news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Hyderabad, First Published 5, Sep 2019, 12:46 PM IST
Highlights
హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం వార్. దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా కోసం వివిధ దేశాల్లో యాక్షన్ సీన్స్ ని 100కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం వార్. దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా కోసం వివిధ దేశాల్లో యాక్షన్ సీన్స్ ని 100కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే తెలుగు ట్రైలర్ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరో తెలుగు సాంగ్ తో సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ అండ్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.
Last Updated 5, Sep 2019, 12:48 PM IST | 0business
|
Suresh 119 Views RELIANCE
కాదంబ పుష్పాలు, స్వింగ్స్డిజైన్లలో మిలాని బ్రాండ్సరికొత్త ఆభరణాలను రిలయన్స్ జ్యుయెల్స్ ప్రవేశపెట్టింది.
రిలయన్స్ నుంచి కొత్తడిజైన్ ‘మిలాని’
హైదరాబాద్, జనవరి 13: కాదంబ పుష్పాలు, స్వింగ్స్డిజైన్లలో మిలాని బ్రాండ్సరికొత్త ఆభరణాలను రిలయన్స్ జ్యుయెల్స్ ప్రవేశపెట్టింది. డిజైనర్ గరిమా మహేశ్వరి రూపొందించిన ఈ కొత్త తరం ఆభర ణాలను రిలయన్స్బ్రాండ్ జ్యుయెల్స్ అందిస్తోంది. మిలాని అంటే గాలిమృధువుగా స్పృశించడం అని అర్ధం. ఆకర్షణీయ మైన పూల డిజైన్లతోప్రతి మహిళా వాటిని కోరుకుంటుందని, సమకాలీన, ఆధునిక వజ్రాభరణాల జ్యుయెలరీ డిజైన్స్, ఆధునికత ఉట్టిపడేలా బంగారంలో సాంప్రదాయ వారసత్వ డిజైన్లు పాశ్చాత్య దుస్తులకు సరిజోడుగా ఉంటాయని రిల యన్స్ జ్యుయెల్ ప్రకటించింది వజ్రాలతో పొదిగిన బంగారు నెక్లెస్, కదంబ పువ్వుల శ్రేణిలో రూపుదిద్దుకుంది. ఈ ఆధునిక అందమైన నెక్లెస్ సెట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో లభిస్తుంది. ఇదే తరహాలో బ్రాస్లెట్లు, చేతిరింగులు కూడా ఈ కలెక్షన్లో ఉన్నట్లు రిలయన్స్ జ్యుయెల్స్ వివరించింది. అధునాతన డిజైన్ ఆభరణాలు కోరుకునేవారికి కొత్తగా వచ్చిన రిలయన్స్ మిలాని బ్రాండ్ ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని రిలయన్స్ ప్రకటించింది.
========= | 1entertainment
|
ఆ తర్వాత వైజాగ్ లోనే మకాం- మెగాస్టార్ చిరంజీవి
Highlights
రంగస్థలం ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి
ప్రస్థుతం హైదరాబాద్ లో నివాసముంటున్న చిరు
ప్రి రిలీజ్ ఈవెంట్ లో వైజాగ్ పై తన ప్రేమను చాటిన చిరు
రిటైరయ్యాక మకాం వైజాగ్ లోనే..?
మెగాపవర్ స్టార్ రామ్చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `రంగస్థలం`. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైజాగ్ ఆర్.కె.బీచ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, సమంత, పూజా హెగ్డే, ఆది పినిశెట్టి, సుకుమార్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.ఎం(మోహన్), రామ్ లక్ష్మణ్, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``తెలుగు ప్రజలకు, మెగాభిమానులకు ఉగాది శుభాకాంక్షలు. నాకు వైజాగ్తో మంచి అనుబంధం ఉంది. ఈ నగరాన్ని, ఇక్కడి అభిమానుల్ని చూస్తుంటే నేను ప్రారంభంలో చేసిన ఆరాధన, అభిలాష, ఘరానామొగుడుసినిమాలు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో బంగారు భవిష్యత్ గురించి ఆలోచించుకుంటూ వైజాగ్ అంతటా తిరిగిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. రేపు రిటైర్డ్ అయిన తర్వాత వైజాగ్లోనే ఉండాలనిపిస్తుంది. నిర్మాతలు విజయవంతమైన సినిమాలు చేసి వారికంటూ ఓ బ్యానర్ వేల్యూను క్రియేట్ చేసుకున్నారు. ప్రతి హీరో వారితో సినిమా చేయాలనుకుంటున్నారంటే వారెంత మంచి నిర్మాతలు అర్థం చేసుకోవచ్చు. దేవిప్రసాద్, త్రివిక్రమ్ రావు, అశ్వనీదత్, అల్లు అరవింద్ వంటి స్టార్ నిర్మాతల స్థాయి నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. చరణ్ ఎప్పుడూ వారి గురించే చెబుతుండేవాడు. ఈ సినిమా వారికి హ్యాట్రిక్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. సుకుమార్ అద్భుతమైన పనితనాన్ని చూపించాడు. ప్యూర్ విలేజ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. తను నాకు చెప్పినప్పుడు ఎలాచెప్పాడో.. అంతే ప్యూర్గా ఈ రోజు ఎమోషనల్గా సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ప్రేక్షకులను సినిమా కట్టి పడేస్తుంది. సినిమాను నేను ఎంజాయ్ చేసి చూశాను. ప్రేక్షకులందరినీ అలరించే సినిమా అవుతుంది. నాకు ఖైదీ సినిమా ఎలాగో.. రామ్చరణ్కి ఇది స్టార్స్టేటస్ను పెంచే సినిమా అవుతుంది. తను పెర్ఫామర్గా ఎదిగే సినిమా అవుతుంది. సుకుమార్.. చరణ్తో ఇంత మంచి సినిమా చేసినందుకు ఆర్టిస్ట్గా ఈర్ష్య పడుతున్నాను. ఓ తండ్రిగా గర్వపడుతున్నాను. సుకుమార్ గ్రామంలో పుట్టి పెరగడం వల్ల ఎమోషన్స్ మిస్ కాకుండా చక్కగా తీశాడు. సినిమాలో ఓ కన్విక్షన్తో నేచురల్గా సాంగ్స్ను తెరకెక్కించాడు. హీరో క్యారెక్టర్ను డీ గ్లామరైజ్ చేయించి ..చరణ్కెరీర్లో ఓ తలమానికమైన సినిమాను చేసిన సుకుమార్కి నా అభినందనలు. సుకుమారే ఈ సినిమాకు కర్త,కర్మ, క్రియగా సినిమాను ముందుకు నడిపించాడు. దేవిశ్రీ ప్రసాద్ చాలా అద్భుతమైన బాణీలను అందించాడు. నాలుగు రోజుల్లో అంత మంచి సాంగ్స్ ఇచ్చాడని తెలిసి ఆశ్చర్యపోయాను. చంద్రబోస్గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. నెటివిటీకి అనుగుణంగా అందమైన పాటలను అందించారు. రత్నవేలుగారు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. రామకృష్ణ, మోనికగారు అద్భుతమైన సెట్ వేశారు. ఆ సెట్ రియల్ లోకేషన్లా అనిపించింది. తనకు ఈ సినిమాతో అవార్డులు రావడం ఖాయం. ఆది డిగ్నిటి ఉన్న పాత్రలో అత్యద్భుతంగా నటించాడు. చరణ్ గర్వపడేలా సినిమాలో నటించాడు. చాలా ఇన్టెన్స్తో నటించాడు. సమంత పాత్రలో ఒదిగిపోయింది. జగపతిబాబుగారు సెటిల్డ్ రోల్ చేశారు., ప్రకాశ్ రాజ్గారి పాత్ర, అనసూయ చేసిన అత్తపాత్ర సహాఅన్నీ పాత్రలు మెప్పిస్తాయి. ఈ సినిమా ప్రజలను ఆకట్టుకోవడమే కాదు.. అన్ని విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంటుంది. జాతీయస్థాయిలో కూడా అవార్డువచ్చినా ఆశర్య లేదు. జాతీయ అవార్డులు వస్తుందని.. రావాలని ..రాకుంటే అన్యాయం జరిగినట్లే. 2018లో ఈ సినిమా అత్యద్భుతమైన సినిమా అవుతుందని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ - ``మా జ్ఞాపకాలన్నీగుర్తుకు తెచ్చుకుంటూ చేసిన సినిమా ఇది. సుకుమార్గారితో ఆర్య నుండగి అనుబంధం ఉంది. మా 30 ఏళ్ల కెరీర్లో చాలా మంది డైరెక్టర్స్తో పనిచేశాం. కానీ సుకుమార్ వంటి డైరెక్టర్ పిచ్చి డైరెక్టర్ని చూడలేదు. సినిమాలంటే అలాంటి పిచ్చి ఉన్న డైరెక్టర్ ఆయన. అన్నయ్యతో ఖైదీ నంబర్ 150 చేశాం. ఇప్పుడు చరణ్తో రంగస్థలం చేశాం. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. చరణ్ బాబు ఈ సినిమాతో అందరి కుటుంబంలో ఓ వ్యక్తిలా ఉండిపోయే పాత్ర చేశాడు. తెలుగు నెటివిటీని సుకుమార్గారు చూపించారు. నిర్మాతలు త్రిమూర్తులు. ఎంతో మంది టెక్నీషియన్స్ను ప్రోత్సహిస్తున్నారు. వారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం`` అన్నారు.
మెగాపవర్స్టార్ రామ్చరణ్ మాట్లాడుతూ - ``నిర్మాతలు రాజమండ్రిలో షూటింగ్ సమయంలో 400-500 మంది ఉండటానికి కావాల్సిన వసతులన్నీ చేసి అందరినీ కంఫర్ట్గా ఉంచారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. రత్నవేలుగారు ఓ ఊరుని ఎంతో అందంగా ఉండాలో అంత అందంగా చూపించారు. అలాగే రామ్లక్ష్మణ్ మాస్టర్స్ ఎమోషన్స్తో పైట్స్ను కంపోజ్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణగారికి, మోనిక గారికి థాంక్స్. నాన్నగారు నాలుగైదు సార్లు నెల్లూరుకి తీసుకెళ్లారు. ఆపద్భాంవుడు సినిమాకు పూడిపల్లి గ్రామానికి తీసుకెళ్లారు. తర్వాత నేను పల్లెటూరుకి వెళ్లలేదు. ఈ సినిమాతో సుకుమార్ నా కోరికను తీర్చాడు. సమంతతో నటించేటప్పుడు ఓ ఎనర్జీ వస్తుంది. తను మంచికో ఆర్టిస్ట్. అనసూయగారికి థాంక్స్. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. తనతో నేను చేసిన రెండో సినిమా ఇది. చంద్రబోస్గారు అందరికీ ర్థమయ్యే రీతిలో సాహిత్యాన్ని అందించారు. ఇంత మంచి సినిమా చేయడానికి కారణమైన సుకుమార్గారికి హ్యాట్సాఫ్. నాకే ఓ కొత్త చరణ్ని పరిచయం చేశాడు. సుకుమార్గారి వల్ల నాపై నాకే గౌరవం పెరిగింది. సుకుమార్గారిని రోజూ చూడలేనేమోనని దిగులు పట్టుకుంది. ఆ గడ్డం లుక్, లుంగీని బాగా ఎంజాయ్ చేశాను. నా అమ్మానాన్నలతోపాటు ఫ్యాన్స్ గర్వపడే సినిమాను సుకుమార్ నాకు ఇచ్చారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.
గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``రెండేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవిగారు ఇదే వేదికపై `సరైనోడు` సినిమా ఫంక్షన్కి వచ్చి బన్నిని ఆశీర్వదించాడు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు రంగస్థలం కోసం ఇదే వేదికపైకి చరణ్ని ఆశీర్వదించడానికివచ్చారు. చరణ్ ఇది వరకు ఎప్పుడూ చేయని సినిమా ఇదని.. సినిమా చూసిన అందరూ అంటున్నారు. చరణ్కి ఇది ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. సినిమాలో పనిచేసిన అందరికీ అభినందనలు. చరణ్కు స్పెషల్ అభినందనలు. సమంత చాలా నేచురల్గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సుకుమార్తో అందరూ హీరోలు పనిచేయాలని కోరుకుంటారెందుకో ఈ సినిమా ఒక చిన్న ఉదాహరణ`` అన్నారు.
చిత్ర దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ - ``చిరంజీవిగారికి, అరవింద్గారికి నమస్కారాలు. చిరంజీవిగారు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి పదవికంటే చిరంజీవిగారి పదవి పెద్దది కదా! అయనెందుకు రాజకీయాల్లోకి వస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. నిజంగానే చిరంజీవిగారి పదవి చాలా ప్రత్యేకం. ఆయనకే సాధ్యం. ఈ సినిమా చూసిన ఆయన ఎంతో బాగా అప్రిసియేట్ చేశారు. నిర్మాతలు గురించి చెప్పాలంటే.. మా టీంను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. రత్నవేలుగారి సినిమాటోగ్రఫీ కారణంగా నేను మంచి దర్శకుడ్ని కాగలిగాను. దేవిశ్రీ ప్రసాద్ సిచ్యువేషన్స్ విని.. కేవలం మూడున్నర రోజుల్లోనే గొప్ప మ్యూజిక్ అందించాడు. నా ఎమోషన్స్ను తను చక్కగా క్యారీ చేశాడు. చంద్రబోస్గారు పాట రాయలేదు. అలా చెప్పుకుంటూ పోయారు. సమంతతో లైఫ్లాంగ్ సినిమాలు చేయాలని ఉంది. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ వేసిన సెట్ మనకు కనపడదు. ఎందుకంటే సెట్ అంత బాగా వేశాడు. తనకు అవార్డుని క్రియేట్ చేసి నేనే ఇవ్వాలనుకుంటున్నాను. ఆది పినిశెట్టి..పాత్రలో ఒదిగిపోయాడు. రామలక్ష్మణ్ మాస్టర్స్ ప్యూర్ ఎమోషన్స్తో యాక్షన్ కంపోజ్ చేశారు. జగపతిబాబుగారు, ప్రకాశ్ రాజ్గారు ఎంతో సపోర్ట్ చేశారు. నవీన్ నూలిసినిమాను చక్కగా ఎడిట్ చేసిచ్చాడు. కాస్ట్యూమ్స్ వర్క్ చేసిన సుస్మిత, శాంతిగారికి థాంక్స్. రామ్చరణ్ చిట్టిబాబు క్యారెక్టర్లో ఒదిగిపోవడానికి ఎక్కువ సమంయం తీసుకోలేదు. చరణ్ పెర్ఫామెన్స్ చూసి మేమే కాదు.. ప్రకాశ్ రాజ్లాంటి నటుడు కూడా క్లాప్స్ కొట్టాడంటే తను ఎలా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ - ``మెగాస్టార్ చిరంజీవిగారికి, గంటా శ్రీనివాసరావుగారికి, వైజాగ్ కమీషన్గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమాలో రామ్చరణ్గారికి విశ్వరూపం చూస్తారు. చరణ్గారికి ఈ సినిమా చిరంజీవిగారి ఖైదీ లాంటి సినిమా అవుతుంది. సమంతగారు చాలా చక్కగా నటించారు. దేవిశ్రీగారితో మా బ్యానర్లో మూడు సినిమాలకు పని చేశాం. భవిష్యత్లో ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాం`` అన్నారు.
సమంత మాట్లాడుతూ - ``మేమందరం కష్టపడి చేసిన సినిమా రంగస్థలం. ఈ టీంతో కలిసి పనిచేయడం నా అదృష్టం. సుకుమార్గారు మంచి వ్యక్తి. ప్రతి విషయాన్ని ప్రేమతో చేశారు. ఆయన ఎంతో ప్రేమతో రాసుకున్న ఈ క్యారెక్టర్కు న్యాయం చేయాలని చాలెంజ్గా తీసుకుని ఈ పాత్ర చేశాను. చరణ్గారి గురించి చెప్పాలంటే... చిరంజీవిగారికి స్వయంకృషి ఎలాగో.. చరణ్కి రంగస్థలం అలా మంచి పేరు తెస్తుంది. చాలా కాలం పాటు చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్ర గుర్తుండిపోతుంది. దేవిశ్రీగారు సూపర్హిట్ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతల ముఖాల్లో ఎప్పుడూ చిరునవ్వే ఉంటుంది. విషయాలను చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. యూనిట్ అంతాచాలాకష్టపడ్డాం. మార్చి 30 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ - ``ఇది నాకు స్పెషల్ మూవీ. నాకు ఎప్పటి నుండో ఫోక్ మ్యూజిక్ ఉన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయాలనే కోరిక ఉండేది. ఆ కోరిక సుకుమార్ వల్ల తీరింది. ఓ థీమ్కు సంబంధించిన మ్యూజిక్ చేయాలంటే ఓ ఎమోషన్ కావాలి. ఆ ఎమోషన్ అందించిన వ్యక్తుల్లో నాన్న సత్యమూర్తిగారు మొదటి వ్యక్తి. సమ్మర్ హాలీడేస్లో ఆయన నన్ను విలేజ్కు తీసుకెళ్లేవారు. అందువల్ల కనెక్ట్ అయ్యాను. అలాగే సుకుమార్గారికి అదే ఎమోషన్ ఇచ్చిన ఆయన తండ్రిగారికి నా థాంక్స్. ఇక మూడో వ్యక్తి ఇళయరాజాగారు. ఆయన కంపోజ్ చేసిన విలేజ్ సినిమాల మ్యూజిక్ చూసి నాకు అలాంటి ఛాన్స్ ఎప్పుడూ వస్తుందోనని అనుకునేవాడిని. నాలుగో వ్యక్తి నా గురువుగారు శ్రీనివాస్గారికి థాంక్స్. ఈ సినిమాలో నాకు వచ్చిన సక్సెస్ను ఈ నలుగురితో పాటు మా నాన్నగారి ఊరు వెదురుపాకంకు కూడా అంకితం చేయాలనుకుంటున్నాను. సుకుమార్గారు నాపై నమ్మకంతో నా మ్యూజిక్లో డిఫరెంట్ యాంగిల్ను ప్రెజంట్ చేస్తూ వస్తున్నారు. బోస్గారు తన సాహిత్యంతో అందమైన ఎమోషన్స్ను క్రియేట్ చేశారు. ఆయన అందించిన సాహిత్యానికి నేను ట్యూన్స్ కంపోజ్ చేసుకుంటూ వచ్చాను. బోస్గారు సాహిత్యాన్ని అలా సింపుల్గా చెప్పేశారు. రత్నవేలుగారు టాప్ సినిమాటోగ్రఫీ అందించారు. చరణ్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. తను ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ను చేయడం అంత సులభం కాదు. తను పెర్ఫామెన్స్ను చూసి నాకు చిరంజీవిగారిని చూసినట్లు అనిపించింది. సమంత ఆ క్యారెక్టర్లో జీవించింది. ఆది పినిశెట్టిగారు చాలా మంచి పాత్ర చేశారు. నిర్మాతలకు చాలా థాంక్స్. మోస్ట్ డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్`` అన్నారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ - ``రంగస్థలం ఒక మ్యాజిక్. సినిమా చూసే ప్రేక్షకులు 1980లోకి వెళ్లిపోతారు. ఎగ్జామ్ రాసే కుర్రాళ్లలో ఉండే ఎగ్జయిట్మెంట్, భయం ప్రతి సీన్లో కనపడుతుంది. ఇది గొప్ప టెక్నీషియన్స్ కలయికలో రూపొందిన చిత్రం. రామ్చరణ్, సమంత పెర్ఫామెన్స్. సుకుమార్గారి దర్శకత్వం.. రత్నవేలు విజువల్స్, దేవిశ్రీగారి సంగీతం.. ఇలా అందరూ సినిమాలో మాయ చేశారు. సినిమాలో ఆమేజింగ్ పెర్ఫామెన్స్ చేశారు. చిరంజీవిగారికి ఖైదీ సినిమా ఎలా నిలిచిందో... చరణ్కు ఈ సినిమా అలా నిలుస్తుంది`` అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక మాట్లాడుతూ - ``మా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఎందుకంటే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడ్యూసర్స్ తో పనిచేయడమే. పూర్తిస్థాయి తెలుగు సినిమా. రేపు సినిమా చూసే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే పక్కా తెలుగు మూవీ అవుతుంది. మాకు అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
అనసూయ మాట్లాడుతూ - ``దర్శకులు, నిర్మాతలు, మిగతా నటీనటులు, టెక్నీషియన్స్కు థాంక్స్. రామ్ చరణ్ నాకు ఫేవరెట్ యాక్టర్. ఆయనతో అత్త అని పిలిపించుకోవడం.. ఆయన్ను అల్లుడు అని పిలవడమేంటని గొడవ పెట్టాను. మేం అందరం `రంగస్థలం` అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని అందరినీ అందులోకి తీసుకెళ్లబోతున్నాం. మన నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మలు ఎలా ఉండేవారో సినిమాలో చూడబోతున్నాం`` అన్నారు.
సుస్మిత మాట్లాడుతూ - ``సుకుమార్గారి సలహాలు, సూచనలు లేకుంటే చరణ్ లుక్ అంత బాగా వచ్చుండేదేమో కాదు. చరణ్ లుక్ను చాలా బాగా క్యారీ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ - ``నెల్లూరులో పుట్టిన నాకు సినిమాల్లో తెలిసిన స్టార్ ఎవరంటే మెగాస్టార్ చిరంజీవిగారే. ఆయన నటించిన ముగ్గురు మొనగాళ్ళును రోజుకి ఐదో షోలు లెక్కలో ముప్పై రోజులు చూశాను. సినిమా విషయానికి వస్తే.. జిగేల్ రాణి పాటను వెస్ట్రన్ లుక్లో ఫోక్ కల్చర్లో చేయడం అంత సులభం కాదు. పూజా హెగ్డేగారు అద్భుతంగా నటించారు. రేపు ఈ సాంగ్ను ప్రేక్షకులు చూస్తూ థియేటర్స్లో కూర్చోలేక డాన్స్ లేస్తారు`` అన్నారు.
పూజా హెగ్డే మాట్లాడుతూ - ``ఈ పాటను నేను చేయగలుగుతానని నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు సుకుమార్గారికి థాంక్స్. ఇలాంటి సాంగ్ చేయడం నాకు కూడా కొత్తగానే ఉంది. దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు`` అన్నారు.
Last Updated 25, Mar 2018, 11:41 PM IST | 0business
|
బిగ్ బాస్2: సెకండ్ డే హైలైట్స్!
Highlights
16 మంది పోటీదారులతో బిగ్ బాస్2 షో మొదలైంది. నేడు ఈ రియాలిటీ షో రెండో ఎపిసోడ్ ను
16 మంది పోటీదారులతో బిగ్ బాస్2 షో మొదలైంది. నేడు ఈ రియాలిటీ షో రెండో ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. అయితే తొలిరోజు సెలబ్రిటీలందరూ కలిసి సంజనా, నూతన్ నాయుడులను బిగ్ బాస్ జైలులో ఉండడానికి నామినేట్ చేశారు. దీంతో రెండో రోజు కూడా వీరిద్దరూ జైలులోనే గడపాల్సి వచ్చింది. హౌస్ లో మొదటిరోజే జైలులో ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేసింది మోడల్ సంజన.
సెలబ్రిటీలు అంటే ముందుగా వారంతా సామాన్యులతో కలవాలి అలాంటిది వాళ్లు ముందే సెపరేట్ చేసేస్తున్నారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక నటుడు కిరీటీ ఏ సినిమాలలో నటించారో తనకు తెలియదని అతడిని అడిగి తెలుసుకుంది. దీప్తి సునైనా ఎవరో కూడా తనకు తెలియదని ఆన్ లైన్ లో చెక్ చేస్తే అందరూ ఆమెను బనానా అని పిలుస్తుండడంతో అలా ఎందుకు పిలుస్తున్నారో ఆమెను అడిగింది. దీనికి సమాధానంగా దీప్తి ''సోషల్ మీడియాలో ఆ పేరుతో తనను ట్రోల్ చేస్తుంటారని సునైనా రైమింగ్ కు బనానా సెట్ అవుతుందని అలా అంటుంటారని'' దీప్తి సునైనా వెల్లడించింది.
జైలులో ఉన్న ఇద్దరిలో ఒకరిని బయటకు తీసుకువచ్చే ఛాన్స్ హౌస్ లో ఉన్న మిగిలినవారికి ఇవ్వగా వారంతా నూతన్ నాయుడిని బయటకు తీసుకొచ్చారు. నటుడు కౌశల్ కు సంజనను జైలు నుండి బయటకు తీసుకువచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఆ పని చేయలేదు. అలా చేసినందుకు సంజన చేయి పట్టుకొని ఆమెను క్షమాపణ కోరాడు. ఇక స్విమ్మింగ్ పూల్ లో స్పూన్ తో వాటర్ తీస్తూ బకెట్ నింపాలనే టాస్క్ నటుడు తనీష్ పూర్తి చేశాడు.బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ రౌండ్ లో సునయన, గణేష్, కిరీటీ, కౌశల్, నూతన్ నాయుడు, సంజన నామినేట్ అయ్యారు.
Last Updated 11, Jun 2018, 11:56 PM IST | 0business
|
Visit Site
Recommended byColombia
149 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు విజయానికి చివరి 12 బంతుల్లో 22 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో 19వ ఓవర్ని ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్తో రోహిత్ శర్మ వేయించగా.. వరుసగా 4, 4, 4, 4 బాదేసిన ముష్ఫికర్ రహీమ్.. ఆ ఓవర్లో ఏకంగా 18 పరుగులు రాబట్టి సమీకరణాన్ని 6 బంతుల్లో 4 పరుగులుగా మార్చేశాడు.
Read More: Delhi T20లో బంగ్లాదేశ్ క్రికెటర్లకి వాంతులు
‘స్పిన్నర్లతో స్లాగ్ ఓవర్లలో బౌలింగ్ చేయించాలని నేను అనుకోలేదు. అందుకే చాహల్ మినహా మిగిలిన ఇద్దరు స్పిన్నర్లు (కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్) బౌలింగ్ కోటాని 16 ఓవర్లలోపే పూర్తి చేయించాను. ఒత్తిడిలో బౌలింగ్ చేసిన అనుభవం చాహల్కి ఉండటం.. అప్పటికి క్రీజులో ఇద్దరూ కుడి చేతి వాటం బ్యాట్స్మెన్లే ఉండటంతో 18వ ఓవర్ని చాహల్తో వేయించా. దీంతో.. 19వ ఓవర్ని ఖలీల్ అహ్మద్తో వేయించక తప్పలేదు’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
Read More: టీ20లో 4, 4, 4, 4 ఖలీల్ అహ్మద్ ఇక సర్దుకో..!
వాస్తవానికి ఆఖరి ఓవర్లో ఫలితం తేలే టీ20 మ్యాచ్ల్లో.. 19వ ఓవర్ చాలా కీలకం. అందుకే జట్టులో ఉంటే జస్ప్రీత్ బుమ్రాతోనే సాధారణంగా ఆ ఓవర్ని టీమిండియా వేయిస్తుంటుంది. తొలి టీ20లోనూ దీపక్ చాహర్ రూపంలో మెరుగైన పేసర్ అందుబాటులో ఉన్నా.. అతడితో 20వ ఓవర్ వేయించాలని ఆశించిన రోహిత్ శర్మ.. ఖలీల్ అహ్మద్తో 19వ ఓవర్ వేయించి తప్పు చేశాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
Read More: పేరుకేమో పవర్ హిట్టర్.. షాట్ మాత్రం..?
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బి.జయ వైశాఖం
Highlights
డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి, దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
వైశాఖం మూవీకి సంబంధించి విశేషాలు దర్శకురాలు జయ బి. చెప్తూ.. ''ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే మంచి సినిమాగా 'వైశాఖం' రూపొందుతోంది. లవ్లీ' తర్వాత మళ్ళీ సూపర్హిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా 'వైశాఖం'. ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ మిక్స్ అయిన 'వైశాఖం' అపార్ట్మెంట్స్ నేపథ్యంలో సాగుతుంది. డైరెక్టర్గా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్గా పెద్ద హిట్ రేంజ్కి వెళ్తుంది. కజక్స్థాన్లో తీసిన సాంగ్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతాయి. షూటింగ్ ఫైనల్ స్టేజ్లో వుంది. ప్రస్తుతం ఎడిటింగ్, డబ్బింగ్కి సంబంధించిన వర్క్ జరుగుతోంది'' అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ.. ''చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్లీ చిత్రాలు జయకి డైరెక్టర్గా చాలా మంచి పేరు తెచ్చాయి. అంతేకాకుండా మంచి కమర్షియల్ హిట్స్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్తోపాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్తో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ 'వైశాఖం'. జయ దర్శకత్వంలో సినిమా అనగానే బయ్యర్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. నా చిత్రాలకు చేసే పబ్లిసిటీ కూడా పెద్ద స్థాయిలో వుంటుంది కాబట్టి బిజినెస్ పరంగా చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇది చిన్న చిత్రం అయినా భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నాం. హై టెక్నికల్ వేల్యూస్తో తీస్తున్న 'వైశాఖం' మా బేనర్లో వచ్చిన 'లవ్లీ'కి రెట్టింపు విజయాన్ని అందిస్తుందన్న కాన్ఫిడెన్స్ వుంది. ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి కూడా బిజినెస్ పరంగా మంచి ఆఫర్స్ రావడం హ్యాపీగా వుంది. అలాగే హిందీ, తమిళ్ రైట్స్ కోసం కూడా ఆఫర్స్ రావడం ఈ సినిమా మీద వున్న క్రేజ్కి నిదర్శనం'' అన్నారు.
హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, శశాంక్, లతీష్, కీర్తి నాయుడు, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళి కొండేటి, స్టిల్స్: శ్రీను, కో-డైరెక్టర్: అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST | 0business
|
Dec 06,2018
కొత్త ఏడాదిలో మారుతి కార్లు ప్రియం
ముంబయి : ఆటోమొబైల్ కంపెనీలు వరుసకట్టి ధరలు పెంచుతు న్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు మారుతి సుజుకీ వచ్చే కొత్త ఏడాదిలో ధరలు పెంచనున్నట్లు తెలిపింది. జనవరి నుంచి తమ అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు బుధవారం వెల్లడించింది. అయితే పెంపు ఎంతా అనేది స్పష్టం చేయలేదు. ఉత్పత్తి ఖర్చులు, కమోడిటీ ధరలు, రూపాయి విలువ పతనం తదితర కారణాల రీత్యా ధరలు పెంచాల్సి వచ్చిందని ఆ కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం మారుతి సుజుకీ ఎంట్రీ లెవల్ ఆల్టో 800 నుంచి ప్రీమియం ఎస్-క్రాస్ వరకు విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.2.53లక్షల మధ్య నుంచి రూ.11.45లక్షల మధ్య వరకు ఉన్నాయి. అన్ని మోడళ్లపై ధరలు పెంచనున్నట్లు ఇసుజు మోటార్స్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. టొయోటా కీిర్లోస్కర్ మోటార్స్ కూడా గత నెలలో అన్ని మోడళ్లపై 4శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
sumalatha 102 Views IND vs BAN , schedule-details
IND vs BAN Schedule
ముంబయి:దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన పది రోజుల్లోనే భారత్ గడ్డపై బంగ్లాదేశ్ని టీమిండియా ఢీకొట్టబోతోంది. రాంచీ వేదికగా శనివారం నుంచి సఫారీలతో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడనున్న భారత్ జట్టు.. ఆ తర్వాత నవంబరు 3 నుంచి బంగ్లాదేశ్తో మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్లో తలపడనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ రూపొందగా.. తొలి టీ20 మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (ఫిరోజ్ షా కోట్ల)లో జరగనుంది.
మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
నవంబరు 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్ రాజ్కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్పూర్ వేదికగా 10న జరగనున్నాయి. అన్ని టీ20 మ్యాచ్లూ రాత్రి 7 గంటలకి ప్రారంభంకానున్నాయి. ఇక నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. 22 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ రెండు టెస్టులూ ఉదయం 9.30 గంటల నుంచి మొదలవనున్నాయి.
బంగ్లాదేశ్ టీ20 జట్టు:
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, మహ్మద్ నయిం, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అపిఫ్ హుస్సేన్, మసదేక్ హుస్సేన్, అమినుల్ ఇస్లామ్, అర్ఫాట్ సన్నీ, మహ్మద్ సైఫుద్దీన్, అల్ అమిన్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్లా ఇస్లామ్
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/ | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఒకేరోజు 2 సినిమాలు స్టార్ట్ చేస్తున్న వెంకీ
దసరా పండగ సినిమాల రిలీజ్లకే కాదు.. సినిమా ప్రారంభోత్సవాలకి కూడా పెద్ద సెంటిమెంట్గా మారిపోయింది.
| Updated:
Oct 20, 2015, 09:29PM IST
దసరా పండగ సినిమాల రిలీజ్లకే కాదు.. సినిమా ప్రారంభోత్సవాలకి కూడా పెద్ద సెంటిమెంట్గా మారిపోయింది. దసరాకి ప్రారంభించిన కొన్ని సినిమాలని క్రిస్మస్లోగా షూటింగ్ ముగించి సంక్రాంతికి రిలీజ్ చేయడం టాలీవుడ్లో ఎప్పటినుంచో వున్న ఆనవాయితీనే. ఇప్పుడా ఆనవాయితీ ప్రకారమే విక్టరీ వెంకటేష్ దసరా రోజే ఒకేసారి రెండు సినిమాలు ప్రారంభించడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. గోపాల గోపాల తర్వాత ఇప్పటివరకు ఏ ప్రాజెక్టుకి సైన్ చేయని వెంకీ.. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్లో రెండు సినిమాలకి ఓకే చెప్పాడని సమాచారం. అందులో ఒకటి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేయనుండగా మరొకటి మారుతి తెరకెక్కించనున్నాడు. భలే భలే మగాడివోయ్ మూవీ సక్సెస్తో ఊపుమీదున్న మారుతి అదే ఊపులో వెంకీని ఒప్పించి ఓ సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. | 0business
|
Hyderabad, First Published 4, Feb 2019, 12:09 PM IST
Highlights
సక్సెస్ ఫుల్ పర్సన్ కంటే ఫ్యామిలీ పర్సన్ చాలా సంతోషంగా ఉంటాడని యాంకర్ రవి ఒక కొటేషన్ ఇచ్చి తన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేశాడు. తన భార్య, మూడేళ్ల కూతురి ఫోటోలని రివీల్ చేశాడు.
సక్సెస్ ఫుల్ పర్సన్ కంటే ఫ్యామిలీ పర్సన్ చాలా సంతోషంగా ఉంటాడని యాంకర్ రవి ఒక కొటేషన్ ఇచ్చి తన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేశాడు. తన భార్య, మూడేళ్ల కూతురి ఫోటోలని రివీల్ చేశాడు. ఇంతకాలం పాటు దాచిన నిజాల్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు రవి.
అయితే ఈ పోస్ట్ పై కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం రవిని పట్టుకొని బూతులు తిడుతున్నారు. తెలుగులో ఎన్ని రకాల బూతులుంటాయో అవన్నీ రవిపై ప్రయోగిస్తున్నారు. ఇంత నెగెటివిటీ రావడానికి ఓ కారణముంది.
అప్పట్లో రవితో పాటు యాంకర్ లాస్య కూడా ఈవెంట్లను హోస్ట్ చేసేది. వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతుందంటూ పుకార్లు కూడా వచ్చాయి. లాస్య ఎప్పుడైతే మరోవ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందో.. అందరూ ఆమెను మోసగత్తె అంటూ కామెంట్లు చేసేవారు. దీంతో లాస్య పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని రవికి పెళ్లైందని చెప్పింది.
కానీ రవి మాత్రం ఓ ఇంటర్వ్యూలో తనకు పెళ్లి కాలేదని అన్నాడు. అంతేకాదు.. ఇంటర్వ్యూ చేసిన యాంకర్ తో 'నాకు పెళ్లి కాలేదని నిరూపిస్తే మీరు పెళ్లి చేసుకుంటారా..?' అని మాట్లాడాడు. దీంతో రవికి నిజంగానే పెళ్లి కాలేదని అందరూ లాస్యని తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు రవి విషయం తెలుసుకొని అతడిపై విరుచుకుపడుతున్నారు. | 0business
|
vishal and prasanna starrer detective trailer
'డిటెక్టివ్' ట్రైలర్: కార్ల్మార్క్స్ భలే కొత్తగున్నాడు
మాస్ హీరో విశాల్ కథానాయకుడుగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డిటెక్టివ్'.
TNN | Updated:
Oct 4, 2017, 03:19PM IST
మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'డిటెక్టివ్‌'. తమిళ్‌లో 'తుప్పరివాలన్‌'గా విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించి విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, 'డిటెక్టివ్‌' ట్రైలర్‌ను అక్టోబర్‌ 2న విడుదల చేశారు. ప్రముఖ హీరోయిన్స్‌ కాజల్‌, సమంత, కీర్తి సురేష్‌, ప్రముఖ దర్శకుడు ఎన్‌.లింగుస్వామి ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు.
ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ‘తుప్పారివాలన్’ మూవీ తమిళ్‌లో సెప్టెంబర్ 14 న విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించి హిట్ చిత్రాల లిస్ట్‌లో నిలిచింది. విశాల్ డిటెక్టివ్‌ అవతారంలో ఇంతకు ముందెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్‌లో అదరగొట్టేస్తున్నాడు. | 0business
|
Nov 07,2018
హైదరాబాద్లో థింగ్స్ కాన్ఫరెన్స్
హైదరాబాద్: స్మార్ట్ నగరాలు, వ్యవసాయం, పరిశ్రమలు, ఆరోగ్యం తదితర రంగాల్లో ఉన్న స్మార్ట్ అవకాశాలను చర్చించేందుకు ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్లో 'ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా' పేరిట అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఐటీ నిపుణులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. భారత్కు చెందిన 'సైబర్ ఐ' ఈ సదస్సును నిర్వహిస్తోంది. నీతి ఆయోగ్ ఛైర్మన్ అమితాబ్ కాంత్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. టెక్నాలజీ అంశాలపై అవగాహనను పెంచుకొనేందుకు గాను దేశంలోని ప్రముఖ ఐఐటీల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
First Published 5, Feb 2018, 9:33 PM IST
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
ఇంటిలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
Recent Stories | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కథ ఏంటి ?
'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా అనంతరం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరో సినిమా మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్.
| Updated:
Apr 28, 2016, 01:22AM IST
' సర్ధార్ గబ్బర్ సింగ్ ' సినిమా అనంతరం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరో సినిమా మొదలుపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . మొదటి నుంచీ మనం చెప్పుకున్నట్టుగానే 'ఖుషీ' డైరెక్టర్ ఎస్.జే. సూర్య దర్శకత్వంలో మరో సినిమాకి ఈ బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ అధినేత శరత్ మరార్ ఆఫీస్లో ఈ సినిమా లాంచింగ్ జరిగింది.
ఓ ఫ్యాక్షన్ లీడర్ లవ్ స్టోరీ కథాంశంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ లాంచింగ్ కార్యక్రమానికి సంబంధించిన విశేషాల్ని ఫేస్బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్న నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఇప్పటికే ఈ సినిమా కోసం రెండు పాటల్ని కంపోజ్ చేసినట్టు తెలిపింది.
ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ మూవీ జూన్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సమాచారం. దర్శకుడు సూర్యతో కలిసి గత 4 నెలలుగా కథని డెవలప్ చేస్తున్న రచయిత ఆకుల శివ ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ విశేషాలని పవన్ కళ్యాణ్తో పంచుకుంటున్నట్టుగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పేర్కొంది. బిల్లా , బెంగాల్ టైగర్ వంటి చిత్రాలకి డీఓపీ హ్యాండిల్ చేసిన సౌందర్ రాజన్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు.
సర్ధార్ సినిమాకి భారీ సెట్టింగ్స్ అందించిన ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి ఈ మూవీకి కూడా ఆర్ట్ సమకూరుస్తుండగా గౌతమ్ రాజ్ ఎడిటర్, రామ్-లక్ష్మణ్ సోదరులు యాక్షన్ డైరెక్టర్స్గా వ్యవహరిస్తున్నారు. | 0business
|
Hyderabad, First Published 22, Sep 2018, 6:24 PM IST
Highlights
శుక్రవారం నుండి మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' ఒకటి కాగా.. విక్రమ్ 'సామి2', 'ఈ మాయ పేరేమిటో' చిత్రాలున్నాయి.
శుక్రవారం నుండి మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' ఒకటి కాగా.. విక్రమ్ 'సామి2', 'ఈ మాయ పేరేమిటో' చిత్రాలున్నాయి. అయితే చిన్న చిత్రంగా విడుదలైన 'ఈ మాయ పేరేమిటో' ఇప్పుడు వివాదాలలో చిక్కుకుంది. ఈ సినిమాలో ఓ పాత హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై బిజెపి మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ సెన్సార్ బోర్డుకి లేఖ కూడా రాశారు. అరిహంతానం అనే పాటలో హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్న లిరిక్స్ పై సెన్సార్ చైర్మన్ కి ఆయన లేఖ రాశారు. నిజానికి నెలరోజుల క్రితమే పాటలో లిరిక్స్ మార్చాలని అయన చిత్రబృందాన్ని హెచ్చరించారట.
అది వినకుండానే సినిమా విడుదల చేయడం పట్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ చిత్ర నిర్మాత దివ్య.. లిరిక్స్ వచ్చిన సమయంలో మ్యూట్ చేశామని, అయినా ఇంకా ఎందుకు వివాదం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
కొందరి నుండి ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సోషల్ మీడియాలో కావాలని ఆమె ఫోన్ పెట్టి సర్క్యులేట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. రాహుల్ కోసం తన సొంత అక్క నిర్మాతగా మారి ఈ సినిమాను తెరకెక్కించింది.
Last Updated 22, Sep 2018, 6:24 PM IST | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆసీస్ కాస్కో... రబాడ ఈజ్ బ్యాక్
అనుచిత ప్రవర్తన కారణంగా రబాడపై రెండు టెస్టుల నిషేధం విధించిన ఐసీసీ చివరకు మెత్తబడింది. రబాడపై నిషేధం వేటును ఎత్తివేసింది.
| Updated:
Mar 20, 2018, 03:02PM IST
ఆసీస్ కాస్కో... రబాడ ఈజ్ బ్యాక్
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఐసీసీ సౌతాఫ్రికాకు గుడ్ న్యూస్ చెప్పింది. పోర్ట్ ఎలిజబెత్ టెస్టులో అనుచిత ప్రవర్తన కారణంగా రెండు టెస్టుల నిషేధం వేటు ఎదుర్కొన్న రబాడకు శిక్ష తగ్గించింది. దీంతో ఆసీస్తో జరగనున్న మూడు, నాలుగు టెస్టుల్లో రబాడ బరిలో దిగనున్నాడు. రెండో టెస్టులో 11 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన రబాడ.. స్మిత్ వికెట్ తీయగానే.. అతడ్ని భుజంతో తోసుకుంటూ ముందుకెళ్లాడు.
Visit Site
Recommended byColombia
రబాడ చర్య నిబంధనలకు విరుద్ధం కావడంతో ఐసీసీ అతడికి 50 శాతం జరిమానా విధించడంతోపాటు.. అతడి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు చేర్చింది. ఏడాదిలో ఈ సఫారీ బౌలర్ ఖాతాలో 8 డీమెరిట్ పాయింట్లను దాటడంతో అతడిపై రెండు టెస్టుల నిషేధం విధించింది. ఐసీసీ తీరు అన్యాయంగా ఉందంటూ మాజీలు విమర్శించారు.
రబాడ అప్పీల్ చేయడంతో విచారణ జరిపిన జ్యుడీషియల్ కమిషనర్ మైకెల్ హెరాన్ శిక్షను తగ్గించారు. రబాడకు విధించిన డీమెరిట్ పాయింట్లను మూడు నుంచి ఒకటికి తగ్గించారు. దీంతో అతడు మిగతా టెస్టుల్లో బరిలో దిగడానికి మార్గం సుగమమైంది. మ్యాచ్ ఫీజులో విధించిన కోతను సైతం 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు.
దీంతో మూడో టెస్టులో రబాడ రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగనున్నాడు. కానీ అతడి ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ చేరితే మాత్రం మళ్లీ నిషేధం వేటు పడటం ఖాయం. ఇరు జట్లు 1-1తో సమంగా నిలవగా.. మూడో టెస్టు గురువారం నుంచి జరగనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
TEAM INDIA
తొలి టెస్టులో పట్టు బిగించిన భారత్
గాలే వేధికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది.లంకను కోహ్లీసేన ఆత్మరక్షణలో నెట్టేసింది. తొలి టెస్టులో భారత్ పూర్తి ఆధి పత్యం దక్కించుకుంది. బ్యాటింగ్,బౌలింగ్ రెండు విభాగాల్లోఊ రాణించిన భారత్ ప్రత్యర్థులను నిస్సహాయులుగా మార్చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 5వికెట్లు 154 పరుగులు చేసింది.ప్రస్తుతం మాథ్యూస్ (54), పెరారా(6) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక ఇంకా 446 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో శిఖర్ ధావన్ (190), అభినవ్ ముకుంద్ (12), ఛటేశ్వర పుజారా (153), విరాట్ కోహ్లీ (3), రహానె (57), అశ్విన్ (47), సాహా (16), పాండ్యా (50), జడేజా (15), షమీ (30), ఉమేష్ యాదవ్ (11నాటౌట్) పరుగులు చేయడంతో 600పరుగులు చేసి ఆలౌట య్యింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారం భించిన శ్రీలంకను భారత బౌలర్లు బెంబేలెత్తిం చారు. కరుణరత్నె (2), గుణతిలక (16), మెండిస్ (0), డిక్వెల్లా (8) తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరారు. దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 154/5 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమి 2, ఉమేష్, అశ్విన్ చెరో వికెట్ తీయగా తరంగ రనౌటయ్యాడు. రెండో
రోజు ఆటసాగిందిలా….భారత్ 600 ఆలౌట్….
తొలి రోజు ధావన్ (190), పుజారా రాణిం చడంతో భారత్ 399/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 399/3తో రెండో రోజు టీమిండియా ఆట ప్రారంభించింది. 93వ ఓవర్లో హెరాత్ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో తృటిలో పుజారా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హెరాత్ వేసిన తొలి బంతి బ్యాట్కు అత్యంత సమీపం నుంచి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లడంతో శ్రీలంక రివ్యూకి వెళ్లింది. అయితే రివ్యూలో పుజారా నాటౌట్గా తేలింది.అనంతరం 96వ ఓవర్లో ప్రదీప్ వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించిన పుజారా 152 పరుగులు సాధించాడు. ఈసందర్భంగా మైదానం వెలుపల ఉన్న కోహ్లీ, అశ్విన్, పాండ్యా తదితరులు పుజారాను అభినందించారు.
రహానె కూడా హాప్ సెంచరీ సాధించాడు. అప్పటికి భారత్ 97ఓవర్లు ముగిసే సమయానికి 3వికెట్లతో 421పరుగులు చేసింది. 97.4 ఓవర్లో హెరాత్ బౌలింగ్లో పుజారా (153) అవుటయ్యాడు. పుజారా రహానెలు జోడీ నాలుగో వికెట్కి 137పరుగులు నమోదు చేశారు. ఆతర్వాత 103ఓవర్లో లాహిరు కుమార వేసిన తొలి బంతికి రహానె 57పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరకు న్నాడు. పుజారా, రహానెలు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సాహా-అశ్విన్ల జోడి వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. అయితే 16 పరుగులు చేసిన సాహాను…హెరాత్ పెవిలియన్కు చేర్చాడు. మరో నాలుగు పరుగుల వ్యవధిలోనే అశ్విన్ కూడా అవుటయ్యాడు.దీంతో అశ్విన్ 47పరుగులతో రాణించినా తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. రెండో రోజు లంచ్ విరామ సమయానికి టీమిండియా 7వికెట్లు కోల్పోయి 503పరుగులు చేసింది. అ
ప్పటికి క్రీజులో పాండ్యా (4), రవీంద్ర జడేజా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. బోజన విరామనంతరం రవీంద్ర జడేజా (15) అవుటయ్యాడు. జడేజా అవుటైన తర్వాత పాండ్యా, షమీలు లంక బౌలర్లపై విరుచుకుపడుతూ ఓవర్కు ఆరుకుపైగా పరుగులు సాధిస్తూ టీ20ని తలపించారు. ఇద్దరూ కలిసి తొమ్మిదో వికెట్కి 62పరుగులు చేశారు. షమీ 30బంతుల్లో 30పరుగులు సాధించాడు. పాండ్యా కూడా ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచారు. హార్థిక్ పాండ్యా తన దైన శైలిలో ఆడుతూ లంక బౌలర్లపై విరుచుక పడి 49బంతుల్లో 3సిక్సులు, 5ఫోర్లు సాయంతో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆరంగేట్ర టెస్టులో తొలి ఇన్నింగ్స్లోనే అర్థ శతకం సాధించిన ఘనతను పాండ్యా అందకు న్నాడు. అనంతరం 134వ ఓవర్లో లాహిరు కుమారా వేసిన తొలిబంతికి ఎదుర్కొన్న పాండ్యా క్యాచ్ చ్చి మైదానాన్ని వీడాడు. పాండ్యా (50), బౌలర్ షమి (30) అవుటవ్వడంతో టీమిండియా 600పరుగులకు ఆలౌటయ్యింది. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్కు 6, లహిరు కుమారాకు 3, హెరాత్కు ఒక వికెట్ దక్కాయి.
రెండో రోజు శ్రీలంక 154/5….
భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టుస్కోరు 7పరుగుల వద్ద ఓపెనర్ కరుణరత్నే (2)ను ఉమేష్ యాదవ్ పెవిలియన్కు చేర్చాడు. తన తొలి ఓవర్ ఐదో బంతికి కరుణరత్నేను ఎల్బిడబ్ల్యుగా అవుట్ చేశాడు. ఈక్రమంలో టీ విరామ సమయానికి శ్రీలంక వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. గుణతిలక (12), తరంగ (24)తో క్రీజులో ఉన్నారు. టీవిరామ అనంతరం బ్యాటింగ్ ప్రారం భించిన శ్రీలంక ఇన్నింగ్స్ను తరంగ- గుణతిలక చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండగా షమీ వారిని విడదీశాడు. 15వ ఓవర్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి షమీ ఆజట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. 15వ ఓవర్ రెండో బంతికి గుణతిలక(16) ధావన్క్యాచ్ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం ఆ ఓవర్లోనే చివరి బంతికి కుశాల్ మెండిస్ను డకౌట్గా పెవిలి యన్కు పంపాడు. దీంతో లంక పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. అప్పటికి 15ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 68/3తో ఒత్తిడిలో పడింది.
ఓపెనర్ ఉపుల్ తరంగ హాఫ్ సెంచరీతో రాణించాడు. తరంగ -మాథ్యూస్ జోడీ న్నింగ్సని చక్కదిద్దుతూ స్కోరు బోర్డును కదిలించారు. ఈజోడీ నాలుగో వికెట్కు 57 పరుగులు రాబట్టింది. 33.6వ ఓవర్లో అశ్విన్ వేసిన బంతిని తరంగ ఎదుర్కొన్నాడు. అభినవ్ ముకుంద్ నుంచి బంతిని అందుకున్న సాహా మెరుపు వేగంతో వికెట్లను పడగొట్టాడు. అంపైర్ సమీక్ష నిర్వహించగా తరంగ (64) ఔట్గా తేలింది.ఆతర్వాత డిక్వెలా 8పరుగులకే అశ్విన్ బౌలింగ్లో ముకుంద్ క్యాచ్ఇచ్చి అవుట య్యాడు.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 44ఓవర్లకే 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకపోయింది. లంక రెండో ఆటముగిసే సమయానికి 5వికెట్లు కోల్పోయి 154పరుగులుచేసింది. భారత బౌల ర్లలో షమి 2, ఉమేశ్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ తన తొలి ఇన్నిం గ్స్లో ఆతిథ్య లంకపై 446పరుగుల ఆధి క్యంలో కొనసాగుతోంది. భారత ఇన్నింగ్స్: ధావన్ (సి) మాథ్యూస్ (బి) 190, ముకుంద్ (సి) డిక్వెలా (బి) ప్రదీప్ 12, పుజారా (సి) డిక్వెలా (బి)ప్రదీప్ 153, కోహ్లీ (సి) డిక్వెలా (బి) ప్రదీప్ 3, రహానె (సి) కరుణరత్నే (లాహిరు కుమార) 57, రవిచంద్రన్ అశ్విన్ (సి) డిక్వెలా (బి) ప్రదీప్ 47, సాహా (సి) దిల్రువన్ పెరీరా (బి) హెరాత్ 16, హార్థిక్ పండ్యా (సి) (సబ్) ధనంజయ డిసెల్వ (బి) లహిరు కుమార 50, రవీంద్ర జడేజా (బి) ప్రదీప్ 15, మహ్మద్ షమి (సి) తరంగ (బి) లాహిరు కుమార 30, ఉమేశ్ యాదవ్ (11నాటౌట్) ఎక్స్ట్రాలు 16 మొత్తం : 600 (133.1ఓవర్లు), వికెట్లు పతనం: 1-27, 2-280, 3-286, 4-423, 5-432, 6-491, 7-495, 8-517, 10-600 బౌలింగ్: ప్రదీప్ 31-2-132-6, లహిరు 25.1-3-131-3, దిల్రువన్ 30-1-130-0, హెరాత్ 40-6-159-1, గుణతిలక 7-0-41-0 శ్రీలంక ఇన్నింగ్స్: దముత్ కరుణ రత్నే (బి) ఉమేశ్ యాదవ్ ఎల్బీ 2, ఉపుల్ తరంగ 64 (రనౌట్) దనుష్క, గుణతిలక (సి) ధావన్ (బి) షమీ 16, కుశాల్ మెండిస్ (సి) ధావన్ (బి) షమి (0), ఎడి మాథ్యూస్ 54 (నాటౌట్), డిక్వెలా (సి) ముకుండ్ (బి) అశ్విన్ 8, పెరీరా 6 (నాటౌట్), ఎక్స్్ట్రాలు 4, మొత్తం : 154/5 బౌలింగ్: మహ్మద్ షమీ 9-2-30-2, ఉమేశ్ యాదవ్ 8-1-50-1, అశ్విన్ 18-2-49-1, జడేజా 9-1-22-0 | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
తరుణ్ లవ్ స్టోరీ
ఇటీవలే సెకండ్స్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన తరుణ్ ప్రస్తుతం ఓ ప్రేమకథా చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
TNN | Updated:
Jan 6, 2016, 04:18PM IST
Tarun
నువ్వేకావాలి, నువ్వేనువ్వే , ప్రియమైన నీకు చిత్రాలతో చక్కటి కమర్షియల్ విజయాల్ని సొంతం చేసుకున్నాడు తరుణ్ . ఈ సినిమాలు ఆయనకి స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. అయితే ఈ సక్సెస్లను క్యాష్ చేసుకోవడం తరుణ్ విఫలమయ్యాడు. కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల అతడు నటించిన చిత్రాలన్ని పరాజయాలుగా నిలవడంతో కొద్ది రోజుల్లోనే అవకాశాలు దూరమైయ్యారు. ఇటీవలే సెకండ్స్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన తరుణ్ ప్రస్తుతం ఓ ప్రేమకథా చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. రామ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.వి. ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్ గోపీ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటోన్న ఈ సినిమాకు ఇది నా లవ్ స్టోరీ అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వినూత్న ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోవాలని తరుణ్ ఆశాభావంతో ఉన్నారు. మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రానికి రీమేక్గా దీనిని తెరకెక్కిస్తున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
ఆమే జయలలిత కూతురు, జయ సన్నిహితురాలి సంచలన వ్యాఖ్యలు
Highlights
జయలలితకు కూతురు ఉందా లేదా అనే అంశంపై కొనసాగుతున్న మిస్టరీ
జయలితకు కూతురు వుందని వెల్లడించిన జయ సన్నిహితురాలు గీత
జయ,శోభన్ బాబులకు అమృత అనే కూతురు వుండేదని వెల్లడి
తానే జయలలిత కూతురుని అంటూ కోర్టుకు ఎక్కి... అక్షింతలు వేయించుకున్న అమృత గుర్తుందా.... ఆమెకు కోర్టు చీవాట్లు పెట్టినా తాజాగా జయ కూతురు ఆమేనంటూ అమృతకు అనూహ్య మద్దతు దక్కింది. అర్థం లేని పిటిషన్ అంటూ కోర్టు అమృతపై ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఆమె జయలలిత కూతురే అనే మాట వినిపిస్తోందిప్పుడు. జయలలిత స్నేహితురాలిగా గుర్తింపు ఉన్న గీత ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలే చేశారు.
జయలలితకు ఒక కూతురు ఉందని గీత అంటున్నారు. అలనాటి తెలుగు స్టార్ హీరో శోభన్ బాబుతో జయలలితకు సంతానం కలిగిందని ఆమె వ్యాఖ్యానించారు. వాళ్లకు ఒక పాప పుట్టిందని, తన పేరు అమృత అని గీత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని జయలలిత తనకు స్వయంగా చెప్పిందని ఆమె చెప్పుకొచ్చారు. కూతురు అమృతతో జయలలితకు సత్సంబంధాలే ఉండేవని.. అన్నారు.
ఈ విషయం గురించి శోభన్ బాబు కూడా తనతో చర్చించాడని గీత చెప్పుకురావడం విశేషం. తనకు జయతో కూతురు ఉన్నట్టుగా శోభన్ బాబు చెప్పాడని 1999లోనే తనకు ఈ విషయం తెలుసని గీత అన్నారు. జయ, శోభన్ ల కూతురిని అని కోర్టుకు ఎక్కి, మీడియాకు చెబుతున్న అమృతకు డీఎన్ఏ టెస్టులు చేస్తే విషయం స్పష్టం అవుతుందని గీత అభిప్రాయపడ్డారు.
Last Updated 25, Mar 2018, 11:57 PM IST | 0business
|
ప్రకటనల ద్వారా 12 వందల కోట్లు
ముంబయి : ప్రజలకు అత్యంత వినోదం కలిగించే వాటిలో సినిమా,క్రీడలు రెండు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి.అయితే క్రీడల్లో భాగమైన క్రికెట్ అంటే భారత్లో విపరీతమైన క్రేజ్. దీంతో ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ లీగ్ల కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మేటిగా నిలిచింది.ఐపిఎల్ అంటే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ లాంటిదనే చెప్పాలి. మరి ఈ ఐపిఎల్ సీజన్ అభిమానులకు అత్యంత ఎక్కువ వినోదాన్ని పంచడమే కాదు,ఆ మ్యాచ్ల ప్రసార హక్కులను దక్కించుకున్న సోనికి కాసుల వర్షం కురిసింది. ఐపిఎల్-9 సీజన్లో ప్రకటనల ద్వారా సోనికి వచ్చిన ఆదాయం 1200 కోట్లు అని తెలుస్తుంది.కాగా విషయాన్ని సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా తాజాగా వెల్లడించాడు. ఈ ఏడాది ప్రకటనలపై స్పాన్సర్లు విపరీతమైన ఆసక్తి కనబర్చడంతోనే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఇది గత ఏడాది ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం కంటే 20 శాతం ఎక్కువ ఉండటం విశేషం. | 2sports
|
#Subrahmanyapuram #SubrahmanyapuramTeaser https://t.co/gTFe0d2pBi
— Sumanth (@iSumanth) 1539950180000
సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్గా ఈ టీజర్ ఉంది. నాస్తికుడిగా, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా నటించిన సుమంత్.. భక్తి ముసుగులో జరిగే మోసాల్ని వెతికిపట్టే పనిలో పడ్డాడు. దేవుడంటే నమ్మకం లేని హీరో.. ఓ గ్రామం కోసం దేవుడితో ఎలా పోరాడాడు? ఎందుకు పోరాడాడు? అసలు దేవుడిని ఎందుకు ఎదిరించాడు? అనే ఆసక్తికరమైన కథతో, ఉత్కంఠత కలిగించే స్క్రీన్ ప్లేతో ఇందులో కనిపిస్తుంది.
నువ్ దేవుడ్ని ఎదురిస్తున్నావ్ అంటే.. ‘ఎదురిస్తే ఏం చేస్తాడండీ మీ దేవుడు’, ఆ భగవంతుడు ‘సుబ్రహ్మణ్యపురం’ ఊరికి రక్షణగా ఒకడ్ని సిద్ధం చేసే ఉంచాడు.. అతడే కార్తీక్ లాంటి సంభాషణలు ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. దెయ్యానికి ఆగ్రహమొస్తే దేవుడ్ని ఆశ్రయించవచ్చు. మరి దేవుడికే ఆగ్రహమొస్తే మానవుడి పరిస్థితి ఏంటి? అనే కథాంశంతో ఈ సినిమా రూపుదించారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. సుమంత్, ఈషా రెబ్బ, సురేష్, తనికెళ్ళ భరణి, జోష్ రవి, భద్రమ్, గిరి, మాధవి, హర్షిణి, అమిత్, టిఎన్ఆర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
‘సుబ్రహ్మణ్యపురం’ టీజర్
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Hyderabad, First Published 15, Aug 2018, 1:06 PM IST
Highlights
'మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?' అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్ తో 'అరవింద సమేత' టీజర్ మొదలైంది
'మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?' అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్ తో 'అరవింద సమేత' టీజర్ మొదలైంది. ఎన్టీఆర్ పాత్రను వివరించేలా సాగిన ఈ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఫైనల్ గా ఎన్టీఆర్ 'కంటపడ్డావా కనికరిస్తానేమో.. ఎంటపడ్డానా నరికేస్తా ఓబా..' అంటూ కత్తి పట్టుకొని పవర్ ఫుల్ గా ఓ డైలాగ్ చెప్పాడు. దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ ఓ రేంజ్ లో ఉంది. ఒక ఫ్రేమ్ లో సునీల్ కూడా కనిపించారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
71 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
ప్రైవేటు బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాల పాలవడంతో పాటు, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకునేందుకు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో దేశీయ మార్కెట్లు ప్రతికూలంగా సాగాయి. గత ఎనిమిది సెషన్లలో విదేశీ సంస్థాగత మదుపర్లు దాదాపు 1.4 బిలియన్ డాలర్ల ఈక్విటీలను అమ్మేసారు. బడ్జెట్ నిరాశపరచడంతో పాటు, ఇటీవలి బ్యాంకింగ్ రంగ కుంభకోణం మదుపర్లను నిరాశకు గురిచేసింది. దీంతో అమ్మకాలకు తెగబడుతున్నారు.
| Updated:
Feb 20, 2018, 05:13PM IST
న‌ష్ట‌పోయిన దేశీయ సూచీలు
ప్రైవేటు బ్యాంకింగ్ రంగ షేర్లు న‌ష్టాల పాల‌వ‌డంతో పాటు, విదేశీ పెట్టుబ‌డిదారులు త‌మ పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు తీసుకునేందుకు అమ్మ‌కాల‌కు ఆస‌క్తి చూప‌డంతో దేశీయ మార్కెట్లు ప్ర‌తికూలంగా సాగాయి. గ‌త ఎనిమిది సెష‌న్ల‌లో విదేశీ సంస్థాగ‌త మ‌దుప‌ర్లు దాదాపు 1.4 బిలియ‌న్ డాల‌ర్ల ఈక్విటీల‌ను అమ్మేసారు. బ‌డ్జెట్ నిరాశ‌ప‌ర‌చ‌డంతో పాటు, ఇటీవ‌లి బ్యాంకింగ్ రంగ కుంభ‌కోణం మ‌దుప‌ర్ల‌ను నిరాశ‌కు గురిచేసింది. దీంతో అమ్మ‌కాల‌కు తెగ‌బ‌డుతున్నారు.
మార్కెట్లు ముగిసేస‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ 71.07 పాయింట్లు త‌గ్గి 33,703.59 వ‌ద్ద ముగియ‌గా, మ‌రో సూచీ నిప్టీ 18 పాయింట్లు క్షీణించి 10,360 వ‌ద్ద స్థిర‌ప‌డింది. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
సూపర్స్టార్తో మెగాస్టార్ ‘సైరా’.. టార్గెట్ ?
‘సైరా’ నరసింహారెడ్డి... చిరంజీవి,అమితాబ్,సుధీప్, విజయ్ సేతుపతి, నయనతార నటీనటులుగా.. సురేందర్ రెడ్డి, ఏఆర్ రెహమాన్, రవివర్మ, పరుచూరి బ్రదర్స్ లాంటి లెజెండ్స్తో .. సుమారు 200 కోట్లతో భారీ బడ్జెట్లో నిర్మాత రామ్ చరణ్ చేస్తున్న ప్రయోగం ఏమిటి? అసలు రామ్ చరణ్ టార్గెట్ ఏంటి?
TNN | Updated:
Aug 22, 2017, 05:32PM IST
ఖైదీ నెం.150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ విజేత మెగాస్టార్ చిరంజీవి ఆ మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు. తాను రావడం లేటవ్వొచ్చేమో కాని వస్తే రికార్డులు పగిలిపోవడం పక్కా అని ఖైదీ కలెక్షన్స్ సునామి సృష్టించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మెగాస్టార్ కలెక్షన్స్ కుమ్ముడు ఏ రేంజ్‌లో ఉంటుందో ఖైదీ నిరూపించింది. ఖైదీ మూవీతో మెగాస్టార్ మార్కెట్ పరిధి ఓ రేంజ్‌లో పెరిగిపోయింది.
అయితే ఖైదీ చిత్రంకంటే ముందే మెగాస్టార్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథతో సినిమా చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆ కథను డీల్ చేయాలంటే కాస్ట్ అండ్ క్రూ కీలకం కావడంతో చిరు చిరకాల స్వప్నం వాయిదా పడుతూ వచ్చింది. అయితే చిరు కలను రామ్ చరణ్ భుజాలపై వేసుకుని ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రాన్ని పట్టాలిక్కించాడు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా టైటిల్‌ లోగోను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను జాతీయస్థాయిలో తెరకెక్కించేందుకు రామ్ చరణ్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయా ప్రాంతాలకు సంబంధించిన స్టార్ నటులు ‘సైరా’ మూవీలో నటిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ను ఈ మూవీతో రంగంలోకి దింపడంతో ఈ చిత్రం ఏ స్థాయిలో వుండబోతుందనే దానికి హింట్‌ ‘సైరా’ మోషన్‌ పోస్టర్‌‌తో దొరికేసింది.
— Pavan Tej (@iPavanTej) August 22, 2017
అమితాబ్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, కన్నడస్టార్ సుధీప్, జగపతిబాబు, నయనతారా లాంటి స్టార్స్‌తో పాటు సాంకేతిక విభాగంలో సుప్రసిద్ధులైన లెజెండ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఈమూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. రవివర్మ ఛాయాగ్రహణం సమకూర్చుతున్నారు. రాజీవన్‌ కళాదర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రచన సహకారం పరుచూరి సోదరులు అందిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వ బాధ్యతను చూస్తున్నారు.
భారీ కాస్ట్ అండ్ క్రూ‌తో రంగంలోకి దిగుతున్న ‘సైరా’ నరసింహారెడ్డి సుమారు రెండు వందలకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అయితే ఈస్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన బాహుబలి చిత్రం అదే రేంజ్‌లో మిగతాభాషల్లోనూ సేల్ అయ్యి భారీగా వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ ఇండియన్ హిట్ మూవీ లిస్ట్‌లో చేరింది. మరి అదే రేంజ్‌లో ‘సైరా’ సేల్ అవుతుందా అన్నది ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది.
అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా స్టామినాను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే మిగతా రాష్ట్రాలు తమిళనాడు,కన్నడలలోనూ మెగాఫ్యాన్స్ బాగానే ఉండటంతో పాటు కన్నడ హీరో సుధీప్ ఈ మూవీలో నటిస్తుండటంతో ఒక రకంగా ప్లస్ అనే చెప్పాలి. అయితే సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ‘సైరా’ బాహుబలి స్థాయిలో హైస్సా రుద్రస్సా హేసరభద్ర సముద్రస్సా అనాలనే టార్గెట్ చాలా పెద్దదే అనేది మార్కెట్ పండితుల అంచనా. | 0business
|
nirmala. sitharaman jpg
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఆర్ధికవృద్ధిని రెంట్టింపుచేసుకునేలక్ష్యంతో ఎన్డిఎ-2 ప్రభుత్వం పలు ఉద్దీపనలు ప్రకటిస్తోంది. నాలుగో విడతగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్రంగానికి భారీ వరాలు ప్రకటించారు. కార్పొరేట్పన్నును 25.17శాతంగా నిర్ణయించారు. అంతకుముందున్న 30శాతం నుంచి మరికొంత తగ్గించారు. ఎలాంటిప్రోతత్సాహకాలు, రాయితీలు పొందకుండా ఉంటేకార్పొరేట్పన్ను 22శాతం మాత్రమే చెల్లించుకునే సదుపాయం ప్రకటించారు. ఇపుడు కొత్త ఉత్పత్తిరంగ సంస్థలు కేవలం 15శాతం పనున చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు తెస్తూ ఆర్డినెన్స్ను కూడా అమలుచేస్తున్నట్లు తెలిపారు. పన్నుల పరంగా ప్రభుత్వం పారిశ్రామిక, పెట్టుబడుల రంగాలప్రతినిధులతో చర్చించినత ర్వాత వారం వారం ప్రోత్సాహకాలు, ఉద్దీపనలు ప్రకటిస్తూనే ఉంది. ఉద్దీపనల కారణంగా ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతున్నప్పటికీ ఆర్థికవృద్ధి లక్ష్యంతోప్రోత్సాహకాలు అనివార్యం అవుతున్నాయని, మొత్తంగా ప్రకటించిన రాయితీల కారణంగా కేంద్రానికి 1.45 లక్షలకోట్లు నష్టం వస్తుందని కూడా ఆమె వెల్లడించారు. ప్రోత్సాహకాలు పన్నుతగ్గింపులకు సంబంధించి శుక్రవారం ఆర్డినెన్స్ను కూడా ఆమోదించినట్లు తెలిపారు. ఆదాయపు పన్ను చట్టంలో ఒక సవరణను ఆమోదిస్తూ 2019-20 ఆర్ధికసంవత్సరంనుంచి కార్పొరేట్కంపెనీలు 22శాతం పన్ను చెల్లించవచ్చు. .
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
sandhya 309 Views AUS vs BAN , World Cup 2019
AUS vs BAN
నాటింగ్హామ్: ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఆడిన ఐదు మ్యాచుల్లో ఇప్పటికే నాలుగు మ్యాచ్లు గెలిచి మూడో స్థానంలో ఉన్న కంగారూల జట్టు ఈ మ్యాచ్లో గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగు పర్చుకోవాలని ఉంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/ | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రూ.200 నోటు ఎందుకు తెస్తున్నారంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం (ఆగస్టు 25) నుంచి మార్కెట్లోకి రూ.200 నోట్లను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ చరిత్రలోనే తొలిసారిగా ఈ నోట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు..
TNN | Updated:
Aug 24, 2017, 05:27PM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం (ఆగస్టు 25) నుంచి మార్కెట్‌లోకి రూ.200 నోట్లను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ చరిత్రలోనే తొలిసారిగా ఈ నోట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నకిలీలకు చెక్ పెట్టే విధంగా వీటిని ఆధునిక సాంకేతికత సాయంతో సరికొత్త డిజైన్లలో రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. గత నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత.. మార్కెట్లో కరెన్సీ కొరత వల్ల ప్రజలు అల్లాడిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా ఈ నోట్లను ప్రవేశ పెట్టడానికి కారణమేమిటి? అనేది సామాన్యుడికి అర్థంకాని ప్రశ్న.. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలు..
సామాన్యుడికి కరెన్సీని మరింత చేరువ చేయడం, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే ప్రధాన లక్ష్యాలుగా రూ. 200 నోట్లను ప్రవేశ పెడుతున్నట్టు ఆర్‌బీఐ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ నోట్లను ప్రవేశ పెట్టడం వెనుక ఎస్‌బీఐ ఎకనమిక్ అడ్వైజర్ ఘోష్ పాత్ర కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇది ఔటా.. థర్డ్ అంపైర్ నిర్ణయంతో అంతా షాక్!
రనౌట్ అప్పీల్ను టీవీలో పరిశీలించిన థర్డ్ అంపైర్ దాన్ని ఔట్గా ప్రకటించారు. అయితే రిప్లైలో బ్యాట్ సగం వరకు క్రీజులోకి వచ్చిన తర్వాత కీపర్ స్టంప్స్ను పడగొట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
Samayam Telugu | Updated:
Dec 20, 2018, 10:20AM IST
ఇది ఔటా.. థర్డ్ అంపైర్ నిర్ణయంతో అంతా షాక్!
క్రికెట్లో అంపైర్ల నిర్ణయాలు అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. వివాదాలకు కూడా కారణమవుతుంటాయి. పెర్త్ టెస్ట్లో విరాట్ కోహ్లీ ఔట్ ఇలానే వివాదమైంది. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలోని బిగ్ బాస్ లీగ్లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రనౌట్ అప్పీల్ను టీవీలో పరిశీలించిన థర్డ్ అంపైర్ దాన్ని ఔట్గా ప్రకటించారు. అయితే రిప్లైలో బ్యాట్ సగం వరకు క్రీజులోకి వచ్చిన తర్వాత కీపర్ స్టంప్స్ను పడగొట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కానీ దీన్ని థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించడం క్రీజులో ఉన్న బ్యాట్స్మెన్తో పాటు గ్యాలరీలో ఉన్న వారిని కూడా షాక్కు గురిచేసింది.
బిగ్ బాస్ లీగ్లో భాగంగా బుధవారం రాత్రి బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లోనే రనౌట్ వివాదమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో జిమ్మీ పియర్సన్, జేమ్స్ ప్యాటిన్సన్ క్రీజులోకి వచ్చారు. పియర్సన్ స్ట్రైకింగ్ చేస్తుండగా.. మరో ఎండ్లో ప్యాటిన్సన్ ఉన్నారు. పియర్సన్ ఆడిన బంతికి సింగిల్ కోసం ప్రయత్నించారు. ప్యాటిన్సన్ డైవ్ చేసుకుంటూ క్రీజులోకి అడుగుపెట్టాడు. ఇదే సమయంలో అడిలైడ్ స్ట్రైకర్స్ వికెట్ కీపర్ అలెక్స్ కారే బేల్స్ను గిరాటేశాడు. నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్కు అప్పగించారు.
రిప్లైలో బ్యాట్ క్రీజులో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించారు. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఏం చేయాలో అర్థం కాక ఒకరితో ఒకరు చర్చ మొదలుపెట్టారు. అయితే, థర్డ్ అంపైర్ పొరపాటున తప్పు బటన్ నొక్కడంతో ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించిన ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కొలిన్ ఇన్గ్రామ్.. ప్యాటిన్సన్ను మళ్లీ వెనక్కి పిలిచారు. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంతో కాసేపు మైదానంలో అయోమయ స్థితి నెలకొన్నా తరవాత మ్యాచ్ సజావుగానే సాగింది. ఈ మ్యాచ్లో బ్రిస్బేన్ హీట్పై అడిలైడ్ స్ట్రైకర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
James Pattinson and Ben Laughlin speak after this controversial moment in the #BBL last night https://t.co/ddJO6OZbO4
— cricket.com.au (@cricketcomau) 1545261929000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
నటించనని చెబుతున్నా.. వినిపించుకోరేం: కీర్తి సురేష్
Highlights
ఇప్పటివరకు ఫిలిం మేకర్స్ కూడా తనను అటువంటి సీన్లలో నటించమని అడగలేదని చెప్పిన కీర్తిని ఇప్పుడు మాత్రం దర్శకనిర్మాతలు తనను ముద్దు సీన్లలో నటించమని అడుగుతున్నారట. 'మహానటి' సినిమా తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీ గ్లామర్ షో అనేది కామన్. కొందరు హీరోయిన్లు తమ నటనతో పాటు గ్లామర్ రసాన్ని కూడా ఒలకబోస్తూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. మరికొందరు మాత్రం పద్దతిగా కనిపించడానికే ఇష్టపడుతున్నారు. అవకాశాల కోసం తమ హద్దులను దాటమని బహిరంగంగా చెబుతున్నారు. ఈ లిస్టు లో కీర్తి సురేష్ కూడా ఉంది. గ్లామర్ రోల్స్ లో నటించనని, ముద్దు సీన్లకు దూరంగా ఉంటానని ఓపెన్ స్టేట్మెంట్స్ చేసింది.
ఇప్పటివరకు ఫిలిం మేకర్స్ కూడా తనను అటువంటి సీన్లలో నటించమని అడగలేదని చెప్పిన కీర్తిని ఇప్పుడు మాత్రం దర్శకనిర్మాతలు తనను ముద్దు సీన్లలో నటించమని అడుగుతున్నారట. 'మహానటి' సినిమా తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అందులో కొన్ని కథలు బాగున్నప్పటికీ ముద్దు సీన్లు ఉండడంతో వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతుందట. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఆ సీన్లను తొలగించలేమని అంటున్నారట.
దీంతో కథ నచ్చినా.. ఆమె వదులుకోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. మొత్తానికి తన వద్దకు వచ్చే అవకాశాలను కూడా వదులుకుంటుందేమో గానీ తెరపై ముద్దు సీన్లు మాత్రం చేయనని క్లియర్ గా చెప్పేస్తుంది ఈ బ్యూటీ. మరి ఈ క్రమంలో ఆమె ఎంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతుందో చూడాలి. ప్రస్తుతం కీర్తి తమిళంలో నాలుగు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది!
Last Updated 10, Jul 2018, 7:03 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
హాకీకే స్ఫూర్తి.. బల్బీర్ సింగ్ సీనియర్
హాకీలో వరసగా మూడు ఒలింపిక్ స్వర్ణ పతకాలు, స్వతంత్ర భారతదేశం తరఫున ఒలింపిక్స్లో తొలి పతాకధారి, దేశంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఒలింపియన్, ఆయనెవరో కాదు.. భారత దిగ్గజ హాకీ ఆటగాడు బల్బీర్ సింగ్ దోసాంఝ్.
TNN | Updated:
Oct 17, 2016, 06:09PM IST
హాకీలో వరసగా మూడు ఒలింపిక్ స్వర్ణ పతకాలు, స్వతంత్ర భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో తొలి పతాకధారి, దేశంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఒలింపియన్, ఆయనెవరో కాదు.. భారత దిగ్గజ హాకీ ఆటగాడు బల్బీర్ సింగ్ దోసాంఝ్. అందరికీ తెలిసిన పేరు బల్బీర్ సింగ్ సీనియర్. 1948, 1952, 1956 ఇలా వరసగా మూడు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత హాకీ జట్టులో బల్బీర్ కీలక ఆటగాడు. ప్రస్తుతం ఈయన వయసు 93 ఏళ్లు. దిగ్గజ ఆటగాడు ధ్యాన్‌చంద్‌తో కలిసి ఆడినప్పటికీ ఆయనకొచ్చినంత గుర్తింపు బల్బీర్‌కి రాకపోవడం బాధాకరం.
అయితే అప్పటి భారత హాకీ జట్టుకు నివాళులర్పిస్తూ బల్బీర్ చెప్పిన కొన్ని మనసుకు హత్తుకునే విషయాలను ఒలింపిక్ ఛానల్.. వీడియో రూపంలో తన వెబ్‌సైట్‌లో ఉంచింది. భారత హాకీ అభిమానులందరూ తప్ప చూడాల్సిన వీడియో అది. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
పవన్ కల్యాణ్ తర్వాతే తారక్తో అంటున్న త్రివిక్రమ్
తన మాటలతో ఎవరినైనా మాయచేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కి ఇప్పుడో పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమాల...
TNN | Updated:
Oct 5, 2016, 05:40PM IST
తన మాటలతో ఎవరినైనా మాయచేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కి ఇప్పుడో పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమాల మేకింగ్‌లో ప్రతీ దర్శకుడికీ ఎప్పుడు, ఎవరితో, ఏ సినిమా తెరకెక్కించాలి అనే విషయంలో ఓ ప్లాన్ అనేది వుంటుంది. అలాగే త్రివిక్రమ్ కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో తన తర్వాతి సినిమాలు తీయాలని భావించాడు. అందులో భాగంగానే మొదటిగా పవన్ కోసం ఓ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. కానీ పవన్ మాత్రం ప్రస్తుతం కాటమరాయుడు మూవీ షూటింగ్‌తో ఫుల్ బిజీగా వున్నాడు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పవన్ కోసం ఎదురుచూస్తున్న త్రివిక్రమ్.. తారక్ సినిమాని వాయిదా వేస్తూ వస్తున్నాడు. పవన్‌తో సినిమా పూర్తయితే కానీ తన ప్లాన్ ప్రకారం తారక్ సినిమాని డైరెక్ట్ చేయలేడు త్రివిక్రమ్.
ఇదిలావుంటే, ఇటీవల కర్ణాటకలో పవన్, తారక్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ అభిమాని కన్నుమూయడం ఆ ఇద్దరు స్టార్స్ అభిమానుల మధ్య దూరాన్ని మరింత పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ తమ అభిమాన హీరోతో సినిమాని వాయిదా వేసుకుంటుండటం... అది కూడా పవన్ కోసం వేచిచూస్తుండటం తారక్ అభిమానులకి అంతగా మింగుడు పడటం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇలా తన ఇష్టానికి, తారక్ అభిమానుల అభిమతానికి మధ్య నలిగిపోతున్నాడట త్రివిక్రమ్. జనవరి నుంచి మన సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్దాం అని పవన్ త్రివిక్రమ్ చెప్పినట్టుగా ఓ ప్రచారం జరుగుతోంది. మామధ్య విభేదాలు ఏమీ లేవని ఇరువురు స్టార్స్ తరచుగా అభిమానులకి చెబుతున్నారు కనుక అభిమానులు కూడా ఈ విషయాన్ని లైట్ తీస్కుంటారేమో చూడాలి మరి!! | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మ్యాచ్ రద్దుపై అధికారులు భయపడ్డారా..?
భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించేందుకు
TNN | Updated:
Oct 14, 2017, 02:23PM IST
భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించేందుకు అధికారులు భయపడ్డారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఔట్‌ఫీల్డ్ బురదగా ఉండటంతో మ్యాచ్‌ జరిగే అవకాశం లేనందున విజేత నిర్ణయాత్మక మ్యాచ్‌ అయినప్పటికీ రద్దు చేయాల్సి వచ్చింది. వర్షం లేకపోవడం.. రోజంతా ఎండ ఉండటంతో మ్యాచ్ తప్పకుండా జరుగుతుందని వచ్చిన అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది.
మైదానం ఔట్‌ఫీల్డ్‌ని టేబుల్ ఫ్యాన్స్‌తో ఆరబెట్టిన సిబ్బంది.. మ్యాచ్ ఆరంభానికి ముందు మట్టిని చల్లి గట్టిపరిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దాదాపు మూడు సార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. ఔట్‌ఫీల్డ్‌లోని కొన్ని ప్రాంతాలు బురదగా ఉండటంతో చివరికి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటన కంటే అరగంట ముందు స్టేడియం నుంచి ఇరు జట్ల ఆటగాళ్లని ప్రత్యేక బస్సులలో వారు బస చేసిన హోటల్‌కి తరలించారు. గువహటిలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి జరిగిన నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు స్టేడియంలో ఉన్నప్పుడు మ్యాచ్ రద్దు ప్రకటన చేస్తే.. ఫ్యాన్స్ నుంచి నిరసనలు వ్యక్తమవుతాయనే భయంతో అధికారులు తెలివిగా వ్యవహరించారు. | 2sports
|
Oct 12,2017
ఆ చెక్కుబుక్కుల గడువు పెంపు : ఎస్బీఐ
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల పాత చెక్కుబుక్కుల చెల్లుబాటు గడువును పెంచుతూ ఎస్బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఆ బ్యాంకులకు సంబంధించిన చెక్లు సెప్టెంబర్ 30 తర్వాత చెల్లబోవంటూ ఎస్బీఐ ఇటీవలే అధికారికంగా ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా పాత చెక్కుబుక్కుల చెల్లుబాటు గడువును డిసెంబర్ 31 వరకు పొడగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇంతలోగా కొత్తవాటి కోసం దరఖాస్తు చేసుకోవాలని వినియోగదారులకు ఆ బ్యాంకు ట్విట్టర్లో సూచిం చింది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఎటీఎం, సొంత బ్యాంకు బ్రాంచీల నుంచి ఈ చెక్కుబుక్కుల దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ఎస్బీహెచ్తో పాటు ఐదు బ్యాంకులను ఎస్బీఐ తనలో విలీనం చేసుకున్న విషయం తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 6, Aug 2019, 11:14 PM IST
Highlights
బిగ్ బాస్ సీజన్ 3 పదహారు ఎపిసోడ్లను ముగించుకుని మంగళవారం నాడు పదిహేడో ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. మూడోవారం నామినేషన్కి ఐదుగురు నామినేట్ కావడంతో రంజుగా సాగుతోంది బిగ్ బాస్ ఆట. ఇక నేటి (ఆగస్టు 06) ఎపిసోడ్ వివరాళ్లోకి వెళ్తే..
నిన్నటి నుండి బిగ్ బాస్ హౌస్ లో ట్రాన్స్ జెండర్ తమన్నా హద్దులు మీరి ప్రవర్తిస్తోంది. తనను నామినేట్ చేశాడనే కారణంతో రవిక్రిష్ణను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. సోమవారం నాటి ఎపిసోడ్ లో రవిని వ్యక్తిగతంగా దూషించిన తమన్నా మంగళవారం నాడు కూడా అదే కంటిన్యూ చేసింది. తను బిగ్ బాస్ హౌస్ లో ఉండేది మరో ఐదు రోజులు మాత్రమేనని ఈ ఐదు రోజులు మాత్రం తన శత్రువు రవిక్రిష్ణను మాత్రం వదిలిపెట్టను అంటూ పర్సనల్ అటాక్ చేసింది తమన్నా.
మొదట జర్నలిజం కూడా యాక్టింగ్ అని డబ్బు కోసం చేస్తుంటారని శివజ్యోతిని ఉద్దేశిస్తూ మాట్లాడింది తమన్నా. దీంతో శివజ్యోతి ఓ రేంజ్ లో తమన్నాపై ఫైర్ అయింది. నోటికొచ్చి మాట్లాడితే ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
డైనింగ్ టేబుల్ మీద సైలెంట్ గా కూర్చొని టిఫిన్ చేస్తోన్న రవిని ఇష్టమొచ్చినట్లు దూషించింది తమన్నా. నవ్వులో కూడా దమ్ములేదని.. నువ్ మగాడికి కాదు.. రేయ్ పప్పూ అంటూ అతడిని రెచ్చగొట్టింది. తమన్నా ఎంత రెచ్చగొట్టినా రవికృష్ణ స్పందించక పోవడంతో వీడు మగాడే కాదంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. రవికృష్ణ తనకు ఎంత కోపం వస్తున్నా.. కంట్రోల్ చేసుకొని కామ్ గా ఉన్నాడు.
రవిని తమన్నా అలా టార్గెట్ చేయడాన్ని హౌస్ మేట్స్ కూడా భరించలేకపోయారు. అతడికి అండగా నిలిచారు. ట్రాన్స్ జెండర్స్ తరపున వచ్చి వాళ్లకు స్పూర్తిగా నిలవాల్సిన మీరు ఇలా దిగజారుడుగా ప్రవర్తించడం సరికాదంటూ తమన్నా మొహం మీదే అన్నాడు రాహుల్. దీంతో అతడితో కూడా గొడవకి దిగింది తమన్నా. హౌస్ మొత్తం కూడా తమన్నా చేష్టలతో విసిగిపోయింది.
Last Updated 6, Aug 2019, 11:14 PM IST | 0business
|
Hyderabad, First Published 12, Oct 2018, 10:48 AM IST
Highlights
టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ కు దిగాల్సి వచ్చింది. బౌలింగుకు దిగిన శార్డూల్ ఠాకూర్ దాదాపు 14 బంతులు వేశాడో లేదో గాయపడ్డాడు.
హైదరాబాద్: శార్దూల్ ఠాకూర్ కు ఆరంగేట్రం అచ్చి రానట్లే ఉంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో శార్దూల్ ఠాకూర్ టెస్ట్ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. అయితే, అంతలోనే గాయపడి మైదానం నుంచి వైదొలిగాడు.
ఈ మ్యాచులో టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ కు దిగాల్సి వచ్చింది. బౌలింగుకు దిగిన శార్డూల్ ఠాకూర్ దాదాపు 14 బంతులు వేశాడో లేదో గాయపడ్డాడు.
అతని చీలమండ గాయం తిరగబెట్టింది. ఆ నొప్పితో విలవిలలాడుతుంటే చూడలేక కెప్టెన్ కోహ్లీ, ఫిజియో మైదానం వీడాల్సిందిగా సూచించారు. దాంతో అతను మైదానం వీడాడు.
శూర్దూల్ 3.4 ఓవర్లు ఓవర్లు వేశాడు. చివరి రెండు బంతులు అశ్విన్ వేసి ఓవర్ పూర్తి చేశాడు.
Last Updated 12, Oct 2018, 10:48 AM IST | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఐడీబీఐలో కుంభకోణం.. చేపల చెరువుల పేరుతో రూ. 772 కోట్లు కుచ్చుటోపి
బ్యాంకింగ్ కుంభకోణాల జాబితాలో మరో ఉదంతం చేరింది. ఐడీబీఐ బ్యాంక్కు చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని 5 శాఖల్లో సుమారు రూ.772 కోట్ల మేర మోసం జరిగినట్లు తేలింది.
TNN | Updated:
Mar 28, 2018, 03:39PM IST
బ్యాంకింగ్ కుంభకోణాల జాబితాలో మరో ఉదంతం చేరింది. ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదు బ్రాంచీలు నిండా మునిగాయి. ఐడీబీఐ బ్యాంక్కు చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని 5 శాఖల్లో సుమారు రూ.772 కోట్ల మేర మోసం జరిగినట్లు తేలింది. మంగళవారం (మార్చి 27) నిర్వహించిన ఆడిట్ అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2009-2013 మధ్య కాలంలో మోసపూరిత రుణాలు ఇచ్చినట్లు తేలింది. చేపల చెరువుల పేరుతో కొంత మంది తప్పుడు సర్టిఫికెట్లు చూపించి రుణాలు పొందినట్లు అధికారులు గుర్తించారు.
ఈ రుణాలన్నీ బ్యాంకుకు చెందిన ఇద్దరు అధికారుల ద్వారా మంజూరైనట్లు గుర్తించారు. వీరిలో ఇప్పటికే ఒక అధికారి రిటైర్ అయినట్లు గుర్తించారు. ఈ కుంభకోణంపై ఐడీబీఐ సిబ్బంది సీబీఐకి ఫిర్యాదు చేశారు. బషీర్బాగ్, గుంటూర్ జిల్లాలోని పలు బ్రాంచ్లకు సంబంధించిన 5 ఫిర్యాదులను నమోదు చేశారు. | 1entertainment
|
Suresh 156 Views
రఘురామ్ సమీక్షపై ఇన్వెస్టర్ల పెదవివిరుపు
ముంబై: రిజర్వు బ్యాంకు సమీక్ష ఫలితాలు ఇన్వెస్టర్లకు రుచించలేదు.. స్టాక్ మార్కెట్లు దిగు స్తాయిలోనే ముగిసాయి.. బిఎస్ఇ సెన్సెక్స్ 97పాయింట్లు దిగువన ముగిసింది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నందున రెపోరేట్ల జోలికి వెల్టం లేదని రాజన్ పద చివరి సమీక్షలో సంకేతాలిచ్చారు. ఆర్థిక రంగ నిపుణుల అంచనాలకు అనుగుణగా వడ్డీరేట్లు స్థిరంగా కొనసాగించింది. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులు.. కొత్తగా ఏ+ గ్రేడ్.. షమీ ఔట్!
భారత క్రికెటర్ల వేతనాల చెల్లింపు కోసం బీసీసీఐ సరికొత్త కాంట్రాక్ట్ సిస్టమ్ను రూపొందించింది. అందులో భాగంగా కొత్త ఏ+ గ్రేడ్ను ఏర్పాటు చేసింది.
TNN | Updated:
Mar 7, 2018, 06:22PM IST
క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులు.. కొత్తగా ఏ+ గ్రేడ్.. షమీ ఔట్!
భారత క్రికెటర్ల వేతనాల చెల్లింపు కోసం బీసీసీఐ సరికొత్త కాంట్రాక్ట్ సిస్టమ్‌ను రూపొందించింది. అందులో భాగంగా కొత్త ఏ+ గ్రేడ్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ సూచనల మేరకు ఇక నుంచి భారత సీనియర్ జట్టులో ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలు ఉంటాయి. ఏ+ కేటగిరీలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లకు ఏటా రూ.7 కోట్లు చెల్లిస్తారు. కేటగిరీ-ఏ పరిధిలోకి వచ్చే ఆటగాళ్లకు రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందిస్తారు. బీ-కేటగిరీలోకి వచ్చే వారికి రూ.3 కోట్లు, సీ- కేటగిరీలో వచ్చే వారికి రూ.1 కోటి చొప్పున చెల్లించనున్నారు.
Visit Site
Recommended byColombia
భారత సీనియర్ జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాలు ఏ+ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఏ-కేటగిరీలో.. అశ్విన్, జడేజా, మురళీ విజయ్, పుజారా, రహానే, ధోనీ, సాహాలకు స్థానం కల్పించారు. టెస్టు క్రికెట్ ఆడని కారణంగా ధోనీకి కేటగిరీ ఏ+లో అవకాశం కల్పించలేదు.
బీ-కేటగిరీలో కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చాహల్, హర్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, దినేశ్ కార్తీక్‌లకు అవకాశం దక్కింది. సీ-కేటగిరీలో కేదార్ జాదవ్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, సురేశ్ రైనా, పార్థీవ్ పటేల్, జయంత్ యాదవ్‌లకు చోటు కల్పించారు. యువరాజ్ సింగ్‌, షమీలను కాంట్రాక్ట్‌ల విషయంలో పట్టించుకోలేదు.
మహిళా క్రికెట్లో కొత్తగా గ్రేడ్-సిని ఏర్పాటు చేశారు. ఏ-గ్రేడ్ మహిళా ప్లేయర్లకు రూ. 50 లక్షలు, బీ-గ్రేడ్‌లో చోటు దక్కించుకున్న వారికి రూ.30 లక్షలు, సీ-గ్రేడ్ ప్లేయర్లకు రూ. 10 లక్షల చొప్పున వార్షిక వేతనం అందించనున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కళాభిరుచికి నిలువెత్తు నిర్వచనం ఏడిద
చిరస్మరణీయ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భౌతికంగా ఇక లేరన్న వార్త తెలుగు చిత్రసీమతో పాటు ప్రేక్షకులనూ ఒక్కసారి కుదిపేసింది.
TNN | Updated:
Oct 5, 2015, 11:42AM IST
హైదరాబాద్: ఆణిముత్యాల్లాంటి పదే పది సినిమాలను నిర్మించి, తెలుగు చిత్రసీమలోనూ, ప్రేక్షక హృదయాలలోనూ నిలిచిపోయిన చిరస్మరణీయ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భౌతికంగా ఇక లేరన్న వార్త తెలుగు చిత్రసీమతో పాటు ప్రేక్షకులనూ ఒక్కసారి కుదిపేసింది.ఒక సాధారణ డబ్బింగ్, జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ను ఆరంభించి అంచెలంచెలుగా నిర్మాతగా ఎదిగిన ఆయనకు నాటక రంగంతో కూడా విడదీయలేని అనుబంధం ఉంది. - కాకినాడ స్కూల్ వార్షికోత్సవంలో 'లోభి' అనే నాటకంలో ఆడ వేషం వేయడం ద్వారా ఆయన నటప్రస్థానం జరిగింది. ఆ నాటకంలో మగ పాత్రధారుల ఎంపిక పూర్తికావడంతో ఒకే ఒక్క ఆడవేషం మిగిలిపోయిందట. ఇష్టం ఉంటే ఆ ఆడవేషం వెయ్యమని ఆయనను కోరడంతో వెంటనే వేరే ఆలోచన లేకుండా ఒప్పేసుకుని, ఆ పాత్రను ధరించారట. అలా ఆయన వేసిన ఆ తొలి ఆడవేషానికి సిల్వర్మెడల్ రావడం ఓ విశేషం.పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థను స్థాపించి, దానిపై 1978లో ఆయన తీసిన తొలి కళాఖండం 'సిరి సిరి మువ్వ' చిత్రానికి ఎంతటి ప్రేక్షకాదరణ లభించిందో తెలిసిందే. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో చంద్రమోహన్, జయప్రదలు తమ పాత్రలకు ప్రాణంపోసి, ప్రేక్షక హృదయాలలో చెరగని ముద్రను వేసుకున్నారు. ఆ తర్వాత 'తాయారమ్మ బంగారయ్య' వంటి కుటుంబ కథాచిత్రాన్ని నిర్మించిన ఆయన వెంటనే 'శంకరాభరణం ' వంటి కళాత్మక చిత్రాన్ని తీసి అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించారు. ఆ చిత్రానికి వచ్చిన అవార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆ తర్వాత తీసిన 'సీతాకోకచిలుక ' ప్రేమకథాచిత్రం కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేసింది. ఇక ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోనేలేదు. ‘ సాగర సంగమం’,'సితార, స్వాతిముత్యం, స్వయంకృషి, స్వరకల్పన, ఆపద్బాంధవుడు' వంటి అద్భుత చిత్రాలను నిర్మించి తెలుగు చలనచిత్ర చరిత్రలో నిర్మాత అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. సినీరంగం పట్ల ఆయనకున్న అభిరుచి, మక్కువను చెప్పేందుకు మాటలు చాలవు. అయితే సినీరంగంలో ట్రెండ్ మారడంతో చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చారు. అలనాటి అద్భుత చిత్రాల నిర్మాతలు నేడు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను చూసి ఎంతగానో బాధపడటం, చలించిపోవడం అడపాదడపా చూస్తున్నదే. ఎప్పటికైనా మళ్లీ ఆ బంగారు రోజులు రాకపోతాయా! అని ఆశావాదంగా ఎదురుచూస్తున్న నిర్మాతల | 0business
|
Visit Site
Recommended byColombia
సారీ చిరంజీవి గారు.. నేను చాలా స్మూత్గానే మాట్లాడుతున్నా.. మంచి గురించి మాత్రమే మాట్లాడుతున్నా.. నా వ్యాఖ్యల్ని తీసుకోండి. మీకు పేరు ఉంది కాబట్టి మేమంతా వెధవలమా? వయసు కాదు జ్ఞానం ఉండాలి’ అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్ని తొక్కి తొక్కి 13 హీరోస్ని కన్నారు. నన్ను కూడా తొక్కుతారా? నన్ను కెలకవద్దు. నా జోలికొస్తే పంబ పగిలి రంభ బయటకొస్తాది’ అంటూ చిరంజీవికే వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి.
See Photos: శ్రీరెడ్డి హాట్ ఫ్యాషన్ షో
ఇంతకీ శ్రీరెడ్డిని మెగాస్టార్ ఏమన్నారు..? ఆమె కోపానికి కారణం ఏంటంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తమన్నా సింహాద్రి. అవును.. శ్రీరెడ్డిపై మెగాస్టార్ పరోక్షంగా చురకలేసింది ఎక్కడ నుండో బిగ్ బాస్ స్టేజ్ మీది నుండే.
ఆదివారం నాడు జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. హౌస్లో ఉన్న తమన్నా సింహాద్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘తమన్నా. . వెరీ డైనమిక్ గర్ల్. తేడాలొస్తే చీల్చి చెండాడుతావ్. ప్రేమిస్తే.. మనసు ఇచ్చేస్తావ్. తప్పు జరిగితే ఏదైనా సరే.. బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడగలిగే ధైర్య వంతురాలివి నువ్. నువ్వు అప్పటి వరకూ ఎవర్ని సపోర్ట్ చేసినా సరే.. వాళ్లు మంచి వ్యక్తుల్ని విమర్శిస్తే.. ఆ ఫ్రెండ్ షిప్ని కూడా కట్ చేసుకుని బయటకు వచ్చి నువ్ చేస్తున్నది తప్పు చెప్పే ధైర్యం నీలో ఉన్నది. ఆవిషయంలో నిన్ను అభినందిస్తున్నా. ఇది నీకు నాకు మాత్రమే అర్ధమై ఉంటుంది. ఇంకెవరికీ అర్ధంకాకపోవచ్చు.. కరెక్టేనా?’ అంటూ తమన్నాని ఉద్దేశించి మాట్లాడారు.
అయితే ఈ మాటలు శ్రీరెడ్డిని ఉద్దేశించి అన్నవని చాలామంది క్యాచ్ చేయడంతో శ్రీరెడ్డి ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. అప్పట్లో శ్రీరెడ్డి, తమన్నాల మధ్య రిలేషన్ ఉండేది. అయితే శ్రీరెడ్డి పవన్ని టార్గెట్ చేయడంతో తమన్నా ఫ్రెండ్ షిప్కి కట్ చెప్పి శ్రీరెడ్డితో విభేదించింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
శ్రీలంకపై శతకం బాదిన కోహ్లి..!
శ్రీలంకతో కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శతకంతో చెలరేగాడు.
TNN | Updated:
Aug 31, 2017, 04:57PM IST
శ్రీలంకతో కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శతకంతో చెలరేగాడు. అతను కేవలం 76 బంతుల్లోనే 14 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసిన సిరివర్దనె బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ దిశగా కళ్లు చెదిరే రీతిలో బౌండరీ బాదిన కోహ్లి కెరీర్‌లో 29వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
మలింగ యార్కర్‌ రూపంలో విసిరిన బంతిని విరాట్ కోహ్లి (131: 96 బంతుల్లో 17x4, 2x6) కవర్స్ దిశగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఫీల్డర్ మునవీర దిల్షాన్ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విషయాన్ని కోహ్లి గుర్తించలేకపోయినట్లు తెలుస్తోంది. అప్పటికే ఆ ప్రదేశంలో రెండు.. మూడు బౌండరీలు బాదిన కోహ్లి.. మరో బౌండరీ కోసం ప్రయత్నిస్తూ అతని చేతికి చిక్కిపోయాడు. దిల్షాన్ క్యాచ్ అందుకునేందుకు నిల్చొన్న చోట నుంచి ఎక్కడికీ కదలాల్సిన అవసరం లేకపోయింది. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఐశ్వర్యరాయ్.. అస్సలు తగ్గట్లేదు..!
అసలేమాత్రం తగ్గట్లేదామె.. వయసు, సంసారం.. ఇవేవీ ఆమెలోని గ్లామర్ డోస్ ను తగ్గనిచ్చేలా లేవు. ఇప్పటికీ అదే గ్లామర్ తో, అదరగొట్టే అందంతో,
Samayam Telugu | Updated:
Mar 27, 2018, 09:29AM IST
ఐశ్వర్యరాయ్.. అస్సలు తగ్గట్లేదు..!
అసలేమాత్రం తగ్గట్లేదామె.. వయసు, సంసారం.. ఇవేవీ ఆమెలోని గ్లామర్ డోస్ ను తగ్గనిచ్చేలా లేవు. ఇప్పటికీ అదే గ్లామర్ తో, అదరగొట్టే అందంతో, తన వయసులో సగమున్న హీరోయిన్లకు పోటీనిచ్చేలా.. అగుపిస్తోంది ఐశ్వర్య రాయ్ బచ్చన్. తాజాగా అంబానీల ఇంట జరిగిన ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి మిగిలిన బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఐశ్వర్యరాయ్ కూడా హాజరైంది. కూతురు ఆరాధ్యను వెంటబెట్టుకుని ఐష్ ఈ కార్యక్రమానికి వచ్చింది.
Visit Site
Recommended byColombia
సంతూర్ మమ్మీకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గా నిలిచింది ఐశ్వర్య. ఒకవైపు కూతురు పొడగరిగా ఎదుగుతున్నా.. ఐశ్వర్యరాయ్ లోని హీరోయిన్ ఫీచర్స్ ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. క్లీవేజ్ అందాలను ఆవిష్కరించే డ్రస్సింగ్ తో ఐష్ ఈ ఫొటోలను చూసే వాళ్ల మతులను కూడా పోగుడుతోంది.
ప్రస్తుతం ఐష్ వయసు 44 సంవత్సరాలు. త్వరలోనే ఫ్యానీ ఖాన్ సినిమాతో ప్రేక్షకులను, అభిమానులను పలకరించబోతోంది బచ్చన్ ఇంటి కోడలు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Thiruvananthapuram, First Published 1, Nov 2018, 2:49 PM IST
Highlights
భారత్-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలోనే విండీస్ బ్యాటింగ్ పేలవంగా సాగుతోంది. భారత బౌలర్ల దాటికి మరోసారి విండీస్ బ్యాట్ మెన్స్ అల్లాడిపోతున్నారు. ఒకరివెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు.
నిర్ణయాత్మక ఐదో వన్డేలో భారత్ విండీస్ జట్టును చిత్తుగా ఓడించింది. దీంతో ఐదు వన్డేల సీరిస్ 3-1 తేడాతో భారత్ వశమైంది. 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే విండీస్ బౌలర్లు షాకిచ్చారు. రెండో ఓవర్లోనే ధావన్ వికెట్ పడగొట్టారు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీ మరో వికెట్ పడకుండానే భారత్ ను విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో రోహిత్ అర్థశతకం పూర్తిచేసుకున్నాడు. మొత్తానికి రోహిాత్ 63 పరుగులు 56 బంతుల్లో( 5 పోర్లు, 4 సిక్సులు) సాధించగా, కోహ్లీ 33 పరుగులు 29 బంతుల్లో( 6 ఫోర్లు) బాదాడు. వీరి దూకుడుతో కేవలం 14.5 ఓవర్లలోనే ఆట ముగిసింది.
తిరువనంతపురంలో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ ఘన విజయం వైపు దూసుకుపోతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించి ఇండియా విజయాన్ని ఖరారు చేశారు. కెప్టెన్ కోహ్లీతో కలిసి మరో వికెట్ పడకుండా రోహిత్ మంచి బాగాస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ కేవలం 54 బంతుల్లోనే 62 పరుగులు సాధించగా కోహ్లీ 33 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
కేవలం 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కూడా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. థామన్ బౌలింగ్ క్లీస్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 3 ఓవర్లలో 22 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు.
తిరువనంతపురంలో జరుగుతున్న ఐదో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో విండీస్ కేవలం 31.5 ఓవర్లలోనే 104 పరుగులు చేసి ఔటయ్యింది. విండీస్ జట్టుకు ఏ దశలోనూ కోలుకోడానికి సమయం ఇవ్వకుండా బౌలర్లు వికెట్లు పడగొట్టారు. విండీస్ జట్టులో ముగ్గురు బ్యాట్ మెన్స్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. 25 పరుగులు చేసిన హోల్డర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.
భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఖలీల్ అహ్మద్, బుమ్రాలు చెరో రెండు వికెట్లు పడగొట్టగా,భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్ లు చేరో వికెట్ తీశారు. దీంతో భారత జట్టు ముందు విండీస్ కేవలం 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
ఐదో వన్డేలో భారత బౌలర్ల జోరు కొనసాగుతోంది. విండీస్ జట్టును కుప్పకూల్చడంలో దాదాపు వారు సఫలమయ్యారు. ఇప్పటికే ఏడు వికెట్లు కోల్పోయి ఫీకల్లోతు కష్టాల్లో పడ్డ విండీస్ కు కుల్దీప్ మరో షాకిచ్చాడు. కుల్దీప్ వేసిన 28 ఓవర్లో పాల్ ఫీల్డర్ రాయుడికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 94 పరుగుల వద్ద విండీస్ 8వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులు బిషూ, రోచ్ లు వున్నారు.
విండీస్ జట్టు వికెట్ల పతనాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించిన బ్యాట్ మెన్ హోల్డర్ కూడా పెవిలియన్ కు చేరాడు. ఇప్పటివరకు 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన హోల్డర్, ఖలీల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో విండీస్ 87 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పాల్, బిషూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.
విండీస్ మరో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన 20వ ఓవర్లో అలెన్(4 పరుగులు) జాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో విండీస్ 66 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం హోల్డర్ కి తోడుగా పాల్ క్రీజులో వున్నాడు.
ఐదో వన్డేలో భారత బాలర్ల దాటికి విండీస్ బ్యాట్ మెన్స్ పెవిలియన్ బాట పట్టారు. కేవలం 57 పరుగులకే విండీస్ జట్టు సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఖలీల్ అహ్మద్ వేసిన 16 ఓవర్లో ఓపెనర్ ఆర్. పావెల్ ఔటయ్యాడు. ప్రస్తుతం హోల్డర్, అలెన్ బ్యాటింగ్ చేస్తున్నారు. విండీస్ స్కోరు ప్రస్తుతం 20 ఓవర్లలో 65 పరుగులుగా ఉంది.
భారత్-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలోనే విండీస్ బ్యాటింగ్ పేలవంగా సాగుతోంది. భారత బౌలర్ల దాటికి మరోసారి విండీస్ బ్యాట్ మెన్స్ అల్లాడిపోతున్నారు. కేవలం 53 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్ కష్టాల్లో పడింది.
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఈ సీరీస్ లో మొదటిసారిగా విండీస్ టాస్ గెలించింది. దీంతో విండీస్ జట్టు బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకుంది. అయితే ఇది తప్పుడు నిర్ణయమని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు.
మొదటి ఓవర్లోనే బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓపెనర్ పావెల్ డకౌట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బుమ్రా ఈ సీరిస్ లో మంచి పామ్ లో వున్న హోప్స్ ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్యామూల్స్ జట్టును ఆదుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అతడు జడేజా వేసిన 11 ఓవర్లో కెప్టెన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక 15 ఓవర్లో హెట్మెయర్ రూపంలో విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ వికెట్ కూడా జడేజా ఖాతాలోకే చేరింది.
ప్రస్తుతం క్రీజులో ఆర్. పావెల్, హోల్డర్ ఉన్నారు. మొత్తంగా విండీస్ జట్టు కేవలం 16 ఓవర్లలో 57 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో జడేజా 2, భువనేశ్వర్ 1, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు. | 2sports
|
జర్మన్ క్రీడాకారుడికి మద్ధతు...క్రీడాకారిణిగా ఇలాంటి మాటలు వినలేను: సానియా
Highlights
తాను జర్మనీ తరపున అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు ఆడనని జర్మన్ ఫుట్బాల్ క్రీడాకారుడు మెసట్ ఒజిల్ వ్యాఖ్యలకు సానియా మిర్జా మద్ధతుగా నిలిచారు
తాను జర్మనీ తరపున అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు ఆడనని జర్మన్ ఫుట్బాల్ క్రీడాకారుడు మెసట్ ఒజిల్ వ్యాఖ్యలకు సానియా మిర్జా మద్ధతుగా నిలిచారు. జట్టును గెలిపించినప్పుడు మాత్రమే జర్మన్గా గుర్తించడం.. ఓడిపోయినప్పుడు ఒక వలసదారుడి వల్లే ఓటమి జరిగిందంటూ ఒజిల్ కన్నీటి పర్యంతమవుతూ.. కేవలం టర్కీ మూలాలున్న కారణంగానే తనను విమర్శిస్తున్నారంటూ ఆరోపించాడు..
తాను దేశం తరపున ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించినప్పటికీ తనపై విమర్శలు చేస్తున్నారని...జాతి వివక్షకు వ్యతిరేకంగా తాను జర్మనీ తరపున ఫుట్బాల్ ఆడనంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతని నిర్ణయానికి మద్దతుగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పందించింది. ‘‘ ఒక క్రీడాకారిణిగా.. ఒక మనిషిగా ఇలాంటి వార్తలు వినాల్సి రావడం చాలా బాధ కలిగిస్తోందని.. జాత్యహంకారం అసలు ఉండకూడదని.. దానిని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించనని ’’ సానియా ట్వీట్ చేశారు.
Last Updated 23, Jul 2018, 7:06 PM IST | 2sports
|
internet vaartha 255 Views
జియాంగ్ : చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. కాగా మహిళల సింగిల్స్లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 17-21,19-21 తేడాతో బురానా ప్రాసెర్ట్సుక్(థాయ్ లాండ్) చేతిలో ఓటమి చెందింది.సింధు ఈ పోరులో 38 నిముషాల పాటు పోరాడి ఓడిపోయింది. తొలి గేమ్ ఆదిలో 4-1తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ తరువాత థాయ్ లాండ్ క్రీడా కారిణి స్కోరును 4-4తో సమం చేసింది. ఆ తరువాత సింధు 7-4,13-10తో మరోసారి ముందుకు దూసుకెళ్లింది. కాగా తొలి గేమ్ స్కోర్ 16-16తో ఇరువురి క్రీడాకారిణులు సమంగా ఉన్న సమయంలో బురానాప్రాసెర్ట్సుక్ వరుస పాయింట్లను సాధించి గేమ్ను దక్కించుకుంది. అయితే రెండవ గేమ్లో సింధు 11-8తో పై చేయి సాధించినా మధ్యలో చితికిలబడి వరుస పాయింట్లను చేజార్చుకుంది.రెండవ గేమ్ ఆధ్యంతం నువ్వా-నేనా అన్నట్లు సాగినా చివరకు బురానాప్రాసెర్ట్సుక్నే విజయం వరించింది.ఇక పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ప్రణయ్ 10-21,15-21 తేడాతో ప్రపంచ నెంబర్ వన్ చెస్ లాంగ్ చైనా చేతిలో ఓడిపోయాడు. ఇక మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గుత్తాజ్వాల-అశ్విని పొన్నప్ప 11-21, 14-21 తేడాతో లూ యింగ్ -వూ యూ (చైనా) చేతిలో ఓడిపోయారు. | 2sports
|
శ్రీదేవి కుమార్తె జాహ్నవికి స్రిక్ట్ రూల్స్.. ఇక కనిపించదా
Highlights
జాహ్నవికి నిబంధనలు విధించిన తల్లి శ్రీదేవి
సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్
బాలీవుడ్ లో కూతురు గ్రాండ్ ఎంట్రీ కోసం తెగ ట్రై చేస్తున్న శ్రీదేవి
అందాల తార శ్రీదేవిని కోరుకునే వాళ్లందరి కోసం ఇప్పుడు అందరి దృష్టి.. మరికొన్నాళ్లలో సినీ అరంగేట్రం చేయనున్న శ్రీదేవి కూతుర జాన్వి కపూర్ పైనే ఉంది.
తన పెద్ద కూతురుని హీరోయిన్ చేయడం విషయంలో శ్రీదేవి చాలానే జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తోంది. స్టైలింగ్ నుంచి ప్రతీ విషయంలోనూ కేర్ తీసుకుంటోంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఈ భామకు.. ఇప్పుడీ అందాల మమ్మీ కొత్త రూల్ పెట్టిందట. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఫోటోలను సోషల్ మీడియాలో రివీల్ చేయద్దని చెప్పిందట. ఎప్పటికప్పుడు ఆమె లుక్స్ బైటకు వచ్చేస్తుండడంతో.. కూతురు సినీ ఎంట్రీపై హైప్ క్రియేట్ అవదని.. శ్రీదేవి ఉద్దేశ్యం కావచ్చని అంటున్నారు బాలీవుడ్ జనాలు.గతంలో కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదంటూ ఇలాగే ఓ రూల్ పెట్టింది జాన్వీ కపూర్ మమ్మీ.
అయితే.. జాన్వీ కపూర్ అరంగేట్రం కోసం శ్రీదేవి తెరవెనుక ప్రయత్నాలు చాలానే చేస్తోంది. మరోవైపు.. ఇన్నాళ్లు జాన్వీ సెల్ఫీలతో అందాల విందు చేసుకున్న అభిమానులు.. ఇకపై ఈ అమ్మడు కనిపించదేమో అని ఇప్పటినుంచే బెంగ పెట్టేసుకుంటున్నారు.
Last Updated 26, Mar 2018, 12:03 AM IST | 0business
|
హోమ్ క్రీడలు జడేజా అద్భుత ఇన్నింగ్స్ తో గౌరవప్రద స్కోరును అందుకున్న భారత్
జడేజా అద్భుత ఇన్నింగ్స్ తో గౌరవప్రద స్కోరును అందుకున్న భారత్
August 24, 2019, 12:12 PM IST
Share on:
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 297 పరుగులకు ఆలౌటైంది. 203/6 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్ను ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆదుకున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 24 పరుగులు చేసి కీమర్ రోచ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇషాంత్ శర్మ అండతో జడేజా పోరాటం కొనసాగించాడు. విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న వీరిద్దరూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్తో టీమిండియాకు అండగా నిలిచాడు. సమన్వయంతో ఆడిన ఇషాంత్ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో జడేజాతో కలిసి 60 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. తర్వాత వచ్చిన మహ్మద్ షమి (౦) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అయితే చివరి బ్యాట్స్మన్ బుమ్రా (4) అండతో జడేజా విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జడేజా 112 బంతుల్లో ఆరు బౌండరీలు, మరో సిక్సర్తో 58 పరుగులు చేసి చివరి వికెట్గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ గౌరవప్రద స్కోరును అందుకుంది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ నాలుగు, గాబ్రియల్ మూడు, రోస్టన్ ఛేజ్ రెండు వికెట్లు పడగొట్టారు.
సంబంధిత వార్తలు | 2sports
|
Hyd Internet 152 Views dravid and anushka shetty
dravid and anushka shetty
బెంగుళూరుః క్రికెటర్లకు మన దేశంలో ఉన్న క్రేజే వేరు. తమ ఆటతీరుతో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. యువ ఆటగాళ్లకు మహిళా అభిమానులే ఎక్కువ. తాజాగా టాలీవుడ్ భామ అనుష్క తన అభిమాన క్రికెటర్ ఎవరో తెలిపింది. తాజాగా అనుష్క ఓ వెబ్ పోర్టల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. మీ అభిమాన క్రికెటర్ ఎవరు అని ప్రశ్నించాడు. దీనికి అనుష్క ‘రాహుల్ ద్రవిడ్ నా అభిమాన క్రికెటర్. నా చిన్నతనం నుంచి అతనంటే నాకు పిచ్చి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా’ అని బదులిచ్చింది.
. | 2sports
|
Hyderabad, First Published 23, Oct 2018, 9:33 AM IST
Highlights
టీఆర్పీల కోసం ఎంతకైనా దిగజారే పరిస్దితి టీవి మీడియాలో కనిపిస్తోంది. ఇంతకాలం జబర్దస్త్ నే వల్గర్ అంటూ తిట్టుకున్న మనం తమిళంలో వస్తున్న సప్న సుందరి పోగ్రాం గురించి తెలిస్తే లైట్ అంటాం. అంతలా పూర్తిగా బూతు,వల్గారిటితో ఆ పోగ్రాం నింపేసారు నిర్వాహకులు.
టీఆర్పీల కోసం ఎంతకైనా దిగజారే పరిస్దితి టీవి మీడియాలో కనిపిస్తోంది. ఇంతకాలం జబర్దస్త్ నే వల్గర్ అంటూ తిట్టుకున్న మనం తమిళంలో వస్తున్న సప్న సుందరి పోగ్రాం గురించి తెలిస్తే లైట్ అంటాం. అంతలా పూర్తిగా బూతు,వల్గారిటితో ఆ పోగ్రాం నింపేసారు నిర్వాహకులు.
కళానిధి మారన్ సొంత ఛానెల్ సన్ నెట్ వర్క్ గత రెండు సంవత్సరాలుగా తమిళ మార్కెట్లో వ్యూయర్ షిప్ కోల్పోతూ వస్తోంది. ఓ ప్రక్కన బిగ్ బాస్ తో స్టార్ విజయ్, జీ తమిళ్ నెంబర్ వన్ పొజీషన్ లోకి వచ్చేసాయి. ఈ నేపధ్యంలో పోల్ పొజీషన్, షేర్స్ నిలబెట్టుకోవాలంటే తమను తాము రీలాంచ్ చేసుకోవాలని కొద్దికాలం క్రితం నిర్ణయించుకుంది.
తమ సీరియల్స్, షోలు అన్ని కూడా కేవలం సీనియర్ సిటిజన్స్ లేదా నలభైల్లో ఉన్నవారికి మాత్రమే తయారువుతున్నాయని అర్దం చేసుకుని 18-30 ఏళ్ల లోపు వాళ్ల కోసం ఓ పోగ్రామ్ డిజైన్ చేయాలని నిర్ణయించారు. అయితే అంతత్వరగా అది జరిగే పని కాదుగా.
అందుకోసం ఇతర దేశాల్లో క్లిక్ అయిన రియాల్టి షోలు తెప్పించుకుని చూసారు. వాటిల్లో వాళ్లకి నచ్చింది America’s Next Top Model అనే రియాల్టి షో. మోడల్స్ కోసం టీవి ఛానెల్ జరిపే ఓ అన్వేషణ ఆ పోగ్రాం. రకరకాల దుస్తుల్లో మోడల్ గా చూసుకోవాలనుకునే అమ్మాయిలు...కనపడతారన్నమాట. మోడలింగ్ అనే పదాన్ని అడ్డం పెట్టి బూతుని కుప్పగా పోస్తున్నారనేది విమర్శుకుల మాట.
ఇప్పుడా పోగ్రాం దేశీయంగా స్వప్న సుందరి పేరుతో ఇక్కడ రెడీ చేసారు. కావాల్సినంత మసాలా కలుపుతున్నారు. అమ్మాయిలు విచ్చలివిడిగా తమ అంగాంగ ప్రదర్శన చేసుకోవచ్చు అన్నట్లుగా ఉందా పోగ్రామ్. మీడియాలో కూడా ఈ పోగ్రాం వివాదంగా మారింది. ఇంత పచ్చిగానా ..అదీ టీవిలో అంటూ విమర్శలు చేస్తున్నారు. దాంతో ..అసలు ఆ పోగ్రాం ఏమిటి మరింతగా జనం ఎగబడి చూస్తున్నారు.
తిట్టుకుంటూనే ఈ పోగ్రాం ని హిట్ చేస్తున్నారు. ఈ పోగ్రాం ఎంతలా క్లిక్ అయ్యిందంటే ...సన్ నెట్ వర్క్ మరిన్ని ఇలాంటి పోగ్రామ్ లు డిజైన్ చేయాలని ప్లాన్ చేస్తోందని వినికిడి. మరి తమిళంలో హిట్ అయ్యిందంటే త్వరలో తెలుగులోనూ ఈ పోగ్రాం దిగనుందన్నమాట. అయితే అక్కడ సన్ నెట్ వర్క్..
Last Updated 23, Oct 2018, 9:33 AM IST | 0business
|
బిగ్ బాస్ సీజన్ 2 పై తన దగ్గర ఎటువంటి అప్ డేట్స్ లేదంటున్న నాని
Highlights
బిగ్ బాస్ సీజన్ 2 పై తన దగ్గర ఎటువంటి అప్ డేట్స్ లేదంటున్న నాని
బిగ్ బాస్ అప్పటి వరకు రియాలిటీ షోలు ఒకవైపు కానీ బిగ్ బాస్ ఎప్పుడైతే వచ్చిందో సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు ఉన్న టీఆర్పీ లు గల్లంతై కొత్త రికార్డులను సృష్టించింది. దానికి ఒకే ఒక్క కారణం తారక్ తనకు తెలుగు పట్ల ఉన్న పట్టు అవలీలగా తెలుగు మాట్లాడడం,చురుకుదనం ఇలా చాలా. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేవలం తారక్ హోస్టింగ్ వల్లే ఆ షో హిట్టయ్యింది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ డేట్స్ కుదరకపోవడం వల్లనో తన భర్య ప్రెగ్నెన్సీ వలనో తారక్ బిగ్ బాస్ 2 చేయట్లేదు. ఆ తరువాత ఆప్షన్ ఎవరు లేకపోయిన ఉన్నవాళ్లలో కొంచెం నాని అయితే బెటర్ అని స్టార్ మా యాజమాన్యం భావించినట్టు సమాచారం.
కృష్ణార్జునయుద్ధం ప్రమోషన్లో భాగంగా ఆయనను అడిగితే ఇలా చెప్పుకొచ్చాడు... "బిగ్ బాస్ సీజన్ వన్ తారక్ హోస్ట్ గా చేయడం - ఆ షో పెద్ద హిట్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తరువాత సీజన్ కి నన్ను ఆ ఛానల్ వారు నన్ను ఎప్రోచ్ అయ్యారనే విషయం పై ప్రస్తుతానికి నేను ఎలాంటి కామెంట్స్ చేయలేను. నన్ను హోస్ట్ గా తీసుకోవడం పై పూర్తి నిర్ణయం ఛానల్ వారిదే. ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి అప్ డేట్ లేదు. ఒక వేళ ఏదేనై ఉంటే అతి త్వరలోనే అధికారికంగా ఛానల్ వారు ప్రకటిస్తారు" అంటూ సమాధానం ఇచ్చారు.
Last Updated 10, Apr 2018, 5:20 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అరెస్ట్ వార్తలపై స్పందించిన యాంకర్ రవి
డిస్ట్రిబ్యూటర్ సందీప్ ఫిర్యాదు, ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలపై యాంకర్ రవి స్పందించాడు. తాను ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్నానని వివరణ ఇచ్చాడు.
Samayam Telugu | Updated:
Oct 28, 2018, 02:54PM IST
అరెస్ట్ వార్తలపై స్పందించిన యాంకర్ రవి
ఎస్ఆర్ నగర్ పోలీసులు తనను అరెస్ట్ చేశారనే వార్త విషయమై యాంకర్ రవి స్పందించాడు. దీపావళి ప్రత్యేక కార్యక్రమం కోసం తాను ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్నానని వివరణ ఇచ్చాడు. సందీప్పై దాడికి స్కెచ్ వేశాననే వార్తలు అవాస్తవమని రవి తెలిపాడు. తప్పుడు ఆరోపణలతో వ్యూహాత్మకంగా అతడు తనపై శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని తెలిపాడు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పాడు. | 0business
|
May 29,2017
రెండేండ్లలో బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ సేవలు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2019నాటికి దేశంలోని పౌరులందరికి శాటిలైట్ ఫోన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తోంది. దేశంలోని ఏ మూల నుంచైనా ఈ ఫోన్ల ఉపయోగించుకోవచ్చుని, ముఖ్యంగా ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు మొబైల్ సేవలకు కలుగుతున్న విఘాతం నుంచి ఈ ఫోన్ల ద్వారా అధిగమించ వచ్చునని తెలిపింది. ఈ సేవల కోసం ఇప్పటికే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్కు దరఖాస్తు చేసుకున్నామని, ఈ ప్రక్రియకు మరికొంత సమయం పడుతుందని బీఎస్ఎన్ఎల్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవా తెలిపారు. 18-24 నెలలో ఈ శాటిలైట్ సేవలను పౌరులందరికి దశల వారిగా అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ శాటిలైట్ ఫోన్లు దేశంలో ఎక్కడినుంచైనా వినియోగించే అవకాశం ఉందని, అంతేకాకుండా విమానాలు, నౌకలలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగిచవచ్చునని శ్రీవాస్తవా వివరించారు. దీనికితోడు భూమికి 35,700 కిలోమిటర్ల దూరంలో ఉన్న శాటిలైట్స్ నుంచి వీటికి సిగల్స్ లభిస్తాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో సంప్రదాయ మొబైల్ నెట్వర్క్ ద్వారా మాత్రం కేవలం 25-30 కిలోమిటర్ల దూరం వరకే సిగళ్లను అందుతాయని తెలిపారు. అయితే దేశంలో శాటిలైట్ ఫోన్ల కనెక్షన్లు తక్కువగా ఉన్నాయని, ఒకసారి వీటి సేవలు అందుబాటులోకి వస్తే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుం టాయని, ధరల సేవలు తగ్గుతాయని శ్రీవాస్తవా అభిప్రాయం వ్యక్తం చేశారు. శాటిలైట్ ధర రూ.40,000 ఉండవచ్చుని పేర్కొన్నారు. తొలి దశలో కాల్ చార్జీ రూ.30-35 వరకు వసూల్ చేసే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. బీఎస్ఎన్ఎల్ ,ఐఎన్ఎంఏఆర్ఎస్ఏటీ ద్వారా ఈ శాటిలైట్ సేవలను తీసుకురానుంది. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ సేవలను ఉపయోగిస్తున్నాయని, వీటిని త్వరలో దశల వారిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
New Delhi, First Published 14, May 2019, 10:55 AM IST
Highlights
పీకల్లోతు కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ సీఎఫ్వో, డిప్యూటీ సీఈవో అమిత్ అగర్వాత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.
పీకల్లోతు కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ సీఎఫ్వో, డిప్యూటీ సీఈవో అమిత్ అగర్వాత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎన్నో ఏళ్లుగా జెట్తో అనుబంధం ఉన్న డిప్యూటీ సీఈవో మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సోమవారం వ్యక్తిగత కారణాల కారణంగా పదవికి రాజీనామా చేశారు. జెట్ ఎయిర్వేస్ సుమారు రూ. 8,500 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.
దీంతో రుణదాతలు సంస్ధను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. కాగా సంస్ధలో రుణదాతగా ఉన్న హెడ్డీఎఫ్సీ బ్యాంక్... జెట్ ఎయిర్వేస్ కార్యాలయాన్ని మంగళవారం వేలం వేయనుంది.
ప్రారంభ ధరను రూ.245 కోట్లుగా తెలిపింది. తమకు జెట్ రూ.414.80 కోట్లు చెల్లించడంలో వైఫల్యం చెందినందున ఆ సంస్ధకు రుణాన్ని రాబట్టుకునేందుకు గాను జెట్ ఎయిర్వేస్ ఆస్తులను వేలం వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా అమిత్ అగర్వాల్ 2015 డిసెంబర్లో జెట్ ఎయిర్వేస్లో చేరారు. చార్టర్డ్ అకౌంటెంట్గా ఆయనకు 24 ఏళ్ల అనుభవం ఉంది. జెట్ కంటే ముందు సుజ్లాన్ ఎనర్జీ, ఎస్సార్ స్టీల్ వంటి పలు సంస్ధల్లో ఆయన సీఎఫ్వోగా పనిచేశారు
గత నెల రోజుల వ్యవధిలో జెట్లోని నలుగురు కీలక వ్యక్తులు సంస్ధను వీడారు. ఇప్పటికే ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పాతీ, మాజీ ఏవియేషన్ సెక్రటరీ, కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నసీం ఖైదీ రాజీనామా చేశారు. శాశ్వత డైరెక్టర్ గౌరాంగ్ శెట్టి జెట్ ఎయిర్వేస్కు గుడ్బై చెప్పారు.
Last Updated 14, May 2019, 11:09 AM IST | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రనౌట్.. నెక్ట్స్ డే ప్రత్యర్థి జట్టుపై కాల్పులు
పాకిస్థాన్లో ఎనిమిదేళ్ల క్రితం శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై మిలిటెంట్లు దాడి చేసిన విషయం
TNN | Updated:
Sep 7, 2017, 05:09PM IST
పాకిస్థాన్‌లో ఎనిమిదేళ్ల క్రితం శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై మిలిటెంట్లు దాడి చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. లాహోర్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ కోసం హోటల్ నుంచి స్టేడియానికి క్రికెటర్లు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందులో ఏడుగురు శ్రీలంక క్రికెటర్లతో పాటు సహాయ సిబ్బంది, పోలీసులకి గాయాలయ్యాయి. ఈ కాల్పులతో పాకిస్థాన్ క్రికెట్‌ పెద్ద కుదుపునకు గురైంది. ఈ ఘటనతో ఏ టెస్టు జట్టు ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లే సాహసం చేయకపోవడంతో ఆర్థికంగా, క్రికెట్ వృద్ధిప‌రంగా పాకిస్థాన్ బాగా నష్టపోయింది. కానీ.. ఇటీవల భద్రతాపరమైన పూర్తి భరోసా ఆ దేశ క్రికెట్ బోర్డు ఇస్తుండటంతో మళ్లీ.. క్రమంగా ఒక్కో జట్టు పట్టు సడలిస్తున్నాయి. త్వరలోనే శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాక్‌లో పర్యటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ క్రికెటర్, ఆ ఘటన సమయంలో లాహోర్ టెస్టు జట్టు సభ్యుడైన సల్మాన్ భట్ ఆ రోజుని గుర్తు చేసుకున్నాడు.
‘ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆటలో రెండో రోజు మేము 600పైచిలుకు స్కోరు చేశాం. మరికొద్దిసేపట్లో ఆ రోజు‌ ఆట ముగుస్తుందనగా.. నేను 48 పరుగుల వద్ద పేలవరీతిలో రనౌటయ్యాను. మూడో రోజు కూడా మేము ఆ ఇన్నింగ్స్‌ని కొనసాగించాలని నిర్ణయించుకుని హోటల్ నుంచి స్టేడియానికి బయల్దేరాం. కానీ.. కొద్ది నిమిషాల్లోనే మేము ప్రయాణిస్తున్న బస్సు దారి మార్చుకుని మళ్లీ హోటల్‌కి చేరుకుంది. కాల్పుల విషయం అప్పుడు మాకు తెలిసింది. వినగానే షాక్‌కి గురయ్యాం. ఈ కాల్పుల ఘటన పాకిస్థాన్ క్రికెట్‌‌‌ని దారుణంగా దెబ్బతీసింది. కానీ.. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్విరామ కృషితో మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది’ అని సల్మాన్ భట్ వివరించాడు. | 2sports
|
Hyderabad, First Published 12, Apr 2019, 4:25 PM IST
Highlights
సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే ప్రభాస్ ఇప్పుడు కొత్త ఎకౌంట్ లను క్రియేట్ చేసుకుంటున్నాడు.
బాహుబలి తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నెక్స్ట్ సినిమాతో ఎప్పుడు వస్తాడా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సాహో సినిమాతో రెబల్ స్టార్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే ప్రభాస్ ఇప్పుడు కొత్త ఎకౌంట్ లను క్రియేట్ చేసుకుంటున్నాడు.
ఇక ఫెస్ బుక్ ఎకౌంట్ లో అప్పుడపుడు అభిమానులకు తన వివరణను ఇచ్చే ప్రభాస్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా సందడి చేయడానికి సిద్దమవుతున్నాడు. ఫెస్ బుక్ ఎకౌంట్ కి కోటికి పైగా ఫాలోవర్స్ ఉండగా ఇంస్టాగ్రామ్ కి కూడా అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క పోస్ట్ కూడా చేయలేదు అప్పుడే ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 7 లక్షలోకి వచ్చేస్తోంది.
ఈ దెబ్బతో ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ మొదటి పోస్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Last Updated 12, Apr 2019, 4:25 PM IST | 0business
|
internet vaartha 156 Views
న్యూఢిల్లీ : కేంద్ర పన్నుల వసూళ్లు మొదటి త్రైమాసికంలో 28శాతంమేర పెరగడంతో ఆర్థికలోటుకొంతమేర తగ్గేందుకు దోహదం చేస్తుందని అంచనా. ఆర్థికలోటు స్థూల దేశీయోత్పత్తిలో 3.5శాతానికి కట్టడిచేయవచ్చన్న ధీమా అధికారుల్లో కనిపిస్తోంది. పన్ను వసూళ్లు మొదటి మూడునెలల్లో 28శాతంపెరిగి 3.24లక్షల కోట్లకు చేరాయి. ఎక్కువ వసూళ్లు జరిగితే వేతన సంఘం సిఫారసుల భారం కూడా తగ్గుతుందని అంచనా. ఆగస్టునుంచి కొత్త వేతనాలను అమలుచేయా ల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో 28శాతం వృద్ధిని సాధించింది. వాస్తవ లక్ష్యం 12శాతం మాత్రమే ఉంది. గత ఏడాది ఇదేకాలంలో 2.52లక్షల కోట్లుగా ఉంది. 42శాతం పెరిగి ప్రస్తుతం 3.24లక్షల కోట్లుగా ఉన్నాయి. అదనపు రాబడులు ఎక్కువగా పెట్రోలియంపై ఎక్సైజ్డ్యూటీ వల్లనే వస్తోంది. ఆర్థికశాఖ అంచనాల ప్రకారం పరోక్షపన్నుల వసూళ్లు 30.8శాతంపెరిగి 1.98 లక్షలకోట్లకు చేరాయి. గతఏడాది ఇదేకాలంలో 1.53 లక్షలకోట్లుగా ఉన్నాయి. పరో పనున్లపరంగా చూస్తే 1.24లక్షలకోట్లుగా ఉన్నాయి. వృద్ధి 24.8శాతం నమోదయింది. పరోక్షపన్నులపరంగా అదనపు రాబడులు మినహాయి స్తే 10.2శాతం వృద్ధిని సాధించింది. ఎక్సైజ్ సుంకం వసూళ్లు 50 శాతం పెరిగి 91,225 కోట్లవరకూ ఉన్నాయి. అదనపు చర్యలు తీసు కోని పక్షంలో పరోక్ష వసూళ్లు కేవలం 13.9శాతం మాత్రమే ఉంది. సేవాపన్నులపరంగాచూస్తే 53,757 కోట్లరూపాయలుగా ఉన్నాయి. 23.3శాతం పెరిగింది. కస్టమ్స్సుంకం 15.5శాతం పెరిగి 58,808 కోట్లకు చేరింది. నికరంగా అదనపు చర్యలతో వృద్ధి 11.2శాతానికి చేరింది. ముడిచమురుధరలు బ్యారెల్కు 60 నుంచి 70-80 డాలర్లు గా స్థిరపడితే కొంత సమస్య ఎదురవుతుందని, దీనివల్లప్రభుత్వం అదనపు ఎక్సైజ్ సుంకాలను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ద్రవ్యోల్బణ సమస్య ఎదురవుతుందని ఇండియారేటింగ్స్ అధి పతి దేవేంద్రపంత్ వెల్లడించారు. ముడిచమురుమార్కెట్ ప్రస్తుతం 45.17డాలర్లుగా ఉంది. అంతకుముందురోజు 45.15 డాలర్లుగా నిలిచింది. 2016-17ఆర్థిక సంవత్సరం నాలుగోవంతు పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం అధిగమించింది. వ్యక్తిగత ఆదాయపు పనున 48.8శాతం పెరిగింది. గతంలో కేవలం మూడు వాయిదాల్లో మాత్ర మే అడ్వాన్స్ పన్ను చెల్లించేందుకు వెసులుబాటు ఉండేది. సెప్టెం బరు, డిసెంబరు, మార్చినెలలుగా ఉన్న ఈ వెసులుబాటు ఈ సంవ త్సరం నుంచి నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంది. 15శాతం, 30శాతం, 30శాతం, 25శాతంగా ఉంది. జూన్, సెప్టెం బరు, డిసెంబరు, మార్చి నెలలో క్రమం తప్పకుండా చెల్లించాలి. భారీ స్థాయిలో ప్రస్తుత సంవత్సరం కంటే గత ఏడాది భారీస్థాయిలో పన్ను రిఫండ్లు ఇచ్చారు. రిఫండ్లు 29.8శాతంగా ఉన్నాయి. ఇక కార్పొరేట్ పన్ను 4.4శాతం ఎక్కువ రాబడులు తెచ్చింది. భారత్ కార్పొరేట్రంగంలో కొంత మందగమనం వల్ల రాబడులు తక్కువ వృద్ధిలో ఉన్నాయి. రిఫండులు మినహాయిస్తే కార్పొరేట్ పన్ను వసూళ్లు 13.5శాతంగా ఉన్నాయి. ఏప్రిల్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచి 0.8శాతంగా ఉంది. ఉత్పత్తిరంగం వృద్ధిలేదు. 2015లో ఇదేకాలానికిగాను 3.1శాతం దిగజారింది. జూన్ త్రైమాసికంలో భారత్ ఆర్థికవృద్ధి ఎనిమిదిశాతంగా ఉంటుందని క్రిసిల్ ఇండియా వెల్లడించింది. బడ్జెట్ లక్ష్యాల్లో పన్ను వసూళ్లు 14.6శాతంగా ఉన్నాయి. ప్రత్యక్షపన్ను వసూళ్లు లక్ష్యాలను చేరుకున్నట్లు అంచ నా. కేంద్ర ప్రభుత్వ మొదటి రెండునెలల ఆర్థికలోటును పరిశీలిస్తే బడ్జెట్ అంచనాల్లో 42.9శాతంగా ఉంది. అంతకుముందు సంవ త్సరంలోటు బడ్జెట్ అంచనాల్లో 37.5శాతంగా ఉంది. ఏప్రిల్నెల లో25.7శాతంగాఉంది. అదే 2015 ఏప్రిల్నెలలో 23శాతంగా ఉంది. మొత్తంమీద మొదటిత్రైమాసిక పన్నువసూళ్లతో వేతన సంఘం సిఫారసులభారం కొంతమేర అధిగమించవచ్చన్నదినిపుణుల అంచనా. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్: తెలుగు సోదరుల పసిడి పంట
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్స్లో తెలుగు కుర్రాళ్లు పసిడి పంట పండించారు.
TNN | Updated:
Sep 8, 2017, 11:29AM IST
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో తెలుగు కుర్రాళ్లు పసిడి పంట పండించారు. సోదరులైన రాగాల వెంకట రాహుల్, రాగాల వరుణ్ స్వర్ణ పతకాలతో మెరిశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ టోర్నీలో ఈ ఇద్దరూ అసమాన ప్రతిభ కనబరిచారు. తెలంగాణ క్రీడా పాఠశాల విద్యార్థులైన ఈ సోదరులు నిరుపేదలు కావడం గమనార్హం. అన్న రాహుల్‌ 85 కిలోల కేటగిరీలో సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో స్వర్ణాలు సాధిస్తే.. తమ్ముడు వరుణ్‌ యూత్‌ విభాగంలో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. అంతేకాకుండా పలు రికార్డులు నెలకొల్పాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌కు రాహుల్ అర్హత సాధించాడు.
మొత్తం 351 కిలోల బరువులెత్తిన రాహుల్‌ సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచాడు. అతడు స్నాచ్‌లో 156 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 195 కిలోలు ఎత్తాడు. ఈ క్రమంలో ఐదు జాతీయ రికార్డులు బద్దలు కొట్టిన రాహుల్‌.. 2018లో ఇదే వేదికపై జరిగే కామన్వెల్త్‌ క్రీడలకు అర్హత సాధించాడు. యూత్‌ బాలుర 77 కిలోల విభాగంలో రాగాల వరుణ్‌ 269 కేజీ (స్నాచ్‌ 124, క్లీన్‌ అండ్‌ జెర్క్‌ 145) ఎత్తి బంగారు పతకం నెగ్గాడు. కాగా, ఇతర విభాగాల్లోనూ భారత లిఫ్టర్లు పతకాల పంట పండించారు.
2014 కామన్వెల్త్‌ స్వర్ణ విజేత శివలింగం సతీష్‌ కుమార్‌ 77 కిలోల కేటగిరీలో 320 కిలోల బరువులెత్తి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. దీంతో ఇతను కూడా వచ్చే ఏడాది కామన్వెల్త్‌ క్రీడలకు అర్హత సాధించాడు. అదే విధంగా ఇద్దరు జూనియర్‌ మహిళా వెయిట్‌లిఫ్టర్లు కూడా భారత్‌కు స్వర్ణాలు అందించారు. నికిత కాలె (యూత్ బాలికల విభాగం-69కేజీ), నిరుపమాదేవి (జూనియర్ మహిళలు-69కేజీ) బంగారు పతకాలు సాధించారు. మరో కుర్రాడు అజయ్ సింగ్ జూనియర్‌ పురుషులు 69కేజీ విభాగంలో స్వర్ణం గెలిచాడు. యూత్ బాయ్స్‌లో అభిషేక్ పూనియా కాంస్యం నెగ్గాడు. | 2sports
|
a new health policy from aditya birla health insurance
ఆదిత్యా బిర్లా నుంచి కొత్త ఆరోగ్య బీమా పాలసీ
ఆదిత్యా బిర్లా కాపిటల్కు చెందిన ఆదిత్యా బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆక్టివ్ సెక్యూర్ పేరుతో రిటైల్ పిక్సుడ్ బెనిఫిట్ పాలసీని ఆవిష్కరించింది.
TNN | Updated:
Apr 1, 2018, 12:10PM IST
ఆదిత్యా బిర్లా కాపిటల్కు చెందిన ఆదిత్యా బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆక్టివ్ సెక్యూర్ పేరుతో రిటైల్ పిక్సుడ్ బెనిఫిట్ పాలసీని ఆవిష్కరించింది. ఇది సమగ్ర ఆరోగ్య పాలసీ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. దీని కింద క్రిటికల్ ఇల్నెస్, కాన్సర్ సెక్యూర్, పర్సనల్ యాక్సిడెంటల్, హాస్పిటల్ క్యాష్ అనే నాలుగు అప్షన్స్లో అన్నిటినీ లేదా కొన్నిటినీ ఎంపిక చేసుకోవచ్చన్నారు. తాము వచ్చే మూడే ళ్లలో దేశంలోని 100 ప్రధాన నగరాలకు తమ సేవలు విస్తరించాలని నిర్దేశించుకున్నామన్నారు. | 1entertainment
|
ntr and ktr on same platform?
ఒకే వేదికపైకి కేటీఆర్, ఎన్టీఆర్?
‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్, కేటీఆర్ను ఆహ్వానించాలని నిర్మాత డీవీవీ దానయ్య అనుకుంటున్నారట.
Samayam Telugu | Updated:
Dec 14, 2018, 01:48PM IST
రామ్చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదల అవుతున్నందున ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారట. దీంతో నిర్మాత డీవీవీ దానయ్య ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
ఈ కార్యక్రమానికి ‘RRR’ దర్శకుడు రాజమౌళి, రామ్చరణ్ కో స్టార్ ఎన్టీఆర్ను యూనిట్ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మరో సర్ప్రైజ్ ఏంటంటే.. ప్రీ రిలీజ్ ఫంక్షన్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా ఆహ్వానించేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారట. | 0business
|
Vaani Pushpa 122 Views prophet , upi
UPI
మంగుళూరు, యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపిఐ)లావాదేవీలురానురాను పుంజుకుంటున్నాయి. ఇప్పటివరకూ యుపిఐ వెయ్యికోట్లకుపైబడిన లావాదేవీలునిర్వహించింది.యుపిఐ ప్లాట్ఫామ్కింద సుమారు 17.29 లక్షలకోట్లమేర మూడేళ్లపాటు లావాదేవీలునిర్వహించింది. అంటే ప్రారంభంనుంచి కూడా ఈ డిజిటల్ లావాదేవీలకు మంచి ప్రోత్సాహం లభించింది. మూడేళ్లలోనే యుపిఐ ప్లాట్ఫామ్ సరికొత్త మైలురాయిని నమోదుచేసింది. 2016లో ప్రారంభించిన తర్వాత భారత జాతీయ చెల్లింపులసంస్థ (ఎన్పిసిఐ) 2019 ఆగస్టు వరకూ 1,029.44 కోట్ల లావాదేవీఉల నిర్వహించింది. కేవలం మొబైల్ ద్వారా మాత్రమే చెల్లింపులజరిపే ఈ వ్యవస్థకు మొత్తం 37 నెలల్లో 17.29 లక్షలకోట్లు లావాదేవీలునిర్వహించినట్లు వెల్లడించింది. మొత్తం లావాదేవీలసంఖ్య 819.03 కోట్లు కాగా ఈ లావాదేవీలద్వారా 14.11 లక్షలకోట్లు లావాదేవీలుజరిగాయి. సెప్టెంబరు 2018 నుంచి ఆగస్టు 2019 మధ్యకాలంలోనే ఈ లావాదేవీలు 81.60శాతం వాటాతో ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాతరోజుల్లో కూడా యుపిఐ డిజిటల్ చెల్లింపులకు పెద్దపీటవేసింది. 2016 డిసెంబరులోనే 19 లక్షల లావాదేవీలుజరిగాయి. నెలవారీ లావాదేవీల మూడులక్షలలోపు ఉన్నవే ఎక్కువ జరిగాయి. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్ను ఎన్పిసిఐ ప్రారంభించిన తర్వాత మరింతగా చెల్లింపుల్లో వృద్ధి కనిపించింది. భీమ్ యాప్ద్వారా మొత్తం లావాదేవీలు యుపిఐ ప్లాట్ఫామ్పై 41.36శాతంగా ఉన్నాయి. జనవరి 2017నుంచి చూస్తే ఆగస్టు 2019 నాటికి 1.82శాతంపెరిగాయి. భీమ్ యాప్ద్వారా చెల్లింపులు జనవరిలో కొంత తగ్గాయి. ప్రారంభంలోయుపిఐ పి2పి చెల్లింపుల ప్లాట్ఫామ్గా పనిచేసింది. టెక్నాలజీ కంపెనీలు ఈ సెగ్మెంట్లోనికి రావడంతో వ్యక్తులనుంచి వ్యాపారులవరకూ పి2ఎం విభాగానికి కూడా యుపిఐ విస్తరించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
Mericom
వచ్చే నెలలో రింగ్లోకి మేరీకోం
న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్, భారత మేటి బాక్సర్ మేరీ కోం మళ్లీ బాక్సింగ్ రింగ్లోకి దిగనుంది. దాదాపు ఏడాదిగా బాక్సింగ్కు దూరంగా ఉన్న ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోం… వచ్చే నెలలో మంగోలియాలో జరిగే ఇన్విటేషనల్ టోర్నమెంట్లో పాల్గొననుంది. జూన్ 20 నుంచి 26వరకు జరిగే ఈటోర్నీలో 51కేజీల విభాగంలో పోటీ పడుతున్నట్లు మేరీ తెలిపింది. ఈటోర్నీలో పాల్గొనేందుకు 48కేజీల విభాగం నుంచి 51కేజీల విభాగానికి మారానంది.దాదాపు ఏడాది కాలంగా బాక్సింగ్కు దూరంగా ఉండటంతో నాకు కాస్త మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమన్నారు. వచ్చే నవంబర్లో జరిగే ఆసియా ఛాంపియన్ షిప్లో మళ్లీ 48కేజీల విభాగంలోనే పాల్గొంటాను. ఇప్పుడు మాత్రం మంగోలియాలో జరిగే టోర్నీలో పాల్గొనడంపై దృష్టి పెట్టారని మేరీ తెలిపింది. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో 51 కేజీల విభాగాన్ని ప్రవేశపెడుతుండటంతో ఆవిభాగంలో పోటీపడాలని నిర్ణయించుకుంది. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కివీస్తో తొలి వన్డే.. భారత్కు ఎంతో ప్రత్యేకం
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు తొలి వన్డే జరగనుంది.
TNN | Updated:
Oct 22, 2017, 08:10AM IST
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు తొలి వన్డే జరగనుంది. తిరుగులేని ఫామ్‌లో ఉన్న భారత్ ఈ సిరీస్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాపై 4-1తో సిరీస్ గెలిచి మంచి ఊపుమీదున్న భారత్‌కు అడ్డుకట్ట వేయడం కివీస్‌కు అంత సులభం కాదు. ఓపెనర్ రోహిత్ శర్మ, రహానే, హార్దిక్ పాండ్య.. ఆసీస్‌పై మంచి ఆటతీరును కనబరిచారు. ఇప్పుడు వారు కివీస్‌పై కూడా అదే జోరును కొనసాగిస్తే భారత పటిష్టంగా ఉన్నట్లే. మరోవైపు బౌలర్లు కూడా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే కివీస్‌ను తక్కువ అంచనా వేయడం పొరపాటే. చాలా సార్లు క్లిష్ట పరిస్థితుల్లో పుంజుకుని విజయాలు సాధించిన ఘనత కివీస్‌కు ఉంది. మరి ఈ మూడు వన్డేల సిరీస్‌ను ఎవరు విజయంతో ఆరంభిస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే.. నేడు జరగనున్న తొలి వన్డే భారత్‌కు ఎంతో ప్రత్యేకం. భారత్ ఒక జట్టుగానే కాకుండా.. కొందరు ఆటగాళ్లు కూడా అరుదైన ఘనతలు సాధించే అవకాశం ఈ మ్యాచ్‌లో ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇది 200వ వన్డే. 2008లో అంతర్జాతీయ అడుగుపెట్టిన కోహ్లి.. ఇప్పటి వరకు 199 వన్డేలు ఆడాడు. నేటి మ్యాచ్‌తో 200 వన్డేలు పూర్తిచేస్తాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 12 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. | 2sports
|
Hyderabad, First Published 25, Sep 2018, 3:15 PM IST
Highlights
ఆయనతో పాటు వచ్చిన హీరోలందరూ స్పీడ్ గా సినిమాలు చేస్తుంటే వెంకీ మాత్రం ఎలాంటి తొందర లేదన్నట్టుగా మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే వెంకీ ఈ మధ్య వరుసగా సినిమాలను ఒకే చేయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రెండు మల్టి స్టారర్ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.
వెంకీ మామ బాగా బిజి.. అఖిల్ డైరెక్టర్ ను కూడా పట్టేశాడుఒకప్పుడు వరుసగా సినిమాలతో బిజి బిజీగా ఉండే విక్టరీ వెంకటేష్ కొన్నేళ్లుగా చాలా స్లో అయ్యారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో పాటు వచ్చిన హీరోలందరూ స్పీడ్ గా సినిమాలు చేస్తుంటే వెంకీ మాత్రం ఎలాంటి తొందర లేదన్నట్టుగా మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే వెంకీ ఈ మధ్య వరుసగా సినిమాలను ఒకే చేయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రెండు మల్టి స్టారర్ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో F2 అనే ప్రాజెక్టును ఆల్రెడీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మరో హీరోగా వరుణ్ తేజ్ నటిస్తుంన్నాడు. ఇక మేనల్లుడు నాగచైతన్య తో వెంకీ మామ అనే కథను కూడా చేయనున్నాడు. కేఎస్.రవీంద్ర (బాబీ) ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ తరువాత త్రినాథ రావు నక్కిన - త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో వెంకటేష్ కలవనున్నారు.
ఇక ప్రస్తుతం అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరితో కూడా వెంకటేష్ ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం. రీసెంట్ కొన్ని నిమిషాల కథను విన్న వెంకటేష్ కథను పూర్తవ్వగానే సినిమా స్టార్ట్ చెయ్యాలని ఓ మాట అనేసుకున్నారట. దానితో పాటు బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ కూడా ఈ సీనియర్ హీరోకి నచ్చినట్లు టాక్. మొత్తంగా వెంకటేష్ చాలా రోజుల తరువాత బిజి అయ్యారని చెప్పవచ్చు.
Last Updated 25, Sep 2018, 3:16 PM IST | 0business
|
Sep 27,2017
ఫార్చ్యూన్ జాబితాలో కొచ్చర్, శిఖా
న్యూయార్క్: అమెరికా తప్పించి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో భారత్కు చెందిన ఇద్దరికి స్థానం లభించింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంక్ సీఈవో, ఎండీ శిఖా శర్మాలు జాబితాలో వరుసగా అయిదు, 21 స్థానాల్లో నిలిచినట్టుగా పార్చ్యూన్ తన తాజా సంచికలో వెల్లడించింది. అమెరికాలో కాకుండా అతిశక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్త జాబితాలో బాన్కో స్టాండర్డ్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ అనా బోటిన్ ప్రథమ స్థానంలో నిలిచారు. గ్లాక్సో స్మిత్క్లైన్ సంస్థ అధినేత్రి ఎమ్మా వాల్మ్స్లే రెండో స్థానంలోనూ.. ఎంజరు సీఈవో ఇసబెల్లా కొచేర్ మూడో స్థానంలోనూ నిలిచినట్టు పత్రిక తెలిపింది. అమెరికా కాకుండా వివిధ దేశాల్లో శక్తిమంతంగా వ్యాపారాల అభివృద్ధికి కృషి చేస్తున్న 50 మందితో ఫార్చ్యూన్ ఈ జాబితాను తయారు చేసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Nov 03,2019
ఆంధ్రాబ్యాంక్లో విజిలెన్స్ వారోత్సవాలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఆంధ్రాబ్యాంక్లో విజిలెన్స్ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబరు 28న ప్రారంభమైన ఈ వేడుకలు సోమవారంతో ముగియనున్నాయి. వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బ్యాంక్ ఎండీ, సీఈవో జె.ఫకిరీస్వామి, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుల్భూషణ్ జైన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరవింద్తో పాటు బ్యాంక్కు చెందిన జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు ఉద్యోగులు సిబ్బందితో సమగ్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ సిబ్బంది వృత్తి పరంగాను, జీవితంలోనూ నిజాయితీని అలవర్చుకొని అమలు చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా బ్యాంక్ వాకథాన్, సైక్లోథాన్ కార్యక్రమాలను నిర్వహించింది. దీనికి తోడు బ్యాంకు భవనాలలో వైద్య శిబిరాలను నిర్వహించింది. విజిలెన్స్ జాగురుకతపై అవగాహన కల్పించేందుకుగాను బ్యాంక్ పల్లెల్లో గ్రామ సభలు, పట్టణాలలో అవగాహన శిబిరాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం సత్యసాయి నిగమాగమంలో జరిగిన కార్యక్రమంలో సీబీఐ జేడీ ఎ.వై.వి. కృష్ణతో పాటు బ్యాంక్ ండీ, సీఈవో జె.ఫకిరీస్వామి, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుల్భూషణ్ జైన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరవింద్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలు స్కూలు, కళాశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సీబీఐ జేడీ, బ్యాంక్ ఉన్నతాధికారులు బహుమతులను ప్రదానం చేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 113 Views
హైదరాబాద్ : చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం జియోని కొత్తగా ఎఫ్103 ప్రొభారత్ మార్కెట్కు విడుదల చేసింది. మెటల్ బాడీతో స్లీక్గా ఉనన ఈ కొత్త స్మార్ట్ఫోన్లో అత్యాధునిక ఫీచర్లుఅన్నీ ఉన్నట్లు జియోని వివరించింది. ఫ్లిప్కార్ట్పై ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అమిగో 3.2 ఆండ్రాయిడ్ 6.0 వ్యవస్థపై పని చేస్తుంది.12.7సెంటీమీటర్లు అంటే ఐదుఅంగుళాల డిస్ప్లేతో ఉంది. 3జిబి రామ్, 16జిబి నిల్వసామర్ధ్యం, 128 జిబివరకూ పొడిగించుకునే సౌకర్యం ఉంది. 2400 ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తోంది. 13ఎంపి/5ఎంపి కెమేరాలు స్పష్టమైన చిత్రాలు వీడియోలు అందిస్తాయి. డ్యూయల్సిమ్ స్మార్ట్ఫోన్ అన్నివర్గాలను ఆకర్షిస్తుందని జియోని ప్రొసిరీస్ విడుదలసందర్భం గా కంపెనీ ఇండియా డైరెక్టర్ అరవింద్ ఆర్వోహ్రా వివరించారు. భారత్మార్కెట్లో ఈఫోన్లు 11,999లకే లభిస్తున్నాయి. | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
internet vaartha 129 Views
ముంబై : ఐడిబిఐ బ్యాంకు మొత్తం వ్యాపారం 4.46 లక్షలకోట్ల నుంచి 5.77శాతం పెరిగి 4,71,394 కోట్లకు చేరింది. డిపాజిట్ల పరంగా చూస్తే 5.26శాతం పెరిగి 2,54,031కోట్లకు చేరాయి. అడ్వాన్సుల పరం గా 2,04,339 కోట నుంచి 6.37శాతంపెరిగి 2,17,363 కోట్లకు చేరాయి. మొత్తం స్థిరాస్తులు 6.85శాతం పెరిగాయి. 4.42,099 కోట్ల నుంచి 3,65,532 కోట్లకు చేరిన ట్లు బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు నికరవడ్డీ ఆదాయం 14.20 శాతంపెరిగి 1706 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో 1494 కోట్లుగా ఉంది. నికరలాభం ఈ త్రైమాసికంలో 78.36శాతంపెరిగి 241 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో 135 కోట్లు ఆర్జించినట్లు బ్యాంకుప్రకటించింది. బ్యాంకు నిర్వహణ లాభం కూడా 1138 కోట్లనుంచి 1466 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 6765కోట్ల నుంచి 6753 కోట్లకు తగ్గాయి. కేటాయింపులపరంగా 1003కోట్ల నుంచి 1225కోట్లకు పెరిగినా లాభాలను పెంచుకోగలిగింది. గతఏడాది పూర్తి సంవత్స రానికిగాను బ్యాంకు 3665కోట్లు నికరలాభం ఆర్జించిందని ఐడిబిఐ బ్యాంకు ప్రకటించింది. బ్యాంకుస్థూల నిరర్ధక ఆస్తులు 11.92 శాతం వరకూచేరి 27,275కోట్లకు చేరాయి. గడచిన మార్చి త్రైమాసికంలో 10.98శాతంవరకూ పెరిగిన నిరర్ధక ఆస్తులు 24,875కోట్ల నుంచి 27వేల కోట్లకు పెరిగాయి. నికర నిరర్ధక ఆస్తులపరంగాచూస్తే 6.78శాతంనుంచి 7.47శాతానికి పెరిగా యి. అంటే 14,643కోట్లనుంచి రూ.16,248 కోట్లకు పెరిగాయి. ఐడిబిఐబ్యాంకు గుజరాత్ గిఫ్ట్సిటీలోఅంతర్జాతీయ ఆర్థికసేవలు ప్రారంభించేం దుకు అనుమతినిసాధించింది. ఐడిబిఐఎక్స్ప్రెస్ వ్యవస్థద్వారా కస్టమర్లకు వేగవం తంగా నిధులబదిలీ, చెల్లింపులసేవలు పొందేవీలుంటుందనిబ్యాంకు వెల్లడించింది. | 1entertainment
|
వచ్చే సీజన్ లో 10 టీమ్ లు
చర్చించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
తుది నిర్ణయం బీసీసీఐదే
IPL
లండన్: 12 సీజన్ లను పూర్తి చేసుకున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్), 2020లో 13వ సీజన్ కు రానున్న నేపథ్యంలో, ఈ టోర్నీని మరింత ఆకర్షణీయంగా చేసేందుకు లండన్ లో సమావేశమైన ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు, మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నీలో ప్రస్తుతం 8 టీమ్ లుండగా, వచ్చే సీజన్ నాటికి మరో రెండు టీమ్ లను అదనంగా చేర్చి 10 టీమ్ లతో మ్యాచ్ లు నిర్ణయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.
కాగా, 2011లో కేరళ టస్కర్స్, పూణె వారియర్స్ పేరిట రెండు ఫ్రాంచైజీలు టోర్నీలోకి అడుగుపెట్టినా, ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఈ రెండు టీమ్ లూ రెండు సీజన్లు మాత్రమే కొనసాగాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పొట్టి ఫార్మాట్ కు ఉన్న ఆదరణ దృష్ఠ్యా, తిరిగి జట్ల సంఖ్యను పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో ఐపీఎల్ మేనేజ్ మెంట్ తో పోలిస్తే, బీసీసీఐదే తుది నిర్ణయం. ఎందుకంటే, జట్ల సంఖ్య పెరిగితే, మరిన్ని మ్యాచ్ లు నిర్వహించాలి కాబట్టి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/andhra-pradesh/ | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆసీస్తో తొలి మూడు వన్డేలకు జట్టు ఇదే!
ఆసీస్తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా మూడు వన్డేల కోసం సెలెక్టర్లు జట్టును ప్రకటించారు.
TNN | Updated:
Sep 10, 2017, 02:07PM IST
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరగనున్న తొలి మూడు వన్డేల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. టాప్ స్పిన్నర్లు అశ్విన్‌, జాడేజాలకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం అశ్విన్ ఇంగ్లండ్ కౌంటీల్లో వోర్క్‌స్టెర్‌షైర్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో షమీ, ఉమేశ్‌లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ఆసీస్‌తో వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేశారు. సెప్టెంబర్ 17 నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
జట్టు ఎంపిక సందర్భంగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘శ్రీలంక పర్యటనలో భారత ప్రదర్శన అద్భుతంగా ఉంది. అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్ అద్భుతంగా రాణించారు. భారత రిజర్వ్ బెంచ్ బలంగా ఉందన్నారు.
కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీలతో భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. హార్ధిక్ పాండ్య ఆల్‌రౌండర్‌గా తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. సెలెక్టర్లు కాన్ఫరెన్స్ కాల్ ద్వారా జట్టును ఎంపిక చేశారు. ప్రస్తుతం ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీలు లక్నోలో దులీప్ ట్రోఫీ మ్యాచ్ చూస్తుండగా.. శరణ్‌దీప్ సింగ్ ఢిల్లీలో ఉన్నారు.
జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, అజింక్య రహానే, ఎంఎస్ ధోనీ (కీపర్), హార్ధిక్ పాండ్య, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ. | 2sports
|
హైకోర్టులో ఛార్మి పిటిషన్ పై వాడివేడి వాదనలు, మ.2.30కు తీర్పు
Highlights
డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవుతానని.. సడెన్ గా యు టర్న్ తీసుకున్న ఛార్మి
విచారణలో అనుమతి లేకుండా శాంపిల్స్ సేకరిస్తున్నారన్న ఛార్మి
కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే నోటీసులిచ్చామన్న సిట్
ఛార్మిని మహిళా అధికారులే విచారిస్తారన్న సిట్
గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మి హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దర్యాప్తు తీరు సరిగా లేదని పిటిషన్ వేసింది ఛార్మి. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తొలుత విచారణకు సిట్ కార్యాలయానికే వస్తానని తెలిపిన ఛార్మి.. సడెన్ గా యు టర్న్ తీసుకుని హైకోర్టును ఆశ్రయించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఇక ఛార్మి పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఇరు పక్షాల వాదోపవాదాలు పరిశీలించింది. కేవలం సిట్ విచారణను తప్పుదోవ పట్టించేందుకే చార్మి పిటిషన్ వేసిందని సిట్ వాదించింది. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయట్లేదని చెప్పింది. కేవలం పబ్లిసిటీ స్టెంట్ తప్ప పిటిషన్ వేయటానికి మరో కారణం లేదని సిట్ వాదించింది. పూరీ జగన్ ఇష్టపూర్వకంగానే శాంపిల్స్ ఇచ్చారని సిట్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. నోటీసులు ఇచ్చినప్పుడే కకావాలంటే మీ ఇంటికే వస్తామని చెప్పినట్లు సిట్ స్పష్టం చేసింది.
ఇక ఛార్మి లాయర్ కూడా వాదనలు బలంగానే వినిపించారు. ఛార్మి నిందితురాలు కాదని, కనీసం సాక్షి కూడా కాదని.. అలాంటప్పుడు శాంపిల్స్ తనకు ఇష్టం లేకుండా ఎలా ఇస్తారని చార్మి లాయర్ వాదించారు. ఆర్టికల్ 20 ప్రకాలం చార్మికి స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారించాలని లాయర్ కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ మధ్యాహ్నం 2.30గంటలకు తీర్పు వెల్లడించనుంది. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL 2019 Timings, CSK vs RCB: ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ విడుదల..!
టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా.. గ్రూప్ దశలో ప్రతి జట్టూ 14 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో ఏడు మ్యాచ్లు సొంతగడ్డపై.. మరో ఏడు ప్రత్యర్థి వేదికపై తలపడటం ఆనవాయితీగా వస్తోంది.
Samayam Telugu | Updated:
Mar 20, 2019, 12:06PM IST
IPL 2019 Timings, CSK vs RCB: ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ విడుదల..!
హైలైట్స్
మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్లు మొదలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఇటీవల రెండు వారాల మ్యాచ్ల షెడ్యూల్ని ప్రకటించిన బీసీసీఐ
తాజాగా గ్రూప్ దశ వరకూ షెడ్యూల్ విడుదల
తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ
ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్ల షెడ్యూల్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు విడుదల చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇటీవల రెండు వారాల షెడ్యూల్ని విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా గ్రూప్ దశ వరకూ షెడ్యూల్ని ప్రకటించింది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొననుంది. గత సీజన్ తరహాలో గ్రూప్ దశ వరకూ మ్యాచ్లు సాయంత్రం 4 గంటలకి, రాత్రి 8 గంటలకి ప్రారంభంకానున్నాయి.
ఐపీఎల్ 2019 సీజన్ పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి..!
ఈ నెల 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. మే 5న గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్ జరగనుంది. అయితే.. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ల తేదీలు, వేదికల్ని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. దేశంలో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకూ ఎన్నికలు జరగనున్నాయి.
టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా.. గ్రూప్ దశలో ప్రతి జట్టూ 14 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో ఏడు మ్యాచ్లు సొంతగడ్డపై.. మరో ఏడు ప్రత్యర్థి వేదికపై తలపడటం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఎన్నికల నేపథ్యంలో.. కొన్ని జట్లు సొంతగడ్డపై ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం లేదని వార్తలు వచ్చినా.. బీసీసీఐ.. స్టేడియాల మార్పుతో ఆ సమస్య తెరపైకి రాకుండా చూసుకుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
మారుతీలో తాత్కాలిక ఉద్యోగాల తగ్గింపు
Maruti Suzuki
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు తగ్గిపోవడంతో తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొంది. కాగా ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొంది. దేశంలో సగానికి పైగా ఆటోమొబైల్ పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు పడిపోవడంతో కొలువుల కోత తప్పలేదు. ఈ కోత విషయాన్ని మారుతీ ఒక ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించింది. జూన్ 30 నాటికి కంపెనీ 18,845 మందిని నియమించుకోగా.. వీరిలో 6 శాతం 1,181 మందిని తగ్గించుకొంది. ఏప్రిల్ నుంచి ఉద్యోగాల కోతను వేగవంతం చేసినట్లు పేర్కొంది. దీంతోపాటు కొత్త ఉద్యోగులను తీసుకోవడాన్ని కూడా నిలిపివేసింది. తాము పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించుకోలేదని మారుతీ వెల్లడించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/ | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రైతును దెబ్బతీస్తున్న'మార్కెట్ పన్ను'
జీఎస్టీ అమల్లో ఉన్నప్పటికీ.. రాష్ట్రాలు మార్కెట్ పన్ను విధించడాన్ని కొనసాగించవచ్చని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అడిగిన ఒక ప్రశ్నకు న్యాయశాఖ ఈ విధంగా సమాధానమిచ్చింది.
TNN | Updated:
May 19, 2018, 02:10PM IST
రైతును దెబ్బతీస్తున్న'మార్కెట్ పన్ను'
జీఎస్టీ అమల్లో ఉన్నప్పటికీ.. రాష్ట్రాలు మార్కెట్ పన్ను విధించడాన్ని కొనసాగించవచ్చని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అడిగిన ఒక ప్రశ్నకు న్యాయశాఖ ఈ విధంగా సమాధానమిచ్చింది. జీఎస్టీ అనేది దేశవ్యాప్తంగా అమలవుతున్న ఏకపన్ను విధానం. ఇందులో 17 రకాల పరోక్షపన్నులు; కేంద్ర, రాష్ట్రాలు విధించే 23 రకాల సెస్సులు కలిపి ఉన్నాయి. కానీ. ఇందులో మార్కెట్ (మండీ) పన్నును కలపలేదని న్యాయశాఖ తెలిపింది.
రాష్ట్రాలు విధించే ఇతర సెస్సులు వచ్చినట్లుగా మార్కెట్ పన్ను జీఎస్టీలో విలీనం కానందున, రాష్ట్రాలు మార్కెట్ పన్ను విధించే అవకాశముందని న్యాయ మంత్రిత్వ శాఖ అభిప్రాయమని.. ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను విధానం అమలవుతుందని ఆయన అన్నారు. అయితే.. రాష్ట్రాలు ఎస్జీఎస్టీకి సవరణ తెచ్చి, మార్కెట్ పన్నును రద్దు చేయవచ్చని ఆ అధికారి వివరించారు.
మార్కెట్ పన్ను అనేది.. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై విధించే ఫీజు. వ్యవసాయ టోకు మార్కెట్ నిర్వహణ వ్యయాన్ని తట్టుకునేందుకు రైతులపై ఈ పన్ను విధిస్తున్నారు. అలాంటి మార్కెట్లో రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర లభిస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. ‘మామాలుగా అయితే, ఒక రాష్ట్రంలో ఒకలా మరో రాష్ట్రంలో మరోలా పన్ను విధానం లేకపోవడమే మంచిది. దేశవ్యాప్తంగా అన్ని పన్నులు ఒకే విధంగా ఉండాలి. కానీ, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్నుల విధానం అమల్లో ఉండటంతో.. ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టమే అవుతుందని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ఎం.ఎస్. మణి అన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆ నోట్లతో వినియోగ బిల్లులు చెల్లించొచ్చు
రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వినియోగ బిల్లులు, ట్యాక్సులు, జరిమానాలు, ఫీజులు చెల్లించొచ్చని గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
TNN | Updated:
Nov 10, 2016, 03:55PM IST
రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వినియోగ బిల్లులు, ట్యాక్సులు, జరిమానాలు, ఫీజులు చెల్లించొచ్చని గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నవంబర్ 11వ తేదీ అర్థరాత్రి వరకే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోడానికి ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు ఈ నిర్ణయం కొంచెం ఉపసమనం ఇస్తుందనే చెప్పాలి.
రద్దు చేసిన నోట్లను ఇప్పటికే పెట్రోల్ బంకులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో అనుమతిస్తున్నారు. అలాగే ఈ నోట్లతో ఎల్పీజీ సిలిండర్లు, వైద్యలు ప్రిస్క్రిప్షన్‌పై మందులు కొనుగోలుచేయడానికి ప్రభుత్వం అనుమతించింది. తాజాగా ఈ జాబితాలో యుటిలిటీ బిల్లులతోపాటు మరికొన్ని సర్వీసులను జత చేసింది. దీంతో శుక్రవారం అర్థరాత్రి వరకు ప్రజలు కరెంట్, మున్సిపాలిటీ వాటర్ బిల్లులు, ట్రాఫిక్ జరిమానాలు తదితర వినియోగ బిల్లులను రూ. 500, రూ. 1000 ద్వారా చెల్లించొచ్చు. | 1entertainment
|
Jan 03,2018
ఈ ఏడాది 6.5% వృద్ధి : హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5 శాతం వృద్ధితోనే సరిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. కాగా 2018-19లో ఇది 7.0 శాతానికి, 2019-20లో 7.6 శాతంగా చోటు చేసుకోవచ్చని విశ్లేషించింది. నోట్ల రద్దు, జీఎస్టీ సంక్లిష్టతలు తొలిగి పోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. క్రమంగా భారత వృద్ధి రేటు పుంజుకోవచ్చని తన రిసెర్చ్ రిపోర్టులో పేర్కొంది. తిరిగి దేశంలో ద్రవ్యోల్బణం పుంజుకోవచ్చని హెచ్చరించింది. ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండొచ్చని తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 123 Views
బ్రిటన్ రిఫరెండమే కీలకం
ముంబై : మార్కెట్లు రెండో రోజు కూడా స్వల్ప నష్టాల్లో ముగిసాయి. బ్రిటన్ రిఫరెండమ్ పైనే ఎక్కువ దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు కొనుగోళ్లలో అప్రమత్తంగా వ్యవహరించడమే ఇందుకు కీలకం. గురువారం బ్రిటన్ యూరోపియన్ కూటమిలో కొనసాగాలా వద్దా అన్న అంశంపై రిఫరెండమ్ నిర్వహిస్తోంది. బిఎస్ఇ సెన్సెక్స్ 47 పాయింట్లు క్షీణించి 26,766 పాయిట్లవద్ద కొనసాగుతుంది. నిప్టీ 50సూచి 16 పాయింట్లు క్షీణించి 8204వద్ద ముగి సింది. బిఎస్ఇలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా 0.1 నుంచి 0.6శాతం చొప్పున క్షీణించాయి. మొత్తం 1597 కంపెనీలు నష్టాల్లో సాగితే 988 కంపెనీలు స్వల్ప లాభాలు చవిచూసాయి. లాభాల్లో కొన సాగిన మూడురోజులకు ముందు నుంచీ స్టాక్సూచీలు నష్టాల్లోనే ముగిసాయి. ఇండియా విక్స్ అనిశ్చితసూచి గడచిన కొద్ది రోజులుగా పది శాతంకుపైగా క్షీణించాయి. నిఫ్టీ ఆంకేతికంగా 8080వద్దకు చేరుతుందని అంచనా. నిఫ్టీ 8280వద్ద తీవ్రప్రతిఘటన ఎదురవుతుందని తెలుస్తోంది. బ్రెగ్జిట్ అంత ర్గతంగా ఎలాంటిప్రభావం చూపించినా ఈక్విటీ లపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. డాలరుతో రూపాయి మారకం విలువలు 67.54గా కొనసాగాయి. విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లలో మంగళవారం 485 కోట్ల విలువైన షేర్లుకొనుగోలు చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురుధరలు బ్యారెల్కు 50గా ముగిసాయి. అమె రికా ప్రభుత్వం అధికారికంగా నిల్వలున్న గణాం కాలు ఈరోజు విడుదలచేస్తుంది. అలాగే కేంద్ర కేబినెట్ టెలికాం స్పెక్ట్రమ్ వేలాన్ని ఆమోదించింది. అలగే విద్యుత్శాఖపరిధిలో ఉదయ్ స్కీంను ఈ ఏడాది నుంచే అమలుకు కేబినెట్ ఆమో దించింది. ఇక స్టాక్ మార్కెట్లపరంగా టాటా మోటార్స్ సెన్సెక్స్లో అత్యధికంగా నష్ట పోయింది. యుకె కేంద్రంగా ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ వార్షిక లాభాలు బ్రెగ్జిట్తో ఎక్కువ ఒత్తిడికి లోనయ్యాయి. ఐటిసి ఒకటిశాతం క్షీణించింది. కంపెనీకి దీర్ఘకాలం పాటు సేవలందించిన యోగేష్ చందర్ దేవేశ్వర్ పదవినుంచి దిగిపోవాలని నిర్ణ యించారు. 2017ఫిబ్రవరి నుంచి తన బాద్యతల నుంచి తప్పుకుంటారు. నాన్ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగుతారు. హిందూస్థాన్యూనిలీవరర్ కూడా 1.4శాతం క్షీణించింది. ఇతర భారీ కంపెనీలపరం గా ఇన్ఫోసిస్ ఒకటిశాతం క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటిశాతం ముందుకు కదిలింది. సెన్సెక్స్లో టిసిఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అదాని పోర్టులు, డా.రెడ్డీస్ లాబ్స్ ముందుకు కదిలాయి. ఇతరత్రా టెక్స్టైల్ కంపెనీలు లాభాల స్వీకరణకు ముగి సాయి. రేమండ్, అరవింద్, బాంబే డైయింగ్ సంస్థలు ఒకటిశాతంనుంచి నాలుగు చొప్పున దిగజారాయి. టెలికాం రంగ షేర్లు స్పెక్ట్రమ్ వేలం ప్రకటనతో కొంతమేర క్షీణించాయి. భారతి ఎయిర్టెల్, ఐడియా సెల్యులర్, రిలయన్స్ కమ్యూని కేషన్స్ 0.3 నుంచి 1.7శాతం చొప్పున క్షీణించాయి. ఎస్కార్ట్స్ కంపెనీ 14శాతం పెరిగి 208 రూపాయలకు చేరింది. టెక్ మహీంద్ర ఒకటి శాతం క్షీణించింది. కమిటీ బోర్డు డైరెక్టర్లు బయో ఏజెన్సీ కంపెనీని కొనుగోలుకు ఆమోదించారు. ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ 20శాతం పెరిగింది. థామస్ కూక్ ఇండియా ఐదుశాతం పెరిగింది. కంపెనీలో 70శాతం వాటాలున్న క్వెస్కార్ప్ ఐపిఒ జారీచేసి 400 కోట్లు నిధులు జారీకి యోచిస్తోంది. | 1entertainment
|
Hyderabad, First Published 24, Sep 2018, 2:51 PM IST
Highlights
బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ ఇప్పుడు ఫినాలేకి చేరుకున్నారు. అతడికి ఆడియన్స్ లో ఎంతగా క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకి అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.
బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ ఇప్పుడు ఫినాలేకి చేరుకున్నారు. అతడికి ఆడియన్స్ లో ఎంతగా క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకి అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అందరూ కలిసి కౌశల్ ఆర్మీగా ఏర్పాటై కౌశల్ కి కావాల్సినంత సపోర్ట్ అందిస్తున్నారు. కౌశల్ ని హౌస్ లో ఎవరేమన్నా..? ఆఖరికి హోస్ట్ నాని.. కౌశల్ ని ప్రశ్నించినా.. ఈ కౌశల్ ఆర్మీ వారిపై విరుచుకుపడుతోంది.
నాని హౌస్ మేట్స్ లో కొందరికి ఫేవర్ గా మాట్లాడుతున్నాడని, కౌశల్ ని కావాలని టార్గెట్ చేస్తున్నారని కౌశల్ ఆర్మీ కామెంట్స్ చేసి అతడి సినిమా హిట్ కానివ్వమని బెదిరించారు కూడా.. మొదట్లో ఈ విషయంపై స్పందించిన నాని.. తనకు అందరూ సమానమేనని వెల్లడించింది. నాని ఎన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నా.. కౌశల్ ఆర్మీ మాత్రం అతడిని విడిచిపెట్టడం లేదు.
దీంతో నాని కూడా బాగా సైలెంట్ అయిపోయాడని తెలుస్తోంది. గత వారం హౌస్ లో జరిగిన పరిణామాలకు సంబంధించి నాని హౌస్ ని వాయిస్తాడనుకుంటే అతడు మాత్రం చాలా సైలెంట్ గా ఓపికగా ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఇక కౌశల్ ని సపోర్ట్ చేస్తూ నాని మాట్లాడడం విశేషం. హౌస్ మేట్స్ ని కుక్కలతో పోల్చిన విషయంలో కౌశల్ పై నాని ఫైర్ అవుతాడనుకుంటే నాని మాత్రం వాయిస్ తగ్గించి కౌశల్ తరఫున మాట్లాడుతూ ఇంట్లో వాళ్ల మీద పంచ్ వేశాడు.
తనీష్ ని అయితే నువ్వేమైనా రౌడీవా అంటూ ప్రశ్నిస్తూ అతడిని హెచ్చరించాడు. కౌశల్ ని మాత్రం చాలా సున్నితంగా మందలిస్తూ అతడు కానీ, కౌశల్ ఆర్మీ కానీ హర్ట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు.
Last Updated 24, Sep 2018, 2:51 PM IST | 0business
|
internet vaartha 175 Views
హైదరాబాద్ : విద్యాసంవత్సరం ప్రారంబం కావడంతో విద్యార్థులకోసం హెచ్పి కంపెనీ బ్యాక్టు కాలేజ్ ప్రచారం ప్రారంభించింది. విద్యార్ధులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. హెచ్పి ఆల్ఇన్వన్స్, హెచ్పి డెస్క్ టాప్స్ వంటి కొన్నింటిని ఎంపికచేసిన ఉత్పత్తులపై విద్యా ర్థులు 11,998 వరకూ లబ్ధిపొందే విధంగా బ్యాక్టు కాలేజ్ ఆఫర్ ప్రవేశపెట్టింది. హెచ్పిలాప్టాప్ 5999 రూపాయలు, డెస్క్టాప్కు రూ.3500లు ఇతర ఉపకరాణాలైన హెడ్ఫోన్లు, హార్డ్ డ్రైవ్స్, బ్లూటూత్ స్పీకర్లకు మూడేళ్లపాటు నామమాత్రపు ధరతో అదనంగా ఆన్సైట్ వారంటీ సదుపాయం ఇస్తున్నట్లుహెచ్పి భారత్ కంట్రీమేనేజర్ అనురాగ్ అరోరా వివరించారు. హెచ్పి పెవిలియన్, హెచ్పి పెవిలియన్ నోట్బుక్స్, హెచ్పి ఆల్ ఇన్వన్స్ను అందిస్తోంది. ఆల్ఇన్వన్స్ 23,290 ప్రారంభ ధరతో లభిస్తాయి. హెచ్పి స్లిమ్లైన్ డెస్క్టాప్ 22,490 ధరలతో లభిస్తాయన్నారు. ఈ ఏడాది ఉన్నత విద్యా సంస్థలు, సాఫ్ట్వేర్ సంస్థల పరంగాను, ఇంజినీరింగ్ కళాశాలల పరంగా తమ ఉత్పత్తులు మరింత పెరుగుతాయని ఇతర వివరాలకు హెచ్పి షాపింగ్ డాట్ఇన్/బిటిసి2016ను క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చన్నారు. | 1entertainment
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
క్రికెటంటే ఇష్టం.. కనికరించండి ప్లీజ్
గతంలో కూడా బీసీసీఐ ఇలానే బాధపెట్టింది.. వినోయ్ రాయ్ మీరైనా నా బాధ అర్థం చేసుకోండి
TNN | Updated:
Feb 17, 2017, 08:33PM IST
ఐపీఎల్‌లో స్ఫాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి జీవిత కాలం నిషేధానికి గురైన కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పశ్చాతాపంతో బీసీసీఐని వేడుకునే పనిలో పడ్డాడు. 2013లో ఫిక్సింగ్‌కు పాల్పడిన శ్రీశాంత్ అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. జైలులో ఉన్నప్పుడు తనపై 90 రోజుల మాత్రమే నిషేధం ఉందని.. అది ఎప్పుడో పూర్తయిందంటూ తాజాగా కేరళ క్రికెట్ సంఘం నిర్వహించనున్న లీగ్‌లో ఆడేందుకు శ్రీశాంత్ యత్నించడంతో బీసీసీఐ స్పందించింది. అతనిపై జీవిత కాలం నిషేధం ఉందని.. లీగ్‌లో ఆడించేందుకు వీలులేదంటూ కేరళ సంఘాన్ని హెచ్చరించింది.
ఈ ఆదేశాలపై మనస్థాపం చెందిన శ్రీశాంత్.. తనను కనుకరించాలంటూ బీసీసీఐ పాలన కోసం సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అధ్యక్షుడు వినోయ్ రాయ్‌కి లేఖ రాశాడట. ఇప్పటికే తనకెంతో ఇష్టమైన క్రికెట్‌కు నాలుగేళ్లు దూరమయ్యానని.. గతంలో కూడా వేరే ప్రైవేట్ లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ నుంచి నిరభ్యంతర పత్రం కోరినా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా బీసీసీఐ తనపై వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నట్లు లేఖలో వెల్లడించిన శ్రీశాంత్ ఇకనైనా తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాడట.
మైదానంలో దూకుడుగా ఉన్నప్పటికీ.. ప్రతిభ ఉండటంతో టీమిండియాలో వరుస అవకాశాలు చేజిక్కించుకున్న శ్రీశాంత్ కెరీర్‌లో 27 టెస్టులాడి 87 వికెట్లు తీశాడు. 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌ల్లో‌నూ మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ 34 ఏళ్ల స్పీడ్‌స్టర్ మళ్లీ క్రికెట్లోకి రావడం కష్టమనే చెప్పాలి..! | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Saaho: ‘సైకో సైయా’ ఫుల్ వీడియో సాంగ్.. ప్రభాస్ స్టైలిష్
‘సైకో సైయా’ పాటను ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. తెలుగు, తమిళంలో అనిరుధ్, ధన్వి భనుశాలి, తనిష్క్ బాగ్చి ఆలపించారు.
Samayam Telugu | Updated:
Jul 8, 2019, 12:45PM IST
తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘సాహో’. ‘బాహుబలి’ సిరీస్ తరవాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా ‘సాహో’ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో తెరకెక్కుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిర్మితమవుతోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తొలి పాటను తాజాగా విడుదల చేశారు. ‘సైకో సైయా’ అంటూ సాగే ఈ పాట చాలా స్టైలిష్గా ఉంది. ఇదొక క్లబ్ సాంగ్. ఇప్పటికే ఈ పాట టీజర్ను విడుదల చేశారు. అది ఆసక్తికరంగా ఉండటంతో పూర్తి వీడియో సాంగ్ కోసం ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. మొత్తానికి సోమవారం ఉదయం ఈ వీడియో సాంగ్ను యూట్యూబ్లో అందుబాటులోకి తెచ్చారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. బాలీవుడ్ కంపోజర్ తనిష్క్ బాగ్చి ఈ పాటను స్వరపరిచారు. తెలుగులో అనిరుధ్ రవిచందర్, ధన్వి భనుశాలి, తనిష్క్ బాగ్చి ఆలపించారు. శ్రీజో రిలిక్స్ అందించారు.
Saaho: ‘సైకో సైయా’ ఫుల్ వీడియో సాంగ్
X
కాగా, ఈ సినిమాను టి-సిరీస్ అధినేతలు గుల్షన్ కుమార్, భూషన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ‘సాహో’ సినిమాను అత్యధికంగా విదేశాల్లో చిత్రీకరించారు. హైదరాబాద్, ముంబైతో పాటు అబుదాబి, దుబాయ్, రొమానియా, ఆస్ట్రియాతో పాటు యూరప్లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. సుధీర్ఘ కాలంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఖాదీ, గ్రామీణ వస్తువులకు పెరుగుతోన్న డిమాండ్!
నిజంగా ఇది ఖాదీ, గ్రామీణ పరిశ్రమలకు శుభవార్తే.. ఎళ్లుగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటొన్న ఖాదీకి అంతర్జాతీయంగానూ డిమాండ్ ఏర్పడటం గమనార్హం.
TNN | Updated:
May 1, 2017, 12:39PM IST
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకం 2016-17 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా రూ.50 వేల కోట్ల మార్కును దాటింది. ఖాదీ అమ్మకాలకు ప్రభుత్వం బలంగా కృషి చేస్తుంటే, ఆశ్చర్యకరంగా గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులైన తేనే, సబ్బులు, సౌందర్య లేపనాలు, ఫర్నిచర్, సేంద్రీయ ఆహార పదార్థాలకు అత్యంత గిరాకీ ఏర్పడింది. ఈ ఉత్పత్తుల్లో చాలావాటిని మహిళలే నిర్వహించడం గమనార్హం. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ గత ఆర్థిక సంవత్సరంలో సేకరించిన సమాచారం ప్రకారం గ్రామీణ పరిశ్రమలు లేదా గ్రామోద్యోగ ఉత్పత్తుల అమ్మకాలు 24 శాతం మేర పెరిగి రూ.50 వేల కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.
వీటిలో ఖాదీ అమ్మకాలు 2015-16తో పోల్చుకుంటే 33 శాతం పెరిగి రూ.1,635 కోట్ల నుంచి రూ.2,005 కోట్లకు చేరుకున్నాయి. దేశంలోని ఇతర నిత్యావసర వస్తువుల కంపెనీల ఉత్పత్తుల కంటే కేవీఐసీ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఖాదీ అమ్మకాలు కూడా బాంబే డైయింగ్, రేమాండ్స్ లాంటి సంస్థల కంటే మెరుగ్గా ఉన్నాయి. 2018-19 నాటికి ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలను రూ.5 వేల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై కేంద్రం కూడా బలంగా ప్రచారం చేస్తోంది. అంతే కాదు విదేశాల్లోనూ ఖాదీకి వినియోగదారులు పెరగడం విశేషం. | 1entertainment
|
internet vaartha 164 Views
ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం నికరలాభాల్లో 61.6శాతం దిగజారాయి. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో ఎస్బిఐ 1115.34కోట్లు రూపాయలు నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి 2910.8 కోట్ల నికరలాభం ఆర్జించిన బ్యాంకు ఈ ఏడాది భారీ పత నం చవిచూసింది. రానిబాకీలకు కేటా యింపులు పెంచడం వల్లనే లాభాలు తగ్గినట్లుబ్యాంకు చెపుతోంది. ఈ త్రైమా సికంలో 7644.62 కోట్లు కేటాయిం చిన బ్యాంకు గతఏడాది మూడోత్రైమాసి కంలో కేవలం 4810 కోట్లు మాత్రమే కేటాయించింది. సుమారుగా రానిబాకీల కు రెట్టింపు కేటాయింపులు చేసిన బ్యాంకు లాభాల్లో కోతను చవిచూసింది. బ్యాంకు స్థూల ఎన్పిఎలు 5.1శాతంగా ఉన్నాయి. అంతకుముంద త్రైమసికం లో 4.9శాతంగా ఉన్నవి గణనీయంగా పెరిగాయి. అదేకాలంలో స్థూల ఎన్పిఎలు కూడా 72,791.73 కోట్లకు పెరిగాయి. ంతకుముందు ఏడాది ఇదేకాలంలో 61,991.45కోట్ల రూపాయ లుగా ఉన్నాయి. స్థూల ఎన్పిఎలు సెప్టెంబరు త్రైమాసికంలో 4.15శాతంగా ఉన్న సంగతి తెలిసిం దే. ఎస్బిఐ నికర ఎన్పిఎలపరంగాచూస్తే 2.89 శాతంగా ఉన్నాయి. గతఏడాది ఇదేకాలంలో 2.80 శాతం ఉన్న నిరర్ధక ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. ఎన్పిఎలు 40,429.12 కోట్లకు పెరిగినట్లు అంచనా. గత ఏడాది ఇదేకాలంలో 34,488.74 కోట్లు ఉన్నాయి. నికర నిరర్ధక ఆస్తులు కూడా క్రమానుగత పద్ధతిలో 2.14శాతంగా ఉన్నాయి. నికరవడ్డీ ఆదాయం పరంగా చూస్తే ఒకటిశాతం క్షీణించి 13,606.47 కోట్లకు చేరింది. క్యాపిటల్ అడక్వసీరేషియో 12.45శాతంగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు 2017 మార్చిలోపు తమ ఆస్తి అప్పుల పట్టీలను సమన్వయం చేసుకోవాలని రిజర్వుబ్యాంకు ఆదే శించిన సంగతి తెలిసిందే. అలాగే బ్యాంకుల మొండి బకాయిలను కూడా ఇటీవలి కాలంలో నిశిత పరి శీలన చేసిన ఆర్బిఐ సమస్యాత్మక రుణాలు, పునర్వ్యవస్థీకరించిన రుణాల్లో కొన్నింటిని సంక్లిష్టమైన రికవరీలను రానిబాకీల జాబితాలో చేర్చి కఠిన కార్యాచరణ అవలం భించాలని ఆదేశించింది. బ్యాంకిం గ్ దిగ్గజంగా ఉన్న ఎస్బిఐ సహ జంగానే నిరర్ధక ఆస్తులపరంగా కొంత పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకించి ఆర్బిఐ సమీక్ష తర్వాత ఈ ఆస్తులు మరింత పెరిగిపోయాయి. | 1entertainment
|
openers on board, rains stops the match in kolkata
రాహుల్ చెత్త రికార్డు.. ఓపెనర్లు పెవిలియన్కు!
కోల్కతా టెస్టును వర్షం వీడటం లేదు. 8.2 ఓవర్లపాటు సాగిన ఆటలో ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు.
TNN | Updated:
Nov 16, 2017, 02:56PM IST
వర్షం ఆటంకం కలిగించడంతో ఆలస్యంగా ప్రారంభమైన తొలి టెస్టులో భారత్‌కు పేలవమైన ఆరంభం లభించింది. లక్మల్ విసిరిన ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుటై నిరాశపరిచాడు. తద్వారా టెస్టుల్లో మొదటి బంతికే అవుటైన ఏడో భారత బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. సునీల్ గావస్కర్ మూడుసార్లు మొదటి బంతికే అవుటవగా, సుధీర్ నాయక్, డబ్ల్యూవీ రామన్, శివ సుందర్ దాస్, వసీం జాఫర్‌ ఒక్కోసారి చొప్పున తాము ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగారు. టెస్టు సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో తొలి బంతికే వెనుదిరిగన ప్రపంచ క్రికెటర్ల జాబితాలోనూ రాహుల్ ఏడో వాడు కావడం గమనార్హం.
పిచ్ మీద పచ్చిక ఉండటం, ఆకాశం మేఘావృతమై ఉండటంతో లంక పేసర్లకు కలిసి వచ్చింది. ముఖ్యంగా లక్మల్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పెట్టాడు. లంక బౌలర్లు చెలరేగడంతో.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పుజారా ఖాతా తెరవడానికే 21 బంతులు తీసుకున్నాడు. మరో ఎండ్‌లో శిఖర్ ధావన్ కుదురుకున్నట్లు కనిపించాడు. కానీ లక్మల్ బౌలింగ్‌లోనే డ్రైవ్ చేయబోగా బంతి బ్యాట్ లోపలి అంచును తాకుతూ వికెట్లను గిరాటేసింది. దీంతో భారత జట్టు 13 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. | 2sports
|
Hyderabad, First Published 6, Apr 2019, 12:22 PM IST
Highlights
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది.
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. సమ్మర్ ఆరంభంలో వచ్చిన ఈ సినిమాకి ఉగాది పండగ కూడా బాగా కలిసొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలో ఈ సినిమా ఐదు కోట్లను రాబట్టింది.
ఏరియాల వారీగా కలెక్షన్లు.. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Mahesh Babu ఫ్యాన్స్కు షాక్.. ‘మహర్షి’ విడుదల మళ్లీ వాయిదా?
మహేశ్బాబు 25వ చిత్రం ‘మహర్షి’ విడుదల మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 25న కాకుంగా.. జూన్కి వాయిదా పడినట్లు సమాచారం.
Samayam Telugu | Updated:
Feb 22, 2019, 12:29PM IST
హైలైట్స్
మహేశ్ బాబు ఫ్యాన్స్కు మళ్లీ నిరాశ.
ఏప్రిల్ 25న వస్తుందనుకుంటున్న ‘మహర్షి’ మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా జూన్లో విడదలయ్యే ఛాన్స్ ఉందని టాక్.
సూపర్స్టార్ మహేశ్బాబు , క్యూట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న సినిమా ‘మహర్షి’. మహేశ్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. మూడో వంతు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ‘మహర్షి’ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
షూటింగ్ ప్రారంభమైనప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 5నే విడుదల చేయాలని అనుకున్నారు. అయితే చిత్రీకరణలో ఆలస్యం వల్ల ఏప్రిల్ 25కి వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం ‘మహర్షి’ సమ్మర్లో కూడా వచ్చే ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ‘మహర్షి’కి ప్లస్ అవుతుందని మహేశ్ ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా సమ్మర్కు వచ్చే ఛాన్స్ లేకపోవడంపై వారు నిరాశ చెందుతున్నారట. | 0business
|
RATAN TATA
సైరస్ మిస్త్రీకి ఉద్వాసన
ముంబై, అక్టోబరు 24: టాటాసన్స్బోర్డు డైరెక్టర్లు కంపెనీ ఛైర్మన్గా సైరస్ పి మిస్త్రీని ఆస్థానం నుంచి బదలీచేసారు. ఆయనస్థానంలోట్రాటాగ్రూప్ ఛైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటాను తాత్కాలిక బాధ్యతలు నిర్వహించాలని విజ్ఞప్తిచేసింది. కార్పొరేట్ రం గంలో సంచలనం కలిగించిన ఈ యాజమా న్య బదలాయింపుపై రకరకాల పుకార్లు వ్యాపి స్తున్నాయి. సోమవారం సమావేశం అయిన టాటాబోర్డు కొత్త ఛైర్మన్ను ఎన్నుకునేందుకు కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ ప్యానెల్ లో రతన్టాటాతోపాటు మరో నలుగురు డైరె క్టర్లను నియమించిన సంస్థ నాలుగునెలల్లో కొత్తఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది. సైరస్మిస్త్రీ టాటాసన్స్బోర్డుకు 2012 డిసెంబరులో ఛైర్మన్గా నియమితుల య్యారు. అప్పటి ఛైర్మన్ రతన్టాటా స్థానం లో ఆయన నియామకం జరిగింది. కమిటీలో రతన్ టాటాతోపాటు వేణుశ్రీనివాసన్, అమిత్ చంద్రా, రోనెన్సెన్, లార్డ్కుమార్ భట్టాచార్య తది తరులు సభ్యులుగా ఉంటారు. టాటాసన్స్ అంత ర్గత నియమ నిబంధనలను అనుసరించి ఈ నియా మకం జరిగింది. కమిటీ శరవేగంగా కొత్తఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని బాధ్యతలు అప్పగించింది. తాత్కాలిక ఛైర్మన్గా నియమితుల యిన రతన్ టాటా 1991నుంచి 2012 డిసెంబరు 28వ తేదీ వరకూ ఛైర్మన్గా వ్యవహరించారు.రతన్ టాటా టాటాగ్రూప్ కంపెనీల్లో టాటామోటార్స్, టాటాస్టీల్, టాటాకన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా పవర్, టాటాగ్లోబల్ బేవరేజెస్, టాటాకెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలిసర్వీసెస్ వంటి సంస్థలకుసైతం ఛైర్మన్గా వ్యవహరించారు. ఆయన హయాంలో టాటాగ్రూప్ రాబడులు 2011-12 సంవత్సరాంతానికి 100 బిలియన్ డాలర్లకు చేరా యి. ఇక సైరస్ మిస్ట్రీ 2012 డిసెంబరులో ఆరో ఛైర్మన్గా టాటాగ్రూప్కు నియమితులయ్యారు. రతన్ టాటా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించా రు. అప్పటివరకూ ఆయన 2006 నుంచి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముం దు మిస్త్రీషాపూర్జీ పల్లోం ఈగ్రూప్కు ఎండిగా వ్యవహరిస్తున్నారు. సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎంఎస్ఇ మేనేజ్మెంట్ డిగ్రీ ని లబడన్ బిజి నెస్స్కూల్ నుంచి పొందారు. 48ఏళ్ల మిస్త్రీ ఆయన బాధ్యతల స్వీకరించినప్పటినుంచి సవాళ్లతోనే ఉందని వెల్లడించారు. గడ చిన 15 దశాబ్దాలుగా కంపెనీకి ఉన్న పటిష్టమైన పునాదులను మరింత శక్తి మంతం చేయాల్సిన అవసరం బాధ్య తలు తనపై ఉన్నాయని, వచ్చే 150 ఏళ్లవరకూ కంపెనీ పనితీరు స్థిరంగా ఉండేలా కార్యాచరణ అమలవుతుందని మిస్త్రీ వెల్లడించారు. అయితే సైరస్ మిస్త్రీ రాజీనామా, రతన్ టాటా తాత్కాలిక ఛైర్మన్గా నియమితులు కావడంపై మరింతగా వివరాలు రావాల్సి ఉంది. | 1entertainment
|
స్టాక్స్ రికార్డులు సరే! ఇన్వెస్టర్లు.. జర పయిలం
Highlights
పరస్పర భిన్నమైన ఆర్థిక డేటా మధ్య అత్యధిక రికార్డులు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లతో ఇన్వెస్టర్లు ఆనందడోలికల్లో మునిగి తేలారు. కానీ జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం తదితర అంశాలు తప్పక ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుకుని రికార్డులు నెలకొల్పాయి. క్రూడాయిల్ ధరల పతనం, తొలి త్రైమాసిక ఫలితాలపై పాజిటివ్ అంచనాలతో సెన్సెక్స్ జనవరి 29వ తేదీ నుంచి ఐదు నెలల తర్వాత కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఎదిగిందన్న వార్తలతో కూడా మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. సెన్సెక్స్ 282.48 పాయింట్ల లాభంతో 36,548. 41 వద్ద ముగిసింది. కాగా, నిఫ్టీ 11,000 స్థాయిని అధిగమించి 74.90 పాయింట్ల లాభంతో 11,023.20 వద్ద ముగిసింది. ఒకదశలో 11,078.30 పాయింట్ల గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. రిలయన్స్ 4.42 శాతం పెరిగి వంద బిలయన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీగా అవతరించింది.
బుల్లిష్గా ఉన్నా అప్రమత్తంగా ఉండాలి
కానీ వచ్చే 6-12 నెలల కాలానికి బుల్లిష్గా ఉన్నామార్కెట్ విశ్లేషకులు మాత్రం ఇన్వెస్టర్లు, ట్రేడర్లు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెబుతున్నారు. పరస్పర విరుద్ధ ఆర్థిక డేటా నేపథ్యంలో కార్పోరేట్ రాబడులు, క్రూడాయిల్ ధరలు, రూపాయి మారకం విలువ, తర్వలో జరుగబోయే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్కెట్ దిశను సమీప భవిష్యత్లో నిర్దేశిస్తాయని డీహెచ్ఎఫ్ఎల్ ఫార్మేసియా మ్యూచువల్ ఫండ్ ప్రతినిధి రాజేష్ అయ్యర్ అన్నారు.
వీటితో మార్కెట్లు ఇలా ప్రభావితం
చమురు ధరలు, రూపాయి మారకం విలువ, మొండి బకాయి సమస్య, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్, రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కేంద్రంలో రాజకీయ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కార్పోరేట్ రాబడులు మార్కెట్ను ప్రభావితం చేయనున్నాయని కార్వీ స్టాక్ బ్రోకింగ్ విశ్లేషించింది.
ఇలా ఇండెక్స్ల నష్టాల పర్వం
మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లతోపాటు మెటల్, ఆటో, రియల్టీ, ఐటీ ఇండెక్స్లు నష్టాల్లో ముగిసాయి. బ్యాంక్ నిఫ్టీ 0.78 శాతం మేర లాభపడింది. మార్కెట్ గరిష్ఠ స్థాయిలో ముగిసినప్పటికీ ఎన్ఎస్ఈలో నష్టపోయిన షేర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. మొత్తం 1,026 షేర్లు నష్టపోతే 756 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిసాయి. బుధవారం కొనుగోళ్లు జరిపిన ఎఫ్ఐఐలు మళ్లీ నికరంగా అమ్మకాలకు దిగారు. రూ. 742.63 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. డీఐఐలు రూ.366.40 కోట్ల కొనుగోళ్లు జరిపారు.
10 షేర్లకు మాత్రమే లాభాల పంట ఇలా..
సెన్సెక్స్ గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నా, గత జనవరిలో వచ్చిన గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే సెన్సెక్స్లోని 30 షేర్లలో 10 షేర్లు మాత్రమే పోల్చితే లాభాలను ఇచ్చాయి. మిగిలిన 20 షేర్లు 17-37 శాతం మేర నష్టపోయాయి. లాభాలను ఇచ్చిన వాటిలో టీసీఎస్, కోటక్ బ్యాంక్ 24 శాతం, హెచ్యుఎల్ 23 శాతం, ఎంఅండ్ఎం 22 శాతం, ఏషియన్ పెయింట్స్ 18 శాతం, ఇన్ఫోసిస్ 12 శాతం, ఇండస్ బ్యాంక్ 10 శాతం, రిలయన్స్ 8 శాతం, హెచ్డీఎఫ్సీబ్యాంక్ 7 శాతం, యెస్ బ్యాంక్ 4 శాతం చొప్పున రాబడిని ఇచ్చాయి. నష్టపోయిన వాటిలో వేదాంత, టాటా మోటార్స్, టాటా స్టీల్ ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
నిఫ్టీలో షూటింగ్ స్టార్ క్యాండిల్ ప్యాట్రన్
నిఫ్టీ 11,078 పాయింట్లను తాకిన తర్వాత వచ్చిన లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయి నుంచి 55 పాయింట్ల నష్టంతో షూటింగ్ స్టార్ క్యాండిల్ ప్యాట్రన్ ఏర్పడింది. సాధారణంగా ఈ ప్యాట్రన్ను ట్రెండ్ రివర్సల్కు సంకేతంగా భావిస్తారని యాక్సిస్ సెక్యూరిటీస్కు చెందిన రాజేష్ పాల్వియా చెప్పారు. గురువారం నాటి కనీస స్థాయికి దిగువన క్లోజ్ అయితే షూటింగ్ స్టార్ ప్యాట్రన్కు ధృవీకరణ లభిస్తుంది. ర్యాలీ కొనసాగాలంటే నిఫ్టీ 10,980 స్థాయికి ఎగువన నిలదొక్కుకోవాలని పాల్వియా తెలిపారు. ఒకవేళ 11,000స్థాయికి దిగువన ముగిస్తే 10,920 వరకూ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా టెక్నికల్ ఇండికేటర్లు ఓవర్బాట్ పొజిషన్లోకి వచ్చినందున మార్కెట్ పెరిగేందుకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయని యోస్ సెక్యూరిటీస్ సాంకేతిక విశ్లేషకులు ఆదిత్యా అగర్వాల్ తెలిపారు. గరిష్ఠ స్థాయిల్లో లాభాల స్వీకరణకు అవకాశం ఉన్నట్లు చెప్పారు.
11 ఏళ్లకు మళ్లీ వంద బిలియన్ డాలర్ల కంపెనీ రిలయన్స్
మళ్లీ 11 ఏళ్ల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రికార్డును తానే తిరగరాసింది. వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది. షేరు ధర 4.42 శాతం లాభపడి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ. 1099.8కి చేరుకోవడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,88,51 3.11 కోట్లకు (100.3 బిలియన్ డాలర్లు) చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి లాభాల స్వీకరణతో మార్కెట్ క్యాప్ వంద బిలియన్ డాలర్ల దిగువకు పతనం అయింది. 2007, అక్టోబర్ 18న రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలిసారిగా వంద బిలియన్ డాలర్ల మార్కెట్క్యాప్ కంపెనీగా అవతరించింది. ఆ తర్వాత వచ్చిన కరెక్షన్తో మార్కెట్ క్యాప్ కూడా తగ్గింది. దాదాపు 11 ఏండ్ల తర్వాత మళ్లీ వంద బిలియన్ మార్కెట్ క్యాప్ మార్క్ను చేరుకుంది. టీసీఎస్ గత ఏప్రిల్లోనే వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా ఎదిగింది.
Last Updated 13, Jul 2018, 10:27 AM IST | 1entertainment
|
Suresh 246 Views
మన ఆడోళ్లు పవర్ఫుల్
న్యూఢిల్లీ: ఫోర్స్ ప్రతిష్టాత్మకంగా ఏటా ప్రకటించే ఆసియా అత్యంత శక్తివంతురాలైన మహిళల జాబితాలో భారత్కు ప్రథమస్థానం దక్కింది. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ ప్రథమస్థానం దక్కించుకున్నారు. రెండో స్థానంలో ఎస్బిఐ (స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా) చైర్మన్ అరుంధతి భట్టాచార్య నిలిచారు. వ్యాపార ప్రపచంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాను ఫోర్బ్ ప్రకటించింది. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ICC Test Rankings: కోహ్లినే కింగ్.. తొలి కివీస్ ప్లేయర్గా విలియమ్సన్ రికార్డ్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో బ్యాట్స్మెన్ విభాగంలో కోహ్లి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో నిలిచాడు.
Samayam Telugu | Updated:
Dec 20, 2018, 02:15PM IST
ICC Test Rankings: కోహ్లినే కింగ్.. తొలి కివీస్ ప్లేయర్గా విలియమ్సన్ రికార్డ్
హైలైట్స్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: బ్యాటింగ్ విభాగంలో కోహ్లి (934 పాయింట్లు)దే అగ్రస్థానం.
915 పాయింట్లతో రెండో స్థానంలో కేన్ విలియమ్సన్.
900 పాయింట్లకుపైగా సాధించిన తొలి కివీస్ బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేసిన విలియమ్సన్.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శతకం సాధించిన విరాట్ కోహ్లి టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 123 పరుగులు చేసిన కోహ్లి.. 934 పాయింట్లతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో తొలి స్థానంలో నిలిచాడు. అబుదాబి టెస్టులో 89, 139 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (915) రెండో స్థానంలో ఉన్నాడు. ఆసియా గడ్డ మీద పాక్పై టెస్టు విజయాన్ని అందుకున్న తొలి కివీస్ కెప్టెన్గా రికార్డ్ క్రియేట్ చేసిన కేన్.. 900కిపైగా పాయింట్లు సాధించిన తొలి కివీస్ బ్యాట్స్మెన్గానూ రికార్డులకెక్కాడు. | 2sports
|
Hyderabad, First Published 14, Mar 2019, 4:55 PM IST
Highlights
హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి స్టార్ డం సంపాదించుకున్న నటి జ్యోతిక.. సూర్యని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైంది. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈమె మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. తన వయసుకి తగ్గ పాత్రలను ఎన్నుకుంటూ దూసుకుపోతుంది.
హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి స్టార్ డం సంపాదించుకున్న నటి జ్యోతిక.. సూర్యని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైంది. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈమె మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. తన వయసుకి తగ్గ పాత్రలను ఎన్నుకుంటూ దూసుకుపోతుంది.
ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో 'నవాబ్' సినిమాలో నటించిన ఈమె ప్రస్తుతం కొత్త దర్శకుడు రాజ్ తో కలిసి సినిమా చేయబోతుంది.ఈ సినిమాలో కూడా ఆమె పాత్రే కీలకంగా ఉండబోతుంది. ఈ సినిమాలో నటి పూర్ణిమా భాగ్యరాజ్, సత్య రాజ్ వంటి వారు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
ఇందులో జాతిక ప్రభుత్వ పాఠశాల టీచర్ గా కనిపించనుంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది.ఇప్పుడు ఈ సినిమా కు టైటిల్ ని కన్ఫర్మ్ చేసే పనిలో పడింది చిత్రబృందం. 'రాక్షసి' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వేసవి తరువాత సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఆర్ఎస్.ప్రకాశ్, ఆర్ఎస్. ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Last Updated 14, Mar 2019, 4:55 PM IST | 0business
|
ఎస్బీహెచ్ సీజీఎం బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
'స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్' చీఫ్ జనరల్ మేనేజర్ (ఎస్ఏఎంజీ) గా డి.వి.సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని'స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్' (ఎస్బీహెచ్) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. డి.వి. సురేష్ కుమార్ 1985లో ఎస్బీహెచ్లో ప్రొబిషనరీ ఆఫీసర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం బ్యాంకులోని వివిధ కార్యాలయాల్లో పలు హోదాల్లో పని చేశారు. దేశంలోని వివిధ నగరాలలో కూడా సురేష్ సేవలందించారు. అమెరికాలోని 'స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా' షికాగో శాఖలోనూ సురేష్ కుమార్కు నాలుగు సంవత్సరాల పాటు పని చేసిన అనుభవం ఉంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలలో జనరల్ మేనేజర్ (రిటైల్ నెట్వర్క్ ఛండీగఢ్)లో పని చేస్తున్న సమయంలో సురేష్ కుమార్కు చీఫ్ జనరల్ మేనేజర్గా పదోన్నతి లభించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
చిరు కోసం హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్!
Highlights
చిరు మాత్రం త్రిష, లేదా అనుష్క వంటి సీనియర్ హీరోయిన్లను తీసుకుంటే బాగుంటుందని సూచించినా.. కొరటాల ఆలోచనలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. చిరు కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల
ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టం అవుతోంది. అందుకే కొందరు హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవికి కూడా ఇలాంటి సమస్యే వచ్చినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు చిరు పక్కన హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనేది ప్రశ్నగా మారిపోయింది.
కాజల్ తో కలిసి 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో నటించారు. 'సై రా' సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. మళ్లీ వారినే కొరటాల తన సినిమాలో హీరోయిన్ గా రిపీట్ చేయడానికి ఇష్టపడడం లేదు. చిరు మాత్రం త్రిష, లేదా అనుష్క వంటి సీనియర్ హీరోయిన్లను తీసుకుంటే బాగుంటుందని సూచించినా.. కొరటాల ఆలోచనలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. చిరు కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల.
బాలీవుడ్ లో టీవీ సీరియళ్ల ద్వారా ఫేమస్ అయిన కొందరు లీడ్ ఆర్టిస్ట్ లను అలానే ముప్పై ఏళ్ళు దాటిన మోడల్స్ కొందరిని ఆడిషన్ చేయాలనుకుంటున్నారు. వారిలో ఒకరిని హీరోయిన్ గా ఫైనల్ చేయాలనుకుంటున్నారు. కొరటాల గనుక నిర్ణయించుకుంటే చిరంజీవి కూడా కాదనే ఛాన్స్ లేదు. సో.. ఈసారి చిరంజీవీ సినిమాలో కొత్త హీరోయిన్ ను చూడడం ఖాయమనిపిస్తోంది.
Last Updated 1, Aug 2018, 4:19 PM IST | 0business
|
ప్రణీత సైడ్ బిజినెస్ చేస్తోంది.. సంపాదించాలంటే తప్పదు
Highlights
ఇటీవల బిజినెస్ పీపుల్ గా మారిపోతున్న టాలీవుడ్ హీరోయిన్లు
నటనతోపాటు రకుల్ తదితర హీరోయిన్ల సైడ్ బిజినెస్
అదే కోవలో సినీ నిర్మాతగా మారనున్న ప్రణీత
ఈ మధ్య మన హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్న నానుడిని పక్కా ఫాలో అవుతున్నారు మన యంగ్ హీరోయిన్లు. తెలుగులో హీరోయిన్స్ గా యమా క్రంజ్ సంపాదించుకున్న పలువురు హీరోయిన్లు తమకు నచ్చిన రంగంలో వ్యాపారం చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఆ కోవలో ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ అండ్ ఫిట్ నెస్ బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది.
ఇలా తమ సంపాదనను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడుతున్న కథానాయికల్లో మరో హీరోయిన్ చేరింది. రకుల్ జిమ్ బిజినెస్ లో సక్సెస్ అవుతుండగా కొంతమంది జ్యుయలరీ బిజినెస్ లో.. మరికొంతమంది డైమండ్స్ బిజినెస్ లో . . ఇంకొంతమంది హోటల్ బిజినెస్ లో పెట్టుబడులు పెడుతూ లాభాలు సంపాదిస్తున్నారు. ఈ బిజినెస్ లు కాకుండా సినిమాలను నిర్మించే బాధ్యతను తలకెత్తుకోవడానికి కూడా కొంతమంది సిద్ధమవుతున్నారు. అలాంటి కథానాయికల జాబితాలో తాజాగా ప్రణీత కనిపిస్తోంది.
తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ప్రణీతకి, అత్తారింటికి దారేది' .. ' పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక కన్నడలోను తన సత్తా చాటుకోవడానికి ఆమె తన వంతు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య హోటల్ బిజినెస్ ను ఆరంభించిన ప్రణీత, అందులో లాభాల బాటలో దూసుకుపోతోందట. దాంతో నిర్మాతగా మారిపోయి .. స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతోందని అంటున్నారు. త్వరలోనే తన సొంత బ్యానర్ పై ఒక సినిమాను ఎనౌన్స్ చేయనుందని అంటున్నారు.
Last Updated 26, Mar 2018, 12:02 AM IST | 0business
|
Mar 13,2017
ఇంటెక్స్కు 'ఆక్వా' ఊరట!
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఇంటెక్స్కు ఊరట లభించింది. 'ఆక్వా' బ్రాండుతో మొబైల్ఫోన్లు, విడిభాగాలను విక్రయించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. జస్టిస్ బదార్ దురెంజ్ అహ్మద్, జస్టిస్ అసుతోష్ కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ట్రేడ్ మార్క్ ఉల్లంఘన జరిగిందంటూ 'ఏజెడ్ టెక్' సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో 'ఆక్వా' బ్రాండ్పై సెల్ఫోన్లు, విడిభాగాలు స్థానిక విపణిలో విక్రయించొద్దని ఇంటెక్స్ సంస్థను ఏకసభ్య ధర్మాసనం గత డిసెంబరులో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ తీర్పును సవాల్ చేస్తూ ఇంటెక్స్ మరోసారి పిటిషన్ దాఖలు చేయగా.. గత తీర్పును పక్కనపెట్టి ద్విసభ్య ధర్మాసనం ఇంటెక్స్కు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ను జారీ చేస్తున్నట్టు తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఓటమి నేర్పిన పాఠాలు.. రవిశాస్త్రి ఎంతలా మారిపోయాడు!
ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టు సిరీస్ గెలుస్తామని ప్రగల్భాలు పలికిన టీమిండియా కోచ్ రవిశాస్త్రి.. తర్వాత ఫలితం చూసి షాకయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బుద్ధిమంతుడిలా మారిపోయాడు.
Samayam Telugu | Updated:
Sep 15, 2018, 11:51AM IST
‘భారత జట్టు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఇంగ్లీష్ గడ్డ మీద టెస్టు సిరీస్ గెలుస్తాం’ అని ఇంగ్లాండ్ టూర్ ఆరంభానికి ముందు టీమిండియా కోచ్ రవిశాస్త్రి ధీమాగా చెప్పాడు. కానీ తీరా అక్కడికెళ్లాక సీన్ రివర్స్ అయ్యింది. ఐదు టెస్టుల సిరీస్ను 1-4 తేడాతో కోహ్లి సేన కోల్పోయింది. కేవలం ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే ఆడటంతో బ్యాట్స్మెన్ సిరీస్కు సన్నద్ధం కాలేకపోయారనే విమర్శలు వచ్చాయి. దీంతో కీలకమైన ఆస్ట్రేలియా టూర్లో ఈ పొరబాట్లు చేయొద్దని కోచ్ రవిశాస్త్రి నిర్ణయించాడు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు మరిన్ని వార్మప్ మ్యాచ్లను నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను రవి శాస్త్రి కోరాడు. టీమిండియా కోచ్ వినతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి సానుకూలంగా స్పందించారు. కానీ బీసీసీఐ నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉందని ఆయన తెలిపారు.
భారత జట్టు నవంబర్ 21 నుంచి జనవరి 18 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. కంగారూలతో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 6 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది. మొత్తానికి ఇంగ్లాండ్ గడ్డ మీద ఓటమి రవిశాస్త్రికి గట్టి గుణపాఠమే నేర్పినట్టుంది. | 2sports
|
Hyderabad, First Published 19, Aug 2019, 2:52 PM IST
Highlights
ఆర్టికల్ 370 రద్దు అంతర్జాతీయంగా సంచలనం రేపిన అంశం. భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుని అమలు చేశారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ కావడంతో ప్రస్తుతం కాశ్మీర్ పూర్తిస్థాయిలో ఇండియాలో అంతర్భాగం అయింది. ఆర్టికల్ 370 రద్దుపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టికల్ 370 రద్దు అంతర్జాతీయంగా సంచలనం రేపిన అంశం. భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుని అమలు చేశారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ కావడంతో ప్రస్తుతం కాశ్మీర్ పూర్తిస్థాయిలో ఇండియాలో అంతర్భాగం అయింది. ఆర్టికల్ 370 రద్దుపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఆర్టికల్ 370 రద్దుపై చేసిన వ్యాఖ్యలు ఆమెపై ట్రోలింగ్ కు దారితీశాయి. సోనమ్ కపూర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఇండియా, పాక్ ఓకే దేశంగా ఉండేవి. కానీ ఆర్టికల్ 370 అనేదాన్ని నేను రాజకీయంగానే భావిస్తాను. రాజకీయ కారణాలవల్ల ఇరు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్.
ఇరు దేశాల మధ్య పరిస్థితులు సద్దుమణగడానికి కొంత సమయం ఇవ్వాలి అని సోనమ్ వ్యాఖ్యానించింది. సోనమ్ కపూర్ వ్యాఖ్యలు ఆర్టికల్ 370 రద్దు ఆమెకు ఇష్టం లేదనే విధంగా ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు ని స్వాగతించకుండా ఏదేదో మాట్లాడుతోందని అంటున్నారు.
తన కుటుంబానికి పాకిస్తాన్ తో రిలేషన్ కూడని కూడా సోనమ్ తెలిపింది. ఇక తన చిత్రాలని కూడా పాక్ ప్రేక్షకులు ఆదరిస్తారని సోనమ్ చెప్పుకొచ్చింది. పాక్ ప్రభుత్వం ఇండియన్ చిత్రాలపై బ్యాన్ విధించడాన్ని సోనమ్ తప్పుబట్టింది. కానీ నెటిజన్లు ఇవేమి గమనించకుండా ఆర్టికల్ 370 రద్దుపై ఆమె ఇచ్చిన వివరణని మాత్రం తప్పుబడుతున్నారు. తనపై వస్తున్న ట్రోలింగ్ ని ఇప్పటికైనా ఆపాలని, తన వ్యాఖ్యలని వక్రీకరిస్తున్నారని సోనమ్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది.
Last Updated 19, Aug 2019, 2:52 PM IST | 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.