news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బాహుబలి లెన్స్మేన్కి బంపర్ ఆఫర్
బాహుబలి సినిమాకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్కి ఆ సినిమా మంచి అవకాశాన్నే తెచ్చిపెట్టింది.
TNN | Updated:
Sep 23, 2015, 01:05PM IST
బాహుబలి సినిమాకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్కి ఆ సినిమా మంచి అవకాశాన్నే తెచ్చిపెట్టింది. బాహుబలి మూవీలో సెంథిల్ పనితనం నచ్చిన బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నేరుగా అతనికే ఫోన్ చేసి తనకి ఓ పాటకి షూట్ చేసి పెట్టాల్సిందిగా కోరాడట. అది కూడా షారుఖ్ ఖాన్ , కాజోల్ జంటగా తెరకెక్కుతున్న దిల్వాలే మూవీ కావడంతో సెంథిల్ ఆనందానికి అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇంకేం ప్రస్తుతానికి ఖాళీగానే వున్న సెంథిల్ వెంటనే హైదరాబాద్లో వాలిపోయాడు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న పాటని షూట్ చేసే ఛాన్స్ దక్కించుకున్న ఈ తమిళ సినిమాటోగ్రాఫర్.. బాహుబలి సినిమా వర్క్ వల్లే తనకి ఈ అవకాశం లభించిందంటున్నాడు. షారుఖ్, రోహిత్ శెట్టి, సాంగ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ .. అందరూ చాలా బాగా కోపరేట్ చేశారని చెబుతున్న సెంథిల్ హిందీ సినిమా పనిచేయడం మొదటిసారి. ఇకపై కూడా ఏదైనా హిందీ సినిమా అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధంగానే వున్నాను. అయితే అవి ఏవైనా బాహుబలి 2 ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే. ప్రస్తుతానికి నా దృష్టంతా ఆ సినిమా మీదే వుందంటున్నాడు సెంథిల్. | 0business
|
indo israial
ఇండో-ఇజ్రాయెల్ పర్యాటకరంగంలో 13% వృద్ధి
హైదరాబాద్: ఇజ్రాయెల్ పర్యాటకరంగం వార్షికవృద్ధి గణనీయంగా పెరిగిందని, ఇజ్రాయెల్ను సంద ర్శిస్తున్న భారతీయ పర్యాటకుల సంఖ్య 13శాతం వృద్ధి చెందినట్లు ఇజ్రాయెల్పర్యాటకశాఖ డైరెక్టర్ హస్సన్ మదా వెల్లడించారు. గత ఏడాది ఐదునగరాల్లో రోడ్షోలు నిర్వహిస్తే ఈ ఏడాది నిర్వహించిన మూడు మెట్రోనగరాల రోడ్షోలకు మంచి స్పందన లభించిందన్నారు. గత ఏడాది 44,672 మంది భారతీయ పర్యాటకులు ఇజ్రాయెల్ను సందర్శించినట్లు వెల్లడిం చారు. ప్రపంచవ్యాప్తంగా పురావస్తు ప్రాంతాలు, ఘటనమైన సంస్కృ తి, మ్యూజియంలు ఆధునిక ఆకర్షణలు. స్నేహపూర్వకంగా ఇజ్రాయెల్ దేశస్తులు ఉంటారని అన్నారు. గత ఏడాది నిర్వహించిన ట్రావెల్ట్రేడ్ రోడ్షోకు 800మందికిపైగా ఈ రంగం ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. ఈఏడాది ఛండీగఢ్, అహ్మదాబాద్, హైదరాబాద్లలో రోడ్షోలు నిర్వ హించింది. నెట్వర్కింగ్ వర్క్షాప్ వేదికగా నిర్వహించామని, మంచి స్పందన లభించిందన్నారు. ఇజ్రాయెల్కు వెళుతున్న భారతీయుల సంఖ్య వృద్ధి కనిపించిందని, విశ్రాంత ఎంఐసి పర్యాటకుల సంఖ్యను పెంచేదిశగా చర్యలు చేపట్టిందన్నారు. వ్యాపార ప్రకటనలపై ఎక్కువ దృష్టిపెట్టామన్నారు. భారతీయ మార్కెట్లో తమదేశ పర్యాటక రంగ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టామని హసన్ మదా వెల్లడించారు. | 1entertainment
|
Hyderabad, First Published 3, Sep 2018, 11:27 AM IST
Highlights
'జబర్దస్త్' షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ మహేష్ ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటుడిగా బిజీ అయ్యాడు. 'రంగస్థలం' సినిమాలో హీరో పక్కనే ఉంటూ కామెడీ చేసే క్యారెక్టర్ లో కనిపించాడు మహేష్.
'జబర్దస్త్' షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ మహేష్ ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటుడిగా బిజీ అయ్యాడు. 'రంగస్థలం' సినిమాలో హీరో పక్కనే ఉంటూ కామెడీ చేసే క్యారెక్టర్ లో కనిపించాడు మహేష్. ఈ సినిమాతో నటుడిగా అతడికి మంచి గుర్తింపు లభించింది.
ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నాకొక పాత్ర ఇవ్వండి సార్.. అంటూ సుకుమార్ గారిని చాలా సార్లు అడిగాను. ఆయన గుర్తుపెట్టుకొని మరీ 'రంగస్థలం' సినిమాలో అవకాశం ఇచ్చారు. హీరోతో పాటు సినిమా మొత్తం ఉండే పాత్ర చేయడం ఇదే మొదటిసారి. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా పండించే పాత్రలో నన్ను తీసుకొని నాకు గుర్తింపు వచ్చేలా చేసిన ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్ గారికే దక్కుతుంది.
షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి గారు వచ్చి.. ఈ సినిమాతో నీకు చాలా గుర్తింపు వస్తుందయ్యా.. అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా చూస్తున్నప్పుడు.. 'ఏమో గురుగారు ఆ ఎత్తులు,పల్లాలు మీకే తెలియాలి.. ఓసారి చూశారుగా' అని నేను చెప్పిన డైలాగ్ కి తెగ నవ్వారు. ఆయన వెనుకే కూర్చున్న నేను చాలా ఆనందపడ్డాను'' అంటూ చెప్పుకొచ్చాడు.
Last Updated 9, Sep 2018, 12:36 PM IST | 0business
|
Hyderabad, First Published 17, Sep 2018, 3:25 PM IST
Highlights
బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ తో స్టార్ డైరెక్టర్ బోయపాటి సినిమా చేయబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 2 లో ఏ కంటెస్టెంట్ కి రాని క్రేజ్ కౌశల్ కి వచ్చింది
బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ తో స్టార్ డైరెక్టర్ బోయపాటి సినిమా చేయబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 2 లో ఏ కంటెస్టెంట్ కి రాని క్రేజ్ కౌశల్ కి వచ్చింది. అతడి కోసం కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ లో క్రేజ్ తెచ్చుకున్న వారితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు మేకర్స్.
తాజాగా కౌశల్ కి బోయపాటి సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. జగపతిబాబుని విలన్ గా పరిచయం చేసిన బోయపాటి ఇప్పుడు కౌశల్ ని విలన్ గా పరిచయం చేయబోతున్నాడని సమాచారం. దీనికి సంబంధించి బోయపాటి.. కౌశల్ తో చర్చించకపోయినా... బోయపాటి టీమ్ మాత్రం కౌశల్ భార్యని సంప్రదించినట్లు తెలుస్తోంది.
దానికి ఆమె సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో కౌశల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించారు. కానీ హీరో స్నేహితుల పాత్రలకే పరిమితమయ్యారు. ఆయనకి సినిమాల్లో ఆశించిన గుర్తింపు లభించకపోవడంతో సీరియళ్లతో బిజీగా మారారు.
బోయపాటి నిజంగానే కౌశల్ కి తన సినిమాలో అవకాశం ఇస్తే.. ఇక కెరీర్ పరంగా అతడు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అన్నీ కుదిరితే బాలయ్య సినిమాలో కౌశల్ విలన్ గా కనిపించే అవకాశం ఉంది.
Last Updated 19, Sep 2018, 9:28 AM IST | 0business
|
Sep 19,2016
మేగా లోన్మేళాకు అపూర్వ స్పందన
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఇండియన్ బ్యాంక్, హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం విశ్వేశ్వరయ్య భవన్లో ఏర్పాటు చేసిన 'మెగా లోన్ మేళా అండ్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్'కు నగరవాసుల నుంచి అపూర్వ స్పందన లభించింది. దేశ వ్యాప్తంగా రూ.2500 కోట్ల రిటైల్ రుణాల వితరణే లక్ష్యంగా ఇండియన్ బ్యాంక్ ఈ రెండు రోజుల మెగా లోన్ మేళాను నిర్వహించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఈడీ ఎ.ఎస్.రాజీవ్ మాట్లాడుతూ బ్యాంక్ రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగానే రుణ వితరణ వేగంగా జరిగేందుకు వీలుగా హైదరాబాద్లో ప్రత్యేక ఎంఎస్ఎంఈ శాఖను తెరినట్లుగా వివరించారు. కార్యక్రమంలో బ్యాంకు జోనల్ మేనేజర్ జి.లక్ష్మీపతిరెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంకు రూ.పది వేల కోట్ల వ్యాపార లక్ష్యాన్ని అధిగమించినట్లుగా వివరించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో సిబ్బంది పాత్ర మరవలేనిదని అన్నారు. కనిష్ట ఎన్పీఏలు, ఎక్కువ క్యాపిటల్ అడిక్వెసీ రేషియోతో బ్యాంకు విస్తరిస్తోందని తెలిపారు. విరివిగా రుణాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో మెగా మేళాను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. ఈ మేళాలో దాదాపు 15కు పైగా వివిధ స్థిరాస్తి సంస్థలు, వాహన షోరూమ్ల వారు స్టాల్స్ ఏర్పాటు చేశారు. రుణ మేళా ద్వారా జోన్ పరిధిలో దాదాపు రూ.175 కోట్ల విలువైన రుణాలకు మంజూరీ తెలపడంతో పాటు ఇందులో అధిక మొత్తంలో రుణ వితరణ కూడా జరిపినట్లుగా బ్యాంకు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వేదిక మీద కొందరికి రుణ పత్రాలను అందజేశారు. మెగా రుణమేళాలో ఇండియన్ బ్యాంక్ అధికారులు, సిబ్బందితో పాటు ఖాతాదారులు, ఔత్సాహిక ఎంఎస్ఎంఈ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
పవన్ వేదాంతం అర్ధమయ్యేది కాదు.. నటి వ్యాఖ్యలు!
Highlights
పవన్ కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా అతడి కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్. ఆ సినిమాలో పవన్ నటనతో పాటు చాలా క్యారెక్టర్లు అభిమానులకు గుర్తుండిపోయాయి
పవన్ కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా అతడి కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్. ఆ సినిమాలో పవన్ నటనతో పాటు చాలా క్యారెక్టర్లు అభిమానులకు గుర్తుండిపోయాయి. అందుకే ఒకటి పవన్ చెల్లెలి పాత్ర. ఆ పాత్రలో తమిళ నటి వాసుకి నటించింది.
సినిమాలో వీరిద్దరి మధ్య ఎమోషన్ బాగా పండింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో పరిచయం ఏర్పడడం, అది కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నామని వెల్లడించింది. అయితే తను ప్రేమిస్తోన్న విషయాన్ని అప్పట్లోనే పవన్ పసిగట్టారని అంటూ ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ తనకు ఎప్పటికీ మంచి స్నేహితుడని ఆయన ఎంత సరదాగా ఉంటారో చెప్పింది.
అలానే ఫిలాసఫీ బాగా చెప్పేవారనే విషయాన్ని బయటపెట్టింది. 'తొలిప్రేమ' సినిమా సమయానికి తన వయసు 18 ఏళ్లు మాత్రమే కావడంతో పవన్ చెప్పేవేదాంతం పెద్దగా తన బ్రెయిన్ కు ఎక్కేది కాదని కానీ ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు గుర్తుకువస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది నటి వాసుకి.
Last Updated 1, Aug 2018, 3:24 PM IST | 0business
|
వేతనం అక్కర్లేదు
- తిరస్కరించిన గుహ, విక్రమ్
నవతెలంగాణ, ముంబయి : సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ (సీఓఏ) సభ్యులుగా గౌరవ వేతనాన్ని మాజీ సభ్యులు చరిత్రకారుడు రామచంద్ర గుహ, నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ సీఈవో విక్రమ్ లిమామె తిరస్కరించారు. ఈ మేరకు బుధవారం బీసీసీఐ చీఫ్ ఫైనాన్షియల్ అధికారికి ఈ మెయిల్ పంపారు. 2017 నుంచి పాలకుల కమిటీ సభ్యులుకు నెలకు.10-12 లక్షల చొప్పున గౌరవ వేతనంగా సుప్రీంకోర్టు నిర్ణయించింది. 48 గంటల్లోగా సొమ్ము ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. 33 మాసాలు సీఓఏలో కొనసాగిన చైర్మన్ వినోద్ రారు, డయాన ఎదుల్జీలు సుమారు రూ. 3.6 కోట్లు అందుకోనున్నారు. ఇటీవల నూతనంగా వచ్చిన లెఫ్టినెంట్ కల్నల్ రవి సుమారు రూ. 1.17 కోట్లు అందుకోనున్నాడు. 2017లో నాలుగు నెలలు కొనసాగిన రామచంద్ర గుహ రూ. 40, ఏడు మాసాలు కొనసాగిన విక్రమ్ లిమాయె రూ. 70 లక్షల వరకూ వేతనం అందుకోవాల్సి ఉంది. ఈ మేరకు బీసీసీఐ సీఎఫ్ఓ వారికి లేఖలు రాశారు. పాలకుల కమిటీ తొలి సమావేశంలోనే ఎటువంటి వేతనం అవసరం లేదని రామచంద్ర గుహ, విక్రమ్ లిమాయె స్పష్టం చేశారు. కానీ డయాన ఎదుల్జీ వేతనం కావాల్సిందేనని పట్టుబట్టడంతో సమావేశానికి రూ. 1 లక్ష చొప్పున ఇవ్వాలని చైర్మన్ వినోద్ రారు నిర్ణయించారు. వేతనం అక్కర్లేదని ముందే చెప్పాం కాబట్టి, ఈ సొమ్ము తీసుకునేందుకు అంతరాత్మ అంగీకరించదని రామచంద్ర గుహ అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 2sports
|
Hyderabad, First Published 2, Sep 2019, 2:33 PM IST
Highlights
ఇటీవల సినీ తారలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు, కమెడియన్ అయిన కెవిన్ హార్ట్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. లాస్ ఏంజిల్స్ లో ఆదివారం రోజు మల్హోల్యాండ్ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఇటీవల సినీ తారలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు, కమెడియన్ అయిన కెవిన్ హార్ట్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. లాస్ ఏంజిల్స్ లో ఆదివారం రోజు మల్హోల్యాండ్ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది.
కెవిన్ అతడి స్నేహితులు కలసి ఈ కారులో ప్రయాణిస్తున్నారట. రహదారిపై వేగంగా ప్రయాణించడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న ఫెన్సింగ్ ని ఢీకొట్టింది. దీనితో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం పైభాగం మొత్తం ధ్వంసం అయింది.
కెవిన్ స్నేహితుడు కారుని డ్రైవ్ చేస్తున్నట్లు సమాచారం. కెవిన్ తో పాటు, అతడి స్నేహితుడికి నడుము భాగంలో తీవ్రమైన గాయం అయింది. కెవిన్ స్నేహితుడిని పెట్రోలింగ్పోలీసులు హెలికాఫ్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
కెవిన్ ని అతడి వ్యక్తిగత సిబ్బంది మరో కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కెవిన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేదానిపై సమాచారం లేదు. కెవిన్ సినిమాల్లోనూ, బుల్లితెరపై ప్రముఖ నటుడిగా రాణిస్తున్నాడు. | 0business
|
రోహిత్ విధ్వంసక ఇన్నింగ్స్ (వీడియో)
Highlights
రోహిత్ విధ్వంసక ఇన్నింగ్స్ (వీడియో)
అన్నింటా ఆఖరి బంతి వరకు పోరాడినా అదృష్టం మొఖం చాటేసిన వేళ.. ఈసారి ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. తొలి రెండు బంతులకే రెండు వికెట్లు కోల్పోయిన ఈ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 94)తో పాటు ఓపెనర్ ఎవిన్ లూయిస్ (42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65) సూపర్ బ్యాటింగ్తో చిరుదరహాసం చేసింది. ఫలితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో అన్నింటా రాణించిన ముంబై 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 213 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ స్కోరు ఛేదన కోసం దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. కోహ్లీ (62 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. | 2sports
|
Nov 11,2015
కార్ల కంపెనీలకు పండుగ
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు భారీగా పెరిగాయి. పండుగకు వారం రోజుల ముందు అన్ని ప్రధాన కంపెనీలు భారీ ఆఫర్లతో కొనుగోలుదార్లను ఆకర్షించే ప్రకటనలతో ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాల్లో ఏకంగా 30-70 శాతం వృద్ధి నమోదయ్యిందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త మోడళ్ల అయినా హ్యుందారు 'క్రెటా', మారుతీ సియాజ్, మహీంద్రా టీయూవీ 300, రెనో క్విడ్లకు ప్రధానంగా ఎక్కువ మద్దతు లభిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా అక్టోబర్ కార్ల అమ్మకాల్లో 21.8 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. క్రితం మాసంలో మొత్తంగా 1,94,158 కార్ల అమ్మకాలు జరిగాయని 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్పాక్చరర్స్' (సియోమ్) తెలిపింది. 2014 ఇదే మాసంలో 1,59,408 యూనిట్లు విక్రయమయ్యాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బాలయ్య రెండో మనవడు ఎంత ముద్దుగున్నాడో!!
నేను మరోసారి తాతనయ్యా.. అంటూ మనవడు పుట్టిన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు నందమూరి బాలకృష్ణ.
Samayam Telugu | Updated:
Mar 25, 2018, 05:23PM IST
బాలయ్య రెండో మనవడు ఎంత ముద్దుగున్నాడో!!
నేను మరోసారి తాతనయ్యా.. అంటూ మనవడు పుట్టిన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు నందమూరి బాలకృష్ణ . ఆయన రెండో కూతురు తేజస్విని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా తనకు మనవడు పుట్టిన విషయాన్ని అధికారికంగా తెలియజేశారు బాలయ్య. ప్రశాంతంగా నిద్రపోతున్న పాలబుగ్గల పసి మనవడు ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేస్తూ అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు బాలయ్య.
“మరోసారి తాతయ్య అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మా రెండో అమ్మాయి తేజస్విని - అల్లుడు శ్రీభరత్ మగబిడ్డకు తల్లితండ్రులైన శుభసందర్భంగా వాళ్ళకు దేవుడు సదా ప్రేమను ఆనందాన్ని పంచుతూనే ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు బాలయ్య. ప్రస్తుతం బాలయ్య షేర్ చేసిన తన మనవడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా బాలయ్య మనవడు ఇడిగో.. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి అంటూ ఈ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు ఆయన అభిమానులు.
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మనవడైన శ్రీభరత్తో తేజస్విని వివాహం 2013లో జరిగింది. వివాహానంతరం వారిరువురు అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి వచ్చారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
IndiGo: ఇండిగో విమాన చార్జీలు పెరిగాయ్
విమాన ఇంధన ధరల పెరుగుదలతో టికెట్ రేట్లు సైతం ప్రియం అయ్యాయి. అన్నింటికన్నా ముందుగా.. ఇండిగో ఎయిర్లైన్స్ ఈ పరిణామానికి తెరతీసింది
Samayam Telugu | Updated:
May 30, 2018, 05:39PM IST
విమాన ఇంధన ధరల పెరుగుదలతో టికెట్ రేట్లు సైతం ప్రియం అయ్యాయి. అన్నింటికన్నా ముందుగా.. ఇండిగో ఎయిర్లైన్స్ ఈ పరిణామానికి తెరతీసింది. దేశీయ మార్గాల్లో తిరిగే విమాన టిక్కెట్లపై రూ.400 దాకా ఇంధన సర్చార్జీ విధించాలని నిర్ణయించింది. 1000 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు సంబంధించిన టికెట్లపై రూ. 200, అంతకు మించిన దూర ప్రయాణాలపై రూ.400 సర్చార్జీ ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
ఈ నెల (మే)30 నుంచి కొత్త చార్జీల అమలు ఉంటుందని ఇండిగో తెలిపింది. అటు ఇంధన ధరలు(ఏటీఎఫ్) రేటు పెరగడానికి, ఇటు రూపాయి క్షీణత కూడా జత కలవడంతో ఎయిర్లైన్స్పైన అదనపు నిర్వహణ భారం పడుతున్నట్లు ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ వెల్లడించారు.
మరో వైపు ఇండిగో ప్రయాణికులకు ఒక శుభవార్త తెలిపింది. కొత్త విమానాల రాకను గురించి ప్రకటించింది. దీంతో కొత్త మార్గాల్లో ప్రయాణాలను ఈ సంస్థ మొదలుపెట్టనుంది. ముఖ్యంగా జూలై 1 నుంచి బెంగళూరు నుంచి వారణాసి మరియు బెంగళూరు నుంచి చండీగఢ్ మధ్య రోజువారీ విమాన సర్వీసులు నడుపుతాయన్నారు. రాంచీ నుంచి బెంగుళూరు మరియు బెంగళూరు నుంచి ఇండోర్ కు మధ్య రోజువారీ విమాన సర్వీసులు నడుపుతామన్నారు.
ఇండిగో విమాన ఛార్జీలు | 1entertainment
|
అమెరికాకు చెందిన "వెల్స్కో"ను టేకోవర్ చేసిన ఇన్ఫోటెక్!
Hanumantha Reddy|
హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ సేవలు అందించే ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ సంస్థ అమెరికాకు చెందిన "వెల్స్కో" కంపెనీని టేకోవర్ చేసినట్టు ప్రకటించింది. అయితే ఎంత మోత్తానికి వెల్స్కోను టేకోవర్ చేసిందనే విషయాన్ని కంపెనీ ప్రస్తావించలేదు. అమెరికాకు చెందిన వెల్స్కో కంపెనీ టెలికమ్యూనికేషన్స్కు సంబంధించిన నెట్వర్కింగ్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ సేవలను అందిస్తోంది.
జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఇన్ఫోటెక్ నికరలాభం రూ.22.15 కోట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42.72శాతం తక్కువ. ఈ కంపెనీ మొత్తం 7,600 మంది నిపుణులతో ఇంజనీరింగ్ సర్వీసులను అందిస్తోంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్సేంజ్లో ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ షేర్స్ రూ. 168.45 వద్ద ట్రేడ్ అవుతుండగా ఈ ఒప్పందంతో కంపెనీ షేర్ విలువలు 4.47శాతానికి పెరిగాయి.
సంబంధిత వార్తలు | 1entertainment
|
ట్విస్టులతో జైలవకుశ ట్రైలర్ వస్తోంది
Highlights
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జై లవ కుశ
సెప్టెంబర్ 9న రిలీజ్ కానున్న జై లవకుశ
ట్విస్టులతో జైలవకుశ ట్రైలర్ వస్తోంది
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా 'జై లవ కుశ'ను ఎట్టాగో టైముకే దించుతున్నారు. సెప్టెంబర్ 9న చెప్పినట్లే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు కళ్యాణ్ రామ్ అండ్ కో. అయితే మొన్ననే ఆడియోను డైరక్టుగా మార్కెట్లోకి రిలీజ్ చేసేసినా కూడా.. ఇప్పుడు ట్రైలర్ ను మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం అట్టిపెట్టారంట. అయితే ఈ ట్రైలర్ కోసం ఓ రెండు మూడు వర్షన్లు మాత్రం తెగ్గొట్టినట్లు తెలుస్తోంది. ఎందుకలా
నిజానికి జై లవ కుశ సినిమాలో మొదటి నుండి మనం విలన్ అనుకునే క్యారక్టర్ చివరకు హీరో అవ్వడం. హీరో అనుకునేవాడు విలన్ అవ్వడం వంటి వినూత్న స్ర్కీన్ ప్లే ఏదో రాశారట కోన వెంకట్ వారు. దీనికి సంబంధించి మొదటి భాగంలో ఒక ట్విస్టు. రెండో భాగంలో మరో ట్విస్టు ఉందట. ఈ ట్విస్టుల గురించి జనాలకు తెలియకుండా ఉండేలా ఒక ట్రైలర్ కట్ చేయిస్తే. అది హీరో సాబ్ కు నచ్చలే. అలాగని తెలిసేలా కట్ చేస్తే అది ప్రొడ్యూసర్ సాబ్ కు నచ్చలే. అందుకే వీటికి మధ్యస్థంగా ఉండే ఒక కొత్త ట్రైలర్ ను కట్ చేశారటలే.
అయితే ఇలా సినిమాలో రెండు ట్విస్టులే మెయిన్ అని తెలిసిపోవడంతో.. అవి కాకుండా సినిమాలో ఏముంది అనే సందేహం జనరల్ గానే వస్తుంది. కాకపోతే ఇక్కడ మాత్రం.. అసలు ఆ రెండు ట్విస్టులు ఏంటి అంటూ కూడా అందరూ ఆలోచిస్తున్నారు. జై క్యారక్టర్ విలన్ కాదు హీరో అంటారా? అమాయకంగా ఉండే లవ క్యారక్టర్లో డార్క్ షేడ్ ఉందంటారా లెటజ్ సీ.
Last Updated 26, Mar 2018, 12:03 AM IST | 0business
|
Hyderabad, First Published 10, Aug 2019, 2:37 PM IST
Highlights
నటి ఆండ్రియా పేరు చెప్పగానే కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం గుర్తొస్తుంది. విశ్వరూపం రెండు భాగాలలో ఆండ్రియా కీలక పాత్రలో నటించింది. తమిళంలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు చేసినా సెకండ్ హీరోయిన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు మాత్రమే పరిమితం అయింది. ఆండ్రియా సింగర్ కూడా.
నటి ఆండ్రియా పేరు చెప్పగానే కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం గుర్తొస్తుంది. విశ్వరూపం రెండు భాగాలలో ఆండ్రియా కీలక పాత్రలో నటించింది. తమిళంలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు చేసినా సెకండ్ హీరోయిన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు మాత్రమే పరిమితం అయింది. ఆండ్రియా సింగర్ కూడా.
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాడా చెన్నై' చిత్రం తర్వాత ఆండ్రియా సినిమాలు తగ్గించింది. అందుకుగల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఆండ్రియా ప్రస్తుతం పలు ఈవెంట్స్ లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.
వాడా చెన్నై చిత్రం సమయంలో తాను పెళ్ళైన ఓ ప్రముఖ వ్యక్తితో రిలేషన్ షిప్ పెట్టుకున్నానని తెలిపింది. కొన్ని రోజుల వరకు అతడు తనతో బాగానే ఉన్నా ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడని తెలిపింది. అతడి నుంచి దూరమయ్యాక బాగా డిప్రెషన్స్ కు గురయ్యా. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి.
ట్రీట్మెంట్ తర్వాత డిప్రెషన్స్ నుంచి కోలుకుని ప్రస్తుతం మళ్ళీ పనిలో బిజీ అయ్యానని ఆండ్రియా తెలిపింది. ఇంతకీ తాను రిలేషన్ కొనసాగించిన వ్యక్తి పేరు మాత్రం ఆండ్రియా బయటపెట్టలేదు. ఆండ్రియా తెలుగులో తడాఖా చిత్రంలో నటించింది. గతంలో ఆండ్రియా ప్రేమ వ్యవహారాల గురించి అనేక రూమర్స్ వినిపించాయి.
Last Updated 10, Aug 2019, 3:39 PM IST | 0business
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి | 1entertainment
|
Visit Site
Recommended byColombia
ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ (ఈఎస్వోపీ)లను 100 శాతం బై బ్యాక్ చేస్తామని ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బిన్నీ బన్సల్ తెలిపారు. తద్వారా ఈఎస్వోపీలు కలిగిన 3 వేల మందికి పైగా ఉద్యోగులు ఒక్కో షేర్ ద్వారా రూ.10 వేలు (150 డాలర్లు)ను పొందనున్నట్టు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఫోన్పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్, మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అమోద్ మాలవీయ, వైబ్ఫార్మ్ ఉడాన్ ఆపరేషన్స్ మాజీ ప్రెసిడెంట్ సుజీత్ కుమార్, క్యూర్ఫిట్ హెల్త్ కేర్ ప్లాట్ఫాం యజమాని (ఫ్లిప్కార్ట్ మాజీ ఉద్యోగి) అంకిత్ నగోరి, ఉద్యమ్ లెర్నింగ్ మాజీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ మేకిన్ మహేశ్వరి, మింత్రా, జబాంగ్ సీఈవో అనంత్ నారాయణ్ సహా పలువురు ఫ్లిప్కార్ట్ ఉన్నతోద్యోగులు, మాజీ ఉద్యోగులు ఈ బై బ్యాక్ ద్వారా కోటీశ్వరులు కాబోతున్నారు. మరో వైపు ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ కంపెనీలో తనకున్న 6% వాటాను విక్రయిస్తున్నారు. ప్రతిఫలంగా ఆయనకు లభించే రూ. 6700 కోట్లలో 20శాతం మూలధన రాబడి పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ గ్రూప్ సీఈవో, బిన్నీ బన్సల్, చైనా ఇన్వెస్ట్²మెంట్ దిగ్గజం టెన్ సెంట్, టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు తన వాటాను కొనసాగించనున్నాయి
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘జియో’గదారులకు శుభవార్త!
అపరిమిత 4జీ డాటా, వాయిస్ కాల్స్, మెసేజ్లను ఉచితంగా అందిస్తోన్న రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ఈ సేవలను మరో మూడు నెలల పాటు అందించనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
TNN | Updated:
Oct 24, 2016, 05:14PM IST
అపరిమిత 4జీ డాటా, వాయిస్ కాల్స్, మెసేజ్‌లను ఉచితంగా అందిస్తోన్న రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ఈ సేవలను మరో మూడు నెలల పాటు అందించనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ఉచిత సేవలతో కూడిన ‘జియో వెల్‌కమ్ ఆఫర్’ డిసెంబర్ 31 వరకు అందిస్తామని రిలయన్స్ జియో ఇదివరకే ప్రకటించింది. అయితే టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో ఈ మధ్య జరిగిన సమావేశం అనంతరం వెల్‌కమ్ ఆఫర్ డిసెంబర్ 3తో ముగుస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఉచిత సేవలు మాత్రం డిసెంబర్ 31 వరకు వినియోగదారులకు అందుతాయని జియో స్పష్టం చేసింది.
మరోవైపు జియో ఉచిత సేవలను మార్చి వరకు పొడిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమ సర్వీసులపై వినియోగదారులు సంతృప్తికరంగా లేరని ట్రాయ్, ప్రభుత్వానికి వివరించినట్లు జియో స్ట్రాటజీ, ప్లానింగ్ విభాగాధిపతి అన్షుమన్ ఠాకూర్ వెల్లడించారు. ఇంటర్ కనెక్షన్ రద్దీ వల్ల జియో వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కూడా వివరించామని తెలిపారు. ఏదేమైనప్పటికీ వినియోగదారుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాణ్యతతో కూడిన సేవలు అందజేయడమే జియో లక్ష్యమని చెప్పారు. దీని కోసం జియో యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
జియో ఉచిత సర్వీసులను డిసెంబర్ తరవాత కూడా కొనసాగించడానికి ట్రాయ్ అనుమతి పొందాల్సిన అవసరం కూడా లేదని ఠాకూర్ చెప్పారు. దీనిని బట్టి చూస్తే జియో ఉచిత సర్వీసులను రిలయన్స్ సంస్థ మరిన్ని రోజులు పొడిగించే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే జియో వినియోగదారులకు నిజంగా శుభవార్తే కదా! | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఆరో స్థానంలో నిలిచిన ‘గీతగోవిందం’
ఈ ఏడాది బెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ పొందిన సినిమాల్లో ఆరో స్థానంలో నిలుస్తోంది గీతగోవిందం.
Samayam Telugu | Updated:
Aug 17, 2018, 11:08AM IST
ఈ ఏడాది బెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ పొందిన సినిమాల్లో ఆరో స్థానంలో నిలుస్తోంది గీతగోవిందం . యూత్లో ఫుల్ క్రేజ్తో విడుదల అయిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ను రాబట్టుకుంది. ముందస్తు అంచనాలతో దీనికి భారీ ఓపెనింగ్స్ సాధ్యం అయ్యాయి. ఎంతలా అంటే.. ఈ ఏడాదిలో తొలి రోజున భారీ కలెక్షన్స్ పొందిన సినిమాల్లో ఆరో స్థానంలో నిలిచేలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.
ఈ సినిమా తొలి రోజున 5.8 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించిందని తెలుస్తోంది. దాదాపు 14 కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందిన ఈ సినిమాకు ఇవి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ అని వేరే చెప్పనక్కర్లేదు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి గీతగోవిందం ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని పలికింది. కేవలం తొమ్మిది కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించినా ఈ ప్రాజెక్ట్ సేఫ్ వెంచర్ అవుతుంది. సూపర్ హిట్ దిశగా దూసుకుపోయేలా.. ఉన్నాయి దీని ఓపెనింగ్స్.
ఎలాగూ పాజిటివ్ టాక్ పొందింది కాబట్టి.. వీకెండ్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టుకునే అవకాశం ఉంది. దీంతో దీనికి లాభాల పంట పండటం ఖాయం. ఇక ఈ ఏడాదిలో విడుదల అయిన సినిమాల్లో తొలి రోజున భారీ వసూళ్లను పొందిన సినిమాల జాబితా ఇలా ఉంది...
1)అజ్ఞాతవాసి- రూ.23.36 కోట్లు
2)భరత్ అనే నేను-రూ.22.24 కోట్లు
3)రంగస్థలం-రూ.19.70 కోట్లు
4)నా పేరు సూర్య-రూ.16.28 కోట్లు
5)జై సింహా-రూ.6.85 కోట్లు
6)గీతగోవిందం-రూ.5.80 కోట్లు
7)భాగమతి-రూ.5.14 కోట్లు
8)కృష్ణార్జునయుద్ధం -రూ.4.61 కోట్లు
9)టచ్ చేసి చూడు-రూ.4.16 కోట్లు
10)నేల టికెట్ -రూ.3.37 కోట్లు | 0business
|
News Room 365 WATCH LIVE TV
బాహుబలి చాన్స్ అలా మిస్సయ్యిందట
ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో బాగా వినపడుతున్న పేరు సాయి మాధవ్ బుర్రా.. డైలాగ్స్ రాయడంలో తనకంటూ ఓ స్టయిల్ను క్రియేట్ చేసిన ఈ రచయిత రీసెంట్గా ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి వంటి రెండు పెద్ద సినిమాలకు మాటలు రాశాడు.
TNN | Updated:
Jan 21, 2017, 05:51PM IST
ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో బాగా వినపడుతున్న పేరు సాయి మాధవ్ బుర్రా.. డైలాగ్స్ రాయడంలో తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసిన ఈ రచయిత రీసెంట్‌గా ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి వంటి రెండు పెద్ద సినిమాలకు మాటలు రాశాడు. వాటికొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరి నోటి ద్వారా ఈ డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అంతగా ఇంపాక్ట్ చేశాయి.
మరి ఇటువంటి రచయితకు బాహుబలి సినిమాలో స్థానం ఎందుకు దక్కలేదో.. ఆయనే స్వయంగా చెప్పడం విశేషం. నిజానికి బాహుబలి సినిమా సిట్టింగ్స్‌లో సాయి మాధవ్ కూడా ఉన్నారట. స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు రాజమౌళి మీతో పాటు సినిమాకు మరో రచయిత కూడా పని చేస్తారని చెప్పారట. దీంతో సాయి మాధవ్ బుర్రా వెంటనే సినిమాకు ఒక్క రచయిత ఉంటేనే బావుంటుంది అలా అయితేనే నేను పనిచేస్తానని చెప్పారట. | 0business
|
Visit Site
Recommended byColombia
సానుకూల అంతర్జాతీయ పరిస్థితులు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ అందుకోవడానికి దేశీ జువెలర్ల నుంచి కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు బంగారంపై పాజిటివ్ ప్రభావం చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 0.09 శాతం పెరుగుదలతో 1,283.40 డాలర్లకు చేరింది. అయితే వెండి ధర మాత్రం ఔన్స్కు 15.39 డాలర్లకు తగ్గింది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.33,200కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.33,050కు పెరిగింది. కాగా బంగారం ధర గత రెండు సెషన్లలో రూ.140 మేర తగ్గింది.
ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.25,500ల వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర స్థిరంగా రూ.40,100 వద్ద కొనసాగితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.58 తగ్గుదలతో రూ.39,140కి క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.77,000 ఉండగా.. అమ్మకం ధర రూ.78,000గా స్థిరంగా కొనసాగాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Team india
టీమిండియాకు కొత్త జెర్సీ
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో కొత్త కెప్టెన్తో పాటు మరో రెండు రోజుల్లో సీజన్ తొలి మ్యాచ్ను టీమిండియా ఆరంభించనుంది. వీటికి తోడు భారత్ జెర్సీలో కూడా మార్పులు చేసి వన్డే జట్టు నూతన జెర్సీని బిసిసిఐ గురువారం ఆవిష్కరించింది.ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు నైకి సంస్థ దుస్తులతో పాటు వివిధ పరికరాలకు స్పాన్సర్షిప్గా వ్యవహరిస్తుంది.ప్లాస్టిక్ బాటిల్స్ను రి సైకిల్ చేయగా వచ్చిన ఉత్ప త్తులతో 2015లో జెర్సీని తయారు చేసిన నైకి ఈ ఏడాది వెరైటీ డిజైన్లతో జెర్సీని రూపొం దించింది.భుజాలపై త్రివర్ణ రంగులతో చారలను ముద్రించింది.వచ్చే ఆదివారం నుంచి పర్యాటక జట్టు ఇంగ్లండ్తో జరుగనున్న తొలి వన్డే మ్యాచ్లో భారత్ తలపడనుంది | 2sports
|
Hyderabad, First Published 2, May 2019, 7:34 PM IST
Highlights
బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి రాబోతున్న యాక్షన్ అడ్వెంచర్ సాహో షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ గత కొన్ని రోజుల క్రితం ముంబైలో మొదలయ్యింది.
బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి రాబోతున్న యాక్షన్ అడ్వెంచర్ సాహో షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ గత కొన్ని రోజుల క్రితం ముంబైలో మొదలయ్యింది. అయితే సినిమా షూటింగ్ లో రెస్ట్ లేకుండా పాల్గొన్న ప్రభాస్ తన పాత్రకు సంబందించిన వర్క్ ని ఫినిష్ చేశాడు.
విలన్స్ కి సంబందించిన కొన్ని సీన్స్ ని ఫినిష్ చేస్తే సాహో షూటింగ్ పూర్తవుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ఆగస్ట్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. అలాగే రెగ్యులర్ ప్రమోషన్స్ ని కూడా మొదలెట్టాలని యువీ క్రియేషన్స్ ప్లాన్ చేసుకుంటోంది.
శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శంకర్ ఏ హాసన్ లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక హిందీలో టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సాహో సినిమాను భారీగా రిలీజ్ చేయనున్నారు.
Last Updated 2, May 2019, 7:34 PM IST | 0business
|
Hyderabad, First Published 11, Apr 2019, 2:19 PM IST
Highlights
సార్వత్రిక ఎన్నికల్లో నేడు తొలిదశ పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల కోసం కొన్ని నెలలుగా జరిగిన ప్రచారంలో సినీ తారలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
సార్వత్రిక ఎన్నికల్లో నేడు తొలిదశ పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల కోసం కొన్ని నెలలుగా జరిగిన ప్రచారంలో సినీ తారలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కొందరు సినీతారలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు మద్దతిచ్చి ప్రచారంలో పాల్గొన్నారు.
సినీ నటి ఖుష్బూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంది. బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రిజ్వాన్ కి మద్దతుగా ఆమె ఏప్రిల్ 10న ప్రచారం నిర్వహించారు. ప్రచారమనంతరం ఆమె ఇంటికి వెళ్లడానికి కారు దగ్గరకి వెళ్తుండగా.. అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరారు.
ఖుష్బూ కారు ఎక్కేందుకు వెళుతుండగా.. ఆమెని కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టారు. అక్కడున్న పోలీసులకు కూడా వారిని అదుపుచేయడం కుదరలేదు. ఆ సమయంలో ఓ కార్యకర్త ఖుష్బూతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
వెంటనే ఆమె సదరు కార్యకర్త చెంప చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంటనే పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఖుష్బూ.. విశాల్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు.
This is called Kapala Moksha in Kannada. @khushsundar slapped a man who tried to misbehave with her while campaigning for Bengaluru Central Candidate. Even few lady reporters who are subjected to this kind of harassment should learn from Kushboo. #LokSabhaElections2019 pic.twitter.com/v5ZuFDTTZa
— Sagay Raj P (@sagayrajp) April 10, 2019
Last Updated 11, Apr 2019, 2:19 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఆస్ట్రేలియాపై మూడో టెస్టు విజయానికి 2 వికెట్ల దూరంలో భారత్
ఆస్ట్రేలియా జట్టు విజయానికి ఇంకా 141 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో ఆదివారం భారత్ గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది.
Samayam Telugu | Updated:
Dec 29, 2018, 02:25PM IST
India's Mohammed Shami (R) celebrates after dismissing Australia's Aaron Finch ...
ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు గెలుపు ముంగిట నిలిచింది. ఆటలో నాలుగో రోజైన శనివారం 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు ఈరోజు ఆట ముగిసే సమయానికి 258/8తో ఓటమి అంచున నిలబడింది. ప్రస్తుతం క్రీజులో పాట్ కమిన్స్ (61 బ్యాటింగ్: 103 బంతుల్లో 5x4, 1x6) ఒంటరి పోరాటం చేస్తుండగా.. అతనికి నాథన్ లయన్ (6 బ్యాటింగ్: 38 బంతుల్లో) చక్కటి సహకారం అందిస్తున్నాడు. అయితే.. ఆ జట్టు విజయానికి ఇంకా 141 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో ఆదివారం భారత్ గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/82), జస్ప్రీత్ బుమ్రా (2/53) మహ్మద్ షమీ (2/71), ఇషాంత్ శర్మ (1/37) సమష్టిగా రాణించారు. | 2sports
|
తీన్మార్ దరువుకు రాహుల్ స్...
బిచ్చగాడుగా కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టిన విజయ్ ఆంటోని ఇప్పుడు 'సైతాన్' గా మారిపోయాడు. బిచ్చగాడు సినిమాతో అటూ తమిళ ప్రేక్షకులకే గాక, ఇటూ తెలుగులోనూ మంచి అభిమానాన్ని సంపాందించుకున్న నటుడు విజయ్ అంటోనీ. తమ సొంత బ్యానర్ అయిన 'ఫాతిమా విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్' నుండి విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా వచ్చిన 'బిచ్చగాడు' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు అదే బ్యానర్ లో ' సైతాన్ ' అనే సినిమాను రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోనీ, అరుంధతి నాయర్ ప్రధాన పాత్రలుగా ఫాతిమా ఆంటోని నిర్మాణ సారథ్యంలో దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి 'సైతాన్' అనే పేరుతో ఈ హారర్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నది ఈ సినిమా హీరో విజయ్ అంటోనే కావడం మరో విశేషం. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఆ టీజర్ ను ఓ సారి చూసేయండి.
Vijay Antony's Saitan
Vijay Antony's Saitan
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
షాక్.. ప్రభాస్ విలన్ మృతి
Highlights
బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా మరణించారు
55 ఏళ్ళ ఆయన బుధవారం ఉదయం గుండెపోటుతో కన్ను మూశారు
పలు సూపర్ హిట్ తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా మరణించారు. 55 ఏళ్ళ ఆయన బుధవారం ఉదయం గుండెపోటుతో కన్ను మూశారు. తెలుగులో యమదొంగ, లెజెండ్, ఛత్రపతి తదితర సినిమాల్లో నటించిన ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించాడు.2002 లో ” ఫంటూష్ ” సినిమాతో బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన నరేంద్ర ఝా.. గదర్, మొహెంజోదారో, రాయీస్ లాంటి చిత్రాల్లో నటించాడు. సల్మాన్ ఖాన్ హీరోగా విడుదల కానున్న ” రేస్-3 ” ఆయన నటించిన చివరి చిత్రం. ఆయన మృతి పట్ల బాలీవుడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
డబుల్ హ్యాట్రిక్కి అడుగు దూరంలో కోహ్లి..!
మొహాలి వేదికగా ఈరోజు నాలుగో వన్డే జరగనుండగా.. ఈ మ్యాచ్లో కోహ్లీ శతకం సాధిస్తే..? వన్డేల్లో రెండుసార్లు హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్గా రికార్డుల్లో నిలవనున్నాడు.
Samayam Telugu | Updated:
Mar 10, 2019, 12:36PM IST
డబుల్ హ్యాట్రిక్కి అడుగు దూరంలో కోహ్లి..!
హైలైట్స్
వెస్టిండీస్పై గత ఏడాది హ్యాట్రిక్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ
తాజాగా ఆస్ట్రేలియాపై ఇప్పటికే వరుసగా రెండు శతకాలు
మొహాలి వేదికగా ఈరోజే నాలుగో వన్డే
ఈరోజు సెంచరీ సాధిస్తే.. అరుదైన రికార్డ్ నెలకొల్పనున్న కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో వరుసగా రెండు శతకాలు బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అరుదైన ప్రపంచ రికార్డ్కి సెంచరీ దూరంలో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కేవలం 44 పరుగులే చేసి ఔటైన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత నాగ్పూర్లో జరిగిన రెండో వన్డేలో 116, రాంచీ వన్డేలో 123 పరుగులతో సత్తాచాటాడు.
మొహాలి వేదికగా ఈరోజు నాలుగో వన్డే జరగనుండగా.. ఈ మ్యాచ్లో కోహ్లీ శతకం సాధిస్తే..? వన్డేల్లో రెండుసార్లు హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్గా రికార్డుల్లో నిలవనున్నాడు. వెస్టిండీస్తో 2018లో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో 140, 157*, 107 పరుగులతో విరాట్ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే.
క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకూ వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లితో పాటు ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), గిబ్స్(దక్షిణాఫ్రికా), రాస్ టేలర్ (న్యూజిలాండ్) తదితరులు ఉన్నారు. ఇక వరుసగా నాలుగు శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్గా శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర రికార్డుల్లో ఉన్నాడు. వెస్టిండీస్పై గత ఏడాది ఈ రికార్డ్ని కోహ్లీ బ్రేక్ చేసేలా కనిపించాడు. ఐదు వన్డేల ఆ సిరీస్లో తొలి మూడు వన్డేల్లోనూ వరుసగా 100 పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ.. చివరి రెండు వన్డేల్లో విఫలమయ్యాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Visit Site
Recommended byColombia
అయితే ఏడు చేపల కథ ఫీవర్ కొనసాగుతుండగానే మరో సినిమాను రిలీజ్కు సిద్ధం చేశాడు అభిషేక్ రెడ్డి. వైఫ్ ఐ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా ఏడు చేపల కథ తరహాలోనే బోల్డ్ కంటెంట్తో రూపొందుతోంది. నైఫ్ ఈజ్ బెటర్ దాన్ వైఫ్ అనై ట్యాగ్ లైన్తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ సినిమాకు కూడా ఏ సర్టిఫికేటే వచ్చింది.
Also Read: వెక్కి వెక్కి ఏడుస్తున్న పప్పు.. చుక్కలు చూపిస్తున్న వర్మ
ఒకరు ప్రవర్తనతో ఒకరు విసిగిపోయిన భార్యా భర్తల కథతో రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కుతోంది. అభిషేక్ భార్య సాక్షి నిదియా నటిస్తున్న ఈ సినిమాలో కావ్య, సునీల్ నగరం, సూర్య ఆకొండి, మహేష్ విట్టా, అపర్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. | 0business
|
Oct 25,2015
ఆర్ఇసి పన్ను రహిత బాండ్లు
న్యూఢిల్లీ : ఇప్పటికే ఎన్టిపిసి, పిఎఫ్సి పన్ను రహిత బాండ్లు జారీ చేసి విజయవంతంగా నిధులు సమీకరించుకున్నాయి. ఇదే బాటలో మరో ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఇసి) నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27న ఆర్ఇసి రూ.700 కోట్ల పన్ను రహిత నాన్ కన్వర్టెబుల్ బాండ్లను విడుదల చేయనుంది. ఈ బాండ్లకు క్రిసిల్, ఇక్రా, కేర్ సంస్థలు ఎఎఎ రేటింగ్ను ఇచ్చాయి. సాధారణ ఫారంతోనూ ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. రూ.1000 విలువ చేసే కనీసం 5 బాండ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రిటైల్ కేటగిరీలో రూ.10 లక్షల వరకు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్లు బిఎస్ఇలో లిస్టెడ్ అయ్యాయి. ఈ ఇష్యూ అక్టోబర్ 27న ప్రారంభమవుతుంది. తొలుత వచ్చిన వారికి ముందు కేటయింపులు పద్దతిని అనుసరిస్తుంది. 10, 15, 20 ఏళ్ల కాలపరిమితితో ఈ బాండ్లను జారీ చేస్తోంది. 10 ఏళ్ల బాండ్లపై కార్పొరేట్ వారికి 6.89 శాతం, రిటైల్ వారికి 7.14 శాతం వడ్డీ చెల్లించనుంది. 15 ఏళ్ల బాండ్లపై 7.09 శాతం, 7.34 శాతం చొప్పున, 20 ఏళ్ల బాండ్లపై 7.18 శాతం, 7.43 శాతం చొప్పున వడ్డీ రేటును చెల్లించనుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Suresh 179 Views
ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ 3వ రౌండ్లోకి సానియా జోడీ ప్రవేశించింది. ఇవాళ జరిగిన రెండో రౌండ్లో సానియా మిర్జా, డాడ్గీ జోడీ ఖరేషి, షేవడోవా జోడీపై తొలి సెట్ను టైబ్రేక్లఓ 7-5 స్కోరుతో గెలుచుకుంది. కాగా 2వ సెట్ ఏకపక్షంగా సాగింది. 6-2 స్కోరుతో గెలుచుకుని 3వ రౌండ:లోకి ప్రవేశించింది. వీరి మ్యాచ్ 68నిముషాలు మాత్రమే కొనసాగింది. | 2sports
|
Hyderabad, First Published 7, May 2019, 11:21 AM IST
Highlights
మంగళవారం అక్షయ తృతీయ సందర్భంగా రిలయన్స్ డిజిటల్, జోయాలుక్కాస్, మలబార్ తదితర సంస్థలు తమ వినియోగదారులకు స్సెషల్ ఆపర్లు ప్రకటించాయి.
హైదరాబాద్: అక్షయ తృతీయ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ తమ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొనుగోలుదారులు 5 గ్రాముల బంగారం, 5 శాతం క్యాష్బ్యాక్ గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
మంగళవారం అన్ని రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్లతోపాటు అధికారిక వెబ్సైట్ www.reliancedigit al.inలో చేసే కొనుగోళ్లకు ఈ సదుపాయం వర్తిస్తుందని తెలిపింది. అంతేగాక సులభ వాయిదా పద్ధతుల్లో, తక్కువ ధరలకే నచ్చిన ఉత్పత్తులను సొంతం చేసుకోవచ్చని సోమవారం ఓ ప్రకటనలో రిలయన్స్ డిజిటల్ తెలిపింది.
టెక్నాలజీ రంగంలో నిత్యం వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా అన్ని రకాల ఉత్పత్తులను రిలయన్స్ డిజిటల్ అందిస్తున్నది. దేశవ్యాప్తంగా 2000 స్టోర్లతో భారతీయ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్గా రిలయన్స్ డిజిటల్ వెలుగొందుతున్నది.
ఇంకా వరల్డ్ ఫేవరేట్ జ్యూయలర్ జోయాలుక్కాస్... పవిత్ర పసిడి కొనుగోళ్ల పర్వదినం సందర్భంగా గోల్డ్ఫార్ట్యూన్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా బంగారం, డైమెండ్ జ్యూయలరీ కొనుగోలు దారులకు ఉచితంగా బంగారు నాణేలు బహూకరిస్తారు. సరికొత్త అక్షయ తృతీయ 2019 కలక్షన్ను ఆరంభించామని, కస్టమర్లకు సంపదతో సేవ చేయడానికి ఈ పండుగ తమకు అవకాశం కల్పిస్తోందని సంస్థ ఎండీ, చైర్మన్ జాయ్ అలూక్కాస్ పేర్కొన్నారు.
మరోవైపు దేశంతో వేగంగా విస్తరిస్తున్న రిటైల్ చైన్స్లో ఒకటైన ఒర్రా, అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు భారీ ఆఫర్లను ప్రకటించింది. డైమెండ్ జ్యూయలరీ కొనుగోలుపై 25 శాతం తగ్గింపు సదుపాయాన్ని కల్పిస్తోంది.
పసిడి ఆభరణాల మేకింగ్ చార్జీలపై కూడా 25 శాతం రాయితీ ప్రకటించింది. గోల్డ్ నాణేలు, కడ్డీలపై అసలు మేకింగ్ చార్జీలు ఉండవు. డైమెండ్ జ్యూయలరీ కొనుగోలుకు సంబంధించి వడ్డీ రహిత ఇన్స్టాల్మెంట్ చెల్లింపు సౌలభ్యతను కల్పిస్తున్నట్లు ఒక ప్రకటన పేర్కొంది.
ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గ్రూప్ ప్రత్యేక అక్షయ త్రుతీయ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే షోరూమ్లను ప్రారంభిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఒక ప్రకటనలో తెలిపింది.
వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు ఈ పండుగ సందర్భంగా అందుబాటులో ఉండనున్నాయి. పండుగను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా దాదాపు 2000 కేజీల పసిడి విక్రయం అవుతుందని, భావిస్తున్నట్లు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ పేర్కొన్నారు. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
టీ10లో అఫ్రిది విశ్వరూపం.. 14 బంతుల్లో 51
ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రియాజ్ బౌలింగ్లో అఫ్రిది విశ్వరూపం చూపాడు. వరుసగా 6, 6, 6, 6 బాదేశాడు. దీంతో.. 10 బంతుల్లో 38 పరుగులతో నిలిచాడు.
Samayam Telugu | Updated:
Dec 2, 2018, 01:40PM IST
షార్జా వేదికగా జరుగుతున్న టీ10 లీగ్ బౌలర్లకి పీడకలల్ని మిగిలిస్తోంది. తాజాగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది (59: 17 బంతుల్లో 3x4, 7x6) మెరుపు అర్ధశతకం బాదడంతో అతను ప్రాతినిథ్యం వహించిన పాక్టూన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకి నార్తర్న్ వారియర్స్ జట్టు కూడా దీటుగా బదులిచ్చింది. రొమన్ పొవెల్ (80 నాటౌట్: 35 బంతుల్లో 4x4, 9x6) దూకుడుగా ఆడటంతో ఆ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగలిగింది. ఛేదనలో ఆండ్రీ రసెల్ (0), డ్వేన్ స్మిత్ (3) నిరాశపరచడం ఆ జట్టుని దెబ్బతీసింది. దీంతో.. 13 పరుగుల తేడాతో గెలుపొందిన పాక్టూన్స్ జట్టు టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో అఫ్రిది హిట్టింగ్ హైలైట్గా నిలిచింది. కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం మైలురాయిని అందుకున్న అఫ్రిది.. మ్యాచ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్గా మలిచాడు. ఆ తర్వాత ఓవర్లో రసెల్ బౌలింగ్లో ఓ సిక్స్ బాదిన ఈ పాకిస్థాన్ హిట్టర్.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రియాజ్ బౌలింగ్లో విశ్వరూపం చూపాడు. వరుసగా 6, 6, 6, 6 బాదేశాడు. దీంతో.. 10 బంతుల్లో 38 పరుగులతో నిలిచి.. 9వ ఓవర్లో ఒక సింగిల్తో పాటు వరుసగా మూడు బంతుల్ని 4, 4, 4 బాదేసి అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో హిట్టర్లు పరుగుల పండగ చేసుకోగా.. బౌలర్లు చేతులెత్తేశారు. | 2sports
|
పి.నోట్స్ పెట్టుబడులు 2.16 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, అక్టోబరు 10: పార్టిసిపేటరీనోట్స్(పి.నోట్స్) పెట్టుబడులు గడచిన ఐదునెలల్లో 2.16లక్షల కోట్లు పెట్టుబడులు పెరిగాయి. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఎక్కువశాతం పినోట్స్లో పెట్టుబడులు పెడు తుంటారు. సెబి గణాంకాలను పరిశీలిస్తే పినోట్స్ పెట్టుబడులు భారతీయ మార్కెట్లలో ఈక్విటీ, డెట్, కరెన్సీ డెరివేటివ్స్ విభాగాల్లో 2,16,232 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు జూలైనెల పెట్టుబడులను పరిశీలిస్తే 2,12,179కోట్లుగా ఉంది. గడచిన మార్చినెలలోఈ పెట్టుబడులు 2.23 లక్షల కోట్ల వరకూ వచ్చాయి. జూన్ పెట్టుబడులపరంగాచూస్తే పినోట్స్ 2.10 లక్షలకోట్ల వరకూ ఉన్నా యి. పినోట్స్లో పెట్టుబడులపై సెబి నిశితపరిశీలనచేసిన నల్లధనస్వాముల పెట్టుబడులను కొంత కట్టడి చేసింది. యాంటిమనీలాండరింగ్ చట్టాలను ఉపయోగించి అనుమానాస్పద లావాదేవీలపై కట్టడి ప్రయో గంచేయడంతోకొంతమేర పెట్టుబ డుల క్రమబద్ధీకరణ జరిగింది. 2015 అక్టోబరు నుంచిభారత్ మార్కె ట్లకు పినోట్స్ పెట్టుబడు లు కొంత మారాయి. తిరిగి ఫిబ్ర వరి నుంచి కొంతమేర ఊపందు కున్నాయి. మార్చిలో కొంత ఊపందుకున్నా ఏప్రిల్లో తిరిగి మందగమనంలోఉన్నాయి. పినో ట్స్పరంగా చూస్తే జూన్లో మళ్లీ తగ్గాయి. జూలై, ఆగస్టునెలల్లో స్వల్పంగా పెరిగినట్లు గణాంకాలు చెపుతున్నాయి. మొత్తంగాచూస్తే పినోట్స్ ఈక్విటీల్లో 1.33 లక్షల కోట్లు ఆగస్టులో పెట్టుబడులున్నట్లు తేలింది. మిగిలినమొత్తం అంతా డెట్, డెరివేటివ్ మార్కెట్లలో ఎక్కువ ఉంది. ఆగస్టు చివరినాటికి విదేశీ సంస్థాగత పెట్టుబడులు పినోట్స్ద్వారా వచ్చినవి స్థిరంగా ఉన్నాయి. 8.4శాతం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సెబి నియమ నిబంధనలు కఠినతరం చేసిన తర్వాత పినోట్స్ పెట్టుబడులు భారీగాతగ్గాయి. 2008లో 25-40శాతం పెట్టుబడులు వచ్చా యి. 2007 స్టాక్ మార్కెట్లకు 55శాతం పినోట్స్ పెట్టుబడులు వచ్చాయి. పినోట్స్ పెట్టుబడులపరంగా 2007 అక్టోబరులో 4.5 లక్షల కోట్లు వరకూ వచ్చాయి. తదనంతరం 2008 ఫిబ్రవరి నాటికి 3.22 లక్షల కోట్లకు పడిపోయింది. 2009 ఫిబ్రివరిలో కేవలం 60,948 కోట్లు మాత్రమే వచ్చాయి. | 1entertainment
|
apollo1
అపోలో గ్రూప్ నుంచి ‘ట్రస్టు ఆవిర్భావ0
చెన్నై: అపోలో ఆసుప్రతుల గ్రూప్ తాజాగా ఒకట్రన్టును ఏర్పాటుచేసేందుకు యోచిస్తోంది. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద ఆసుపత్రుల చైన్ నిర్వహిస్తున్న గూప్ యాజమాన్యం మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో సజావుగా సాగేందుకు ట్రస్టును ఏర్పాటుచేయాలని వ్యవస్థాపకులు ప్రతాప్ సిరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్ప టికే తయారయిన ముసాయిదాను అందరు కుటుంబసభ్యులు సంతకాలు చేసారని తేలింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దస్త్రాలపై న్యాయవాదులు కసరత్తులు చేస్తున్నారు. ప్రతాప్సిరెడ్డి నలుగురు కుమార్తెల్లోనే చైర్మన్గిరీ ఉంటుంది. రొటేషన్ పద్ధతిలో చైర్మన్ గిరీ నడుస్తుంది. నలుగురుకుమార్తెలు, కుటుంబంలోని మూడోతరంతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసు కున్నట్లు సమాచారం. అపోలో ఆసుప్రతుల వైస్ఛైర్పర్సన్ శోభనా కామినేని మాట్లాడు తూ ఇప్పటికే ప్రీయాంబుల్పై సంతకాలు జరిగాయని ట్రస్టుకు సంబంధించిన నిర్మాణ క్రమంపై కసరత్తులు జరుగుతున్నాయని, తన తల్లితండ్రుల 60వ వివాహమహోత్స వం సందర్భంగా ఈట్రస్టు ఆవిర్భావం ఉం టుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న తరంతో పాటు మూడోతరం కూడా వ్యాపారాల్లో నిమగ్నంఅయ్యారు. సింధూరిరెడ్డి ఆసు పత్రుల బిజినెస్పై ఫోకస్చేసారు. ఉపాసనా కామినేని గ్రూప్ సిఎస్ఆర్ కార్యకలాపాలు, అనుష్పాల కామినేని ఫార్మసీ ప్రైవేటు లేబుల్, ప్రీతారెడ్డి కొడుకు కార్తీక్రెడ్డి విద్య, బీమా రంగాలపై దృష్టిపెట్టారు. గ్రూప్ బయట కూడా భావితరం యువ రక్తం వ్యాపారాలు చేస్తోంది. రక్షణ, విద్యుత్ ఉత్పత్తి, హెల్త్కేర్ అప్లికేషన్ స్టార్టప్ ఇతర అనుబంధ వ్యాపారాల్లో నిమగ్నం అయి ఉంది. వీటన్నింటి దృష్టాయ కుటుంబ వ్యాపారాలు మరింత సజావుగా సాగేందుకు ఒక ట్రస్టును ఏర్పాటుచేసి తదనంతరం ఆట్రస్టు ఆధ్వర్యంలో మొత్తం యాజమాన్యం జరిగేటట్లు అపోలో వ్యవస్థాపకులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో టాటాగ్రూప్ సంస్థలు ఈ తరహా యాజమాన్యంలోనే ఉన్నాయి. | 1entertainment
|
అంచనాల నడుమ ఆకాశం వైపునకు..
- పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్లు
- వడ్డీ రేట్ల 'కోత'లు, జీఎస్టీ వార్తలతో మద్దతు
- సెన్సెక్స్లో517 పాయింట్ల ర్యాలీ
ముంబయి: టోకు ధరల ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదో మాసంలోనూ తగ్గడంతో 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు.. వస్తుసేవల పన్నుకు ఇంకా దారులు తెరిచే ఉన్నాయని, త్వరలోనే ఈ బిల్లుకు పార్లమెంట్లో మోక్షం లభించనుందన్న వార్తల నడుమ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. మరోవైపు చైనా కరెన్సీ తిరిగి స్థిరత్వంలోకి వచ్చిందన్న వార్తలు కూడా మదుపరులలో విశ్వాసాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 517 పాయింట్లు పెరిగి 28,067కు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజీ సూచీ నిఫ్టీ 162 పాయింట్ల మేర పెరిగి 8,519 వద్ద స్థిరపడింది. గత ఏడు మాసాల్లో నిఫ్టీ ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి.
బీఎస్ఈలో మిడ్క్యాప్ సూచీ 2.1 శాతం, స్మాల్క్యాప్ సూచీ 1.4 శాతం చొప్పున రాణించాయి. మొత్తంగా 2,943 స్టాక్స్ ట్రేడింగ్ అయ్యాయి. ఇందులో 1,791 స్క్రిప్లు లాభాల్లో ముగియగా.. మరోవైపు 1,055 స్టాక్స్ నష్టాల బాట పట్టాయి. బీఎస్ఈలో రంగాల వారిగా స్థిరాస్తి సూచీ అత్యధికంగా 7.6 శాతం పెరిగింది. ఇదే క్రమంలో బ్యాంకింగ్ 3.05 శాతం, ఆటో 2.4 శాతం, మౌలిక వసతుల సూచీ 2.19 శాతం చొప్పున రాణించాయి. సెన్సెక్స్లో విఇడిఎల్ 3.73 శాతం, ఐసిఐసిఐ బ్యాంకు 3.58 శాతం, ఎస్బిఐఎన్ 3.49 శాతం, రిలయన్స్ 3.44 శాతం, హెచ్డిఎఫ్సి 3.4 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ -0.75 శాతం, ఇన్ఫోసిస్ -0.68 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. జిఎస్టి బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకుంటామని ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడానికి తోడు, వరుసగా మూడు రోజులు తగ్గిన చైనా కరెన్సీ యువాన్ శుక్రవారం స్థిరంగా కొనసాగింది. దీంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారని బ్రోకర్లు పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ స్వల్పంగా 0.03 పైసలు పెరిగి రూ.65.07 వద్ద నమోదవడంతో మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Sharukh
హుండై మోటార్స్కు షారూక్ ప్రచారం
న్యూఢిల్లీ,జూలై 5: హుండైమోటార్ ఇండియా కొత్తగా షారూఖ్ ఖాన్ను తమవాహనాలకు ప్రచారకర్తగా నియమించింది. రెండు దశాబ్దాలుగా షారూఖ్ హుండైకు ప్రచారకర్తగా వ్యవహరి స్తున్నారు. కంపెనీ ఎండి సిఇఒ వైకెకూ మాట్లాడుతూ ఎస్ఆర్కె హుండై కుటుంబానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి అని ప్రశం సించారు. హుండై కుంబంతో సాన్నిహిత్యం ఎక్కువ ఉన్న షారూఖ్ హుండై ఉత్పత్తులు మార్కెట్కు ఆయన కృషి ఎంతో కీలకంగాపనిచేసిందన్నారు. హుండైలాంటి బహుళజాతి కంపెనీ తో 19ఏళ్లపాటు పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆధునిక ప్రీమియంకార్బ్రాండ్కు తనను ప్రచారకర్తగా తిరిగి ఎంపికచేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ఎన్డిటివి ప్రాఫిట్ కార్ అండ్బైక్ అవార్డులపరంగా షారూఖ్ ఖాన్కు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ది ఇయర్ అవార్డును సాధించారు. | 1entertainment
|
HYUNDAI
హుండైమోటార్స్ అమ్మకాల్లో క్షీణత
న్యూఢిల్లీ, జూలై 3: హుండైమోటార్స్ జూన్నెలలో దేశీయ విరకయాల్లో 5.6శాతం తగ్గాయి. గత ఏడాది 39,807 యూనిట్లు విక్రయిస్తే ఈ ఏడాది 37,562 యూనిట్లు మాత్రమే విక్రయించింది. జనవరి జూన్నెలల మధ్య దేశీయంగా అమ్మకాలు 2,53,428 యూనిట్లుగా ఉందని, 4.1శాతం పెరిగాయని చెపుతోంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 2,43,442 యూనిట్లను విక్రయించింది. కంపెనీ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జిఎస్టి పన్ను క్రమంపై ఊహాగానాలు పెరగడంతో ధరలు తగ్గుతాయా పెరుగుతాయాఅన్న సందేహాలు ఎక్కువ రావడం వల్ల అమ్మకాలపై ప్రభావం చూపిం చిందన్నారు. అయితే ఆరునెలల్లో చూస్తే అమ్మకాలు పెరిగాయన్నారు. గ్రాండ్ ఐ10, ఎలైట్ఐ20, క్రెటా వంటి బ్రాండ్లు మంచి మార్కెట్ తెచ్చాయన్నారు. జిఎస్టి అమలుతో రానున్న నెలల్లో ఆటోమొబైల్రంగం మరింత వృద్ధి సాధించగలదని, కస్టమర్ల ఆసక్తి కూడా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. | 1entertainment
|
Hyderabad, First Published 12, Apr 2019, 8:04 PM IST
Highlights
తమిళ స్టార్ సూర్య కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘గజిని’, ‘సింగం’వంటి చిత్రాలతో ఇక్కడ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని, ఇక్కడా తన సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆయన సినిమాలు ఈ మధ్యకాలంలో భాక్సాఫీస్ వద్ద ఆడటం లేదు.
తమిళ స్టార్ సూర్య కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘గజిని’, ‘సింగం’వంటి చిత్రాలతో ఇక్కడ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని, ఇక్కడా తన సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆయన సినిమాలు ఈ మధ్యకాలంలో భాక్సాఫీస్ వద్ద ఆడటం లేదు.
ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఎన్ జీకే టైటిల్ తో పొలిటికల్ జానర్లో తెరకెక్కుతున్న మూవీతో ఫ్యాన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. తాజాగా ఫస్ట్ సింగిల్ను విడుదల చేశారు. ‘వడ్డీలోడు వచ్చెనే... గడ్డి కోసం చూసెనే...’అంటూ చంద్రబోస్ రాసిన పాటను సత్యన్ పాడారు. ఈ పాటకు యువన్ శంకర్రాజా అందించిన సంగీతం చాలా విభిన్నంగా ఉంది.
‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో రీసెంట్గా ‘ఖాకి’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’, ‘రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ ల పై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్.జి.కె’ (నంద గోపాల క ష్ణ).
సూర్య తో జంటగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటించే ఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్, ఎడిటింగ్: జి.కె.ప్రసన్న, ఆర్ట్: ఆర్.కె.విజయ్ మురుగన్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: శ్రీ రాఘవ | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రోహిత్కి రూ.కోటి.. కుంబ్లేకి 48లక్షలు
రూ. 25 లక్షలకి మించి చేసిన చెల్లింపు వివరాలను వెబ్సైట్లో గురువారం పొందుపరిచింది.
TNN | Updated:
Jul 20, 2017, 06:56PM IST
భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ )‌లో ఆర్థికపరమైన పారదర్శకత కోసం బోర్డు తాజాగా జూన్‌కి సంబంధించి చెల్లింపు వివరాలను అధికారికంగా బహిర్గతం చేసింది. రూ. 25 లక్షలకి మించి చేసిన చెల్లింపు వివరాలను వెబ్‌సైట్‌లో గురువారం పొందుపరిచింది. మాజీ కోచ్ అనిల్ కుంబ్లే , ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి సంబంధించిన బకాయిలను తాజాగా బోర్డు చెల్లించింది. అయితే.. ఈ జాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు లేకపోవడం విశేషం.
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేసిన అనిల్ కుంబ్లేకి.. గత మార్చి బకాయిల కింద రూ. 48.75లక్షలను బోర్డు చెల్లించింది. అతని ఏడాది మొత్తం జీతం రూ. 6.25 కోట్లు. అలాగే రోహిత్ శర్మ, రహానె 2015-2016‌లో విదేశీ పర్యటనలకి సంబంధించి వరుసగా రూ.1.12 కోట్లు, రూ. 1.10 కోట్లను అందజేసింది. వివిధ సిరీస్ మ్యాచ్‌లు ఆడినందుకు అశ్విన్ (రూ.1.01కోట్లు), మనీశ్ పాండే (రూ. 29 లక్షలు), సురేశ్ రైనా (రూ.32 లక్షలు), అమిత్ మిశ్రా (రూ.42లక్షలు), భువనేశ్వర్ కుమార్ (రూ.67 లక్షలు), ఉమేశ్ యాదవ్ (రూ.83లక్షలు), కేఎల్ రాహుల్ (రూ.42 లక్షలు) బకాయిలను బోర్డు చెల్లించినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మళ్లీ బ్యాట్ పట్టనున్న డేవిడ్ వార్నర్..
బాట్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఏడాది నిషేధం వేటు ఎదుర్కొంటున్న ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
Samayam Telugu | Updated:
May 17, 2018, 05:36PM IST
మళ్లీ బ్యాట్ పట్టనున్న డేవిడ్ వార్నర్..
ఆసీస్ మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తిరిగి బ్యాట్ పట్టనున్నాడు. సిడ్నీకి చెందిన రాండ్విక్ పీటర్షమ్ తరఫున క్లబ్ క్రికెట్ ఆడనున్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఏడాదిపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. కానీ క్లబ్ స్థాయిలో క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో వార్నర్ మళ్లీ మైదానంలో అడుగు పెట్టనున్నాడు.
ఈ సీజన్లో వార్నర్ తమ క్లబ్ తరఫున తొలి మూడు లేదా నాలుగు మ్యాచ్లు ఆడతాడని రాండ్విక్ క్లబ్ ప్రెసిడెంట్ మైక్ వైట్నీ తెలిపాడు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడిన గొప్ప ఆటగాళ్లలో వార్నర్ ఒకడు. అతడు మా క్లబ్ తరఫున క్రికెట్ ఆడనుండటం ఆనందంగా ఉంద’’ని మైక్ చెప్పాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా వార్నర్ బాల్ ట్యాంపరింగ్ వ్యూహం రచించాడు. దాన్ని బాన్క్రాఫ్ట్ అమల్లో పెట్టగా.. ఆ విషయం తెలిసినప్పటికీ కెప్టెన్ స్మిత్ వారించలేదు. దీంతో బాన్క్రాఫ్ట్పై 9 నెలలు నిషేధం వేటు వేసిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.. వార్నర్, స్మిత్లపై ఏడాది నిషేధం విధించింది. ఈ ముగ్గురు ఆటగాళ్ల నిషేధం గడువు పూర్తయ్యాక.. వారిని తిరిగి జట్టులోకి చేర్చుకుంటామని ఆసీస్ కొత్త కోచ్ జస్టిన్ లాంగర్ ఇటీవలే ప్రకటించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
'రూపే' నుంచి క్రెడిట్కార్డ్లు
- సెప్టెంబరు నుంచి జారీ
- తొలి ఏడాదే లక్షల కార్డుల మార్కెట్పై దృష్టి
కోల్కతా: దేశీయ కార్డు చెల్లింపు సేవల సంస్థ రూపే ఈ ఏడాది సెప్టెంబరు నుంచి క్రెడిట్కార్డుల విభాగంలో అడుగుపెట్టనుంది. తొలి ఏడాదే దాదాపు లక్ష కార్డులను జారీ చేయడం ద్వారా మార్కెట్లో తన సత్తా చాటాలని యోచిస్తోంది. ఈ సంస్థ డెబిట్ కార్డుల విభాగంలో దాదాపు 38 శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోతోంది. ఆరంభంలో ఈ సంస్థ రెగ్యులర్, ప్లాటినమ్ రకాల క్రెడిట్ కార్డులను జారీ చేయనుంది. రానున్న రోజుల్లో దశల వారీగా ఈ సంస్థ సహ బ్రాండెడ్ కార్డులతో జట్టుకట్టి క్రమంగా విస్తరించనుంది. కార్డుల జారీ వ్యాపారంలో విస్తరించేందుకు తమకు ఎంతో మెరగైన అవకాశాలు ఉన్నట్లుగా 'నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దిలీప్ అస్బే తెలిపారు. వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల పోటిని నిలవరించేలా ఎన్పీసీఐ మార్కెట్లోకిక రూపే బ్రాండ్ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రానున్న 2-3 ఏళ్లలో మొత్తం క్రెడిట్ కార్డుల విభాగంలో 10 శాతం వాటాను అందిపుచ్చుకోవాలిని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా అస్బే వివరించారు. దేశీయంగా 2.27 కోట్ల కెడిట్ కార్డ్లు చెలామణిలో ఉన్నాయి. వీరు సాలీనా రూ.2.5 లక్షల కోట్ల మేర క్రెడిట్ కార్డు వ్యవహారాలు జరుపుతున్నట్లు సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
క్లీన్ స్వీప్పై టీమిండియా గురి..!
కివీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
TNN | Updated:
Oct 8, 2016, 09:56AM IST
ఇండోర్: హోల్కర్ స్టేడియం వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఒకే ఒక్క మార్పుతో టీమిండియా రంగంలోకి దిగింది. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ ను తప్పించి.. ఆ స్థానంలో గంభీర్ కు అవకాశం కల్పించింది.కాగా కివీస్ తో జరుగుతున్న మూడో టెస్టులోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా ప్లాన్ రెడీ చేసింది. పాక్ ను వెనక్కి నెట్టి ఇప్పటికే టెస్టుల్లో నెంబర్ 1 హోదా సాధించిన కోహ్లీ సేన.. తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో పడింది. మరోవైపు ఈ మ్యాచ్ లో నెగ్గి పరువుదక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
గత సాంప్రదాయానికి భిన్నంగా కోహ్లీ సేన ముందడుగు వేస్తున్న విషయం తెలసిందే. ఒక విజయం తర్వాత పరాజయం.. ఒక పరాజయం తర్వాత విజయం.. ఇలాంటి విధానానికి స్వస్తి చెప్పి..విజయాలను మాత్రమే అలవాటు చేసుకుంది. ఇటివలీ కాలంలో టీమిండియా ప్రదర్శన గమనించినట్లయితే కోహ్లీ సేన ఏమేరకు దుసుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరుగుతున్న కివీస్ టెస్టు సిరీస్‌లోనూ తొలి రెండు టెస్టుల్లో విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి కివీస్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులోనూ విజయం సాధించాలనే పట్టుదల టీమిండియా లో కనిపిస్తోంది | 2sports
|
అమెరికా హెచ్1బి వీసా ఆంక్షల ఫలితం
4 ఐటి కంపెనీల్లోరూ.21 వేల కోట్ల నష్టం
ముంబై, జనవరి 6: అమెరికా కొత్త అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ట్రంప్ ఎన్నికల నినాదం అమలులోనికి వస్తుండటం, హెచ్1బి వీసాలపై ఆంక్షలు పెంచడం వంటి వాటితో భారత్లోని నాలుగు టాప్ ఐటి కంపెనీల మార్కెట్ విలువలు ఒక్కరోజులోనే 21వేల కోట్లు దిగజారాయి. బిఎస్ఇలో ఐటిసూచి మూడు శాతం దిగజారింది. హెచ్సి ఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో, టెక్మహీంద్ర వంటివి 4.5శాతం వరకూ నష్టపోయాయి.
కేవలం ఇవేకాకుండా మైండ్ట్రీ, పెర్సి స్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్ వంటివి ఎక్కువ అమ్మకాల వత్తిడికి లోనయ్యాయి. అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధుల సభలో హెచ్వన్బి వీసాలపై ఆంక్షలను పెంచుతూ బిల్లు ను ప్రవేశపెట్టడమే ఇందుకు కీలకం అని భావించాలి. బిఎస్ఇ ఐటి ఉపసూచి టాప్ కంపనీలపరంగా మూడు శాతం దిగజారితే టాప్ కంపెనీలన్నీ 4.5శాతం వరకూ క్షీణించాయి. ఒక్కరోజులోనే భారతీయ ఐటి ఔట్సోర్సింగ్ కంపెనీలలో 21 వేల కోట్ల రూపాయల మార్కెట్విలువల పతనం జరిగింది.
వాస్తవానికి ఈ బిల్లు వల్ల భారత్ లాంటి దేశాలు హైటెక్ ఉద్యోగాలను అమె రికాలో నియ మించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. అయితే యుఎస్ కాంగ్రెస్లో తిరిగి ప్రవేశపెట్టడం వల్ల బిల్లు వీసా దుర్వినియో గాన్ని అరికడుతుందని అంచనావేస్తున్నారు. అలాగే హెచ్వన్బి వీసా కలిగిన వారికి కనీసం సాలీనా లక్ష డాలర్ల వేతనం ఉండాలి.ప్రస్తుతం ఈ పరిమితి కేవలం 60వేల డాలర్లుగా మాత్రమే ఉంది. అలాగే ఇప్పటి వరకూ ఉన్న మాస్టర్స్ డిగ్రీపై ఉన్న మినహాయింపులను కూడా రద్దు చేసింది. దీనివల్ల ఖచ్చితంగా ఎంఎస్ వంటి మాస్టర్డిగ్రీలు చేయాల్సి ఉంటుంది.
ఈబిల్లు అమెరికా చట్టసభల్లో ఆమోదం పొందితే భార తీయ ఔట్సోర్సింగ్ కంపెనీల నిర్వహణ మార్జిన్లు గణనీయంగా తగ్గిపోతాయనడంలో సందేహంలేదు. ఐడిబిఐ క్యాపిటల్ రీసెర్చి ఎకె ప్రభాకర్ మాట్లాడుతూ హెచ్1బి వీసా ఆంక్షలే నేటి ఐటిషేర్ల పతనా నికి మూలకారణమని విశ్లేషించారు. ఈ బిల్లు అమెరికాలో అమోదం పొందితే భారత్ ఐటి కంపెనీల రాబడుల్లో, మార్జిన్లలో 150 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అంచనావేసారు. హెచ్వన్ బి వీసా అంశంతోపాటు అమ్మకాల ఒత్తిడి కూడా తోడయింది. భారత్లోని కొన్ని ఐటి కంపెనీలు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటివి 50-55శాతం స్థానిక ఉద్యోగులనే అమెరికాలో నియమించుకున్నాయని ఇటువంటి కంపెనీలపై తక్కువ ప్రభావంఉంటుందని ఆయన అన్నారు.
హెచ్వన్బి వీసా అంశంతోపాటు అమ్మకాల ఒత్తిడి కూడా ఎక్కువయింది. మూడో త్రైమాసిక ఫలితాలు రానుండటంతో కొంతమంది పెద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపించడం కూడా స్టాక్ మార్కెట్లలో ఐటిరంగ షేర్ల పతనానికి మూలకారణం అయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా రెండునెలల గరిష్ట స్థాయి నుంచి దిగజారాయి. ఐటిరంగ షేర్ల పతనమే ఇందుకుకారణం. నిఫ్టీ మధ్యాహ్నానికి 0.03శాతం దిగజారి 8271పాయింట్లవద్ద స్థిరపడితే సెన్సెక్స్ కూడా 0.02శాతం దిగజారి 26,873.93 పాయింట్లవద్ద స్థిరంగా కొనసాగుతున్నది. నిఫ్టీ ఐటిసూచి 3.2శాతం దిగజారింది. నవంబరు 9వతేదీ తర్వాత భారీస్థాయిలో పతనంగానిపుణులు పేర్కొంటున్నారు | 1entertainment
|
Hyderabad, First Published 10, Oct 2018, 8:22 AM IST
Highlights
తను డైరెక్ట్ చేసే సినిమాలకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు త్రివిక్రమ్. ఇక భారీ బడ్జెట్ సినిమా అంటే తప్పకుండా దేవీ ఉండాల్సిందే. అలాంటిది త్రివిక్రమ్ దేవిశ్రీప్రసాద్ ని పక్కన పెట్టేసారని, ఆ కారణంగానే 'అరవింద సమేత' కోసం తమన్ ని రంగంలోకి దింపారంటూ వార్తలు వినిపించాయి.
తను డైరెక్ట్ చేసే సినిమాలకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు త్రివిక్రమ్. ఇక భారీ బడ్జెట్ సినిమా అంటే తప్పకుండా దేవీ ఉండాల్సిందే. అలాంటిది త్రివిక్రమ్ దేవిశ్రీప్రసాద్ ని పక్కన పెట్టేసారని, ఆ కారణంగానే 'అరవింద సమేత' కోసం తమన్ ని రంగంలోకి దింపారంటూ వార్తలు వినిపించాయి.
తాజాగా ఇదే ప్రశ్న త్రివిక్రమ్ కి ఎదురైంది. మీరు ఈ మధ్య దేవిశ్రీప్రసాద్ ని పక్కన పెట్టేసినట్లున్నారని..? ప్రశ్నించగా.. దానికి సమాధానంగా ''నిజంగా చెప్పాలంటే దానికి పెద్దగా కారణాలేవీ లేవు.నాకు దేవి అంటే ఎప్పటికీ ఇష్టమే. మేమిద్దరం ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాం.
ఈ సినిమాతో నన్ను నేను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే.. విలేకరులు ఇదివరకు పని చేస్తోన్న సంస్థలో మానేసి కొత్త సంస్థలోకి ఎందుకు వచ్చారంటే ఏం చెబుతారు..? దానికి కారణం గొడవలే అవ్వాల్సిన అవసరం లేదు కదా. మార్పు కోసమే.. నాలో మార్పు కోసం కొత్త సంగీత దర్శకులతో చేస్తున్నాను.
దేవి ఒకటే రకమైన మ్యూజిక్ చేస్తున్నాడని నేను అనడం లేదు.. అలా చేస్తే అతడికి ఇన్ని హిట్లు ఎందుకు వస్తాయి. 'అ ఆ' సినిమా బడ్జెట్ ప్రకారం దేవిశ్రీ ఎక్కువ. దీంతో అనిరుద్ అనుకున్నాం. చివరకి మిక్కీతో చేయించాం. అంతే తప్ప దేవికి నాకు ఎలాంటి గొడవలు లేవు'' అంటూ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి.. | 0business
|
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
First Published 8, Mar 2018, 7:06 PM IST
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
రాంచరణ్ రంగస్థలం ఫోటో గ్యాలరీ
Recent Stories | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
MeToo అమీర్, అక్షయ్కి ‘అమ్మ’ మద్దతు..!
‘అమ్మ’ సెక్రటరీ సిద్ధిఖ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్లపై విమర్శలు గుప్పించగా.. ఆ మాటలపై తాజాగా అధికార ప్రతినిధి విచారం వ్యక్తం చేశాడు.
Samayam Telugu | Updated:
Oct 17, 2018, 03:24PM IST
MeToo అమీర్, అక్షయ్కి ‘అమ్మ’ మద్దతు..!
దేశంలో #మీటూ ఉద్యమానికి మద్దతుగా తాము నటిస్తున్న సినిమాల నుంచి పక్కకి తప్పుకున్న బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్ , అక్షయ్ కుమార్లకి మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (అమ్మ) మద్దతు ప్రకటించింది. ఇటీవల ‘అమ్మ’ సెక్రటరీ సిద్ధిఖ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్లపై విమర్శలు గుప్పించగా.. ఆ మాటలపై తాజాగా విచారం వ్యక్తం చేసిన ‘అమ్మ’ అధికార ప్రతినిధి జగదీశ్ ఆ ఇద్దరికీ అసోషియేషన్ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశాడు.
సుభాష్ కపూర్ దర్శకత్వంలో ‘మొఘల్’ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపిన అమీర్ ఖాన్.. తాజాగా సుభాష్పై ఓ బాధితురాలు లైంగిక ఆరోపణలు చేయడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. మరోవైపు సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హౌస్ఫుల్ 4’ సినిమాలో నటిస్తున్న అక్షయ్ కుమార్ .. కొంత మంది మహిళలు సాజిద్ తమని లైంగికంగా వేధించాడంటూ గళం విప్పడంతో ఆ సినిమా షూటింగ్ని తాత్కాలికంగా నిలిపివేశాడు. దీంతో.. ఈ ఇద్దరికీ ‘అమ్మ’ మద్దతు తెలుపుతోందని వెల్లడించిన జగదీశ్.. సెక్రటరీ సిద్ధిఖ్ అసోషియేషన్ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Top Bats men
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టాప్ బ్యాట్స్మెన్ వీరే
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా ఇప్పటికే 2-0తో ఆధిక్యాన్ని సాధించింది.కాగా అటు బ్యాటింగ్తో సహ బౌలిం గ్లో కూడా కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సత్తా చాటుతుంది.ఇక ఈ సిరీస్లో టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్లో దూసుకుపో తున్నాడు. కాగా ఈ సంవత్సరం మెరుగైన ఫామ్ లో ఉన్న కోహ్లీ ఈ సిరీస్లో ఇప్పటికే 405 పరు గులు సాధించాడు.కోహ్లీ ఫామ్ను అడ్డుకునేందుకు ఇంగ్లండ్ బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. కాగా రాజ్కోట్,విశాఖపట్నం టెస్టులో ఒక వైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కాగా ఈ ఏడాది 10 టెస్టు మ్యాచ్లాడిన కోహ్లీ 68.92 యావరేజ్తో 965 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో కోహ్లీ అనంతరం ఛటేశ్వరపుజరా అత్యధిక పరు గులు సాధించిన ఆటగాడిగా రెండవ స్థానంలో నిలి చాడు.ఇంగ్లండ్ఆటగాడు జోరూట్ మూడవ స్థానం లోఉన్నాడు.గత మూడు టెస్టుల్లో అత్యధిక పరుగు లు సాధించిన టాప్ ప్లేయర్లు ఐదుగురు వీరే మెరుగైన ఫామ్లో కోహ్లీ: ఈ ఏడాది కోహ్లీ మెరు గైన ఫామ్లో కొనసాగుతున్నాడు.
కాగా ఇం గ్లండ్తో మూడు టెస్టు మ్యాచ్లాడిన కోహ్లీ 405 పరుగులుచేశాడు. ఈ సిరీస్లో కోహ్లీ విశాఖపట్నం లో జరిగిన టెస్టు అత్యధిక స్కోరు 167.అంతే కాదు తన అత్యుత్తమ ఫామ్తో ఐసిసి ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్లో కోహ్లీ మూడవ స్థానం లో నిలిచాడు.కాగా ఈ సిరీస్లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలను కోహ్లీ సాధించాడు. ద్వితీయ స్థానంలో పుజారా: ఈ సిరీస్లో రెండు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఛటేశ్వర పుజారా నిలిచాడు.గత మూడు టెస్టుల్లో పుజారా 338 పరుగులు సాధించాడు.ఇంగ్లండ్తో రాజ్కోట్ తో జరిగిన టెస్టులో పుజారా 124 పరుగులతో సత్తా చాటాడు.కాగా రాజ్కోట్ స్టేడియం లో పుజారా హోంగ్రౌండ్ కావడం విశేషం.ఆ తరువాత విశాఖపట్నంలో జరిగిన రెండవ టెస్టులో రెండవ సెంచరీ సాధించాడు.
ఇంగ్లండ్ బౌలర్స్పై పుజారా మంచి ట్రాక్ రికార్డు నెలకొల్పాడు.ఈ సిరీస్లో పుజారా యావరేజ్ 56.33గా ఉంది.ఇంగ్లండ్పై పుజారా 5 టెస్టు సెంచరీలు చేయడం విశేషం. తృతీయ స్థానంలో జోరూట్ : ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులోపామ్లోఉన్న ఆటగాడు జోరూట్.గత మూ డుటెస్టుల్లో జోరూట్ 299పరుగులు సాధించాడు. కాగా యావరేజ్ 49.83గా ఉంది.సెంచరీతో పాటు రెండుహాఫ్ సెంచరీలను జో రూట్ నమోదు చేశాడు.భారత పర్యటనలో జో రూట్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.అయితే రాబోయే టెస్టుల్లో అతడు పుంజుకునే అవకాశం ఉంది. బెన్స్టోక్స్: ప్రస్తుత సిరీస్లో ఇంగ్లండ్ జట్టులో మంచి ఫామ్లో ఉన్న ఆల్రౌండర్ బెన్స్టోక్స్,గత మూడు టెస్టుల్లో 267 పరుగులు సాధించాడు. కాగా సిరీస్లోనే అతడు తన క్రికెట్ కెరీర్లోనే అత్యధిక పరుగులు 128 సాధించాడు.బెన్స్టోక్స్ యావరేజ్ 53.40 ఉంది. అలెస్టర్ కుక్ : టీమిండియాతో జరుగుతున్న అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఉన్నాడు.కాగా అలెస్టక్ కుక్ గత మూ డుటెస్టుల్లో 41.00 యావరేజ్తో 246 పరుగులు సాధించాడు.తొలి టెస్టు జరిగిన రాజ్కోట్లో అలె స్టర్ కుక్ 130 పరుగులతో సెంచరీ సాధించాడు. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ప్రపంచకప్లు కంటే టెస్టులే గొప్ప..!
జట్టు సామర్థ్యానికి నిజమైన పరీక్షలు మాత్రం టెస్టు మ్యాచ్లే. అందుకే వచ్చే ఏడాది వరకు సాధ్యమైనంత
TNN | Updated:
Aug 16, 2017, 12:36PM IST
ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల కంటే టెస్టు సిరీస్‌లు ఆడితేనే జట్టు ఆట మెరుగవుతుందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అంతమాత్రానా ప్రపంచకప్‌ని తక్కువ చేసి చూడటం కాదని.. టెస్టుల్లో కఠిన సవాళ్లని ఎదుర్కొన్నప్పుడే క్రికెటర్లు రాటుదేలుతారని ఆయన వివరించాడు. శ్రీలంకతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో దాని సొంతగడ్డపైనే భారత్ జట్టు క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
‘ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు తమ క్రికెట్‌ని కాపాడుకుంటున్న తీరును ఓ సారి పరిశీలిస్తే.. వాళ్ల మొదటి ప్రాధాన్యత టెస్టులే. ప్రపంచకప్‌లు నాలుగేళ్లకు ఒకసారి వస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మెగా టోర్నీలకి ఉన్న ఆదరణ, ప్రాముఖ్యత నాకు తెలుసు. కానీ.. జట్టు సామర్థ్యానికి నిజమైన పరీక్షలు మాత్రం టెస్టు మ్యాచ్‌లే. అందుకే వచ్చే ఏడాది వరకు సాధ్యమైనంత ఎక్కువ టెస్టులు భారత్ జట్టు ఆడేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని రవిశాస్త్రి వివరించాడు. 2019 ప్రపంచకప్‌, టెస్టుల్లో ఇప్పుడు ఉన్న నెం.1 స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేకంగా తమ వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని.. వాటికి అనుగుణంగానే జట్టు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని కోచ్ స్పష్టం చేశాడు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వారే నిర్మాతలే, వారే హీరోలు- 'ఆకతాయి' లుక్ ఇలా
ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్ హీరో హీరోయిన్లుగా రామ్భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం `ఆకతాయి`. ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్ను విడుదల చేశారు...
TNN | Updated:
Dec 9, 2016, 07:02PM IST
వారే నిర్మాతలే, వారే హీరోలు- 'ఆకతాయి' లుక్ ఇలా
ఆశిష్‌ రాజ్‌, రుక్సార్ మియర్ హీరో హీరోయిన్లుగా రామ్‌భీమ‌న ద‌ర్శ‌కత్వంలో విజ‌య్ క‌ర‌ణ్‌, కౌశ‌ల్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `ఆక‌తాయి`. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌, ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. హాలీవుడ్ ని తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చారా? అనే రేంజ్ లో మోషన్ పోస్టర్ ఉంది. హీరోహీరోయిన్లు బైక్ పై వస్తూ ఉంటే ఎదురుగా వచ్చే లారీలు, జీపులు ఎక్కడికక్కడ పడిపోతాయి. హీరో ఒక చేతితో బైక్ హాండిల్ చేస్తూ మరో చేయితో డిష్కాం.. డిష్కాం అంటూ రివాల్వర్ తో కాల్చుతూ వస్తాడు. అబ్బో ఒక్క పోస్టర్ లోనే యాక్షన్ సీక్వెన్స్ చూపించారను కోండి. ఆ అద్భుతమైన మోషన్ పోస్టర్ ను మీరూ చూసేయండి.
ఈ సినిమాలో ఆశిష్‌ రాజ్‌తో పాటు నిర్మాత‌లు కూడా హీరోలే. కాబ‌ట్టి మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందించారట. రెండు పాట‌లు మిన‌హా సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. వారం రోజుల్లో రెండు పాట‌ల షూటింగ్ పూర్తి చేస్తాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి చివ‌రి వారంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు రామ్ భీమ‌న తెలిపారు.
డైరెక్ట‌ర్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమా అవుట్ పుట్ బాగా వ‌చ్చింది. సినిమాను జ‌న‌వ‌రి లాస్ట్ వీక్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని నిర్మాత‌ల్లో ఒక‌రైన కౌశ‌ల్ క‌ర‌ణ్ చెప్పారు. సినిమాలో చేయ‌డాన్ని బాగా ఎంజాయ్ చేశాన‌ని హీరో ఆకాష్ రాజ్ తెలియ‌జేశారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Hyderabad, First Published 22, Aug 2018, 10:45 AM IST
Highlights
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' నరసింహారెడ్డి సినిమా టీజర్ ని చిరు పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన సంగతి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' నరసింహారెడ్డి సినిమా టీజర్ ని చిరు పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. అయితే ముందుగా ఈ టీజర్ చూసిన వ్యక్తి ఎవరో తెలుసా..? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. శిల్పకళావేదికలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్.. టీజర్ చూసి పవన్ ఏం అన్నారో ప్రేక్షకులకు చెప్పి వారిని ఉత్తేజపరిచారు.
''ఉదయం 10.45 కి టీజర్ నా దగ్గరకి వచ్చింది. దాన్ని ముందుగా కళ్యాణ్ బాబాయ్ కి పంపించాను. ఆయనకు 11 గంటలకు నేను ఫార్వార్డ్ చేయగా.. 11.10 నిమిషాలకు ఆయన నుండి మెసేజ్ వచ్చింది. అదిరిపోయింది థియేటర్లో చూడడానికి రెడీ అవుతున్నాను అన్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు. అలానే ఈ వేడుకలో అభిమానులను తన మాటలతో సంతోషపరిచాడు.
మీ అందరినీ ఉత్సాహపరచడానికి డైరెక్టర్ ని అడిగి మరీ పుట్టినరోజు కానుకగా టీజర్ ని తీసుకొచ్చామని అభిమానులను ఉద్దేశిస్తూ అన్నారు. తేదీ ఖరారు చేయనప్పటికీ వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
Last Updated 9, Sep 2018, 11:53 AM IST | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
భారతదేశ అత్యంత ధనవంతుల జాబితా
చైనాకు చెందిన సంస్థ హునున్ భారతదేశ అత్యంత ధనవంతుల జాబితాను విడుదల చేసింది.
TNN | Updated:
Sep 12, 2015, 04:20PM IST
చైనాకు చెందిన సంస్థ హునున్ భారతదేశ అత్యంత ధనవంతుల జాబితాను విడుదల చేసింది. దాదాపు 296 మంది జాబితాలో ఉన్నారు. ఈ సంవత్సరం కొన్ని కొత్త ముఖాలు, అతి చిన్న వయసులో కోటీశ్వరుల జాబితాలోకి వెళ్లిన వాళ్లు ఉన్నారు. యథావిధిగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 1.6లక్షల కోట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. తరువాతి స్థానంలో 1.26 లక్షల కోట్లతో దిలీప్ సాంగ్వి, మూడోస్థానంలో హిందూజా ఫ్యామిలీ లక్షా మూడువేల కోట్లతో నిలిచారు. ఈ ఏడాది కొందరు యంగ్స్టర్స్కి కూడా ఈ అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దొరికింది. వారిలో ఓలా క్యాబ్ స్థాపకులైన 28 ఏళ్ల అంకిత్ భాటి, 29 ఏళ్ల భావిష్ అగర్వాల్ అతి పిన్న ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే స్నాప్ డీల్ వ్యవస్థాపకుడు 32 ఏళ్ల కునాల్ బాల్, ఫ్లిప్ కార్ట్ సీఈవోలైనా 34 ఏళ్ల బిన్నీ, సచిన్ బన్సాల్ కూడా జాబితాలో చోటు సంపాదించుకున్నారు. | 1entertainment
|
PANKAJ
రెడ్ స్నూకర్ టైటిల్
ముంబై: పలు ఫార్మాట్లలో 16 సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్ బిలియర్డ్స్) స్టార్ పంకజ్ అద్వానీ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు.కాగా స్నూకర్లో పొట్టి ఫార్మాట్గా భావించే 6-రెడ్ స్నూకర్ జాతీయ టైటిల్ను ఈ బెంగళూరు ప్లేయర్ సొంతం చేసుకున్నాడు.కాగా ఫైనల్లో పంకజ్ అద్వానీ కర్ణాటకకు చెందిన ఐష్ప్రీత్ చద్దాపై గెలుపొందాడు. కాగా ఈ విజయంతో జాతీయ స్థాయిలో,ఆసియా స్థాయిలో,ప్రపంచ స్థాయిలో 6-రెడ్ స్నూకర్ టైటిల్ నెగ్గిన ఏకైక ప్లేయర్గా పంకజ్ గుర్తింపు పొందాడు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నెహ్రా బౌలింగ్లో ఓ మచ్చుతునక..!
భారత ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అనూహ్యంగా గురువారం తన క్రికెట్ కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. 38 ఏళ్ల ఈ బౌలర్ని
TNN | Updated:
Oct 12, 2017, 05:33PM IST
భారత ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అనూహ్యంగా గురువారం తన క్రికెట్ కెరీర్‌కి రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. 38 ఏళ్ల ఈ బౌలర్‌ని ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కోసం సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. ఇప్పటికే ముగిసిన తొలి రెండు టీ20ల్లోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. శుక్రవారం హైదరాబాద్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందు నెహ్రా వీడ్కోలు నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆశిష్ నెహ్రా.. 2003 ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకి విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టుపై నిప్పులు చెరిగి 23 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఒక భారత బౌలర్ ప్రపంచకప్‌లో ఈ స్థాయి ప్రదర్శన చేయడం అదే తొలి, చివరిసారి. అందుకే.. నెహ్రా రిటైర్మెంట్ సందర్భంగా అతని కెరీర్‌లో మచ్చుతునకలా నిలిచిపోయిన ఆ బౌలింగ్ ప్రదర్శనని అందరితో వీడియో రూపంలో పంచుకుంటూ ఐసీసీ ఈ ఫాస్ట్ బౌలర్‌ని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంది. | 2sports
|
`పిఎస్వి గరుడవేగ 126.18ఎం` పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది - పూజా కుమార్
Highlights
పి.ఎస్.వి గరుడవేగ సినిమాలో రాజశేఖర్ సరసన పూజా కుమార్
ఈ సినిమాలో హౌజ్ వైఫ్ పాత్రలో నటిస్తున్న పూజా కుమార్
గరుడవేగ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిందేనన్న పూజ
డా.రాజశేఖర్. ఈయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. పూజా కుమార్, శ్రద్ధాదాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై ప్రవీణ్ సత్తారు దర్వకత్వంలో కోటేశ్వర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను నవంబర్ 3న విడుల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ పూజాకుమార్తో ఇంటర్వ్యూ...
‘పిఎస్వి గరుడవేగ’ సినిమా ఎలా ఉండబోతోంది ?
- ఈ సినిమాలో యాక్షన్, థ్రిల్లర్, ఎమోషన్స్ వుంటాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇదొక పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుంది. ఈ సినిమాని థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాలి. ఇందులో ట్రైన్స్, బైక్స్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. చాలా బాగుంటాయి.
మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది?
- ఇందులో నాది హౌస్ వైఫ్ క్యారెక్టర్. ఎన్ఐఏ ఆఫీసర్ అయిన భర్త దేశం కోసమే ఎక్కువ టైమ్ కేటాయిస్తుంటాడు. భర్తకు ఏమవుతుందో అని ఎప్పుడూ టెంక్షన్ పడుతూ అతని నుండి కేరింగ్, అటెంక్షన్ కోరుకునే భార్యగా నటించాను. అలాగే మరోవైపు తన భర్త దేశాన్ని కాపాడే ఉద్యోగం చేస్తున్నాడు కదా..అని కూడా తను ఆలోచిస్తూ ఉంటుంది. ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ ఉంటారు. కానీ ఇందులో 10 ముఖ్యమైన క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే నేను విశ్వరూపం సినిమాలో కూడా హౌస్ వైఫ్ పాత్రలోనే కనిపించాను. నిజానికి హౌస్ వైఫ్ పాత్రలోనే నటించడానికి చాలా విశేషాలుంటాయి.
ఈ సినిమాను మీరు అంగీకరించడానికి కారణం?
- ఇంతకు ముందు కూడా నేను తెలుగులో నటించడానికి చాలా స్క్రిప్ట్స్ విన్నాను. కానీ నచ్చలేదు. ఆ సమయంలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుగారు 120 పేజీలున్న బౌండెడ్ స్క్రిప్ట్ నాకిచ్చారు. అది చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంతకు ముందు చెప్పిన విధంగా డ్రామా, యాక్షన్, ఎమోషన్స్ నచ్చడంతో నటించడానికి అంగీకరించాను.
రాజశేఖర్తో వర్కింగ్ ఎక్స్పీరియెన్స్ ఎలా ఉంది?
- గతంలో రాజశేఖర్గారు నటించిన పోలీస్ సినిమాలను చూశాను. ఆయన అద్భుతంగా నటించారు. ఆయన చాలా ఎనర్జిటిక్. ముఖ్యంగా యాక్షన్స్ సన్నివేశాలైతే చాలా బాగా చేశారు.నేను కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కనపడతాను.
Last Updated 25, Mar 2018, 11:40 PM IST | 0business
|
Vaani Pushpa 105 Views china singls , PVSindhu
చాంగ్జౌ (చైనా): ఇటీవల ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన భారత స్టార్ షట్లర్ పివి సింధుకు చైనా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్లో సింధు 21-12, 13-21, 19-21తేడాతో పోర్న్పావే చూచూవోంగ్ (థాయిలాండ్) చేతిలో పరాజయం చెందారు. దాంతో మరో టైటిల్ను సాధించాలనుకున్న సింధు ఆశలు నెరవేరలేదు. తొలి గేమ్ను సునాయాసంగా గెలిచిన సింధు…ఆపై వరుస రెండు గేమ్ల్లో విఫలమయ్యారు. రెండో గేమ్లో పుంజుకున్న చూచూవోంగ్ ఆగేమ్ను గెలిచి రేసులో నిలిచారు. అదే ఊపును మూడో గేమ్లో కొనసాగించారు. నిర్ణయాత్మక మూడో గేమ్లో సింధు పోరాడినా గేమ్ను కోల్పోయారు. దాంతో గేమ్తో పాటు మ్యాచ్ను కూడా చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించాడు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 21-18, 21-12తో ప్రపంచ మాజీ నంబర్వన్, 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురు§్ు(చైనా)పై అలవోకగా గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. 50 నిమిషాలకు పైగా సాగిన రెండో రౌండ్ ఆరంభంలో సింధు ఆకట్టుకున్నప్పటికీ తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/ | 2sports
|
Nottingham, First Published 22, Aug 2018, 1:26 PM IST
Highlights
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఇంగ్లాండు ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తిట్టాడు. ఇంగ్లండు, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు రెండో రోజు ఆటలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
నాటింగ్ హామ్: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఇంగ్లాండు ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తిట్టాడు. ఇంగ్లండు, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు రెండో రోజు ఆటలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అందుకు గాను బ్రాడ్ కు మ్యాచు ఫీజులో 15 శాతం కోత విధించారు.
ఐసిసి ప్రవర్తనా నియమావళిలని ఆర్టికల్ 2.1.7ను ఉల్లంఘించాడనే ఆరోపణపై బ్రాడ్ కు ఆ జరిమానా విధించారు. అంతేకాకుండా బ్రాడ్ క్రమశిక్షణ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేరుతుంది.
ఆదివారంనాడు 92వ ఓవరులో రిషబ్ పంత్ అవుటయ్యాడు. క్రీజు బయటకు వెళ్తున్న పంత్ వద్దకు వెళ్లి బ్రాడ్ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడాడు. బ్రాడ్ తన తప్పును అంగీకరించాడు.
బ్రాడ్ పై అంపైర్లు మారైస్ ఎరాస్మస్, క్రిస్ గఫనేలతో పాటు థర్డ్ అంపైర్ అలీ దర్ ఆరోపణలు చేశారు.
Last Updated 9, Sep 2018, 1:43 PM IST | 2sports
|
Hyderabad, First Published 12, Apr 2019, 2:07 PM IST
Highlights
ప్రముఖ నటి, రచయిత రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రముఖ నటి, రచయిత రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటు హక్కు గురించి నెటిజన్లు తనకు ఇచ్చే సలహాలు సూచనలపై మండిపడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు ఓటు వేసిన అనంతరం సోషల్ మీడియాలో రేణు వాల్ పై ఫోటోలు పెట్టి ఆమెని విసిగించారు.
దీంతో ఆమె వారిపై ఘాటుగా స్పందించింది. తనకు ఎలా ఓటు వేయాలో.. ఎవరికీ ఓటు వేయాలో చెప్పాల్సిన అవసరం లేదని నెటిజన్లకు చెప్పింది. తన ఓటు హక్కుని పూణేలో ఏప్రిల్ 23న వినియోగించుకొబోతున్నట్లు చెప్పింది.
దయచేసి తనకు మెసేజ్ లు పెట్టడం ఆపాలని కోరింది. అలానే ఓటు హక్కు ప్రాధాన్యం గురించి లెక్చర్లు ఇవ్వడం ఆపండని చెప్పింది. తనకు నచ్చిన వ్యక్తికి, పార్టీకి ఈ నెల 23న ఓటు వేస్తున్నట్లు కాస్త గట్టిగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం రేణు రైతు సమస్యల మీద ఓ సినిమా తీయడానికి రెడీ అవుతోంది.
Last Updated 12, Apr 2019, 2:07 PM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కొడుకు వల్ల రచయితైన ఇమ్రాన్ హష్మీ
ఇమ్రాన్ హష్మీ క్యాన్సర్ పై పుస్తకం రాయబోతున్నాడు.
TNN | Updated:
Oct 21, 2015, 05:31PM IST
ఇమ్రాన్ హష్మీ... సీరియల్ కిస్సర్ బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నాడు. తెరమీద రొమాంటిక్ గా కనిపించే ఈ హీరో జీవితంలో గత రెండేళ్లుగా కష్టాలతోనే సాగుతోంది.
The last 2 years have been the most trying phase of my life.Through it I have found 2 of my greatest teachers.Cancer and my son!.
— emraan hashmi (@emraanhashmi) October 16, 2015
అంతులేని మానసిక వ్యధతో ఉన్నాడు ఇమ్రాన్. అందుకు కారణం సినిమాలు లేకపోవడమో, ఆర్థిక సమస్యలో కాదు. తన ఒక్కగానొక్క కొడుకు ఆర్యన్ కు క్యాన్సర్ అని తేలింది. క్యాన్సర్ మొదటిదశలో ఉంది. అప్పట్నించి చికిత్స తీసుకుంటున్నాడు ఆర్యన్. అయిదేళ్ల ఆ పిల్లాడి బాధను తండ్రిగా చూడలేకపోతున్నాడు ఇమ్రాన్. క్యాన్సర్ పై ఓ పుస్తకం రాసేందుకు సిద్ధపడ్డాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశాడు. ఇమ్రాన్ కు తొమ్మిదేళ్ల క్రితం పర్వీన్ షహానీతో పెళ్లయ్యింది. ఇమ్రాన్ రాసే పుస్తకాన్ని అచ్చువేసేందుకు పెంగ్విన్ బుక్స్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. | 0business
|
Hyderabad, First Published 20, Mar 2019, 1:50 PM IST
Highlights
ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి చేస్తోన్న కామెంట్స్ శ్రుతిమించుతున్నాయి. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి కొందరిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తోన్న శ్రీరెడ్డి తాజాగా మరో వీడియో వదిలింది.
ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి చేస్తోన్న కామెంట్స్ శ్రుతిమించుతున్నాయి. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి కొందరిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తోన్న శ్రీరెడ్డి తాజాగా మరో వీడియో వదిలింది.
ఇందులో హీరో వెంకటేష్ ని టార్గెట్ చేస్తూ ఆయన కూతురి పెళ్లి తనను పిలవలేదని తెగ ఫీలైపోయింది. వెంకటేష్ ని తన చిన్న మావయ్యగా సంబోధిస్తూ.. వెంకటేష్ గారి పాప పెళ్లికి తనకు కార్డ్ ఇవ్వలేదని.. అఫీషియల్ గా తను కోడలు కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా కోడల్నే కదా అంటూ తనను పిలిస్తే ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని అంటూ
చెప్పుకొచ్చింది.
వెంకీ కూతురు చేసుకోబోయే అబ్బాయి రెడ్డీస్ అని.. వెంకీకి కంగ్రాట్స్ చెప్పింది. మీ అమ్మాయి సంతోషంగా ఉండాలని ఓ అభిమానిగా కోరుకుంటున్నానని చెప్పింది. తన విషెస్ ని పాజిటివ్ గా తీసుకోవాలని కోరింది.
Last Updated 20, Mar 2019, 1:50 PM IST | 0business
|
డ్రగ్స్ కేసులో సిట్ ప్రశ్నలకు సమాధానాలు దాటేస్తున్న పూరీ
Highlights
డ్రగ్స్ కేసు విచారణకు హాజరైన దర్శకుడు పూరీ జగన్నాథ్
కొడుకు ఆకాష్, సోదరుడు సాయిరామ్ శంకర్ తో కలిసి హాజరైన పూరీ
ఉదయం నుంచి కొనసాగుతున్న విచారణలో ఆచి తూచి సమాధానాలిస్తున్న పూరీ
డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పదిన్నర నుంచి విచారణలో పాల్గొన్నారు. లంచ్ కు ముందు సిట్ అధికారులు ప్రధానంగా డ్రగ్స్ స్మగ్లర్స్ తో ఎలా పరిచయమైంది, వారితో ఎందుకు కాంటాక్ట్ పెట్టుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసారు. ఇక లంచ్ తర్వాత కెల్విన్ తో గల సంబంధాలు, డ్రగ్స్ వినియోగంపై సిట్ పూరీని ప్రశ్నిస్తోంది.
సిట్ అడిగిన ప్రశ్నల్లో పూరీ ఎదుర్కొన్న ప్రధాన ప్రశ్న కెల్విన్ తో గల పరిచయం ఏంటి, ఎందుకు, ఎలా.. ఈ ప్రశ్నకు సమాధానంగా పూరీ.. ఓ ఈవెంట్ సందర్భంగా పబ్లో కెల్విన్ను కలిశానని, తనకు కెల్విన్కు మధ్య రెగ్యులర్గా ఎలాంటి సంభాషణలు జరగడం లేదని పూరి చెప్పినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు తడబాటు లేకుండా పూరీ సమాధానం చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి చూస్తే పూరీ పక్కా ప్లానింగ్తో విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ప్రతి ప్రశ్నకూ ఆచితూచి సమాధానం చెబుతున్నాడని అంటున్నారు. ఇక పూరీపై సిట్ అధికారులు సంధించిన ప్రశ్నలు కొన్ని బయటకు వచ్చాయి. పూరీని సిట్ సభ్యులు అడిగిన ప్రశ్నలు ఇవే...
1. డ్రగ్స్ ఎన్నిరోజులుగా వాడుతున్నారు?
2. ఎవరి ద్వారా కెల్విన్ పరిచయం?
3. కొకైన్ వాడుతున్నది నిజమా? కాదా?
4. రోజుకు ఎంత మోతాదులో డ్రగ్స్ తీసుకుంటారు?
5. డ్రగ్స్ కోసం నెలవారీగా ఎంత ఖర్చు చేసేవారు?
6. కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ సరఫరా చేసిందెవరు?
7. నైజీరియన్ జిఫాన్తో ఉన్న లింకేంటి?
8. మీ ద్వారా డ్రగ్స్ ఎవరెవరికి వెళుతున్నాయి?
9. మీరు డ్రగ్స్ను అమ్ముతున్నారా?
10. ఫ్రెండ్లీగా పంచుతున్నారా?
11. ముమైత్, ఛార్మి, సుబ్బరాజులకు మీ నుంచే డ్రగ్స్ వెళ్తున్న మాట నిజమా? కాదా?
12. మీ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు?
13. రవితేజ, భరత్కు డ్రగ్స్ ఇచ్చినట్టు ఉన్న ఫొటోలకు మీ సమాధానం ఏంటి?
14. పార్టీలు బయట చేసుకోకుండా ఇంట్లోనే ఎందుకు చేసుకుంటారు?
15. కెల్విన్, జిషన్లు ఇంటికి ఎందుకు వచ్చారు?
16. కొకైన్ కావాలంటూ కెల్విన్ దగ్గరకి ఎవరిని పంపారు?
17. నెలకు ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకుంటున్నారు?
18. డ్రగ్స్ తీసుకున్నాక కొద్దిరోజులు ఎందుకు హైదరాబాద్లో ఉండరు?
19. బ్లడ్టెస్ట్కు సిద్ధమా, మా దగ్గర ఉన్న ఫొటోలకు మీ సమాధానం ఏమిటి?
Last Updated 25, Mar 2018, 11:40 PM IST | 0business
|
Hyderabad, First Published 24, Jun 2019, 10:25 AM IST
Highlights
గతేడాది 'కవచం' సినిమాకి సంబంధించిన ఒక వేడుకలో కాజల్ ని పబ్లిక్ గా ముద్దాడి విమర్శలు ఎదుర్కొన్నాడు ఛోటా కే నాయుడు.
గతేడాది 'కవచం' సినిమాకి సంబంధించిన ఒక వేడుకలో కాజల్ ని పబ్లిక్ గా ముద్దాడి విమర్శలు ఎదుర్కొన్నాడు ఛోటా కే నాయుడు. అప్పటికే ఇండస్ట్రీలో ఛోటాకి అమ్మాయిలపై ఇంటరెస్ట్ ఎక్కువనే కామెంట్స్ వినిపించేవి. ఈ విషయంపై ఛోటా కూడా చాలా ఓపెన్ గా మాట్లాడేవాడు.
అయితే ఛోటా.. కాజల్ ని ముద్దుపెట్టుకున్న సమయంలో ఆమె హుందాగా ప్రవర్తించినప్పటికీ ఆమె అభిమానులు మాత్రం ఊరుకోలేదు. సోషల్ మీడియా వేదికగా ఛోటా ఏకిపారేశారు. అప్పటినుండి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తోన్న ఛోటా తాజాగా మరోసారి విమర్శకుల చేతికి చిక్కాడు.
ఇటీవల జరిగిన 'రాజు గారి గది3' సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ఛోటా.. తమన్నాతో ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ ఈవెంట్ లో ఫోటోలకు ఫోజిచ్చే సమయంలో దూరంగా ఉన్నవాడు తమన్నా పక్కకు చేరి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
తమన్నా తన చేతిని విడిపించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా.. ఆయన గట్టిగా అలానే పట్టుకోవడం వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో ఛోటాని టార్గెట్ చేసిన నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. పబ్లిక్ లో ఎలా ప్రవర్తించాలో తెలియదా అంటూ విరుచుకుపడుతున్నారు. ఛోటా ఇలానే గనుక కంటిన్యూ అయితే ఆయన కెరీర్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది!
Last Updated 24, Jun 2019, 10:25 AM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అంపైర్ ఔట్.. డీఆర్ఎస్ ఓటూ మనకే..!
దంబుల్లా వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక 27 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి
TNN | Updated:
Aug 20, 2017, 04:57PM IST
దంబుల్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక 27 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. జట్టు స్కోరు 139 వద్ద ఓపెనర్ డిక్వెల్లా (64: 74 బంతుల్లో 8x4) స్వీప్ షాట్‌కి ప్రయత్నించి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కేదార్ జాదవ్ విసిరిన బంతిని పాయింట్ దిశగా షాట్ కోసం డిక్వెల్లా ట్రై చేశాడు. కానీ.. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ప్యాడ్స్‌ని తాకింది. దీంతో అంపైర్‌ డిక్వెల్లాని ఔట్‌గా ప్రకటించాడు.
అంపైర్ నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేసిన డిక్వెల్లా డీఆర్‌ఎస్ కోరగా.. బంతి వికెట్లను తాకే లైన్‌లో ప్రయాణిస్తుండటంతో మళ్లీ ఔట్‌ నిర్ణయానికే అంపైర్ కట్టుబడ్డాడు. అనంతరం కొద్దిసేపటికే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ కోసం ప్రయత్నించిన కుశాల్ మెండిస్ (36) క్లీన్‌ బౌల్డవగా.. జట్టు స్కోరు 166 వద్ద కేదార్ జాదవ్ బౌలింగ్‌లో సిక్స్ కోసం ప్రయత్నించి కెప్టెన్ ఉపుల్ తరంగ (9) బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్ ధావన్ చేతికి చిక్కాడు. దీంతో 166/4తో కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. | 2sports
|
బీఎస్ఎన్ఎల్ లక్ష్యం: మార్చికల్లా 10వేల శాటిలైట్ ఫోన్ల విక్రయం
Highlights
శాటిలైట్ ఫోన్ల విక్రయంలో తనదైన ముద్ర వేసిన బీఎస్ఎన్ఎల్ వచ్చే ఏడాది మార్చి నాటికి 10 వేల ఫోన్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. గతేడాది మే నుంచి 4000 శాటిలైట్ ఫోన్ల విక్రయంతో రూ.100 కోట్ల ఆదాయం సంపాదించినట్లు బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికి 10 వేల శాటిలైట్ ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రకటించింది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలకు, నిపుణులకు గతేడాది 4 వేల శాటిలైట్ ఫోన్లను విక్రయించినట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. గతేడాది మే నుంచి బీఎస్ఎన్ఎల్ హైప్రొఫైల్ శాటిలైట్ ఫోన్ల విక్రయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
బేష్షుగ్గా శాటిలైట్ ఫోన్ల వ్యాపారం
‘శాటిలైట్ ఫోన్ల వ్యాపారం బాగా జరుగుతోంది. రక్షణ, సైనిక, సరిహద్దు భద్రత దళం(బీఎస్ఎఫ్), విపత్తు నిర్వహణ సంస్థలు, ఓఎన్జీసీ, రైల్వేలు, కొన్ని ప్రైవేటు రంగాలకు చెందిన కంపెనీలకు సుమారు 4వేల శాటిలైట్ ఫోన్లను విక్రయించాం’ అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ శ్రీవాత్సవ అన్నారు.
భిన్నంగా పని చేసే శాటిలైట్ ఫోన్లు
సాధారణ మొబైల్ ఫోన్లతో పోలిస్తే, శాటిలైట్ ఫోన్లు భిన్నమైనవి. వీటికి సిగ్నల్స్ నేరుగా శాటిలైట్ అందుతాయి. ప్రతికూల వాతావరణంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయి. మొబైల్ టవర్ల సిగ్నల్తో సంబంధం లేకుండా ఇవి ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవతలి వారితో అనుసంధానమయ్యేలా ఉపయోగపడతాయి.
ఎక్కడనుంచైనా శాటిలైట్ ఫోన్లతో మాట్లాడొచ్చు
దేశంలోని ఏ ప్రదేశం నుంచైనా వీటి ద్వారా మాట్లాడవచ్చు. విమానాల్లోనూ, నౌకలలోనూ ఇవి పనిచేస్తాయి. సాధారణ మొబైల్స్ కేవలం 25-30 కి.మీ. దూరంలో ఉన్న టవర్స్ నుంచి సిగ్నల్స్ తీసుకునే సామర్థ్యం ఉండగా, శాటిలైట్ ఫోన్లు, భూమికి 35,700 కి.మీ. దూరంలో ఉన్న శాటిలైట్ నుంచి అందుకుంటాయి. అంతేకాదు, శాటిలైట్ ఫోన్ల ధర కూడా చాలా ఎక్కువ. ఇక నిమిషానికి రూ.25 నుంచి రూ.30 వరకూ కాల్ ఛార్జ్ పడుతుంది.
గతేడాది మే నుంచి రూ.100 కోట్ల ఆదాయం
గతేడాది మేలో ఈ ఫోన్లను విడుదల చేసిన బీఎస్ఎన్ఎల్కు ఇప్పటి వరకూ రూ.100 కోట్ల ఆదాయం ఆర్జించించిందని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ శ్రీవాత్సవ తెలిపారు. 2018-19లో వీటి విక్రయాలను 10వేలకు చేర్చాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. నావికాదళానికి, చేపల వేటకు వెళ్లేవారికి, మత్స్య పరిశ్రమకు చెందిన వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఈ ఫోన్లపై ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు.
ఎయిర్టెల్, జియో సీటీవోల రాజీనామా
ప్రముఖ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో నెట్వర్క్ల ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు (సీటీవో)తమ తమ పదవులకు రాజీనామా చేశారు. రిలయన్స్ జియో గ్రూప్ సీటీవోగా పనిచేస్తున్న జగ్బీర్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. 4జీ సేవల ప్రారంభానికి ముందు నుంచే ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంతకు ముందు ఈయన ఎయిర్టెల్ నెట్వర్క్లో సుమారు దశాబ్దకాలం పాటు పనిచేశారు. రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు.
మర్దికర్ రాజీనామాను ధ్రువీకరించిన ఎయిర్టెల్
భారతీ ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్కు సీటీవోగా పనిచేస్తున్న శ్యామ్ ప్రభాకర్ మర్దికర్ కూడా తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు ధ్రువీకరించారు. మర్దికర్ ఇక్కడ రాజీనామా చేసి సొంతంగా వ్యాపారం మొదలు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన 2001లో ఈ కంపెనీలో చేరారు. దశాబ్దకాలంపాటు ఇక్కడే పనిచేసిన ఈయన కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు. రెండేళ్ల విరామం తర్వాత తిరిగి 2012లో ఎయిర్టెల్లో చేరారు. 2017నుంచి ఈయన ఛీప్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు.
Last Updated 23, Jul 2018, 10:43 AM IST | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
దూకుడుగా ఆడిన డిక్వెల్లా ఔట్..!
భారత్తో పల్లెకలె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో దూకుడుగా ఆడిన ఓపెనర్ డిక్వెల్లా ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్
TNN | Updated:
Aug 24, 2017, 03:16PM IST
భారత్‌తో పల్లెకలె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో దూకుడుగా ఆడిన ఓపెనర్ డిక్వెల్లా ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో డిక్వెల్లా (31: 24 బంతుల్లో 3x4, 2x6) ఫీల్డర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆరంభం నుంచి భారీ షాట్లతో డిక్వెల్లా విరుచుకుపడుతూ లంక స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. అయితే.. జట్టు స్కోరు 41 వద్ద బుమ్రా.. తెలివైన బంతితో అతడ్ని పెవిలియన్‌కి పంపాడు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ కోహ్లి లంకేయుల్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి వన్డేలో ఆత్మరక్షణ ఆటకే పరిమితమైన శ్రీలంక.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆరంభం నుంచే బ్యాట్ ఝళిపించడం మొదలెట్టింది. ఈ క్రమంలోనే మరో ఓపెనర్ గుణతిలక (10 నాటౌట్)‌తో కలిసి డిక్వెల్లా స్కోరు బోర్డును నడిపించాడు. గుణతిలక స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే.. డిక్వెల్లా పేసర్లని లక్ష్యంగా చేసుకుని బౌండరీలు బాదేశాడు. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఓటమి అంచున.. కివీస్ అద్భుత పోరాటం!
జట్టు ఓటమి అంచున నిలిచిన వేళ చివరి వరుస బ్యాట్స్మెన్ అద్భుతంగా పోరాడటంతో న్యూజిలాండ్ టెస్టును డ్రాగా ముగించింది.
| Updated:
Apr 3, 2018, 04:43PM IST
ఓటమి అంచున.. కివీస్ అద్భుత పోరాటం!
క్రైస్ట్చర్చ్: ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా పోరాడిన న్యూజిలాండ్ డ్రాతో గట్టెక్కింది. చివరి సెషన్లో మూడు వికెట్లు పడగొడితే ఇంగ్లాండ్ను విజయం వరించే అవకాశం ఉన్న స్థితిలో కివీస్ బ్యాట్స్మెన్ మొక్కవోని దీక్షతో ఆడారు. తొలి టెస్టులో నెగ్గిన న్యూజిలాండ్.. రెండో టెస్టును డ్రాగా ముగించడం ద్వారా 1-0 తేడాతో టెస్టు సిరీస్ను నెగ్గింది. సొంత గడ్డ మీద కివీస్ జట్టు ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ నెగ్గడం 34 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
382 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలో దిగిన న్యూజిలాండ్.. 42/0తో ఐదో రోజు ఆట ప్రారంభించింది. కానీ స్కోరు బోర్డు మీద పరుగులు చేరక ముందే.. జీత్ రావల్, కేన్ విలియమ్సన్ అవుటయ్యారు. టేలర్, నికోలస్ కూడా కాసేపటికే అవుటవడంతో.. న్యూజిలాండ్ జట్టు 91 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 162/6తో ఓటమి అంచున నిలిచింది.
ఈ దశలో చివరి వరుస బ్యాట్స్మెన్ అద్భుతంగా పోరాడారు. వాట్లింగ్ (66 బంతుల్లో 19 రన్స్), గ్రాండ్హోమ్ (97 బంతుల్లో 45), ఇష్ సోధీ (168 బంతుల్లో 56 నాటౌట్), నెల్ వాగనర్ (103 బంతుల్లో 7) దృఢ సంకల్పంతో ఆడారు. ముఖ్యంగా ఇష్ సోధీ, వాగనర్.. ఇంగ్లిష్ బౌలర్లను విసిగించారు. చుట్టూ ఫీల్డర్లతో ఉచ్చు బిగించినా.. కివీస్ బ్యాట్స్మెన్ అసాధారణంగా పోరాడటంతో ఇంగ్లాండ్ విజయానికి రెండు వికెట్ల దూరంలో నిలిచిపోయింది.
న్యూజిలాండ్ డ్రాతో గట్టెక్కడానికి కారణమైన గ్రాండ్ హోమ్ జింబాబ్వేలోని హరారేలో పుట్టాడు. జింబాబ్వే తరఫున అండర్-19 క్రికెట్ కూడా ఆడాడు. ఇష్ సోధీ భారతీయుడు కాగా.. వాట్లింగ్, నెయిల్ వాగ్నర్ సౌతాఫ్రికాలో జన్మించారు. అలా వేర్వేరు దేశాల్లో పుట్టిన ఆటగాళ్లు కివీస్ను ఓటమి బారి నుంచి కాపాడారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
Kattappa SathyaRaj`s Jockson Dorai releasing in telugu as Dora
'దొర'గా వస్తున్న కట్టప్ప
బాహుబలి సినిమాలో సత్యరాజ్ చేసిన కట్టప్ప పాత్ర ఆయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అంతకన్నా ముందే
| Updated:
Jun 13, 2016, 10:31PM IST
బాహుబలి సినిమాలో సత్యరాజ్ చేసిన కట్టప్ప పాత్ర ఆయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అంతకన్నా ముందే వైవిధ్యభరితమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు ఆయన. తాజాగా ఆయన తమిళంలో జాక్సన్ దొరై అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై జక్కం జవహర్ బాబు తెలుగులో 'దొర' అనే టైటిల్తో విడుదల చేస్తున్నారు. ధరణీ ధరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. బిందు మాధవి హీరోయిన్ రోల్ ప్లే చేసింది. కరుణాకరన్, సహాయం రాజేంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని పాటలను జూన్ 21న, చిత్రాన్ని జులై 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా... నిర్మాత జక్కం జవహర్ బాబు మాట్లాడుతూ "సత్యరాజ్ గారికి తెలుగులో ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. తెలుగులో ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించారు. తమిళంలో పీరియాడికల్ హారర్ ఎంటర్టైనర్ జాక్సన్ దొరై చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'దొర' పేరుతో అనువదిస్తున్నాం. సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను జూన్ 21న విడుదల చేసి, సినిమాను తెలుగు, తమిళంలో. జులై 1న విడుదల చేస్తున్నాం. సిద్ధార్థ్ విపిన్ చాలా మంచి బాణీలను అందించారు. వెన్నెలకంటి, చంద్రబోస్ చక్కటి సాహిత్యంతో పాటలు రాశారు. శశాంక్ వెన్నెలకంటి అద్భుతమైన డైలాగులు రాశారు. ఇటీవలికాలంలో వైవిధ్యమైన హారర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ కోవలో ' దొర '` కూడా తప్పక తెలుగు వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ జోనర్ కొత్తగా ఉంటుంది" అని అభిప్రాయపడ్డారు. | 0business
|
మెగాస్టార్ అభిమానిని అంటూ బాలయ్యతో చేస్తున్నాడు
Highlights
మెగా స్టార్ చిరంజీవి వీరాభిమనినని, సినిమా చేయందే వదలనని అంటున్న పూరీ
గతంలో ఆటోజానీ పేరుతో వచ్చిన ప్రపోజల్ రద్దు
బాలయ్య సినిమా తర్వాత చిరంజీవితో చేయనున్న పూరీ
మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానమున్న దర్శకులు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. ఇటీవల కాలంలో మెగాస్టార్ను డైరెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్న వారిలో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. గతంలో మెగాస్టార్ 150వ చిత్రానికి పూరి డైరెక్టర్ అనే టాక్ వినిపించింది. అయితే ఎందుకో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. కానీ పూరీ ఇటీవలే చిరంజీవితో సినిమా చేస్తానని బల్లగుద్ది చెప్పడం గమనార్హం.
మెగాస్టార్ రీ ఎంట్రీకి మంచి కథ కోసం ఎదురుచూస్తుండగా పూరి జగన్నాథ్ ఓ కథ చెప్పాడు. అప్పట్లో “కథలో ఫస్టాఫ్ మెగాస్టార్కు బాగా నచ్చింది. సెకండాఫ్ కొంత సందిగ్ధత ఉంది” అని పూరి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు చిరంజీవి రీఎంట్రీకి పూరీయే దర్శకుడు అని ప్రచారం జరిగింది. ఆ చిత్రానికి టైటిల్ ఆటో జానీ అని మీడియాలో నానింది. కానీ అనూహ్యంగా కత్తి రీమేక్కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూరీ ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నా అభిమాన హీరో చిరంజీవితో తప్పకుండా సినిమా చేస్తా అని ఇటీవల మరోసారి పూరీ జగన్నాథ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆ చిత్రంలో మెగాస్టార్ అంటే ఏమిటో ఆ సినిమాలో చూపిస్తాను. మెగాస్టార్ అసలు నట విశ్వరూపం అనేది ఇదే అనే విధంగా ఉంటుంది అని సవాల్ చేసినంత పనిచేశాడు పూరీ.
చిరంజీవి అంటే నాకు చెప్పలేనంత అభిమానం అనిస ఇటీవలే మీడియా ముందు కూడా చెప్పాడు పూరీ. చిన్నతనంలో చిరంజీవి సినిమా చూడ్డానికి క్యూ లైన్లలో నిలబడి టికెట్లు కొనేవాడిని. సినిమా హాళ్ల వద్ద కటౌట్లు కూడా కట్టేవాడిని అని పూరీ చెప్పుకోచ్చాడు దూరం నుంచి చూసేవాడిని దర్శకుడిని కావాలన్న కోరికతో హైదరాబాద్ వచ్చిన సమయంలో చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంటే దూరం నుంచి ఆయనను చూసేవాడిని. చిరంజీవిని అంతగా అభిమానించే తనకు.ఆయనతో ఓ బ్లాక్ బస్టర్ మూవీ తీయాలనే కసి ఉంటుంది కదా అని అభిమానులు ఆనందించే వార్తను జగన్నాథ్ చెప్పారు.
ఇక ప్రస్థుతం పూరీ బాలకృష్ణ 101వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST | 0business
|
ఎస్ఎంఇ సంస్థల మార్కెట్ విలువ రూ.18,345 కోట్లు
ముంబై: బిఎస్ఇలోని చిన్న, మధ్యతరహా సంస్థలు ప్లాట్ఫామ్ ఎస్ఎంఇపై ఐపిఒల జారీకి సుమారు 200కుపైగా సంస్థలు ముసాయిదా దరఖాస్తులు దాఖలుచేసాయి. డిఆర్హెచ్పి దాఖలుచేసి ఐపిఒలకు అనుమతి కోరుతున్నాయి. మొత్తం 200కంపెనీల్లో 164 కంపె నీలు ఇప్పటికే స్టాక్ఎక్ఛేంజిల్లో జాబితా అయ్యాయి. ఇవన్నీ కలిపి మొత్తంగా 1282 కోట్లు మార్కెట్లనుంచి సమీకరించాయి. ప్రస్తుతం ఈ సంస్థలు మార్కెట్ విలువలు 18,345కోట్లుగా ఉన్నట్లుఅంచనా. మొత్తం 164 సంస్థలు బిఎస్ఇ ఎస్ఎంఇ ప్లాట్ఫామ్పై జాబి తా అయితే 23 సంస్థలు బిఎస్ఇ మెయిన్బోర్డుకు తరలిపోయాయి. ఆసియా అత్యంతప్రాచీన ఎక్ఛేంజి అయిన బిఎస్ఇ ఇప్పటికే ఎస్ఎంఇ విభాగంలో లీడర్గా నిలిచింది. మొత్తం 80శాతం మార్కెట్ వాటాతో ఉంది. బిఎస్ఇ 2012 మార్చినెలలో ఎస్ఎంఇ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. కొన్ని కంపెనీలు ఎస్ఎంఇ వేదికగా జాబితా అయితే మరికొన్ని కంపెనీలు మెయిన్ ప్లాట్ఫామ్కు తరలిపోయాయి.
ఇక భారత్ ఆర్థికవ్యవస్థ ప్రపంచంలోనే శరవేగంగా వృద్ధిచెందుతున్న ఆర్ధిక వ్యవస్థ గా నిలిచింది. 2025 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా మారుతుందనిఅంచనా. ఇందుకు ఎస్ఎంఇ రంగమే కీలకంఅవుతుందని బిఎస్ఇవెల్లడించింది. ఎస్ఎంఇ సంస్థల యజమానులు నిధుల సమీకరణతో మూలధన పెట్టుబడులు, విస్తరణప్రణాళికలతో పాటు నిర్వహణ ఖర్చు లకు సైతం వినియోగించుకునే అవకాశంఉంది. అందువల్ల నే బిఎస్ఇ ఎస్ఎంఇ ప్లాట్ఫామ్కు మంచి స్పందన లభి స్తోంది. పైగా సెబి కూడా ఎస్ఎంఇల ఐపిఒలకు ప్రోత్సా హం ఇవ్వడంతోపాటు ఇన్వెస్టర్ల సొమ్ముకు పరిరక్షణ కల్పి స్తోంది. అందువల్ల దేశీయ ఇన్వెస్టర్లే ఎక్కువగా వీటిలో పెట్టుబడులకు ముం దుకు వస్తున్నారు. ఎస్ఎంఇలు వృద్ధిలోకి వస్తే ఉపాధి కల్పన పెరుగుతుందని భావిస్తున్న కేంద్రం వీటిలో సాధ్యమైనంతవరకూ మూతపడకుండా చూస్తోంది.
====== | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
అజేయ శతకంతో ఆసీస్పై ప్రతీకారం తీర్చుకున్న డివిలియర్స్
డర్బన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రనౌట్ అవమానానికి డివిలియర్స్ ప్రతీకారం తీర్చుకున్నాడు. అజేయ శతకంతో సఫారీలకు ఆధిక్యం అందించాడు.
Samayam Telugu | Updated:
Mar 11, 2018, 05:20PM IST
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టులో డివిలియర్స్ అజేయ శతకంతో సత్తా చాటాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయిన ఏబీ.. ఈ టెస్టులో తన కసినంతా చూపించాడు. 146 బంతుల్లో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన డివిలియర్స్ 20 ఫోర్లు, ఒక సిక్సర్ బాదడం విశేషం. మొదటి టెస్టులో వేగంగా సింగిల్ తీయడానికి ప్రయత్నించిన ఏబీ రనౌట్ అయ్యాడు. బంతితో వికెట్లను కూల్చిన స్పిన్నర్ లియాన్.. డైవ్ చేసి కింద పడిపోయిన డివిలియర్స్ ఛాతి మీదకు బంతిని విసిరాడు. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో.. ఆసీస్ స్పిన్నర్‌ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.
Visit Site
Recommended byColombia
డివిలియర్స్‌ను రనౌట్ చేశాక లియాన్ అత్యుత్సాహం ప్రదర్శించడం క్రికెట్ అభిమానులను కలచి వేసింది. ఏబీ కెరీర్లోనే తొలిసారిగా పరుగులేమీ చేయకుండా రనౌట్ అయిన బాధ కంటే.. ఆసీస్ ఆటగాళ్ల తీరే బాధించింది. దీనికి ప్రతీకారంగా అన్నట్టుగా.. రెండో టెస్టులో డివిలియర్స్ అజేయ శతకంతో కదం తొక్కాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ధాటిగా ఆడి పరుగులు రాబట్టాడు. టెస్టుల్లో 22వ శతకం సాధించిన ఏబీ.. చివరి వరుస ముగ్గురు బ్యాట్స్‌మెన్‌తో కలిసి 155 పరుగులు జోడించాడు. దీంతో సఫారీలు 382 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ జట్టుకు 139 పరుగుల ఆధిక్యం లభించింది.
డర్బన్‌లో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 162 పరుగులకు ఆలౌట్ కాగా.. డివిలియర్స్ 71 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ
Highlights
నాగచైతన్య, చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి
గతంలో ప్రేమమ్ రిమేక్ కోసం కలిసి పనిచేసిన చైతు, చందు
చైతు సరసన నటించనున్న బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్
అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో తెరకెక్కుతున్న తాజా సినిమా సవ్యసాచి. ప్రేమం రీమేక్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వైవిధ్యమైన కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామను ఎంపిక చేశారట దర్శక నిర్మాతలు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో బీ టౌన్ బ్యూటీ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో మున్నా మైకెల్ సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ బామ. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ సినిమాలోని ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే చైతు సినిమా కోసం నిధిని ఎంపిక చేసినట్లు సమాచారం.
కార్తికేయ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న చందు మొండేటి.. ఈ సినిమాని పక్కా స్క్రిప్టుతో తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాలో నాగచైతన్య ను కూడా చాలా కొత్తగా చూపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న నాగచైతన్య వివాహం తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ ఏడాది చైతూ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత విడుదలైన యుద్ధం శరణం గచ్చామి..డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సవ్యసాచితో ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
Last Updated 25, Mar 2018, 11:51 PM IST | 0business
|
Asanka Gurusinha Comes To Dinesh Chandimal's Defense On Witchcraft Comment
జర్నలిస్ట్ ప్రశ్నకి లంక కెప్టెన్ క్లీన్బౌల్డ్
భారత్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్కి దిమ్మతిరిగే ప్రశ్న ఎదురైంది. ఇటీవల యూఏఈ వేదికగా పాకిస్థాన్తో
TNN | Updated:
Nov 10, 2017, 08:58AM IST
భారత్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే శ్రీలంక కెప్టెన్‌ దినేశ్ చండిమాల్‌కి దిమ్మతిరిగే ప్రశ్న ఎదురైంది. ఇటీవల యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ని శ్రీలంక 2-0తో చేజిక్కించుకుంది. మంత్రగత్తె అయిన తన స్నేహితుడి తల్లి ఆశీర్వాదంతోనే ఆ టెస్టు సిరీస్‌‌లో శ్రీలంక విజయం సాధించినట్లు వారం క్రితం చండిమాల్ వెల్లడించాడు. దీంతో అతనిపై తీవ్ర స్థాయిలో నెటిజన్లు, పాక్, మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అదే నిజమైతే.. టెస్టు సిరీస్ తర్వాత జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా శ్రీలంక ఎందుకు గెలవలేకపోయింది..? అని ప్రశ్నించారు.
నవంబరు 16 నుంచి భారత్ జట్టుతో ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా తొలి టెస్టులో శ్రీలంక ఢీకొనబోతోంది. ఈ టెస్టు మ్యాచ్ కంటే ముందు.. భారత్ బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ని లంక ఆడనున్న నేపథ్యంలో గురువారం రాత్రి మీడియా సమావేశంలో చండిమాల్ మాట్లాడాడు. ఈ సమావేశంలో కెప్టెన్‌కి జర్నలిస్ట్ నుంచి ఎదురైన తొలి ప్రశ్న ‘భారత్‌ జట్టుపై సిరీస్ గెలవాలని మంత్రగత్తె ఆశీస్సులు తీసుకున్నారా..?’. ఊహించని ఈ ప్రశ్నకి చండిమాల్ బిక్కమొహం వేయగా.. పక్కనే ఉన్న జట్టు మేనేజర్ అసంక గురుసిన్హా చొరవ తీసుకుని ‘అందరిలానే శ్రీలంక క్రికెటర్లకి కొన్ని నమ్మకాలున్నాయి. కానీ.. అంతిమంగా మైదానంలో జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే విజయం వరిస్తుంది’ అని సమాధానమిచ్చాడు. | 2sports
|
Jun 01,2017
ఐసీఐసీఐ వాటాలు కొన్న బ్లాక్రాక్
ముంబయి : దేశంలోని అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్లో వాటా పెంచుకొనే దిశగా బ్లాక్రాక్ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్ అడుగులు వేస్తోంది. తాజాగా బుధవారం ఆ సంస్థ బహిరంగ మార్కెట్ ద్వారా దాదాపు 3.54 కోట్ల ఐసీఐసీఐ బ్యాంకు షేర్లను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.1,1,55 కోట్లు. ఎన్ఎస్ఈలో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు బ్లాక్రాక్ సంస్థ 3,53,95,884 ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకు సగటున రూ.326.33 చెల్లించి బ్లాక్రాక్ ఈ వాటాలను కొనుగోలు చేసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రానాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్? షాకిస్తోన్న వార్తలు.. నిజమెంత?
రానా దగ్గుబాటి కిడ్నీలు రెండు చెడిపోయాయా? కిడ్నీ మార్పిడీకి ఆయన తల్లి ముందుకొచ్చిందా? రానా ఆరోగ్యం గురించి వస్తోన్న తాజా రూమర్లలో నిజమెంతో తెలుసుకోండి. మీరు షాకవుతారు.
Samayam Telugu | Updated:
Feb 26, 2019, 11:34PM IST
హైలైట్స్
రానా దగ్గుబాటి కిడ్నీలు రెండు చెడిపోయాయా?
కిడ్నీ మార్పిడీకి ఆయన తల్లి ముందుకొచ్చిందా?
రానా ఆరోగ్యం గురించి వస్తోన్న తాజా రూమర్లలో నిజమెంతో తెలుసుకోండి.
బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా.. మరోసారి అనారోగ్యానికి గురయ్యారా? రానా కంటి సంబంధ సమస్యలతో బాధపడుతున్నాడని గతంలో వార్తలొచ్చాయి. ఈ రూమర్లపై స్పందంచిన ఆయన తను కేవలం హై బీపీతో మాత్రమే బాధపడుతున్నానని, ఇతరత్రా అనారోగ్య సమస్యలేవీ లేవని చెప్పారు. కానీ రానా ఆరోగ్యానికి సంబంధించి తాజాగా మరో రూమర్ బయటకు వచ్చింది.
రానాకు కిడ్నీలు చెడిపోయాయని, వెంటనే కిడ్నీలు మార్చాలనే వార్త ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చింది. కిడ్నీ ఇచ్చేందుకు అతడి తల్లి ముందుకొచ్చిందని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఇదంతా ఉత్తిదేనని సమాచారం. ఇవన్నీ గాలి వార్తలని తెలుస్తోంది. ఆయనకున్న కిడ్నీ సమస్య చాలా చిన్నదని, త్వరలోనే ఆయన కిడ్నీ సమస్య తగ్గిపోతుందని కూడా ప్రచారంలో ఉంది. | 0business
|
అంచనాలపై ఇన్వెస్టర్ల ఆశలు
లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : భారతీయ స్టాక్మార్కెట్లు ఒక పర్సంటేజి పాయింటు లాభపడ్డాయి. భారతీయ రిజర్వుబ్యాంకు తన వడ్డీరేట్లను సడలిస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు మార్కెట్లలో కొనుగోళ్లు పెంచారు. సెన్సెక్స్ 332.63 పాయింట్లు పెరిగి 25,285 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50 సూచి 99.10 పాయింట్లు పెరిగి 7704.25 పాయింట్లవద్ద స్థిరపడింది 50షేర్ సూచీలు అంబు జా సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బోష్, హిందూ స్థాన్ యూనిలీవర్, భారతీయ స్టేట్బ్యాంకులు 3శాతం నుంచివ 4.42శాతం చొప్పున పెరిగాయి. ఇతరత్రా ఏసియన్ పెయింట్స్, లూపిన్, భెల్; కోల్ ఇండియా, గెయిల్ఇండియా సంస్థలు 0.48 శాతం నుంచి 2.27శాతం మేర దిగజారాయి. సూచీలవారీగాచూస్తే బిఎస్ఇ కేపిటల్గూడ్స్ సూచి 2.01శాతం, వినియోగరంగ ఉత్పత్తులసూచి 1.80 శాతం, రియాల్టీ సూచి 1.78శాతం, బ్యాంకింగ్ సూచి 1.70శాతం, ఎఫ్ఎంసిజి 1.65శాతం చొప్పు న భారీస్థాయిలో లబ్ధిపొందాయి. ఇతర సూచీలు కూడా లాభాల్లోనే ముగిసాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడుల ప్రోత్సాహకమండలి మొతతం 15 ఎఫ్డిఐ ప్రతిపాదనలను ఆమోదించింది. వీటిలో నిప్పన్లైఫ్ బీమా, టాటా ఎఐఎ, అవైవాలైఫ్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తం ఎఫ్డిఐ 7262 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. యస్బ్యాంకులో విదేశీ పెట్టుబడులను 74శాతానికి పెంచుకునేందుకు కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమి టీ ఆమోదించింది. దీనితో ఎస్బ్యాంకు షేర్లు 2.13 శాతం పెరిగి 831.35 రూపాయలుగా ఉన్నాయి. ఆసియా ఈక్విటీమార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిసాయి. ముడిచమురు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసింది. అమెరికా, చైనాల నుంచి ఆర్థికగణాంకాల వైపు ఎక్కువ దృష్టిపెట్టారు. గుడ్ఫ్రైడే సందర్భంగా చాలా మార్కెట్లు మూతపడ్డాయి. చైనాషేర్లు ఏడో రోజు కూడా లాభాల్లోనే ముగిసాయి. ఇక దేశీయ మార్కెట్లపరంగాచూస్తే స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండుశాతం, పంజాబ్నేషనల్ బ్యాంకు మూడు శాతం చొప్పున పెరిగాయి. బిఎస్ఇ సూచీల్లో ఎక్కు వగా కేపిటల్గూడ్స్ 2.12శాతం, వినియోగరంగ ఉత్పత్తులు 1.87శాతం, ఎఫ్ఎంసిజి, 1.83 శాతం, రియాల్టీ 1.79శాతం చొప్పున పెరిగాయి. బ్యాంకింగ్ సూచి 13 శాతం ఈనెలలో పెరిగింది. ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన మూలధన కల్పన విధా నం ప్రకటించడం, కేంద్ర బ్యాంకు కూడా బేసెల్ నిబంధనలకు అనుగుణంగా మూలధన వనరుల సమీకరణపై స్పష్టమైన నిబంధనలు రూపొందిం చడంతో బ్యాంకింగ్రంగం ప్రకాశంచింది. ఇక జ్యుయెలరీ సంస్థలషేర్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. 19 రోజుల సమ్మెకారణంగా మార్కెట్లలో ఈ కంపె నీల షేర్లు దెబ్బతిన్నాయి. అయితే శనివారం ప్రభు త్వం ఎక్సైజ్శాఖ పరంగా వ్యాపారులను ఎటు వంటి వేధింపులు గురిచేయదని హామీ ఇచ్చింది. పిసి జ్యుయెలర్ 1.6శాతం పెరిగింది. పర్సి స్సెంట్ సిస్టమ్స్ 18.7శాతం పెరిగింది. ఏసియన్ పెయింట్స్ 2,5శాతం దిగజారింది. సెన్సెక్స్లో టాప్ ఐదుసంస్థలు లాభపడిన వాటిలో హిందూ స్థాన్ యూనిలీవర్ 4.13శాతం, భారతీయ స్టేట్ బ్యాంకు 3.11శాతం, ఎల్అండ్టి 2.65శాతం, హెచ్డిఎఫ్సి 2.42శాతం, టాటామోటార్స్ 2.41 శాతం పెరిగాయి. నష్టాలపరంగా చూస్తే ఏసియన్ పెయింట్ 2.06శాతం, లూపిన్ 1.66శాతం, భెల్ 1.28శాతం, హీరోమోటోకార్ప్ 0.95శాతం, గెయిల్ 0.59శాతం చొప్పున నష్టపోయాయి. మొత్తంగాచూస్తే కొంతమేర రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లను సవరిస్తుందన్న అంచనాలతోనే మార్కెట్లు గరిష్టంగా పెరిగినట్లు స్పష్టం అవుతోంది. రిజర్వుబ్యాంకు ఇప్పటివరకూ సవరించిన 125 బేసిస్ పాయింట్లకు తోడు వచ్చే సమీక్షలో కనీసం 25 బేసిస్ పాయింట్లు, గరిష్టంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో బ్యాంకింగ్షేర్లు ర్యాలీ తీసాయి. | 1entertainment
|
Hyderabad, First Published 2, Feb 2019, 10:39 AM IST
Highlights
నిర్మాతలు తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లటానికి రకరకాల స్కెచ్ లు వేస్తూంటారు. ముఖ్యంగా డబ్బింగ్ నిర్మాతలు అయితే వెరైటీ ఆలోచనలు చేస్తూంటారు. ఏ టైటిల్ పెడితే జనాల దృష్టి పడుతుందో చూస్తారు. తాజాగా ఓ తమిళ డబ్బింగ్ నిర్మాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ద్వారక’ చిత్రం ఇప్పుడు తమిళంలో ‘అర్జున్రెడ్డి’టైటిల్ ని మార్చి విడుదల చేస్తోంది.
నిర్మాతలు తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లటానికి రకరకాల స్కెచ్ లు వేస్తూంటారు. ముఖ్యంగా డబ్బింగ్ నిర్మాతలు అయితే వెరైటీ ఆలోచనలు చేస్తూంటారు. ఏ టైటిల్ పెడితే జనాల దృష్టి పడుతుందో చూస్తారు. తాజాగా ఓ తమిళ డబ్బింగ్ నిర్మాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ద్వారక’ చిత్రం ఇప్పుడు తమిళంలో ‘అర్జున్రెడ్డి’టైటిల్ ని మార్చి విడుదల చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్ బ్యానరుపై ఏఎన్ బాలాజీ తమిళంలో నిర్మిస్తున్నారు.
‘అర్జున్రెడ్డి’టైటిల్ బాగా పాపులర్ అవడంతో ఈ సినిమాకు అదే పేరును పెట్టినట్లు చిత్ర యూనిట్ చెబుతున్నాయి. పూజా జవేరి కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ప్రకాశ్రాజ్, ప్రభాకర్, మురళీ శర్మ, సురేఖలు ఇతర తారాగణం. శ్యామ్ కె.నాయుడు సినిమాటో గ్రాఫర్గా వ్యవహరించారు. సాయికార్తిక్ సంగీతం సమకూర్చారు. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వం వహించారు.
నిర్మాత ఏఎన్ బాలాజీ మాట్లాడుతూ.... ‘ద్వారాక’ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘అర్జున్రెడ్డి’ పేరుతో తమిళంలో అనువాదం చేశాం. ప్రేమ, యాక్షన్, కమర్షియల్ వంటి అంశాలన్నీ కలగలిసిన సినిమా ఇది. త్వరలోనే పాటల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, పలువురు సినీ ప్రముఖులు ఇందులో అతిథులుగా హాజరుకానున్నారని’ పేర్కొన్నారు.
Last Updated 2, Feb 2019, 10:39 AM IST | 0business
|
Hyderabad, First Published 12, Sep 2019, 11:22 PM IST
Highlights
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్గా 53 ఎపిసోడ్లను పూర్తి చేసి గురువారం నాటితో 54వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
గత రెండు రోజులుగా 'ఇంట్లో దెయ్యం నాకేంటి భయం' అనే టాస్క్తో ఇంటి సభ్యులతో ఆడుకున్న బిగ్ బాస్ కి చుక్కలు చూపించింది పునర్నవి. బిగ్ బాస్ షూ పాలిష్ చేయాలని విధించిన శిక్షని తను ఫాలో అవ్వనని బిగ్ బాస్ తోనే గొడవకి దిగింది. ఇక గురువారం నాటి ఎపిసోడ్ లో మాత్రం పునర్నవి రాజీ పడింది.
నిన్న, మొన్నటి ఎపిసోడ్లలో క్యారెక్టర్ అంటూ అన్ని మాటలు మాట్లాడిన పునర్నవి ఫైనల్ గా బిగ్ బాస్ కి సారీ చెప్పి షూ పాలిష్ చేసింది. అనంతరం పునర్నవితో పాటు మహేష్, శ్రీముఖిలకు సైతం లగ్జరీ బడ్జెట్ వాడుకోవచ్చని బిగ్ బాస్ చెప్పారు. ఇక ఈ వారం కెప్టెన్సీ కోసం 'బరువు లెత్తగలవా జెండా పాతగలవా' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
ఇందులో ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ కాని వారికి ఛాన్స్ ఇచ్చారు. దీని ప్రకారం శ్రీముఖి, పునర్నవిలు కెప్టెన్ అయ్యేందుకు ఆసక్తి చూపించకపోవడంతో.. మహేష్, వితికా, రవిలు కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడ్డారు. టాస్క్ ప్రకారం.. కెప్టెన్ కావాలనుకున్న వాళ్లు.. వాళ్లకు నచ్చిన వాళ్ల వీపుపై ఎక్కి తమకు ఇచ్చిన జెండాలను ఒక ప్లేస్లో పెట్టాల్సి ఉంటుంది.
ఇలా జోడీగా ఆడిన ఆటలో ఎవరు ఎక్కువ జెండాలు పెడితే వాళ్లే బిగ్ బాస్ కొత్త కెప్టెన్ అని చెప్పారు బిగ్ బాస్. ఈ క్రమంలో వితికా తన భర్త వరుణ్ వీపుపై.. శ్రీముఖి-రవి వీపుపై.. శివజ్యోతి- మహేష్ వీపుపై ఎక్కి గేమ్ ఆడారు. ఈ ప్రాసెస్ లో వితికా ఎక్కువ జెండాలు పెట్టడంతో ఈ వారం ఆమె కెప్టెన్ గా ఎంపికైంది.
Last Updated 12, Sep 2019, 11:25 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వాళ్ల అథ్లెట్లకు డోప్ టెస్ట్ లు చేయలేదట
రియో ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ తమ అథ్లెట్లకు డోపింగ్ టెస్టులు చేయలేదట.
TNN | Updated:
Aug 6, 2016, 12:52AM IST
రియో ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ తమ అథ్లెట్లకు డోపింగ్ టెస్టులు చేయలేదట. ఈ విషయాన్ని బ్రెజిల్ అధికారులే తెలిపారు. జూలై 1 - 24 తేదీల మధ్య ఒక్క అథ్లెట్ కు కూడా డోప్ టెస్టులు చేయలేదని వారు వివరించారు. ప్రతి దేశం తమ అథ్లెట్లకు కచ్చితంగా డోపింగ్ టెస్టులు నిర్వహించాలి అనే నిబంధన ఉంది. కానీ బ్రెజిల్ అలా చేయకపోవడంపై ఇప్పుడు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) తమ దేశ డోపింగ్ టెస్టింగ్ లాబోరేటరీని మూసివేసిన కారణంగా డోప్ టెస్టులు చేయలేదని బ్రెజిల్ చెబుతుండడం ఆశ్చర్యకరమైన విషయం. | 2sports
|
మందగమన పరిస్థితులు నిజమే..
- ప్రధాని ఆర్థిక సలహా మండలి
- 10 ప్రాధాన్యతాంశాల గుర్తింపు
- స్థిరీకరణ కొనసాగించాలని సూచన
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు నిజమేనని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) ఒప్పుకుంది. ఇందుకు గల ప్రధాన కారణాలను తాము అన్వేషించనున్నట్టుగా పేర్కొంది. దేశంలో వృద్ధిని పరుగులు పెట్టించేందుకు, రానున్న ఆరు నెలల్లో మేటి ఉద్యోగావకాశాలు సృష్టించేందుకు గాను సర్కారు దృష్టి సారించాల్సిన 10 ప్రాధాన్యత అంశాలను మండలి గుర్తించినట్టు సర్కారు ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి, ఉద్యోగ కల్పన, అసంఘటిత రంగం మరియు ఏకీకరణ, ఆర్థిక ప్రణాళిక, ద్రవ్య విధానం, ప్రజా వ్యయం, ఆర్థిక పాలన సంస్థలు, వ్యవసాయం, పశుగణాభివృద్ధి, వివిధ రకాల వినిమయం, ఉత్పత్తితో పాటు సామాజిక రంగాలను కమిటీ ప్రాధాన్యతాంశాలుగా గుర్తిం చిందని తెలిపింది. ఈ సందర్భంగా పీఎంఈఏసీ అధినేత బిబేక్ దెబోరారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించుకున్న ఆర్థిక స్థిరీకరణ విధానాలకు కట్టుబడి ముందుకు సాగాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్థిక స్థిరీకరణ విధానాల నుంచి పక్కకు మరలే చర్యలు వద్దని సూచించారు. కీలక భాగస్వాములతో చర్చలు జరిపి ఆర్థిక పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు గాను తాము ప్రధాన మంత్రికి తగిన సూచనలు మాత్రమే చేయనున్నుట్టు ఆయన తెలిపారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా వృద్ధి రేటు పడిపోయిందని ఐఎంఎఫ్ వెల్లడించిన అంచనాలు నూటికి 80% తప్పు అని కౌన్సిల్ సభ్యులు రతిన్ రారు అభిప్రాయ పడ్డారు. వృద్ధి మందగమనానికి అసలు కారణాలను తాము అన్వేషించునున్నట్టుగా తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రైల్వే స్టేషన్లలో గూగుల్ వైఫై-ఆసక్తికర విషయాలు
భారతప్రభుత్వం, గూగుల్ సంయుక్తంగా ఉచిత WiFi సేవలను ప్రవేశపెట్టాయి.
Samayam Telugu | Updated:
May 27, 2018, 03:39PM IST
రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై
రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై వెనుక కథా కమామిషు ఇది
చాలా ఏళ్ల నుంచి రైల్వే స్టేషన్లలో రైల్వే శాఖ ఉచిత వైఫై అందించడం మనకు తెలిసిందే. అది ఎంత ఫేలవంగా పనిచేస్తుందో కూడా అందరికీ తెలుసు. అందుకే దానిపైన ఎవరికీ ఆసక్తి కలగలేదు. దీంతో భారతప్రభుత్వం, గూగుల్ సంయుక్తంగా ఉచిత WiFi సేవలను ప్రవేశపెట్టాయి. రైల్ టెల్ సాయంతో ఈ ప్రాజెక్టును నడిపిస్తున్నారు. మీరు ఎప్పుడైనా సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, బెంగుళూరు ఎస్బీసీ, చెన్నై సెంట్రల్ వంటి రైల్వే స్టేషన్లకు వెళితే మీకే తెలుస్తుంది. ప్రధాన రైల్వే స్టేషన్లలలో WiFi ఆన్ చేసి.. ఫ్రీ వైఫైని ఎంచుకుంటే మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి ఎక్కువ వేగంతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం వాడుకోవచ్చు. ఈ Google WiFi సర్వీస్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు ఇక్కడ తెలుసుకుందాం.
రైల్వే స్టేషన్లలో గూగుల్ వైఫై | 1entertainment
|
Aug 09,2015
రూ.257 కోట్లకు తగ్గిన యుకో బ్యాంకు
కోల్కతా: యుకో బ్యాంకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.256.70 కోట్ల లాభాలతోనే సరిపెట్టుకుంది. 2014-15 ఇదే త్రైమాసికంలో రూ.521.40 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే గత త్రైమాసికంలో లాభాల్లో 50.76 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ఇదే త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం 5,395 కోట్ల నుంచి రూ.5,169.09 కోట్లకు తగ్గింది. బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 4.31 శాతం నుంచి 7.30 శాతానికి ఎగిశాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Jul 27,2018
ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గురువారం కాస్త వెసులుబాటు కల్పించింది. గత పన్ను చెల్లింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలునకు తుదిగడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్టుగా కేంద్ర పత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. వాస్తవానికి రిటర్నుల దాఖలునకు జులై 31ని ప్రభుత్వం తుది గడువుగా ప్రకటించినప్పటికీ పలు అభ్యర్థన మేరకు సర్కారు ఈ సవరణ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. తుది గడువులోపు ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయకపోతే రూ.1,000, రూ 5,000, రూ.10,000 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని సీబీడీటీ పేర్కొంది. అపరాధరుసం ఎంతా అనేది రిటర్ను దాఖలు చేసిన తేదీ ఆధారంగా నిర్ణయిస్తారు. 2018-19 సంవత్సరానికి కొత్త ఇన్కమ్ట్యాక్స్ అసెస్మెంట్ ఫారాలను ఏప్రిల్ 5వ తేదీన సీబీడీటీ విడుదల చేసింది. కొత్తఫారం కారణంగా ఆదాయపన్ను రిటర్నుల దాఖలులో జాప్యం జరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు గడువు పొడిగింపు నిర్ణయం వెలువడి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Nov 01,2019
సాబా కరీంపై బీసీసీిఐ సీరియస్!
న్యూఢిల్లీ: మహిళల క్రికెట్ జట్టు ఇన్ఛార్జి సాబా కరీం నిర్లక్ష్య వైఖరిపై బిసిసిఐ సీరియస్ అయ్యింది. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత మహిళాజట్టు సభ్యులకు రోజువారీ అలెవెన్స్(డిఏ) రూపంలో ఇవ్వాల్సిన నగదుపై సాబా కరీం అలసత్వం ప్రదర్శించడమే ఈ సీరియస్కు కారణం. భారత క్రికెట్ జట్ల ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ గత నెల 18 వరకూ వినోద్ రారు నేతృత్వంలోని క్రికెట్ పరిపాలక కమిటీ(సిఓఏ) చూసేది. అయితే బిసిసిఐ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో దాన్ని సాబా కరీంకు అప్పచెప్పింది. దీనిపై సెప్టెంబర్ 23వ తేదీనే కరీంకు మెయిల్ పంపారు. అయితే అక్టోబర్ 24వరకూ ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి సాబా కరీం ఏమీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే భారత మహిళా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లడంతో నగదు సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని వెంటనే బిసిసిఐకు తెలియజేయడంతో కొత్త నియమించబడ్డ కార్యవర్గం జోక్యంతో డిఏను ఆగమేఘాలపై బదిలీ చేయాల్సివచ్చింది. విండీస్ పర్యటనలో భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్తో పాటు ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 2sports
|
కుదేలవుతున్న అంతర్జాతీయ చమురు మార్కెట్లు
-వెక్కిరిస్తున్న పెట్రో ,డీజిల్ రేట్లు
అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్కు 28 డాలర్లకన్నా తక్కువకు పడిపోయాయి. 2003 తర్వాత ఇది అతి తక్కువ స్థాయి. 9 ఏండ్ల క్రితం చమురు ధర బ్యారల్కు 140 డాలర్లకు పైగా పలికింది. ఈ ధరల పతనం వల్ల మన దేశంలో మాత్రం ప్రభుత్వాలు ఖజానా నింపుకుంటున్నాయి. దీనితో వందల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యింది. చమురు బిల్లు ఈ ఏడాదిలో నికరంగా 47 బిలియన్ డాలర్లు (రూ. 3 లక్షల కోట్లకు పైగా) తగ్గింది. కానీ సగటు వినియోగదారులకు మాత్రం ఈ ధరల తగ్గింపు వల్ల ఎలాంటి లాభం చేకూరలేదు.
జులై 2008లో ముడి చమురు ధర అత్యధిక స్థాయిలో బ్యార ల్కు 147 డాలర్లు ఉన్నప్పుడు, మన దేశంలో (ఢిల్లీలో) పెట్రోలు రూ.50.62/ లీటరు, డీజిల్ రూ. 34.86/లీటరు చొప్పున అమ్మారు. ఆ తర్వాత నుంచి అంత ర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వరుసగా తగ్గు తున్నప్పటికీ ఇక్కడ పెట్రోలు, డీజిల్ ధరల్లో మాత్రం వరుసగా పెరుగుదలే నమోదైంది. ప్రత్యేకించి 2010-12 మధ్య వీటి ధరలు చుక్కల్ని తాకాయి. పెట్రోలు ధర లీటరుకు రూ. 73. 18, డీజిల్ ధర రూ. 47.93కు చేరాయి. ఆనాటికి అంతర్జా తీయ ముడి చమురు ధర బ్యారల్కు 90 డాలర్లు మాత్రమే. ప్రస్తు తం బ్యారల్కు 30 డాలర్లకన్నా తక్కువ స్థాయికి చేరుకున్న నేప థ్యంలో పెట్రోలు ధర లీటరుకు 20, డీజిల్ ధర ఇంకా తక్కువ ఉండా ల్సింది. కానీ అలా జరగలేదు. దానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభు త్వం వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని ఎడా పెడా పెంచుతూ పోవడమే.
వినియోగదారుల ప్రయోజనాలు హుళక్కి
జూన్ 2010 నుంచి అప్పటి యూపీఏ ప్రభుత్వం క్రమంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై నియంత్రణ తొలగిస్తూ వచ్చింది. అప్పటి దాకా ఉన్న నియంత్రణా వ్యవస్థను తొలగిస్తూ పెట్రోలు, డీజిల్ల టోకు, రిటైల్ ధరలను పూర్తిగా మార్కెటు శక్తులకు అప్పగిం చింది. ఇలా చేయడం ద్వారా అంతర్జాతీయ ధరలలో చోటు చేసు కునే హెచ్చుతగ్గులను బట్టి వినియో గదారులకు నేరుగా ప్రయో జనం చేకూరుతుందని అప్పటి ప్రభుత్వం నమ్మబలికింది. నిజానికి ప్రపంచబ్యాంకు ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పారిఖ్ కమిటీ ఈ సూచ నలు చేసింది. చమురు రంగం లో ఉన్న బడా కిలాడీలకు అమిత లాభాలు చేకూర్చడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకుందనేది స్పష్టం. అప్పటి నుంచి వరుసగా అంతర్జా తీయ మార్కెట్లో చమురు ధరలు దిగిపోతున్నాయి. గత రెండేండ్ల కాలంలో మోడీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్లపై పన్నుల్ని విపరీతంగా పెంచింది. సందట్లో సడేమియా అన్నట్టుగా రాష్ట్రాలూ తమ వంతుగా వ్యాట్ను పోటెత్తించాయి.ఇలా పన్నులను పెంచడం ద్వారానే జీడీపీలో 3.9 శాతం విత్తలోటు లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర పాలకులు తెగేసి చెబుతున్నారు. మరోవైపు, 'మేక్ ఇన్ ఇండి యా' అంటూ చేస్తున్న నినాదాలు, పబ్లిక్ రంగ సంస్థల వాటాలను తెగనమ్మే విధానాలు ఏవీ ఆశించిన 'ఫలి తాలు' ఇవ్వడం లేదనీ, కాబట్టి పరోక్ష పన్నుల్ని పెం చడం ద్వారానే లోటు పూడ్చుకుం టామనీ వారు బాహాటంగానే చెబుతున్నారు. అసలే మండిపో తున్న నిత్యావసర వస్తువుల ధరలతో, పెరుగుతున్న నిరుద్యోగంతో, కరువు కాటకాలతో బాధపడుతున్న దేశ ప్రజలకు ఈ పన్ను పోటు గోరు చుట్టుపై రోకటి పోటులా పరిణమిస్తున్నది. ప్రజల వ్యతిరేకతను లెక్క చేయకుండా చేపడుతున్న ఈ దుష్ట విధా నాలకు పాలకులు మూల్యం చెల్లించకతప్పదు.
ఇలా, వినియోగదారులు పెట్రోలుకు చెల్లించే ధరలో 61 శాతం కంపెనీలకు, డీలర్లకు, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు చేరుతుండగా, లీటరు డీజిలుకు చెల్లించే ధరలో 58.4 శాతం కంపెనీలకు, డీలర్లకు, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు చేరుతోంది.
వ్యాట్ పోటులో ముందున్న ఏపీ
పెట్రోలు, డీజిల్ ధరల్లో కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ పన్నులు సింహభాగం ఆక్రమిస్తుండగా, రాష్ట్రాలు వడ్డిస్తున్న వ్యాట్ వల్ల కూడా వినియోగదారులపై భారం తడిసి మోపెడవుతోంది. ఇటీవల ఒడిషా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్లపై వ్యాట్ను 23 శాతం నుంచి 26 శాతానికి పెంచింది. దీనితో రూ. 361 కోట్ల అదనపు రాబడి ఉంటుందని ఆ ప్రభుత్వం చెప్పింది. ఇంకా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కూడా ఇటీవల వ్యాట్ను పెంచింది. అయితే దేశంలో అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పెట్రోలుపై ఆంధ్రప్రదేశ్లో 39.66% వ్యాట్ వసూలు చేస్తున్నారు. కాగా, తెలంగాణలో 35.20%, మహారాష్ట్రలో 32.07%, పంజాబ్లో 38.44%, పశ్చిమ బెంగాల్లో 28.52%, ఉత్తరప్రదేశ్లో 33.88% వ్యాట్ ఉంది. డీజిల్పై వ్యాట్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో 32.72%, తెలంగాణలో 27%, మహారాష్ట్రలో 28.93%, కేరళలో 27.35% ఉంది. డీజిల్పై ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలలో వ్యాట్ తక్కువగా ఉంది.
దిగజారుతున్న రూపాయి విలువ
పడిపోతున్న రూపాయి విలువ కూడా ధరాభారానికి ఒక కారణంగా ఉంది. దీని వల్ల కూడా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల్లో తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు చేరకుండా అవుతోంది. జులై 2008 నాటికి డాలరుకు రూ. 42గా ఉన్న రూపాయి విలువ ప్రస్తుతం రూ. 67.5కు పడి పోయింది. ఉదాహరణకు 2008లో బ్యారల్ ధర 100 డాలర్లు ఉన్నప్పుడు మన దేశం రూ. 4,200 చెల్లించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అదే ధర ఉంటే రూ. 6,750 చెల్లిం చాల్సి వస్తుంది. ఆ లెక్కన రూపాయి విలువలో తరుగుదల ఫలితంగా ధరలో 61 శాతం పెరుగుదల జరిగినట్టు. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ రూపాయి బలహీనత కూడా సగటు వినియోగదారులకు ప్రయోజనం చేకూరకుండా అడ్డుకుంటోంది.
ఎక్సైజ్ బాదుడు
2014 ఏప్రిల్ 2 నుంచి 2016 జనవరి 2 మధ్య, దాదాపు రెండేండ్ల కాలంలో, కేంద్రం పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ పన్నులను వరుసగా 108.21 శాతం, 288.09 శాతం పెంచింది. ఈ కాలంలో మొత్తం ఏడు సార్లు ఎక్సైజ్ పన్నుల్ని పెంచగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మూడు సార్లు పెంచారు. ఈ మూడు సార్లు జరిగిన పెంపుదల వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 10,000 కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం ఇలా ఎక్సైజ్ పన్ను పెంచనట్టయితే వినియోగదారులు కొనుగోలు చేసే పెట్రోలు, డీజిల్ ధరలు కనీసం రూ. 10 తగ్గి పోయేవని విశ్లేషకుల అంచనా. మరోమాటలో చెప్పాలంటే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసే వినియోగదారుల జేబుల్లోంచి లీటరుకు కనీసం రూ. 10 కేంద్రం అదనంగా లాగేసుకుంటున్నది.
అంతర్జాతీయ మార్కెట్లో
చమురు ధరల పతనంతో భారత్కు చేకూరిన లాభం
గరిష్ఠ చమురు బిల్లు (2012లో) 108 బిలియన్ డాలర్లు
ప్రస్తుత 12 నెలల చమురు బిల్లు 61 బిలియన్ డాలర్లు
నికర పొదుపు 47 బిలియన్ డాలర్లు (రూ. 3,18,601 కోట్లు)
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
- రైతు బాగుపడితేనే దేశాభివృద్ధి
- డీడీ కిసాన్ ఛానెల్ ప్రారంభ సభలో ప్రధాని
న్యూఢిల్లీ: రైతు అభివృద్ధి చెందనిదే దేశం అభివృద్ధి చెందదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం దూరదర్శన్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతునేస్తపు ఛానెల్ 'కిసాన్' ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వ్యవసాయోత్పత్తి 50 శాతం మేర పెరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మెరగైన సాగు పద్ధతులు, దానికి అవసరమైన సమాచారాన్ని దేశ రైతులకు అందించేందుకు గాను ప్రభుత్వం 'కిసాన్' ఛానెల్ను ఆవిష్కరించింది. ప్రస్తుత వ్యవస్థ అన్నదాతలను అనాథగా వదిలేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై సమాజంలోని సాగు నిపుణులు ఒక్కతాటి పైకి వచ్చి రైతుకు సాయం అందించి వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని ఆయన అన్నారు. దేశంలో అన్నదాతల సమాజమే అతిపెద్దదని తెలిపారు. భారత్ను వృద్ధి బాట పట్టించాలంటే గ్రామాలను, రైతులను ముందుగా అభివృద్ధి పరచాలని ఆయన సూచించారు.
దేశంలో పప్పుధాన్యాల అధిక ధరల వల్ల పోషకాహార లోపం బాగా పెరుగుతుండటం పట్ల ప్రధాని అందోళన వ్యక్తం చేశారు. వంటనూనె, పప్పు ధాన్యాల డిమాండ్ తీర్చేందుకు దేశం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. దీనిని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు రైతన్నలతో కలిసి 2022 నాటికి (దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం) దేశీయ డిమాండ్కు సరిపడేలా ఉత్పత్తి పెంచేందుకు కృషి చేయాలని అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
చైనాలో భజరంగీ భాయ్ జాన్ భారీ ఓపెనింగ్స్.. దంగల్ ను కొడుతుందా?
Highlights
మార్చి 2న చైనాలో రిలీజైన భజరంగీ భాయ్ జాన్
సల్మాన్ నటించిన ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్
దంగల్ రికార్డును కొడుతుందని విష్లేషకులా అంచనాలు
భారత్ లో విడుదలైన రెండేళ్ల తర్వాత సల్మాన్, కబీర్ ఖాన్ భజరంగీ భాయ్ జాన్ చిత్రం చైనాలో రిలీజ్ అయింది. రెండు దేశాల బోర్డర్ ల మధ్య జరిగే ఈ చిత్రంలో సల్మాన్, హర్షాలి మల్హోత్రా, కరీనా కపూర్ ఖాన్ నటించారు. బాలీవుడ్ లో రూ.320 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం చైనాలోనూ భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది.
చైనాలో ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పింది. ఇప్పటికే... చైనాలో ఆమిర్ ఖాన్ నటించిన దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలు భారీ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించాయి.
భారత రెజ్లర్ మహావీర్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా దంగల్. ఈ చిత్రం చైనా బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లు వసూళ్లు చేసి రికార్డుల మోత మోగించింది. అంతేకాక భారత్ లో వసూళ్లయిన మొత్తం కంటే.. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ మూవీగా దంగల్ రికార్డు సృష్టించింది.
చిన్న పాత్రే అయినా ఆమిర్ నటించిన మరో చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ చైనీస్ బాక్సాఫీస్ వద్ద రూ.760 కోట్లు వసూళ్లు సాధించింది. భారత్ లో ఇది కేవలం 63.40 కోట్లు మాత్రమే వసూళ్లు చేయటం గమనించాల్సిన అంశం. ఈ చిత్రంలో జైరా వాసిమ్ ప్రధాన పాత్రలో నటించింది.
చైనాలో ఆమిర్ ఖాన్ తన అద్భుత నటనతో గుర్తింపు పొందిన నటుడుగా నిరూపించుకున్నాడు. మరి సల్మాన్ ఖాన్ భజరంగీ భాయ్ జాన్ భారీ ఓపెనింగ్స్ సాధించిన నేపథ్యంలో.. దంగల్ రికార్డులు తిరగరాస్తుందా అనే అంచనాలు నెలకొన్నాయి.
Last Updated 25, Mar 2018, 11:40 PM IST | 0business
|
- ప్రభుత్వ విమాన సంస్థ ఎయిరిండియావాటా విక్రయానికి క్యాబినెట్ 'సై'!
- ఆర్థిక మంత్రి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ
న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటా విక్రయానికి మోడీ సర్కారు తెర లేపింది. బుధవారం జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో క్యాబినెట్ ఎయిరిండియాలో వాటా అమ్మకానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీంతో దేశీయ విమానయాన రంగంలో 'మహారాజా'గా వెలుగొందిన ఎయిరిండియాకు మంగళం పాడే విషయం అధికారికంగా సుస్పష్టమైంది. మంత్రివర్గ భేటీ అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మాట్లాడుతూ విమానయాన శాఖ, నిటి అయోగ్ల సిఫారసుల మేరకు ఎయిరిండియాలో పెట్టుబడులను ఉపసంహరి ంచుకునేందుకు కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ప్రైవేటు వ్యక్తులు ఎయిర్ ఇండియా సంస్థలో చేరడం వల్ల సంస్థ మరింత నాణ్యంగా, వేగంగా పనిచేయగలదని తాము ఆశిస్తున్నట్టు కేంద్ర మంత్రి జైట్లీ వివరించారు. ఎయిరిండియాలో వాటా విక్రయానికి సంబంధించి ఆర్థిక మంత్రి నేతత్వంలో ఒక కమిటీ ఏర్పాటుకు చేయాలన్న విమానయానశాఖ శాఖ ప్రతిపాదనను కూడా క్యాబినెట్ సమ్మతించిందని తెలిపారు. వాటాల అమ్మకం, అప్పులు, ఆస్తులు తదితర అంశాలను ఈ బందం పరిశీలిస్తుందని.. ఆ తరువాతే ఎంత మొత్తంలో వాటా విక్రయించాలనే విష యమై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇందులో సభ్యులను త్వరలోనే ఎంపిక చేయనున్నట్టుగా తెలిపారు. అయితే వాటా విక్రయం ప్రక్రియ కోసం ఎర్పాటు చేయనున్న కమిటీకి ఎలాంటి కాల వ్యవధిని నిర్ధేశించలేదని జైట్లీ తెలిపారు.
మరో అవకాశం కల్పించండి: ఉద్యోగ సంఘాలు
ఎయిరిండియాను ప్రయివేటుపరం చేసే యోచన విషయాన్ని పునరాలోచించాలని ఆ సంస్థ ఉద్యోగ సంఘాలు బుధవారం నిటి అయోగ్ చైర్మెన్ అరవింద్ పనగరియాను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు గాను సంస్థకు భారంగా మారిన దాదాపు రూ.30,000 కోట్ల రుణాన్ని మాఫీ చేసి ఎయిరిండియా తిరిగి పట్టాలెక్కేందుకు మరో అవకాశం కల్పించాలని వారు కోరారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే సంస్థకు ఈ దురవస్థ కలిగిందని వారు ఆరోపించారు. ప్రయివేటీకరణ పేరుతో సర్కారు లాభదాయకమైన విమానయాన రూట్లను ప్రయివేటుకు అప్పగించడం సబబు కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రయివేటీకరణ నిర్ణయం తీసుకొనే ముందు 25000 మంది ఉద్యోగుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని వారు కోరారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
లాభాల స్వీకరణతో నష్టాల్లోకి..
- సెన్సెక్స్ 47 పాయింట్లు పతనం
ముంబయి: మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలను మూటగట్టుకున్నాయి. దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు తోడు చైనా మార్కెట్లు భారీగా పడిపోయాయన్న వార్తల నేపథ్యంలో మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒత్తిడికి గురయ్యాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 47 పాయింట్లు తగ్గి 27,832 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 8,467 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్క్యాప్ సూచీ 0.5 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.8 శాతం చొప్పున రాణించాయి. మొత్తంగా మదుపర్ల మద్దతుతో 1,629 స్టాక్స్ లాభాల్లో ముగియగా,1,240 స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. రంగాల వారిగా బీఎస్ఇలో ఐటి సూచీ అత్యధికంగా 1.61 శాతం పెరిగింది. ఇదే క్రమంలో కన్సూమర్ డ్యూరెబుల్స్ 1.15 శాతం, టెక్ 0.96 శాతం, కాపిటల్ గూడ్స్ 0.88 శాతం చొప్పున రాణించాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 216 Views
హైదరాబాద్ : భారతీయ మార్కెట్లలో విదేశీ సంస్థాగతిన్వెస్టర్లు ఇటీవలి విక్రయాలు మిడ్క్యాప్ విభాగంతో పోలిస్తే భారీ పెట్టుబడుల విభాగంలో ఆకర్షణీయమైన విలువలకు దారితీసాయని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్మేనేజ్మెంట్ కంపెనీ ఎండి సిఇఒ నిమేష్షా వెల్లడించారు. రికవరీఫండ్ సిరీస్-4ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయనమాట్లాడారు. పెట్టుబడుల అవకాశాన్ని ఇన్వెస్టర్లకు అందిచేందుకు అగ్రగామి ఐసిఐసిఐప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కొత్త ఫండ్ ఆఫర్ను విడుదలచేసింది. మూడేళ్ల క్లోజ్ ఎండెడ్ ఈక్విటీఫండ్ 15-20 హైకన్వెన్షన్ లార్జ్క్యాప్ స్టాక్స్పై ప్రధానంగా దృష్టిపెడుతుంది. భారత్ ఆర్థికవ్యవస్థ కోలు కోవడంతో ఈ కంపెనీలు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. భారీ పెట్టుబడుల కం పనీల బిజినెస్మోడల్స్ మేనేజ్మెంట్ టీమ్ లు సుస్థిర ట్రాక్రికార్డును కలిగి ఉంటాయని అందువల్ల ఈ ఫండ్కు రిటర్నులు భారీగా ఉంటాయన్నారు. 2016 ప్రారంభంలోనే ముడిచమురుధరలు, చైనా పరిణామాల పట్ల అంతర్జాతీయ సెంటిమెంట్లను ప్రతిఫలిస్తూ ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్కు వచ్చాయని, నాన్ఫండమెంటల్ కారణాల కారణంగా మార్కెట్కరెక్షన్ అంటే భారతీ య ఈక్విటీల్లో ముఖ్యంగా వాల్యుయేషన్స్ ఎక్కువ ఉండే భారీపెట్టుబడుల విభాగంలో ఇన్వెస్ట్ చేసేం దుకు మంచి అవకాశం అని నిమేష్షా వెల్లడించారు. ఈ కొత్త ఫండ్ను మనీష్ గన్వాని, రజత్ చంద క్లు నిర్వహిస్తారన్నారు. రెండు, మూడేళ్ల వ్యవధితో కూడిన పెట్టుబడితో ఇన్వెస్టర్లు గణనీయమైన సంపద పొందుతారన్నారు. కరెంటుఖాతాలోటు, ద్రవ్యోల్బణంవృద్ధిలాంటి ఆర్థికసూచీలు గత రెండేళ్లుగా మెరుగుపడురతున్నందున ఆర్బిఐ వడ్డీరేట్లను మరింత తగ్గించేఅవకాశం సూచిస్తోందని షాపేర్కొన్నారు. ఈ విధానం ఆయా కంపెనీలు పెట్టుబడులు అధికంచేసేందుకు తోడప్పడుతుందన్నారు. మెరుగైన ఆర్థికసూచీలు, బిజినెస్ సెంటిమెంట్, ఇన్వెస్ట్మెంట్ రికవరీ, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో ఈఫండ్లో ఇన్వెస్టర్లు లబ్ధిపొందవచ్చన్నారు. ఈనెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఫండ్ను కొనుగోలుచేయవచ్చని, కనీస దరఖాస్తు మొత్తం ఐదువేల రూపాయలని ఆపై రూ.10 గుణిజాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. న్యూఫండ్ ఆఫర్కాలంలో యూనిట్కు రూ.10చొప్పున యూనిట్లు అందుబాటులో ఉంటాయని నిమేష్షా వెల్లడించారు. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
హర్మన్ప్రీత్ కౌర్ని చిక్కుల్లో పడేసిన హార్దిక్, రాహుల్ సస్పెన్షన్..!
2018లో తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్స్ సమర్పించి డీఎస్పీ ఉద్యోగంలో చేరి.. అనంతరం దొరికిపోయిన హర్మన్ప్రీత్ కౌర్పై బీసీసీఐ తీసుకున్న చర్యలేంటి..? అభిమానుల నుంచి ఎదురైన ఈ ప్రశ్నతో ఇప్పుడు బీసీసీఐ పెద్దలు బిక్కమొహం వేస్తున్నారు..!
Samayam Telugu | Updated:
Jan 14, 2019, 03:22PM IST
హర్మన్ప్రీత్ కౌర్ని చిక్కుల్లో పడేసిన హార్దిక్, రాహుల్ సస్పెన్షన్..!
భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ సస్పెన్షన్ ఇప్పుడు మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో అమ్మాయిలు, డేటింగ్ గురించి అసభ్యకరంగా మాట్లాడిన హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ .. వారిని ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడకుండా సస్పెన్షన్ వేటు వేసి ఆగమేఘాల మీద భారత్కి పిలిపించింది.
Visit Site
Recommended byColombia
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన అభిమానులు.. కొత్తగా ఓ ప్రశ్నని కూడా లెవనెత్తారు. అది ఏంటంటే..? గత ఏడాది తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్స్ సమర్పించి డీఎస్పీ ఉద్యోగంలో చేరి.. అనంతరం దొరికిపోయిన హర్మన్ప్రీత్ కౌర్పై బీసీసీఐ తీసుకున్న చర్యలేంటి..? అభిమానుల నుంచి ఎదురైన ఈ ప్రశ్నతో ఇప్పుడు బీసీసీఐ పెద్దలు బిక్కమొహం వేస్తున్నారు..!
ఇంగ్లాండ్ వేదికగా 2016లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్లో అద్భుత ఆటతీరు కనబర్చిన హర్మన్ప్రీత్ కౌర్ .. ఆస్ట్రేలియాపై 171 పరుగులతో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. దీంతో ఆమె ప్రతిభకి మెచ్చిన పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఆఫర్ చేసింది. అయితే.. ఆ ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్స్ని సమర్పించిన హర్మన్ప్రీత్.. స్వయంగా పంజాబ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించింది.
కానీ.. కొద్దిరోజులకే పోలీసు శాఖ అంతర్గత విచారణలో అవి తప్పుడు సర్టిఫికేట్స్ అని తేలడంతో ఆమెని డీఎస్పీ హోదా నుంచి తప్పించారు. దీనిపై అప్పట్లో బీసీసీఐ మిన్నకుండిపోగా.. హర్మన్ప్రీత్ కౌర్ కూడా సరైన వివరణ ఇవ్వకుండా తప్పించుకుంది. కానీ.. ఇప్పుడు అభిమానులు మళ్లీ హర్మన్ప్రీత్ తప్పుని తెరపైకి తీసుకురావడం, హార్దిక్, కేఎల్ రాహుల్ తరహాలో ఆమెపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండటంతో బీసీసీఐ ఆ దిశగా సమాలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కేవలం టీమ్లో ఆటగాళ్లు మాత్రమే.. కానీ.. హర్మన్ప్రీత్ కౌర్ ఏకంగా టీ20 టీమ్ కెప్టెన్ హోదాలో ఉంది. కాబట్టి.. ఆమె మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే.. బీసీసీఐ పరిపాలక కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జితో హర్మన్ప్రీత్కి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ విషయం ఇటీవల మిథాలీ రాజ్ వివాదంలో హర్మన్ప్రీత్ని ఎడుల్జీ వెనకేసుకొచ్చిన తీరుతో వెలుగులోకి వచ్చింది. దీంతో.. ఆమెపై చర్యలు తీసుకుంటారా..? లేదా..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
First Published 6, Jan 2017, 2:38 PM IST
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ గ్యాలరీ
Recent Stories | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
విండీస్ని చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్
టెస్టు ఫార్మాట్లో సొంతగడ్డపై తమకి తిరుగులేదని ఇంగ్లాండ్ మరోసారి నిరూపించుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గిన
TNN | Updated:
Aug 20, 2017, 03:43PM IST
టెస్టు ఫార్మాట్‌లో సొంతగడ్డపై తమకి తిరుగులేదని ఇంగ్లాండ్ మరోసారి నిరూపించుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గిన ఆ జట్టు తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన డై/నైట్ తొలి టెస్టులో ఇన్నింగ్స్, 209 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత ఓపెనర్ అలిస్టర్ కుక్ (243: 407 బంతుల్లో 33x4), కెప్టెన్ జో రూట్ (136: 189 బంతుల్లో 22x4) దూకుడుగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌ని ఇంగ్లాండ్ 514/8 వద్ద డిక్లేర్ చేసింది.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ అండర్సన్ (3/34), బ్రాడ్ (47/2) ధాటికి 168 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 346 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ మళ్లీ తడబాటు వీడలేకపోయింది. మరోసారి అండర్సన్ (2/12), బ్రాడ్ (3/34) చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ 137 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ జట్టులో కుక్, రూట్ ఇద్దరూ కలిపి తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేయగా.. వెస్టిండీస్ జట్టు మొత్తం రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి చేసిన పరుగులు.. 305 మాత్రమే కావడం విశేషం. | 2sports
|
కేంద్రంతో విభేదాలు పలకని పటేల్
- 2018-19లో 7.4% వృద్ధి అంచనా
- రెపో రేటు 6.5 శాతంగా కొనసాగింపు
ఆర్బీఐ సమీక్షలో నిర్ణయం
ముంబయి : కేంద్ర ప్రభుత్వంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు పెరుగుతున్న విభేదాలపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పందించడానికి నిరాకరించారు. ఆర్బీఐపై సెక్షన్ 7 ప్రయోగం, రిజర్వు నిధుల బదిలీ తదితర అంశా లపై ఆయన మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు. రిజర్వు బ్యాంకు ఐదో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ముగిసింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపిసి) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించింది. అనంతరం ఉర్జిత్ మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ స్వయంప్రత్తి ఇతర అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు తాను ప్రస్తుతం సమాధానం ఇవ్వలేనని, తాము ఈ సమీక్షలో ద్రవ్య పరపతి విధానం, సూక్ష్మ ఆర్ధిక వ్యవస్థపై మాత్రమే చర్చించామన్నారు.
ఆర్బీఐ స్వయంప్రత్తి నిర్వీర్యంపై గళమెత్తిన డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య కూడా ఉర్జిత్ తరహాలోనే సమాధానమిచ్చారు. క్రితం అక్టోబర్ నుంచి కేంద్రం-ఆర్బీఐ మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తర్వాత పటేల్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. మోడీ ప్రభుత్వం ఆర్బీఐపై సెక్షన్-7 ప్రయోగించి ఈ స్వయంప్రత్తి కలిగిన సంస్థపై అజామాయిషీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అదే విధంగా కేంద్ర బ్యాంకు వద్ద ఉన్న రూ.9.6 లక్షల కోట్ల నుంచి మూడో వంతు తమకు బదిలీ చేయాలని ఒత్తిడి చేసింది. దీనిపై ఆర్బీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాగైనా ఈ నిధులను చిక్కించుకోవాలన్న ప్రభుత్వం దీనిపై ఆర్బీఐతోనే ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయించింది. మరోవైపు ఎన్బీఎఫ్సీలకు భారీగా నిధులు అందించేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 10కి ముందుకు ఒక్క వారంలోనే మోడీ సర్కార్ డజన్ డిమాండ్లతో కూడిన లేఖలను ఆర్బీఐకి అందజేసిందని రిపోర్టులు వచ్చాయి. ఈ పరిణామాలు కేంద్రం, ఆర్బీఐ మధ్య తీవ్ర అంతరాలను పెంచింది. ఈ పరిణామాలను చాలా మంది నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశాలపై ఉర్జిత్ పటేల్ స్పందించకపోవడం గమనార్హం.
వడ్డీ రేట్లు యథాతథం
ఐదో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో రెపో రేటు 6.5శాతంగాను, రివర్స్ రెపో6.25శాతంగా ఉండనుంది. ఆరుగురి సభ్యుల్లో ఐదుగురు కూడా వడ్డీ రేట్ల యథాతథానికే ఓటు వేశారు. అయితే ఎస్ఎల్ఆర్ రేటులో 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ జీడీపీ వృద్ధి రేటు 7.4శాతంగా అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికి గానూ జీడీపీని 7.5శాతంగా ఉండొచ్చని పేర్కొంది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా రెండోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. క్రితం అక్టోబర్ సమీక్షలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దష్ట్యా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే ఆర్బీఐ తాజాగా కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. గతంతో పోలిస్తే చమురు ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. తదుపరి ద్వైమాసిక సమీక్ష 2019 ఫిబ్రవరి 5 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనుంది.
సమీక్ష ప్రధానాంశాలు..
- రెపో రేటు యథాతథంగా 6.5శాతంగా కొనసాగింపు.
- రివర్స్ రెపో రేటు ఎప్పటిలాగే
- 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ జీడీపీ వద్ధి రేటు 7.4శాతంగా అంచనా.
- 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికి గానూ జీడీపీ 7.5శాతంగా అంచనా.
- ప్రస్తుత అక్టోబరు - మార్చి కాలంలో
రిటైల్ ద్రవ్యోల్బణం 2.7-3.2శాతంగా ఉండొచ్చని విశ్లేషించింది.
- ఎంపీసీ భేటీ మినెట్స్ను డిసెంబర్ 19న వెల్లడించనున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
SBI ఖాతాదారులకు షాక్.. రేపటి నుంచి కొత్త నిర్ణయం అమలులోకి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాాతాదారులకు షాక్. బ్యాంక్ నవంబర్ 1 నుంచి కొత్త నిర్ణయాన్ని అమలులోకి తీసుకురానుంది. దీంతో మీరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఇకపై తక్కువ రాబడి వస్తుంది.
Samayam Telugu | Updated:
Oct 31, 2019, 04:43PM IST
SBI ఖాతాదారులకు షాక్.. రేపటి నుంచి కొత్త నిర్ణయం అమలులోకి!
హైలైట్స్
ఖాతాదారులకు ఝలక్ ఇచ్చిన స్టేట్ బ్యాంక్
సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లలో కోత
25 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీ
నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. నవంబర్ 1 నుంచి కొత్త నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఇప్పటికే తెలియజేసింది. నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. దీంతో బ్యాంకులో డిపాజిట్ చేసే వారికి ఇకపై తక్కువ రాబడి వస్తుంది.
స్టేట్ బ్యాంక్ నవంబర్ 1 నుంచి సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత విధించింది. 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రూ.లక్ష వరకు డిపాజిట్లు ఉన్న అకౌంట్లకే ఇది వర్తిస్తుంది. దీంతో 1వ తేదీ నుంచి బ్యాంక్ కస్టమర్లకు 3.5 శాతం వడ్డీ రేటు కాకుండా 3.25 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
పంజాబ్ షెడ్యూల్లో మార్పు.. ఈ ఐపీఎల్లో ఆ జట్టే స్పెషల్!
ఐపీఎల్లో ప్లేఆఫ్ మ్యాచ్ల వేదికను ప్రకటించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. పంజాబ్ ఆడే సొంత వేదిక షెడ్యూల్లో మార్పులు చేసింది.
| Updated:
Mar 20, 2018, 10:11PM IST
పంజాబ్ షెడ్యూల్లో మార్పు.. ఈ ఐపీఎల్లో ఆ జట్టే స్పెషల్!
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్లేఆఫ్ వేదికల్లో మార్పులకు అనుమతిచ్చింది. మే 23, 25 తేదీల్లో జరిగే ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్లను పుణేలోని ఎంసీఏ స్టేడియంలో నిర్వహించేందుకు పాలక మండలి అంగీకారం తెలిపింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సొంత వేదికలో ఆడే మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లను ఇండోర్లో, మూడు మ్యాచ్లను మొహాలీలో ఆడనుంది. ఈ ఐపీఎల్లో మరే జట్టు కూడా తటస్థ వేదికల్లో మ్యాచ్లు ఆడటం లేదు.
Visit Site
Recommended byColombia
అన్ని ఫ్రాంచైజీలు తమ హోమ్ మ్యాచ్ల్లో నాలుగింటిని కచ్చితంగా సొంత గ్రౌండ్లో ఆడాల్సి ఉంటుంది. కానీ విసర్తణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు ఛండీగఢ్ ఎయిర్పోర్ట్ మూతపడనుంది. దీంతో ఆ జట్టు సొంత గడ్డ మీద ఆడాల్సిన మ్యాచ్ల్లో తొలి మూడింటిని మొహాలీలో, తర్వాతి నాలుగు మ్యాచ్లను ఇండోర్లో ఆడనుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంజాబ్ తొలి మూడు మ్యాచ్లు ఇండోర్లో, తర్వాతి నాలుగు మ్యాచ్లు మొహాలీలో ఆడాల్సి ఉంది.
చదవండి: ఐపీఎల్-2018 సన్ రైజర్స్ షెడ్యూల్ & పూర్తి షెడ్యూల్
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. 51 రోజులపాటు ఐపీఎల్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. ఈ ఐపీఎల్లో 12 మ్యాచ్లు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుండగా.. 48 మ్యాచ్లు రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. మే 27న వాంఖడే స్టేడియం ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
INDIAN CURRENCY11
ఆర్థిక గణాంకాలు, ప్రపంచ మార్కెట్లే కీలకం!
ముంబై: దేశీయ స్టాక్ మార్కె ట్లు ఆర్థిక వ్యవస్థ స్థూల గణాంకాల ఆధారంగా నడిచే అవకాశం ఉంది. వచ్చే వారం దేశీయ మార్కె ట్లకు మూడోత్రైమాసిక జిడిపి గణాంకాలు కీలకం అవుతాయి. ఈ గణాంకాలు 28వ తేదీ విడుదలవు తాయి. స్థూల దేశీయోత్పత్తి జిడిపి 7.3శాతంగా ఉంది. మూడోత్రైమాసికంలో ఆరుశాతం లోపు ఉంది. పెద్దనోట్ల రద్దుకారణంగా జిడిపి వృద్ధి 6.2 శాతంగా మాత్రమే ఉంటుందని ఇప్పటికే పలు రేటింగ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. భారతీయ స్టేట్బ్యాంకు రీసెర్చి విభాగం 5.8శాతం మాత్రమే ఉంటుందని అంచనావేసింది. హెచ్ఎస్బిసి ఐదు శాతం వృద్ధిని లెక్కకట్టింది. కేంద్ర గణాంకాల సంస్థ సిఎస్ఒ అయితే 6.1శాతంగా ఉంటుందని ప్రక టించింది.
జిడిపి గణాంకాలతోపాటు మార్కెట్లను పలు ఇతరఅంశాలూ ప్రభావితంచేయనున్నట్లు నిపు ణులు చెపుతున్నారు. గడచిన వారం నికర అమ్మ కం దారులుగా నిలిచినఎఫ్ఐఐల పెట్టుబడుల తీరు, డాలరుతో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్కు కీలకంగా నిలుస్తాయి. గత వారాం తంలో డాలరుతో రూపాయి మారకం విలువలు రెండువారాల గరిష్టస్థాయికి చేరినసంగతి తెలిసిందే. మరోపక్క ఒపెక్దేశాలు ఉత్పత్తిలో కోత అమలుకే కట్టుబడినట్లు స్పష్టంచేయడంతో ముడిచమురు ధరలు మళ్లీ జోరందుకున్నాయి.
చమురుధరలు పెరిగితే దిగుమతులు బిల్లు పెరగడంద్వారా ప్రభు త్వంపై ఒత్తిడిపెరిగే అవకాశం ఉందని అంచనా. చమురుధరలుపెరిగితే దిగుమతుల బిల్లు పెరగడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడిపెరిగే అవకా శం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చము రుధరలకు అనుగుణంగాపెట్రో ఉత్పత్తులధరలను ప్రభుత్వరంగ ఆయిల్మార్కెటింగ్ సంస్థలు ఈ నెలాఖరున సవరించనున్నాయి. దీనితో ఐఒసి, బిపిసిఎల్, హెచ్పిసిఎల్ కౌంటర్లు వెలుగులో నిలిచే అవకాశంఉంది. ఇదేవిధంగా ఎటిఎఫ్ధరల సవరణ కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల విమానయాన కంపెనీలషేర్లు క్రియాశీలకంగా ట్రేడ్ అవుతాయి. ఈ బాటలో ఆటోషేర్లపట్ల కూడా ఇన్వెస్టర్లు ఆసక్తిచూపి స్తారు. బుధవారం నుంచి ఫిబ్రవరినెల వాహన విక్రయగణాంకాలు వెల్లడి అవుతాయి.చైనా జపాన్, యూరోజోన్ తయారీరంగ పిఎంఐ గణాంకాలు వచ్చేవారం విడుదలవుతాయి.మంగవారం అమెరికా నాలుగో త్రైమాసిక జిడిపి ప్రాథమిక అంచనాలు వెల్లడి అవుతాయి. ఈగణాంకాల నేపథ్యంలో ప్రపం చ దేశాల మార్కెట్లలో నెలకొనే ధోరణులు కూడా దేశీయమార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయని చెప్పాలి. | 1entertainment
|
internet vaartha 184 Views
ముంబై : ఫార్మా రంగ ఎగుమతుల్లో భారత్ చైనాను అధిగమిస్తోంది. వాణిజ్య మంత్రిత్వశాఖ అంచనాల ప్రకారం భారత్ ఫార్మారంగ ఎగుమతులు 2015లో 12.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 7.55శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది భారత్ చైనాను అధిగమించిందని ప్రకటించింది. 2015లో భారత్ ఫార్మారంగ ఎగుమతులు 11.66 బిలియన్ డాలర్ల నుంచి 12.54బిలియన్ డాలర్లవరకూ పెరిగినట్లు అంచనా. చైనా ఎగుమతులు 5.3శాతంపెరిగి 6.94 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. అన్ని కీలక మార్కెట్లలో చైనాకంటే భారత్ ముందుందని, అమెరికా, ఆఫ్రికా, యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో భారత్దే ఆధిపత్యమని వాణిజ్య మంత్రిత్వశాఖ వివరించింది. భారత్ నుంచి అమెరికాకు ఫార్మా ఎగుమతులు 23.4శాతం పెరిగి గత ఏడాది 4.74 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇతరత్రా చూస్తే చైనా ఫార్మారంగ ఎగుమతులు అమెరికాకు 15శాతంపెరిగి 1.34 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారత్ యూరోపియన్ యూనియన్, ఆఫ్రికాదేశాల్లో కూడా ఆధిపత్యంతో ఉంది. ఇయుదేశాలకు 1.5 బిలియన్ డాలర్లు, ఆఫ్రికా దేశాలకు 3.04 బిలియన్ డాలర్లు ఎగుమతులు చేసింది. ఎపిఐల దిగుమతికి భారత్ ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతోంది. ఔషధాలకు ఇవే ముడివనరులుగా ఉంటాయి. చైనానుంచి భారీస్థాయిలో దిగుమతి చేసుకోవడంపై ఈ రంగం, ప్రభుత్వం కూడా కలవరం వ్యక్తంచేస్తున్నాయి. జనరిక్ ఔషధా లకు భారత్ ప్రపంచస్థాయి హబ్గా నిలిచింది. దేశ ఫార్మా రంగ ఉత్పత్తి టర్నోవర్ 20 బిలియన్ డాలర్ల వరకూ ఉంది. | 1entertainment
|
Hyderabad, First Published 25, Jun 2019, 5:28 PM IST
Highlights
లై సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన క్యూట్ పిల్ల మేఘా ఆకాష్ మొదటి చూపులోనే కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది. అపజయాలు ఎన్ని వస్తున్నా కూడా అందంతోనే అవకాశాలు అందుకుంటూ కెరీర్ ను ఒక ట్రాక్ లో నడిపిస్తోంది.
లై సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన క్యూట్ పిల్ల మేఘా ఆకాష్ మొదటి చూపులోనే కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది. అపజయాలు ఎన్ని వస్తున్నా కూడా అందంతోనే అవకాశాలు అందుకుంటూ కెరీర్ ను ఒక ట్రాక్ లో నడిపిస్తోంది. ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కి సౌత్ లో స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వాలని ఆశపడుతోంది.
ఛల్ మోహన్ రంగ - పేట - వందా రాజాదా వరువేన్ (అత్తారింటికి దారేది రీమేక్) వంటి సినిమాల్లో నటించి అపజయాలను మూటగట్టుకుంది. అయినా కూడా బేబీ లక్కు స్ట్రాంగ్ గా ఉండడంతో ఆఫర్స్ కాళ్లదగ్గరకు వచ్చేస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ సేతుపతి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.
అసలైతే విజయ్ తో అమలాపాల్ నటించాల్సి ఉండగా ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మేఘా ఆకాష్ ని వరించింది. ఈ సినిమాపై బేబీ అంచనాలు భారీగా పెంచేసుకుందట. ఎందుకంటే సినిమా రిజల్ట్ తేడా కొట్టినా నటిస్తున్న పాత్ర హైలెట్ అవుతుందట. అందుకే బేబీ అవకాశాలకు డోకా లేదని కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగుతోంది.
Last Updated 25, Jun 2019, 5:31 PM IST | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
Dinesh Karthik: భారత్ కీపర్ తప్పిదాన్ని సరిదిద్దిన రోహిత్..!
ఆఫ్ స్టంప్కి వెలుపలగా పడుతున్న బంతుల్ని న్యూజిలాండ్ ఓపెనర్ మున్రో కట్ చేసేందుకు ప్రయత్నిస్తుండటాన్ని పసిగట్టిన మహ్మద్ షమీ.. ఆఖరి బంతిని కూడా నాలుగో బంతి తరహాలోనే విసిరాడు.
Samayam Telugu | Updated:
Jan 28, 2019, 01:31PM IST
న్యూజిలాండ్తో సోమవారం జరుగుతున్న మూడో వన్డేలో వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ రెండో ఓవర్లోనే తప్పిదానికి పాల్పడ్డాడు. మహ్మద్ షమీ వేసిన ఆ ఓవర్లో నాలుగో బంతిని న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మున్రో (7: 9 బంతుల్లో 1x4) కవర్స్ దిశగా కట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి వికెట్ కీపర్ పక్కన గాల్లోకి లేచింది. అయితే.. ఆ బంతి కోసం కార్తీక్ ఆలస్యంగా డైవ్ చేయగా.. అతని చేతుల్లో పడిన బంతి మళ్లీ బౌన్స్ అయ్యి నేలపాలైంది. అయితే.. ఆ ఓవర్లోని ఆఖరి బంతికే మున్రో ఔటయ్యాడు. తొండ కండరాలు పట్టేయడంతో ధోనీకి టీమిండియా మేనేజ్మెంట్ ఈరోజు విశ్రాంతినిచ్చింది.
ఆఫ్ స్టంప్కి వెలుపలగా పడుతున్న బంతుల్ని మున్రో కట్ చేసేందుకు ప్రయత్నిస్తుండటాన్ని పసిగట్టిన మహ్మద్ షమీ.. ఆఖరి బంతిని కూడా నాలుగో బంతి తరహాలోనే విసిరాడు. దీంతో.. షాట్ మార్చుకోని మున్రో.. మళ్లీ అదే తప్పిదానికి పాల్పడ్డాడు. దీంతో.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి ఈసారి ఎక్స్ట్రా బౌన్స్ కారణంగా స్లిప్లో రోహిత్ శర్మ శరీరంపైకి దూసుకెళ్లింది. గత ఏడాదికాలంగా స్లిప్లో అపార అనుభవాన్ని గడించిన రోహిత్ శర్మ ఎలాంటి తడబాటు లేకుండా క్యాచ్ని అందుకున్నాడు. | 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.