news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Aug 27,2017
జియో ఫోన్ ప్రీ బుకింగ్స్ నిలిపివేత!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన 4జీ ఫోన్ ప్రీ-బుకింగ్ను తాత్కాలికంగా నిలిప ివేశారు. లక్షల మంది వినియోగదారులు ఈ మొబైల్ను బుక్ చేసుకోవడంతో ప్రీ బుకింగ్ వెసులుబాటును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని జియో తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. 'లక్షల మంది ఇప్పటికే ఫోన్ను ముందుగా బుక్ చేసుకున్నారు' అనే మెసేజ్ను ఆ సైట్ హోమ్ పేజీలో పెట్టారు. ప్రస్తుతానికి ప్రీ-బుకింగ్లను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టుగా తన అధికారిక సైట్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో జియో ఫోన్ కావాల్సిన వారు ప్రస్తుతం తమ ఆసక్తిని మాత్రమే రిజిస్ట్రర్ చేసుకోవాలని సూచించింది. ప్రీ-బుకింగ్స్ను తిరిగి ఎప్పుడు ప్రారంభినున్నామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని జియో సైట్లో తెలిపింది. తాత్కాలికంగా అయితే బుకింగ్ ఆప్షన్ను తొలగిస్తున్నట్టు పేర్కొంది. జియో అకస్మాత్తుగా ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ను నిలిపివేయడంతో, తర్వాత బుక్ చేసుకోవచ్చని భావించిన ప్రజలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. జియో ఫోన్ను ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి సెప్టెంబర్లో రిలయన్స్ జియో అందించనుంది. త్వరలో ఫోన్ల డెలివరీ తేదీ, స్టోర్ వివరాలను వినియోగదారుల ఫోన్లకు కంపెనీ మెసేజ్ పంపనుంది. రిలయన్స్ జియో పేరిట రూ.1,500లకే 4జీ ఫీచర్ఫోన్ను అందించనున్న విషయం తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Vaani Pushpa 185 Views demand , INCOME TAX
automobiles
న్యూఢిలీ: ఆటోమొబైల్రంగంలో నెలకొన్న మాంద్యం పోవాలంటే ఇపుడున్న పన్ను రాయితీలు ఎంతమాత్రం సరిపోవన్న భావన వ్యక్తం అవుతున్నది. వాహనాల ధరలు కొంతమేర తగ్గుతాయన్న సమాచారం వాస్తవమే అయినా డిమాండ్ లేదని అందువల్ల మార్కెట్ పునరుద్ధరణ జాప్యం అవుతుందని నిపుణులు చెపుతున్నారు. ఆటో సంస్థలు మేకిన్ ఇండియా కార్యాచరణ కింద 15శాతం కంటే తక్కువకే జిఎస్టి ఉంటే కొంతమేర లాభం కలుగుతుందంటున్నారు. ఐదుశాతం జిఎస్టి అమలుచేయాలని లగ్జరీకార్లుకాకుండా ఇతర కేటగిరీ కార్లపై జిఎస్టి తగ్గించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. 23శాతం అమ్మకాల్లో పతనం చవిచూసిన ఆటోమొబైల్రంగం ప్రముఖ కంపెనీలు హుండై మోటార్స్, మారుతిసుజుకి, మహీంద్ర వంటి కంపెనీలు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసాయి. ఉన్న నిల్వలు క్లియర్చేసుకోవాలంటే ఇదే ఏకైకమార్గమని ఎంచుకున్న కంపెనీలు తాత్కాలిక మూసివేతతో ఉన్న నిల్వలు డీలర్లకు తరలివెళతాయన్న భావన వ్యక్తంచేస్తున్నారు. ఇపుడు ప్రకటించిన కార్పొరేట్ పన్నుల తగ్గింపుతో వచ్చిన ప్రయోజనాలు క్షేత్రస్థాయికి మళ్లించవచ్చన్న భావన వ్యక్తం అవుతోంది. ఇక ఆటోమొబైల్రంగంలో దీపావళి, నవరాత్రి పండుగల సందర్భంగా అమ్మకాల్లోపెరుగుదల నమోదవుతుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
డైలాగ్స్ తో పొలిటికల్ హీట్ పెంచుతున్న డీజే దువ్వాడ జగన్నాథం
Highlights
దువ్వాడ జగన్నాథంలో అగ్రి గోల్డ్ తరహాలో బాధితుల సమస్య ప్రస్తావన
బాధితుల పక్షాన నిలిచే డీజే పాత్రలో నటించిన అల్లు అర్జున్
ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్న పైన అమ్మ వారు, కింద కమ్మ వారు అనే డైలాగ్
విజయవాడ కేంద్రంగా జరిగిన అగ్రిగోల్డ్ కుంభకోణం లాంటి సీరియస్ సబ్జెక్ట్ ను వినోదాత్మకంగా చెప్పడానికి దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ప్రయత్నమే అల్లు అర్జున్ డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం. సమాజంలో జరిగే దుర్మార్గాలపై స్పందిస్తూ.. మర్డర్లు చేసే డీజే కేరక్టర్ అగ్రి సంస్థ బాధితులను కాపాడేందుకు హీరో కంకణం కట్టుకుంటాడు. ఈ స్టోరీ ఏపీలో అగ్రి గోల్డ్ బాధితుల కష్టాలను కళ్లకు గట్టినట్లుంటుంది.
తాజాగా ఏపీలో బ్రహ్మణ కమిషన్ చైర్మన్ ఐవీకే కృష్ణారావు ఘటన నేపథ్యం ఈ చిత్రానికి సరిగ్గా యాప్ట్ అయ్యే అవకాశం ఉంది. విజయవాడ కేంద్రంగా కొందరు నేతలు బ్రహ్మణ సంఘానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఈ కథకు సూట్ అయ్యేలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఈ చిత్రంలో జరిగే భూ కుంభకోణానికి అగ్రో డైమండ్ అనే పేరుపెట్టారు. డిఫాల్టర్ల ఆగడాలు, బాధితుల కష్టాలను ఉద్వేగభరితంగా చిత్రీకరించారు. ఏపీ రాజధానిని కేంద్రంగా చేసుకొని సాగిన ఈ భూదందా సహజంగానే ప్రేక్షకుడిని కదలిస్తుంది.
హరీశ్ శంకర్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఓ సీన్లో ‘బెజవాడలో పైన అమ్మవారు.. కింద కమ్మవారు' అంటూ చెప్పే డైలాగ్స్ కు ప్రేక్షకులకు మంచి స్పందన వచ్చింది. సభ్య సమాజానికి ఏం చెబుతామనుకొంటున్నావ్ లాంటి డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి. ఇలాంటి డైలాగ్స్ ఏ సందర్భంలో వచ్చాయి.. ఎందుకు వచ్చాయి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సీరియస్ సన్నివేశాల్లో అల్లు అర్జున్ చేత చెప్పించిన సంభాషణలు ఫ్యాన్స్ కు పండుగలా మారాయి. మొత్తానికి ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలకు కనెక్ట్ అవుతూ డీజే మూవీ పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తోంది.
Last Updated 26, Mar 2018, 12:00 AM IST | 0business
|
Hyderabad, First Published 5, Sep 2019, 8:08 PM IST
Highlights
తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నారు.
తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదల చేసిన టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, తమన్నా, నయనతార లాంటి స్టార్ కాస్టింగ్ కూడా సైరా చిత్రానికి కలసి వచ్చే అంశం. ట్రేడ్ వర్గాల్లో సైరాపై భారీ అంచనాలే ఉన్నాయి. తన రీఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 తో చిరంజీవి రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టారు.
సైరా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది కాబట్టి అంతకు మించిన అంచనాలే ఉన్నాయి. తాజాగా సైరా చిత్ర గుంటూరు ఏరియా రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయి. సాహో లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థే సైరా గుంటూరు హక్కులని 11.5 కోట్లకు దక్కించుకుంది.
బాహుబలి మినహా మరే చిత్రం గుంటూరులో 10 కోట్లకు మించి వసూళ్లు రాబట్టలేదు. సైరా చిత్రం ఆ ఫీట్ అందుకుంటుందేమో వేచి చూడాలి. | 0business
|
ఏప్రిల్ నుంచి ఆదాయపు పన్నులో మార్పులు..
-ఆర్థిక బిల్లు ప్రతిపాదనలు అమల్లోకి
- నగదు లావాదేవీలపై ఆంక్షలు
- పాన్కార్డుకు ఆధార్ అనుసంధానం
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. 2017-18 ఆర్థిక బిల్లుకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏప్రిల్ ఒక్కటో తేది నుంచి పలు ఆదాయ పన్ను చట్టాలు మారనున్నాయి. గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివిధ ఆదాయ పన్ను చట్ట సవరణలను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా తాజాగా లోకసభ కొన్ని సవరణలను కూడా ఆమోదించింది. ఈ క్రమంలో 2017 ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు క్రింది విధంగా ఉండనున్నాయి. రూ. 2.5 లక్షలు నుంచి రూ. 5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి పన్ను శాతం తగ్గనుంది. 87ఎ సెక్షన్ ప్రకారం ఈ తగ్గింపు లభించనుంది. అయితే రూ.3.50 లక్షలు ఆదాయ పన్ను చెల్లించేవారికి మాత్రం ఈ రిబేటు వర్తించదు. కాగా రూ.5 లక్షల ఆదాయం లోపు వారికి పన్ను భారం రూ.5,000 నుంచి రూ.2,500కు తగ్గనుంది. అదే విధంగా మొత్తం ఆదాయం కోటి రూపాయల లోపు ఉంటే ఆదాయపు పన్ను 10 శాతం నుంచి 5 శాతానికి దిగిరానుంది. దీంతో ఈ స్థాయి పన్ను చెల్లింపుదారులకు ఏడాదికి రూ.12,500 మేర పన్ను పొదుపు కానుంది. సర్ఛార్జ్, సెస్లతో కలుపుకుని రూ.14,806 రూపాయలు ఆదా కానుంది. రూ.5 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.12,900 ఆదా కానుంది. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల లోపు ఆదాయం కలిగిన ధనవంతులకు పన్నుపై పది శాతం సర్ఛార్జ్ విధింపు అమలు కానుంది. ఇది గతంలో 15 శాతంగా ఉంది. అయితే కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం గల సంపన్నులపై మాత్రం ఈ సర్ఛార్జ్ విధింపులో మార్పులేకుండా 15 శాతంగా ఉండనుంది.
ఒక్క పేజీతో రిటర్న్స్..
ఇది వరకు రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు కూడా ఆదాయపు పన్ను చెల్లించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చేది. అనేక పేజీలు, గందరగోళం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు రూ.5లక్షలలోపు ఆదాయం ఉన్న వారికోసం సులభంగా ఒక్క పేజీ ఫారంను నింపితే చాలు. ఈ విభాగంలో మొదటిసారిగా దాఖలు చేసే పన్ను రిటర్న్లపై సహజంగానే ఎలాంటి పెద్ద పరిశీలనలు ఉండవు. జాతీయ పెన్షన్ పథకం ఉపసంహరణపై ఎలాంటి పన్ను ఉండదు. ఖాతాదారులకు 25 శాతం అత్యవసరాల కోసం ఉపసంహరణ చేసుకోవచ్చు. అలాగే పదవీ విరమణ తర్వాత ఉపసంహరణలపై వచ్చే మొత్తం ఆదాయంలో 40శాతానికి ఎలాంటి పన్ను ఉండబోదు.
చిన్న మదుపర్లకు ప్రోత్సాహకాలుండవు..
రాజీవ్గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ను 2017-18 నుంచి ఉపసంహరిస్తున్నారు. లిస్టెడ్ ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్లో లిక్విడ్ యూనిట్స్లో తొలిసారి పెట్టుబడులకు మినహాయింపును ఇచ్చే పథకం ఇకపై ప్రాధాన్యతను కోల్పోనుంది. చిన్న ఆదాయపరుల పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలో ప్రోత్సహించేందుకు గాను 2012-13లో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో మార్పుల ద్వారా 2018-19 నుంచి ఎలాంటి మినహాంపులు లభించవు. స్థిరాస్థులపై పెట్టుబడులను దీర్ఘకాలంగా పరిగణిచేందుకు అవసరమైన కాలపరిమితిని 3 ఏండ్ల నుంచి 2 సంవత్సరాలకు కోత పెట్టారు. దీంతో స్థిరాస్తులపై 2 ఏండ్లకు మించిన పెట్టుబడులపై పన్ను 20 శాతానికి పరిమితం చేయడంతో పాటు, తిరిగి పెట్టుబడులు చేయడంపై పలు మినహాయింపులకు అర్హత లభిస్తుంది. నోటిఫైడ్ రెడీమబుల్ బాండ్లలో క్యాపిటల్ గెయిన్స్పై రీఇన్వెస్ట్మెంట్కు పన్ను మినహాయింపు వర్తిస్తుంది ఎన్హెచ్ఎఐ, ఆర్ఈసి బాండ్లలో పెట్టుబడులకు అదనంగా ఉండనుంది.
ఆలస్యం చేస్తే అపరాధ రుసుం
ట్యాక్స్ రిటర్న్ పున:సమీక్షించేందుకు కాలపరిమితిని రెండేండ్ల నుంచి అదే ఆర్థిక సంవత్సరం చివరకు లేదా అసెస్మెంట్ ఏడాది చివరకు ఇందులో ఏది త్వరగా ముగియనుంటే దానికి పరిమితం చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్ను ఆలస్యంగా అంటే 2018 డిసెంబర్ 31వరకూ దాఖలు చేసినవారు రూ. 5,000వేలు, ఆ తర్వాత దాఖలు చేసే వారు రూ. 10వేలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కాగా రూ. 5 లక్షల లోపు ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులపై ఈ జరిమానాను రూ.1,000గా నిర్ణయించారు. నగదులావాదేవీలపై పరిమితి విధించింది. ఈ పరిమితిని బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.3లక్ష నుంచి ఏకంగా రూ.2 లక్షలకు కేంద్రం తగ్గించింది. రూ.2లక్షల పైన లావాదేవీలపై ఆంక్షలు విధించినట్టయ్యింది. దీని ప్రకారం లావాదేవీలపై 100శాతం జరిమానా విధించనున్నారు.
ఆధార్ తప్పనిసరి..
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారందరికీ తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాల్సిందే. కాని పాను కార్డు ద్వారా కూడా జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి అధార్ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 50 వేలకు మించిన నగదు లావాదేవీలు అన్నింటికీ పాన్ కార్డు నెంబరును రాయడం తప్పనిసరి చేశారు. అదే విధంగా రూ.2 లక్షల పైబడిన పసిడి కొనుగోళ్లకు కూడా పాన్ నెంబర్ కావాల్సిందే. కాగా డిసెంబర్ 31వ తేదీలోగా ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశంలో 108 కోట్ల మందికి ఆధార్ కార్డులు, 25 కోట్ల పాన్ కార్డులున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 235 Views
హైదరాబాద్ : పంటినొప్పి ఇతర దంత క్షయ వ్యాధుల నుంచి సత్వర ఉపశమనం కోసం కాల్గేట్ తొలిసారి పెయిన్ ఔట్ను విడుదల చేసింది. ఒక్క చుక్క పెయిన్ ఔట్తో నొప్పి వేగంగా నివారించవచ్చని చెపుతోంది. పిన్నవయస్కులే కాకుండా మధ్యవయస్కుల్లో కూడా పంటి నొప్పితో బాధపడుతున్నవారు అనేక మంది ఉన్నారని, కంపెనీ చెపుతూ ఎలాంటి పంటి నొప్పినుంచైనా సరే, సత్వరమే పెయిన్ఔట్ ఉపశమనం ఇస్తుందని పేర్కొన్నారు. కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ ఎరిక్ జొంబర్ట్ మాట్లాడుతూ దంతక్షయం నుంచి ఉపశమనం పొందేందుకు ఇప్పటికే కాల్గేట్ అనేక ఉత్పత్తులు అందించిందని, తాజాగా పంటినొప్పి నుంచి ఉపశమనం కోసం పెయినౌట్ను తెచ్చామని పేర్కొన్నారు. పదిగ్రాముల ప్రీమియం ప్యాక్ రూ.50లుగా ఉంది. | 1entertainment
|
Jul 04,2018
రెడ్కార్నర్ అరెస్ట్ వారెంట్ కాదు!
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణానికి పాల్పడి విదేశాలకు తరలిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంటర్పోల్ అతడిని పట్టుకోవాల్సిన వ్యక్తుల జాబితాలో చేర్చింది. అయితే ఈ నోటీసుల ఆధారంగా తాము ఏ దేశాన్నీ నీరవ్ను అరెస్ట్ చెయ్యమని ఒత్తిడి చెయ్యలేమని ఇంటర్పోల్ వెల్లడించింది. ఇంటర్ పోల్ వెబ్సైట్లో నీరవ్ మోదీకి సంబంధించిన వివరాలను.. మనీలాండరింగ్ ఆరోపణల కారణంగా భారత అధికారులు నీరవ్ను పట్టుకోవాలనుకుంటున్నారని వెల్లడించారు. విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న నిందితులను అరెస్టు చేసేందుకు ఈ రెడ్కార్నర్ నోటీసు ఉపయోగపడుతుంది. రెడ్కార్నర్ నోటీసును ఇంటర్పోల్ తన సభ్యదేశాలకు జారీ చేస్తుంది. ఒక దేశానికి సంబంధించిన నేరస్థుడు ఇతర దేశాల్లో ఉంటే.. అతన్ని అరెస్టు చేయాలని ఇంటర్పోల్ తన సభ్య దేశాలను కోరుతుంది. రెడ్ కార్నర్ నోటీసు ద్వారా ఇంటర్పోల్ అరెస్ట్ చేయాలని ఇతర దేశాలకు సిఫార్సులు మాత్రమే చేస్తుందని, అరెస్ట్ చెయ్యమని, చర్యలు తీసుకొమ్మని వేరే దేశాలను ఒత్తిడి చేయలేమని, ఇది ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ కాదని ఇంటర్పోల్ వెల్లడించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘నా నువ్వే’ ప్రి రిలీజ్ ట్రైలర్: కళ్యాణ్రామ్.. కలయా? నిజమా!
మనసులు కలిశాయి.. నీడలు కలిశాయి. మరి, వారిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారా? ఆమె ప్రేమ ఊహా? లేదా.. ఊహకందని ప్రేమా? ఇంతకీ ఆమె ప్రేమిస్తుంది ఎవరినీ?
Samayam Telugu | Updated:
Jun 12, 2018, 08:09PM IST
మనసులు కలిశాయి.. నీడలు కలిశాయి. మరి, వారిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారా? ఆమె ప్రేమ ఊహా? లేదా.. ఊహకందని ప్రేమా? ఇంతకీ ఆమె ప్రేమిస్తుంది ఎవరినీ? వామ్మో.. ఈ ట్రైలర్ చూస్తే ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతాయి. ‘నా నువ్వే’ అంటూ తన ప్రేమికుడి రాక కోసం ఎదురుచూస్తున్న ఆ ప్రేయసి కథ.. తెరపై చూస్తేనే అర్థమవుతుందట.
నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన ‘నా నువ్వే’ చిత్రం.. అంచనాలు పెంచేస్తుంది. ప్రి రిలీజ్ నేపథ్యంలో విడుదల చేసిన ట్రైలర్ను చూస్తే.. ఈ సినిమాలో ఏదో సరికొత్త విషయం దాగిందనేది స్పష్టమవుతుంది. ‘‘చల్లని గాలిలా పరిచయమై ఠక్కున మాయమైపోయాడు’’ అంటూ తమన్నా ద్వారా ఓ చిన్న హింట్ ఇచ్చే ప్రయత్నం ఈ ట్రైలర్లో ఇచ్చినా పాటలో భావం మాత్రం.. ఏదో కొత్త విషయాన్ని చెబుతుంది.
కళ్యాణ్రామ్ ఈ సినిమాలో చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. తమన్నా-ఎన్కేఆర్ల కెమిస్ట్రీ చాలా కొత్తగా.. సినిమాకు ఫ్రెష్ లుక్ ఇస్తోంది. బహుశా ఇది.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మాయే కావచ్చు. శరీత్ సంగీతం ఈ సినిమాకు మరింత రొమాంటిక్ ఫీల్ కలిగిస్తోంది. జయేంద్ర దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ‘ట్రైలర్’ ఫీల్ గుడ్గా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ను యూట్యూబ్లో పోస్టు చేసిన 24 గంటల్లోనే 45 లక్షల మంది వీక్షించడం గమనార్హం. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఏం ‘మాయ’ చేస్తుందో చూడాల్సిందే.
‘నా నువ్వే’ ప్రి రిలీజ్ ట్రైలర్ను ఇక్కడ చూడండి.
X | 0business
|
Jan 31,2016
దేశ మార్కెట్లోకి షెవర్లే క్రూజ్ 2016
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ భారత మార్కెట్లోకి 'షెవర్లే క్రూజ్ 2016' ను విడుదల చేసింది. శనివారం ఈ కారును ఆవిష్కరించింది. అరుదైన వ్యూ కెమేరా, పొగ మంచులో వెళ్లేప్పుడు వాడేందుకు ప్రొజెక్టర్ లైట్స్, ఏడు అంగుళాల తాకే తెర, వాయిస్ ఆధారిత నియంత్రణ, ఇంటర్నెట్ రేడియో తదితర ఆకర్షణీయ ఫీచర్లు దీనిలో ఉన్నాయని జీఎం ప్రెసిడెంట్ కహెర్ కాజెమ్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ సీడన్లలో క్రూజ్ కొత్త ఫీచర్లతో రూపొందిందని చెప్పారు. శక్తివంతమైన డీజిల్ ఇంజన్తో దీన్ని తయారుచేశామన్నారు. న్యూఢిల్లీ ఎక్స్షోరూం వద్ద ఈ వాహన ధర రూ.14.68 లక్షల నుంచి రూ.17.81 లక్షలుగా నిర్ణయించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 9, May 2019, 11:48 AM IST
Highlights
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ.. హృతిక్ రోషన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ.. హృతిక్ రోషన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. హృతిక్ నటిస్తోన్న 'సూపర్ 30' సినిమా అలానే కంగనా నటిస్తోన్న 'మెంటల్ హై క్యా' సినిమా ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. చాలా కాలంగా హృతిక్, కంగనాల మధ్య గొడవలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా విడుదల వాయిదా వేద్దామని కంగనా.. నిర్మాత ఏక్తా కపూర్ ని కోరారట.
కానీ దానికి ఆమె అంగీకరించలేదు. దీంతో సోషల్ మీడియాలో హృతిక్ అభిమానులు కంగనాపై కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీనికి నిర్మాత ఏక్తా కపూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సినిమా ఎప్పుడు విడుదల చేయాలనేది నిర్మాతగా అది తన నిర్ణయమని, అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకున్నామని, కాబట్టి ద్వేషంతో కూడిన వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొంది.
ఈ ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ రంగోలీ.. హృతిక్ రోషన్ కు చురకలంటించింది. నేరుగా పోరాడే ధైర్యం లేక వెనుక నుండి నోటికొచ్చినట్లు మాట్లాడేవారి గురించి ఏం చెప్తాం.. నువ్వు, నీ పీఆర్వో కంగనాను ఎంతగా అవమానించాలని చూస్తే.. తను మిమ్మల్ని అంతగా తొక్కిపడేస్తుందని కామెంట్స్ చేసింది.
'హృతిక్.. చూస్తూ ఉండు. కంగన నిన్నేం చేస్తుందో..'అంటూ వార్నింగ్ ఇచ్చింది. సినిమాను వాయిదా వేయాలని కంగనా.. ఏక్తాను కోరిందని కానీ ఆమె నిర్మాత కావడంతో ఆమె మాటే చెల్లుతుందని అంది. ఏక్తా, హృతిక్ స్నేహితులు కావడంతో ఆమెను ఏం అనలేక కంగనాను టార్గెట్ చేస్తున్నారని తెలిపింది.
'ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంతగా కంగనను టార్చర్ పెట్టాలని చూసినా తను నీకున్న కొవ్వంతా కరిగించేస్తుంది.ఇప్పటికైనా బాగుపడు' హృతిక్ ఫ్యాన్స్ కి కోపం వచ్చే విధంగా రాసుకొచ్చింది. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ambati Rayudu: ప్రపంచకప్ రేసులో మళ్లీ రాయుడు, పంత్..!
భారత సెలక్టర్లు ఇప్పటికే ప్రకటించిన జట్టులో ఎవరైనా మే 23లోపు గాయపడితే..? వారి స్థానంలో అంబటి రాయుడు లేదా రిషబ్ పంత్ని ఎంపిక చేస్తారు. ఒకవేళ ఫాస్ట్ బౌలర్ గాయపడితే అతని స్థానంలో నవదీప్ షైనీకి అవకాశం దక్కనుంది.
Samayam Telugu | Updated:
Apr 17, 2019, 06:06PM IST
Ambati Rayudu: ప్రపంచకప్ రేసులో మళ్లీ రాయుడు, పంత్..!
హైలైట్స్
ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టులో ఎవరైనా గాయపడితే.. ఫస్ట్ రాయుడికి ఛాన్స్
వరల్డ్కప్కి ఈరోజు ప్రత్యామ్నాయంగా రాయుడు, పంత్, నవదీప్ షైనీని ఎంపిక చేసిన బీసీసీఐ
మే 23లోపు భారత్కి ప్రపంచకప్ జట్టులో పేర్లుని మార్చుకునే అవకాశమిచ్చిన ఐసీసీ
ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అంబటి రాయుడు , రిషబ్ పంత్ మళ్లీ రేసులోకి వచ్చారు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. గత సోమవారం 15 మందితో కూడిన జట్టుని భారత సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జట్టులో నెం.4 స్థానం కోసం రాయుడి స్థానంలో విజయ్ శంకర్ని, రిజర్వ్ వికెట్ కీపర్గా పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్కి సెలక్టర్లు అవకాశం కల్పించారు. దీంతో.. కొంత మంది భారత మాజీ క్రికెటర్లు జట్టు ఎంపికపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా.. రిషబ్ పంత్ని పక్కన పెట్టడంపై సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. రాయుడిపై వేటు తనని బాధించిందని గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. దీంతో.. రాయుడు, పంత్తో పాటు యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ షైనీని కూడా ప్రత్యామ్నాయంగా ప్రపంచకప్ కోసం బీసీసీఐ తాజాగా ఎంపిక చేసింది. | 2sports
|
హోమ్ క్రీడలు భారత యువతీ తో ఆస్ట్రేలియా అల్ రౌండర్
భారత యువతీ తో ఆస్ట్రేలియా అల్ రౌండర్
August 29, 2019, 5:33 PM IST
Share on:
ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ భారత సంతతి అమ్మాయితో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారత సంతతి యువతి విని రామన్తో మ్యాక్స్వెల్ కొంతకాలంగా ప్రేమయాణం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ తరచూ హోటళ్లకు, పబ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళుతున్నారు. చివరికి క్రికెటర్ల అవార్డు కార్యక్రమానికి కూడా మ్యాక్స్వెల్ తన ప్రేమీకురాలు విని రామన్తో కలిసి వచ్చాడు. త్వరలోనే వీరిద్దరూ వివాహమాడబోతున్నట్టు తెలిసింది. కాగా దీనిపై అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాకున్న త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వస్తుందని ఆస్ట్రేలియాకు చెందిన ఓ క్రికెటర్ తెలిపాడు.
సంబంధిత వార్తలు | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బోస్టన్లో పవన్ కల్యాణ్కు ఘన స్వాగతం!
అమెరికా పర్యటనకు వెళ్లిన పవన్ కల్యాణ్కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు.
TNN | Updated:
Feb 9, 2017, 02:52PM IST
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ షూటింగ్‌‌కు కొంచెం బ్రేక్ ఇచ్చిన ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం బోస్టన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈనెల 11, 12 తేదీల్లో జరగనున్న ‘ఇండియా కాన్ఫరెన్స్ 2017’లో ప్రసంగించేందుకు ఆయన బోస్టన్ వెళ్లారు. ఈ సమావేశాన్ని ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు.
బోస్టన్ ఎయిర్‌పోర్టులో దిగిన పవన్ కల్యాణ్‌కు అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్‌తోపాటు ఆయన స్నేహితుడు శరద్ మరార్, భార్య అన్నా లెజ్‌నెవ్ కూడా ఉన్నారు. ‘ఇండియా కాన్ఫరెన్స్ 2017’లో పవన్‌తో అమెరికా మహామహులు హాజరవుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ తదితర దిగ్గజాలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే బోస్టన్ ఎయిర్‌పోర్టులో షూటు, బూటుతో కనిపించిన పవన్.. సమావేశానికి మాత్రం ఖాదీ దుస్తుల్లో హాజరవనున్నట్లు సమాచారం. | 0business
|
Suresh 94 Views
మార్కెట్లకు బక్రీద్ సెలవ్!
ముంబై, సెప్టెంబరు 13: భారత్ ఈక్విటీ, ఫారెక్స్, నగదు కమోడిటీ మార్కెట్లకు బక్రీద్ సందర్భంగా సెలవు ప్రకటించారు. ఈద్ ఉల్ అధా అని పిలుచు కునే బక్రిద్ అధికారిక సెలవుగా మార్కెట్లు ప్రకటిం చాయి. ఇకముందురోజు మార్కెట్లు బ్రెగ్జిట్ రిఫ రెండమ్ వెలువడినరోజు తర్వాత అతిపెద్ద నష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అమెరికా ఫెడ్ రిజర్వు, యూరోపియన్ ఎంట్రల్బ్యాంకు అధ్యక్షు డు మారియోడ్రాగీ వ్యాఖ్యలు వంటివి కీలకంగా పనిచేసాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను డ్రాగీ వ్యాఖ్యలు నిరాశపరిచాయి. బిఎస్ఇ సెన్సెక్స్్ 444 పాయింట్లు క్షీణించి 28,354 పాయింట్లు నమోదు చేస్తేనిఫ్టీ 50 సూచి 151పాయింట్లు క్షీణించి 8716 పాయింట్లవద్ద నిలిచింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా అతిపెద్ద నష్టాలు ఎదుర్కొన్నట్లు నిపుణుల అంచనా. మోతీలాల్ ఓస్వాల్ సాంకేతిక నిపుణులు సచ్చితానంద్ ఉట్టేకర్ మాట్లాడుతూ నిఫ్టీ 8820 వద్ద ఆకస్మికంగా బ్రేక్ అయిందన్నారు. నిఫ్టీలో రానున్న మద్దతు స్థాయి 8640గా ఉండవచ్చని గరిష్టంగా 9వేల పాయింట్లవద్దకు ఉంటుందన్నారు సోమవారం మార్కెట్లు ముగిసిన తర్వాత భారత రిటైల్ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలయ్యాయి. ఆగస్టు రిటైల్ద్రవ్యోల్బణం 5.05 శాతంగా నిలి చింది. ఫ్యాక్టరీ ఉత్పత్తి గణాంకాలపరంగాచూస్తే దిగజారాయి. ప్రతికూల వృద్ధి మైనస్ 2.4శాతంగా నమోదయింది. అంతకుముందు జూన్నెలలో 1.95శాతం వృద్ధినిసాధిస్తే జులైనెలలో ప్రతికూలం గా ఉంది. ఇక అంతర్జాతీయంగా అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారంకొంతపెరిగాయి. ఫెడ్రిజర్వు పాలకులు అమెరికా వడ్డీరేట్లు పెంచాల్సిన అవసరా న్ని నొక్కిచెప్పడంతో యూరోపియన్ మార్కెట్లు, ఆసియా మార్కెట్లు కూడా దిగజారాయి. అమెరికా డాలరు ఫెడ్నిర్ణయాలతో కొంతమేర స్వల్పంగా దిగజారింది. ఫెడ్ రిజర్వు పాలకవర్గం ఈఏడాది రెండోసారి వడ్డీరేట్లను పెంచేఅవకాశం ఉంది. యూరోపియన్ సెంట్రల్బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ జపాన్ సంస్థలు కూడా అదనపు ఉద్దీపనలపై మౌనం వహించాయి. డౌజోన్స్ పారిశ్రామిక సూచి 193.26పాయింట్లు పెరిగి18,278.71 పాయింట్ల కు పెరిగింది. ఎస్అండ్పి 500 సూచి 25.56 పాయింట్లు పెరిగి 2153.37 పాయింట్లుగా నమో దయింది. నాస్డాక్కాంపోజిట్ 68.37 పాయింట్లు పెరిగి 5194.28 పాయింట్లవద్ద నిలిచింది. ఇక సోమవారం డాలరుతో రూపాయి మారకం విలు వలు 24పైసలు క్షీణించి 66.92 రూపాయలుగా నిలిచింది. ఇక సెబీపరంగాచూస్తే విదేశీ పోర్టు ఫోలియో ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్లలో నేరుగా ట్రేడింగ్ చేసుకునేందుకు ఎంపికచేసిన రంగాల్లో ప్రవేశించేందుకు అనుమతులు సడలించింది. డెట్రంగంతోపాటు మరికొన్నికేటగిరీలు స్పష్టం చేసింది. కేంద్రకేబినెట్ కూడా జిఎస్టి మండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇక ఆసియా మార్కెట్లపరంగాచూస్తే మంగళవారం వాల్స్ట్రీట్ సెంటిమెంట్తో పనిచేశాయి. జపాన్ బయటి మార్కెట్లలో ఆసియాపసిఫిక్ షేర్లు 0.6శాతం పెరి గాయి. జపాన్నిక్కీ ముందు లాభాలు హరించుకు పోయాయి. దక్షిణకొరియా కోస్పి 0.5శాతం పెరిగింది. ఆస్ట్రేలియన్ స్టాక్మార్కెట్లు 0.3శాతం పెరిగాయి. హాంకాంగ్ హ్యాంగ్షెంగ్ 1.1శాతం షాంఘై మార్కెట్లు నిలకడగాను ముగిసాయి. | 1entertainment
|
DRAVID
కోహ్లీ,అశ్విన్లను ప్రశంసించిన ద్రవిడ్
న్యూఢిల్లీ: ఘోర పరాజయాలకు అడ్డుగోడగా నిలిచి భారత క్రికెట్ జట్టును విజయం వైపు దూసుకు పోయేలా చేసిన ద్రవిడ్ తాజాగా భారత టెస్టు జట్టు సారథి కోహ్లీ,స్పిన్ మాంత్రికుడు అశ్విన్ను పొగడ్తలతో ముంచెత్తాడు.కాగా సచిన్,గంగూలీ, లక్ష్మణ్,సెహ్వాల్,కుంబ్లేతను తాను గతంలో క్రికెట్ను శాసించిన దిగ్గజాల జాబితాలో చేరతామన్న ద్రావిడ్,వీళ్లు మాత్రం ఎప్పటికి దిగ్గజాలే అన్నాడు. ఇప్పుడున్న జట్టులో కోహ్లీ,అశ్విన్లు ఈ తరం క్రికెట్ దిగ్గజాలను చెబుతూ వీరిద్దరిని ద్రవిడ్ పొగడ్తలతో ముంచెత్తాడు.ఈ తరంలో కూడా భారత్ జట్టులో దిగ్గజాలు తయారువుతారని,కోహ్లీ ఇప్పటికే క్రికెట్ దిగ్గజ ఆటగాడయ్యాడని,అశ్విన్ టెస్టు రికార్డులను ఎవరూ అధిగమించలేరని పేర్కొన్నాడు.కాగా రానున్న కాలంలో మరికొంత మందిమంచి ఆటగాళ్లను చూడగలమన్నాడు.ప్రస్తుత కాలంలో టివి,సోషల్ మీడియా ద్వారా ప్రతిభ గల ఆటగాళ్తు త్వరగా వెలుగులోకి వస్తున్నామని ద్రవిడ్ పేర్కొన్నాడు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
విరాట్ కోహ్లి కంటే రోహిత్ శర్మనే బెటర్..!
పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే ఓపెనర్ రోహిత్ శర్మనే బెస్ట్ బ్యాట్స్మెన్ అని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్
TNN | Updated:
Dec 26, 2017, 04:10PM IST
విరాట్ కోహ్లి కంటే రోహిత్ శర్మనే బెటర్..!
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే ఓపెనర్ రోహిత్ శర్మనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అభిప్రాయపడ్డారు. కోహ్లి అభిమానులు ఈ మాటని ఒప్పుకోకున్నా ఇది మాత్రం వాస్తవమని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా డబుల్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ .. టీ20లో మెరుపు శతకం సాధించిన విషయం తెలిసిందే. అతని జోరుతో భారత్ జట్టు శ్రీలంకపై 2-1తో వన్డే సిరీస్‌ని.. 3-0తో టీ20 సిరీస్‌ని చేజిక్కించుకుంది. తాజాగా సందీప్ పాటిల్ ఓ టీవీ ఛానల్‌‌తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘విరాట్ కోహ్లి అభిమానులు ఈ మాటని ఒప్పుకోకపోవచ్చు. కానీ.. కోహ్లి కంటే రోహిత్ శర్మనే మెరుగైన బ్యాట్స్‌మెన్. విరాట్ కోహ్లి కూడా గొప్ప ఆటగాడే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. అతను భారత్ జట్టు అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కోహ్లి కంటే రోహిత్ శర్మ కొంచెం ముందు ఉన్నాడు’ అని పాటిల్ వివరించారు. వన్డే, టీ20 జట్టులో మెరుగ్గా రాణిస్తున్న రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టు జట్టులోనూ సుస్థిర స్థానం సంపాదించుకుని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. రోహిత్ వేగవంతమైన షాట్ సెలక్షన్ వన్డే, టీ20లకి (తెలుపు బంతి) బాగా నప్పుతుందని.. టెస్టుల్లో (ఎరుపు బంతి) మాత్రం క్యాచ్‌లు వెళ్లిపోతాయంటూ గత కొంతకాలంగా మాజీ క్రికెటర్లు విమర్శస్తున్న విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి జీవితాన్ని మార్చిన పుస్తకం!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుస విజయాలతో తిరుగులేని సారథిగా దూసుకుపోతున్నాడు. కోహ్లి పాటిస్తున్న కొన్ని కచ్చితమైన నిర్ణయాలే అతన్ని ఇప్పుడు స్థిరమైన, బలమైన క్రికెటర్గా నిలబెట్టాయి.
TNN | Updated:
Feb 18, 2017, 08:26PM IST
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుస విజయాలతో తిరుగులేని సారథిగా దూసుకుపోతున్నాడు. కోహ్లి పాటిస్తున్న కొన్ని కచ్చితమైన నిర్ణయాలే అతన్ని ఇప్పుడు స్థిరమైన, బలమైన క్రికెటర్‌గా నిలబెట్టాయి. అతని బ్యాటింగ్, కెప్టెన్సీ, హెల్తీ లైఫ్‌స్టైల్ అన్నీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కోహ్లి అతని సహచరులకే కాదు.. రాబోయే యువతరానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అయితే కోహ్లీ ఇంత దృఢంగా, స్థిరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. ఒక పుస్తకం. ఈ 28 ఏళ్ల క్రికెటర్‌కి జీవితం అంటే ఏంటో నేర్పింది ఆ పుస్తకమేనట. ఇంతకీ ఆ పుస్తకం ఏదో తెలుసా.. ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ ( ఓ యోగి ఆత్మకథ ). ఈ పుస్తకం పట్టుకుని ఉన్న ఫొటోను కోహ్లి శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. అంతేకాకుండా ‘ఈ పుస్తకాన్ని మీరందరూ చదవండి, కచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. | 2sports
|
microsoft ceo satya nadella picks hyderabad legend over sachin tendulkar as his favorite cricketer
సచిన్ కంటే ఆ హైదరాబాదీ క్రికెటర్ అంటేనే ఇష్టం: సత్య నాదెళ్ల
నేను హైదరాబాదీని, నాకు సచిన్ కంటే ఆ హైదరాబాదీ క్రికెటర్ అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పిన సత్య నాదెళ్ల.
TNN | Updated:
Nov 7, 2017, 03:28PM IST
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మెచ్చిన క్రికెటర్ ఎవరో తెలుసా? క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కంటే ఆయనకు హైదరాబాదీ క్రికెటర్ అంటేనే ఇష్టమట. 1960ల నాటి ఆటగాడైన జయసింహ తనకెంతో ఇష్టమైన క్రికెటర్ అని సత్య తెలిపారు. ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జయసింహ, సచిన్ టెండుల్కర్‌.. వీరిద్దరిలో నీ ఫేవరెట్ ఎవరనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. కష్టమైన ప్రశ్నే వేశారు. కానీ నేను హైదరాబాదీని కాబట్టి నా ఓటు జయసింహకే అని తెలిపారు.
తను రాసిన హిట్ రిఫ్రెష్ పుస్తకంలో సత్య నాదెళ్ల జయసింహ గురించి ప్రస్తావించారు. ఓసారి వాళ్ల తన గదిలో కార్ల్ మాక్స్ పోస్టర్ వేలాడదీశాడని, దీంతో వాళ్లమ్మ వచ్చి లక్ష్మీ దేవి ఫొటోను గోడకు తగిలించిందని చెప్పాడు. దీనికి బదులుగా తను ఇష్టమైన ఆటగాడైన జయసింహ ఫొటోను ఉంచానని చెప్పారు. చిన్నపిల్లాడిలా కనిపించే ఈ హైదరాబాదీ క్రికెటర్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. అతడి స్టయిల్ నాకెంతో నచ్చుతుందన్నారు. | 2sports
|
వర్మా.. నీపెళ్లాం,కూతురు గుడ్డలిప్పి సినిమా తీస్కో..
Highlights
రాంగోపాల్ వర్మపై బీజేపీ మహిళా విభాగం పోలీస్ కంప్లైంట్
పోలీస్ కంప్లైంట్ లో జీఎస్టీ సినిమా తీసిన వర్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
జీఎస్టీ తీసిన వర్మ తన పెళ్లాం బిడ్డల బట్టలిప్పి సినిమాలు తీసుకో అంటూ ఘాటు విమర్శలు
‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ షార్ట్ ఫిల్మ్ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను మంటగలిపేస్తోందని, ఇలాంటి నీచమైన సినిమా తీసిన వర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం నేతలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మకు పిచ్చి పట్టిందని.. అందుకే ఇలాంటి అర్థం పర్థం లేని సినిమాలు తీస్తున్నాడని బీజేపీ మహిళా విభాగం నేతలు విరుచుకుపడ్డారు.
వర్మను భార్య, కూతురు కూడా వెలివేశారని, ఇకనైనా వర్మ పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే వర్మకు తాము పిచ్చి వదిలిస్తామని వారు హెచ్చరించారు. విజయవాడ పరిధిలోని సూర్యపేట పోలిస్ స్టేషన్లో బీజేపీ నేతలు తమ ఫిర్యాదును ఇచ్చారు. వారి ఫిర్యాదును పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలను చేపడతామని పోలీసులు ప్రకటించారు.
అయితే వర్మ ఇలాంటి విమర్శలను, ఫిర్యాదులను లెక్క చేసేట్టుగా లేడు. పోర్న్ చూడటం తప్పే కాదు, పోర్న్ చూడటం వల్ల నష్టం లేదు, అది మానసిక వ్యాధి ఎంతమాత్రమూ కాదు, సరదాగా పోర్న్ చూడవచ్చు.. పోర్న్ స్టార్ అంటే దేవతతో సమానం, అలెగ్జాండర్ కన్నా గొప్ప.. అంటూ వర్మ తన సహజ శైలిలోనే స్పందిస్తున్నాడు.
Last Updated 26, Mar 2018, 12:00 AM IST | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
బ్రెజిల్ ఒలింపిక్స్ కల నెరవేరిన వేళ..
ఒలింపిక్స్లో పసిడి పతకం సాధించాలన్న బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు కల ఎట్టకేలకు నెరవేరింది.
TNN | Updated:
Aug 21, 2016, 01:37PM IST
భారత్లో క్రికెట్ కోసం ఎంతలా పడి చస్తారో.. బ్రెజిల్లో సాకర్ అంటే అదే తరహాలో అభిమానం చూపిస్తారు. అందుకు తగ్గట్టుగానే బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు కూడా ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. కానీ ఒలింపిక్స్లో మాత్రం పసిడి పతకాన్ని ఒడిసి పట్టలేకపోయింది. ఈ లోటు ఆ దేశాన్ని ఎంత కాలంగానో వేధిస్తోంది. అయితే సొంత గడ్డపై జర్మనీతో జరిగిన ఒలింపిక్స్ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్లో బ్రెజిల్ చిరకాల వాంఛ నెరవేరింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో నిర్ణీత సమయం ముగిసే సరికి బ్రెజిల్, జర్మనీ చెరో గోల్ సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. దీంతో ఎక్స్ట్రా టైమ్ తప్పలేదు. అదనపు వ్యవధిలోనూ ఫలితం తేలకపోవడంతో షూటౌట్కు దారి తీసింది. అందులోనూ ఇరు జట్లు తీవ్రంగా పోరాడాయి. షూటౌట్ తొలి నాలుగు రౌండ్లలోనూ ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు గోల్స్ చేశారు. ఈ దశలో చివరి గోల్ కోసం జర్మనీ చేసిన ప్రయత్నాన్ని బ్రెజిల్ గోల్కీపర్ సమర్థవంతంగా తిప్పికొట్టాడు. తర్వాత బ్రెజిల్ ఫుట్బాల్ టీం కెప్టెన్ నెయ్మర్ విజయవంతంగా గోల్ చేయడంతో 5-4 తేడాతో బ్రెజిల్ స్వర్ణ పతకాన్ని సాధించింది. గతంలో మూడుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ను తృటిలో చేజార్చుకున్న బ్రెజిల్ ఈసారి మాత్రం స్వర్ణాన్ని సాధించింది. బ్రెజిల్ సాకర్ జట్టు విజయంతో ఆ దేశ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఓవరాల్గా ఫుట్బాల్లో ఒలింపిక్స్ మెడల్స్ విషయానికి వస్తే బ్రెజిల్ ఖాతాలో ఇప్పటికే ఉన్న మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉండగా.. అదనంగా ఇప్పుడు బంగారు పతకం చేరింది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆస్ట్రేలియా కవ్విస్తే.. భారత్ కూడా రెడీ: కోహ్లీ
ఆస్ట్రేలియా పర్యటనలో ఆట తప్ప.. అనవసర విషయాల జోలికి వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. కానీ.. వాళ్లు కవ్వింపులకి దిగుతూ.. గొడవలకి ప్రయత్నిస్తే..?
Samayam Telugu | Updated:
Nov 15, 2018, 06:05PM IST
ఆస్ట్రేలియా ఆటగాళ్లు కవ్వింపులకి దిగితే తాము కూడా ధీటుగా బదులిస్తామని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా ఈరోజు భారత్ నుంచి బయల్దేరుతున్న నేపథ్యంలో కోహ్లీ పైవ్యాఖ్యలు చేశాడు. ఈ నెల 21న తొలి టీ20 మ్యాచ్తో సుదీర్ఘ సిరీస్ని ఆరంభించనున్న భారత్ వచ్చే ఏడాది జనవరి 18 వరకూ అక్కడే ఉండనుంది.
సుదీర్ఘ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, నాలుగు టెస్టులతో పాటు మూడు వన్డేల్లో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకూ భారత్ జట్టు ఒక్క టెస్టు సిరీస్ని కూడా ఆ గడ్డపై గెలవలేదు. దీంతో.. కనీసం ఈసారైనా.. ఈ నిరీక్షణకి తెరదించాలని భారత్ జట్టు ఆశిస్తోంది.
‘ఆస్ట్రేలియా పర్యటనలో ఆట తప్ప.. అనవసర విషయాల జోలికి వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. కానీ.. వాళ్లు కవ్వింపులకి దిగుతూ.. గొడవలకి ప్రయత్నిస్తే..? మేము కూడా అదే విధంగా బదులిస్తాం. ఇప్పుడు క్రికెట్ పోకడ కూడా అలానే ఉంది. కానీ.. మేము సాధ్యమైనంత వరకూ పర్యటనలో వారికి పోటీనిస్తూ.. ఆటపైనే దృష్టి నిలిపేందుకు ప్రయత్నిస్తాం’ అని కోహ్లీ వెల్లడించాడు.
భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్
భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ | 2sports
|
నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ వీక్ కలెక్షన్స్
Highlights
కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న నేనే రాజు నేనే మంత్రి
తొలి వారం 18.6 కోట్లు సాధించి బ్రేక్ ఈవెన్ కు చేరుకున్న నేనే రాజు నేనే మంత్రి
19 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు టాక్, ఇక వచ్చేది లాభాలే
తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ దశకు చేరుకున్నాయి. వారంతతపు సెలవు, స్వాతంత్ర దినోత్సవం ఇలా వరుస సెలవులతో తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. రానా కెరీర్ లో సోలో హీరోగా ఓపెనింగ్స్ అత్యధికంగా సాధించిన మూవీగా నేనేరాజు నేనేమంత్రి నిలిచింది. నేనే రాజు నేనే మంత్రి తొలి వారం ఏరియా వారీ వసూళ్ల వివరాలు ఇలా వున్నాయి. | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
బాలీవుడ్ సినిమా కాదనుకున్న శృతి
సౌతిండియాతోపాటు బాలీవుడ్పైనా ఫోకస్ చేసిన శృతి ఈమధ్యే ఓ బాలీవుడ్ ప్రాజెక్టుకి యస్ చెప్పినట్లే చెప్పి మళ్లీ నో చెప్పింది.
TNN | Updated:
Sep 11, 2015, 01:35PM IST
తమిళ, తెలుగు సినిమాలతోపాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తున్న శృతిహాసన్ ఈమధ్యే మరో బాలీవుడ్ ప్రాజెక్టుకి యస్ చెప్పినట్లే చెప్పి మళ్లీ నో చెప్పింది. బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టిన శృతి ఈ ప్రాజెక్టు కాదనుకోవడానికి గల కారణాలు వేరే వున్నాయి. మొదట్లో డైరెక్టర్ మిలన్ లుథ్రియా కథ చెప్పినప్పుడు తన క్యారెక్టర్ బాగానే వున్నట్లనిపించిందట ఆమెకి. అయితే కథ మొత్తం సిద్ధం చేసి తీసుకొస్తే, అది చదివిన తర్వాతే సినిమాకి సైన్ చేస్తానని షరతు పెట్టిన శృతికి ఆ కండిషన్ బాగానే కలిసొచ్చింది. ఎందుకంటే ఫుల్ బౌండ్ స్క్రిప్టుతో వచ్చిన మిలన్ చెప్పిన కథ చూస్తే, అందులో తన పాత్ర తీరుతెన్నులు మారిపోయినట్లుగా అనిపించిందట ఆమెకి. మొదట్లో చెప్పిన పాత్రకి, ఇప్పుడు చెబుతున్న పాత్రకి వృత్యాసం వుండటం, అది శృతికి నచ్చకపోవడం వల్లే బాద్షాహో అనే ఈ సినిమాకి నో చెప్పిందని ఆమె సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఇవేం ఫొటోలు.. హీరోయిన్లు మారరా?
గిలుజోసెఫ్ కంటే ముందే కొంత మంది సెలెబ్రిటీ తల్లులు పిల్లలకు పాలిస్తున్న ఫొటోలను స్వయంగా సోషల్ మీడియాలో పెట్టి హల్ చల్ చేశారు.
BCCL | Updated:
Mar 2, 2018, 12:22PM IST
ప్రముఖ మలయాళి నటి, రచయిత, మోడల్ గిలు జోసెఫ్.. ఓ మేగజిన్ కవర్ పేజీ కోసం ఓ బిడ్డకు పాలిస్తూ ఫొటోలకు ఫోజివ్వడం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. బిడ్డకు చనుపాలు ఇవ్వడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే అలా చేయాల్సి వచ్చిందని గిలు జోసెఫ్ సమాధానం ఇచ్చుకుంది. అయితే సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వ్యక్తమయ్యాయి. బిడ్డకు పాలివ్వడాన్ని ఇలా బహిరంగ పర్చడం అభ్యంతరకరంగా ఉందని పలువురు తప్పుపట్టారు.
గిలుజోసెఫ్ కంటే ముందే కొంత మంది సెలెబ్రిటీ తల్లులు పిల్లలకు పాలిస్తున్న ఫొటోలను స్వయంగా సోషల్ మీడియాలో పెట్టి హల్ చల్ చేశారు. | 0business
|
Hyderabad, First Published 15, May 2019, 12:13 PM IST
Highlights
ప్రస్తుతం బుల్లితెరపై అనసూయ, రష్మిలతో పాటు శ్రీముఖి కూడా తనదైన మాటలతో యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది.
ప్రస్తుతం బుల్లితెరపై అనసూయ, రష్మిలతో పాటు శ్రీముఖి కూడా తనదైన మాటలతో యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది. అప్పుడప్పుడు సినిమాల్లో నటించినా ఆశించిన బ్రేక్ మాత్రం రాలేదు. అయితే బుల్లితెర షో 'పటాస్'తో బాగా పాపులర్ అయింది.
ఆ షోలో రాములమ్మగా ఆమె చేసే హడావిడి షోలో ఉండే స్టూడెంట్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది. తన గ్లామరస్ లుక్స్ తో షోకి అందాన్ని తీసుకొస్తుంది. ఈ షో పాపులర్ కావడంతో శ్రీముఖి, రవి హోస్ట్ గా 'పటాస్ 2' కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఆ షోకి శ్రీముఖి దూరం కాబోతుంది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. కొద్దిరోజుల పాటు షోకి బ్రేక్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నిర్వాహకుల అనుమతితోనే బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపింది. తనను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకుఈ విషయం తెలియజేయాలని వీడియో చేసినట్లుగా తెలిపింది.
తనకు ఎంతో ఇష్టమైన షో పటాస్ అని, హృదయానికి చాలా దగ్గరైన షో అని చెబుతూ నిర్మాణ సంస్థ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కి కృతజ్ఞతలు తెలియజేసింది. మరి శ్రీముఖి బ్రేక్ తీసుకుంటుంది కాబట్టి మరే యాంకర్ ని ఈ షో కోసం తీసుకొస్తారో చూడాలి!
To all the lovely people who liked my work in pataas, Ramulamma has a news for you all! I absolutely love the show and it’s very close to my heart! Thanks to Mallemala entertainments, Shyam sir and Deepthi mam! ☺️ #sreemukhi #pataas #pataasramulamma pic.twitter.com/MpvgYL3a7X | 0business
|
నిధుల సమీకరణలో జివికె గ్రూపు!
- విదేశాల్లో విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి
- సంస్థ వైస్ ఛైర్మన్ జి.వి. సంజరు రెడ్డి
న్యూఢిల్లీ : విమానశ్రయాల వ్యాపారంలో పెట్టుబడుల కోసం జివికె పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు సమీకరించే యోచనలో ఉంది. వీటితో ప్రధానంగా ఉన్న అప్పులు చెల్లించాలని భావిస్తున్నామని జివికె గ్రూపు వైస్ ఛైర్మన్ జివి సంజరు రెడ్డి అన్నారు. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ను లిస్టింగ్లోకి తీసుకొచ్చే అంశంపై ఆయన మాట్లాడటానికి నిరాకరించారు. ప్రస్తుతం ఈ గ్రూపు రూ.20,000 కోట్ల అప్పుల భారంలో ఉంది. జివికె ఎయిర్పోర్టు డెవలపర్స్ లిమిటెడ్ను లిస్టింగ్లో తీసుకురావడానికి రూ.3,000 కోట్ల నిధులు సమీకరించనున్నట్లు ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి. 2016 మార్చి 31 నాటికి ముంబయి ఎయిర్పోర్టు నుంచి 4 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని రెడ్డి తెలిపారు. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరంలో 3.64 కోట్ల ప్రయాణికులు నమోదయ్యారు. విదేశాల్లో విమానశ్రయాల అభివృద్ధిపై తమ సంస్థ దృష్టి సారిస్తుందన్నారు. ప్రధానంగా ఇండోనేషియా, ఆఫ్రికా దేశాల్లోని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే ఇండోనేషియాలో రెండు విమానాశ్రయాలను అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం దేశంలో చత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (ముంబయి), కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (బెంగళూరు) విమానశ్రయాలను జివికె అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది. ఈ గ్రూపు ప్రస్తుతం విమానాశ్రయాలు, ఇంధనం, రిసోర్సేస్, రవాణ, హాస్పిటాలిటీ, లైఫ్ సైన్సెస్ రంగాలను వేరు చేయాలనే ఆసక్తితో ఉందని సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 15, Aug 2019, 6:19 PM IST
Highlights
కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ చేసిన తాప్సి ప్రస్తుతం విభిన్న చిత్రాలతో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. తాప్సి నటించిన 'మిషన్ మంగళ్' చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రంలో విద్యా బాలన్, నిత్యామీనన్, తాప్సి, సోనాక్షి సిన్హా కీలక పాత్రల్లో నటించారు.
కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ చేసిన తాప్సి ప్రస్తుతం విభిన్న చిత్రాలతో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. తాప్సి నటించిన 'మిషన్ మంగళ్' చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రంలో విద్యా బాలన్, నిత్యామీనన్, తాప్సి, సోనాక్షి సిన్హా కీలక పాత్రల్లో నటించారు.
తాప్సి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాదాల రాణి కంగనాకు కౌంటర్ ఇచ్చింది. గతంలో కంగనా, ఆమె సోదరి రంగోలి తాప్సిని విమర్శించారు. తన చిత్రాలకు బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ మద్దతు తెలపడం లేదని కంగన ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించినా హీరోయిన్లు ఎవరూ అభినందించలేదని కంగనా ఆరోపించింది.
ఇక రంగోలి ఓ సందర్భంలో మాట్లాడుతూ తాప్సి తన సోదరి కంగనాని కాపీ కొడుతోందని విమర్శించింది. ఈ వ్యాఖ్యలకు తాప్సి తాజాగా కౌంటర్ ఇచ్చింది. మిషన్ మంగళ్ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లం నటించాం. అంటే ఇది కూడా మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రమే. ఈ చిత్రానికి కంగనా ఎందుకు అభినందనలు తెలపలేదు.
కంగనాకు ఉన్న సినిమా నాలెడ్జ్ నాకు లేదు.. కానీ ఇటీవల నేను మంచి చిత్రాల్లో నటించా. అయినా ఆమె స్పందించలేదు అంటూ తాప్సి సెటైర్లు వేసింది. నేను కంగనాని కాపీ కొడుతున్నానని ఆమె సోదరి కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్యలకు తాను చాలా బాధపడ్డా అని తాప్సి తెలిపింది. | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
Ind Vs WI: కోహ్లీ రికార్డుకు రోహిత్ ఎసరు!
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గానూ నిలుస్తాడు. ప్రస్తుత టీ20 సిరీస్లో కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు.
Samayam Telugu | Updated:
Nov 6, 2018, 06:36PM IST
భారత ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ , కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును అదిగమించేందుకు అతి చేరువలో ఉన్నాడు. నిన్నటికి నిన్న పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ అజమ్ విరాట్ వేగవంతమైన వెయ్యి పరుగుల రికార్డును అధిగమించిన మించాడు. నేడు వెస్టిండీస్తో లక్నోలో జరగనున్న 2వ టీ20లో 11 పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లీ టీ20 పరుగులను రోహిత్ అధిగమిస్తాడు. దాంతో పాటు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గానూ నిలుస్తాడు. ప్రస్తుత టీ20 సిరీస్లో కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు.
టీ20ల్లో 62 మ్యాచ్లలో విరాట్ కోహ్లీ 2,102 పరుగులు చేయగా, రోహిత్ 2,092 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 10 పరుగులు చేస్తే కోహ్లీ పరుగులను సమం చేయనున్న రోహిత్.. మరో పరుగు చేస్తే ఛేజింగ్ స్టార్ రికార్డును బ్రేక్ చేస్తాడు. రోహిత్ మాత్రం కోహ్లీకి దాదాపు సమానమైన పరుగులు చేసేందుకు 85 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఐసీసీ టీ20ల్లో రోహిత్ 3 శతకాలు సాధించగా, కోహ్లీ ఖాతాలో ఒక్క సెంచరీ నమోదు కాలేదు.
ఐసీసీ టీ20 ఫార్మాట్లో ఓవరాల్గా మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్) 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, షోయబ్ మాలిక్ (పాకిస్థాన్) 2,171 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మెకల్లమ్ (2,140), కోహ్లీ (2,102), రోహిత్ (2,092) పరుగులతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. | 2sports
|
BSE
ఫెడ్రిజర్వు, కార్పొరేట్ ఫలితాలే కీలకం
ముంబయి, జూలై 24: దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫెడ్రిజర్వు నిర్ణయాలు, దేశీయంగా వెలువడే కార్పొరేట్ ఫలి తాలే కీలకమని తెలుస్తోంది. కార్పొరేట్ ఫలితాలు కొంతమేర ఆశాజనకంగా ఉన్నాయి. వీటికితోడు నైరుతి రుతుపవనాలజోరు, జూలై నెల డెరివేటివ్స్ ముగింపు వంటిఅంశాలు ప్రభావంచూపుతున్నాయి. వచ్చే గురువారం జూలై సిరీస్ ఎఫ్అండ్ఒ కాంట్రా క్టుల గడువు ముగుస్తుంది. దీనితోట్రేడర్లు తమ పొజిషన్లను ఆగస్టు నెల సిరీస్కు బదలాయించు కుంటారు.
దీనివల్ల మార్కెట్లు స్వల్పంగా హెచ్చు తగ్గులకు లోనయ్యే అవకాశాలున్నాయి. రెండు రోజులపాటు అమెరికా ఫెడ్ పాలసీ సమావేశాలు ఈనెల 26వ తేదీ బుధవారం ముగుస్తాయి. ఫెడ్ పాలసీ నిర్ణయాలు కూడా కీలకం అవుతాయని అంచనా. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో, రిలయన్స్ వంటి కంపెనీలు ఫలితాలుప్రకటిస్తే వచ్చే వారం మరికొన్ని బ్లూచిప్ కంపెనీలు ఫలితాలు వెల్లడి స్తాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, అంబూజా, జీ ఎంటర్టైన్మెంట్లు వెల్లడిస్తాయి.
ఈదేబాటలో ఏసియన్పెయింట్స్, యాక్సిస్బ్యాంకు, భారతి ఎయిర్టెల్, హీరోమోటో 25న వెల్లడిస్తాయి. ఎస్ బ్యాంకు 26వతేదీ డాక్టర్రెడ్డీస్, హెచ్సిఎల్టెక్నాల సీజ్, ఐసిఐసిఐ, ఐటిసి, మారుతి కంపెనీలు 27వ తేదీ పనితీరు వెల్లడిస్తాయి. శుక్రవారం ఎల్అండ్టి తొలిత్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నది. జూలై 20వ తేదీవరకూ దీర్ఘకాలిక సగటుకంటే ఒకటిశాతం అధికంగా వర్షపాతం నమోద యింది. నైరుతి రుతుపవనాలు దేశవ్యవ సాయ రంగానికి కీలకంకాగా ఇకపై వర్షపాతవిస్తరణ ను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని అంచనా. ఇవికాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురుధరలు, విదేశీఇన్వెస్టర్లపెట్టుబడులు, డాలరు తో రూపాయి మారకం కదలికలు వంటి అంశాలు మార్కెట్ల సెంటిమెంట్కు బలంగా మారతాయి.
ఇక అంతర్జాతీయంగాచూస్తే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్రిజర్వు పాలసీ నిర్ణయాలు బుధవారం వెలు వడతాయి. ఈఏడాది కనీసంమూడుదశాలు వడ్డీరేట్ల ను పెంచేందుకు ఫెడ్ రిజర్వు లక్ష్యంగా పెట్టుకున్నా పరిస్థితులు అందుకు అనుకూలంగాలేవు. జూన్ పాలసీ సమీక్షలోఫెడ్రిజర్వు ఫండ్రేట్ను 25బేసిస్ పాయింట్లుపెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫండ్స్రేటు1-1.25శాతంగాఉంది.అమెరికా, జపాన్ తయారీరంగ గణాంకాలు సోమవారం విడుదలవు తాయి. గురువారం అమెరికాద్వితీయ త్రైమాసిక జిడిపి తొలిగణాంకాలు వెల్లడిఅవుతాయి. వీటి ఆధారంగానే మార్కెట్లలో ట్రేడిండ్ ఉంటుందని నిపుణుల అంచనా. | 1entertainment
|
Oct 07,2015
మైక్రోసాఫ్ట్ నుంచి లూమియా 640
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ భారత మార్కెట్లోకి లూమియా 640 స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. 4జీకి మద్దతు చేసే ఈ ఫోన్ ధర రూ.17,399గా నిర్ణయించింది. 5.7 అంగుళాల డిస్ప్లే, 13ఎంపీ కెమెరా, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్తో దీన్ని ఆవిష్కరించామని మైక్రోసాఫ్ట్ మొబైల్ డైరెక్టర్ టీిఎస్ శ్రీధర్ పేర్కొన్నారు. డ్యూయల్ సిమ్కు మద్దతు చేసే ఈ స్మార్ట్ఫోన్ను ఫుల్ హెచ్డి డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్3, 1.2గాగాహెడ్జ్ క్వార్డ్కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 400 ప్రాసెసర్తో అభివృద్ధి చేశామన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
డైరెక్టర్ కమిట్మెంట్ అడిగాడు.. బిగ్ బాస్ భామ ఏం చేసిందంటే!
Highlights
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే వ్యవహారం ఈ మధ్య కాలంలో పెను దుమారం రేపింది.
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే వ్యవహారం ఈ మధ్య కాలంలో పెను దుమారం రేపింది. పలువురు తారలు సైతం ఈ విషయంపై స్పందిస్తూ తము ఎదుర్కొన్న సంఘటనలను వివరించారు. బిగ్ బాస్ బ్యూటీ సంజన కూడా గతంలో ఈ విషయంపై స్పందించింది. రెండేళ్ల క్రితం మిస్ హైదరాబాద్ గా ఎంపికైన సంజనా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
హౌస్ లో ఎంటర్ అయినప్పటి నుండి ఆమె చేస్తోన్న వ్యాఖ్యల కారణంగా ఆమెను ఫైర్ బ్రాండ్ అని పిలుస్తున్నారు. ఈమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కొందరిలో కలుగుతోంది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్ చేసింది. మోడలింగ్ తరువాత
సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ డైరెక్టర్ ను కలిసిందట.
అతడి మాటలు తేడాగా అనిపించడంతో జాగ్రత్త పడిందట. ఇండస్ట్రీ గురించి తెలుసు కదా అంటూ ఆమెతో అనుచితంగా మాట్లాడినట్లు తెలిపింది. ఓ రోజు మ్యానేజర్ ద్వారా ఆఫీస్ కు రమ్మని కబురు పెట్టాడట. దీంతో తన అన్నయ్య, అక్కను వెంట పెట్టుకొని వెళ్లడంతో సదరు డైరెక్టర్ కి చాలా కోపం వచ్చి ఆమెపై సీరియస్ అయ్యాడట. తనకు కమిట్మెంట్ ఇస్తే.. ముంబైలో ఫ్లాట్, డబ్బు, సినిమా ఆఫర్లు ఇప్పిస్తానని ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయగా.. అతడి చెంప మీద గట్టిగా కొట్టినట్లు చెప్పుకొచ్చింది సంజనా.
Last Updated 12, Jun 2018, 5:43 PM IST | 0business
|
ఐటీ రంగంలో 14 లక్షల కొలువులు!
- ఉద్యోగాల్లో 46 శాతం వృద్ధికి అవకాశం..
- కొత్త టెక్నాలజీలపైనే అత్యధికంగా జాబ్స్..
- 2027 నాటికి 50 లక్షల మేర కొలువులు
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో భారత ఐటీ రంగంలో దండిగా కొత్త కొలువులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ప్రముఖ ఐటీ సంస్థ సిస్కో, ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్లు కలిసి నిర్వహించిన సంయుక్తం అధ్యయనం ప్రకారం.. 2027 నాటికి కొత్తగా దాదాపు 14 లక్షల ఐటీ కొలువుల అందుబాటులోకి రానున్నట్టుగా తేలింది. ఇది ప్రాథమికంగా ఐటీ కొలువుల్లో 46 శాతం వృద్ధిని సూచిస్తోందని అధ్యయనం తెలిపింది. టెక్నాలజీ సంస్థలు కొత్తగా అందుబాటులోకి వస్తోన్న డిజిటల్ పరివర్తన టూల్స్, సాంకేతీకతలపై ఆసక్తి చూపుతున్నాయని.. ఈ నేపథ్యంలో కొత్త కొలువులు ప్రధామికంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలైన సైబర్ టెక్నాలజీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), బిగ్ డేటాలపైనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని స్టడీ వివరించింది. ఐడీసీ ఇన్ఫోబ్రీఫ్ 'ది 20 మోస్ట్ సిగ్నిఫికెంట్ ఐటీ రోల్స్ యూ షుడ్ కన్సిడర్ ఇన్ ఇండియా' స్టడీలోని ఇతర ప్రధాన విశేషాలు ఇలా ఉన్నాయి..
- రానున్న సంవత్సరాల్లో సోషల్ మీడియా అడ్మినిస్ట్రేటర్, మెషిన్ లర్నింగ్ డిజైనర్, ఐవోటీ డిజైనర్ తదితర కొలువులు ఎక్కుగా డిమాండ్ ఉన్న ఉద్యోగాలుగా అందుబాటులోకి రానున్నాయి.
- 2017 నాటికి భారత్లో ఐటీ రంగపు కొలువుల సంఖ్య 91 లక్షల దరిదాపుల్లో ఉంటే.. అందులో 59 లక్షల కొలువులు కొత్త తరపు టెక్నాలజీలపై ఆధారపడిన కొలువులే కావడం విశేషం.
- 2027 నాటికి ఈ విభాగంలో కొత్తగా 50 లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి.
- డిజిటల్ పరివర్తనల నేపథ్యంలో చాలా పరిశ్రమలు ప్రత్యేక నైపుణ్యతల అవసరం మేరకు ఏక్కడ, ఎలా ఉద్యోగులు వీటిపై పని చేస్తున్నారన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ అవసరాలకు తగ్గ కొలువుల భర్తీ అంత కష్టతరమేమీ కాకపోవచ్చు.
- కంపెనీలు తమ ఉద్యోగుల విజ్ఞానాన్ని, నైపుణ్యతను పెంపొందించేందుకు గాను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తర్ఫీదును అందిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకమైన సర్టిఫికేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
- ప్రస్తుతం ఐటీ కొలువులు నిర్వహిస్తున్న వారిలో ఐదో వంతు మంది తమ సర్టిఫికేషన్ కార్యక్రమాలను తమ సొంత నిధులతో పూర్తి చేసుకుంటున్నారు. 2017 నాటికి ఇప్పుడున్న ఐటీ నిపుణుల్లో దాదాపు 50% మంది ఆయా సర్టిఫికేషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఉన్నారు.
- సర్టిఫికేషన్ కలిగి ఉన్న ఐటీ నిపుణులపై 89% శాతం మంది నియామకపు మేనేజర్లు అత్యున్నతమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
- సర్టిఫికేషన్ పొందిన నిపుణులు అందిస్తున్న సేవల్లో నాణ్యత స్థాయి పెరిగినట్టుగా 88% శాతం మంది వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 12, Sep 2018, 3:35 PM IST
Highlights
ఈ మధ్యకాలంలో విడుదలై ఘన విజయం అందుకున్న సినిమాల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది 'గీత గోవిందం'. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది.
ఈ మధ్యకాలంలో విడుదలై ఘన విజయం అందుకున్న సినిమాల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది 'గీత గోవిందం'. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది. పది కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్ల షేర్ సాధించింది. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులందరూ ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.
అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి వంటి తారలు ఈ సినిమా ప్రమోషన్స్ లో కీలక పాత్ర పోషించారు. కానీ అల్లు శిరీష్ మాత్రం ఈ సినిమాపై ఒక్క కామెంట్ కూడా చేయలేదు. రానా నిర్మించిన 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాని ప్రోత్సహిస్తూ ట్వీట్ చేసిన అల్లు శిరీష్ కి తన తండ్రి నిర్మించిన 'గీత గోవిందం'పై ఒక ట్వీట్ పెట్టడానికి సమయం లేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అల్లు శిరీష్ 'గీత గోవిందం' సక్సెస్ ని జీర్ణించుకోలేకపోతున్నాడని సమాచారం. నిజానికి అల్లు అరవింద్ ఈ కథని శిరీష్ కోసం ఎంపిక చేశారట. కానీ దర్శకుడు పరశురామ్ మాత్రం తనకు మరో హీరో కావాలని విజయ్ దేవరకొండ ఏరికోరి మరీ ఈ ప్రాజెక్ట్ లో భాగం చేశాడు.
సాదాసీదా కథ అయినప్పటికీ విజయ్ కి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా నిలబడిందని అదే అల్లు శిరీష్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని అతడిని విమర్శిస్తూ కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో అల్లు శిరీష్ హర్ట్ అయ్యాడట. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ ని తట్టుకోలేకపోతున్నాడని టాక్.
Last Updated 19, Sep 2018, 9:24 AM IST | 0business
|
విజయ్ సేతుపతి 'జుంగా' ట్రైలర్(వీడియో)
Highlights
విజయ్ సేతుపతి 'జుంగా' ట్రైలర్
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన 'జుంగా' సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కథ ప్రకారం హీరో సినిమాలో కొంత భాగం డాన్ తరహా క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. గోకుల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
షమీ బౌలింగ్.. స్లిప్లో 9 మంది ఫీల్డింగ్
భారత్ దేశవాళీ టోర్నీ రంజీ మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం తాజాగా చోటు చేసుకుంది. రాయ్పూర్ వేదికగా ఛత్తీస్గఢ్,
TNN | Updated:
Oct 18, 2017, 06:13PM IST
భారత్ దేశవాళీ టోర్నీ రంజీ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం తాజాగా చోటు చేసుకుంది. రాయ్‌పూర్ వేదికగా ఛత్తీస్‌గఢ్, బెంగాల్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. స్లిప్‌లో ఏకంగా 9 మంది ఫీల్డర్లని మొహరించి.. బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్ చేస్తుండగా ఛత్తీస్‌గఢ్ బ్యాట్స్‌మెన్ తడబాటుని గమనించిన తివారీ ఈ విధంగా ఫీల్డింగ్‌ని సెట్ చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఈ మ్యాచ్‌లో బెంగాల్ 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
శనివారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌ని 529/7 వద్ద డిక్లేర్ చేయగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఛత్తీస్‌గఢ్ 110 పరుగులకే ఆలౌటైంది. దీంతో 419 పరుగుల ఆధిక్యం లభించడంతో బెంగాల్ జట్టు కెప్టెన్ ఫాలో ఆన్‌ని ఆడించగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆ జట్టు 259 పరుగులకి కుప్పకూలిపోయింది. స్లిప్‌లో ఈ 9 మంది ఫీల్డింగ్ సెటప్ ఛత్తీస్‌గఢ్ రెండో ఇన్నింగ్స్ చివరిలోనే చోటు చేసుకుంది. మహ్మద్ షమీ ఈ ఫొటోని అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సెలక్టర్లూ.. వరల్డ్ కప్ వరకూ ధోనీ పక్కా!
సరిగా ఆడకపోతే.. ధోనీకి జట్టులో చోటు ఇచ్చే విషయమై ఆలోచిస్తామన్న సెలక్టర్లకు ధోనీ తిరుగులేని బదులిచ్చాడు.
TNN | Updated:
Aug 25, 2017, 12:57PM IST
శ్రీలంకపై ఒకే ఒక ఇన్నింగ్స్‌తో ధోనీ విమర్శకుల నోళ్లు మూయించాడు. జట్టుకు తన అవసరమేంటో తన బ్యాటింగ్ ద్వారా చాటి చెప్పాడు. కీలక సమయంలో నిలకడగా ఆడి.. వచ్చే ప్రపంచ కప్ దాకా తనకు జట్టులో స్థానం కల్పించాల్సిన ఆశ్యకతను చాటాడు. లంకతో జరిగిన రెండో వన్డేలో మిగతా ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టగా.. ఇక గెలుపు మీద ఆశలు లేని స్థితిలో భువీతో కలిసి ధోనీ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. రాణించకపోతే ధోనీని జట్టులోకి తీసుకునే విషయమై ఆలోచిస్తామంటూ వన్డే సిరీస్‌కు ముందు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడగా.. ఇప్పుడు తన బ్యాట్‌తో సెలక్టర్లకు దీటైన బదులిచ్చాడు. 131 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో సింగిల్స్ తీస్తూ.. జట్టును విజయ తీరాలకు అందించాడు.
ఈ మ్యాచ్‌లో 68 బంతులు ఆడి 45 పరుగులు చేసిన ధోనీ.. ఒకే ఒక బౌండరీ బాదాడు. కానీ మరో ఎండ్‌లో భువీ కుదురుకునేందుకు తన వంతు ప్రోత్సాహం అందించాడు. భువనేశ్వర్ ఎక్కువ బంతులు ఆడుతున్నా అభ్యంతరం చెప్పని ధోనీ.. పవర్ హిట్టింగ్‌ను పక్కనబెట్టి పరిస్థితులకు అనుగుణంగా సింగిల్స్ తీయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. భువీతో కలిసి 8వ వికెట్‌కు అబేధ్యంగా 100 పరుగులు జోడించాడు.
రెండో వన్డేలో ధోనీ నెమ్మదిగా ఆడి ఉండొచ్చు.. కానీ వన్డేల్లో ఛేజిం‌గ్లో తనకు తానే సాటి అని మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. విజయవంతంగా లక్ష్యాన్ని చేధించిన మ్యాచ్‌ల్లో ధోనీ సగటు 99.16 కావడం విశేషం. ఛేజింగ్ కింగ్ కోహ్లి 97.68 సగటుతో అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఇప్పటి వరకూ ఛేజింగ్‌లో 39సార్లు ధోనీ అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. కడ దాకా క్రీజులో ఉండి జట్టును గెలుపు తీరాలకు చేర్చిన ఆటగాడు ప్రపంచ క్రికెట్లో మరొకరు లేరు. ధోనీ తర్వాతి స్థానంలో జాంటీ రోడ్స్ (33 సార్లు) ఉన్నాడు. ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్లలో ఒకడైన ధోనీ వచ్చే ప్రపంచ కప్ వరకూ జట్టులో ఉంటే.. అతడి అనుభవం, బ్యాటింగ్ నైపుణ్యం జట్టుకు ఎంతగానో ఉపయోపడుతుంది. ఇదే విషయాన్ని ధోనీ అభిమానులు ఇప్పుడు బలంగా ప్రస్తావిస్తున్నారు. ధోనీ విలువేంటో ఇప్పటికైనా సెలక్టర్లకు అర్థమై ఉంటుందా..? | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అద్దం ముందు నిలబడి ఒక్కోటీ విప్పుతూ.. శ్రీరెడ్డి హాట్ బాంబ్
తెలుగు సోషల్ మీడియా హాట్ బాంబ్ శ్రీరెడ్డి మరో హాట్ పిక్ వదిలింది. అద్దం ముందు నిలబడి హాఫ్ న్యూడ్గా తన భారీ ఎద సంపదను విరివిగా ధారబోస్తోంది.
Samayam Telugu | Updated:
Oct 25, 2019, 07:18PM IST
శ్రీరెడ్డి
వివాదాస్పద నటి శ్రీరెడ్డికి విప్పడం.. విప్పితూ ఊరించడం ఆమెకు కొత్తేం కాదు. అర్ధనగ్న ప్రదర్శనలు, మితిమీరి ఎక్స్పోజ్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. తన అందాల ఆరబోతకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ని విరివిగా వాడేస్తూ 6 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ని రాబట్టింది. తన ఫాలోవర్స్కి నయనానందం కలిగించేందుకు మితిమీరి అందాలను ఆరబోస్తుంది. భారీ అందాలను ధారబోస్తుంది.
చూస్కున్నోళ్లకు చూస్కున్నంత అన్నట్టుగా తన భారీ ఎద సంపదను ఎరగా పరిచి అన్ లిమిటెట్ ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. తాజాగా ఆమె హాట్ బాంబ్ లాంటి ఫొటోను షేర్ చేసింది. అద్దం ముందు నిలబడి.. షర్ట్ను పైకి లేపి మరీ ఎద సంపదను విరివిగా వడ్డిస్తోంది. మైకంతో తేలిపోతూ నడుమ ఒంపుల్ని వయ్యారంగా ఒలకబోస్తూ సెల్ఫీ ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో వదిలింది.
మరో ఫొటోలో ఎద బాగాన్ని కనిపించేలా ఉంచి నాలుక బయట పెట్టి రెచ్చ తనస్టైల్లో కామెంట్ పెట్టింది. ఇక తాను డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోకు రాయడానికి వీలులేని పచ్చిబూతుని కామెంట్గా జత చేసింది శ్రీరెడ్డి . అది చూడాలంటే ఆమె ఫేస్ బుక్ ఖాతాకు వెళ్లాల్సిందే. | 0business
|
Apr 21,2016
విప్రో క్యూ4 లాభాలు రూ.2,240 కోట్లు
ముంబయి : దేశంలోనే మూడో అతిపెద్ద ఐటి సేవల కంపెనీ విప్రో 2016 మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.2,235 కోట్ల నికర లాభాలు నమోదు చేసుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇదే స్థాయిలో లాభాలు ఆర్జించింది. గత క్యూ4లో విప్రో రెవెన్యూ 14 శాతం పెరిగి రూ.12,800 కోట్లకు చేరింది. డాలర్ రూపంలో 2.7 శాతం వృద్ధితో 1887.6 మిలియన్ డాలర్ల రెవెన్యూ నమోదయ్యింది.క్రితం ఆర్ధిక సంవత్సరంలో మొత్తంగా 3 శాతం వృద్ధితో రూ.8890 కోట్ల నికర లాభాలు సాధించింది. రెవెన్యూ 9 శాతం పెరిగి రూ.51,240 కోట్లకు చేరింది. షేర్ల బైబ్యాక్లో భాగంగా ప్రతిషేర్కు రూ.625 చెల్లించి రూ.2500 కోట్ల షేర్లను వెనక్కి తీసుకోవడానికి విప్రో బోర్డు ఆమోదం తెలిపింది. బుధవారం బిఎస్ఇలో విప్రో షేర్ 2 శాతం పెరిగి రూ.601 వద్ద ముగిసింది. జూన్ త్రైమాసికంలో 1,901 బిలియన్ డాలర్ల రెవెన్యూ అంచనా వేస్తోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 1.88 బిలియన్ డాలర్ల రెవెన్యూ నమోదు చేసుకుంది. సమీకృత సేవలు, హైపర్ ఆటోమేషన్ విభాగాల వృద్ధిపై తాము ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నామని విప్రో సిఇఒ అబిదాలి నీముచ్వాలా తెలిపారు. డిజిటల్ అండ్ కన్సల్టెంగ్పై పెట్టుబడులు చేస్తామన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
sandhya 338 Views bangladesh VS srilanka , bristol stadium , rain fall , toss delay
bristol stadium
బ్రిస్టల్: ప్రపంచకప్లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన బంగ్లాదేశ్ శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమయ్యేట్లు ఉంది. ప్రస్తుతం మైదానంలో వర్షం కురుస్తున్నందున అంపైర్లు టాస్ను నిలిపివేశారు. సుమారు గంట తర్వాత పరిస్థితి సమీక్షించి టాస్ వేసే అవకాశం ఉంది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/ | 2sports
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి | 1entertainment
|
కొనసాగిన జీఎస్టీ జోరు..
- 170 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబయి: ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీి బిల్లుకు ఆమోదం లభించనుందన్న అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా పరుగులు పెట్టాయి. ఈ బిల్లు కోసం ప్రతిపక్షాలను అధికారపక్షం ఒప్పించనుందన్న వార్త మదుపరుల్ల్లో విశ్వాసం నింపింది. దీంతో వారు భారీగా కొనుగోళ్లు జరిపారు. ఫలితంగా సెన్సెక్స్ 169.57 పాయింట్లు పెరిగి 26,128.20 పాయింట్లకు ఎగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 58.9 పాయింట్లు రాణించి 7,942.70 వద్ద స్థిరపడింది. జీఎస్టీి బిల్లుపై నమ్మకం నేపథ్యంలో కిందటి సెషన్లో సెన్సెక్స్ 182.89 పాయింట్లు రాణించింది. రంగాల వారిగా బ్యాంకింగ్ 1.86 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.53 శాతం, పీిఎస్యు 0.91 శాతం, ఐటీ 0.74 శాతం చొప్పున పెరిగాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 360 Views
హైదరాబాద్ : తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాలకు సంబంధించి దేశీయ మొబైల్ కంపెనీ లావా అగ్రస్థానంలో ఉందని, మొత్తం రాబడుల పరంగా కూడా 2015లో 74శాతం సాధించినట్లు కంపెనీ సీనియర్ వైస్ప్రెసిడెంట్ సందీప్ డాంగ్రే వెల్లడించారు. వచ్చే మూడునెలల్లో ప్రస్తుతం ఉన్న నాలుగువేల ఔట్లెట్లనుంచి 7100 ఔట్లెట్లకు విస్తరించనున్నట్లు తెలిపారు. కంపెనీ ఇప్పటికే తిరు పతిలో 500కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిందన్నారు. ఉత్పత్తిపరంగా ఈరెండు రాష్ట్రాలు తమకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. 2017 నాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు కొనసాగిస్తామని నెలకు ఐదు మిలియన్ల ఫోన్లను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగ ఆపెట్టుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమకు 20 ఎకరాలస్థలం కేటాయించిందన్నారు. 2015లో రాబ డులు 104శాతం పెరిగాయని, స్మార్ఫోన్ల విక్రయం లో మార్కెట్ వాటా 9.5శాతం పెరిగిందన్నారు. రెండురాస్ట్రాల్లో నంబవర్వన్ బ్రాండ్గా మారింద న్నారు. రిటైల్ ఔట్లెట్లలో 150శాతం వృద్ధిఉందన్నా రు. మొత్తం 4067వరకూ ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు తెలుగురాష్ట్రాల్లో మొత్తం 70కిపైగా సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసామని తెలిపారు. | 1entertainment
|
india vs sri lanka, 1st test: sri lanka lose three after brisk start
వరసగా మూడు వికెట్లు.. లంకదే పైచేయి!
బంతితో విజృంభించి భారత్ను 172కే కట్టడి చేసిన శ్రీలంక.. బ్యాటింగ్లోనూ రాణించి మెరుగైన స్థితిలో నిలిచింది.
TNN | Updated:
Nov 19, 2017, 11:05AM IST
బంతితో విజృంభించి భారత్‌ను 172కే కట్టడి చేసిన శ్రీలంక.. బ్యాటింగ్‌లోనూ రాణించి మెరుగైన స్థితిలో నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టుకు తొలి రెండు వరణుడు ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. అయితే మూడో రోజు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ సాగింది. భారత్‌ను 172 పరుగులకు ఆలౌట్ చేసిన లంక.. మూడో రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. మాథ్యూస్(52), తిరిమానె(51) శ్రీలంకను పటిష్ఠ స్థితిలో నిలబెట్టారు. దీంతో
ఇక 165/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన లంకను కెప్టెన్ దినేశ్ చండిమల్ (28), డిక్‌వెల్లా (35) భారీ స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకుంటున్న సమయంలో భారత బౌలర్లు షాకిచ్చారు. వరసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి లంకను ఇబ్బందుల్లోకి నెట్టారు. అయితే అప్పటికే లంక స్కోరు 200 దాటింది. ఆట 53వ ఓవర్లో మహమ్మద్ షమీ విసిరిన ఓ మంచి బంతికి డిక్‌వెల్లా ఔటయ్యాడు. సెకండ్ స్లిప్‌లో ఉన్న కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. | 2sports
|
హిమాచల్ లో పూరీ తెరకెక్కిస్తున్న మెహబూబా వర్కింగ్ స్టిల్స్
First Published 11, Oct 2017, 12:40 PM IST
హిమాచల్ లో పూరీ తెరకెక్కిస్తున్న మెహబూబా వర్కింగ్ స్టిల్స్
హిమాచల్ లో పూరీ తెరకెక్కిస్తున్న మెహబూబా వర్కింగ్ స్టిల్స్
హిమాచల్ లో పూరీ తెరకెక్కిస్తున్న మెహబూబా వర్కింగ్ స్టిల్స్
హిమాచల్ లో పూరీ తెరకెక్కిస్తున్న మెహబూబా వర్కింగ్ స్టిల్స్
హిమాచల్ లో పూరీ తెరకెక్కిస్తున్న మెహబూబా వర్కింగ్ స్టిల్స్
హిమాచల్ లో పూరీ తెరకెక్కిస్తున్న మెహబూబా వర్కింగ్ స్టిల్స్
హిమాచల్ లో పూరీ తెరకెక్కిస్తున్న మెహబూబా వర్కింగ్ స్టిల్స్
Recent Stories | 0business
|
Kane Williamson: Bhuvneshwar Kumar, Jasprit Bumrah most consistent bowlers in world cricket
భారత్ బౌలింగ్ దాడే.. ఓ వ్యూహం
భారత్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వరుస తప్పిదాలతోనే తాము మ్యాచ్ని చేజార్చుకున్నట్లు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్
TNN | Updated:
Nov 2, 2017, 06:57PM IST
భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వరుస తప్పిదాలతోనే తాము మ్యాచ్‌ని చేజార్చుకున్నట్లు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ కివీస్ విఫలమైందని.. అనుభవం ఉన్న క్రికెటర్లు కూడా ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని విలియమ్సన్ అసహనం వ్యక్తం చేశాడు. భారత్‌ లాంటి కఠిన ప్రత్యర్థిని టీ20ల్లో ఎదుర్కొనేటప్పుడు మెరుగైన ప్రదర్శన చేయాలని.. ఒకవేళ విఫలమైతే ఫలితాలు ఎలా ఉంటాయో మరోసారి తెలిసొచ్చిందన్నాడు.
‘భారత్ బౌలింగ్ విభాగం భువనేశ్వర్, జస్‌ప్రీత్ బుమ్రాతో చాలా పటిష్ఠంగా ఉంది. వారు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో మ్యాచ్ గమనానికి అనుగుణంగా బంతులు విసురుతున్నారు. దీంతో టీమిండియా బౌలింగ్ దాడి వ్యూహం ప్రకారం సాగుతోంది. భువీ, బుమ్రాల బౌలింగ్ శైలిని ఈ సిరీస్‌లోనే కాదు.. ఐపీఎల్‌లో కూడా నేను గమనించాను. ప్రపంచ క్రికెట్‌లోనే ఈ జోడి చాలా స్థిరంగా ఎదుగుతోంది’ అని విలియమ్సన్ ప్రశంసించాడు. రెండో టీ20 మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా శనివారం జరగనుంది. | 2sports
|
Hyderabad, First Published 3, Nov 2018, 9:28 AM IST
Highlights
గత కొద్ది రోజులుగా దక్షిణాదిన హాట్ టాపిక్ గా నడిచిన విజయ్ ‘సర్కార్’ సినిమా వివాదం రెండు రోజుల క్రితమే ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే.
గత కొద్ది రోజులుగా దక్షిణాదిన హాట్ టాపిక్ గా నడిచిన విజయ్ ‘సర్కార్’ సినిమా వివాదం రెండు రోజుల క్రితమే ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. అంతా చల్లారింది అనుకున్న టైమ్ లో ఆ వివాదం కొత్త మలుపు తిరిగింది. దక్షిణ భారత చలనచిత్ర రచయితల సంఘం అధ్యక్షుడు గా ఈ కథపై మాట్లాడిన ప్రమఖ దర్శక,రచయిత కె.భాగ్యరాజ్ మెడకు చుట్టుకుంది. ఆయన కథ ని లీక్ చేసారంటూ విమర్శలు వచ్చాయి. దాంతో క్షమాపణ చెప్పి ఆ పదవికి రాజీనామా చేశారు.
మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘సర్కార్’ సినిమా కథ విషయంలో భాగ్యరాజా విమర్శలు ఎదుర్కొన్నారు. ‘సర్కార్’ కథకు, రచయిత వరుణ్ రాజేంద్రన్ కథకు పోలికలున్నాయని భాగ్యరాజా స్టేట్మెంట్ ఇవ్వటమే సమస్యగా మారింది. 'సర్కార్' సినిమా కథ, 'సెంగోల్' కథ ఒకటేనని ఆ చిత్రం స్టోరీని మీడియా ముందు చెప్పాడు. సినిమా కథను బయటకు చెప్పడంపై ఆ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ క్షమాపణ కోరింది. ఈ సందర్భంగా భాగ్యరాజ్ క్షమాపణలు చెప్పారు. తాజాగా ఎస్ఐడబ్ల్యూఏ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఈ విషయమై పలురకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నాననీ, అందుకే అధ్యక్ష పదవి నుంచి పక్కకు తపుకుంటున్నాననీ ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘‘సంఘం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పలు విషయాలను నేను వ్యక్తం చేయడం లేదు. ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడమే నాపై ఒత్తిడి పెరగడానికి కారణం అనుకుంటున్నా. భవిష్యత్తుల్లో స్వచ్ఛందంగా పోటీ చేసి గెలుస్తా. ది బెస్ట్ అనేలా పని చేస్తా’’ అని భాగ్యరాజ్ చెప్పారు.
సర్కార్ సినిమా ప్రభావంతేనే భాగ్యరాజ్ రాజీనామా చేసాడనే విషయం కొట్టిపారేసారు. ఆయన మాట్లాడుతూ రాజీనామా అనేది తన వ్యక్తిగత నిర్ణయమని, సర్కార్ సినిమా వివాదంతో దీనికి సంబంధం లేదని, నిరాధారమైన ఆరోపణలు ఆపండి అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి.. | 0business
|
CIGERIES
రికవరీదిశగా సిగరెట్ కంపెనీల షేర్లు
న్యూఢిల్లీ,జూలై 20: పొగాకు ఉత్పత్తులపరంగా దిగజారిన కంపెనీలషేర్లు బుధవారం కోలుకున్నాయి. తాజా ట్రేడింగ్లో మూడుశాతానికి పెరిగినట్లు అంచనా. ఐటిసి సానుకూలంగా ట్రేడింగ్ప్రారంభించి 2.56శాతం పెరిగి 291.90రూపాయ లకు బిఎస్ఇలో చేరింది. విలువలపరంగా 14.98 లక్షల షేర్లు కంపెనీలోట్రేడ్ అయ్యాయి. ఎన్ఎస్ఇలో ఉదయం పూట ట్రేడింగ్లోనే రెండుకోట్లకుపైగా షేర్లు ఎన్ఎస్ఇలో చేతులుమారాయి. గాడ్ఫ్రేఫిలిప్స్ కంపెనీషేర్లు 2.62శాతం పెరిగి 1188 రూపాయలకు పెరిగాయి. విఎస్టి ఇండస్ట్రీస్ కూడా 1.60శాతంపెరిగి 3334.45 రూపా యలకు చేరాయి. పొగాకు కంపెనీల షేర్లు ముందురోజు భారీగా దెబ్బతిన్నాయి. ఐటిసి 15శాతం దిగజారింది.
జిఎస్టి మండలి సిగరెట్లపై సెస్ పెంచడంతోనే ఒక్కసారిగా షేర్లు కుప్పకూలాయి. తర్వా త 12.63శాతం వద్ద నష్టాలను కట్టడిచేసి 284.60 రూపాయల వద్ద ట్రేడింగ్ కొనసాగించింది. సిగ రెట్ కంపెనీల స్టాక్స్ సోమవారం ట్రేడింగ్లో కూడా దిగజారాయి. జిఎస్టి మండలిపరంగా సిగ రెట్లపై సెస్ను పెంచడం వల్ల సాలీనా ఐదువేల కోట్లు ఉత్పత్తిదారులకు అదనపు భారం పడుతుందని తేలింది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ శతకాల మోత.. లంక టార్గెట్ 376
శ్రీలంక బౌలర్లకి వారి సొంతగడ్డపైనే మరోసారి భారత బ్యాట్స్మెన్లు చుక్కలు చూపించారు. కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న
TNN | Updated:
Aug 31, 2017, 06:38PM IST
శ్రీలంక బౌలర్లకి వారి సొంతగడ్డపైనే మరోసారి భారత బ్యాట్స్‌మెన్లు చుక్కలు చూపించారు. కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి ( 131: 96 బంతుల్లో 17x4, 2x6), రోహిత్ శర్మ (104: 88 బంతుల్లో 11x4, 3x6) శతకాల మోత మోగించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (4) విఫలమైనా.. రోహిత్ శర్మతో కలిసి కోహ్లి టీ20 తరహా ఆటతో రెండో వికెట్‌కి అభేద్యంగా 221 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా భారీ స్కోరుకి బాటలు వేసుకుంది. మధ్యలో హార్దిక్ పాండ్య (19), లోకేశ్ రాహుల్ (7) తడబడినా చివర్లో మనీశ్ పాండే (50 నాటౌట్: 42 బంతుల్లో 4x4), మహేంద్రసింగ్ ధోని (49 నాటౌట్: 42 బంతుల్లో 5x4, 1x6) మెరుపులు మెరిపించడంతో భారత్ 375 పరుగుల సురక్షిత స్కోరు‌‌తో లంకేయులకి సవాల్ విసిరింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్‌లో సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్న శిఖర్ ధావన్ ఆదిలోనే ఔటైనా.. రోహిత్, కోహ్లి జోడి లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఎడాపెడా బౌండరీలు బాదేసింది. భారత జట్టులో ఐదుగురు మాత్రమే బౌలర్లు ఉండటంతో వీలైనంత ఎక్కువ స్కోరు బోర్డుపై ఉంచాలనే లక్ష్యంతో ఆడిన ఈ జోడి ఓవర్‌‌కి కనీసం ఒక బౌండరీ చొప్పున బాదుతూ వచ్చింది. దీంతో ఏ దశలోనూ భారత్ రన్‌రేట్ 7కి తగ్గలేదు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి కెరీర్‌లో 29వ శతకం పూర్తిచేసుకోగా.. కొద్దిసేపటికే రోహిత్ శర్మ కూడా 13వ శతకాన్ని అందుకున్నాడు. అయితే ఐదు ఓవర్ల వ్యవధిలోనే ఈ ఇద్దరూ ఔటైనా.. అప్పటికే భారత్‌ సురక్షిత స్థితిలో నిలిచింది. చివర్లో ధోనీ, మనీశ్ పాండే విలువైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ రెండు, మలింగ, విశ్వ, ధనంజయ ఒక వికెట్ తీశారు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
2జీ కేసు: నష్టపరిహారం కోరనున్న వీడియోకాన్
2 జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రెండు రోజుల కిందట తీర్పును వెలువరించి, నిందితులంతా నిర్దోషులేనని తేల్చిన విషయం తెలిసిందే.
TNN | Updated:
Dec 24, 2017, 10:31AM IST
2 జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రెండు రోజుల కిందట తీర్పును వెలువరించి, నిందితులంతా నిర్దోషులేనని తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ సంస్థ ఆరోపణలు ఎదుర్కొంది. ఆ సంస్థ కూడా నిర్దోషిగా బయటపడటంతో నూతనోత్సాహం చోటుచేసుకుంది. తమను అనవసరంగా ఇరికించారని, తమ తప్పులేదని తెలిసినా స్పెక్ట్రమ్ లైసెన్స్‌ను రద్దు చేసినందుకు ప్రతిగా నష్టపరిహారం కోరేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం నుంచి రూ. 10 వేలు కోట్లు ఇప్పించాల్సిందిగా త్వరలోనే కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది.ప్రభుత్వ నిర్ణయంతో తమకు రూ.10 వేల కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని, ఆ మొత్తానికి నష్టపరిహారం పొందాలని యోచిస్తున్నట్టు వీడియోకాన్ సంస్థ సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారి తెలిపారు.
తమవైపు నుంచి ఎలాంటి తప్పు లేకుండానే రూ.25 వేల కోట్ల వరకు నష్టపోయామని, తాజా తీర్పుతో ఊరట లభించిందని పేర్కొన్న ఆయన ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం కోరుతామని తెలిపారు. 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో రూ.1.76 లక్షల కోట్లు మేర ప్రభుత్వానికి నష్టం జరిగిందని నవంబరు 2010లో కాగ్ నివేదిక పేర్కొంది. మరోవైపు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కూడా స్పెక్ట్రం కేటాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2, 2012 న సుప్రీంకోర్టు 122 టెలికం సంస్థల లైసెన్స్‌లను రద్దు చేసింది. వీటిలో వీడియోకాన్‌కు చెందిన 21 లైసెన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాదు 15 లైసెన్సుల కోసం రూ. 1,500 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
తొలి రౌండ్లోనే పేస్, బోపన్న ఔట్
రియో ఒలింపిక్స్ లో భారత టెన్నిస్ ధ్వజం లియాండర్ పేస్, రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ లో తొలి మ్యాచ్ లోనే నిరాశపరిచింది.
TNN | Updated:
Aug 7, 2016, 02:10AM IST
X
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ...
రియో ఒలింపిక్స్ లో భారత టెన్నిస్ ధ్వజం లియాండర్ పేస్, రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ లో తొలి మ్యాచ్ లోనే నిరాశపరిచింది. పోలెండ్ జంట మార్సిన్ మట్కోస్కీ-లూకాస్ కుబోట్ చేతిలో 4-6, 6-7 తేడాతో వీరు ఓటమి పాలయ్యారు. కాగా వీరిద్దరి మధ్య సమన్వయలోపం కారణంగానే ఆటపై దృష్టిపెట్టకపోవడంతో తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యారని స్పష్టంగా తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయకపోవడం గమనార్హం. ఇద్దరు మధ్య సమన్వయం లేదని ముందే తెలిసినా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయానికి ఎదురుదెబ్బే తగిలింది. రూమ్ విషయంలో ఒలింపిక్ క్రీడా గ్రామంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం కూడా జరిగింది. | 2sports
|
Hyderabad, First Published 24, Oct 2018, 7:19 PM IST
Highlights
మీటూ వివాదం సోషల్ మీడియాలో రోజుకో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. ఎవరో ఒకరు వారికి జరిగిన చేదు అనుభవాలను బయటపెడుతుండగా ఇతరులు వారికి మద్దతుగా నిలుస్తున్నారు.
మీటూ వివాదం సోషల్ మీడియాలో రోజుకో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. ఎవరో ఒకరు వారికి జరిగిన చేదు అనుభవాలను బయటపెడుతుండగా ఇతరులు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. రీసెంట్ గా అమలాపాల్ లీనా చేసిన వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తూ తాను కూడా అలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుపడం వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
అమలా పాల్ రీసెంట్ గా చేసిన ట్వీట్ లో డైరెక్టర్ సుసి గణేషన్ నుంచి ఎదురైనా లైంగిక వేధింపుల గురించి వివరించింది. తిరుటుపాయలే 2 చిత్రంలో నేను ఈ దర్శకుడిని నుంచి కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. చేడు అర్ధం వచ్చేలా మాట్లాడేవాడు. అవసరం లేకపోయినా కావాలని అవకాశాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేసేవాడు. లీనా అతని నుంచి ఎలాంటి వేధింపులను ఎదుర్కొందో నేను అర్ధం చేసుకోగలను.
ఆమె దైర్యంగా బయటకు చెప్పినందుకు అభినందిస్తున్నా.ఆ విధంగా వేదించే వారు. ఇంట్లో వారిని చాలా బాగా చూసుకుంటారు గాని బయట మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని అమల పాల్ వివరించింది. అదే విధంగా సుసి గణేషన్ పై ఆరోపణలు చేయగానే తనకు అతని భార్య నుండి ఫోన్ వచ్చిందని చెబుతూ.. ఆమె ఇష్టం వచ్చినట్లుగా తీడుతున్నారు. జరిగిన విషయాన్నీ చెప్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వినకుండా తిట్టారు. ఇది ఒక షాకింగ్ విషయమని అమలాపాల్ పేర్కొంది.
Last Updated 24, Oct 2018, 7:19 PM IST | 0business
|
అజ్ఞాతంలో కోలీవుడ్ స్టార్ కమెడియన్
Highlights
అజ్ఞాతంలో కోలీవుడ్ స్టార్ కమెడియన్ గా వెలుగొందుతున్న సంతానం
ఓ డీల్ లో సంబంధాలు చెడిపోవడంతో ఫైటింగ్
కొట్లాటలో ప్రత్యర్థులకు గాయాలు కావటంతో పోలీసు కేసు
తమిళ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ కమేడియన్ గా ఒక వెలుగు వెలిగిన సంతానం ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నాడు. ఒకానొక టైం లో హీరో స్థాయి కి కూడా వెళ్ళిన సంతానం అనుకోని పరిస్థితి లో ఇప్పుడు అజ్ఞాతం లోకి వెళ్ళడం షాకింగ్ గా మారింది. సినిమా నటులు తాము సంవత్సరాల పాటు సంపాదించిన ఆదాయంతో ఇతర రంగాలలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు.
అలాగే సంతానం కూడా ఒక కాంట్రాక్టర్ తో కలిసి కుంద్రత్తూర్ సమీపంలోని కోవూర్ ప్రాంతంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందులో తన భాగం మొత్తానికి సంబంధించి డబ్బుని నిర్మాణం కంటే ముందరే ఆయనకి ఇచ్చేసాడు. నిర్మాణం టై లో అభిప్రాయ బేధాల కారణంగా ఆయన వైదొలిగాడు. కాంట్రాక్టర్ కొంత డబ్బు సంతానంకి ఇచ్చేసాడు కూడా. మిగితా మొత్తం కోసం ఎప్పటి నుంచో సంతానం అతని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అదే నేపథ్యంలో తన మేనేజర్ తో కలిసి సంతానం అతని ఆఫీస్ కి వెళ్ళాడు.
ఈ సమయంలో అక్కడ సదరు భాగస్వామి షణ్ముగసుందరంతో పాటు, ఆయన మిత్రుడు, స్థానిక బీజేపీ నాయకుడైన న్యాయవాది ప్రేమానంద్ కూడా అక్కడే ఉన్నారు. వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి, ఘర్షణకు దారితీసింది. ఆ గొడవలో ముగ్గురూ గాయపడ్డారు. ఆ టైంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సంతానం చికిత్స కూడా పొందాడు, అదే ఆసుపత్రి లో షణ్ముగ సుందరం కూడా జాయిన్ అయ్యాడు.
ఇంతలో ప్రేమానంద్ గాయపడ్డాడని తెలుసుకున్న కార్యకర్తలు, ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు నమోదు చేసి స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. పోలీసులు సంతానం మీద మూడు సెక్షన్ లపై కేసు నమోదు చేసారు. దీంతో సంతానం అజ్ఞాతం లోకి వెళ్ళిపోయారు. ఆయన దొరకగానే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.
Last Updated 25, Mar 2018, 11:40 PM IST | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓటీపీ చెబితే ట్రైన్ టికెట్ డబ్బులు వెనక్కి!
ట్రైన్ జర్నీ చేసే వారికి మరో శుభవార్త అందింది. ఇండియన్ రైల్వేస్ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓటీపీ ఆధారిత రిఫండ్ వ్యవస్థను అమలు చేసింది. దీంతో ప్రయాణికులకు సులభంగానే రిఫండ్ మొత్తం వస్తుంది.
Samayam Telugu | Updated:
Oct 30, 2019, 09:22AM IST
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓటీపీ చెబితే ట్రైన్ టికెట్ డబ్బులు వెనక్కి!
హైలైట్స్
ఓటీపీ ఆధారిత రిఫండ్ సిస్టమ్ను అమలులోకి తెచ్చిన ఐఆర్సీటీసీ
ఇది కేవలం ఐఆర్సీటీసీ అధికారిక ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకే వర్తిస్తుంది
ఈ విధానంలో టికెట్లు క్యాన్సల్ చేసుకుంటే మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది
దీన్ని చెబితే టికెట్ డబ్బులు వెనక్కు వస్తాయి
రైల్వే ప్రయాణికులకు తీపికబురు అందింది. పీయూష్ గోయెల్ సారథ్యంలోని ఇండియాన్ రైల్వేస్, ఐఆర్సీటీసీ కొత్త ఓటీపీ ఆధారిత రిఫండ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నప్పుడు రిఫండ్ మొత్తాన్ని సులభంగా, త్వరితగతిన ప్రయాణాకులకు అందించడం లక్ష్యంగా ఇండియన్ రైల్వేస్ ఈ వ్యవస్థను ఆవిష్కరించింది.
ఐఆర్సీటీసీ కొత్త రిఫండ్ సిస్టమ్ ఐఆర్సీటీసీ అధికారిక ఏజెంట్లకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ విధానంలో రైల్వే ప్రయాణికుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. | 1entertainment
|
Hyderabad, First Published 1, Apr 2019, 5:28 PM IST
Highlights
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్స్ తో దాదాపు అన్ని తన సినిమాలపై అంచనాలను పెంచాడు. ఇక ఇప్పుడు అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అన్న బాటలోనే ప్రయాణాన్ని మొదలెట్టాడు. ఎందుకంటే ఆనంద్ మొదటి సినిమాలో లిప్ లాక్ డోస్ గట్టిగానే ఉంటుందట.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్స్ తో దాదాపు అన్ని తన సినిమాలపై అంచనాలను పెంచాడు. ఇక ఇప్పుడు అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అన్న బాటలోనే ప్రయాణాన్ని మొదలెట్టాడు. ఎందుకంటే ఆనంద్ మొదటి సినిమాలో లిప్ లాక్ డోస్ గట్టిగానే ఉంటుందట.
దొరసాని అనే సినిమా ద్వారా ఈ కుర్ర హీరో కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు కూడా ఇది మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇక డియర్ కామ్రేడ్ సినిమా టీజర్ తో రీసెంట్ గా విజయ్ దేవరకొండ లిప్ లాక్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసాడు.
ఇప్పుడు తమ్ముడు కూడా అదే రేంజ్ లో టీజర్ తో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. నిజ జీవితాల ఆధారంగా దొరసాని సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల పోస్టర్ తో క్లారిటీ ఇచ్చింది. మరి దేవరకొండ బ్రదర్ ఏ రేంజ్ లో క్లిక్కవుతాడో చూడాలి.
Last Updated 1, Apr 2019, 5:28 PM IST | 0business
|
Visit Site
Recommended byColombia
‘దేశవాళీ క్రికెట్లో అత్యద్భుతంగా రాణించినా.. మయాంక్ అగర్వాల్ని దురదృష్టం వెంటాడుతోంది. వెస్టిండీస్తో సిరీస్కి అతను ఎంపికైనా టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టులో చోటివ్వలేదు. దీంతో.. అతనికి నిరూపించుకునేందుకు అవకాశమే లేకపోయింది. తాజాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కి అతడ్ని జట్టు నుంచే తప్పించారు. ఒకవేళ మురళీ విజయ్ మెరుగైన ఆటగాడని సెలక్టర్లు భావిస్తే.. ఇంగ్లాండ్తో సిరీస్ తర్వాత్ అతడ్ని టెస్టు జట్టు నుంచి ఎందుకు తప్పించారు..? ఇప్పుడు మళ్లీ జట్టులోకి ఎందుకు తీసుకున్నారు. మీ నిలకడలేని ఆలోచనల కారణంగా యువ క్రికెటర్కి జట్టులో స్థానం పోయింది. ఇలా చేస్తే.. వారి మానసిక స్థైర్యం దెబ్బతిందా..? జట్టు ఎంపికలో సెలక్టర్లకి క్లారిటీ ఉండాలి. అంతేకాని.. ఇలా ఆటగాళ్లతో కుర్చీలాట ఆడకూడదు’ అని గంభీర్ సూచించాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 6 నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. మొత్తం నాలుగు టెస్టులు ఆ గడ్డపై జరగనున్నాయి.
టెస్టు సిరీస్ కోసం ఇటీవల భారత సెలక్టర్లు ప్రకటించిన జట్టు ఇదే..!
భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ | 2sports
|
internet vaartha 192 Views
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీ రెండురోజుల నుంచి లాభాల దిశగా నిఫ్టీలో ర్యాలీ తీస్తోంది. వరుసగా రెండోరోజు ఏడుశాతం ఎక్ఛేంజిల్లో పెరుగుతున్నట్లు అంచనాలు వేస్తున్నారు కెనరా బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులు ఐదు శాతం కంటే ఎక్కువ పెరిగి ట్రేడింగ్ జరిగింది. భారతీయ స్టేట్బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూని యన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, పంజాబ్నేషనల్ బ్యాం కులు 3-4శాతం చొప్పున క్షీణించాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల సూచీనిఫ్టీలో ఇతర సూచీల న్నింటికంటే నాలుగుశాతం పెరిగి 2293 పాయింట్లవద్ద నిలిచింది. గడచిన రెండు ట్రేడింగ్లలో ప్రభుత్వరంగ సూచీ 7.9 శాతం పెరిగింది. బెంచ్మార్క్ సూచీని చూస్తే 1.2శాతం పెరిగినట్లయింది. ప్రభుత్వరంగ సూచీలను పరిశీలిస్తే ప్రభు త్వం దేశీయ ఉక్కురంగం అమ్మకాలను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలు ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువ పరపతిని అందించేందుకు దోహదం చేసింది. ప్రభు త్వం ఉక్కు కనీస దిగుమతిధరను పెంచింది. మొత్తం 173 ఉక్కు ఉత్పత్తులను దేశంలోనికి దిగుమతిచేసుకోవాలంటే ఎక్కువధరలు చెల్లించా ల్సిందే. దీనికితోడు చౌక ఉత్పత్తుల దిగుమతులను తగ్గించేందుకు కూడా ప్రభుత్వ చర్యలు దోహదం చేస్తున్నాయి. విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ జనరల్ జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వం కనీస దిగుమతి ధర టన్నుకు 341 డాలర్లనుంచి 752 డాలర్లుగా పెంచింది. ఈధరలు ఆరునెలల పాటు అమలులో ఉంటాయి. ఇతర వ్యక్తిగత స్టాక్లలో చూస్తే కెనరాబ్యాంకు ఏడుశాతంపెరిగి 206 చొప్పున ట్రేడింగ్ జరిగింది గురువారం ట్రేడింగ్లో బ్యాంకుషేర్లు 16శాతంపెరిగి 52వారాల కనిష్టస్థాయినుంచి కోలుకున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరుశాతం పెరిగి 104 రూపాయలుగా ఉన్నాయి. బోర్డు డైరె క్టర్లు ఈ నెల 11వ తేదీ సమావేశం అయి మూలధన వనరుల సమీకరణపై నిర్ణయం తీసుకుంటారు. షేర్లు ఐదుశాతం పెరిగాయి. పంజాబ్నేషనల్బ్యాంకు మూడుశాతం పెరిగి 97.35శాతంగా ఉంది. బ్యాంకు 1500 కోట్లు టైర్-2 బాండ్ల జారీద్వారా నిధులు సేకరించినట్లు ప్రకటించింది. 8.65శాతం కూపన్రేట్పై వార్షిక పద్ధతిన ప్రైవేటుప్లేస్మెంట్ నిధులు సేకరించింది. నిఫ్టీ పిఎస్యు బ్యాంకు సూచి 52వారాల కనిష్టస్థాయిని గురువారం నమోదుచేసింది. వివిధ బ్యాంకుల ట్రేడింగ్ను పరిశీలిస్తే కెనరా బ్యాంకు రూ.206.25గా ఉంటే 6.89శాతం పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.104.10, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ.111.80, అలహాబాద్ బ్యాంకు రూ.55, యూనియన్ బ్యాంకు రూ.138.65, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.132.55, ఎస్బిఐఎన్ రూ.175.10, ఐడిబిఐ రూ.58.25 చొప్పున ట్రేడింగ్ జరిపాయి. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
శనివారం నాటికి రూ.2 లక్షల కోట్లు డిపాజిట్ చేసిన జనం
కరెన్సీ నోట్ల రద్దు ప్రభావంతో బ్యాంకుల్లో డిపాజిట్టు భారీగా పెరుగుతున్నాయి.
TNN | Updated:
Nov 13, 2016, 12:07PM IST
కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం భారతీయుల మీద బాగానే పడింది. ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోలేక, చిల్లర దొరక్క సామాన్యులు నానా ఇక్కట్లు పడుతున్నారు. అనూహ్యంగా పెద్ద నోట్లను బ్యాన్ చేయడంతో కొనుగోలు చేసేవారు లేక వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇదలా ఉంటే.. దేశంలో వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే రూ.2 లక్షల కోట్లు బ్యాంకుల్లో బ్యాంకుల్లో జమ కావడం విశేషం. శనివారం మధ్యాహ్నం నాటికి ఈ మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు సమాచారం. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే రూ. 47,868 కోట్లను జనం డిపాజిట్ చేశారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పెద్ద నోట్ల రూపంలో రూ.14 లక్షల కోట్ల ధనం ఆర్థిక వ్యవస్థలో చెలామణి అవుతోందని జైట్లీ తెలిపారు. ఇదంతా ఓ పెద్ద ప్రక్రియని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, దీనికి మరింత సమయం పడుతుందని ఆయన తెలిపారు. | 1entertainment
|
ఈ సూచనలు పాటించండి
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఎక్కడ నుండి వచ్చాడు ఈ జంతువు? జగన్పై దాడి ఇష్యూపై కత్తి మహేష్ సంచలన కామెంట్స్
పోలీసులు, చంద్రబాబు అసలు దర్యాప్తు ప్రారంభించకుండా ఇది ఒక డ్రామా అని ముందే తేల్చేస్తే.. విచారణ సిన్సియర్గా సాగుతుందనే నమ్మకం ఎలా ఏర్పడుతుంది? ఒక వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత దిగజారిపోయారనే దానికి ఈ ఒక్క స్టేట్ మెంట్ చాలు.
Samayam Telugu | Updated:
Nov 2, 2018, 11:37AM IST
గతకొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన జగన్పై హత్యాయత్నం ఇష్యూపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆ పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు కత్తి మహేష్.
ఆయన మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ మీద హత్యాప్రయత్నం జరిగిన రోజునే లైవ్ లోకి వద్దాం అని అనుకున్నా.. కాని నిజా నిజాలు బయటకు రావాలి. అసలు ఏం జరిగిందో తెలియాలి. దానికోసం వేచిచూడాలి. మనం ఏం తెలియకుండా ఏం మాట్లాడగలం ఖండించడం తప్ప అని కొన్నాళ్లు ఆగాను. కాని జరుగుతున్న పరిణామాలు చూస్తే.. చాలా ప్రమాదకరంగా మన ప్రజాస్వామ్యం ఉంది. ఈ హత్యారాజకీయాల నేపథ్యం ప్రజాస్వామ్యానికి హాని చేస్తుందనే అభిప్రాయం అయితే కలిగింది.
ఈ విషయాన్నే షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంలో ఈ లైవ్ చేస్తున్నా. వైజాగ్ ఎయిర్ పోర్ట్లో ఏం జరగిందో అందరికీ తెలిసిందే. ఇలాంటివి జరిగినప్పుడు సాటి మనిషిగా ఎలా స్పందిస్తున్నాం.. రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తున్నారు అనేది లోతుగా గమనించాల్సిన విషయం. నిజానికి నాకు జగన్పై హత్యాయత్నంకంటే ఎక్కువ షాక్ ఇచ్చింది దాడిపై జనాలు, టీడీపీ నాయకుల రియాక్షన్.
ఒక హత్యాప్రయత్నం జరిగినప్పుడు అది కూడా ఓ ప్రతిపక్ష నాయకుడిపై ఇలా జరిగితే అధికారంలో ఉన్న ప్రభుత్వం స్పందించిన తీరుపై మనం లోతుగా గమనించాలి. హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం తరుపున డీజీపీ ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా ఇది ప్రచారఆర్భాటంలో భాగంగా జరిగిన తంతుగా అనడం అనేది షాకింగ్ కలిగించే విషయం.
అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఇదో రాజకీయ నాటకం అంటూ మొదలుపెట్టడం హేయమైన చర్యగా అనిపిస్తుంది. ఎవరైనా సరే ఒక వ్యక్తిపై దాడి జరిగినప్పుడు సానుభూతి ప్రకటన చేయడమో... లేక విచారణ చేస్తున్నాం అని ప్రకటించమో చేస్తారు. ఒక మనిషి అన్నవాడు ఎవడైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సాటి మనిషిపై హత్యయత్నం జరిగితే సాటి మనిషిగా స్పందించాలి. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకోవడమో చేయాలి.
పోలీసులు, చంద్రబాబు అసలు దర్యాప్తు ప్రారంభించకుండా ఇది ఒక డ్రామా అని ముందే తేల్చేస్తే.. విచారణ సిన్సియర్గా సాగుతుందనే నమ్మకం ఎలా ఏర్పడుతుంది? ఒక వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత దిగజారిపోయారనే దానికి ఈ ఒక్క స్టేట్ మెంట్ చాలు. కనీసం ఒక ఫోన్ కాల్ చేసి ఉండి ఉండుంటే ఆయన స్థాయి పెరిగేది.
ఇక లోకేష్ కాని ఇతర మంత్రులు కాని ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ అనే టీడీపీ ఎమ్మెల్సీ ఎంత చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారంటే.. నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనుషుల మధ్య నివసిస్తున్నామా? అనే సందేహాన్ని కలిగించేవిగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. జగన్ తల్లి, చెల్లే జగన్పై హత్యాయత్నం చేయించారనే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు వింటే.. ఎక్కడ నుండి వచ్చాడు ఈ జంతువు మన సమాజంలోకి అనే డౌట్ వస్తుంది. ఒక పార్టీపరంగా కాని.. వ్యక్తిగతంగా కాని జగన్ విషయంలో టీడీపీ నాయకులు స్పందించిన తీరు వాళ్లకు వాళ్లు చేసుకున్న డ్యామేజ్గా కనిపిస్తుంది. జగన్ కోలుకోవడం సంతోషకరమైన విషయమే కాని ప్రజాస్వామ్యం హత్య చేయబడుతోంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు కత్తి మహేష్.
X | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రణ్బీర్-కత్రినాల బ్రేకప్ తెచ్చిన కష్టాలు
బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ డేటింగ్ కపుల్గా పేరుతెచ్చుకున్న రణ్బీర్-కత్రినాలు విడిపోయారనే వార్త ఆ ఇద్దరు కలిసి పనిచేస్తున్న
TNN | Updated:
Jan 18, 2016, 11:05PM IST
రణ్బీర్-కత్రినాల బ్రేకప్ తెచ్చిన కష్టాలు
బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ డేటింగ్ కపుల్గా పేరుతెచ్చుకున్న రణ్బీర్-కత్రినాలు విడిపోయారనే వార్త ఆ ఇద్దరు కలిసి పనిచేస్తున్న జగ్గా జాసూస్ సినిమాపై పడింది. ఏ సినిమాకైనా ఎక్కువ సమయం కేటాయించి షూటింగ్ జరిపే దర్శకుడిగా పేరున్న జగ్గా జాసూస్ డైరెక్టర్ అనురాగ్ బసు ఈసారి ముంబైలో 15 రోజులకి ప్లాన్ చేసిన షెడ్యూల్ని హడావుడిగా కేవలం 3 రోజుల్లో ముగించాడు. అనురాగ్ కెరీర్లో ఇదో రికార్డుగా చెబుతున్నాయి బాలీవుడ్ వర్గాలు. 15 రోజులపాటు ప్లానింగ్ చేసినప్పటికీ.. అలా కేవలం 3 రోజుల్లో ముగించడానికి కారణం రణ్బీర్-కత్రినాల బ్రేకప్ పరిణామాలు తమ షూటింగ్పై ఎక్కడ ప్రభావం చూపిస్తాయోననే భయంతోనేనట. ఇదేకాకుండా మొరాకోలో ఈ నెలాఖరు నుంచి జరగాల్సి వున్న ఫైనల్ షెడ్యూల్ సైతం మరో 2 నెలలపాటు వాయిదా పడిందని తెలుస్తోంది. అందుకు కూడా ఈ ఇద్దరి బ్రేకప్ కహానీయే కారణమని సమాచారం. దీంతో రణ్బీర్-కత్రినాల బ్రేకప్ తదనంతర పరిణామాల్ని బాలీవుడ్ సైతం ఆసక్తిగా గమనిస్తోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Visit Site
Recommended byColombia
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబి, ఆదాయం పన్ను శాఖలు డొల్ల కంపెనీల తీరుపై నివేదికలను కార్పోరేట్ మంత్రిత్వశాఖకు ఇచ్చాయి. డొల్ల కంపెనీలకు ఇచ్చే నిర్వచనంపైన కూడా తమ అభిప్రాయాలను న్యాయ కోవిదుల ద్వారా రూపొందించి ఇచ్చాయి. ఈ అంశాలపై ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డిసి)లో కూడా చర్చ జరిగింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ కూడా రెగ్యులేటరీ మార్గసూచీని రూపొందించింది. షెల్ కంపెనీని రిజిస్టర్ చేసి, న్యాయబద్ధంగా సంస్థ ఆదాయంలో చూపెడుంటారు. కాని ఈ సంస్థ ఎటువంటి ఆపరేషన్స్ను నిర్వహించదు. కాని ఈ సంస్థ ద్వారా నిధులు ప్రవహిస్తాయి. సెబి మాత్రం కంపెనీలో భాగంగా ఉండి, ఎటువంటి పాత్ర నిర్వహించకుండా, నిధుల ప్రవాహానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. షెల్ కంపెనీలకు ఆర్థిక, వాణిజ్య, న్యాయ శాస్త్రం, చట్టపరంగా పటిష్టమైన నిర్వచనం ఇవ్వాలని, దీని వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొల్లగొట్టడం, అక్రమమార్గాల ద్వారా మళ్లించే వారి భరతం పట్టేందుకు దర్యాప్తు ఏజన్సీలకు ఆయుధనం ఇచ్చినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది. సెబి గత ఏడాది 331 డొల్ల కంపెనీలపై కొరఢా ఝుళిపించింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
mahesh babu and koratala shiva film's new schedule details
‘భరత్ అనే నేను’ లేటెస్ట్ అప్డేట్: స్టారొచ్చాడు
మహేష్-కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మళ్ళీ వీరి కాంబినేషన్లో మూవీ అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి.
TNN | Updated:
Sep 4, 2017, 04:47PM IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘స్పైడర్’తో బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘స్పైడర్’ షూటింగ్‌ షెడ్యూల్డ్‌ను పూర్తి చేయడంతో తన ఫోకస్‌ను కొరటాల డైరెక్షన్‌కలో వస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీపైకి షిఫ్ట్ చేశారు. మహేష్ బాబు కెరియర్‌‌లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాల.. మహేష్ కోసం అదేస్థాయిలో ఓ పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నట్టు టాక్ రావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలాఉంటే మహేష్- కొరటాల మూవీ రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమైంది. అయితే ఈ కొత్త షెడ్యూల్‌కు మొదటి మూడురోజులు మహేష్ బాబు దూరంగా ఉండి సోమవారం షూటింగ్‌లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది.సెప్టెంబర్ 27న భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్న ‘స్పైడర్’ మూవీ పనుల్లో మహేష్ బిజీగా ఉండటంతో కొరటాల మూవీ షూటింగ్‌కి కొంత ఆలస్యమైంది.
మరోవైపు మహేష్ కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ టైటిల్ విషయంలోనూ కొంత సందిగ్థంలో ఉన్నారట చిత్రయూనిట్. ఇప్పటికే ఈ మూవీకి ‘భరత్ అనే నేను’అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చి అభిమానుల్లోకి బాగా వెళ్లింది. అయితే ఈ టైటిల్‌‌ను కన్ఫామ్ చూస్తూ.. చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి మహేష్ 24 మూవీకి ‘భరత్ అను నేను’ టైటిల్‌ను ఉంచుతారా లేక టైటిల్ మార్పు ఉంటుందా అన్నదానిపై క్లారిటీ రావాల్సిఉంది. ఇక ఈ మూవీ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. | 0business
|
- దీర్ఘకాలిక సెలవులపై వెళ్లాలని కోరిన 'బోర్డు'
- ఐసీఐసీఐ బ్యాంక్ సీవోవోగా సందీప్ బక్షికి బాధ్యతలు
ముంబయి: వీడియోకాన్ రుణ వివాదంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచ్చర్కు బోర్డు సోమవారం షాకిచ్చింది.కొచ్చర్ను దీర్ఘకాలిక సెలవుపై పంపించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్- వీడియోకాన్ కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఆమె సెలవులోనే ఉండనున్నారు. కొచ్చర్ బాధ్యతలకు దూరం కానున్నందును ఆమె అధికారిక కార్యకలాపాలను నిర్వహించేందుకు గాను సందీప్ బక్షికి బ్యాంక్ సీవోవో బాధ్యతలను అప్పగించారు. సందీప్ బక్షి ప్రస్తుతం ఐసీఐసీఐ జీవిత బీమా విభాగం (ఐసీఐసీఐ ప్రూడెన్షియల్) అధినేతగా పనిచేస్తున్నారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. జూన్ 19 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుందని బోర్డు తెలిపింది. ఈ నిర్ణయానికి రెగ్యూలేటరీ అనుమతులు రావాల్సి ఉంది. కొచ్చర్ సెలవులో ఉన్నంతకాలం ఆయన బ్యాంక్ బోర్డుకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.'' ఐసీఐసీఐ బ్యాంక్ కార్పొరేట్ కేంద్రలోని పనులు, వ్యాపారాలను బక్షి పర్యవేక్షిస్తారు. బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటీవ్ మేనేజర్లు ఆయనకు రిపోర్టు చేయాల్సింది'' అంటూ నేడు ఐసీఐసీఐ బ్యాంక్ తమ కార్యాలయాలకు ఒక ప్రకటనను వెలువరించింది.
అపార అనుభవం బక్షి సొంతం..
1986లో సందీప్ బక్షి ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 2010 నుంచి ఆగస్టు నుంచి ప్రుడెన్షియల్ లైఫ్కు సీఈఓగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2009-10 మధ్య కాలంలో బ్యాంకుకు చెందిన రిటైల్ సంస్థకు డిప్యూటీ ఎండీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. కాగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచర్పై వచ్చిన ఆర్థిక అభియోగాలకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలోని స్వత్రంత కమిటీ విచారణకు ఆమోదం తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అనంతపురంలో కియా అనుబంధంగా మరో 16 సంస్థలు
అనంతపురం జిల్లాలో కొరియాకు చెందిన 16 ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఎపి ప్రభుత్వం కియా అనుబంధ సంస్థలైన హుందాయ్ మొబిస్తో సోమవారం ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
TNN | Updated:
Mar 20, 2018, 11:14AM IST
అనంతపురం జిల్లాలో కొరియాకు చెందిన 16 ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఎపి ప్రభుత్వం కియా అనుబంధ సంస్థలైన హుందాయ్ మొబిస్తో సోమవారం ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ రడ్డి సమక్షంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి, సంస్థ ప్రతినిధులు సంతకం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ దక్షిణ కొరియా ఆంధ్రప్రదేశ్ని రెండో నివాసంగా భావించాలని, రాష్ట్రాభి వృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. రూ.24,600 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారని, అనంతపురం నుంచి చిత్తూరు మీదుగా నెల్లూరు వరకూ ఆటో కారిడార్ తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతలో హుందాయ్ మొబిస్ అనుబంధ సంస్థల భారీ పెట్టుబడులు
ఈ క్లస్టర్కు అనంతపురం జిల్లా ఎర్రమంచి దగ్గర 534 ఎకరాలు, గుడిపల్లిలో 71 ఎకరాలు, అమ్మవారిపల్లి దగ్గర 131 ఎకరాలు కేటాయించామన్నారు. ఈ క్లస్టర్ భారత్లోనే అతిపెద్ద ఎఫ్డీఐగా అభివర్ణించారు. అనంత జిల్లాకు, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు బాట వేస్తున్నాయన్నారు. ఏపీలో ఆటోమొబైల్ రంగ అభివృద్ధి వాతావరణ ఏర్పాడుతుందని, ఎంఎస్ఎంఈ యూనిట్లు పెరుగుతాయని, రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ వస్తుందని తెలిపారు. మూడేళ్ల క్రితమే దేశంలో అత్యుత్తమైన ఆటోమొబైల్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. అనంతపురం బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఉందని, త్వరలో ఓర్వకల్లులో విమానాశ్రయం రానుందని, ఇప్పటికే తిరుపతి, పుట్టపర్తిలో విమానాశ్రయాలున్నాయని తెలిపారు. కియాతో సహా ఇసుజు మోటార్స్ అనుబంధ సంస్థలు, హీరో మోటార్స్, అశోక్ లేలాండ్, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ కంపెనీలు తమ ఉత్పాదక యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయని, ఇప్పటికే శ్రీసిటీలో సుజుకి వాహన ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేసిందని వివరించారు. ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిలో హ్యుండై డైమోస్, హ్యుండై స్టీల్, హ్యుండై గ్లోవిస్, సంగ్వూ, సేహాన్, సియోయాన్ ఎవహా, ఎన్విహెచ్, హ్యుండై మెటీరియల్స్, ఫోరేసియా, ఎస్ఎల్, వూయంగ్, హాసీయంగ్, ఇంజి, డిఎస్సి కంపెనీలు ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సీఎంతో పాటు సీఎం ముఖ్యకార్యదర్శి జి సాయిప్రసాద్ ఉన్నారు. | 1entertainment
|
MUKESH AMBANI
తొమ్మిదేళ్లుగా అదేజీతం..!
న్యూఢిల్లీ, జూన్ 29: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వార్షిక వేతనం రూ.15 కోట్లతోనే సరిపెట్టుకున్నారు. వరుసగా తొమ్మిదవ సంవత్సరంలో కూడా ఏడాదికి తన వేతనాన్ని రూ.15కోట్లు మాత్రమే తీసు కుంటూ తనకు తాను పరిమితులు విధించుకున్నారు. అలాగే ఇతర ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్లు తీసుకుంటున్న స్టాక్ ఆప్షన్లను కూడా ముఖేష్ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. భారత్లోనే అపరకుబేరునిగా నిలిచిన ముకేష్ అంబాని 2008-09 ఆర్థిక సంవత్సరంనుంచి కూడా కేవలం రూ.15 కోట్లు మాత్రమే తీసుకుంటు న్నారు.
సాలీనా రూ.24 కోట్లు నష్టపోతున్నా అంబానీ మాత్రం 15కోట్లకే పరిమితం అయ్యా రు. సిఎండి పరిహారం డైరెక్టర్లబోర్డు రూ.38.75 కోట్లుగా నిర్ణయించినా అంబాని మాత్రం రూ.15కోట్లు మాత్రమే తీసుకుంటున్నా రు. దీనితో సాలీనా రూ.24 కోట్లు నష్టపోతు న్నట్లు అయింది. ఆయన పరిహారం 4.16 కోట్ల రూపాయలు వేతనం, 60 లక్షల రూపాయలు ఇతర భత్యాలు, చెల్లింపులు ఉన్నాయి. ఆయ నకు రిటైర్మెంట్ ప్రయోజనాలకింద రూ.71 లక్షలు రూ.9.53 కోట్లు కమిషన్ రూపంలో అందింది.
మూలవేతనం, అలవెన్సులు, రిటైర్మెంట్ సదుపాయాలు, కమి షన్ అన్నీ కలుపుకునే అంబాని 2015-16లో మొత్తం తీసుకున్నారు. అంబానీ తనకుతానుగా పరిమితులు విధించుకుని 2009 అక్టోబరు నుంచి 15 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాలు పెరుగుతున్నా అంబానీ వేతనం మాత్రం పెరగలేదు ముఖేష్ అంబానీ సోదరులు నిఖిల్ ఆర్ మేస్వాని, హీతాల్ ఆర్ మేస్వానిల పరిహారం ఒక్కక్కటరికి 16.58కోట్లుగా ఉంది. వారు 14.42 కోట్లు, 14.41కోట్లు ఆర్జించారు. అంతకుముందు 2014-15 ఆర్థికసంవత్సరంలో వారు రూ.12.03 కోట్లు చొప్పున ఆర్జించినట్లు తేలింది.
కీలకమైన ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ 7.87 కోట్లు సాధించారు. అంతకుముందు ఏడాది 7.25 కోట్ల నుంచి భారీగా పెరిగింది. అలాగే అంతకుముందు ఏడాది 6.03 కోట్లుగా ఉంది. 2014-15లో రిఫైనరీ చీఫ్ పవన్కుమార్ కపిల్ మొత్తం పరిహారం 2.54 కోట్లుగా ఉంది. అంతకు ముందు సంవత్సరంలో 2.94 కోట్లుగా ఉంది. 2014-15లో ఆయన 2.41 కోట్లు ఆర్జించినట్లు అంచనా. రిలయన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నీతా అంబానీ 1.2 కోట్లు చొప్పున పొందారు. వీటికితోడు కమిషన్, సిట్టింగ్ఫీజులు కూడా ఉన్నాయి. నిఖిల్ హీతల్ స్టాక్ ఆప్షన్లుగా 64.18కోట్లు చొప్పున పొందారు. ప్రసాద్కు స్టాక్ ఆప్షన్లకింద రూ.45కోట్లు సాధించారు.
కపిల్ ఒక కోటి రూపాయలు స్టాక్ ఆప్షన్ పొం దారు. అంబానీ సతీమణి నీతా అంబానీ నాన్ఎగ్జిఎక్యూటివ్ డైరెక్టర్గా నాలుగు లక్షలు సిట్టింగ్ఫీజు, 1.35 కోట్ల కమిషన్ సాధించారు. అంతకుముందు ఏడాది సిట్టింగ్ఫీజు ఆరులక్షలు పొందారు. కమిషన్ 1.20 కోట్లుగా కొంత పెరిగింది. ముఖేష్ అంబానీతోపాటు రిల్ బోర్డులో మేస్వాని సోదరులు, ప్రసాద్, పిల్ పూర్తికాలపు డైరెక్టర్లుగా ఉన్నారు ఇక నీతాఅంబానీ, ధరమ్వీర్ కపూర్, దీపక్ సిజైన్, మాన్సింగ్ ఎల్భక్త, యోగేంద్ర పిత్రివేది, రమీందర్సింగ్ గుజ్రాల్, అశోక్ మిశ్రా, రఘునాధ్ మసేల్కర్, జైనుల్భా§్ులు స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. | 1entertainment
|
వడ్డీ రేట్లు యథాతధం...!
- ద్రవ్యోల్బణ పరిస్థితుల ప్రభావం కొనసాగుతోంది
- వృద్ధిరేటు 7.6 శాతానికే పరిమితం
- జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థకు కొంత మేలే
- బ్యాంకులతో కలిసి పనిచేస్తాం: ఆర్బీఐ
- ప్రత్యేకతలే కనబడని పరపతి సమీక్ష!
న్యూఢిల్లీ: అందరూ ఊహించినదే జరిగింది.. 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్బీఐ) మూడో ద్వైమాస పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన చివరి పరిపతి విధాన సమీక్షలోనూ ఎలాంటి మెరుపులు కనిపించలేదు. మిస్టర్ పర్ఫెక్ట్గా పేరున్న రాజన్ చివరి సమీక్షలోనైనా ఆశ్చర్యకర నిర్ణయాలను ప్రకటించి.. తన ప్రత్యేకతను చాటుతారని ఊహించిన వారికి నిరాశే ఎదురైంది. పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక వడీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేటును 6.5శాతం, నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) 4 శాతం వద్దే కొనసాగింస్తున్నట్లుగా ప్రకటించింది. రివర్స్ రెపోరేటును 6శాతం, ఎంఎస్ఎఫ్ రేటును 7శాతం వద్ద యథాతథంగా ఉంచారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17లో) 7.6 శాతం వద్ధిరేటు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఆర్బీఐ అంచనా కట్టింది. తగ్గింపునకు ఆస్కారం ఉన్నప్పటికీ ఆర్బీఐ అధిక వడ్డీ రేట్లను కొనసాగిస్తూ ప్రగతి నిరోధకంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు ఈ దిశగా చర్యలు చేపడుతోందని భావించినప్పటికీ ఆర్బీఐ తన మునపటి విధానానికే కట్టుబడుతూ వడ్డీరేట్లను యథాతథ స్థాయిల్లోనే ఉంచింది. తదుపరి పరపతి సమీక్షా సమావేశం వచ్చే అక్టోబరు 4న ప్రభుత్వం కొత్తగా నియమించనున్న 'మానిటరీ పాలసీ కమిటీ' (ఎంపీసీ) ఆధ్వర్యంలో జరగనుంది.
ద్రవ్యోల్బణంపై ప్రత్యేక దృష్టి నిలపాల్సిందే..
ఇటీవలి కాలంలో ఆహారోత్పత్తుల ధరలు పెరుగుతుండడంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పప్పులు, తృణ ధాన్యాలతో పాటు కీలక ఆహారోత్పత్తుల ధరల నియంత్రణపై సర్కారు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆర్బీఐ ప్రభుత్వానికి సూచించింది. తాజా గణాంకాల ప్రకారం కూరగాయల ధరలు స్వల్పంగా దిగి వచ్చాయని పేర్కొంది. మార్చి 2017 నాటికి ద్రవ్యోల్బణం సూచీని 5 శాతానికి కట్టడి చేయాలని ఆర్బీఐ నిర్దేశించుకున్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో ఐదు శాతం కంటే పెరగడం కొంత ఆందోళనకరమేనని పేర్కొంది. జూన్ 2016లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 5.77 శాతానికి ఎగిసింది. గతేడాది ఇదే జూన్ మాసంలో ఇది 5.40 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణం సూచీని 5 శాతానికి నియంత్రించడం కష్టమేనని ఆర్బీఐ అభిప్రాయపడింది. 7వ వేతన సంఘం ప్రతిపాదనలు ధరలపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. ఈ పరిణామాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.
తగ్గింపు బదిలీ ఆశించిన స్థాయిలో లేదు..
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లైని సులభతరం చేస్తూ ఆర్బీఐ ఇప్పటి వరకు పలు వడ్డీరేట్లను తగ్గించిననప్పటికీ బ్యాంకులు వాటిని తమ వినియోగదారులకు ఆశించిన స్థాయిలో బదిలీ చేయకపోవడం పట్ల ఆర్బీఐ కొంత అసంతృప్తిని వ్యక్తం చేసింది. వడ్డీరేట్లను తగ్గించకుండా బ్యాంకులు కొత్త పద్ధ్దతులను అనుసరించాయని రాజన్ పేర్కొన్నారు. త్వరలోనే పీ2పీ అప్పులుపై నూతన విధివిధానాలతో పాటు కార్పొరేట్ బాండ్ల మార్కెట్కు విధివిధానాలు ప్రకటిస్తామని రాజన్ తెలిపారు.
బ్యాంకులతో కలిసి పని చేస్తాం..
మొండి బాకీల నియంత్రణకు బ్యాంకులు తీసుకుంటున్న చర్యలను రాజన్ ప్రశంసించారు. కాగా కొన్ని బ్యాంకులు మొండి బాకీల శుభం పలికేందుకు అదనపు చర్యలు కూడా తీసుకున్నాయన్నారు. ఎక్కువ ఒత్తిడి ఉన్న ఎన్పీఎలను మళ్లీ పునరుద్ధరిస్తున్నాయన్నారు. ఇందుకోసం అనేక ఆర్బీఐ పథకాలు ఉన్నాయన్నారు. ఏ సమస్య పరిష్కారం కోసం అయినా బ్యాంకులతో కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. 'వస్తు సేవల పన్ను' (జీఎస్టీ) అమలుపై రాజన్ మాట్లాడుతూ ఇతర దేశాల్లో ఈ తరహా పన్ను వల్ల ద్రవ్యోల్బణంపై ప్రభావం పడిందన్నారు. అయితే ధరలు పెరగడం తాత్కాలికమేనని పేర్కొన్నారు. వేటి ధరలు పెరుగు తాయో, తగ్గుతాయే చెప్పడానికి అనేక అంశాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. మార్చి 2017 నాటికి 5 శాతానికి నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుం దన్నారు. ఏప్రిల్ 2017కు ముందు జీఎస్టీ అమలులోకి తేవడం కష్టమేనని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణంపై జిఎస్టి పూర్తి ప్రభావం కనిపించొచ్చన్నారు. బిల్లు ఇంకా రూపకల్పనలోనే ఉండగా అప్పుడే ఈ విషయంపై మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. ఏకీకత వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో బిజినెస్ సెంటిమెంట్ పెరుగుతుందని, పెట్టుబడులు మరింతగా ఆకర్షించవచ్చని రాజన్ చెప్పారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి షాక్.. సాక్ష్యం షోలు రద్దు
Highlights
నిర్మాత అభిషేక్ నామా, ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే షోలు ఆగినట్లు సమాచారం. చిత్ర విడుదలను నిలిపివేయాలని నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఉదయం షోలు రద్దయ్యాయంట.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు(జూలై 27)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే ఎర్లి మార్నింగ్ షోతోపాటు మార్నింగ్ షోలు కూడా దాదాపు రద్దయ్యాయి. ఇందుకు టెక్నికల్ ఇష్య్సూ కారణమని చెబుతున్నప్పటికీ.. మరోవైపు న్యాయపరమైన సమస్యలనే టాక్ వినిపిస్తోంది.
నిర్మాత అభిషేక్ నామా, ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే షోలు ఆగినట్లు సమాచారం. చిత్ర విడుదలను నిలిపివేయాలని నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఉదయం షోలు రద్దయ్యాయంట.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పటి వరకు ఈ చిత్రం షోలు పడలేదు. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్లో పడాల్సిన 8.45 గంటల షో కూడా రద్దయింది. ఏపీ, తెలంగాణల్లో మార్నింగ్ షోలు కూడా ఉండవని పలువురు సినీ జర్నలిస్టులు ట్వీట్లు చేశారు. మధ్యాహ్నానికి ఈ సమస్యలన్నీ పరిష్కరించకుని మ్యాట్నీ షో నుంచి చిత్ర ప్రదర్శనను ప్రారంభించాలని నిర్మాత యత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్కు డిజిటల్ ప్రింట్ అందలేదు.
కాస్త లేటుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే బెల్లంకొండ సరసన నటిస్తోంది.
Last Updated 27, Jul 2018, 12:57 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఈ సినిమాలు.. చిరు కెరీర్ మెరుపులు!
ఇండస్ట్రీ హిట్లు, వసూళ్ల వండర్లు, 100,175 డేస్ పిక్చర్లు...
TNN | Updated:
Aug 22, 2017, 03:19PM IST
ఈ సినిమాలు.. చిరు కెరీర్ మెరుపులు!
పైన ఉన్న దేవతలంతా ఆకాశంలోని ఒక తారను భూమ్మీదకు పంపి ‘చిరంజీవి’గా జీవించమని దీవించి పంపారు... ఆ తారే MEGASTARగా వెలుగొందుతోంది... ఇంతకన్నా ఏం చెప్పగలం ఆయన గురించి! అలాంటి మెగాస్టార్ చిరు పుట్టిన రోజు నేడు. తెలుగు సినీ ప్రేక్షకులను అలరించడానికే జన్మించిన మెగాస్టార్.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా, స్వయం కఈషితో ఎదిగి వచ్చాడు. ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ సారి చిరంజీవి పుట్టిన రోజుకు మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇండస్ట్రీలో ఆయన తన ప్రస్థానంలో 40 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం. మరి ఈ ప్రస్థానంలో కొన్ని కీలకమైన మలుపులున్నాయి. ఒక్కో సినిమా చిరు కెరీర్ ను ఒక్కో మలుపు తిప్పింది. ఎక్కడా వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకుండా సాగిన ఆ ప్రస్థానంలో మేలి మలుపులైన సినిమాలు ఏవంటే...
Visit Site
Recommended byColombia
పునాదిరాళ్లు : ఈ సినిమా టైటిల్ చిరంజీవి కెరీర్ కు జస్టిఫికేషన్ గా నిలిచింది. మెగాస్టార్ తొలి సినిమాగా, స్వయంకృషితో ఎదిగిన స్టార్ హీరో కెరీర్ కు పునాదిరాయిగా నిలిచింది ఈ సినిమా. ఇందులో మెగాస్టార్ మహానటి సావిత్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా చిరు ఫస్ట్ సినిమానే అయినప్పటికీ మొదట విడుదల అయ్యింది మాత్రం ‘ప్రాణం ఖరీదు’
ఖైదీ: పునాదిరాళ్లు కు తర్వాత, ఖైదీకి ముందు.. మధ్యలో చిరంజీవి చాలా సినిమాలు చేశాడు. వాటిల్లో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ ‘అభిలాష’ వంటి హీరోగా నటించిన సినిమాలు, విలన్ గా నటించిన ‘పున్నమినాగు, కొత్త అల్లుడు, ఇది కథ కాదు’సినిమాలు, ‘మనవూరి పాండవులు, మంచు పల్లకి’ వంటి మల్టీస్టారర్ సినిమాలున్నాయి. నెగిటివ్ రోల్లో కనిపించినా, మల్టీ స్టారర్ లో మెరిసినా.. సోలో హీరోగా నటించినా.. ప్రతి సినిమాతోనూ చిరంజీవి తన ప్రత్యేకతను తను నిరూపించుకొంటూ వచ్చాడు. అందుకు దక్కిన ప్రతిఫలమే ‘ఖైదీ’. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టింది. చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టింది. ఇప్పటికీ తెలుగు చలన చిత్ర చరిత్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచిపోయింది.
పసివాడి ప్రాణం: ఇండస్ట్రీలో ఇంకా సీనియర్ హీరోలు పోటీలో ఉన్నా, వాళ్లు కూడా మాస్ ఎంటర్ టైనర్లను చేస్తున్నా.. ‘చిరంజీవి నంబర్ వన్’ అనిపించిన సినిమా ఇది. మలయాళంలో సూపర్ హిట్ అయిన మమ్ముట్టీ సినిమా ఒకదానికి రీమేక్ ‘పసివాడి ప్రాణం’. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది. థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా నిలిచింది.
స్వయంకృషి, రుద్రవీణ: ఒకవైపు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒక్కొక్క సినిమాతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ కూడా సమాజహితాన్ని కోరే సినిమాలు, అభినందనలను అందుకునే సినిమాలను చేయడం ఆపలేదు మెగాస్టార్. కే విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన స్వయంకృషి, కే బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన రుద్రవీణ సినిమాలే అందుకు రుజువు. కమర్షియల్ కోణాని పక్కన పెట్టి రూపొందించిన ఈ సినిమాలు చిరంజీవిలోని నటుడిని గొప్ప రీతిన ఆవిష్కరించాయి.
ఘరానామొగుడు: నంబర్ వన్ హీరోగా చిరంజీవి కెరీర్ ఉన్నతదశలో ఉండగా వచ్చిన సినిమా, అంత వరకూ చిరంజీవితో సహా టాలీవుడ్ హీరోలు స్థాపించిన రికార్డులన్నింటినీ బ్రేక్ చేసిన సినిమా. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఘరానామొగుడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సినీ వినోదానికి నిర్వచనం ఇచ్చింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
హిట్లర్: మెగాస్టార్ కెరీర్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభం అయినది ‘హిట్లర్’తోనే. ఈ సినిమాకు ముందు కొన్ని ఫ్లాఫులు వచ్చాయి. ఒక ఏడాదిలో చిరంజీవి సినిమాలేవీ విడుదల కాకపోవడం అనే సంఘటన కూడా సంభవించింది. పేరులోనే హిట్ ఉన్న హిట్లర్.. చిరంజీవి కెరీర్ కు మళ్లీ ఊపునిచ్చింది. మలయాళంలో మమ్ముట్టీ చేసిన సినిమానే ఇది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరు హీరోగా రూపొంది.. మెగాస్టార్ మానియాకు మళ్లీ ఊపునిచ్చింది.
ఇంద్ర, ఠాగూర్: రికార్డులకు రిపేర్లు చేసిన సినిమాలివి. వంద రోజుల రన్ విషయంలో ఇంద్ర 122 థియేటర్లలో ఆడి సరికొత్త రికార్డును సృష్టించింది. తమిళ సినిమా ‘రమణ’కు రీమేక్ గా వచ్చిన ‘ఠాగూర్’ ఇంద్రకు మించిన సంచలనాన్ని నమోదు చేసింది.
శంకర్‌దాదా జిందాబాద్: ఫలితం ప్రకారం చూసుకుంటే ఈ సినిమా అంత ఆకట్టుకోలేదు కానీ, ఈ సినిమా అనంతరం చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ సినిమా తర్వాత దాదాపు పదేళ్ల పాటు చిరంజీవి సినిమాలకు విరామం వచ్చింది. ఆ రకంగా ఇది ప్రత్యేకమైనది.
ఖైదీ-150: తెలుగు సినీ అభిమానుల హృద‌యాల్లో ఖైదీ అయిన చిరంజీవి పవర్ ను చాటి చెప్పిన చిత్రమిది. పదేళ్ల విరామానంతరం వచ్చినా, రాజకీయాల వైపు వెళ్లి మళ్లీ వచ్చినా.. తెలుగు సినీ ప్రేక్షకుల్లో చిరంజీవి వన్నె తరగలేదు అని నిరూపించిన చిత్రం. కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను స్థాపించింది ఖైదీ -150.
నటనతో సత్తా చూపిన సినిమాలా, వంద రోజులు, 175 రోజులు ఆడే సినిమాలు కావాలా, కోట్ల రూపాయల కలెక్షన్ల సినిమాలు కావాలా.. ఏవి కావాలన్నా చిరంజీవి మూవీ డిక్షనరీలో ఉంటాయి. అలాంటి వాటిలో ఇవి కొన్ని.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
బొల్లారంలో కార్ల తయారీ ప్లాంట్: ఈ-ట్రియో
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
పర్యావరణహిత విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఈ-ట్రియో ఆటోమొబైల్ వ్యవస్థాపకులు సత్యా యలమంచిలి తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము మూడు వేరియంట్లలో ఈవీ 100, ఈవీ 180, మరో హచ్బ్యాక్ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. త్వరలోనే వీటిని విడుదల చేయనున్నామని చెప్పారు. 2018 మార్చి నుంచి మార్కెటింగ్ను ప్రారంభించనున్నామని చెప్పారు. వీటి టెక్నలాజీ కోసం అమెరికన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టుగా వివిరంచారు. కాగా ఈ కార్లు 25 నిమిషాల్లోనే చార్జీంగ్ అయ్యేలా చైనా కంపెనీతో టెక్నాలజీ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టుగా వెల్లడించారు. నెలకు 1500 కార్ల తయారీ సామర్థ్యంతో బొల్లారంలో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. మరో 15 నెలల్లో ఈ ప్లాంట్ అందుబాటులోకి రానుందని ఆయన వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
హెచ్ఎంటీ.. ఉద్యోగుల పరిస్థితేంటీ?
- 2,900 మందిపై వేటేనా!
- ఎక్కువ మంది వాచీలు, బేరింగ్ విభాగాల వారే
- సిద్ధమవుతున్న 'పునర్ నిర్మాణం'
- 17 నెలలుగా జీతం లేదు.. వీఆర్ఎస్ లేదు: ఉద్యోగులు
బెంగళూరు: కాలంతో పోటీపడలేక వెనుకబడిపోయిన ప్రభుత్వ రంగ సంస్థ 'హిందుస్థాన్ మెషిన్ టూల్స్' (హెచ్ఎంటీ)లోని ఉద్యోగుల భవితపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. నష్టాల్లో నడుస్తున్న హెచ్ఎంటీకి చెందిన కొన్ని యూనిట్లను మూసివేసేందుకు ఆ సంస్థ కార్యాచరణను అమలు చేస్తుండడంతో ఈ సంస్థల్లోకి ఉద్యోగుల్లో అభద్రతాభావం బాగా పెరిగిపోతోంది. సంస్థ నుంచి దాదాపు 2,900 మంది ఉద్యోగులను తొలగించే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో హెచ్ఎంటీకి చెందిన రెండు వాచీల తయారీ యూనిట్లతో పాటు బేరింగ్ కంపెనీలకు చెందిన 1,091 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. మూడు అనుబంధ సంస్థలను మూసివేసిన తరువాత, రెండు అనుబంధ సంస్థలలోని దాదాపు 1,600 మందిని సంస్థలోనే కొనసాగించాలని యోచిస్తున్నట్లు హెచ్ ఎంటీ గ్రూపు ఛైర్మన్ ఎస్.గిరీష్ కుమార్ అన్నారు. మొత్తం 4,500 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలో మరో 2,900 మందికి త్వరలోనే తాము ఆకర్షణీయమైన 'స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని' (వీఆర్ఎస్) అమలు చేయనున్నట్లుగా ఆయన ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. సంస్థ పునర్ నిర్మాణం తరువాత సంస్థ కార్యకలాపాలు మొత్తం తొమ్మిది విభాగాల్లో చిన్న మొత్తంలో కొనసాగతాయని ఆయన అన్నారు. ఇందులో మెషిన్ టూల్స్, బయో-మెడికల్ పరికరాలు, ట్రాక్టర్లు, వాచీలు ఉండనున్నట్లు ఆయన తెలిపారు. మందమనంలో నడుస్తున్న హెచ్ఎంటీ గొడుగు కింద మూడు నష్టాల్లో నడుస్తున్న అనుబంధ సంస్థలను మూసి వేయాలని మిగతా రెండింటిని విలీనం చేసి ఒక హోల్డింగ్ సంస్థగా రూపొందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగా ఒక్కో ఉద్యోగికి రూ.22-25 లక్షల మేర ఒకే దశ వీఆర్ఎస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
రెండేళ్లుగా ఇదే మాట..
తాజా పరిణామాలపై హెచ్ఎంటీ ప్రధాన కార్యాలయపు అధ్యక్షుడు పి.ఎస్.చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా వీఆర్ఎస్ ఎర చూపుతోందని అయితే ఇప్పటి వరకు ఈ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని ఆయన అన్నారు. గత 17 నెలలుగా తమకు వీఆర్ఎస్ గానీ జీతాలు గానీ అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు (కర్ణాటక), రాణాభాగ్ (ఉత్తరాఖండ్) లోని గడియారాల తయారీ యూనిట్లతో పాటు హైదరాబాద్లోని బేరింగ్ కంపెనీలలో దాదాపు 1091 మంది ఉద్యోగుల జీవితాలు భారంగా మారాయి. వీరికి గత ఏడాది ఏప్రిల్ నంచి జీతాలు అందడం లేదు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 2, Oct 2018, 6:03 PM IST
Highlights
యంగ్ టైగర్ ఎన్టిఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలను విడుదల చేసింది చిత్రబృందం. ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది.
యంగ్ టైగర్ ఎన్టిఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలను విడుదల చేసింది చిత్రబృందం. ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది.
మరికొద్ది సేపట్లో ఈ ఫంక్షన్ మొదలుకానుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులంతా హైదరాబాద్ లోని ఈవెంట్ జరుగుతోన్న నొవెటెల్ హోటల్ కి చేరుకున్నారు. హాల్ మొత్తం అభిమానులతో నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుండి ఎన్టిఆర్ ని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
అయితే వారిమధ్య ఎలాంటి తొక్కిసలాట జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికాసేపట్లో చిత్రబృందంతో పాటు ఎన్టిఆర్ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇప్పటివరకు అతిథులుగా ఎవరు రాబోతున్నారనే విషయంపై స్పష్టత రాలేదు. ఎన్టిఆర్, త్రివిక్రమ్ లతోనే కార్యక్రమాన్ని నడిపించనున్నారు. కల్యాణ్ రామ్ మాత్రం హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు.. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అరె... సెట్లో నిజంగానే కొట్టేసుకున్నారు
సహజమైన నటనే సినిమాకు కలిసొస్తుందని దర్శకుల నమ్మకం.
TNN | Updated:
Feb 3, 2016, 09:28AM IST
అరె... సెట్లో నిజంగానే కొట్టేసుకున్నారు
సహజమైన నటనే సినిమాకు కలిసొస్తుందని దర్శకుల నమ్మకం. తెలుగులో కొందరు దర్శకులు హీరోయిన్ను ఓ చెంప దెబ్బకొట్టి మరీ ఏడిపించి ఆ సీన్ ను పండించుకుంటున్నారు. హీరోలు కూడా ఫైటింగ్ సన్నివేశాలలో డూప్ లు లేకుండా నటించేందుకు సిద్ధపడి కాళ్లు విరగ్గొట్టుకుంటున్నారు కూడా. సినిమాలో సహజత్వం పార్ట్ అంతగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇలాగే సహజత్వానికి పోతే ఓ తమిళ సినిమా షూటింగ్ రసాభాసగా మారింది.
Visit Site
Recommended byColombia
జీవా, హన్సిక జంటన పోకిరి రాజా సినిమా రూపొందుతోంది. అందులో శిబిరాజ్ అనే మరో నటుడు కూడా ఉన్నాడు. జీవా, శిబిరాజ్ లపై ఓ సీన్ చిత్రీకరిస్తోంది చిత్ర యూనిట్. ఆ సీన్ లో జీవా, శిబిరాజ్ ని చెంపపై కొట్టాలి. దర్శకుడు సహజంగా ఉండాలని అనడంతో జీవా నిజంగనే శిబి చెంపని వాయించేశాడట. ఇంకేముంది శిబికి కోపం ముంచుకొచ్చి జీవాతో గొడవకు దిగాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు చేతులు విసురుకున్నట్టు తెలుస్తోంది. చిత్రయూనిట్ ఇద్దరినీ విడదీసి, షూటింగ్ ని ఆ రోజుకి ఆపేశారు. ఇప్పుడు వారిద్దరూ ఎడముఖం, పెడముఖంగా ఉన్నారు. కలిసి సినిమా ఎలా చేస్తారో చూడాలి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Hyderabad, First Published 18, Mar 2019, 3:25 PM IST
Highlights
ఎన్నికల కమిషన్ నుండి తనకు లెటర్ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి.
ఎన్నికల కమిషన్ నుండి తనకు లెటర్ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి. పోసాని రూపొందిస్తోన్న 'ముఖ్యమంత్రి గారు.. మీరు మాట ఇచ్చారు' అనే సినిమా విడుదల ఆపేయాలని ఎన్నికల సంఘం నుండి తనకు లేఖ వచ్చిన కారణంగా ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు.
అసలు సినిమాలో తానేం చూపించానో.. ఏం చెప్పానో.. తెలియకుండా సినిమా ఆపేయాలని ఎవడెవడో లెటర్ లు రాస్తుంటారని.. ఎలక్షన్ కమిషన్ వాళ్లు అన్నింటికీ స్పందిస్తారా..? అంటూ ప్రశ్నించాడు. సెన్సార్ నిబంధనలకు లోబడే తాను సినిమా తీసినట్లు స్పష్టం చేశాడు.
తాను ఎవరికీ వ్యతిరేకి కాదని, ఏ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సినిమా తీయలేదని అన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటే సినిమాలు ఓటర్లను ప్రభావితం చేస్తుందని, నైతికత లేదని అంటున్నారు. నేనేమైనా వ్యభిచార గృహం పెట్టానా..? అంటూ ఫైర్ అయ్యారు.
నిజంగా సినిమా ప్రభావితం చేస్తుందనుకుంటే.. టీవీల ముందు కూర్చొని పార్టీల గురించి మాట్లాడుతున్నారు.. అది ప్రభావితం చేయదా..? అంటూ ఎదురు ప్రశ్నించారు.
Last Updated 18, Mar 2019, 3:25 PM IST | 0business
|
Jan 06,2018
ఐరన్ మౌంటెన్ చేతికి ఓఈసీ రికార్డ్స్
హైదరాబాద్: రికార్డుల నిర్వహణ, ఇమేజింగ్ సేవలు, మీడియాకు చెందిన ఆఫ్సైట్ స్టోరేజీని అందించే ఓఈసీ రికార్డ్సు మేనేజ్మెంట్ను నిల్వ, సమాచార నిర్వహణ సేవల సంస్థ ఐరన్ మౌంటెన్ సొంతం చేసుకున్నట్టు ఆలసంస్థ ఒక ప్రక టనలో తెలిపింది. దీంతో భారత్లో తమ ఉనికిని విస్తరించుకున్నట్ట య్యిందని ఐరన్ మౌంటెన్ ఇండియా ఎండీ హితేష్ గుప్తా పేర్కొన్నారు. దీంతో భారత్లో 15 ప్రాంతాల్లో 73 సదుపాయాలతో కూడిన నెట్వర్క్కు చేరినట్టయ్యిందన్నారు. 2600 మందికి పైగా వినియోగదారులకు చెందిన రికార్డులను డెలివరీ చేయడంతో పాటుగా సమాచార నిర్వహణ, డేటా మేనేజ్మెంట్ అందించనున్నామన్నారు. ఈ మొత్తం విలువ 18 మిలియన్ డాలర్లుగా ఉంటుందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
TEAM
టి20 ర్యాంకులు వెల్లడి టీమిండియా కంటే పాక్ మెరుగు
దుబా§్ు: వార్షిక ఆప్డేట్లో భాగంగా మంగళ వారం ఐసిసి టి20 ర్యాంకులను ప్రకటిం చింది. తాజా ర్యాంకుల్లో న్యూజిలాండ్ అగ్రస్థా నంలో నిలువగా,టీమిండియా రెండుర్యాంకులు కోల్పోయి నాలుగవ స్థానంలో నిలిచింది.ఇక ఈ సంవత్సరం జూన్లో చాంపియన్స్ ట్రోఫికి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాండ్ మూడు స్థానాలు మెరుగు పర్చుకుని రెండవ స్థానానికి ఎగబాకింది. 2007లో ఐసిసి వరల్డ్ టి20 చాంపియన్గా అవతరించిన టీమిండియా 118పాయింట్లతో నాలుగవ స్థానం లో నిలిచింది.121 పాయింట్లతో పాకిస్థాన్ రెండవ స్థానంలో నిలువగా,111 పాయింట్లతో దక్షిణాఫ్రికా అయిదవ స్థానంలో,110పాయింట్లతో ఆస్ట్రేలి యా ఆరవ స్థానంలో నిలిచాయి.2019లో వరల్డ్ టి20 క్వాలిఫయర్జరుగుతుండగా2020లోజరు గనున్న ఐసిసి వరల్డ్ టి20కి ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తుంది | 2sports
|
sunflower oil
వంటనూనెల ఎగుమతులకు కేంద్రం గ్రీన్సిగ్నల్!
ముంబై: కేంద్రప్రభుత్వం వంటనూనెలు ఎగుమతులకు భారత ఎత్తున అనుమతులు ఇవ్వ డంతో సహజంగానే పరిశ్రమ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.వంటనూనెల్లో వేరుశెనగనూనె, నువ్వుల నూనె, సోయాబీన్, జొన్ననూనెలను వాటిప్యాకేజిల సైజుతో నిమిత్తంలేకుండా ఎగుమతి చేసుకోవచ్చని విదేశీ వాణిజ్యశాఖ వెల్లడించింది. సుమారు తొమ్మి దేళ్ల నిషేధం తర్వాత ఎగుమతులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో పరిశ్రమ వర్గాల్లో ఎగుమతులకు కసరత్తులు షురూ అవుతున్నాయి. తొమ్మిదేళ్లుగా ఐదుకిలోల ప్యాకెట్లవరకూ మాత్రమే ఇతర దేశాలకు ఎగుమతి కానీ సరఫరా చేసుకునేందుకుకానీ అను మతులుండేవి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వంటనూనెల ఉత్పత్తిలోఉన్న కంపెనీలకు లాభాలు పెరుగుతాయనేది అందరూ అనుకుంటున్నదే. వర్త కులకే కాకుండా నూనెగింజలు పండించే రైతులకు చెల్లించే మద్దతుధరకు మించి రేటుపలుకుతుందని అంటున్నారు. దీనితోపాటే నూనెగింజల సాగు విస్తీ ర్ణం కూడా పెరిగేఅవకాశం ఉంటుంది. ఐతే దేశీ యంగా వంటనూనెల అవసరాలను తీర్యుచకునేం దుకు దాదాపు 60శాతం అంటే 2.4 కోట్ల టన్నుల వరకూ నూనె దిగుమతి చేసుకుంటున్నాం. ఇదే ఇపుడు వంటనూనెల ధరలు పెరుగుతాయేమోనన్న అనుమానాలకు తావిస్తోంది. ఎగుమతులపరంగా నాన్జిఎం అంటే జెనిటికల్లీ మోడిఫైడ్ కాని మార్కె ట్ పరంగాచూస్తే భారత్కు ఇదో మంచి అవకాశం. వేరుశెనగ పంటసీజన్ దాదాపుపూర్తిఅయింది.
మిగి లిన నూనెల ఉత్పత్తి మాత్రం ఇంకా కొనసాగు తోంది. తాజా నిర్ణయం ఇప్పటికిప్పుడు ఈనూనెల ఉత్పత్తిదారులకు మంచి లాభాలు తీసుకొచ్చేలా కనిపిస్తోంది. నిషేధానికిముందు అంటే 2008 లో లక్ష టన్నుల వేరుశెనగనూనె ఎగుమతి చేసే వారు. ఇపుడు నిషేధం ఎత్తివేయడంతో గరిష్ట లాభాలు పొందేందుకు వెంటనే చర్యలు తీసు కుంటున్నట్లు భారతీయ నూనెగింజనల ఉత్పత్తి దారులు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి విశ్లేషిస్తోంది. వీటికితోడు స్టాక్ మార్కెట్లలో కూడా నూనె ఉత్పత్తి కంపెనీల షేర్లు దౌడు తీస్తున్నాయి. గుజరాత్ అంబూజా ఎక్స్పోర్ట్ 114.45 రూపాయలు, ఆగ్రోటెక్ఫుడ్స్ 530., రుచిసోయా 27.95, ఎవిటినేచురల్ 38.35, గోకుల్ రీఫాయిల్స్ 24.65, పావారియా ఆగ్రో 8.45, ఆనిక్ ఇండస్ట్రీస్ 27.95, రుచి ఇన్ఫ్రా 3.75, విమల్ ఆయిల్స్ 46.50,సోయా ప్రొటీన్స్ 0.15, రాజ్ ఆయిల్మిల్స్ 1.75లకు పెరిగాయి. | 1entertainment
|
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
First Published 22, Jun 2017, 12:16 PM IST
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫొటో షూట్ స్టిల్స్
Recent Stories | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వీడియో: ఆమిర్తో కోహ్లీ ‘దింక చికా..’
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ స్టార్ ఆమిర్ఖాన్తో కలిసి ఓ టీవీ షోలో సందడి చేశాడు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ పాటలకు డ్యాన్స్ చేసి అభిమానుల మనసు ఆకట్టుకున్నాడు. ఆమిర్ నటించిన ‘రంగ్ దే బసంతి’లోని టైటిల్ సాంగ్తో పాటు సల్మాన్కు చెందిన ‘రెడీ’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘దింక చికా దింక చికా’ పాటకు ఖాన్తో కలిసి కోహ్లీ కాళ్లు కదిపాడు..
TNN | Updated:
Oct 16, 2017, 08:43PM IST
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్‌తో కలిసి ఓ టీవీ షోలో సందడి చేశాడు. సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ పాటలకు డ్యాన్స్‌ చేసి అభిమానుల మనసు ఆకట్టుకున్నాడు. ఆమిర్‌ నటించిన ‘రంగ్‌ దే బసంతి’లోని టైటిల్‌ సాంగ్‌తో పాటు సల్మాన్‌‌కు చెందిన ‘రెడీ’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘దింక చికా దింక చికా’ పాటకు ఖాన్‌తో కలిసి కోహ్లీ కాళ్లు కదిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో వీరిద్దరూ అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు.
విద్యాభ్యాసం గురించి వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను 12వ తరగతి కూడా కంప్లీట్‌ చేయలేదు. 11 పాసవ్వగానే భారత్‌ తరఫున అండర్‌-19 టీమ్‌లో ఆడేందుకు అవకాశం వచ్చింది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆమిర్ మాట్లాడుతూ.. ఒక్కోసారి సోషల్‌మీడియా వేదికగా అభిమానులు క్రికెటర్లపై మండిపడుతుంటడం చూస్తే.. తనకు చిర్రెత్తుకొస్తుందని తెలిపాడు. | 2sports
|
GRAB ON RENT
తెలంగాణకు విస్తరించిన ‘గ్రాబ్ఆన్రెంట్ సేవలు
హైదరాబాద్: భారత్లో అద్దెవ్యాపారం (షేరింగ్ ఎకానమి) 2025 నాటికి 335 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలున్నాయని, కేవలం అద్దెప్రాతిపదికన అవసరమైన వస్తువులను సమ కూర్చే సంస్థగా బెంగళూరులో ప్రారంభించిన గ్రాబ్ఆన్రెంట్ నేడు హైదరాబాద్లో కార్యకలాపాలు ప్రారంభించినట్లు సంస్థ సిఇఒ సుభమ్జైన్ వెల్లడించారు. రెండు నగరాల్లో 400 మందికిపైగా విక్రేతలు తమ క్లయింట్లుగా లభించారన్నారు. సరైనపద్ధతిలో వీరికి మార్కెట్ వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ద్రవిడ్ సలహా విజయ్ శంకర్ కెరీర్ను మలుపు తిప్పింది
ఇటీవలే టీమిండియాకు ఎంపికైన తమిళనాడు క్రికెటర్ విజయ్ శంకర్ కెరీర్ను ద్రవిడ్ సలహా మలుపు తిప్పింది.
TNN | Updated:
Nov 22, 2017, 01:07PM IST
తమిళనాడు క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడుతున్న విజయ్ శంకర్‌కు టీమిండియా నుంచి పిలుపొచ్చింది. భారత జట్టులో చోటు దక్కడం పట్ల ఈ ఆల్‌రౌండర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆనందంలో ఓ క్షణం పాటు మైండ్ బ్లాంక్ అయ్యిందని తెలిపాడు. విజయ్ శంకర్ గతంలో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసేవాడు. ఓసారి తన ఆరాధ్య క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు బౌలింగ్ చేసే అవకాశం లభించింది.
చెపాక్‌లో రాహుల్‌కు బౌలింగ్ చేయడం విజయ్‌కు కాస్త బెరుకుగా అనిపించింది. బంతిని సరిగా విసరలేకపోయాడు. అతడి ఇబ్బందిని గమనించిన ద్రవిడ్ బంతిని అందిస్తూ.. భయపడకు, నీ బౌలింగ్ యాక్షన్ నాకు నచ్చింది. లెంగ్త్ బాగుంది. కానీ కొంచెం అదనపు వేగంతో విసురు అని సలహా ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ ద్రవిడ్ విజయ్‌కు కిటుకులు నేర్పాడు. | 2sports
|
ATHELITICS
57వ జాతీయ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్కు సర్వం సిద్ధం
విజయవాడ: 57వ జాతీయ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ ఆంధ్రప్రదేశ్ రాజదాని ప్రాంతంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈపోటీల కోసం నిర్వాహకులు సర్వం సిద్దం చేశారు. ఇందుకోసం అత్యాధునిక హంగులతో క్రీడా సౌకర్యాలను సిద్ధం చేశారు. ఆరులేన్ల వార్మప్ ట్రాక్, అథ్లెట్ల వసతి కోసం ప్రత్యేక వసతి భవంతి రూపుదిద్దుకున్నాయి. వీటి ద్వారా ఒక ప్రత్యేక అథ్లెటిక్ హబ్ను రాజధానిలో ఏర్పాటు చేసి జాతీయ అథ్లెటిక్స్కే కాదు…అంతర్జాతీయ పోటీల నిర్వహణ మార్గాల కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎవి రాఘవేంద్ర చెప్పారు. ఈపోటీలలో 29రాష్ట్రలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన గోవా, పుదుచ్చేరి, యానాం నుంచి సుమారు వెయ్యిమంది పురుషులు, మహిళలు కలిసి అథ్లెట్లు పాల్గొంటున్నారు.
వీరితో సాంకేతికదారులు 300మంది, శిక్షకులు 80మంది, మేనేజర్లు 80మంది, వలంటీర్లు 200మంది, సహాయ సిబ్బంది 300మంది పాల్గొనన్నురు. పోటీలు జరిగే అంశాలు జంపింగ్ విభాగంలో లాంగ్ జంప్, హైజంప్, ట్రిపుల్ జంప్, పోల్ వాల్డ్, త్రోయింగ్ విభాగంలో షాట్ పుట్, డిస్కస్, జావెలిన్, హామ్మర్, రన్నింగ్ విభాగంలో స్ప్రింట్ 100మీ,200మీ, 400మీ.100మీ హర్డిల్స్, 400మీ హార్డిల్స్, 4100మీ రిలే, 4400మీ రిలే. వీటితోపాటు మధ్యదూరపు పరుగు విభాగంలో 800మీ, 1500మీ, 5000మీ, 10వేల మీ, 2000మీ.స్టీపుల్ ఛేజ్, 3000మీ. స్టీపుల్ ఛేజ్, 5కి.మీ నడక, 10కి.మీ నడక, 20కి.మీ నడక. కంబైన్డ్ ఈవెంట్స్ విభాగంలో హెప్టాథ్లాన్ (8అంశాలు), డెకాథ్లాన్ (10అంశాలు) | 2sports
|
Hyderabad, First Published 11, Jul 2019, 1:56 PM IST
Highlights
'RX100' సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకున్నాడు హీరో కార్తికేయ.. సైలెంట్ గా వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకొని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
'RX100' సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకున్నాడు హీరో కార్తికేయ.. సైలెంట్ గా వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకొని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దీంతో ఇండస్ట్రీలో కార్తికేయకు అవకాశాలు పెరిగాయి. తన రెండో సినిమా 'హిప్పీ' భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడంతో నిర్మాతలు నష్టాలపాలయ్యారు. సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. చాలా రియాల్లో నిర్మాతలు స్వయంగా విడుదల చేసుకోవడంతో నష్టం మరింత ఎక్కువైంది.
'RX100'తో వచ్చిన క్రేజ్ 'హిప్పీ'తో చతికిలపడింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కార్తికేయ కొత్త సినిమా 'గుణ 369'పై కూడా పడింది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల.. కార్తికేయ హీరోగా 'గుణ 369' రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కోసం కూడా బాగానే ఖర్చుపెట్టారు. ఈ సినిమాకి బిజినెస్ బాగా జరుగుతుందని ఆశ పడ్డారు.
కానీ అలా జరగడం లేదు. 'హిప్పీ' సినిమా ఎఫెక్ట్ తో 'గుణ 369' సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. పైగా సినిమాను ఆగస్ట్ 30న విడుదల చేయాలనుకుంటున్నారు. అదే రోజు హీరో నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' విడుదల కానుంది.
నాని సినిమాతో పోటీ అంటే వసూళ్లపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. అందుకే కార్తికేయ సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ నిర్మాతలు మాత్రం ఈ సినిమాను ఏదొక రేటుకి అమ్మేయాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
Last Updated 11, Jul 2019, 1:56 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అడుగు దూరంలో...
మహిళల డబుల్స్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ పోరుకు సానియా మీర్జా సిద్దమౌతోంది.
Rajesh Kalra , TNN | Updated:
Jul 11, 2015, 06:05PM IST
మహిళల డబుల్స్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ పోరుకు సానియా మార్టినా హింగిస్ జోడి సిద్దమౌతోంది. సెమీస్ పోరులో ప్రపంచ నెం.1 సానియా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ 6-1, 6-2తో వరుస సెట్లలో ఐదోసీడ్ రాక్వెల్ కోప్స్ జోన్స్-స్పియర్స్ (అమెరికా) ద్వయంపై విజయం సాధించి.. ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక టైటిల్ పోరు లో రెండోసీడ్ మకరోవా-వెస్నినా (రష్యా) జోడీతో సానియా జోడీ తాడోపేడో తేల్చుకోనుంది. కాగా గ్రాండ్స్లామ్ మహిళల డబుల్స్లో సానియా ఫైనల్కు చేరడం కెరీర్లో ఇది రెండోసారి. 2011 ఫ్రెంచ్ ఓపెన్లో సానియా-వెస్నినా జోడీ రన్నరప్గా నిలిచింది. మిక్స్డ్లో సానియా 3 గ్రాండ్స్లామ్ టైటిళ్లు నెగ్గింది. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
SHASN
ఐసిసి చైర్మన్గా కొనసాగేందుకు శశాంక్ మనోహర్ అంగీకారం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి)కి చైర్మన్గా వ్యవహ రించడమే ప్రపంచ క్రికెట్లో అత్యున్నత పదవిగా పేర్కొనవచ్చు. అలాంటి పదవికి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరచిన శశాంక్ తాజాగా ఐసిసి పాలకమండలి అభ్య ర్థన మేరకు వచ్చే ఏడాది జూన్ వరకు కొనసాగుతానని వెల్లడించాడు.
శశాంక్ మనోహర్ రాజీనామా నేపథ్యంలో నూతన చైర్మన్ను ఎవరిని ఎన్నుకోవాలని తర్జనభర్జనపడుతున్న ఐసిసికి ఉపశమనం లభించింది.తన నిర్ణయాన్ని మార్చుకుని చివరికి యూటర్న్ తీసుకున్న మనోహర్ 2018 జూన్ వరకు చైర్మన్గా కొనసాగేందుకు అంగీకారం తెలిపారు.శశాంక్ ఆ పదవిలో కొనసాగాలని బోర్డు డైరెక్టర్లు కోరుకుంటున్నాని ఐసిసి ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నాడు.త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడేఅవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. జూన్లో జరిగే వార్షిక సదస్సు అనంతరం పదవి నుంచి తప్పుకోవద్దని, మిగిలిన సంవత్సర కాలాన్ని పూర్తి చేయాలని ఐసిసిలో పనిచేస్తున్న తన సహచరులు కోరుతున్నారని శశాంక్ మనోహర్ ధృవీక రించాడు.గత సంవత్సరం మేలో ఐసిసి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన సంవత్సరం పూర్తి కాకుండానే పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించడం పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే బిసిసిఐతో ఆదాయ పంపిణీ విషయంలో విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో ప్రచారం జరిగిన శశాంక్ రాజీనామాకు నిర్ణయించుకున్నారని తాజాగా నూతన ఆదాయ పంపిణీకి బిసిసిఐ అమోదం తెలిపేలా కనిపించడంతో మనోహర్ ఆ పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లంకతో చివరి వన్డేకి శిఖర్ ధావన్ దూరం..?
శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నాడు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి
TNN | Updated:
Sep 2, 2017, 07:27PM IST
శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నాడు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శ్రీలంక నుంచి ఈ ఓపెనర్ భారత్‌కి పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల టెస్టులతో పాటు వన్డేల్లోనూ పరుగుల వరద పారించిన ధావన్.. ప్రస్తుతం జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ చివరి వన్డే అనంతరం భారత్ బుధవారం ఏకైక టీ20 మ్యాచ్‌ కూడా లంకతో ఆడనుంది.
ధావన్ దూరమైతే.. అతని స్థానంలో అజింక్య రహానె తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. అతను ఓపెనర్‌గా వస్తాడా..? లేదా మిడిలార్డర్‌లో కెప్టెన్ కోహ్లి అవకాశమిస్తాడో చూడాలి. ఎందుకంటే.. ఈ సిరీస్ ముందు వరకు ఓపెనర్‌గా ఉన్న కేఎల్ రాహుల్.. గత నాలుగు వన్డేల్లోనూ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. కానీ.. ఒకటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేకపోవడంతో ఐదో వన్డేలో ధావన్ స్థానంలో రాహుల్ మళ్లీ ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్‌లున్నాయి. ఒకవేళ రహానెకి అవకాశం దక్కకపోతే.. కేదార్ జాదవ్‌ తుది జట్టులోకి రావొచ్చు..! | 2sports
|
sumalatha 223 Views
sreesanth
కోచ్చి: భారతీయ క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ ఇంట్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. కోచ్చిలోని ఎడపల్లిలోని శ్రీశాంత్ ఇంటిలోని కింది అంతస్తులో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగి ఒక గది పూర్తిగా దగ్ధమైంది. ఒక సినిమా షూటింగ్ కోసం శ్రీశాంత్ ముంబై వెళ్లగా ఆయన భార్య పిల్లలు, పనివారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఇంట్లో నుంచి పొగలు, మంటలు కనిపించడంతో పొరుగువారు వెంటనే అగ్నిమాపక అధికారులకు ఫోన్ చేయగా అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది గ్లాస్ వెంటిలేటర్ పగులగొట్టి ఇంట్లోని వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తన భార్య, పిల్లలు మొదటి అంతస్తులో నిద్రిస్తుండగా కింది అంతస్తులోని డ్రాయింగ్ రూమ్లో మంటలు చెలరేగాయని శ్రీశాంత్ తెలిపారు. సీలింగ్ ఫ్యానులో షార్ట్ సర్కూట్ ఏర్పడిన కారణంగానే మంటలు ఏర్పడినట్లు భావిస్తున్నారు.
తాజా ఎడిటోరియల్ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/editorial/ | 2sports
|
Jewellery Mart
కళతగ్గిన బులియన్ మార్కెట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ధోరణులు నీరసించడంతో బంగారంధరలు మరింతగా పడిపో తున్నాయి. మంగళవారం దేశరాజధాని పరిసర మార్కెట్లలో పదిగ్రాముల బంగారంధరల్లో 200 రూపాయలు దిగజారింది. స్థానిక జ్యూయెలర్లనుంచి కొనుగోళ్లు లేకపోవడం, మార్కెట్ధోరణులు ఆశా జనకంగా లేకపోవడమే ఇందుకుకీలకం. వెండి ధరలు కూడా రూ.300 దిగజారి కిలో 42,500 కు చేరింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయా రీదారులనుంచి డిమాండ్ మందగించడమే ఇం దుకుకీలకం. ఫెడ్రిజర్వు వడ్డీరేట్లు పెంచితే వచ్చే వారంనుంచి బంగారంధరలు మరింత తగ్గుతాయి. పెట్టుబడులన్నీ బాండ్ల మార్కెట్వైపు మళ్లే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది. అందువల్ల బాండ్ల మార్కెట్ పెరిగితే బంగారంపెట్టుబడులన్నీ అటు వైపు తరలిపోతాయి. స్థానిక జ్యూయెలర్లు, రిటై లర్లు దేశీయ స్పాట్మార్కెట్లలో కూడా ధరలపై వత్తిడి ఉంటుందని అంచనా. అంతర్జాతీ యంగా కూడా బంగారం సింగపూర్మార్కెట్లో 0.03 శాతం తగ్గి 1224.70డాలర్లుగా నిలిచింది. వెండి ధరల్లో కూడా 0.34శాతం క్షీణించి సింగపూర్ మార్కెట్లో ఔన్స్ ఒక్కింటికి 17.70 డాలర్లుగా నిలిచింది. ఇక దేశరాజధానిలో 99.9 కేరట్లు, 99.5 కేరట్ల స్వఛ్ఛమైన బంగారం రూ.200 తగ్గి 29,550, రూ.29,400 రూపాయలుగా ఉంది. సోమవారం కూడా బంగారంధరల్లో రూ.350 తగ్గింది. సవర్లలో చూస్తే ఎనిమిది గ్రాముల బంగారం 24,500 రూపాయలుగా ఉంది. బంగా రంతోపాటు వెండిధరలు కూడా తగ్గుతున్నాయి. రూ.300 తగ్గి కిలో ఒక్కింటికి 42,500గా ఉంది. వెండి నాణేలపరంగా ప్రతి వందనాణేల కొనుగో లుకు రూ.73 వేలు, విక్రయాలకు రూ.74 వేలుగా కొనసాగుతోంది. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఐపీఎల్లో మళ్లీ కోహ్లీని వెనక్కినెట్టిన రైనా..!
ఐపీఎల్లో తనకు తిరుగులేదని చెన్నై సూపర్ కింగ్స్ హిట్టర్ సురేశ్ రైనా మరోసారి నిరూపించుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం రాత్రి
Samayam Telugu | Updated:
May 23, 2018, 04:23PM IST
ఐపీఎల్లో తనకు తిరుగులేదని చెన్నై సూపర్ కింగ్స్ హిట్టర్ సురేశ్ రైనా మరోసారి నిరూపించుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 22 పరుగులు చేసిన సురేశ్ రైనా మొత్తం 4,953 పరుగులతో 11 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డుల్లో నిలిచాడు. ఇటీవల రైనా రికార్డుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి 4,948 పరుగులతో అధిగమించినా.. నిన్న రాత్రి మళ్లీ రైనా అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. 2008 నుంచి ఇప్పటి వరకు 11 ఐపీఎల్ సీజన్లు జరగగా.. ఇందులో 9 సీజన్లలో రైనా 400+ స్కోరు చేయడం ఈ టోర్నీలో అతని జోరుకి నిదర్శనం. మిగిలిన రెండు సీజన్లలోనూ 399, 374 పరుగులు చేశాడు.
ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో సురేశ్ రైనా (4,953), విరాట్ కోహ్లి (4,948) తర్వాత రోహిత్ శర్మ (4,493), గౌతమ్ గంభీర్ (4,217), రాబిన్ ఉతప్ప (4,081) ఉన్నారు. ఇప్పటికే తాజా ఐపీఎల్ సీజన్ నుంచి బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు నిష్ర్కమించిన నేపథ్యంలో.. రైనా టాప్ స్కోరర్ రికార్డు వచ్చే ఏడాది వరకూ కొనసాగే అవకాశం ఉంది. మంగళవారం రాత్రి హైదరాబాద్పై గెలిచిన చెన్నై జట్టు ఫైనల్కి చేరిన విషయం తెలిసిందే. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సెన్సార్ స్టేజ్లో సలోని ఐటంసాంగ్ సినిమా
కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సినీ మహల్.
| Updated:
Jan 25, 2016, 10:26PM IST
సెన్సార్ స్టేజ్లో సలోని ఐటంసాంగ్ సినిమా
కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్ధాంశ్ , రేయాన్ రాహుల్ , తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సినీ మహల్. రోజుకు 4 ఆటలు అనే ట్యాగ్ లైన్తో లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ సహనిర్మాతలుగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినీ మహల్ సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ 'సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోవడానికి సిద్ధమైంది. కొత్త తరహాలో సాగే కథనంతో ఆద్యంతం ఆకట్టుకునే చిత్రమిది. లక్ష్మణ్ వర్మ చక్కగా తెరకెక్కించారు. సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని బాగా నటించారు. ముఖ్యంగా సలోనిగారు చేసిన స్పెషల్ సాంగ్కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే శేఖర్ చంద్ర అందించిన సంగీతానికి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సలోనిగారికి థాంక్స్. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫ్రిభ్రవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Visit Site
Recommended byColombia
ఒక్కరాత్రి తనతో గడిపితే ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని, లేకపోతే నువ్వు ఏం చేయలేవని తనను లైంగికంగా వేధించాడని మోడల్, నటి కేట్ శర్మ ఆరోపించారు. పోలీసులను ఆశ్రయించి సుభాష్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తనపై వచ్చిన రేప్ ఆరోపణలను సీరియస్గా తీసుకోని దర్శకుడు సుభాష్.. ఫ్యాషనైపోయిందని పేర్కొన్న కొన్ని గంటలకే కేట్ శర్మ ఫిర్యాదు చేయడం గమనార్హం. ‘సుభాష్ ఘాయ్ ఆగస్టు 6న తన ఇంటికి నన్ను పిలిచారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఆరుగురు వ్యక్తులున్నారు. మసాజ్ చేస్తావా అని వారి ముందే నన్ను అడిగాడు. పెద్దాయన అన్న గౌరవంతో రెండు నుంచి మూడు నిమిషాలు మసాజ్ చేశా. చేతులు కడుక్కోవడానికి బాత్రూమ్లోకి వెళ్తే నా వెంటే ఆయన వచ్చారు.
ఏదో మాట్లాడాలి అని చెప్పి నన్ను తన బెడ్రూమ్కు తీసుకెళ్లారు. అకస్మాత్తుగా నన్ను దగ్గరికి లాక్కుని కౌగిలించుకున్నాడు. ఆపై ముద్దు పెట్టబోయాడు. నేను త్వరగా వెళ్లిపోవాలి అని చెప్పా. ఓ రాత్రి తనతో గడిపితే ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను. లేకపోతే నీకు మరో అవకాశం లేదని’ వేధించినట్లు మోడల్ కేట్ శర్మ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బహిర్గతం చేశారు.
Read also: MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి
సుభాష్ ఘాయ్తో పాటు అలోక్నాథ్, కైలాష్ కేర్, రజత్ కపూర్, సాజిద్ ఖాన్, వికాస్ బెహెల్, తదితర బాలీవుడ్ ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్నారు. భారత్లో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకుంది. కొందరు సినిమా ప్రాజెక్టుల నుంచి తప్పుకోగా, మరికొందరు మాత్రం పాపులర్ అయ్యేందుకు తప్పుడు ఆరోపణలుచేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Mar 17,2017
జియో ఉచిత ఆఫర్లపై స్టే ఇవ్వలేం..
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన ప్రముఖ టెలికాం ఆపరేటర్ సంస్థ రిలయన్స్ జియో అందిస్తున్న జియో ప్రమోషనల్ ఆఫర్పైనా స్టే ఇవ్వలేమని టెలికాం వివాదాల కమిటీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గురువారం వెల్లడించింది. కానీ ఫ్రీ ఆఫర్ను కొనసాగించిడానికి సదరు ఆపరేటర్కు ఇచ్చిన అనుమతులను 'పున:పరిశీలించాలని' టెలికాం నియంత్రణ సంస్థ (ట్రారు)కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని కోరింది. జియో ఉచిత ఆఫర్లపై స్టే విధించాలని కోరుతూ ఎయిర్టెల్, ఐడియా వేసిన మధ్యంతర అప్పీల్పై ఆదేశాలను టెలికాం ట్రిబ్యునల్ రిజర్వులో పెట్టిన సంగతి తెలిసిందే. కాగా గతేడాది సెప్టెంబర్ నుంచి జియో ఉచిత వాయిస్, డేటా ప్లాన్ను కస్టమర్లకు అందిస్తోంది. డిసెంబర్లో రిలయన్స్ జియో 'హ్యాపీ న్యూ ఇయర్' పేరిట తన ఉచిత సేవలను 2017 మార్చి 31 వరకు పొడగించింది. దీనికి ట్రారు అనుమతివ్వడాన్ని ఎయిర్టెల్, ఐడియా సవాలు చేశాయి. వెంటనే ఫ్రీ ఆఫర్పై స్టే ఇవ్వాలని ట్రిబ్యునల్ను కోరాయి. అందుకు వ్యతిరేకంగా టీడీశాట్ తన నిర్ణయం వెలువరించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 16, May 2019, 11:31 AM IST
Highlights
ఫారెన్ కు చెందిన నటులు భారతీయ చిత్రాల్లో నటించేందుకు ఇక్కడికి వస్తుంటారు. కళకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రష్యా నుంచి బతుకుదెరువు కోసం ఓ చిత్రం నటించేందుకు వచ్చిన నటుడు మృతి చెందాడు.
ఫారెన్ కు చెందిన నటులు భారతీయ చిత్రాల్లో నటించేందుకు ఇక్కడికి వస్తుంటారు. కళకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రష్యా నుంచి బతుకుదెరువు కోసం ఓ చిత్రం నటించేందుకు వచ్చిన నటుడు మృతి చెందాడు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు.
అలెక్స్ సెండర్(38) అనే నటుడు టూరిస్ట్ వీసాపై ఓ చిత్రంలో నటించేందుకు రష్యా నుంచి హైదరాబాద్ వచ్చాడు. డిఎల్ఎఫ్ బిల్డింగ్ వద్ద అకస్మాతుగా అతడు సృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతడిని కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అలెక్స్ బుధవారం మరణించాడు.
అలెక్స్ మృతికి ఇక్కడి వాతావరణ పరిస్థితులే కారణం అని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు మండిపోతున్నాడు. తీవ్రమైన వేడితో అలెక్స్ వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే గుండెపోటు కూడా రావడం అతడి మృతికి కారణం అని వైద్యులు తెలిపారు. | 0business
|
internet vaartha 152 Views
ఆస్ట్రేలియా 132/6 (20 ఓవర్లు) ఇంగ్లండ్ 127/7 (20 ఓవర్లు)
న్యూఢిల్లీ : టి20 మహిళల ప్రపంచ కప్లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా మహిళలు గెలుపొందారు.కాగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసింది.కాగా తరువాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయడంతో ఆసీస్ 5 పరుగులతో విజయం సాధించింది.ఆస్ట్రేలియాకు చెందిన లాన్నింగ్ 55 పరుగులు,హీలీ 25 పరుగులు,విల్లానీ 19 పరుగులు చేశారు.కాగా ఇంగ్లండ్కు చెందిన ఎడ్వర్డ్స్ 31 పరుగులు,భీమాంట్ 32 పరుగులు,సారా టేలర్ 21 పరుగులు మాత్రమే ఒక మోస్తరుగా చేశారు.ఆస్ట్రేలియా బౌలర్లు ష్కట్ 2 వికెట్లు, పెర్రీ,పెర్రెల్,బీమ్స్,అస్బార్సీలకు ఒక్కొక్కరికి ఒక వికెట్ లభించింది. | 2sports
|
sumalatha 117 Views bse , NSE , stock market
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 361 పాయింట్లు కోల్పోయి 38,305కు పడిపోయింది. నిఫ్టీ 114 పాయింట్లు పతనమై 11,359కు దిగజారింది. ఈ రోజు మధ్యాహ్నం వరకు లాభాల్లో ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ ఏకంగా 726 పాయింట్ల వరకు నష్టపోయింది. బ్యాంకింగ్ స్టాకులు తీవ్ర స్థాయిలో అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు కుప్పకూలాయి. చివర్లో సూచీలు కొంత మేర కోలుకున్నాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/ | 1entertainment
|
పవన్ కళ్యాణ్ ను తోసేసి ఎన్టీఆర్ పక్కన చేరాడు
Highlights
ఓవర్సీస్ లో దూసుకెళ్తున్న నిన్నుకోరి కలెక్షన్స్
ఫస్ట్ వీక్ లోనే 20 కోట్ల ఓవర్సీస్ వసూళ్లతో నిన్నుకోరి హిట్
నాలుగు 20 మిలియన్ సినిమాలతో ఎన్టీఆర్ సరసన నాని
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయనాయకుడిగా ప్రజలకు మరింత చేరువ అయ్యారు. ఓ వైపు సినిమాలు తీస్తూనే..రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ సినిమాలంటే భారీ అంచనాలుంటాయి. కాకపోతే ఆ మద్య వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ కాగా..‘కాటమ రాయుడు’ చిత్రంపై మిశ్రమ స్పందన వచ్చింది.
ఇక తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో పైకి వచ్చాడు నేచురల్ స్టార్ నాని. గత మూడు సంవత్సరాల నుంచి నానీ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే. నాని నటించిన తాజా చిత్రం నిన్ను కోరి సినిమాతో వరుసగా ఏడో హిట్ అందుకున్నాడు.
ఈ క్రమంలోనే హిట్ టాక తెచ్చుకున్న నిన్ను కోరి సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికే రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి లాభాల భాటలో దూసుకుపోతోంది. ఇటీవల రిలీజ్ అయిన అల్లు అర్జున్ డీజే సినిమా ఓవర్సీస్లో ఈ మార్క్ సాధించేందుకు అష్టకష్టాలు పడితే నిన్ను కోరితో నాని చాలా సులువుగానే మిలియన్ మార్క్ దాటేశాడు.
అంతే కాదు నాని నిన్ను కోరి సినిమాతో ఓవర్సీస్లో పవన్కళ్యాణ్ రికార్డును బీట్ చేసేశాడు. నిన్ను కోరి మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడంతో నాని ఖాతాలో ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్ సినిమాలతో కలిసి మొత్తం నాలుగు మిలియన్ డాలర్ సినిమాలు ఉండటంతో కొత్త రికార్డు స్థాపించాడు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, టెంపర్, బాద్ షా సినిమాలతో నాలుగు మిలియన్ డాలర్ల సినిమాల రికార్డు ఉన్న ఎన్టీఆర్ సరసన ఇప్పుడు నాని చేరాడు.
Last Updated 25, Mar 2018, 11:51 PM IST | 0business
|
Feb 23,2019
మళ్లీ నష్టాల్లోకి జారిన సెన్సెక్స్
ముంబయి : వరుసగా తొమ్మిది రోజులు భారీగా నష్టపోయి.. తిరిగి రెండు సెషన్లలో ఉపశమనం లభించిందని భావించినంతలోనే.. సెన్సెక్స్్ మళ్లీ శుక్రవారం నష్టాల్లోకి జారింది. భారత వృద్ధి రేటుపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పరపతి సమీక్ష మినెట్స్లో ఆందోళన వ్యక్తం చేయడంతో వారాంతంలో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 26.87 పాయింట్లు లేదా 0.07 శాతం నష్టపోయి 35,871.48కు తగ్గింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.80 పాయింట్లు పెరిగి 10,791.65 వద్ద ముగిసింది.
సెన్సెక్స్-30లో టాటా మోటార్స్, యస్ బ్యాంకు, వేదాంత, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం స్టాక్స్ 3.01 శాతం వరకు లాభపడి మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. మరోవైపు కొటాక్ బ్యాంకు, రిలయన్స్ ఇండిస్టీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ సూచీలు 3.75 శాతం మేర అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మిడ్క్యాప్ 0.38 శాతం, స్మాల్క్యాప్ 0.77 శాతం చొప్పున రాణించాయి. లోహ, ఆటో, రియాల్టీ, పవర్, ఆయిల్అండ్ గ్యాస్ సూచీలు 1.62 శాతం వరకు పెరిగాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Dec 23,2016
పాస్వర్డ్ ఎవ్వరికీ చెప్పొద్దు: ఐటీ
ముంబయి : పన్ను చెల్లింపుదారులు తమ యూజర్ ఐడి, పాస్వర్డ్ను ఎవరితో పంచుకోవద్దని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఒకవేళ ఈ వివరాలు అనధికారిక వ్యక్తుల చేతులోకి వెళ్తే చెల్లింపుదార్ల కీలక సమాచారం దుర్వినియోగానికి గురైయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పాస్వర్డ్, యూజర్ ఐడీలలో కనీసం ఎనిమిది అక్షరాలు ఉండేలా, అందులోపూ అంకెలు, ప్రత్యేక అక్షరాలు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు యూజర్ ఐడీ, పాస్వర్డు ఎంతో కీలకమైందని పేర్కొంది. వీటితో టిడిఎస్ సంబంధిత రహస్య సమాచారం, కీలకమైన డేటా దిద్దుబాటుకు గురయ్యే అవకాశముంటుందని హెచ్చరించింది. మీ ఈ-మెయిల్ అకౌంట్ ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డుల కీలక సమాచారం కూడా ఇతర వ్యక్తుల చేతిల్లోకి పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.