news
stringlengths
299
12.4k
class
class label
3 classes
'BOSS BUSTER ఇచ్చావ్.. థాంక్స్ డాడీ' : రామ్ చరణ్! First Published 2, Oct 2019, 2:34 PM IST ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తనకు కానుకగా ఇచ్చినందుకు తన తండ్రి చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు  ఇన్స్టాగ్రామ్ లో క్యూట్ ఫొటోలను షేర్ చేశారు. మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో హిట్ దిశగా దూసుకుపోతుంది. మొదటి నుండి ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావించిన చిత్రబృందం సినిమాకి వస్తోన్న టాక్ తో సంబరాలు చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది. ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. ‘మాకు అన్నీ ఇచ్చిన వ్యక్తి. ఇంతటి బాస్ బస్టర్‌ను మాకు అందించినందుకు థ్యాంక్స్ నాన్నా’ అంటూ తన తండ్రితో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి భారీ బడ్జెట్ సినిమా తీసినందుకు చిరు కుమారుడిని ప్రేమగా ముద్దాడారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల చేశారు. హిందీలో కూడా క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం విశేషం. Recent Stories
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బిగ్‌బాస్ హౌస్‌లో ఓవర్ యాక్షన్ డోస్! విపరీతమైన జాలి, భరించలేనంత ప్రేమ, కనిపించనంత కన్నింగు, బీభత్సమైన నటన... ఇలా నవరసాలు చూడాలని ఉందా? అయితే, ఈ వారం బిగ్‌బాస్ మిస్ కాకుండా చూడాల్సిందే. ఎందుకంటే.. TNN | Updated: Sep 19, 2017, 04:16PM IST బిగ్‌బాస్ హౌస్‌లో ఓవర్ యాక్షన్ డోస్! విపరీతమైన జాలి, భరించలేనంత ప్రేమ, కనిపించనంత కన్నింగు, బీభత్సమైన నటన... ఇలా నవరసాలు చూడాలని ఉందా? అయితే, ఈ వారం బిగ్‌బాస్ మిస్ కాకుండా చూడాల్సిందే. ఎందుకంటే.. ఇప్పటి వరకు తోటి సభ్యులను ఎలిమినేట్ చేయడంలో బిజీగా ఉన్న సభ్యులు ఇప్పుడు.. తమని తాము ప్రమోట్ చేసుకుని ఓట్లు పొందాల్సి ఉంటుంది. దీంతో, బిగ్‌బాస్ సభ్యులు వినోదంతో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. సోమవారం ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు.. ‘‘బిగ్‌బాస్.. ఏమిటీ వీళ్ల ఓవర్ యాక్షన్’’ అంటూ తలలు పట్టుకుంటున్నారు. అందుకే, మంగళవారం ఎపిసోడ్‌లో హౌస్ సభ్యులను చిక్కుల్లో పెట్టే టాస్క్ సిద్ధం చేశాడు బిగ్‌బాస్. సోమవారం ఎపిసోడ్‌లో సభ్యుల తీరు చూసిన ప్రేక్షకులు ‘‘అబ్బో ఎంత మార్పు’’ అని నోరు వెళ్లబెట్టారు. ఆఖరి వారం సందర్భంగా ప్రేక్షకులను సృజనాత్మకంగా ఓట్లు అడగాలని బిగ్‌బాస్ కోరాడు. Read Bigg Boss Telugu Updates Here: బిగ్‌బాస్ అన్ని ఎపిసోడ్‌లు ఒక్కక్లిక్‌తో ఇందులో ఆదర్శ్, నవదీప్, శివ బాలాజీ పర్వాలేదనిపించినా.. అర్చనా, హరితేజాలు మాత్రం బోర్ కొట్టించారనే అభిప్రాయం వ్యక్తమైంది. మంచి ప్రతిభతో ఆకట్టుకుంటున్న హరితేజా.. కాస్త ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిదని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇక అర్చనపై దారుణమైన కామెంట్లు వస్తున్నాయి. అసలు, అర్చనాకు ఎవరు ఓటేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆమె దీక్షను ఏడిపించడంతోనే అర్చనా సగం రోజులు గడిపేసిందని, ఒకే విషయాన్ని సాగదీస్తూ చంపేస్తుందని అంటున్నారు. అర్చనను కాపాడేందుకు.. హౌస్‌మేట్స్ అంతా దీక్షను టార్గెట్ చేసుకున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వారిని ఎదుర్కోవడంలో దీక్ష కూడా ఫెయిల్యూర్ అయ్యిందని, అతిగా స్పందిస్తూ.. గంటకో మాట మాట్లాడుతూ విసుగు తెప్పించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అర్చనా - దీక్షాలు ఎదురుపడితే చానెల్ మార్చేసేవాళ్లమని, దీక్ష వెళ్లిపోవడం మంచిదైందని పలువురు అంటున్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌పై వస్తున్న పలు కామెంట్లు ఇక్కడ చూడొచ్చు.. — raja (@rajarktweets) September 12, 2017 లీడింగ్‌లో ఆదర్శ్..: ఓ ఆన్‌లైన్‌ పోల్‌ వివరాల ప్రకారం.. ఐదుగురు సభ్యుల్లో ఆదర్శ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అతని తర్వాత శివ బాలాజీ, హరితేజ ఉన్నారు. నవదీప్‌కు కూడా కాస్త ఫర్వాలేదని అనిపిస్తున్నాడు. అర్చనకు మాత్రం చాలా తక్కువ ఓట్లు వస్తున్నాయి. అయితే, ఈ వారం రోజులు బిగ్‌బాస్‌లో జరిగే తతంగం బట్టి ఓట్లలో వ్యత్యాసం కనపడవచ్చు. ప్రేక్షకులను ఆకట్టుకునే క్రమంలో సభ్యులు చేసే ఓవర యాక్షన్ కూడా వినోదం పంచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలా మంచి స్నేహితులుగా కనిపిస్తున్న ఆ ఐదుగురు సభ్యులు చివరి రోజుకు శత్రువులుగా మారిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. బిగ్‌బాస్ సభ్యులకు ఓటేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Apr 12,2017 జియోనీ ఎ1 స్మార్ట్‌ఫోన్‌ భారీ రికార్డు రూ.150కోట్ల విలువైన బుకింగ్‌లు! న్యూఢిల్లీ: చైనీస్‌ తయారీ జియోనీ సంస్థ ఎ1 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన 10 రోజుల్లోనే 74,682 ముందస్తు బుకింగ్‌లు వచ్చినట్టు సంస్థ వెల్లడించింది. ఈ బుకింగ్‌ ఆర్డర్‌ల విలువ సుమారు రూ.150 కోట్ల విలువ ఉంటుందని పేర్కొంది. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 9 వరకు జియోనీ ఎ1 ఫ్రీ బుకింగ్‌లను తీసుకోవడం ప్రారంభించినట్టు వివరించింది. అయితే ఈ ఫోన్‌ పట్ల కస్టమర్స్‌ నుంచి ఈ స్థాయిలో ఆదరణ లభించడానికి ముఖ్య కారణం..ఈ స్మార్ట్‌ఫోన్‌ కొన్నవారికి రెండేండ్ల వారంటీతో పాటు జేబీఎల్‌ హెడ్‌ఫోన్స్‌ లేదా స్వీస్‌ మిలటరీ బ్లూటూత్‌ స్పీకర్స్‌ అందజేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. ప్రధానంగా రూ.8,000-25,000 ధరల మధ్యలో ఉన్న ఫోన్ల్‌కు భారీగా బుకింగ్‌లు ఉంటాయని జియోనీ ఇండియా సీఈవో అరవింద్‌ ఆర్‌.వోహ్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అడ్వాన్స్‌ సెల్ఫీ సామర్థ్యాలు, ఎక్కువ కాలం బ్యాటరీ మన్నిక ఈ ఫోన్‌ ప్రత్యేకతలు అని ఆయన తెలిపారు. దీని ధర రూ.19,999 ఉండగా.. 16 ఎంపి సెల్పీ కెమేరా, 13 ఎంపి వెనుక కెమేరా, 2గిగాహెడ్జ్‌, 5.5 అంగుళాల తెర, 4జీబీ ర్యామ్‌తో అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ఆస్ట్రేలియా పతనంలో ఇద్దరు మణికట్టు బౌలర్లు కుల్దీప్, చాహల్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రమాదకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, మార్కస్‌ స్టొయినిస్‌ను కుల్‌దీప్‌ పెవిలియన్‌కు పంపించగా.. భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగిన మాక్స్‌వెల్‌, మాథ్యూ వేడ్‌, కమిన్స్‌ను చాహల్‌ ఔట్‌ చేశాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లకూ వికెట్ల వెనక నుంచి ధోనీ విలువైన సలహాలిచ్చాడు. మహీ ఇచ్చిన సూచనలు స్టంప్స్‌ మైక్‌లో రికార్డయ్యాయి. ‘వో మార్నే వాలా దాల్‌నా.. అందర్‌ యా బాహర్‌ కోయీ భీ (షాట్‌ కొట్టే బాల్ వేయి.. వికెట్ల వైపు లేదా బయటకి టర్న్‌ అయినా సరే), ఘూమ్నే వాలా దాల్‌ ఘూమ్నే వాలా దాల్‌.. (టర్న్‌ అయ్యే బాల్ వెయ్యి)’ అని కుల్‌దీప్‌కు ధోనీ సూచించాడు. సిక్సర్లు బాదుతున్న మాక్స్‌వెల్‌ను ఔట్‌ చేయడానికి స్పిన్నర్లిద్దరికీ నేరుగా స్టంప్స్‌ పైకి బాల్ వేయొద్దని (స్టంప్‌ పే మత్‌ దాల్‌) మహీ సూచించాడు. తాను అనుకున్న రీతిలో కుల్‌దీప్ బాల్ వేయకపోవడంతో.. ‘అరే బాహర్‌ దాల్‌, ఇస్కో ఇత్నా ఆగే నహీ (స్టంప్స్‌కు దూరంగా బాల్ వేయి.. అతడి ముందు వేయకు)’ అని ధోనీ చెప్పాడు. చాహల్‌ కూడా అదే మూస పద్ధతిలో బౌలింగ్ చేస్తుండటంతో.. ధోనీ కాస్త పెద్ద గొంతు చేసుకొని ‘ఐసే ఐసే దాలో, తు భీ సున్తా నహీ హై క్యా (నువ్వు కూడా చెప్పింది వినిపించుకోవా.. ఇలా అలా వెయ్యి)’ అంటూ గట్టిగా చెప్పాడు. కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ మైదానంలో ఎన్నో వ్యూహాలను రచిస్తాడు. అందుకనుగుణంగా టీమ్మేట్స్‌కు అనేక సూచనలిస్తాడు. అంతేకాకుండా అతడు తన సహచరులతో.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లతో ఆడేటప్పుడు హిందీలోనూ.. బంగ్లాదేశ్, పాక్ లాంటి జట్లతో ఆడేటప్పుడు ఇంగ్లిష్‌లోనూ సంభాషించడం గమనార్హం. మైదానంలో సంకట పరిస్థితుల్లో కెప్టెన్ విరాట్ కోహ్లి.. మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సలహాలు తీసుకోవాలని సునీల్ గవాస్కర్.. అంత ఆశామాషీగా చెప్పలేదని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది టీ20, వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న కోహ్లికి మరికొంత కాలం సీనియర్‌ ధోనీ సాయపడాలని గవాస్కర్ సూచించాడు. ‘భారత జట్టుకు ధోనీ చాలా విజయవంతమైన కెప్టెన్. అందువల్ల అతడికి అప్పుడప్పుడూ బౌలర్లతో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఫీల్డింగ్ సర్దుబాటులో ధోనీకి కూడా కొంచెం స్వేచ్ఛనివ్వాలి. అతడు జట్టును గెలిపించడానికే ప్రయత్నిస్తాడనే విషయాన్ని కోహ్లి గుర్తించాలి’ అని గవాస్కర్ అన్నాడు.
2sports
Jul 15,2016 విజయ్ మాల్యాకు మరో షాక్‌! నవతెలంగాణ-న్యూఢిల్లీ : వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్‌ డాన్‌ విజయ్  మాల్యాపై సుప్రీంకోర్టులో కోర్టుధిక్కార పిటిషన్‌ దాఖలైంది. స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం గురువారం ఈ పిటిషన్‌ దాఖలు చేసింది.సుప్రీంకోర్టు ఆదేశించినా మాల్యా తన ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడంతో ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని బ్యాంకుల కన్సార్టియం తన పిటిషన్‌లో కోరింది. ఈ నెల 18న సుప్రీంకోర్టు పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభ ప్రభావం కొనసాగొచ్చు కార్పొరేట్‌ ఆదాయాలు రాణిస్తాయ  అంతర్జాతీయంగా లోహాల గిరాకీ అంతంతే ఇంటర్వ్యూ ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇండియా ఎండీ, సీఐఓ ఆనంద్‌ రాధాకృష్ణన్‌ ప్రస్తుతం మార్కెట్లో అంత ఉత్సాహం కనిపించడం లేదని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇండియా ఎండీ, సీఐఓ ఆనంద్‌ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. ఎన్నికల అనిశ్చితి, కార్పొరేట్‌ పాలనలో అవకతవకలు, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభ ప్రభావం కొనసాగుతుండడం ఇందుకు కారణాలని ఆయన అంచనా వేశారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం కార్పొరేట్‌ ఆదాయాల్లో మరింత ఉత్సాహం కనిపించవచ్చని కోజెన్సిస్‌ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంకా పలు అంశాలపైనా సవివరంగా మాట్లాడారు. ఆ విశేషాలు.. * ఇటీవల చోటు చేసుకున్న కార్పొరేట్‌ పాలన సమస్యలు మదుపర్ల సెంటిమెంటుపై ప్రభావం చూపుతున్నాయి. ఈ తరహా వ్యవహారాలు ఇంకా బయటపడవచ్చంటారా కార్పొరేట్‌ పాలనలో స్వతంత్ర డైరెక్టర్ల సంఖ్య కూడా ఒక అంశమే. అయితే అది మదుపర్లపై ప్రభావం చూపేది కాదు. కానీ సీఈఓలకిచ్చే వేతన పరిహారాలు, పారదర్శకత, ఖాతా ప్రమాణాల వంటివి మాత్రం ప్రభావం చూపుతాయి. కావాలని ఏదైనా (ప్రతికూల) సమాచారాన్ని బయటకు చెప్పకుండా ఉంటే యాజమాన్యంపై పెట్టుబడుదార్లు విశ్వాసం కోల్పోతారు. కొన్ని కంపెనీలు ఖాతా విధానాలపై కఠినంగా ఉంటాయి. మరికొన్ని ఫర్వాలేదన్నట్లుగా ఉంటాయి. కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితుల్లో కంపెనీలు ఎలా వ్యవహరిస్తాయన్నదానిపై వాటి వ్యాపారాలు ఆధారపడి ఉంటాయి. అయితే వ్యవస్థలో ఒత్తిడి మొదలైతే ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ఆ ప్రభావం పడుతూనే ఉంటుంది. * ఏదైనా కంపెనీలో పెట్టుబడులు పెట్టే సమయంలో మీరు ఎలాంటి అంశాలను పరిశీలిస్తారు? ఇటీవల కార్పొరేట్‌ పాలన సమస్యల్లో చిక్కుకున్న కంపెనీల్లో పెట్టుబడులేమైనా పెట్టారా మొత్తం వ్యవస్థను పరిశీలిస్తాం. కార్పొరేట్‌, సామాజిక పరిస్థితులన్నిటినీ బేరీజు వేస్తాం. మా విశ్లేషణ వ్యవస్థ వీటిని తనిఖీ చేస్తుంది. తొలుత ప్రాథమిక అంచనా వేశాక.. ఆ తర్వాత లోతుగా విశ్లేషిస్తాం. అందువల్లే తప్పులు జరగకుండా ఉంటాయి. మా ఫండ్‌లలో రెండింటికి సన్‌ ఫార్మాలో పెట్టుబడులు ఉండేవి. అయితే ఆ కంపెనీలో కార్పొరేట్‌ పాలన సమస్యలు వచ్చాక.. మేం దాన్నుంచి బయటకొచ్చాం. అయినా అందులో మేం పెట్టిన పెట్టుబడి తక్కువే. ఇక జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో ఎలాంటి పెట్టుబడులు లేవు. వేదాంతాలో మాకు చెందిన ఒక ఫండ్‌కు పెట్టుబడులున్నాయి. * గత పాతికేళ్లలోనే స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపిన అతిపెద్ద సంక్షోభం ఎన్‌బీఎఫ్‌సీల్లోని ద్రవ్య లభ్యత కొరతే అని అన్నారు. ఆ సంక్షోభ ప్రభావం ఇంకా కొనసాగుతోందా మరికొద్ది కాలంపాటు ఆ సంక్షోభ ప్రభావం కొనసాగొచ్చు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఈక్విటీ, డెట్‌ మార్కెట్లోకి నగదు వచ్చింది. ఈక్విటీల్లోకి వచ్చిన నగదు వెనక్కివెళ్లింది. అందువల్లే మధ్య స్థాయి కంపెనీల షేర్లు నష్టాల పాలయ్యాయి. ఇపుడు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ మార్కెట్లో అది జరుగుతోంది. కాబట్టి ఆ సంక్షోభం ఇంకా పూర్తవ్వలేదనే నేను భావిస్తున్నా. * దీని ప్రభావం వల్ల రూపాయి ఒత్తిడిలోకి వెళుతుందా పెట్టుబడుల ఉపసంహరణ ఎక్కువగా ఉంటే ఒత్తిడి కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో విక్రయాలు మరీ తీవ్రంగా ఏమీ లేవు. గతేడాది విదేశీ సంస్థాగత మదుపుదార్లు 5 బి.డాలర్లు విక్రయిస్తే.. దేశీయ మదుపర్లు 15 బి.డాలర్లు పెట్టుబడులు పెట్టారు. కాబట్టి ఒత్తిడి లేదు. రూపాయి అనేది విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదార్లతో పోలిస్తే కరెంట్‌ ఖాతా లోటు, ముడి చమురు ధరలకే ఎక్కువ ప్రభావితమవుతుంది. ఎందుకంటే ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే.. మన నుంచి 10 బి.డాలర్లు అదనంగా బయటకు వెళతాయి. కాబట్టి రూపాయిపై ఎఫ్‌పీఐల ప్రభావం తక్కువే అని చెప్పాలి. * వర్థమాన మార్కెట్లలో భారత్‌పై ఏ మేరకు సెంటిమెంటు ఉందంటారు మొత్తం మీద ప్రజలు కొంత కలత చెందినట్లే కనిపిస్తున్నారు. అయితే వర్థమాన మార్కెట్లలో భారత్‌ తీరు వేరు. భారత్‌లో  పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించడానికి విదేశీయులకు అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుత పరిస్థితులకొస్తే ఎన్నికల నేపథ్యం, కార్పొరేట్‌ పాలన సమస్యల వల్ల కొంత మేర సెంటిమెంటు స్తబ్దుగా ఉన్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం కార్పొరేట్‌ పాలన అంశంలో చిక్కుకున్న కంపెనీలన్నీ చిన్నవి కాబట్టి సరిపోయింది. పెద్దవైతే భారత్‌లో ఏం జరుగుతోందో అని అందరూ ఆందోళన చెందేవారు. * ఎన్నికల ముందు షేర్లు పెరగట్లేదు. పెట్టుబడులకిది మంచి సమయమేనా ప్రస్తుతం అంత ఉత్సాహం కనిపించడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాలేదని లేదా ప్రస్తుత మెజారిటీ ఉండదని భావిస్తున్నారు. మనం అంగీకరించినా.. అంగీకరించకపోయినా మార్కెట్‌ మోదీ ప్రభుత్వాన్ని ఇష్టపడింది. మోదీ తిరిగి ప్రధానమంత్రి అవ్వడన్న భావనలు ఉన్నందున అందుకు మానసికంగా ఇపుడిపుడే సిద్ధమవుతోంది. * కార్పొరేట్‌ ఆదాయాల్లో మూడేళ్ల నుంచీ రెండంకెల వృద్ధిని సాధిస్తున్నాం. ఈ ఏడాది మరింత ఉత్సాహం కనిపిస్తుందంటారా 2018-19 కార్పొరేట్‌ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి(12-13%) కనిపించింది. అవాంతరాలు కనిపించినా.. కొన్ని నష్టపోయిన రంగాలు తిరిగి రాణించడం ఇందుకు నేపథ్యమైంది. 2019-20పై మార్కెట్‌పై సానుకూల అంచనాలున్నాయి.  ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి పెద్ద సంస్థలు తిరిగి పుంజుకుంటాయన్న అంచనాలున్నాయి. * కొంత కాలంగా లోహ రంగం బలహీనంగా కనిపిస్తోంది. ఎందుకని ప్రధాన కారణం చైనాయే. చైనాలో వాహన, నిర్మాణ కార్యకలాపాల నుంచి లోహాలకు అధిక గిరాకీ ఉంటుంది. అయితే ఆయా రంగాలు రాణించకపోవడం లోహ రంగాన్ని ఇబ్బందుల పాలు చేసింది. స్వల్పకాలంలో లోహాల గిరాకీ పుంజుకోవడానికి అవకాశాలు కనిపించడం లేదు. భారత ఉక్కు పరిశ్రమకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. అయితే మేం టాటా స్టీల్‌లో మాత్రమే పెట్టుబడులు పెట్టాం. భారత్‌లో ఉక్కుకు గిరాకీ బాగుంది. అయితే కొని, అట్టే పెట్టిఉంచుకునేంతగా ఎక్కువ స్క్రిప్‌లు లేవు. ప్రధానాంశాలు
1entertainment
india vs sri lanka first two odis to start two hours early భారత్-శ్రీలంక వన్డే సమయాల్లో మార్పు! భారత్-శ్రీలంక మధ్య వచ్చే నెల 10 నుండి భారత్‌లో జరగనున్న వన్డే సిరీస్ తొలి రెండు వన్డేల్లో సమయాన్ని మార్పుచేసినట్టు బీసీసీఐ వెల్లడించింది. TNN | Updated: Nov 19, 2017, 10:55PM IST భారత్-శ్రీలంక మధ్య వచ్చే నెల 10 నుండి భారత్‌లో జరగనున్న వన్డే సిరీస్ తొలి రెండు వన్డేల్లో సమయాన్ని మార్పుచేసినట్టు బీసీసీఐ వెల్లడించింది. మూడు వన్డేలలో భాగంగా.. ధర్మశాలలో డిసెంబర్ 10న తొలి వన్డే.. డిసెంబర్ 13న మొహాలీలో రెండో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ రెండు ప్రాంతాలలో చలి వాతావరణం కారణంగా మ్యాచ్‌ల సమయాల్లో మార్పులు జరిగాయి. తొలి రెండు వన్డేలూ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఉదయం 11.30 గం.కు ప్రారంభమవుతాయని తెలిపింది. ‘హిమాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌పీసీఏ), పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(పీసీఏ)లతో సంప్రదింపులు జరిపిన బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి మ్యాచ్‌ల వివరాలను తెలియజేశారు. కాగా మూడో వన్డే విశాఖపట్నంలో ముందుగా ప్రకటించిన సమయం ప్రకారమే జరుగుతుందన్నారాయన.
2sports
Gati Profits గతి రాబడులు రూ.428.8 కోట్లు హైదరాబాద్‌, నవంబరు 6: రవాణా సంస్థల్లో అగ్ర గామిగా ఉన్న గతి సంస్థ రెండోత్రైమాసికానికి రాబ డులు 428.8 కోట్లుగా ప్రకటించింది. బిజినెస్‌ వాతావరణం మందగించినప్పటికి గతి రాబడులు పెంచుకోగలిగిందని బిఎస్‌ఇకి నివేదిక ఇచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 5.2శాతం రాబడులు పెంచుకోగలిగింది. నికరలాభాలు 1.4శాతం పెరిగి 8.4కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది 8.3కోట్లు మాత్రమే ఉంది. వివిధ విభాగాలపరంగా గతికిన్టెట్సు ఎక్స్‌ప్రెస్‌ విభాగం రెండోత్రైమాసికంలో 286.7 కోట్ల రాబడులు సాధించింది. వార్షిక పద్ధతి లో 2.1శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ నిర్వ హణ లాభాలు 2.3శాతం పెరిగి 22 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 21.5కోట్లుగా ఉన్నవి స్వల్పంగా పెరిగాయి. కంపె నీ టెక్నాలజీని ఆధునీకరించుకుని కొత్త పద్ధతులు అవలంభించడం నూరుశాతం ప్యాకేజి దేశవ్యాప్త నెట్‌వర్క్‌లో అమలుచేస్తోంది. దీనివల్ల కంపెనీ ఇతర సంస్థనుంచి పోటీని తట్టుకోగలుగుతోంది. ఇక గతి ఇ-కామర్స్‌ సంస్థ ఇకనెక్ట్‌ 3.3శాతం వృద్ధితో 46.6 కోట్లుగా ఉంది. ప్యాకేజింగ్‌ పరిమాణం 21శాతం వృద్ధిని సాధించింది. ఆటోమేషన్‌పరంగా గతి ఆటోమేటెడ్‌ ప్యాకేజింగ్‌ విధానాన్ని ఉత్తర ప్రాంతంలోప్రారంభించింది. అలాగే గతి బ్రౌన్‌టేప్‌ టెక్నాలజీస్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. ఇక గతికౌసర్‌ పరంగా శీతలీకరణ ఉత్పత్తుల రవాణా పంపిణీ విధానాన్ని ప్రారంభించింది. గరిష్టసామర్ధ్యం కలిగిన కేంద్రాన్ని దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్‌)లో ప్రారం భించింది. కంపెనీ వ్యవస్థాపకులు సిఇఒ మహేంద్ర అగర్వాల్‌మాట్లాడుతూ కంపెనీ ఈ త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించిందని, సమిష్టి కృషిఫలితమేన న్నా రు. జిఎస్‌టి అమలయితే సంస్థకు మరింత రాబడులు, లాభాలు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. అర్ధసంవత్సర కాలానికిగాను గతిసంస్థలు 258.81కోట్లు రాబ డులు సాధిస్తే పన్నులచెల్లింపులకుముందు 207.4 కోట్లు, నికరలాభాలు193.1కోట్లుఆర్జించినట్లు తేలింది
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఒట్టేశాం కదా అని ఓటేస్తే.. పవన్‌ని గాంధీతో పోల్చిన హైపర్ ఆది పవన్ కళ్యాణ్‌‌పై ఈగవాలినా తన పంచ్‌లకు పనిచెప్తాడు. పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనే కోరికతో జనసైనికుడిగా మారాడు. తనవంతుగా తన మాటల తూటాలను పెట్టుబడిగా పెట్టి పవర్ ఫుల్ పంచ్‌లతో జనసేనకు అండగా నిలుస్తున్నాడు. Samayam Telugu | Updated: Oct 16, 2018, 04:46PM IST ఒట్టేశాం కదా అని ఓటేస్తే.. పవన్‌ని గాంధీతో పోల్చిన హైపర్ ఆది హైపర్ ఆది.. జబర్దస్త్ కామెడీ షోలో తనదైన శైలి పంచ్‌లతో పాపులర్ అయిన ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌కి వీర విధేయుడు. జనసేన పార్టీకి స్పోక్ పర్సన్. పవన్ కళ్యాణ్‌‌పై ఈగవాలినా తన పంచ్‌లకు పనిచెప్తాడు. పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనే కోరికతో జనసైనికుడిగా మారాడు. తనవంతుగా తన మాటల తూటాలను పెట్టుబడిగా పెట్టి పవర్ ఫుల్ పంచ్‌లతో జనసేనకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా సోమవారం నాడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో నిర్వహించిన ‘జనసేన కవాతు’లో పాల్గొని జనసైనికుల్లో ఉత్సాహం నింపారు. Recommended byColombia జబర్దస్త్ ప్రాసతో తనదైన శైలి యాసను జతచేసిన హైపర్ ఆది పంచ్ పటాకా లాంటి ప్రసంగం ఇదే.. ‘ధవళేశ్వరం బ్రిడ్జి మీద కొన్ని మైళ్లు పరిగెత్తి.. అవతలవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ అవతలివాళ్లు అంటే కార్యకర్తలు కాదు.. నిజాయితీ లేని అవినీతి నాయకుల గుండెల్లో. బేసిక్‌గా పవన్ కళ్యాణ్ గారు సమస్యలపై పోరాడుతున్నారు.. మిగిలిన వాళ్లు ఆయనపై పోరాడుతున్నారు. వీళ్లు స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పుట్టి ఉంటే.. బ్రిటీష్ వాళ్ల మీద కాకుండా గాంధీజీ మీద పోరాటం చేసేవాళ్లు. ఖచ్చితంగా ఇప్పుడు అలాంటిదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే.. ప్రజలు బాగుపడతారు. వేరేవాళ్లు ఎవరు గెలిచినా నాయకులు బాగుపడతారు. త్వరలో మీ ఇంటికి ఓట్ల కోసం వస్తారు.. మీకు డబ్బులు ఇస్తారు. మీ పిల్లలపై ఒట్లు పెట్టించుకుంటారు. ఒట్టేసి మాట తప్పితే మీ పిల్లలకు ఏమౌతుందో చెప్పలేను కాని.. ఒట్టేశాం కదా అని ఓటేస్తే.. మీ పిల్లలకు భవిష్యత్ ఉండదు. ప్రస్తుత రాజకీయాల్లో నిస్వార్ధ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఒక్కసారి ఆయనకు ఓటు వేసి చూడండి ఐదు సంవత్సరాలు కాపాడే బాధ్యత ఆయనిది. ఒక్కడకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటు వేస్తే చాలు ఆయన సీఎం అయిపోవడం ఖాయం. మీరు మాత్రమే ఓటు వేయడమే కాకుండా మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరితో ఓటు వేయించాలని కోరారు హైపర్ ఆది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
లేడి సూపర్ స్టార్స్ ఒకేచోట ఎందుకు కలిశారో తెలుసా.? Highlights సెలబ్రిటీ కల్చర్ లో ఇలాంటి గ్యాదరింగ్స్ జరుగుతూ ఉంటాయి అందరూ కలిసి ఫోటోలు దిగడం కచ్చితంగా అట్రాక్షన్ అవుతుంది​ రీసెంట్ గా ఇలాంటిదే సూపర్బ్ అనిపించే ఓ సంఘటన జరిగింది​ సెలబ్రిటీ కల్చర్ లో ఇలాంటి గ్యాదరింగ్స్ జరుగుతూ ఉంటాయి కానీ.. ఒకే చోట ఎక్కువ మంది కనిపించడం.. అందరూ కలిసి ఫోటోలు దిగడం కచ్చితంగా అట్రాక్షన్ అవుతుంది. రీసెంట్ గా ఇలాంటిదే సూపర్బ్ అనిపించే ఓ సంఘటన జరిగింది. నారా లోకేష్- బ్రాహ్మణిల కుమారుడు  దేవాన్ష్ మూడవ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా రంగం నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలే వచ్చారు. రామ్ చరణ్ భార్య ఉపాసన.. మంచు వారసురాలు లక్ష్మీ ప్రసన్న.. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ లతో పాటు నారా బ్రాహ్మణి కలిసి దిగిన ఫోటో ఒకటి.. ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇంత మంది సెలబ్రిటీ లేడీస్ ఒక చోట కనిపించడం అపూర్వం అనిపించేసింది. అందరూ తమ తమ ట్రెండ్స్ కు తగినట్లుగా డ్రెసింగ్ చేసుకుని కనిపించారు. ఒక్కోరిదీ ఒక్కో విభిన్న శైలి. అయినా.. అందరూ సెలబ్రిటీలే.  మహేష్ కూతురు సితారతో ఆడుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన.. ఈ సూపర్ లేడీస్ పిక్ ను కూడా తనే షేర్ చేసింది. నారా దేవాన్ష్ కు ఆశీర్వాదాలు అందంచిన తర్వాత.. అందరూ కలిసి బోలెడంత సేపు కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడప్పుడు మాత్రమే తీరిక సమయాన్ని చక్కగా ఉపయోగిచుకుంటూ తీరిగ్గా ముచ్చట్లు ఆడుకున్నారు.
0business
Gangooly గంభీర్‌ వ్యాఖ్యలకు మద్దతు కోల్‌కతా: కాల్పు ఒప్పందానికి తూట్లు పొడిచి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌తో అన్ని రకాల సబంధాలను తెంచుకోవాలన్న టీమిండియా ఆటగాడు గంభీర్‌ వ్యాఖ్యలకు టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ మద్దతు పలికారు. నిజానికి ఇది చాలా దురదృష్టకరమైన అంశమని, పాక్‌తో కొన్నేళ్లపాటు క్రికెట్‌ ఆడకుండా ఉంటేనే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
2sports
Athya pathya Games జాతీయ సీనియర్‌ అత్యాపత్యా పోటీలు ఫతేమైదాన్‌,: తెలంగాణ అత్యాపత్యా సంఘం ఆధ్వర్యంలో జాతీయ సీనియర్‌ పురుషుల, మహిళల అత్యాపత్యాపోటీలు ఎల్బీస్టేడియంలో ప్రారంభమైయ్యావి. ఈ పోటీలను తెలంగాణ శాట్స్‌ఎండి ఏ.దినకర్‌బాబు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు, మానసిక వికాసానికి ఎంతగానో ఉపయోగపడ తాయన్నారు. ఒకప్పుడు ఈ ఆటను ప్రతి గ్రామంలో 4 డబ్బలు గీసుకొని అడేవారని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ అత్యాపత్యా క్రీడా పోటీ దేశమంత మంచి ఆధారణ పొందుతుందని ఆయనగుర్తు చేశారు. జాతీయ పోటీలు మన రాష్ట్రంలో జరుగడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అత్యాపత్యా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
2sports
yadav డోప్‌ టెస్టుల్లో చిక్కిన మరో అథ్లెట్‌ న్యూఢిల్లీ: భాతర క్రీడకారులకు డోపింగ్‌ భూతం వెంటాడుతుంది. నిషేదత ఉత్ప్రేరకం తీసుకొని తాజాగా మరో అథ్లెట్‌ జావెలిన్‌ త్రో క్రీడాకారుడు డోప్‌ టెస్టుల్లో పట్టుబడ్డారు. ఇటీవల ఓ అగ్ర శ్రేణి అథ్టెట్‌ క్రీడాకారుడి నుంచి నాడా అధికారులు నిషేదిత ఉత్ప్రేరకం మెల్డోనియంను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతనికిపై నిషేదాన్ని విధించారు. మరో క్రీడాకారుడు స్టానోజోలాల్‌ వాడినట్లు అతనిపై నిషేదం విధించాడు. ఏషియన్‌ యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో యువ జావెలిన్‌ త్రో క్రీడాకారుడు రోహిత్‌ యాదవ్‌ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మే 20నుంచి 23వరకు బ్యాంకాక్‌లో ఈపోటీలు నిర్వహిం చారు. అయితే ఏప్రిల్‌లో హైద్రాబాద్‌లో యూత్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించిన సమయంలో రోహిత్‌ నుంచి శాంపిల్స్‌ సేకరించారు. శాంపిల్స్‌కి నిర్వహించిన పరీక్షల్లో రోహిత్‌ స్టానోజోలాల్‌ అనే నిషేదిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. ఏషియన్‌ యూత్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల చివరి రోజు ఈవిషయం తెలిసింది. దీంతో అతనిపై అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు తాత్కాలికంగా నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఏషియన్‌ యూత్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌లో రోహిత్‌ కైవసం చేసుకున్న రజత పతకాన్ని వెనక్కి తీసుకోను న్నట్లు సమాచారం.
2sports
meda meeda abbayi telugu movie latest news and updates ‘మేడమీద అబ్బాయ్’ దూకేదెటు? కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్‌కు ఈ మధ్య గడ్డుకాలం నడుస్తోంది. ‘సుడిగాడు’ ఆయన ఆఖరి హిట్ సినిమా. ఆ తరువాత చెప్పుకునే స్థాయిలో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదంటే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. TNN | Updated: Sep 6, 2017, 07:09PM IST కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్‌కు ఈ మధ్య గడ్డుకాలం నడుస్తోంది. ‘సుడిగాడు’ ఆయన ఆఖరి హిట్ సినిమా. ఆ తరువాత చెప్పుకునే స్థాయిలో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదంటే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా అందరి మన్ననలు పొందిన ఈ హీరో సినిమాను ఇప్పుడు కొనడానికి కూడా ఎవరు సాహసించడం లేదు. ఈ క్రమంలో ఆయన నటించిన ' మేడ మీద అబ్బాయి ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ శుక్రవారం సినిమా థియేటర్లలోకి రానుంది. అదే రోజు చైతు నటించిన 'యుద్ధం శరణం' సినిమా కూడా విడుదల కాబోతుంది. మలయాళ హిట్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోన్న 'మేడ మీద అబ్బాయి' సినిమా ప్రోమోస్ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ బయ్యర్లకు మాత్రం సినిమాపై నమ్మకం కుదరడం లేదు. విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయినా ఇప్పటివరకు సినిమాపై ఎలాంటి హైప్ తీసుకురాలేకపోయారు. కనీసం ఈ వారంలోనే సినిమా రాబోతుందనే విషయాన్ని కూడా సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోల సంఖ్య పెరిగిపోవడం, స్పూఫ్‌లను యాక్సెప్ట్ చేయడానికి ఆడియన్స్ రెడీగా లేకపోవడంతో నరేష్ క్రేజ్ బాగా తగ్గిపోయింది. ఈ సినిమాతో అయినా ‘సుడిగాడి’ సుడి తిరుగుతుందేమో చూడాలి. అందాకా ఈ ట్రైలర్ చూడండి.
0business
sumalatha 205 Views batting coach , Vikram Rathour Vikram Rathour ముంబయి: టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గతవారం క్రికెట్‌ సలహా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి తిరిగి ఎంపికవ్వగా… బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ఆయా కోచ్‌ పదవులకు గురువారం ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్ బంగర్‌ దరఖాస్తు చేసుకున్నా అతడు ఇంటర్వ్యూల్లో రెండో స్థానంలో నిలిచాడని బిసిసిఐ సిఇఓ రాహుల్‌ జోహ్రీ చెప్పారు. తొలి స్థానంలో విక్రమ్‌రాథోడ్‌, మూడో స్థానంలో ఇంగ్లండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ మార్క్‌ రామ్‌ప్రకాశ్‌ నిలిచారని తెలిపారు. మరోవైపు బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌.శ్రీధర్‌ తమ స్థానాలను పదిలం చేసుకున్నట్లు తెలిసింది. టీమిండియాకు నాలుగో స్థానంలో సరైన ఆటగాడిని తీర్చిదిద్దడంలో బంగర్‌ విఫలమయ్యాడని, అదే అతడి పదవికి ఎసరు పెట్టినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/business/
2sports
ఫాన్స్ సౌండ్‌కి రీసౌండ్‌ కన్ఫర్మ్: నాగచైతన్య Highlights అక్కినేని అభిమానులకు గతేడాది 'రారండోయ్ వేడుక చూద్దాం'తో హిట్ ఇచ్చాడు  అక్కినేని అభిమానులకు గతేడాది 'రారండోయ్ వేడుక చూద్దాం'తో హిట్ ఇచ్చాడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. నెక్స్ట్ 'యుద్ధం శరణం'తో డిజాస్టర్ అందించి నిరాశ మిగిల్చాడు. నాగార్జునదీ సేమ్ సిట్యువేషన్. 'ఓం నమో వేంకటేశాయ'తో ప్రేక్షకులు ఆశించిన అంచనాలు చేరుకొని కింగ్, 'రాజుగారి గది-2'తో ఖుషీ చేశారు. అఖిల్ అయితే 'హలో'తో మిక్స్డ్ ఫీలింగ్స్ మిగిల్చాడు. ఈ ఏడాది ఇంకా అక్కినేని సినిమాలు విడుదల కాలేదు. 'మహానటి'లో నాగచైతన్య కనిపించినా... అతిథి పాత్ర కాబట్టి లెక్కలోకి తీసుకోవడం కష్టమే. 'ఆఫీసర్'తో కింగ్ నాగార్జున ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర ఖాతా తెరవబోతున్నాడు. ఈ సినిమా బాగుటుందని నాగచైతన్య అభిమానులకు భరోసా ఇచ్చాడు. అక్కినేని కుటుంబం నుంచి ఈ ఏడాది వచ్చే ప్రతి సినిమా బాగుంటుందనే అభిప్రాయాన్ని అభిమానుల్లో కలిగించాడు. 'ఆఫీసర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగచైతన్య మాటలు అభిమానులకు బూస్ట్ ఇచ్చాయి. "తప్పకుండా అభిమానులందరికీ ఈ ఏడాది చాలా బావుంటుంది. (ఆడిటోరియంలో హంగామా చేస్తున్న అభిమానులను ఉద్దేశిస్తూ...) మీరు ఇచ్చిన ప్రతి సౌండ్‌కి తప్పకుండా ఒక రీసౌండ్‌ ఉంటుంది" అని నాగచైతన్య కిక్ ఇచ్చాడు. అయితే... ఈవెంట్ ముగిసే వరకూ చైతూ సందడి చేయలేదు. మాట్లాడిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు.  Last Updated 29, May 2018, 11:03 AM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV 'జై లవకుశ'లో మూడో హీరోయిన్ ఎందుకు లేదంటే! 'జై లవకుశ' సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను ముమ్మరం చేశారు చిత్ర యూనిట్. TNN | Updated: Sep 19, 2017, 03:22PM IST 'జై లవకుశ'లో మూడో హీరోయిన్ ఎందుకు లేదంటే! ' జై లవకుశ ' సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను ముమ్మరం చేశారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ కూడా యాక్టివ్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లెక్క ప్రకారం సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండాలి కానీ రాశిఖన్నా, నివేదా థామస్‌లు మాత్రం ఈ సినిమాలో హీరోయిన్స్ అని వెల్లడించింది చిత్రబృందం. దీంతో నెగెటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రకు హీరోయిన్ ఉండదా? అనే విషయాన్ని ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించగా ఆయనొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌ను రివీల్ చేశారు. సినిమాలో జై పాత్రకు కూడా లవ్ యాంగిల్ ఉంటుందట. జై, కుశ పాత్రలు నివేదా థామస్‌ను ప్రేమిస్తారట. నివేదా మాత్రం కుశతో ప్రేమలో ఉంటుంది. అంటే నివేదా కోసం అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుందేమో.. రాశిఖన్నా మాత్రం లవకుమార్‌కు జోడీ అని క్లారిటీ ఇచ్చేశాడు ఎన్టీఆర్. అలానే 'స్పైడర్' సినిమాతో పోటీ పడడం పట్ల స్పందిస్తూ 'సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ ఒకేసారి వంద సినిమాలు విడుదలైనా ఆడతాయనే' నమ్మకాన్ని వ్యక్తం చేశారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 8, Oct 2018, 9:38 PM IST Highlights బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా నానా పటేకర్ - తను శ్రీ దత్త ల వివాదం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదట తను శ్రీ తనకు ఒక సీనియర్ యాక్టర్ నుంచి పదేళ్ల క్రితం లైంగిక వేధింపులు మొదలయ్యాయని చెప్పిన సంగతి తెలిసిందే.  బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా నానా పటేకర్ - తను శ్రీ దత్త ల వివాదం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదట తను శ్రీ తనకు ఒక సీనియర్ యాక్టర్ నుంచి పదేళ్ల క్రితం లైంగిక వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. అయితే ఆమెకు బాలీవుడ్ నుంచి కాస్త మద్దతు లభించడంతో నానా పటేకర్ తనను వేధించాడని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు.  దీంతో బాలీవుడ్ లో మరికొందరు ఆమెకు మద్దతు పలికినప్పటికీ ఇతరులు కొంత మంది నానా పటేకర్ కు మద్దతు ఇచ్చారు. అయితే ఫైనల్ గా నానా పటేకర్ ఈ విషయంపై స్పందించారు. మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ముందుగా ఆయన చెప్పారు. అయితే మీడియా వద్దకు వచ్చిన తరువాత తాను ఏమి మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.  ఎందుకంటే తన లాయర్ గారు ఇప్పుడు ఎలాంటి విషయాన్నీ ఇక్కడ ప్రస్తావించవద్దని చెప్పారని తెలుపుతూ.. పదేళ్ల క్రితం నేనేమీ చెప్పాను, ఇప్పుడు అదే చెబుతున్నానని నానాపటేకర్ అన్నారు. అదే విధంగా సత్యంలో ఎప్పుడు మార్పులు రావని గట్టిగా చెప్పారు. దీంతో బాలీవుడ్ మీడియాలో ఈ వివాదం గురించి వార్తలు మరింత చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే నానా పటేకర్ చట్టప్రకారం కోర్టుకు హాజరై మీడియాకు వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  Last Updated 8, Oct 2018, 9:38 PM IST
0business
Kohli కెరీర్‌లో 50వ టెస్టు న్యూఢిల్లీ: టెస్టు కెప్టెన్‌ కోహ్లీ విశాఖ స్టేడియంలో ఇం గ్లండ్‌తో జరిగే రెండవ టెస్టు మ్యాచ్‌లో 50 టెస్టు ఆడ నున్నాడు. కాగా క్రికెట్‌ చరిత్రలో ఎందరికో సాధ్యం కాని రికార్డులు సృష్టించిన కోహ్లీ మరో చిరస్మరణీయ ఘనత అందుకోబోతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే రెం డవ మ్యాచ్‌కి కోహ్లీకి 50 టెస్టు.అందుకే విశాఖ టెస్ట్‌ అతడి కెరీర్‌లో ప్రత్యేకంగా గుర్తుంచుకోదగింది.ఇప్పటి వరకు కోహ్లీ 49 టెస్టుల్లో 84 ఇన్నింగ్స్‌ ఆడాడు.కాగా అత్యధిక వ్యక్తిగత పరుగులు 211 సాధించాడు.మొత్తం 3,643 పరుగులకు కోహ్లీ చేరుకున్నాడు. సగటు 46.11 కాగా స్ట్రైక్‌రేట్‌ 53.69 నమోదైంది.కాగా కెప్టెన్‌గా సగటు 55.17,కోహ్లీ 13 సెంచరీలు చేయగా 2 డబుల్‌ సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు చేశాడు. కోహ్లీ 50 పరుగులకు పైగా చేసినపుడు గెలిచిన మ్యాచ్‌ లు 9.కెప్టెన్‌గా నాలుగు వరుస సిరీస్‌లలో విజయం సాధించాడు.
2sports
TATA2 టాటా మోటార్స్‌ మైక్రోసాప్ట్‌ టైఅప్‌ ముంబై: డ్రైవింగ్‌లో మరింతగా ఆధునీకరణ మార్పులు సవరణలు తెచ్చేందుకు వీలుగా టాటా మోటార్స్‌, మైక్రోసాప్ట్‌ ఇంక్‌ సాంకేతికపరమైన డీల్‌ కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కార్ల యజమానులకు కొత్త సాంకేతిక ఒరవడులతో కూడిన శిక్షణ ఇస్తాయి. మొదట వాహనం ఆధునీకరించిన డ్రైవింగ్‌ అనుభవాలను వివరిస్తుందని, జెనీవా ఇంటర్నేషనల్‌ మోటార్‌షోలో వచ్చేనెల ఏడవ తేదీ ఈ వాహనాన్ని ప్రదర్శిస్తు న్నట్లు రెండు సంస్థలు వెల్లడించాయి. ఇంటర్నెట్‌ఆఫ్‌ థింగ్స్‌ వినియోగం, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, యంత్రాలపై శిక్షణ సాంకేతిక పరిజ్ఞానం వంటివి కార్లయజమానులకు మరింత అవగాహన పెంపొందిస్తాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కార్ల యజమానులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయని మైక్రో సాప్ట్‌ ఇండియా అధ్యక్షుడు అనంత్‌ మహేశ్వరి వెల్లడించారు. టాటామోటార్స్‌ సిఇఒ గ్యూఎంటర్‌ బట్‌షెక్‌ మాట్లాడుతూ ఈ రెండు సంస్థల మధ్య టైఅప్‌ కొత్త రాబడుల అవకాశాలు కల్పిస్తుందని కార్ల యజమానులకు విలువలు జోడించిన సేవలందించేందుకు వీలు కలుగుతుందని వివరించారు. డిసెంబరు త్రైమాసికంలో టాటామోటార్స్‌ 96శాతం నికరలాభాలు తగ్గాయి. జెఎల్‌ఆర్‌ నుంచి కూడా భారీ నష్టాలను చవిచూసింది. టాటా ఇందుకోసం టెక్నాలజీ భాగస్వామిగా మైక్రోసాప్ట్‌ను ఎంచుకుంది.
1entertainment
Shah Rukh Khan pens special poem to salute Indian soldiers on Diwali సైనికులకు సెల్యూట్ చెప్పేందుకు కవిగా మారిన షారుఖ్ బాలీవుడ్ బాద్‌షా, కింగ్ కార్న్ షారుఖ్ ఖాన్ ఈ దీపావళి పర్వదినాన తనలోని కవిని బయటి ప్రపంచానికి పరిచయం చేశారు. TNN | Updated: Oct 31, 2016, 03:51PM IST బాలీవుడ్ బాద్‌షా, కింగ్ కార్న్ షారుఖ్ ఖాన్ ఈ దీపావళి పర్వదినాన తనలోని కవిని బయటి ప్రపంచానికి పరిచయం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకి వందనాలు చెబుతూ షారుఖ్ ఓ కవితను రాసి, చదివి వినిపించారు. ఇంటికి దూరంగా సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకి, వారి కుటుంబాలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షారుఖ్.. వారికి ఎల్లప్పుడూ శుభమే కలగాలని ఆకాంక్షించారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికుల త్యాగాల వల్లే మనం ఇక్కడ హాయిగా, మనశ్శాంతిగా వుండగలుగుతున్నాం. దేశ రక్షణ కోసం సైనికులు తీసుకుంటున్న శ్రమ అసామాన్యమైనది.. అందుకే వారిని స్మరించుకుందాం.. సైనికుల పోరాటం వల్లే మనం మరింత ముందుకు పోగలుగుతున్నాం'' అని తాను రాసిన కవితలో పేర్కొన్నారు షారుఖ్. అంతేకాకుండా టపాసులు వంటివి కాల్చకుండా సురక్షితమైన దీపావళిని జరుపుకోవాలని అభిప్రాయపడ్డారు.​ సైనికులు, వారి కుటుంబాలపై గౌరవాన్ని చాటుకుంటూ, వారి శ్రేయోభిలాషిగా షారుఖ్ షేర్ చేసుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరూ ఈ కవితపై ఓ లుక్కేయండి Wishing everyone a Happy Diwali. May the Festival of Lights bring with it brightness and goodness in all our lives. Be safe and enjoy. pic.twitter.com/iuHMQpAMgd
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రోహిత్ శర్మ ‘డక్’ చెత్త రికార్డు పదిలం..! భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన చెత్త రికార్డుని మరింత పదిలం చేసుకున్నాడు. ఇప్పటికే టీ20 TNN | Updated: Mar 7, 2018, 09:48AM IST రోహిత్ శర్మ ‘డక్’ చెత్త రికార్డు పదిలం..! భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన చెత్త రికార్డుని మరింత పదిలం చేసుకున్నాడు. ఇప్పటికే టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక సార్లు డకౌటైన క్రికెటర్‌గా రికార్డుల్లో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మ.. మంగళవారం రాత్రి ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ముగిసిన తొలి టీ20లోనూ డకౌటయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే చమీరా బౌలింగ్‌లో రోహిత్ శర్మ (0: 4 బంతుల్లో) ఫీల్డర్ తలమీదుగా బంతిని బౌండరీకి తరలించబోయి మెండిస్‌కి దొరికిపోయాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV అడవి శేష్.. ఆ యంగ్ హీరోయిన్‌నీ ముద్దాడతాడా? అడవి శేష్ సినిమాల్లో ముద్దులు తప్పనిసరి అయిపోయాయి. Samayam Telugu | Updated: Aug 12, 2018, 11:29AM IST అడవి శేష్ సినిమాల్లో ముద్దులు తప్పనిసరి అయిపోయాయి. ప్రత్యేకించి లిప్ లాక్‌లు ఈ హీరో సినిమాలో తప్పనిసరి అనిపించుకుంటున్నాయి. ఇది వరకూ ‘కిస్’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన ఇతడు తన తదుపరి సినిమాల్లో కిస్సులను తప్పనిసరి చేసుకొంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ‘గూఢచారి’ సినిమాలో కూడా లిప్‌లాక్ సీన్లు పెట్టారు. అంతకు ముందు ‘కిస్’, ‘క్షణం’ సినిమాల్లో కూడా ఆ తరహా సీన్లున్నాయి. ఇప్పుడు శేష్ హీరోగా ‘2స్టేట్స్లద’ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ‌లో హిట్ అయిన ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారిప్పుడు. ఈ సినిమాతో హీరో రాజశేఖర్, నటి జీవితల కూతురు శివానీ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అవుతోంది.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సమంత కొత్త పేరు: అప్పుడలా.. ఇప్పుడిలా సమంత రూత్ ప్రభు.. నిన్నటి వరకూ సమంతకు ఉన్న పేరు ఇది. టాలీవుడ్‌లో ముద్దుగా సామ్, సమంత అని పిలుచుకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆమె సమంత రూత్ ప్రభుగానే ఫ్యాన్స్‌కి పరిచయం. TNN | Updated: Oct 11, 2017, 08:59PM IST సమంత రూత్ ప్రభు.. నిన్నటి వరకూ సమంతకు ఉన్న పేరు ఇది. టాలీవుడ్‌లో ముద్దుగా సామ్, సమంత అని పిలుచుకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆమె సమంత రూత్ ప్రభుగానే ఫ్యాన్స్‌కి పరిచయం. అయితే నాలుగురోజుల క్రితం నాగచైతన్యతో ఏడడుగులూ.. రెండు రింగులతో వివాహ బంధంతో ఒకటైన సమంత.. హిందూ సాంప్రదాయం ప్రకారం తనకు స్టాటస్‌గా వచ్చినా అక్కినేని ఇంటిపేరుని తన పేరు పక్కన చేర్చుకుని అక్కినేని సమంతగా పేరు మార్చుకుంది. తాజాగా సమంత తన ట్విట్టర్ అకౌంటులో ఉన్న ‘సమంత రూత్ ప్రభు’అనే పేరును సమంత అక్కినేని అని మార్చేసుకుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని కుటుంబంలో భాగమైన సమంత సర్ నేమ్ మార్చేయడంతో తమిళ పిల్ల శాశ్వతంగా తెలుగు హీరోయిన్‌గా మారనుంది. ప్రస్తుతం సమంత తన పేరును అక్కినేని సమంతగా మార్చుకోవడంతో ఆమె అభిమానులు అక్కినేని కోడలకు స్వాగతం అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.
0business
అంచనాలను మించిన ఐసీఐసీఐ - లాభాల్లో 10.2% వృద్ధి -ప్రభావం చూపిన ఎన్‌పీఏలు ముంబయి : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ సంస్థ ఐసిఐసిఐ బ్యాంకు క్రితం ఆర్ధిక సంవత్సరం జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 10.2 శాతం వృద్ధితో రూ.2922 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2652 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. 2009 అక్టోబర్‌-డిసెంబర్‌ తర్వాత త్రైమాసికం లాభాల తర్వాత అత్యల్ప వృద్ధి రేటు ఇదే కావడం గమనార్హం. గత త్రైమాసికంలో బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 3.78 శాతం పెరిగి రూ.15,095 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 3.03 శాతంతో రూ.10,505 కోట్ల జిఎన్‌పిఎ చోటు చేసుకుంది. రుణాల పునరుద్దరణలో భారీగా నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారడంతో లాభాల్లో తగ్గుదల చోటు చేసుకుందని ఐసిఐసిఐ బ్యాంకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ చందా కొచ్చర్‌ పేర్కొన్నారు. ఇది వరకుతో పోల్చితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో నిరర్ధక ఆస్తులు తగ్గుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మరో రూ.1500 కోట్లు రుణాలు పునరుద్దరణ జాబితాలో ఉన్నాయన్నారు. తమ బ్యాంకు మొత్తం రుణాల్లో 42.5 శాతం రిటైల్‌ విభాగం పోర్టుపోలియోలో ఉన్నాయన్నారు. గృహ రుణాల్లో 26 శాతం, వామన రుణాల్లో 25 శాతం, మొత్తంగా రిటైల్‌ రుణాల్లో 25 శాతం, కార్పొరేట్‌ రుణాల్లో 10 శాతం చొప్పున వృద్ధి సాధించిందన్నారు. 2015-16లో రుణాల మంజూరులో 18-20 శాతం వృద్ధి ఆశిస్తున్నామన్నారు. సోమవారం బిఎస్‌ఇలో ఐసిఐసిఐ బ్యాంకు షేరు 2 శాతం తగ్గి రూ.302 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV దీపిక 20వ స్థానంలో.. భారత్ ఏడో స్థానంలో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం మొదలయ్యేది మన కాలమాన ప్రకారం శనివారం తెల్లవారు జామునే అయినా భారత ఆర్చరీ జట్టు విశ్వక్రీడల పోరాటం శుక్రవారమే ప్రారంభించింది. BCCL | Updated: Aug 6, 2016, 01:31AM IST రియో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం మొదలయ్యేది మన కాలమాన ప్రకారం శనివారం తెల్లవారు జామునే అయినా భారత ఆర్చరీ జట్టు విశ్వక్రీడల పోరాటం శుక్రవారమే ప్రారంభించింది. రాత్రి 9.30 గంటలకు మొదలైన మహిళల ఆర్చరీ టీమ్ వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో దీపికా కుమారి, బొంబ్యాల దేవి, లక్ష్మీరాణి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో దీపికా కుమారి 640 పాయింట్లు సాధించి 20వ స్థానంలో నిలవగా.. బాంబేలా దేవి 638 పాయింట్లతో 24వ స్థానంలో నిలిచింది. లక్ష్మీరాణి 614 పాయింట్లతో 43వ స్థానంతో సరిపెట్టుకుంది. టీమ్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో భారత్‌ మొత్తం 1892 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌కి అర్హత సాధించింది. కాగా దక్షిణ కొరియాకు చెందిన ముగ్గురు ఆర్చర్లు మొదటి మూడు స్థానాల్లో నిలవడం విశేషం. అంతకుమందు సాయంత్రం ఐదు గంటలకు మొదలైన పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో భారత ఆర్చర్‌ అతాను దాస్‌ 683 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
2sports
IND vs SA 3rd Test: కెప్టెన్‌గా అరుదైన రికార్డ్‌పై కన్నేసిన కోహ్లి Samayam Telugu| Oct 18, 2019, 01.55 PM IST India's Virat Kohli bats during second cricket test match between India and Sou... దక్షిణాఫ్రికాతో గత ఆదివారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో దశాబ్దాల రికార్డ్‌ల్ని కనుమరుగు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా అరుదైన రికార్డ్‌పై తాజాగా కన్నేశాడు. రాంచీ వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే..? క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్‌గా అత్యధిక శతకాలు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు. Read More: భారత్‌పై రాంచీ టెస్టు‌కి కొత్త వ్యూహంతో సఫారీలు పుణె టెస్టులో సెంచరీ మార్క్‌‌తో కెప్టెన్‌గా 19వ శతకాన్ని నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ (19 సెంచరీలు) సరసన నిలిచాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 25 శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ప్రస్తుతం పాంటింగ్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్న కోహ్లీ.. రాంచీ టెస్టులో సెంచరీతో పాంటింగ్‌ని వెనక్కి నెట్టేయాలని ఆశిస్తున్నాడు. అప్పుడు రెండో స్థానంలో కోహ్లీ మాత్రమే ఉండనున్నాడు. Read More: రాంచీ టెస్టుకి ధోనీ హాజరు.. పిచ్‌‌పై స్పష్టత భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. టీమిండియా ఇప్పటికే 2-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. దీంతో.. సిరీస్ చేజిక్కిన నేపథ్యంలో.. భారత క్రికెటర్లు స్వేచ్ఛగా చెలరేగిపోయే అవకాశం ఉంది. రాంచీ పిచ్ స్పిన్‌కి కలిసిరానుందనే వార్తలు టీమిండియాలో ఇంకా ఉత్సాహం నింపుతుండగా.. సఫారీలను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి.
2sports
sumalatha 122 Views bse , NSE , stock market sensex ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 198 పాయింట్లు లాభపడి 38,305 వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛే సూచీ నిఫ్టీ 44 పాయింట్లు లాభంతో 11,358 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.96 వద్ద కొనసాగుతుంది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మ్యాచ్‌లో సవాల్ ఎదురైతే ధోనీ దగ్గరకెళ్తా..! మైదానంలో ఏదైనా సవాల్ ఎదురైతే వెంటనే సలహా కోసం వికెట్‌ కీపర్ మహేంద్రసింగ్ ధోనీని కలుస్తానని TNN | Updated: Sep 6, 2017, 04:01PM IST మైదానంలో ఏదైనా సవాల్ ఎదురైతే వెంటనే సలహా కోసం వికెట్‌ కీపర్ మహేంద్రసింగ్ ధోనీని కలుస్తానని భారత ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ వెల్లడించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌‌తో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఈ యువ బౌలర్.. తుది జట్టులో ఛాన్స్ దక్కిన చివరి రెండు వన్దేల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో ధోనీ సూచనలు, సలహాలతోనే మెరుగైన ప్రదర్శన చేయగలిగానని.. శ్రీలంకతో సిరీస్‌లోనూ అతని సాయం తీసుకున్నట్లు శార్ధూల్ వివరించాడు. ఐపీఎల్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ఈ ఇద్దరూ ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ‘ఐపీఎల్ సమయంలో ధోనీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అతను జట్టుకి వికెట్‌ కీపర్ కాబట్టి.. ఇప్పటికే చాలా మంది బౌలింగ్‌ని మరో ఎండ్‌ నుంచి చూసుంటాడు. ఒకవేళ నాకు మ్యాచ్‌లో ఏదైనా సవాల్ ఎదురైతే.. అంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ నా బౌలింగ్‌లో ఎదురుదాడి చేస్తుండటం లేదా బౌలింగ్ లయ కుదరకపోవడం లాంటి సమస్యలకి ధోనీ మెరుగైన సలహాలు ఇస్తాడు. ఇప్పటికే ఎన్నోసార్లు ధోనీ సాయంతో నేను గట్టెక్కగలిగాను. మ్యాచ్‌ల్లో అతని సాయం మరువలేనిది’ అని శార్ధూల్ వివరించాడు. బుధవారం శ్రీలంకతో జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్‌కి శార్ధూల్‌‌ ఆడే అవకాశాలు తక్కువే. గాయంతో చివరి వన్డేకి దూరమైన హార్దిక్ పాండ్య అతని స్థానంలో మళ్లీ జట్టులోకి రానున్నాడు.
2sports
Hyderabad, First Published 3, Sep 2019, 12:15 PM IST Highlights సోషల్ మీడియాలో సడెన్ గా 'చీప్ స్టార్' అనే ట్వీట్ వేశాడు అజయ్ భూపతి. ఇప్పుడు ఈ చీప్ స్టార్ ఎవరై ఉంటారని గుసగుసలు మొదలయ్యాయి. హీరో రవితేజనా..? అనే మాటలు వినిపిస్తున్నాయి.  'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన దర్శకుడు అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఇప్పటివరకు తన తదుపరి సినిమా అనౌన్స్ చేయలేదు ఈ డైరెక్టర్. 'మహాసముద్రం' అనే కథ పట్టుకొని హీరోల దగ్గరకి తిరుగుతున్నా.. ఎవరూ ఫైనల్ చేయడం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సడెన్ గా 'చీప్ స్టార్' అనే ట్వీట్ వేశాడు అజయ్ భూపతి. ఇప్పుడు ఈ చీప్ స్టార్ ఎవరై ఉంటారని గుసగుసలు మొదలయ్యాయి. హీరో రవితేజనా..? అనే మాటలు వినిపిస్తున్నాయి. అజయ్ తన తదుపరి సినిమా రవితేజతో చేయాలనుకున్నాడు. స్క్రిప్ట్ కూడా వినిపించాడు. రవితేజ కొన్ని కరెక్షన్స్ చెప్పారు. కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ నలుగుతూ వస్తోంది. క్యాన్సిల్ అయిందనే మాటలు కూడా వినిపించాయి. ఇదే సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తో చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు. ఈ క్రమంలో అజయ్ ఈ స్క్రిప్ట్ ని నాగచైతన్య వద్దకు తీసుకువెళ్తున్నట్లు సమాచారం.  'మహాసముద్రం' లైన్ హీరోయిన్ సమంతకు బాగా నచ్చిందట. కానీ ప్రాజెక్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంతలో అజయ్ 'చీప్ స్టార్' అనే ట్వీట్ వేయడం వెనుక అర్ధమేంటో..? ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు 'ఎవరైనా స్క్రిప్ట్ రిజెక్ట్ చేశారా..?' అని అజయ్ ని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ.. ఆ 'చీప్ స్టార్' ఎవరయ్యుంటారబ్బా..?   — Ajay Bhupathi (@DirAjayBhupathi) September 2, 2019 Last Updated 3, Sep 2019, 4:48 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV PSL 2019లో ఆడుతున్నా.. డివిలియర్స్ పాక్ వెళ్లడం లేదు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పాకిస్థాన్ వెళ్లడం లేదు. పీఎస్ఎల్‌లో భాగంగా పాక్ వెళ్లాల్సి ఉన్నా అనివార్యంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయన్ని డివిలియర్స్ తెలిపాడు. Samayam Telugu | Updated: Mar 4, 2019, 05:12PM IST PSL 2019లో ఆడుతున్నా.. డివిలియర్స్ పాక్ వెళ్లడం లేదు హైలైట్స్ సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పాకిస్థాన్ వెళ్లడం లేదు. పీఎస్ఎల్‌లో భాగంగా పాక్ వెళ్లాల్సి ఉన్నా అనివార్యంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయన్ని డివిలియర్స్ తెలిపాడు. సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పాకిస్థాన్‌లో జరగనున్న తదుపరి పీఎస్ఎల్ 2019 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వెన్ను గాయం కారణంగా అతడు ఈ టోర్నీకి దూరం అవుతున్నాడు. లాహోర్ ఖాలండర్స్ తరఫున డివిలియర్స్ ఈ లీగ్‌లో ఆడుతున్నాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న డివిలియర్స్‌కు రెండు వారాలపాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో అతడు లీగ్ నుంచి తప్పుకున్నాడు. పాకిస్థాన్ గడ్డ మీద, పాక్ ఫ్యాన్స్ మధ్య క్రికెట్ ఆడలేకపోవడంతో నిరాశ చెందానని ఏబీ తెలిపాడు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV టీమిండియా పిలుపుకై నిరీక్షణ: శుభమన్ భారత్-ఎ జట్టుతో జరిగిన దేవధర్ ట్రోఫీలోనూ శుభమన్ గిల్ (106 నాటౌట్: 111 బంతుల్లో 8x4, 3x6) అజేయ శతకం బాదడంతో.. అతను ప్రాతినిథ్యం వహిస్తున్న భారత్- సి జట్టు ఘన విజయంతో టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. Samayam Telugu | Updated: Oct 26, 2018, 05:19PM IST టీమిండియా పిలుపుకై నిరీక్షణ: శుభమన్ టీమిండియా పిలుపు కోసం తాను ఎదురుచూస్తున్నట్లు భారత యువ బ్యాట్స్‌మెన్ శుభమన్ గిల్ వెల్లడించాడు. అండర్-19 ప్రపంచకప్‌లో శతకం బాది వెలుగులోకి వచ్చిన శుభమన్.. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున సత్తాచాటాడు. నిన్న భారత్-ఎ జట్టుతో జరిగిన దేవధర్ ట్రోఫీలోనూ శుభమన్ గిల్ (106 నాటౌట్: 111 బంతుల్లో 8x4, 3x6) అజేయ శతకం బాదడంతో.. అతను ప్రాతినిథ్యం వహిస్తున్న భారత్- సి జట్టు ఘన విజయంతో టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌కి భారత సెలక్టర్లు కూడా హాజరవడంతో.. అతడ్ని వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ కోసం భారత జట్టులోకి ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ.. యువ క్రికెటర్‌కి నిరాశే ఎదురైంది.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ 300.. పాక్ 0 ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మొదలైన తర్వాత ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్ జట్టు.. అన్నింటిలోనూ గెలుపొంది పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. Samayam Telugu | Updated: Nov 16, 2019, 05:08PM IST India ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌లో టీమిండియానే ప్రస్తుతం టాప్ నాలుగు నెలలుగా ఆడిన అన్ని టెస్టుల్లోనూ గెలిచిన భారత్ బంగ్లాదేశ్‌పై ఇండోర్ టెస్టులో ఇన్నింగ్స్ 130 రన్స్ తేడాతో గెలుపు ఛాంపియన్‌షిప్ ఇంకా ఖాతా తెరవని పాక్.. మరో మూడు జట్లు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌‌‌షిప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ ఛాంపియన్‌షిప్‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రారంభించగా.. అప్పటి నుంచి ఆరు టెస్టులు ఆడిన భారత్ జట్టు అన్నింటిలోనూ ఘన విజయాల్ని అందుకుంది. దీంతో.. పాయింట్ల పట్టికలో టీమిండియా 300 పాయింట్లతో నెం.1 స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‌పై ఇండోర్ టెస్టులో భారత్ అలవోక గెలుపు ఈ ఏడాది ఆగస్టులో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ని ఆడిన టీమిండియా 2-0తో గెలిచి.. ఆ తర్వాత దక్షిణాఫ్రికాని మూడు టెస్టుల సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ చేసేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో ఇండోర్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టులోనూ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు.. టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలైన తర్వాత ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఏకైక జట్టుగా కొనసాగుతోంది. టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ జట్టు 300 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత వరుసగా న్యూజిలాండ్ (60 పాయింట్లు), శ్రీలంక (60), ఆస్ట్రేలియా (56), ఇంగ్లాండ్ (56) టాప్-5లో కొనసాగుతున్నాయి. ఇక మిగిలిన వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకూ కనీసం పాయింట్ల ఖాతా కూడా తెరవలేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచి వెస్టిండీస్ రెండు టెస్టులు, దక్షిణాఫ్రికా మూడు టెస్టులు, బంగ్లాదేశ్ ఒక టెస్టు ఆడి.. ఓడిపోగా.. పాకిస్థాన్ ఇప్పటి వరకూ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. Photo credit: Screen Shot from ICC ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమవగా.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రూపంలో మొత్తం తొమ్మిది దేశాలు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా.. 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. రెండేళ్ల ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరిగా టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్‌ నెలలో ఫైనల్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టెస్టు ఛాంపియన్‌గా నిలుస్తుంది. ప్రతి సిరీస్‌కి 120 పాయింట్లని ఐసీసీ కేటాయిస్తుండగా.. మ్యాచ్ సంఖ్య ఆధారంగా వాటిని విభజిస్తారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
- నిప్పులు చెరిగిన టీమిండియా బౌలర్లు - బంగ్లాదేశ్‌ 150/ఆలౌట్‌, భారత్‌ 86/1 టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది. గురువారం టాస్‌ గెలిచిన బంగ్లా బ్యాటింగ్‌కు దిగి 58.3 ఓవర్లలో 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. టీమిండియా పేసర్లు మహ్మద్‌ షమీ(3/27), ఇషాంత్‌(2/20), ఉమేష్‌(2/47)కి తోడు స్పిన్నర్‌ అశ్విన్‌(2/43) రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. ఇండోర్‌: టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. గురువారం తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(37), సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌(43) మినహా మిగతా బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమయ్యారు. వీరిద్దరి ఓ మోస్తరు పోరాటం మినహాయిస్తే తొలిరోజు ఆద్యంతం భారత్‌దే పైచేయిగా నిలిచింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు సాధించగా... అశ్విన్‌, ఇషాంత్‌, ఉమేశ్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌ కయాస్‌లు ప్రారంభించగా వారిద్దరూ తలో ఆరు పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. ఇషాంత్‌ వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతికి షాద్‌మన్‌ ఔట్‌ కాగా, ఆపై ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి ఇమ్రుల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. షాదమ్‌న్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పట్టగా, ఇమ్రుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. దాంతో 12 పరుగులకే బంగ్లాదేశ్‌ రెండు వికెట్లను చేజార్చుకుంది. మూడో వికెట్‌గా కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(37)ను అశ్విన్‌ ఔట్‌ చేయడంతో బంగ్లా నిలకడైన భాగస్వామ్యానికి తెరపడింది. ఇక వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌(43) ఒక్కడే బాధ్యతాయుతంగా ఆడాడు. రహీమ్‌ను బౌల్డ్‌ చేసిన షమీ.. ఆపై మరుసటి బంతికి మెహిదీ హసన్‌ను గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ చేశాడు. టీ బ్రేక్‌ తర్వాత ఇషాంత్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి బంతికే లిటన్‌ దాస్‌(21) ఔట్‌ అయ్యాడు. 140 పరుగుల వద్దే బంగ్లా మూడు వికెట్లను కోల్పోయింది. అటు తర్వాత తైజుల్‌ ఇస్లామ్‌ రనౌట్‌ కాగా, చివరి వికెట్‌గా ఇబాదత్‌ హుస్సేన్‌(2) ఔటయ్యాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన బంతికి ఇబాదత్‌ బౌల్డ్‌ అయ్యాడు. తొలిరోజు ఆటలో భాగంగా లంచ్‌ సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌.. ఆపై టీ విరామానికి వెళ్లే సమయానికి మరో నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఆ తర్వాత బంగ్లా ఇన్నింగ్స్‌ను టీమిండియా బౌలర్లు ఎక్కువ సేపు సాగనీయలేదు. వికెట్ల వేటను కొనసాగిస్తూ బంగ్లాను కట్టడి చేశారు. బంగ్లా తన చివరి రెండు వికెట్లలో ఒక రనౌట్‌ కాగా, మరొక వికెట్‌ను ఉమేశ్‌ యాదవ్‌ తీశాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అటు తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన భారత జట్టు ఆరంభంలోనే రోహిత్‌ శర్మ(6) వికెట్‌ను కోల్పోయింది. అబు జాయేద్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఔటయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌(37 బ్యాటింగ్‌), పుజారా(43 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు. షమిని ఊరించిన హ్యాట్రిక్‌... బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్‌ షమీ హ్యాట్రిక్‌ తీసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో భాగంగా 54 ఓవర్‌ ఐదో బంతికి ముష్ఫికర్‌ రహీమ్‌ వికెట్‌ తీసిన షమీ.. ఆ మరుసటి బంతికి మెహిదీ హసన్‌ గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలోనే టీ బ్రేక్‌ రాగా, షమీని హ్యాట్రిక్‌ ఊరించింది. కాగా, టీ విరామం తర్వాత షమీ మరొక ఓవర్‌ను అందుకోవడానికి ముందే ఇషాంత్‌ శర్మ వేసిన 55 ఓవర్‌ మొదటి బంతికే లిటన్‌ దాస్‌ ఔటయ్యాడు. స్లిప్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వికెట్‌ కోల్పోయాడు. దాంతో షమీ, ఇషాంత్‌లు సంయుక్తంగా టీమ్‌ హ్యాట్రిక్‌ను సాధించారు. స్కోర్‌బోర్డు... బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: షాద్‌మన్‌ (సి) సాహా (బి) ఇషాంత్‌ 6, కయాస్‌ (సి) రహానే (బి) ఉమేష్‌ 6, మోమినుల్‌ హక్‌ (బి) అశ్విన్‌ 37, మిథున్‌ (ఎల్‌బి) షమి 13, ముష్ఫికర్‌ రహీమ్‌ (బి) షమి 43, మహ్మదుల్లా (బి) అశ్విన్‌ 10, లింటన్‌ దాస్‌ (సి) కోహ్లీ (బి) ఇషాంత్‌ 21, మెహిదీ హసన్‌ (ఎల్‌బి) షమి 0, తైజుల్‌ ఇస్లామ్‌ (రనౌట్‌) జడేజా/సాహా 1, అబు జాయెద్‌ (నాటౌట్‌) 7, ఇబాదత్‌ (బి) ఉమేష్‌ 2, అదనం 4. (58.3 ఓవర్లలో ఆలౌట్‌) 150 పరుగులు. వికెట్ల పతనం: 1/12, 2/12, 3/31, 4/49, 5/115, 6/160, 7/140, 8/140, 9/148, 10/150 బౌలింగ్‌: ఇషాంత్‌ 12-6-20-2, ఉమేష్‌ 14.3-3-47-2, షమి 13-5-27-3, అశ్విన్‌ 16-1-43-2, జడేజా 3-0-10-0 భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: అగర్వాల్‌ (బ్యాటింగ్‌) 37, రోహిత్‌ (సి)దాస్‌ (బి) అబు జాయేద్‌ 6, ఛటేశ్వర పుజరా (బ్యాటింగ్‌) 43, (26 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 86 పరుగులు. వికెట్ల పతనం: 14/1 బౌలింగ్‌: ఇబాదత్‌ 11-2-32-0, అబూ జాయెద్‌ 8-0-32-1, తైజుల్‌ ఇస్లామ్‌ 7-0-33-0 మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
2sports
హైదరాబాద్‌ కేంద్రంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీ - నమోదు కాని స్టార్టప్‌ల కోసం ప్రత్యేకం - 'గ్రెక్స్‌' పేరుతో వచ్చే నెలనుంచి సేవలు హైదరాబాద్‌: దేశంలోని స్టాక్‌ మార్కెట్లలో నమోదు కాని స్టార్టప్‌ కంపెనీల కోసం కొత్తగా ఒక స్టాక్‌ ఎక్స్ఛేంజీ 'గ్రెక్స్‌' పేరుతో అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా ఈ కొత్త ఎక్స్ఛేంజీ ఏర్పాటు కావడం విశేషం. 'ది ఇండస్‌ ఎంటర్‌ ప్రీన్యుయర్స్‌' (టై) సంస్థ 'ది ఎంటర్‌ప్రీన్యుయర్‌ జోన్‌' (టెజ్‌)తో కలిసి దీనిని ఏర్పాటు చేశారు. ఈ కొత్త స్టాక్‌ ఎక్స్ఛేంజీ సేవలు అధికారికంగా వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టిన స్టార్టప్‌ సంస్థలకు నిధుల సమీకరణకు గాను ఒక ప్రత్యామ్నాయాన్ని అందుబాటులో ఉంచడం, మదుపరులు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెట్టుబడులను ఉపసంహరించుకొనేందుకు ఎక్కువ సౌలభ్యంగా ఉండాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు. ప్రజలు స్టార్టప్‌ల వృద్ధిలో పాలుపంచుకొనేలా 'గ్రెక్స్‌' ప్రోత్సహించనుంది. కొత్త ఎక్స్ఛేంజీని కేవలం పెట్టుబడి అవసరాల కోసమే కాకుండా కంపెనీల గురించి తెలిపేందుకు, సంపూర్ణంగా వివరించేందుకు ఒక సమగ్ర వేదికగా దీనిని రూపొందించినట్లు 'గ్రెక్స్‌' సీఈవో మనీష్‌ కుమార్‌ తెలిపారు. 'గ్రెక్స్‌'లో పారదర్శకతకు, సమాచారం పంపకం, ఆర్థిక వ్యవహారాలు చాలా సులభంగా నిర్వహించేలా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
'డిజిటల్‌'కు తెలంగాణ సన్నద్ధం జులై-1 నుంచి 'డిజిటల్‌ ఇండియా' - వారం రోజలపాటు సాగనున్న కార్యక్రమాలు - ఐటీ వ్యాప్తి, అవగాహనే ధ్యేయం - ప్రతిష్ఠాత్మకంగా ఐటీ శాఖ సన్నాహాలు నవతెలంగాణ-వాణిజ్య విభాగం        కేంద్ర ప్రభుత్వం బుధవారం (జులై1) నుంచి ప్రతిష్ఠాత్మకంగా ప్రారం భించనున్న 'డిజిటల్‌ ఇండియా' కార్యక్రమానికి తెలంగాణ సర్కార్‌ భారీగానే సన్నద్ధమవుతోంది. దేశ సౌరులకు ఐటీ, సాంకేతిక రంగాలపై అవగాహన కల్పించి వారు డిజిటల్‌ సాధికారికత సాధించేలా చూడడం, దేశంలో ప్రతి ఒక్కరికీ సాంకేతిక మౌలిక వసతులను అందుబాటులో ఉంచడం, ప్రజల కోరిక మేరకు వారు డిజిటల్‌ మార్గంలో సుపరిపాలనను అందుబాటులో ఉంచడం 'డిజిటల్‌ ఇండియా' ప్రధాన ధ్యేయాలు. మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమం జులై 1న మొదలై వారం రోజులపాటు సాగనుంది. తెలంగాణాలోనూ భారీ కార్యక్రమాలు..       'డిజిటల్‌ ఇండియా' కార్యక్రమంలో భాగంగానే మరిన్ని ఐటీ, ఐటీ ఆధారిత సేవలను తెలంగాణ ప్రజలకు 'డిజిటల్‌ తెలంగాణ' పేరుతో అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ణయించింది. పంపిణీ, డిమాండ్‌ల ప్రాతిపదికన 'డిజిటల్‌ తెలంగాణ' కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. పంపిణీ విభాగం కింద తెలంగాణలోని ప్రతి పౌరునికి ఐటీ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వాటర్‌గ్రిడ్‌ పైపుల వెంట ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల్లను వేయడం, రాష్ట్రం మొత్తం 4జీ సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు.. అన్ని ప్రధాన నగరాలలో వైఫై సేవలను అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిమాండ్‌ విభాగం వైపు ప్రతి ఒక్కరికీ ఐటీ, ఐటీ ఆధారిత డిజిటల్‌ సేవలపై అవగాహన పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్‌ అక్షర్యాత పెంపు, పాఠశాలల్లో కంప్యూటర్‌ అక్షర్యాత కార్యక్రమాలు, మీ-సేవ సర్వీసులను మరింత విస్తృత పరచడం, వీలైనన్ని ఎక్కువ మీ-సేవ సర్వీసులను మొబైల్‌ ప్లాట్‌ఫాం పైకి అందుబాటులోకి తేవడం, మెరుగ్గా ప్రజా సేవలను అందించేందుకు గాను వీలైనన్ని కొత్త సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ కార్యక్రమాలకు శ్రీకారం..      ఐటీ శాఖ పలు ఇతర ప్రభుత్వ శాఖల సహాయంతో వారం రోజల పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో 'డిజిటల్‌' కార్యక్రమాలను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ నందు ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే ఏర్పాటు. సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాలు, 5కె, 2కె రన్‌ల ఏర్పాటు, వివిధ పోటీలను నిర్వహించడం, వరంగల్‌ జిల్లాలో బయోమెట్రిక్‌ హజరుపట్టిక ఏర్పాటు, తెలంగాణ వర్సిటీలో వైఫై సేవలను ప్రారంభించడం వంటి పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV రూ.350 నాణేలను తీసుకురానున్న ఆర్‌బీఐ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలోనే కొత్త నాణేన్ని ప్రవేశపెట్టనుంది. శ్రీ గురు గోవింద్ సింగ్ 350వ జయంతి వార్షికోత్సవం సందర్భంగా రూ.350 నాణేన్ని విడుదల చేయనుంది TNN | Updated: Mar 27, 2018, 05:30PM IST రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలోనే కొత్త నాణేన్ని ప్రవేశపెట్టనుంది. శ్రీ గురు గోవింద్ సింగ్ 350వ జయంతి వార్షికోత్సవం సందర్భంగా రూ.350 నాణేన్ని విడుదల చేయనుంది. నోట్ల రద్దు తరువాత పెద్ద నాణేలను తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.350 నాణేలను తీసుకురానుంది. ఈ మేరకు ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కొత్త రూ.350 నాణెం ఎలా ఉంటుంద‌నే దానిపై అంచనాలు ఇలా ఉన్నా కొత్త నాణేన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఆర్బీఐ యి. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలత సిల్వర్‌ మిశ్రమ లోహాలు 50 శాతం, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, జింక్ లోహాల మిశ్రమంతో దీన్ని రూపొందించింది. ముందు భాగంలో అశోక స్తంభం, మధ్యలో "సత్యమేవ జయతే" నినాదాన్ని పొందుపర్చగా, ఎడమవైపున దేవనాగరి లిపిలో "భారత్", వెనుక భాగంలో ఇండియా అని ఆంగ్లంలో ఉంటుంది.
1entertainment
విద్యారంగ సమస్యలపై 30న ధర్నాలు - జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు.. * సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్‌ నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌         విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 30న (మంగళవారం) జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో విద్యార్థి రంగ కార్యకర్తలతో కోట రమేష్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం బి వెంకట్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్‌ విద్యావ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ స్కూళ్లు, వసతి గృహాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. పాఠశాలలు, వసతి గృహాలు తెరిచి 20 రోజులు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలిపారు. బంగారు తెలంగాణ అని ఎన్ని మాటలు చెప్పినా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను బలోపేతం చేయకుండా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కెజి టు పిజి విద్య పథకం ఊసేలేదన్నారు. జీవో నెంబర్‌ 11ను తెచ్చి సర్కారు బడులను దెబ్బతీసేందుకు సిద్ధపడిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లవైపు పోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.       వసతి గృహాల్లో నాసిరకమైన భోజనం అందించడం లేదని, పక్కా భవనాల్లేక, ఇతర వసతుల్లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పిల్లలను వసతి గృహాలకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఫీజుల వసూలులో ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చేయడం లేదని పేర్కొన్నారు. ఏటా 25 నుంచి 40 శాతం వరకు ఫీజులు పెంచుతున్నాయని తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు ఆర్థికంగా బలహీన తరగతుల విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పాలని ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సాంబశివ, నాగేశ్వరరావు, జగదీష్‌, బాలరాజు, అశోక్‌, రామకృష్ణ, రమేష్‌, రవికుమార్‌, శేఖర్‌, రజని తదితరులు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
హ్యాపీ బర్త్ డే పూరీ Highlights ఇవాళ పూరీ జగన్ పుట్టిన రోజు హ్యాపీ బర్త్ డే పూరీ-ఏలియానెట్ తరపున త్వరలోనే ఆకాశ్ తో పూరీ సినిమా   తెలుగు సినీ పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్‌. సినీ పరిశ్రమలో త‌న కంటూ సెప‌రేట్ మార్క్ క్రియేట్ చేసుకుని పూరి మార్క్ అంటూ ఓ ప్ర‌త్యేక‌మైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఈ డైలాగ్ బ్లాస్టర్ కు హీరోల మాదిరిగానే సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విప‌రీతంగానే ఉంది. ద‌ర్శ‌కుల‌కు ఫాలోయింగ్ ఉంటుంది అన్న‌ది అసలు పూరీతోనే మొద‌లైంద‌ని చెప్పాలి. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా తతన కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకునేలా సినిమాలు తీస్తూ అప్పుడప్పుడు కాస్త అటు ఇటు అయినా... పూరీ మార్క్ బ్రాండ్ తో తన పని తాను చేసుకు పోతున్నాడు. ఇటీవల డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న పూరీ ఇవాళ 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.   సెప్టెంబ‌ర్ 28 1966 లో జ‌న్మించిన పూరీ 2000 సంవ‌త్స‌రంలో ఫ‌స్ట్ టైం మెగా ఫోన్ ప‌ట్టిన పూరి మొద‌టి సినిమానే పవ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తో తీయ‌డమే కాకుండా ప‌వ‌ర్ స్టార్ కు బ‌ద్రీ రూపంలో భారీ విజ‌యాన్ని అందించాడు.. కాని ఆ స‌క్సెస్‌ను బాచీ సినిమాతో కంటిన్యూ చేయ‌లేక పోయాడు. ఆ త‌రువాత మ‌ళ్లీ ర‌వితేజ హీరోగా ఇట్లు శ్రావ‌ణీ సుబ్ర‌మ‌ణ్యం లాంటి ల‌వ్ స్టోరీతో ట్రాక్ లోకి వ‌చ్చాడు.   అయితే...పూరీ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన సినిమా మాత్రం ఇడియ‌ట్ అనే చెప్పాలి ..ర‌వితేజ్కు కూడా మాస్ ఇమేజ్ ను తెచ్చిన హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ అంటే ఇలా ఉండాలి హీరో అంటే ఇలానే ఉండాలి అంటూ పూరీ మార్క్ అంటే ఏంటో చూపించాడు..ఆ సినిమాను ఇన్స్‌ పిరేష‌న్ గా తీసుకుని ఎంద‌రో ఆయ‌న్ను ఫాలో అయ్యారు కాని.. పూరీ తో పోటీ ప‌డ‌లేక పోయారు. 7 రోజుల్లో కథరాసి డైలాగ్ వ‌ర్ష‌న్ 8 రోజుల్లో టోట‌ల్ 15 రోజుల్లో కంప్లిట్ స్క్రిప్ట్ ను రాయ‌గ‌ల ఏకైక ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌..ఇడియ‌ట్ త‌రువాత అమ్మా నాన్న ఓ త‌మిళ‌ అమ్మాయి,శివ‌మ‌ణి లాంటి బ్లాక్‌బాస్ట‌ర్ హిట్లు కొట్టి టాప్ డైరెక్ట‌ర్ అయ్యారు పూరీ.   ఆ తరువాత కొన్ని ఫ్లాపులు ప‌డ్డా...పోకిరి సినిమాతో ఇండ‌స్ట్రిని ఒక ఊపు ఊపేశాడు ...ఇండ‌స్ట్రీ రికార్డ్ అంటే ఎలా ఉంటుందో అన్న అనుమానాల‌కు పోకిరి స‌మాధానంగా నిలిచింది..అల్లు అర్జున్‌తో దేశ‌ముదురు లాంటి భారీ విజ‌యం అందుకున్న ఈ డాషింగ్ డైరెక్ట‌ర్ ...ఆ త‌రువాత చిరంజీవి త‌న‌యుడిని చిరుత సినిమాతో ఇంట్ర‌డ్యూస్ చేశాడు పూరీ..ఆ త‌రువాత ప్ర‌భాస్‌తో బుజ్జిగాడు, ఏక్ నిరంజ‌న్ లాంటి సినిమాల‌తో పాటు ర‌వితేజ్‌తో నేనింతే సినిమా తీసి నందీ అవార్డు సైతం అందుకున్నాడు.     మ‌హేష్ తో బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు తియ్యాల‌న్నా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి సినిమాలు తియ్యాల‌న్నా...తార‌క్ లాంటి యాక్టింగ్ ప‌వ‌ర్ ఉన్న హీరోల‌తో టెంప‌ర్ లాంటి సినిమాలు తీయాల‌న్నా అది కేవ‌లం పూరీ కే సాధ్యం.   ఇప్ప‌టికే 32 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పూరి ప్ర‌స్తుతం త‌న కొడుకు ఆకాష్ పూరీతో సినిమా చేస్తున్నాడు..దీని ముందు చేసిన పైసావ‌సూల్ హిట్ అవ్వ‌కున్న ...వ‌రుస‌గా ఫ్లాపులు ఎదుర‌వుతున్నా పూరీ క్రేజ్ మాత్రం ఎప్ప‌టికి త‌గ్గ‌ద‌నే చెప్పాలి   సినిమా ప‌రంగా కాని...ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో అయినా కాని ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా ఎన్న డౌన్ ఫాల్స్ వ‌చ్చినా మ‌ళ్లీ క‌మ్‌బ్యాక్ అవ్వ‌డం గ్రాండ్ వేలో ఇండ‌స్ట్రీకి పూరీ మార్క్ ను చూప‌డం జ‌గ‌న్‌కు వెన్న‌తో పెట్టిన విద్య ...నేడు పుట్టిన రోజు సందర్భంగా పూరీ జగన్నాధ్ కి 'ఆసియానెట్' జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. Last Updated 25, Mar 2018, 11:45 PM IST
0business
internet vaartha 135 Views నాకు అవకాశం ఇవ్వడం లేదు కరాచీ : మైదానంలో కంటే గాయాలతో ఎక్కువ సహజీవనం చేసిన పాకిస్థాన్‌ బౌలర్‌ ఉమర్‌ గుల్‌ తాజాగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై విమర్శలు గుప్పించారు. కాగా జులై 14 నుంచి ఇంగ్లండ్‌తో ఆరంభం కానున్న సిరీస్‌కి తనను ఎంపిక చేయకపోవడంపై గుల్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న తనని సెలక్టర్లు ఎంపిక చేయకుండా ఇలానే పక్కన పెడుతున్నట్లు ఆరోపించాడు. ఆటగాళ్లకు గాయాలు సహజం. అయితే ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందకు తగిన సమయం ఇవ్వాలి కదా అని ప్రశ్నించాడు. పిసిబి ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందని, కెరీర్‌లో ఇప్పటి వరకు 47 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గుల్‌ 163 వికెట్లు,126 వన్డేల్లో 173 వికెట్లు తీసుకున్నాడు.
2sports
Visit Site Recommended byColombia అంతేకాదు మనమిద్దరం ఇలా తిరిగితే అందరూ దిష్టిపెట్టేస్తారు.. నిమ్మకాయ, మిరపకాయ పెట్టానా’ అంటూ దిష్టితీసేందుకు రెడీ అయ్యింది. ఈ హంగామా అంతా జబర్దస్త్ స్టేజ్‌‌పైనే. వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. ఇందులో అనసూయ, హైపర్ ఆదిలో బైక్‌పై షికారు చేస్తున్నారు. ఇక దిష్టికోసం మిరపకాయ, నిమ్మకాయ పెట్టనా అని అనసూయ అడిగితే.. వాటితో దిష్టిపోతే.. నిమ్మకాయ తోటకు తెగులెందుకు? మిరప రైతుకి దిగులెందుకు? అంటూ సెటైర్లు వేస్తున్నాడు హైపర్ ఆది. సర్లే.. ఇప్పుడు బైక్ మీద ఎంట్రీ ఇచ్చాం కదా.. ఈసారి ఫ్లైట్‌లో ఎంట్రీ ఇద్దాం అని అనసూయ అంటుంటే.. ‘నీలాంటిదే దీపావళి రిచ్‌గా జరుపుకోవాలని... రివాల్వర్‌తో కాల్చిందట అందర్నీ’ అంటూ పంచ్‌లు పేలుస్తున్నాడు హైపర్ ఆది. తాజా ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి. X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ఇన్ఫోసిస్‌ లాభం రూ.3726 కోట్లు - 7 శాతం మేర పెరిగిన ప్రాఫిట్‌ - భవిష్యత్తు అంచనాలకు కోత బెంగళూరు : దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను ముందస్తు రెవెన్యూ అంచనాలను తగ్గించుకుంది. ఈ ఏడాదిలో కంపెనీ రెవెన్యూలో 5.5-6.5 శాతం పెరుగుదల ఉండొచ్చని తాజాగా పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనాలు 6.5-8.5 శాతంగా ఉన్నాయి. డాలర్ల రూపంలో కూడా ఆదాయాన్ని 6.5-7.5 శాతంగా అంచనా వేసుకుంది. వివిధ అంతర్జాతీయ, జాతీయ పరిణామాల నేపథ్యంలో తమ రెవెన్యూ గైడ్‌లైన్స్‌ను తగ్గించుకున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికానికి ఇన్ఫోసిస్‌ నికర లాభాలు 7 శాతం పెరిగి రూ.3,726 కోట్లకు చేరాయి. ఇంతక్రితం జూన్‌ త్రైమాసికంలో రూ.3,483 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. గతేడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం లాభాలతో పోల్చితే క్రితం క్యూ2 ఫలితాల్లో 3.4 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. సిక్కా రాజీనామా తర్వాత కంపెనీ సహ వ్యవస్థాపకులు నందన్‌ నిలేకనీ సీఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెలువడుతున్న తొలి ఫలితాలు ఇవే. సిక్కాకు మద్దతుగా నిలిచిన నిలేకని పనయ కొనుగోలు విషయంలో ఏర్పడిన అనుమానాలకు నిలేకని మంగళవారం తెర దించారు. ఈ కొనుగోలు విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని నందన్‌ నిలేకనీ పేర్కొన్నారు. సంస్థ మాజీ సీఈవో విశాల్‌ సిక్కా నిర్ణయం సరైందేనని అన్నారు. విచారణ నివేదికను బహిర్గతం చేయకుండానే ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. ఈ కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఇది వరకు ఇన్ఫీ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై మూర్తి, సిక్కా మధ్య పెద్ద దుమారమే రేగింది. కాగా ఈ వ్యాఖ్యలను నిలేకని కొట్టిపారేసినట్లయ్యింది. దీంతో సిక్కాకు క్లీన్‌చీట్‌ లభించింది. కంపెనీ ప్రయోజనాల రీత్యా విచారణ నివేదికను బహిర్గతం చేయడం లేదన్నారు. జోరుగా కొత్త సీఈవో అన్వేషణ ఇన్ఫోసిస్‌కు కొత్త సీఈవోను ఎంపిక చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని నిలేకని తెలిపారు. వీలైనంత తొందరగానే ఈ ప్రక్రియను ముగిస్తామన్నారు. డిజిటల్‌ వ్యాపార వృద్ధిలో సంస్థ పలు సవాళ్లు ఎదుర్కుంటుందన్నారు. ఫలితాల నేపథ్యంలోమంగళవారం బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ షేర్‌ 1.37 శాతం నష్టపోయి రూ.926.75 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV భారత్‌పై చివరి వన్డేలో సత్తాచూపిస్తాం..! భారత్‌తో ఆదివారం జరగనున్న చివరి వన్డేలో సత్తాచూపిస్తామని శ్రీలంక మాజీ కెప్టెన్ మాథ్యూస్ ధీమా వ్యక్తం చేశాడు. TNN | Updated: Sep 2, 2017, 05:23PM IST భారత్‌తో ఆదివారం జరగనున్న చివరి వన్డేలో సత్తాచూపిస్తామని శ్రీలంక మాజీ కెప్టెన్ మాథ్యూస్ ధీమా వ్యక్తం చేశాడు. గత గురువారం కొలంబోలో ముగిసిన నాలుగో వన్డేలో అర్ధశతకంతో లంక పరువు కోసం ఒంటరిపోరాటం చేసిన మాథ్యూస్ (70) చివరికి పేలవ షాట్‌‌తో వికెట్ చేజార్చుకున్నాడు. ఇప్పటికే భారత్ చేతిలో టెస్టుల్లో క్లీన్‌స్వీప్‌కి గురైన శ్రీలంక.. ఐదు వన్డేల సిరీస్‌లోనూ 0-4తో వెనకబడి వైట్‌వాష్ ప్రమాదం ముంగిట ఉంది. ఆదివారం మధ్యాహ్నం కొలంబో వేదికగానే ఐదో వన్డే జరగనుంది. ‘వ్యక్తిగతంగా వన్డేల్లో నా ప్రదర్శనపై తీవ్ర నిరాశలో ఉన్నాను. క్రీజులో వేగంగా కుదురుకుని పరుగులు రాబడుతున్నా.. ఔటవుతున్న తీరు బాధిస్తోంది. ఇక సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే నా బ్యాటింగ్‌ తీరుతో నేను విసుగుచెందాను. జట్టుకి విజయాలు అందించలేకపోయినా.. కనీస ముద్ర వేయగలిగాననే సంతృప్తి మాత్రమే నాకు మిగిలింది. చివరి వన్డేలో శ్రీలంక తప్పకుండా గెలిచి సత్తా చూపిస్తుంది’ అని మాథ్యూస్ ధీమా వ్యక్తం చేశాడు.
2sports
internet vaartha 343 Views తాజా స్టేషన్లలో కాచిగూడ, విజయవాడ, విశాఖ హైదరాబాద్‌ : నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో గూగుల్‌తో కలిసి హైస్పీడ్‌ పబ్లిక్‌ వైఫై సేవలను రైల్‌టెల్‌ ప్రారంభించింది. 2016 చివరినాటికి 100రైల్వే స్టేషన్లలో వైఫై సేవలందిం చాలన్న ప్రణాళికలో భాగంగా 10 రైల్వే స్టేషన్లలో ఇప్పటివరకూ వైఫైసేవలు విజయవంతంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. రైల్‌ వైర్‌గా తన విస్తృత నెట్‌వర్క్‌లో గూగుల్‌తో కలిసి ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది. ప్రతిరోజూ 1.5 మిలియన్ల మందికి ఇంటర్నెట్‌ యాక్సెస్‌ చేసుకునేందుకు వీలుకల్పించింది. రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు చేతుల మీదుగా విజయవాడ, కాచిగూడ, ఎర్నాకుళం, కోచి విశాఖపట్టణాల్లో కూడా వైఫై సేవలు ప్రారంభిస్తున్నట్లు రైల్వేప్రకటించింది. వినియోగదారులకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ అనుభూతిని అందించేందుకు రైల్‌టెల్‌ ఫైబర్‌ నెట్‌ వర్క్‌పై ఈ సేవలు రూపొందించారు. ఈ స్టేషన్ల మీదుగా వెళ్లే ప్రయాణీకులు ఇపుడు సులభంగా హైడిఫినిషన్‌ వీడియోను చూడవచ్చన్నారు. తమ గమ్యస్థానం అన్వేషించుకోవచ్చని, కావాల్సిన పుస్త కం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. కొత్త గేమ్స్‌ ఆడు కోవచ్చని గూగుల్‌ ప్రకటించింది. గూగుల్‌ అందించే ఈప్రాజెక్టు కింద 400 రైల్వేస్టేషన్లలో వైఫై సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా గూగుల్‌ హెడ్‌ గుల్జార్‌ఆజాద్‌ మాట్లాడుతూ కాచి గూడ స్టేషన్‌ చేరడంతో ఈనెట్‌వర్క్‌ ఇపుడు దేశ వ్యాప్తంగా పది స్టేషన్‌లలో లైవ్‌ అయిందన్నారు. చిన్నచిన్న స్టేషన్లను సైతం కవర్‌చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలోఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ను సుఏలభంగా అందుబాటు రేట్లలో యాక్సెస్‌ చేయడ మనేది తక్షణావసరంగా మారిందన్నారు 100 స్టేషన్లను లైవ్‌ చేయడం ద్వారా దేశంలో ఈప్రాజెక్టు అత్యధిక స్థాయిలో ప్రజాచేరువ అయిందన్నారు. రైల్‌టెల్‌ ఎండి ఆర్‌కెబహుగుణ మాట్లాడుతూ మంత్రి సురేష్‌ప్రభు పేర్కొన్నట్లు భారతీ య రైల్వే ప్రయాణాకులకు అందే సేవల ను ఆధునీకరించడం మెరుగుపరచడం అనేది ప్రధా నంగా దృష్టి సారించినట్లు తెలిపారు. భవిష్యత్తులో రైల్‌టెల్‌ ఇతర భాగస్వాములతో కలిసి ఈసేవలు మరిన్ని స్టేషన్లకు ప్రాంతాలకు విస్తరిస్తుందన్నారు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 2025 నాటికి రెండింత‌ల‌వ‌నున్న దేశ ఆర్థికం . ప్ర‌స్తుతం 2.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లుగా ఉన్న భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ విలువ ప‌రంగా ప్ర‌పంచంలో 6 వ స్థానంలో ఉంది. TNN | Updated: Mar 26, 2018, 05:03PM IST 2025 క‌ల్లా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ రెట్టింపై 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఆర్‌బీఐ నిర్ధేశించిన ల‌క్ష్యానికి అనుగుణంగా ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితుల‌న్న‌ప్పుడే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం 2.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లుగా ఉన్న భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ విలువ ప‌రంగా ప్ర‌పంచంలో 6 వ స్థానంలో ఉంది. “ప్ర‌స్తుతం మ‌న దేశం 7-8 శాతం వృద్ధి రేటు సాధిస్తోంది. అయితే అంకుర సంస్థ‌లు, మౌలిక వ‌స‌తులు, సూక్ష్మ, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లపై దృష్టి సారిస్తే ఈ వృద్ది రేటును మ‌రింత ముందుకు వెళ్ల‌గ‌లద‌ని” కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర అంచ‌నా వేశారు. సీఐఐ గ్లోబ‌ల్ ఇండ‌స్ట్రీ అసోసియేష‌న్స్ స‌మ్మిట్‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ వ‌స్తు, సేవ‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తూ వ‌చ్చే 7-8 ఏళ్ల పాటు డిమాండ్‌ను సృష్టించుకోగ‌లిగితే ఈ త‌ర‌హా వృద్ధి రేటును ఆశించ‌డం స‌రైన‌ద‌నే చెప్పుకొచ్చారు. 2025 క‌ల్లా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సైతం 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేరుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. Read also in English ఆర్‌బీఐ నిర్ధేశించిన ల‌క్ష్యమైన 4 శాతం(+/- 2 శాతం) క‌నుగుణంగానే ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితులున్నాయ‌ని, భవిష్య‌త్‌లోనూ న‌ష్ట‌భ‌య ప‌రిస్థితులు ఏర్ప‌డే అవ‌కాశం లేద‌ని తెలిపారు. ఇంకా ప్ర‌స్తుతం ఫిబ్ర‌వ‌రి నెల‌కు డ‌బ్ల్యూపీఐ ద్ర‌వ్యోల్బ‌ణం 7 నెల‌ల క‌నిష్టానికి చేరి 2.48% వ‌ద్ద కొన‌సాగుతోందని, వినియోగ‌దారు సంబంధిత రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 4 నెల‌ల క‌నిష్ఠ స్థాయి 4.44 శాతానికి చేరింద‌ని చెప్పుకొచ్చారు.
1entertainment
Southampton, First Published 3, Sep 2018, 7:28 AM IST Highlights మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ ఇంగ్లాండుపై ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ ను పోగొట్టుకుంది. నాలుగో టెస్టు మ్యాచులో విజయావకాశాలను సరిగా వాడుకోలేక చేతులెత్తేసింది. నాలుగో టెస్టు మ్యాచులో ఇంగ్లాండుపై 60 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ ను 3-1 తేడాతో కోల్పోయింది.  సౌతాంప్టన్‌: మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ ఇంగ్లాండుపై ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ ను పోగొట్టుకుంది. నాలుగో టెస్టు మ్యాచులో విజయావకాశాలను సరిగా వాడుకోలేక చేతులెత్తేసింది. నాలుగో టెస్టు మ్యాచులో ఇంగ్లాండుపై 60 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ ను 3-1 తేడాతో కోల్పోయింది.  నాలుగో టెస్టు మ్యాచులో మొయిన్ అలీ బంతులకు భారత్ బ్యాట్స్ మెన్ విలవిలలాడారు. నాలుగో రోజు ఆదివారం 245 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ 69.4 ఓవర్లలో 184 పరుగులకు కుప్పకూలింది. విరాట్‌ కోహ్లీ (58), రహానె (51) అర్ధ సెంచరీలతో నాలుగో వికెట్‌కు 101 పరుగులు జత చేయడం తప్ప చెప్పుకోవాల్సిందేమీ లేదు.  అంతకుముందు ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 96.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు తొలి బంతికే బ్రాడ్‌ వికెట్‌ను షమి తీశాడు. ఆ తర్వాత కర్రాన్‌ (46) రనౌట్‌ కావడంతో తమ ఓవర్‌నైట్‌ స్కోరుకు ఆ జట్టు 11 పరుగులే చేయగలిగింది.   విజయం కోసం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఆది నుంచీ తడబడుతూ వచ్చింది.. 22 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌లో కూర్చుంది. ఈ దశలో జట్టును కెప్టెన్‌ కోహ్లీ, రహానె ఆదుకున్నారు. ధావన్‌ (17), రాహుల్‌ (0), పుజారా (5) పేలవమైన షాట్లతో అవుటయ్యారు.  భారీ షాట్లకు వెళ్లకుండా రహనే,త కోహ్లీ నిదానంగా ఆడుతూ స్కోరు పెంచారు.కోహ్లీ 114 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 51వ ఓవర్‌లో బంతి కోహ్లీ గ్లోవ్స్‌కు తగిలి షార్ట్‌ లెగ్‌లో కుక్‌ చేతిలో పడింది. దీంతో నాలుగో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.   టీ విరామం తర్వాత భారత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. స్వల్ప వ్యవధిలోనే పాండ్యాను స్టోక్స్‌ అవుట్‌ చేశాడు. రిషబ్ పంత్‌ (18) అలీకి చిక్కాడు. ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న రహానెను కూడా కొద్దిసేపటికే అలీ ఎల్బీ చేయడంతో భారత్‌ 4పరుగుల వ్యవధిలో 3 వికెట్లను కోల్పోయింది. ఆఖరి వికెట్‌కు అశ్విన్‌ (25) పోరాటం కనబరిచినా ప్రయోజనం లేకుండా పోయింది.  Last Updated 9, Sep 2018, 11:17 AM IST
2sports
Hyderabad, First Published 21, Oct 2018, 8:47 PM IST Highlights యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ విచ్చేశారు.  యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. ఈ వేడుకలో టెక్నీషియన్స్,నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లందరికీ మూమెంటోలను అందజేశారు. ఈ సంధర్భంగా  కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ''సినిమా చూసినప్పుడు రాయలసీమ స్లాంగ్ తమ్ముడి నోటిలో నుండి వింటుంటే అక్కడ పుట్టి పెరిగిన వారు మాట్లాడినట్లుగా అనిపించింది. అంత బాగా మాట్లాడాడు. త్రివిక్రమ్ కి సినిమా క్లైమాక్స్ చాలా బావుందని, మంచి పాయింట్ తో సినిమా తీశారని చెప్పాను. ఫుల్ ఎమోషన్ తో సినిమాను తెరకెక్కించారు. జగపతిబాబు పాత్ర కారణంగానే తారక్ పాత్ర మరింత ఎలివేట్ అయింది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు తమ్ముడు నాతో అన్నాడు.. సినిమాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారని.. నిజంగానే ప్రతి ఒక్కరూ అధ్బుతంగా నటించారు. తమన్ ఇచ్చిన రీరికార్డింగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇళయరాజా రేంజ్ లో కొట్టాడు. ఎన్‌టి‌ఆర్ బయోపిక్ తో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బాబాయ్ ఈ వేడుకకి రావడానికి ఒప్పుకున్నారు. ఈ వేడుకలో నాన్నగారు లేరనే లోటుని మా బాబాయ్ తీర్చేశారు'' అంటూ చెప్పారు.
0business
ఏటా 25 లక్షల కార్లు కొనుగోలు వీటిలో లగ్జరీకార్లు 35వేలు వీరంతా పన్నుపరిధిలో లేనివారే! ఐటిరిటర్నులు పరిశీలిస్తున్న పన్నుశాఖ   న్యూఢిల్లీ, డిసెంబరు 27: భారత్‌లో పన్నుచెల్లింపు దారులు 24.4లక్షల మంది వార్షిక పద్ధతిలో పన్ను లు రిటర్నులు దాఖలుచేస్తే వారందరూ సాలీనా పది లక్షల వార్షికాదాయ పరిమితిలో ఉన్నారు. విచిత్రం ఏమంటే భారత్‌లో సాలీనా 25 లక్షల కొత్తకార్లు కొంటున్నారు. వీటిలో 35 వేలకుపైగా విలాసవంత మైన కార్లే ఉన్నాయి. 125 కోట్ల జనాభాలో 3.65 కోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నట్లు తేలిం ది. 2014-15నుంచి ఇదే విధానంగా కొనసాగు తున్న భారత్‌లో లగ్జరీ కార్లు, ఇతర కార్లు మాత్రం 25 లక్షలకుపైబడి కొనుగోలుచేస్తున్నారంటే నల్ల ధనస్వాములు అత్యధిక సంఖ్యలోనే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. మొత్తం 3.65 కోట్ల మంది 2014- 15లో రిటర్నులు దాఖలుచేస్తే 5.5 లక్షలమంది మాత్రమే ఐదులక్షలకుపైబడిన పన్నులు చెల్లించారు. మొత్తం పన్ను రాబడుల్లో 57శాతం వీరి రిటర్నులే ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే 3.65 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల్లో కేవలం 1.5శాతం మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నట్లు తేలింది. కార్ల విక్రయాలతో బేరీజువేసి చూస్తే పన్ను రిటర్నులు విస్మయం కలిగిస్తున్నాయి. గడచిన ఐదేళ్లుగా చూస్తే ఏడాదికి 25 లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. గడ చిన మూడేళ్లలో కార్ల విక్రయాలు వరుసగా 25.03 లక్షలు, 26లక్షలు, 27లక్షలకుపైబడి వివిధ కంపెనీ లు విక్రయించాయి. వీరిలో ఎక్కువ మంది పన్నులు చెల్లిస్తున్నవారిలో లేకపోవడం విచిత్రం. పన్నుల చట్రంలో లేనివారే ఈ కార్లను ఎక్కువ కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. కార్లకు సాధారణంగా ఏడేళ్ల జీవితకాలంగాలెక్కిస్తారు. సెకండ్‌హ్యాండ్‌కారు అయి తే ఐదేళ్ల జీవితకాలంగా నిర్ణయిస్తారు. ఆదాయ పన్ను లెక్కలను చూస్తే 48,417 మంది వ్యక్తులు కోటి రూపాయలకుపైబడి ఆదాయంఉన్నట్లు చూపిం చారు. అయితే లగ్జరీ కార్లు బిఎండబ్ల్యు, జాగ్వార్‌, ఆడి, మెర్సిడిస్‌, పోర్షే, మసారెటి వంటి బ్రాండ్లు ఏడాదికి 35 వేలకు తగ్గకుండా విక్రయిస్తున్నారు. ఇక వ్యక్తిగతంగా రిటర్నులు దాఖలుచేస్తున్న వారిలో 5.32 లక్షల మంది ఉన్నారు. వీరంతా రెండులక్షల వార్షికాదాయం చూపుతున్నారు. అందువల్లనే వీరం తా పన్నుపరిధిలోనికి రారు. 24.4 లక్షల మంది పన్ను రిటర్నులు దాఖలుచేసిన వారిలో అధికశాతం 10లక్షలకుపైబడిన ఆదాయం ఉన్నట్లుప్రకటించారు. ఏడాదికి 50 లక్షలు ఆదాయం ఉన్నవారు 1.47 లక్షల మంది ఉన్నట్లు పన్ను రిటర్నులను బట్టి తెలు స్తోంది. ఇక 2014-15 అసెస్‌మెంట్‌ సంవత్స రానికి సంబంధించి 1.61కోట్ల మందినుంచి టిడిఎస్‌ రూపంలో పన్నులు మినహాయింపు జరిగింది. అయి తే వీరంతా ఐటిఆర్‌లు దాఖలుచేయలేదు. భారత్‌ పన్నులరాబడి స్థూల దేశీయోత్పత్తి జిడిపిలో 16.7శాతం వాటాతో ఉంది. అదే అమెరికాలో అయి తే 25.4శాతం, జపాన్‌లో అయితే 30.3శాతంగా ఉంది. వాస్తవానికి లెక్కకుమించిన సంఖ్యలో పన్ను లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ వారంతా పన్నులు చెల్లించడంలేదని ఆదాయపు పన్నుశాఖ సీనియర్‌ అధికారులు చెపుతున్నారు. అందువల్లనే పన్నుల ఎగవేతకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వంవిస్తృత కార్యా చరణను అమలు చేస్తోంది. గడచిన నవంబరు 8వ తేదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లు రద్దును ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనితో ఒకేసారి బ్యాంకుల్లోనికి 14 లక్షలకోట్లు సొమ్ము డిపాజిట్లరూపంలో వచ్చింది. అంతేకాకుండా 2.5 లక్షలకు మించి వచ్చిన డిపా జిట్లపైనా, 12.5 లక్షలకు మించి ఉన్న కరెంటు ఖాతా డిపాజిట్లపైనా ఐటిశాఖ నిఘాపెంచింది. అందువల్లనే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పన్నుఖాతాల్లోనికి మరింతమంది పన్ను ఎగవేత దారులు వచ్చిచేరే అవకాశం ఉంది. అలాగే బినామి లావాదేవీల నిరోధక చట్టం ఉపయోగిం చడం ద్వారా రియాల్టీలో అక్రమాస్తులను గుర్తించే పనిలో ఉన్న కేంద్రం మరికొంతమందిని పన్నుల చట్రంలోనికి తీసుకు వస్తోంది. వీరిలో అత్యధికంగా ప్రవాసభారతీయుల సొంతగడ్డపై కొనుగోలుచేసిన ఆస్తి వివరాలే అధికంగా ఉన్నట్లు అంచనా.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV స్పిన్నర్ అశ్విన్ ఇక రిలాక్స్ అవుతాడట..! రెండేళ్ల క్రితం టెస్టు జట్టులో పునరాగమనం‌తో ప్రతి టెస్టులో కనీసం ఆరు వికెట్లు తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. TNN | Updated: Jul 24, 2017, 05:18PM IST స్పిన్నర్ అశ్విన్ ఇక రిలాక్స్ అవుతాడట..! భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో అరుదైన ఘనతకి చేరువయ్యాడు. శ్రీలంకతో బుధవారం నుంచి ఆరంభంకానున్న మ్యాచ్‌తో ఈ స్పిన్నర్ 50 టెస్టుల రికార్డుని చేరుకోనున్నాడు. గత రెండేళ్లుగా ఒంటిచేత్తో భారత్‌కి విజయాలు అందిస్తూ అగ్రశ్రేణి స్పిన్నర్‌గా ఎదిగిన అశ్విన్.. కెరీర్‌లో ఇప్పటి వరకు 49 టెస్టులాడి 275 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 25 సార్లు ఐదు వికెట్ల ఫీట్.. 7 సార్లు 10 వికెట్ల రికార్డు ఉండటం అతని జోరుకి నిదర్శనం. ‘రెండేళ్ల క్రితం టెస్టు జట్టులో పునరాగమనం‌తో ప్రతి టెస్టులో కనీసం ఆరు వికెట్లు తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. లయ అందుకున్న తర్వాత.. కొన్ని టెస్టుల్లో ఏకంగా 10 వికెట్లు కూడా పడగొట్టగలిగాను. నా కెరీర్‌లో బెస్ట్ అంటే.. 2015లోనే. ఆ ఏడాది ప్రదర్శనతోనే టెస్టు జట్టులో సుస్థిర స్థానం సంపాదించగలిగాను. కెరీర్‌లో 50వ టెస్టు అంటే ప్రత్యేకమే. ఇక్కడ నుంచి ప్రత్యేక లక్ష్యాలను ఏర్పరచుకోకుండా.. గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తూ క్రికెట్‌ని ఆస్వాదిస్తాను’ అని అశ్విన్ వివరించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
New Delhi, First Published 8, Feb 2019, 12:52 PM IST Highlights దాదాపు 18 నెలల తర్వాత ఆర్బీఐ రెపొరేట్ తగ్గిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు బ్యాంకింగ్, కార్పొరేట్ వర్గాల నుంచి సానుకూల స్పందన లభించింది. ప్రగతికి ఊతమివ్వడంతోపాటు చౌకగా రుణాలు లభిస్తాయని, ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  రెపో రేటును తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్బీఐ ఊతమిచ్చిందని, ఇక చిన్న వ్యాపారులకు, గృహ కొనుగోలుదారులకు రుణాలు చౌక కానున్నాయని తాజా ఆర్బీఐ ద్రవ్యసమీక్షపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని రంగాలకూ ఈ నిర్ణయం లాభించి ఉద్యోగావకాశాలు పెరుగగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘6.5 శాతంగా ఉన్న రెపో రేటును 6.25 శాతానికి ఆర్బీఐ తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల బ్యాం కుల రుణాలపై వడ్డీరేట్లు తగ్గేందుకు ఆస్కారమున్నది. ఇది చిన్న వ్యాపారులు, గృహ కొనుగోలుదారులకు లాభం’ అని పీయూష్ గోయల్ ట్వీట చేశారు. ఇంకా ఎవరేమన్నారంటే.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పందిస్తూ ‘ఆర్బీఐ నిర్ణయం భేష్. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లపై ఉన్న ఆంక్షల్ని తొలగించడాన్నీ స్వాగతిస్తున్నాం’ అని పేర్కొన్నారు.  ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ స్పందిస్తూ ‘మున్ముందు వడ్డీరేట్లు మరింత తగ్గేందుకు అవకాశాలున్నాయి. ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్ణీత స్థాయి కంటే దిగువనే ఉన్నందున రాబోయే సమీక్షల్లో వడ్డీరేట్ల కోతకు వీలున్నది’ అని అన్నారు.  సీఐఐ అధ్యక్షుడు రాకేశ్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ ‘రెపో రేటు తగ్గింపు నిస్తేజంగా ఉన్న వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో నూతనోత్సాహాన్ని నింపింది. బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించి ప్రయోజనాన్ని అందించాలి’ అని వ్యాఖ్యానించారు.  ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమని మాట్లాడుతూ రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు మరింతగా తగ్గాలి. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి, మందగించిన వృద్ధిరేటు పురోగతికి ఆమోదయోగ్యమైన వడ్డీరేట్లు అవసరం’ అని చెప్పారు.  అసోచాం అధ్యక్షుడు బాలకృష్ణన్ గోయెంకా ఈ సందర్భంగా స్పందిస్తూ ‘వడ్డీరేట్ల తగ్గింపు ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ప్రయోజనాన్ని పరిశ్రమకు బ్యాంకులు అందించాలి. మధ్య, భారీతరహా సంస్థల రుణాల విషయంలో ఆర్బీఐ కనికరించాలి’ అని తెలిపారు.   ఈఈపీసీ ఇండియా చైర్మన్ రవీ సెహగల్ మాట్లాడుతూ ‘అంతర్జాతీయంగా ఎగుమతిదారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించేలా ఆర్బీఐ చొరవ తీసుకుంటే ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించవచ్చు’ అని పేర్కొన్నారు.  డీబీఎస్ గ్రూప్ రిసెర్చ్ ప్రతినిధి రాధికా రావు స్పందిస్తూ ‘ఈ సమీక్షలో రెపో రేటు తగ్గింపును ఊహించలేకపోయాం. ఈ క్రమంలో ఏప్రిల్‌లో జరిగే ద్రవ్యసమీక్షలో మరో పావు శాతం తగ్గవచ్చని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.   క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు జక్సే షా మాట్లాడుతూ ‘ఆర్బీఐ నిర్ణయంతో హౌజింగ్ డిమాండ్ పెరుగొచ్చు. అయితే ఎన్‌బీఎఫ్‌సీ, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థల్లో ద్రవ్యలభ్యత పెరుగుదలకు ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉన్నది’ అని అన్నారు.   నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హీరానందని స్పందిస్తూ ‘గృహ నిర్మాణ రంగంలో అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. ద్రవ్యకొరతను ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఆర్బీఐ కొత్త ఊపిరిలూదింది’ అని తెలిపారు.  క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు కొనుగోలుదారులకు బదిలీ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే ఇండ్ల కొనుగోళ్లు పెరుగుతాయి’ అని చెప్పారు. Last Updated 8, Feb 2019, 12:52 PM IST
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మారుతీ సుజుకి న్యూ లుక్.. కాన్సెప్ట్ ‘ఫ్యూచర్-ఎస్’ మారుతీ సుజుకి కార్లు అంటే సంప్రదాయబద్ధమైన డిజైన్, మంచి మన్నిక, ఉత్తమమైన మైలేజ్, సరసమైన ధర.. ఇవే గుర్తొస్తాయి అందరికీ. TNN | Updated: Feb 7, 2018, 11:45AM IST మారుతీ సుజుకి కార్లు అంటే సంప్రదాయబద్ధమైన డిజైన్, మంచి మన్నిక, ఉత్తమమైన మైలేజ్, సరసమైన ధర.. ఇవే గుర్తొస్తాయి అందరికీ. మార్కెట్‌లోకి కొత్త కొత్త డిజైన్లతో ఎన్ని కార్లొచ్చినా మారుతీ సుజుకి మాత్రం తన సంప్రదాయాన్నే కొనసాగించింది. దీనికి కారణం భారత మార్కెట్‌లో మారుతీ సుజుకీకి ఉన్న విశ్వసనీయత. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ తన సంప్రదాయాన్ని పక్కన పెట్టి తొలిసారి వినూత్నమైన డిజైన్‌లో కాన్సెప్ట్ కార్‌ను ప్రదర్శించింది. అదే కాన్సెప్ట్ ‘ఫ్యూచర్-ఎస్’. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో జరుగుతోన్న ఆటో ఎక్స్‌పో 2018లో ఈ కాన్సెప్ట్ ఫ్యూచర్-ఎస్‌ను మారుతీ సుజుకి విడుదల చేసింది. మారుతీ సుజుకి సొంతంగా స్వదేశంలో అభివృద్ధి చేసిన తొలి కాన్సెప్ట్ కార్ ఇది. కాంపాక్ట్ కార్ల విభాగంలో ఈ కాన్సెప్ట్ ఫ్యూచర్-ఎస్ కంపెనీకి ఒక ప్లాట్‌ఫాంగా మారనుంది. భవిష్యత్తులో ఈ విభాగంలో మరిన్ని కార్లను మారుతీ సుజుకి తీసుకురానుంది.
1entertainment
Hyderabad, First Published 25, Oct 2018, 4:57 PM IST Highlights తమకంటే వయసులో పెద్ద అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అభిషేక్ బచ్చన్, ధనుష్ ఈ కోవలోకే వస్తారు. తాజాగా హాలీవుడ్ సింగర్, నటుడు నిక్ జోనాస్ తనకంటే పదేళ్లు పెద్దదైన ప్రియాంక చోప్రాని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు తమకంటే వయసులో పెద్ద అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అభిషేక్ బచ్చన్, ధనుష్ ఈ కోవలోకే వస్తారు. తాజాగా హాలీవుడ్  సింగర్, నటుడు నిక్ జోనాస్ తనకంటే పదేళ్లు పెద్దదైన ప్రియాంక చోప్రాని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. వీరందరి స్టోరీ ఒకటైతే.. ఓ యంగ్ హీరో ఏకంగా విడాకులు తీసుకున్న పిల్లల తల్లిని పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్. అతడెవరంటే.. అర్జున్ కపూర్. చాలా రోజులుగా అర్జున్ కపూర్.. మలైకా అరోరా ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. నటుడు అర్భాజ్ ఖాన్ నుండి మలైకా విడాకులు తీసుకోవడానికి గల కారణం కూడా అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారమనే అంటారు. విడాకులు తీసుకున్న తరువాత మలైకా పబ్లిక్ ఈవెంట్స్ కి అర్జున్ కపూర్ తో కలిసి వస్తోంది. వీకెండ్స్ లో కూడా ఈ జంట మీడియా కంట పడుతూనే ఉంది. తాజాగా వీరిద్దరూ కలిసి మిలాన్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఇద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకొని మరి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. పెద్ద వయసు అమ్మాయిని చేసుకోవడం కామనే అయినా.. మరీ పిల్లలున్న నలభై ఏళ్ల ఆంటీని కుర్ర హీరో ఇంతగా ప్రేమించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటారని బాలీవుడ్ మీడియా వర్గాలు కథనాలను ప్రచురిస్తున్నారు.
0business
India vs Sri Lanka: Rohit sharma out సిక్స్‌ సమర్పించుకుని.. రోహిత్‌ను బుట్టలో వేశాడు నాలుగో బంతిని లెగ్ వికెట్ మీదుగా గుడ్ షార్ట్ లెంగ్త్ రూపంలో మలింగ విసరగా.. షాట్‌కి అనుగుణంగా భుజాలను వేగంగా కదిలించిన TNN | Updated: Jun 8, 2017, 05:23PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది. లసిత్ మలింగ్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీకి తరలించిన భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ తన ఆధిపత్యాన్ని ఆరంభించగా.. పక్కా ప్లానింగ్‌తో సిక్స్ సమర్పించుకుని మరీ అతడ్ని లంక ఫాస్ట్ బౌలర్ బుట్టలో వేయడం విశేషం. ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లోని నాలుగో బంతిని లెగ్ వికెట్ మీదుగా గుడ్ షార్ట్ లెంగ్త్ రూపంలో మలింగ విసరగా.. షాట్‌కి అనుగుణంగా భుజాలను వేగంగా కదిలించిన రోహిత్ శర్మ డీఫ్ ఫైన్ లెగ్ దిశగా కళ్లు చెదిరే రీతిలో సిక్స్ కొట్టాడు. బంతి బౌండరీ లైన్‌ అవల కొద్ది దూరంలో మాత్రమే పడింది. నిజానికి అప్పటి వరకు అక్కడే ఉన్న ఫీల్డర్ తిసార పెరీరాను లాంగ్ లెగ్ దిశగా మలింగనే మార్చాడు. ఒకవేళ ఫీల్డర్ అక్కడే ఉన్నట్లయితే బంతిని క్యాచ్‌గా అందుకునే అవకాశాలు ఉండేవి.
2sports
పల్లెటూరి ఎంకిలా మెప్పించిన భామలు! First Published 26, Jun 2019, 11:00 AM IST తెలుగు సినిమాల్లో హీరోయిన్లను రిచ్ గా, పొగరుగా లేదంటే అమాయకంగా చూపిస్తుంటారు. ఈ తరహా పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు సినిమాల్లో హీరోయిన్లను రిచ్ గా, పొగరుగా లేదంటే అమాయకంగా చూపిస్తుంటారు. ఈ తరహా పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ కొన్ని సినిమాల్లో హీరోయిన్లను పల్లెటూరి అమ్మాయిలుగా తెరపై ఎంతో అందంగా చూపించారు మన దర్శకులు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్, కొంచెం కొంటెతనం, అమాయకత్వం, మంచితనం అన్ని లక్షణాలు కలగలిపిన పాత్రల్లో మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు నటించి మెప్పించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం! సౌందర్య - ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య చాలా సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిగా నటించింది. కానీ 'దొంగాట'లో ఆమె నటన ప్రత్యేకం. రకుల్ ప్రీత్ సింగ్ - 'కరెంట్ తీగ' సినిమాలో కవితగా, 'రా రండోయ్ వేడుక చూద్దాం'లో బ్రమరాంబగా రకుల్ కనిపించింది. ఈ రెండు సినిమాల్లో పల్లెటూరి పిల్లగా రకుల్ తన నటనతో మెప్పించింది. అనుపమ పరమేశ్వరన్ - 'అ ఆ' సినిమాలో నాగవల్లిగా కనిపించిన అనుపమ చెరగని ముద్ర వేసింది. అనుష్క - 'మిర్చి'లో ఈ బ్యూటీ పల్లెటూరి పిల్లగా ఆకట్టుకుంది. సాయి పల్లవి - 'ఫిదా' సినిమాలో బాన్సువాడ అనే పల్లెటూరికి చెందిన అమ్మాయిగా నటించిన సాయి పల్లవిని అంత ఈజీగా మర్చిపోలేం.. ఈ ఒక్క సినిమాతో కుర్రకారుని తనవైపు తిప్పేసుకుంది. శ్రుతిహాసన్ - పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' సినిమాలో శృతి పల్లెటూరి అమ్మాయిగా చక్కటి నటన కనబరిచింది. కాజల్ - తన మొదటి సినిమా 'లక్ష్మీ కళ్యాణం'లో ఈ బ్యూటీ విలేజ్ అమ్మాయిగా కనిపించింది. త్రిష - 'అతడు' సినిమాలో ఈ భామ పల్లెటూరి పిల్లగా నటించి మెప్పించింది. ఆమె కట్టు, బొట్టు అందరినీ ఆకట్టుకున్నాయి. సమంత - 'రంగస్థలం'లో రామలక్ష్మిగా సమంత కనబరిచిన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆర్తి అగర్వాల్ - 'అందాల రాముడు' మంచు లక్ష్మి- 'గుండెల్లో గోదారి' అవికాగోర్ - 'ఉయ్యాల జంపాలా' ప్రియమణి - 'శంభో శివ శంభో' షాలిని పాండే - 'మహానటి'
0business
Visit Site Recommended byColombia ఆతిథ్య ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ షమీ బౌలింగ్‌లో షాన్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో 15 ఔట్లలో పంత్ పాలు పంచుకున్నాడు. దీంతో గతంలో ఓ టెస్ట్ సిరీస్‌లో 14 మంది ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఔట్లలో పాలుపంచుకున్న ధోనీ, సాహా, సయ్యద్ కిర్మాణీలను పంత్ వెనక్కి నెట్టేశాడు. ఆస్ట్రేలియాతో 1979/80 సిరీస్‌లో కిర్మాణీ (11 క్యాచ్‌లు, మూడు స్టంపింగ్‌లు), ధోనీ 2012/13లో భారత్‌లో జరిగిన సిరీస్‌లో (9 క్యాచ్‌లు, 5 స్టంపింగ్‌లు), 2014/15లో ఆస్ట్రేలియాలో (13 క్యాచ్‌లు, 1 స్టంపింగ్), 2014/15లో భారత్‌లో జరిగిన సిరీస్‌లో సాహా 13 క్యాచ్‌లు ఒక స్టంపింగ్ చేశాడు. అయితే పెర్త్ టెస్టులో షాన్ మార్ష్ క్యాచ్ పట్టడంతో పంత్ 15 మంది ఆసీస్ క్రికెటర్ల ఔట్లలో పాలు పంచుకున్నట్లయింది. అయితే అందులోనూ పంత్ విశిష్టత వేరు. పంత్ మొత్తం 15 వికెట్లను కేవలం క్యాచ్‌ల రూపంలోనే అందుకోవడం విశేషం. అడిలైడ్‌లో జరిగిన టెస్టులో పంత్ 11 క్యాచ్‌లు అందుకోగా, రెండో టెస్ట్‌లో ఇప్పటివరకు 4 క్యాచ్‌లు పట్టడం విశేషం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Oct 22,2015 ఆర్‌వీటీటీ నుంచి ప్రత్యేక ప్యాకేజీలు నవతెలంగాణ, వాణిజ్య విభాగం: కార్తీక మాసం పురస్కరించుకొని ఆర్‌వీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ (ఆర్‌వీటీటీ) సంస్థ పలు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ అధినేత ఆర్‌.వి. రమణ ఒక ప్రకటనలో తెలిపింది. కాశీతో పాటు దేశంలోని వివిధ ప్రముఖ శైవ క్షేత్రాల దర్శనం కల్పించేలా ఈ ప్యాకేజీలను రూపొందించినట్లు వివరించారు. 9 రోజుల నిద్రతో కూడిన కాశీ యాత్రను రూ.16,500లకు, గుజరాత్‌లోని నాగేశం, సోమనాథ్‌, ఉజ్జయిని వంటి జ్యోతిర్లింగాలతో కూడిన పర్యటక ప్యాకేజీని రూ.18600లకు, రామేశ్వరం, కర్ణాటక, కేరళ, శ్రీలంకలోకి శాకాంబరీ దేవీ, ఛార్‌దాం తదితర యాత్రలకు కూడా వివిధ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నట్లు తెలిపారు. నవంబరులో సింగపూర్‌-మలేషియా, బ్యాంకాక్‌, డిసెంబరు, జనవరి మాసాల్లో 'దుబయి షాపింగ్‌ ఫెస్టివల్‌'ల కోసం కూడా ప్రత్యేక ప్యాకేజీలను అందించనున్నట్లు వివరించారు. వివరాలకు 040-40045234, 7032666927 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Mallesen భారత్‌ సంఘాలతో మలేసియా పామాయిల్‌ మండలి ఒప్పందాలు హైదరాబాద్‌:ముంబై డబ్బావాలా అసోసియేషన్‌, సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌లతో మలేసియాన్‌ పామ్‌ ఆయిల్‌ కౌన్సిల్‌ అవగాహన ఒప్పందాలుచేసుకుంది. మలేసియా ప్రధాని హాజీమహ్మద్‌ నజీబ్‌ బిన్‌ తున్‌హాజీ అబ్దుల్‌ రజాక్‌ దేశ పర్యటనను పురస్కరించుకుని ఈ సంఘాలతో పామాయిల్‌ ఉత్పాదన, మార్కెట్‌ అభివృద్ధికి మద్దతు కార్యకలాపాలకోసం అవగాహన ఒప్పందాలుచేసు కుంది. మలేసియాలోని కౌలాలంపూర్‌లో కేంద్ర కార్యాలయంఉన్న మలేసియన్‌ పామా యిల్‌ కౌన్సిల్‌ భారతీయకస్టమర్లు, ఆహార తయారీదారులు, అంతిమ వినియోగదారు ల్లో మలేసియన్‌ పామాయిల్‌కు విస్తృత ప్రాచుర్యం లభించేలా చూసేందుకు వీలుగా భారత్‌లో సంబంవధిత వ్యాపార సంస్థలతోకలిసి పనిచేసేందుకు ఆసక్తితో ఉందన్నారు. ఐదువేలమంది సభ్యులతతో ఉన్న ముంబై డబ్బావాలా అసోసియేషన్‌, ముంబైమెట్రో పాలిటన్‌ అంతటా కూడా తాజా ఆహారాన్ని లంచ్‌బాక్స్‌లద్వారా అందిస్తున్నది. ముంబై లో ఈ సంస్థ రోజుకు రెండులక్షల డబ్బాలను అందిస్తున్నారు. అలాగే సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ కూడా 1963లో ఆవిర్భవిం చింది. వివిధ వంటనూనెలు, ఫీడ్‌, మైనర్‌ ఆయిల్స్‌, నూనెగింజల ఎగుమతులకు సంబం ధించి వాణిజ్య ప్రోత్సాహక సంస్థగా కొనసాగు తోంది. మొత్తం 850మందికిపైగా సభ్యులున్న ఈ సంఘాలతో మలేసియా పామాయిల్‌ మండలి అవగాహన ఒప్పందం చేసుకోవడం పట్ల వర్తక వాణిజ్యసంఘాలు సంతోషం వ్యక్తం చేసాయి. పామాయిల్‌ వినియోగం, పోషకాలు, ఆరోగ్యగుణాలపై కస్టమర్లలో అవగాహన కల్పించడం, మలేసియా వంట నూనెల సుగుణాలు ప్రయోజనాలపై సమాచారం. అపోహలు తొలగించడం, మేకిన్‌ ఇండియా భావనతో వంటనూనెల్లో స్వయంసమృద్ధి సాధించేలా సహకరించడం వంటి లక్ష్యాలతో ఈ ఒప్పందం జరిగిందని మండలి ప్రతినిధులు వివరించారు.
1entertainment
internet vaartha 240 Views రాంచీ : శ్రీలంక మహిళలతో జరిగిన టి20 క్రికెట్‌ సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.కాగా శుక్రవారం జరిగిన మూడవ మ్యాచ్‌లో శ్రీలంకను మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది.కౌశల్య 25 పరుగులు జయాంగినీ 21 పరుగులతో టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.బిష్త్‌కు 3 వికెట్లు,పాటిల్‌ 2 వికెట్లు పడగొట్టారు. కాగా 90 పరుగుల టార్గెట్‌ను 37 బంతులు మిగిలుండానే వికెట్‌ నష్టపోయి భారత్‌ చేరుకుంది.13.5 ఓవర్లలో 91 పరుగులు చేసింది. మందన 43 పరుగులు, వేద కృష్ణమూర్తి 13 పరుగులు చేశారు.అంతకు ముందు శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీసేన క్లీన్‌ స్వీప్‌ చేసింది.
2sports
Hyderabad, First Published 16, Aug 2019, 10:40 AM IST Highlights  ‘‘యువరాజ్ సింగ్ కి నిరభ్యంతర పత్రం ఇచ్చాం. ఇక ఇదే ఆఖరిది. ఇక మీదట ఏ భారత క్రికెటర్ విదేశీ లీగ్ లో ఆడేందుకు అనుమతి ఇవ్వం’’ అని తేల్చి  చెప్పారు. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారులు విస్మయం ప్రకటించారు. విదేశాల్లో టీ 20 టోర్నీలు ఆడేందుకు భారత క్రికెటర్లెవరికీ ఇక నుంచి నిరభ్యంతర పత్రాలు(ఎన్ఓసీ)లు ఇవ్వమమని క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ) తెలిపింది. కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20ల్లో ఆడేందుకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు సీఓఏ బోర్డు అనుమతించింది. కాగా... యువరాజ్ కి ఇచ్చిన నిరభ్యంతర పత్రమే చివరిదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో సీఓఏ సభ్యుడు ఒకరు మాట్లాడారు. ‘‘యువరాజ్ సింగ్ కి నిరభ్యంతర పత్రం ఇచ్చాం. ఇక ఇదే ఆఖరిది. ఇక మీదట ఏ భారత క్రికెటర్ విదేశీ లీగ్ లో ఆడేందుకు అనుమతి ఇవ్వం’’ అని తేల్చి  చెప్పారు. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారులు విస్మయం ప్రకటించారు. రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లను ఇక ఏ టోర్నీలోనూ ఆడకుండా చేయడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బోర్డులో సరైన పాలక వ్యవస్థ లేకపోతే ఇలాంటి అనిశ్చితి నిర్ణయాలే వస్తాయని ఓ అధికారి అన్నారు. మరో అధికారి మాట్లాడుతూ... ఒక దేశానికి రిటైర్ అయినంత మాత్రన మొత్తం బౌగోళిక ప్రాంతానికి రిటైర్మెంట్ ప్రకటించినట్లు కాదన్నారు. ఒక దేశపు రిటైర్డ్ క్రికెటర్లను అనుమతించడమనేది నిర్వాహకుల ఇష్టమని చెప్పారు. ఇందులో ఏదైనా సమస్య ఉంటే ఐసీసీ చూసుకుంటుందని చెప్పారు.  Last Updated 16, Aug 2019, 10:39 AM IST
2sports
‘పద్మావత్‌’కు గొప్ప ఊరట.. రిలీజ్‌కు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్ TNN| Jan 18, 2018, 02.47 PM IST X ‘పద్మావత్’ సినిమాకు పెద్ద ఊరట కలిగించే తీర్పు వెలువరించింది భారత సర్వోన్నత న్యాయస్థానం. ఈ సినిమాపై నిషేధం విధించే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో జనవరి 25న దేశవ్యాప్తంగా ‘పద్మావత్’ సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. సీబీఎఫ్‌సీ కొన్ని షరతులతో సినిమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. బీజేపీ పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్.. ‘పద్మావత్’పై నిషేధం విధించాయి. దీంతో చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం (జనవరి 18) ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. సినిమాపై నిషేధం విధించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. పద్మావత్ సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఎఫ్‌సీ సూచనల మేరకు సినిమాలు పలు మార్పులు చేసి, కొత్త ట్రైలర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అయితే.. రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు దీపికా పదుకొణె నటించిన దృశ్య కావ్యం ‘పద్మావత్‌’ చిత్రం బాగుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ కితాబిచ్చారు. బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమంలో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీతో కలిసి ఆయన సినిమా వీక్షించారు. దీపిక, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ నటన అద్భుతంగా ఉందని రవిశంకర్‌ అన్నారు. ఈ చిత్రంపై రాజ్‌పుత్‌లు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అర్థం లేనివని పేర్కొన్నారు.
0business
బోర్డులో ప్రక్షాళన పద్మనాభన్‌కు మానవ వనరులు ముంబై: టాటా సన్స్‌ చైర్మన్‌గా సైరన్‌ మిస్త్రీని తొలగించిన వారం రోజులకు ప్రస్తుత తాత్కాలిక చైర్మన్‌ రతన్‌టాటా తన బోర్డు రూం ప్యానెల్‌ను పూర్తిస్థాయిలో శక్తిమంతం చేశారు. ఎటీమ్‌గా పిలవబడుతున్న ఈ టీమ్‌లో టాటా క్వాలీటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ఎండి పద్మనాభన్‌ గ్రూప్‌ మానవవనరుల అధిపతిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఎయిర విస్తారా, టాటా కెమికల్స్‌కు అధిపతిగా, పనిచేసిన మీనన్‌ను టాటా పవర్‌కు ఎండిగా నియమించారు.
1entertainment
hath way హాత్‌వే ప్రచారకర్తగా మాధవన్‌ హైదరాబాద్‌, మే 26: హాత్‌వే తన కొత్త వ్యాపార పరిధిని విస్తృతం చేస్తున్నది. ఇందులో భాగంగా తన బ్రాండ్‌ ప్రచారకర్త గా ప్రముఖ నటుడు మాధవన్‌ను నియ మించుకుంది.ఇంటర్నెట్‌ కేబుల్‌టివి బ్రాండ్ల లో హాత్‌వే సరికొత్త ప్రయోగాలతో ముం దుకు పోతున్న సంగతి తెలిసిందే. ఇతర సంస్థలనుంచి ఎదురవుతున్న పోటీని అధిగమిస్తూ కస్టమర్ల అభిరుచులకు అను గుణంగా వినోదాన్ని అందించడంతోపాటు డేటారంగంలో కూడా కీలక పాత్రపోషిస్తోం ది. తాజాగా బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌లో వెయ్యి జిబి వరకూ 200 ఎంబిపిఎస్‌ వేగంతో అందిస్తున్న ది. భారతీయులు ఎక్కువగా ఆదరించే బ్రాడ్‌బ్యాండ్‌గా తమకున్న పేరును మరింత విస్తరించి మరింతగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని హాత్‌వే యాజమాన్యం ప్రకటించింది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV తప్పుడు నిర్ణయాల వల్లే ఓటమి భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 ఆటలో భారత్ ఓటమి పాలైంది. TNN | Updated: Oct 3, 2015, 02:19PM IST భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 ఆటలో భారత్ ఓటమి పాలైంది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచులో రోహిత్ సెంచరీ చేసిన ఫలితం లేకపోయింది. దీనిపై కెప్టెన్ ధోనీ స్పందించాడు. తమ ఓటమికి అంపైర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డుమిని రెండు సార్లు ఎల్బీ డబ్య్లు అయ్యాడని, తాము అప్పీలు చేసిన అంపైర్లు పట్టించుకోలేదని అన్నాడు. డుమిని అవుట్ అయ్యుంటే భారత్ గెలిచేదన్నాడు. రెండు సార్లు లైఫ్ సంపాదించిన డుమిని 34 బంతుల్లో 68 పరుగులు చేసి విజయం దక్షిణాఫ్రికాకు అందించాడని చెప్పాడు.
2sports
cash రూపాయి మారకం విలువల్లో భారీ పతనం న్యూఢిల్లీ, నవంబరు 11: డాలరుతో రూపాయి మారకం విలువలు భారీగా క్షీణించాయి. శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 54 పైసలు క్షీణించి 67.17రూపాయలవద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా ఆర్ధిక మార్కెట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం కొంతమేర స్టాక్‌, కరెన్సీ మార్కె ట్లలో మార్పులు తెస్తుందన్న అంచనాలు వేస్తున్నారు. ఆసియా షేర్లు కొంతమేర దిగజారాయి. వర్ధమాన మార్కెట్‌ కరెన్సీలు భారత్‌ రూపాయితో సహా దిగజారాయి. ట్రంప్‌ విజయం తర్వాత వడ్డీరేట్లు పెరిగితే పెట్టు బడులు ఎక్కువ వెనక్కి మళ్లుతాయన్న ఆందో ళనల్లో ఇన్వెస్టర్లున్నారు. మోర్గాన్‌ స్టాన్లీ కేపిటల్‌ సూచీని పరిశీలిస్తే జపాన్‌ బయటి ఆసియా పసిఫిక్‌షేర్లు 1.4శాతం దిగజారా యి. ట్రంప్‌ వ్యయప్రణాళికలు ద్రవ్యోల్బణా న్ని పెంచుతాయన్న అంచనాలే ఇందుకు కారణంగా ట్రేడర్లు చెపుతున్నారు. అంతేకాకుం డా ఫెడ్‌రిజర్వు ఫండ్‌రేట్‌లను పెంచగలదన్న ధీమా కూడా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఫెడ్‌ రిజర్వు డిసెంబరులో వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచ నాలను ప్రకటించింది. దీనివల్ల అమెరికా మార్కెట్లకు స్థిరత్వం వస్తుందని ఇన్వెస్టర్లు అధ్యయనం చేస్తున్నారు. ఇక ఫెడ్‌ఱిజర్వు వడ్డీరేట్లు పెంచితే విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌, ఇతర వర్ధమాన దేశాల్లోని పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుందని అంచనా. భారత్‌ మార్కెట్లు ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఎక్కువ విలువలున్న బ్యాంక్‌నోట్ల చెలామణి రద్దు వంటివాటితో తీవ్ర ఒత్తిడికి లోనయ్యా యి. తదనంతరం వెనువెంటనే కొంత రికవరీ కాగలిగాయి. అంతే కాకుండా అంతర్జాతీయ ధోరణులపరంగాచూస్తే వేచిచూసే ధోరణి వ్యక్తం అవు తోంది.అ మెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్‌ట్రంప్‌ ఎన్నిక తర్వాత మార్కెట్లు కొంత రికవరీఅయ్యాయి. ఒకే సమైక్యప్రజగా కొనసాగాలని అమెరికన్ల కు పిలుపు ఇవ్వడం మార్కెట్లపై సానునకూల ప్రభావాలు చూపిం చింది. అమెరికాబాండ్‌ మార్కెట్లు ట్రంప్‌ విజయం తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పదేళ్ల అమెరికా ట్రెజరీ రాబడులు 10 నెలల గరిష్టస్థాయికి వెళ్లిపోయాయి. భారత్‌ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సుమారు 45వేల కోట్ల రూపాయలు పెట్టు బడులు పెట్టారు. వాల్‌స్ట్రీట్‌పరంగా డౌజోన్స్‌ పారిశ్రామిక సగటు 1.2శాతం పెరిగింది. గతంలో ఆగస్టులో సాధించిన ఒకటిశాతం రికార్డును సైతం అధిగ మించింది. మొత్తంగాచూస్తే అంతర్జాతీయం గా కూడా డాలర్‌ పటిష్టం అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వర్ధమాన దేశా లపై ఈ ప్రభావం ఎక్కువ ఉంది. ఇంటర్‌ బ్యాంక్‌ విదేశీ కరెన్సీ మార్పిడి మార్కెట్లలో అమెరికా కరెన్సీ భారీగా పెరుగుతున్నది. విదేశీఫండ్‌ ఉపసంహ రణ ఎక్కువఉంది. దిగుమతిదారుల నుం చి పటిష్టమైన డిమాండ్‌ రావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు దిగువస్థాయినుంచి ట్రేడింగ్‌ ప్రారంభించడం కూడా ఇందుకు కొంత కారణం అయినట్లు ఈపరిస్థితులపై రూపాయిపై భారం పెంచా యని ఫోరెక్స్‌ డీలర్లు చెపుతున్నారు. విదేశాల్లోని కొన్ని దేశాల కరెన్సీలపై ఢాలర్‌ నాలుగునెలల గరిష్టస్థాయికి పెరిగింది. ట్రంప్‌ భారీ వ్యయప్రణాళికలపైనే ఎక్కువఅంచనాలు పెరుగుతున్నాయి. ముందు రోజు డాలరుతో రూపాయి మారకం విలువలు 20 పైసలు క్షీణించి 66.63రూపాయలుగా ఉంటేశుక్రవారం రూ.67.15లకు చేరుకున్నది.
1entertainment
Apr 21,2018 న్యూమెక్స్‌ నుంచి మన్నికైన టైర్లు నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైన న్యూమెక్స్‌ టైర్స్‌ సంస్థ న్యూమెక్స్‌ బ్రాండ్‌తో మన్నికైన ట్యూబ్‌లు, టైర్లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ప్రధానంగా ద్విచక్ర, తిచక్ర, చిన్న తరహా వాణిజ్య విహనాలు, లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు అవసరమయ్యే టైర్లు, ట్యూబ్‌లను తాము మొదటి విడుతగా మార్కెట్లోకి తీసుకువస్తున్నట్టుగా సంస్థ సీఈవో, ఎండీ రవిశంకర్‌ తెలిపారు. తొలత హైదరాబాద్‌ లక్ష్యంగా తమ మార్కెట్‌ను విస్తరించి ఆ తరువాత తెలుగు రాష్ట్రాల్లోను.. 2021 నాటికి దక్షిణాదితో పాటు మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించాలని తాము భావిస్తున్నట్టుగా సంస్థ ప్రమోటర్‌ రత్నాకర్‌ తెలిపారు. టైర్ల కొనుగోలులో మరింత విషయపరిజ్ఞానాన్ని పెంచే విధంగా తమ షోరూమ్‌ల రూపకల్పన చేస్తున్నట్టుగా సంస్థ మరో ప్రమోటర్‌ సుప్రజ్‌ రెడ్డి, తెలిపారు. న్యూమెక్స్‌ సంస్థ ప్రధానంగా రిప్లేస్‌మెంట్‌ మార్కెట్‌పై దృష్టి సారిస్తోందని ప్రమోటర్‌ బాలాజీ వివరించారు. ఎంతో కఠిన పరిశోధన చేసిన తరువాత.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మేటి బ్రాండ్‌ టైర్ల కంటే కూడా అత్యధిక మన్నిక, ఎక్కవ మైలేజీకి తోడ్పడేలా టైర్లను రూపొందించి న్యూమెక్స్‌ బ్రాండ్‌తో మార్కెట్లోకి తెస్తున్నట్టుగా రవిశంకర్‌ వివరించారు. దీంతో వినియోగదారులకు తక్కువ ధరకే మన్నికైన టైర్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
DOMINAR బజాజ్‌ నుంచి కొత్తరంగుల్లో ‘డామినార్‌’ హైదరాబాద్‌,జూలై 10: బజాజ్‌ ఆటో మొబైల్స్‌ కొత్తగా విడుదలచేసిన లగ్జరీ బైక్‌ డామినార్‌లో కొత్త రంగులను విడుదల చేసింది. డామినార్‌ 400 సిసి కేటగిరీలో ప్రీమియం స్పోర్ట్స్‌బైక్‌గా లభిస్తోంది. ఈ బైక్‌ కొత్తగా చిక్కటి నలుపురంగు బైక్‌లను కూడా కొత్తగా విడుదల చేసింది. ఇప్పటికే డామి నార్‌ నాలుగు రంగుల్లో లభిస్తున్నది. మాట్టేబ్లాక్‌, మూన్‌వైట్‌, మిడ్‌నైట్‌ బ్లూ, ట్విలైట్‌ప్లమ్‌ రంగుల్లో ఉంది. బజాజ్‌ బైక్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎరిక్‌ వాస్‌ మాట్లాడుతూ డామినార్‌ విడుదలైన తర్వాత భారతీయరోడ్లపై అత్య ధ్భుత పనితీరును కనబరుస్తోందని, నియంత్రణ, టెక్నాలజీలపరంగా డామినార్‌ ప్రీమియం పనితీరు చూపుతోందన్నారు. కొత్తగా నల్లటిరంగులో విడుదలచేసిన డామినార్‌ బజాజ్‌ ఆటో డీలర్లవద్ద డిస్క్‌వేరి యంట్‌ 1,41,045రూపాయలు, ఎబిఎస్‌ వేరియంట్‌ 1,55,215 ఎక్స్‌ షోరూంధరలకు లభిస్తోంది.
1entertainment
sandhya 200 Views Former Indian bowler , Narendra Hirwani , spin consultant for women's team Narendra Hirwani న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ లెగ్‌ స్పిన్నర్‌, జాతీయ క్రికెట్‌ అకాడమి(ఎన్‌సిఏ)స్పిన్‌ కోచ్‌ నరేంద్ర హిర్వాని భారత మహిళా జట్టుకు స్పిన్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నారు. భారత్‌ తరఫున 17 టెస్టులు, 18 వన్డేలు ఆడిన హిర్వాని సెప్టెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్‌ సిరీస్‌తో మహిళా జట్టుతో కలవనున్నారు. ప్రస్తుతం భారత మహిళా జట్టులో చాలామంది స్పిన్నర్లు ఉన్నారు. పూనమ్‌ యాదవ్‌, ఏక్తా బిష్ట్‌, దీప్తి శర్మలతో జట్టు స్పిన్నర్లతో నిండిఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు స్పిన్‌ కోచ్‌ అవసరం అని తాజాగా భారత టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్నారు. ఇది పరిగణలోకి తీసుకున్న బిసిసిఐ నరేంద్ర హిర్వానిని స్పిన్‌ కన్సల్టెంట్‌గా ఎంపిక చేసింది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ప్రీ రిలీజ్ ఫంక్షన్‌: పవన్ పిలవలేదు వారు రావట్లేదు పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు ప్రత్యేక అతిథుల హంగామా ఉంటుందని అందరూ అనుకున్నారు. కాని TNN | Updated: Mar 18, 2017, 02:53PM IST పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా ఈవెంట్ ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరికొన్ని గంటల్లో జరగనుండటంతో.. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ప్రత్యేక అతిథుల హంగామా ఉంటుందని అందరూ అనుకున్నారు. మెగా హీరోలు ఈ వేడుకలో కనిపించడం ఖాయమని భావించారు. కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అటువంటి సందడి కనిపించదని సమాచారం. ఈ వేడుకకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా పవన్ మాత్రమే ఉంటాడని తెలుస్తోంది. పవన్ అభిమానులకు వేదికపై పవన్ ఉంటే చాలు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరినీ ఈ వేడుకకు ఆహ్వానించలేదని చెబుతున్నారు. పెద్దగా ఎలాంటి హంగామా చేయకుండా.. సింపుల్‌గా ఈ ఫంక్షన్‌ను కానిచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
0business
ఏడోవిడత పసిడిబాండ్లు జారీ   ముంబై: ప్రభుత్వం ఏడోవిడత సావరిన్‌ పసిడి బాండ్లను విడుదలచేసింది. 500 గ్రాముల వరకూ ఉన్న సెక్యూరిటీలను ప్రజలు కొనుగోలుచేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆర్‌బిఐతో చర్చించిన అనంతరం ప్రభుత్వం గోల్డ్‌బాండ్లను 2016-17లో సిరీస్‌-4కింద జారీచేసేందుకు నిర్ణయించింది. ఈ నెల 27వ తేదీనుంచి మార్చి 3వ తేదీవరకూ బాండ్లకు దరఖాస్తులను అనుమతిస్తుందని ఆర్ధికశాఖ ప్రక టించింది. అర్హులైన దరఖాస్తుదారులకు వచ్చే నెల 17వ తేదీనుంచి బాండ్లను జారీచేస్తామని ప్రకటిం చింది. 2015 నవంబరులో ప్రవేశపెట్టిన ఈ పథకం తో బంగారంపై పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆరువిడతలుగా బాండ్లను జారీచేసింది. ఈబాండ్లను బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, అధీకృత పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్‌ఎక్ఛేంజిలు ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇ ల్లో లభిస్తాయని ప్రకటించింది. ఐదు విడతలుగా జారీ చేసిన బాండ్ల నుంచి ప్రభుత్వం 3060 కోట్లు సమీ కరించింది. సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల దారులకు ప్రభు త్వం సాలీనా 2.50శాతం వడ్డీ ఇస్తుంది. పాక్షిక వార్షిక పద్ధతిలో వడ్డీ చెల్లిస్తుంది. ఎనిమిదేళ్లకు ఈ బాండ్లు ఉంటాయని, ఐదేళ్ల తర్వాత అవసరమైతే వైదొలిగే అవకాశం ఉంటుంది. బాండ్లకు చెల్లింపులు నగదు రూపంలోనే ఉంటాయి. గరిష్టంగా 20వేల రూపాయలు లేదా డిమాండ్‌ డ్రాప్ట్‌చెక్కు, ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ పద్ధతుల్లో చెల్లించాలి. ఆర్థికసంవత్సరంలో ఒక వ్యక్తి లేదా సంస్థ 500 గ్రాములకు మించి కొనుగోలు చేసేందుకు వీలులేదు. ఇందుకు సంబంధించి స్వీయ ధృవీకరణ కూడా అందించాలి. జాయిం ట్‌ హోల్డింగ్‌ అయితే పెట్టుబడుల పరిమితి 500 గ్రాములు మొదటి దరఖాస్తుదారునికే వర్తిస్తుంది.
1entertainment
sumalatha 101 Views Amitabh Kant , car , EV Amitabh Kant న్యూఢిల్లీ: భవిష్యత్‌లో విద్యుత్‌ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. రానున్న 3, 4 ఏళ్లలో ప్రస్తుతమున్న కార్ల ధరలకే దాదాపు అవీ లభించనున్నాయని ఆయన చెప్పారు. బ్యాటరీ ధరలు తగ్గుముఖం పట్టడం ద్వారా ఇది సాధ్యం కానుందన్నారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో వెయ్యి మందికి 28 కార్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. అదే అమెరికాలో 980, యూరప్‌లో 850 ఉన్నాయని తెలిపారు. అంటే భవిష్యత్‌లో పట్టణీకరణ మొత్తం విద్యుత్‌ వాహనాల వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. బ్యాటరీ ధర ౖజ్తూ 276 డాలర్ల నుంచి 76 డాలర్లకు తగ్గనుండటంతో ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ లెక్కన రానున్న మూడు నాలుగేళ్లలో ఇప్పుడున్న పెట్రోల్‌, డీజిల్‌ ఆధారిత ఇంజిన్‌ కార్ల ధరలకే ఎలక్ట్రిక్‌ వాహనాలు లభించే అవకాశం ఉందని కాంత్‌చెప్పారు. తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:ht tps://www.vaartha.com/news/international-news/
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV రాజమండ్రిలో రంగస్థలం షూట్.. కారణమిదేనా? చెర్రీ, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న రంగస్థలం మూవీ రాజమండ్రిలో TNN | Updated: Jan 20, 2018, 11:24AM IST రామ్ చరణ్ హీరోగా బోయపాటి డైరెక్షన్లో సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. కానీ రంగస్థలం షూటింగ్ పూర్తి కాకపోవడంతో.. చెర్రీ వచ్చే నెలలో బోయపాటి సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. వాస్తవానికి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగస్థలం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాల రీత్యా విడుదల ఆలస్యమైంది. కానీ ఆ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోందనే వార్త అభిమానులను ఆలోచనలో పడేసింది. సుకుమార్ ప్రతీ సీన్ పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటాడనే సంగతి తెలిసిందే. రంగస్థలం మూవీలో కొన్ని సీన్లు ఆశించిన స్థాయిలో రాలేదని.. అందుకే రాజమండ్రి పరిసరాల్లో మళ్లీ షూటింగ్ చేస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ‘గోదావరి జిల్లాల్లో చేయాల్సిన సీన్లను హైదరాబాద్‌లో సెట్ వేసి షూట్ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఔట్‌పుట్ రాలేదు. దీంతో రీషూట్ చేస్తున్నారు. ఇందుకోసం చెర్రీ డేట్స్ కూడా ఇచ్చాడు’ అని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ సూచనల మేరకు సుకుమార్ కొన్ని సీన్లను మళ్లీ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
0business
jr ntr revealed his trobles in jai lava kusa shooting ఎన్టీఆర్‌ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం! తాను నటించిన తాజా చిత్రం 'జై లవకుశ' షూటింగ్‌లో తాను బాగా ఇబ్బంది పడిన సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నాడు యంగ్ టైగర్.. TNN | Updated: Sep 11, 2017, 08:02PM IST తాను నటించిన తాజా చిత్రం 'జై లవకుశ' షూటింగ్‌లో తాను బాగా ఇబ్బంది పడిన సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూడు పాత్రల్ని ఒకే సన్నివేశంలో షూట్ చేయాల్సి వచ్చిన సందర్భంలో దాదాపు 36 వీఎఫ్ఎక్స్ షాట్స్ షూట్ చేయాల్సి వచ్చేదని... అందుకోసం ఒకేరోజు 79 డ్రెస్సుల వరకు మార్చాల్సి వచ్చేదని చెప్పాడు తారక్. ఆ వీఎఫ్ఎక్స్ షాట్స్ కోసం మళ్ళీ మళ్ళీ డ్రెస్సులు మార్చడం మొదట కష్టంగా అనిపించినా.. ఒక మంచి సినిమా కోసం, అభిమానుల కోసం ఇలాంటి ఇబ్బందులు పడినా పర్లేదని సర్ధుకున్నట్లు వెల్లడించాడు ఎన్టీఆర్. జై లవ కుశ షూటింగ్‌లో తనతోపాటు అంతే ఓపిగ్గా షూటింగ్‌కి సహకరించిన రాశి ఖన్నా, నివేదా థామస్‌కి జై లవ కుశ ప్రి రిలీజ్ ఫంక్షన్‌ వేదికపై కృతజ్ఞతలు చెప్పే సందర్భంలో తారక్ ఈ ఇబ్బందులని గుర్తు చేసుకున్నాడు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సన్నీలియోన్, భర్త.. నగ్నంగా సందేశం! జంతువులను కాపాడుకోవాలని ఉద్యమానికి ఊతమిస్తూ నగ్నప్రదర్శన చేసింది సన్నీ TNN | Updated: Nov 29, 2017, 09:16AM IST కేవలం నటిగా మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమాల్లో కూడా మమేకం అవుతూ ఉంటుంది సన్నీ లియోన్. అలా ఈమె ‘పెటా’లో సభ్యురాలు, ఆ ఉద్యమంలో భాగస్వామ్యురాలు. ఇలాంటి నేపథ్యంలో జంతువులను కాపాడుకోవాలని ఉద్యమానికి ఊతమిస్తూ నగ్నప్రదర్శన చేసింది సన్నీ. జంతువులను చంపి వాటి తోలు తీసి తయారు చేసిన దుస్తులను ధరించరాదు.. అనేది ఈ నగ్నత్వంలో ఉన్న సందేశం. వేగన్ క్లోతింగ్ ఐటమ్స్ ను మాత్రమే ఎంచుకోండి అని సన్నీ లియోన్ సదేశం ఇస్తోంది. అంటే.. జంతు సంబంధ ఉత్పత్తులతో సంబంధం లేని దుస్తులనే ధరించాలనేది పెటా తరఫు నుంచి సన్నీ చెబుతున్న మాట. ఈ నగ్న సందేశంలో సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబర్ కూడా భాగస్వామి అయ్యాడు. భార్యతో కలిసి నగ్నంగా పోజు ఇచ్చాడతను. జంతువులు లేనిదే మనం లేని, ఫ్యాషన్ పేరుతోనో, అందం కోసమనో జంతు వధ ద్వారా తయారు చేసిన దుస్తులను వేసుకోవద్దు.. అని భార్యభర్తలు నగ్న సందేశం ఇస్తున్నారు!
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ‘జబర్దస్త్’ సెల్ఫీ వీడియో: రోజా విత్ లక్ష్మీస్ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే.. సినీ నటి రోజా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా అయ్యారు. వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా తన పార్టీ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను ఫేస్ బుక్ ద్వారా ఫ్యాన్స్‌‌తో పంచుకుంటూ ... TNN | Updated: Dec 7, 2017, 06:09PM IST వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే.. సినీ నటి రోజా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా అయ్యారు. వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా తన పార్టీ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను ఫేస్ బుక్ ద్వారా ఫ్యాన్స్‌‌తో పంచుకుంటూ ఇప్పటికే రెండు మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించారు. ఇకపోతే ఇటీవల తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసిన వీడియో అటు సినీ సర్కిల్‌లో పాటు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అవకతవకలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బస్ యాత్ర చేపట్టిన వైసీపీ నేతల హంగామాను ఫేస్ బుక్‌లో షేర్ చేశారు రోజా. వీటిలో ఎమ్మెల్యే రోజా.. లక్ష్మీ పార్వతితో దిగిన సెల్ఫీ వీడియో వైసీపీ శ్రేణులకు తెగ నచ్చేస్తుంది. పార్టీని డిఫెండ్ చేయడంతో ఎప్పుడూ ముందుండే ఫైర్ బ్రాండ్‌లు ఇద్దరూ ఒకేచోట చేరిన సెల్ఫీ వీడియోపై తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు రోజా అండ్ లక్ష్మీస్ సెల్ఫీపై పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంటే మరికొంత మంది సెటైర్లు విసురుతున్నారు.
0business
Nov 17,2016 ఆటోమొబైల్‌లో ఆరున్నర కోట్ల ఉద్యోగాలు..! న్యూఢిల్లీ: దేశీయంగా రానున్న దశాబ్ద కాలంలో ఆటోమొబైల్‌ పరిశ్రమ విస్తృతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని మారుతీ సుజుకీ విశ్లేషించింది. 2026 నాటికి జీడీపీలో ఈ రంగం వాటా 12 శాతానికి చేరవచ్చని తెలిపింది. దీనికి తోడు ఈ రంగంలో 6.5 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సీఎండీ కెంచీ అయుకావ పేర్కొన్నారు. ప్రస్తుతం జీడీపీలో ఆటో పరిశ్రమ వాటా 7.1శాతం కాగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.2 కోట్ల మందికి ఉద్యోగాలు పొందారని ఆయన తెలిపారు. ఈ పదేండ్ల కాలంలో మొత్తం 35 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. పరిశ్రమ వృద్ధి చెందే క్రమంలో రద్దీ, కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌, రోడ్డు ప్రమాదాల పట్ల దృష్టిసారిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ గ్లోబల్‌ మార్కెట్‌లోని ప్రధాన మూడు కంపెనీలలో ఒకటిగా ఉండడమే లక్ష్యమని వెల్లడించారు. అయితే భద్రత, సమర్థవంతమైన, పర్యావరణ వాహనాలు అందించినప్పుడే ఇది సాధ్యం అవుతుందని అయుకావా అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం లైసెన్స్‌ నియమ నిబంధనలపై దృష్టిసారించడం మంచి పరిణామం. ఇది మంచి చర్యగా ఆయన అభివర్ణించారు. అయితే కచ్చితమైన నిబంధనలు అమలు చేయకుంటే పరిశ్రమ ప్రయత్నాలు విఫలమవుతాయని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
భానుప్రియకు తీరని దుఃఖం, భర్త హఠాన్మరణం Highlights భానుప్రియ జీవితంలో విషాదం భానుప్రియ మాజీ భర్త(విడాకులు తీసుకున్నారు) ఆదర్శ కౌశల్ గుండెపోటుతో మృతి 1998లో ఆదర్శ్ కౌశల్ ను వివాహం చేసుకున్న భానుప్రియ నిన్నటి తరం అందాల నటిగా పేరు తెచ్చుకున్న భానుప్రియ జీవితంలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆమె మాజీ భర్త ఆదర్శ కౌశల్ గుండెపోటు కారణంగా మృతిచెందారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో సింగిల్ గానే ఉంటున్నారు. ఈ షాకింగ్ న్యూస్ తెలిసిన వెంటనే ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న భానుప్రియ అమెరికాకు బయలుదేరి వెళ్లింది.  భానుప్రియ 1998లో అమెరికాలో నివాసం ఉంటున్న ఆదర్శ్ కౌశల్ ను వివాహం చేసుకుంది. ఆ తరవాత కొన్నాళ్లపాటు వారి మ్యారీడ్ లైప్ సజావుగానే సాగింది. వాళ్లిద్దరికీ అభినయ అనే కుమార్తె కూడా ఉంది.  పెళ్లి తరవాత భానుప్రియ అమెరికాలో ఉండిపోయింది. అనుకోని కారణాలతో ఈ జంట 2005లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక భానుప్రియ తిరిగి కుమార్తెతో చెన్నై తిరిగొచ్చేసింది. అప్పటి నుంచే అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఉంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ ఒక్కడే అమెరికాలో ఉండిపోయారు.    భానుప్రియ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుండటం.. టాలీవుడ్ కు దూరంగా చెన్నైలో ఉండిపోవడంతో ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలేవీ ఇక్కడ మీడియాకు... సినిమా జనాలకు పెద్దగా తెలియలేదు. అందుకే ఇప్పుడు ఆమె జీవితంలో జరిగిన ఈ విషాద ఘటన ఇంకా చాలామంది దృష్టికి రాలేదని తెలుస్తోంది.   Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0business
Aug 19,2015 కోటి అమ్మకాలు దాటిన యాక్టివా..!     ముంబయి: హోండా యాక్టివా స్కూటర్‌ అరుదైన ఘనతను సాధించింది. దేశంలో కోటి అమ్మకాలను దాటిన ఏకైక స్కూటర్‌గా 'హోండా యాక్టివా' నిలిచింది. భారత స్కూటర్‌ మార్కెట్లో ప్రస్తుతం యాక్టివా వాటా 59 శాతంగా ఉంది. గత ఒక ఆర్థిక సంవత్సరంలోనే హోండా సంస్థ దాదాపు 21 లక్షల యాక్టివా వాహనాలను విక్రయించింది. హోండా యాక్టివా శ్రేణిలో మూడు స్కూటర్లను అందిస్తోంది. యాక్టివా 3జీ, యాక్టివా ఐ, యాక్టివా 125 మోడళ్లతో మార్కెట్లో సందడి చేస్తోంది. కోటి హోండా యాక్టివా వాహనాల అమ్మకాల పట్ల 'హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా' సంస్థ అధ్యక్షుడు కెయితా మురమత్సు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం తమకు చాలా విశిష్టమైందని పేర్కొన్నారు. తాము కోటి సంతోషకరమైన కుటుంబాల నమ్మకం పొందడం ఎంతో అనందంగా ఉందని ఆయన అన్నారు. 2001లో దేశంలో స్కూటర్ల విభాగాన్ని పునరుత్తేజ పరుస్తూ తాము అందుబాటులోకి తెచ్చిన హోండా యాక్టివా నేడు పరిశ్రమ మొత్తం ఈ దిశగా దృష్టి సారించేలా ఎదిగిందని ఆయన వివరించారు. అత్యధిక మంది దేశ ఫ్రజలు తమ కలలను నిజం చేసుకునే విధానాన్ని యాక్టివా మార్చేసిందని అన్నారు. మరోవైపు గత రెండు నెలలుగా యాక్టివా అధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనంగా కూడా రికార్డు సృష్టిస్తోందని కంపెనీ తెలిపింది. గత జులై నెలలో హోండా సంస్థ 2.5 లక్షల వాహనాలను తయారు చేసిన సంస్థగా కూడా ఎదిగిందని ఆయన వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు CVR| Last Updated: శుక్రవారం, 5 డిశెంబరు 2014 (11:13 IST) రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.384 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.4.25గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.387, విశాఖపట్నంలో రూ.375, విజయవాడ రూ.370, చిత్తూరులో రూ.393, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.370 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.400 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో రూ.376 రూపాయలుగా, బెంగుళూరులో 405 రూపాయలు పలుకుతోంది. సంబంధిత వార్తలు
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV భారత్ ఓటమికి కారణం చెప్పిన కోహ్లి..! దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమికి కెప్టెన్ విరాట్ కోహ్లి TNN | Updated: Feb 22, 2018, 05:33PM IST దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమికి కెప్టెన్ విరాట్ కోహ్లి కారణం చెప్పాడు. మ్యాచ్‌ మధ్యలో వర్షం రావడంతో బౌలర్లకి బంతిపై పట్టు దొరకలేదని.. దీంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కి 189 పరుగుల భారీ లక్ష్యఛేదన సైతం సులువైందని కోహ్లి వివరించాడు. ఈ మ్యాచ్‌లో మనీశ్ పాండే (79 నాటౌట్: 48 బంతుల్లో 6x4, 2x6), మహేంద్రసింగ్ ధోని (52 నాటౌట్: 28 బంతుల్లో 4x4, 3x6) అర్ధశతకాలు బాదడంతో తొలుత భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యాన్ని క్లాసెన్ (69: 30 బంతుల్లో 3x4, 7x6), కెప్టెన్ డుమిని (64: 40 బంతుల్లో 4x4, 3x6) దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సమయంలో రెండు సార్లు వర్షం రావడం‌ భారత బౌలర్లకి శాపంగా మారిందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్‌ ఏకంగా 64 పరుగులు సమర్పించుకుని.. భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ‘భారత్ జట్టు ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోవడంతో 175 పరుగులు చేస్తే చాలని అనుకున్నాం. కానీ.. మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోని, సురేశ్ రైనా మెరుగ్గా బ్యాటింగ్ చేయడం 188 పరుగులు చేయగలిగింది. వాస్తవానికి అది సురక్షితమైన స్కోరు. అయితే.. వర్షం రావడం‌తో భారత బౌలర్లకి కష్టంగా మారింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్ నుంచి బంతిపై బౌలర్లకి పట్టు దొరకలేదు (13వ ఓవర్‌ వేసిన చాహల్ 6, 6, 4, 1, 0, 6 పరుగులిచ్చాడు). ఒకవేళ వర్షం రాకుండా ఉండింటే.. మ్యాచ్ ఫలితం ఎలా ఉండేదో అందరికీ తెలుసు’ అని కోహ్లి వెల్లడించాడు. విజేత నిర్ణయాత్మక మూడో టీ20 శనివారం జరగనుంది.
2sports
Apr 21,2017 మరింత చౌక ధరలో నిస్సాన్‌ 'సన్నీ' న్యూఢిల్లీ: జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం నిస్సాన్‌ తన మిడ్‌ సైజ్‌ సెడాన్‌ కారు సన్నీ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్లో ఈ మోడల్‌పై ధరను రూ.1.99 లక్షల మేర తగ్గిస్తున్నట్లు గురువారం కంపెనీ ప్రకటించింది. దీంతో న్యూఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద ఈ కారు ధర రూ.6.99 లక్షల నుంచి 8.99 లక్షలుగా ఉంటుందని నిస్సాన్‌ పేర్కొంది. ఉత్పత్తి వ్యయం తగ్గిన కారణంగా ధరలకు కోత పెట్టామని నిస్సాన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
vijay hazare trophy 2019: ambati rayudu made captain of hyderabad team రాయుడికి ఛాన్స్.. హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపిక రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇటీవల వెనక్కి తీసుకున్న అంబటి రాయుడ్ని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అక్కున చేర్చుకుంది. అతనికి ఏకంగా హైదరాబాద్ టీమ్ పగ్గాలను అప్పగించింది. Samayam Telugu | Updated: Sep 14, 2019, 08:27AM IST హైలైట్స్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇటీవల వెనక్కి తీసుకున్న అంబటి రాయుడు విజయ్ హజారే ట్రోఫీ కోసం జట్టుని ప్రకటించిన హైదరాబాద్ టీమ్ సెలక్టర్లు హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా అంబటి రాయుడు ఎంపిక బెంగళూరు వేదికగా ఈనెల 24 నుంచి టోర్నీ ప్రారంభం అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ ఆ వీడ్కోలు నిర్ణయాన్ని ఇటీవల వెనక్కి తీసుకున్న భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడి చేతికి హైదరాబాద్ టీమ్ పగ్గాలు వచ్చాయి. బెంగళూరు వేదికగా ఈనెల 24 నుంచి అక్టోబరు 11 వరకూ జరగనున్న విజయ్ హజారే టోర్నీ కోసం హైదరాబాద్ జట్టుని తాజాగా ప్రకటించిన హైదరాబాద్ టీమ్ సెలక్టర్లు.. కెప్టెన్‌గా అంబటి రాయుడ్ని ఎంపిక చేశారు. వన్డే ఫార్మాట‌్‌లో ఈ టోర్నీ జరగనుండగా.. పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలని రాయుడు ఆశిస్తున్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ బి. సందీప్ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. Read More: రిటైర్మెంట్ వెనక్కి.. రాయుడిపై సెటైర్ల వర్షం వన్డే ప్రపంచకప్‌‌లో భారత సెలక్టర్లు తనకి అవకాశమివ్వకపోవడంతో నిరాశ చెందిన అంబటి రాయుడు .. వరల్డ్‌కప్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అయితే.. ఇటీవల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు.. బీసీసీఐతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌ (హెచ్‌సీఏ)‌కి కూడా లేఖ రాస్తూ.. సెలక్షన్‌కి తాను అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించాడు. రాయుడి అభ్యర్థని పరిగణలోకి తీసుకున్న హెచ్‌సీఏ.. జట్టులో చోటివ్వడంతో పాటు ఏకంగా కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
2sports
Suresh 176 Views ఫెమా ఉల్లంఘనపై 81 కేసులు న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ మొత్తం 81కేసులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తుచేస్తోందని వాణిజ్య శాఖ్‌ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.22కేసుల్లో ఇప్పటికే సంజాయిషీ నోటీసులు జారీచేసినట్టు వివరించారు.మిగిలిన 59 కేసులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
1entertainment
BCCI లోధా సంస్కరణలకు బిసిసిఐ గ్రీన్‌ సిగ్నల్‌ ముంబయి: భారత క్రికెట్‌లో సమూల మార్పుల కోసం జస్టిస్‌ లోధా కమిటీ సూచించిన సంస్కరణలను పాక్షికంగా అమలు చేసేందుకు బిసిసిఐ ముందుకు వచ్చింది. అయితే ఐదు వివాదాస్పద సూచనలను మాత్రం పక్కన బెట్టింది. ఈమేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో (ఎజిఎం)లో నిర్ణయం తీసుకుంది. లోధా సంస్కరణల్లో వివాదాస్పద అంశాల పరిశీలనకు సుప్రీం కోర్టు అంగీకరించిన నేపథ్యంలో అవి మినహా మిగిలిన వాటిని బిసిసిఐ ఆమోదం తెలిపింది. ఆ ఐదు మినహా లోధా కమిటీ సంస్కరణలను అమలు చేయాలని బిసిసిఐ నిర్ణయించింది. అని సమావేశం అనంతరం బోర్డు తాత్కాలిక కార్య దర్శి అమితాబ్‌ చౌదరి చెప్పాడు. ఇక ఆ ఐదు సంస్కరణల విషయమై వచ్చేనెల 18న జరిగే విచారణలో నిర్ణయం తీసుకుంటామని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ప్రకటించింది. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు, అపెక్స్‌ కౌన్సిల్‌, ఆఫీసు బేరర్ల సెలక్షన్‌ కమిటీ పరి మాణం ఇలా ఈ ఐదు మినహా మిగిలిన వాటిని పాటించేందుకు బిసిసిఐ అంగీకరించింది. మరో వైపు ఏజిఎంకు ఆఫీస్‌ బేరర్లు మాత్రమే హాజరు కావాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బిసిసిఐ కచ్చితంగా అమలు చేసింది. బిసిసిఐ సిఈఓ రాహుల్‌ జోహ్రీని కూడా సమావేశానికి హాజరు కానివ్వలేదు. జోహ్రీ సహా బోర్డు ఉద్యోగులం దరూ సమావేశం నుంచి వెళ్లిపోవాలని అమితాబ్‌ చౌదరి చెప్పడం విశేషం.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అశ్విన్ లగేజీ బ్యాగ్ డ్యామేజీ.. రోహిత్ ట్వీటేశాడు అశ్విన్ బ్యాగ్ ఎందుకు డ్యామేజీ అయిందో రోహిత్ చెప్పేశాడు.. TNN | Updated: Jan 13, 2017, 09:56PM IST భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, స్టార్ బ్యాట్స్‌మెన్ రవిచంద్రన్ అశ్విన్ మధ్య ట్వీటర్లో సరదా సంభాషణ కొనసాగింది. అశ్విన్ లగేజీ బ్యాగ్ వీల్ విరిగిపోగా.. అవుట్ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన రోహిత్ శర్మ .. నువ్వు వికెట్ల మీద వికెట్లు తీస్తూ ఆ బ్యాగ్‌లో వేస్తే అలాగే ఉంటుంది. అదిప్పుడు వీల్ బిఫోర్ వికెట్ అయ్యిందంటూ అశ్విన్‌ను ఆట పట్టించాడు. వీరి ట్వీట్లు చూసిన ఆ లగేజీ బ్యాగ్ కంపెనీ.. ఆ బ్యాగ్ సంగతి మేం చూసుకుంటామంటూ బదులిచ్చింది. — Ashwin Ravichandran (@ashwinravi99) January 12, 2017 అశ్విన్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆడుతుండగా.. గాయం కారణంగా లండన్లో శస్త్రచికిత్స చేయించుకున్న రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ప్రారంభమయ్యే జట్టులో స్థానం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రోహిత్ ఫిట్‌నెస్ నిరూపించుకోకపోవడంతో అతణ్ని ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దీంతో... నేను ఇంకా ఫిట్కాలేదు. అందుకే ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు నన్ను ఎంపిక చేయలేదు. నా ఫిట్‌నెస్ ను పరిగణలోకి తీసుకుని నన్ను ఎంపిక చేయనందుకు థ్యాంక్స్ అని రోహిత్ ట్వీట్ చేశాడు.
2sports
Nano motors నానో ప్రాజెక్టు టాటామోటార్స్‌కు ఆర్థికభారం! ముంబై, డిసెంబరు 14: టాటామోటార్స్‌ స్వతంత్ర డైరెక్టర్‌గా నానో చిన్నకారు కొనసాగింపు వల్ల కంపెనీకి ఆర్థిక నష్టం భారీగా ఎదురవుతున్నదని ఈ ప్రాజెక్టు కొనసాగింపునకు వ్యతిరేకించడం వల్లనే రతన్‌ టాటా తనతో విభేధిస్తున్నారని నుస్లీవాడియా వెల్ల డించారు. నానో ప్రాజెక్టువల్ల వేలాది కోట్ల రూపా యలు టాటామోటార్స్‌కు నష్టం వాటిల్లిందని వాటా దారులకు వాడియా లేఖలు రాసారు. ఈనెల 22వ తేదీ టాటామోటార్స్‌ప్రత్యేక సమావేశం జరుగనున్న నేపథ్యంలో వాడియా వాటాదారులకు రాసిన లేఖ లు కీలకం అయ్యాయి. ప్రాథమికంగా ఈ కారును లక్ష రూపాయలకే విక్రయించాలని తలపోసారని, 2008లో ప్రారంభించారని అప్పటినుంచి టాటా మోటార్స్‌కు ఆర్థికనష్టాలు పెరిగిపోయాయని కారు ధరను 2.25 లక్షలకు పెంచినా అదేపరిస్థితి నెల కొన్నదని వాడియా తనలేఖలో వివరించారు. నానో ప్రతికారు విక్రయంవల్ల కంపెనీకి ఒరిగిందేమీలేద న్నారు. వాణిజ్యపరంగా విఫలం అయిన తర్వాత ఈ ప్రనాజెక్టు కొనసాగించడాన్ని వ్యతిరేకించానని అదే రతన్‌టాటాకు నచ్చలేదన్నారు. ముందు ఈ నానోకార్లు 2.5 లక్షల కార్డు ఉత్పత్తికి పెట్టుబడులు ప్రణాళిక ఖరారయిందని, అయితే 2015-16లో ఈ కార్ల ఉత్పత్తి 20వేలకు మించిలేదని ప్రస్తుతం ఇంకా తక్కువగానే ఉందని నుస్లీవాడియా రతన్‌ టాటాను పరోక్షంగా విమర్శించారు. అంతేకాకుండా టాటామోటార్స్‌ కంపెనీపై కూడా ప్రతికూల సెంటిమెంట్‌ పెంచింద న్నారు. టాటామోటార్స్‌లో 18 ఏళ్లపాటు స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేసానని తన ప్రవర్తన తీరు అప్పటినుంచి టాటాసన్స్‌కు తెలియనిదికాదని ఆయన అన్నారు. టాటాసన్స్‌, తాత్కాలిక ఛైర్మన్‌ కావాలనే తనకు నోటీసు ఇచ్చారని, కుట్రపూర్తిలక్ష్యాల తోనే తనను టాటామోటార్స్‌ బోర్డు నుంచి తప్పించే లక్ష్యంతోనే నోటీస్‌ ఇచ్చారన్నారు. వారి లక్ష్యం చెల్లదని, స్వార్ధంతో కూడుకున్నదిగా భావిస్తున్న ట్లు వాడియా వాటాదారులకు లేఖ రాస్తూ తనకు మద్దతునివ్వాలని కోరా రు. టాటామోటార్స్‌లో 26.51శాతం వాటాలు టాటాసన్స్‌కు ఉన్నాయి. గత నెలలోనే టాటామోటార్స్‌ అత్యవసర సర్వసభ్యసమావేశం నిర్వహించాలని, సైరస్‌ మిస్త్రీ, నుస్లీవాడియాలను బోర్డునుంచి తొలగించేందుకు తీర్మా నం ప్రతిపాదించాలని సూచించిన సంగతి తెలిసిందే.
1entertainment
ఈ ఐదు అంశాలే 2017లో కీలకం!   హైదరాబాద్‌, డిసెంబరు 30: పలు సంచ లనాలు, ఆగమన నిష్క్రమణలతో మారు మోగిన భారత్‌లో రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఐదు కీలక అంశాలు ప్రభావితంచేస్తాయి. కొత్తఏడాదికి కోటి ఆశలతో స్వాగతం చెపుతున్న తరుణంలో దేశ ఆర్థికవ్యవస్థకు ఐదు అంశాలు కీలకం అవుతాయి. ఒక అమెరికా కొత్త అధ్యక్షునిగా డొనాల్డ్‌ట్రంప్‌ బాధ్యతల స్వీకారం అనంతరం ఆయన చేపట్టే విధివిధానాలు ప్రభావితంచేస్తాయి. ఆయన కేబినెట్‌ నియామకాలు కూడా భారత్‌కు ముఖ్యం. భారత్‌లాంటి శరవేగంగా వృద్ధిచెందు తున్న దేశంపై ట్రంప్‌ సానుకూలంగానే ఉంటున్న ట్లు అంచనా. పెట్టుబడుల రాక సానుకూలం అవు తుంది. అదే పాకిస్తాన్‌పై ట్రంప్‌ వైఖరిని కూడా భారత్‌ సానుకూలం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వలసలవిధానంపై ట్రంప్‌వైఖరి కొంత సమస్యాత్మ కం అవుతుంది. స్వేఛ్ఛావాణిజ్యం, ఔట్‌సోర్సింగ్‌, పన్నుప్రణాళికలు భారత్‌కు వరోధం అవుతాయని అంచనా. అయితే ట్రంప్‌వరకూ నేరుగా భారతీ యులే లక్ష్యంగా చేసుకోలేదు. కఠినతరమైన వలస విధానం అనుసరిస్తామని మాత్రమే చెప్పారు. కొత్త పన్ను ప్రణాళిక వల్ల ఎక్కువ మంది అమెరికా బిజినెస్‌ ప్రముఖులు తమ దేశానికి తరలిపోయే అవకాశంఉంది. ఇకపెద్దనోట్ల రద్దుప్రభావం 2017 మధ్యస్తం వరకూ కొనసాగే ప్రమాదం లేకపోలేదు. ఆర్థికవ్యవస్థలోనికి సరిపడేంతగా నగదు అందు బాటులోనికి రావడంలేదు. దీనివల్లరానున్న రెండు త్రైమాసికాల కార్పొరేట్‌ ఫలితాలు కూడా వత్తిడికి లోనవుతాయని అంచనా. వీటికితోడు ప్రభుత్వం చేపట్టే కార్యాచరణ కూడా కొంత కీలకం అవు తుంది. ఇక ఫిబ్రవరి ఒకటవ తేదీ చేపట్టే కేంద్ర బడ్జెట్‌ మరొక ప్రధాన అంశం. రైల్వే, సాధారణ బడ్జెట్‌లను సమ్మిళితంచేసి ఒకే బడ్జెట్‌గా ప్రవేశ పెడుతున్న మొదటిసంవత్సరం కావడంతో అటు రైల్వే, ఇటు ప్రజలకు కూడా మోడీ, జైట్లీ వరాలు కురిపిస్తారన్న ఆశలు మెండుగా ఉన్నాయి. వీటికి తోడు దేశంలోని కీలకమైన ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశంచేస్తాయని చెప్పవచ్చు. బడ్జెట్‌లో వచ్చే వార్షి క వ్యయప్రణాళికలు, పన్ను ప్రతిపాదనలు వంటి వాటిపై అందరి కళ్లు ఉన్నాయి. ఇక అన్నింటికంటే ముందు పరోక్షపన్నులరంగంలో వస్తున్న సంస్కర ణలు కీలకం. ఇందులో భాగంగానే జిఎస్‌టి చట్టం ఎప్పటినుంచి అమలవుతుందన్నది అందరి వద్ద నలుగుతున్న ప్రశ్న. కొన్ని కీలక అంశాలపై ఏకాభి ప్రాయం రాకపోవడం, పార్లమెంటు సమావేశాల్లో జిఎస్‌టి చట్టానికి ఆమోదం పెండింగ్‌లో పడటం వల్ల ఏప్రిల్‌నుంచి ఈ చట్టం అమలుకు రాబోదన్న వాదనలే ఎక్కువ వినిపిస్తున్నాయి. సెప్టెంబరు నుంచి రావచ్చన్న వార్తలు జోరుగా ఉన్నాయి. పన్నురేటు, జిఎస్‌టిపై నియంత్ర, పర్యవేక్షణాధికారాలపై ఇప్పటికీ ఏకాభిప్రాయానికి రావాల్సిఉంది. ఇక మరీముఖ్యంగా చెప్పాలంటే స్టాక్‌మార్కెట్లకు, ఆర్థికవ్యవస్థ మరింత ముందుకు వెళ్లేందుకు దేశరాజకీయాలు కూడా కీలకం అవుతాయి. 2017లోజరిగే నాలుగు రాష్ట్రా ల ఎన్నికలు ఇందుకు వేదిక అవుతున్నాయి. బీహార్‌, ఢిల్లీల్లో ఘోరపరాజయం పొందిన బిజెపి అస్సాంలో మాత్రం గెలిచింది. అంతేకాకుండా ఈ నాలుగు రాష్ట్రాల్లో గెలిస్తే మోడీ ప్రభ మరింత వెలుగుతుందని నిపుణుల అంచనా. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎక్కువ ఉంటుందన్న ఆందో ళనలున్నాయి. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు దేశరాజకీయ పటిష్టతకు అధికార ఎన్‌డిఎకు కీలకం అవుతాయి.ఈఎన్నికల ఫలితాలఆధారంగానే విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని నిపుణుల అంచనా.
1entertainment
నన్ను కూడా కిడ్నాప్ చేశారు: ప్రముఖ నటి Highlights ఓ చర్చలో పాల్గొన్న పార్వతి.. తన సహ నటి కిడ్నాప్ కు గురైన విషయం తెలుసుకొని షాక్ అయ్యానని.. ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలిసి మరింత బాధ పడ్డానని వెల్లడించింది. ఆమెకు కూడా అటువంటి సంఘటన ఎదురైందని చెప్పి షాకింగ్ విషయాలను బయట పెట్టింది మలయాళీ ముద్దుగుమ్మ పార్వతీమీనన్ కు అక్కడ మంచి క్రేజ్ ఉంది. 'బెంగుళూర్ డేస్' సినిమా ద్వారా ఆమె మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రెండు,మూడు సినిమాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ మలయాళీ సినీ సంఘం గురించిన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దానికి ముందు నటుడు దిలీప్ ను సంఘంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించిన నటీమణులలో పార్వతి కూడా ఉన్నారు. నటిపై అత్యాచార కేసులో విచారణలో ఉండగా.. నటుడు దిలీప్ ను సంఘంలో ఎలా చేర్చుకుంటారని పార్వతి ఖండించింది. ఈ విషయంపై ఓ చర్చలో పాల్గొన్న పార్వతి.. తన సహ నటి కిడ్నాప్ కు గురైన విషయం తెలుసుకొని షాక్ అయ్యానని.. ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలిసి మరింత బాధ పడ్డానని వెల్లడించింది. ఆమెకు కూడా అటువంటి సంఘటన ఎదురైందని చెప్పి షాకింగ్ విషయాలను బయట పెట్టింది.  ఇప్పటికీ కుడా తనను ఎవరు కిడ్నాప్ చేశారో బయటపెట్టి శిక్ష పడేలా చేయగలనని కానీ అలా చేయడం తనకు ఇష్టం లేదని అన్నారు. వారు ఎంతకైనా తెగించే రకమని, తనకు ఇలా జరిగినా దాన్ని నుండి బయటపడగలిగినట్లు చెప్పారు.  Last Updated 12, Jul 2018, 6:45 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆసీస్‌కు షాక్.. సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్! బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతున్న ఆసీస్‌కు.. మూడో టెస్టు ముందు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు.. TNN | Updated: Mar 10, 2017, 12:59PM IST బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు ముందు ఆసీస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ స్టార్క్ కాలి గాయం కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరమయ్యాడు. రాంచీ, ధర్మశాలల్లో జరగనున్న టెస్టులకు అతడు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ కూడా స్వదేశానికి పయనమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ జట్టులో టస్మానియాకు చెందిన జాక్సన్ బర్డ్ జట్టులో రిజర్వ్ బౌలర్‌గా ఉండటంతో స్టార్క్ స్థానంలో మరో క్రికెటర్‌‌ను తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ ప్రకటించలేదు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టు సందర్భంగా.. మిచెల్ కుడి పాదంలో నొప్పి వచ్చిందని, స్కానింగ్‌లో అది ఫ్రాక్చర్ అని తేలినట్లు జట్టు ఫిజియోథెరపిస్ట్ డేవిడ్ బీక్లే తెలిపాడు. దీంతో స్టార్క్ స్వదేశం వెళ్లి విశ్రాంతి తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశాడు.
2sports
చిరంజీవి,పవన్ కళ్యాణ్ పై నాగబాబును నిలదీసిన సుడిగాలి సుధీర్ Highlights జబర్దస్త్ కు చేరిన చిరు పవన్ ల పంచాయితీ నాగబాబును నిలదీసిన సుడిగాలి సుధీర్ జబర్దస్త్ దసరా మహోత్సవం షోలో రోజా కన్నీళ్లు బుల్లితెరపై ఈటీవీలో 'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' కామెడీ షోలు తెలుగు టీవీ ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ పొందాయో తెలిసిందే. నాగబాబు, రోజా న్యాయ నిర్ణేతలుగా, అనసూయ, రష్మి లాంటి హాట్ బ్యూటీస్ యాంకరింగ్ చేస్తున్న ఈ షోలు.. తెలుగు టీవీ వినోద కార్యక్రమాల్లోనే కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం సాగిస్తున్నాయి. ఇక ఈ దసరా సందర్భంగా 'జబర్దస్త్' షోను ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. 'దసరా మహోత్సవం' పేరుతో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించబోతున్నారు.   సెప్టెంబర్ 30న ప్రసారం అయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రోమో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-పవన్ కళ్యాణ్ ల గురించి సుడిగాలి సుధీర్ నాగబాబును ప్రశ్నించడం పెద్ద చర్చనీయాంశమైంది. సుధీర్ మాటలతో హర్ట్ అయిన నాగబాబు ఫైల్ టేబుల్ పై సీరియస్ గా విసిరేసి చాలా కోపపంగా అర్థంతరంగా షో నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.   ఈ ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్లు వాదులాడుకోవడం, తీవ్రంగా పరుషాలు మాట్లాడటం లాంటివి కనిపించాయి. ఇక నాగబాబు మాట్లాడుతూ.. బ్రిటిష్ వాడు కోహినూర్ వజ్రం ఎత్తుకెళ్లింది అని చెప్పింది ఎవరు? ఇదిగో ఇక్కడ ఉంది కోహినూర్ డైమండ్ అంటూ రోజాను ఉద్దేశించి కమెంట్ చేయడం, రోజా సిగ్గుపడటం కనిపించింది.   ఇక రోజాను కూడా.. ఆ పార్టీ ఈ పార్టీ మార్చడం కాదు, ఏదో ఒక పార్టీలో ఉండాలంటూ కొందరు కమెడియన్లు విమర్శించారు. దాంతో రోజా ఎమోషన్ అయ్యి ఏడ్చేసింది. తాను ఎమ్మెల్యే అయ్యానంటే దానికి కారణం జబర్దస్త్ షో మాత్రమే అని స్పష్టం చేసింది.   షో మధ్యలో అనసూయ కళ్లు తిరిగి పడిపోవడం, నాగబాబు, ఇతరలంతా కలిసి ఆమెను పట్టుకోవడం కనిపించాయి. మొత్తానికి దసరా మహోత్సవం చాలా రసవత్తరంగా సాగుతుందని స్పష్టమవుతోంది. సెప్టెంబర్ 30న తొమ్మిది గంటలకు ప్రసారం కాబోతున్న జబర్దస్త్ దసరా మహోత్సవం ప్రేక్షకులకు జబర్దస్త్ వినోదం పంచనుంది. Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అదే సీన్: అబాట్ విసిరిన బౌన్సర్‌కు విలవిల్లాడిన బ్యాట్స్‌మెన్ మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలో అబాట్ సీన్ విసిరిన బంతి ఫిలిప్ హ్యూస్‌ను బలితీసుకున్న ఘటనను గుర్తుతెస్తూ.. మరో ఘటన జరిగింది. TNN | Updated: Mar 4, 2018, 04:46PM IST ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్ విసిరిన బౌన్సర్ ఫిలిప్ హ్యూస్ మరణించిన సంఘటన గుర్తుంది కదా. అదే తరహాలో అబాట్ విసిరిన బౌన్సర్ మరో బ్యాట్స్‌మెన్ హెల్మెట్‌కు బలంగా తాకింది. షెఫీల్డ్ షీల్డ్ దేశవాళీ టోర్నీలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. న్యూ సౌత్ వేల్స్ తరఫున బరిలో దిగిన అబాట్ విసిరిన షార్ట్ బాల్ విల్ పుకోవిస్కి హెల్మెట్‌కు బలంగా తాకింది. బంతి తాకిన తీవ్రతకు విక్టోరియా బ్యాట్స్‌మెన్ వెంటనే కిందపడిపోయాడు. హ్యూస్ మరణ విషాదం కళ్ల ముందు మెదలడంతో అబాట్ వెంటనే పరుగున వచ్చి బ్యాట్స్‌మెన్‌ను సముదాయించాడు. అదృష్టవశాత్తు అతడికి పెద్ద గాయమేం కాలేదు. కానీ ముందు జాగ్రత్తగా రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 2014లో దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో సీన్ అబాట్ విసిరిన బౌన్సర్ ఫిలిప్ హ్యూస్ తలను బలంగా తాకింది. హెల్మెట్ ఉన్నప్పటికీ అది కాస్త కింది భాగంలో తాకడంతో హ్యూస్ కోమాలోకి వెళ్లిపోయాడు. తర్వాత కోలుకోకుండానే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాతోపాటు క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Rohit బ్యాడ్‌లక్.. ఆసీస్ గడ్డపై శతకాల రికార్డ్, కానీ! సిడ్నీ వన్డేలో శతకం బాదిన రోహిత్.. ఆసీస్‌ గడ్డ మీద నాలుగో వన్డే శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరే బ్యాట్స్‌మెన్ కూడా ఆస్ట్రేలియా గడ్డ మీద 4 సెంచరీలు చేయలేదు. కానీ ఈ నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. Samayam Telugu | Updated: Jan 12, 2019, 04:31PM IST Rohit బ్యాడ్‌లక్.. ఆసీస్ గడ్డపై శతకాల రికార్డ్, కానీ! హైలైట్స్ సిడ్నీ వన్డేలో శతకం బాదిన రోహిత్.. ఆసీస్‌ గడ్డ మీద నాలుగో వన్డే శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరే బ్యాట్స్‌మెన్ కూడా ఆస్ట్రేలియా గడ్డ మీద 4 సెంచరీలు చేయలేదు. కానీ ఈ నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ అద్భుత శతకంతో భారత్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. ధోనీ అవుటయ్యాక అవతలి ఎండ్‌లో మరో బ్యాట్స్‌మెన్ అండగా నిలవకపోవడంతో.. ఒత్తిడి పెరిగి చివర్లో అవుటయ్యాడు. 4 రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను 254/9తో మ్యాచ్‌ను ముగించిందంటే అందుకు కారణం రోహితే. భారత్ గెలిపించలేక పోయినప్పటికీ.. అద్భుత శతకంతో రోహిత్ అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ గడ్డ మీద వన్డేల్లో నాలుగు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో వివియన్ రిచర్డ్స్ మూడు సెంచరీలు చేయడమే ఇప్పటి వరకూ రికార్డ్. బాధాకరమైన విషయం ఏంటంటే.. రోహిత్ శతకం బాదిన ఈ నాలుగు వన్డేల్లోనూ భారత్ ఓటమి పాలైంది. 2015లో మెల్‌బోర్న్ వన్డేలో రోహిత్ 138 పరుగులు చేశాడు. 2016లో పెర్త్ వన్డేలో 171 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే ఏడాది పెర్త్‌లో 124 రన్స్ చేశాడు. ఇప్పుడు సిడ్నీలో 133 పరుగులు చేశాడు. ఈ నాలుగు సందర్భాల్లోనూ భారత్ ఓటమిపాలైంది. ఒకే జట్టుపై వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆసీస్‌పై హిట్ మ్యాన్ 64 సిక్స్‌లు కొట్టగా... లంకపై ఆఫ్రిదీ 63 సిక్స్‌లు బాదాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఇంటెల్ ఐ9 ప్రాసెస‌ర్ల విడుద‌ల‌ ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ ల్యాప్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా 8వ జనరేషన్‌ కోర్‌ ఐ9 ప్రాసెసర్‌ను ఆవిష్కరించింది. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 8వ జనరేషన్‌ కోర్‌ ఐ5, ఐ7 ప్రాసెసర్లను విడుదల చేసింది TNN & Agencies | Updated: Apr 4, 2018, 03:39PM IST ల్యాప్ ట్యాప్, డెస్క్ టాప్‌ల కోసం స‌రికొత్త ప్రాసెస‌ర్ ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ ల్యాప్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా 8వ జనరేషన్‌ కోర్‌ ఐ9 ప్రాసెసర్‌ను ఆవిష్కరించింది. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 8వ జనరేషన్‌ కోర్‌ ఐ5, ఐ7 ప్రాసెసర్లను విడుదల చేసింది. ఈ ప్రాసెసర్లను గేమింగ్‌, గ్రాఫిక్స్‌ యూజర్లను ద ష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు ఇంటెల్‌ వెల్లడించింది. ల్యాప్ ట్యాప్, డెస్క్ టాప్‌ల కోసం స‌రికొత్త ప్రాసెస‌ర్ ఇంటెల్‌ విడుదల చేసిన 8వ జనరేషన్‌ ప్రాసెసర్లను డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ పిసిల్లో ఉపయోగించనున్నారు. వీటి వల్ల ఆయా డివైస్‌లు మరింత వేగంగా పనిచేయడమే కాదు, మొత్తంగా అత్యుత్తమ ప్రదర్శనను ఇస్తాయి. గతంలో విడుదలైన ఇంటెల్‌ 7వ జనరేషన్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్ల కన్నా ఈ ప్రాసెసర్లు 29 నుంచి 88 శాతం వరకు అధిక ఉత్తమ ప్రదర్శనను కనబర్చనున్నాయి. గ్రాఫిక్స్‌, డేటా కాపీయింగ్‌, ఇంటర్నెట్‌ స్పీడ్‌ తదితర అనేక అంశాల్లో గత ప్రాసెసర్ల కన్నా కొత్తగా వచ్చిన ఈ 8వ జనరేషన్‌ ఇంటెల్‌ ప్రాసెసర్లు మరింత వేగంగా పనిచేస్తాయి. కాగా ఈ ప్రాసెసర్ల ధరలను ఆ కంపెనీ వెల్లడించలేదు.
1entertainment
cheteshwar pujara climbs to second spot కొహ్లీ కన్నా.. పుజారానే టాప్..! ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్లో పాత రికార్డులకు రిపేర్లు చేస్తూ దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ కన్నా ముందుండి దూసుకుపోతున్నాడు నయా వాల్ ఛతేశ్వర్ పుజారా. TNN | Updated: Nov 28, 2017, 03:06PM IST ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్లో పాత రికార్డులకు రిపేర్లు చేస్తూ దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ కన్నా ముందుండి దూసుకుపోతున్నాడు నయా వాల్ ఛతేశ్వర్ పుజారా. ఇది టెస్టు ర్యాంకింగ్స్ విషయంలో. ఐసీసీ తాజాగా వెల్లడించిన టెస్టు బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానాన్ని దూసుకుపోయాడు పూజారా . 888 పాయింట్లతో నవంబర్ టూ పొజిషన్ ను సొంతం చేసుకున్నాడు పుజారా. మరోవైపు శ్రీలంకతో టెస్టు సీరిస్ లో తొలి మ్యాచ్ లో సెంచరీ, రెండో మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన కొహ్లీ ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. 877 పాయింట్లతో కొహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. ఇక నంబర్ వన్ పొజిషన్లో, ఎవరికి అందనంత స్థాయిలో ఉన్నాడు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్. 941 పాయింట్లతో స్మిత్ నంబర్ వన్ గా ఉన్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మూడో స్థానం, నాలుగో స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లు ఉన్నారు. ఆరో స్థానంలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు.
2sports
Hyderabad, First Published 3, Sep 2018, 4:43 PM IST Highlights జూనియర్ ఎన్టీఆర్ తను ఎంతగానో ప్రేమించిన తన తండ్రి నందమూరి హరికృష్ణను యాక్సిడెంట్ లో కోల్పోయారు. ఈ సంఘటన జరిగి నాలుగురోజులు గడవక ముందే తారక్ 'అరవింద సమేత' సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.  జూనియర్ ఎన్టీఆర్ తను ఎంతగానో ప్రేమించిన తన తండ్రి నందమూరి హరికృష్ణను యాక్సిడెంట్ లో కోల్పోయారు. ఈ సంఘటన జరిగి నాలుగురోజులు గడవక ముందే తారక్ 'అరవింద సమేత' సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. నిజానికి తారక్ ఈ బాధ నుండి కోలుకోవడానికి సమయం పడుతుందని, ఇప్పట్లో ఆయన షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదనే మాటలు వినిపించాయి. సినిమా అనుకున్న సమయానికి రాదేమోనని మేకర్స్ కూడా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా తారక్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా.. తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు. తన కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోకూడదని తారక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్, తదితరులపై కీలక సన్నివేశాలను చితీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ''అంకితభావానికి ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం. ఆయన డెడికేషన్ చూసిన తరువాత ఆయనపై గౌరవం మరింత పెరిగింది.. మేమంతా మీతో ఉన్నాం. మీకు మరింత బలం చేకూరాలి'' అంటూ ట్వీట్ చేశారు. చకచకా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.     Lots of respect and regards to dear @tarak9999 Anna We r with U anna ♥️ Love u for ur dedication ✨✨✨✨✨ More strength and power to U — thaman S (@MusicThaman) September 3, 2018 Last Updated 9, Sep 2018, 2:07 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మ్యాచ్‌కి ముందు జెర్సీ పొగొట్టుకున్న ఓపెనర్ బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కి ముందు దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ తన జెర్సీని పొగొట్టుకున్నాడు. దీంతో మరో ఓపెనర్ హసీమ్ ఆమ్లా జెర్సీని TNN | Updated: Oct 27, 2017, 04:10PM IST బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కి ముందు దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ తన జెర్సీని పొగొట్టుకున్నాడు. దీంతో మరో ఓపెనర్ హసీమ్ ఆమ్లా జెర్సీని వేసుకుని అతను మైదానంలోకి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమిని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. బ్యాటింగ్‌కి వెళ్లే ముందు తన జెర్సీ కనిపించకపోవడంతో కాసేపు డికాక్ అయోమయానికి గురయ్యాడట. దీంతో పక్కనే ఉన్న ఆమ్లా తన అదనపు జెర్సీని అతనికి ఇచ్చినట్లు కామెంటేటర్లు వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఆమ్లా (3) ఔటైపోయినా.. డికాక్ (59: 44 బంతుల్లో 5x4, 1x6) మాత్రం అర్ధశతకంతో సత్తాచాటాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు తమదైన శైలిలో ‘ఆమ్లా ఔట్.. కానీ బ్యాటింగ్ చేస్తున్నాడు’ అంటూ చమత్కారంగా ట్వీట్ చేశారు. డికాక్‌తో పాటు డివిలియర్స్ (49: 27 బంతుల్లో 8x4) కూడా సత్తాచాటడంతో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 175/9కే పరిమితమైంది.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV అత్యాచారాలకు ఆమె కండోమ్ ప్రకటనే కారణమట దేశంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి ఓ పోర్న్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటించిన కండోమ్ ప్రకటనే కారణమంటూ మరో కొత్త వాదన తెరపైకొచ్చింది. TNN | Updated: Sep 3, 2015, 10:57AM IST దేశంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి పోర్న్ స్టార్ సన్నిలియోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటించిన కండోమ్ ప్రకటనే కారణమంటూ మరో కొత్త వాదన తెరపైకొచ్చింది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు... సీపీఐ పార్టీకి చెందిన సీనియర్ నేత అరున్ అంజన్. ఎన్నో పోర్న్ సినిమాల్లో నటించిన సన్నీలియోన్‌ని సినీనటిని చేశాడు మహేష్ భట్ . జీవితంలో మొట్టమొదటిసారి ఆమె నటించిన ఓ పోర్న్ ఫిలిం చూశాను. చాలా సిగ్గేసింది. అంతేకాదు.. ఆమె నటించిన ఓ కండోమ్ ప్రకటనే ఇండియాలో రేప్ కేసులు పెరిగిపోవడానికి ఓ కారణమని అరుణ్ అంజన్ వ్యాఖ్యానించారు. సన్నీలియోన్‌పై అతడు చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. సన్నీలియోన్‌పై ఇలాంటి వ్యాఖ్యలు వినిపించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో శ్రీరామ్ సేన నేత ప్రమోద్ ముతాలిక్ కూడా దేశంలో లైంగిక నేరాలు తగ్గించాలంటే సన్నీలియోన్‌‌లాంటి వాళ్లని దేశం నుంచి తిరిగి వెనక్కి పంపించాలని అన్నారు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV వీడియో: ధోనీ vs పాండ్య రన్నింగ్ రేసులో గెలుపెవరిది? మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య మధ్య 100 మీటర్ల పరుగు పందెం పెడితే ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు. వీడియో చూస్తే షాకవాల్సిందే.. TNN | Updated: Dec 13, 2017, 12:08PM IST టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మధ్య పరుగు పందెం పెడితే ఎవరు నెగ్గుతారు? 36 ఏళ్ల ధోనీ, 24 ఏళ్ల పాండ్య మధ్య వంద మీటర్ల రన్నింగ్‌ రేసు పెడితే.. హార్దిక్‌నే విజయం వరిస్తుందని భావిస్తాం కదూ. కానీ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికీ ఎంత ఫిట్‌‌గా ఉన్నాడో చాటిచెప్పేలా.. బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ఓ వీడియో‌ను పోస్ట్ చేసింది. దిగ్గజ క్రికెటర్, యంగ్ ప్లేయర్ మధ్య రన్నింగ్ రేసును మన కళ్ల ముందు ఉంచింది. రెండో వన్డే ప్రారంభానికి ముందు వార్మప్ సెషన్‌లో పాల్గొన్న ధోనీ, పాండ్య మైదానంలో వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. సరదాగా రన్నింగ్ మొదలుపెట్టిన వీరు.. తర్వాత సీరియస్‌గా తీసుకున్నారు. వీరిద్దరూ చిరుతల్లా పరిగెత్తి.. ఉసేన్ బోల్ట్‌ను మైమరిపించారు. ఇద్దరూ సమానంగా పరిగెత్తినప్పటికీ.. చివర్లో పాండ్య అలసిపోయినట్లు కనిపించాడు. కానీ ధోనీ మాత్రం ఆఖరి వరకూ ఒకే వేగంతో రన్నింగ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన పాండ్యను ఓడించిన ధోనీ.. ఈ వయసులోనూ సత్తా తగ్గలేదని మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు.
2sports
ms dhoni, rohit sharma recommended jasprit bumrah bowling penultimate over: virat kohli వారి సలహా మేరకే బుమ్రా ఏడో ఓవర్ వేశాడు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన బుమ్రా ఆఖరి ఓవర్ కాకుండా ఏడో ఓవరే ఎందుకు బౌలింగ్ చేశాడో కోహ్లి చెప్పాడు. వారిద్దరి సలహాతోనే అలా చేయించామన్నాడు. | Updated: Nov 8, 2017, 12:21PM IST న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. కివీస్‌ను కట్టడి చేసిన బౌలర్లు 67 పరుగుల లక్ష్యాన్ని కాపాడారు. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత విజయంలో బౌలర్లు, ఫీల్డర్లు కీలక పాత్ర పోషించారు. బౌలింగ్ ఆర్డర్లో మార్పు కూడా కివీస్‌ను ఒత్తిడిలో నెట్టడానికి ఉపయోగపడింది. భువనేశ్వర్ కుమార్ తన రెండు ఓవర్ల కోటాను ముందే వినియోగించుకోగా... బుమ్రా ఆఖరి ఓవర్ వేస్తాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కోహ్లి ఏడో ఓవర్లోనే బంతిని బుమ్రా చేతికి ఇచ్చాడు. ఈ వ్యూహం ఫలితాన్ని ఇచ్చింది. రెండు ఓవర్లలో కివీస్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా, తొలి బంతికే బుమ్రా నికోలస్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ ఓవర్లో పది పరుగులు రాబట్టిన కివీస్ చివరి బంతికి మరో వికెట్ కోల్పోయింది. బ్రూస్‌ను ధోనీ, హార్దిక్ అద్భుతంగా రనౌట్ చేశారు. దీంతో చివరి ఓవర్‌కు ముందు న్యూజిలాండ్ ఒత్తిడికి లోనైంది. బుమ్రాతో ఏడో ఓవర్ వేయించాలనే ఆలోచన రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీది అని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి తెలిపాడు. చివరి ఓవర్లో సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉంటే కివీస్ గెలుపు కష్టం అవుతుందని భావించాం. అందుకే బుమ్రాకు ఏడో ఓవర్ బౌలింగ్ ఇచ్చాం. పాండ్య ఆఖరి ఓవర్ వేశాడని కెప్టెన్ చెప్పాడు. మూడో టీ20 చివరి ఓవర్లో గ్రాండ్‌హోమ్ బంతిని బలంగా బాదాడు. దాన్ని అందుకునే ప్రయత్నంలో పాండ్య చేతికి దెబ్బతగిలింది. నొప్పితో విలవిల్లాడు. ఆ టైంలో కోహ్లి కంగారు పడ్డాడు. కానీ పాండ్య మాత్రం ఫర్వాలేదు.. మీరేం కంగారు పడొద్దు నేను సరిగానే బౌలింగ్ చేస్తాననే విరాట్‌కు భరోసా ఇచ్చాడు. అన్నట్టుగానే కివీస్‌ను కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ అయిన రోహిత్ శర్మకు బుమ్రాను ఆఖరి ఓవర్లలో ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్లోనూ చివరి రెండు ఓవర్లలో పుణే విజయానికి 23 పరుగులు అవసరం కాగా, 19వ ఓవర్‌ను బుమ్రాతో వేయించాడు. ఆ ఓవర్లో ఒక సిక్సర్ సహా బుమ్రా 12 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్లో పుణేకు 11 పరుగులు అవసరమైన దశలో జాన్సన్ మూడు వికెట్లు తీసి ముంబైకి విజయాన్ని అందించాడు.
2sports