news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
50% పైగా జన్ధన్ ఖాతాలు మహిళలవే
ప్రధానమంత్రి మోదీ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన జన్ధన్ యోజన పథకం సకారాత్మక ఫలితాలనే ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉన్న ప్రజలను వ్యవస్థీకృత ఆర్థిక లావాదేవీల దిశగా నడిపించాలన్నది జన్ధన్ యోజన ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. దానికి సంబంధించి పలు అధ్యయనాలు ఇప్పటికే పీఎంజేడీవై(పీఎం జన్ ధన్ యోజన)ని సమర్థించాయి.
TNN | Updated:
Feb 16, 2018, 01:53PM IST
ప్ర‌ధాన‌మంత్రి మోదీ ప్ర‌తిష్టాత్మ‌కంగా మొద‌లుపెట్టిన జ‌న్‌ధ‌న్ యోజ‌న ప‌థ‌కం స‌కారాత్మ‌క ఫ‌లితాల‌నే ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉన్న ప్ర‌జ‌ల‌ను వ్య‌వ‌స్థీకృత ఆర్థిక లావాదేవీల దిశ‌గా నడిపించాల‌న్న‌ది జ‌న్‌ధ‌న్ యోజ‌న ముఖ్య ఉద్దేశాల్లో ఒక‌టి. దానికి సంబంధించి ప‌లు అధ్య‌య‌నాలు ఇప్ప‌టికే పీఎంజేడీవై(పీఎం జ‌న్ ధ‌న్ యోజ‌న‌)ని స‌మ‌ర్థించాయి. ఇప్పుడు మైక్రో సేవ్ అనే సంస్థ సైతం ఏజెంట్ నెట్వర్క్ 2017 స్థితిగతి పేరిట ఒక నివేదిక‌ను త‌యారుచేసింది. అందులో 2015 నుంచి 2017 మ‌ధ్య జ‌న్ ధ‌న్ ఖాతాల్లో న‌గ‌దు లావాదేవీలు 200% పెరిగిన‌ట్లు వెల్ల‌డి అయింది. ప్ర‌స్తుతం జ‌న్ ధ‌న్ ఖాతాల్లో స‌గానికి పైగా ఖాతాలు మ‌హిళ‌లే నిర్వ‌హిస్తున్నార‌ని నివేదిక విశ్లేషించింది.
ఎక్కువ మంది పేద ప్ర‌జ‌లు బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు జ‌రిపేలా మోదీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన జ‌న్ ధ‌న్ యోజ‌న ప‌థ‌కం ప్రోత్స‌హిస్తుంది. త‌ద్వారా వారికి ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ది ఎటువంటి లీకేజీలు లేకుండా నేరుగా ఖాతాల్లోకి చేరుతుంది. ఇంకా వారంతా అవ‌స‌ర‌మైన‌ప్పుడు అప్పులు తీసుకునే వీలును క‌ల్పిస్తుంది.
ప్ర‌స్తుతం ఆధార్ సంఖ్య‌ను, బ్యాంకు ఖాతాల‌తో అనుసంధానించ‌డంతో బ్యాకు క‌రెస్పాండెంట్లు లేదా ఏజెంట్లు ఆర్థిక ఉత్ప‌త్తుల‌ను ప్ర‌జ‌ల‌కు విస్తృతంగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు సూక్ష్మ బీమా అందుబాటులోకి వ‌చ్చింది. ముఖ్యంగా పొదుపు ఖాతా ఉన్న‌వారికి రోజుకు రూ.1 క‌న్నా త‌క్కువ ప్రీమియంతో ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న ప‌థ‌కానికి బాగానే స్పంద‌న వ‌చ్చింది. ఏప్రిల్ 24,2017 నాటికి 3.11 కోట్ల మంది ఈ ప‌థ‌కంలో ల‌బ్దిదారులుగా చేరారు. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
''నాన్నకు ప్రేమతో' చిత్రానికి సంబంధించిన ఒక సాంగ్ పోస్టర్లోని బ్యాక్గ్రౌండ్ ముస్లిం సోదరుల మనో భావాలను కించపరిచే విధంగా వుందని మా దృష్టికి వచ్చింది. మేం అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తాం. అందుకే ఆ పోస్టర్లోని బ్యాక్గ్రౌండ్ని తొలగించి కొత్త పోస్టర్ను విడుదల చేశాం. అలాగే సినిమాలోని ఆ సాంగ్లో కూడా బ్యాక్గ్రౌండ్ను మార్చేస్తున్నాం. మేం విడుదల చేసిన పోస్టర్ వల్ల ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి మేం బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. వారి మనోభావాలను దెబ్బతియ్యాలనికానీ, వారికి చెడు తలపెట్టాలని కానీ మా ఉద్దేశం కాదు. అన్ని మతాల వారికి స్వేచ్ఛ, గౌరవంగా జీవించే హక్కు వుంది. ఆ పోస్టర్ అనుకోకుండా వచ్చిందే తప్ప ముస్లిం సోదరులను బాధ పెట్టాలన్న ఉద్దేశంతో రిలీజ్ చేసింది కాదు'' అని అన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘ఖయ్యూం భాయ్’గా వస్తున్న నయీం!
పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురైన గ్యాంగ్ స్టర్ నయీం జీవితం ఆధారంగా సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు
| Updated:
Jan 18, 2017, 09:38AM IST
పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్ స్టర్ నయీం జీవితం ఆధారంగా సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ..ప్రకటించారు. నయీం పేరుతో మూడు సీక్వెల్స్ కూడా తీస్తానని అన్నారు. కానీ..అది ఇంత వరకు పట్టాలపైకి ఎక్కలేదు.
అలాంటిది దర్శకుడు భరత్...‘ఖయ్యూం భాయ్’పేరుతో నయీం జీవితం ఆధారంగా సినిమా తీసేశారు. సినిమా ఎప్పుడు ప్రారంభమైందన్న ఆలోచనే లేకుండా దాదాపు 90శాతం చిత్రీకరణ కూడా పూర్తయ్యింది.
ఈ చిత్రంలో నయీమ్ గా కట్టా రాంబాబు నటిస్తుండగా ఏసీపీ పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు భరత్ చెప్పారు.
ప్రధాన పాత్రదారుడు కట్టా రాంబాబు స్టిల్స్ అచ్చం గ్యాంగ్ స్టర్ నయీం పోలి ఉండటం చిత్రంపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. | 0business
|
Fakinova
ఫాకియావోకు మూడవసారి టైటిల్
లాన్వేగాన్: పిలిప్సినో స్టార్ మ్యానీ పాకియావో మూడవసారి ప్రపంచ బాక్సింగ్ సంఘం వాట్లర్ వెయిట్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.కాగా మాజీ విజతే జెస్సీ వర్గాన్తో జరిగిన బౌట్లో చాంపియన్గా నిలిచాడు.ముగ్గురు న్యాయనిర్ణే తల్లో ఇద్దరు ఫాకియావోకు 118-109, 114- 113 స్కోరు ఇచ్చారు.కాగా 37 సంవత్సరాల తరువాత ఈ బాక్సర్ ఏడునెలల క్రితం తిమోతి బ్రాడ్లీపై విజయంసాధించిన తరువాత రిటైర్మెంట్ ప్రకటించాడు.2010లో మిగుల్ కోటో,2014లో బ్రాడ్లీపై గెలుపొంది డబ్ల్యూబిఓ టైటిల్ కైవసం చేసుకున్నాడు. | 2sports
|
జై లవ కుశ రికార్డు.. వారం రోజుల్లో రూ.100కోట్లు
Highlights
ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా జై లవ కుశ
రికార్డులు బద్దలు కొడుతున్న జై లవ కుశ
రూ.100కోట్ల క్లబ్ లో చేరిన జై లవ కుశ
ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డుల వర్షం కురిపిస్తోంది. కేవలం విడుదలైన మూడు రోజుల్లోనూ రూ.75కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. వారం రోజుల్లో రూ.100కోట్ల క్లబ్ లో చేరింది. యూఎస్ లోనూ అత్యధిక వసూళ్లు రాబడుతోంది ఈ చిత్రం.
ఎన్టీఆర్ కెరిర్ లో రూ.100కోట్లు సాధించిన మూడో చిత్రం ఇది. ఇప్పటికే ‘ నాన్నకు ప్రేమతో’, జనా గ్యారేజ్ లతో ఈ క్రెడిట్ ని సాధించగా.. తాజాగా జై లవ కుశ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. ఈ సినిమాలోని జై పాత్రకు విశేష స్పందన లభిస్తోంది. రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ హర్షం వ్యక్తంచేశారు. అభిమానులందరికీ ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రపంచంలోని తెలుగు చిత్ర అభిమానులు అందరికీ ధన్యవాదాలు’ అని ఆయన ట్వీట్ చేశారు.
Last Updated 25, Mar 2018, 11:39 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఎఫ్డీల ద్వారా రూ.5 లక్షల వడ్డీ పొందేవారిపై నిఘా
ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక మొత్తంలో వడ్డీ పొంది, పన్ను చెల్లించని వేలాది మందిపై ఆదాయపు పన్ను శాఖ దృష్టిసారించింది.
TNN | Updated:
Aug 28, 2017, 11:21AM IST
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక మొత్తంలో వడ్డీ పొంది, పన్ను చెల్లించని వేలాది మందిపై ఆదాయపు పన్ను శాఖ దృష్టిసారించింది. ఏడాదికి రూ.5 లక్షల కంటే ఎక్కువ వడ్డీ పొందుతూ పన్ను చెల్లించని సీనియర్ సిటిజన్లతోపాటు మిగతావారిపై కూడా దృష్టిసారించామని కేంద్ర ప్రత్యక్ష పన్నులో బోర్డకు చెందిన సీనియర్ అధికారులు పేర్కొన్నారు. పన్ను వసూలను విస్తరించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా ప్రొఫెషనల్స్ ఆదాయంపై దృష్టి పెట్టింది... వీరిలో ఎక్కువ మంది తాము సంపాదించిన మొత్తాన్ని, విలాసాలకు ఖర్చుచేసి ఖచ్చితమైన ఆదాయాన్ని బహిర్గతం చేయడం లేదని వారు వ్యాఖ్యానించారు.
వివిధ వనరుల ద్వారా పొందిన ఆదాయాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేసి, వాటిని ఐటీ రిటర్న్స్‌లో చూపడం లేదని అన్నారు. ఇలాంటి వారిని గుర్తించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించిందని, అయితే కాలానుగుణంగా కొందరి ఆదాయంలో వ్యత్యాసాలు ఉంటాయని, వీరిని పట్టుకోవడం అంత సులభం కాదని తెలియజేశారు. వైద్యుల విషయమే తీసుకుంటే సీజనల్ వ్యాధులు అంటే డెంగ్యూ, చికున్‌గున్యా అధికంగా ఉండే సమయంలో వీరికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం ఉంటుంది. అయితే డిపాజిట్లపై వడ్డీ ద్వారా పొందే ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుంది. | 1entertainment
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
అందుబాటులోకి ట్రూజెట్ సేవలు
Mon 13 Jul 02:26:33.242561 2015
హైదరాబాద్ : టర్బో మేఘ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ట్రూజెట్ సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ ను
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు గోల్డెన్ పికాక్ అవార్డు
Mon 13 Jul 02:26:37.768962 2015
న్యూఢిల్లీ : శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అరుదైన గౌరవం దక్కింది. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కు (జిహెచ్ఐఎఎల్) 2015 గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మ
చైనాలో తగ్గిన లగ్జరీకార్ల అమ్మకాలు
Mon 13 Jul 02:26:43.459265 2015
బీజింగ్ : స్టాక్ మార్కెట్ల పతనం, ఆర్థిక అభివృద్ధి రేటు తగ్గటంతో చైనాలో లగ్జరీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. వారంరోజుల్లోనే షేర్ మార్కెట్ రెండుసార్లు కుప్పకూలటంతో
ఉద్యోగాల్లో 15% వృద్ధి
Mon 13 Jul 00:40:43.297282 2015
ముంబయి: వచ్చే త్రైమాసికంలో ఐటీ, నిర్మాణం, ఉత్పత్తి రంగాల ఉద్యోగాల్లో 15శాతం వృద్ధి ఉండవచ్చని ఓ సర్వే అభిప్రాయపడింది. కలకత్తాకు చెందిన జీనయస్ కన్సల్టెన్సీ సంస్థ ఈ సర్వే చ
అగర్తలాలో కోర్ బ్యాంకింగ్ సేవలు
Mon 13 Jul 02:26:50.359872 2015
అగర్తలా : అగర్తాలాలోని పోస్టాఫీసులో కేంద్ర కమ్యునికేషన్లశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోర్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు. దేశంలో కోర్ బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తామ
ఫాక్టోరియల్ పెట్టుబడులకు అనుమతి
Mon 13 Jul 00:38:09.541255 2015
ముంబయి: హాంకాంగ్ చెందిన ఫాక్టోరియల్ మాస్టర్ హెడ్జ్ ఫండ్కు భారత మార్కెట్లలో పెట్టుబడి పొందేందుకు అనుమతి లభించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో గతంలో సెబి ఈ
ఏడాదిలో 16లక్షల కొత్త ఇన్వెస్టర్లు
Mon 13 Jul 00:37:45.600243 2015
ముంబయి: స్పేహాపూరిత ఇన్వెస్టింగ్, మార్కెట్ వృద్ధి నేపథ్యంలో ఈ ఏడాది కొత్తగా 16.64లక్షల కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లో ఖాతాలు పొందారు. డిపాజిటరీలు ఎన్ఎస్డిఎల్, సిఎస్
బస్సులకు చిరునామా తెలంగాణ
Sun 12 Jul 03:43:28.65648 2015
ప్రపంచంలో విలాసవంతమైన బస్సుల తయారీకి ఇక తెలంగాణ చిరునామాగా మారనుంది. మెదక్ జిల్లా జిన్నారం మండలం కొడకంచిలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డెక్కన్
భారత్లో గనులంటేనే కుంభకోణాలు
Sun 12 Jul 03:43:34.774506 2015
భారత్లో గనుల రంగమంటేనే కుంభకోణాలకు మారుపేరుగా మారిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ గ్రానైట్ అండ్ స్టోన్ ఇండిస్టీ (ఎఫ్ఐజిఎస్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంలో ప్
ఫర్నీచర్కు పర్యాయంగా బాంటియా
Sun 12 Jul 03:43:43.8344 2015
ఫర్నీచర్ అవసారాలు అనగానే 'బాంటియా' బ్రాండ్ గుర్తుకు వచ్చేలా తాము వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు బాంటియా ఫర్నీచర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్
ఎపిలో ఫాక్స్కాన్ ప్లాంట్ !
Sun 12 Jul 03:43:50.283734 2015
ఫోన్లు, గాడ్జెట్లు తయారు చేసే అతిపెద్ద కంపెనీ ఫాక్స్కాన్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో తయారు పరిశ్రమను నెలకొల్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. 131.8 బిలియన్ డాలర
37.4 శాతం పెరిగిన పన్ను వసూళ్లు
Sun 12 Jul 03:43:56.226227 2015
జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో పరోక్ష పన్నుల వసూళ్లు 37.4 శాతం మేర పెరిగాయి. అంతకు ముందు ఏడాది రూ.1.12 లక్షలుగా ఉన్న పన్ను వసూళ్లు ఈ ఏడాది
కాకతీయకు క్రెడాయ్ చేయూత..
Sun 12 Jul 03:44:10.534518 2015
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మొదలు పెట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి తమ వంతు చేయూతగా క్రెడాయ్- హైదరాబాద్ ప్రతినిధులు రూ.8.5 లక్షల ఆర్థిక చేయూతను
క్యాన్సర్కు డిఎస్ రీసెర్చ్ సెంటర్ మందు
Sun 12 Jul 02:59:20.098424 2015
వివిధ రకాల క్యాన్సర్లకు డిఎస్ రీసెర్చ్ సెంటర్ తయారు చేసిన మందు మంచి ఫలితాలనిస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు వారు వ్యాధికి గురై చికిత్స పొందిన 926 మందితో కూ
సేవల నాణ్యతలో రాజీపడం..
Sat 11 Jul 03:45:13.786568 2015
చౌక ధరలో సౌకర్యవంతమైన, మంచి ఆతిథ్యంతో కూడిన విమానయానాన్ని అందించనున్నట్లుగా 'టర్బోజెట్ మెగా ఎయిర్వేస్ ప్రయివేటు లిమిటెడ'్ (ట్రూజెట్ బ్రాండ్) ప్రమోటర్,
నిరుత్సాహకులకు మరో అవకాశం..
Sat 11 Jul 03:28:57.821026 2015
లెనోవా కె3 నోట్ మరోమారు ఫ్లిప్కార్ట్ వేదికపై సందడి చేయనుంది. గత బుధవారం తొలిసారిగా ఆన్లైన్ అమ్మకాల కోసం ఫ్లిప్కార్ట్ వేదికపైకి వచ్చిన లెనోవా కె3 నోట్ ఫోన్లు కేవల
హోండా బైక్ 'లివో' విడుదల
Sat 11 Jul 03:29:04.623048 2015
'హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' (హెచ్ఎంఎస్ఐ) ప్రాథమిక శ్రేణి మోటార్ సైకిళ్లను కోరుకునే వారి కోసం 'లివో' పేరుతో సరికొత్త బైక్ను మార్కెట్లోకి అందుబాటులోకి
భారత సైన్యానికి టాటా ట్రక్కులు
Sat 11 Jul 03:29:10.43101 2015
భారత సైన్యం నుంచి టాటా మోటార్స్ భారీ ఆర్డరును చేజిక్కించుకొంది. దాదాపు రూ.940 కోట్ల విలువైన 1200 హై మోబిలిటీ కలిగిన మల్టీయాక్సిల్ ట్రక్కులకు సంబంధించిన ఆర్డరు ఒకటి రక్ష
భారత్లో ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు
Sat 11 Jul 03:29:15.822538 2015
భారత్లో తయారీ ప్లాంట్ ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతుందని జియోమి ఇండియా ఆపరేషన్స్ హెడ్ మను కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్
మూడు రోజుల నష్టాల నుంచి ఉపశమనం
Sat 11 Jul 03:29:23.410657 2015
వరుసగా మూడు రోజుల నుంచి నష్టాలు చవి చూస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు వారాంతంలో ఉపశమనం లభించింది. గ్రీసు బెయిలవుట్ ఒప్పందం ఓ కొలిక్కి వస్తుందన్న వార్తలకు తోడు ఈ ఏడాది
పారిశ్రామికోత్పత్తిలో మాంద్యం
Sat 11 Jul 02:09:54.500039 2015
భారత పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి)లో మాంద్యం నెలకొంది. తయారీ రంగం పేలవ ప్రదర్శన వల్ల ఈ ఏడాది మేలో ఐఐపి 2.7 శాతం పెరుగుదలతో సరిపెట్టుకుంది.
ఔత్సాహికులైన యువత కోసం ఎస్బీహెచ్ కొత్త కార్యక్రమం
Sat 11 Jul 02:08:40.665067 2015
ఔత్సాహికులైన యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు గాను 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద'్ (ఎస్బీహెచ్) భారతీయ యువశక్తి ట్రస్టు (బీవైఎస్టీ) చేతులు కలిపాయి. 'ఎస
మెదక్లో అత్యాధునిక బస్సుల తయారీ
Fri 10 Jul 03:24:23.529695 2015
తెలంగాణ మరో ఆటో పరిశ్రమకు వేదిక కానుంది. 'డెక్కన్ ఆటో లిమిటెడ్' మెదక్ జిల్లా కొడకంచి గ్రామంలో సుమారు రూ.250 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి సమీకృత బస్సు తయారీ యూనిట్ను నె
అంచనాలను చేరిన టిసిఎస్
Fri 10 Jul 03:24:29.084807 2015
ముంబయి : దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో అ
రూ.1000 రాయితీతో విమానయానం
Fri 10 Jul 03:24:35.132266 2015
విజయవాడ కేంద్రంగా పని చేస్తోన్న రీజినల్ విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా ప్రయాణికులను ఆకర్షించడానికి మరో ఆఫర్ను ప్రకటించింది. ఎకానమీ, ఎకానమీ ఫ్లస్ విమానయానంపై రూ.1,000 రాయ
ఇదే సరైన సమయం: జైట్లీ
Fri 10 Jul 03:24:39.486338 2015
యూఎఫ్ఏ (రష్యా): ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు మందగమనంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభివర్ణించారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా భారత్ 7-7.5శా
ఎల్జి నుంచి జి4 'బీట్'
Fri 10 Jul 03:24:46.61491 2015
న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ ఎల్జి మార్కెట్లోకి జి4 సీరిస్లో మరో స్మార్ట్పోన్ను విడుదల చేయనుంది. ఎల్జి జి4 బీట్ పేరుతో దీన్ని మార్కెట్లోకి త
ఆంధ్రా బ్యాంకు డివిడెండ్ 20%
Fri 10 Jul 03:24:51.606352 2015
ఆంధ్రా బ్యాంకు 2014-15కు గాను షేర్ హోల్లర్లకు 20 శాతం డివిడెండ్ను ప్రకటించింది. బుధవారం హైదరాబాద్లో 15వ వార్షిక జనరల్ బాడీ సమావేశం జరిగిందని ఆంధ్రా బ్యాంకు ఓ ప్రకటనలో
5 నెలల కనిష్ఠానికి కార్ల అమ్మకాలు
Fri 10 Jul 02:25:33.424385 2015
న్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురియవచ్చన్న అంచనాలకు తోడు వడ్డీరేట్లు మరితగా దిగి వస్తాయన్న వార్తలు జూన్లో దేశీయ వాహన అమ్మకాలను ప్రభావితం చేశాయి. గత నెలలో కార్ల అమ
మార్చి నాటికి తొలి 'రుణం'
Fri 10 Jul 02:24:34.509345 2015
రష్యా : రుణ గ్రహీతల ఆసక్తులకు అనుగుణంగా బ్రిక్స్ బ్యాంకు కీలకంగా పని చేస్తుందని ఆ సంస్థ చీఫ్ కెవి కామత్ అన్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా తదితర ఐద
నష్టాల బాటలోనే మార్కెట్లు
Fri 10 Jul 02:23:36.481206 2015
ముంబయి: వరుసగా మూడో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ పరిణామాల పట్ల మదుపరులు జాగురుకతతో వ్యవహరిస్తూ ట్రేడింగ్ నిర్వహించడం, కొంత నిరుత్సాహ ప
మెడ్చల్లో రాక్వెల్ ఇండిస్టీ రెండో ప్లాంట్
Fri 10 Jul 02:22:09.31232 2015
నవతెలంగాణ- బ్యూరో : కోల్డ్ చైన్ ఉత్పత్తుల తయారీదారు రాక్వెల్ ఇండిస్టీస్ లిమిటెడ్ తెలంగాణలో రెండో తయారీ ప్లాంట్ను నిర్వహణలోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పన
మురిపించిన 'మన్పసంద్'
Fri 10 Jul 02:21:35.247777 2015
'మ్యాంగో సిప్' బ్రాండ్తో మామిడి పండ్ల రసాన్ని అందించే గుజరాత్కు చెందిన మన్పసంద్ బ్రూవరీస్ సంస్థ షేర్లు గురువారం మార్కెట్లో నమోదు అయ్యాయి. ఆరంభంలో ఇష్యూ ధర రూ.320 క
Thu 09 Jul 03:10:47.766866 2015
ముంబయి: గ్రీసు సంక్షోభం ఒక కొలిక్కి రాకపోవడం, చైనా మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, ముడి చమురు,
మనసున్న మహారాజు 'ప్రేమ్'జీ
Thu 09 Jul 03:10:53.518781 2015
దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించారు. విప్రో వ్యవస్థాపకుడిగా తనుకున్న వాటాలోంచి మరో 18 శాతంను ఛారిటీకి ఇస్తున్నట్లు ఆయన షేరుహోల్డర్లకు తెలిపారు.
బుధవారం సన్సెక్స్ కదలికలు
Thu 09 Jul 03:10:58.581037 2015
గ్రీసు పరిణామాలకు తోడు దిగుమతిదార్లు, బ్యాంకర్లు డాలర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో వరుసగా రెండో సెషన్లోనూ రూపాయి మారకం విలువ పడిపోయింది.
సరికొత్త హోండా 'జాజ్' వచ్చేసింది
Thu 09 Jul 03:11:03.980628 2015
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా సరికొత్త ప్రిమియం హ్యచ్బ్యాక్ 'జాజ్'ను మార్కెట్లోకి విడుదల చేసింది.మూడో తరానికి చెందిన జాజ్ వాహనాన్ని
Thu 09 Jul 03:11:09.900061 2015
చైనా మందగమనం నేపథ్యంలో టాటా మోటార్స్ వాటాలు బుధవారం దాదాపు 6 శాతానికి పైగా కుంగాయి.
బీఎస్ఎన్ఎల్ 'డిజిటల్' దూకుడు
Thu 09 Jul 03:11:16.208469 2015
'డిజిటల్ ఇండియా' స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, | 1entertainment
|
RAHUL
తెలుగు టైటాన్స్లో కొనసాగనున్న రాహుల్
ముంబయి: దేశవ్యాప్తంగా అభిమానులను అలరించడానికి ప్రొ కబడ్డీ అయిదవ సీజన్ వచ్చేస్తుంది.జులైలో మ్యాచ్లు ప్రారంభం కానున్న సమయంలో ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లపై దృష్టి నిలిపాయి.స్టార్ ఆటగాళ్లను తమతోనే కొనసాగేలా చూస్తున్నాయి.ఈ సీజన్లో మొత్తం 350 క్రీడాకారులు భాగం కానున్నారు.టీమిండియామాజీ సారథి అనూప్ కుమార్ యు- ముంబా తరిగి తీసుకొంది.అతడి సారథ్యంలో ఆ జట్టు మూడుసార్లుఫైనల్కు వెళ్లింది.సీజన్-2లో ట్రోఫీ గెలిచింది.ప్రొ కబడ్డీ చరిత్రలో అత్యంత విజయవంతమైన రైడర్ రాహుల్ చౌదరిని తెలుగు టైటాన్స్ తమతోనే కొనసాగిస్తుంది.కబడ్డీ ప్రపంచ కప్ ఇరాన్ను రన్నరప్గా నిలిపిన సారథిఆల్రౌండర్ మిరాజ్ను ఢిల్లీ,కొరియా స్టార్ రైడర్ జాన్ కున్ లీని బెంగాల్ వారియర్స్ తమతో ఉంచుకొన్నాయి.ఆశీశ్ కుమార్ను బెంగళూరు బుల్స్,ప్రదీప్ నర్వాల్ను పట్నా పైరేట్స్,దీపక్ హుడాను పుణేరి పల్టాన్ దక్కించుకొన్నాయి.ఒక్క జైపూర్ పింక్ పాం థర్స్ మాత్రమే ఎవరిని తీసుకోలేదు. ఈ సీజన్లో కొత్తగా నాలుగు ఫ్రాంచైజీలు వస్తున్నాయి. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కలర్ ఫుల్లు ఐఫా అవార్డ్స్ 2017
తారాలోకం సందడితో ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ‘ఐఫా’ ఉత్సవ్ అవార్డ్స్ వేడుక 2017 అంగరంగ వైభవంగా జరుగుతుంది.
TNN | Updated:
Mar 29, 2017, 08:39PM IST
తారాలోకం సందడితో ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ‘ఐఫా’ ఉత్సవ్ అవార్డ్స్ వేడుక 2017 అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిన్న(మంగళవారం) ప్రారంభమైన ఈవేడుకలో తొలిరోజు తమిళ, మలయాళల సినిమాలకు అవార్డ్స్ ప్రదానం చేయగా.. ఈరోజు బుధవారం తెలుగు, కన్నడ సినిమా అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకకు తెలుగు నుంచి రానా, నాని.. కన్నడ నుండి అకుల్ బాలాజీ, మేఘనా గోవంకర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ ఏడాది ఐఫా ఉత్సవ్ అవార్డ్స్2017 పేరుతో పలు కేటగిరీలలో అవార్డ్స్ అందించనున్నాడు. బెస్ట్ మూవీ, బెస్ట్ హీరో , బెస్ట్ హీరోయిన్, బెస్ట్ విలన్ , బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇలా వివిధ కేటగిరీలతో అవార్డ్స్ ఇవ్వనున్నారు. | 0business
|
Visit Site
Recommended byColombia
ఈ చిత్రంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్టర్లను విడుదల చేస్తూ అగ్గిరాజేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్లో తాను ఎవర్ని టార్గెట్ చేయబోతున్నారో ముందు హింట్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్లను పోలిన పాత్రల్ని తనకు నచ్చినట్టు చూపించారు వర్మ.
See Photo Story: అల్లరి ఆశల అభిసారికనై మీకై చూస్తున్నా..ఓ..!
లోకేష్ బాబుకి పప్పు వడ్డిస్తూ ఉన్న చంద్రబాబు.. ‘ఇక ప్రశ్నించే ప్రసక్తిలేదు.. చేయడమే’ అని పవన్ పాత్రధారి చెప్తున్న డైలాగ్స్ ఆయా పార్టీల్లో మంటపుట్టించేవిగా ఉన్నాయి. ఇక పప్పు అంటూ రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన సాంగ్ దారుణం అంటే దారుణం అనే చెప్పాలి.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు `పప్పు లాంటి అబ్బాయి` ఫుల్ వీడియో సాంగ్
X
ఇక వర్మ పైత్యాన్ని పరాకాష్టకు చేర్పించడంతో మూవీ క్రిటిక్ కత్తి మహేష్ చాలానే కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో కత్తి మహేష్ ఓ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ చిత్రంలో పవన్, లోకేష్ బాబు పాత్రల్లో కనిపించిన నటులతో కలిసి దిగిన ఫొటోని ఫేస్ బుక్లో షేర్ చేశారు కత్తి మహేష్.
ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర పోషించిన నటుడు చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని ఉండగా.. లోకేష్ బాబు పాత్రధారి పవన్ భుజంపై చేయి వేసి ఉన్నారు. ఈ బార్లో దిగారో తెలియదు కాని.. రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీలోని పీకే, లోకేష్ బాబులతో నేను’ అంటూ ఫొటోకి క్యాప్షన్ పెట్టి మరీ వదిలారు కత్తి మహేష్.
ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు. అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్లు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
డిజిటలీకరణ వల్ల 50లక్షల ఉద్యోగాలు
జిటల్ టెక్నాలజీ ప్రపంచగతిని సమూలంగా మార్చేసింది. కొత్త అవకాశాలకు వేదిక అవుతోంది. ఒక పక్క రోబోటిక్స్, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు ఊడతాయని అంటున్నా మరో వైపు అపార అవకాశాలకు ఇది మార్గం చూపుతోంది.
Samayam Telugu | Updated:
May 28, 2018, 03:01PM IST
డిజిటల్ టెక్నాలజీ ప్రపంచగతిని సమూలంగా మార్చేసింది. కొత్త అవకాశాలకు వేదిక అవుతోంది. ఒక పక్క రోబోటిక్స్, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు ఊడతాయని అంటున్నా మరో వైపు అపార అవకాశాలకు ఇది మార్గం చూపుతోంది.
డిజిటలీకరణ వల్ల ఐటీ రంగంలో నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందని, ముఖ్యంగా సైబర్ సెక్యురిటీ, డేటా ఎనాలసిస్ విభాగాల్లో కొత్తగా ఉద్యోగాలు వస్తాయని ఒక సర్వేలో వెల్లడైంది. 2027నాటికి కొత్తగా 50లక్షల ఉద్యోగాల వస్తాయని సిస్కోకు చెందిన ఐడీసీ తన సర్వేలో పేర్కొంది. చక్కని నైపుణ్యాలు కలిగిన ఐటీ నిపుణులకు మంచి అవకాశాలు ఉంటాయని సిస్కో తెలిపింది. భవిష్యత్లో వారే కీలక పాత్ర పోషిస్తారని వివరించింది. వచ్చే దశాబ్ద కాలంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా 29 లక్షల మంది కీలక విభాగాల్లో ఉంటారని, నార్త్ అమెరికాలో 12 లక్షల మంది, లాటిన్ అమెరికాలో తదితర ప్రాంతాల్లో ఈ సంఖ్య 6లక్షలుగా ఉంటుందని వెల్లడించింది.
డిజిటల్ టెక్నాలజీ
ముఖ్యంగా ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి అధిక డిమాండ్ ఉంటుంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డేటా ప్రాసెసింగ్, అనలిటిక్స్ తదితర విభాగాల్లో ప్రత్యేక స్కిల్ ఉన్నవారికి అపార అవకాశాలు లభించనున్నాయి. నెట్ వర్క్ లేదా సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ మీడియా మేనేజర్ లేదా అడ్మిన్, వెబ్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్, డేటాబేస్ ఆర్కిటెక్ట్, సిస్టమ్ అనలిస్ట్, డేటా ఇంజినీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్ డెవలపర్ వంటి ఉద్యోగాలకు తగిన అర్హత కలిగిన వారిని ఎంచుకోవడం కష్టతరమైన అంశం కాగలదని నివేదిక వివరించింది. | 1entertainment
|
Jun 30,2018
సర్కారు ద్రవ్యలోటు ఆందోళనకరం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖర్చు అంతకంతకు పెరుగుతున్న వేళ దేశంలో ద్రవ్యలోటు వేగంగా ఎగిసిపడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలకు (ఏప్రిల్-మే) గాను సర్కారు ద్రవ్యలోటు బడ్జెట్లో నిర్దేశించుకున్న మొత్తంలో 55.3 శాతానికి చేరుకున్నట్టుగా కంప్ట్రోలర్ జనరల్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. కేవలం రెండు నెలల్లో సర్కారు వ్యయం ఆదాయానికి మించి రూ.3.45 లక్షల కోట్లకు చేరుకుందని సర్కారు గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఆదాయానికి మించి రూ.6.24 లక్షల కోట్ల కంటే అధికంగా ఖర్చు చేయకూడదని సర్కారు బడ్జెట్లో నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఇదే కాలంలో సర్కారు ద్రవ్యలోటు బడ్జెట్లో నిర్ధేశించుకున్న పరిధిలో 68.3 శాతానికి చేరువైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల కాలంలో సర్కారు పన్ను ఆదాయం రూ.1.02 లక్షల కోట్లుగా నిలిచింది. ఇది బడ్జెట్లో అంచనా వేసుకున్న దానిలో దాదాపు 6.9 శాతం. నాన్డెట్ క్యాపిటల్ ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే సర్కారు ఆదాయం రూ.1.27 లక్షల కోట్లుగా నిలిచింది. ఏప్రిల్-మే మధ్య కాలంలో దాదాపు సర్కారు మొత్తం వ్యయం రూ.4.72 లక్షల కోట్లకు చేరువైనట్టుగా సర్కారు గణాంకాలు చెబుతున్నాయి. ద్రవ్యలోటు పరిధిని సర్కారు గత ఆర్థిక సంవత్సరానికి రూ.5.94 లక్షల కోట్లుగా నిర్ణయించుకోగా.. దానిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.6.24 లక్షల కోట్లుకు పెంచిన విషయం తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Vaani Pushpa 75 Views 61 dollers per barrel , CRUDE-OIL
crude oil
న్యూఢిల్లీ: చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి జరిగిన తర్వాత నుంచి రెండు వారాల్లోనే సౌదీ తన చమురు ఉత్పత్తిని పునరుద్ధరించడంతో చమురు ధరలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ఒక శాతం క్షీణించి బ్యారెల్ 61.12 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడాయిల్ 0.60శాతం క్షీణించి బ్యారెల్ 56.07డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఊహించని దాని కంటే ముందుగానే సౌదీ తన చమురు కేంద్రాలను పునరుద్ధరించడంతో చమురు మార్కెట్లో బుల్స్ నిరుత్సాహపడ్డారు అని నిపుణులు పేర్కొన్నారు. కాగా గత పది వారాల్లో డబ్యూటీఐ క్రూడాయిల్ ధర అధికంగా ఈ వారమే డీలాపడింది. ఈ వారం డబ్ల్యూటీఐ క్రూడాయిల్ 3 శాతం నీరసించింది. అంతేకాకుండా బ్రెంట్ క్రూడాయిల్ ఈ వారం 2.9శాతం పడిపోయింది. ఇది గత ఏడు వారాల కంటే అత్యధిక పతనం కావడం విశేషం. సౌదీ అరేబియా తన చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి జరిగిన తర్వాత నుంచి రెండు వారాల్లోనే తమ చమురు ఉత్పత్తిని రోజుకు 113 లక్షల బ్యారెల్స్ను తిరిగి పునరుద్ధరించిందని రాయిటర్స్ వెల్లడించారు. సౌదీ చమురు కేంద్రాలపై సెప్టెంబరు 14న డ్రోన్ దాడి జరగడంతో చమురు ధరలు 20 శాతం మేన పెరిగిన విషయం విదితమే. ఆ తర్వాత సౌదీ ఈ నెల చివరినాటికి తన పూర్తిచమురు ఉత్పత్తిని పునరుద్ధరిస్తానని ప్రకటించడంతో చమురు ధరలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. దీంతో పాటు గత వారానికి సంబంధించిన అమెరికా చమురు నిల్వలు 24 లక్షల బ్యారెల్స్ పెరగడంతో కూడా డిమాండ్ ఆందోళనలు చమురు మార్కెట్లో పెరిగాయి. అంతేకాకుండా అమెరికా-చైనా వాణిజ్య వివాదం ఆందోళనలు అంతర్జాతీయంగా చమురు డిమాండ్ను ప్రభావితం చేస్తున్నాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
degital Transactions
డిజిటల్ లావాదేవీలు సరే..!
ముంబై, డిసెంబరు 2: డిజిటల్ వ్యవస్థ వైపు భారత్ను నడిపించే కృతనిశ్చయంతో ఉన్నట్లు పాలకులు చెపుతున్నా అందుకు సంబంధించి డిజిటల్ రక్షణను అందించే చట్టాలు మనకు లేకపోవడం విచారకరం. ఒకవేళ ఎవరైన వ్యక్తి డిజిటల్ లావాదేవీల్లో తన సొమ్మును నష్టపోతే అందుకు సదరు వ్యక్తిదే బాధ్యతగా నెట్టి వేస్తున్నాయి. నగదు రహిత ఆర్థికవ్యవస్తను నిర్మిం చాలని చెపుతూ రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు రద్దుచేసిన ప్రభుత్వం ముందు సెక్యూరిటీ చట్టాలపై దృష్టిపెట్టాల్ని అవసరం ఎంతో ఉంది. ప్రధాని మోడీ ప్రభుత్వంచేపట్టిన నోట్లరద్దు అని వార్యంగా డిజిటల్ లావాదేవీలు, మనీవ్యాలెట్ల వైపు నడిపిస్తోంది. అయితే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థరక్షణకు సంబంధించి నిర్దిష్టమైన చట్టాలేవి లేవు. దీనివల్ల ఈ వ్యవస్థలో సందేహాలునివృత్తి చేసుకోవాలన్నా, న్యాయపరమైన విలువలు, న్యాయపరిమితులు వంటి వాటిని ఎవ్వరూ చెప్ప లేరని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పవన్ దుగ్గల్ వెల్లడించారు.
ఇప్పటికే దేశంలో పేటిఎం, ఫ్రీచార్జ్, మొబిక్విక్సంస్థలు నాన్బ్యాంకింగ్ ఫైనా న్షియల్ కార్పొరేషన్స్ కేటగిరీలో ఉన్నాయి. ఇక ఫిన్టెక్ కంపెనీలపరంగా సెక్యూరిటీ పరంగాచూస్తే ఐటిచట్టంలోని సెక్షన్ 43(ఎ) పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం లావాదేవీలన్నీ ఇక కస్టమరు,మొబైల్ వ్యాలెట్ సేవలందించే సంస్థలమధ్య జరుగుతాయి. వీటన్నింటినీచూస్తే ఒకకాంట్రాక్టు ఒప్పందం తరహా లో ఉంటుంది. అయితే ఈ లావాదేవీల్లో విని యోగదారుని సొమ్ముకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. పెద్దనోట్ల రద్దునుంచి పేటి ఎం సంస్థ 35మిలియన్ల లావాదేవీలు నిర్వహిం చింది. వివిధ కొనుగోళ్లు, లేదా నిధుల బదిలీకి సం బంధించి ఈ లావాదేవీలున్నాయి. ఫ్రీచార్జ్ అయితే ముంబైలోని ట్రాఫిక్ ఫైన్లు చలానాలు చెల్లిం చేందుకు పోలీస్తో ఒప్పందంచేసుకుంది.
బెంగ ళూరు కేంద్రంగా ఉన్న మేధో వేదిక సెంటర్ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సిఐఎస్) అంచనాలను చూస్తే భారత్లోని ఎక్కువ ఐటి సంస్థలు టెక్నాలజీ కంపెనీలు ఈ సెక్షన్ 43ఎ పరిధిలోనికి రావని వెల్లడించింది. ఇలాంటి లోపాలవల్ల మొత్తం బాధ్య త అంటా వినియోగదారులకే వదిలివేయడం జరుగుతోంది. ప్రతి వినియోగదారుడు డిజిటల్ వ్యాలెట్లో నిల్వలు రూ.10వేలకు మించకుం డా చేసుకోవచ్చని ఆర్బిఐ ప్రకటించింది. అయి తే గతనెల 23వ తేదీ ఈపరిమితిని రూ.20 వేలకు పెంచింది. అయితే ఈలావాదేవీల్లో విని యోగదారుని సొమ్ముకు పూర్తిభద్రతనిచ్చే చట్టాలు నిర్దిష్టంగా లేవన్నారు. ప్రస్తుతం ఉన్న ఐటిచట్టంలోని 43(ఎ) ఎంతమాత్రం సరిపోద న్న భావన వ్యక్తం అవుతోంది. ఎలాంటి అవక తవకలు చోటుచేసుకోకుండా సజావుగా లావా దేవీలు జరగాలంటే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కస్టమర్ల సొమ్ముకు పూర్తి భద్రతనిచ్చే చట్టాలు ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీటివల్ల వ్యాలెట్ల హ్యాకింగ్, సొమ్ము తస్కరించడం, లేదా దుర్వినియోగం చేయడం వంటివి తగ్గుతాయి. | 1entertainment
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
YUVARAJ
యువీని కావాలనే పక్కన పెట్టారు?
శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్కి సెలెక్టర్లు మొండిచేయి చూపించిన సంగతి తెలిసిందే. విశ్రాంతిపేరుతో సెలెక్టర్లు యువరాజ్ సింగ్ని తప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెటర్ గౌతమ్ గంబీర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. భారత జట్టులోకి యువరాజ్ మళ్లీ పునరా గమనం చేయడం చాలా కష్టమని గంబీర్ పేర్కొన్నాడు. యువీని భారత సెలెక్టర్లు పక్కన పెట్టడమే కాకుండా దానిని సమర్థించుకోవడంపై గంభీర్ మాట్లాడారు.
యువీకి విశ్రింతినిచ్చామని చెప్పిన చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కె ప్రసాద్పై గంభీర్ విమర్శలు చేశాడు. యువీని పక్కన పెట్టారు. అంతవరకు ఒకే. మరి విశ్రాంతి ఇవ్వడమేమిటి. యువరాజ్ విషయంలో రెస్ట్ అనే పదం సరికాడు. అతను చాలా రోజలుగా క్రికెట్ ఆడలేదు. టీమ్లోకి రావాలని అతను కోరుకుంటున్నాడు. అతడు ప్రపంచ కప్లో ఉండాలని అనుకుంటే కచ్చితంగా టీమ్లోకి తీసుకునేవాళ్లు. యువీలాంటి ప్లేయర్ రిథమ్ దెబ్బతాయాలని ఎవరూ అనుకోరు.
అతనిలాంటి ప్లేయర్ను ఓ సిరీస్లో ఆడించి మరోదానికి పక్కన పెట్టడం సరికాదని గంభీర్ చెప్పాడు. జాతీయ జట్టుకు క్రికెట్ ఆడటానికి ఆసక్తిగానే ఉన్నప్పుడు రెస్ట్ అనే పదాన్ని ఎలా వాడతారని చీఫ్ సెల్టెర్ ఎంఎస్కె ప్రసాద్ని గంభీర్ ప్రశ్నించాడు. ఒక వేళ యువీని ప్రపంచకప్లో చూడాలని సెలెక్టర్లు భావించి ఉంటే మరికొన్ని అవకాశాలు అతనికి కచ్చితంగా ఇచ్చేవారని అన్నాడు. యువీకి తిరిగి చోటు దక్కడం కష్టమేనని గంభీర్ అన్నాడు. అయితే క్రికెట్లోని లెజెండరీ ప్లేయర్స్లో ఒకడైన యువరాజ్ తిరిగి రావాలని తాను కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు. ధోని..నువ్వు ఆడుతూనే ఉంటావా…? భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2019 ప్రపంచకప్ జట్టులో ఉంటాడనే సెలెక్టర్ల సంకేతాలపై గంభీర్ ఫైర్ అయ్యాడు. గత కొంత కాలంగా ఫామ్లో లేని ధోనీని ఎందుకు ఎంపిక చేసినట్లని…ప్రపంచకప్ వరకు అతను ఫామ్ కోల్పోకుండా ఉండగలడా…? అని గంభీర్ ప్రశ్నిం చాడు. 2019 ప్రపంచకప్ జట్లులో ఉండాలంటే ధోనీకి ఒకటే దారి… అప్పటివరకు అతను ఫామ్కొనసాగించడమే. ఇదే ప్రామాణికాన్ని ఆటగాళ్లం దరికీ పాటించాలి.
అది ధోనీగానీ…లేదా ఇంకెవరైనా గానీ… ఒకప్పుడు భారత్ జట్టుకి చాలానే చేశారు. కానీ…అది గతం…అయిపోయింది. ఇంకా…గతాన్ని చూపి…నాకు ఇష్టమైన రోజులు ఆడతానంటే ఎలా…? అలా అనుకుంటే…ధోని రాకతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కెరీర్ చాలా కోల్పోయాడు. ఒకవేళ అతనికి అవకాశం ఇచ్చుంటే…అతను నిరూపించు కునేవాడే. ఇప్పటికీ బ్యాకప్ వికెట్ కీపర్గా జట్టుతో కొనసాగేవాడు అని గంభీర్ ఘాటుగా స్పందించాడు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మోదీ సెక్యూరిటీ మా ఫోన్లు లాగేసుకున్నారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
గాంధీ 150వ జయంతి సందర్భంగా నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన స్టార్స్ మీట్పై మరో ప్రముఖులు విమర్శలు గుప్పించారు. ఆ కార్యక్రమంలో మోదీ సెక్యూరిటీ మా సెల్ఫోన్లు తీసుకున్నారని, కానీ కొంతమంది తారలు మాత్రం తమ ఫోన్లలో సెల్పీలు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu | Updated:
Nov 3, 2019, 11:00AM IST
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
మహాత్మ గాంధీ 150 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సినీ ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 29న జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్తో పాటు పలువురు సౌత్ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే సౌత్లో అగ్రతారలకు ఆహ్వానాలు అందకపోవటంతో, కార్యక్రమంలో పాల్గొన్న కొద్ది మంది దక్షిణాది సినీ ప్రముఖుల ఫోటోలు కూడా బయటకు రాకపోవటంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు.
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విటర్ వేదికగానే మోదీ తీరుపై విమర్శలు కురిపించారు. దక్షిణాది నటులను ఆహ్వానించకపోవటం ఎంతో బాదించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ మీట్పై మరో సౌత్ లెజెండ్ స్పందించారు. మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సౌత్ ను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం హారయ్యారు. | 0business
|
RAjjiv Sukhla
రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఏడుగురితో బిసిసిఐ కమిటీ
ముంబయి: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) లో పారదర్శకత కోసం లోథా కమిటీ సూచించిన సం స్కరణల అమలుపై విశ్లేషించేందుకు మంగళవారం బిస ిసిఐ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఐపిఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లాని కమిటీ ఛైర్మన్గా నియమిస్తూ మరో ఆరు గురిని కమిటీ సభ్యులుగా చోటు కల్పించింది. ఇందులో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి కూడా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడి హోదాలో చోటు దక్కింది. గత ఏడాది లోథా సంస్కరణలు అమలుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎంత త్వరగా, మెరుగ్గా బోర్డులో అమలు చేయవచ్చునో ఈ కమిటీ విశ్లేషించి నివే దికను జూలై మూడో వారంలోగా సమర్పించనుంది. సోమ వారం జరిగిన బిసిసిఐ సర్వసభ్య సమావేశంలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, తాజాగా సభ్యుల నియామకం పూర్తయింది.
రాజీవ్ శుక్లా చైర్మన్గా, సౌరవ్ గంగూలీ, టిసి మాథ్యూ, నబ భట్టాఛర్జీ, జేషా, అనిరుథ్ చౌదరి, అమితాబ్ చౌదరితో కూడిన ఏడుగురు సభ్యులు కమిటీలో ఉండనున్నారు. ఈకమిటీకి అమితాబ్ ఛౌదరి కన్వీనర్గా వ్యవహరిస్తారని బిసిసిఐ ప్రతినిధులు తెలిపారు. జూన్ 30న కమిటీ సభ్యులందరూ తొలిసారి సమావేశం కానున్నారు. | 2sports
|
Hyderabad, First Published 15, Mar 2019, 5:25 PM IST
Highlights
బాహుబలి సినిమాలో విలన్ అనగానే రానా గుర్తొస్తాడు. కానీ అందులో భల్లాలదేవ అంగరక్షకుడిగా కనిపంచిన రాకేష్ వర్రే అందరికి గుర్తుండే ఉంటుంది. మాహిష్మతి సభలో ప్రభాస్ అతని తలనరికే సీన్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే హార్డ్ గా కనిపించే రాకేష్ ఇప్పుడు కథానాయకుడిగా కూల్ గా దర్శనమిస్తున్నాడు.
బాహుబలి సినిమాలో విలన్ అనగానే రానా గుర్తొస్తాడు. కానీ అందులో భల్లాలదేవ అంగరక్షకుడిగా కనిపంచిన రాకేష్ వర్రే అందరికి గుర్తుండే ఉంటుంది. మాహిష్మతి సభలో ప్రభాస్ అతని తలనరికే సీన్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే హార్డ్ గా కనిపించే రాకేష్ ఇప్పుడు కథానాయకుడిగా కూల్ గా దర్శనమిస్తున్నాడు.
"ఎవ్వరికి చెప్పొద్దూ.. నా పెళ్లి" అనే డిఫరెంట్ క్యూట్ అండ్ క్రేజీ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. నెగిటివ్ రోల్స్ లో అన్ని విధాలా మెప్పించిన రాకేష్ ట్రైలర్ లో చాలా పాజిటివ్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ట్రైలర్ కూడా చాలా సింపుల్ & బెస్ట్ అన్నట్లు ఉంది. షార్ట్ ఫిలిమ్స్ తో క్లిక్కయిన గార్గేయి ఏల్లప్రగడ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక చిత్ర యూనిట్ మార్చ్ 22న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. | 0business
|
- 22 క్యారెట్ల బంగారం అని చెప్పి 18 క్యారెట్ల బంగారం అప్పగింత
- బీఐఎస్, హాల్ మార్క్ తదితర అంశాలపై కస్టమర్లకు అవగాహన లేమి
- బంగారం వ్యాపారస్తులపై నమ్మకం లేదు: 59 శాతం మంది ఇండియన్స్
- పసిడి స్థానంలో రాళ్లు పెట్టి ఎక్కువ డబ్బు గుంజుడు
స్రవంతి
బంగారంపై భారతీయులకు మోజు ఎక్కువన్న విషయం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే భారతీయ మహిళల దగ్గర ఎంత ఎక్కువ బంగారు నగలు ఉంటే.. వారి ఆర్థిక స్థోమత, హౌదా అంత ఎక్కువ ఉన్నట్టు భావిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకునే, బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా బంగారంపై పెట్టుబడి స్వల్ప కాలంతో పాటు దీర్ఘకాలంలో మంచి రాబడిని వస్తుందని ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు. అయితే, బంగారంపై పెడుతున్న పెట్టుబడికి సరిపడా న్యాయం జరుగుతున్నదా? అనే అంశాన్ని ఒకసారి గ్రహించాలి. ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఓ నగల వ్యాపార సంస్థ ప్రచార నినాదం 'డబ్బులు ఊరికే రావు'. అవును. ఇది నిజమే! కష్టపడి దాచుకున్న డబ్బుకు న్యాయం చేస్తూ.. నగల వ్యాపారులు డబ్బుకు తగ్గ బంగారాన్ని విక్రయిస్తున్నారా? ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
మోసపోయాం!
బంగారాన్ని కొనుగోలు చేసే వర్తకుల వద్ద తాము గతంలో మోసపోయామని నూటికి 48 మంది వినియోగదారులు లబోదిబోమంటున్నారు. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న సామాజిక మాధ్యమ వేదిక 'లోకల్ సర్కిల్స్' చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తెలంగాణ సహా దేశంలోని ప్రముఖ రాష్ట్రాలలోని దాదాపు 20వేల మంది కస్టమర్లపై ఈ సర్వే నిర్వహించారు. అధ్యయనంలో పాల్గొన్న సగం మంది వినియోగదారులు తమకు బంగారాన్ని విక్రయించే వ్యాపారుల చేతుల్లో గతంలో మోసపోయినట్టు అంగీకరించారు. బంగారం నాణ్యత, జీఎస్టీ రేటు, తరుగు, మజూరీ వంటి అంశాల్లో తాము ఈ మోసానికి గురైనట్టు చెప్పారు. బంగారం వర్తకుల చేతుల్లో తాము మోసానికి గురయ్యామో లేదో తెలియదని 29 శాతం మంది పేర్కొన్నారు. బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు.. బంగారు ఆభరణంలోని స్వచ్ఛతను తెలియజేసే హాల్ మార్క్ గుర్తును చూడకుండానే 16 శాతం మంది వినియోగదారులు ఆభరణాల్ని కొనుగోలు చేస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వర్తకులపై తమకు అంతగా విశ్వాసం లేదని ఏకంగా 59 శాతం మంది భారతీయులు చెప్పడం గమనార్హం.
హాల్ మార్క్ గీటురాయి!
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) ఆభరణాల్లోని స్వచ్ఛతను పరీక్షించి ఇచ్చే ధ్రువీకరణ 'హాల్ మార్క్'. బంగారు ఆభరణంలోని స్వచ్ఛతను హాల్ మార్క్ తెలియజేస్తుంది. 22 క్యారెట్ల బంగారానికి 22కె 916, 18 క్యారెట్లకు 18కె 750, 14 క్యారట్ల బంగారం అయితే 14కె 585 ఇలా గుర్తులు ఉంటాయి. హాల్ మార్కింగ్, బంగారం స్వచ్ఛత నంబర్, తయారీ సంవత్సరం వివరాలు కూడా రిజిస్టర్డ్ నగల షాపుల్లో దొరికే బంగారు ఆభరణాలపై ఉంటాయి. 18 క్యారట్ల బంగారంలో కేవలం 75 శాతం బంగారం మాత్రమే ఉంటుంది. కొంత మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారం అని చెప్పి 18 క్యారెట్ల బంగారంతో చేసిన నగలు అమ్ముతారు. అలాంటప్పుడు కొనే నగలపై తప్పనిసరిగా బీఐఎస్ హాల్ మార్క్ ఉందా లేదా అనేది సరిచూసుకోవాలి. 24 క్యారట్ల మేలిమి బంగారం కడ్డీలు, బిస్కట్ల రూపంలో లభిస్తుంది. బంగారం ఆభరణాలపై వ్యాపారులు బిల్లింగ్ వేసేటప్పుడు కూడా కొనుగోలుదారులు జాగ్రత్త వహించాలి. బంగారం ఖరీదుతో పాటు, ఆభరణం తయారు చేసినందుకు చార్జీలు, జీఎస్టీ ఇలా అన్ని స్పష్టంగా వేశారో లేదో గమనించాలి. ట్యాక్స్ రసీదు తీసుకోవడం తప్పనిసరి.
ధరల గోల
బంగారం ధరలు అన్ని ప్రాంతాల్లో, దుకాణాల్లో ఒకేలా ఉండవు. ఎందుకంటే బిల్లింగ్కు సంబంధించి ఓ ప్రామాణిక విధానం మన దేశంలో ఇప్పటి వరకైతే లేదు. ప్రతి పట్టణం, నగరంలోనూ బంగారు వర్తకుల సంఘం అని ఉంటుంది. ఈ సంఘమే అంతర్జాతీయ, దేశీయ ప్రముఖ మార్కెట్ల ధరల ఆధారంగా ప్రతిరోజూ స్థానిక బంగారం ధరలను ఖరారు చేస్తుంది. అందుకే, వివిధ ప్రాంతాల్లో బంగారం ధర విషయంలో వ్యత్యాసం కనిపిస్తుంది. బంగారు నగల అందాన్ని ఇనుమడింపజేసేందుకు వ్యాపారస్తులు రాళ్లను ఉపయోగిస్తుంటారు. వీటిని 'స్టడెడ్ జ్యుయలరీ' అంటారు. కొందరు బంగారం వర్తకులు మొత్తం ఆభరణాన్ని తూకం వేసి ఎన్ని గ్రాములు ఉంటే ఆ మేరకు బంగారం ధరను నిర్ణయిస్తారు. అంటే రాళ్ల బరువుకు బంగారం ధరే వేస్తారు. అయితే, రాళ్లకు బంగారంకు మధ్య ధర వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుందని గ్రహించాలి. ఆభరణంలో ఉన్న నికరం బంగారానికే ధర నిర్ణయించాలని రాళ్లతో ఉన్న ఆభరణం కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు వ్యాపారస్తులను డిమాండ్ చేయడం మర్చిపోవద్దు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
2019-20 బడ్జెట్ : శుక్రవారం 11 గంటలకు బహిర్గతం...
వాసు| Last Updated: గురువారం, 31 జనవరి 2019 (16:37 IST)
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ సాంప్రదాయాలకు భిన్నంగా ఫిబ్రవరి 1వ తేదీన పూర్తి బడ్జెట్ని ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ కసరత్తులు పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 11 గంటలకు ఆయన లోక్సభలో వెల్లడిస్తారు.
ప్రభుత్వం రైతులకు, గ్రామీణ ప్రాంతవాసులకు మరియు మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్లో తాయిలాలు ప్రకటించడంలో వెనుకడుగు వేయకూడదని భాజపా పార్టీ శ్రేణులలో ఆశిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం జూలైలో పూర్తి బడ్జెట్ని ప్రవేశపెట్టేలోపు మూడు నెలల వరకు మాత్రమే మధ్యంతర అమలులో ఉంటుంది. గతంలో మధ్యంతర బడ్జెట్ల పేరిట కీలక వరాలు ప్రకటించినప్పటికీ, అధికారపక్షం మళ్లీ అధికారం చేజిక్కించుకోవడం అనేది ఎప్పుడూ జరిగే పని కాదు.
రాబోయే కీలక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకుగానూ ఇప్పటికే అందుబాటులో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై ప్రేమని నటిస్తూనే తమ ప్రధాన ఓటు బ్యాంక్ అయిన అగ్రవర్ణాలను కూడా తిరిగి అక్కున చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు మధ్యంతర బడ్జెట్ని బీజేపీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్న సమయంలో బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగడం ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా వ్యవహరించారో దేశమంతా చూసిందని, తమను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని ఆరోపిస్తున్నారు.
గతేడాది బడ్జెట్లో మోడీ ప్రభుత్వం రైతుల కోసం..ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్ల కనీస మద్దతు ధరను ప్రకటించినప్పటికీ అది అంతంతమాత్రంగానే ప్రభావం చూపింది. దీంతో ఈ బడ్జెట్లోనే రైతులపై మోడీ వరాల జల్లు కురిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటమితో మోడీ వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్లుగా అర్థమవుతోంది. మరోవైపు రుణమాఫీ చేస్తాం, ప్రజలందరికీ కనీస ఆదాయం స్కీమ్ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారాన్ని మోడీ తన మార్క్ బడ్జెట్తో ఎంత మేరకు తిప్పికొడ్తారో 1వ తేదీ వరకు వేచి చూడవలసిందే.
సంబంధిత వార్తలు | 1entertainment
|
internet vaartha 158 Views
బెంగళూరు : టీమిండియాకు సుమారు 15 నెలల నుంచి దూరంగా ఉంటున్న పేసర్ షమీపై టెస్ట్ కెప్టెన్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.షమీ ఒక నాణ్యమైన బౌలర్ అని, అతని ఎటాకింగ్ విధానం ముచ్చటగా ఉంటుందని కొనియాడాడు. కాగా మరో రెండు రోజుల్లో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనున్న టీమిండియా జట్టులో షమీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నాడు. షమీలో మంచి రిథమ్ ఉంది,ప్రత్యేకంగా టెస్టు మ్యాచ్లకు అతని లెంగ్త్ సరిగ్గా సరిపోతుంది. విండీస్ పిచ్లపై ఆ తరహా లెంగ్త్ అవసరం,షమీ లైన్ అండ్ లెంగ్త్ ఎప్పుడూ ఎటాక్ చేసే విధంగానే ఉంటుంది.వికెట్ లభించిందా? లేదా? అనేది ప్రశ్న కాదు అని కోహ్లీ పేర్కొన్నాడు.చాలా కాలం తరువాత టీమిండియా జట్టులో ఆడబోతున్న షమీ ఆకలిగొన్న పులిలా విజృంభించడం ఖాయ మని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతన్ని మానసికంగా సిద్ధం చేయడంలో నిమగ్నమైనట్లు కోహ్లీ పేర్కొన్నాడు. | 2sports
|
ఎఫ్డిలపై వడ్డీ రేట్ల పెంపు
- హెచ్డిఎఫ్సి బ్యాంకు నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంకు వివిధ కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.6 శాతం వరకూ పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆ బ్యాంకు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆరు నెలల ఒకరోజు నుంచి 5సంవత్సరాల డిపాజిట్లపై పెంచిన వడ్డీ రేట్లను ఆ బ్యాంకు వెబ్సైట్లో ప్రచురించింది. 6-9నెలల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 6.75శాతం వడ్డీరేటు అందించనుంది. 9 నెలల మూడు రోజుల నుంచి ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటును 7.25శాతంగా నిర్ణయించింది. ఏడాది 17 రోజుల నుంచి రెండేళ్ల కాలపరిమితి ఎఫ్డిలపై 7.75 శాతం వడ్డీ అందించనుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల డిపాజిట్లపై 7.60 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించింది. ఎఫ్డీ రేట్లను పెంచడంతో రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెంచడానికి ఆస్కారం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే రెపో రేటును మరో పావు శాతం పెంచుతూ ఆర్బిఐ నిర్ణయం తీసుకుంది. రుణాలపై వడ్డీ రేటు పెరిగితే గహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న కస్టమర్ల ఐఎంఐలు భారము కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బిఐ కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
kevin koththigoda, the sri lanka spinner's action is more froggier than paul adams
భలే యాక్షన్ గురు: శ్రీలంక స్పిన్నర్ వెరైటీ బౌలింగ్!
క్రికెట్లో విరుద్ధమైన బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్లు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
TNN | Updated:
Nov 14, 2017, 05:35PM IST
క్రికెట్‌లో విరుద్ధమైన బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్లు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఒకప్పుడు దక్షిణాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్ దగ్గర నుంచి నేటి గుజరాత్ లయన్స్‌కు చెందిన శివిల్ కౌశిక్ వరకు మనం చాలా మంది వింత యాక్షన్ బౌలర్లను చూశాం. ఇలాంటి బౌలింగ్ యాక్షన్లకు ఫిదా అయిపోయిన క్రికెట్ అభిమానులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మరో బౌలర్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటున్నాడు. అతనే శ్రీలంకకు చెందిన 18 ఏళ్ల స్పిన్నర్ కెవిన్ కొత్తిగొడ.
ప్రస్తుతం మలేసియాలో జరుగుతున్న అండర్-19 యూత్ ఏసియా కప్ టోర్నమెంట్‌లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ లెగ్ స్పిన్నర్ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నాడు. ఈ వారం ఆఫ్ఘనిస్తాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. కుడిచేతి వాటం లెగ్ స్పిన్నర్ అయిన కెవిన్.. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీశాడు. దీంతో ఇప్పుడు కెవిన్ హాట్ టాపిక్‌గా మారాడు. దక్షిణాఫ్రికా చైనామన్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్‌ను కెవిన్ గుర్తు చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మనోడి బౌలింగ్ యాక్షన్ ఎలా ఉందో మీరూ చూసేయండి.. | 2sports
|
Sep 17,2015
ఫెడ్కు ఎదురొడ్డి సెన్సెక్స్ ర్యాలీ
అమెరికా కేంద్ర బ్యాంకు 'ఫెడరల్ రిజర్వు' కీలక వడ్డీ రేట్లను పెంచనుందని బలమైన సంకేతాలు అందినప్పటికీ మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరులు కొనుగోళ్ల వైపే మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరాయి. బీఎస్ఈసెన్సెక్స్ 258.04 పాయింట్లు రాణించి 25,963.97 పాయింట్ల వద్ద స్థిర పడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 70.05 పాయింట్లు పెరిగి 7,899.15 వద్ద స్థిరపడింది. ఇంట్రా ట్రేడింగ్లో సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 26 వేల పాయింట్ల పైనా ట్రేడ్ అయ్యింది. బీఎస్ఈలో రంగాల వారిగా బ్యాంకింగ్ సూచీ అత్యధికంగా 1.42 శాతం వద్ద ముగిసింది. విద్యుత్ (0.7 శాతం), వైద్య (0.67 శాతం), టెక్నాలజీ (0.56 శాతం) రంగ సూచీలు రాణించాయి. మరోవైపు కన్సూమర్ డ్యూరెబుల్స్ (1.45 శాతం), ఆయిల్ అండ్ గ్యాస్ (0.6 శాతం), కాపిటల్ గూడ్స్ (0.46 శాతం), రియాల్టీ (0.39 శాతం) చొప్పున పెరిగాయి.
సెన్సెక్స్ భారతీ ఎయిర్టెల్ 2.58 శాతం, సన్ఫార్మా 2.38 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.35 శాతం, విఇడిఎల్ 2.12 శాతం, హీరో మోటో కార్ప్ 2.01 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు భెల్ 0.66 శాతం, డాక్టర్ రెడ్డీస్ 0.6 శాతం, ఎల్అండ్టీ 0.58 శాతం, కోల్ ఇండియా 0.06 శాతం చొప్పున నష్టాలను చవి చూశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు సమీక్ష సమావేశంలో కీలక వడ్డీ రేట్ల పెంపు చోటు చేసుకోనుందని అంతర్జాతీయ మీడియా, విశ్లేషకులు గత కొద్ది రోజులు పేర్కొంటున్నాయి. అయినా తాజాగా మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గ చూపడంతో మార్కెట్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు వరుసగా 0.17 శాతం, 0.44 శాతం చొప్పున పెరిగాయి. మొత్తంగా మదుపర్ల మద్దతుతో 1,411 స్టాక్స్ లాభాల్లో ముగియగా, మరోవైపు 1,260 స్టాక్స్ ప్రతికూలతలో నమోదయ్యాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
కోల్ ఇండియా సీఎండీగా అనీల్ కుమార్
దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు కోల్ ఇండియాకు నూతన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా అనిల్ కుమార్ జా నియమితులయ్యారు
Samayam Telugu | Updated:
May 21, 2018, 12:00PM IST
కోల్ ఇండియా సీఎండీగా అనీల్ కుమార్
దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు కోల్ ఇండియాకు నూతన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా అనిల్ కుమార్ జా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం జా మహానంది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్కు సీఎండీగా ఉన్నారు. గనుల విభాగంలో ఆయనకు 32 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కోల్కత్తా కేంద్రంగా పని చేస్తున్న కోల్ ఇండియాకు ఆయన 2020 జనవరి 31 వరకు అధిపతిగా కొనసాగనున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్లో ఎం-టెక్ చేసిన అనిల్ కుమార్ ఝా.. 1983లో సీసీఎల్లో కెరీర్ను ప్రారంభించారు. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
సార్.. నేను బ్రతకాలా? చావాలా? సీఎంకు నటి లేఖ!
ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసు ట్విస్ట్ మీద ట్విస్ట్లతో సాగుతోంది.
TNN | Updated:
Aug 17, 2017, 02:37PM IST
ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసు ట్విస్ట్ మీద ట్విస్ట్‌లతో సాగుతోంది. కేరళలో సంచలనంగా మారిన ఈ సంఘటన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా.. నేను బ్రతకనా? లేక ఆత్మహత్య చేసుకోమంటారా? అని ప్రశ్నిస్తూ మలయాళ నటి కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్‌కు ఓ లేఖ రాసింది. ఫిబ్రవరి 17న జరిగిన సంఘటన తనను కలతకు గురి చేసిందని, తన కుటుంబ సభ్యుల పరిస్థితి దారుణంగా ఉందని లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేసింది. 'ఉమెన్ ఇన్ కలెక్టివ్' సంఘం అధికారిక ఫేస్ బుక్‌లో భావన ఈ లేఖను పోస్ట్ చేయగా, విషయంలో తీవ్రతను ముఖ్యమంత్రికి తెలియజేసింది సదరు సంస్థ.
ఎమ్మెల్యే పీసీ జార్జ్ తనను ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తున్నట్లుగా ఈ లేఖలో పేర్కొంది. తనపై లైంగిక వేధింపుల ఘటన అనంతరం పీసీ జార్జ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనస్థాపానికి గురి చేశాయని, కేసును పక్క దారి పట్టించేందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వాపోయింది. తనపై అటాక్ సంఘటన జరిగిన మరుసటి రోజున షూటింగ్‌లో పాల్గొన్నారని, అది ఎలా సాధ్యమని సదరు ఎమ్మెల్యే ఇది వరకు ప్రశ్నించారు. అయితే ఆ ఘటన జరిగిన వారం రోజుల వరకు తను ఇంటి నుండి బయటకు రాలేదని, చిత్ర యూనిట్ సభ్యుల అభ్యర్ధన మేరకు పది రోజుల తరువాతే షూటింగ్‌కు వెళ్లానని, అసలు యూనిట్ సభ్యుల సహకారం లేకపోతే షూటింగ్‌లో పాల్గొనేదాన్ని కాదని అన్నారు. ఈ సంఘటనతో తాను క్రుంగిపోయానని తన ఆవేదనను వెల్లడించారు. మరి ఈ లేఖపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. | 0business
|
Jan 20,2016
వృద్ధిరేటుకు ఐఎంఎఫ్ కోత
వాషింగ్టన్ : అభివృద్ధి చెందిన, వర్థమాన దేశాల్లో నెలకొన్న స్తబ్దత నేపధ్యంలో 2016లో ప్రపంచ వృద్ధి రేటులో తగ్గుదల చోటు చేసుకోనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ హెచ్చరించింది. ప్రస్తుత ఏడాదిలో 3.4 శాతం, 2017లో 3.6 శాతం చొప్పున వృద్ధి నమోదు కావొచ్చని తెలిపింది. గతేడాది క్టోబర్ అంచనాలతో పోల్చితే ఇవి 0.2 శాతం తక్కువ. వృద్ధి అంచనాలకు కోత పెట్టడం వరుసగా ఇది మూడోసారి. దిగజారుతున్న వృద్ధి నేపధ్యంలో స్వల్పకాల డిమాండ్లపై విధానకర్తలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్ సూచించింది. అంత ర్జాతీయ మార్కెట్లో వరుసగా చమురు ధరలు తగ్గడానికి తోడు చైనా ఆర్ధిక వ్యవస్థలో నెలకొన్న ఒత్తిడి ప్రపంచ వృద్ధిరేటును తగ్గేలా చేస్తున్నాయని పేర్కొంది. చైనా వృద్ధి రేటు అంచనాలను 6.3 శాతానికి, 2017లో 6 శాతానికి తగ్గించింది. 2015లో చైనా 6.9 శాతం, 2014లో 7.3 శాతం చొప్పున వృద్ధి నమోదు చేసుకుంది. చైనాకు తోడు బ్రెజిల్లో నెలకొన్న సంక్షోభం కూడా ప్రపంచ వృద్ధి రేటును ప్రభావితం చేయ నుందని ఐఎంఎఫ్ పేర్కొంది. మొత్తం ప్రపంచ వృద్ధి రేటులో అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల వాటా 70 శాతంగా ఉంది.
భారత వృద్ధి 7.3 శాతమే..
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.3 శాతానికే పరిమితం కానుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వచ్చే రెండు ఆర్ధిక సంవత్సరాల్లో మాత్రం 7.5 శాతానికి చేరే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇది వరకు గతేడాది అక్టోబర్లో ఐఎంఎఫ్ వృద్ధి రేటు అంచనాలను విడుదల చేసింది. అప్పుడు కూడా 2015-16లో 7.3 శాతం వృద్ధి రేటునే ప్రకటించింది. ఇదే సమయంలో 7.5 శాతం, 8 శాతం వృద్ధి రేటుకు అవకాశాల ున్నాయని మోడీ అధికార వర్గాలు పదే పదే పేర్కొంటున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Suresh 121 Views Bruma
Bruma
ప్రపంచకప్లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 100 వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్లో లంక ఓపెనర్లు కరుణరత్నె (10), కుశాల్ పెరీరా (18)లను పెవిలియన్ పంపిన బుమ్రా తన ఖాతాలో 100 వికెట్లు వేసుకోవడంతో పాటు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా వంద వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా రికార్డుల్లో ఎక్కాడు. మహ్మద్ షమి 56 వన్డేల్లో ఈ ఘనత సాధిస్తే.. బుమ్రా 57 వన్డేల్లో ఈ ఫీట్ను అందుకున్నాడు. తర్వాత స్థానాల్లో ఇర్ఫాన్ పఠాన్ (59 వన్డేల్లో), జహీర్ ఖాన్ (65), అజిత్ అగార్కర్ (67), జవగళ్ శ్రీనాథ్ (68) ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే.. అతి తక్కువ వన్డేల్లో వంద వికెట్లు తీసిన అంతర్జాతీయ బౌలర్గా అఎn్గానిస్తాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ ఖాన్ 44 వన్డేల్లోనే వంద వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అతని తర్వాత ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (52), పాకిస్తాన్ బౌలర్ సక్లేన్ ముస్తాక్ (52) టాప్-3లో ఉన్నారు. | 2sports
|
బాలయ్య రూ.2 కోట్లు ఇచ్చి మరీ తీసుకొచ్చాడు!
Highlights
ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ బాగుంటుందని క్రిష్ సూచించగా ఆమెను సెట్స్ పైకి తీసుకురావడం కోసం ఏకంగా రూ.2 కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడట బాలయ్య. నిజానికి సినిమా ఆమె పాత్ర చాలా చిన్నది. ఏ సీనియర్ హీరోయిన్ ను తీసుకున్నా సరిపోతుంది కానీ బాలయ్య మాత్రం సినిమాకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ తీసుకురావడం కోసమే విద్యాబాలన్ ను రంగంలోకి దింపారు.
దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తన తండ్రి బయోపిక్ ను తనే స్వయంగా నిర్మిస్తున్నాడు. దీంతో ఏ విషయంలో కూడా రాజీ పడడం లేదు బాలయ్య. ఈ సినిమాకు జీతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనేది బాలకృష్ణ ప్లాన్.
దానికోసం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాకు ఏం కావాలన్న దగ్గరుండి సమకూరుస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ బాగుంటుందని క్రిష్ సూచించగా ఆమెను సెట్స్ పైకి తీసుకురావడం కోసం ఏకంగా రూ.2 కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడట బాలయ్య. నిజానికి సినిమా ఆమె పాత్ర చాలా చిన్నది.
ఏ సీనియర్ హీరోయిన్ ను తీసుకున్నా సరిపోతుంది కానీ బాలయ్య మాత్రం సినిమాకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ తీసుకురావడం కోసమే విద్యాబాలన్ ను రంగంలోకి దింపారు. కేవలం విద్యాబాలన్ మాత్రమే కాదు.. పలువురు టాలీవుడ్ అగ్ర నటీనటులను ఈ బయోపిక్ లో భాగం చేసే పనిలో పడ్డాడు బాలయ్య. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
Last Updated 13, Jul 2018, 6:58 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
చెన్నైకి ధోనీ ఆడటం అనుమానమేనా..?
వచ్చే ఐపీఎల్లో ధోనీ చెన్నై తరఫున ఆడటం అనుమానమేనా..? ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీకి ఏయే జట్లు విముఖంగా ఉన్నాయి..
TNN | Updated:
Nov 22, 2017, 04:51PM IST
చెన్నైకి ధోనీ ఆడటం అనుమానమేనా..?
వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం వేలం ప్రక్రియ ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే.. ఏ జట్టుకు ఏ ఆటగాడు సొంతం అవుతాడనే విషయం ఉత్కంఠ రేపుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోనీ తిరిగి చేరడం అనుమానంగా కనిపిస్తోంది. మంగళవారం ముంబైలో నిర్వహించిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది. ఆటగాళ్ల రిటెన్షన్ విధానం పట్ల కోల్‌కతా, రాజస్థాన్ జట్లు విముఖంగా ఉన్నాయి. కాగా, ముంబై ఇండియన్స్, చెన్నై జట్లు మాత్రం రిటెన్షన్ విధానాన్ని సమర్థిస్తున్నాయి.
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేళ్లపాటు ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లపై నిషేధం పడటంతో.. ఆయా జట్ల ఆటగాళ్లు రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లలో చేరిపోయారు.
ప్రస్తుతం ముంబై జట్టు ఐదారుగురు ఆటగాళ్లను తనతోనే అట్టిపెట్టుకోవాలని భావిస్తోంది. చెన్నై జట్టు నలుగుర్ని తనతోనే ఉంచుకోవాలని భావిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు జట్లు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ ఆటగాళ్లను తమతో ఉంచుకోవాలని భావిస్తున్నాయి. చెన్నై జట్టు ధోనీ, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా,డుప్లెసిస్, బ్రావోలను తనతో ఉంచుకోవాలని అనుకుంటోంది. ఆటగాళ్ల రిటెన్సన్ పాలసీ గురించి మరో పదిహేను రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
- ప్రాజెక్టును రద్దు చేసిన ఆస్ట్రేలియా స్థానిక కోర్టు
- అయినా తమకే దక్కుతుందని నమ్మకంలో కంపెనీ వర్గాలు
న్యూఢిల్లీ: అదాని గ్రూపు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆస్ట్రేలియాలో తలపెట్టిన అతిపెద్ద బొగ్గు గని ప్రాజెక్టుకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టు పర్యావరణాన్ని దెబ్బ తీస్తుందని, స్థానికుల అభిప్రాయ సేకరణ పూర్తిస్థాయిలో చేపట్టలేదన్న కారణంగా దీన్ని రద్దు చేస్తూ స్థానిక కోర్టు ఆదేశించిన మరుసటి రోజే ఈ ప్రాజెక్టుకు ప్రధాన బ్యాంకు సలహాదారుగా ఉన్న 'కామన్వెల్త్ బ్యాంకు ఆఫ్ ఆస్ట్రేలియా' (సిబిఎ) తాము ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద విత్త సంస్థగా ఉన్న సీబీఏ ఈ నిర్ణయం తీసుకోవడంతో అదాని ప్రాజెక్టుపై మరిన్ని నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా ఇంకా పూర్తి నిర్ణయం జరగలేదని, ఈ ప్రాజెక్టు నిర్వహణలోకి వస్తుందని అదాని గ్రూపు మాత్రం ఇంకా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.
ఆస్ట్రేలియాలో అదాని గ్రూపు తలపెట్టిన భారీ బొగ్గు గని 'కార్మికేల్ ప్రాజెక్టు' ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు గని ప్రాజెక్టుల్లో ఒక్కటిగా ఉంది. 16.5 బిలియన్ డాలర్లు (రూ.1 లక్ష కోట్ల పైగా ) విలువైన ఈ ప్రాజెక్టుకు ఆదేశ పర్యావరణ మంత్రిత్వశాఖ ఇచ్చిన అనుమతులను బుధవారం స్థానిక ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. క్వీన్స్లాండ్లోని గెలీలీ బేసిన్లో తలపెట్టిన ఈ ప్రాజెక్టులపై పర్యావరణ వేత్తలు, స్థానిక నివాసితుల తీవ్ర అభ్యంతరాలను పూర్తి స్థాయిలో తీసుకోకుండానే పర్యావరణ మంత్రి గ్రెగ్ హంట్ ఈ బొగ్గు గని ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారాని కోర్టు పేర్కొంది. కార్మికేల్ బొగ్గు గని, రైలు ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఏ కూడా వెనక్కి తగ్గినట్లు ప్రకటించింది. అయితే పూర్తి వివరాలు వెల్లడించడానికి ఆ సంస్థ ఆసక్తి చూపలేదని రాయిటర్స్ ఓ కథనం వెల్లడించింది. కార్మికేల్ ప్రాజెక్టు నిర్వహణలోకి వస్తే 4.5 గిగా టన్నుల ఉద్గారాలను వెదజల్లనుందంటూ 'యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్లాండ్స్'కు చెందిన 'ఒవె హొగ్ గుల్డ్బెర్గ్' ఇది వరకే ఆందోళన వ్యక్తం చేసింది.. ఈ ప్రాజెక్టు వల్ల 0.5 శాతం ఉద్గారాలను వదిలేసిన, మిగితా మొత్తం చాలా ప్రమాదకర స్థాయిలో ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మోడీ అధికారంలోకి రాగానే..
భారత్లో మోడీ బాధ్యతలు స్వీకరించి ఆ దేశ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఈ ప్రాజెక్టును గౌతం ఆదానీ కైవసం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టుపై ఒప్పందం జరిగిన కొద్ది నెలల్లోనే క్వీన్స్లాండ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంతో అదానీ గ్రూపు తలపెట్టిన లక్ష కోట్ల రూపాయాల ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడింది. ఒప్పంద సమయంలో ప్రతిపక్షంగా ఉన్న లేబర్ పార్టీ, ఇతర పక్షాలు దుమ్మెత్తిపోశాయి. క్వీన్స్లాండ్లో అధికార మార్పిడి తాజాగా అదాని ప్రాజెక్టును మరింత ఇరకాటంలో పడేసింది. అప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ దెబ్బతో అదాని గ్రూపు ఆస్ట్రేలియా మైనింగ్ ప్రాజెక్టుకు రూ.6,200 కోట్ల రుణ మంజూరుపై ఎస్బీఐ కూడా వెనక్కి తగ్గే అవకాశాలున్నట్లు సమాచారం.
స్థానికుల్లో హర్షం
'మెకే కన్సర్వేషన్ గ్రూపు' వేసిన పిటిషన్పై కోర్టు రెండు రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో పాటు కామన్వెల్త్ బ్యాంకు నిర్ణయాలను స్వాగతిస్తున్నామని ఆస్ట్రేలియా గ్రీన్స్ డిప్యూటీ లీడర్ లరిస్సా వాటర్స్ అన్నారు. స్థానిక పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ గనికి సంబందించి చట్టపరమైన అనుమతులు రద్దు అయ్యాయని మెకే గ్రూపు ప్రతినిధి స్యూ హిగ్గిన్సన్ తెలిపారు. ఇప్పుడు పర్యావరణ మంత్రి మరోసారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ గనిని తిరిగి ఆమోదించాలని మంత్రి భావిస్తే నూతన సమాచారం, సాక్ష్యాలు ప్రవేశపెట్టాల్సి ఉందని, అది అంత సులువు కాదన్నారు.
పూర్తి స్థాయి ప్రభుత్వ అనుమతుల కోసం అదాని గ్రూపు ఇప్పటికే ఈ ప్రాజెక్టును నిలిపి వేసింది. చివరకు ఈ వ్యవహారం తమకు అనుకూలంగానే వస్తుందని అదాని గ్రూపు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టు 280 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇందుకోసం 300 కిలోమీటర్లలో రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది 60 మిలియన్ టన్నుల బొగ్గును విదేశాలకు ఎగుమతి చేయాలన్నది ప్రధాన లక్ష్యంగా అదాని గ్రూపు నిర్దేశించుకుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బచ్చన్ ఇంట్లో సందడి చేసిన బాలీవుడ్ స్టార్స్ కిడ్స్
రీసెంట్ గా బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్ ఇంట్లో జరిగిన దీపావళి సంబరాల్లో బాలీవుడ్ స్టార్స్ కిడ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
TNN | Updated:
Nov 1, 2016, 04:22PM IST
రీసెంట్ గా బాలీవుడ్ షెహ‌న్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ ఇంట్లో జరిగిన దీపావ‌ళి సంబరాల్లో బాలీవుడ్ స్టార్స్ కిడ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సైఫ్ అలి ఖాన్ కుమారుడు, కూతురు ఇబ్రహీం, సారా అలీ ఖాన్ తో పాటు పాటు షారూక్ ఖాన్ కూతురు సుహాన ఖాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్లంతా అక్క‌డే ఉండ‌టంతో బ‌చ్చ‌న్ ఇల్లు క‌ళ‌క‌ళ‌లాడింది. ప్ర‌తి ఏడాది దీపావ‌ళి వేడుక‌ల‌కు బాలీవుడ్‌ను ఆహ్వానించ‌డం ఆన‌వాయితీ మార్చుకుంది బ‌చ్చ‌న్ ఫ్యామిలీ.
The Bachchan Diwali gala is a grand star-studded affair. Graced by Bollywood's who's who, it's a party you can't miss! This year, Saif Ali Khan's kids, Ibrahim and Sara Ali Khan, and Shah Rukh Khan's daughter, Suhana Khan, attended the event looking royal! Check out the pictures. | 0business
|
Steve Waugh the most selfish cricketer - warne
స్టీవ్ వా స్వార్థపరుడు - షేన్ వార్న్ విమర్శ
ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ వాపై మాజీ లెగ్ స్పిన్ మాంత్రికుడు విమర్శల జల్లు కురిపించాడు .
| Updated:
Feb 9, 2016, 04:27PM IST
ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ వాపై మాజీ లెగ్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ విమర్శల జల్లు కురిపించాడు . స్టీవ్ వా బయట కనిపించినంత మంచివాడు కాడని.. అతను ఎప్పుడు ఏం చేసినా అందులో అతని స్వార్థం దాగుంటుందని వెల్లడించారు. మైదానం లోపల ..వెలుపల ఇలా ఎక్కడ చూసినా అతని స్వభావం స్వార్ధపూరితంగా ఉంటందని వార్న్ బాంబు పేల్చాడు. ఇది ఊహించి చెబుతున్న మాటలు కావని.. అతనితో కలిసి ఆడిన అనుభవంతో చెబుతున్నానని వార్న్ వెల్లడించారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఓ టెలివిజయన్ ఇంటర్వ్యూలో వార్న్ ఈ విమర్శలు చేశాడు.
స్టీవాకు సమకాలికుడైన షేన్ వార్న్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇటు క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. క్రికెట్ చరిత్రలో అత్యంత సక్సెస్ పుల్ కెప్టెన్ గా పేరు తెచ్చున్న స్టీవ్ వా లాంటి వ్యక్తిపై అదే జట్టులో ఆడిన ప్రపంచ అగ్రశ్రేణి స్పిన్నర్ వార్న్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆస్తక్తి నెలకొంది. మరోవైపు వార్న్ విమర్శలపై స్టీవ్ ఎలా స్పందిస్తాడనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. | 2sports
|
తగ్గిన వ్యవసాయోత్పత్తుల ఎగుమతి
- మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: భారత వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు గత ఆర్ధిక సంవత్సరంలో (2016-17లో) 33.87 బిలియన్ డాలర్లకు పడిపోయాయని కేంద్ర వెల్లడించింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ విషయం తెలిపారు. 2013-14లో ఈ రంగం ఎగుమతులు 43.23 బిలియన్ డాలర్లగా నమోదయ్యాయని బుధవారం మంత్రి రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోవడం ఈ రంగం ఎగుమతులపై ప్రభావం చూపాయన్నారు. దీంతో భారత ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో పోటీ పడలేకపోయాయని పేర్కొన్నారు. కాగా 2016-17లో సముద్ర ఉత్పత్తులతో కలుపుకుని వ్యవసాయోత్పత్తుల దిగుమతులు 25.09 బిలియన్ డాలర్లకు పెరిగాయని మంత్రి వెల్లడించారు. 2013-14లో 15.03 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదైనట్టుగా తెలిపారు. ఈ రంగం ఎగుమతులు, దిగుమతులు వివిధ పరిణామాలపై ఆధారపడి ఉంటాయన్నారు. లభ్యత, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో డిమాండ్, సరఫరా, పరిస్థితులు, నాణ్యత పరమైన అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. ముఖ్యంగా భారత్ వంట నూనెలు, పప్పుల కొరతను ఎదుర్కొంటుందన్నారు. క్రితం మూడేండ్ల నుంచి దేశం మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయోత్పత్తుల వాటా క్రమంగా తగ్గుతూ వస్తోందని మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2016-17 దేశ మొత్తం ఎగుమతుల్లో 12.26 శాతం, 2014-15లో 12.59 శాతం చొప్పున తగ్గుదల చోటు చేసుకుందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 21, Mar 2019, 5:40 PM IST
Highlights
నాని జెర్సీ సినిమాతో రొమాంటిక్ టచ్ గట్టిగానే ఇవ్వనున్నట్లు టీజర్ తో చెప్పేశాడు. జెర్సీ సినిమాకు సంబందించిన సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది.
నాని జెర్సీ సినిమాతో రొమాంటిక్ టచ్ గట్టిగానే ఇవ్వనున్నట్లు టీజర్ తో చెప్పేశాడు. జెర్సీ సినిమాకు సంబందించిన సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది.
అదేంటో గాని విన్నపాటుగా అనే సాంగ్ లో నాని హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ తో రొమాంటిక్ గా కనిపించడం బావుంది. స్నానం చేసి వస్తా.. పెళ్లి చేసుకుందాం అనే డైలాగ్ సింపుల్ అండ్ స్వీట్ గా ఉంది. ఒక క్రికెటర్ నాని ఈ సినిమాలో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఏప్రిల్ 19న ఈ స్పోర్ట్స్ డ్రామా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. | 0business
|
షాప్ క్లూస్ ను కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్న స్నాప్డీల్
కుమార్ దళవాయి| Last Modified బుధవారం, 22 మే 2019 (17:57 IST)
మరో వ్యాపార విలీనానికి అంకురార్పణ జరిగింది. ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన షాప్ క్లూస్ను కొనుగోలు చేసేందుకు స్నాప్డీల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ విలీన ఒప్పందం విషయమై ఈ రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే దాని విలువ దాదాపు 250 మిలియన్ డాలర్లు ఉండవచ్చు. అయితే ఈ విలీనానికి సంబంధించి రెండు సంస్థలు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
స్నాప్డీల్ గతంలో భారీ నష్టాల్లో కూరుకుపోయిన సందర్భంలో దాన్ని చేజిక్కించుకోవడానికి ఫ్లిప్కార్ట్ ప్రయత్నించింది. అయితే ఫ్లిప్కార్ట్ ప్రయత్నాలకు తలొగ్గని స్నాప్డీల్ తన స్వంత కాళ్లపై నిలబడాలనే ఆలోచనతో సంస్థను నష్టాల నుండి గట్టెక్కించడానికి ప్రణాళికా బద్దంగా అడుగులు వేసింది. ఆ సమయంలో స్నాప్డీల్ తీసుకున్న నిర్ణయాలు ఆ సంస్థను నష్టాల నుండి గట్టెక్కించాయి. క్రమంగా పుంజుకున్న స్నాప్డీల్ ప్రస్తుతం తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా క్లూస్ నెట్వర్క్కు చెందిన షాప్ క్లూస్ను స్వంతం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
ప్రస్తుతం షాప్ క్లూస్ను కూడా నష్టాలు చుట్టుముట్టడంతో స్నాప్డీల్ లాగానే ఆ సంస్థ కూడా నష్టాలను తగ్గించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. షాప్క్లూస్కు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.347 కోట్ల నష్టం రాగా, తర్వాత సంవత్సరంలో తన నష్టాలను రూ.208 కోట్లకు తగ్గించుకోగలిగింది.
ఇప్పటి వరకూ ప్రధాన నగరాల్లో మాత్రమే సేవలందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు టైర్ 2, 3 నగరాలపై కూడా దృష్టి సారిస్తోంది. స్నాప్డీల్ - షాప్క్లూస్ ఒప్పందం కుదిరితే భారత్లో ఈ-కామర్స్ సేవలందిస్తున్న అతిపెద్ద సంస్థల్లో ఇది కూడా ఒకటి కానుంది. వాల్మార్ట్ చేతిలో ఉన్న ఫ్లిప్కార్ట్, అమెజాన్ తర్వాత మూడో అతిపెద్ద సంస్థగా స్నాప్డీల్ అవతరించనుంది.
సంబంధిత వార్తలు | 1entertainment
|
- ట్రంపు గెలుపు వార్తలతో భారీగా కుంగిన సూచీలు
- మార్కెట్ ముగిసే సమయానికి 339 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్్
ముంబయి: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మదుపరులకు కనీళ్లు తెప్పించాయి. అంచానాలను తారుమారు చేస్తూ అమెరికా తదుపరి అధ్యక్షుడి రేసులో ట్రంప్ అధిపత్యం నేపథ్యంలో ఉదయం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలోకి జారుకున్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లు ఎరుపెక్కడంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లోనే మొదలయ్యాయి. కాగా ఓ దశలో డొనాల్డ్ ట్రంపు గెలుపు వార్తలు ప్రపంచ మార్కెట్లలో కల్లోలం సృష్టించాయి. ట్రంపు గెలుపు గణంకాలు మదుపర్లలో విశ్వాసాన్ని దెబ్బతీయడానికి తోడు భారత ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచింది. మొత్తంగా బుధవారం సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా పతనమై 26వేల పాయింట్ల దిగువన చోటు చేసుకుంది. ఈ పరిణామానికి తోడు డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించగా, బంగారం ధర భారీగా పెరిగింది. ట్రంప్ గెలుపుతో ఊహించుకుంటున్నంత నష్టం వాటిల్లే ప్రమాదం లేదంటూ వచ్చిన వార్తలు విశ్లేషణల నేపథ్యంలో మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకోవడం కనిపించింది. చివరకు మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 339 పాయింట్లు పతనమై 27,253 వద్ద స్థిరపడింది. ఉదయం 26,251 వద్ద ప్రారంభమై సూచీ తొలి గంటలోనే 25,902 పాయింట్లకు పతనమైంది. అనంతరం హిల్లరీకి మెజారిటీ పెరుగుతోందన్న అంచనాల్లో పుంజుకుని మరో దశలో 27,397 గరిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అయ్యింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 112 పాయింట్లు తగ్గి 8,432 వద్ద ముగిసింది. బీఎస్ఈలో మిడ్క్యాప్ 2.03 శాతం, స్మాల్క్యాప్ 2.7 శాతం చొప్పున క్షీణించాయి. మొత్తంగా మదుపర్ల మద్దతు కరువై 2143 స్టాక్స్ పతనం చవి చూడగా, 629 స్టాక్స్ సానుకూలంగా నమోదయ్యాయి. సెన్సెక్స్లో టీసీఎస్ 4.93 శాతం, మారుతీ సుజుకీ 4.68 శాతం, హీరో మోటో కార్ప్ 3.97 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 3.43 శాతం, అదాని పోర్ట్సు 2.97 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ 5.04 శాతం, సన్ఫార్మా 4.07 శాతం, ఎస్బీఐ 2.83 శాతం, పవర్ గ్రిడ్ 1.95 శాతం, గెయిల్ 1.44 శాతం చొప్పున పెరిగాయి.
15 నిమిషాల్లో 6 లక్షల కోట్లు ఆవిరి
ట్రంపు భయాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన 15 నిమిషాల్లో భారీ పతనాన్ని చవి చూశాయి. తొలి 15 నిమిషాల్లోనే సెన్సెక్స్ 1689 పాయింట్లు పతనం కావడంతో మదుపర్లు రూ.6 లక్షల కోట్ల విలువను కోల్పోయారు. మధ్యాహ్నం కల్లా పది కీలక కంపెనీలు రూ.77,000 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి. ఇందులో టీసీఎస్, హెచ్డీఎప్˜సీ బ్యాంకు, ఐటీసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ సూచీలు ఉన్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
వరల్డ్ టి20 టోర్నీ నుంచి నిష్క్రమించిన
భారత మహిళల జట్టు
న్యూఢిల్లీ : భారత మహిళల క్రికెట్ జట్టు టి20 వరల్డ్ కఫ్లో వరుస ఓటములతో నిష్క్రమించింది. కాగా తొలి మ్యాచ్లో పాకిస్థాన్ తో ఓడిపోయిన భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో చతికిల పడింది.టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత మహిళా జట్టు ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కేవలం 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్ను బ్యాటింగ్ చేయాలని కోరింది.దీంతో భారత్ బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 90 పరుగులకే ఆలౌటైంది.కాగా మిథాలీ రాజ్ 20 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 26 పరుగులు మాత్రమే చేసి ఫర్వాలేదనిపించారు.అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ 19 ఓవర్లలోనే టార్గెట్ను చేధించి జయకేతనం ఎగురవేశారు. ఇంగ్లండ్ జట్టులో బియోమౌంట్ 20 పరుగులు,సారాహ్ టేలర్ 16 పరుగులు, స్కైవర్ 19 పరుగులు చేశారు.కాగా రెండు మ్యాచ్లలో ఓడిన భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. | 2sports
|
Jul 14,2017
గూగుల్ చేతికి 'హళ్లి'
బెంగళూరు : ప్రముఖ సెర్చింజన్ సంస్థ గూగుల్ తాజాగా స్థాపించి కనీసం నాలుగు మాసాలు కూడా కానీ చిన్న స్టార్టప్ హళ్లి లాబ్స్ను కొనుగోలు చేసింది. బెంగళూరుకు చెందిన హళ్లి లాబ్స్ను గూగుల్ చేజిక్కించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్కు సంబంధించి హళ్లి పరిశోధనలు జరపనుంది. అతి తక్కువ వ్యవధిలో గూగుల్ లాంటి పెద్ద కంపెనీ దీన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పెద్ద ఐటీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థమవుతోంది. కత్రిమ మేథకు సంబంధించి అనేక కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంపై గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఐబీఎం, యాపిల్. తదితర దిగ్గజ కంపెనీలు ద ష్టిసారించాయి. 2020 కల్లా క త్రిమ మేథకు సంబంధించిన మార్కెట్ 50 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముందని అంచనా.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
sumalatha 178 Views Bhuvneshwa , ICC World Cup 2019
Bhuvneshwar Kumar
కార్డిప్: ప్రపంచకప్లో చివరిదైన సన్నాహక మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని బౌలర్ భువనేశ్వర్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా భూవీ మీడియాతో మాట్లాడుతు బ్యాట్స్మెన్, బౌలర్లు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వారు బాగా రాణించారు. ప్రపంచకప్లో బాగా ఆడడానికి ఈ విజయం ఉత్సాహాన్నిస్తుందిగ అని తెలిపాడు. ప్రపంచకప్లో ఆటను గెలుపుతో ప్రారంభించాలని మనం ఎల్లప్పుడూ భావిస్తాం. అయితే, ప్రపంచకప్లో మొదటి మ్యాచ్ ఆడడానికి మాకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. గెలుపుకోసం మా ప్రణాళిక ఏంటో ప్రస్తుతం నేను చెప్పలేను. మేము సాధన చేస్తున్న సమయంలో, సమావేశం అయిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో ఎలా ఆడాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటాము అని భువీ తెలిపాడు. కాగా, ప్రపంచకప్లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/ | 2sports
|
Hyderabad, First Published 28, Sep 2018, 3:53 PM IST
Highlights
బాలీవుడ్ నటుడు నానాపటేకర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని నటి తనుశ్రీదత్తా సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో నిజానిజాలు తేలకముందే మరొకరిపై ఆరోపణలు చేస్తోంది తనుశ్రీదత్తా.. బాలీవుడ్ లో ఆమె నటించిన 'చాక్లెట్' సినిమా దర్శకుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని వెల్లడించింది.
బాలీవుడ్ నటుడు నానాపటేకర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని నటి తనుశ్రీదత్తా సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో నిజానిజాలు తేలకముందే మరొకరిపై ఆరోపణలు చేస్తోంది తనుశ్రీదత్తా.. బాలీవుడ్ లో ఆమె నటించిన 'చాక్లెట్' సినిమా దర్శకుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని వెల్లడించింది.
ఆమె డైరెక్టర్ పేరు చెప్పనప్పటికీ 'చాక్లెట్' సినిమా డైరెక్ట్ చేసింది వివేక్ అగ్నిహోత్రి. ఆ సినిమా షూటింగ్ సమయంలో అతడు తనను ఎంతగా ఇబ్బంది పెట్టాడో చెబుతూనే.. బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, సునీల్ శెట్టిలు తనకు సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చింది.
తనను బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమని డైరెక్టర్ బలవంతం పెట్టాడని తనుశ్రీ ఆరోపించింది. నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఎక్స్ ప్రెషన్స్ కోసం ఫ్రేములో తనుశ్రీ లేకపోయినా.. ఆమెని బట్టలిప్పి అతడి ముందు నగ్నంగా డాన్స్ చేయమని డైరెక్టర్ డిమాండ్ చేశాడట.
అయితే వెంటనే ఇర్ఫాన్ ఖాన్, సునీల్ లు అలాంటి డాన్స్ లు ఏవీ అక్కర్లేదని అన్నారట. అప్పుడు వివేక్ సైలెంట్ అయ్యాడని ఇండస్ట్రీలో మంచి వ్యక్తులు కూడా ఉన్నారని ఆమె తెలిపింది.
సంబంధిత వార్త.. | 0business
|
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు!
First Published 16, Mar 2019, 2:53 PM IST
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
నివేదా థామస్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
Recent Stories | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అనుష్క ‘భాగమతి’ న్యూ ఇయర్ సర్ప్రైజ్!
ఈ పోస్టర్లో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అందులో ‘భాగమతి’ అసలైన రూపానికి సంబంధించిన ఛాయచిత్రం కూడా కనిపిస్తోంది. అనుష్క నడుచుకుంటూ ఆ చిత్రాన్ని చూస్తున్నట్లుగా పోస్టర్లో ఉంది.
TNN | Updated:
Jan 1, 2018, 12:31PM IST
‘భాగమతి’గా అనుష్క శెట్టి మరో కొత్త లుక్‌తో వచ్చింది. ఫస్ట్‌లుక్ భయానకంగా కనిపించిన అనుష్క కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేసిన పోస్టర్‌లో చాలా సాద్వికంగా కనిపిస్తోంది. పిల్ల జమీందార్ ఫేం జి అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ' భాగమతి ' టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఎప్పటికప్పుడు సినిమాల మధ్య వ్యత్యాసం చూపించే అనుష్క ‘భాగమతి’లోనూ సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజా పోస్టర్‌లో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అందులో ‘భాగమతి’ అసలైన రూపానికి సంబంధించిన ఛాయచిత్రం కూడా కనిపిస్తోంది. అనుష్క నడుచుకుంటూ ఆ చిత్రాన్ని చూస్తున్నట్లుగా పోస్టర్లో ఉంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకే రోజు ఈ సినిమా విడుదల కానుంది. గతేడాది బాహుబలి-2 తప్ప మరే హిట్లూ అందుకోని అనుష్క ‘భాగమతి’తో హిట్ కొడుతుందో లేదో చూడాలి. | 0business
|
Visit Site
Recommended byColombia
ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. రూ.25,000 ధర వద్ద కొనసాగుతోంది. స్థానికంగా డిమాండ్ రావడంతో వెండి ధరలు జోరందుకున్నాయి. నేటి ట్రేడింగ్లో కిలో ధర రూ.250 పెరిగి 38,800కు చేరుకుంది. ఇక వారంతపు వెండి ధరలు 170 పెరిగి రూ.38,351 కి చేరుకుంది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.74,000 ఉండగా.. అమ్మకం ధర రూ.75,000 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధరలు వరుసగా 1,245.74, మరియు 1,250.3ల వద్ద కొనసాగుతున్నాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వెస్టిండీస్ పేరు గొప్ప.. ఆట దిబ్బలా..?
క్రికెట్లో ఘనమైన చరిత్ర ఉన్న వెస్టిండీస్ పరువు తీసేలా ప్రస్తుతం టెస్టుల్లో జట్టు ప్రదర్శన ఉందని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ ఆంబ్రోస్
TNN | Updated:
Aug 21, 2017, 05:47PM IST
క్రికెట్‌లో ఘనమైన చరిత్ర ఉన్న వెస్టిండీస్ పరువు తీసేలా ప్రస్తుతం టెస్టుల్లో జట్టు ప్రదర్శన ఉందని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ ఆంబ్రోస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో ఆదివారం ముగిసిన డే/నైట్ తొలి టెస్టులో వెస్టిండీస్ ఇన్నింగ్స్, 209 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యంగా విండీస్ ఒక్కరోజులోనే ఏకంగా 19 వికెట్లను చేజార్చుకోవడంతో ఆట మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టులో అలిస్టర్ కుక్ డబుల్ సెంచరీ.. రూట్ శతకం సాధిస్తే.. రెండు ఇన్నింగ్స్‌లు ఆడిన విండీస్ జట్టులో కేవలం ఒక అర్ధశతకం మాత్రమే నమోదవడంపై ఈ దిగ్గజ క్రికెటర్ పెదవి విరిచాడు. ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ని 514/8 వద్ద డిక్లేర్ చేయగా.. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 168, ఫాలో ఆన్‌లో భాగంగా ఆడిన రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే ఆలౌటైంది.
‘ఆ మూడు రోజుల టెస్టులో కనీసం ఒక సెషన్‌లో కూడా వెస్టిండీస్ క్రికెటర్లు ఇంగ్లాండ్‌కి పోటీనివ్వలేకపోయారు. ఇకపై మిగిలిన రెండు టెస్టుల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తారనే నమ్మకం నాకు లేదు. సిరీస్‌ని ఇంగ్లాండ్‌కే వదిలేయండి. ఇక మ్యాచ్‌లు చూడటమే దండగ. నేను రెండేళ్ల పాటు జట్టుకి బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాను. ఆ సమయంలో వెస్టిండీస్ ఘనమైన క్రికెట్ చరిత్ర గురించి ఆటగాళ్లతో చెప్పి.. వాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాను. కానీ.. మైదానంలోకి దిగాక వారి ఆట మామూలే. ఎందుకంటే.. వాళ్లు వినేందుకు సిద్ధంగా లేరు. ఈ తత్వమే ఇప్పుడు తీసికట్టు ప్రదర్శనతో సిగ్గుపడేలా చేస్తోంది’ అని ఆంబ్రోస్ వివరించాడు. | 2sports
|
Visit Site
Recommended byColombia
‘మీటూ’ ఉద్యమంలో భాగంగా చాలా మంది తనకు జరిగిన వేధింపులను బహిర్గతం చేస్తున్నారు. చాలా సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఎవరికైతే వేధింపులు జరిగాయో వాళ్లు మాత్రమే బయటకు వస్తే మంచిది. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేసి రాద్ధాంతం చేయకూడదు. ‘మీటూ’ని మిస్ యూజ్ కాకుండా చేయకూడదు.
ఇది సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఉంటుంది. పబ్లిసిటీ కోసమో మరోదాని కోసమో ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. వాళ్లు చేయమన్నారు నేను చూశాను అంటే కాదు.. నీ అంతరాత్మకు తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అనేది దానికి అనుగుణంగా నడుచుకోవాలి. మన గురించి మనకు మాత్రమే ఎక్కువ తెలుస్తోంది. మనల్ని మనమే కాపాడుకోవాలి. మీ ఇష్టాలేవో మీకు తెలుసు.. నన్ను నేను ఎలా కాపాడుకోవాలనేది ఆలోచించే వాళ్లకు మాత్రమే తెలుస్తోంది. చేసే పనిలో క్లారిటీ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ రావు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది అనసూయ.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
internet vaartha 138 Views
గచ్చిబౌలి : కేంద్రియ విద్యాలయ సంఘటన్ 47వ జాతీయ స్పోర్ట్స్ మీట్-2016 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో కేంద్రియ విద్యాలయ హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడోత్సవాల్లో దేశంలోని 25 రీజియన్లకు చెందిన దాదాపు 2,621మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల్లో బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, రోప్ స్కిట్టింగ్, హాకీ, కబడ్డీ, కోకో తదితర క్రీడల్లో విద్యార్థులు పోటీపడుతున్నారు. ఈ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఓ జట్టును ఎంపిక చేసి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్కు పంపిం చనున్నారు. ఈనెల 7వ తేదీ వరకు కొనసాగనున్న ఈ స్పోర్ట్స్ మీట్ను సోమవారం సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎఆర్.శ్రీనివాస్, ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భాషలు వేరైన ఈ దేశంలో ప్రజలను కలిపి ఉంచేది ఐకమత్యమేనన్నారు. విద్యార్థులే ఈ సమాజాన్ని మార్చే విధాతలని, అన్యాయం, అక్రమాలను ఎదిరించాలని సూచించారు. గుత్తాజ్వాల మాట్లాడుతూ కేంద్రియ విద్యాలయాల్లోనే బాలికలను క్రీడల్లో ఎక్కువగా ప్రోత్సహిస్తారని, ఒకనాటి కేంద్రియ విద్యాలయ విద్యార్థిని అయినందుకు గర్వంగా ఉందన్నారు. తన క్రీడా జీవితంలో కేంద్రియ విద్యాలయ పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతి కార్యక్రామలు అలరించగా, తెలంగాణ సాంప్రదాయాన్ని చాటిచెప్పుతూ బోనాలు, బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈకార్యక్రమంలో కేంద్రియ విద్యాలయ హెడ్ క్వార్టర్ డిసి సాయి రంగారావు, హైదరాబాద్ డిసి మణివన్నన్, ఎసి జెఎస్వి.లక్ష్మి, రవికుమార్, రాధాక్రిష్ణన్, స్పోర్ట్స్ ఇంచార్జ్ దారా తదితరులు పాల్గొన్నారు. | 2sports
|
శ్రీరెడ్డి మళ్లీ లీక్ లు స్టార్ట్ చేసింది
Highlights
శ్రీరెడ్డి మళ్లీ లీక్ లు స్టార్ట్ చేసింది
సినిమా ఇండస్ట్రీలోని తెర వెనక బాగోతాలు బయటపెట్టేందుకు ఉద్యమం చేపట్టింది. దీనికి శ్రీరెడ్డి లీక్స్ అని పేరు పెట్టింది. టాలీవుడ్ మేనేజర్లు, పీఆర్వోలు, హీరోలు అమ్మాయిలను తెగ వాడేస్తున్నారని సంచలన విషయాలు చెప్పింది.ఈ క్రమంలోనే.. శ్రీరెడ్డి లీక్స్ రిలీజ్ స్టార్ట్ చేసింది. గతంలో దగ్గుపాటి అభిరామ్ ఫోటోలు లీక్ చేసి అందరికి దడ పుట్టించింది.
అమ్మాయిలకు అండగా ఉంటానంటు అప్పుడు పెద్ద ఉద్యమాన్నే నడిపింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ను భూతులు తిట్టందో ఒక్కసారిగా ఉద్యమం నీరుగారిపోయింది.అప్పటి నుండి మీడియా శ్రీరెడ్డిని పక్కన పెట్టేసింది. ఎదో అప్పుడప్పుడు ఫేస్ బుక్ లైవ్ కి వచ్చి అది చేస్తా ఇది చేస్తానంటు చెప్పసాగింది.ఇప్పుడు మళ్లీ లీక్స్ స్టార్ట్ చేసింది. దగ్గుపాటి అభిరామ్ తనతో క్లోజ్ గా ఉన్న ఫోటోలను ఉన్నట్టుండి ఇవాళ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. తను మళ్లీ ఈ లీక్ లు ఎందుకు స్టార్ట్ చేసిందో అసలు తన ప్యూహమేంటో తనకే తెలియాలి.
Last Updated 23, May 2018, 4:45 PM IST | 0business
|
బ..బ..బ..బాహుబలి రేంజ్ లో జ..జ..జ..జైలవకుశ..ట్రేడ్ రిపోర్ట్
Highlights
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జైలవకుశ విడుదల
ట్రేడ్ ఎనలిస్టుల విశ్లేషణ ప్రకారం కలెక్షన్స్ సునామీకి అవకాశాలు
జైలవకుశ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్న ఎన్టీఆర్ ఆర్ట్స్
తొలిరోజే బాహుబలిలా కలెక్షన్స్ సాధించాలని అంచనా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జైలవకుశ చిత్రం భారీ అంచనాలతో ఈ గురువారం రిలీజ్ అవుతోంది. అంచనాలకు తగినట్లుగానే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందని వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కలెక్షన్ల ధాటికి గత నాన్ బాహుబలి రికార్డులు బద్ధలవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక జైలవకుశ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతాయని అంటున్నారు.
ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం, టీజర్, ట్రైలర్స్ ఈ చిత్రంపై అంచనాల్ని మరింత పెంచాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో జై పాత్ర విపరీతంగా ఆకట్టుకోవడంతోపాటు భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం తొలిసారి అంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు వసూల్ చేస్తుందని చెబుతున్నారు. ఓవర్సీస్లో రికార్డు స్థాయిలో.. అటు ఓవర్సీస్ లోను అత్యధిక స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో అక్కడ కూడా విపరీతంగా కలెక్షన్లు వసూల్ అవుతాయని తెలుస్తుంది. ప్రీమియర్స్ ద్వారానే దాదాపు మిలియన్ డాలర్కి చేరువలో కలెక్షన్స్ కొల్లగొట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
బాహుబలి తర్వాత జై లవకుశ అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అవుతున్న చిత్రంగా రికార్డు సొంతం చేసుకొన్నది. జై లవకుశ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2400 స్క్రీన్లలో రిలీజ్ అవుతున్నది. కేవలం హైదరాబాద్లోనే 100 స్క్రీన్లలో ప్రదర్శించబడటం ఓ రికార్డు అని చెప్పవచ్చు.
ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం... జై లవకుశ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 24 నుంచి 25 కోట్ల షేర్ దక్కించుకుంటుందని వాణిజ్య వర్గాల్లో ఓ అంచనా. ఆదే నిజమైతే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 100వ చిత్రం ఖైదీ నం. 150 తో నాన్ బాహుబలి రికార్డ్ పటా పంచెలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక పక్క రాష్ట్రమైన కర్ణాటకలోనూ ఎన్టీఆర్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దాంతో అక్కడ కూడా మంచి వసూళ్లు వస్తాయని... అలాగే రెస్టాఫ్ ఇండియాలో కూడా డీసెంట్ కలెక్షన్లు నమోదు కావచ్చని చెప్తున్నారు.
మొత్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు రూ. 30 నుంచి 31 కోట్లు షేర్ కలెక్ట్ చేయవచ్చని వాణిజ్య వర్గాల అంచనా. ఈ లెక్కన తొలిసారి రూ. 50 కోట్ల గ్రాస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే... గత రికార్డులన్నీ పటాపంచలైనట్లే. మరి ఆ వాణిజ్య నివేదిక ఎంత వరకు నిజమవుతుందో తెలియాలంటే.. ఫస్ట్ డే కలెక్షన్స్ అధికారికంగా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Last Updated 25, Mar 2018, 11:38 PM IST | 0business
|
shalini pandey to play actress jamuna in savitiri biopic
‘మహానటి’లో జమున పాత్రలో ఆమె..!
నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘మహానటి’లో మరో నటీమణి నటించబోతోంది.
TNN | Updated:
Sep 11, 2017, 09:47AM IST
నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘మహానటి’లో మరో నటీమణి నటించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో టైటిల్ లో రోల్ కీర్తి సురేష్, ఒక జర్నలిస్టు పాత్రలో సమంత, మరో పాత్రలో నిత్యామీనన్ లు నటిస్తున్నారు. వీరికి తోడు ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ శాలినీ పాండే కూడా జాయిన్ అవుతోందని సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాతో ఈమె మంచి గుర్తింపు సంపాదించుకుందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో శాలినీ ‘మహానటి’లో ఒక ముఖ్యపాత్రను చేయబోతోంది.
సావిత్రి జీవిత కథ సినిమాలో నాటి తరం నటీమణులకు కూడా స్థానం ఉంటుంది. సావిత్రి జీవితం అంతా సినిమా వాళ్ల మధ్యనే గడిచింది కాబట్టి.. చాలా మంది ప్రస్తావన ఉంటుంది. ఇప్పటికే సావిత్రి భర్త జెమినీ గణేషన్ పాత్రలకు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ను ఎంచుకున్నారు. ఇక శాలిని పాత్ర లివింగ్ లెజెండ్‌ జమునగారిది అని సమాచారం. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఈ శని, ఆదివారాలు బ్యాంకులకు పనిదినాలు
శని, ఆదివారాలలో బ్యాంకులు పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
TNN | Updated:
Nov 9, 2016, 07:19PM IST
ప్రజలకు ఊరట కలిగించే వార్త. అసలే రూ.500, రూ.1000 నోట్లు రద్దు కావడంతో చిల్లర విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంతా. బుధ, గురువారాలలో బ్యాంకులు, ఏటీఎం సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ రెండు రోజులకు బదులు శని, ఆదివారాలలో బ్యాంకులు పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. డబ్బుల కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వార్త కాస్త ఊరటనిచ్చేలా ఉంది. | 1entertainment
|
Hyderabad, First Published 26, Jun 2019, 6:54 PM IST
Highlights
అర్జున్ రెడ్డి కథ బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకెక్కి మరో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. కథ ఎలా ఉన్నా డైరెక్టర్ విజన్ - హీరో యాక్టింగ్ సినిమాపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. తెలుగులో హిందీలో అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యింది.
అర్జున్ రెడ్డి కథ బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకెక్కి మరో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. కథ ఎలా ఉన్నా డైరెక్టర్ విజన్ - హీరో యాక్టింగ్ సినిమాపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. తెలుగులో హిందీలో అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యింది.
బాలీవుడ్ 100కోట్ల క్లబ్ లో చేరుతున్న ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు కోలీవుడ్ లో ఆదిత్య వర్మపై అంచనాలను రేపింది. తమిళ్ రీమేక్ లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలా మొదట దర్శకత్వం వహించిన పార్ట్ ని మొత్తం క్యాన్సిల్ చేసిన విక్రమ్ డైరెక్టర్ ని కూడా మార్చేసిన విషయం ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
సందీప్ వంగా సలహా మేరకు అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గిరిశయకు విక్రమ్ ఆదిత్య వర్మ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో సందీప్ వంగ డైరక్ట్ చేసిన కబీర్ సింగ్ సాలిడ్ హిట్టవ్వడంతో విక్రమ్ అతన్ని పిలుస్తున్నట్లు సమాచారం. సినిమా మేకింగ్ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
Last Updated 26, Jun 2019, 6:55 PM IST | 0business
|
GANGOOLY
ప్రతి గేమ్లోనూ కోహ్లీపై ఆధారపడటం మంచిది కాదు
రాంచీ: న్యూజిలాండ్తో జరిగిన నాలుగవ వన్డేలో టీమిండియా 19 పరుగులు తేడాతో పరాజయం చెందడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పరుగుల చేధనలో టీమిండియా ప్రతి గేమ్లోనూ కోహ్లీపై ఆధారపడటం మంచిది కాదని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ పేర్కొన్నాడు.కాగా రాంచీలో జరిగిన నాలుగవ వన్డేలో రెండవ వికెట్గా క్రీజులోకి వచ్చిన కోహ్లీ 45 పరుగుల వద్ద ఔటయ్యాడు.కోహ్లీ తరువాత బ్యాటింగ్కు దిగిన ధోనీ మిగతా ఆటగాళ్లు సరిగా ఆడకపోవడంతో టీమిండియా పరాజయం చెందింది.దీంతో కోహ్లీపై ఆధారపడటం మంచిది కాదని ఆటగాళ్లకు గంగూలీ సూచించాడు.న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా గెలిచిన రెండు వన్డేల్లో కోహ్లీ సత్తా చాటడం వల్ల గెలిచింది.ధర్మశాల వన్డేలో 85 పరుగులు,మొహాలీ వన్డేలో 154 పరుగులతో నాటౌట్గా నిలిచి టీమిండియా విజయంలో కీలక కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవుతుంది. దీంతో భారమంతా కోహ్లీపైనే పడుతుందని,టీమిండియా గెలిచిన ప్రతిసారి కోహ్లీ సెంచరీ అనేది సర్వసాధారణంగా మారిపోయిందని గంగూలీ కొనియాడాడు.అందుకే కోహ్లీ గొప్ప ఆటగాడు అంటూ గంగూలీ పొగడ్తలతో ముంచెత్తాడు.కాగా మొహాలిలో జరిగిన మూడవ వన్డేలో కోహ్లీ 154 నాటౌట్గా నిలువడంతో టీమిండియా విజయం సాధించిందని పేర్కొన్నాడు.ఆ మ్యాచ్లో రాస్ టేలర్ గనుక కోహ్లీ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితమే వేరొలా ఉండేదని గంగూలీ వ్యాఖ్యానించాడు.
గత కొంత కాలంగా టీమిండియా కోహ్లీపైనే ఆధారపడుతుందని అనడానికి మొహాలిలో కోహ్లీ ఆడిన ఇన్నింగ్సే ఉదాహరణ అని వివరించాడు.పరుగుల చేధనలో కోహ్లీ మెరుగైన రికార్డును సొంతం చేసుకోవడమే కాకుండా జట్టుకు కీలక విజయాన్ని అందిస్తున్నాడని వెల్లడిం చాడు. జట్టులో చాలా మంచి మ్యాచ్ విన్నర్లు ఉన్నారని అనుకుం టున్నా,న్యూజిలాండ్తో అయిదు వన్డేల సిరీస్లో కోహ్లీనే రెండు మ్యాచ్ల్లో ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.కాగా మొహాలీలో జరిగిన మూడవ వన్డేలో కోహ్లీ క్యాచ్ను రాస్ టేలర్ వదిలేశాడు.ఒకవేళ ఆ క్యాచ్ను పట్టి ఉంటే జట్టులోని మిగతా ఆటగాళ్లు ఏం చేసేవారే నాకైతే తెలీదు.అంతా సమిష్టిగా పోరాడి విజయం కోసం కృషి చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి అని గంగూలీ పేర్కొన్నాడు.ఇక ఈ సిరీస్లో టీమిండియా ఓపెనర్ రోహత్ పూర్తిగా విఫల మయ్యాడని,ఇంకా గాడిలో పడలేదని,ధోనీ నాలుగవ స్థానంలో బ్యాటింగ్కు రావడం మంచిదేనని,రాంచీ మ్యాచ్లో అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు తీసుకురావడం తప్పుకాదని గంగూలీ తెలిపాడు. కుడి చేతి,ఎడమ చేతి ఆటగాళ్లు క్రీజులో ఉంటే ఈ తరహా వికెట్పై స్ట్రయిక్ రొటేట్ చేయడం సులభం అవుతుందనే కారణంగానే ధోనీ అలా చేసి ఉండవచ్చని యువ ఆటగాళ్లు కేదార్ జాదవ్,మనీష్ పాండే స్లో పిచ్లకు కూడా సత్తా చాటారని గంగూలీ వివరించాడు. | 2sports
|
VIJAYA BANK Team
రాజ్యభాష అమలులో విజయబ్యాంకు భేష్
హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల్లో రాజ్యభాషగా హిందీ అమలునుఖచ్చితంగా అమలుచేయా లని, డిజిటల్ బ్యాంకింగ్, విజిలెన్స్లపై అవగాహన మరింతగాపెరగాలని విజయాబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిఎస్రామారావు వెల్లడించారు. అఖిలభారత అంతర్బ్యాంకుల హిందీ సదస్సుకు ఆతిధ్య సంస్థగా వ్యవహరించిన విజయబ్యాంకు సదస్సు కు నగరంలోవివిధ బ్యాం కుల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖపరిధిలోని అధి కార భాషా విభాగం సం యుక్తకార్యదర్శి డా.బిపిన్ బీహారి ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా పాల్గొన్నా రు.విజయబ్యాంకు జనర ల్ మేనేజర్ ఎసిస్వెయిన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వ కార్యదర్శిబీహారి మాట్లాడుతూ వివిధ విభాగాల్లో అధికార భాష అమలుకు విజయబ్యాంకు చేపట్టిన కార్యాచరణను అభినందించింది. రాజ్య భాష వెబ్సైట్, అఖిలభారత స్థాయిలో హిందీని వృద్ధిచేసేందుకు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ind vs Aus: కెప్టెన్గా కోహ్లి @9000.. నెం.1 రికార్డ్
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ ఐదు మంది కెప్టెన్స్ మాత్రమే 9వేల పరుగుల మైలురాయిని అందుకోగా.. తాజాగా ఆరో కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
Samayam Telugu | Updated:
Mar 5, 2019, 04:07PM IST
Ind vs Aus: కెప్టెన్గా కోహ్లి @9000.. నెం.1 రికార్డ్
హైలైట్స్
2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లి
బ్యాట్స్మెన్గా ఇప్పటికే వన్డేల్లో 10 వేల పరుగులు, టెస్టుల్లో 6,600 పరుగులు
కెప్టెన్గా 9వేల పరుగుల మార్క్ని ఈరోజు అందుకున్న కోహ్లి
క్రికెట్ ప్రపంచంలో ఇంత వేగంగా ఎవరూ ఈ మైలురాయిని అందుకోలేదు
ఆస్ట్రేలియాతో నాగ్పూర్ వేదికగా ఈరోజు జరుగుతున్న రెండో వన్డేలో అర్ధశతకం సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్ సృష్టించాడు. 2014-15లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో మహేంద్రసింగ్ ధోనీ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ.. కెప్టెన్గా ఈరోజు అన్ని ఫార్మాట్లలో కలిపి 9,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కేవలం 159 ఇన్నింగ్స్ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకోగా.. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ ఏ జట్టు కెప్టెన్ ఇంత వేగంగా కనీసం 7 పరుగుల మార్క్ని కూడా చేరుకోలేకపోయారు. | 2sports
|
AFRIDI11
అంతర్జాతీయ క్రికెట్కు అఫ్రిది వీడ్కోలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.1996లో కెన్యాపై అరంగేట్రం చేసిన అఫ్రిది 27 టెస్టులు,398 వన్డేలు,98 టి20 మ్యాచ్లు ఆడాడు.దూకుడుకు మారుపేరుగా అఫ్రిది వన్డేల్లో 351 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.1996లో శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీ బాది అత్యధిక వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టిం చాడు.టెస్టుల్లో 1716 పరుగులు చేసి 48 వికెట్లు తీసుకోగా,వన్డేల్లో 8064 పరుగులు చేసి 395 వికెట్లు,టి20లో 1405 పరుగులు చేసి 97 పరుగులు చేశాడు. | 2sports
|
internet vaartha 181 Views
టీమిండియాపై తొలి టెస్టు ఘోరంగా వైపల్యం చెందడంపై విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ నిస్సహాయత వ్యక్తం చేశాడు.జట్టు కనీస స్థాయిలో కూడా పోరాట పటిమ చూపలేదని పేర్కొన్నాడు. బౌలింగ్లో ఘోర వైఫల్యం చెందామని వివరించాడు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు భారీ స్కోరు చేసే అవకాశం ఇవ్వడం ద్వారా ముందే లొంగిపోయామని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్లో తమ జట్టు బౌలింగ్ బాగ లేదని అంగీకరించాడు.జట్టుపై కనీస ఒత్తిడి తేలేకపోయామని,తాము బౌలింగ్ చేసిన విధానం టెస్టు క్రికెట్కు సరిపోదన్నాడు.బౌలింగ్ విభాగంలో వైఫల్యమే తొలి టెస్టు ఓటమికి కారణమని పేర్కొన్న హోల్డర్ బౌలింగ్ విభాగంలో చాలా మెరుగుపడాల్సిఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.తరువాత జరుగనున్న టెస్టు నాటికి పుంజుకుని టీమిండియాకు గట్టిపోటీ ఇస్తామని హోల్డర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
చిరంజీవికి రాజకీయాలు అవసరమా- సుకుమార్
Highlights
రంగస్థలం ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా చిరంజీవి రాజకీయాలపై సుకుమార్ కామెంట్స్
చిరంజీవికి రాజకీయాలు అవసరం లేదన్న సుకుమార్
చిరంజీవి వున్న పొజిషన్ రాజకీయాలను మించిందన్న సుక్కు
మెగాస్టార్ చిరంజీవిపై ‘రంగస్థలం’ చిత్ర దర్శకుడు సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ.. ‘ఎంత మందికి ఎన్ని పదువులైనా ఉండొచ్చు.. కానీ ఆయనకు చిరంజీవి పదవే ప్రత్యేకం’ అని సుకుమార్ అన్నారు. ఆదివారం రాత్రి విశాఖ తీరంలో జరిగిన ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు దేవీ నాతో ఒక మాటన్నాడు. ముఖ్యమంత్రి పదవి కన్నా చిరంజీవి పదవే పెద్దది కదా ఆయనెందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు అని. కాబట్టి ఎంత మందికి ఎన్ని పదవులైనా ఉండొచ్చు.. కానీ ఆయనకు చిరంజీవి పదవే ప్రత్యేకం. అది ఆయన ఒక్కరికే సాధ్యం’ అని సుకుమార్ చెప్పుకొచ్చారు.
‘రంగస్థలం’ సినిమా చూసిన తరవాత చిరంజీవి తనను ఇంటికి పిలిచి సినిమా ఎలా ఉందో చెప్పారని సుకుమార్ వెల్లడించారు. ‘చిరంజీవి గారు సినిమా ఎలా ఉందో చెప్పినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక 10 కి.మీ. దూరంలో గోల్ఫ్ హోల్ ఉంది. ఇక్కడ నుంచి స్టిక్తో గోల్ఫ్ బాల్ను కొడితే వెళ్లి గోల్లో పడిపోయింది. కానీ చూడటానికి ఎవరూ లేరు. అంటే సినిమాలో హీరో బాధపడుతుంటే పక్కన ఉన్నవారి రియాక్షన్ చూపిస్తాం. ఇక్కడ ఆ రియాక్షన్ లేదు. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే.. చిరంజీవి గారు ఆ మాటలు చెబుతున్నప్పుడు నా పక్కన ఎవరైనా ఉంటే బాగుండేదే. మా ఆవిడను తీసికెళ్లినా బాగుండేదే. తనైనా చూసి ఆనందించేది అనుకున్నా. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారో ఎవరికీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ నేనొక్కడినే ఉన్నాను. నేనేం చెప్పినా అబద్ధం అనుకుంటారు’ అని సుకుమార్ తన మనసులోని మాటలను బయటపెట్టారు.
ఇక సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. తనకు మ్యూజిక్ అంటే దేవీ, దేవీ అంటే మ్యూజిక్ అని ఆయనపై ఉన్న అభిమాన్ని మరోసారి సుకుమార్ బయటపెట్టారు. తన ఎమోషనే దేవీ అని చెప్పారు. సమంత ఒప్పుకుంటే.. జీవితాంతం తనతో సినిమాలు తీస్తుంటానని, ఏ వయసులోనైనా ఆ వయసు తగ్గ పాత్రలు కల్పించి సినిమాలు చేస్తానని అన్నారు. రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోవడానికి చరణ్కి ఎంతోసేపు పట్టలేదన్నారు. చాలా సన్నివేశాలు తొలి టేకులో ఓకే అయిపోయేవని, చరణ్ కోపం, ఆనందం, బాధ.. వీటన్నింటిలోనూ నిజాయతీ ఉంటుందని వెల్లడించారు.
Last Updated 25, Mar 2018, 11:57 PM IST | 0business
|
బాడ్మింటన్ విజేత
అనాహీమ్ (కాలిఫోర్నియా): యుఎస్ ఓపెన్ గ్రాండ్ఫ్రీ గోల్డ్ బ్యా డ్మింటన్ టోర్నమెంట్ విజేతగా హెచ్ఎస్ ప్రణ§్ు అవ తరించాడు.పురుషుల సింగిల్స్ ఫైనల్లో కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక మాజీ విజేత పారుపల్లి కశ్యప్పై ప్రణ§్ు విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో కశ్యప్పై 21-15, 20-22, 21-12 తేడాతో ప్రణ§్ు విజయం సాధిం చాడు. ప్రణ§్ుకు ఇది మూడో గ్రాండ్ ఫ్రీ టైటిల్ కావడం విశేషం. సుమారు 65 నిమిషాల పాటు జరిగిన పోరులో మొదట కశ్యప్ పైచేయి సాధించినట్లు కనిపించినా ప్రణ§్ు పుంజుకుని విజయం సాధించాడు. తొలి గేమ్లో మొదట 6-1తో కశ్యప్ పైచేయి సాధించాడు. మధ్యలో ఇద్దరి స్కోర్లు 12-12తో సమమయ్యాయి. ఆతర్వాత చెలరేగిపోయిన ప్రణ§్ు 21-15తో తొలి గేమ్ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. ఇద్దరి మధ్య ర్యాలీలు సుధీర్ఘంగా సాగాయి. స్కోర్లు సమం చేసుకుంటూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు.
కశ్యప్ 14-10తో ముందడుగు వేస్తున్నట్లు కని పించిన తరుణంలో ప్రణ§్ు పుంజుకుని 18-18తో సమయం చేశాడు. కానీ చివరికి 22-20తో కశ్యప్ రెండో గేమ్ను దక్కిం చుకున్నాడు. ఆఖరి గేమ్లో మాత్రం ప్రణ§్ు పూర్తి ఆదిపత్యం చెలాయించాడు. కశ్యప్కు ఎలాంటి అవకాశంఇవ్వలేదు. 21-12తోమూడోగేమ్ను గెలిచి టైటిల్ను సొంత చేసుకున్నాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు చెందిన ఇద్దరు షట్లర్లు ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. గాయం నుంచి కోలుకొని ఇటీవలే మళ్లీ రాకెట్ పట్టిన కామన్వెల్త్ క్రీడల ఛాంపి యన్ కశ్యప్ దాదాపు రెండేళ్ల తర్వాత ఓ టోర్నీలో ఫైనల్కు చేరాడు. ఇక గతేడాది స్విస్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన ప్రణ §్ుకిది ఈఏడాదిలో ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ టోర్నీలో ఈ ఏడాది ఇద్దరు భార తీయులు ఫైనల్కు చేరడం ఇది రెండో సారి. సింగపూర్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్, సాయి ప్రణీత్ తలపడిన సంగతి తెలిసిందే.
ప్రణ§్ు జైతయ్రాత్ర సాగిందిలా: పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో రెండో సీడ్ ప్రణ§్ు 10-21, 21-15, 21-18 తేడాతో జపాన్ క్రీడాకారుడు కంటట్యునియామపై విజయం సాధించి సెమీఫైన ల్ల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో హెచ్ఎస్ ప్రణ§్ు వియ త్నాంకు చెందిన తియెన్ మిన్ ఎన్గుయెన్ఫై 21-14, 21-19తో గెలుపొంది ఫైనల్కు దూసుకెళ్లాడు. ఫైనల్లో భారత్కే చెందిన స్టార్ షట్లర్ కశ్యప్పై 21-15, 20-22, 21-12తో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ట్విట్టర్లో తమ ఆనందాన్ని పంచుకున్న ప్రణ§్ు, కశ్యప్: మ్యాచ్ అనంతరం ప్రణ§్ు, కశ్యప్ ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. యుఎస్గ్రాండ్ ఫ్రీగోల్డ్- 2017 టోర్నీ విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. అకాడమీ లో నాతోపాటు శిక్షణ పొందుతున్న పారుపల్లి కశ్యప్పై విజయం సాధించాను. నాకు మద్ధతు తెలిపిన వారందరికీ ధన్య వాదాలు అని ప్రణ§్ు పేర్కొన్నాడు. యుఎస్ ఓపెన్-2017 టోర్నీ రన్న రప్గా నిలిచాను. ఈ వారం నా ప్రదర్శనపట్ల ఎంతో సం తోషం గాఉన్నాను.విజేతగానిలిచిన ప్రణ§్ుకు శుభాకాంక్షలు. బ్యా డ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ఇండియా, గోపీచంద్, భారత ప్రభు త్వానికి, జాతీయక్యాంపులో నాకు శిక్షణ ఇచ్చిన కోచ్లకు ఈసం దర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులోనూ మీ మద్ధతుఇలాగేకొనసాగాలని కోరుకుంటున్నాఅని కశ్యప్ పేర్కొన్నాడు. | 2sports
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
India vs Bangladesh 2019: భారత్తో సిరీస్కి బంగ్లాదేశ్ కెప్టెన్ కూడా డౌట్..?
భారత్తో టీ20 సిరీస్కి ముందే ఇద్దరు అగ్రశ్రేణి క్రికెటర్లు బంగ్లాదేశ్ జట్టుకి దూరమవగా.. తాజాగా ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Samayam Telugu | Updated:
Oct 29, 2019, 10:59AM IST
Bangladesh's Shakib Al Hasan
భారత్తో సిరీస్కి దూరమయ్యే ఆలోచనలో బంగ్లాదేశ్ కెప్టెన్
ట్రైనింగ్ సెషన్కి దూరంగా ఉంటున్న షకీబ్ అల్ హసన్
క్రమశిక్షణ తప్పినందుకు ఇటీవల షకీబ్కి షోకాజ్ నోటీసులు
ఇప్పటికే టూర్ నుంచి సైపుద్దీన్, తమీమ్ ఇక్బాల్ ఔట్
భారత్ గడ్డపై సిరీస్ ఆరంభానికి ముందే బంగ్లాదేశ్కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ సైపుద్దీన్ గాయం కారణంగా జట్టుకి దూరమవగా.. సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వ్యక్తిగత కారణాలతో టూర్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా భారత్తో సిరీస్కి దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
గృహిణులకు గుడ్న్యూస్.. తగ్గిన గ్యాస్ ‘బండ’ ధర
గ్యాస్ సిలిండర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.35.50 మేర తగ్గించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే.. ఎల్పీజీ ధరలు మాత్రం తగ్గుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశం.
TNN | Updated:
Apr 2, 2018, 11:38PM IST
గ్యాస్ సిలిండర్..
గ్యాస్ సిలిండర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.35.50 మేర తగ్గించాయి. నెల రోజుల్లో సిలిండర్ ధరలు తగ్గడం ఇది రెండోసారి. ఈసారి కమర్షియల్ సిలిండర్ల ధర కూడా తగ్గించడం విశేషం. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ. 54 తగ్గించగా.. 5 కిలోల సిలిండర్ ధరను రూ.15 తగ్గించారు. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుంటే.. మరోవైపు ఎల్పీజీ ధరలు మాత్రం తగ్గుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం.
ప్రస్తుతం.. ప్రతి ఇంటికి ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్లను అందిస్తున్నారు. ఆపై ప్రతి సిలిండర్ను మార్కెట్ ధరకు కొనాల్సిందే. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 2020 కల్లా కొత్తగా మరో 3 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
141 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
Sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆర్థిక సంక్షోభ భయాలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 141 పాయింట్లు నష్టపోయి 37,531కి పడిపోయింది. నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 11,126 వద్ద స్థిరపడింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/ | 1entertainment
|
ఇంగ్లాండుపై అందుకే ఓడాం: విరాట్ కోహ్లీ నిరాశ
Highlights
ఇంగ్లాండుపై రెండో ట్వంటీ20లో భారత్ ఓటమి పాలైంది. టాప్ ఆర్డర్ కుప్ప కూలడంతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆ ఓటమిపై విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశ చెందాడు. అయినా కూడా బాగానే ఆడమన్నాడు.
కార్డిఫ్: రెండో ట్వంటీ20 మ్యాచులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూడు ట్వంటీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచులో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయంతెలిసిందే.
ఆరంభంలో కీలకమైన వికెట్లను కోల్పోవడం వల్లనే పోరాటానికి అవసరమైన లక్ష్యాన్ని ఇంగ్లాండు ముందు ఉంచలేకపోయామని అన్నాడు. తొలి ఆరు ఓవర్లలో 30 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లను కోల్పోవడంతో తిరిగి కోలుకోలేకపోయామని అన్నాడు.
తొలి ఆరు ఓవర్లే తమ ఓటమికి ప్రధాన కారణమని అన్నాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి మూడు వికెట్లను కోల్పోవడమే తమ కొంప ముంచిందని అన్నాడు. ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోవడంతో తమపై ఒత్తిడి పెరిగిందని, అదే సమయంలో పవర్ ప్లే పరుగులు రాకపోవడంతో చివరకు మంచి స్కోరును సాధించలేకపోయామని అన్నాడు.
మరో 15 పరుగులు సాధించాల్సి ఉండిందని, మొత్తంగా చూస్తే బాగానే ఆడామని, ఇంగ్లండ్ కూడా 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా కష్ట పడాల్సి వచ్చిందని కోహ్లి అన్నాడు.
Last Updated 7, Jul 2018, 12:58 PM IST | 2sports
|
internet vaartha 177 Views
న్యూఢిల్లీ : గౌరవ ప్రదంగా బకాయిలన్నీ చెల్లించండి లేదా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ కింగ్ఫిషర్ ఛైర్మన్ విజయ్ మాల్యాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వసంస్థల బకాయిలను గౌరవ ప్రదంగా పరిష్కరించుకోవడం మంచిది లేదంటే దర్యాప్తు సంస్థలు, బ్యాంకులనుంచి కఠిన కార్యాచరణ తప్పదని జైట్లీ హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఎవరిపేర్లను ప్రస్తావించబోనని, అయితే విజయ్ మాల్యా లాంటి భారీసంస్థలు గౌరవప్రదంగా వారిబకాయిలు పరిష్కరించుకోవడం మంచిదని అన్నారు. బ్యాంకు లు విజయ్ మాల్యకు చెందినకంపెనీల సెక్యూరిటీలు ఇతరత్రాపై కూడా చర్యలు తీసుకుంటాయని, 9000 కోట్లకుపైబడిన బకాయిలు వసూలుకు బ్యాంకులు ఉపక్రమిస్తాయన్నారు.కింగ్ఫిషర్ వ్యవస్థాప కుడు విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మాల్యా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 7800 కోట్లు 17 బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. వీటిలో ఎస్బిఐ ఒక్క సంస్థకే 1600 కోట్లు చెల్లిం చాల్సి ఉంది. ఇతర బ్యాంకులపరంగా చూస్తే పంజా బ్నేషనల్బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకులు 800కోట్లు చొప్పున, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 550 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాయు 410 కోట్లు చొప్పున మాల్యా బకాయిపడ్డారు. యుకో బ్యాంకు 320 కోట్లు రికవరీ చేయాల్సిఉంది. కార్పొరేషన్ బ్యాంకు 310 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 150 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 140 కోట్లు, ఫెడరల్ బ్యాంకు 90 కోట్లు, పంజాబ్ సింధ్ బ్యాంకు 60 కోట్లు, యాక్సిస్బ్యాంకు 50 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఎన్పిఎల సమస్యలను పరిశీలిస్తోందని, ఉక్కు, వస్త్రపరిశ్రమ, హైవేలు, మౌలిక వనరులు వంటివిఆటిలో ఎక్కువ ఎన్పిఎలు ఉన్నాయని, ఆర్థిక మందగమనమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఎన్పిఎల పరిష్కార కార్యాచరణ ప్రారంభం అయిందని, ఎక్కువ ఒత్తిడి ఉన్న రంగాలపై దృష్టిసారించినట్లు తెలిపారు. ఆర్థికవాతావరణం దృష్ట్యా కొంత, కొన్ని కేటగిరీల పరిశ్రమల్లో నష్టాలు కూడా మరికొంత కారణం అవుతున్నాయని, ప్రస్తుతం వీటిన్నింటిపైనా దృష్టిపెట్టామన్నారు. | 1entertainment
|
దేశం వీడిన 'కింగ్'ఫిషర్
- సుప్రీంకు వెల్లడించిన అటార్నీ జనరల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.వేల కోట్ల మేర రుణాలు బకాయిపడిన ఉద్దేశపూర్వక ఎగవేతదారు, లిక్కర్ డాన్ విజరు మాల్యా విదేశాలకు తరలి వెళ్లినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మాల్యాపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ ఈ విషయాన్ని వెల్లడించారు. సీబీఐ ద్వారా తమకీ విషయం తెలిసినట్టు ఆయన పేర్కొన్నారు. విజరు మాల్యా పాస్ పోర్టును స్వాధీనం చేసుకొని, అతడు దేశం దాటి వెళ్లిపోకుండా ఆదేశించాలని మార్చి 2న 17 బ్యాంకుల కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే రోజు మాల్యా లండన్ వెళ్లినట్టు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తున్నట్టు రోహ్తగీ కోర్టుకు తెలిపారు. జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ నారిమన్తో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ విషయమై విచారణ జరుపుతోంది. ఏ ఆధారంతో అతనికి రూ.7 వేల కోట్లు అప్పు ఇచ్చారంటూ బ్యాంకుల్ని సుప్రీంకోర్టు ప్రశ్నించగా.. ఆ సమయంలో కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నత స్థాయిలో ఉందని రోహ్తగీ బదులిచ్చారు. సెక్యూరిటీగా కొన్ని ఆస్తుల్ని తనఖా పెట్టినట్టు రోహ్తగీ తెలిపారు. అతని ఆస్తుల్లో ఎక్కువ భాగం విదేశాల్లోనే ఉన్నాయని, దేశంలో ఉన్నది కేవలం ఐదోవంతు మాత్రమేనని రోహ్తగీ పేర్కొన్నారు. యూకేలో ఎక్కువ ఆస్తులు ఉన్నందున అతడు అక్కడే ఉండే అవకాశముందని రోహ్తగీ కోర్టుకు తెలిపారు. దాంతో, యూకేలోని భారత రాయబారితోపాటు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ, మాల్యా ఈ-మెయిల్ అడ్రస్కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 30కి వాయిదా వేసింది.
మాల్యా ఇంటిముందు ఉద్యోగుల ఆందోళన
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులు ముంబైలోని విజరు మాల్యా ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2012 జూలై నుంచి తమకు వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు తెలిపారు. రూ.800 కోట్ల వరకు ఈ మొత్తం ఉంటుందని అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దుస్తులు విప్పి నగ్నంగా రెండు కిలోమీటర్లు నడిపించారు (వీడియో)
Highlights
పొలంలో పనిచేసేందుకు నిరాకరించినందుకు మైనర్లను కొందరు దుస్తులు విప్పి నగ్నంగా రెండు కిలోమీటర్లు నడిపించారు
బికనీర్కు సమీపంలోని మోతావ్తా గ్రామంలో అందరు చూస్తుండగా మైనర్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది
దారుణానికి పాల్పడిన వారు ఘటనను వీడియో తీసినట్టు పోలీసులు తెలిపారు.
రాజస్ధాన్లో దారుణం చోటుచేసుకుంది. పొలంలో పనిచేసేందుకు నిరాకరించినందుకు మైనర్లను కొందరు దుస్తులు విప్పి నగ్నంగా రెండు కిలోమీటర్లు నడిపించిన ఘటన వెలుగుచూసింది. బికనీర్కు సమీపంలోని మోతావ్తా గ్రామంలో అందరు చూస్తుండగా మైనర్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ దారుణానికి పాల్పడిన వారు ఘటనను వీడియో తీసినట్టు పోలీసులు తెలిపారు.
పొరుగునే ఉన్న పొద్దుతిరుగుడు పంట సాగుకు సహకరించేందుకు నిరాకరించామని తమను కొందరు దారుణంగా కొట్టారని, బట్టలు లేకుండా రెండు కిలోమీటర్లు పైగా నడిపించారని బాధిత బాలుడు చెప్పాడు. ముగ్గురు బాలురను గణేష్ సింగ్ అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి పొలం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గ్రామం వరకూ నగ్నంగా నడిపించాడని పోలీసులు తెలిపారు. బాలురను వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కాగా, పొలంలో పనిచేసేందుకు నిరాకరించినందుకు మైనర్లను దారుణంగా వేధించారని పోలీసులు చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Last Updated 25, Mar 2018, 11:45 PM IST | 0business
|
IND vs BAN 1st T20 LIVE Score బోర్డు కోసం క్లిక్ చేయండి..!
ఈ మ్యాచ్ ముందు వరకూ 2,443 పరుగులతో ఉన్న రోహిత్ శర్మ 9 పరుగులు చేయడం ద్వారా 2,452 పరుగులతో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి నెం.1 స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 67 ఇన్నింగ్స్ల్లో 2,450 పరుగులు చేయగా.. తాజా మార్క్ని 91 ఇన్నింగ్స్ల్లో రోహిత్ శర్మ అందుకోవడం గమనార్హం. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో కోహ్లీ, రోహిత్తో పాటు మార్టిన్ గప్తిల్ (2,285 పరుగులు), షోయబ్ మాలిక్ (2,263), బ్రెండన్ మెక్కలమ్ (2,140) టాప్-5లో కొనసాగుతున్నారు.
Read More: సమైరా తాకగానే పడిపోయిన శిఖర్ ధావన్
బంగ్లాదేశ్తో మూడు టీ20లు జరగనుండగా.. విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో.. కెప్టెన్గా రోహిత్ శర్మ జట్టుని నడిపిస్తున్నాడు. సిరీస్లో ఇంకా రెండు టీ20లు జరగనుండటంతో.. రోహిత్ శర్మ మరికొన్ని రోజుల పాటు నెం.1 స్థానంలోనే కొనసాగే అవకాశం ఉంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
sumalatha 269 Views Rohit Sharma , Team India
Rohit Sharma
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ మధ్య గత మూడు వారాలుగా కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. దీనిపై మూడు రోజుల క్రితం విరాట్ క్లారీటీ ఇచ్చాడు. కానీ రోహిత్ మాత్రం ఇప్పటికి స్పందించలేదు. దీనిపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ.. భారత జట్టులో విభేదాలు అంటూ చేస్తున్న ప్రచారమంతా నాన్సెన్స్ అని కొట్టిపారేశాడు. కానీ ట్విట్టర్ లో రోహిత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెవిలియన్ నుంచి మైదానంలోకి వెళ్తున్న ఫోటోను షేర్ చేసిన రోహిత్ ఙనేను ప్రతిసారి జట్టు కోసం కాదు.. దేశం కోసం బరిలోకి దిగుతాచ అని కామెంట్ చేశాడు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/ | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
యుద్ధ విమానంలో విహరించిన పీవీ సింధు..!
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయబడిన తేలిక పాటి యుద్ధ విమానంగా 'తేజాస్' వెలుగులోకి వచ్చింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) దాదాపు 30ఏళ్ల శ్రమ తర్వాత వీటిని అభివృద్ధి చేసింది
Samayam Telugu | Updated:
Feb 23, 2019, 02:47PM IST
యుద్ధ విమానంలో విహరించిన పీవీ సింధు..!
హైలైట్స్
బెంగళూరు వేదికగా అలరిస్తున్న ఏరో ఇండియా షో
యుద్ధ విమానం తేజాస్లో విహరించిన పీవీ సింధు
మార్చి 6 నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తేలిక పాటి యుద్ధ విమానం 'తేజాస్'లో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ‘ఏరో ఇండియా షో’లో శనివారం ఉమెన్స్ డే నిర్వహించారు. దీంతో.. షోకి హాజరైన పీవీ సింధు కోపైలెట్గా 'తేజాస్'లో విహరించింది. గ్రీన్ యూనిఫామ్ ధరించి 'తేజాస్'లోకి ప్రవేశించిన సింధు.. సాహసోపేతంగా యుద్ధ విమానంలో ప్రయాణించడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Shuttler PV Sindhu waves as she is about to take off for a sortie in the indigenous Light Combat Aircraft - Tejas i… https://t.co/nm79BQg0p5
— ANI (@ANI) 1550906043000
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయబడిన తేలిక పాటి యుద్ధ విమానంగా 'తేజాస్' వెలుగులోకి వచ్చింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) దాదాపు 30ఏళ్ల శ్రమ తర్వాత వీటిని అభివృద్ధి చేసింది. ఇది వరకు ఉన్న యుద్ధ విమానాల కంటే తేజాస్ యుద్ధ విమానాలు నవీనమైనవి. గాల్లో ఉన్నప్పుడు కూడా వీటిలో ఇంధనాన్ని నింపుకోవచ్చు.
Badminton player PV Sindhu waves as she is about to take off for a sortie in the indigenous Light Combat Aircraft -… https://t.co/9VecLSweev
— ANI (@ANI) 1550903729000
కెరీర్ పరంగా మార్చి 6 నుంచి ప్రారంభంకానున్న ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం ప్రస్తుతం పీవీ సింధు సిద్ధమవుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నెహ్రా తుది మ్యాచ్ రిక్వెస్ట్.. హైకోర్ట్ ఓకే!
నవంబర్ 1న ఫిరోజ్షా కోట్ల మైదానంలో చివరి మ్యాచ్ ఆడి వీడ్కోలు పలకాలని ఆశిస్తున్న నెహ్రాకు
TNN | Updated:
Oct 24, 2017, 07:49PM IST
నవంబర్ 1న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్లు టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని ఆశిష్ నెహ్రా భావిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య కెరీర్‌కు గుడ్ బై చెప్పాలని ఈ వెటరన్ బౌలర్ ఆశిస్తున్నాడు. అందుకే వారు కూర్చొని మ్యాచ్ తిలకించేందుకు వీలుగా కార్పొరెట్ బాక్స్ కేటాయించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. నెహ్రా వినతి పట్ల న్యాయస్థానం కూడా సానుకూలంగా స్పందించింది.
జస్టిస్ రవీంద్ర భట్, సంజీవ్ సచ్‌దేవతో కూడిన న్యాయస్థానం నెహ్రాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెహ్రా చివరి మ్యాచ్ ఆడనుండటంతో కార్పొరేట్ బాక్స్‌కు అంగీకరించింది. మరి చివరి మ్యాచ్ ఆడేందుకు కోహ్లి ఈ సీనియర్ బౌలర్‌కు ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి మరి.
ఢిల్లీ క్రికెట్ సంఘం ఉద్యోగులు, స్టాఫ్, సెలెక్టర్లు, కోచ్‌లు, కామెంటేటర్లు, ఇతర క్రీడా ప్రతనిధుల కోసం ఒక్కొక్కరికి రెండు కాంప్లిమెంటరీ పాసుల మంజూరీకి కూడా హై కోర్టు అనుమతిచ్చింది. | 2sports
|
లండన్: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన జావెలిన్ త్రోయర్ దావీందర్ సింగ్ ఫైనల్స్కి అర్హత సాధించడం
ఇదే తొలిసారి. దావీందర్ సింగ్ జావెలిన్ను 83మీటర్లు విసరడంతో ఫైనల్కి అర్హత సాధించాడు. భుజం గాయంతో బాధపడుతున్న
దావీందర్ గ్రూప్-బి నుంచి పోటీలో పాల్గొన్నాడు. . శుక్రవారం ఫైనల్ పోటీలు జరగనున్నాయి. గ్రూప్-ఎ నుంచి ఐదుగురు,
గ్రూప్-బి నుంచి ఏడుగురు ఫైనల్కి అర్హత సాధించారు. ఇదే ఈవెంట్లో భారత్కు చెందిన మరో అథ్లెట్ నీరజ్ చోప్రా ఫైనల్కి అర్హత సాధించలేకపోయాడు. ఈ సందర్భంగా దావీందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘నేను బరిలో దిగే సమయానికి నీరజ్ ఫైనల్కి అర్హత
సాధించలేదని తెలిసింది. ఎలాగైనా ఫైనల్కి అర్హత సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. దేశానికి ఏదైనా చేయాలి.
గతంలో ఏ భారతీయుడు అందుకోలేని ఘనత ఇప్పుడు నేను అందుకున్నాను. ఇదంతా దేవుడి దయ. ఈ ఏడాది మేలో
ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలు జరిగే సమయంలో కుడి భుజానికి గాయమైంది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. ఫైనల్లో
మెరుగైన ప్రదర్శన చేసి దేశానికి పతకం అందిస్తాను’ అని దావీందర్ సింగ్ తెలిపాడు. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Visit Site
Recommended byColombia
బంగారం ధర తగ్గడంతో దేశ రాజధానిలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.32,100 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.31,950 వద్ద నిలిచింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర 25,000 రూపాయల వద్దే కొనసాగుతోంది. వెండి ధర రూ.200 తగ్గి రూ.37,800 కి పడిపోయింది. వారాంతపు ఆధారిత డెలివరీ వెండి ధర రూ.238 తగ్గి రూ .37,494 కి చేరింది. మరోవైపు 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కొనుగోలు ధర రూ.74,000 ఉండగా.. అమ్మకం ధర రూ.75,000 వద్ద స్థిరంగా ఉంది.
న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర 0.33 శాతం తగ్గడంతో ఔన్సు 1,256.20 డాలర్లు పలికింది. వెండి 1.02 శాతం తగ్గి 14.69 డాలర్లకు చేరింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
పూనమ్, పవన్ ల పై కత్తి మహేష్ సంచలన ఆరోపణలు
Highlights
పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తూ.. పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన కత్తి మహేష్
గత కొంత కాలంగా పవన్ ఫ్యాన్స్ వేధిస్తున్నారంటూ కత్తి మహేష్ ఆరోపణలు
తాజాగా ఫ్యాట్సో అంటూ విమర్శించిన పూనమ్ కౌర్ కు కత్తి ఆరు సూటి ప్రశ్నలు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై చాలాకాలంగా తీవ్ర విమర్శలు చేస్తూ పవన్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్తో ముఖాముఖి నిర్వహించాలని మహేష్ ఈ మీడియా సమావేశాన్ని తలపెట్టారు. ఈ మేరకు పవన్, పూనమ్కు ఆహ్వానాలు పంపారు. అయితే వారు రాకపోవడంతో మహేష్ మీడియాతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ను విమర్శించినందుకు సోషల్ మీడియా ద్వారా స్పందించిన నటి పూనమ్ కౌర్ను మహేష్ టార్గెట్ చేశారు. నిన్న నీ గర్ల్ ఫ్రెండ్ కు గడ్డి పెట్టుకో అంటూ పూనమ్ నుద్దేశించి పవన్ ను విమర్శించిన కత్తి మహేష్.. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్, పూనమ్ మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తూ ఆమెకు ఆరు ప్రశ్నలు సంధించారు. పూనమ్ కౌర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆరు ప్రశ్నలు సందించారు.
‘నేను ఎవరి గురించీ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మాట్లాడదలుచుకోలేదు. అది ప్రజాస్వామ్యం కాదని నా ఉద్దేశం. పూనమ్ కౌర్ గారిని నేను చాలా గౌరవిస్తాను. ఇప్పుడు నేను లేవనెత్తుతున్నవి ప్రశ్నలు మాత్రమే. నేను ఆమెపై ఏ విధమైన ఆరోపణలు చేయట్లేదు. ఈ ప్రశ్నలు ఆమెను కించపరచడానికో, న్యూనపరచడానికో అడగడంలేదు. ఈ ప్రశ్నలకు ఆమె వద్ద సమాధానాలుంటే ఆ తరవాత చర్చికుందాం’ అంటూ ఈ కింది ఆరు ప్రశ్నలను సందించారు.
1. మీకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది?
2. తిరుమలలో పవన్ కళ్యాణ్తో పాటు నిలబడి ఒకే గోత్ర నామాలతో మీరు పూజలు ఎందుకు చేయించుకున్నారో చెప్పగలరా?
3. పవన్ మోసం చేశారనే బాధతో మీరు ఆత్మహత్యాయత్నం చేస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరున్న హాస్పిటల్ ఏంటి? ఆ బిల్లులు కట్టిందెవరు?
4. పవన్ కళ్యాణ్ మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటి వరకు అది నెరవేర్చారా లేదా?
5. డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకెందుకు అంత కోపం?
6. ఒక క్షుద్ర మాంత్రికుడు నర్సింగం చేసిన క్షుద్ర పూజలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్తో కలసి అక్కడ మీరేంచేశారో చెప్పగలరా?
ఆరు ప్రశ్నలకు మీడియా ముఖంగా పూనమ్ను అడుగుతున్నానని, దీనికి ఆమె సమాధానం చెబితే బాగుంటుందని మహేష్ అన్నారు. ఏ ఆధారాలు లేకుండా ఓ మహిళపై మీరు ఆరోపణలు ఎలా చేస్తారని మీడియా ప్రశ్నించడంతో.. తన వద్ద ఆధారాలున్నాయన్నారు. పూనమ్ సమాధానం చెబితే తన వద్ద ఉన్న ఆధారాలు చూపుతానని చెప్పారు.
Last Updated 25, Mar 2018, 11:53 PM IST | 0business
|
ajinkya rahane batting average is impressive on away tests
పుజారా, రహానే.. ఆడో రకం, ఈడో రకం
భారత్ క్రికెట్లో పుజారా, రహానే ఇద్దరూ ఆడో రకం, ఈడో రకం అనిపిస్తున్నారు. ఇద్దరూ నిలకడగా ఆడేవారే అయినప్పటికీ.. ఈ విషయంలో మాత్రం పొంతన లేదు.
TNN | Updated:
Nov 26, 2017, 05:37PM IST
క్రికెటర్ ఎవరైన సొంత గడ్డ మీద ఎక్కువ పరుగులు చేయడం సహజం. కానీ టీమిండియా బ్యాట్స్‌మెన్ అంజిక్య రహానే స్టయిలే వేరు. భారత్‌లో అతడి బ్యాటింగ్ యావరేజ్ కంటే విదేశాల్లోనూ అధికం. సొంత గడ్డ మీద టెస్టుల్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడే రహానే.. విదేశాల్లో చక్కగా రాణిస్తాడు. దీనికి అతడి బ్యాటింగ్ యావరేజే నిదర్శనం. ఇండియాలో అతడి టెస్టు బ్యాటింగ్ సగటు 36.89, కాగా విదేశాల్లో అది 53.44గా ఉండటం విశేషం. గతంలో మొహిందర్ అమర్‌నాథ్ కూడా విదేశాల్లోనే బాగా ఆడేవాడు. విదేశీ గడ్డ మీద ఆయన యావరేజ్ 51.86 కాగా, ఇండియాలో 30.44 మాత్రమే.
భారత్‌లో సరిగా ఆడలేడనే అపప్రదను నిజం చేస్తూ రహానే నాగ్‌పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకే వెనుదిరిగాడు. కోల్‌కతా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసిన రహానే, రెండో ఇన్నింగ్స్‌‌లో డకౌట్‌గా పెవిలియన్ చేరి నిరాశ పరిచాడు. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
స్నాప్చాట్లో 'కొత్త ఫీచర్'..!
'స్నాప్చాట్' యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ను సంస్థ తీసుకొచ్చింది. దీనిద్వారా యూజర్లు... 'గ్రూప్ వీడియో చాట్' సౌకర్యాన్ని పొందనున్నారు. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఒకేసారి 16 మంది వరకు వీడియో చాటింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
TNN | Updated:
Apr 6, 2018, 04:11PM IST
స్నాప్చాట్లో 'కొత్త ఫీచర్'..!
'స్నాప్చాట్' యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ను సంస్థ తీసుకొచ్చింది. దీనిద్వారా యూజర్లు... ' గ్రూప్ వీడియో చాట్ ' సౌకర్యాన్ని పొందనున్నారు. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఒకేసారి 16 మంది వరకు వీడియో చాటింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక గ్రూప్లో ఉన్న యూజర్, మొదటగా గ్రూప్ చాట్లో వీడియో కెమెరా ఐకాన్ను టచ్ చేసిన వెంటనే... గ్రూప్లోని మిగతా వారందరికీ వీడియో చాట్ నోటిఫికేషన్ వెళ్తుంది. ఇక వీడియో చాట్ చేసుకోవచ్చు. ఒక గ్రూప్ ద్వారా గరిష్ఠంగా 16 మంది వరకు వీడియో చాటింగ్ చేసుకునేందుకు వీలుంది. | 1entertainment
|
Hyderabad, First Published 26, Oct 2018, 12:05 PM IST
Highlights
సీనియర్ హీరో అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సెట్ లో తప్పుగా ప్రవర్తించాడని యంగ్ హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన ఆరోపణలు కన్నడ నాట వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ ఆరోపణలు అర్జున్, అతడి కుటుంబంతో పాటు కొందరు సినీ ప్రముఖులు ఖండించారు. అర్జున్ జెంటిల్మెన్ అంటూ అతడికి మద్దతు తెలుపుతున్నారు.
సీనియర్ హీరో అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సెట్ లో తప్పుగా ప్రవర్తించాడని యంగ్ హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన ఆరోపణలు కన్నడ నాట వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ ఆరోపణలు అర్జున్, అతడి కుటుంబంతో పాటు కొందరు సినీ ప్రముఖులు ఖండించారు.
అర్జున్ జెంటిల్మెన్ అంటూ అతడికి మద్దతు తెలుపుతున్నారు. ప్రకాష్ రాజ్, శ్రద్ధాశ్రీనాథ్ వంటి తారలు మాత్రం శ్రుతికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
దీనికి అర్జున్, శ్రుతిలని పిలిచారు. ఈ సమావేశం మొదలుకావాడానికి కొన్ని గంటల ముందే అర్జున్ తరఫున అతని మేనల్లుడు ధ్రువ బెంగుళూరు సివిల్ న్యాయస్థానంలో శ్రుతిపై రూ.5 కోట్ల పరువునష్టం దావా వేశారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి ఛాంబర్ అధ్యక్షుడు అంబరీష్.. ఇతర సభ్యులు ప్రయత్నించగా.. అర్జున్.. శ్రుతి తనకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన శ్రుతి... తాను క్షమాపణలు చెప్పనని, ఎప్పటికీ తన మాట మీదే నిలబడి ఉంటానని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి.. | 0business
|
Suresh 84 Views pv sindhu in world batminton tournament
pv sindhu in world batminton tournament
స్కాట్లాండ్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత అగ్రశ్రేణి
షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. కిమ్ హ్యో మిన్ (కొరియా)ను 21-16, 21-14తో
వరుస గేముల్లో ఓడించింది. ప్రత్యర్థి అన్సీడెడ్ కావడంతో సింధు సునాయాసంగా విజయం
సాధించింది. తొలి గేమ్ ప్రారంభంలోనే వరుసగా ఎనిమిది పాయింట్లతో ప్రత్యర్థిని కోలుకోనీకుండా
చేసిన సింధు చక్కని స్మాష్లు, నెట్గేమ్తో దూసుకుపోయింది. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సచిన్.. అక్రమ్ను చేయి వేయనీయొద్దు..!
పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్ అంటే భారత అభిమానులకు పండగ. ఎంతో కసి.. మరెన్నో భావోద్వేగాలు.
TNN | Updated:
Oct 25, 2017, 10:05AM IST
పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ అంటే భారత అభిమానులకు పండగ. ఎంతో కసి.. మరెన్నో భావోద్వేగాలు. పాకిస్థాన్‌పై టీమిండియా గెలిస్తే.. మనమే స్వయంగా గెలిచినంత ఆనందపడతాం. అది దేశం మీద, క్రికెట్ మీద మనకున్న భక్తి, అభిమానం. మరి అలాంటప్పుడు మైదానంలో మన ఆటగాళ్లతో పాకిస్థానీ ప్లేయర్లు అనుచితంగా ప్రవర్తించినా, అవమానించినా మనం తట్టుకోగలమా..? ఇదే విషయాన్ని భారత లెజండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రస్తావించారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ రాసిన ‘డెమోక్రసీస్ లెవెన్ - ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ముంబైలో జరిగింది.
ఈ కార్యక్రమంలో పాతతరం ఆటగాళ్లు నారీ కాంట్రాక్టర్, మాధవ్ ఆప్టే, వారి తర్వాతి తరం అజిత్ వాడేకర్, మహ్మద్ అజారుద్దీన్ సహా సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ పాల్గొన్నారు. క్రికెట్ దిగ్గజాలంతా ఒకేచోట చేరి అభిమానులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్ క్రికెటర్లతో మైదానం వెలుపల స్నేహం, సచిన్ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో అతనికి ఇచ్చిన సళమాలను గవాస్కర్ గుర్తుచేసుకున్నారు. ‘నువ్వు టాస్ కోసం మైదానంలోకి వెళ్లే సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ వసీం అక్రమ్‌ను నీ భుజాల మీద చేతులు వేయనీయొద్దు. వారు అప్పుడప్పుడు అలా చేస్తుంటారు. అది దేశభక్తికి సంబంధించిన విషయం. కాబట్టి చేతులు వేయనీయొద్దు’ అని సచిన్‌కి చెప్పినట్లు సన్నీ వెల్లడించారు.
టెండ్‌ల్యా ఇక పడుకోవాలి..!
సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. లెజండరీ కెప్టెన్ కపిల్ దేవ్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. తాను టీమిండియాలో చేరిన కొత్తలో కపిల్ దేవ్ తన రూమ్ మేట్‌గా ఉండేవారిని చెప్పాడు. దీంతో తాను చాలా క్రమశిక్షణ కలిగి ఉండేవాడినని, కపిల్ సూచనలు పాటించేవాడనని గుర్తు చేసుకున్నారు. రాత్రి 10.30 అయితే కపిల్ లైట్లన్నీ ఆపేసి ‘టెండ్‌ల్యా అబ్ సోనా హై (టెండ్‌ల్యా ఇక పడుకోవాలి)’ అని అనేవారని తెలిపాడు. ఉదయం 9 గంటలకు తాము మైదానానికి వెళ్లాలని, అయితే కపిల్ తనను 8.15 గంటలకు నిద్రలేపే వారని చెప్పాడు. ‘టెండ్‌ల్యా నీకోసం టీ తీసుకురానా? అని కపిల్ అడిగేవారు. నేను వెంటనే బెడ్ మీద నుంచి దిగి.. లేదు పాజీ నేనే మీకు టీ తీసుకొస్తాను అని చెప్పేవాడిని’ అని కపిల్ స్వభావం గురించి సచిన్ చెప్పుకొచ్చాడు. | 2sports
|
Hyderabad, First Published 10, Mar 2019, 5:09 PM IST
Highlights
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) 2019 ఎన్నికలు ముగిశాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) 2019 ఎన్నికలు ముగిశాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుండి
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.
గతంలో ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా.. ఈసారి పోలింగ్ కు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. ఈ ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్, నరేష్ ప్యానెల్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది.
'మా' అసోసియేషన్ లో మొత్తం 745 ఓట్లు ఉండగా.. 472 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ రేంజ్ లో మా ఎలెక్షన్స్ లో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి.
సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా ఫిలిం ఛాంబర్ కి చేరుకొని ఓటు వేశారు. మరికాసేపట్లో విజేతగా ఎవరు నిలిచారో అనౌన్స్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి.. | 0business
|
బ్లాక్రాక్ పెట్టుబడులకు భారత్ కీలక మార్కెట్!
న్యూఢిల్లీ, నవంబరు 3: ప్రపంచంలోనే అతిపెద్ద మనీమేనేజర్ సంస్థగా ఉన్న బ్లాక్రాక్ ఇంక్ ప్రస్తు తం భారత్తమకు అత్యంత కీలకమయిన మార్కె ట్గా భావిస్తోంది. ఆసియాలోనే అత్యంత ఎక్కువ పుష్కల వ్యాపార వనరులు భారత్లో ఉన్నట్లు సంస్థ అంచనావేసింది. అందుకే ఆసియా పరిధిలో తన నెట్వర్క్ను మరింత విస్తరించే యోచనతో ఉంది. ఎక్కడ బ్యాంకర్లు రుణం ఇచ్చేందుకు సంశ యిస్తున్నారో అక్కడ ఈ సంస్థ ప్రవేశించి మొత్తం పరపతిని అందించేందుకు సిద్ధంఅవుతోంది. ద్రవ్య విధాన సమీక్షలో కేంద్ర బ్యాంకులు విధి విధానాలు సరళీకృతంచేయడం వల్ల ప్రైవేటు రుణపరపతికి మరింత ముందంజలో ఉంది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా పదిలక్షలకోట్ల డాలర్ల సెక్యూ రిటీలను ఆఫర్చేసినా ఇప్పటికి కొన్నిప్రపంచ బ్యాం కులు ప్రతికూల వడ్డీరేట్లలోనే మగ్గుతున్నాయి. దీనివల్లనే ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రైవేటు రుణపరపతి వల్ల మంచి లాభాలు ఉంటాయని సంస్థలు అంచనాలు వేస్తు న్నాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్లు ప్రస్తుతం తక్కు వ వడ్డీరేట్ వాతావరణం వల్ల మరింతగా కార్పొ రేట్లు, సంస్థలకు లాభదాయకంగా ఉంటుందని అంచనా. రుణపరపతిద్వారా పెట్టుబడులకు భారత్ ఎంతో అనువైన దేశంగా సింగపూర్ సంస్థ లు ఇప్పటికీ భావిస్తున్నాయి. భారత్ స్థూల దేశీ యోత్పత్తి 7.1శాతంపెరిగింది. ఆసియాలోని ఇతర ప్రధాన దేశాల్లో శరవేగంగా వృద్ధిచెందుతున్న దేశం గా ఉంది. ఇక కొత్తగా వస్తున్న దివాళా నియ మావళి విధానాలు కూడా ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. ఇక స్పెక్ట్రమ్ వేలం ద్వారా భారత్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు న్నాయని బ్లాక్రాక్ భావిస్తోంది. రానిబాకీల వల్ల భారత్లో బ్యాంకింగ్ వ్యవస్థ అధ్వాన్నాంగా మారింది. అందువల్లనే బ్లాక్రాక్ వంటి సంస్థలు భారత్వైపు దృష్టిసారించాయి.అలాగే ఆసియాలోని అతిపెద్దదేశం అయిన చైనాలో పెట్టుబడులకు బ్లాక్ రాక్ వంటి సంస్థలు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నా యి. అలాగే బ్లాక్రాక్ తన ప్రైవేటుక్రెడిట్టీమ్ను ఆసియాలో పెంచుకున్నది. హడ్జ్ఫండ్ మాజీ మేనే జర్ జస్టిన్ ఫెరీర్ను ఎండిగా ఈ ఏడాదిప్రారంభం లోనే నియమించింది. బ్యాంకింగ్ రంగంలో ఎదు రవుతున్న సవాళ్లు సమస్యలను పరిగణనలోనికి తీసుకుని వాటినుంచి పెట్టుబడులపరంగా భారత్ లో మరింతముందుకు వెళ్లేందుకుబ్లాక్రాక్ చూస్తోంది. | 1entertainment
|
internet vaartha 178 Views
హైదరాబాద్ : ప్రారంభదశలో ఉన్న స్టార్టప్ కంపనీలకు బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, హైదరాబాద్, ముంబైలలోని స్టార్టప్ క్లబ్స్ ప్రారంభించడం జరుగుతోందని, 11నగరాల్లో స్టార్టప్ కంపెనీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వ హించి వారిచ్చే అనుభవాల ఆధారంగా స్టార్టప్ కంపెనీలు ప్రోత్సాహకాంశాలపై మదింపు చేయడం జరుగుతుందని పారిశ్రామిక ప్రముఖులు చెపుతున్నారు. నగరంలోని హైదరాబాద్ యూనివర్సి టీలో జరిగిన స్టార్టప్స్ క్లబ్ ఆధ్వర్యంలో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ డెమోడేను నిర్వహించారు. తెలంగాణ సిఐఐ ఛైర్మన్ నృపేందర్రావు, టిబిఐ వర్సిటీ ప్రొఫెసర్ బి.రాజశేఖర్, ప్రొఫెసర్ బి వెంకటరమణ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఐదునగరాల్లో ఆ స్టార్టప్ క్లబ్లలో ఆరువేల మందికిపైగా సభ్యులున్నారని వారన్నారు. స్టార్టప్ క్లబ్ నిర్వహించే డెమోడే సందర్భంగా కంపనీల ప్రతినిధులు తమ ఆలోచనలను పెట్టు బడిదారులకు అమ్మడానికి నిధులు సమకూర్చు కోడానికి ఒక సులభతరమైన అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం గుర్తించిన టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ను వర్సిటీలో ఇందుకోసమే ఏర్పాటుచేసినట్లు తెలిపారు. చిన్న పరిశ్రమల అభివృద్ధికి కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక మద్దతు, ఆర్థిక అభివృద్ధి వ్యూహాలు తది తరమైనవి ఎన్నో ఉంటాయన్నారు. వ్యవస్థా పకుల మధ్య సహకారానికి టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ డెమోడే వారధిగా పనిచేస్తుందని, పెట్టుబడులు పెట్టి వ్యాపారం నిర్వహించేందుకు ముందుకువచ్చే వ్యక్తులకు రాబోయే కాలంలో వారు ఎదుర్కొనబోయే సవాళ్లపై చర్చించేందుకు ఒక చక్కనివేదికగాఉంటుందని వక్తలు పేర్కొన్నారు. | 1entertainment
|
Aug 14,2018
దిగివచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: పండ్లు, కూరగాయల ధరలు కాస్త దిగిరావడంతో గత జులై మాసంలో రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గత నెల తొమ్మిది నెలల కనిష్టానికి దిగివచ్చింది. జులై మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.17 శాతంగా నమోదు అయినట్టుగా ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. వినయోగదారు ధరల సూచిక మేరకు జూన్ మాసంలో 4.91 శాతంగా వెల్లడించిన రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి సవరించినట్టుగా కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్వో) వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన గణించి చూస్తూ జులై మాసంలో రిటైల్ ద్రోవ్యల్బణం 2.36 శాతం మేర పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం గత ఏడాది అక్టోబరులో అత్యధికంగా 3.58 శాతంగా నమోదు అయింది. జులై మాసంలో కూరగాయల ధరలు 2.19 శాతం మేర దిగివచ్చాయి. మరోవైపు పండ్ల ధరలు 6.98 శాతం మేర తగ్గాయి. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల మేరకు మాంసకృత్తులు ఎక్కువగా ఉండే మాంసం, చేపలు, పాలు తదితరాల ధరలు జులై మాసంలో భారీగా దిగివచ్చాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
క్రికెట్ ఫ్యాన్స్కి నిరాశ.. ఈ ఏడాది బీపీఎల్ లేనట్టే!
క్రికెట్ ఫ్యాన్స్కి చేదువార్త. ఎన్నికల కారణంగా ఈ ఏడాది అక్టోబర్లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఉండదని ప్రకటించారు.
Samayam Telugu | Updated:
Jul 30, 2018, 12:49PM IST
క్రికెట్ ఫ్యాన్స్కి నిరాశ.. ఈ ఏడాది బీపీఎల్ లేనట్టే!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్కు ఎన్నికల సెగ తాకింది. సార్వత్రిక ఎన్నికల ప్రభావంతో బీపీఎల్ లీగ్ వెనక్కి వెళ్లింది. ఈ ఏడాది అక్టోబర్లో బీపీఎల్ నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. కానీ అక్టోబర్ తర్వాత బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో.. భద్రత కల్పించలేమని పోలీసు యంత్రాంగం చేతులెత్తేసింది. దీంతో ఈ టీ20 టోర్నీని వచ్చే ఏడాది జనవరి 5 నుంచి నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. మిర్పూర్లో టోర్నమెంట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్లు, ఫ్రాంచైజీల ప్రతినిధుల మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
‘బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ చివరి వారంలో నిర్వహించే వీలుంది. దీంతో జనవరి 5, ఫిబ్రవరి 8 తేదీల మధ్య బీపీఎల్ నిర్వహించనున్నాం’ అని బీపీఎల్ టెక్నికల్ కమిటీ చైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు.
బీపీఎల్ వెనక్కి వెళ్లిపోవడంతో.. అక్టోబర్లో జింబాబ్వే బంగ్లా పర్యటనకు రానుంది. ఇరు జట్లు మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో తలపడనున్నాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Visit Site
Recommended byColombia
‘ఇలా ఓ సిరీస్‌ గురించి అంతా చర్చించుకోవడం గొప్ప విషయం. ముఖ్యంగా.. ఇక్కడి బౌన్స్‌ పిచ్‌లు గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇది దక్షిణాఫ్రికా జట్టుకి సిరీస్‌లో సానుకూలాంశం. కానీ.. ఎంత స్వదేశీ పిచ్‌లైనా సరైన ప్రాంతంలో బంతులు వేయడం మా జట్టు బౌలర్లకి తెలియాలి. టెస్టు మ్యాచ్‌లో పరుగులు ఎక్కువగా టీ సెషన్ ముగిసిన తర్వాతే వస్తాయి. కాబట్టి.. అప్పటి వరకు మా జట్టు బౌలర్లు ఉత్సాహం తగ్గకుండా
సహనంతో బౌలింగ్ చేయాలి. అలా చేయగలిగితే.. రోజు ముగిసే సమయానికి భారత్‌ని ఒత్తిడిలోకి నెట్టగలం’ అని మోర్నీ మోర్కెల్ వివరించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Renu patti, HR Manager
నోయిడాలో పేటిఎం పేమెంట్ బ్యాంకు
ముంబయి, మే 19: ఏడాది జాప్యం తర్వాత ఆన్లైన్మొబైల్ చెల్లింపులవ్యవస్థ పేటిఎం చివరకు చెల్లిం పుల బ్యాంకును ప్రారంభిస్తోంది. ఈ నెల 23వ తేదీ పేటిఎం బ్యాంకు ప్రారంభిస్తామని ప్రకటించింది. కంపెనీ ముందుగా నిర్ణయించిన షింజినికుమార్ కాకుండా రంగంలోనికి సంస్థ సిఇఒగా రేణు సత్తిని నియమిస్తున్నారని అంచనా. క్రెడిట్కార్డులు, రుణాలు మినహా ఇతర అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. పేటిఎం పేమెంట్ బ్యాంక్ను 23వ తేదీ ప్రారంభిస్తామని, ఆర్బిఐ నుంచి ఇటీవలే అనుమతులు వచ్చాయని సిఇఒ రేణు సత్తి వెల్లడించారు. పేటిఎం పేమెంట్ బ్యాంకు కేంద్ర కార్యా లయం నోయిడాలో ఉంటుంది. తాను ముంబైలోనే ఉండాలనుకుంటున్నానని అందువల్లనే పేటిఎంసిఇఒ గా వైదొలుగుతున్నట్లు షింజినకుమార్ వెల్లడించారు. ఢిల్లీలో ఉండాలనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలిం చలేదన్నారు. ఢిల్లీ లేదా ముంబలలో మాత్రమే ఉండా లన్న తన నిర్ణయమే తనను వైదొలిగేలాచేసిందన్నారు.
పేటిఎంలో రేణుసత్తి హెచ్ఆర్ మేనేజర్గా ఉద్యోగం ప్రారంభించారు. దశాబ్దకాలంపాటు కార్పొరేట్ పాల నకు వచ్చిన రేణు వివిధ టీమ్లను ఆన్లైన్ మార్కెట్ సంస్థలో నిర్వహించారు. పేమెంట్స్ బ్యాంక్ మొదట ఉత్తరప్రదేశ్లో సేవలు ప్రారంభిస్తుంది. తర్వాత ఈశాన్యరాష్ట్రాలకు విస్తరిస్తుందని అంచనా. జనవరి లోనే పేటిఎంవ్యవస్థాపకులు విజ§్ుశేఖర్శర్మ మొదటి దశలో పేమెంట్స్ బ్యాంకు లక్ష మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమిస్తుందని, 20కోట్లకుపైగా బ్యాంకింగ్ వ్యాలెట్లను కరెంటుఖాతాలు, సేవింగ్స్ ఖాతాలను ప్రారంభిస్తామన్నారు. సాధారణ బ్యాంకులు సేవింగ్స్, కరెంటుఖాతాలపైనే ఎక్కువ దృష్టిసారిస్తాయని మనీవ్యాలెట్లపై కూడా తాము దృష్టిసారి స్తామన్నారు. గడచిన ఏడాదిన్నరకాలంగా పేటిఎం బ్యాంకు కార్యకలాపాలను ఏడుసార్లు వాయిదా వేసింది. 400 కోట్ల మూలధనంతో ఇపుడు ప్రారంభిస్తోంది.
నోయిడా యుపిలో మొదటి శాఖ ప్రారంభిస్తారు. గౌహతి తర్వాత ప్రారంభిస్తుంది. పెద్దనోట్ల రద్దు కారణంగా వాయిదా పడింది. వీటికితోడు శర్మ హాంకాంగ్లో ఉన్నారు. పేమెంట్స్ బ్యాంకు వాటా విక్రయాలపై దృష్టిసారించారు. పెద్దనోట్ల రద్దు కారణంగా తగినంత నిధులు అందుబాటులోకి రాలేదని, అందువల్లనే వాటాల విక్ర యంపై దృష్టి పెట్టానన్నారు. మొత్తం 220 కోట్లు పెట్టుబడులు బ్యాంకులో పెడుతున్నామని వీటిలో 120 కోట్లు తనవంతుగా ఉంటాయని శర్మ వెల్లడించారు. ఆర్బిఐకు పేమెంట్స్ బ్యాంకులపరంగా 11 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో మనీవ్యాలెట్ల పరంగా పేటిఎం బ్యాంకు అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఎయిర్టెల్ పేమెంట్స్బ్యాంకు దేశంలోనే మొట్టమొదటి పేమెంట్ బ్యాంకుగా వచ్చింది. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, ఒకప్పటి విధ్వంసకర ఆటగాడు మాథ్యూ హెడెన్ కూడా కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లి గురించి మాటల్లో చెప్పలేనని, అతడొక అద్భుతమని కొనియాడాడు. ‘క్రికెట్ల్లో దిగ్గజ ఆటగాళ్లైన సచిన్, బ్రియాన్ లారా ఒక్కొక్క సమయంలోనూ గొప్ప ఆటతీరు కనబర్చారు. కానీ కోహ్లి సీజన్తో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్నాడు. అతడికి పరుగుల దాహం తీరడం లేదు. బ్యాటింగ్కు కష్టతరంగా మారిన రాంచీ పిచ్పై కోహ్లి ఆటతీరు అద్భుతం. తన ఆట చూస్తుంటే పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందేమో అనిపించింది. మైదానానికి అన్నివైపులా షాట్లు కొట్టాడు. కష్టతరమైన సందర్భంలోనూ మ్యాచ్ను గెలిపించడానికి కోహ్లి శాయశక్తులా ప్రయత్నించాడు’ అని పొగిడేశాడు హెడెన్.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
Suresh 174 Views jio phone
Jio Phone
హైదరాబాద్: ‘జియో ఫోన్ డెలివరీ ఎప్పుడనే ఆసక్తి ఇప్పుడు టెలికం వినయోగదారుల్లో నెలకొంది. టెలికాం రంగంలో
సంచలనం సృష్టించిన రిలయన్స్ సంస్థ..ఇటీవట ‘జియోఫోన్ పేరుతో 4జీ ఫీచర్ ఫోన్ను విడుదల చేసిన విషయం
తెలిసిందే. ఆగస్టు 24న ఈ ఫోన్ ప్రీ అర్డర్లు ప్రారంభం కాగా రెండు రోజుల్లోనే 60 లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు.
అయితే త్వరలోనే ఈఫోన్ వినియోగదారులకు అందించనున్నారు. దసరా పండగను పురస్కరించుకుని నవరాత్రులు ప్రారంభమయ్యే సెప్టెంబర్ నుంచి జియోఫోన్లను డెలివరీ చేయనున్నట్లు జియో వర్గాలు వెల్లడించాయి. జులైలో జరిగిన సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ జియోఫోన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 4జీ తీసుకొచ్చిన ఈఫీచర్ ఫోన్ను ఉచితంగానే అందించనున్నారు. అయితే సెక్యూరిటీ బాండ్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత సంస్థ తిరిగి చెల్లిస్తుంది. ఈ ఫోన్ల ముందస్తు బుకింగ్ను ఆగస్టు 24న ప్రారంభించనున్నారు. అయితే ఆగస్టు 26 ఉదయం ఈ ప్రీ ఆర్డర్లను ఆకస్మాత్తుగా నిలిపివేశారు. అప్పటికే 60 లక్షల మంది పోన్ కోసం బుక్ చేసుకున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో దశ ప్రీ ఆర్డర్లను చేపట్టనున్నట్లు తెలిపింది. | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
'గురు' తర్వాత మరో కొత్త గెటప్లో వెంకీ!
వచ్చే జనవరి నుంచి వెంకీ ఫోకస్ అంతా ఆడాళ్లూ మీకు జోహర్లు మూవీపైకి...
| Updated:
Dec 25, 2016, 08:30AM IST
మారుతున్న కాలం, ఆడియెన్స్ అభిరుచులనిబట్టి అప్‌డేట్ అవుతూ.. దానికి అనుగుణంగానే పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న వెంకీ ప్రస్తుతం గురు మూవీతో బిజీగా వున్నాడు. సాలా ఖడూస్ అనే హిందీ చిత్రానికి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ గురు సినిమాలో వెంకీ ఓ రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో వుండటంతో వచ్చే జనవరి నుంచి వెంకీ ఫోకస్ అంతా కిషోర్ తిరుమల తెరకెక్కించనున్న ఆడాళ్లూ మీకు జోహర్లు మూవీపైకి మళ్లనుంది.
వెంకీ సరసన నిత్యామీనన్ జంటగా నటించనున్న ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మూవీ మేకర్స్ నుంచి అందుతున్న లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఈ సినిమాలో వెంకీ ఓ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వున్న మూవీ యూనిట్ వెంకీ పాత్ర, అతడి న్యూ లుక్ పట్ల ఎటువంటి వివరాలు బహిర్గతం అవకుండా జాగ్రత్తపడుతున్నట్టు సమాచారం. లేదంటే, 'ఆడాళ్లూ మీకు జోహార్లు' ఫస్ట్‌లుక్ పట్ల ఆడియెన్స్‌లో అంత క్యూరియాసిటీ కానీ క్రేజ్ కానీ వుండదు అనేది వారి భయం కాబోలు! | 0business
|
internet vaartha 154 Views
ముంబై : మ్యూచువల్ఫండ్స్ బ్యాంక్ షేర్లలో పెట్టుబడులు సుమారుగా 94 వేల కోట్లకు పెరి గాయి. జూన్నెల చివరినాటికి ఈ పెట్టుబడులు గణనీయంగా పెరిగినట్లు తేలింది. ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు వాణిజ్యబ్యాంకుల ఆస్తి అప్పులపట్టీలను ప్రక్షాళన చేయాలన్న నిర్ణయంతో ఫండ్ సంస్థలకు ధీమా పెరిగినట్లు కనిపిస్తోంది. ఫండ్ మేనేజర్లు బ్యాంకింగ్ రంగ పెట్టుబడులను ఫిబ్రవరి నుంచి ప్రారంభించారు. ఎక్కువ రానిబాకీలు, మొండిబకాయిల కారణంగా అంతకుముందు నవంబరు, జనవరి మాసాలపరంగాచూస్తే మొత్తం పెట్టుబడులు తగ్గించారు. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళన పరంగాచూస్తే ఆర్బిఐ ప్రభుత్వం మొండి బకాయిలను గుర్తించి ముందుగానే తగు కార్యాచరణకు ఆదేశాలిస్తున్నాయి. దీనివల్ల బ్యాంకింగ్రంగం కొంత పటిష్టపడుతుం దన్న అంచనాలు ఫండ్మేనేజర్లలో ఉన్నాయి. ఫలితంగానే బ్యాంకింగ్ రంగంలో 94 వేల కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు వెల్త్ఫోర్స్ డాట్కామ్ వ్యవస్థాపకుడు సిద్ధాంత్జైన్ వెల్లడించారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి మూలధనవనరుల చేకూర్పు కూడా కొంత సానుకూలం చేసింది. వివిధ సగటుశాతంతో పోలి స్తే బ్యాంకింగ్రంగషేర్లు 20.4శాతం ఈక్విటీ నిర్వహణ ఆస్తుల్లో వాటాతోఫండ్ పెట్టుబడులు న్నట్లు అంచనా. అదేమేనెలలో అయితే 20.28 శాతం వాటాతోఉన్నాయి. మొత్తం పెట్టుబడులు 93,885కోట్లుగా ఈక్విటీరంగంలో బ్యాంక్స్టాక్స్ పెట్టు బడులున్నాయి. అంతకుముందునెల మేమాసంలో 90,014 కోట్లుగా ఉన్నాయి. సెబి గణాంకాలను పరిశీలిస్తే బ్యాంకింగ్ రంగానికి ఈక్విటీ ట్రేడింగ్ జనవరిలో 78,644కోట్లు, ఫిబ్రవరిలో 71,864 కోట్లు, మార్చినెలలో 82,198 కోట్లు, ఏప్రిల్నెలలో 85,330 కోట్లు ఫండ్ పెట్టుబడులున్నట్లు అంచనా. ఫండ్మేనేజర్లకు బ్యాంకింగ్ రంగమే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత స్థానం ఐటిరంగానికి ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఈక్విటీపండ్ మేనేజర్లు 41,079 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఫార్మా రంగంలో 34,768కోట్లు, ఆర్థికరంగంలో 31,493కోట్లు ఉన్నాయి. వినియోగరంగ ఉత్పత్తులరంగంలో 27,155కోట్లుగా పెట్టుబడులున్నాయి. కొంతమంది ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను సమీకరించి ఒక నిధిగా ఏర్పాటుచేసి వాటిని స్టాక్స్, బాండ్లు, నగదుమార్కెట్లలో పెట్టుబడులు పెట్టి ఆర్థికవృద్ధికి ట్రేడింగ్ చేస్తారు. | 1entertainment
|
Vaani Pushpa 118 Views Azharuddin , namination
azharuddin
హైదరాబాద్: రెండేళ్ల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ) అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్సిఎ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు అజహర్. ఈనెల 27వ తేదీన జరగనున్న హెచ్సిఎ ఎన్నికల్లో భాగంగా గురువారం అజహర్ నామినేషన్ వేశారు. హెచ్సిఏ క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం. దాంతోనే అధ్యక్ష పదవికి నామినేషన్ వేశా. ప్రతి ఒక్కరి నుంచి సలహాలు తీసుకుంటూ హైదరాబాద్ క్రికెట్ను ఉన్నత స్థానంలో నిలపాలనుకుంటున్నా. జిల్లా స్థాయి క్రికెట్ను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. నాకు విక్రమ్ మాన్సింగ్తో పాటు మాజీ క్రికెటర్లు అర్హద్ అయూబ్, శివలాల్ యాదవ్లు సహకారం ఉందని అజహర్ తెలిపారు. కాగా, మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ ఆర్పి మాన్సింగ్ కుమారుడు విక్రమ్ మాన్సింగ్ వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు.
తాజా క్రీడల వార్తల కోసం క్లిక్ చేయండి..https://www.vaartha.com/news/sports/ | 2sports
|
bse
ఎస్అండ్ఎం క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు జాగ్రత్త!
ముంబయి, ఆగస్టు 22: ఈక్విటీమార్కెట్లలో పెట్టుబ డుల పెట్టిన ఇన్వెస్టర్లు గడచిన నాలుగేళ్లుగా సంతో షంగా ఉన్నారు. స్వల్పకాలంలో కొంత ఊగిసలాట ఉన్నా ఎక్కువగా మాత్రం సానుకూల ధోరణులను మదుపర్లు రాబట్టుకోగలిగారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నిధులు భారీగా కుమ్మరించారు. స్మాల్ అండ్మిడ్క్యాప్ఫండ్స్ను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. వీటిలోనే ఎక్కువ భాగస్వాముల వుతున్నారు. గత మూడేళ్లుగా వీటిలోని పెట్టుబ డులు చేసిన ఇన్వెస్టర్లు భారీ రిటర్నులు కూడా అందుకున్నారు. ఈక్విటీ మ్యూచువల్ఫండ్స్లో స్మాల్క్యాప్, మిడ్క్యాప్ఫండ్స్ వాటా గత నాలు గేళ్లలో రెట్టింపు అయింది. స్మాల్కాప్మిడ్క్యాప్ఫ్డ్ం సగటు రాబడి ఏడాదికాలానికి 18.80శాతం, మూడేళ్లకు 20.02శాతం, ఐదేళ్లకు 24.37శాతం రిటర్నులిస్తున్నాయి. భారీకాప్ఫండ్ సగటు ఏడాదికి 16.01శాతం, మూడేళ్లకు 12.24శాతం, ఐదేళ్లకు 15.64శాతంరిటర్నులుఇస్తాయి. నిఫ్టీసూచి అయితే ఏడాదికి 14.52శాతం, మూడేళ్లకు 9.07శాతం, ఐదేళ్లకు 13.04శాతంరిటర్నులు ఇస్తున్నాయి.
నిఫ్టీ ప్రీఫ్లోట్మిడ్క్యాప్ 100 సూచీల్లో అయితే మొదటి ఏడాదికి 18.68శాతం, మూడేళ్లకు 17.93శాతం, ఐదేళ్లకు 19.26శాతం చొప్పున రిటర్నులు ఇస్తాయని అంచనా. ఈక్విటీ మ్యూచువల్ఫండ్స్ కింద నిర్వహణ ఆస్తుల్లో స్మాల్, మిడ్క్యాప్ఫండ్స్ వాటా జూన్నెలలో 19.96శాతం ఉంటే గతఏడాది డిసెంబరులో 19.30శాతంగా ఉంది. అదే డిసెం బరు 2015లో 17.60శాతం, 2013 డిసెంబరు లో 11.94శాతం, 2012డిసెంబరులో 11.56 శాతం వాటాలున్నాయి. ఈక్విటీ ఇన్వెస్టర్లలో ఎక్కు వగా వీటిపై ఆసక్తి పెరుగుతోంది. రిస్క్తోపాటు ఎంతకాలం పెట్టుబడులు పెడతారన్న అంశాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి స్మాల్,మిడ్క్యాప్ కంపెనీలపట్ల మరింత జాగ్రతఉండాలి. మార్కె ట్లు ప్రతికూలటర్న్ తీసుకుంటే ఈ స్టాక్స్లో భారీ సవరణలు వస్తాయి. ఇన్వెస్టర్ పోర్టు ఫోలియోలోస్మాల్, మిడ్క్యాప్ఫండ్స్ఒక భాగం గా ఖచ్చితంగా ఉండాలి. దీర్ఘకాలంలో సంపద సృష్టిలో ఇవికీలకపాత్ర పోషిస్తాయి. 5-7ఏళ్ల పాటు పెట్టుబడిచేసే ఆలోచన ఉంటే మంచి రాబడులు వస్తాయని, మధ్యకాలికంగా ఊగిస లాటను భరించేలని ఇన్వెస్టర్లు స్వల్పకాలికంగా మాత్రమే పెట్టుబడులుచేయగలవారు భారీకాప్ ఉన్న ఫండ్స్వైపేఉండటం మంచిదనిమార్కెట్ నిపు ణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లూ స్మాల్, మిడ్ క్యాప్లలో పెట్టుబడులు పెట్టేముందు బహుపరాక్. | 1entertainment
|
sumalatha 196 Views fingerprint , WhatsApp
whatsapp
న్యూఢిల్లీ: వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ను యాడ్ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం దీన్ని రిలీజ్ చేసింది. వాట్సాప్ అకౌంట్ను ఇతరులు చూడకుండా…లేదా వాడకుండా ఉండేందుకు ఈ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ పనిచేస్తుంది. యూజర్ల వాట్సాప్ అకౌంట్ భద్రత దృష్ట్యా ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫీచర్లో ఫేస్ రిగక్నైజేషన్ లేదు. స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/ | 1entertainment
|
Suresh 283 Views
బ్రిస్బేన్: టీమిండియా గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో నేడు రెండవ వన్డే ఆడనుంది.కాగా అయిదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా భారీ పరుగులు చేసినా ఓడిపోయింది.ఆస్ట్రేలియా బ్యాటింగ్ను అడ్డుకోలేక చితికిలపడింది.ప్రత్యేకంగా కెప్టెన్ స్టీవ్ స్మిత్,జార్జి బెయిలీలు మూడవ వికెట్కు 242 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా విజయాన్ని అడ్డుకున్నారు.టీమిండియా బ్యాటింగ్లో రోహిత్శర్మ,కోహ్లీలు బాగా ఆడగా,ఆ మ్యాచ్ ద్వారా వన్డేలో అరంగేట్రం చేసిన హర్యానా మీడియం పేసర్ బరీందర్ స్రాన్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం టీమిండియా జట్టు బ్యాటింగ్ విభాగంలో బలంగా కనబడుతున్నా,బౌలింగ్ విషయంలో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు.కాగా టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఫర్వాలేదని పించినా,ఉమేష్ యాదవ్,భువనేశ్వర్ కుమార్ పేస్కు అనుకూలించే పిచ్లో కనీసం ఆడలేదు.తొలి వన్డేలో ఇషాంత్ శర్మను పక్కకు పెట్టడం కూడా ఓటమికి కారణమనే విమర్శలు వినిపించాయి.కాగా నేడు బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండవ వన్డే జరుగనుంది.కీలకమైన రెండవ వన్డేకు భారత పేసర్ ఇషాంత్శర్మ ఆడే అవకాశలు కనిపిస్తున్నాయి.బ్రిస్బేన్ కూడా పెర్త్ మాదిరిగా ఫాస్ట్ పిచ్ కావడంతో ఇషాంత్ను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది.ఇప్పటికే తాను రెండవ వన్డేకు ఫిట్గా ఉన్నట్లు ఇషాంత్ ప్రకటించడంతో అతని ఎంపిక దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.ఒకవేళ ఇషాంత్ను జట్టులోకి తీసుకుంటే భువనేశ్వర్,ఉమేష్యాదవ్లలో ఒకరిని పక్కన పెట్టక తప్పదు.ఇక స్పిన్నర్లలో జడేజా,అశ్విన్ రెండవ వన్డేలో ఆడే అవకాశం ఉంది. | 2sports
|
తగ్గుతున్న ఎంఎఫ్లపై ఆసక్తి
- జనవరిలో 60% పతనం
- గత కొన్ని నెలలుగా ఇదే స్థితి
- మార్కెట్లలో ఒడిదుడుకుల ప్రభావం
ముంబయి : మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ స్కీముల్లో పెట్టుబడుల ఆసక్తి పడిపోతుంది. ప్రస్తుత ఏడాది జనవరిలో ఈ రంగంలో పెట్టుబడులు రూ.6,158 కోట్లకు పడిపోయి.. 24 మాసాల కనిష్ట స్థాయికి దిగజారాయి. కొత్త ఏడాది తొలి మాసంలో స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకున్న తీవ్ర ఒడిదుడుకులు ఎమ్ఎఫ్లపై ప్రతికూల ప్రభావాన్ని పెంచాయి. అదే విధంగా రాజకీయ పరిణామాల్లో అనిశ్చిత్తి పెరగడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసిందని నిపుణులు పేర్కొంటున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (ఎఎంఎఫ్ఐ) రిపోర్టు ప్రకారం.. 2019 జనవరిలో ఎంఎఫ్ల నికర రాకలో తగ్గుదల చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నట్టు పేర్కొంది. క్రితం డిసెంబర్లో ఎంఎఫ్లపై పెట్టుబడులు రూ.6,606 కోట్లుగా నమోదయ్యాయి. ఈ నెల పెట్టుబడులతో పోల్చితే జనవరి నికర ఎంఎఫ్ల నమోదులో 6.7 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. 2018 ఇదే జనవరిలో ఏకంగా ఎంఎఫ్ ఈక్విటీ ఫండ్లలో రూ.15,390 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. దీంతో పోల్చితే 2019 జనవరి పెట్టుబడుల్లో ఏకంగా 60 శాతం పతనం చోటు చేసుకుంది. ఫ్యూర్ ఈక్విటీ ఫండ్స్, ఈక్విటీ లింకుడ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఇఎల్ఎస్ఎస్), టాక్స్ సేవింగ్స్ వెహికల్స్ ఇన్వెస్టింగ్ ప్రెడొమినెంట్లి విభాగాలు ఈక్విటీ ఫండ్ల డేటాలో భాగంగా ఉన్నాయి. ఎఎమ్ఎఫ్ఐ రిపోర్టు ప్రకారం క్రితం జనవరిలో రూ.1,076 కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి.
2019 జనవరిలో ఈక్విటీ ఫండ్ల నుంచి ఇన్వెస్టర్లు రూ.11,397 కోట్లు తిరిగి తీసుకున్నారు. ఇంతక్రితం మాసంలో ఈ మొత్తం రూ.11,234 కోట్లుగా ఉంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలను కఠినతరం చేస్తుందన్న విశ్లేషణలు ఎంఎఫ్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొన్నారు. అదే విధంగా భారత్లో వచ్చే ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లలో చోటు చేసుకుంటున్న తీవ్ర హెచ్చు.. తగ్గులు ఎంఎఫ్లపై కూడా పెట్టుబడుల ఆసక్తిని తగ్గిస్తున్నాయని విశ్లేషించారు. ఎఎమ్పీఐ రిపోర్టు ప్రకారం.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం ఆసక్తి చూపారు. 2019 జనవరిలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సీప్)లో రిటైల్ ఇన్వెస్టర్లు రూ.8,063.67 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇంతక్రితం మాసంలో ఈ మొత్తం రూ.8,022.33 కోట్లుగా నమోద య్యింది. ఎంఎఫ్ల్లో పెట్టుబడిదారులు క్రమ పెట్టుబడుల కోసం సిప్లను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే.
ఆందోళనకరం.. : నిపుణులు
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న అనిశ్చిత్తికి తోడు భారత వృద్ధి రేటుపై రిటైల్ ఇన్వెస్టర్ల అనుమానాలు, స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురి కావడంతో ఎంఎఫ్ల్లో ప్రతికూలత చోటు చేసుకుంటుందని ఎఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ) ఎన్ఎస్ వెంకటేష్ విశ్లేషించారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినందున భవిష్యత్తు వారాల్లో ఈ రంగంలో పెట్టుబడులు పెరుగొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత అనిశ్చితి కొనసాగితే పెట్టుబడుల రాక మరింత తగ్గొచ్చని మోతిలాల్ ఓస్వల్ ఫండ్ సీఈఓ ఆశిష్ సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సిప్ల్లో పెరుగుదల చోటు చేసుకున్నప్పటికీ.. స్థూలంగా ఎంఎఫ్ల్లో పెట్టుబడులు తగ్గుతున్నాయన్నారు. ఈక్విటీల్లో క్రమంగా తగ్గుదల వల్ల అవకాశాలను ప్రతికూలతలోకి నెట్టుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పేలవమైన ప్రగతి, మోసపూరిత ఫండ్ల విక్రయాలు, తక్కువ కమిషన్లు ఎంఎఫ్లపై ఆసక్తిని తగ్గించడానికి ప్రధాన కారణాలని తెలిపారు. భవిష్యత్తు రాబడిపై అనిశ్చిత్తి, ఫండ్లపై తక్కువ రాబడి కూడా ఎంఎఫ్లపై ప్రభావం చూపుతున్నాయని ప్లాన్ ఎహెడ్ ఫైనాన్సీయల్ అడ్వైజర్ విశాల్ ధావన్ పేర్కొన్నారు. విదేశీ మదుపర్లు భారత మార్కెట్ల నుంచి 2018లో 4,557.39 మిలియన్ డాలర్ల విలువ చేసే ఈక్విటీలను తరలించుకుపోయారు. క్రితం ఒక్క జనవరిలో 75.35 మిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయి. ఈ ప్రభావం ఎంఎఫ్లపై పడిందని ధావన్ విశ్లేషించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
DHAWAN
నా ఓటములే నన్ను రాటు తేల్చాయి
దంబుల్లా: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత ఆటగాడు శిఖర్ దావన్ 90బంతుల్లో 132 పరుగులతో నాటౌట్గా నిలిచిన సంగతి తెలిసిందే. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శిఖర్ మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇటీవల వరుస ఇన్నింగ్స్ల్లో రాణిస్తోన్న అతను…గతంలో జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో….ఓటముల నుంచి ఎంతో నేర్చుకున్నట్లు తెలిపాడు. ఫెయిల్యూర్స్ రాటుతేల్చినట్లు చెప్పాడు. ఓటములే మనకు భవిష్యత్తులో రాణించేందుకు ముఖ్యమైన పాఠాలు నేర్పుతాయని తెలిపాడు. తొలి వన్డే అనంతరం శిఖర్ మీడియాతో మాట్లాడుతూ….గత ఏడాది న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో నేను మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. దీంతో జట్టులో నుంచి స్థానం కోల్పోవల్చి వచ్చింది. కాస్త విరామం తర్వాత ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో జట్టులో స్థానం దక్కించుకోగలిగాను.
ఈ టోర్నీలో నా ప్రదర్శనకు మంచి మార్కులే పడ్డాయి. భవిష్యత్తులోనూ ఇదే ప్రదర్శననే కొనసాగించాలని అనుకుంటున్నాను. 2019లో ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ఇంకా ఎంతో సమయం ఉంది. ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేయాలన్నది నా లక్ష్యం. అందుకే ఇదంతా…ఒక వేళ నేను మంచి ప్రదర్శన చేయలేకపోతే నా స్థానంలో మరో బ్యాట్స్మెన్ చోటు దక్కించుకోవడం ఖాయమన్నాడు. ఓటములు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఇప్పటికే వాటి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయిన సమయం నాకెంతో కఠినమైనది.
ఇప్పుడు దాని నుంచి బయిటకి వచ్చేశాను కాబట్టి మరోసారి ఆలోచించాలని అనుకోవట్లేదు. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్పై శతకం సాధించాను. అప్పుడు ఏ ఫామ్లో ఆడానో ఇప్పుడు అదే ఫామ్లో ఆడుతున్నా. మ్యాచ్కి ముందు లక్ష్యాలను ఏర్పరుచుకోను. కేవలం ఫిట్నెస్, ఫీల్డింగ్, స్కిల్స్పైనే ఎక్కువగా దృష్టిపెడతా అని తెలిపాడు. శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభాన్ని చూసి ఆ జట్టు 300కిపైగా పరుగులు సాధిస్తుందని భావించా. కానీ స్వల్ఫ విరామంలో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆజట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. మరిన్ని మ్యాచ్ల ద్వారా వారు త్వరలోనే అనుభవం సాధిస్తారు. విశ్వ ఫెర్నాండో బౌలింగ్ ప్రదర్శనపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను. అతనో మంచి బౌలర్. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతన్ని ఎదుర్కొన్నాను అని ధావన్ వివరించాడు. | 2sports
|
Visit Site
Recommended byColombia
‘జీవితకాల అధ్యక్షుడి పదవితో నన్ను గౌరవించిన భారత ఒలింపిక్ సంఘానికి కృతజ్ఞతలు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఈ గౌరవాన్ని స్వీకరించాలనుకోవట్లేదు’ అని ఐఓఏ అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్‌కు రాసిన లేఖలో కల్మాడీ పేర్కొన్నారు.
మంగళవారం చెన్నైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో కల్మాడీతో పాటు వివాదాస్పద మాజీ అధ్యక్షుడు అభయ్‌ సింగ్‌ చౌతాలాను జీవికాల అధ్యక్ష పదవితో ఐఓఏ గౌరవించింది. కల్మాడీ 1996-2011 మధ్య సుదీర్ఘ కాలం ఐఓఏకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. అతను పదవిలో ఉండగానే 2010 నాటి కామన్వెల్త్‌ క్రీడల కుంభకోణం బయటికి వచ్చింది. ఈ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కల్మాడీ, పది నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. కల్మాడీ తర్వాత 2012-14 మధ్య కాలంలో ఐఓఏ అధ్యక్షుడిగా ఉన్న చౌతాలా మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.