్, కెజిబేసిన్లో చమురు, సహజ వాయు క్షేత్రాల్లో అపారమైన నిల్వలున్నందున విలువలు ఎక్కు వని ఐటిశాఖ చెపుతోంది. ఇది కేవలం అంతర్గత బదిలీ అయి నందున భారతీయపన్నుల విధానం పరిధిలోకి రానేరాదని కెయి ర్న్ ఎనర్జీ వాదించింది. ఐటిశాఖ జారీచేసిన పాతతేదీ నోటీసుల నుంచి 18,800కోట్లుగాఉంది. వాస్తవపన్ను డిమాండ్ 10,247 కోట్లు కలుపుకుంటే 29,045కోట్లుగా ఉంది. మొత్తం జరిమానా లు అన్నీ కలుపుకుంటే 30,700 కోట్లుగా ఉందని అంచనా. ఒక వేళ కంపెనీ బకాయిలు చెల్లించలేని పక్షంలో ఈమొత్తం 40,947 కోట్లకు చేరుతుందని ఐటిశాఖ వాదిస్తోంది.
కంపెనీ ఇప్పటికీ పన్నులు చెల్లించేందుకు విముఖంగా ఉంది. 2006లో కంపెనీ పునర్వ్యవస్థీకరణ సమయంలో చట్టపరంగా ఏ సంస్థ కూడా తమ విధానం పన్నుల పరిధిలోకి వస్తుందని చెప్పలేదని వాది స్తోంది. భారతీయ ప్రభుత్వం, కెయిర్న్ మధ్య నడుస్తున్న ఈ పన్నువిధానం 2014నుంచి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్యానెల్ వద్ద నడుస్తోంది. తాజాగా ప్యానెల్ అనుమతించకపోవ డంతో ఇక బకాయిల వసూళ్లపై భారత్ ఐటిశాఖ దృష్టిపెట్టింది. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IND vs AUS 4th Test: ఆసీస్ గడ్డపై పుజారా ‘1,000’ రికార్డ్..!
ఆస్ట్రేలియా గడ్డపై 1947-48లో జరిగిన టెస్టు సిరీస్లో విజయ్ హజారే 1,192 బంతులతో ఈ రికార్డుని నెలకొల్పగా.. ఆ తర్వాత 1977-78లో సునీల్ గవాస్కర్ 1,032 బంతులతో అతని సరసన చేరాడు.
Samayam Telugu | Updated:
Jan 3, 2019, 12:21PM IST
IND vs AUS 4th Test: ఆసీస్ గడ్డపై పుజారా ‘1,000’ రికార్డ్..!
ఆస్ట్రేలియా గడ్డపై భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా అరుదైన రికార్డ్లో చోటు దక్కించుకున్నాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో శతకంతో చెలరేగిన చతేశ్వర్ పుజారా (126: 240 బంతుల్లో 16x4).. కంగారూల గడ్డపై ఒక టెస్టు సిరీస్లోనే 1,000 బంతులు ఎదుర్కొన్న ఐదో భారత క్రికెటర్గా దిగ్గజాల సరసన నిలిచాడు. ఇప్పటి వరకూ సునీల్ గవాస్కర్, విజయ్ హజారే, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. | 2sports
|
సీడీఎస్ఎల్ ఐపీవో మెగాహిట్!
- పబ్లిక్ ఇష్యూకు 164 రెేట్ల స్పందన
న్యూఢిల్లీ: 'సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్' (సీడీఎస్ఎల్) పబ్లిక్ ఇష్యూ మెగా హిట్టైంది. బుధవారం ఐపీవో గడువు ముగిసే సమయానికి సంస్థ ఐపీవోకు దాదాపు 169 రెేట్ల మేర స్పందన లభించింది. దాదాపు రూ.524 కోట్ల నిధుల సమీకరణ నిమిత్తం సీడీఎస్ఎల్ సంస్థ రూ.145-149ల ధరల శ్రేణితో ఐపీవోకు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 2.48 కోట్ల వాటాలను సంస్థ పబ్లిక్ ఇష్యూకు ఉంచగా.. ఇష్యూ ముగిసే సమయానికి దాదాపు 4,20,60,29,600 బిడ్లు లభించినట్టుగా సమాచారం. సీడీఎస్ఎల్ సంస్థ ఇప్పటికే 15 మంది యాంకర్ ఇన్వెష్టర్ల ద్వారా దాదాపు రూ.154.07 కోట్ల మేర నిధులను సమీకరించినట్టుగా సమాచారం. బీఎస్ఈ సంస్థ ప్రోద్భలంతో ఉనికిలోకి వచ్చిన సీడీఎస్ఎల్ సంస్థ ఆ తరువాత స్వతంత్ర సెంట్రల్ సెక్యూరిటీ డిపాజిటరీగా ఎదిగింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదుకు వచ్చిన మొదటి సెంట్రల్ డిపాజిటరీ సీడీఎస్ఎల్యే కావడం విశేషం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
జర్మనీ హ్యాట్రిక్ " గోల్స్ " వీరులు (వీడియో)
Highlights
నరాలు తెగె ఉత్కంఠ
నరాలు తెగె ఉత్కంఠ మధ్య సాగే ఫిఫా వరల్డ్ కప్లో ఒక గోల్ కూడా జట్టు విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. ఆ ఒక్క గోల్ కొట్టడానికి జట్టులోని ప్రతి ఆటగాడు..ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడు.. అలాగే ప్రత్యర్థి జట్టు కూడా అందుకు ఛాన్స్ ఇవ్వదు.. ఇలాంటి చోటు ఒక్క ఆటగాడే మూడు గోల్స్ (హ్యాట్రిక్గోల్స్) కొడితే.. ఈ అరుదైన ఫీట్ను ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో చాలా మంది అందుకున్నారు. అలాంటి వాటిలో జర్మనీకి చెందిన వారిని ఒకసారి పరిశీలిస్తే.. మొత్తం ఏడు సార్లు ఆ దేశం ఈ ఘనతను అందుకుంది..
జర్మనీ ఏకీకరణకు పూర్వం ఎడ్మండ్ కానిన్, మాక్స్ మోర్లాక్, జెర్డ్ ముల్లర్, జెర్డ్ ముల్లర్-2, హర్ల్ హెయింజ్ రుమ్మింగ్, మిర్లోసావ్ క్లోజ్, థామస్ ముల్లర్ మూడు సార్లు హ్యాట్రిక్ గోల్స్ సాధించారు. వీటిలో 2014 ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా పోర్చుగల్తో జరిగిన మ్యాచ్ జర్మన్లకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్తో ప్రపంచకప్ చరిత్రలో 100వ మ్యాచ్ ఆడిన ఏకైక జట్టుగా జర్మనీ చరిత్ర సృష్టించింది. అంతేకాదు ప్రపంచకప్ మ్యాచ్ల్లో తామే మొదటి గోల్ చేయడం జర్మనీకి ఇది 60వ సారి.. తద్వారా బ్రెజిల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్లో ముల్లర్ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేయడంతో.. ఫిలిప్ లామ్ నాయకత్వంలోని జర్మనీ 4-0 తేడాతో పోర్చుగల్ను చిత్తు చేసింది.
Last Updated 9, Jun 2018, 12:16 PM IST | 2sports
|
Vaani Pushpa 127 Views cricket , Pakistan , srilanka
pakistan cricket team
ఇస్లామాబాద్: ఇటీవల పాకిస్థాన్లో శ్రీలంక, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ ముగిసింది. చాలాకాలం వరకు ఈ దేశంలో విదేశీయులతో క్రికెట్ జరగలేదు. అయితే ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో ఘోర అపజయాన్ని మూటగట్టుకున్న పాకిస్థాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. భద్రతా కారణాల వల్ల స్టార్ ఆటగాళ్లు పాక్ పర్యటనకు రాకపోయినప్పటికీ శ్రీలంక యువ క్రికెటర్లు పాక్ను క్లీన్స్వీప్ చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సహా హెడ్కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్పై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది. ఈ నేపధ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఆమిర్ సోహైల్ కూడా పాక్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పించాడు. అయితే క్రికెట్కు తక్కువ కుస్తీ పోటీలకు ఎక్కువ అన్నట్లు క్రికెటర్ల ఆకారం కనబడుతోంది. వీళ్లు ఒలంపిక్స్ లేదా డబ్ల్యూడబ్ల్యూఈ కుస్తీ పోటీలకు సిద్ధ అవుతున్నారో అర్ధం కావడం లేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/ | 2sports
|
Visit Site
Recommended byColombia
అనంతరం 2018 జూన్ 10న సీజన్ 2 స్టార్ట్ చేశారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించగా.. మొదటి సీజన్తో పోల్చుకుంటే కంటెస్టెంట్స్ వీక్ కావడం వల్ల ఈ సీజన్ 2 బుల్లితెర ప్రేక్షకులకు ఓ మోస్తరు వినోదాన్ని మాత్రమే అందించగలిగింది. ఎన్టీఆర్తో పోల్చుకుంటే నాని హోస్ట్గా ఒక అడుగు వెనుకనే ఉండిపోయారు. ఇక రెండో సీజన్లో అనేక గొడవలు, వివాదాలు, రచ్చల నడుమ కౌశల్.. బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా అవతరించారు.
ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ జూలైలో ప్రారంభం కాగా.. రెండో సీజన్ ఒక నెల ముందుగానే అంటే.. జూన్లోనే ప్రారంభమైంది. అయితే మార్చి నెల వచ్చేస్తున్నా సీజన్ 3 సంబంధించిన పనులు కసరత్తులు నత్తనడకన సాగుతున్నాయి. అయితే కీలకమై హోస్ట్ కోసం ఇంకా వెతుకులాట సాగుతూనే ఉంది. నాని, ఎన్టీఆర్, రానా, విజయ్ దేవరకొండ, చిరంజీవి, నాగార్జున ఇలా చాలా పేర్లు వినిపించినప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ అయితేనే హోస్ట్కి న్యాయం చేస్తారని ఆయనే దాదాపు ఖాయం కావచ్చని నిన్న మొన్నటి వరకూ వార్తలు వినిపించాయి.
అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఖచ్చితంగా రెండేళ్లు హీరో లాక్ అయిపోవాల్సిందే. ఆ సినిమా స్క్రిప్ట్ పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు ఎన్టీఆర్. ఈ తరుణంలో ఎన్టీఆర్.. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ చేసే అవకాశాలు దాదాపు లేనట్టే.
అయితే ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ హోస్ట్ రేస్ నుండి తప్పుకోవడంతో కింగ్ నాగార్జున హోస్ట్ రేస్లో ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ బుల్లితెరపై సందడి చేసిన నాగార్జున.. ఆ కార్యక్రమం ద్వారా హోస్ట్గా శెభాష్ అనిపించుకున్నారు. ఈ తరువాత సీజన్ని చిరంజీవి హోస్ట్ చేసినా.. నాగార్జున స్థాయిలో మెప్పించలేకపోయారు. కాగా.. నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హోస్ట్ అనుభవాన్ని బిగ్ బాస్ ద్వారా ఉపయోగించుకోవాలని స్టార్ మా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాలను లైన్లో ఉన్నాయి. ఈ రెండు ఆయన సొంత సినిమాలు కావడంతో కాస్త బ్రేక్ ఇచ్చి బుల్లితెరపై రక్తికట్టించేందుకు ‘బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్’గా మారేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. బిగ్ బాస్ హౌస్లో మీ కింగ్ నాగార్జున అనడం ఖాయం గానే కనిపిస్తుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
రెండు నెలల్లో 4 కొత్త మోడళ్లు..
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
భారత్లో మరింతగా విస్తరించాలని యోచిస్తున్న మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఈ ప్రయత్నంలో భాగంగా మరిన్ని కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. వచ్చే డిసెంబర్ ముగింపు నాటికి మరో నాలుగు కొత్త మోడళ్లలో కార్లను విడుదల చేయనున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ రొలాండ్ ఎస్ పాల్గర్ తెలిపారు. ఈ ఏడాదికి కొత్తగా 12 మోడళ్లను విడుదల చేయాలని నిర్దేశించుకు న్నామని ఆయన వివరించారు. ఇప్పటి వరకు తాము ఎనిమిదింటిని ఆవిష్కరించామని చెప్పారు. సోమవారం హైదరాబాద్లో మెర్సిడస్ బెంజ్ విక్రయాల కోసం ఏర్పాటు చేసిన సిల్వర్ స్టార్ షోరూంను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా పాల్గర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇది 5వ విక్రయ కేంద్రమన్నారు. ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి దేశ వ్యాప్తంగా కొత్తగా 10 డీలర్షిప్లను అందుబాటులోకి తేనున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఇందులో ఏడు షోరూంలు తెరిచామని, త్వరలోనే మరో మూడు అవుట్ లెట్లను తెరువనున్నామన్నారు. సిల్వర్ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్రెడ్డి మాట్లాడుతూ తాము రూ.37 కోట్ల పెట్టుబడితో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ నూతన షోరూంను అందుబా టులోకి తెచ్చామన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 103 Views
హైదరాబాద్ : సన్ఫార్మా గ్లోబల్ వినియోగరంగ హెల్త్కేర్ బిజినెస్ కొత్తగా రివైటల్ హెచ్వుమన్ ఉత్పత్తి ప్రచారంలో భాగంగా ఆరోగ్యసంరక్షణ కార్యక్రమాలను చేపట్టింది. మూడునెలల్లో 20 లక్షల మంది మహిళలను చేరుకునే విధంగా ఆరోగ్యసంరక్షణ ప్రచారజాతా నిర్వహిస్తున్నట్లు సన్ఫార్మా వివరించింది. సన్ఫార్మా గ్లోబల్ హెల్త్కేర్ బిజినెస్ హెడ్ సుభోద్ మార్వా మాట్లాడుతూ దేశంలో మహిళల అరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఉందని, కుటుంబ సమాజ ఆరోగ్యాన్ని తీర్చిదిద్దడంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారన్నారు. ఆరోగ్య సంరక్షణలో పాల్గొనేవారికి ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ వేదిక లిబ్రాటేతో రివైటల్హెచ్ వుమన్ భాగస్వామిగా మారిందని మార్వా వివరించారు. అంతేకాకుండా ఈ ప్రచారకర్తగా ప్రముఖ బాలివుడ్ నటి సోనాలి బింద్రే వ్యవ హరిస్తున్నారు. కంపెనీ ఉత్పత్తిపరంగా రివైటల్ హెచ్ వుమన్ 12 విటమిన్లు, పది ఖణిజ వనరులు, జిన్సెంగ్ల సమ్మిళితం అని ఆన అన్నారు. మహిళలు రోజంతా శారీరకంగా, చురుగ్గా, మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు తోడ్పడుతుందని రివైటల్హెచ్ వుమన్లో ఉండే విటమిన్లు, ఖణిజవనరులు ఆరోగ్య దాయకంగా ఎముకల పటుత్వానికి ఉపకరి స్తుందని సుభోద్ మార్వా వివరించారు. | 1entertainment
|
Two wheelers
8%కి పడిపోయిన టూవీలర్ అమ్మకాలు
ముంబై: దేశంలో ద్విచక్రవాహనాలు అమ్మకాలకు నోట్లరద్దు భారీగా దెబ్బతీసింది. రెండంకెల ప్రగతివరకూ గడచిన అక్టోబరుమాసం వరకూ కొన సాగిన విక్రయాలు నవంబరులో 7-8శాతానికి పడిపోయాయి. నవంబరు, జనవరి మాసాల్లో అమ్మకాలు 11.3శాతం పడి పోయాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో మొదటి పదినెలల్లోను 8.3శాతంతో ముగిసింది. ఈ నోట్ల రద్దు భ్రావం జనవరి తర్వాత నుంచి కొంత రికవరీ అయింది. ఫిబ్రవరినెలలో అమ్మకాలు స్థిరంగా కొన సాగాయి. ఇక్రా నివేదికప్రకారం చూస్తే 7-8శాతం పెరుగుతాయని అంచనా. 2018 ఆర్ధిక సంవత్సరం లో మంచి విక్రయాలు రావచ్చని 8-10శాతం వృద్ధి ఉంటుందని ఇక్రా అంచనావేసింది. స్కూటర్ల పరంగా మోటార్సైకిల్ విక్రయాలను మించిపోతాయని అంచ నా వేసింది. మోపెడ్ విక్రయాలు కొంత మందగ మనంతోనే ఉంటాయని, అయితే రెండంకెల వృద్ధి తోనే నడుస్తాయని 26.8శాతం వృద్ధి కొనసాగుతుం దని ఇక్రా వెల్లడించింది. ఇక స్కూటర్లపరంగా చూస్తే ఈ రంగంలో వృద్ధిని మించుతుంది. ఇప్పటివరకూ 12.5శాతం వృద్ధి ఉంది. గత ఏడాది సెప్టెంబరు వరకూ 24.7శాతం ఉన్న వృద్ధితోపోలిస్తే చాలావరకూ క్షీణించిందనే చెప్పాలి. ఇక మోటారుసైకిళ్లపరంగాచస్తే ప్రతికూలవృద్ధితో ఉంది. అతితక్కువస్థాయి అమ్మకాల వృద్ధి ఉంది. పెద్దనోట్లరద్దు తర్వాత కూడా ఈ అమ్మకాలు 5.1 శాతం మాత్రమే ఉన్నట్లు అంచనా. పట్ట ణీకరణ పెరగడం, మధ్యతరగతి ప్రజ ల్లో ఆదాయ వృద్ధి ఇందుకు కీలకం అవు తుంది. మధ్యకాలికంగాచూస్తే చిన్న పట్ట ణాలకు సైతం ఫైనాన్స్సంస్థలు వ్యాపి స్తుండటంతో వాహనాల కొనుగోలుకు సులువయిందని ఇక్రా అంచనా వేసింది. విదేశీ మార్కెట్లపరంగా ఆటో మొబైల్ రంగానికి మంచి మార్కెట్ ఉంది. ఆఫ్రికా, దక్షిణాసియా, లాటిన్ అమెరికాల్లో మంచి మార్కెట్ ఉన్నట్లు అంచనా. వార్షిక వృద్ధి గా 8-10శాతంగా ఉంటుందని, వచ్చే మూడేళ్లపాటు ఈ వృద్ధి కొనసాగుతుందని అంచనా. వచ్చే రెండో అర్ధసంవత్సరం మార్కెట్లలో ఈ రంగానికి కీలకంగా ఉం టుందని, రికవరీ సాధ్యం అవుతుందని ఇక్రా తన నివేదికలో స్పష్టం చేసింది. | 1entertainment
|
జిఎస్టి తగ్గింపునకు ఫిట్మెంట్ కమిటీ నో!
GST
న్యూఢిల్లీ: జిఎస్టిపరిధిలోని ఫిట్మెంట్ కమిటీ పన్నుశ్లాబ్లు 32 కేటగిరీల ఉత్పత్తులకు మార్చాలని సిఫారసులు చేసింది. గత వారం జరిగిన జిఎస్టి మండలి సమావేశంలో మోటారు వాహనాలు, బిస్కెట్లపై పన్నులు తగ్గిస్తారని అందరూ అంచనాలు వేసినా మండలి అందుకు సుముఖత వ్యక్తంచేయలేదు. అయితే ఇఉడు కొత్తగా 165 రకాల ఉత్పత్తులకు తగ్గించాలన్న డిమాండ్ వస్తోంది. వాటిలో వెన్న, నెయ్యి, జున్ను, డ్రైఫ్రైట్స్ వంటివి తగ్గించాలన్న డిమాండ్ఉన్నా జిఎస్టి మండలి మాత్రం సుముఖంగా లేదు జిఎస్టి మండలికి సబ్కమిటీగా ఉన్న ఫిట్మెంట్కమిటీలో పన్నుల రంగానికి చెందిన కేంద్ర రాష్ట్ర అధికారులుంటారు. జిఎస్టి రేట్లను పరిశీలిస్తారు. పరిహారం సెస్సు వసూళ్లపైకూడా సిఫారసులుంటాయి. 200 కేటగిరీలపరంగా ఉత్పత్తులపై ఉన్న విధానాలను పరిశీలించి సిఫారసులుచేస్తారు. చివరకు 32 కేటగిరీల్లోని ఉత్పత్తుల పన్నుశ్లాబ్లను సవరించాలనికోరింది. అంతేకాకుండా పది కేటగిరీల్లో మార్చేందుకు తిరస్కరించింది.
167 కేటగిరీలను అసలు పరిశీలించకుండానే వదిలివేసింది. వివిధరంగాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా ఫిట్మెంట్కమటీ వీటిని నిర్ణయిస్తుంది. డ్రైఫ్రూట్స్ 12.5నుంచి ఐదుశాతం,ఉపాహారం తృణధాన్యాలతోకూడిన వంటలపై 18 శాతంనుంచి 12శాతం, మలాపార్ పరంథాలపై 18నుంచి ఐదుశాతం, పండ్ల గుజ్జు, పండ్ల రసాలు డ్రింకులపై 12నుంచి ఐదుశాతం, కోకోనట్ నీటిపై ఐదుశాతం, సుగంధపరిమళాలపై ఐదుశాతం 32 అంగుళాలకు పైబడిన వాటిపై 18శాతం, పెనునలపై ఐదుశాతానికి తగ్గించాలని విజ˜ప్తులు అందుతున్నాయి. ఇతత్రా ఆహార ఉత్పత్తులు ఖండసారి, మిశ్రీ, మతాషా, బూరాలతోతయారీచేసినవాటిపై ఎత్తివేయాలని, వెర్మిసెల్లీ సేమియా, పాస్తా, మాక్రోనిలపై ఐదుశాతానికే కుదించాలనికోరుతున్నారు. పచ్చళ్లు, వివిధ చట్నీ పౌడర్లు, వడగమ్వాథల్వంటివాటిపై పన్నులు తొగించాలని, కూరగాయలు, పండ్లు ఆధారిత ఉత్పత్తులపై ఐదుశాతానికి తగ్గించాలన్న డిమాండ్లను ఫిట్మెంట్ కమిటి అంగీకరించలేదు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
Steel Plant
37.3శాతం తగ్గిన ఉక్కు దిగుమతులు
కోల్కత్తా, అక్టోబరు 10: భారత్ ఉక్కుదిగుమతులు 37.3శాతం దిగజారాయి. మొదటి ఆరునెలల్లో ఎగు మతులు మాత్రం 35.6 శాతం పెరిగినట్లు ఒకనివేదిక విడుదలయింది. ఏప్రిల్సెప్టెంబరు మధ్య కాలం లో భారత్ మొత్తంగా ఉక్కును 3.594 మిలియన్టన్నులను దిగుమతిచేసుకుంది. గత ఏడాదితో పోలి స్తే 37.3శాతం తగ్గినట్లు అంచనా. అలాగే ఎగుమ తులపరంగాచూస్తే 35.6శాతం పెరిగాయి. గత ఏడాదితోపోలిస్తే 3.03 మిలియన్ టన్నులకు పెరిగా యి. ఉక్కుమంత్రిత్వశాఖ సంయుక్త ప్లాంట్ కమిటీ ఈ గణాంకాలు విడుదలచేసింది. సెప్టెంబరులో దిగు మతులు 46శాతం తగ్గి 0.611మిలియన్ టన్నులుగా ఉంటే ఎగుమతులు కూడా 0.655 మిలియన్ టన్ను లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదేనెలతో పోలిస్తే 111 శాతం పెరిగినట్లు అంచనా. ఆగస్టునెలతో పోలిస్తే ఉక్కు దిగుమతులు 3.5శాతంసెప్టెంబరునెలలో తగ్గా యి. దేశంలో పూర్తిస్థాయి ఉక్కు వినియోగం కూడా 2.5శాతం పెరిగింది. 40.561 మిలియన్ టన్ను లుగా ఉంది. సెప్టెంబరు వినియోగి 6.731మిలియన్ టన్నులు పెరిగింది. గతఏడాది ఇదేనెలతోపోలిస్తే 7.6శాతంగా ఉంది. ఆగస్టు నెలతో పోలిస్తే 7.7శాతం దిగజారింది. పూర్తిస్థాయి ఉక్కు దిగుమతులు 48.846 మిలియన్టన్నులుగా ఉన్నాయి. ఏప్రిల్-సెప్టెంబరు మధ్యకాలంలో 9శాం వినియోగం పెరిగింది. సెప్టెంబరునెలలో చూస్తే8.042 మిలియన్టన్నులుగా ఉంది. గత ఏడాది ఇదేనెలతో పోలిస్తే 10.5శాతం పెరిగింది. ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబరులో ఉత్పత్తి మాత్రం 8.4శాతం దిగజారింది. | 1entertainment
|
Suresh 84 Views P.V.Sindhu
P V Sindhu
గ్లాస్గో: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో ఫైనల్లో తెలుగుతేజం సింధు పరాజయం. ఎన్నో ఆశలు, వ్యూహాల మధ్య ఫైనల్లోకి అడుగుపెట్టిన పీవీ సింధు ప్రత్యర్థి జపాన్ షట్లర్ ఒకుహర చేతిలో పరాజయం పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఒకుహర విజేతగా నిలిచింది. తొలి గేమ్ను 19-21 తేడాతో కోల్పోయిన సింధు, రెండో ఆటను 22-20తో సమం చేసుకుంది. తుదికల్లా మూడో ఆటలో పోరాడి 20-22తో పరాజయం. | 2sports
|
internet vaartha 306 Views
న్యూఢిల్లీ : టెలికాం ప్రభుత్వరంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ వంటి సంస్థలు ఈ కొత్త ఆర్థిక సంవతంలో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు 16,815 కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించాయి. వైఫైహాట్స్పాట్స్, నెట్వర్క్ విస్తరణ, నాణ్యత పెంచడం, బ్రాడ్బాండ్ కవరేజి పెంచడం వంటి కార్యాచరణను ప్రకటిం చింది. బిఎస్ఎన్ఎల్ ఇందుకోసం 7317 కోట్లు 2016-17లో ఖర్చు చేస్తున్నట్లు ప్రక టించింది. భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ జాతీయ ఆప్టికల్ఫైబర్ నెట్వర్క్ అమలుచేస్తున్న సంస్థ 9418.7 కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించింది. బిఎస్ఎన్ల్ సిఎండి అనుపమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ 7317 కోట్ల రూపాయలు మూలధన వనరులు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. 40వేలకుపైగా వైఫై హాట్స్పాట్స్ ఏర్పాటవుతాయని ప్రస్తుత నెట్వర్క్ కెపాసిటీకి పదిరెట్లు పెరుగుతుందని, రెండువేల కోట్లు యంత్రసామగ్రిపై వెచ్చిస్తామన్నారు. ఇక నష్టాల్లో నడుస్నుత్న ఎంటిఎన్ఎల్ 649.03 కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించింది. సెంటర్ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్ టెక్నాలజీలో 100 కోట్లు ఖర్చుచేస్తుందని బడ్జెట్ వివరాలుచెపుతున్నాయి. విదేశీ సంచార్నిగమ్ వంద్ద 773.1కోట్ల విలువైన మిగులుభూమి ఉందని, ప్రస్తుతం టాటాకమ్యూనికేషన్స్ పరిధిలో ఉంది. 2002లో ఈ పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత ప్రత్యేక ప్రయోజన వాహికను ఏర్పాటు చేసారు. హెమిస్ఫేర్ ప్రాపర్టీస్ ఇండియాను ఏర్పా టు చేసి ఈఅంశం పరిష్కరానికి నిర్ణయించారు. 2016-17లోఇందుకోసం కోటి రూపాయలు ఖర్చు చేయనున్నది. డాట్కోసం ప్రభుత్వం ఈ సంవ త్సరంలో18,413కోట్లు విడుదలచేస్తుంది. 2200 కోట్లు రీఫండ్ చేసేందుకు కూడా కేటాయింపులు చేసింది. బ్రాడ్ బ్యాండ్ వైర్లెస్ స్పెక్ట్రమ్(4జి) ఆరుసర్కిళ్లలోను, సిడిఎంఎ స్పెక్ట్రమ్లోను ఈ మొత్తం రీఫండ్చేస్తుంది. ఎంటిఎన్ఎల్ ఐదు ఎంహెచ్జడ్ సిడిఎంఎ స్పెక్ట్రమ్ను అప్పగించేసింది. ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో అప్పగిం చింది. ఇక బిఎస్ఎన్ఎల్ ఎనిమిది నుంచి పది టెలికాం సేవా ప్రాంతాల్లో స్పెక్ట్రమ్ అప్పగించినట్లు తేలింది. ఎంటిఎన్ఎల్కోసం బడ్జెట్లో 428.91 కోట్లు కేటాయించారు. మ్యాట్ రీఫండ్, బాండ్లపై వడ్డీచెల్లింపు, సిడిఎంఎ స్పెక్ట్రమ్ వాపసు వంటివాటికి ఈ నిధులు వెచ్చిస్తారు ప్రభుత్వం ఇప్పటి వరకూ మ్యాట్పరంగా ఎంటిఎన్ఎల్కు 492 కోట్లు వాపసు చేసింది. | 1entertainment
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
పెళ్లిపీటలు ఎక్కుతోన్న అర్చన.. హైదరాబాద్లో వివాహం
నటి అర్చన వివాహం వ్యాపారవేత్త జగదీశ్తో జరగబోతోంది. వచ్చే నెలలో వీరి పెళ్లి హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. ఈ మేరకు ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని ప్రకటించారు.
Samayam Telugu | Updated:
Oct 29, 2019, 07:40PM IST
హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయమై ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన నటి అర్చన అలియాస్ వేద పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్ను అర్చన పెళ్లిచేసుకోబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న జగదీశ్, అర్చన అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
అర్చన, జగదీశ్ నిశ్చితార్థ వేడుకలో హీరోలు సుమంత్, శివబాలాజీ, నవదీప్, నటి మధుమితతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే, తాజాగా వీరి పెళ్లి తేదీని ఖరారు చేశారు. నవంబర్ 13న వీరి వివాహం హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. ఈ మేరకు వధూవరుల కుటుంబ సభ్యులు మంగళవారం మీడియాకు ప్రకటించారు. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా అర్చన-జగదీశ్ పెళ్లి జరగనుంది. | 0business
|
Suresh 194 Views
న్యూఢిల్లీ: గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ రెండమ గేమ్ డ్రా గా నమోదు చేసుకున్నాడు.కాగా జిబ్రాట్లర్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో హరికృష్ణ భారత్కు చెందిన అభిజిత్ గుప్తాతో జరిగిన ఆరవ రౌండ్ గేమ్ను హరికృష్ణ 60 ఎత్తుల్లో డ్రా గా ముగించాడు.ఆరవ రౌండ్ తరువాత హరికృష్ణ అయిదు పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో గ్రాండ్ మాస్టర్ హరికకు తొలి పరాజయం ఎదురైంది.ఆంటోస్ గిజారో( స్పెయిన్)తో జరిగిన గేమ్లో హారిక 53 ఎత్తుల్లో ఓడిపోయింది.కాగా మరోవైపు భారత దిగ్గజం ఆనంద్ మూడవ విజయాన్ని సాధించాడు.ఫియాలా విక్లాస్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్లో ఆనంద్ 32 ఎత్తుల్లో గెలిచాడు. | 2sports
|
ఇక ప్రభాస్ "సాహో" గతేంటి..?
Highlights
బాహుబలితో నేషనల్ సూపర్ స్టార్ గా మారిన ప్రభాస్
తాజాగా ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో
సాహో దర్శకుడు సుజీత్ పై నమ్మకం కోల్పోయిన ప్రభాస్
‘బాహుబలి’ చిత్రంతో నేషనల్ సెలిబ్రిటీగా మారిపోయిన ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ పై రోజురోజుకీ అంచనాలు పెరిగి పోతున్నాయి. దీనితో ఈమూవీని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ ఈసినిమా పై దాదాపు 200 కోట్ల వరకు భారీ బడ్జెట్ ఖర్చుపెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పుడు ఈసినిమా పై పెరిగిన అంచనాలుతో పాటు పెరిగిపోయిన బడ్జెట్ కూడ డైరెక్టర్ సుజిత్ పై విపరీతమైన ఒత్తిడి పెంచడమే కాకుండా ఈమూవీని దర్శకుడు సుజిత్ హేండిల్ చేస్తున్న పద్దతి ప్రభాస్ కు ఏమాత్రం నచ్చడంలేదు అన్నవార్తలు హడావిడి చేస్తున్నాయి.
ఇంతవరకు సుజిత్ డైరెక్ట్ చేసింది కేవలం ‘రన్ రాజా రన్’ చిత్రం ఒక్కటే. ఫన్ మిక్స్ డ్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ సినిమా హిట్ అయినా ఆఒక్క సినిమా అనుభవం ‘సాహో’ విషయంలో సరిపోవడంలేదు అని ప్రభాస్ అభిప్రాయం అని అంటున్నారు. దీనితో హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టెయినర్ గా సాహోను ఎంతవరకు సుజిత్ తీర్చిదిద్దగలడు అన్న డౌట్లు లేటెస్ట్ గా ప్రభాస్ కు ఏర్పడినట్లు సమాచారం. ఇదేతరహా అనుమానాలు బాలీవుడ్ నుంచి కూడ ప్రభాస్ కు అందుతున్న నేపధ్యంలో ప్రభాస్ ను మరింత కలవర పాటుకు గురి అవుతున్నాడు అని టాక్.
దీనికితోడు ‘సాహో’ ను తెలుగుతో పాటు తమిళం మళయాళం హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్న పరిస్థుతులలో డైరెక్టర్ సుజిత్ కు మల్టీ లాంగ్వేజ్ సినిమాతీసిన అనుభవంలేదు అన్నవిషయాన్ని బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు ప్రభాస్ కు గుర్తుచేస్తున్నట్లు సమాచారం. ఈసినిమా షూటింగుకు సంబంధించి మొత్తం భారమంతా సుజిత్ పైన మోపితే అనుకున్న రిజల్ట్ రావడం కష్టమవుతుందనే అభిప్రాయం ప్రభాస్ కు స్పష్టంగా వచ్చింది అన్నవార్తలు వినపడుతున్నాయి.
దీనితో అతడి సన్నిహితుల సూచనల మేరకు ‘సాహో’ షూటింగ్ స్పాట్ లో సినిమాటోగ్రాఫర్ మదిని మరింత ఇన్వాల్వ్ చేయడమే కాకుండా తీస్తున్న ప్రతి సీన్ ను తరుచుగా చెక్ చేసుకుంటూ ముందుకు సాగమని ప్రభాస్ మదిని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీకి భారీ బడ్జెట్ ఖర్చు అవుతున్న నేపధ్యంలో ప్రభాస్ తన ఇమేజ్ ని కాపాడుకోవడానికి ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తూ ఉన్నా ఈవిధంగా సుజిత్ పై మరీ ఒత్తిడి పెరిగితే మొదటికే మోసం వస్తుందా అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. దీనినిబట్టి చూస్తుంటే ‘సాహో’ ప్రభాస్ కు ఒక విషమ పరీక్షనే అనుకోవాలి.
Last Updated 25, Mar 2018, 11:53 PM IST | 0business
|
Hyderabad, First Published 8, Apr 2019, 11:21 AM IST
Highlights
మెగాహీరో సాయి ధరం తేజ్ ఇప్పుడు సాయి తేజ్ గా తన పేరుని మార్చుకున్నాడు. తన కొత్త సినిమా 'చిత్రలహరి' సినిమా టైటిల్స్ లో ఇదే పేరు రానుంది.
మెగాహీరో సాయి ధరం తేజ్ ఇప్పుడు సాయి తేజ్ గా తన పేరుని మార్చుకున్నాడు. తన కొత్త సినిమా 'చిత్రలహరి' సినిమా టైటిల్స్ లో ఇదే పేరు రానుంది. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తాజాగా సాయి తేజ్ వెల్లడించాడు.
ఐదుగురు విభిన్న వ్యక్తులు హీరోని ఎలా ప్రభావితం చేశారనేదే ఈ సినిమా కథ అని చెప్పుకొచ్చాడు. అలానే తనకు వరుసగా వచ్చిన ఆరు ఫ్లాప్ లపై కూడా స్పందించాడు. అరడజను ఫ్లాప్ లు వచ్చిన తరువాత తనవాళ్లు ఎవరో తెలుసుకున్నానని.. గుండె ధైర్యం కూడా బాగా పెరిగిందని అంటున్నాడు.
చాలా మంది సక్సెస్ ఉన్నప్పుడు వస్తారని, సక్సెస్ లేనప్పుడు వెళ్లిపోతారని.. కొందరు మాత్రమే సక్సెస్ తో సంబంధం లేకుండా ఉంటారని.. ఆరు సినిమాల ఫ్లాప్ లతో వాళ్లను పొందగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తనవైపు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని.. షూటింగ్ చెప్పాలంటే ఒకరిద్దరు మాత్రమే మిగిలారని.. అందరూ తనను వదిలేశారని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఫ్లాప్ ల నుండి చాలా నేర్చుకున్నానని.. సినిమాలో తన పాత్ర నిజజీవితానికి దగ్గరగా ఉంటుందని చెప్పాడు. ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా.. బాధను మనసులో దాచుకొని బయటకి నవ్వడం అలవాటు అయిపోయిందని చెప్పుకొచ్చాడు.
Last Updated 8, Apr 2019, 11:21 AM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధావన్కే మళ్లీ ఛాన్స్.. పృథ్వీ షాకి షాక్
గౌహతిలో ముగిసిన తొలి వన్డేలో 4 పరుగులకే ఔటైన ధావన్.. నిన్న విశాఖపట్నంలో ముగిసిన రెండో వన్డేలో 29 పరుగులకే పెవిలియన్ చేరిపోయాడు. ఈ నేపథ్యంలో.. చివరి మూడు వన్డేలకి అతని స్థానంలో పృథ్వీ షా అవకాశం ఇవ్వాలనే సూచనలు పెరిగాయి.
Samayam Telugu | Updated:
Oct 25, 2018, 04:54PM IST
ధావన్కే మళ్లీ ఛాన్స్.. పృథ్వీ షాకి షాక్
వెస్టిండీస్తో చివరి మూడు వన్డేలకి అవకాశం దక్కుతుందని ఆశించిన యువ ఓపెనర్ పృథ్వీ షాకి ఈరోజు సెలక్టర్ల నుంచి మొండిచేయి ఎదురైంది. ఇటీవల వెస్టిండీస్తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా 134, 70, 33* పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో.. వన్డే సిరీస్లోనూ అతనికి అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ.. ఐదు వన్డేల సిరీస్కి రెండు సార్లు జట్టుని ప్రకటించిన సెలక్టర్లు.. రెండు సందర్భాల్లోనూ యువ ఓపెనర్కి ఛాన్సివ్వలేదు. | 2sports
|
internet vaartha 158 Views
అలప్పజ : భారత క్రికెటర్ కరణ్ నాయర్ తృటిలో స్నేక్ బోట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పంపా నదిలో పడవ తిరగబడటంతో ఇద్దరి ఆచూకీ గల్లంతవగా కరణ్ నాయర్తో సహా పలువురు సురక్షితంగా బయకు వచ్చారు. పరిమితికి మించి ఎక్కువ మంది స్నేక్ బోట్లో ప్రయాణించడంతోనే ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. కాగా వీరంతా శ్రీ పార్థసారథి స్వామి ఆలయంలో జరిగే వాట్లా సద్యా ఉత్సవం కోసం పలువురు ఈ స్నేక్ బోట్లో ప్రయాణం చేశారు. అయితే సుమారు 100 మంది వరకు బోట్లో ఎక్కడంతో, పడవ ప్రమాదం సంభవించినట్లు ఒక ఉన్నతాధికారి వెల్లడించాడు. ప్రమాద సమయంలో రెస్క్యూ టీమ్ వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పినట్లు ఆర్నా మూలా పోలీస్ అధికారులు పేర్కొన్నారు. గల్లంతయిన ఇద్దరి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక కర్ణాటకకు చెందిన కరణ్ నాయర్కు ఇటీవల జింబాబ్వే టూర్లో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రఫెల్ తో ఆడాలనుంది : సానియా
రఫెల్ నాదల్ తో జట్టుకట్టాలని ఉందని భారత టెన్నిస్ ఆణిముత్యం సానియా మీర్జా తెలిపింది.
TNN | Updated:
Nov 4, 2015, 06:26PM IST
ప్రపంచ టెన్నిస్ కింగ్ రఫెల్ నాదల్ తో జట్టుకట్టాలని ఉందని భారత టెన్నిస్ ఆణిముత్యం సానియా మీర్జా తెలిపింది. ఇప్పటికే పది టైటిళ్లు నెగ్గి ఉమన్స్ డబుల్స్ లో అగ్రస్థానంలోకి చేరిన సానియా మిక్స్డ్ డబుల్స్ పై దృష్టి సారించింది. రఫెల్ నాదల్ తో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడి ప్రపంచ అగ్రస్థానంలో నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. మాజీ వరల్డ్ నెంబర్ వన్ మార్టినా హింగిస్తో జత కట్టిన సానియా డబుల్స్ ర్యాంకింగ్స్లో తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకే ఏడాదిలో ఏకంగా పది టైటిళ్లను సాధించి మంచి ఊపు మీద ఉన్న సానియా మంగళవారం నాడు తన స్వస్థలం హైదరాబాదుకు చేరుకుంది. | 2sports
|
Hyderabad, First Published 5, Mar 2019, 2:54 PM IST
Highlights
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన భర్తకి విడాకులిచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్.
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన భర్తకి విడాకులిచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. ఇద్దరూ కలిసి ఈవెంట్స్ కి పార్టీలకు వెళ్లడం వంటివి చేస్తుండడంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు.
ఇటీవల ఇద్దరూ కలిసి ఓ పార్టీకి హాజరయ్యారట. ఆ పార్టీకి అర్జున్ కజిన్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా వెళ్లిందట. అక్కడ మలైకా.. సోనమ్ ని అవమానించినట్లు సమాచారం. పార్టీలో ఎంజాయ్ చేస్తూ మలైకా కాస్త ఎక్కువగా మద్యం సేవించిదట. తాగేసి ఆమె చేస్తోన్న రచ్చని అర్జున్ నిలువరించలేదట.
దీంతో సోనమ్.. మలైకా వద్దకు వెళ్లి నేను సాయం చేస్తానని ఆఫర్ చేస్తే దానికి ఆమె.. 'స్టే అవే (దూరంగా వెళ్లు)' అని పొగరుగా చెప్పడంతో సోనమ్ ఒక్కసారిగా షాక్ అయిందట.
అక్కడున్నవారంతా ఆమెనే చూడడంతో కాస్త అవమానంగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అర్జున్, మలైకాల ప్రేమను సపోర్ట్ చేస్తూ వస్తోన్న సోనమ్ ఈ సంఘటనతో వారికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Last Updated 5, Mar 2019, 2:54 PM IST | 0business
|
హోమ్ Business News నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
August 28, 2019, 11:48 AM IST
Share on:
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమైన్నాయి. ఉదయం 9.51 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 74 పాయింట్లు నష్టపోయి 37,566 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 11,085 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.57 వద్ద కొనసాగుతోంది.
సంబంధిత వార్తలు | 1entertainment
|
rahul2
టీమిండియా తొలి ఇన్నింగ్స్ 248/6
ధర్మశాల: టీమిండియా,ఆస్ట్రేలియా మధ్య ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టులో ఆధిక్యం ఎవరిదో తేలలేదు. ఇరు జట్లు పోరాడుతున్నాయి.రెండవ రోజు టీమిండియా 6 వికెట్లకు 248 పరుగులు చేసింది.ఇదే టెస్టులో తొలి రోజు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ను 300 పరుగులకే టీమిండియా కట్టడి చేసిన సంగతి తెలిసిందే.భారీ స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధిద్దామనుకున్న టీమిండియా ఆశలను ఆసీస్ స్పిన్నర్ లైయన్ అడ్డుకట్ట వేశాడు.కీలక సమయాల్లో నలుగురు భారత బ్యాట్స్మెన్ పెవిలియన్కు చేర్చాడు.పిచ్ పేసకు అనుకూలిస్తుందని భావించినా ఇరు జట్లు స్పిన్నర్లే కీలక పాత్ర పోషించారు.ఇరు జట్ల మధ్య ఇన్నింగ్స్ ఆధిక్యం చాలా స్వల్పంగా ఉండనుంది.అయితే రెండవ ఇన్నింగ్స్కు అదే కొండంత భరోసా ఇవ్వవచ్చు.
ఓవర్నైట్ జిరో పరుగులకు జిరో స్కోరు వద్ద రెండవ రోజు ఆట ప్రారంభించిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులతో ముగించింది.తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే విజ§్ు 11 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది.ఒకవైపు ఉదయం సమయంలో పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా మారినా ఎంతో ఓర్పుగా లోకేశ్ 60 పరుగులు,పుజారా 57 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.వారిద్దరూ నిష్క్రమించిన అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా సారథి రహానే 46 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆల్ రౌండర్ అశ్విన్ 30 పరుగులతో ఫర్వాలేదనిపించినా కీలక సమయంలో ఔట్ కావడంతో టీమిండియాకు సమస్య ఎదురైంది.కరుణ్ నాయర్ 5 పరుగులలో పూర్తిగా విఫలమయ్యాడు
.ప్రస్తుతం క్రీజులో వృద్దిమాన్ సాహా 10 పరుగులు, జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడవ రోజు తొలి సెషన్ ఆట కీలకం కానుంది.టీమిండియా చైనా మెన్ బౌలర్ కులదీప్ యాదవ్ దూకుడు కనబర్చిన పిచ్పై ఆసీస్ స్పిన్నర్ లైయన్ ముఖ్యభూమిక పోషించాడు.లైయన్ 4 వికెట్లు, హేజిల్వుడ్,కమిన్స్ చెరో వికెట్ తీశారు.డిఆర్ఎస్ వినియోగంలో భారత ఆటగాళ్లు తడబడినట్లే ఆసీస్ క్రీడాకారులకు కూడా ఇబ్బంది పడ్డారు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వింత ట్వీట్కు లైక్ కొట్టిన ధోనీ, కన్ఫ్యూజన్లో నెటిజన్లు!
మహేంద్ర సింగ్ ధోనీ మూడేళ్ల తర్వాత ఓ ట్వీట్కు లైక్ కొట్టాడు. అది కూడా మ్యాచ్ ఫిక్స్, ప్రపంచ కప్ మనదే అనే వార్తకు కావడం విశేషం.
TNN | Updated:
Dec 14, 2017, 04:29PM IST
వింత ట్వీట్కు లైక్ కొట్టిన ధోనీ, కన్ఫ్యూజన్లో నెటిజన్లు!
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ చేసినా, మ్యాచ్ మధ్యలోనే వెల్లకిలా పడుకొని విశ్రాంతి తీసుకున్నా వార్తే. తన ఆలోచనా విధానంతో ధోనీ నిత్యం వార్తల్లో ఉంటాడు. ప్రధాన మీడియాకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండే ధోనీ.. సోషల్ మీడియాలో కూడా అంతంత మాత్రమే రెస్పాండ్ అవుతుంటాడు. తోటి క్రికెటర్ల బర్త్ డే సందర్భంగా కూడా వారిని సోషల్ మీడియా ద్వారా విష్ చేయడానికి పెద్దగా ఇష్టపడడు. అలాంటి ధోనీ ఇటీవల ఓ ట్వీట్‌కు లైక్ కొట్టడం, అది కూడా ఓ వార్తకు కావడం సంచలనంగా మారింది.
2009 నవంబర్లో ట్విట్టర్లో చేరిన ధోనీ.. 2013లో ఓ ట్వీట్‌కు లైక్ కొట్టాడు. తర్వాత 2014లో మరో ట్వీట్‌కు లైక్ కొట్టాడు. మూడేళ్ల తర్వాత ధోనీ లైక్ కొట్టడంతో ఆ వార్త పట్ల అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకూ అదేం వార్తంటే.. ‘మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. వచ్చే ప్రపంచకప్‌ను కోహ్లి నేతృత్వంలోని టీమిండియా గెలవబోతుంద’ని ఓ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. దీనికి ధోనీ ఎందుకు లైక్ కొట్టాడని అనుకుంటున్నారా..
ప్రపంచ కప్‌ జరగడానికి రెండు మూడేళ్ల ముందు కోహ్లి పెళ్లాడాడు. కాబట్టి కప్ మనదే. గతంలో వరల్డ్ కప్ ముందు ధోనీ, కపిల్ దేవ్ లాంటి కెప్టెన్లు కూడా ఇలాగే పెళ్లిళ్లు చేసుకున్నారు. అప్పుడు కూడా కప్ మనోళ్లే కొట్టారు. 2019లో మనోళ్లు కప్పు తేవడం ఖాయం అని వార్త రాశారు. దీనికే ధోనీ లైక్ కొట్టాడు. దీంతో ధోనీ మా వార్తకు లైక్ కొట్టాడోచ్చ్ అని మరో వార్త రాసేసింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
బంగారు చేప.. రామాయణ పఠనం!
మొనాకో
మిస్సీ ఫ్రాంక్లిన్ గుర్తుంది కదా! ఒకటి రెండు కాదు.. ఏకంగా ఐదు ఒలింపిక్ స్వర్ణ పతకాలు గెలిచి ‘బంగారు చేప’గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా స్విమ్మర్. ఇంకా చాలా ఏళ్లు కొలనులో పతకాల పంట పండిస్తుందనుకున్న ఈ భామ.. భుజం గాయం కారణంగా 23 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చింది. గత డిసెంబరులోనే ఈతకు దూరమైన మిస్సీ.. ఇప్పుడు హిందూ ధర్మం మీద ఆసక్తి ప్రదర్శిస్తుండటం విశేషం. హిందూ ధర్మం తనకు గొప్ప ఆధ్యాత్మిక భావన కలిగిస్తోందని ఆమె అంటోంది. ‘‘నేను ఏడాదిగా హిందూ మతం గురించి చదువుతున్నా. ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. కొత్త సంస్కృతులు, ప్రజలు, నమ్మకాల గురించి తెలుసుకోవడం నాకెంతో ఇష్టం. నేను క్రైస్తవురాలిని. కానీ హిందుత్వం, ఇస్లాం ఆసక్తి కలిగించాయి. అవెంతో అందంగా కనిపించాయి. హిందూ ధర్మంలో నన్నెంతగానో ఆకర్షించిన విషయం కర్మ సిద్ధాంతం. మనం మంచి చేస్తే తిరిగి ఆ మంచి మన దగ్గరికి వస్తుందనే ఆలోచన చాలా బాగుంది’’ అని మిస్సీ చెప్పింది.
ప్రధానాంశాలు | 2sports
|
internet vaartha 452 Views
న్యూఢిల్లీ : మేకిన్ ఇండియా కార్యాచరణకు మద్దతుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించిన నోయిడా కేంద్రంగా ఉన్న స్టార్టప్ కంపెనీ తయారుచేసిన స్మార్ట్ఫోన్ కేవలంనాలుగు డాలర్లకే లభిస్తున్నది. ఫ్రీడమ్ 251 పేరిట రింగింగ్ బెల్స్ స్టార్టప్ కంపెనీ ఈ ఫోన్ రూపొందించి దేశీయ ధర రూ.251గా ప్రకటించిన సంగతి తెలిసిందే. జుపీ ఆర్డర్లు ప్రారంభించింది. ఈనెల 21వ తేదీవరకూ కొనసాగుతాయి. బిజెపి కురువృద్ధనేత మురళీమనోహర్జోషి ఈ ఫోన్ను విడుదలచేసారు. గ్రామీణప్రాం తాల్లోని మత్స్యకారులు, రైతులు, మహిళలు ఈ ఫోన్ వినియోగించుకుంటారని కంపెనీ చెపుతోంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ఫోన్ భారత్లో విడుదలచేసిన ఘనత విశ్వవ్యాప్తంగా ఈ స్టార్టప్ కంపెనీకి దక్కింది. అయితే ఫోన్మార్కెట్లోనికి వచ్చేంతవరకూ పలు సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. భారతీయ మార్కెట్లలో ఈఫోన్ భారీ విక్రయాలు సాధిస్తుందా అన్నది అనుమానంగా ఉంది. స్మార్ట్ఫోన్ మార్కెట్ల పరంగా భారత్ వచ్చే కొద్ది సంవత్సరా ల్లోనే అమెరికాను అధిగమించనున్నది. ప్రభుత్వ మద్దతుతోనే ఫ్రీడమ్ 251ను తయారుచేయగలిగామని కంపెనీ చెపు తోంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ రూపొందించినట్లు కంపెనీ ఛైర్మన్ అశోక్ చడ్డా వెల్లడించారు. మహిళలు సుళువుగా పోలీస్ యాప్లకు యాక్సెస్ చేసుకోవ చ్చని, సీనియర్ సిటిజన్లు వైద్యసౌకర్యాలు పొందే వెసులుబాటు ఉందని చెపుతున్నారు. కేవలం 3జి కనెక్డివిటీ తో మాత్రమే వస్తోంది. 32జిబి వరకూ నిల్వసామర్ధ్యం పొడిగించుకునే సదుపాయం ఉంది. స్వఛ్భారత్, మహిళా భద్రత, వాట్స్యాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి యాప్స్తో వస్తోంది. వచ్చే జూన్30వ తేదీనాటికి ఫ్రీడమ్ 251 పంపిణీ పూర్తిస్థాయిలో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇటీవలే కంపెనీ 4జి చౌకస్మార్ట్ఫోన్ను రూ.2999లకు విడుదలచేసింది. మరో రెండు ఫీచర్ ఫోన్లను కూడా విడుదలచేసింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ అంచనాలప్రకారం త్రైమాసిక మొబైల్ఫోన్ట్రాకర్ పరిశీలిస్తే భారత్లో నాలుగుత్రైమాసికంలో ఇప్పటి వరకూ 25.6 మిలియన్ల స్మార్ట్ఫోన్లు మార్కెట్ అయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 22.2 మిలియన్ యూనిట్లు ఉన్నాయి. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఆ పొరపాటు ఏడుగురి ఆశలను గల్లంతు చేసింది..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) చేసిన ఆ పొరపాటు ఏడుగురు యువ క్రికెటర్ల ఆశలను అడియాశలపాలు చేసింది
TNN | Updated:
Dec 2, 2016, 05:47PM IST
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) చేసిన ఆ పొరపాటు ఏడుగురు యువ క్రికెటర్ల ఆశలను అడియాశలపాలు చేసింది. దేశం తరఫున ఆడే అవకాశాన్ని వారు పొందినట్లే పొంది చిట్టచివరి క్షణంలో పోగొట్టుకున్నారు. శ్రీలంకలో జరగాల్సిన యూత్ ఏషియా కప్ లో భారత్ తరఫున పాల్గొనే 15 సభ్యుల జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొద్ది రోజుల క్రితం ఆర్బాటంగా విడుదల చేసింది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఆటగాళ్లు 1-9-1998 తరువాత జన్మించి ఉండాలి. కానీ, దాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పుగా 1997 అని అర్ధం చేసుకుని ఆ మేరకు క్రికెటర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ కూడా పూర్తిచేసింది. టీముకు ఎంపికైన ఆటగాళ్లంతా తాము దేశం తరఫున ఆడనున్నామని సగర్వంగా అందరికీ చాటి చెప్పుకున్నారు. వారి కుటుంబాలు తమ బిడ్డలను చూసి పొంగిపోయాయి. శ్రీలంకకు వెళ్లేందుకు అవసరమైన వీసాలు, పాస్ పోర్టులు కూడా వారు సమకూర్చుకుని ఇక విమానం ఎక్కేయడమే ఆలస్యం అన్నట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, చివరి క్షణాల్లో తన తప్పును తెలుసుకున్న బీసీసీఐ కనీసం ఎటువంటి విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా జరిగిన పొరపాటును ఒక ప్రెస్ నోటుతో సరిపుచ్చేసింది. పదిహేను మంది సభ్యుల టీములో ఏకంగా ఏడుగురిని వేరేవారితో భర్తీ చేయడంతో పాపం ఆ యువ ఆటగాళ్ల ముఖంలో నెత్తురు చుక్కలేకుండా పోయింది. ఇది ఒక రకంగా క్రీడాకారుల జీవితాలతో ఆడుకోవడమేనని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. బీసీసీఐ లాంటి ప్రపంచపు అతిపెద్ద క్రీడా సంస్థ స్థాయికి ఈ తరహా చర్యలు సరితూగవన్నారు. ఇది ఆ సంస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపుతుందని చెప్పారు. | 2sports
|
Sep 03,2016
ప్యూజన్ నుంచి ఎలంట్రా విడుదల
నవతెలంగాణ-వాణిజ్యవిభాగం : ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ ప్యూజన్ హ్యుందారు ఎలంత్రా హ్యుందాయ్ కారును బ్యాడ్మింటన్ ఆటగాడు శ్రీకాంత్ కిదాంబీ చేతుల మీదుగా హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్యూజన్ హ్యుందారు ప్రతినిధులు పాల్గొన్నారు. సరి కొత్త ఎలంత్రా అంతర్జాతీయంగా ఉత్తమ అమ్మకాదారునిగా వుందని సంస్థ తెలిపింది. అలాగే నాలుగో నూతన ప్రమాణాల మెలవింపుతో పాటు ప్రతి తరానికి కొత్త ప్రమాణాలను పరిచయం చేస్తుందని సంస్థ పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బ్యాటింగ్ రికార్డుల్ని కోహ్లి బ్రేక్ చేస్తాడు..!
క్రికెట్లోని అన్ని బ్యాటింగ్ రికార్డుల్ని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రేక్ చేయగలడని పాకిస్థాన్ మాజీ బౌలర్ వఖార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు.
TNN | Updated:
Dec 24, 2017, 04:56PM IST
బ్యాటింగ్ రికార్డుల్ని కోహ్లి బ్రేక్ చేస్తాడు..!
క్రికెట్‌లోని అన్ని బ్యాటింగ్ రికార్డుల్ని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రేక్ చేయగలడని పాకిస్థాన్ మాజీ బౌలర్ వఖార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మని ఇటీవల వివాహం చేసుకున్న విరాట్ కోహ్లి ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే.. జనవరి 5 నుంచి భారత్ జట్టు సుదీర్ఘ సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. కఠినమైన ఈ సిరీస్‌లో భారత్ జట్టుని విరాట్ కోహ్లి ఎలా నడిపిస్తాడోననే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ సామర్థ్యంపై వఖార్ మాట్లాడాడు.
‘విరాట్ కోహ్లి ఫిటెనెస్‌, ఆటని ఆస్వాదించే తీరు అమోఘం. క్రికెట్‌లోని అన్ని బ్యాటింగ్ రికార్డుల్ని బద్దలుకొట్టగలిగే ప్రతిభ అతనిలో ఉంది. ఇప్పటికే తాను అన్ని రికార్డుల్ని అందుకోగలనని కోహ్లి నిరూపించాడు’ అని వివరించాడు. కోహ్లిని సచిన్‌తో పోల్చడంపై పాకిస్థాన్ మాజీ బౌలర్ మాట్లాడుతూ ‘సచిన్‌తో కలిసి నేను చాలా మ్యాచ్‌లు ఆడాను. ఇంకా చెప్పాలంటే పాకిస్థాన్‌పైనే అతను అరంగేట్రం చేశాడు. దీంతో సచిన్ కెరీర్ ఆరంభం నుంచి దిగ్గజ ఆటగాడిగా ఎదగడం వరకు నేను గమనించాను. అతనో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. సచిన్‌కి బౌలింగ్ చేయడం ఓ సవాల్’ అని వివరించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
West Indies, First Published 11, Aug 2018, 5:28 PM IST
Highlights
వెస్టిండిస్ దీవుల్లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఓ పాకిస్తానీ బౌలర్ చేసిన పనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిడా స్పూర్తిని మంటగలుపుతూ ఇలా ఓ అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ ప్రవర్తిచడం సిగ్గుచేటని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ ఆ బౌలర్ ఎవరు? అభిమానులు అంతలా ఆగ్రహించేలా ఏం చేశాడో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవండి.
వెస్టిండిస్ దీవుల్లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఓ పాకిస్తానీ బౌలర్ చేసిన పనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిడా స్పూర్తిని మంటగలుపుతూ ఇలా ఓ అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ ప్రవర్తిచడం సిగ్గుచేటని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ ఆ బౌలర్ ఎవరు? అభిమానులు అంతలా ఆగ్రహించేలా ఏం చేశాడో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవండి.
కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో పాకిస్తాన్ ఫేస్ బౌలర్ సోహైల్ తన్వీర్ అమెజాన్ వారియర్స్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. అయితే ఇతడు గురువారం కిట్టిస్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతిగా ప్రవర్తించాడు. ఆ జట్టుకు చెందిన ఓ బ్యాట్ మెన్ ని అవుట్ చేసిన ఆనందంలో అసభ్యకరమైన సంజ్ఞ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
క్రీడాస్పూర్తిని మరిచి ప్రవర్తించిన తన్వీర్ అవుటైన బ్యాట్ మెన్ వైపు తన రెండు మధ్య వేళ్లను చూపుతూ అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు సైతం సోహైల్ పనిని తప్పుబడుతున్నారు.
ఈ ఘటన మ్యాచ్ రిఫరీకి సైతం ఆగ్రహం తెప్పించింది. దీంతో సోహైల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ రిపరీ నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. | 2sports
|
Suresh 147 Views
పాక్ క్రికెటర్ ఆఫ్రిదిపై పిసిబి ఒత్తిడి
కరాచీ: అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఇన్నిం గ్స్లతో అలరించిన పాకిస్థాన్కు చెందిన ఆఫ్రిదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పొమ్మన కుండా పొగ పెడుతున్నట్లు సమాచారం.కాగా టి20 ప్రపంచ కప్లో జట్టు పేలవ ప్రదర్శనతో కెప్టెన్సీ నుంచి వైదొలగిన అతడు ఆతరువాత చోటు కోల్పో యాడు. దుబా§్ులో జరిగే వెస్టిండీస్ సిరీస్లో అవకాశమిచ్చిన తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి అప్రిది నిష్క్రమించాలని పిసిబి ఒత్తిడి చేస్తున్నట్లు ఒక పత్రిక పేర్కొంది.కాగా మెరుపు బ్యాటింగ్తో ప్రత్యర్థి ఔలర్లకు చుక్కలు చూపించే అఫ్రిది 2010లో టెస్టులు,2015లో వన్డే క్రికెట్ నుంచి వైదొలిగాడు.కెప్టెన్సీ నుంచి వైదొలిగినా సాధారణ ఆటగాడిగా జట్టుకు సేవలందిస్తానని పేర్కొన్నాడు.అయితే సెలెక్టర్లు పట్టించుకోకుండా ఇంగ్లండ్ సిరీస్కు పక్కన పెట్టారు.విండీస్ సిరీస్ తరువాత వచ్చే ఏప్రిల్ వరకు పాక్ టి20లు ఆడదు.ఇప్పటికే 15 మందితో కూడిన యువ జట్టును ప్రకటించిన సమయంలో 16వ ఆటగాడి గా ఎంపిక చేసి ఘనంగా వీడ్కోలు పలికేందుకు అఫ్రిదిపై పిసిబి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా విదేశీ లీగుల్లో ఆడేందుకు అభ్యంతరం లేదని పిసిబి వివరించిందట. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
హ్యాపీ బర్త్ డే.. డ్రీమ్గార్ల్
నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్ను ఏలుతోన్న డ్రీమ్ గార్ల్ ఆదివారం 68వ పడిలో అడుగు పెట్టారు. మరి, డ్రీమ్ గార్ల్గా ఎంతో మంది అభిమానుల మనసులు దోచిన హేమా మాలిని గురించి తెలుసుకుందామా...
TNN | Updated:
Oct 16, 2016, 04:57PM IST
‘డ్రీమ్ గార్ల్’.. భారత చలన చిత్ర రంగంలో మరే కథానాయికకు దక్కని అరుదైన, అందమైన గుర్తింపు ఆమె సొంతం. ఆమె వయస్సు సిక్స్‌టీ ప్లస్ కావచ్చు.. కానీ, అభిమానులకు మాత్రం ఆమె ఎప్పుడూ స్వీట్ సిక్స్‌టీనే. మరి, ఆ అందాల తార ఎవరో ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. ఆమే.. హేమా మాలిని. నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతోన్న డ్రీమ్ గార్ల్ ఆదివారం 68వ పడిలో అడుగు పెట్టారు. మరి, ఎంతో మంది అభిమానుల మనసులు దోచిన హేమా మాలిని గురించి తెలుసుకుందామా...
పూర్తి పేరు: హేమా మాలిని చక్రవర్తి
పుట్టిన తేదీ: అక్టోబరు 16, 1948
స్వస్థలం: అమ్మన్ కుడీ, తమిళనాడు
తల్లిదండ్రులు: వి.ఎస్.ఆర్.చక్రవర్తి, జయలక్ష్మి
వివాహం: 1979లో హీరో ధర్మెంద్రను పెళ్లి చేసుకున్నారు
సంతానం: ఇషా డియోల్, అహనా డియోల్
సినీరంగ ప్రవేశం: 1963లో తమిళ చిత్రం‘ఇదు సతియం’
తొలి హిందీ చిత్రం: సప్నోంకా సౌదాగర్
మొత్తం చిత్రాలు: 150 పైనే
ఇవీ ప్రత్యేకతలు
# నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, నాట్య కళాకారిణిగా, రాజకీయ నాయకురాలిగా.. తల్లిగా ఇలా ఎన్నో భిన్న పాత్రలను హేమామాలిని పోషిషిస్తున్నారు.
# ఇప్పటి వరకు ఆమె 150కు పైగా చిత్రాల్లో నటించారు. విజయవంతమైన అత్యధిక చిత్రాలు ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, దేవానంద్‌లతో చేసినవే కావడం గమనార్హం.
# హేమామాలిని 1965లో ‘పాండవ వనవాసం’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు.
# 1968లో రాజ్ కపూర్ సరసన నటించిన తొలి హిందీ చిత్రం‘సప్నోం కా సౌదాగర్’ నుంచే ఆమెకు ‘డ్రీమ్ గార్ల్’గా పేరొచ్చింది.
# జీవిత భాగస్వామి దర్మేంద్రతో కలిసి ఆమె 28 చిత్రాలు చేశారు. అప్పట్లో వీరి జంటకు హిట్ పెయిర్‌గా పేరొందారు.
# ఒక పక్క నటిగా రాణిస్తూనే.. శాస్త్రీయ నృత్యంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు.
# షారుఖ్ ఖాన్, దివ్యభారతి నటించిన ‘దిల్ ఆశా హై’చిత్రానికి హేమా దర్శకత్వం వహించారు
# ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
# సర్ పదంపత్ సింఘానియా విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.
# జాతీయ సినిమా అభివృద్ధి కార్పొరేషన్ కు చైర్ పర్సన్ గా వ్యవహరించారు.
# 12వ తరగతి వరకు మాత్రమే చదివిన హేమా. నటనపై మక్కువతో సినిమాల్లోకి వచ్చేశారు.
# తాజాగా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’చిత్రంలో ఆమె బాలకృష్ణకు తల్లిగా నటిస్తున్నారు. | 0business
|
వేగం పెంచుతాం
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూయార్క్: విదేశీ మదుపరులు కోరుకుంటున్న మాదిరిగానే భారత్లో సంస్కరణల వేగాన్ని మరింత పెంచేందుకు, సరళమైన పన్ను విధానాన్ని అమలు పరిచేందుకు, విధాన పరమైన నిర్ణయాలలో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందని ఆర్థిక మంత్రి ఆరుణ్ జైటీ అన్నారు.
10 రోజుల అమెరికా పర్యటన నిమిత్తం ఇక్కడకు చేరుకున్న మంత్రి న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీని సందర్శించిన అనంతరం ఇక్కడ పీటీఐతో మాట్లాడారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్వైఎస్ఇ)లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైటీ ముగింపు గంట మోగించారు.
ఇక్కడ ఆయన ప్రముఖ వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. మంత్రి వెంట అంబూజా నియోటియా గ్రూపు ఛైర్మన్ హర్షవర్ధన్, అపోలో టైర్స్ ఛైర్మన్ ఓంకార్ కన్వర్, భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ ఛైర్మన్ రాజన్ భారతీ, భారత్ హౌటల్స్ ఛైర్పర్సన్ జ్యోష్న సూరీ ఉన్నారు. ఎన్వైఎస్ఇలో గంట మోగించడంతో పాటు ఎక్సేంజీ ఉన్నతాధికారులతో ముచ్చటించారు. ఫిక్కీ అమెరికాలోని పారిశ్రామికవేత్తలతో భేటీ ఏర్పాటు చేసింది. భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
May 14,2016
ఈకామర్స్లోకి అడుగుపెట్టనున్న 'బిగ్ బజార్'
బెంగళూరు: ఫ్యూచర్ గ్రూపు సంస్థ బిగ్బజార్ ఆన్లైన్లోకి రానుందని సంస్థ సీఈఓ కిషోర్ బీయాని తెలిపారు. ఈకామర్స్ ఫోర్ట్ల్ మూడు నెలలలో ఇండియాలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఓ ఇంటర్వూలో తెలిపారు. ఈ కామర్స్ కంపెనీలు ప్లిఫ్కార్ట్, అమెజాన్ మార్కెట్ ప్రదేశాలుగా కాకుండా ఓమ్ని-చానెల్ మార్గం ద్వారా ఈ కామర్స్లోకి రంగ ప్రవేశం చేస్తామని తెలిపారు. ఈ ఆన్లైన్ అమ్మకాలకు దేశ వ్యాప్తంగా వున్న భౌతిక దుకాణాల నుంచి మద్దతు వుంటుందని తెలిపారు. అయినప్పటికీ కంపెనీ ఈ కామర్స్ రంగంలో ఒక్కొ మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్తుందని, ఓమ్ని చానల్ బ్యాంకింగ్ మోడల్గా వుంటుందని వివరించారు. అయితే ఈ తరహ నమొనా ఖరిదైనప్పటికీ ఒక సంస్థగా ఏలాంటి నష్టాలు రాకుండా వ్యాపారం చేస్తామని తెలిపారు. ఈ కామర్స్ ఫోర్ట్ల్ పున:ప్రారంభంలో కంపెనీ నుంచి వచ్చే మూడు నెలలో మంచి లాభాలను ఆశిస్తున్నట్టుగా తెలిపారు.ఈకామర్స్ సెగేంట్స్లో ప్రధాన ప్రాత పోషించాలని లక్ష్యంగా పెట్టుకున్నమని వివరించారు. ఈ రంగం చాలా బలంగా వుందని, విస్తరించి వున్నదని, వేగవంతమైన అమ్మకాలు, భూగోళంలలో ఎక్కడికైనా తొందరగా చేరే విధంగా చేస్తుందని పేర్కొన్కారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
sumalatha 141 Views Anil-Agarwa , Jet Airways
Anil-Agarwal
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన మూతపడిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ఆశలు అడియాసలు అవుతున్నాయి. మైనింగ్, మెటల్ దిగ్గజం అనిల్ అగర్వాల్ ఫ్యామిలీ ట్రస్ట్ వోల్కన్ ఇన్వెస్ట్మెంట్ జెట్ ఎయిర్వేస్ బిడ్ను ఉపసంహరించుకుంది. గత శనివారం గడువు ముగింపు వరకు మూడు అంతర్జాతీయ సంస్థలు బిడ్ను దాఖలు చేశాయి. అయితే ప్రస్తుతం రెండు సంస్థలు అవంతులో గ్రూప్, ఆర్ఎ క్రియెటర్లు బరిలో ఉన్నాయి. జెట్లో సమస్యలను పరిష్కరించని కారణంగా బిడ్కు సుముఖంగా లేమని 24 శాతం వాటాలను కల్గిన ఎతిహాద్ ప్రకటించిన తర్వాత వోల్కన్ వెనక్కి తగ్గింది. కాగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఈ ఏడాది ఏప్రిల్లో విమానయాన సేవలకు జెట్ ఎయిర్వేస్ దూరమైన విషయం తెలిసిందే.
తాజా చెలి వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/specials/women/ | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వారెవ్వా బన్నీ.. క్రేజ్తో షేక్ చేస్తున్నాడుగా!
అల్లు అర్జున్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటాడు.
TNN | Updated:
Nov 20, 2017, 09:11PM IST
అల్లు అర్జున్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటాడు. సోషల్ మీడియాలో బన్నీకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ఖాతాల్లో లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇన్‌స్ట‌ాగ్రామ్‌ లోకి కూడా ఎంటర్ అయిపోయాడు. ఇంకా అందులో ఆయన ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు జస్ట్ అకౌంట్ ఓపెన్ చేశాదంతే.. ఇంతలోనే అతడి ఫాలోవర్ల సంఖ్య లక్ష దాటిపోయింది. ఇన్‌స్ట‌ాగ్రామ్‌‌తో తన జర్నీ 21వ తారీఖు నుండి మొదలవుతుందని ఒక మెమొరబుల్ ఫోటోను ఆరోజు ఇన్‌స్ట‌ాగ్రామ్‌‌లో పోస్ట్ చేస్తానని బన్నీ వెల్లడించాడు.
దీంతో ఆయన ఎలాంటి ఫోటో షేర్ చేయబోతున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో కలుగుతోంది. ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ 'నా పేరు సూర్య' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో బన్నీకు విలన్‌గా అనూప్ సింగ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సల్మాన్కు కోన సపోర్ట్.. తిట్టిపోసిన నెటిజన్లు
కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు సానుభూతిపరులు పెరిగిపోతున్నారు.
Samayam Telugu | Updated:
Apr 6, 2018, 10:02AM IST
కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు సానుభూతిపరులు పెరిగిపోతున్నారు. ఈ జాబితాలో తాజాగా రచయిత, దర్శకుడు కోన వెంకట్ కూడా చేరారు. సల్మాన్ ఖాన్ కేసులో తీర్పు విని తాను షాక్కు గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. దోషిగా తేలినంత మాత్రాన ఆయన వ్యక్తిత్వంపై చర్చ జరపాల్సిన అవసరం లేదన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి చాలా దేశాల ప్రభుత్వాలు జంతువుల వేటను అనుమతిస్తున్నాయని.. మొదట మనుషులను కాపాలి అంటూ కోన తన ట్వీట్లో పేర్కొన్నారు. ‘ఐ సపోర్ట్ సల్మాన్’ అనే హ్యాష్టాగ్ను కూడా తగిలించారు.
I’m shocked at the verdict on @BeingSalmanKhan ... let’s not debate on his character... in many countries governmen… https://t.co/wPx5jzfc4e
— kona venkat (@konavenkat99) 1522951738000
అయితే కోన వ్యాఖ్యలపై ట్విట్టరేట్స్ మండిపడ్డారు. మనషుల మీదికి కారును ఎక్కించినప్పుడు ఏమైంది మీ మానవత్వం అంటూ రిప్లైలు ఇస్తున్నారు. ‘ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీల కోసం న్యాయ, నిబంధనలు మార్చుకుంటూ పోవాలా.. మా ఇండియాలో అయితే అనుమతించం సర్. మీరు కావాలంటే వేరే దేశం వెళ్లి వేటాడుకోండి’ అంటూ మరొకరు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి వీరి కామెంట్లకు కోన స్పందించారు.
I know that many of u are hurt with my support to @BeingSalmanKhan on the case .... but I’m more concerned about Sa… https://t.co/qu2zVi8xFP
— kona venkat (@konavenkat99) 1522957092000
సల్మాన్ ఖాన్కు తాను వత్తాసు పలకడం వల్ల చాలా మంది బాధపడతారని తనకు తెలుసని, అయితే తన ఆందోళనంతా సల్మాన్ భాయి గురించేనని కోన మరో ట్వీట్లో వెల్లడించారు. పాములు, తేళ్లు సహా ఏ జంతువునూ చంపడాన్ని తాను ప్రోత్సహించనని పేర్కొన్నారు. మానవత్వానికి మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ‘అందరూ అర్థం చేసుకుంటురాని ఆశిస్తున్నా’ అంటూ ముగించారు. కాగా, సల్మాన్కు కోన వెంకట్ సన్నిహితంగా ఉంటారు. కొన్ని సల్మాన్ సినిమాలకు కోన స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. ఇదిలా ఉంటే, కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జోధ్పూర్ జైలులో ఉన్నారు. | 0business
|
COFFEE
కేఫ్ కాఫీడే వాటా కొనుగోలు
ముంబయి, మే 15: కేఫ్కాఫీడే చైన్ స్టోర్లు నిర్వహి స్తున్న కాఫీడే ఎంటర్ప్రైజెస్ తన అనుబంధ సంస్థ సికాల్ లాజిస్టిక్స్ రెండు చిన్న సంస్థల్లో మెజార్టీ వాటా లను కొనుగోలుచేస్తున్నట్లు వెల్లడించింది. రవాణా రంగంలో ఈ సంస్థలు బహుముఖంగా పనిచేస్తున్నాయి. గోదాముల నిర్వహణ పంపిణీ బిజినెస్లకు సంబంధించి ఈ రెండు సంస్థల్లో మెజార్టీ వాటాలు కొనుగోలు చేసింది. అంతేకాకుండా కంపెనీ అనుబంధ సంస్థ సికాల్ లాజి స్టిక్స్ ఈ రెండుసంస్థల్లో వాటాల కొనుగోలుకు విధాన కసరత్తులు షురూచేసింది. ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ బిజినెస్ సంస్థలో 40 కోట్లు రాబడులతో పటిష్టంగా ఉంది. కాఫీడే ఎంటర్ప్రైజెస్ ఈ సమాచారం బిఎస్ఇకి సైతం నివేదించింది. కంపెనీ బోర్డు డైరెక్టర్లు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. రెండోకంపెనీ పరంగా వార్షికంగా 20 కోట్ల రాబడులు సాధిస్తోంది. | 1entertainment
|
Suresh 119 Views
ఎయిర్టెల్ నుంచి రూ.25కే నెట్
హైదరాబాద్, సెప్టెంబరు 7: రిలయన్స్జియో పోటీ ని తట్టుకునేందుకు దేశంలోని అగ్రగామి టెలికాం సేవలసంస్థ ఎయిర్టెల్ నెలంతా పొదుపైన ఇంటర్నెట్అని కొత్త స్కీం ప్రవేశపెట్టింది. కేవలం రూ.25తో 30రోజుల కాలపరిమితికలిగిన ప్రీపెయిడ్ వోచర్ను ప్రారంభించింది. అయితే సర్కిళ్ల వారీగా ధరల్లో తేడాలు ఉంటాయని వెల్ల డించింది.రూ.25 నుంచి ఈ ధరలు కూడా ప్రారం భం అవుతాయని కస్ట మర్లు తమకు ఇష్టమైన ప్యాక్ను ఎంచుకోవచ్చని ఎయిర్టెల్ డైరెక్టర్ అజ§్ుపూరి వెల్లడించారు. కస్టమర్లు ఈధరలతో 75ఎంబి 2జి,3జి, 4జి డేటాను పొందేఅవకాశం ఉంది. మొదటిసారి నెట్ వినియోగించేవారికి, అవసరం వచ్చినపుడు మాత్రమేనెట్ వినియోగించుకునే వారికి ఈ వోచర్ఆఫర్ ఎంతో వినియోగంఅవుతుందన్నారు. | 1entertainment
|
"రాజు గారి గది 2" మూవీ రివ్యూ, రేటింగ్
Highlights
చిత్రం : రాజు గారి గది 2
జానర్ : కామెడీ హారర్
నటీ నటులు : నాగార్జున, సమంత,సీరత్ కపూర్, వెన్నెల కిషోర్,ప్రవీణ్ తదితరులు
మ్యూజిక్ : ఎస్.ఎస్.థమన్
ప్రొడక్షన్ : పి.వి.పి సినిమాస్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : ప్రసాద్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి
స్క్రీన్ ప్లే,దర్శకత్వం : ఓంకార్
ఆసియానెట్ రేటింగ్: 3/5
నాగార్జున కథానాయకుడిగా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఓంకార్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘రాజు గారి గది-2’ . పి.వి.పి సినిమాస్, ఓక్ ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రం మలయాళ హారర్ సినిమా "ప్రేతమ్" కథను తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి రీమేక్ చేశారు. నాగార్జున తొలి సారిగా మెంటలిస్ట్(మంత్రగాడిగా) పాత్రలో నటించిన ఈ చిత్రంలో సమంత ప్రత్యేక పాత్రలో నటించింది. మరి అక్కినేని కుటుంబంలో సమంత అడుగుపెట్టాక తొలిసారిగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందా..
కథ:
అశ్విన్ (అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఎప్పటికీ తమ స్నేహం అలాగే ఉండాలని ఆలోచనతో ముగ్గురు కలిసి ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ ఓ బిజినెస్ మొదలు పెడతారు. విశాఖపట్నం బీచ్ లో ఉండే రాజుగారి బంగ్లా కొని అందులో రిసార్ట్ స్టార్ట్ చేస్తారు. రిసార్ట్ కు వచ్చిన సుహానిస (సీరత్ కపూర్) మీద కిశోర్, ప్రవీణ్ లు మనసుపడతారు. అయితే ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నంలో వారికి ఆ రిసార్ట్ లో దెయ్యం ఉందని తెలుస్తుంది.
దెయ్యం పని పట్టేందుకు దగ్గరలోని చర్చి ఫాదర్ ను కలిస్తే ఆయన రుద్ర ( నాగార్జున) గురించి చెప్తాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ మెంటలిస్ట్ లో ఒకడైన రుద్ర, సైన్స్ గురించి ఎంత తెలిసిన మన పాత ఆచారాలను, నమ్మకాలను పాటిస్తుంటాడు. రిసార్ట్ కు వచ్చిన రుద్ర.. అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ రిసార్ట్ లో తిరుగుతుందని, ఏవో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఆ ఆత్మ ప్రయత్నిస్తుందని కనిపెడతాడు. అమృత ఎవరు..? ఎలా చనిపోయింది..? అమృత తెలుసుకోవాలనుకుంటున్న సమాధానాలు ఏంటి..? ఆ సమాధానాలు అమృతకు తెలిసాయా..? రుద్ర ఆత్మకు ఎలా సాయం చేశాడు..? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
* సినిమాలో నాగార్జున మానసిక వైద్యుడిగా చేసి అదరగొట్టాడు.
* వెన్నెలకిషోర్, అశ్విన్, షకలక శంకర్ ల కామెడీ బాగుంది.
* ఓంకార్ డైరెక్షన్ ఆకట్టుకుంది. కాకపోతే రాజాగారి గది ఛాయలు చాల వరకు కనిపించాయి.
* ఆత్మ గా సమంత ఆకట్టుకుంది., సీరత్ కపూర్ గ్లామర్ తో యూత్ ను ఫిదా చేసింది.
* నిర్మాణ విలువలు బాగున్నాయి.
* ఓవరాల్ గా సినిమా అంతా కామెడీ తో సాగిపోయింది. ప్రేక్షకులకు మంచి వినోదం ఖాయం.
నటీటనటులు:
హీరో నాగార్జున రాజు గారి గది 2తో మరో విభిన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రయోగాలకు ఎప్పుడు ముందుండే నాగ్, ఈ సినిమాలో మెంటలిస్ట్ రుద్ర పాత్రలో మెప్పించారు. మనసులోని భావాలను పసిగట్టే పాత్రలో నాగ్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత నాగార్జున కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో ఈ ఇద్దరి నటన కట్టిపడేస్తుంది. సమంత తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బబ్లీగా కనిపించిన సామ్, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ సాధించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది. సీరత్ కపూర్ కు నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా.. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ షోతో అలరించింది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ లు భయపడుతూనే నవ్వించారు. మరో ముఖ్యమైన పాత్రలో అభినయ ఆకట్టుకుంది. క్లైమాక్స్ సీన్స్ లో సమంతతో పోటీ పడి నటించింది.
సాంకేతిక నిపుణులు:
రాజుగారి గది సినిమాతోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ఓంకార్, రెండో సినిమాతో మరోసారి మెప్పించాడు. నాగార్జున, సమంత లాంటి టాప్ స్టార్స్ ఉన్న కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం కలిసొచ్చింది. మలయాళ సినిమా నుంచి మూలకథను తీసుకున్న ఓంకార్, పూర్తిగా కొత్త టేకింగ్ తో మెప్పించాడు. ఎక్కవగా ఇది రీమేక్ అన్న ఆలోచన రానంతగా మన నేటివిటికీ తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న సమంత నుంచి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ రాబట్టడంలో ఓంకార్ విజయం సాధించాడు. సినిమాకు మరో ఎసెట్ తమన్ అందించిన సంగీతం, పాటలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమాలో బిట్స్ సాంగ్స్ తో అలరించాడు. ఇక తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. దివాకరన్ సినిమాటోగ్రఫి హర్రర్ సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకువచ్చింది. పీవీపీ సినిమా నిర్మాణలు విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
నాగార్జున, సమంతల నటన
క్లైమాక్స్
ఫస్ట్ హాఫ్ లోని కొన్ని అనవసరమైన సీన్స్
చివరగా:
రాజుగారి గది2 ఫ్యామిలీ అందరికీ వినోదం పంచే కామెడీ హారర్ | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 6 పాయింట్లు నష్టపోయి 26,298 వద్ద వద్ద ముగిసింది. నిఫ్టీ 3.15 పాయింట్ల లాభంతో 8,111 వద్ద ముగిసింది...
TNN | Updated:
Nov 16, 2016, 04:07PM IST
వరుసగా మూడో రోజు సెన్సెక్స్ నష్టపోయింది. బుధవారం స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 6 పాయింట్లు నష్టపోయి 26,298 వద్ద వద్ద ముగిసింది. నిఫ్టీ 3.15 పాయింట్ల లాభంతో 8,111 వద్ద ముగిసింది. ఆతోమొబైల్ రంగం షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. మారుతి సుజుకి, హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. వీటితో పాటు ఏసియన్ పెయింట్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, హిందూస్థాన్ యూనీలీవర్, భారతీ ఎయిర్ టెల్, లార్సెన్ అండ్ టర్బో, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. కాగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, సిప్లా, లుపిన్ , విప్రో, టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 67.83 వద్ద స్థిరపడింది. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
నేను.. శైలజ సినిమా అందరికీ నచ్చింది. కానీ నా నుండి డాన్స్, ఫైట్స్ ఆశించే ప్రేక్షకులు ఇంకా
ఏదో ఆశిస్తారు. అలాంటి వారికి హైపర్ ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్
హైపర్ గా ఉంటుంది. అలాంటి వాడు ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.. అందుకే క్యాప్షన్ గా అదే పెట్టాం.
నిజానికి ఈ సినిమా టైటిల్ షూటింగ్ ఫైనల్ సమయంలో పెట్టాం. అందరూ నా కోసం ఇలాంటి
టైటిల్ పెట్టారని అనుకుంటారని మొదట టైటిల్ చెప్పినప్పుడు కామ్ గా ఉండిపోయాను. ఆ
తరువాత క్యాప్షన్ చెప్పగానే యాప్ట్ అనిపించింది.
ఫాదర్ సెంటిమెంట్ తో చాలా సినిమాలొచ్చాయి. ఈ సినిమా ప్రత్యేకత ఏంటి..?
ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఫాదర్ సెంటిమెంట్ తో ఉంటూ.. ఆడియన్స్ కు సందేశం ఇచ్చే
విధంగా సినిమా ఉంటుంది. కానీ ఆ మెసేజ్ చెప్పడానికి నా వయసు సరిపోదు. అందుకే సత్యరాజ్
వంటి నటుడిని తండ్రి పాత్రలో తీసుకున్నాం. కమర్షియల్ ఎలిమెంట్స్ కు సుగర్ కోటెడ్ లా మెసేజ్
ఉంటుంది. కథ విన్నప్పుడు కూడా ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది.
సినిమాలో హీరో ఏం చేస్తుంటాడు..?
.నా పాత్ర పేరు సూర్య, తండ్రి పేరు నారాయణ. సినిమాలో హీరో ఏం చేస్తున్నాడనే దానికి పెద్దగా
ప్రాముఖ్యత ఉండదు. సినిమా చూస్తే తెలుస్తుంది.
ట్రైలర్ బట్టి సినిమాలో సత్యరాజ్, మీ కాంబినేషన్ సీన్స్ చాలా ఫన్ గా ఉంటాయనిపిస్తుంది..?
అవునండీ.. ఇప్పటివరకు సత్యరాజ్ గారు తెలుగులో సీరియస్ గా ఉండే పాత్రల్లోనే కనిపించారు.
కానీ ఈ సినిమాలో ఆయన కామెడీ యాంగల్ ను చూపించాం. ప్రతి కొడుకికి తన తండ్రి మీద
ప్రేమ ఉంటుంది. కానీ ఎక్స్ప్రెస్ చేయరు. లోపల చచ్చేంత ప్రేమ ఉంటే ప్రతి క్షణం ఆ ప్రేమను
చూపించడానికి ప్రయత్నిస్తారు.
మీ నిజజీవితంలో కూడా ఫాదర్ తో అలానే ఉంటారా..?
అందరిలానే నేను కూడా.. నాన్న అంటే గౌరవం ఉంది కానీ భయం లేదు.
కందిరీగకు, హైపర్ కు డైరెక్టర్ శ్రీనివాస్ లో ఏదైనా మార్పు గమనించారా..?
కందిరీగ సమయంలోనే శ్రీనివాస్ చాలా మెచ్యూర్డ్ గా ఉండేవాడు. ఇప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్స్
ఇంకా పెరిగాయి. అయినా కందిరీగ, హైపర్ రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. కొన్ని సినిమాలు హిట్ అయితే
పేరొస్తుంది. ఈ సినిమా హిట్ అయితే గౌరవం వస్తుంది.
మీ వరకు మీ డైరెక్టర్ హైపర్ అంటారా..? లేక నిర్మాతలా..?
డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ హైపర్ ఉన్నవాళ్లే.. లేకపోతే సినిమా ఇంత తొందరగా పూర్తయ్యేది కాదు. నిజానికి 14 రీల్స్ లో మొదటి సినిమా నేను చేయాల్సివుంది. కానీ కుదరలేదు. అప్పటినుండి అనుకుంటే ఇప్పటికీ కుదిరింది.
సక్సెస్ తరువాత సినిమా చేయడం.. ఫెల్యూర్ తరువాత సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది..?
టెన్షన్ పడాలనుకుంటే ప్రతిదానికి పడాలి. హిట్ వచ్చింది.. తరువాత సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని ప్రెషర్ లో ఉండొచ్చు.. అలానే ఫ్లాప్ వచ్చింది.. నెక్స్ట్ ఎలా అయినా.. హిట్ కొట్టాలనే టెన్షన్ పడొచ్చు. నా వరకు నేను దేనికి టెన్షన్ పడను. సినిమా అంటే రోలర్ కోస్టర్ రైడ్. సక్సెస్ చూసా.. ఫెల్యూర్ చూశాను. ఇప్పుడు లాజికల్ గా ఆలోచిస్తున్నాను. నాకు ఆ స్టెబిలిటీ వచ్చిందని భావిస్తున్నా..
ఎలాంటి దర్శకులతో పని చేయాలనుకుంటున్నారు..?
నేను.. శైలజ సినిమా తరువాత నాకు చాలా కథలు ఆఫర్స్ వచ్చాయి. నటుడిగా నా పరిణితిని
రోజురోజుకి పెంచుకోవాలి. రామ్ ను ఇలా కూడా చూపించొచ్చు అని కొత్తగా ఆలోచించే వారితో పని
చేయాలానుకుంటాను. అందుకే డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ తో పని చేస్తుంటాను.. నాలో తెలియని
యాంగల్ ను ప్రొజెక్ట్ చేస్తే అదే నాకు ఎక్కువ తృప్తినిస్తుంది.
తమిళ సినిమాల్లో ఏమైనా నటిస్తున్నారా..?
ఒక్క తమిళం అని కాకుండా తెలుగు, తమిళ భాషల్లో రూపొందే సినిమా కోసం చూస్తున్నాను. కథలు
వింటున్నా కానీ రెండు భాషలకు సెట్ అయ్యే కథ దొరకడం లేదు. దొరికితే చేస్తా..
ఈ సినిమాలో హీరోయిన్ కామెడీ చేయాలి. సుప్రీం సినిమా చూసిన తరువాత రాశి అయితే ఈ కథకు
యాప్ట్ అనిపించింది. అందుకే సెలెక్ట్ చేసుకున్నాం.
కమర్షియల్ సినిమాలు ప్రయోగాత్మకంగా చేస్తారా..?
నేను నటించిన 'జగడం','ఎందుకంటే ప్రేమంట' సినిమాలు ఆ జోనర్ లోకే వస్తాయి. అయితే కొన్ని
సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి.. కొన్ని ఫ్లాప్ అవుతాయి. వారికి నచ్చే విధంగా ఉండే
కమర్షియల్ ఎక్స్పెరిమెంట్ కథలు దొరికితే చేస్తాను.
అనిల్ రావిపూడి, కరుణాకరన్, కిషోర్ తిరుమల వంటి దర్శకులతో పని చేయబోతున్నారని
విన్నాం..? | 0business
|
Suresh 209 Views
వింబుల్డన్కు నాదల్ దూరం
న్యూఢిల్లీ: వరల్డ్ టెన్నిస్లో సత్తాచాటుతూ వస్తున్న నాదల్కు ప్రస్తుతం పరిస్థితులు అంతగా అనుకరించటం లేదు. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్లో భారీ ఆశలతో అడుగుపెట్టిన ఈ 30 ఏళ్ల యువసంచలన గాయం కారణంగా రెండవ రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. త్వరలో జరగనున్న వింబుల్డన్లో కూడ ఇతను ఆడే అవకాశం లేదని తెలిసింది. చేతి మణికట్టుకు అయిన గాయం కారణంగా వింబుల్డన్లో అడుగుపెట్టటం లేదు. | 2sports
|
May 14,2017
ఆదివారమూ బంకుల తెరిచే ఉంటాయి..
ముంబయి: ఇంధన వాడకాన్ని తగ్గించే ఉద్దేశంతో నేటి (మే 14) నుంచి మొదలుకొని ఆదివారాల్లో పెట్రోలు బంకులను మూసి ఉంచాలనుకున్న డీలర్ల ప్రతిపాదన తాత్కాలికంగా అటుకెక్కింది. ఈ దిశగా తీసుకున్న నిర్ణయాన్ని డీలర్ల సంఘం ప్రస్తుతానికి వాయిదా వేసుకుంది. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ఇంధన వాడకాన్ని తగించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించిన మేరకు.. మే 14 నుంచి మొదలుకొని ఆదివారాల్లో పెట్రోలు బంకులను మూసి ఉంచాలని 'కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోల్ డీలర్స్' (సీఐపీడీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే పెట్రోలు నిత్యవసర వస్తువుల జాబితాలో ఉండడం.. సీఐపీడీ నిర్ణయం పట్ల ప్రభుత్వ వర్గాల నుంచి బాహాటంగానే వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐపీడీ తాత్కాలికంగా తమ ప్రతిపాదనను పక్కన బెట్టినట్టు సమాచారం. సీఐపీడీ అధ్యక్షుడు ఈ విషయమై మాట్లాడుతూ బంకుల మూసివేత విషయమై చర్చించేందుకు బుధవారం (మే 17న) సర్కారు తమను చర్చలకు ఆహ్వానించినట్టుగా తెలిపారు. ఈ విషయమై సర్వసమ్మత నిర్ణయం వెలువడే వరకు ఎప్పటి మాదిరిగానే ఆదివారాల్లో కూడా బంకులను తెరచే ఉంటాయని ఆయన వివరణనిచ్చారు. కాగా.. తెలంగాణలోని బంకుల వద్ద డీలర్లు ఆదివారం తమ బంకులు పనిచేయవంటూ బోర్డులు పెట్టడంతో ప్రజలు ఆయోమయానికి గురయ్యారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
xiaomi: 512 జీబీ స్టోరేజ్తో రానున్న షియోమీ 'ఎంఐ 8' స్మార్ట్ఫోన్!
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ 'ఎంఐ 8'ను మే 31న విడుదల చేయనుంది. షియోమీ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోన్ను విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
Samayam Telugu | Updated:
May 27, 2018, 02:35PM IST
xiaomi: 512 జీబీ స్టోరేజ్తో రానున్న షియోమీ 'ఎంఐ 8' స్మార్ట్ఫోన్!
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ 'ఎంఐ 8'ను మే 31న విడుదల చేయనుంది. షియోమీ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోన్ను విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ రానుంది. 6/ 8 జీబీ ర్యామ్, 256/ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో వినియోగదారులను అలరించడానికి రాబోతుంది. ఈ కొత్త 'ఎంఐ 8' స్మార్ట్ఫోన్లో ఫింగర్ప్రింట్ సెన్సార్ను డిస్ప్లే కిందే ఉండనుంది. ఈ ఫోన్లో అధునాతన స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ను ఏర్పాటుచేశారు. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వరల్డ్ కప్కు నేరుగా క్వాలిఫై కాలేకపోయిన లంక
భారత్ చేతిలో వరుసగా నాలుగు వన్డేలు ఓడిన శ్రీలంక క్రికెట్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. వచ్చే వరల్డ్ కప్కు నేరుగా క్వాలిఫై..
TNN | Updated:
Sep 1, 2017, 11:11AM IST
భారత్ చేతిలో వరుసగా నాలుగు వన్డేలు ఓడిన శ్రీలంక జట్టుకు మరో ఎదురు దెబ్బతగిలింది. ఐసీసీ వరల్డ్ కప్ 2019‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే భారత్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో లంక కనీసం రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాల్సి ఉండగా.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. సెప్టెంబర్ 30లోగా టాప్-7లో నిలిచిన జట్లతోపాటు ఆతిథ్య జట్టు హోదాలో ఇంగ్లాండ్ వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి.
భారత్ చేతిలో 0-4 తేడాతో ఓడిన లంక జట్టు ప్రపంచ కప్‌కు అర్హత సాధించడం అనేది వెస్టిండీస్ చేతుల్లో ఉంది. కరేబియన్ జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో ఓడితేనే లంక వరల్డ్ కప్ కోసం నేరుగా బెర్తు దక్కించుకుంటుంది. చివరి వన్డేలో గెలిస్తే లంక ఖాతాలో 88 పాయింట్లు ఉంటాయి. కానీ ఆటోమెటిక్‌గా క్వాలిఫై కావడానికి ఆ పాయింట్లు సరిపోవు. సెప్టెంబర్ 30లోగా విండీస్ జట్టు ఆరు వన్డేలు ఆడనుంది. 13వ తేదీన ఐర్లాండ్‌తో ఒక మ్యాచ్ ఆడనున్న విండీస్ జట్టు.. సెప్టెంబర్ 19-29 తేదీల మధ్య ఇంగ్లండ్‌తో ఐదు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో కరేబియన్ జట్టు గెలుపొందితే.. దాని ఖాతాలో 88 పాయింట్లు చేరతాయి. డెసిమల్ పాయింట్ల అంతరంతో లంకను దాటేసి విండీస్ జట్టు ప్రపంచ కప్‌కు నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. | 2sports
|
SENSEX
ఈక్విటీకి ఎయిర్టెల్ మద్దతు
ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు వరుసగాఆరోరోజు కూడా లాభాల్లోనే కొనసాగాయి. తొలుత జోరందుకుని ఏడాది గరిష్టస్థాయికి చేరినప్పటికీ చివర్లో వెనకడుగు వేసా యి. ఫిబ్రవరి డెరివేటివ్స్ గురువారంతో ముగిసిన నేపథ్యంలో చివరి అర్ధగంటలో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపట్టారు. భారీ అమ్మకాలతో మార్కెట్లు స్వల్పలాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ట్రేడింగ్ముగిసే సమయానికి సెన్సెక్స్28 పాయిం ట్లు పెరిగి 28,893 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 13 పాయింట్లు లాభంతో 8939 వద్ద ముగిసింది. మధ్యాహ్నం ట్రేడింగ్ నుంచి కొనుగోళ్లు జోరందు కోవడంతో ఎన్ఎస్ఇ ప్రధాన సూచి నిఫ్టీ 8969ని అధిగమించింది. గడచిన 2016 సెప్టెంబరులో సాధించిన గరిష్టస్థాయి మళ్లీ నమోదు చేసినట్లయిం ది. ఇక సెన్సెక్స్పరంగా లాభాల డబుల్సెంచరీ సాధించి 29వేల పాయింట్ల మార్కును దాటింది. ఎన్ఎస్ఇలో ఐటి 1.7శాతం దూకితే రియాల్టీ 0.8 శాతం, మెటల్ 0.4శాతం బలపడ్డాయి. మరోపక్క పిఎస్యు బ్యాంక్సూచి 0.4శాతం నీరసించింది. ఎయిర్టెల్ టెలినార్ను కొనుగోలు చేస్తున్నదన్న వార్తలతో ముందు 11శాతానికి దూసుకవెళ్లింది. ఆ తర్వాత చివరిలో 1.5శాతం లాభాలతోనే సరిపెట్టు కుని రూ.366 వద్ద నిలిచింది.
ఇంట్రాడేలో రూ.400సైతం అధిగమించింది. వొడాఫోన్తో విలీ నం వార్తలతో ఐడియా 6.4శాతం కదిలి 120వద్ద ముగిసింది. ఒకదశలో 128కి సైతం వెళ్లింది. ఇటీ వల నీరసించిన ఐటి కౌంటర్లు స్వల్ప రికవరీ జరగ డంతో టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్ 2-3శాతంమధ్య లాభపడ్డాయి. మిగిలిన బ్లూచిప్ కంపెనీల్లో కోటక్ బ్యాంకు, ఇండస్ ఇండ్, హిందాల్కో, ఐటిసి 1-2 శాతం మధ్య బలపడితే గ్రాసిమ్ రిల్,అరబిందో, ఇన్ఫ్రాటెల్, ఐషర్, ఎంఅండ్ఎం 1-2శాతం మధ్య నష్టపోయాయి. ఇంట్రాడే నుంచి ఊపందుకున్న కొనుగోళ్లతో మార్కెట్లు లాభాల ర్యాలీతో ముందుకు వెళ్లినా చివరిలో మంద గించింది. సెన్సెక్స్ ఒక దశలో29,030 పాయిం ట్లను నమోదుచేఇసంది. తద్వారా29వేల పాయిం ట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 52పాయింట్లుపెరిగి 8979కి చేరింది. ఏడాది గరిష్ట స్థాయి 8966 పాయమింట్లను దాటడమే కాకుండా ఆల్టైమ్ గరిష్టంవైపు దూసుకువెళ్లింది. ఫిబ్రవరి డెరివేటివ్స్ముగిసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు, ఇటుట్రేడర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వ డంతో సెంటిమెంట్కు మద్దతునిచ్చిటన్లు నిపు ణులుఅంచనావేస్తున్నారు.ఎన్ఎస్ఇలో చూస్తే అన్నిరంగాలులాభపడ్డాయి. బ్యాంకు, మెడల్, రియాల్టీ రంగాలు 0.5శాతం పెరిగితే బ్లూచిప్లో ఐడియా 5.2శాతం పెరిగింది. శివరాత్రి సెలవ్! మార్కెట్లకు శివరాత్రి పర్వదినం సంద ర్భంగా సెలవు ప్రకటించారు. ఈక్విటీ, కరెన్సీ, కమోడిటీ మార్కెట్లకు శుక్రవారం సెలవు కావడంతో మూతపడతాయి. దీనితో ట్రేడింగ్ మళ్లీ సోమవారం 27వ తేదీ యధావిధిగా ప్రారంభం అవుతుంది. దీనివల్ల ఈ వారంలో ట్రేడింగ్ కేవలం నాలుగురోజులు మాత్రమే జరిగింది.
గురువారంతోనే ఎఫ్అండ్ఒ కాంట్రాక్టులు ముగియడంతో డెరివేటివ్ సిరీస్ కూడా అదేరోజు ప్రారంభం అవుతాయి. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
దూసుకెళ్తున్న దీప కర్మాకర్
మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ క్వాలిఫికేషన్ లో భారత క్రీడాకారిణి దీప కర్మాకర్ తన సత్తా చాటింది.
TNN | Updated:
Aug 8, 2016, 07:28AM IST
రియో ఒలింపిక్స్ లో మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ క్వాలిఫికేషన్ లో భారత క్రీడాకారిణి దీప కర్మాకర్ తన సత్తా చాటింది. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్టిక్ గా రియోలో అడుగుపెట్టిన ఈమె అక్కడ పట్టుదలతో పోరాడుతోంది. వివిధ విభాగాల్లో మెరుగైన స్కోర్ సాధిస్తూ తన ప్రతిభ చాటుతోంది. వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు సాధించింది. ఫస్ట్ అటెంప్ట్ లో 15.100 పాయింట్లతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రెండో సారి 14.600తో స్కోరు సాధించారు. వాల్ట్ విభాగంలో ప్రస్తుతం దీప ఆరో స్థానంలో ఉన్నారు. ఇందులో ప్రతిభచూపే టాప్-8 జిమ్నాస్ట్స్ ఫైనల్ కు చేరుతారు. అన్ని విభాగాల్లో కలిపి దీప ప్రస్తుతం 51.665తో 27వ స్థానంలో నిలిచింది. అన్ఈవెన్ బార్స్లో 11.666.. బ్యాలెన్స్ బీమ్లో 12.866.. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో 12.033 పాయింట్లు సాధించింది. త్రిపురకు చెందిన దీప కర్మాకర్ విజయంపై యావత్ భారతావని చాలా ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఎల్లుండి పీఎస్బీ అధినేతలతో మంత్రి భేటీ
కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మంగళవారం (19న) ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల(పీఎస్బీ) అధినేతలు, ముఖ అధికారులతో సమావేశం కానున్నారు.
Samayam Telugu | Updated:
Jun 17, 2018, 10:19AM IST
కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మంగళవారం (19న) ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల(పీఎస్బీ) అధినేతలు, ముఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల ప్రక్షాళనతో పాటు రుణ వితరణ పెంపు తదితర అంశాలపై చర్చించనున్నట్టుగా సమాచారం. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అస్వస్థత కారణంగా ఆ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న పీయూష్ గోయెల్ బ్యాంకు అధికారులతో సమావేశం కావడం ఇది రెండోసారి. మంగళవారం జరుగనున్న సమావేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల అధినేతలు, అధికారులు కూడా హాజరు కానున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు
ఈ సమావేశంలో ఆర్థిక సేవల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొననున్నారు. సంసద్ మార్గ్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానిక కార్యాలయంలో ఈ బేటీ జరుగనుంది. బ్యాంకుల రిస్క్ మెకానిజంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి కావాల్సిన సామర్థ్యాలపై కూడా ఈ సమా వేశంలో చర్చించనున్నారు. గత ఆర్థిక సంవత్స రంలో దేశంలోని మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 19 బ్యాంకులు నష్టాల్లోనే నిలవడం తెలిసిందే. భారత బ్యాకింగ్ చరిత్రలో తొలిసారిగా గత ఏడాది బ్యాంకులు దాదాపు రూ.12,280 కోట్ల నష్టాలను ప్రకటించాయి. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసే విషయంలో సర్కారు సీరియస్గా అడుగులు వేస్తున్నట్లుగా సమా చారం. ఇందులో భాగంగానే గోయెల్ గడిచిన నెలన్నర కాలంలోనే బ్యాంకు అధికారులతో సమావేశం కావడం ఇది రెెండోసారి. | 1entertainment
|
internet vaartha 349 Views
హైదరాబాద్ : దేశంలో వేగంగా విస్తరిస్తున్న టీకేఫ్ ఆపరేటర్ టీట్రయల్స్ తన అత్యాధునిక ఔట్లెట్స్లో దక్షిణాది మార్కెట్కు విస్తరిస్తోంది. తాజాగా తెలంగాణలో అడుగుపెట్టిన టీట్రయల్స్ హైద రాబాద్లో అధునాతన కేఫ్ను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీట్రయల్స్ సహవ్యవస్థాపకులు ఉదయ్ మాధుర్ మాట్లాడుతూ జోన్8 వరల్డ్ తన విస్తరణలో భాగంగా ముంబైలో ప్రస్తుతం 8 ఔట్లెట్లు నిర్వహిస్తున్నదన్నారు. వచ్చే ఏడాది చివరినాటికి 100 ఔట్లెట్లకు విస్తరించేలక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. కంపెనీ ఎక్కువగా ఫ్రాంచైజీ నెట్వర్క్ అభివృద్ధిపైనే దృష్టిపెట్టిందని పేర్కొ న్నారు. ముంబైలో ఆరు కంపెనీ ఔట్లెట్లు నిర్వహిస్తుంటే మరో రెండుఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు మాస్టర్ ఫ్రాంచైజీగా ప్రభాకరరావును నియమించింది. ప్రపంచంలో తేనీరు ఎక్కువ వినియోగించేదేశాల్లో భారత్ రెండోదేశమని అందువల్లనే డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు టీట్రయల్ వివిధ అధునాతన రుచులను ప్రవేశపెడుతున్నట్లు సంస్త సిఇఒ సంజీవ్పొట్టి వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి 17 ఔట్లెట్లకు విస్తరించాలని వచ్చే ఏడాది నాటికి వంద ఔట్లెట్లకు పూర్తిచేసే లక్ష్యంతో ఉన్నట్లు ఉదయ్ మాధుర్ వెల్లడించారు. | 1entertainment
|
Suresh 102 Views virat
virat
శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ కు కెప్టెన్ కోహ్లీ దూరమవుతున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా విశ్రాంతి
లేకుండా వరుస సిరీస్ లు ఆడుతున్న నేపథ్యంలోనే కోహ్లీతో పాటు మరికొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పించాలని
బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీతో పాటు జడేజా, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, షమిలు వన్డే సిరీస్కు
దూరం కానున్నారు. ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటన, శ్రీలంక పర్యటనల కారణంగా ఆటగాళ్లు పూర్తిగా
అలసిపోయారు. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్ పగ్గాలను చేపట్టే అవకాశం ఉంది. అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్,
కుల్ దీప్ యాదవ్, బసిల్ థంపిలు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20న తొలి వన్డే ప్రారంభం కానుంది. 12వ
తేదీన శ్రీలంకతో చివరి టెస్టు మొదలుకానుంది. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
వివాదాలకు తెర తీయనున్న `Thalaivi`.. ప్రారంభమైన అమ్మ బయోపిక్
తమిళనాట అమ్మగా పేరు తెచ్చుకున్న నటి, రాజకీయనాయకురాలు జయలలిత కథను వెండితెరకెక్కించేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తలైవి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చింది.
Samayam Telugu | Updated:
Nov 12, 2019, 08:46AM IST
తలైవి మూవీ ఓపెనింగ్
తమిళనాడు సినీ రంగంలో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ను వెండితెర కెక్కించేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయలలిత మరణం కూడా సంచలనంగా మారటతంతో అమ్మ బయోపిక్పై మరింత ఆసక్తి నెలకొంది. దీంతో చాలామంది దర్శక నిర్మాతలు జయలలిత బయోపిక్కు తెర రూపం ఇస్తున్నట్టుగా ప్రకటించారు.
Visit Site
Recommended byColombia
ఇప్పటికే ప్రముఖ దర్శక నిర్మాత గౌతమ్ మీనన్ అమ్మ బయోగ్రఫిని ప్రారంభించారు. వెబ్ సిరీస్గా తెరకెక్కుతున్న ఈ బయోగ్రఫీలో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్కు క్వీన్ అనే టైటిల్ను కన్ఫర్మ్ చేశారు. తాజాగా అమ్మ కథతో రూపొందుతున్న బయోపిక్ సెట్స్ మీదకు వచ్చింది.
Also Read: `ఏడు చేపల కథ` హీరో మరో అరాచకం.. సెన్సార్ పూర్తి చేసుకున్న `వైఫ్,ఐ`
బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్ను తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ జయలలిత బయోపిక్కు కథా స్క్రీన్ప్లే అందించారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం (11-11-2019) చెన్నైలో ప్రారంభమైంది.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో పలువురు.. తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన నటీ నటులు నటిస్తున్నారు. జయలలిత జీవితంలో ఎంతో కీలకమైన ఎంజీ రామచంద్రన్ పాత్రలో సీనియర్ నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నాడు. జయలలిత సినీ జీవితం నుంచి, రాజకీయ రంగ ప్రవేశం, సీయం స్థాయికి ఎదగటం చివరకు ఆమె మరణం కూడా వివాదాస్పదమే. అందుకే ఈ ప్రాజెక్ట్ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. సినిమాలో కంగనాను జయలలితలా చూపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: వెక్కి వెక్కి ఏడుస్తున్న పప్పు.. చుక్కలు చూపిస్తున్న వర్మ
బ్లేడ్ రన్నర్, కెప్టెన్ మార్వెల్ లాంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ప్రఖ్యాత మేకప్ ఆర్టిస్ట్ను ఈ సినిమాకు కోసం తీసుకువచ్చారు. కంగన కూడా అమ్మలా కనిపించేందుకు రిస్క్ తీసుకొని బరువు పెరిగి మీర ఈ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను నిర్మించిన విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్తో కలిసి ఈ బయోపిక్ను నిర్మిస్తున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
BSE
మెటల్, పిఎస్యు స్టాక్స్ మద్దతు
ముంబయి,ఆగస్టు 5: స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్,నిఫ్టీ రెండూ కూడా గరిష్టస్థాయి లోనే ముగిసాయి. గతట్రేడింగ్లలోని నష్టాలను రివర్స్చేస్తూ వినియోగరంగ ఉత్పత్తులు, మెటల్, ప్రభుత్వరంగ స్టాక్స్ కంపెనీలు మద్దతునిచ్చాయి. మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల నీర సించిన ధోరణులు అంతగా ప్రభావం చూపించలేదు. ఎన్ఎస్ఇ సూచి 52.75 పాయింట్ల ఎగువన 10,066.40 పాయింట్లవద్ద స్థిరపడితే బిఎస్ఇ సెన్సెక్స్ 87.53 పాయింట్లవద్ద స్థిరపడింది. రెండు సూచీలు కూడా వరుసగా ఐదో వారం లాభాలను నమోదు చేసినట్లయింది. ఎన్ఎస్ఇ సూచి 0.52శాతం బిఎస్ఇ సూచి 0.05శాతం పెరిగాయి.
బిఎస్ఇపరంగా వివిధ విభాగసూచీ ల్లో వినియోగరంగ ఉత్పత్తులు ప్రకాశించింది. 4.21శాతం వరకూ పెరిగింది. చమురుగ్యాస్ సూచి 2.63శాతం, మెట ల్ 2.5శాతం, ప్రభుత్వరంగసంస్థలు 2.45శాతం పెరి గాయి. హెల్త్కేర్ సూచి ఒక్కటే బిఎస్ఇలో 0.94శాతం క్షీణించింది. అమెరికా ఎఫ్డిఎ నాణ్యతా లోపాలను ఎత్తిచూపిస్తూ బయోకాన్ లిమిటెడ్ను హెచ్చరించింది. కేవలం ఒక్క కంపెనీపైనే కాకుండా భారతీయ హెల్త్కేర్రంగంపై ఎక్కువ ప్రభావంచూపిస్తున్నాయి. సెన్సెక్స్లోని ఐదు లాభాలసంస్థల్లో హీరోమోటోకార్ప్ 3.11శాతం, కోల్ ఇండియా 3.04శాతం, టాటాస్టీల్ 2.85శాతం, ఎన్టిపిసి 2.78శాతం, హిందూస్థాన్ యూనిలీవర్ 1.91శాతం లాభ పడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ 3.76శాతం, సన్ఫార్మా 1.85శాతం, రిలయన్స్ 1.76శాతం, భారతిఎయిర్టెల్ 0.78శాతం, హెచ్డి ఎఫ్సి 0.27శాతంగా ఉన్నాయి.
బయోకాన్ కంపెనీ షేర్లు 7.6శాతంవరకూ దిగ జారాయి. అమెరికాఎఫ్డిఎ పది తులనాత్మక పరిశీలన అంశాలను కంపెనీకి సూచించింది. బెంగళూరులోని కంపెనీ ప్లాంట్ను తనిఖీ చేసిన ఎఫ్డిఎ హెచ్చరికలు జారీచేసింది. నిఫ్టీ పార్మా సూచీలో ఉన్న అన్ని కంపెనీలు కూడా పెరిగాయి. 2.5 శాతం వరుసగా మూడోనెలలో తగ్గింది. సన్ఫార్మా 4.5 శాతం, డాక్టర్ రెడ్డీస్లేబ్స్ 3శాతంచొప్పున దిగజారాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఇసూచీలో 2.1శాతం తగ్గిం ది. రెండురోజుల లాభాల ట్రేడింగ్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాలను కట్టడిచేసారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 5.1శాతంపెరిగింది. కంపెనీఅంచనాలకుమించిన లాభాల ను ప్రకటించడమే ఇందుకుకీలకం. వాల్స్ట్రీట్లోటెక్నాలజీ ఆధారిత కంపెనీలు క్షీణించిన నేపథ్యంలోఆసియాలో స్టాక్మార్కెట్లు శుక్రవారం కొంత పెరిగాయి. అమెరికా ట్రెజరీ రాబడులు డాలర్పరంగా ఒత్తిడికిలోనయ్యాయి. అమెరికా ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందన్న విచారణాంశాలను వెల్లడిచేయడంతో మార్కెట్లు కొంతఒత్తిడికి లోనయ్యాయి. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వైరల్ అవుతున్న తైమూర్ ఫోటోలు
లిటిల్ తైమూర్... పుట్టుకతోనే పెద్ద సెలెబ్రిటీ.
TNN | Updated:
Dec 22, 2016, 04:03PM IST
లిటిల్ తైమూర్... పుట్టుకతోనే పెద్ద సెలెబ్రిటీ. అతని ఫోటోలు వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేష్ బుక్, ట్విట్టర్ లలో తెగ షేర్ అవుతున్నాయి. అయితే నిజంగా అవి తైమూర్ ఫోటోలేనా కావా అన్నది మాత్రం తెలియదు. తైమూర్ - కరీనా ఇద్దరు ఆసుపత్రి బెడ్ ఉన్న ఉన్న ఫోటో, వారిద్దరినీ చూస్తున్న సైఫ్ ఫోటో ఇప్పటి లేటెస్ట్ వైరల్ ఫోటో. కొంతమంది అవి నిజంగానే తైమూర్ - కరీనాలవే అంటుంటే, మరికొందరు మాత్రం మార్ఫింగ్ చేసి ఉంటారని అంటున్నారు. ఇప్పుడు తాజాగా వైరల్ అయిన కరీనా - సైఫ్ - తైమూర్ ముగ్గురూ ఉన్న ఫోటో నిజమైనదేనంటూ ఇన్ స్టాగ్రామ్ లో ప్రచారం జరుగుతోంది. ఆ ఫోటోలు ఇవే... | 0business
|
flipkart
ప్లిప్కార్ట్ మరో సమ్మర్ ఆఫర్
ముంబై, మే 30: ఇ-కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ గత రెండు వారాల క్రితమే 10ఏళ్ల సందర్భంగా నాలుగు రోజుల బిగ్ 10సేల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. బంపర్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ సేల్ నిర్వహించింది. ప్రస్తుతం మరో సమ్మర్ సేల్తో మన ముందుకు వచ్చేసింది. నేటి నుంచి ఈ నెల చివరి వరకు 80శాతం డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఎలాంటి ఖర్చులేని ఈఎంఐలతో సమ్మర్ సేల్ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హోమ్ అప్లియన్స్, స్మార్ట్ఫోన్లపై ఈ కంపెనీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
స్మార్ట్ఫోన్ మోడల్స్ ప్లాట్పై 10వేల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. జియోర్డోనో వాచ్లు, మహిళల ప్రీమియం బ్యాగులపై కనీసం 75శాతం వరకు తగ్గింపును ఈ కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్, మహిళల ప్రీమియం బ్యాగులపై కనీసం 75శాతం వరకు తగ్గింపును ఈ కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఆపిల్ వాచ్లు సిరీస్ 2పై 14శాతం తగ్గింపు, 40అంగుళాల సోని టెలివిజన్పై 20శాతం తగ్గింపు, ఫిల్నెస్ ప్రొడక్ట్స్పై 80శాతం వరకు డిస్కౌంట్లను ప్లిప్కార్ట్ అందుబాటులో ఉంచింది. | 1entertainment
|
Jun 25,2018
పార్లమెంటరీ కమిటీతో రేపు పీఎస్బీల సమావేశం
న్యూఢిల్లీ: నిరర్ధక ఆస్తులు పెరిగిపోవడం, బ్యాంకు మోసాలు అధికమవుతుండటంతో కుదేలవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) సమస్యలపై చర్చించడానికి పలు బ్యాంకుల చైర్మెన్లు ఈ నెల 26న పార్లమెంటరీ కమిటీతో సమావేశం కానున్నారు. 'దేశంలోని బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, నిరర్ధక ఆస్తులు' అనే అంశం మీద 11 ప్రభుత్వరంగ బ్యాంకుల చైర్మెన్లు.. వీరప్ప మొయిలీ నాయకత్వంలోని పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీతో మంగళవారం జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ సైతం హాజరవుతారు. బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు పేరుకుపోతుండటం, 2015-16 ఆర్థిక సంవత్సరానికి 4,693గా ఉన్న బ్యాంకు మోసాల కేసులు 2017-18కి 5,904కు చేరడం వంటి అంశాలు చర్చలోకి రానున్నాయి. ఐడీబీఐ, యూకో, సెంట్రల్బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకుల చైర్మెన్లు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ప్రభాస్ కు బాలీవుడ్ నుంచి మరో అరుదైన గౌరవం
Highlights
బాహుబలి చిత్రంతో క్రేజీ హీరోగా మారిపోయిన ప్రభాస్
ప్రభాస్ కు బాలీవుడ్ లోననూ యమా క్రేజ్
తాజాగా ఓ ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఈవెంట్ కు ఆహ్వానం
బాహుబలి’ మూవీతో టాప్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ జనవరిలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ దగ్గర జరగబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కు అతిధిగా వెళ్ళబోతున్నాడు. ప్రముఖ నటీమణి, పార్లమెంట్ సభ్యురాలు, హేమమాలిని దర్శకుడు మధూర్ భండార్కర్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వన్ ఫర్ ఆల్ – ఆల్ ఫర్ వన్’ కార్యక్రమానికి దక్షిణాదికి సంబంధించి ప్రభాస్ కు ఆహ్వానం అందింది.
మన దేశ సరిహద్దులలో సేవలు అందిస్తూ ఎన్నో త్యాగాలు చేస్తున్న మన వీర జవానుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించబోతున్న ఈ భారీ కార్యక్రమంలో బాలీవుడ్ టాప్ హీరోలు అంతా పాల్గొంటున్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాల్గొనడం ప్రభాస్ కున్న ఇమేజ్ ఏంటో తెలియజేస్తుంది.
అధర్వా ఫౌండేషన్ నిర్వహణలో జరగబోతున్న ఈ కార్యక్రమంలో అనేకమంది వేలాది సంఖ్యలో కాలేజీ విద్యార్దులు కూడ పాల్గొనబోతున్నారు. అంతేకాదు మన వీరజవానుల త్యాగాలకు సంబంధించిన వాస్తవ సంఘటనలకు సంబంధించిన 10 షార్ట్ ఫిలిమ్స్ ను కూడ రూపొందించి దేశంలోని అన్ని ధియేటర్లలోను ప్రదర్శించబోతున్నారు.
వీటికి సంబంధించి తెలుగులో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉంటుంది అని తెలుస్తోంది. కరణ్ జోహార్ తో ఏర్పడ్డ భేదాభిప్రాయాలు వల్ల ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ కు బాలీవుడ్ మార్కెట్ లో సమస్యలు ఏర్పడ్డాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రభాస్ ను తిరిగి బాలీవుడ్ టాప్ హీరోల మధ్య నిలబెట్టే ఈవెంట్ గా ఈ కార్యక్రమం మారబోతోంది. ఏది ఎలా ఉన్నా ప్రభాస్ కు బాలీవుడ్ లో ఇది ఊహించని గౌరవం అనుకోవాలి.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
ల్యూమినోస్ నుంచి కొత్త బ్యాటరీలు
Thu 19 Oct 03:35:47.252043 2017
హైదరాబాద్ : మార్కెట్లోకి నూతన శ్రేణీ బ్యాటరీలను విడుదల చేసినట్లు ల్యూమినోస్ పవర్ టెక్నలాజీ ఒక ప్రకటనలో తెలిపింది. గృహ విద్యుత్ బ్యాక్అప్ కోసం ఇన్వర్జల్ బ్యాటరీలను
కళ తప్పిన దీపావళి
Thu 19 Oct 03:35:54.537767 2017
న్యూఢిల్లీ: దీపావళి పండుగ సీజన్లో తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటుందని భావించిన వ్యాపారులు ఈ సారి తీవ్ర నిరాశలో ఉన్నారు. పలు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల కొనుగ
విదేశం వద్దు.. స్వదేశమే ముద్దు..!
Wed 18 Oct 06:09:09.52963 2017
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: విదేశీ ఉద్యోగాల పట్ల భారతీయుల్లో క్రమంగా ఆసక్తి తగ్గుతూ వస్తోందని ఒక సర్వేలో తేలింది. అంతర్జాతీయంగా విదేశాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగ
రూ.500లకే క్రెడిట్ కార్డు డేటా!
Wed 18 Oct 06:08:32.374672 2017
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఆన్లైన్ వేదికగా క్రెడిట్ కార్డుల సమాచారాన్ని కారు చౌకగా విక్రయిస్తున్న వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వన్టైమ్ పాస్వార్డ్ (వోట
బీఎస్ఎన్ఎల్ నుంచి చౌక 4జీ ఫోన్
Wed 18 Oct 06:08:39.442583 2017
న్యూఢిల్లీ: ప్రయివేటు టెల్కోలకు దీటుగా ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో అద్బుత ఆఫర్ను ప్రకటించింది. కేవలం రూ.2200కే 4జీ వొల్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్ ఫో
ఎన్పీఏలు పెరిగినా రాణింపే..
Wed 18 Oct 06:08:47.032038 2017
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయివేటు రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంకుకు మొండి బాకీలు పెరిగిన ఆకర్షణీయ ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్తో ముగిసి
విప్రో లాభాలు రూ.2,192 కోట్లు
Wed 18 Oct 06:08:55.056699 2017
న్యూఢిల్లీ : దేశంలోనే మూడో అతిపెద్ద ఐటి సేవల సంస్థ విప్రో లిమిటెడ్ బ్యాంకింగ్, ఫైనాన్సీయల్ సర్వీసెస్ విభాగాల్లో మెరుగైన పనితీరు కనబర్చడంతో క్రితం సెప్టెంబర్తో ముగిసి
రెట్టింపైన ఏసీసీి లాభాలు
Wed 18 Oct 06:09:02.185104 2017
న్యూఢిల్లీ : ప్రముఖ సిమెంట్ తయారీ కంపెనీ ఏసీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం సెప్టెంబ ర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.182 కోట్ల నికర లాభాలు సాధించిది. గతేడాది
తెలంగాణలో 200 కోట్ల పెట్టుబడులు..
Tue 17 Oct 05:25:08.167484 2017
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుగానూ మంత్రి కెటి రామారావు సోమవ
తగ్గిన టోకు ద్రవోల్బణం
Tue 17 Oct 05:25:15.521291 2017
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, కూరగాయల ధరల ఉపశమనంతో సెప్టెంబర్ నెలలో టోకు ఆధారిత ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) సూచీ 2.60శాతానికి దిగివచ్చింది. ఆగస్టు నెలలో ఈ సూచీ 3.24శాతం
కొత్త గరిష్టాలకు మార్కెట్లు!
Tue 17 Oct 05:25:22.208789 2017
ముంబయి: జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో భారత స్టాక్ మార్కెట్లలో ముందే దీపావళి సంతోషాలు వెళ్లువిరుస్తున్నాయి. సెన్సెక్స్ వరుస సెషన్లలో సెంచరీలతో దూసుకుపో తుంది. సోమ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో..
Tue 17 Oct 05:25:29.339139 2017
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కార్ చేపట్టిన సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సంస్కరణలకు చుక్కెదురైంది. ఈవోడీబీలో దేశంలోని 11 రాష్ట్రాలకు జీరో ర్యాంకింగ్
బజాజ్ ఫినాన్స్ ఫలితాలు భేష్!
Tue 17 Oct 05:25:36.346674 2017
ముంబయి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్ 36.5 శాతం వృద్ధితో రూ.557 కోట్ల నికర లాభాలు సాధ
ఫలితాలే మార్కెట్లకు దిక్సూచి
Mon 16 Oct 06:34:51.080891 2017
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికానికి చెందిన బ్లూచిప్ కంపెనీల ఫలితాలు, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లకు కీల
ఆ వివరాలను వెల్లడించలేం: ఆర్బీఐ
Mon 16 Oct 06:34:58.496557 2017
ముంబయి: పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్తగా ముద్రిస్తున్న రూ.500, రూ.2000 నోట్లపై ప్రధానిమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన 'క్లీన్ ఇండియా మిషన్' ప్రాజెక్టు లోగో ముద్రిస్తారా
ఈ ఏడాదికి 7శాతం వృద్ధి రేటు!
Mon 16 Oct 06:35:07.111298 2017
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.9శాతం-7శాతం మధ్యలో నమోదు కావచ్చని నితి అయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్ అన్
భారీగా పెరిగిన బంగారం దిగుమతులు!
Mon 16 Oct 06:35:27.769472 2017
న్యూఢిల్లీ: దేశంలోకి బంగారం దిగుమతులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత ఏడాది తొలి అర్థ భాగంలో బంగారం దిగుమతులు రెండింతలు ఎగిసి తద్వారా 16.95 బిలియన్ డాలర్లకు చేరినట్ట
త్వరలో రెండో దశ జియో ఫోన్ బుకింగ్స్!
Mon 16 Oct 06:35:37.981037 2017
న్యూఢిల్లీ: త్వరలో రెండో దశ జియో ఫ్రీ ఫోన్ బుకింగ్స్ను ఆ సంస్థ ప్రారంభినుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 24న మొదటి దశ జియో ఫ్రీ ఫోన్ బుకింగ్స్ను నిర్వహించ
ప్యాసింజర్ వాహనాల్లో 3% వాటా లక్ష్యం
Mon 16 Oct 06:35:49.47912 2017
న్యూఢిల్లీ: జర్మనీ వాహన తయారీ కంపెనీ ఫోక్స్వ్యాగన్ భారత్లోని ప్యాసింజర్ వాహన సెగ్మెంట్లో 3శాతం వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా తన మార్కెట్ పోర్ట్
లక్ష గ్రామాలకు ఇండస్ఇండ్
Sun 15 Oct 05:38:37.664586 2017
న్యూఢిల్లీ: భారత్లోని అతిపెద్ద సూక్ష్మ రుణాల జారీ సంస్థల జాబితాలో డచ్కు చెందిన ఇండస్ ఇండ్ బ్యాంక్ స్థానం సంపాదించుకోనుంది. ప్రముఖ సూక్ష్మ రుణాల జారీ సంస్థ భారత్ ఫైన
సీఏ హైదరాబాద్ చాప్టర్కు కొత్త చైర్మెన్
Sun 15 Oct 05:38:45.188027 2017
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్ చాప్టర్ మేనేజింగ్ కమిటీ చైర్మెన్గా చంద్రశేఖర్ రాజనాల ఏకగ్రీవంగా ఎన
డి-మార్ట్ ఆర్థిక ఫలితాలు అదుర్స్..
Sun 15 Oct 05:38:52.638346 2017
ముంబయ్:డి-మార్ట్ బ్రాండ్తో రిటైల్ స్టోర్స్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్ సెప్టెంబరు త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబర్తో త్
మోర్మెగా స్టోర్స్లో అజాఫ్రాన్ ఉత్పత్తులు
Sun 15 Oct 05:39:12.848252 2017
హైదరాబాద్: దేశీయంగా ఆర్గానిక్ పర్సనల్ కేర్ ఉత్పాదనలకు డిమాండ్ అంతకంతకు పెరుగు తోందని అజాఫ్రాన్ ఇన్నోవేషన్స్ బిజినెస్ హెడ్ టీఆర్ సురుష్ తెలిపారు. 2018 నాటికి ఈ
ఇన్ఫోసిస్కు మరో ఇద్దరు పెద్దలు గుడ్బై!
Sun 15 Oct 05:39:20.307825 2017
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో అంతర్గత లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సంస్థ అధినేతగా నందన్ నీలేకని బాధ్యతలు చేపట్టినప్పటికీ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగుల రాజీనామాలు మ
ప్రయివేటు చేతికి పవన్ హన్స్!
Sat 14 Oct 06:05:20.932669 2017
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: విమానయాన రంగంలో ప్రభుత్వ పాత్రను పూర్తిగా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వ రంగ వి
ఆల్టైం గరిష్టానికి నిఫ్టీ
Sat 14 Oct 06:05:29.779632 2017
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి వెలుగులు ముందుగానే కనిపిస్తున్నాయి. మెరుగైన సూక్ష్మ గణాంకాల నేపథ్యంలో మదుపరులు శుక్రవారం భారీగా స్టాక్స్ కొనుగోలుకు ఆసక్తి చూపా
3 నెలల్లో రూ.8109 కోట్ల లాభం: ఆర్ఐఎల్
Sat 14 Oct 06:05:37.536923 2017
న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండిస్టీస్ (ఆర్ఐఎల్) సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబర్ త్రై
ఇండియన్ బ్యాంకులో పండుగ డిస్కౌంట్లు
Sat 14 Oct 06:05:47.373986 2017
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పండుగ సీజన్ సందర్భంగా ఇండియన్బ్యాంకు వాహన రుణ గ్రహితలకు పెద్ద మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తోంది. సంబంధిత రాయితీలను ఎక్కువ మంది ఖాతాదారులకు అం
ఎగబాకిన దేశీయ ఎగుమతులు
Sat 14 Oct 06:05:55.067125 2017
న్యూఢిల్లీ: దేశీయ ఎగుతుల్లో గణనీయమైన వృద్ధి నమోదు అయినట్టు సర్కారు వెల్లడించింది. గత సెప్టెంబరు మాసంలో దేశీయ ఎగుమతు లు 25.67 శాతం మేర పెరిగి 28.61 డాలర్ల స్థాయికి
చప్పగా ముగిసిన జీఐసీ భారీ ఐపీవో
Sat 14 Oct 06:06:05.353482 2017
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెగా పబ్లిక్ ఇష్యూ చప్పగా ముగిసింది. దాదాపు రూ.11,300 కోట్ల నిధుల సమీకరణకు సంస్థ ఐపీవోకు వచ్చిన సంగతి తెల
వొడాఫోన్తో విలీనపు 'ఐడియా'కు సై!
Sat 14 Oct 00:07:57.631944 2017
న్యూఢిల్లీ: ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా మొబైల్ వ్యాపారాన్ని వొడాఫోన్ సంస్థలో విలీనం చేసే ప్రతిపాదనకు మార్గం మరింత సలభమైంది. ఈ విలీన ప్రతిపాదనకు ఐడియా వాటాదారు
ఎయిర్టెల్ చేతికి టాటా టెలీసర్వీసెస్
Fri 13 Oct 06:46:00.864439 2017
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో కంపెనీల ఏకీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం టెలికం రంగంలో మరో పెద్ద విలీనానికి తెర లేచింది. టాటా
జీఎస్టీ పరిధిలోకి స్థిరాస్తి : జైట్లీ
Fri 13 Oct 06:47:10.833392 2017
వాషింగ్టన్: స్థిరాస్తి రంగాన్ని వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిధిలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రానున్న జీఎస్టీ మండలి సమావేశంలో ఈ విషయంపై రాష్ట్రాల ఏకీభిప్రాయన
స్టాక్ మార్కెట్లలో ముందస్తు దీపావళి
Fri 13 Oct 06:47:19.117808 2017
ముంబయి: సానుకూల పవనాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లలో గురువారం దీపావళి కాంతులు కనిపించాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను ఇప్పట్లో పెంచకపోవచ్చన్న అంచనాలు.. దేశ పా
సంబురపరిచిన సైయెంట్ ఫలితాలు!
Fri 13 Oct 06:47:27.826105 2017
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ రెండో త్రైమాసికానికి సంబురపరిచే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గతంలో ఎన
బిగ్సీ షోరూమ్లలో దసరావళి సందడి
Fri 13 Oct 06:47:37.935073 2017
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పండుగల సీజన్ నేపథ్యంలో బిగ్సీలో అందుబాటులోకి తెచ్చిన దసరావళి ఆఫర్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపకులు, సీఎండీ బా
దేశంలో 200 స్టోర్లకు విస్తరిస్తాం: పెప్స్
Fri 13 Oct 06:47:46.401285 2017
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ స్ప్రింగ్ మ్యాట్రెస్ తయారీ సంస్థ పెప్స్ ఇండిస్టీస్ హైదరాబాద్లో తన విసృతిని మరింత పెంచుకుంది. గురువారం సంస్థ ఇక్కడ తమ రెండో గ్రేట్
అంచనాలను మించిన టీసీఎస్!
Fri 13 Oct 00:16:04.333116 2017
ముంబయి: దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ అంచనాలను మించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమా
9 నెలల గరిష్టానికి పారిశ్రామికం
Fri 13 Oct 00:15:35.429756 2017
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక రంగపు ఉత్పత్తి ఈసారి కొంత ఊరట కల్పించింది. ఆగస్టు నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.3శాతంతో తొమ్మిది నెలల గరిష్టానికి చేరింది. జులై నె
..అందుకనే ముందు చెప్పలే!
Thu 12 Oct 06:48:00.185465 2017
వాషింగ్టన్: పెద్దనోట్ల రద్దును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా వేదికగా మరోమారు సమర్థించుకున్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న అరుణ్ జైట్లీ న్యూయార్క్లో ప్రతిష్టాత్మక కొలం
రూ.1,399కే స్మార్ట్ఫోన్: ఎయిర్టెల్
Thu 12 Oct 06:48:08.362811 2017
ముంబయి: రిలయన్స్ జియోపై మరోపోరుకు ఎయిర్టెల్ సిద్ధమైంది. చౌక ధరకే ఫీచర్ ఫోన్ అందిస్తూ మార్కెట్లో తన విస్తృతి పెంచుకోవాలని యోచిస్తున్న జియో ప్రయత్నాలకు ఎయిర్టెల్ చెక
బలహీన బ్యాంకులతో ప్రమాదం!
Thu 12 Oct 06:48:16.406395 2017
న్యూయార్క్: బలహీన బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల పరపతి సన్నగిల్లడం తదితర పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరి
పెట్రో డీలర్ల సమ్మె లేదు..
Thu 12 Oct 06:48:25.575733 2017
న్యూఢిల్లీ: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పెట్రోల్ పంపు డీలర్లు రేపు (13న) జరప తలపెట్టిన సమ్మెను డీలర్లు రద్దు చేసుకున్నారు. సమ్మె విషయంలో సర్కారు సీరియస్ కావడంతో డీలర
ఆంధ్రా బ్యాంకు కొత్త ఈడిగా కుల్ భూషణ్
Thu 12 Oct 06:48:53.344559 2017
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: ఆంధ్రా బ్యాంకు కొత్తఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా (ఈడీగా) నియమతులైన కుల్ భూషణ్ జైన్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఆయన బ్యాంకు ఆఫ
ప్రత్యేక్ష పన్ను వసూళ్లులో 15.8 శాతం వృద్ధి
Thu 12 Oct 06:49:47.737102 2017
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్లో కేంద్ర ప్రత్యేక్ష పన్ను నికర వసూళ్లలో 15.8శాతం వృద్ధితో రూ.3.86లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది (రూ.9.8 లక్షల కో
మార్కెట్లోకి అలర్జీ ప్రొటక్ట్ వాషింగ్ మిషిన్
Thu 12 Oct 06:49:28.140406 2017
నవతెలంగాణ-వాణిజ్య విభాగం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత గృహోపకరణాల అమ్మకాలు పడిపోయాయని గోద్రెజ్ అప్లరున్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు. ఈ రెండు నిర్ణయా
మందగమన పరిస్థితులు నిజమే..
Thu 12 Oct 06:49:36.395849 2017
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు నిజమేనని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) ఒప్పుకుంది. ఇందుకు గల ప్రధాన కారణాలను తాము అన్వేషించనున్నట్టుగా పే
ఆ చెక్కుబుక్కుల గడువు పెంపు : ఎస్బీఐ
Thu 12 Oct 06:49:57.250717 2017
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల పాత చెక్కుబుక్కుల చెల్లుబాటు గడువును పెంచుతూ ఎస్బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాంకులకు సంబంధించిన చెక్లు సె
నాలుగేండ్ల కనిష్టానికి భారత్ వృద్ధి..!
Wed 11 Oct 06:46:07.423718 2017
న్యూయార్క్: పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు నాలుగేండ్ల కనిష్టానికి పడిపోయే అవకాశం ఉందన్న అంతర్జాతీయ
మూడో అతిపెద్ద ఐపీవోకు ముహూర్తం నేడే!
Wed 11 Oct 06:46:34.726626 2017
న్యూఢిల్లీ: ప్రాథమిక మార్కెట్లో బుధవారం మరో సంచలనం నమోదు కానుంది. దేశంలో మూడో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు గాను జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ ఆర్ఈ) న | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్.. రూ.1కే ఫోన్, ల్యాప్టాప్!
దేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ను ప్రకటించింది. మే 13వ తేదీ నుంచి 16 వరకు పలు ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను అందజేయనున్నట్లు గురువారం ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.
Samayam Telugu | Updated:
May 3, 2018, 09:35PM IST
ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్.. రూ.1కే ఫోన్, ల్యాప్టాప్!
దేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ను ప్రకటించింది. మే 13వ తేదీ నుంచి 16 వరకు పలు ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను అందజేయనున్నట్లు గురువారం ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీలు, గృహోపకరణాలు తదితర ఉత్పత్తులపై నాలుగు రోజులపాటు ఆఫర్ డీల్స్, డిస్కౌంట్లు ఉంటాయని వెల్లడించింది. దీనికి తోడు పలు డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోళ్లకు కూడా ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నాలుగు రోజుల ఆఫర్ సేల్తో తమ అమ్మకాలను ఆరు రెట్లు పెంచుకోవాలని ఈ ఈ-కామర్స్ దిగ్గజం చూస్తోంది.
Visit Site
Recommended byColombia
బజాజ్ ఫిన్సెర్వ్, క్రెడిట్ కార్డుల లావాదేవీలపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ఈ ఆఫర్ సేల్లో ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. అంతేకాకుండా లక్కీ కస్టమర్లకు 100 శాతం క్యాష్బ్యాక్, ఇతర రివార్డ్స్ కూడా అదనంగా అందజేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక డెబిట్ కార్డ్ యూజర్లు కూడా ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలుచేసే సదుపాయం కూడా ఉంది. అలాగే బై బ్యాక్ గ్యారంటీ కూడా వర్తిస్తుంది. అయితే ఏఏ ఫోన్లపై ఆఫర్లు వర్తిస్తాయి.. ఎంతెంత డిస్కౌంట్లు అందజేస్తారు అనే విషయాలను మాత్రం ఫ్లిప్కార్ట్ వెల్లడించలేదు.
కానీ ల్యాప్టాప్లు, కెమెరాలు, పవర్ బ్యాంక్స్, ట్యాబ్లెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ఫ్లిప్కార్ట్ స్పష్టం చేసింది. టీవీలు, ఇతర గృహోపకరణాలపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈ ఆఫర్ సమయంలో కొన్ని ప్రముఖ టీవీ మోడళ్ల ఫ్లాష్ సేల్స్ కూడా పెట్టనుంది. వీటన్నితో పాటు బిగ్ షాపింగ్ డే సేల్లో భాగంగా ‘గేమ్ కార్నర్’ను కూడా ఫ్లిప్కార్ట్ పరిచయం చేస్తోంది. అంటే ఆసక్తి ఉన్న వినియోగదారులు గేమ్స్ ఆడి ల్యాప్టాప్స్, మొబైల్స్, ఇతర ఉత్పత్తులను రూ.1కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఉత్పత్తుల కొనుగోలుపై 100 శాతం క్యాష్బ్యాక్ పొందే అవకాశం ఉంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
అఖిల్, శ్రియల పెళ్లి కుదిర్చిన ఉపాసన
Highlights
అఖిల్, శ్రియ భూపాల్ పెళ్లికి లైన్ క్లియర్
రంగంలోకి దిగి అంగీకారం కుదిర్చిన మెగా కోడలు
ఉపాసన ఒప్పించటంతో రాజీ కుదుర్చుకున్న అఖిల్, శ్రియ
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ ల వివాహం రద్దయినట్లు ఇటీవల ప్రపంచమంతా కోడై కూసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాహం రద్దు కాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని తెలుస్తోంది. అఖిల్ వివాహం రద్దు కావడంపట్ల నాగార్జున తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. స్వయంగా నాగార్జున ప్రయత్నించినా... శ్రియా భూపాల్ అంగీకరించక పోవడంతో... ఇద్దరి మధ్య రాజీ కుదరలేదని తెలిసింది.
అయితే తాజాగా అఖిల్, శ్రియాల పెళ్లి జరిపేందుకు నాగార్జున కుటుంబానికి ఓ మెగా ఫ్యామిలీ మెంబర్ నడుం బిగించారని, ఆ ప్రయత్నం ఫలించి మళ్లీ అంతా సవ్యంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తాజా సమాచారం. వివరాల్లోకెళ్తే... మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జునకు ఆప్తుల్లో ఒకరు. నాగార్జున మనస్థాపానికి గురి కావడం చూసి చలించిన చిరంజీవి ఎలాగైనా నాగార్జునకు బాధ నుంచి విముక్తి కలిగించాలని భావించారట. అందు కోసం శ్రియా భూపాల్ కుటుంబంతో బంధుత్వం ఉన్న మెగా కోడలు ఉపాసనను రంగంలోకి దించారట.
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి శ్రియా భూపాల్ కు మంచి స్నేహితురాలు కూడా కావటంతో ఆపరేషన్ అఖిల్, శ్రియా వెడ్డింగ్ చేపట్టారని, ఇద్దరితో మాట్లాడి తను తెలివిగా... ఇరువురిని ఒప్పించిందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఇక అఖిల్, శ్రియాల వివాహం జరగటం నల్లేరు మీద నడకేనని తెలుస్తోంది. మొత్తానికి ఈ వివాహం జరిగితేే మెగా కోడలు ఉపాసనకు నాగార్జున ఎంత థాంక్స్ చెప్తారో ఏమో కానీ ఇటు అక్కినేని అబిమానులు, అటు మెగా అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated 26, Mar 2018, 12:02 AM IST | 0business
|
దాని గురించి అడిగిన అభిమానికి మల్లికా దిమ్మతిరిగే కౌంటర్
Highlights
మల్లికా దువా అంటే సినిమాలు చూసేవాళ్ళకు అంతగా ఫ్లాష్ కాకపోవచ్చు
కాని సోషల్ మీడియా ట్రెండ్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు మాత్రం తను చాలా పాపులర్
తను చేసిన షిట్ పీపుల్ సే అనే వీడియో మల్లికాను ఒక్క రోజులో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మార్చింది
మల్లికా దువా అంటే సినిమాలు చూసేవాళ్ళకు అంతగా ఫ్లాష్ కాకపోవచ్చు కాని సోషల్ మీడియా ట్రెండ్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు మాత్రం తను చాలా పాపులర్. కామెడీ ప్లస్ సెటైర్ వీడియోస్ చేయటంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కలిగిన మల్లికా దువా ఇన్స్ టాగ్రామ్ స్నాప్ చాట్ డబ్ స్మాష్ లను విపరీతంగా వాడుతుంది. గతంలో తను చేసిన ‘షిట్ పీపుల్ సే: సరోజినీ నగర్ ఎడిషన్’ అనే వీడియో మల్లికాను ఒక్క రోజులో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మార్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మెండుగా ఉన్న మల్లికా యాక్టివ్ గా ఉంటోంది గత మూడేళ్ళ నుంచే. ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా కూతురే ఈ మల్లికా. ఇందులోకి రాకముందు ఒక పత్రికలో కాపీ రైటర్ గా పనిచేసిన ఈ ఆన్ లైన్ బాంబ్ అడ్వర్టైజింగ్ లో మంచి ఎక్స్ పర్ట్. అందుకే తను రెగ్యులర్ గా పోస్ట్ చేసే కామెడీ వీడియోస్ కోసం అభిమానులు ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉంటారు.
మరి ఇంతగా పాపులర్ అయిన మల్లికా దువాకు మగరాయుళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురు కావా అంటే అవుతున్నాయి. కాని వాటిని ఎదుర్కునే తీరు మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. తనను టార్గెట్ చేసిన ఒకతను ఆన్ లైన్ లో మల్లికా బ్రాలు వేసుకోకపోవడం గురించి ప్రశ్నించాడు. వెంటనే కోపం తెచ్చుకోకుండా చాలా కూల్ గా నాలో అవి చూస్తున్నప్పుడు మీ వైఫ్ మీ గురించి ఏమనుకుంటారు అని రివర్స్ లో ప్రశ్నించింది. అంతటితో వదిలేస్తే తను మల్లికా ఎందుకు అవుతుంది. అతను చేసిన కామెంట్ ని స్క్రీన్ షాట్ రూపంలో పెడుతూ ఇలాంటి వాళ్ళు ఫాలోయర్స్ గా ఉన్నందుకు అదృష్టవంతురాలినని గట్టి చురకే వేసింది. తన ఫైర్ బ్రాండ్ మార్క్ ని ఇందులో కూడా చూపించిన మల్లికా దువా ధైర్యానికి నెటిజెన్లు ప్రశంశలు కురిపిస్తున్నారు.
Last Updated 26, Mar 2018, 12:01 AM IST | 0business
|
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మానందం"కు ఘనసన్మానం
First Published 8, Oct 2017, 5:33 PM IST
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
Recent Stories | 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.