news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Hyderabad, First Published 27, Sep 2018, 12:54 PM IST Highlights మహానటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ పై శ్రీ రెడీ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేసింది. ఇప్పుడు నీ టైమ్ బావున్నందుకు మేఘాల్లో తేలుతున్నావ్. ఎప్పుడో ఒకసారి స్ట్రగులర్స్ బాధ ఏమిటో నీకు అర్థమవుతుందని కీర్తి నవ్విన వెకిలి నవ్వును తాను ఎన్నటికీ మర్చిపోలేను అని పేర్కొంది.  క్యాస్టింగ్ కౌచ్ పై మొదట్లో పోరాటం చేసిన శ్రీ రెడ్డి ఆ తరువాత పాలిటిక్స్ లో భాగంగా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసి ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె పూర్తిగా కోలీవుడ్ పై ద్రుష్టి పెట్టారు. అయితే మహానటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ పై శ్రీ రెడీ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేసింది.  ఇప్పుడు నీ టైమ్ బావున్నందుకు మేఘాల్లో తేలుతున్నావ్. ఎప్పుడో ఒకసారి స్ట్రగులర్స్ బాధ ఏమిటో నీకు అర్థమవుతుందని కీర్తి నవ్విన వెకిలి నవ్వును తాను ఎన్నటికీ మర్చిపోలేను అని పేర్కొంది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. రీసెంట్ గా పందెంకోడి 2 ఆడియో వేడుకలో విశాల్ శ్రీ రెడ్డి గురించి మాట్లాడాడు. ఆమెతో పని చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉంటె మంచిది. శ్రీ రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటూ అవకాశాలు దక్కించుకోవడం మంచి పరిణామం. కాకపోతే ఆమెతో ఉన్నవారు సేఫ్టీగా కెమెరాలను ఉంచుకోవడం బెటర్. అలా ఉంటె శ్రీ రెడ్డికి కూడా ఆటోమేటిక్ గా రక్షణ కల్పించినట్లే అని విశాల్ పేర్కొన్నారు.  దీంతో ఆ వేడుకలో ఉన్న వారందరు విశాల్ స్పీచ్ కు నవ్వేశారు. అందులో కీర్తి సురేష్ కూడా ఉన్నారు. ఆమె నవ్వడంపై శ్రీ రెడ్డి డిఫెరెంట్ గా కామెంట్ చేశారు. కీర్తి సురేష్ నవ్వును చుసిన తరువాత అసహ్యం వేసింది. నీ టైమ్ బావుందని మేఘాల్లో తేలుతున్నావ్. ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకోకు. స్ట్రగులర్స్ బాదేంటో ఎదో ఒకరోజు నీకు తెలుస్తుంది. నువ్వు నవ్విన వెకిలి నవ్వును నేను ఎప్పటికి మరచిపోలేనని శ్రీ రెడ్డి వివరించారు.
0business
Hyderabad, First Published 16, Aug 2019, 12:22 PM IST Highlights మహేష్‌బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లో బండ్ల గణేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇఫ్పటికే ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ని కాశ్మీర్‌లో విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్ లో షూట్ జరుగుతోంది.ఇక ఈ షెడ్యూల్ లో రవితేజ వెంకీ సినిమా తరహాలో ఓ ట్రెయిన్ ఎపిసోడ్ ఫన్నీగా నడవనుంది. నటన వదిలి పాలిటిక్స్ లోకి వచ్చి రచ్చ రచ్చ చేసిన నటుడు బండ్ల గణేష్. అయితే ఆయన ట్రిక్స్ ఏమీ రాజకీయాల్లో ఫలించలేదు. దాంతో తిరిగి మళ్లీ తను మొదలైన చోటకే అంటే నటనకే వచ్చేసారు.చాలా గ్యాప్  తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు.  మహేష్‌బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లో బండ్ల గణేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇఫ్పటికే ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ని కాశ్మీర్‌లో విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్ లో షూట్ జరుగుతోంది. ఇక ఈ షెడ్యూల్ లో రవితేజ వెంకీ సినిమా తరహాలో ఓ ట్రెయిన్ ఎపిసోడ్ ఫన్నీగా నడవనుంది. ఈ ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ కాకుండా బండ్ల గణేష్ పై పూర్తి కామెడి చేయనున్నారు.   ఈ చిత్రంలో బండ్ల గణేష్ పాత్ర పేరు బ్లేడ్ గణేష్ అని వినిపిస్తోంది. బండ్ల గణేష్ పాత్ర ఓ కోటిశ్వరుడు కొడుకు క్యారక్టర్ అని, అతనికి విపరీతమైన డబ్బు ఉన్నా..బుర్ర మాత్రం ఉండదని..ఆ పాత్రలో గణేష్ చేసే చేష్టలు తెగ నవ్విస్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్‌ నటి విజయశాంతి మరో కీలక పాత్రలో నటించనున్నారు. రష్మికా హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిసారి ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్‌బాబు నటిస్తున్నారీ సినిమాలో.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. Last Updated 16, Aug 2019, 12:22 PM IST
0business
"ఏంజెల్" టీజర్ లాంఛ్ చేసిన వి.వి.వినాయక్ Highlights ఏంజెల్ టీజర్ లాంఛ్ చేసిన వి.వి.వినాయక్   శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి నిర్మాణ సారధ్యంలో యంగ్ హీరో నాగ అన్వేశ్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ఏంజెల్. దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఓ అద్భుతమైన సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లాంఛ్ తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.   ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా హాజరై సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ, సింధూరపువ్వ కృష్ణారెడ్డి గారితో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం ఏంజెల్ కోసం చాలా కష్టపడ్డారని, ఈ సినిమాకి మొదటి నుంచి తన సహాయ సహాకారులు అందిస్తున్నట్లుగా తెలిపారు. కథ విన్న వెంటనే తనకి చాలా ఆశక్తిగా అనిపించి కృష్ణారెడ్డిగారిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయాల్సిందిగా కోరినట్లుగా తెలిపారు. అలానే హీరో నాగా అన్వేష్ చిన్నప్పటి నుంచి నటన పైనే ధ్యాస పెడుతూ చిత్ర సీమలో ఒక్కో మొట్టు పైకి ఎక్కుతున్నాడని, ఈ సినిమా కచ్ఛితంగా అన్వేష్ కెరీర్ ని ఓ కీలక మలుపు తిప్పుతొందని అన్నారు.   వినాయక్ తో పాటు ఈ కార్యక్రమంలో ఏంజెల్ నిర్మాత భువన్ సాగర్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బా పటేల్, సింధూరపువ్వు కృష్ణరెడ్డి, సప్తగిరి, తదితరులు పాల్గొన్నారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV విరుష్క రిసెప్షన్‌కి శ్రీలంక టీమ్ డుమ్మా..? భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వచ్చే మంగళవారం ముంబయిలో ఇవ్వనున్న వివాహ విందుకి శ్రీలంక క్రికెటర్లు దూరంకానున్నారు. భారత్‌తో TNN | Updated: Dec 23, 2017, 05:28PM IST విరుష్క రిసెప్షన్‌కి శ్రీలంక టీమ్ డుమ్మా..? భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వచ్చే మంగళవారం ముంబయిలో ఇవ్వనున్న వివాహ విందుకి శ్రీలంక క్రికెటర్లు దూరంకానున్నారు. భారత్‌తో ప్రస్తుతం టీ20 సిరీస్ ఆడుతున్న శ్రీలంక జట్టు చివరి టీ20 మ్యాచ్‌ని ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి ఆడనుంది. సుదీర్ఘ సిరీస్‌లో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో సోమవారం ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుని.. మంగళవారం విందుకి హాజరవుతారనే ఉద్దేశంతో కోహ్లి ప్లాన్ చేశాడు. కానీ.. శ్రీలంక క్రికెటర్లు సోమవారమే భారత్‌ని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2sports
ఐవీఆర్‌సీఎల్‌కు రూ. 478 కోట్ల కాంట్రాక్ట్ హైదరాబాద్ (ఏజెన్సీ)| WD| ప్రముఖ కట్టడ నిర్మాణ సంస్థ ఐవీఆర్‌సీఎల్‌ మధ్యప్రదేశ్‌లోని సనవాడ్ జిల్లాలో ఇందిరా సాగర్ ప్రాజెక్టు మూడో దశలో భాగంగా ఒక కాలువను నిర్మించే కాంట్రాక్టును కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని ఐవీఆర్‌సీఎల్ స్థానిక ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నర్మదా వేలీ డెవలప్‌‍మెంట్ అథారిటీ ద్వారా పొందిన ఈ కాంట్రాక్టు విలువ రూ. 478.48 కోట్లు అని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందిరా సాగర్ ప్రాజెక్టు నిర్మాణపనులను చేపట్టడంతో, తాము భారీ ఆర్డర్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా మరిన్ని కాంట్రాక్ట్‌లను చేజిక్కించుకునే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. సంబంధిత వార్తలు
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సఫారీలను 286కే కుప్పకూల్చిన భారత్ దక్షిణాఫ్రికా పర్యటన ఆరంభంలోనే భారత బౌలర్లు సత్తాచాటారు. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో TNN | Updated: Jan 5, 2018, 08:50PM IST సఫారీలను 286కే కుప్పకూల్చిన భారత్ దక్షిణాఫ్రికా పర్యటన ఆరంభంలోనే భారత బౌలర్లు సత్తాచాటారు. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాని తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకే కుప్పకూల్చారు. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (4/87) మ్యాచ్ తొలి సెషన్‌లోనే వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి.. సఫారీలను ఒత్తిడిలోకి నెట్టేయగా.. చివరి సెషన్‌లో అశ్విన్ (2/21) ఆ జట్టుని ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఏబీ డివిలియర్స్ (65: 84 బంతుల్లో 11x4), డుప్లెసిస్ (62: 104 బంతుల్లో 12x4) అర్ధ శతకాలతో సఫారీ పరువు నిలపగా.. దూకుడుతో డికాక్ (43: 40 బంతుల్లో 7x4) కాసేపు స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 73.1 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా 286 పరుగుల వద్ద ఆలౌటైంది. పేస్ స్వర్గధామమైన పిచ్‌పై భారత్ బౌలర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారోనని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకి ఆరంభంలోనే భువనేశ్వర్ కుమార్ వరుస వికెట్లతో ఉత్సాహం నింపాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ డీన్ ఎల్గర్‌ని డకౌట్‌గా పెవిలియన్‌కి పంపిన భువనేశ్వర్.. తర్వాత తానేసిన మూడో ఓవర్‌లో మరో ఓపెనర్ మక్రమ్(5)ని, ఐదో ఓవర్‌లో హసీమ్ ఆమ్లా(3)ని వరుసగా పెవిలియన్ బాట పట్టించాడు. భువీ వేసిన అవుట్ స్వింగర్ బంతులకి సఫారీ ఓపెనర్ల వద్ద సమాధానమే లేకపోయింది. దీంతో ఆ జట్టు ఆదిలోనే 12/3తో ఒత్తిడిలో పడింది. ఈ దశలో కెప్టెన్ డుప్లెసిస్‌తో కలిసి ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా జట్టుని శతక భాగస్వామ్యంతో ఆదుకున్నాడు. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడినా.. ఈ జోడి మహ్మద్ షమీ బౌలింగ్‌ని లక్ష్యంగా చేసుకుని వరుస బౌండరీలు బాదేసింది. ఈ క్రమంలోనే నాలుగో వికెట్‌కి అభేద్యంగా 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో సఫారీ జట్టు కోలుకుంది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని జస్‌ప్రీత్ బుమ్రా విడదీశాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న బుమ్రా విసిరిన బంతిని అడ్డుకునే ప్రయత్నంలో ఏబీ డివిలియర్స్ క్లీన్ బౌల్డయ్యాడు. అనంతరం కొద్దిసేపటికే కెప్టెన్ డుప్లెసిస్‌ని హార్దిక్ పాండ్య ఔట్ చేయడంతో మళ్లీ ఆతిథ్య జట్టులో తడబాటు మొదలైంది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో డికాక్ మెరుపులు మెరిపించినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతడ్ని భువనేశ్వర్ తన అవుట్ స్వింగర్‌తో పెవిలియన్ బాట పట్టించాడు. చివర్లో మహరాజ్ (35: 47 బంతుల్లో 3x4, 1x6) అశ్విన్ బౌలింగ్‌ని లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడినా.. లేని పరుగు కోసం ప్రయత్నించి అశ్విన్ చేతిలోనే రనౌటయ్యాడు. రబాడ (26), స్టెయిన్ (16), మోర్నీ మోర్కెల్ కాసేపు భారత బౌలర్లని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
నోబుల్ స్టార్ నారా రోహిత్  విడుదల చేసిన "పెంపక్" టీజర్ !! Highlights అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్న చిన్న చిత్రం "పెంపక్" టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్న నారా రోహిత్ చంద్రకాంత్-రాధికా మెహరోత్రా-పల్లవి డోరా హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు ఇటీవల కాలంలో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్న చిన్న చిత్రం "పెంపక్" (ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం). థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురాం రొయ్యూరు తో కలిసి స్వీయ దర్శకత్వంలో గోవర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చంద్రకాంత్-రాధికా మెహరోత్రా-పల్లవి డోరా హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ నోబుల్ స్టార్ నారా రోహిత్ విడుదల చేసి, చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని.. సినిమా మంచి హిట్టవ్వాలని కోరుకుంటున్నానని నారా రోహిత్ అన్నారు.  ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల జరుపుకోనున్న "పెంపక్" ఫస్ట్ సింగిల్ ప్రముఖ దర్శకులు పూరి జగన్నాధ్ రిలీజ్ చేయగా.. రెండో పాటను మరో ప్రముఖ దర్శకులు మారుతి విడుదల చేశారు. మూడో పాటను బిగ్ ఎఫ్ ఎంలో లాంచ్ చేశారు.  తమ చిత్రం టీజర్ నారా రోహిత్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని.. తమందరికీ ఈ చిత్రం మంచి లైఫ్ ఇస్తుందనే నమ్మకం ఉందని దర్శక నిర్మాత గోవర్ధన్, హీరో చంద్రకాంత్, హీరోయిన్స్ రాధికా మెహరోత్రా, పల్లవి డోరా అన్నారు. ఈ వారంలో ఆడియో రిలీజ్ చేసి, సెప్టెంబర్ 15న తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు!!! Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
Aug 15,2017 గాయత్రీ ఫలితాలు ఆకర్షణీయం హైదరాబాద్‌: గాయత్రీ ప్రాజెక్ట్స్‌ జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ నిర్మాణ సంస్థ ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో సంస్థ స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ.45 కోట్ల మేర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.16.14 కోట్లుగా నిలిచిం ది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో సంస్థ మొత్తం ఆదాయం రూ.439.86 కోట్ల నుంచి రూ.659.78 కోట్లకు చేరింది. అంతకు ముందు మార్చితో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.2,128 కోట్ల ఆదాయంపై రూ. 74.53 కోట్ల లాభాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Sehwag Calls It an Honour to Have a Gate Named After Him at Kotla స్టేడియంలో గేట్‌పై సెహ్వాగ్ ఉద్వేగం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని ఒక గేట్‌కి భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు పెట్టే కార్యక్రమం మంగళవారం పూర్తయింది. TNN | Updated: Oct 31, 2017, 04:44PM IST ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని ఒక గేట్‌కి భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు పెట్టే కార్యక్రమం మంగళవారం పూర్తయింది. భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం తొలి టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) పూర్తి చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వీరేంద్ర సెహ్వాగ్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని ఒక గేట్‌కి నా పేరు పెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్‌ నేర్చుకునే దశలో ఈ గేట్ నుంచే మైదానంలోకి నేను ప్రవేశించడం నాకింకా గుర్తుంది. ఢిల్లీ నుంచి గొప్ప స్థాయికి ఎదిగిన క్రికెటర్ల పేర్లను స్టేడియంలోని స్టాండ్స్, పెవిలియన్లకి పెట్టారు. కానీ.. ఒక గేట్‌కి మాజీ క్రికెటర్ పేరు పెట్టడం యాదృచ్చికం.. డీడీసీఏకి థ్యాంక్స్’ అని సెహ్వాగ్ ఉద్వేగంగా మాట్లాడాడు. యువ క్రికెటర్లు తన పేరుతో ఉన్న గేట్‌ని చూసి.. స్ఫూర్తి పొంది ఉన్నత స్థాయికి ఎదగాలని కాంక్షిస్తున్నట్లు ఈ మాజీ క్రికెటర్ వివరించాడు.
2sports
internet vaartha 145 Views ఐటి, ఫార్మారంగ కంపెనీల ఒత్తిడి ముంబై : మార్కెట్లు నష్టాల్లోముగిసాయి. నిఫ్టీ 8200 స్థాయిని దాటింది. నీరసించిన యూరోపియన్‌ మార్కెట్ల ప్రభావం ఎక్కువ కనిపించింది. సెన్సెక్స్‌ గడచిన మూడు వారాలస్థాయికంటే భారీ పతనం చవిచూసింది. ఐటిరంగ కంపెనీల్లోనే అమ్మకాల వత్తిడి ఎక్కువగా ఉంది. ఇన్ఫోసిస్‌, హెచ్‌డిఎఫ్‌సి, ఫార్మా రంగ కంపెనీల షేర్లు ఎక్కువ వత్తిడితెచ్చాయి. హీరోమోటోకార్ప్‌, ఇన్ఫోసిస్‌, ఐటిసి, డా.రెడ్డిస్‌ ల్యాబ్స్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డిఎఫ్‌సి వంట ివి 2-4శాతం క్షీణించాయి. ఒఎన్‌జిసి, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,సిప్లా, ఎన్‌టిపిసి టాటాస్టీల్‌ వంటివి 1నుంచి 3శాతం పెరిగాయి. టాటాపవర్‌ కంపెనీ 77 రూపాయలు, ఎన్‌టిపిసి 152, పవర్‌గ్రిడ్‌కార్పొరేషన్‌ 154 ఊపాయలు వద్ద ముగిసాయి. 52వారాల గరిష్టస్థాయిలో ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో కూడా కొంతపెరిగినట్లు కనిపించింది. గ్రాన్యూల్స్‌ కంపెనీ రెండుశాతంపెరిగి 143గా కొనసాగింది. ఆల్ఫాజియో 52వారాలగరిష్టంగా 861వద్ద ముగిసింది. నాలుగురోజుల ర్యాలీ కొనసాగింది. బిఎస్‌ఇ సెన్సెక్‌్‌స 257 పాయింట్లు దిగజారి 26,783 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50 సూచీ 69 పాయింట్లు క్షీణించి 8204 పాయింట్లవద్ద ట్రేడింగ్‌ముగించింది. మిడ్‌క్యాప్‌ 0.5శాతం దిగజారింది. స్మాల్‌క్యాప్‌ సూచీ నిలకడగా కొనసాగింది. మొత్తంగాచూస్తే 1332 కంపెనీలు నష్టాల్లో మునిగితే 1233 కంపెనీలకు లాభాలు వచ్చాయి. ఇన్ఫోసిస్‌ నాలుగుశాతం క్షీణించింది. విద్యుత్‌రంగ షేర్లు ఇంధనరంగ షేర్లు లాభాల్లో ముగిసాయి. ముడిచమురుధరల ఆధారంగా వీటిట్రేడింగ్‌ ఝరిగింది. రిలయన్స్‌, ఒఎన్‌జిసి 1.7 నుంచి 2శాతంచొప్పున పెరిగాయి. ఎఫ్‌ఎంసిజి మేజర్‌ సంస్థలు ఐటిసి, హిందూస్థాన్‌ యూనిలీవర్‌ రుతుపవనాల రాకపై ఆధారపడి ట్రేడింగ్‌ జరిగిది. ఐటిసి, హెచ్‌యుఎల్‌ రెండుశాతం చొప్పున దిగజారాయి. లూపిన్‌ 54 డోసుల యాంటీ బ్యాక్టీరియా ఇంజక్షన్‌ను రీకాల్‌చేస్తోంది. ఉత్పత్తి నిబంధనలు ఉల్లంఘించిందన్న అభియోగాలపై వీటిని వెనక్కు పిలుస్తోంది. సన్‌ఫార్మా, సిప్లా ంటివి 0.6 నుంచి 1.6శాతం చొప్పున పెరిగాయి. డాక్టర్‌ రెడ్డిస్‌ ల్యాబ్స్‌ 1.7శాతం దిగజారింది. విప్రో సంస్థ స్వల్పలాభాలతో ముగిసింది. మౌంటెన్‌ వ్యూకేంద్రంగా ఉన్న ఆథెంటిస్‌ ఇంక్‌ 3డి ప్రిటింగ్‌ టెక్నాలజీ కన్సల్టింగ్‌ సేవల సంస్థతో భాగస్వామ్యం తీసుకుంది. ప్రభుత్వరంగంలోని ఎంఎంటిసి, స్టేట్‌ట్రేడింగ్‌కార్పొరేసన్‌, హిందూస్థాన్‌ కాపర్‌, ఐటిఐ, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, హెచ్‌ఎంటి వంటివి ఏడుశాతం చొప్పున పెరిగాయి. భారత్‌పెట్రోలియం కార్పొరేషన్‌ 2.5శాతం పెరిగింది. ఆర్‌బిఐ విదేశీ సంసథల పెట్టుబడుల పరిమితిని 49శాతంకు పెంచడమే ఇందుకు కీలకం.
1entertainment
Hyderabad, First Published 5, Sep 2019, 10:34 AM IST Highlights ఆన్‌లైన్‌ ఆహార సేవల సంస్థ స్విగ్గీ తమ వ్యాపార సేవల విస్తృతిని విస్తరించింది. పికప్‌ అండ్‌ డ్రాప్‌ సేవలను అందిజేస్తామనిస్విగ్గీ తెలిపింది. బెంగళూరు: ఆన్‌లైన్‌ ఆహార సేవల సంస్థ స్విగ్గీ తమ వ్యాపార సేవల విస్తృతిని విస్తరించింది. ‘స్విగ్గీ గో’ పేరుతో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. స్విగ్గీగో విభాగం ద్వారా పికప్‌ అండ్‌ డ్రాప్‌ సేవలను అందిజేస్తామనిస్విగ్గీ తెలిపింది. స్విగ్గీ గోలో భాగంగా ఇంట్లో లంచ్‌ బాక్స్‌ను ఆఫీసుల వద్ద అందజేయడం, పత్రాలు, పార్శిల్స్‌ డెలివరీ చేయడం వంటి సేవలను అందించనున్నది. మరో రెండు వారాల్లో హైదరాబాద్ నగర పరిధిలో ‘స్విగ్గీ గో’ సేవలను ప్రారంభించనున్నది.  నిత్యావసర వస్తువులు, పూలు, మందులు వంటి వాటిని కూడా గంటలోపే డోర్‌డెలివరీ సేవలను అందించేలా స్విగ్గీగో నెట్‌వర్క్‌ను రూపొందించారు. ప్రధాన యాప్ లో భాగంగానే స్విగ్గీ గో పని చేస్తుంది. పట్టణ వాసులకు నాణ్యమైన, సౌకర్యవంతమైన జీవనశైలిని చేరువ చేయడంతో భాగంగా ఈ కొత్త సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టుగా సంస్థ సీఈవో శ్రీహర్షా మాజేటీ తెలిపారు. ఐదేళ్లుగా ఆహార పంపిణీలో సేవలు అందిస్తున్న తమ సంస్థ తాజాగా డోర్‌డెలివరీ సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందని అన్నారు.  2020 నాటికి బెంగళూరు, హైదరాబాద్ నగరాల పరిధిలో ఈ సేవలను పూర్తిగా విస్తరిస్తామని శ్రీహర్షా మాజేటీ  చెప్పారు. మొత్తం 300 పట్టణాలకు వీటిని చేరువ చేయన్నుట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో తమ సంస్థ మొత్తం 200 సంస్థలతో జట్టుకట్టిందని వీటిలో రత్నదీప్‌, ఘనశామ్‌, స్నేహా చికెన్‌, యల్లో అండ్ గ్రీన్, 24 ఆర్గానిక్ మంత్రా వంటి సంస్థలు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే బెంగళూరులో 300 మంది వ్యాపారులు స్విగ్గీతో జత కట్టారు. వీరిలో గోద్రేజ్ నేచర్ బాస్కెట్, నీల్ గిరీస్, ఆర్గానిక్ వరల్డ్, హెడ్అప్, టెయిల్స్ అండ్ నందూస్ చికెన్ తదితర సంస్థలు ఉన్నాయి. గుర్ గ్రామ్ నుంచి స్విగ్గీ స్టోర్స్ ప్రారంభించిన ఆరు నెలల్లోపే డెలివరీ సేవల్లోకి అడుగిడుతున్నది. ఏ రోజుకారోజు ‘స్విగ్గీ గో’ యాప్‌లో సభ్యత్వం కోసం స్టోర్టు ముందుకు వస్తున్నాయని శ్రీ హర్షా మాజేటీ చెప్పారు.  Last Updated 5, Sep 2019, 10:36 AM IST
1entertainment
26 శాతం కుంగిన ఎన్‌సీసీ లాభాలు - రూ.0.40 డివిడెండ్‌ ప్రకటించిన కంపెనీ హైదరాబాద్‌ : హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన త్రైమాసికానికి నిరుత్సా హకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో సంస్థ లాభం 26% శాతం మేర కుంగి రూ.86.22 కోట్ల నుంచి రూ.63.71 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌సీసీ మొత్తం ఆదాయం రూ.2529 కోట్ల నుంచి రూ.2187 కోట్లకు కుంగింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంస్థ మొత్తం టర్నోవర్‌ రూ.8,549 కోట్ల నుంచి రూ.8032 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో సంస్థ నికర లాభం కూడా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.240 నుంచి రూ.225.50 కోట్లుగా నమోదు అయింది. రూ.2 ముఖవిలువ కలిగిన షేరు ఒక్కింటికి రూ.0.40 (20%) డివిడెండ్‌ను చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమ్మతి తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Feb 13,2019 నష్టాల్లోంచి తేరుకోని మార్కెట్లు ముంబయి: వరుసగా నాలుగో రోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం పలు సూక్ష్మ గణాంకాలు వెలువడనున్న నేపథ్యలో మార్కెట్లో మదుపరులు అప్రమత్తంగా ట్రేడింగ్‌ నిర్వహించారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ, ద్రవ్యోల్బణం సూచీలపై ప్రతికూల వార్తల నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికి తోడు భారత బ్యాంకింగేతర విత్త సంస్థల ప్రగతిపై నెలకొన్న అనుమానాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 241.41 పాయింట్లు పతనమై 36,153.62కు పడిపోయింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 57.40 పాయింట్లు (0.43 శాతం) తగ్గి 10,831 పాయింట్ల వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 204 Views హైదరాబాద్‌ : ఎఫ్‌అండ్‌డి కంపెనీ కొత్తగా బ్లూటూత్‌ సౌండ్‌ బార్‌, వైర్లెస్‌సబ్‌ వూఫర్‌తోటివిలకు అనుసంధానించేవీలుగా సౌండ్‌ బార్‌లను ప్రవేశపెట్టింది. టి388 మంచి డిజైన్‌ అత్యుత్తమ క్వాలిటీ, అధ్భుతమైన శబ్దంతోపనిచేస్తోంది. పవర్‌కనెక్షన్‌ రాగానే ముందుగ్రిల్‌ ద్వారా స్క్రోలింగ్‌ డిస్‌ప్లే కనిపిస్తుంది. టి388 అనేది సబ్‌వూఫర్‌తో మిళితం అయిన కాంపాక్ట్‌ స్పీకర్‌ బార్‌. రెండంగుళాల ఫుల్‌రేంజ్‌డ్రేవర్‌, ఎనిమిది అంగుళాల డ్రైవర్‌తో టి388 సౌండ్‌బార్‌ పనిచేస్తుంది. ఆడియో డైరెక్టర్‌ రాజేష్‌ బన్సాల్‌ మాట్లాడుతూ నేటి గాడ్జెట్స్‌తో కలిసి వినియోగించుకునేందుకు వీలైన శక్తి సామర్ధ్యాలను సౌండ్‌బార్స్‌ అందిస్తాయని మార్కెట్‌లో మంచి స్పందన ఉందన్నారు. వీటిధరలు రూ.12,990లుగా ప్రకటించారు. అనిన ప్రముఖ రిటైల్‌స్టోర్లు, ఇ-కామర్స్‌ పోర్టల్స్‌పై లభిస్తాయి.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఇంత చెత్తగానా.. మన బ్యాంకుల సేవలు! ఆర్‌బీఐ వద్దకు కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి ఆర్‌టీఐ యాక్ట్ ద్వారా.. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలుసుకునే ప్రయత్నం చేయగా.. విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకింగ్ సేవల్లో నాణ్యత నానాటికీ దిగజారుతోందని, తమ గురించి అవి ఏమాత్రం పట్టించుకోవడంలేదనేది వినియోగదారుల ప్రధాన ఆరోపణ.. TNN | Updated: Sep 18, 2017, 05:04PM IST ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఆ సేవలూ.. ఈ సేవలూ అంటూ ఊదరగొడుతున్న బ్యాంకులు.. కస్టమర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఆ బ్యాంకూ.. ఈ బ్యాంకూ అని కాకుండా.. దేశంలోని అన్ని బ్యాంకుల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ఆర్‌బీఐ వద్దకు కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి ఆర్‌టీఐ యాక్ట్ ద్వారా.. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలుసుకునే ప్రయత్నం చేయగా.. విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకింగ్ సేవల్లో నాణ్యత నానాటికీ దిగజారుతోందని, తమ గురించి అవి ఏమాత్రం పట్టించుకోవడంలేదనేది వినియోగదారుల ప్రధాన ఆరోపణ. 2016 జనవరి 1 నుంచి 2017 జనవరి 1 వరకు దేశంలోని వివిధ బ్యాంక్ ఖాతాదారుల నుంచి ఆర్‌బీఐకి మొత్తం 1,24,477 ఫిర్యాదులు అందాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో 77,162 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినవి కాగా.. 47,315 ప్రైవేట్ బ్యాంక్‌లకు చెందినవి.
1entertainment
ipl panjab బెంగళూరుపై పంజాబ్‌ విజయం ఇండోర్‌:ఐపిఎల్‌-10 సీజన్‌లో ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది.ఆ తరువాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌ కు దిగి 14.3 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.దీంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు నిలకడగా ఆడింది.ఓపెనర్లకు మాక్స్‌వెల్‌ ఆట తీరు సహకరించడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సులువైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు స్కోరు 22 పరుగుల లోపు కెప్టెన్‌ వాట్సన్‌ 1 పరుగు వద్ద, విష్ణు వినోద్‌ 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చెరిపోయారు. దీంతో 360 డిగ్రీ బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌ 46 బంతులు ఆడి 3 బౌండరీలు,9 సిక్సర్లతో 89 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు.మొదట నిలకడగా ఆడిన డివిలియర్స్‌ ఆఖరి మూడు ఓవర్లలో పంజాబ్‌ బౌలింగ్‌ను వూచకోత కోశాడు.బంతులు ఎక్కడ వేసినా వేటాడి మరీ సిక్సర్లు బాదాడు. పదిహేడో ఓవర్‌ ఆఖరి బంతికి సిక్సర్‌ బాది హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన డివిలియర్స్‌ ఆ తరువాత మరింత విజృంభించాడు.అతడు బాదే సిక్సర్లను చూడడం తప్ప ఏమి చేయలేకపోయాడు పంజాబ్‌ కెప్టెన్‌ మాక్స్‌వెల్‌. దీంతో 68 పరుగులు వద్ద నాలుగవ వికెట్‌ కోల్పోయిన బెంగళూరు ఇన్నింగ్స్‌ ముగిసే వరకు మరో వికెట్‌ చేజార్చు కోలేదు.స్టువర్ట్‌ బిన్నీ 20 బంతులు ఆడి 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అజేయమైన అయిదవ వికెట్‌కు 80 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మన్‌దీప్‌సింగ్‌ 34 బంతులు ఆడి 1 బౌండరీ,1 సిక్సర్‌తో 28 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.పంజాబ్‌ బౌలర్లు వరుణ్‌ అరోస్‌ 2 వికెట్లు,అక్షర్‌ పటేల్‌,సందీప్‌శర్మ ఒక్కొక్కరు ఒక వికెట్‌ తీసుకున్నారు. నిలదొక్కుకున్న ఓపెనర్లు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరువాత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు చెందిన ఓపెనర్లు నిలదొక్కుకున్నారు.ఓహ్రా 21 బంతులు ఆడి 4 బౌండరీలు,1 సిక్సర్‌తో 34 పరుగులు చేసి మిల్స్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు.మరో ఓపెనర్‌ అమ్లా 38 బంతులు ఆడి 4 బౌండరీలు,3 సిక్సర్లతో 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.ఇక పటేల్‌ 6 బంతులు ఆడి 1 సిక్సర్‌తో 9 పరుగులు చేసి చాహల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.మాక్స్‌వెల్‌ 22 బంతులు ఆడి 3 బౌండరీలు,4 సిక్సర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.దీంతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 14.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' రిలీజింగ్ డేట్ ఇదే! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్. పవన్ అప్‌కమింగ్ మూవీ 'కాటమరాయుడు' రిలీజింగ్ డేట్... | Updated: Oct 24, 2016, 03:26PM IST పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్. పవన్ అప్‌కమింగ్ మూవీ 'కాటమరాయుడు' రిలీజింగ్ డేట్ ఎప్పుడెప్పుడు వెల్లడిస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానుల సస్పెన్స్‌కి తెరదించుతూ మూవీ డేట్ ఫిక్స్ చేశారు ఈ మూవీ మేకర్స్. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 29న రిలీజ్ చేయనున్నట్టు తాజాగా మూవీ మూవీ యూనిట్ స్పష్టంచేసింది. డాలీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన రెండోసారి శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీని పవన్ సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం మూవీకి ఇది తెలుగు రీమేక్. Pawan Kalyan`s upcoming movie, Katamarayudu releasing date locked: It`s a good news to Power star Pawan Kalyan`s fans. Pawan`s upcoming movie, Katamarayudu releasing date confirmed. As per the sources, Katamarayudu will hit the screens on 19th day of march in next year. It`s a Ugadi festival gift to all power star fans. Shruti Haasan pairing with Pawan for the second time with this movie. Katamarayudu is a directorial venture of Dolly (Kishore kumar Pardhasani). Famous composer Anoop Rubens is composing tunes. Pawan`s close friend Sharat Marar is producing this movie on North star entertainments banner. It`s a telugu remake of Tamil movie Veeram.
0business
no liquor or cigarettes in ar murugadoss' 'spyder' గ్రేట్..‘స్పైడర్’లో అలాంటి సీన్లు లేవ్! దర్శకుడు మురుగదాస్‌కు కొన్ని ఫిలాసఫీలున్నాయి. వాటికి కట్టుబడే సినిమాలు రూపొందిస్తాడు. TNN | Updated: Sep 7, 2017, 02:10PM IST దర్శకుడు మురుగదాస్‌కు కొన్ని ఫిలాసఫీలున్నాయి. వాటికి కట్టుబడే సినిమాలు రూపొందిస్తాడు. కథ, కథనాల విషయం ఎలా ఉన్నా.. తన సినిమాల ద్వారా మద్యపానాన్ని, ధూమపానాన్ని ఏ మాత్రం ప్రమోట్ చేయకపోవడం మురుగదాస్ ప్రత్యేకత. మద్యపానం, ధూమపానానికి వ్యతిరేకి అయిన మురుగదాస్.. తన సినిమాల విషయంలో కూడా ఈ రూల్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాడు. తన సినిమాల్లోని పాత్రలేవీ మద్యం తాగకూడదు, పొగ తాగకూడదనేది మురుగదాస్ పెట్టుకున్న నియమం. ఈ దర్శకుడు తాజా సినిమా ‘స్పైడర్’ విషయంలో కూడా ఆ రూల్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యాడట. స్పైడర్ మూవీలో ఎక్కడా పొగతాగే సీన్ కానీ, మద్యం తాగే సీన్ కానీ లేదని సమాచారం. హీరో మహేశ్ చేత కానీ, విలన్లు ఎస్.జె. సూర్య, భరత్‌ల చేత కానీ.. ఎక్కడా సిగరెట్ చేత పట్టించలేదట దర్శకుడు. అలాగే మద్యం గ్లాస్ కూడా. ఎస్.జె.సూర్య గ్రీన్ టీ తాగుతూ కనిపిస్తాడట. మరి హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికో, విలన్ హైప్ ను పెంచడానికో, సీన్ ను హైలెట్ చేయడానికో.. ఈ రోజుల్లో చాలా సినిమాల్లో మద్యం, ధూమపానం సీన్లు తప్పని సరిగా ఉంటున్నాయి. తామేమీ సిగరెట్లను, మద్యాన్ని ప్రోత్సహించడం లేదని చెబుతూనే.. సీన్ డిమాండ్ చేసిందని.. అలాంటి సీన్లను పెడుతున్నారు దర్శకనిర్మాతలు.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV భారత్-పాక్ యుద్ధనేపథ్యంతో రానా సినిమా బాహుబలి క్రేజ్ రానా స్టేటస్ను అమాంతం పెంచేసింది. TNN | Updated: Jan 9, 2016, 08:17AM IST భారత్-పాక్ యుద్ధనేపథ్యంతో రానా సినిమా? బాహుబలి క్రేజ్ రానా స్టేటస్ ను అమాంతం పెంచేసింది. అతను చేసే తరువాత సినిమాపై ఆసక్తిని పెంచింది. పీవీపీ సినిమా సంస్థతో రానా త్రిభాషా చిత్రం చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. దానికి ‘ఘాజీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి దీనిని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా కథ చాలా ఆసక్తిగా ఉండేట్టు తెలుస్తోంది. కంచె సినిమా 1939 నాటి రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంతో నడుస్తుంది. అదే విధంగా రానా సినిమా 1971వ నాటి ఇండో-పాక్ వార్ కథాంశంతో రూపొందుతోంది. ఈ విషయాన్ని రానా కూడా ఓ సారి అన్నారు. తన అభిమానులంతా మాస్ సినిమా చేస్తే బాగుంటుందని అంటున్నారట, అయితే యుద్ధం కన్నా మాస్ ఏముంది అంటూ రానా వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో నావికా దళ యుద్ధాన్ని చూపిస్తారు. నేలపై సైనికుల యుద్ధాలు చాలా సార్లు సినిమాలుగా వచ్చాయి. అందుకే కొత్తంగా నావికదళం చేసే యుద్ధాలను చిత్రిస్తారట. సినిమా పేరు కూడా 1971 ఇండోపాక్ యుద్ధంలో మునిగిపోయిన పాకిస్తాన్ సబ్ మెరైన్ పేరునే పెట్టారు. ఆ సబ్ మెరైన్ పేరు ‘పీఎన్ఎస్ ఘాజీ’. సినిమా షూటింగ్ కూడా రెండు రోజుల క్రితమే మొదలైంది.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV భారత మహిళా జట్టుకి బీసీసీఐ నజరానా..! లార్డ్స్ వేదికగా భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో ఆదివారం మధ్యాహ్నం ఫైనల్లో తలపడనుంది. TNN | Updated: Jul 22, 2017, 04:17PM IST ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన భారత జట్టుకి బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా బోర్డు తరఫున భారత్ జట్టులోని ప్రతి క్రికెటర్‌కి రూ. 50 లక్షల చొప్పున అందజేయనున్నట్లు శనివారం ప్రకటించారు. లార్డ్స్ వేదికగా భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో ఆదివారం మధ్యాహ్నం ఫైనల్లో తలపడనుంది. ‘ప్రపంచకప్‌లో చిరస్మరణీయమైన ప్రదర్శనతో ఫైనల్ చేరినందుకు భారత్ జట్టుకి రివార్డు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. టోర్నీ ఆరంభం నుంచి ప్రదర్శన మెరుగు పరుచుకుంటూ.. ప్రస్తుతం తుది పోరుకి సిద్ధమైంది. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ దేశం గర్వించే ఇన్నింగ్స్‌ ఆడింది’ అని సీకే ఖన్నా వివరించారు. ఆస్ట్రేలియాతో శుక్రవారం ముగిసిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌‌ప్రీత్ కౌర్ 171 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
2sports
Dec 08,2018 ఐబీఎం ఉత్పత్తులు హెచ్‌సీఎల్‌ చేతికి! న్యూఢిల్లీ: దేశీయ సాఫ్ట్‌వేర్‌ రంగంలో సరికొత్త ట్రెండ్‌కు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెర తీసింది. అంతార్జాతీయ ఐటీ దిగ్గజం ఇంటర్‌నేషనల్‌ బిజినెస్‌ మెషిన్‌ (ఐబీఎం) కార్పొరేషన్‌ నుంచి కొన్ని సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఐబీఎం కూడా ధ్రువీకరించింది. తమ సంస్థకు చెందిన ఏడు ప్రధాన వ్యాపార ఉత్పత్తులను భారతకు చెందిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌కు విక్రయించాలని నిర్ణయించినట్టుగా ఐబీఎం తెలిపింది. ఈ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల మొత్తం విలువ 180 కోట్ల డాలర్ల దరిదాపుల్లో ఉండనున్నట్టుగా కంపెనీ వెల్లడించింది. హెచ్‌సీఎల్‌కు విక్రయించిన ఉత్పత్తులు తమ మొత్తం మార్కెట్లో 5000 కోట్ల డాలర్లకు దరిదాపుల్లో ఉంటుందని సంస్థ తెలిపింది. ఐబీఎం విక్రయించనున్న ఉత్పత్తుల్లో సెక్యూర్‌ డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోడక్డ్‌ బిగ్‌ఫిక్స్‌, మార్కెటింగ్‌ మరియు ఆటోమేషన్‌ ప్రోడక్ట్‌ యునీకా, వర్క్‌స్ట్రీమ్‌ కొలాబరేషన్‌ ప్రోడక్డ్‌ కనెక్షన్స్‌ తదితర ఉత్పత్తులు ఉన్నట్టుగా సంస్థ తెలిపింది. తాము కొనుగోలు చేయనున్న ఉత్పత్తుల్లో సెక్యూరిటీ, మార్కెటింగ్‌, కామర్స్‌ వంటి విభాగలకు చెందిన సాఫ్ట్‌వేర్‌లు ఉన్నట్టుగా హెచ్‌సీఎల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సి. విజరుకుమార్‌ తెలిపారు. ఈ మొత్తం లావాదేవీ వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తికావొచ్చని రెండు సంస్థల వారు భావిస్తున్నారు. రెడ్‌హ్యాట్‌ నిధుల కోసమే.. ఐబీఎం సంస్థ సాఫ్ట్‌వేర్‌ అమ్మకాలు ఇటీవలి కాలంలో తగ్గుతూ వస్తున్నాయి. ఈ కారణంగా గడిచిన త్రైమాసిక కాలంలో సంస్థ ఆదాయం గణనీయంగా కుంగింది. దీంతో సంస్థ ఆదాయం కోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ నుంచి ఆకర్షణీయమైన ఆఫర్‌ రావడంతో సంస్థ కొన్ని సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను హెచ్‌సీఎల్‌కు అమ్మివేయాలని నిర్ణయించడం విశేషం. ఇదే సమయంలో హెచ్‌సీఎల్‌ సంస్థకు వర్థమాన మార్కెట్లో బిజినెస్‌ సర్వీసెస్‌ మార్కెట్లో అవకాశాలు పెరగడంతో ఆ సంస్థ మార్కెట్లో విస్తరణకు ఐబీఎం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇదే నేపథ్యంలో ఐబీఎం సంస్థ అమెరికాకు చెందిన రెడ్‌హ్యాట్‌ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉండడంతో.. నిధుల కోసం ఆ సంస్థ కొన్ని ఉత్పత్తులను వదులుకోవాలని నిర్ణయించినట్టుగా సమాచారం ఇందులో భాగంగానే ఆ సంస్థ హెచ్‌సీఎల్‌కు కొన్ని ఉత్పత్తులను అమ్మివేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఆశ్చర్యంలో సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ.. హెచ్‌సీఎల్‌ సంస్థ ఐబీఎం నుంచి కొన్ని సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయాలని నిర్ణయించడాన్ని సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. పరిశ్రమలో ఇలా రెడీమేడ్‌ ఉత్పత్తులను ఒక సంస్థ నుంచి మరో సంస్థ కొనుగోలు చేయాలని భావిం చడం ఇదే తొలిసారని.. ఇలాంటి పోకడల వల్ల రానున్న రోజుల్లో ఐటీ పరిశ్రమ మనుగడకు కొంత విఘతం కలిగే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయి తే తమ ధోరణిని హెచ్‌సీఎల్‌ సంస్థ సమర్థించుకుంది. కాగా, మేటి సేవలను అందించే సంస్థలను కొనుగోలు చేయడం సంప్రదాయమని.. దానికి భిన్నంగా ఇప్పుడు ఆయా సంస్థల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భావిం చడం వినూత్న ధోరణి అని పరిశ్రమ పెద్దలు ఆక్షేపిస్తున్నా రు. ఇలాంటి పోకడల వల్ల ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలపై ప్రభావం పడుతుందని వారు అంటున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 169 Views Aditya Puri , HDFC BANK Aditya Puri, HDFC Bank CEO and MD ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ ఆదిత్య పురి ఆయన స్థానాన్ని భర్తీ చేసే సరైన వ్యక్తి కోసం ఎంపిక ప్రక్రియ మరికోన్నాళ్లలో ప్రారంభం కానుంది. ఈ విషయం పై ఆయన మాట్లాడుతు తన స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చే వ్యక్తి అక్కడి పనిని రెండువారాల్లో నేర్చుకోగలిగేట్లు ఉండాలని ఆయన తెలిపారు. నా తర్వాత వచ్చే వ్యక్తి నన్ను ఏడాది పాటు మెంటార్‌గా ఉండాలని కోరుకుంటే.. అటువంటి వ్యక్తి నా స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరంలేదుగగ అని పురి సంస్థ ఏజీఎంలో పేర్కొన్నారు. 2020 అక్టోబర్‌లో పురి 70వ ఏట అడుగుపెట్టనున్నారు. భారత్‌లో అత్యంత విజయవంతమైన బ్యాంకును నిర్మించిన వ్యక్తిగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 1994లో బ్యాంక్‌ ప్రారంభం నుంచి చీఫ్‌గా పని చేస్తున్నారు. బ్యాంక్‌ అభివృద్ధిలో పురి పాత్ర ఎనలేనిది. 2016లో ఆయనకు గుండెకు శస్త్రచికిత్స చేశారు. 2018మేలో పురి మాట్లాడుతూ తన స్థానాన్ని భర్తీ చేసేందుకు బోర్డు వేట మొదలు పెట్టనుందన్నారు. తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/
1entertainment
- నవంబరు 2-4వ తేదీల్లో హైటెక్స్‌లో నిర్వహణ.. - 100 కంపెనీల గృహ ప్రాజెక్టుల ప్రదర్శన: ట్రెడా నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌' (ట్రెడా) హైదరాబాద్‌ వేదికగా మరో స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించనుంది. నవంబరు 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు హైటెక్స్‌లో వేదికగా ఈ ప్రాపర్టీషో ఉంటుందని ట్రెడా ప్రతినిధులు తెలిపారు. అందుబాటు ధరలో ఉండే నివాసయోగిత ప్రజెక్టులపై ప్రత్యేక దృష్టితో ఈ మేళాలో స్థిరాస్తుల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టుగా ట్రెడా ప్రతినిధివర్గం తెలిపింది. దాదాపు 100 స్థిరాస్తి కంపెనీలు, 11 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, 15 మంది సప్లయర్లు ఈ స్థిరాస్తి ప్రదర్శనలో పాలుపంచుకోనున్నారని ట్రెడా అధ్యక్షుడు పి.రవింధర్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దూర ప్రాంతాలకు రోడ్లు వేయడం మౌలిక వసతులను కల్పిస్తున్నందున హైదరాబాద్‌ చుట్టు పక్కన ప్రాంతాల్లో కూడా స్థిరాస్తి ప్రాజెక్టులు వెలుస్తున్నాయని ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో స్థిరాస్తి రంగం స్థిరమైన అభివృద్ధితో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ ప్రదర్శనలో అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌్‌ అండ్‌ ఎస్టేట్స్‌, మైహోమ్‌, గ్రీన్‌ రిచ్‌ ఎస్టేట్స్‌, హాల్‌ మార్క్‌ బిల్డర్స్‌, సైబర్‌సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌, రామ్కీ ఎస్టేట్స్‌ అండ్‌ ఫార్మ్స్‌ వంటి ప్రముఖ స్థిరాస్తి సంస్థలు పాల్గొనన్నుట్టుగా ఆయన తెలిపారు. స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకొనే వారికి వెంటనే ఆర్థిక సాయం అందించేందుకు, ఫైనాన్షియల్‌ వెసులుబాటు అందించేందుకు వీలుగా ప్రదర్శనలో ఎస్‌బీఐ, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, గోఫిన్‌, సిండికేట్‌ బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌తో సహా పలు విత్త సంస్థలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొననున్నట్టుగా నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రెడా కార్యవర్గ సభ్యులు సునీల్‌ చంద్రారెడ్డి, ఆర్‌. చలపతి రావు, శ్రీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 23, Aug 2018, 12:19 PM IST Highlights టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్ 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా మారాడు. ఇక కమెడియన్ పాత్రలకు స్వస్తి చెప్పి హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అతి కష్టం మీద బరువు తగ్గించి సిక్స్ ప్యాక్ చేశాడు టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్ 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా మారాడు. ఇక కమెడియన్ పాత్రలకు స్వస్తి చెప్పి హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అతి కష్టం మీద బరువు తగ్గించి సిక్స్ ప్యాక్ చేశాడు. కమర్షియల్ హీరోగా ఎదగాలని భావించాడు. కానీ హీరోగా సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. మధ్యలో ఒకట్రెండు సినిమాల్లో ఓకే అనిపించినా.. నిర్మాతలకు లాభాలు మాత్రం రాలేదు. దీంతో అతడికి హీరోగా అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.  ఈ క్రమంలో సునీల్ ని వెతుక్కుంటూ చాలా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. హీరోగా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే సునీల్ మరి కమెడియన్ గా ఎంత తీసుకుంటున్నాడనే విషయం ఆరా తీయగా.. ఆయన రోజుల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలిసింది. కాల్షీట్ల ప్రకారం రోజుకి రూ.3.5 లక్షల రూపాయలను ఛార్జ్ చేస్తున్నాడట. టాలీవుడ్ లో టాప్ కమెడియన్స్ కి చెల్లించే మొత్తమే సునీల్ కి కూడా ఇస్తున్నారన్నమాట. సునీల్ గనుక మరోసారి కమెడియన్ గా నిరూపించుకుంటే టాలీవుడ్ లో బిజీ కావడం ఖాయం. మరి వెన్నెల కిషోర్ వంటి నటులను సునీల్ పోటీగా మారతాడేమో చూడాలి! Last Updated 9, Sep 2018, 11:02 AM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV క్వార్టర్ ఫైనల్‌ కి చేరిన భారత రోయర్ దత్తు బాబన్‌ భొకనాల్ రియో ఒలింపిక్స్‌ రోయింగ్‌ క్రీడాంశంలో భారత రోయర్‌ దత్తు బాబన్‌ భొకనాల్ క్వార్టర్ ఫైనల్‌కి చేరాడు. TNN | Updated: Aug 7, 2016, 01:34AM IST X రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ... రియో ఒలింపిక్స్‌ రోయింగ్‌ క్రీడాంశంలో భారత రోయర్‌ దత్తు బాబన్‌ ​ భొకనాల్​ క్వార్టర్ ఫైనల్‌కి చేరాడు. పురుషుల సింగిల్ స్కల్స్ లో నిర్వహించిన పోటీల్లో భొకనాల్ అర్హత సాధించాడు. 25 ఏళ్ల ఆర్మీమెన్‌ దత్తు భొకనాల్ 2000 మీటర్లను 7:21.67 సమయంలో చేరుకున్నాడు. భొకనాల్ ప్రస్తుతం పుణెలో ఆర్మీ రోయింగ్‌ నోడ్‌ (ఆర్‌ఎర్‌ఎన్‌) వద్ద శిక్షణ ఇస్తున్నాడు. భొకనల్‌ ఒలింపిక్స్‌ ఫైనల్స్ కు చేరుకుని మెడల్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2sports
Oct 20,2016 డిసెంబర్‌లో బౌమా కాన్‌ ప్రదర్శన హైదరాబాద్‌ : బౌమా కాన్‌ఎక్స్‌ఫో ఇండియా 2016 నాలుగోవ ఎడిషన్‌ను గురుగ్రామ్‌ హుడా గ్రౌండ్స్‌లో నిర్వహి స్తున్నట్టు బౌమా కాన్‌ఎక్స్‌పో ఇండియా సీఈఓ ఐగోర్‌ పాల్క తెలిపారు. డిసెంబర్‌ 12 నుంచి 15 వరకు జరిగే ఈ పదర్శనలో 750 మంది ప్రదర్శనదారులు, 30 వేల మందికిపైగా బిజినెస్‌ సందర్శకులు పాల్గొననున్నారని అంచనా వేశారు. నిర్మాణ, నిర్మాణ రంగ యంత్ర సామాగ్రి రంగంలో ఉన్నటువంటి వారికి ఇది కచ్చితమైన సేవలను అందించే మేటి వేదికగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధోరణులను తెలుపడంతో పాటు సంబంధింత రంగ వర్గాల వారితో సంభాషించి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అనువైన ప్రదర్శనగా ఉంటుందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ఈ షోలో తమ సంస్థ పుజ్జోలానా మెషినరీ ఫ్యాబ్రికేటర్స్‌ పాల్గొంటున్నట్టు ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అభిజీత్‌ పారు వెల్లడించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Oct 06,2016 ఆంధ్రాబ్యాంక్‌లో ఆనందంగా బతుకమ్మ సంబురాలు.. నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఆంధ్రాబ్యాంక్‌ కోఠి విభా గంలో బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉద్యోగులందరూ ఆనం దంగా పాల్గొన్నారు. హైదరాబాద్‌ సర్కిల్‌ జనరల్‌ మేనేజర్‌ వి.సత్యనా రాయణ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో హైదరాబాద్‌-1 జోనల్‌ మేనేజర్‌ త్రినాధ్‌ శ్రీధర్‌, సికింద్రాబాద్‌ జోన్‌ జోనల్‌ మేనేజర్‌ ధనుంజరు రావు, ప్రధాన కార్యాలయ ఇన్‌స్పెక్షన్‌ విభాగం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రమణ, హైదరాబాద్‌ సర్కిల్‌ ఆఫీస్‌ డిప్యూటీ మేనేజర్‌ జయప్రకాష్‌, బిల్డింగ్‌ కార్యాలయంలోని అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు ఈ వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నారు. బతుకమ్మ నృత్యాలకు తోడు బ్యాంకు మహిళా ఉద్యోగులు అనిత, అపర్ణ, నీలిమ, పావనీ, చందన, స్వాతి, మనోరమ, సంధ్య, సుమలత, గీతాలు దాండియా నృత్యంతో అలరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఎస్‌బ్యాంకు సిఇఒ రవ్‌నీత్‌గిల్‌ ravneet gill, yes bank CEO న్యూఢిల్లీ: ఎస్‌బ్యాంకు కొత్తగా సిఇఒ ఎండిగా నియమితులయిన రవ్‌నీత్‌గిల్‌ వందకోట్ల డాలర్ల రూపంలో వాటా విక్రయాలనుంచి సమీకరించాలని నిర్ణయించారు. పెట్టుబడుల సమీకరనలో భ్యాంకు గతంలో ఎన్నడూలేని వఙదంగా భారీస్థాయిలో ముందుకువచ్చింది. ఇక పెట్టుబడులకిందికిరాని మొత్తం ఆరువేలనుంచి 20వేల కోట్లకు చేరుతున్నట్లు తెలింది. యుబిఎస్‌ బ్యాంకు ఇటీవల వందకోట్ల డాలర్లసమీకరణ బ్యాంకుకు అంత మద్దతివ్వదని ప్రకటించడాన్ని ఏ పద్దతిలోయుబిఎస్‌ చెపుతున్నదని ప్రశ్నించారు. ప్రస్తుతం మావద్ద పదిశాతం వరకూ వాటా విక్రయించుకోవచుచ. లేదా వందకోట్ల మూలధన నిధులను సమీకరించుకోవచ్చు. మాంతట మేం మా స్టాక్స్‌పై పదిశాతం ఆంక్షలుపరిమితులు విధించుకోలేదని చెప్పారు. యుబిఎస్‌ బ్యాంకు రేటింగ్‌ తగ్గించడంవల్ల వచ్చే ఏడాదిలో రూ.90కి పడిపోతున్నదన్న ప్రశ్నలపై ఆయన మాట్లాడుతూ నిధుల సమీకరణకు మేం చేపట్టే మార్గాలతో రేటింగ్‌ దానంత అదే పెరుగుతుందని వెల్లడించారు. రియాల్టీ, ఫైనాన్స్‌ వంటి రంగాలకు ఎక్కువ రుణపరపతిని జారీచేయడంవల్ల కొంతమేర నగదు సమస్య ఎదురవుతున్నదా అన్న సమస్యకు ఆయన స్పందించారు. హౌసింగ్‌ ఫైనాన్స్‌కంపెనీలు, నాన్‌బ్యాంకింగ్‌ఫైనాన్స్‌ కంపెనీలు,రియల్‌ఎస్టేట్‌రంగాలపై ఒత్తిడిపెరిగిందని ఇపుడు బ్యాంకు ఏవిధంగా చర్యలు చేపడుతుందన్న ప్రశ్నపై ఎన్‌బిఎఫ్‌సిలకు ఉన్న నగదు కొరత సమస్య మాకు ఎలాంటి ప్రతిబంధకంకాదని, ఇకమిగిలిన రంగాలు కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నా మేం అప్రమత్తంగా వ్యవహరిస్తూ రుణపరపతిని అందిస్తున్నట్లు రణవీత్‌గిల్‌ వెల్లడించారు. తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/
1entertainment
Visit Site Recommended byColombia పసిడి ధరలు రూ.90 మేర పెరగడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,040 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.31,890కి చేరింది. ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,800 వద్దే కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్‌ను పరిశీలిస్తే.. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 0.11 శాతం పెరిగి 1,224.02 నుంచి 1228 డాలర్లకు చేరింది. మరోవైపు వారంతపు డెలివరీ ధరలు రూ.302 పెరిరి రూ.36,888 కి చేరింది.100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.73,000 ఉండగా.. అమ్మకం ధర రూ.74,000 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,120 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,580 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర రూ.41,300 వద్ద కొనసాగుతున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
TRIPATI ముంబైపై పుణే విజయం ముంబయి: ఐపిఎల్‌ పదవ సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో6 వికట్లకు 160 పరుగులు చేసింది.ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది.దీంతో ముంబైపై రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ 3 పరుగులతో విజయం సాధించింది.పుణే ఓపెనర్లు అజింక్యా రహానే 32 బంతులు ఆడి 5 బౌండరీలు,1 సిక్సర్‌తో 38 పరుగులు చేయగా,రాహుల్‌ త్రిపాఠి 31 బంతులు ఆడి 3 బౌండరీలు,2 సిక్సర్లతో సత్తా చాటడంతో పుణే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు సాధించింది. ఆరంభంలో ధాటిగా ఆడినా చివరలో తేలిపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది.టాస్‌ గెలిచిన ముంబయి ఇండియన్స్‌ పుణేనకు మొదట బ్యాటింగ్‌ చేయాల్సిందిగా కోరింది.దీంతో పుణేకు చెందిన రహానే,త్రిపాఠి శుభారంభం అందించారు.వీరిద్దరూ తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఆరంభం నుంచి పుణే వికెట్లు తీసేందుకు ముంబయి సారథి రోహిత్‌ శర్మ బౌలర్ల ను మార్చుతూ వచ్చాడు.చివరికి సీజన్‌లో తొలిసారి మ్యాచ్‌ ఆడుతున్న స్పిన్నర్‌ కర్ణ్‌ శర్మ తన తొలి ఓవర్‌లోనే దూకుడును కనబరిచాడు.కర్ణ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ మూడవ బంతికు రహానే పెవిలియన్‌కు పంపాడు.అనంతరం అదే స్పీడ్‌తో ఆడుతూ హాఫ్‌ సెంచరీకి దగ్గరగా వచ్చిన త్రిపాఠిని కూడా కర్ణ్‌శర్మ ఔట్‌ చేసి భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశాడు.ఈ దశలో పుణే స్కోరు 2 వికెట్లకు 93 పరుగులు. అనంతరం ముంబయి బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు మిగతా బ్యాట్స్‌మెన్‌ నిలువ లేకపోయారు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి హర్భజన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు విజయాన్ని అందించిన ధోనీ ఈ మ్యాచ్‌లో కేవలం 7 పరుగులకే ఔటయ్యాడు. బెన్‌స్టోక్స్‌17 పరుగులతో మరోసారి విఫలమయ్యాడు.చివరలో భారీ స్కోరు సాధించేందుకు మనోజ్‌ తివారి 13 బంతుల్లో 4 బౌండరీలతో 22 పరుగులతో పోరాడినప్పటికి బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరి గాడు. ఆరంభంలో కర్ణ్‌శర్మ 39 పరుగులిచ్చి 2 వికెట్లు,బూమ్రా 29 పరుగులిచ్చి 2 వికెట్లు ఇచ్చి తమ పదునైన బౌలింగ్‌తో పుణేకు సమస్య కలిగించారు. మిచెల్‌ జాన్సన్‌,హర్భజన్‌లకు ఒక్కొక్కరికి ఒక వికెట్‌ లభించింది. నిలదొక్కుకున్న రోహిత్‌శర్మ పుణే సూపర్‌ జెయింట్‌ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు చెందిన రోహిత్‌ శర్మ నిలదొక్కుకుని హాఫ్‌ సెంచరీ సాధించాడు.పుణెపై విజయం కోసం చివరి వరకు ముంబై పోరాటం చేసింది.ఓపెనర్‌ పటేల్‌ 27 బంతులు ఆడి 4 బౌండరీలతో 33 పరుగులు చేసి సుందర్‌ బౌలింగ్‌లో వాషింగ్టన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఔటయ్యాడు. బట్లర్‌ 13 బంతులు ఆడి 3 బౌండరీలతో 17 పరుగులు చేసి స్టోక్స్‌ బౌలింగ్‌లో వాష్టింగ్టన్‌ సుందర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వెనుదిరిగాడు.రాణా 9 బంతులు ఆడి 3 పరుగులు చేసి క్రిస్టియన్‌ బౌలింగ్‌లో నాద్కత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.ఇక రోహిత్‌ శర్మ 39 బంతులు ఆడి 6 బౌండరీలు,3 సిక్సర్లతో 58 పరుగులు చేసి ఉనాద్కత్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెవి శర్మ 10 బంతులు ఆడి 1 సిక్సర్‌తో 11 పరుగులు చేసి స్టోక్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు వెళ్లాడు. పోలార్డ్‌ 9 బంతులు ఆడి 1 బౌండరీతో 9 పరుగులు చేసి ఇమ్రాన్‌ తాహిర్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఔటయ్యాడు.పాండ్యా 11 బంతులు ఆడి 2 బౌండరీలతో 13 పరుగులు చేసి ఉనాద్కత్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఔటయ్యాడు.హర్భజన్‌సింగ్‌ 2 బంతులు ఆడి 1 సిక్సర్‌తో 7 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. మెక్‌క్లెనగన్‌ జిరో పరుగులకు రనౌటయ్యాడు.జాన్సన్‌లు జిరో పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.దీంతో ముంబై ఇండియన్స్‌20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది
2sports
Hyderabad, First Published 8, Sep 2019, 10:05 AM IST Highlights నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో నాని శనివారం మీడియా ముందుకు వచ్చారు. చిత్ర విశేషాలను పంచుకున్నారు.   నేచురల్‌ స్టార్‌ నాని,డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా 'గ్యాంగ్ లీడర్'. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. సెప్టెంబర్‌ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నాని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని.. ట్విస్ట్‌లు టర్న్‌లు ఉన్నాసరే అవి అంత కాంప్లికేటెడ్‌ గా ఉండవని చెప్పారు. సినిమాలో తను పెన్సిల్ పార్ధసారధి అనే పాత్రలో నటించినట్లు చెప్పారు. ఈ క్రమంలో బైలింగ్యువల్ సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు. గతంలో తను ద్విభాషా చిత్రం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా.. అందుకే బైలింగ్యువల్ అంటే తనకు భయమని చెప్పాడు. అదిరిపోయే స్క్రిప్ట్ తో మంచి సెటప్ కుదరాలని.. అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయంటేనే బైలింగ్యువల్ చేస్తాను కానీ.. ఇంకో చోట కలెక్షన్స్ వస్తాయి కదా అని బైలింగ్యువల్ చేయడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని 'వి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయని చెప్పుకొచ్చాడు.  Last Updated 8, Sep 2019, 10:05 AM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సినీ పండుగ: ఒకే రోజు 10 సినిమాలు! ఇదివరకు సినిమా పండుగ అంటే సంక్రాంతి, సమ్మర్ సీజన్‌లో ఉండేది. అప్పుడే వరుస సినిమాలతో థియేటర్స్ కళకళలాడేవి. అయితే ఈ ఏడాది పొడవునా వరుస సినిమాలు ఉంటూనే ఉన్నాయి. ఇక చిన్న సినిమాల గురించి అయితే చెప్పాల్సి అవసరం లేదు. Samayam Telugu | Updated: Jun 25, 2018, 04:11PM IST ఇదివరకు సినిమా పండుగ అంటే సంక్రాంతి, సమ్మర్ సీజన్‌లో ఉండేది. అప్పుడే వరుస సినిమాలతో థియేటర్స్ కళకళలాడేవి. అయితే ఈ ఏడాది పొడవునా వరుస సినిమాలు ఉంటూనే ఉన్నాయి. ఇక చిన్న సినిమాల గురించి అయితే చెప్పాల్సి అవసరం లేదు. శుక్రవారం వచ్చిందంటే.. రెండు మూడు చిన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే వచ్చే శుక్రవారం (జూన్ 29) పదికి పైగా చిన్న సినిమాలు విడుదల కానుండటంతో సినీ ప్రేక్షకులకు సినిమా పండుగే అని చెప్పాలి. అయితే వీటిలో ఈ చిత్రాలపై పెద్దగా బజ్ లేకపోవడంతో థియేటర్‌లో విడులయ్యే చిత్రాలు ఏంటనేవి చెప్పలేని పరిస్థితి. అయితే ఈ పది చిత్రాలు మాత్రం రిలీజ్ డేట్‌ను జూన్ 29గా ప్రకటించాయి. వచ్చే శుక్రవారం విడుదలయ్యే ఆ పది చిత్రాల లిస్ట్ ఇలా ఉంది.. 1. శంభో శంకరా.. (శకలక శంకర్) 2. ఈ నగరానికి ఏమైంది? (తరుణ్ భాస్కర్ డైరెక్షన్) 3. నా లవ్ స్టోరీ 4. యుద్ధ భూమి 5. సూపర్ స్కెచ్
0business
మార్చిలో 28 శాతం పెరిగిన మారుతి సుజుకి అమ్మకాలు Hanumantha Reddy| దేశంలోనే పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా కార్ల అమ్మకాలలో మార్చి నెలలో 28.20 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో 95,123 యూనిట్ల అమ్మకాలు జరుపగా ఈ సంవత్సరం 1,21,952 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. 2010-11 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 12,71,005 అమ్మకాలు జరిపిన మారుతి గత ఆర్థిక సంవత్సరంలో అమ్మిన 10,18,365 యూనిట్లతో పోలిస్తే 24.81 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీయ మార్కెట్‌లో ఈ ప్రభుత్వ సంస్థ మార్చి నెలలో 1,10,424 యూనిట్ల అమ్మకాలు జరిపి 38.85 శాతం వృద్ధిని సాధించింది. గత సంవత్సరం ఇదే మాసంలో దేశీయంగా మారుతి 79,530 యూనిట్ల అమ్మకాలు జరిపింది. అయితే మారుతి ఎగుమతులు గత సంవత్సరం కంటే 26.07 శాతం తగ్గాయి. గత సంవత్సరం 15,593 యూనిట్లు ఎగుమతి చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో 11,528 యూనిట్లు మాత్రమే ఎగుమతి చేసింది. సంబంధిత వార్తలు
1entertainment
Hyderabad, First Published 21, Mar 2019, 8:29 PM IST Highlights టాలీవుడ్ లో ఒక సిద్ధాంతాన్ని నమ్మి సినిమాలు తీసే వ్యక్తి ఆర్.నారాయణమూర్తి. విప్లవ స్వభావంతో ఎన్నో సినిమాలు చేసి ఎర్రన్న అని జనల చేత ముద్దుగా పిలిపించుకునే ఆయన పలు సందర్భాల్లో సమస్యలపై కుడా తన గళాన్ని విప్పుతారు. రీసెంట్ గా లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాపై సెన్సార్ బోర్డు ప్రవర్తించిన తీరుపై మూర్తిగారు స్పందించారు.  టాలీవుడ్ లో ఒక సిద్ధాంతాన్ని నమ్మి సినిమాలు తీసే వ్యక్తి ఆర్.నారాయణమూర్తి. విప్లవ స్వభావంతో ఎన్నో సినిమాలు చేసి ఎర్రన్న అని జనల చేత ముద్దుగా పిలిపించుకునే ఆయన పలు సందర్భాల్లో సమస్యలపై కుడా తన గళాన్ని విప్పుతారు. రీసెంట్ గా లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాపై సెన్సార్ బోర్డు ప్రవర్తించిన తీరుపై మూర్తిగారు స్పందించారు.  పసుపులేటి రామారావుగారు శ్రీదేవిపై రాసిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎర్రన్న వర్మకు మద్దతు పలుకుతూ శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. గతంలో ఒకసారి తన సినిమాకు సెన్సార్ సమస్య తలెత్తినప్పుడు ముంబయి వెళితే ఆమె నన్ను గౌరవంగా ఆహ్వానించారు. మీ సినిమాలో నటించాలని ఉందని మీ విప్లవ సినిమాలు అంటే చాలా ఇష్టమని చెప్పి సెన్సార్ పనుల్లో సహాయాన్ని అందించారు.  అలాంటి మహానుభావురాలు ఇప్పుడు ఉంటే కన్నీరు పెట్టుకునే వారు అంటూ ఎవరో కంప్లైంట్ ఇస్తే సినిమాను నిలిపివేయాలా? సెన్సార్ జరగనివ్వరా? అని అన్నారు. ఈ విధంగా సెన్సార్ బోర్డ్ అనవసరంగా నిబంధనలను పెట్టడం సరికాదని దీనిపై ఇండస్ట్రీలో అందరూ స్పందించాలని నారాయణ మూర్తిగారు తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.  Last Updated 21, Mar 2019, 8:29 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV YS Jagan: పవన్ Vs జగన్: హాట్ టాపిక్‌గా ‘మగతనం’ కామెంట్స్ ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేని నేనే ఇన్ని ప్రజా సమస్యలపై పోరాటం చేసి పరిష్కరించగలుగుతున్నప్పుడు.. మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోతే మీరు ప్రజలకు ఏం న్యాయం చేయగలరు. Samayam Telugu | Updated: Nov 14, 2018, 01:29PM IST YS Jagan: పవన్ Vs జగన్: హాట్ టాపిక్‌గా ‘మగతనం’ కామెంట్స్ తన వైవాహిక జీవితంపై జగన్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజా పోరాటయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అధికార, ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రప్రభుత్వ అవినీతిని ఎండగట్టిన పవన్ కళ్యాణ్.. ప్రతిపక్ష నేత జగన్‌పైనా విమర్శలు గుప్పించారు. ‘మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ప్రజాస్వామ్యంపై మీకు బాధ్యత ఉండాలి. మీరు ఎలాగూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేకపోయారు. కనీసం బాధ్యత గల ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లండి. ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేని నేనే ఇన్ని ప్రజా సమస్యలపై పోరాటం చేసి పరిష్కరించగలుగుతున్నప్పుడు.. మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోతే మీరు ప్రజలకు ఏం న్యాయం చేయగలరు. మీరు ఓదార్పు యాత్రలు చేసుకుంటే సరిపోతుందా? ప్రజలు మీకు ఓట్లు వేసింది మీరు అసెంబ్లీకి వెళ్లి నిలబడాలి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిలదీయాల్సిన బాధ్యత ప్రజలు మీకు ఇచ్చారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు.. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అప్పుడు మీ మగతనం బయటకు వస్తుంది. మా ఇంటి ఆడపడుచులను తిట్టే ధైర్యం జగన్‌కి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా వాడు ఏం చేస్తాడులే అనుకుంటున్నారా? మీరు ఎంత రెచ్చగొట్టినా సంస్కారంగా మాట్లాడే గుణం మా తల్లి నేర్పింది’ అంటూ ఆవేశంగా ప్రసంగించారు పవన్. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఆవేశంతో జగన్‌పై చేసిన మగతనం కామెంట్స్ సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ జగన్‌గా మారాయి. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు పార్టీకి అండగా ఉండి ఆ పార్టీని అందలం ఎక్కించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర అవినీతిలో భాగమే అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ సింగిల్‌గానే చంద్రబాబుని ఢీకొన్నారని.. చంద్రబాబు, పవన్‌లు కలిసినా జగన్‌కి 67 సీట్లు వచ్చాయన్నారు. అదీ జగన్‌కి ఉన్న మగతనం. దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఇందులో సగం సీట్లు గెలుచుకుంటే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని సవాల్ విసురుతున్నారు వైసీపీ శ్రేణులు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Suresh 140 Views పెళ్లికి సిద్ధపడిన సాక్షి మాలిక్‌ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో కాకలు తీరిన క్రీడాకారులంతా ఒట్టి చేతులతో వెనక్కొ స్తుండగా ఇక ఈ దఫా మనకు ఒలింపిక్స్‌ లేదని భారతీయులు నిరాశలో కూరుకు పోయిన సమయంలో సత్తాచాటి భారత్‌కు పతకం సాధించి పెట్టిన స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ మరో సంచలన ప్రకటన చేసింది. కాగా ఈ ఏడాదిలోనే తాను పెళ్లి చేసుకోవా లని భావిస్తున్నట్లు ఆమె ప్రకటించింది.పతకం తెచ్చి భారతీయులకు సంతోషంలో ముంచే సిన ఆమె పెళ్లిమాటచెప్పి మరింత సంభ్రమా శ్చర్యాలకు గురి చేసింది.సహచర రెజ్లర్‌నే పెళ్లి చేసుకుంటానని చెప్పిన సాక్షి అతడి పేరు ఇప్పుడే వెల్లడించలేనని పేర్కొంది. పెళ్లితో తన కెరీర్‌కు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పిన ఆమె టోక్యోలో పతకం దిశగా ముందుకు సాగుతానని ప్రకటించింది.
2sports
ఆసియాలో మెరుగైన పరిపాలన కావాలి: భారత్ Hanumantha Reddy| ఆసియా దేశాలు అన్ని అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవటంతో పాటు అన్ని దేశాలు మెరుగైన పరిపాలన, విధానాల రూపకల్పనలో పారదర్శకత ఉండేలా చూడాలని భారత్ సూచించింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) వార్షిక సమావేశంలో భాగంగా ఆసియా 2050పై జరిగిన సెమీనార్‌లో పాల్గొన్న భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ ఆసియా దేశాలు గుడ్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. పరిపాలన అంటే అవినీతే కాదు జవాబుదారీతనం, పారదర్శకత కూడా ఉన్నాయన్నారు. అన్ని దేశాలు మెరుగైన పరిపాలన కోసం కృషి చేయాలని ప్రణబ్ చెప్పారు. ఈ సమావేశంలో జపాన్ ఆర్థిక మంత్రి, ఫ్రెంచ్ ఆర్థిక మంత్రితో పాటు పలువురు ప్రభుత్వాధినేతలు, అధికారులు కూడా పాల్గొన్నారు. సంబంధిత వార్తలు
1entertainment
వెంటనే ధరలను తగ్గించలేం.. - మెజార్టీ ఉక్కు పరిశ్రమల మాట ఇది.. ముంబయి: ప్రపంచ పరిణామాలకు తట్టుకొనే క్రమంలో భాగంగా ఎన్‌ఎండీసీ ముడి ఇనుము ధరలను తగించినప్పటికీ వినియోగదారుకు దీని ప్రయోజనం పెద్దగా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దేశీయ ఉక్కు తయారీదారులు తమ ధరలకు తగ్గించేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఎన్‌ఎండీసీ గత వారం ముడి ఇనుము ధరలను దాదాపు 20 శాతం మేర, లంప్స్‌ ధరలను 6.1% మేర తగించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల వరకు తమ ఉక్కు ఉత్పత్తి ధరలను సవరించే అవకాశం లేదని ప్రభుత్వ రంగ ఉక్కు ఉత్పత్తిదారు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. తమ ధరలు పెద్ద అధికంగా ఏమీ లేవని మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్లుగాను ఉన్నట్లు ఆ అధికారి తెలిపారు. అందువల్ల ధరలను వెంటనే తగ్గించాల్సి అవసరమేమి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్‌ఎండీసీ ధరల తగ్గింపు చాలా ఆల స్యంగా తీసుకున్న నిర్ణయమని.. ఈ చర్య ఎప్పుడో చేపట్టాల్సిందని ఎస్సార్‌ స్టీల్‌ వ్యాఖ్యా నించింది. ఈ విషయమై తాము వచ్చేనెల మొదట్లోనే ఒక నిర్ణయం తీసుకొనే అవ కాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ధరల సవరణ గురించి ఇప్పుడు చెప్ప డం సమంజసం కాదని వచ్చే నెలలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లుగా మరో ఉక్కు దిగ్గజ సంస్థ టాటా స్టీల్‌ తెలిపింది. దేశీయంగా ఇప్పటికే ఉక్కు డిమాండ్‌ తగ్గినందున ఆయ సంస్థ లు ధరలను బాగా తగ్గించే అమ్ముతున్నారని కావున అవి మరింతగా ధరలు దించ డానికి వీలుకాక పోవచ్చని ఉక్కు రంగ నిపుణులు చెబుతున్నారు. సెయిల్‌ కూడా ఇదే విధంగా స్పందిస్తూ ఇప్పుడే ఉక్కు ధరల తగ్గింపు ఉండదని, ఇప్పటికే ధరలు చాలా తక్కువగా ఉన్న ట్లు తెలిపింది. ధరలను మరింతగా తగ్గిస్తే తాము నష్టపోతామని ఆ సంస్థ వెల్లడించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Ind VS Zimbabwe 1st ODI: Rahul first debutant centurion for India as thrash Zimbabwe తొలి వన్డేలో భారత్ గెలుపు.. చరిత్ర సృష్టించిన రాహుల్ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం భారత్ - జింబాబ్వే మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ పలు రికార్డులకి వేదికైంది. TNN | Updated: Jun 11, 2016, 10:34PM IST జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం భారత్ - జింబాబ్వే మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ పలు రికార్డులకి వేదికైంది. తొలుత టాస్ గెలిచిన భారత్.. జింబాబ్వేపై ఫీల్డింగ్‌కే మొగ్గుచూపింది. అలా జింబాబ్వేపై తమ బంతులతో విరుచుకుపడిన భారత బౌలర్లు జింబాబ్వే ఆటగాళ్లకి ఒకానొక దశలో అగ్ని పరీక్షే పెట్టారు. ఎవ్వరికీ పరుగులు అధికంగా తీసే ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడిన బౌలర్లు కొన్ని వైడ్స్, మరికొన్ని నో బాల్స్ రూపంలో దాదాపు 20 వరకు ఎక్స్ట్రాలు మాత్రం ఇచ్చుకున్నారు. రెండుసార్లు క్యాచ్‌లు కూడా జారవిడిచారు. ఇవన్నీ పక్కన పెడితే, మొత్తానికి టీమ్ సమిష్టి కృషి కారణంగా 49.5 ఓవర్లకి 168 పరుగుల వద్ద జింబాబ్వే చాపచుట్టేసింది. 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 42.3 ఓవర్లలో.. అంటే మరో 45 బంతులు మిగిలివుండగానే 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయంలో మొట్టమొదటిసారి వన్డే ఇంటర్నేషనల్స్‌లోకి ప్రవేశం చేసి రాహుల్ ఓపెనర్‌గా సాధించిన 100 పరుగులు కీలక పాత్ర పోషించగా ఆ తర్వాత అంబటి రాయుడు రాబట్టిన 62 పరుగులు కీలకం అయ్యాయి. భారత్‌తో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో జింబాబ్వే విధించిన అత్యల్ప లక్ష్యాల్లో ఇది మూడవది కాగా.. వన్డే ఇంటర్నేషనల్లో మొట్టమొదటి మ్యాచ్‌తోనే సెంచరీ సాధించిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. రెండో వికెట్ భాగస్వామ్యంతో రాహుల్ చేసిన 162 పరుగులకి ఈ మ్యాచ్‌లో మరో ప్రత్యేకత వుంది. జింబాబ్వేపై రెండో వికెట్ భాగస్వామ్యంతో భారత్ సాధించిన అత్యధిక స్కోర్లలో ఇది మూడవది కావడం విశేషం. మొత్తానికి సిరీస్‌లో మొట్టమొదటి మ్యాచ్‌తోనే శుభారంభం చేసిన భారత్... సోమవారం నాడు జింబాబ్వేతో రెండోసారి తలపడనుంది.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ఘాజీ: రానా నటన అద్భుతం- కేటీఆర్ రానా‘ఘాజీ’ మూవీపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. TNN | Updated: Feb 17, 2017, 10:51PM IST రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మూలన పడ్డ మన చరిత్రను వెలికితీసే ప్రయత్నం చేశాడు నటుడు రానా ఘాజీ చిత్రంతో.. ఈ సినిమా ఈ రోజు (శుక్రవారం) విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. రానా నటన అద్భుతం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా అనేక మంది సెలబ్రిటీ ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణా మినిష్టర్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా రానాను అభినందించారు. ఘాజీలో రానా నటన అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వస్తుందని.. 1970లో భారత్- పాకిస్థాన్‌ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో సబ్‌మెరైన్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రాన్ని త్వరలోనే చూస్తానని అన్నారు.
0business
Hyderabad, First Published 4, Mar 2019, 4:55 PM IST Highlights తమిళంలో ఇటీవల కాలంలో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం '96'. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో ఇటీవల కాలంలో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచినచిత్రం '96'. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. శర్వానంద్-సమంత కాంబినేషన్ లో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఒరిజినల్ దర్శకుడే ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే టైటిల్ గా మాత్రం తెలుగు పేరుని పెట్టాలని దిల్ రాజు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో ఈ క్రమంలో 'జానకీదేవి' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొదట 'జాను', 'జాను అలియాస్ జానకి' అనే టైటిల్స్ ని పరిశీలించారు. కానీ ఫైనల్ గా 'జానకీదేవి' అనే టైటిల్ పై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించడంతో దాదాపు ఈ టైటిల్ ఖరారైనట్లు సమాచారం.  మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాడు. వచ్చే నెల నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.  Last Updated 4, Mar 2019, 4:55 PM IST
0business
కేంద్రంలో భారీ స్కాం కేంద్రంలో భారీ స్కాం - సూత్రధారి చంద్రబాబు కేంద్రంలో ఉన్న తన మంత్రుల ద్వారా పావులు కదిపి వేల కోట్లు దండుక ... కేంద్రంలో భారీ స్కాం - సూత్రధారి చంద్రబాబు కేంద్రంలో ఉన్న తన మంత్రుల ద్వారా పావులు కదిపి వేల కోట్లు దండుకొన్న చంద్రబాబు . స్కాం వివరాలు - కేంద్ర విమానయాన సంస్థ భూములు బినామీ సంస్థలకి అప్పగింత భూముల వి ... October 30, 2017
1entertainment
Suresh 189 Views Catrel Selutes to Dhoni Catrel Selutes to Dhoni ప్రభాతవార్త స్పోర్ట్స్‌ ప్రతినిధి: రెండు నెలలు ఆర్మీకి సేవలందించాలన్న టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే ఆర్మీ ఉన్నతాధికారులతో సహా, టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతమ్‌ గంభీర్‌, కపిల్‌దేవ్‌ వంటి దిగ్గజాలు ధోని నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ ధోని తీసుకున్న నిర్ణయానికి ముగ్ధుడయ్యాడు. అంతేకాకుండా అతడి దేశభక్తి సెల్యూట్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా గతేడాది రాష్ట్రపతి నుంచి పద్మ విభూషణ్‌ అందుకుంటున్న వీడియోని స్నేహితులు,కుటుంబ సభ్యులకి షేర్‌ చేస్తున్నారు. ఎందుకంటే అటువంటి క్షణాన్ని నేను ఎంత గర్విస్తానో వాళ్లకి తెలుసు. ఆ క్షణంలో ధోని, అతని భార్య సాక్షిని చూస్తుంటే జీవిత భాగస్వామిపై, దేశం పట్ల ఉన్న ప్రేమ ప్రతిబింబిస్తుందంటూ ధోని పద్మ విభూషణ్‌ తీసుకుంటున్న వీడియోని జతచేసి పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం కాట్రెల్‌ ట్వీట్లు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. మైదానంలో నువ్వు సెల్యూట్‌తో సంబరాలు చేసుకుంటే…నీ ట్వీట్‌కు, మంచితనానికి మేమందరం సెల్యూట్‌ చేస్తున్నామంటూ నెటిజనట్లు కామెంట్‌ చేస్తున్నారు. కాగా, కాట్రెల్‌ కూడా జమైకా సైన్యంతో కలిసి పనిచేస్తూనే క్రికెట్‌ ఆడుతున్నాడు. దీంతో…ఇప్పటికీ అతను మైదానంలో వికెట్‌ పడగొడితే…? సైనికుడి తరహాలో ఫీల్డ్‌ అంపైర్‌ వైపు వాక్‌ చేసి సెల్యూట్‌ కొట్టి సంబరాలు చేసుకుంటాడు. తాజాగా ధోనికి కూడా గౌరవంగా ట్వీట్‌ ద్వారా సెల్యూట్‌ కొట్టాడు. తన రెండు నెలల సైనిక శిక్షణను ధోని గత గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జులై 31 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 106 టెరిటోరియల్‌ ఆర్మీ బెటాలియన్‌తో కలిసి ధోని పనిచేయనున్నాడు. కాశ్మీర్‌లో ఉన విక్టర్‌ ఫోర్స్‌తో ధోని కలవనున్నాడు. అక్కడ పారాచూట్‌ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా ధోని పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్‌ డ్యూటీలను నిర్వర్తించనున్నాడు.
2sports
Hyderabad, First Published 23, Apr 2019, 9:30 AM IST Highlights సోషల్ మీడియా వచ్చాక ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఎదుటి వాళ్ల జీవితాలు, కెరీర్ లపై కామెంట్స్ పాస్ చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఎదుటి వాళ్ల జీవితాలు, కెరీర్ లపై కామెంట్స్ పాస్ చేస్తున్నారు. అవి ఒక్కోసారి అవతలి వాళ్ళను ఎంత ఇబ్బందికి గురి చేస్తాయో కూడా గుర్తించటం లేదు. తాజాగా హీరోయిన్ ప్రియా ఆనంద్ గురించిన ట్వీట్ ఒకటి అలాగే వివాదాస్పదమైంది. దానిపై ఆమె స్వయంగా స్పందించాల్సి వచ్చింది.  వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ ప్రియా ఆనంద్‌ను ట్విటర్‌లో ఓ నెటిజన్‌ తీవ్రంగా కామెంట్ చేసారు. ఆమెతో కలిసి నటిస్తే దురదృష్టవంతులు అవుతారని అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు. ‘‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ సినిమాలో శ్రీదేవితో కలిసి ప్రియా ఆనంద్‌ నటించారు. ఆమె ఇటీవల చనిపోయారు. తాజాగా ‘ఎల్‌కేజీ’ సినిమాలో ప్రియా ఆనంద్‌తో కలిసి నటించిన సహనటుడు జేకే రితీశ్‌ కూడా మృతి చెందారు. ఆమెతో పనిచేస్తే దురదృష్టవంతులు అవుతారా..?’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్  చూసిన ప్రియ ఆనంద్ కు బాగా బాధ కలిగింది. వెంటనే  నెటిజన్‌కు సున్నితంగా బుద్ధి చెబుతూ సమాధానం ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ట్వీట్లు చేశారు. '‘నీలాంటి వ్యక్తుల మాటలకు సాధారణంగా నేను స్పందించను. కానీ నీ వ్యాఖ్యలు కఠినమైనవని నీకు తెలిపేందుకు రిప్లై ఇస్తున్నా. సోషల్‌మీడియాలో ఇలాంటి కామెంట్లు చూసి మౌనంగా ఉండిపోవడం సులభమే. కానీ నీ మాటల వల్ల ప్రజలు ఎంత బాధపడుతారో ముందు తెలుసుకో. కాబట్టి ఇలాంటి ట్వీట్లు చేసే ముందు ఓ నిమిషం ఆలోచించి.. దయ, మానవత్వంతో వ్యవహరించు’'' అని ప్రియ రిప్లై ఇచ్చారు.  అప్పుడా నెటిజన్ 'నన్ను క్షమించండి. నా తప్పును ఒప్పుకుంటున్నా. ఇవాళ నేను ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’, ‘ఎల్‌కేజీ’ సినిమాలు చూశా. మీరే రెండింటిలో కామన్‌గా ఉన్నారు. అప్పుడు నాకు ఆ ఆలోచన వచ్చింది. అందుకే అలా ట్వీట్‌ చేశా. మీరు ట్వీట్లు చదవరు అనుకున్నా. నేను అలా మాట్లాడినా.. మీరు ప్రేమగానే సమాధానం ఇచ్చారు' అని అన్నారు. ఇక  ప్రియ ఆనంద్ తెలుగులో ‘లీడర్‌’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘180’ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు.   Last Updated 23, Apr 2019, 9:30 AM IST
0business
internet vaartha 130 Views న్యూఢిల్లీ : మారుతిసుజుకి కొత్తగా విడుదల చేసిన సియాజ్‌ పరంగా లక్ష యూనిట్ల ను విక్రయించిన రికార్డు సాధించింది. దేశీయ మార్కెట్లలో సియాజ్‌కు మంచి మార్కెట్‌ లభించింది. హోండా సిటీ ఒవైపు గట్టిపోటీ ఇచ్చిన ప్పటికీ నాలుగుమీటర్లకు పైబడిన కార్లలో సియాజ్‌ మార్కెట్‌వాటా పెంచుకోగలిగిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కల్సావెల్లడించారు. కంపెనీ మేనెలలో 5188 యూనిట్లు సియాజ్‌ విక్రయించింది. 3300 యూనిట్ల సిటీ ఉంది. సిటీ కేవలం 91యూనిట్లు మాత్రమేసియాజ్‌ కంటే ఎక్కువ విక్రయించింది.సిజాయ్ నెలవారీగా సగటు న 5400 యూనిట్ల చొప్పున మొదటి ఐదునెలల్లో విక్రయించినట్లు తేలింది. అలాగే హోండాసిటీ 5500యూనిట్లు విక్రయించింది. మారుతి 18వేల యూనిట్ల సిజాయ్ ను ఎగుమతి మార్కెట్లకు విడుదల చేయగలిగింది. గత ఏడాది సెప్టెంబరులోనే మారుతి హైబ్రిడ్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో ప్రభుత్వం సరిబేసి విధానం అమలు చేసినా విద్యుత్‌, హైబ్రిడ్‌, సిఎన్‌జి కార్లకు మినహాయింపు నిచ్చింది. హైబ్రిడ్‌ టెక్నాలజీ కారు కావడంతో సియాజ్‌కు కూడా మినహాయింపునిచ్చింది. సుప్రీం కోర్టు గత ఏడాది 2000సిసికిపైబడిన వాహనాలను దేశరాజధాని రీజియన్‌లో నిషేధించడంతో మహీంద్ర, టయోటా, మెర్సిడిస్‌ వంటి కంపెనీలకు దెబ్బతగిలింది. హోండా సిటీ మాత్రం ఈ బ్యాన్‌ కిందకురాలేదు. 1500సిసి ఇంజన్‌ కావడంతో కొనుగోలు దారులు ఎక్కువగా పెట్రోలు వేరియంట్లు కొనుగోలుకు సిద్ధం అయ్యారు.
1entertainment
Switzerland, First Published 1, Oct 2018, 7:49 PM IST Highlights భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ టెన్నిస్ క్రీడారిణి మార్టినా హింగిస్ జోడీ డబుల్స్ లోనే కాదు నిజజీవితంలో ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నట్లున్నారు. ఈ జోడీ టెన్నిస్ మహిళల డబుల్స్ లో అనేక విజయాలు సాధించి సక్సెస్ ఫుల్ జోడీగా పేరుతెచ్చుకున్నారు. అయితే వీరు క్రీడల్లోనే కాదు కుటుంబానికి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తూ జీవితాన్ని కూడా సక్సెస్ ఫుల్ గా గడుపుతున్నారు. అయితే ఈ డబుల్స్ జోడీ  ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి అభిమానులను అలరించారు. అయితే గతకొన్ని రోజులుగా వీరు టెన్నిస్ కు దూరంగా ఉంటూ తమ కుటుంబానికే పరిమతమయ్యారు.   భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ టెన్నిస్ క్రీడారిణి మార్టినా హింగిస్ జోడీ డబుల్స్ లోనే కాదు నిజజీవితంలో ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నట్లున్నారు. ఈ జోడీ టెన్నిస్ మహిళల డబుల్స్ లో అనేక విజయాలు సాధించి సక్సెస్ ఫుల్ జోడీగా పేరుతెచ్చుకున్నారు. అయితే వీరు క్రీడల్లోనే కాదు కుటుంబానికి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తూ జీవితాన్ని కూడా సక్సెస్ ఫుల్ గా గడుపుతున్నారు. అయితే ఈ డబుల్స్ జోడీ  ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి అభిమానులను అలరించారు. అయితే గతకొన్ని రోజులుగా వీరు టెన్నిస్ కు దూరంగా ఉంటూ తమ కుటుంబానికే పరిమతమయ్యారు. తాజాగా హైదరబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తాను  తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే ఈమె టెన్నిస్ జోడీ మార్టినా హింగిస్ కూడా  తల్లికాబోతుందట.  తన పుట్టినరోజు సందర్భంగా స్వయంగా మార్టినానే ఈ విషయాన్ని వెల్లడించింది.  సోషల్ మీడియా లో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు మరో తీపికబురు అందించింది. తనకు విషెస్ చెప్పిన అభిమానులతో మరో శుభవార్త  పంచుకుంటున్నానంటూ...తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు వెల్లడించింది. త్వరలో తాను ఓ చిన్నారికి జన్మనిచ్చి తల్లిని కాబోతున్నట్లు తెలిపింది. తమ కుటుంబంలో మరో పాపాయి చేరడంతో ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య మూడుకు చేరనుందంటూ హింగిస్ తన ఆనందాన్ని పంచుకుంది.  Thanks for all the birthday wishes! Happy to share that this will be the last time we’ll celebrate as a couple...excited to announce that we will become a family of three! pic.twitter.com/FRrpndFxxH — Martina Hingis (@mhingis) September 30, 2018
2sports
India vs New Zealand: Did You Know-India Has Never Beaten Kiwis in T20Is కోహ్లిసేన ముంగిట సరికొత్త రికార్డ్..! న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ముందు భారత్ ముంగిట ఓ సరికొత్త సవాల్ నిలిచింది. ఇప్పటికే ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో TNN | Updated: Oct 31, 2017, 05:17PM IST న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ముందు భారత్ ముంగిట ఓ సరికొత్త సవాల్ నిలిచింది. ఇప్పటికే ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా.. ఒకసారి కూడా న్యూజిలాండ్‌ని టీ20ల్లో ఓడించలేకపోయింది. దీంతో ఈ చెత్త రికార్డుని బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరగనున్న తొలి టీ20తో తుడిచిపెట్టేయాలని కోహ్లిసేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు.. వన్డే సిరీస్‌ని కొద్దిలో చేజార్చుకున్న కివీస్ కూడా కనీసం టీ20 సిరీస్‌తోనైనా స్వదేశానికి గౌరవంగా తిరిగి వెళ్లాలని ఆశిస్తోంది. భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు ఐదు సార్లు టీ20ల్లో తలపడగా.. ఐదింట్లోనూ కివీస్‌దే పైచేయిగా నిలిచింది. చివరి సారి.. నాగ్‌పూర్ వేదికగా గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో తలపడిన భారత్ జట్టు ఘోరంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ 126 పరుగులకే పరిమితమవగా.. అలవోకగా లక్ష్యాన్ని ఛేదిస్తుందనుకున్న టీమిండియా అనూహ్యంగా 79 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 11 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV నీర‌వ్ మోదీపై ఈడీ ఛార్జి షీట్ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ (పీఎన్బీ) అవినీతి కుంభకోణంలో పాత్ర వున్న నీరవ్‌ మోదీ, ఆయన సహచరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)మొదటి ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని అధికారులు గురువారం తెలిపారు. Samayam Telugu | Updated: May 25, 2018, 03:00PM IST పంజాబ్ నేషనల్ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ (పీఎన్బీ) అవినీతి కుంభకోణంలో పాత్ర వున్న నీరవ్‌ మోదీ, ఆయన సహచరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)మొదటి ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని అధికారులు గురువారం తెలిపారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) లోని వివిధ సెక్షన్ల కింద 12వేల పేజీల ఈడీ చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో దాఖలు చేసినట్లు చెప్పారు. పీఎన్బీ కుంభ‌కోణం నీరవ్ మోదీ, ఆయన సహచరులు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అధికారులు ఆయన సంస్థలకు బూటకపు లేఖలు జారీ చేయడం వంటి వ్యవహారాలకు వ్యతిరేకంగా క్రిమినల్‌ ఫిర్యాదు దాఖలైంది. ఈ కేసులో మొదటి ఎఫ్‌ఐఆర్‌ దాఖలైన తర్వాత గత కొద్ది నెలలుగా మోదీ, ఆయన సహచరుల ఆస్తులను జప్తు చేసిన వివరాలు కూడా ఈడీ అందులో పేర్కొంది. మనీ లాండరింగ్‌ కోణం, ఈ అవినీతిలో నీరవ్‌ మోదీ, ఇతరుల పాత్రపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సీనియర్‌ అధికారి తెలిపారు. మే నెల ప్రారంభంలో సీబీఐ రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. పరారీలో వున్న నీరవ్‌మోదీ ఇప్పటివరకు ఈడీ దర్యాప్తుకు సహకరించలేదు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
bollywood star hero impressed with vijay devarakonda`s arjun reddy 'అర్జున్ రెడ్డి'పై కన్నేసిన బాలీవుడ్ స్టార్ హీరో ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా 'అర్జున్ రెడ్డి' సక్సెస్ రేటు పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. పైగా పబ్లిక్ టాక్ కారణంగా మరిన్ని... TNN | Updated: Sep 4, 2017, 04:32PM IST ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా 'అర్జున్ రెడ్డి' సక్సెస్ రేటు పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. పైగా పబ్లిక్ టాక్ కారణంగా మరిన్ని కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై దక్షిణాదిన ఇతర భాషా చిత్రాల దర్శకులు, నిర్మాతలు కన్నేశారనే వార్తలు వెలువడుతున్న తరుణంలో తాజాగా ఓ బాలీవుడ్ హీరో సైతం అర్జున్ రెడ్డి సినిమాను చూసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్టు టాక్. 'అర్జున్ రెడ్డి' వివాదం ఆనోటాఈనోటా బాలీవుడ్‌లో రైజింగ్ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న రణ్‌వీర్ సింగ్ చెవిలో కూడా పడిందట. ట్రైలర్స్, టీజర్ వీడియోలలో విజయ్ దేవరకొండ పర్‌ఫార్మెన్స్ రణ్‌వీర్ సింగ్‌కి బాగా నచ్చిందట. అంతేకాకుండా అర్జున్ రెడ్డి సినిమా వివాదం గురించి వస్తున్న వివిధ వార్తా కథనాలు సైతం రణ్‌వీర్ సింగ్‌ని ఆలోచనలో పడేశాయని తెలుస్తోంది. రణ్‌వీర్ సింగ్ ఆసక్తి గురించి తెలుసుకున్న ప్రముఖ బాలీవుడ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ అతడి కోసం అర్జున్ రెడ్డి సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అర్జున్ రెడ్డి సినిమా కథాంశం కానీ రణ్‌వీర్ సింగ్‌కి నచ్చినట్టయితే, అతడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సైన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!
0business
internet vaartha 342 Views ఆరునెలల ప్రగతి నివేదికలో ప్రపంచబ్యాంక్‌ న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థికవ్యవస్థకు భారత్‌ ఒక ప్రభావ వంతమైన దేశంగా మారుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. భారత్‌ఆర్థికవృద్ధి 2016-17లో 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. చైనా కంటే ఒక పాయింట్‌ శాతం పెరు గుతుందని వెల్లడించింది. తన తాజా ప్రపంచ ఆర్థిక ప్రగతి నివేదికలో ప్రపంచ బ్యాంకు ముందు భారత్‌ వృద్ధిరేటును 0.2శాతం కుదించింది. 0.1శాతం 2016,2017 ఆర్థిక సంవ త్సరాల్లో తగ్గుతుందని అంచనా వేసింది. అయినప్పటికీ భారత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఆసియా ఖండంలో కూడా ఆధిపత్యం చేస్తుందని, ఈ ఏడాది 7.8శాతం, వచ్చేఏడాది రానున్న రెండేళ్లలో కూడా 7.9 శాతం గా వృద్ధి ఉంటుందని ప్రకటించింది. ప్రపంచబ్యాంకు చైనా ఆర్థికవృద్ధిని 2015లో 6.9శాతంగా ఉంటుందని వెల్లడించిం ది. జూన్‌ అంచనాలతో పోలిస్తే 0.3 శాతం తక్కువే. చైనా వృద్ధి 2016లో 6.7శాతం, 2017, 2018 సంవత్సరాల్లో 6.5శాతం చొప్పున ఉంటుందని ప్రకటించింది. ఇక వృద్ధి రేటుపరంగా 2016లో 0.3 శాతం, 0.4 శాతం 2017లోను నమోదుచేస్తుందని వెల్లడించింది. రష్యా, బ్రెజిల్‌ రెండుదేశాలు కూడా 2016లో మాంద్యంలోనే కొనసాగుతాయి. భారత్‌ కరె న్సీ, స్టాక్‌ మార్కెట్లు గతఏడాది కాలంలో కొంతమేర ఆశాజ నకంగానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక అనిశ్చితి ఉన్నా భారత్‌పై ప్రభావం కనిపించలేదు. భారతీయ రిజయ్విబ్యాంకు పరంగా చూస్తే ఎఫ్‌డిఐ సానుకూలంగా ఉంది. భారత్‌ పరంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థికలోటును జిడిపిలో నాలుగుశాతానికి కుదించింది. 2009లో 7.6శాతం ఉన్న లోటు గణనీయంగా తగ్గింది. దక్షిణాసియా వర్ధమాన దేశాలకు 2016 మరింతగా కలిసొస్తుంది. 2016లో ఆర్ధికవృద్ధి 7.3శాతంగా ఉంటుంది. ఈ ఏడాది ఏడుశాతానికే పరిమితం అవుతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. చైనాకంటే ఇతర ప్రాంతీయ దేశాలతో వాణిజ్య బంధాలు తక్కువగానే ఉంటాయన్నది అంచనా. పాకిస్థాన్‌పరంగా చూస్తే 4.5శాతంగా వృద్ధిరేటు ఉంటుందని ప్రకటించింది. ఎక్కువ వర్ధమాన మార్కెట్లలో వృద్ధి నీరసంగా ఉంటుందని, అంతర్జాతీయ ఆర్థికవృద్ధిపై ప్రభావం చూపు తుందని ప్రపంచ బ్యాంకు ఉటంకించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 40శాతం మంది నిరుపేదలు అభివృదఇధ చెందుతున్న దేశాల్లోనే ఉన్నారని వీరి వృద్ధి కూడా మందాగమనంతో ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌యాంగ్‌కిమ్‌ పేర్కొ న్నారు. సంస్కరణల ద్వారా వచ్చే ప్రయోజనాలను సుపరి పాలన, వాణిజ్య వాతావరణం పెంచుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2015కంటే అంతర్జాతీయ వృద్ధి తక్కువగా ఉందని, ఉత్పత్తుల ధరలు తగ్గడం, వాణిజ్యం, మూలధన నిధుల రాక కూడా తగ్గడం, ఆర్థిక అనిశ్చితి వంటివి అంతర్జాతీయంగా ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు జిమ్‌యాంగ్‌కిమ్‌ పేర్కొన్నారు. 2016లో అభివృద్ధి చెందుతున్న దేశాలు 4.8శాతానికి చేరుకుంటాయని, సంక్షోభం తర్వాత ఈ ఏడాది 4.3శాతంగా మాత్రమే ఉన్నట్లు బ్యాంకు అధ్యక్షుడు వివరించారు. ఆర్థికలోటు, కేంద్ర బ్యాంకుల విధివిధానాలే వర్ధమాన దేశాలకు ఎదురవుతున్న సమస్యలు, సంక్లిష్టపరిస్థితులను అధిగమిస్తాయని ప్రపంచ బ్యాంకు గ్రూప్‌ ఉపాధ్యక్షుడు, ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్‌బసు పేర్కొన్నారు.
1entertainment
జంట సవాళ్లు: ‘జియో’పై పోరుకు అమెజాన్‌తో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ టైఆప్ Highlights న్యూఢిల్లీ: గతేడాది టెలికం రంగంలో అడుగు పెట్టిన రిలయన్స్ జియో విసిరిన సవాల్‌కు దిగ్గజ సంస్థలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్‌లకు దిమ్మ తిరిగిపోయింది. తాజాగా రిలయన్స్ జియో గిగా ఫైబర్ పేరుతో టీవీ నెట్‌వర్క్ రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించింది.  న్యూఢిల్లీ: గతేడాది టెలికం రంగంలో అడుగు పెట్టిన రిలయన్స్ జియో విసిరిన సవాల్‌కు దిగ్గజ సంస్థలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్‌లకు దిమ్మ తిరిగిపోయింది. తాజాగా రిలయన్స్ జియో గిగా ఫైబర్ పేరుతో టీవీ నెట్‌వర్క్ రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించింది. అలాగే ‘ఈ - కామర్స్’ రంగంలోనూ సేవలందించడానికి ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రిలయన్స్ నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఈ - కామర్స్ సెక్టార్‌లో సంచలనాలతో దూసుకెళ్తున్న అమెజాన్ గుర్తించింది. మరోవైపు రిలయన్స్ ప్రభావంతో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు అతలాకుతలం అయ్యాయి. అందుకే అమెజాన్ సంస్థతో వొడాఫోన్ - ఐడియా జట్టు కట్టాయి.  జియోకు ప్రతి సవాల్ విసిరేందుకు ఎయిర్‌టెల్ - వొడాఫోన్ ఇలా తాజాగా ఉమ్మడిగా రిలయన్స్ జియో విసిరిన సవాల్‌కు గట్టిగా సమాధానమిచ్చేందుకు అమెజాన్‌తో భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ జట్టు కట్టాయి. ఇప్పటికే అమెజాన్ తన వినియోగదారులకు ప్రైమ్ సభ్యత్వం కల్పిస్తోంది. ఆ క్రమంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ సబ్ స్క్రైబర్లకు అమెజాన్ రాయితీ కల్పిస్తోంది. ఎయిర్‌టెల్ కస్టమరయితే అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం ఏడాదిపాటు ఉచితం. వొడాఫోన్‌ కస్టమర్‌‌కు అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం తొలి ఏడాది ఫీజులో సగం రాయితీ. ఇవన్నీ తమ కస్టమర్లకు టెలికం కంపెనీలు అందిస్తున్న రాయితీలు!!. టెలికం, ఈ – కామర్స్‌ కంపెనీల మధ్య వ్యాపార బంధానికి ఉదాహరణలు కూడా. అమెజాన్‌తో బంధంపై ఎయిర్‌టెల్ ఆశాభావం ఇలా ఈ - కామర్స్, డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలతో మార్కెట్‌ను షేక్‌ చేసేందుకు జియో వస్తుండడంతో, పోటీలో నిలబడేందుకు ప్రత్యర్థి సంస్థలు ఇప్పటి నుంచే ఏకం అవుతున్నాయి. రిలయన్స్‌ జియోతో పోటీ పడేందుకు ఈ కామర్స్‌ సంస్థలు, హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలతో కలిసి మరిన్ని ఆఫర్లు తెస్తామని ఓ టెలికం కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు కూడా. ఈ కామర్స్‌ సంస్థలతో దోస్తీ విషయంలో ఎయిర్‌టెల్‌ ఎంతో ఆశాభావంతో ఉంది. కొత్త వేదికలను కూడా అన్వేషిస్తున్నట్టు కంపెనీ ఉద్యోగి ఒకరు చెప్పారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఈ నెల ఆరంభంలో సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలో మాట్లాడుతూ  జియో ఇన్ఫోకామ్, రిలయన్స్‌ రిటైల్‌ చైన్‌ కలిసి ఆన్‌లైన్‌– ఆఫ్‌లైన్‌ రిటైల్‌ వెంచర్‌గా మారనున్నట్లు ప్రకటించడం తెలిసిందే.  డీటీహెచ్ ప్లస్ ఈ కామర్స్ అండ్ డిజిటల్ అనుబంధంతో ఇలా ఈ కామర్స్, డీటీహెచ్, డిజిటల్‌ సేవలు, టెలికం సేవల విషయంలో రిలయన్స్‌ ప్రతిష్టాత్మక ప్రణాళికల నేపథ్యంలో ఇతర టెలికం కంపెనీలు, ఈ కామర్స్‌ కంపెనీలు ఒక్కటై నడవాల్సిన పరిస్థితులు తప్పనిసరవుతున్నాయనేది నిపుణులు విశ్లేషించారు ‘టెలికం కంపెనీలకు చివరిదాకా కస్టమర్లతో సంబంధం ఉంటుంది. కానీ, దాన్ని లాభదాయకంగా మార్చుకోవాలి. పారదర్శక వాటా కోసం అవి మరింత మెరుగైన సేవలందించే స్థితిలో ఉండాలి’’ అని డెలాయిట్‌ ఇండియా మీడియా, టెక్నాలజీ పార్ట్‌నర్‌ హేమంత్‌ ఎం జోషి చెప్పారు. టెలికం సంస్థలు నిరంతరం మెరుగైన సేవలందించాలని భావిస్తాయని హేమంత్ ఎం జోషి చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ కామర్స్, ఇతర కంపెనీలతో టారిఫ్‌లు, పరికరాలు, కంటెంట్‌ విషయంలో మరిన్ని భాగస్వామ్యాలు అవసరం ఉందన్నారు.   జియో పోటీకి భయపడి కాదన్న అమెజాన్ అయితే, మొబైల్‌ ఆపరేటర్లతో సంయుక్తంగా అందించే ఆఫర్లు జియో ఈ కామర్స్‌ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవి కాదని అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా హెడ్‌ అక్షయ్‌సాహి చెప్పారు. ఈ భాగస్వామ్య చర్యలను గతేడాది జూలై నుంచే ప్రారంభించినట్టు సాహి పేర్కొన్నారు. ‘‘టెలికం కంపెనీలతో ఒప్పందాలు కస్టమర్లను చేరుకునేందుకే. దాంతో వారు అమెజాన్‌ ప్రైమ్‌ సేవలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోగలరు’’ అని సాహి చెప్పారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌తో ఇలా లాభాలు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్న వారు ప్రైమ్‌ యాప్‌ ద్వారా తెలుగుతో పాటు ఎన్నో భాషల  సినిమాలు, ఇతర వీడియో కంటెంట్‌ ఉచితంగా చూడొచ్చు. ఉచితంగా పాటలను ‘ప్రైమ్‌ మ్యూజిక్‌’ ద్వారా వినొచ్చు. పైపెచ్చు వీరికి అమెజాన్‌లో కొనుగోళ్లపై ఉచిత డెలివరీ, ఫాస్ట్‌ డెలివరీ ప్రయోజనాలూ ఉన్నాయి. ‘అమెజాన్‌ ప్రైమ్‌ అన్నది భారత్‌లో ఇంకా ఆరంభంలోనే ఉంది. దీని గురించి చాలా మందికి తెలియదు. టెలికం కంపెనీలతో టైఅప్‌ అవడం వెనుక ఉద్దేశం మరింత మందిని చేరటమే’ అని అక్షయ్‌ వివరించారు. మాకు అటువంటి ఆలోచనే లేదన్న ఫ్లిప్‌కార్ట్ టెలికం సంస్థలతో తమకు ఈ తరహా భాగస్వామ్యాల్లేవని, ఇందుకు సంబంధించి చర్యలు కూడా లేవని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ‘కస్టమర్ల పరంగా ఓవర్‌ల్యాప్‌కు (రెండు సంస్థలకూ ఒకే కస్టమర్‌) ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అధిక ఆదాయ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లతో అమెజాన్‌ టైఅప్‌ అవడం తెలివైన యోచన అవుతుంది’’ అని కన్సల్టింగ్‌ సంస్థ ఏటీ కెర్నే పార్ట్‌నర్‌ అభిషేక్‌ మల్హోత్రా పేర్కొన్నారు. ఎయిర్‌టెల్, వొడాఫోన్ సబ్‌స్కైబర్లకు అమెజాన్ ఆఫర్లు ఇవీ ఎయిర్‌‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లు రూ.499 అంతకంటే అధిక విలువ కలిగిన ప్లాన్లలో ఉంటే అమెజాన్‌ ఏడాది కాల ప్రైమ్‌ సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది. వొడాఫోన్‌ రెడ్‌ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ కస్టమర్లు ఏడాది కాల ఉచిత అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌కు అర్హులు. 18–24 ఏళ్ల మధ్యనున్న యువ ప్రీపెయిడ్‌ కస్టమర్లయితే రూ.999కు బదులు కేవలం రూ.499 చెల్లించి అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వాన్ని పొందొచ్చు. దీనిపై స్పందించేందుకు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ స్పందించడానికి నిరాకరించాయి.
1entertainment
Suresh 211 Views   అనంతపురం: భారత క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి అనంపురం జిల్లా కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. వచ్చేనెల 25న కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఒక మ్యాగజైన్‌లో విష్ణుమూర్తి అవతారంలో ధోనీ ప్రకటనలు ఇవ్వటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో విహెచ్‌పి నేత శ్యాంసుందర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయంలో ధోనీకి నోటీసులు పంపినా హాజరుకాకపోవటంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.
2sports
ప్రయోగాత్మకంగా ఓఎల్‌ఏ కేఫ్‌ సేవలు -  200 నగరాలకు విస్తరిస్తాం -  సంస్థ డైరెక్టర్‌ ఆనంద సుబ్రహ్మణ్యం  చెన్నై: ఏడాది చివరి నాటికి తమ సేవలను 200 నగరాలకు విస్తరించాలని ఆన్‌లైన్‌ క్యాబ్‌, ఆటో రిక్షా సేవల సంస్థ ఓఎల్‌ఏ సంస్థ యోచిస్తోంది. మరో వైపు ఓఎల్‌ఏ కేఫ్‌ పేరుతో చెన్నైలోని పలు రెస్టారెంట్ల సౌజన్యంతో డిమాండ్‌ మేరకు ఆహార పదార్థాలను ఇంటికి చేరవేసే వైపు కూడా విస్తరించే అవకాశాలను సంస్థ పరిశీలిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఓఎల్‌ఏ మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ ఆనంద సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రస్తుతం సంస్థ 100 నగరాలలో సేవలను అందిస్తోందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి వీటిని 200 నగరాలకు చేర్చాలని తాము యోచిస్తున్నట్లు వివరించారు. అయితే ఇందుకు అవసరమైన నగదును ఏ విధంగా సమీకరించేది ఆయన వెల్లడించలేదు. రానున్న రోజుల్లో ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు తమ సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. కంపెనీ ప్రస్తుతం ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలలో ఓఎల్‌ఏ కేఫ్‌ సేవలను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టింది. వీటిని చెన్నైలో విస్తరించేందుకు తాము స్థానిక రెస్టారెంట్లతో జట్టు కడుతున్నట్లు ఆయన వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 201 Views ముంబై : టాటామోటార్స్‌ తాజాగా టి1ప్రైమా ట్రక్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధం అవుతోంది. తదుపరిస్థాయి కి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు వేస్తోంది. అంతేకాకుండా టాటాస్‌తో పాటుగా మరింతగా ఎక్కువ భారతీయ ఉత్పత్తి దారులు పాల్గొనేలా ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు సీని యర్‌ వైస్‌ప్రెసి డెంట్‌ ఆర్‌.రామకృష్ణన్‌ వెల్లడించారు. అశోక్‌ లేలాండ్‌, విఇ కమర్షియల్‌ వాహనాలు, మహీంద్ర ట్రక్స్‌ అండ్‌ బస్సుల విభాగం నుంచి కూడా పోటీ ఎదురవ్వవచ్చని ఆయన అన్నారు. ఇవేకాకుండా డైమ్లర్‌ కమర్షియల్‌ వాహనా లు, వోల్వో, స్కానియా, మాన్‌ట్రక్స్‌ కూడా ఉత్పత్తిచేస్తున్నాయి. రేసింగ్‌ రంగంలోనికి ఆ కంపెనీలు కూడా వస్తే విదేశాల్లో కూడా టాటా ట్రక్‌రేస్‌లు నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు. కంపనీ టి1 తరహా ట్రక్‌రేస్‌లను గ్రేటర్‌నోయిడాలోని బుధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ నుంచి ఇతర భౌగోళిక ప్రాంతాలకు విస్తరించాలని చూస్తోంది. యూరోప్‌, యుకె, ఆగ్నేయాసియా దేశాలు, ఉత్తర అమెరికా దేశాలకు కూడా ట్రక్‌రేసింగ్‌ విస్తరించేయోచనతో ఉన్నట్లు రామకృష్ణన్‌ వెల్లడించారు. విదేశాల్లో కూడా పాల్గొనే పటిష్టమైన బాడీతోప్రైమా ట్రక్కులున్నట్లు ఆయన వివరించారు. ముందు ప్రాంతీయ ఈవెంట్లు గా ప్రారంభించి జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్‌కు వెళుతుందని, కేవలం రెండేరెండు రేస్‌ట్రాక్‌లు న్నట్లు చెప్పారు. శ్రీపెరంబుదూరు, బుధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌వద్ద మాత్రమే ఉన్నాయన్నారు.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘ఆటగదరా శివ’కు బాగా డబ్బులు రావాలి: వెంకటేష్ సున్నితమైన భావోద్వేగాలతో చిత్రాలను తెరకెక్కించే చంద్ర సిద్ధార్థ్ మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. Samayam Telugu | Updated: Jun 28, 2018, 07:43PM IST సున్నితమైన భావోద్వేగాలతో చిత్రాలను తెరకెక్కించే చంద్ర సిద్ధార్థ్ మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయ’తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న చంద్ర.. ఇప్పుడు ‘ఆటగదరా శివ’ అంటూ వచ్చేస్తున్నారు. ‘పవర్’, ‘లింగా’, ‘బజరంగీ భాయీజాన్’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన రాక్‌లైన్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఉదయ్ శంకర్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం జూలై 14న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో గురువారం చిత్రంలోని తొలిపాటను విడుదల చేశారు. ‘రామ రామ రే..’ అంటూ సాగే ఈ పాటను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ‘మంచి ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాలను తెరకెక్కించే చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో వస్తోన్న ‘ఆటగాదురా శివ’ మంచి విజయం సాధించాలి. అలాగే నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలి. రామ రామ రే.. సాంగ్ బాగుంది. యూనిట్ మొత్తానికి అభినందనలు’ అని చెప్పారు. ఉరి తీసే వ్యక్తి, ఉరి శిక్షకు గురైన మరో వ్యక్తి కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేదే ‘ఆటగదరా శివ’ చిత్రమని దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ వెల్లడించారు. ఆధ్యాత్మిక‌త‌ను, తాత్విక అంశాల‌ను స్పృశించే క‌థాంశమిదని అన్నారు. క‌న్నడలో విజ‌య‌వంత‌మైన ‘రామ రామ‌రే..’ చిత్రం ఆధారంగా తెలుగు ప్రాంతీయకు త‌గిన విధంగా తెర‌కెక్కించామన్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోందని, కొత్తద‌నాన్ని కోరుకునే ప్రేక్షకుల‌ను రంజింప‌జేసే సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. X ఇక ‘రామ రామ రే..’ అంటూ ఈ పాట చాలా కొత్తగా ఉంది. పాత సినిమాలోని ట్యూన్‌ను గుర్తు చేస్తున్నా వినసొంపుగా ఉంది. సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ చాలా బాగా స్వరపరిచారు. పులగం చిన్నారాయణ లిరిక్స్ అందించారు. సంగీత కత్తి, పూజ, ప్రణవ్, కార్తీక్, బృందా ఈ పాటను ఆలపించారు. అయితే ఈ చిత్రానికి నోబిన్ పాల్ నేపథ్య సంగీతం అందించారు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రియో : ఎనిమిదో రోజూ అంతే రియో ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు ఎనిమిది రోజులు గడిచాయి. కానీ మనకు మాత్రం అన్నీ నిరాశలే. BCCL | Updated: Aug 14, 2016, 05:54AM IST రియో ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు ఎనిమిది రోజులు గడిచాయి. కానీ మనకు మాత్రం అన్నీ నిరాశలే. షూటింగ్ పురుషుల స్కీట్‌ అర్హత పోటీల్లో ఇండియా షూటర్‌ మిరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ తొమ్మిదో స్థానంలో నిలిచి ఓడిపోయాడు. అలాగే పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ లో గుర్‌ ప్రీత్‌ సింగ్‌ ఫైనల్‌ కు అర్హత సాధించలేకపోయాడు. హాకీలో అర్జెంటినాపై 0-5 తేడాతో భారత మహిళల జట్టు ఓటమి చవిచూసింది. టెన్నిస్ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీస్ లో సానియా, బోపన్నలు అమెరికాకు చెందిన వీనస్‌ విలియమ్స్‌, రామ్‌ రాజీవ్‌ జంటపై 6-2, 2-6, (3-10) తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే కాంస్యం కోసం పోటీపడే అవకాశం ఉంది కాబట్టి వీరు మరో మ్యాచ్‌ ఆడనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌ లో గుత్తా జ్వాల అశ్విని పొన్పప్ప జోడీ 17-21, 15-21తేడా తో థాయ్ లాండ్ కు చెందిన పుటిటా, సప్పిరీ జంట చేతిలో ఓడిపోయింది. కాగా అథ్లెట్ లలితా బాబర్‌ మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌ లో ఫైనల్‌ కు చేరుకోవడం విశేషం. మరో క్రీడాకారిణి సుధాసింగ్‌ 9 నిమిషాల 43.29 సెకన్లలో పూర్తి చేసి 30వ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె క్వాలిఫై కాలేదు. 100 మీటర్ల పరుగులో స్టార్‌ స్ప్రింటర్ ద్యుతితో పాటు ఇతర అథ్లెట్లు ఫస్ట్ రౌండ్‌ కూడా దాటలేకపోయారు. బాక్సింగ్‌ 75 కేజీల విభాగంలో వికాస్ 3-0 తేడా తో టర్కీ బాక్సర్‌ సిపల్‌ ఆండ్రేను ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాడు.
2sports
Hyd Internet 72 Views intex mobiles intex mobiles ముంబై: మార్కెట్‌లోకి రిలయన్స్ జియో ప్రవేశించడంతో బాగా నష్టపోయామని ప్రముఖ మొబైల్ సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్ ప్రకటించింది. దీంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 30 శాతం అమ్మకాలు పడిపోయాయని, టెలికాం ఇండస్ట్రీ ఒక్కసారిగా 2జీ, 3జీ నుంచి 4జీకి మారిపోయిందని ఇంటెక్స్ టెక్నాలజీస్ స్పష్టం చేసింది. త్వరలో తమ సంస్థ కూడా 4జీ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుందని, నవంబర్ నుంచి మార్చి మధ్యలో తమ ఉత్పత్తుల అమ్మకాలపై నోట్ల రద్దు ప్రభావం పడిందని వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు తగ్గిపోయాయని, 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 4,306.08 కోట్లుగా ఉందని, గత ఏడాది రూ.6,233.43 కోట్ల ఆదాయం వచ్చిందని.. ప్రస్తుతం నికర లాభం కూడా 17 శాతం తగ్గిందని ఆ సంస్థ ప్రకటించింది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రాంచీ వన్డేలో ఓడిన టీమిండియా 314 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. వరుస ఓవర్లలో ఓపెనర్లు శిఖర్ ధావన్ (1: 10 బంతుల్లో), రోహిత్ శర్మ (14: 14 బంతుల్లో 2x4, 1x6) ఔటవగా.. అనంతరం వచ్చిన అంబటి రాయుడు (2: 8 బంతుల్లో), మహేంద్రసింగ్ ధోని (26: 42 బంతుల్లో 2x4, 1x6) పేలవంగా బౌల్డయ్యారు. Samayam Telugu | Updated: Mar 8, 2019, 09:30PM IST రాంచీ వన్డేలో ఓడిన టీమిండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ జట్టు తడబడింది. వరుసగా రెండు వన్డేల్లో ఘన విజయాల్ని అందుకుని మంచి ఊపుమీద కనిపించిన టీమిండియా.. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మాత్రం కంగారూల చేతిలో 32 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 314 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టును ఓటమి నుంచి రక్షించేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లి (123: 95 బంతుల్లో 16x4, 1x6) వీరోచిత శతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో.. ఐదు వన్డేల సిరీస్‌‌లో భారత్‌ ఆధిక్యాన్ని 2-1కి ఆస్ట్రేలియా తగ్గించగా.. నాలుగో వన్డే మొహాలి వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (104: 113 బంతుల్లో 11x4, 1x6), అరోన్ ఫించ్ (93: 99 బంతుల్లో 10x4, 3x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 313 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి వికెట్‌కి 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఓపెనింగ్ జోడీ.. ఆస్ట్రేలియాకి మెరుగైన ఆరంభమివ్వగా.. స్లాగ్ ఓవర్లలో మాక్స్‌వెల్ (47: 31 బంతుల్లో 3x4, 3x6), స్టాయినిస్ (31: 26 బంతుల్లో 4x4) బ్యాట్ ఝళిపించారు. తొలి 30 ఓవర్లూ తేలిపోయిన భారత్ బౌలర్లు ఆఖర్లో పుంజుకున్నా.. అప్పటికే ఆస్ట్రేలియా భారీ స్కోరుకి చేరువైంది. బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, షమీ ఒక వికెట్ తీశారు. 314 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. వరుస ఓవర్లలో ఓపెనర్లు శిఖర్ ధావన్ (1: 10 బంతుల్లో), రోహిత్ శర్మ (14: 14 బంతుల్లో 2x4, 1x6) ఔటవగా.. అనంతరం వచ్చిన అంబటి రాయుడు (2: 8 బంతుల్లో), మహేంద్రసింగ్ ధోని (26: 42 బంతుల్లో 2x4, 1x6) పేలవంగా బౌల్డయ్యారు. అయితే.. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. పట్టుదలతో క్రీజులో నిలిచిన విరాట్ కోహ్లీ.. కంగారూల బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒకానొక దశలో టీ20 గేర్‌లోకి వెళ్లిపోయిన కోహ్లీ.. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలోనే 52 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న కోహ్లీ.. ఆ తర్వాత కేవలం 85 బంతుల్లోనే శతకం మార్క్‌ని అందుకున్నాడు. వన్డే కెరీర్‌లో భారత కెప్టెన్‌కి ఇది 41వ సెంచరీకాగా.. ఈ సిరీస్‌లో వరుసగా రెండోది కావడం విశేషం. మిడిల్ ఓవర్లలో కేదార్ జాదవ్ (26: 39 బంతుల్లో 3x4), విజయ్ శంకర్ (32: 30 బంతుల్లో 4x4)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. భారత్ జట్టుని గెలిపించేలా కనిపించాడు. కానీ.. జట్టు స్కోరు 219 వద్ద స్పిన్నర్ ఆడమ్ జంపా తెలివైన బంతితో విరాట్ కోహ్లీని క్లీన్‌బౌల్డ్ చేసి భారత్ గెలుపు ఆశలకి తెరదించాడు. మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన ఆడమ్ జంపా.. కీలకమైన కోహ్లి, ధోని, కేదార్ జాదవ్ వికెట్లను పడగొట్టి గేమ్‌ను ఆస్ట్రేలియావైపు తిప్పాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ First Published 20, Jan 2018, 10:33 PM IST తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ తొలి ప్రేమ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ Recent Stories
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV Stock Market Today: కుప్పకూలిన దేశీయ మార్కెట్లు.. ప్రతీ ఒక్క షేరుకు 25 షేర్ల నష్టం.. . అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న తీవ్ర అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్లను బాగా దెబ్బకొట్టినట్టు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Samayam Telugu | Updated: Oct 11, 2018, 05:01PM IST అంతర్జాతీయ మార్కెట్లు.. ముఖ్యంగా అమెరికా మార్కెట్లు భారీ పతనం కావడంతో గురువారం (అక్టోబరు 11) 'దలాల్‌ స్ట్రీట్‌' కుప్పకూలింది. ఉదయం తొలి గంటలోనే 1000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 6 నెలల కనిష్టాన్ని నమోదు చేయగా..నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 10,200 స్థాయి దిగువకు పడిపోయింది. తర్వాత కాస్త తేరుకొన్న సెన్సెక్స్ మధ్యాహ్నానానికి 450 పాయింట్ల నష్టానికి చేరింది. అయితే మళ్లీ ట్రేడింగ్ చివరలో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల బాటపట్టడం సూచీలను మరింత దెబ్బ తీసింది. ప్రతి ఒక్క షేరుకు 25 షేర్లు నష్టపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డాలర్‌, చమురు కూడా క్షీణించడంతో చమురు కంపెనీలకు కలిసొచ్చింది.అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న తీవ్ర అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్లను బాగా దెబ్బకొట్టినట్టు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
1entertainment
Suresh 173 Views Golf Champion : Arjun Golf Champion : Arjun న్యూఢిల్లీ: ఎఫ్‌సిజి కల్లావే జూనియర్‌ ప్రపంచ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన అర్జున్‌ భాటి విజేతగా నిలిచాడు. అమెరాకలోని కాలిఫోర్నియా పామ్‌ డెజర్ట్‌లో జరిగిన ఈ పోటీల్లో అర్జున్‌ ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీ దక్కించుకున్నాడు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో వరుసగా తైవాన్‌ ఆటగాడు జెరేమీ చెన్‌ స్టోక్స్‌ న్యూజిలాండ్‌ ఆటగాడు జోషువా బై నిలిచారు. ఈ టోర్నీలో వివిధ దేశాలను నుంచి గోల్ఫర్లు పాల్గొన్నారు. కాగా నోయిడాకు చెందిన అర్జున్‌ భాటి ఇప్పటివరకు పలు టోర్నమెంట్లలో పాల్గొని టైటిళ్లు గెలిచాడు. ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురావాలనేది అర్జున్‌ లక్ష్యం.
2sports
ఆర్థిక స్థితి మెరుగుపరచేందుకు కట్టుబడివున్నా: ఒబామా Hanumantha Reddy| జాతీయ భద్రతతో పాటు ఇతర విషయాలపై దృష్టిసారించినప్పటికీ ఆర్థిక సంస్కరణలు కొనసాగించటంతో పాటు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కట్టుబడియున్నారని వైట్‌హౌస్ వెల్లడించింది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశం ఇంకా బయటపడే ప్రయత్నం చేస్తూనే ఉంది. అమెరికా పౌరులు అధిక గ్యాస్ ధరలను భరిస్తూనే ఉన్నారు. ప్రజలు అనుభవిస్తున్న అధిక ధరల ప్రభావాన్ని అర్థం చేసుకోవాల్సిందేనని వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి జే కార్నీ పేర్కొన్నారు. అంతర్జాతీయ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చటంతో ఒబామా పరపతి ప్రజల్లో 11 శాతం పెరిగినట్లు ఓపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. సంబంధిత వార్తలు
1entertainment
ESSAR ఎస్సార్‌స్టీల్‌కు చుక్కెదురు ముంబయి, జూలై 18: ఎస్సార్‌స్టీల్స్‌ తమపై రిజర్వుబ్యాంకు జారీచేసిన దివాలా కార్యాచరణను నిలిపివేయా లని కోరుతూ దాఖలుచేసిన కేసులో గుజరాత్‌ హైకోర్టు ఎస్సార్‌ స్టీల్స్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టుజారీచేసిన ఉత్తర్వులు నిరర్ధక ఆస్తులు పరిష్కారంలో ప్రభుత్వ కార్యాచరణకు కొంత మద్దతు లభిం చినట్లయింది. పేరుకుపోయిన రానిబాకీలను రాబట్టేందుకు రిజర్వు బ్యాంకు రుణాలిచ్చిన బ్యాంకులను తమతమ బాకీదారులపై దివాలా కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలుచేయాలని ఆదేశించింది. ఎస్సార్‌స్టీల్‌పై కంపెనీ రిజర్వుబ్యాంకు తమపై చేపట్టిన కార్యాచరణను తొలగిం చాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌చేయడంతో ఇతర మొండి బకాయిదారులకు ఇక దివాలా కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితులు ఉత్ప న్నం అవుతున్నాయి. రిజర్వుబ్యాంకు మొత్తం 12మంది బకాయి దారులపై దివాలా కేసులు దాఖలు చేయాల్సిందేనని బ్యాంకులను ఆదేశించిన సంఘటనల్లో ఎస్సార్‌స్టీల్‌ ఒకటిగా ఉంది. హైకోర్టు ఉత్తర్వులు కంపెనీని మరింత అగాధంలోకి నెట్టివేయకుండా ఉండేందుకు కంపెనీ హైకోర్టుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు సమాచారం. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ముందు 150 బిలియన్‌ డాలర్లు అంటే ఎనిమిది లక్షలకోట్ల నిరర్ధక ఆస్తులున్నాయి. వీటన్నింటిని పరిష్కరించేందుకు ఇపుడు రిజర్వుబ్యాంకుకు అదనపు అధికారాలు లభించాయనే చెప్పాలి. ఎస్సార్‌స్టీల్‌ ఒక్కటే 45వేల కోట్ల వరకూ రుణభారంతో ఉంది. ఈ మొత్తంలో 31,670 కోట్లు నిరర్ధకంగా మారినట్లు ఆర్‌బిఐ గుర్తించింది.
1entertainment
Mar 19,2018 900కోట్ల సంపద పోయే! న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా వివాదాల్లో చిక్కుకుం టున్న ప్రముఖ సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ స్నాప్‌చాట్‌ కంపెనీ ఆదాయం దిగజారింది. పాప్‌ సింగర్‌ రిహన్నా ఆగ్రహం దెబ్బకు ఆ కంపెనీకి సుమారు రూ.9వేల కోట్ల మేర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. తాజాగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఇవాన్‌ స్పైగల్‌ సంపద దాదాపు 150 మిలియన్‌ డాలర్లు(మన కరెన్సీలో రూ.900కోట్లు) ఆవిరైందని ఫోర్బ్‌ వెల్లడించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
NITHYOGI డిజిటల్‌ వ్యవస్థ దిశగా భారత్‌ న్యూఢిల్లీ, డిసెంబరు 22: భారతీయుల్లో కేవలం ఒకటిశాతం మందిమాత్రమే ఆదాయపు పన్ను చెల్లి స్తున్నారు. 125 కోట్లమంది జనాభా ఉన్న భారత దేశంలో కేవలం ఒకటిశాతంమంది మాత్రమే పన్ను లు చెల్లించడం విడ్డూరంగా ఉంది. భారత్‌ లాంటి శరవేగంగా వృద్ధిచెందుతున్న దేశానికి ఇటువంటి తరుణంలో 95శాతం నగదు లావాదేవీలపైనే కొన సాగించడం కష్టంఅన్నారు. జాతీయ ఉపద్రవ నివా రణ స్పందన శక్తిసంఘటన (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) నిర్వ హించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ 2030 నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల ఆర్ధికవ్యవస్థకు పెరు గుతున్న భారత్‌ నేడు రెండులక్షల కోట్ల డాలరక్ల ఆర్థికవ్యవస్థతో ఉందని, అయితే ఈ వ్యవస్థలో 95శాతం నగదు లావాదేవీలతోనే కొనసాగాలంటే సంక్లిష్టమేనని పేర్కొన్నారు. నగదు రహిత లావా దేవీలపై నిర్వహించిన సదస్సులో నీఇ ఆయోగ్‌ సిఇఒ అమితాబ్‌ కాంత్‌ పాల్గొని దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను వివరించారు. 125కోట్ల మంది జనాభాలో కేవలం ఒకటిశాతం మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని అన్నారు. భారత్‌లో వంద కోట్లమందికిపైగా మొబైల్‌ ఫోన్‌ వినియోగిస్తున్నారని ఆధార్‌ బయోమెట్రిక్‌ కార్డులు కూడా వందకోట్ల మందికిపైగా జారీచేసిందని, అయితే పన్ను రిట ర్నుల దాఖల్లో మాత్రం అత్యంత తక్కువ మంది మాత్రమే పన్నులు చెల్లించడం సిగ్గుచేటని కాంత్‌ పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ఇటీవలే ప్రవేశ పెట్టిన జన్‌ధన్‌ ఖాతాలపరంగాచూస్తే 26 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు వచ్చాయని, వీరిలో 20 కోట్లమందికిపైగా రూపేకార్డులు జారీచేసినట్లు వివరించారు. నగదు రహిత లావాదేవీలకు ఇదే సరైన తరుణహని అన్నారు. ఆర్ధికశాఖ సహాయ మంత్రి కిరేన్‌ రిజిజు మాట్లాడుతూ ఎన్‌డిఆర్‌ఎప్‌ సిబ్బంది నగదురహిత లావాదేవీలు నిర్వహించేందు కు ముందుకురావాలని, దేశంనలుమూలల కూడా నగదురహిత లావాదేవీలు పెరగాల్సిన అవసరం ఉందని, డిజిటల్‌ చెల్లింపులు అలవాటుచేసు కోవాలని సూచించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర సాయుధదళాల సిబ్బంది, రాష్ట్ర పోలీసు సిబ్బంది మొత్తం నగదు రహిత లావాదేవీలకే రావా లని సూచించారు. ప్రధానినరేంద్రమోడీ నిర్దేశించిన లక్ష్యం ప్రకారం భారత్‌ను ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద డిజిటల్‌ లావాదేవీల ఆర్థికవ్యవస్థ ఉన్న దేశం గా మార్చే కృషికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రపంచంలోని టాప్‌ మూడు ఆర్థికవ్యవస్థల్లో ఒకటి గా వచ్చే పదేళ్లలో మారుతుందని కిరేన్‌ వెల్లడిం చారు. డిజిటల్‌ చెల్లింపులకు వచ్చేందుకు తొలుత కొంత కష్టంగానే ఉన్నప్పటికీ ఒకసారి ప్రారంభిస్తే సులువగా అలవాటైపోతుందని భరోసా ఇచ్చారు. ప్రధాన మంత్రి దేశ ప్రజలను నగదు రహిత వ్యవస్థవైపే ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎన్‌డిఆర్‌ ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌కె పచనంద మాట్లా డుతూ నగదు రహిత లావాదేవీలు జీవనశైలిని మరింత సులువైన మార్గానికి పయనింపచేస్తుం దని, అంతేకాకుండా డిజిటల్‌ చెల్లింపులకు ప్రభు త్వం కూడా అనేక లావాదేవీలను ప్రకటించిందని వెల్లడించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది విధిగా ఈ లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరు, మరొకరికి అవగాహణ కల్పించాలని ఇదే సందేశం దేశవ్యాప్తం చేయాలని నీతి ఆయోగ్‌ సిఇఒ విజ్ఞప్తిచేసారు. మొత్తంమీద డిజిటల్‌ వ్యవస్థ వైపు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వపరిధిలోని అన్ని ప్రభుత్వ విభాగాలు శరవేగంతో ముందుకు వస్తున్నాయి. ప్రజలను కార్యోన్ముఖులను చేసేం దుకు వీలుగా సమాయత్తం చేస్తున్నాయి.
1entertainment
విజయ్, కీర్తి సురేష్ ల ఏజెంట్ భైరవ స్టిల్స్ First Published 22, Jun 2017, 1:23 PM IST విజయ్, కీర్తి సురేష్ ల ఏజెంట్ భైరవ స్టిల్స్ విజయ్, కీర్తి సురేష్ ల ఏజెంట్ భైరవ స్టిల్స్ విజయ్, కీర్తి సురేష్ ల ఏజెంట్ భైరవ స్టిల్స్ విజయ్, కీర్తి సురేష్ ల ఏజెంట్ భైరవ స్టిల్స్ విజయ్, కీర్తి సురేష్ ల ఏజెంట్ భైరవ స్టిల్స్ విజయ్, కీర్తి సురేష్ ల ఏజెంట్ భైరవ స్టిల్స్ విజయ్, కీర్తి సురేష్ ల ఏజెంట్ భైరవ స్టిల్స్ విజయ్, కీర్తి సురేష్ ల ఏజెంట్ భైరవ స్టిల్స్ విజయ్, కీర్తి సురేష్ ల ఏజెంట్ భైరవ స్టిల్స్ విజయ్, కీర్తి సురేష్ ల ఏజెంట్ భైరవ స్టిల్స్ Recent Stories
0business
RCB vs KXIP లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి..! 1. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ స్వదేశానికి వెళ్లనున్నారు. ఓపెనర్‌గా డుప్లెసిస్ జట్టుకి మెరుగైన ఆరంభాలు ఇస్తుండగా.. తాహిర్ పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ చెన్నై విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. 2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నుంచి మొయిన్ అలీ, డేల్ స్టెయిన్, స్టాయినిస్, హెన్రిచ్ క్లాసెన్ వెళ్లనున్నారు. వారం క్రితమే బెంగళూరు టీమ్‌లోకి వచ్చిన స్టెయిన్.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కీలక వికెట్లు పడగొట్టి బెంగళూరుకి ఊహించని విజయాల్ని అందించాడు. ఇక మొయిన్ అలీ, స్టాయినిస్ మిడిలార్డర్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు. క్లాసెన్ టోర్నీలో ఆడింది తక్కవే..! 3. రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి జోస్ బట్లర్, బెన్‌స్టోక్స్, స్టీవ్‌స్మిత్, జోప్రా ఆర్చర్ స్వదేశానికి వెళ్లనున్నారు. బట్లర్ ఓపెనర్‌గా రాజస్థాన్‌కి మెరుపు ఆరంభాల్ని ఇస్తుండగా.. మిడిలార్డర్‌లో బెన్‌స్టోక్స్, స్టీవ్‌స్మిత్ జట్టుకి ప్రధాన బలం. ఇక రాజస్థాన్ బౌలింగ్‌ భారాన్ని ఆరంభం నుంచి ఆర్చరే ఎక్కువగా మోస్తున్నాడు. 4. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, షకీబ్ అల్ హసన్ వెళ్లనున్నారు. తాజా సీజన్‌లో హైదరాబాద్ ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో సూపర్ హిట్ జోడీగా నిలిచారు. ఇప్పటికే టోర్నీలో నాలుగు శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన ఈ జోడీ.. హైదరాబాద్‌కి తిరుగులేని విజయాల్ని అందించింది. 5. ముంబయి ఇండియన్స్ టీమ్ నుంచి జాసన్ బెరండ్రాఫ్, డికాక్‌ వెళ్లనున్నారు. ఓపెనర్‌గా డికాక్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తుండగా.. బెరండ్రాఫ్ తన బౌలింగ్‌తో జట్టులో నమ్మదగిన బౌలర్‌గా పేరు దక్కించుకున్నాడు. 6. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నుంచి డేవిడ్ మిల్లర్ వెళ్లనున్నాడు. మిడిలార్డర్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న మిల్లర్.. టీమ్‌లోనే నెం.1 ఫీల్డర్‌గా ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్నాడు. 7. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి కగిసో రబాడ వెళ్లనున్నాడు. తాజా సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉన్న రబాడ.. ఢిల్లీ జట్టుకి అసాధారణ విజయాల్ని అందించాడు. 8. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి జో డెన్లీ వెళ్లనున్నాడు. అయితే.. అతను వెళ్లడం వల్ల కోల్‌కతాపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV వీవో స్మార్ట్‌ఫోన్లకు.. జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్..! వీవో స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లపై జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. మొత్తం రూ.1200 క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. TNN | Updated: Mar 25, 2018, 03:39PM IST వీవో స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లపై జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. మొత్తం రూ.1200 క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు తెలిపింది. వీటిలో రూ.600 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్.. వోచర్ల రూపంలో ఉంటుంది. మిగతా రూ.600 క్యాష్‌బ్యాక్ యూజర్ల 'జియోమనీ' వాలెట్‌లో జమవుతుంది. వీటితోపాటు డేటా ఆఫర్లను కూడా ప్రకటించింది. దీని ప్రకారం కొత్త వీవో ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు... అందులో జియో సిమ్ వేసి రూ.198 లేదా రూ.299 తో రిఛార్జ్ చేయించుకన్నవారికి... అదనంగా 120 జీబీ మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది. వినూత్న పోకడలతో... వినియోగదారుల మన్ననలు పొందుతూ... ఇప్పటికే జియో తన వినియోగదారుల సంఖ్యను 16 కోట్లకు పెంచుకుంది. తాజాగా ట్రాయ్ లెక్కల ప్రకారం ఈ యేడాది ఒక్క జనవరి నెలలోనే జియోకు 83 లక్షల మంది కస్టమర్లు వచ్చి చేరారు. టెలిఫోన్ మార్కెట్‌ల జియోవాటా 14 శాతంగా ఉంది.
1entertainment
Hyderabad, First Published 13, Jul 2019, 9:02 AM IST Highlights అతిలోక సుందరి శ్రీదేవి గతేడాది బాత్ టబ్ లో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే.  అతిలోక సుందరి శ్రీదేవి గతేడాది బాత్ టబ్ లో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెది అసహజ మరణమని.. కుట్ర చేసి చంపేశారంటూ వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె మరణించి ఏడాది దాటినా.. ఇప్పటికీ సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీదేవిది హత్యేనని.. ఆమె మరణంలో కుట్రకోణం దాగి ఉందంటూ కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆరోపణలు చేశారు. ఆమె బాత్ టబ్ లో మునిగి చనిపోయి ఉండకపోవచ్చనే సందేహాలను వ్యక్తం చేశారు. ఓ పేపర్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె మరణానికి సంబంధించిన విషయాలను ఫోరెన్సిక్ నిపుణుడైన తన స్నేహితుడు ఉమా దత్తన్ తనతో పంచుకున్నారని చెప్పాడు. ఒక మనిషి ఎంత మద్యం మత్తులో ఉన్నా.. అడుగు లోతు ఉండే బాత్ టబ్ లో పడి చనిపోవడం జరగదని.. ఎవరైనా శ్రీదేవి కాళ్లను గట్టిగా ఒత్తి పట్టి.. తలను నీటిలో ముంచి ఉంటారని.. అలా చేస్తే తప్ప ఆమె చనిపోయే ఛాన్స్ లేదని అన్నారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోయి ఉండకపోవచ్చని, హత్య అయి ఉండవచ్చని డాక్టర్ ఉమాదత్తన్ తనతో అన్నట్లు ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బోనీకపూర్ వద్ద ప్రస్తావించగా.. ఆయన ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటివి వస్తూనే ఉంటాయని.. ఎటువంటి ఆధారాలు లేని ఊహాజనిత వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి మూర్ఖ వాదనలను ఎవరో ఒకరు పుట్టిస్తూనే ఉంటారని అన్నారు.   Last Updated 13, Jul 2019, 9:02 AM IST
0business
Apr 02,2016 వడ్డీ సబ్సిడీ, రిబేట్‌ పథకాల గడువు పొడిగింపుపై హర్షం నవతెలంగాణ, వాణిజ్య విభాగం: వ్యవసాయ రుణాల చెల్లింపులో వడ్డీ సబ్సిడీ,రిబేట్‌ పథకాల గడువును జూన్‌ ముగింపు నాటి వరకు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకోవడం పట్ల 'తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌' అధ్యక్షుడు కొండూరు రవీందర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి నిజమైన ఊతం ఇచ్చేలా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీ యమని ఆయన తెలిపారు. అన్నదాతకు కొంత ఆసరాగా నిలిచేందుకు ఈ పథకాల గడువును పొడగించాలని కొండూరు రవీందర్‌ అంతకుముందు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు వినతి పత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న రూ.243.60 కోట్ల సొమ్మును కూడా విడుదల చేయాల్సిందిగా కోరారు. ఇందుకు అనుగుణంగానే 2014-15, 2015-16కు సంబంధించి వ్యవసాయ రుణాలపై 2.5 శాతం వడ్డీ సబ్సిడీని, మధ్య కాలిక, దీర్ఘకా లిక రుణాలపై ఆరు శాతం రిబేట్‌ పథకాల గడువును జూన్‌ ముగింపు వరకు సర్కారు పొడిగిస్తూ మార్చి 31న జీవోను విడుదల చేసినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
నాగచైతన్య న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ First Published 25, Nov 2017, 4:09 PM IST నాగచైతన్య న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ నాగచైతన్య న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ నాగచైతన్య న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ నాగచైతన్య న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ నాగచైతన్య న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ నాగచైతన్య న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ నాగచైతన్య న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ నాగచైతన్య న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ నాగచైతన్య న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ నాగచైతన్య న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ Recent Stories
0business
Hyderabad, First Published 10, Sep 2019, 3:58 PM IST Highlights కాళోజీకి సంబంధించిన దస్తావేజులు, ఫొటోలు, గ్రంథాలు సేకరించి సూత్రప్రాయంగా ఓ స్టోరీ లైన్ అనుకున్నామని నిర్మాత విజయనిర్మల జైనీ వెల్లడించారు. కాళోజీకి అత్యంత సన్నిహితులను సంప్రదించి స్క్రీన్‌ప్లేకు తుదిరూపం ఇచ్చి త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు ప్రభాకర్ జైనీ పేర్కొన్నారు.  బయోపిక్ ల సీజన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే తెలుగులో రాజకీయ నాయకులు ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితాలతో బయోపిక్ లు వచ్చాయి. ఇప్పుడు ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మ విభూషణ్‌ కాళోజి నారాయణరావు జీవితం వెండితెరకు రానుంది.‘అమ్మా నీకు వందనం, ప్రణయ వీధుల్లో.. పోరాడే ప్రిన్స్, క్యాంపస్‌–అంపశయ్య’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డా. ప్రభాకర్‌ జైనీ దర్శకత్వంలో ‘కాళన్న’ పేరుతో కాళోజి బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. జైనీ క్రియేషన్స్‌ పతాకంపై విజయలక్ష్మి జైనీ నిర్మిస్తారు. దర్శకుడు ప్రభాకర్ జైనీ ఆ వివరాలను ప్రకటనలో అందిస్తూ -2019 సెప్టెంబర్ 9 కాళోజీ 105వ జయంతి. 1992లో భారత ప్రభుత్వ నుంచి పద్మవిభూషణ్ అందుకున్న కాళోజీ జీవిత విశేషాలు, ఆయన రచనలు, స్వాతంత్య్ర పోరాట విశేషాలను ఈ తరానికి తెలియచేసే ఉద్దేశం, మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి హారతిపట్టిన వారి జీవిత విశేషాలను దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలనే ఆలోచనతో ‘కాళన్న’ పేరిట బయోపిక్‌ను ప్రారంభిస్తున్నాం. కాళోజీకి సంబంధించిన దస్తావేజులు, ఫొటోలు, గ్రంథాలు సేకరించి సూత్రప్రాయంగా ఓ స్టోరీ లైన్ అనుకున్నామని నిర్మాత విజయనిర్మల జైనీ వెల్లడించారు. కాళోజీకి అత్యంత సన్నిహితులను సంప్రదించి స్క్రీన్‌ప్లేకు తుదిరూపం ఇచ్చి త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు ప్రభాకర్ జైనీ పేర్కొన్నారు.  ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్‌ నీర్ల, సంగీతం: ఘంటసాల విశ్వనాథ్, మహమ్మద్‌ సిరాజుద్దీన్‌.  Last Updated 10, Sep 2019, 4:03 PM IST
0business
sumalatha 136 Views final , Serena Williams , withdraws Serena Williams టొరంటో : యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌కు ముందు ఒక హార్డ్‌కోర్టు టైటిల్‌నైనా దక్కించుకోవాలన్న సెరీనా విలియమ్స్ ఆశలు గాయం కారణంగా గల్లంతయ్యాయి. టొరంటోలో జరుగుతున్న రోజర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్లో కెనడాకు చెందిన టీనేజర్ బియన్సా ఆండ్రెస్కూతో తలపడిన సెరీనా వెన్నునొప్పి కారణంగా మ్యాచ్ మొదలైన 19 నిమిషాలకే పోటీనుంచి తప్పుకోవలసి వచ్చింది. అప్పటికి సెరీనా 13 పాయింట్లతో వెనుకబడి ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు తాను ఫిట్‌గానే ఉన్నానని చెప్పిన సెరీనా హటాత్తుగా తొలి సెట్ మధ్యలో విశ్రాంతి సమయంలో కుర్చీలో కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్ది సేపటికే తాను పోటీనుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకొని కెరీర్‌లో 24 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్న 37 ఏళ్ల సెరీనాకు ఈ గాయం ఒక అశనిపాతమేనని చెప్పాలి. ఈ టైటిల్‌ను గెలుచుకోవాలని తాను ఎంతగానో ప్రయత్నించాను కానీ అది సాధ్యం కాలేదంటూ అతి కష్టం మీద తన అభిమానులకు సారీ చెప్పింది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/national
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లు.. ఎప్పుడంటే.. దేశీయ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆన్ లైన్ కస్టమర్ల కోసం TNN | Updated: Sep 8, 2017, 08:16AM IST ​దేశీయ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆన్ లైన్ కస్టమర్ల కోసం ‘ది బిగ్ బిలియన్ డేస్’ను తీసుకురాబోతోంది. నాలుగో విడతగా ఈ ఆఫర్ ను తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించింది. ఈ నెలలోనే, దసరా పండుగ ముందు ఫ్లిప్‌కార్ట్ నాలుగు రోజుల పాటు ఈ ఆఫర్ ను అందుబాటులో ఉంచనుంది. సెప్టెంబర్ 20 తేదీ నుంచి 24 వ తేదీ వరకూ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయని ఈ ఇ-కామర్స్ సంస్థ ప్రకటించింది. గరిష్టంగా కొన్ని ఉత్పత్తులపై 90 శాతం వరకూ డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించడం విశేషం. కొన్ని దిగ్గజ బ్రాండ్స్ తో ఒప్పందాలు చేసుకున్నామని.. వాటి ఉత్పత్తులను తమ సైట్లో అందుబాటులో ఉంచుతామని, భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిఫ్ కార్ట్ ఊరిస్తోంది. ఇప్పటి వరకూ మూడు సార్లు ఇలాంటి ఆఫర్స్ ను ప్రకటించామని.. ఇది నాలుగో ఎడిషన్ అని పేర్కొంది. అన్ని కేటగిరిల్లోని ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్లు ఉంటాయని, మునుపెన్నడూ ఎరగని స్థాయి ఆఫర్లుంటాయని తెలిపింది. ​ఈ సంస్థతో పాటు.. అమేజాన్ , పేటియం, ఇతర ఇ-కామర్స్ సైట్లు కూడా సెప్టెంబర్లో భారీ ఆఫర్లతో సిద్ధం అవుతున్నాయి.
1entertainment
Apr 02,2017 విక్రయాల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఆధిక్యం ముంబయి : ప్రయివేటు రంగంలో మూడో అతిపెద్ద జీవి తేతర బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌ సీ ఎర్గో ఇన్సూరెన్స్‌ కంపెనీ కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ (సీఎస్‌ సీ) వేదిక ద్వారా పాలసీలు పంపిణీ చేయడం ద్వారా 55 శాతం మార్కెట్‌ వాటాతో మార్కెట్‌ లీడర్‌గా ఆవిష్కరించిందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో సీఎస్‌సీ చానల్‌కు అతిపెద్ద కంట్రిబ్యూటర్‌గా మారిందని పేర్కొంది. సుమారు 10,000 ఆర్‌ఎపీలు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఉత్పాదనలను సిఫారసు చేస్తున్నాయని ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుజ్‌ త్యాగి పేర్కొన్నారు. దీని ద్వారా 1,50,000 పైగ పాలసీలు జారీ చేయడం జరిగిందన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 189 Views BCCI , DINESH KARTHIK Dinesh Karthik న్యూఢిల్లీ: కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్ కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ట్రిన్ బాగో ఫ్రాంఛైజీకి బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ యజమానిగా ఉన్నారు. షారుఖ్ యజమానిగా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ కు దినేశ్ కార్తీక్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో సెయింట్ కిట్స్ తో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ కు కార్తీక్ హాజరయ్యాడు. ట్రిన్ బాగో జట్టు జెర్సీ ధరించి వారి డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో బదులివ్వాలంటూ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ నోటీసులు పంపారు. బీసీసీఐ కాంట్రాక్టు ఆటగాడైన కార్తీక్ కు ఇతర లీగుల్లో ఆడే అవకాశం లేదు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ మినహా ఇతర లీగుల్లో ఆడరాదు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
2sports
Jun 14,2015 టోకు ధరలు, వర్షాలే ప్రధానం        ముంబయి : జూన్‌ 15తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లను ప్రధానంగా టోకు ద్రవ్యోల్బణం సూచీ, రుతుపవనాల నమోదు ప్రభావితం చేయనున్నాయి. కేంద్ర గణంకాల శాఖ ఈ ఏడాది మే టోకు ద్రవ్యోల్బణం సూచీ గణంకాలను సోమవారం వెల్లడించనుంది. ఇదే సమయంలో దేశంలో వర్షాలపై భారత వాతావరణ శాఖ వెల్లడించే అంచనాలను మదుపర్లు కీలకంగా తీసుకోనున్నారు. గత వారం వెల్లడించిన ఏప్రిల్‌ పారిశ్రామికోత్పత్తి సూచీ, వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ, చమురు ధరలను మదుపర్లు దగ్గరగా పరిశీలించనున్నారు. మూడో వారంలోనూ పతనం    వృద్ధి రేటుపై అనుమానాలు, వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో వరుసగా మూడో వారంలోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. మరోవైపు ఎఫ్‌ఐఐలు భారీగా తరలిపోవడానికి తోడు రూపాయి మారకం విలువ క్షీణత మార్కెట్లపై విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ నేపధ్యంలోనే జూన్‌12తో ముగిసిన వారంలో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 343 పాయింట్లు లేదా 1.3 శాతం దిగజారి 26,425 వద్ద నమోదయ్యింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 1.6 శాతం తగ్గి 7,983 పాయింట్లకు పడిపోయింది. కార్పొరేట్‌ కంపెనీల ఆర్ధిక ఫలితాలు బలహీనంగా చోటు చేసుకోవడానికి తోడు అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనుందన్న సంకేతాలు, దేశంలో ఈ ఏడాది వర్షాభావం నెలకొందన్న భారత వాతావరణ శాఖ అంచనాలు మార్కెట్లపై తీవ్ర ఒత్తిడిని పెంచాయని బ్రోకర్లు పేర్కొన్నారు. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌ సూచీ 2.2 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2.6 శాతం చొప్పున నష్టపోయాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 63.75 నుంచి 64.06కు పడిపోయింది. ఎఫ్‌ఐఐలు తరలిపోవడం అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో రూపాయిపై ఒత్తిడి నెలకొంది. పారిశ్రామికోత్పత్తి సూచీ పుంజుకుంటుందని వారాంతంలో ప్రభుత్వం గణంకాలు వెల్లడించడంతో మార్కెట్లకు చివరి రోజు మద్దతు లభించింది. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గించడానికి బ్యాంకర్లు సంసిద్దత వ్యక్తం చేశారని జైట్లీ పేర్కొనడంతో స్వల్పంగా రాణించాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ఈ ఏడాది జూన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లితో విభేదాలు కారణంగా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి మధ్య పెద్ద స్థాయిలో గొడవ జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. వీటికి బలం చేకూరుస్తూ.. అనిల్ కుంబ్లే పుట్టిన రోజున అందరు క్రికెటర్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తే.. విరాట్ కోహ్లి మాత్రం మిన్నకుండిపోయాడు. దీంతో వీరిద్దరి మధ్య దూరం చాలా పెరిగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ.. కోహ్లి తన వివాహ విందుకి ఆహ్వానించగానే.. సతీసమేతంగా హాజరై అనిల్ కుంబ్లే హుందాతనాన్ని చాటుకున్నాడు. రిసెప్షన్‌లో కూడా భారత క్రికెటర్లతో ఈ మాజీ కోచ్ మునుపటిలానే కలివిడిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కోచ్‌గా పనిచేసిన సమయంలో హెడ్‌మాస్టర్‌లా కుంబ్లే వ్యవహరిస్తున్నాడంటూ బీసీసీఐకి జట్టులోని ఆటగాళ్లంతా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి సేన జనవరి 5 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో తప్పక విజయం సాధిస్తుందని ఇటీవల కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
ఫిఫా-2018లో బెస్ట్ గోల్: మెస్సీది కాదు.. రోనాల్డోది అంతకన్నా కాదు Highlights  ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సీ, రోనాల్డో వంటి దిగ్గజాలను నెయిమర్, సురేజ్, గ్రీజ్‌మెన్ వంటి స్టార్లను పక్కకునెట్టి ఫ్రాన్స్‌ యువ సంచలనం బెంజిమిన్ పవార్డ్ నమోదు చేసిన గోల్‌ను 2018 ప్రపంచకప్‌లో అత్యుత్తమమైనదిగా ఫిఫా ప్రకటించింది ఈ ఏడాది ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ అభిమానులకు ఆశించిన దానికన్నా ఎక్కువ వినోదాన్ని అందించింది. అంతగా అభిమానులను అలరించిన ఈ టోర్నీలో అత్యుత్తమ గోల్ ఎవరు నమోదు చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సీ, రోనాల్డో వంటి దిగ్గజాలను నెయిమర్, సురేజ్, గ్రీజ్‌మెన్ వంటి స్టార్లను పక్కకునెట్టి ఫ్రాన్స్‌ యువ సంచలనం బెంజిమిన్ పవార్డ్ నమోదు చేసిన గోల్‌ను 2018 ప్రపంచకప్‌లో అత్యుత్తమమైనదిగా ఫిఫా ప్రకటించింది. బెస్ట్ గోల్‌కు సంబంధించి ఫిఫా అభిమానులకు ఓటింగ్ నిర్వహించింది. దీనిలో అర్జెంటీనాతో  జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో 57వ నిమిషంలో పవార్డ్ కొట్టిన గోల్ ఫుట్‌బాల్ అభిమానుల మనసును దోచుకుంది. దాదాపు 16 మీటర్ల దూరం నుంచి అతను తన్నిన బంతి అర్జెంటీనా రక్షణశ్రేణిని ఛేదించి గోల్‌ పోస్ట్‌లో పడింది. ఈ ఏటీ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఫ్రాన్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.. ఫైనల్లో క్రొయేషియాను ఓడించి ఫ్రెంచ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. Last Updated 26, Jul 2018, 5:37 PM IST
2sports
2000 Currency యథాతథంగా వడ్డీరేట్లు ముంబై: భారతీయ రిజర్వుబ్యాంకు వచ్చే సమీక్షలో కూడా వడ్డీరేట్లను యధాతథంగా కొన సాగించే అవకాశంఉంది. ద్రవ్యోల్బణం లక్ష్యానికి దిగువనే ఉన్నప్పటికీ రుణపరపతి రేట్లు పెరగడం కంటే తగ్గే అవకాశం ఉందని అంచనా. ఆర్‌బిఐ మాత్రం తన రెపోరేట్‌ను 6.25శాతంవద్దనే ఉంచు తుందని రమారమి 60 మందికిపైగా ఆర్థికవేత్తలు చెపుతున్నారు. ఈనెల 5, 6తేదీల్లో నిర్వహించే మానిటరీపాలసీ కమిటీ సమీక్షలో ఇదేతీరు ప్రద ర్శించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో కేంద్ర బ్యాంకు తన వడ్డీరేట్లను కోత విధిస్తుందని అంచనావేసినా బ్యాంకు మాత్రం తటస్థ వైఖరినే ప్రదర్శించింది. 2019వరకూ ఎలాంటివడ్డీరేట్లలో మార్పులు ఉండక పోవచ్చని కొందరు ఆర్థికవేత్తలు వెల్లడించారు. మొత్తం 34 మంది ఆర్థికవేత్తల్లో 21 మంది ఇదే వైఖరి వెల్లడించారు. ఈ ఏడాది చివరిలో అయితే ఏదైనా అవకాశం ఉండవచ్చని కొందరు వెల్లడించా రు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం దిగువస్థాయిలోనేఉంది. అయితే వినియోగరంగం నుంచి డిమాండ్‌ తగ్గడం వల్ల పెద్దనోట్ల రద్దుప్రభావం పడటం వల్ల కూడా ద్రవ్యోల్బణం తగ్గిందని, అయితే రానున్న కాలంలో మార్పులు వచ్చే అవకాశంఉందని, అందువల్ల వడ్డీ రేట్లపై ఇప్పటికీప్పుడు నిర్ణయం తీసుకోలేదని నోర్డియా మార్కెట్స్‌ ఆర్థికవేత్త ఆమీ యువాజ్‌ ఝువాంగ్‌ వెల్లడించారు. దేశ ఆర్థిక వృద్ధి 7.0 శాతంగా ఉంటుందని అక్టోబరు డిసెంబరు త్రైమా సికంలో కూడా ఇదేతీరు ఉంటుందని అంతకు ముందు త్రైమాసికం 7.4శాతంతో పోలిస్తే తగ్గుతుం దని అంచనావేసారు. అయితే 6.4శాతం నుంచి శరవేగంగా వృద్ధి ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ కార్యాచరణ ఇందుకు కీలకం అవుతుందని అన్నారు. పెద్దనోట్ల రద్దుతర్వాతనే ఆర్థికవృద్ధి 6.4శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. వినియోగరంగ ధర లు వార్షికపద్ధతిలో చూస్తే ఫిబ్రవరిలో 3.65 శాతం పెరిగాయి. కేవలం 3.17శాతం మాత్రమే పెరిగా యి. జనవరి 2012 నుంచి ప్రభుత్వం ప్రస్తుత సూచి సిరీస్‌ను ప్రారంభించడమే ఇందుకు కీలకంగా పరిణమించింది. మానిటరీ పాలసీ కమిటీ మొత్తం ఆరుగురుసభ్యులు కూడా ద్రవ్యోల్బణం సత్వరమే పెరిగే ప్రమాదం ఉందని అందువల్ల ద్రవ్యో ల్బణ ఆర్‌బిఐ లక్ష్యం 4శాతానికి చేరాలంటే మరికొంత కాలం వేచిఉండాల్సిందేనన్న అభి మతంతో ఉన్నారు. గతఏడాది సగటు రుతు పవనాలు రావడంతో సకాలంలో పంటలు పండి దిగుబడులు వచ్చాయి. రెండులక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ ఉన్న భారత్‌ లాంటి దేశాల రుతుపవనాలు, వ్యవసాయరంగం అత్యంత కీలకమన్నది తెలిసిందే. మంచిరుతుపవనాలు సాధిస్తే ఆఏడాది ఆహారద్రవ్యోల్బణం కట్టడి చేసే అవకాశముంటుంది.సాధారణ రుతుపవ నాలతో దేశవ్యాప్తంగా కురిసినా ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గుతుందని, ఫలితంగా ఆర్‌బిఐ వడ్డీరేట్లను చివరిత్రైమాసికంలో తగ్గించే అవ కాశం ఉందని, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఆర్థిక సేవలసంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అయి తే రుతుపవనాలు కొంత తటస్థంగా ఉన్నందున ప్రస్తు తం వడ్డీరేట్లు ఉండకపోవచ్చని సంస్థ విశ్లేషిస్తోంది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV Chris Gayle విధ్వంసం వృథా.. 361 రన్స్ టార్గెట్‌ని ఊదేసిన ఇంగ్లాండ్ 361 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. ఆరంభం నుంచి చివరి వరకూ టాప్‌గేర్‌లోనే దూసుకెళ్లింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టోతో తొలి వికెట్‌కి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జేసన్ రాయ్ (123: 85 బంతుల్లో 15x4, 3x6) ఆ తర్వాత రెండో వికెట్‌కి జో రూట్‌తో కలిసి రెండో వికెట్‌కి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. Samayam Telugu | Updated: Feb 21, 2019, 10:48AM IST హైలైట్స్ వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డేలో పరుగుల వరద రికార్డు శతకం బాదిన క్రిస్‌గేల్.. అఫ్రిది అరుదైన రికార్డ్ బ్రేక్ 361 పరుగుల ఛేదనలో జేసన్ రాయ్, జో రూట్ శతకాలు మరో 8 బంతులు మిగిలి ఉండానే విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ వన్డేల్లో ఇంగ్లాండ్ ఎంత ప్రమాదకరమైన జట్టో మరోసారి క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. గత నాలుగేళ్లలో మూడుసార్లు 400పైచిలుకు స్కోరు చేసిన జట్టుగా ఇటీవల రికార్డ్ సృష్టించిన ఇంగ్లాండ్.. తాజాగా వెస్టిండీస్ నిర్దేశించిన 361 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఊదేసింది. ఇక రెండో వన్డే శుక్రవారం రాత్రి జరగనుంది. బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ (135: 129 బంతుల్లో 3x4, 12x6) శతకం సాధిండంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. గేల్‌తో పాటు ఆ జట్టులో షైహోప్ (64: 65 బంతుల్లో 7x4, 1x6), డారెన్ బ్రావో (40: 30 బంతుల్లో 2x4, 4x6) మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్‌లో 12 సిక్సర్లు కొట్టడం ద్వారా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా క్రిస్‌గేల్ రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటి వరకూ 476 సిక్సర్లతో పాకిస్థాన్ మాజీ హిట్టర్ అఫ్రిది అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా 488 సిక్సర్లతో క్రిస్‌గేల్ ఆ రికార్డుని కనుమరుగు చేశాడు. 361 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. ఆరంభం నుంచి చివరి వరకూ టాప్‌గేర్‌లోనే దూసుకెళ్లింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (34: 33 బంతుల్లో 6x4)తో తొలి వికెట్‌కి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జేసన్ రాయ్ (123: 85 బంతుల్లో 15x4, 3x6) ఆ తర్వాత రెండో వికెట్‌కి జో రూట్ (102: 97 బంతుల్లో 9x4)తో కలిసి రెండో వికెట్‌కి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖర్లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (65: 51 బంతుల్లో 4x4, 3x6) కూడా బ్యాట్ ఝళిపించడంతో 48.4 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 364/4తో విజయాన్ని అందుకుంది. రికార్డుల పరంగా వన్డేల్లో ఇంగ్లాండ్‌కి ఇదే అతిపెద్ద ఛేదన..!!
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఐతే.. మూడోసారైనా హిట్ కొడ‌తాడా! ఋషి, ఆంధ్రాపోరి చిత్రాల ద‌ర్శ‌కుడు రాజు మాదిరాజు ఐతే 2.0 పేరుతో మ‌రో కొత్త సినిమాను ప్రారంభించాడు. | Updated: Nov 16, 2015, 06:50PM IST ఋషి, ఆంధ్రాపోరి చిత్రాల ద‌ర్శ‌కుడు రాజు మాదిరాజు ఐతే 2.0 పేరుతో మ‌రో కొత్త సినిమాను ప్రారంభించాడు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. గ‌తంలో 2003లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి 'ఐతే' టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందించాడు. గుణ్ణం గంగ‌రాజు నిర్మించిన ఈ చిత్రం ప‌లు అవార్డులు, ప్ర‌శంస‌ల‌తో పాటు చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను సాధించింది. దాదాపు 12 ఏళ్ల విరామం త‌ర్వాత రాజు మాదిరాజు ఆ హిట్ సినిమా టైటిల్‌ను ఉప‌యోగించుకుంటు టెక్నో థ్రిల్ల‌ర్ క‌థాంశంతో 'ఐతే 2.0'ను రూపొందిస్తున్నాడు. విజ‌య‌రామ‌రాజు, హేమంత్ వ‌ల్ల‌పురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ప్రెసిడెంట్ పి.రామ్మోహ‌న్‌ రావు గౌర‌వ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, ప్ర‌సాద్ ల్యాబ్స్ అధినేత ర‌మేష్ ప్ర‌సాద్ క్లాప్ కొట్టారు. తెలుగు దేశం పార్టీ అధికార ప్ర‌తినిధి జూపూడి ప్ర‌భాక‌ర్‌ రావు కెమెరా స్విఛాన్ చేశారు. ఇంట‌ర్నెట్ వ‌ల్ల క‌లిగే లాభాన‌ష్టాలు, నేటి యువ‌త‌రంపై అంత‌ర్జాల ప్ర‌భావం వంటి అంశాల నేప‌థ్యంలో సందేశాత్మ‌క క‌థాంశంతో ఈ సినిమాని రూపొందిస్తున్న‌ట్లు రాజ్ మాదిరాజు తెలిపారు. బెంగాల్ న‌టుడు ఇంద్ర‌నీల్‌ సేన్ గుప్తా , లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్ జ‌రాషా ప్ర‌ధాన పాత్ర‌ల్ని పోషిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ నేటి నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు నిర్మాత‌లు పేర్కొన్నారు. ఐతే టైటిల్ వాడుకోవ‌డానికి గుణ్ణం గంగ‌రాజు అంగీక‌రించిన త‌ర్వాతే ఈ సినిమాకు ఆ పేరు నిర్ణ‌యించిన‌ట్లు యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
0business
Rio olypics winer Sakshi Mallik అలా అనలేదు: సాక్షిమాలిక్‌ బెంగళూరు: పాక్‌ ప్లేయర్లను భారత్‌లో ఆడనివ్వాలని తాను అన్నట్టుగా వస్తున్న పుకార్లలో నిజం లేదని రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ పేర్కొంది.. తానలా అనలేదని, ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రత్యర్థితోనైనా తలపడే హక్కు అథ్లెట్లకు ఉందని మాత్రమే తానుచెప్పానని ఆమె వివరణ ఇచ్చింది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV తాప్సీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కి హాజరవుతుండటం హీరోయిన్లకి అలవాటనే విషయం అందరికీ తెలిసిందే. | Updated: Feb 15, 2016, 11:20PM IST తాప్సీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కి హాజరవుతుండటం హీరోయిన్లకి అలవాటనే విషయం అందరికీ తెలిసిందే. హీరోయిన్ల రాకతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడటం, వారి అభిమానుల తాకిడితో షాపింగ్ మాల్ పరిసరాలు రద్దీగా మారటం జరుగుతుంది. పనిలోపనిగా కావాల్సినంత ప్రచారం కూడా లభిస్తుంది. రద్దీ కోరుకునే షాపింగ్ మాల్స్ ఓనర్లకి కావాల్సింది కూడా అదే కనుక హీరోయిన్ల చేత ప్రారంభోత్సవాలు చేయించడం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు అభిమానులు, ఆకతాయిల నుంచి హీరోయిన్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులని ఎదుర్కోవాల్సి వచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. ఆదివారంనాడు చెన్నైలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన హీరోయిన్ తాప్సీకి కూడా సరిగ్గా అటువంటి చేదు అనుభవమే ఎదురైందని తెలుస్తోంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి తాప్సీ వస్తోందని తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఎగబడిన అభిమానులు తాప్సీని చుట్టుముట్టేశారు. ఓ క్రమంలో వారిని కంట్రోల్ చేయడం అక్కడున్న భద్రతా సిబ్బంది వల్ల కూడా కాలేదు. అయితే ఇదే అదునుగా భావించిన ఓ ఆకతాయి తాప్సీని ఎక్కడెక్కడో తడమటంతోపాటు ఆమెని దాదాపు వేధించినంత పనిచేశాడట. ఓ దశలో ఆమె చీర కూడా లాగి పైశాచిక ఆనందం పొందినట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. సదరు ఆకతాయిల వేధింపులతో విసిగిపోయిన తాప్సీ ఎలాగోలా ఆ రద్దీలోంచి వెంటనే బయటపడినట్టు సమాచారం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 12, Sep 2018, 12:49 PM IST Highlights ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో పంది పిల్ల(బంటీ) కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ ప్రేక్షకుల దృష్టి ఆకర్షించింది.  ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో పంది పిల్ల(బంటీ) కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ ప్రేక్షకుల దృష్టి ఆకర్షించింది. ఇందులో పంది పిల్లతో డాన్స్ చేయించారు. తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో బంటీ తనను ఇబ్బంది పెట్టేవారికి చుక్కలు చూపిస్తుంది. బంటీని చంపడానికి ప్రయత్నించే వారిని ముప్పుతెప్పలు పెట్టడం ట్రైలర్ లో చూపించారు. అంతేకాదు ట్రైలర్ లో ఒక పంది మరో పందిని.. ''రేయ్ పంది ఒకసారి చెప్తే అర్ధం కాదా..? మనిషిలా పదిసార్లు చెప్పించుకుంటావా..?'' అని చెప్పే డైలాగ్ తో మనుషులపై సెటైర్ వేశాడు రవిబాబు. ట్రైలర్ చివరిలో బంటీని ఎత్తుకొని ఒక ఫ్రేమ్ లో రవిబాబు కూడా కనిపించారు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే తొలి సారి పూర్తి స్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా ఇది. ఇందులో పందిపిల్ల‌ను చాలా రియ‌ల్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసారు గ్రాఫిక్స్ టీం. దీనికోసం చాలా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు ర‌విబాబు. ద‌స‌రా సెల‌వుల్లో ప్రేక్ష‌కుల ఈ సినిమా ముందుకు రాబోతుంది.
0business
Mumbai, First Published 15, Nov 2018, 10:29 AM IST Highlights కేంద్ర ప్రభుత్వం తాననుకున్నదే చేస్తోంది. ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకునే చర్యలు చేపట్టడానికి వీలుగా నిధులు సమకూర్చాలని ఆర్బీఐ ఒత్తిడి తెస్తున్న కేంద్రం ‘సెక్షన్ 7’ అస్త్రాన్ని ప్రయోగిస్తామన్నది. దీన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యతిరేకించారు. కేంద్రం భగ్గుమన్నది. పరిస్థితి విషమిస్తే 19న బోర్డు భేటీ తర్వాత ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఒకడుగు వెనుకేసి ఉర్జిత్ పటేల్ ను ఏమనకుండానే పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకోవాలని భావిస్తున్నది. బహిరంగ వ్యాఖ్యలను చేసిన విరాల్ ఆచార్యను సాగనంపి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని కేంద్రం ఎత్తువేసింది.  ముంబై: మరో ఐదు నెలల్లో మోగనున్న సార్వత్రిక ఎన్నికల నగారా.. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న తరుణం.. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ వంటి ఆర్బీఐలో సంక్షోభం ఏర్పడితే మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలన్నప్రధాని మోదీ వ్యూహం బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే మోదీ సారథ్యంలోని ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? ఈ నెల 19వ తేదీన జరిగే ఆర్బీఐ పాలక మండలి సమావేశం రసాభాసగా ముగియకుండా గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసే పరిస్థితులు తలెత్తకుండా చూసుకుంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు బదులు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య విభేదాలను ఒక్కమాటలో చెప్పాలంటే సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలను బయటపెట్టిన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యపైనా ప్రభుత్వం గుర్రుగా ఉన్నదా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను పక్కకు తప్పుకోవాలని రకరకాల ఒత్తిళ్లు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దిగి రాకుంటే అవిశ్వాసం ప్రవేశపెట్టి, మిగతా బోర్డు సభ్యులను తన దారికి తెచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తున్నట్లు వినికిడి. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు అస్త్ర శస్త్రాలు సిద్దం చేస్తున్నాయి. అయినా దారికి రాకుంటే అప్పుడు పూర్తిస్థాయిలో 'సెక్షన్‌-7' ప్రయోగానికి కేంద్రం సిద్ధం అవుతోంది.  ఆర్బీఐతో ఏర్పడిన అభిప్రాయ బేధాలు కొలిక్కి రాని పక్షంలో.. ఇక దూకుడుగానే ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 19న జరిగే ఆర్బీఐ బోర్డు సమావేశంలో పరిణామాలను బట్టి భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తగినట్లు ప్రభుత్వం తన అస్త్రాలను సమాయత్తం చేస్తున్నట్టుగా సమాచారం. తొలుత ఆర్బీఐ-కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాన్ని బయటి ప్రపంచానికి తెలిసేలా ప్రవర్తిస్తూ.. ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన ఆర్బీఈ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్యపై కక్ష్య సాధింపు చర్యలతో దూకుడును మొదలు పెట్టాలని సర్కారు వర్గాలు భావిస్తున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలను ఉటంకిస్తూ 'లైవ్‌మింట్‌' ఒక వార్తాకథనం ప్రచురించింది.  వచ్చేవారం జరిగే ఆర్బీఐ బోర్డు సమావేశంలో విరాల్‌ను బాధ్యతల నుంచి తప్పించడానికి మిగతా డైరెక్టర్లతో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారని పేరు చెప్పుకోవడానికి ఇష్ట పడని ఓ అధికారి వెల్లడించారు. బోర్డు సమావేశం నాటికి ఉర్జిత్‌, విరాల్‌తో సహా ఆర్బీఐ కీలక కార్యవర్గం దారికొస్తే సరి..! లేకుంటే వచ్చే బోర్డు మీటింగ్‌లో సెక్షన్‌-7లోని వెసులుబాటును ఉపయోగిస్తూ విరాల్‌ ఆచార్యపై అవిశ్వాస తీర్మానాన్ని తేవాలన్నది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది.  ఆర్బీఐ అంతర్గత సున్నిత విషయాలను బయటపెట్టడాన్ని తప్పుబడుతూ 11 మంది సభ్యుల్లో కనీసం నలుగురు ఆచార్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇంటికి పంపించే అవకాశాలు ఉన్నాయని సదరు వర్గాలు తెలిపాయి. విరల్‌పై వేటు వేయడం ద్వారా మిగతా అధికారులకు ప్రభుత్వ సీరియస్‌నెస్‌ను పరోక్షంగా వెల్లడించాలన్నఅంతర్గత యోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.  విరాల్‌ ఆచార్య వికెట్‌ పడితే, మిగతా అధికారులు సర్దుకుంటారని.. అప్పుడు ఆర్బీఐని ఇంటి సంస్థగా మార్చుకోవాలన్న తమ పని కూడా చాలా సులువవుతుందన్నది ప్రభుత్వంలోని కొందరు అధికారుల భావనగా తెలుస్తోంది. ఈ నెల 19న ఆర్బీఐ మీటింగ్‌లో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ మాట్లాడిన తర్వాత  సెక్షన్‌-7పై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.  సెక్షన్ 7పై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గత అక్టోబర్‌లో జరిగిన బోర్డు మీటింగ్‌లో ఆర్ధిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ ప్రసంగం తర్వాత ఎనిమిది గంటల పాటు బోర్డు సమావేశం జరిగింది. ఈ సమయమంతా ప్రధానంగా రెండు అంశాలపైనే చర్చించినా ఒక ఏకాభిప్రాయానికి రాలేక పోయారు.  ఈ సారి విరాల్‌ ఆచార్య వ్యాఖ్యలను బహిరంగంగా మీడియా ముందు ఎద్దేవా చేసిన గార్గ్‌ ఆయనపై కక్ష్య సాధింపునకు బోర్డు సమావేశానికి అవసరమైన అస్త్రాలను సమాయత్తం చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో 19న ఒక్కరోజు మాత్రమే షెడ్యూల్‌ చేసిన బోర్డు సమావేశంలో కూడా ఎలాంటి నిర్మాణాత్మక నిర్ణయాలను ఆశించలేమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  ఇందులో భాగంగానే  స్వయంగా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) నష్ట నివారణ చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే గత వారం (ఈనెల 9న) ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ను రహస్యంగా తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడినట్లు వార్తలొచ్చాయి.  ఎలాంటి సమాచారం లేకుండా ఢిల్లీ వచ్చిన ఉర్జిత్‌ పటేల్‌ పీఎంఓలోని సీనియర్‌ అధికారులతో సంప్రదింపులు జరిపా రన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానితోనూ ఉర్జిత్‌ పటేల్‌ భేటీ అయ్యారని వివిధ అంశాలపై స్పష్టతనిచ్చినట్టుగా పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో, రుణ నిబంధనలను ఆర్బీఐ సరళీకరించాలని ప్రభుత్వం కోరుకుంటున్న నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.  కేంద్రంతో వివాదాస్పద అంశా లను పరిష్కరించుకునే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రయత్నాలు చేస్తోందని.. ఇందులో భాగంగా ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ గత వారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన ట్లుగా ప్రభుత్వం అనుకూల మీడియా ప్రచారం సాగిస్తోంది. పట్టింపులకు పోకుండా రెండు పక్షాలూ కొన్ని విషయాల్లో సర్దుకు పోవాలని నిర్ణయించినట్టు ఈ మీడియా కథనాలను వెల్లడిస్తుండడం విశేషం.  ప్రధాని మోదీతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ భేటీ విషయమై ఇటు ప్రభుత్వం నుంచి గానీ అటు ఆర్బీఐ నుంచి గానీ అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం-ఆర్బీఐ మధ్య వివాదం తారాస్థాయికి చేరి ఈనెల 19న బోర్డు సమావేశం సందర్భంగా, ఆర్బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయనున్నారన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఉర్జిత్‌ రహస్యంగా ప్రధానితో సమావేశం కావడం పలు అనుమాల నుకు తావిస్తోంది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV నోట్ల రద్దు: ఆర్థిక రాజధానిలో వ్యాపారాల బంద్ నోట్ల రద్దు దెబ్బకు దేశ ఆర్థిక రాజధానిలో వ్యాపారాలు అమాంతం పడిపోయింది. అన్ని రంగాల్లోనూ సుమారు 50 నుంచి 75 శాతం మేర లావాదేవీలు తగ్గిపోయాయి. TNN | Updated: Nov 18, 2016, 06:35PM IST దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరెన్సీ రద్దుతో అన్ని వ్యాపారాల పరిస్థితి దిగజారిపోయిది. రూ.1,000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో రోజూవారీ కూలీలతోపాటు అన్ని వ్యాపారాలు పడిపోయాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్లు సగానికి సగం తగ్గిపోగా, హోటళ్లు, వీధి వ్యాపారులు సుమారు 50 శాతం ఆదాయాన్ని కోల్పోయారు. నవీ ముంబయిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీలో 50 శాతం మేర వ్యాపారం తగ్గిపోయింది. ఈ తొమ్మిది రోజుల్లో రియల్ ఎస్టేట్, జ్యువెలరీ, హోటళ్లు, దినసరి కూలీలు, ఆటోలు, టాక్సీ విభాగాలకు సుమారు రూ.700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఆయా రంగాల్లో 50 నుంచి 75 శాతం వరకు బిజినెస్ లావాదేవీలు పడిపోయాయని ఓయస్టర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సీఈఓ అతుల్ జోషి అన్నారు. ఏడాదికి రూ.32,000 కోట్ల విలువైన లావాదేవీలు జరిపే రెస్టారెంట్ల వ్యాపారం ఈ తొమ్మిది రోజుల్లో 40 శాతం తగ్గిపోయిందని ఇండియన్ హోటల్స్ రెస్టారెంట్ అసోసియేట్ తెలిపింది. ముంబయిలో రెస్టారెంట్ల ద్వారా రోజుకు రూ.90 కోట్ల వ్యాపారం జరుగుతుంది, కానీ ప్రస్తుతం అది సగానికి పడిపోయిందని అహర్ తెలిపింది. ప్రధాని ప్రకటన తర్వాత కొన్ని రోజులైతే 60 శాతం తగ్గిపోయిందని అహర్ ప్రెసిడెంట్ ఆదర్శ్ శెట్టి అన్నారు. ఇక రిటెయిల్ రంగాలైన నిత్యావసరాలు, బేకరీలు, కెమిస్ట్, వస్త్ర దుకాణాల్లో 50 శాతం మేర అమ్మకాలు పడిపోయాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో రిటెయిల్ రంగం అపారమైన నష్టాల్లో కూరుకుపోయిందని రిటెయిల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరేన్ షా తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు 37 శాతం తగ్గిపోయాయి. కరెన్సీ రద్దుకు ముందు రోజూ సుమారు 7,300 రిజిస్ట్రేషన్లు జరిగేవి కానీ నవంబరు 10 తర్వాత వీటి సంఖ్య 4500కు పడిపోయింది. రిజిస్ట్రేషన్ల ద్వారా రోజూ రూ.65 కోట్ల వచ్చే ఆదాయం రూ.45 కోట్లకు జారిపోయిందని రిజిస్ట్రేషన్ అండ్ కంట్రోలర్ ఆఫ్ స్టాంప్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ రామస్వామి తెలియజేశారు. ముంబైలోని సుమారు 1,00,000 ఆటోలు ఉన్నాయి.. వీటి ద్వారా నెలకు సగటున రూ.450 కోట్ల టర్నోవర్ జరిగేది. కానీ ఈ తొమ్మిది రోజుల్లో వీరి వ్యాపారం 25 శాతం తగ్గిపోయింది. థియేటర్లలో కొన్ని రోజులుగా కేవలం 30 శాతం వ్యాపారం మాత్రమే జరుగుతోంది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని జీ-7 మల్టీప్లెక్స్ అండ్ మరాఠా మందిర్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ లావాదేవీలు రోజుకు రూ.8 కోట్ల నుంచి రూ.4.5 కోట్లకు పడిపోయాయి. బంగారం, వజ్రాల అమ్మకం 75 శాతం తగ్గిపోయాయని ముంబై జ్యువెల్లరీస్ అసోసియేషన్ తెలిపింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి పెద్ద మొత్తంలో నగదు సరఫరా జరగాలని ఆర్థికవేత్త జయరాజ్ శాల్గొవకర్ అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్న ఈ సమయంలో ఆర్బీఐ వడ్డీ రెట్లను తగ్గిస్తే డిమాండ్ పెంచడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. Mumbai, the country’s economic powerhouse, has been significantly impacted since November 8, when the demonetisation move was announced by the government. The withdrawal of Rs 500 and Rs 1,000 notes has impacted everyone from restaurateurs to daily wage labourers, and business is down everywhere. Property registrations are nearly half of what they were prior to November 9; restaurants and street hawkers have seen a 50% drop in daily earnings, and traders at Navi Mumbai APMC, the city’s main agricultural produce market, are reporting a 50 per cent drop in business after the central government’s demonetisation measure. A ballpark estimate of just the losses the above sectors have incurred over the last 9 days is around Rs 700 crore, and that should provide an illuminating picture of the trough demonetisation has landed Mumbai in. “It seems business is 50 to 75% down, depending on the sector, but the sectors where discretionary expenses are involved such as entertainment are hit the hardest,” said Atul Joshi, CEO, Oyster Capital Management.
1entertainment
న్యూఢిల్లీః ఇప్ప‌టికే అన్ని ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌ల‌కు, ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేశారు. ఇక నుంచి మ‌దుప‌ర్ల మార్కెట్ కూడా ఆధార్ ఆధారంగానే న‌డిచేలా చేసేందుకు ప్ర‌భుత్వం యోచిస్తుంది. షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టాలంటే ఇక నుంచి ఆధార్ ఉంటేనే సాధ్య‌ప‌డేలా ఉంది. ఆర్థిక లావాదేవీల‌కు ఆధార్‌ను ముడిపెట్టేందుకు సెబీ ప్ర‌య‌త్నిస్తున్నట్లు తెలుస్తోంది. అక్ర‌మంగా సంపాదించిన న‌ల్ల‌డ‌బ్బును స్టాక్ మార్కెట్ల పెట్టుబ‌డి ద్వారా చాలా మంది తెల్ల‌డ‌బ్బుగా మారుస్తున్నార‌ని, వీరిని క‌ట్ట‌డి చేయ‌డానికే ఈ ఆధార్ అనుసంధాన‌మ‌ని మ‌దుపర్ల మార్కెట్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే షేర్లలో, మ్యాచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టాలంటే పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌నే నిబంధ‌న ఉంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన స్ప‌ష్ట‌మైన ఉత్త‌ర్వుల‌ను సెబీ జారీ చేసే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయ‌ని ఆర్థిక శాఖ అధికారి ఒక‌రు పేర్కొన్నారు.
1entertainment
Mumbai, First Published 27, Oct 2018, 7:13 AM IST Highlights ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో జరిగే టీ20 సిరీస్‌లకు 16 మంది సభ్యులతో కూడిన జట్లను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ రెండు సిరీస్ లకు కూడా ధోనీని పక్కన పెట్టారు.  ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బిసిసిఐ సెలెక్షన్ కమిటీ షాక్ ఇచ్చింది.  ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో జరిగే టీ20 సిరీస్‌లకు 16 మంది సభ్యులతో కూడిన జట్లను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ రెండు సిరీస్ లకు కూడా ధోనీని పక్కన పెట్టారు.  వెస్టిండీస్ తో నవంబర్ 4వ తేదీ నుంచి జరిగే టీ20 సిరీస్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కు మాత్రం కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. హార్దిక్ పాండ్యాను కూడా సెలక్టర్లు దూరం పెట్టారు. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచులు టెస్టు సిరీస్ కు కూడా విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు.    విండీస్‌తో జరిగే టీ20 సిరీస్ కు జట్టు ఇదే రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, డీకే, మనీశ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కృణాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కులదీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, షాబాజ్ నదీమ్   ఆసీస్‌తో జరిగే సిరీస్‌కు టీమ్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్(వైస్ కెప్టెన్), శిఖర్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ , మనీశ్, డీకే, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, కృణాల్ పాండ్య, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాద్, ఖలీల్. ఆసీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు జట్టు విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కెఎల్ రాహుల్, పృత్వీ షా, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమాన్ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ షమీ, ఇషాంత్, ఉమేష్ యాదవ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్ Last Updated 27, Oct 2018, 7:13 AM IST
2sports
Hyderabad, First Published 13, Jul 2019, 12:04 PM IST Highlights విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం 'దొరసాని'.  విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం 'దొరసాని'. జీవిత, రాజశేఖర్ ల రెండో కుమార్తె శివాత్మిక ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాని ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రివ్యూ చూసిన చాలా మంది సెలబ్రిటీలు మాత్రం సినిమా బాగుందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్రమోషన్స్ లో కూడా సపోర్ట్ చేయలేదు. అయితే ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరై యూనిట్ ని అభినందించారు. సినిమా విడుదలైన తరువాత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టి చిత్రబృందాన్ని అభినందించాడు. ''యువ నటీనటులను చూసి గర్వపడుతున్నాను. మై బాయ్.. ఐ లవ్యూ సో మచ్. కానీ నీకంటే రాజునే ఎక్కువగా ఇష్టపడుతున్నాను. శివాత్మిక పెర్ఫార్మన్స్ అధ్బుతంగా ఉంది. కథ నిజంగానే జరిగినట్లు తమ పెర్ఫార్మన్స్ తో ఆవిష్కరించిన నటీనటుల కారణంగా సినిమా చూడడానికి అధ్బుతంగా ఉంది. కె.వి.ఆర్.మహేంద్ర, ప్రశాంత్ విహారి, సన్నీ కూరపాటి మీరు నిజంగా సూపర్. త్వరలోనే మన దారులు కలుస్తాయని అనుకుంటున్నారు. సినీ లవర్స్ ని ఈ సినిమా మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్'' అంటూ రాసుకొచ్చాడు.   Last Updated 13, Jul 2019, 12:04 PM IST
0business
Dec 14,2015 4జీ.. ఏడాదంతా ఫ్రీ నవతెలంగాణ వాణిజ్య విభాగం : హైదరాబాద్‌ చౌక మొబైల్‌ హ్యాండ్‌ సెంట్ల తయారీ సంస్థ డేటావిండ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 4జీ మొబైల్‌ని విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈవో సునీత్‌ సింగ్‌ తులి ప్రకటించారు. అయితే ఇందులో విశేషం ఏంటి అంటారా ! విశేషం ఉంది దీని ధర కేవలం రూ. 3వేలు, అంతేకాదు ఇది 12నెలలు పాటు అపరిమిత 4జీ ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ మీ సొంతం. ఇప్పటికే రిలయన్స్‌, టెలినార్‌ సంస్ధలతో కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉందని ,మరికొన్ని టెలికాం ఆపరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు. నెట్‌ బ్రౌజింగ్‌ మాత్రేమే అపరిమితమని ఎలాంటి డౌన్‌లోడ్‌లు చేసుకునే అవకాశం లేదని సునీత్‌ సింగ్‌ తులి తెలిపారు. ఎవరైన ఏ వైబ్‌సైట్‌నైనా ఉచితంగా బ్రౌజింగ్‌ చేసుకునే అవకాశం ఉందని సునీత్‌ స్పష్టం చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Dec 06,2017 ప్రీ బడ్జెట్‌ సమావేశం.. న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ముందస్తు బడ్జెట్‌ మీటింగ్‌ కసరత్తులో భాగంగా మంగళవారం వ్యవసాయ రంగ స్టేక్‌ హోల్డర్స్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సబ్రమణ్యన్‌తో పాటు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV బాలీవుడ్ నటుడిపై అత్యాచారయత్నం కేసు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తనపై అత్యాచారయత్నానికి పాల్పడటంతోపాటు చేయి చేసుకున్నాడంటూ ఓ మహిళ పోలీసులకి ఫిర్యాదు చేసింది. TNN | Updated: Jan 17, 2016, 09:37PM IST <br /> బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తనపై అత్యాచారయత్నానికి పాల్పడటంతోపాటు చేయి చేసుకున్నాడంటూ ఓ మహిళ ముంబైలోని వర్సోవా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. టూ వీలర్ పార్కింగ్ కోసం సొసైటీకి కేటాయించిన స్థలాన్ని ఆక్రమించిన నవాజుద్ధీన్‌ని ఇదేంటని ప్రశ్నించినందుకు అతడు తనపై చేయి చేసుకున్నాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. భజ్రంగీ భాయిజాన్ సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖీకి కెరీర్ పరంగా ఆ సినిమా అతడికి మంచి పేరు తీసుకువచ్చింది. భజ్రంగీ భాయిజాన్ అనంతరం కొన్ని లీడ్ రోల్ ఆఫర్స్‌ని సైతం చేజిక్కించుకున్నాడు నవాజుద్దీన్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
flip kart బిగ్‌ఆఫర్లతో ఇ-కామర్స్‌ పోటీ ముంబయి, మే 10: ఇ-కామర్స్‌ కంపెనీల బిగ్‌ ఆఫర్లజోరులో ఒకదాని కొకటి పోటీపడుతున్నాయి. అమెజాన్‌ తన ఆఫర్లసేల్‌ను ప్రకటించిన వెంటనే ఫ్లిప్‌కార్ట్‌ తన పరిమితకాలపు అమ్మకాలను ప్రారంభిస్తోంది. సోమవారం నుంచి ఈడిస్కౌంట్లు ఉంటాయి. బిగ్‌10సేల్‌ పేరిట ఈ నెల 14వతేదీ నుంచి 18వ తేదీవరకూ విక్రయాలుంటాయి. సుమారు 90శాతం వరకూ డిస్కౌంట్లు అమలవుతాయని కంపెనీ చెపుతోంది. మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇతర పనిముట్లపై సోమవారం నుంచి డిస్కౌంట్‌ అమలవుతుందని అంచనా. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌10సేల్‌ ప్రకారంచూస్తే 15వ తేదీ నుంచే అధికశాతం డిస్కౌంట్లు అమలవుతున్నాయి. టివిలు, టివి కాబినెట్లు, మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ యాక్సెసరీస్‌, హెడ్‌ఫోన్లు, బీన్‌ బ్యాగ్స్‌, ఫ్యాషన్‌ దుస్తులు ఫుట్‌వేర్‌ వంటి వాటిపై ఈ డిస్కౌంట్లు అమలవుతాయి. క్యాష్‌బ్యాక్‌ హెచ్‌డిఎఫ్‌సి కార్డులపై 10శాతం డిస్కౌంటు, డిజిటల్‌ వాలెట్‌ఫోన్‌ఫేపై చేస్తే 30శాతం వరకూ అందిస్తోంది. అలాగే అమెజాన్‌ కూడా మరింతగా గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ పేరిట అమలుచేస్తోంది. ఈనెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ ఈ సేల్‌ మరింతగా కొనసాగిస్తుందని అంచనా. అమెజాన్‌ భారీ ఎత్తున విస్తరణ ఇతర సంస్థలకు భారీ విఘాతం కలిగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV Nayanthara: సైరా ‘సిద్ధమ్మ’: నయనతార మోషన్ పోస్టర్ నయనతార హీరోయిన్‌గా నటించిన మెగాస్టార్ 151 మూవీ సైరా నరసింహారెడ్డి మూవీ నుండి ఆమె రోల్‌కి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ఆదివారం నాడు విడుదల చేశారు. Samayam Telugu | Updated: Nov 18, 2018, 12:42PM IST అందాల తార నయనతార బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరేపోయే గిఫ్ట్ ఇచ్చింది ‘సైరా’ యూనిట్. ఆమె హీరోయిన్‌గా నటించిన మెగాస్టార్ 151 మూవీ సైరా నరసింహారెడ్డి మూవీ నుండి నయనతార రోల్‌కి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్యగా ‘సిద్ధమ్మ’ పాత్రలో నయనతార అదిరిపోయే గెటప్‌లో దర్శనం ఇచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోవడమే అలవాటుగా చేసుకున్న ఈ సీనియర్ హీరోయిన్ ‘సిద్ధమ్మ’ పాత్రలో ఒదిగిపోయినట్లు మోషన్ పోస్టర్‌లో కనిపిస్తుంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి హేమాహేమీలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. వేసవి కానుకగా 2019లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘సైరా నరసింహారెడ్డి’. X
0business
ఫ్రాన్స్ హీరో అంటోనీ గ్రీజ్‌మ్యాన్ ‌( వీడియో) Highlights ఫిఫా ప్రపంచకప్‌లో మాజీల పోరు ముగిసింది. ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ 2-0తో గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. కెప్టెన్, గోల్ కీపర్ హ్యూగో లోరిస్, స్టార్ ఆటగాడు అంటోనీ గ్రీజ్‌మ్యాన్‌లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు ఫిఫా ప్రపంచకప్‌లో మాజీల పోరు ముగిసింది. ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ 2-0తో గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. కెప్టెన్, గోల్ కీపర్ హ్యూగో లోరిస్, స్టార్ ఆటగాడు అంటోనీ గ్రీజ్‌మ్యాన్‌లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. యావత్ దేశం ఇప్పుడు వీరిద్దరిని ప్రశంసలతో ముంచెత్తుతోంది. ముఖ్యంగా గ్రీజ్‌మ్యాన్‌ను ఆకాశానికెత్తెస్తోంది ఫ్రాన్స్ మీడియా. ఒక గోల్  కొట్టడంతో పాటు.. మరో కీలకగోల్‌లోనూ గ్రీజ్ ముఖ్యభూమిక పోషించాడు. అందుకే అతన్ని ‘ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ’ అవార్డు వరించింది. అతని గురించి ఒకసారి చూస్తే: * 2016 యూరోకప్‌లో జట్టును ఫైనల్స్‌కు చేర్చిన ఘనత గ్రీజ్ మ్యాన్‌దే.. జర్మనీతో  జరిగిన సెమీ ఫైనల్స్‌లో రెండు గోల్స్ చేసి జట్టును ముందుండి నడిపించాడు.. అంతేకాదు ఈ టోర్నీలో మొత్తం 9 గోల్స్ కొట్టి అత్యధిక గోల్స్  కొట్టిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. * 2016 యూరో కప్‌లో అత్యధిక గోల్స్ (6) సాధించిన ఆటగాడిగా ‘ప్లేయర్ ఆఫ్ ది సీరిస్’ అందుకున్నాడు. * 2017లో జరిగిన ఛాంపియన్ లీగ్‌ మ్యాచ్‌లో పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో సీజర్స్ కిక్ గోల్ ప్రేక్షకులతో పాటు ఫుట్ బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.. దశాబ్ధాల చరిత్ర కలిగిన ఛాంపియన్స్ లీగ్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యుత్తమ గోల్‌గా గ్రీజ్‌మ్యాన్ కొట్టిన గోల్ ఎంపికైంది. * క్వార్టర్స్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన గ్రీజ్‌మ్యాన్ ప్రపంచకప్‌లలోనూ, యూరోపియన్ ఛాంపియన్ షిప్‌లలోనూ నాకౌట్ స్టేజ్‌లో ఏడు గోల్స్ కొట్టాడు. * మెగా టోర్నీల్లో తాను ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ చేసిన 12 గోల్స్‌ల్లో గ్రీజ్‌మ్యాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది.  * గ్రీజ్‌మ్యాన్ ఆడిన మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్  విజయాల శాతం 69శాతంగా నమోదవ్వగా.. అతను లేని మ్యాచ్‌ల్లో 50శాతం మాత్రమే ఫ్రాన్స్ విజయాలను అందుకుంది. * ప్రపంచకప్‌లో సగటున ప్రతి 151 నిమిషానికి గ్రీజ్‌మ్యాన్ ఒక గోల్ సాధించాడు. * అదే యూరో కప్‌లో అయితే  ప్రతి 92 నిమిషాలకు ఒక గోల్ కొట్టాడు. * ఫిఫా ఆరంబానికి ముందు జరిగిన మూడు వార్మప్ మ్యాచ్‌ల్లో ప్రతి 172 నిమిషాలకు గ్రీజ్‌మ్యాన్ ఒక గోల్ కొట్టాడు. "
2sports
కోట్లు డిమాండ్ చేస్తున్న ప్రియా వారియర్ Highlights ఒక్క ఎక్స్ ప్రెషన్ తో రాత్రికిరాత్రే క్రేజీ స్టార్ అయిన ప్రియా వారియర్ 'ఓరు అడార్ లవ్' సినిమాలోని ప్రమోషన్ సీన్ కు దేశమంతా ఫిదా తాజాగా టాలీవుడ్ మూవీ కోసం కోట్లల్లో డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం గూగుల్‌లో ఇప్పటి వరకు మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీల లిస్టులో సన్నీలియోన్ అగ్రస్థానంలో ఉండేది. అయితే ఇపుడు సన్నీని వెనక్కి నెట్టేసి ప్రియా వారియర్ మొదటి స్థానంలో నిలిచింది. కోట్లాది మంది ఫ్యాన్స్ 'ఓరు అడార్ లవ్' సినిమాలోని ప్రమోషన్ సీన్ లో ఆమె కన్నుకొడుతున్న షాట్ సంచలనం అయింది. కళ్లతో ఆమె పలికించే హావభావాల్లో ఒక మత్తు ఉండటంతో అంతా ఫ్లాట్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమెకు ఇపుడు కోట్లాది మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు.   ఆ వీడియో పుణ్యమా అని ప్రియా వారియర్‌పై అన్ని సినిమా ఇండస్ట్రీల కన్ను పడింది. టాలీవుడ్ లో నిఖిల్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం ప్రియా ప్రకాశ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆమెకు డిమాండ్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. నిఖిల్-తరుణ్ భాస్కర్ మూవీ కోసం ప్రియా వారియర్ డేట్స్ చూస్తున్న దర్శకుడు ఒమర్ లులును సంప్రదించగా రెండు కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు.   ‘ఓరు అడార్ లవ్' టీజర్‌లో ప్రియా వారియర్ తన ప్రియుడి పైకి ప్రేమ తుపాకి ఎక్కుపెట్టింది. ముద్దులనే బుల్లెట్లుగా మార్చి అతడి గుండెల్లో కసిగా దించేసింది. ఈ టీజర్ కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో వైరల్ అవ్వడంతో పాటు ట్రెండింగ్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ‘ఓరు అడార్ లవ్' చిత్రం మార్చి 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రియా వారియర్ అందానికి దేశం మొత్తం ఫిదా అవ్వడంతో... మున్ముందు అమ్మడు ఏ రేంజికి వెళుతుందో అంటూ చర్చించుకుంటున్నారు. Last Updated 26, Mar 2018, 12:00 AM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సినీ నటుడు బాలాజీపై జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు..బాధితురాలికి శ్రీరెడ్డి అండ అన్యాయం జరిగిందంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఓ జూనియర్ ఆర్టిస్ట్‌కు అండగా నిలిచింది నటి శ్రీరెడ్డి. బాధితురాలితో కలిసి వెళ్లి సినిమా, సీరియల్ నటుడు బాలాజీపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. Samayam Telugu | Updated: May 13, 2018, 06:58PM IST అన్యాయం జరిగిందంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఓ జూనియర్ ఆర్టిస్ట్‌కు అండగా నిలిచింది నటి శ్రీరెడ్డి . బాధితురాలితో కలిసి వెళ్లి సినిమా, సీరియల్ నటుడు బాలాజీపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు విషయానికొస్తే... లక్ష్మీ అనే మహిళ హైదరాబాద్ యూసఫ్‌గూడలో తన కూతురితో కలిసి ఉంటోంది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమె కూతురి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో... ఆస్పత్రుల చుట్టూ తిప్పి అప్పుల పాలయ్యింది. 2016 నటుడు బాలాజీ ఆమెను కలిసి... తన భార్యకు కిడ్నీ ఇస్తే రూ.20 లక్షలు ఇస్తానని ఒప్పించాడట. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి కూడా చేశారట. అయితే బాలాజీ ఒప్పందం ప్రకారం డబ్బు తనకు ఇవ్వలేదని లక్ష్మీ ఆరోపిస్తోంది. ఆపరేషన్ జరిగిన సమయంలో రూ.3లక్షలు ఇచ్చి... తెల్ల పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని చెబుతోంది. తనకు డబ్బు మొత్తం ఇచ్చేసినట్లు దొంగ పత్రాలు సృష్టించి మోసం చేశారంటోంది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించగా... శ్రీరెడ్డి కూడా అండగా నిలబడింది. బాలాజీపై వారిద్దరూ కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బాలాజీ పీఎస్‌కు వచ్చాడు. తన దగ్గరున్న ఆధారాలను పోలీసులకు అందజేశాడు. అయితే లక్ష్మీ నుంచి వివరాలు సేకరించామని... దీనిపై న్యాయపరంగా సలహా తీసుకొని ముందుకెళతామంటున్నారు పోలీసులు.
0business