news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
india batting coach vikram rahtour backs rohit sharma to play all formats
India vs South Africa: రోహిత్ శర్మకి కొత్త బ్యాటింగ్ కోచ్ సపోర్ట్
వన్డే, టీ20ల్లో భారత్ నెం.1 ఓపెనర్గా ఉన్న రోహిత్ శర్మకి టెస్టుల్లో కనీసం చోటు దక్కకపోవడానికి కారణమేంటి..? టెస్టుల్లో మిడిలార్డర్లో ఆడటంతోనే అతను విఫలమవుతున్నాడు.
Samayam Telugu | Updated:
Sep 17, 2019, 04:53PM IST
హైలైట్స్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య అక్టోబరు 2 నుంచి టెస్టు సిరీస్ మొదలు
ఇటీవల జట్టుని ప్రకటించిన సెలక్టర్లు.. ఓపెనర్గా రోహిత్ శర్మ ఎంపిక
వన్డే, టీ20ల్లో ఓపెనర్గా ఆడుతున్న రోహిత్ని టెస్టుల్లోనూ ఓపెనర్గా ఆడిస్తామన్న బ్యాటింగ్ కోచ్
భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకి టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అండగా నిలిచాడు. వన్డే, టీ20ల్లో అగ్రశ్రేణి ఓపెనర్గా కొనసాగుతున్న రోహిత్ శర్మకి టెస్టుల్లో కనీసం చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన విక్రమ్.. ఇకపై టెస్టుల్లోనూ ఓపెనర్గా రోహిత్ని ఆడించబోతున్నట్లు స్పష్టం చేశాడు.
Read More: రిషబ్ పంత్కి ఆఖరి ఛాన్స్..! నెక్ట్స్ ఎవరు..?
దక్షిణాఫ్రికాతో అక్టోబరు 2 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఇటీవల జట్టుని ప్రకటించిన సెలక్టర్లు రోహిత్ శర్మని ఓపెనర్గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టెస్టుల్లో ఇప్పటి వరకూ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తూ వచ్చిన రోహిత్ శర్మ .. ఓపెనర్గా ఎలా రాణిస్తాడో..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. | 2sports
|
Visit Site
Recommended byColombia
ఇప్పటి వరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలను మాత్రమే తీసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘అరవింద సమేత’ టీజర్తో ఆయనలో ఉన్న మరో యాంగిల్ని బయటకు తీశారు. పక్కా మాస్ ఎలిమెంట్స్తో ఎన్టీఆర్ అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేట్టుగా టీజర్ని వదిలాడు త్రివిక్రమ్.
3 Million views & Counting! #AravindhaSamethaTeaser https://t.co/AfjrH7Iznt … @tarak9999 #Trivikram… https://t.co/OoAUUzo6UN
— Haarika & Hassine Creations (@haarikahassine) 1534315301000
‘మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా? అంటూ ఎన్టీఆర్ని ఉద్దేశించి ప్రతినాయకుడు జగపతిబాబు చెప్తున్న డైలాగ్స్ ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతుంది. ఇక సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఎన్టీవోడు వీర రాఘవ పాత్రకోసం రాయలసీమ యాసను ఒంటపట్టించుకున్నాడు. ‘కంటపడితే కనికరిస్తానేమో.. ఎంటపట్టానా నరికేస్తానబ్బా’ అంటూ ఎన్టీఆర్ చెబుతున్న డైలాగ్ మాస్ ఆడియన్స్ని కుర్చీలలో కూర్చోనిచ్చేటట్టుగా లేదు.
1.5 Million views & Counting! #AravindhaSamethaTeaser https://t.co/AfjrH7Iznt @tarak9999 #Trivikram… https://t.co/KLYVfNTUrQ
— Haarika & Hassine Creations (@haarikahassine) 1534308554000
ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి మొదటిసారి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఎన్టీఆర్ ‘జై లవకుశ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత త్రివిక్రమ్తో చేస్తుండటం ఒక విశేషమైతే.. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ ప్రాజెక్ట్ను చేపట్టాడు. ఆయనలో ఉన్న కసి మొత్తం ‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్లో కనిపించింది. ఫస్ట్లుక్తోటే అంచనాలను రాబట్టిన ఈ మూవీ టీజర్తో ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఈ చిత్రాన్ని ‘అజ్ఞాతవాసి’ చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా.. అక్టోబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ‘అరవింద సమేత వీర రాఘవ’.
X | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బంతికి బదులు పామును పట్టుకున్న క్రికెటర్
మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా.. ఒక శునకం ప్రవేశిస్తేనే ఆటగాళ్లు హడావిడి చేసేస్తారు. అలాంటిది ఏకంగా పాము వస్తే..? దేశవాళీ క్రికెట్.. రంజీ
TNN | Updated:
Oct 27, 2017, 10:53AM IST
మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా.. ఒక శునకం ప్రవేశిస్తేనే ఆటగాళ్లు హడావిడి చేసేస్తారు. అలాంటిది ఏకంగా పాము వస్తే..? దేశవాళీ క్రికెట్.. రంజీ ట్రోఫీలో భాగంగా విజయనగరం‌లో‌ని క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర, ఒడిశా జట్ల మధ్య ఆసక్తికరంగా గురువారం మ్యాచ్ జరుగుతుండగా ఒక పాము బౌండరీ లైన్ వెలుపలి నుంచి మైదానంలోకి వచ్చింది. దీంతో ఇరు జట్ల క్రికెటర్లు భయంతో దూరంగా పరుగులు పెట్టారు. కానీ.. ఫీల్డింగ్ చేస్తున్న ఆంధ్ర జట్టు ఆటగాడు, నెల్లూరు కి చెందిన అశ్విన్ హెబ్బార్ చాకచక్యంగా దాన్ని ఒడిసిపట్టుకుని మైదానం వెలుపల ఉన్న పచ్చిక బయళ్లలో వదిలిపెట్టాడు.
అశ్విన్ పామును పట్టిన విధానం చూసి జట్టలోని సహచర క్రికెటర్లు.. అతడ్ని ‘స్నేక్ క్రికెటర్’ అంటూ సరదాగా మైదానంలో ఆటపట్టించారు. గతంలోనూ ఇలా వచ్చిన ఓ ఐదారు పాముల్ని ఈ తెలుగు క్రికెటర్ ఇలానే పట్టుకుని బయట విడిచిపెట్టినట్లు తెలిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 584/5 వద్ద మొదటి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేయగా.. ప్రస్తుతం ఒడిశా 330/8తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగిస్తోంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన హెబ్బార్ (13 నాటౌట్: 22 బంతుల్లో 3x4)‌కి ఇన్నింగ్స్ డిక్లేర్‌కు ముందు కాసేపు మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. గురువారం 8 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను రెండు ఓవర్లు మెయిడిన్‌గా వేసి 20 పరుగులు ఇచ్చాడు. | 2sports
|
market
స్టాక్ మార్కెట్లకు రిలయన్స్ మద్దతు
లాభాల్లో సూచీల ర్యాలీ ముంబయి, జూలై 21: బెంచ్మార్క్ స్టాక్సూచీలు గరిష్టంగా పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమా రు నాలుగుశాతం బిఎస్ఇలోర్యాలీతీసింది. అంతకు ముందు ఛైర్మన్ ముఖేష్ అంబానీ 40వ వార్షిక సర్వసభ్యసమావేశంలో 1ః1 నిష్పత్తిలో బోనస్ షేర్ల ఇష్యూను ప్రకటించడంతో కంపెనీ షేర్లు మరింత ఊపందుకున్నాయి. పెట్రోకెమికల్ మార్జిన్లు మరిం తగా పెరగడం, ఆఫ్రికన్ ఆస్తులు విక్రయించడం ద్వారా లాభాలు, నికరలాభాలు రూ.9108 కోట్లకు పెరగడం వంటి అంశాలు అటు కంపెనీకి ఇటు స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి. ఇక ఇతర గ్లోబల్ మార్కె ట్లపరంగా యూరో వెంటనే రెండేళ్ల గరిష్టస్థాయికి పెరిగింది. ఎక్కువస్టాక్మార్కెట్లు యూరోప్ మెయిన్ ల్యాండ్లో స్టాక్స్ క్షీణించడంతో కొన్నిచోట్ల ఇన్వెస్ట ర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అంతేకాకుండా ఇతర ప్రపంచదేశాల్లోని సెంట్రల్బ్యాంకులు తమ తమ ద్రవ్యవినిమియ విధానంలో మరింత కఠిన విధానాలు అవలంభిస్తారన్న అంచనాలతో ఇన్వెస్టర్లు గ్లోబల్మార్కెట్లపై వెనుకంజవేసారు. ఇక దేశీయంగ ఆస్టాక్ మార్కెట్లలోసెన్సెక్స్ 120పాయింట్లు గరిష్టం గా పెరిగింది. విప్రో 1.71 బిలిన్ షేర్ల బైబాక్ప్లాన్, రిలయన్స్బోనస్షేర్ల జారీవంటివి మార్కెట్లకు మద్ద తునిచ్చాయి.
30షేర్ బిఎస్ఇ సెన్సెక్స్ 124.49 పాయింట్లు పెరిగి 32,028.89కి చేరింది. 59షేర్ ఎన్ఎస్ఇ సూచి నిఫ్టీ 41.95 పాయింట్లు క్షీణించి 9915.25పాయింట్లవద్ద స్థిరపడింది. బిఎస్ఇపరం గా ఐటిసూచి 1.66శాతం లాభపడింది. ఆ తర్వాత టెక్సూచి 1.26శాతం,వినియోగరంగం 1.09శాతం ఆయిల్ అండ్ గ్యాస్ 0.99శాతం పెరిగాయి. ఇతర త్రా రియాల్టీ సూచి 1.1శాతం, హెల్త్కేర్ 0.54 శాతం, విద్యుత్0.42శాతం, కేపిటల్గూడ్స్ 0.32 శాతం దిగజారాయి. టాప్ ఐదు సెన్సెక్స్ లాభాలు పొందిన సంస్థల్లో విప్రో 6.47శాతం, రిలయన్స్ 3.76శాతం, కోల్ ఇండియా 2.66శాతం, టిసిఎస్ 1.87శాతం, కోటక్బ్యాంకు 1.86శాతం లాభపడితే భారతి ఎయిర్టెల్ 2.05శాతం, లూపిన్ 1.99 శాతం, పవర్గ్రిడ్ 1.85శాతం, హీరోమోటోకార్ప్ 1.34శాతం, సిప్లా 0.96శాతం నష్టపోయాయి. రిలయన్స్ కంపెనీ షేర్లు 3.9శాతం పెరిగాయి. తొమ్మిదన్నరేళ్ల గరిష్టంగా ఉన్నాయి. పటిష్టమైన త్రైమాసిక ఫలితాలు, తక్కువఖర్చుతోకూడిన 4జి ఆధారిఫోన్ విడుదల ఇందుకుకీలకం. ఛైర్మన్ ముఖేష్ అంబానీ శుక్రవారం ఈ ఫోన్ విడుదలను ప్రకటించారు. తక్కువ ఆదాయం కలిగిన వినియోగ దారులే లక్ష్యంగా జియోసేవలు ఉంటాయని ప్రక టించారు. రిలయన్స్షేర్లు3.9శాతం పెరిగి 1588 రూపాయలకు పెరిగాయి. రిలయన్స్ షేర్ల పెరు గుదలతోపాటు టెలికాం పోటీ కంపెనీల షేర్లుసైతం దిగజారాయి. ఈ రంగంలో మరింతపోటీ పెరిగిం ది. భారతిఎయిర్టెల్, ఐడియా సెల్యులర్ కంపెనీ లు 41.శాతం, 7.3శాతం చొప్పున క్షీణించాయి. అదేవిధంగా విప్రో కంపెనీ కూడా 8.1శాతం షేర్లు పెరిగాయి. ఏప్రిల్ నుంచి కంపెనీ టాప్ లాభాల్లో ఉన్నట్లు తేలింది. నిఫ్టీ ఐటి సూచీలో కూడా రెండు శాతం పెరిగింది. విప్రో స్టాక్స్ దేశంలోని మూడో అతిపెద్ద ఐటి సంస్థగా నిలిచింది. కంపెనీ 11వేల కోట్ల షేర్ల బైబాక్ ప్లాన్ను ప్రకటించింది. భారీ మూలధన కంపెనీలు కార్పొరేట్ ఫలితాలు ఇప్పటి వరకూ సానుకూలంగానే ఉన్నాయని, మార్కెట్లకు ఇవే కీలకం అవుతున్నట్లు ఏంజెల్బ్రోకింగ్ సీని యర్ విశ్లేషకులు సిద్ధార్ద్ పురోహిత్ వెల్లడించారు. | 1entertainment
|
పోలీసుల అదుపులో రింగింగ్బెల్స్ ఎండి!
నోయిడా: రూ.251కే స్మార్ట్ఫోన్ అంటూ రెండేళ్లక్రితం సంచలనాలు కలిగించిన రింగింగ్ బెల్స్ ఎండి మోహిత్గోయల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను మోసం చేసారన్న అభియోగాలతో వచ్చిన ఫిర్యాదులపై గోయల్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలిసులు తెలిపారు. ఘజియాబాద్ కేంద్రంగా ఉనన ఆయామ్ ఎంటర్ప్రైజెస్ ఇందుకు సంబంధించి రింగింగ్బెల్స్ తమను 16 లక్షల రూపాయల మేరకు మోసం చేసిందని ఆరోపించారు. ఘజియాబాద్ డిఎస్ఇ మనీష్ మిశ్రా మాట్లాడుతూ గోయల్ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఆయామ్ ఎంటర్ ప్రైజెస్ తన ఫిర్యాదులో గోయల్ ఇతరులు రింగింగ్బెల్స్ తరపున పంపిణీదారునిగా ఫ్రీడమ్ 251 ఫోన్లకుగాను సభ్యత్వం ఇచ్చారని 2015 నవంబరులోనే తీసు కున్నట్లు వివరించారు. ఆర్టిజిఎస్ ద్వారా 30 లక్షలు చెల్లిం చామని, వివిధ సందర్భాల్లో ఈ చెల్లింపులు జరిగాయన్నారు. కేవలం 13 లక్షల విలువైన ఉత్పత్తులు మాత్రమే పంపిణీ చేసిందని, పదేపదే సంప్రదింపులు జరిపితే 14 లక్షల రూపా యల విలువైన ఉత్పత్తులు, నగదు పంపించిందని అన్నారు. ఆయామ్ ఎంటర్ప్రైజెస్ యజమానులు తమను చంపుతా మన్న హెచ్చరికలు కూడా చేసారని, 16 లక్షలు కోరినందుకు పదేపదే ఇదే హెచ్చరికలు చేసారన్నారు. ప్రపంచంలోనే అత్యంత కారుచౌక హ్యాండ్సెట్లను రూ.251కే అందిస్తామని రింగింగ్ బెల్స్ విక్రయాలు ప్రారంభించింది. గత ఏడాది ఫిబ్ర వరిలో తన వెబ్సైట్ ద్వారా వీటిని విక్రయించింది. తదనంతరం వివాదాలు పొడసూపాయి. ఏడుకోట్ల మంది రిజిస్టరు చేసుకుంటే 30వేల మంది కస్టమర్లు మాత్రమే బుక్ చేసుకున్నట్లు కంపెనీ ప్రకటిం చింది. ఇదొక బోగస్ చిట్ఫండ్ కంపెనీ తరహా స్కీంను కంపెనీ నడిపిందన్న అభియోగాలు కూడా అప్పట్లోనే చుట్టుముట్టాయి. ఎట్టకేలకు రింగింగ్బెల్స్ యజమాని పోలీసుల అదుపులోకి రాకతప్పలేదు. | 1entertainment
|
దుమ్మురేపిన ఎస్బీఐ..
Sat 26 Oct 00:34:31.900383 2019
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) అదిరిపోయే ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో మూడు రెట్ల వృద్ధితో రూ.3,011.73 కోట్ల నికర లాభాలు
12న జియోఫోన్-2 ఫ్లాష్ సేల్..
Sat 08 Sep 06:05:11.635313 2018
ముంబయి: రిలయన్స్ సంస్థ మరోమారు జియోఫోన్-2 ఫ్లాష్ సేల్ను నిర్వహించనుంది. ఈ నెల 12న ఈ ఫ్లాష్సేల్ ఉంటుందని సంస్థ వెల్లడించింది. గతంలో నిర్వహించిన ఫ్లాష్సేల్స్లో కేవల
14 నుంచి లాంకో ట్రేడింగ్ నిలిపివేత..!
Sat 08 Sep 06:05:18.655768 2018
ముంబయి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు చెందిన ల్యాంకో ఇన్ఫ్రా ట్రేడింగ్ను రద్దు చేయనున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస
యూనియన్ బ్యాంక్కు కోటి జరిమానా!
Sat 08 Sep 02:20:35.573019 2018
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (యూబీఐ) భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) జరిమానా విధించింది. బ్యాంక్లో జరిగిన మోసాన్ని సరైన
అర కోటి ఉద్యోగాలు ఆవిరి!
Fri 07 Sep 04:03:32.433387 2018
నవతెలంగాణ, వాణిజ్య విభాగం తమ సంస్కరణల కారణంగా దేశం వృద్ధి పథంలో దూసుకుపోతోందని గొప్పలకు పోతున్న మోడీ సర్కారు.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో జరుగుతోన్న నష్టం పైన దృష్టి సా
డాలరు @ రూ.72
Fri 07 Sep 04:03:45.789291 2018
ముంబయి: రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయంగా డాలర్కు డిమాండ్ పెరుగుతుండటంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. గురువారం నాటి ట్రేడింగ్లో మరింత పతనమై
మారుతీ కార్లపై 70 వేల డిస్కౌంట్
Fri 07 Sep 04:03:52.44249 2018
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సెప్టెంబరు మాసానికి గాను కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. డిస్కౌంట్ వర్తించనున్న కార్ల జాబితాల్లో స్వి
మేటి బ్రాండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్
Fri 07 Sep 04:04:01.417899 2018
ముంబయి: హెచ్డీ ఎఫ్సీ బ్యాంక్ మళ్లీ దేశంలో అత్యంత విలువైన బ్రాండ్గా నిలిచింది. బ్రాండ్జ్ ఇండియా సంస్థ తాజాగా వెల్లడించిన 50 మేటి బ్రాండ్ల జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాం
స్టాక్ మార్కెట్లకు కాస్త ఊరట
Fri 07 Sep 04:04:08.28007 2018
ముంబయి: ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వరుసగా ఆరు సెషన్ల నుంచి నష్టాలను ఎదుర్కొంటున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కాస్త కోలుకున్నాయి. నష్టాల పాలైన దేశీయ స్టాక్ మార్
జెట్ ఎయిర్వేస్కు పైలట్ల వార్నింగ్!
Fri 07 Sep 04:04:15.342377 2018
ముంబయి: ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న ప్రయివేటు రంగ విమానయాన దిగ్గజ సంస్థ జెట్ ఎయిర్వేస్కు తాజాగా మరో సమస్య ఎదురైంది. నిర్వహణ వ్యయాల భారంతో వరుసగా రెండో నెల ఎయిర్లైన్
రూపాయి వెలవెల.. మార్కెట్లు విలవిల..
Wed 05 Sep 03:59:45.832465 2018
రూపాయి మారకపు విలువ మంగళవారం మరింత దిగజారింది. డాలరుకు డిమాండ్ బాగా పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి డాలరు ముందు అంతకంతకూ
మరింతగా డీలాపడిన స్టాక్స్
Wed 05 Sep 03:59:51.287794 2018
వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు డీలా పడ్డాయి. మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపిన వేళ నష్టాలను చవిచూశాయి. డాలర్తో రూపాయి విలువ ఆల్టైం కనిష్టానికి పడిపోవడంతో
15 ఏండ్లలో వంద విమానాశ్రయాలు!
Wed 05 Sep 03:59:56.223862 2018
దేశంలో విమానయాన రంగ ప్రగతి పథంలో దూసుకుపోతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. ఈ నేపథ్యంలో రానున్న 10-15
8% వృద్ధిరేటు అనుమానమే!
Wed 05 Sep 04:00:01.112928 2018
వృద్ధి రేటు (జీడీపీ) విషయంలో భారత్ తొలి త్రైమాసికంలో దూకుడు కనబరిచినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి అదే స్థాయి ప్రదర్శన
బడ్జెట్ ధరలో 'హానర్' 7ఎస్ విడుదల
Wed 05 Sep 04:00:06.847618 2018
ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ హువావే అనుబంధ బ్రాండ్ హానర్ కింద సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. 'హానర్ 7ఎస్' పేరుతో మంగళవారం మార్కెట్లోకి దీనిని విడుదల చేసింది
కేరళకు ఎస్బీఐ రూ.10 కోట్ల సాయం
Wed 05 Sep 04:00:14.036727 2018
వరద ప్రళయానికి విలవిలలాడుతోన్న కేరళ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడంలో దేశంలోని అతిపెద్ద విత్త సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ తన ఉదారతను చాటుకుంది. ఎస్బీఐ సంస్థ మొత్తంగా
రూ. 8 లక్షల కోట్లకు టీసీఎస్ ఎం'క్యాప్'
Wed 05 Sep 01:21:31.202343 2018
దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్టాక్ మార్కెట్లలో మరో రికార్డును నమోదు చేసింది. మార్కెట్ విలువ పరంగా రూ.8 లక్షల కోట్ల మ్యాజిక్ మార్క్ను
నష్టపోయిన స్టాక్ మార్కెట్లు..
Tue 04 Sep 05:04:27.248284 2018
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. అత్యధిక ధరల వద్ద మదుపరులు స్టాక్స్ను విక్రయించి లాభాలను ఆర్జించేందుకు యత్నించడంతో స్టాక్ మార్కెట్లు సోమవారం
8.5 టన్నుల గోల్డ్ కొన్నాం: ఆర్బీఐ
Tue 04 Sep 05:05:48.797401 2018
న్యూఢిల్లీ: దాదా పు తొమ్మిది సంవ త్సరాల తరువా త భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మొట్టమొదటి సారిగా బంగారం కొనుగోలు జరిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మొత్తం 8.4
మార్కెట్లోకి మహీంద్రా మరాజొ
Tue 04 Sep 05:05:58.49409 2018
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా వాహన ప్రియులను ఊరిస్తూ వస్తోన్న మరాజొ ఎమ్పీవీ వెహికల్ను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధికారికంగా సోమ వారం మార్కెట్లోకి విడు దల చేసింది. మొత్
రూ.999లకే విమాన ప్రయాణం: ఇండిగో
Tue 04 Sep 05:06:30.885347 2018
ముంబయి: అందుబాటు ధరల్లో విమానయానాన్ని అందిస్తోన్న ఇండిగో సంస్థ మరో భారీ ఆఫర్ను ప్రకటించింది. 'ఫెస్టివల్ సేల్' పేరుతో దాదాపు 10లక్షల విమాన టికెట్లను రూ.999ల అతి తక్కువ
ఆర్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా..
Tue 04 Sep 05:06:37.010706 2018
కోల్కతా: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఉద్యోగులు మంగళవారం నుంచి తలపెట్టిన రెండు రోజుల సామూహిక సెలవుతో కూడిన సమ్మె వాయిదా పడింది. పెన్షన్ సమస్యలతో పాటు పెండింగ్లో ఉ
మాల్యాకు మూడు వారాల ఊరట..
Tue 04 Sep 05:06:43.99263 2018
న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.9,000 కోట్లు పైగా రుణాలు ఎగవేసి విదేశాలకు ఎగిరిపోయిన విజరు మాల్యా చుట్టూ ప్రభుత్వం విధిస్తున్న ఉచ్చు నుంచి కాస్త ఉరట లభించ
భారత్లో శాంసంగ్ టీవీల ఉత్పత్తి బంద్!
Tue 04 Sep 04:14:37.774028 2018
చెన్నై: 'మేకిన్ ఇండియా' నినాదంతో గొప్పలు పోతున్న మోడీ సర్కారుకు ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ పెద్ద షాకినిచ్చింది. భారత్లో టీవీల ఉత్పత్తిని ఆపివేయాలని శాంసంగ్
కరెన్సీ నోట్లతో జబ్బులు ..
Mon 03 Sep 03:24:23.171682 2018
న్యూఢిల్లీ: చేతుల ద్వారా పలు అంటువ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయన్నది తెలిసిందే. నిత్యం మన చొక్కా జేబుల్లో పెట్టుకొని తిరిగే కరెన్సీ నోట్ల ద్వారా కూడా అంటు వ
ఆ రుణాలను మీరెందుకు రాబట్టలేదు?
Mon 03 Sep 03:25:03.205661 2018
న్యూఢిల్లీ: కావాల్సిన వ్యాపార వేత్తలకు రుణాలిస్తూ పోవడం వల్లే యూపీఏ హయాంలో బ్యాంకుల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోయాయని ప్రధానమంత
బ్యాంకులను మోసం చేసిన కేసులో..
Mon 03 Sep 03:24:56.457533 2018
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక నేరాల పరంపర కొనసాగుతూనే ఉంది. లాభాలను చూపెట్టి బ్యాంకుల వద్ద రుణాలు పొందిన ఇద్దరు వ్యక్తులు.. నేరం బయటపడటంతో పారిపోవడానికి ప్రయత్నించగా వారిని ఢ
ప్రతీ పైసా వసూలు చేస్తాం..
Sun 02 Sep 05:31:17.70294 2018
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని గత యూపీఏ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. యూపీఏ హయాంలో నేతలు అధికారాన్ని ఉపయోగించుకొని బ
రూ.100లతో 'సేవింగ్స్' ఖాతా!
Sun 02 Sep 05:31:29.762288 2018
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) నుంచి పొదుపు ఖాతాలు, కరెంట్ ఖాతాలు, నగదు బదిలీలు, ప్రత్యక్ష నగదు బదిలీ, బిల్లు
ఎస్బీఐ రుణాలు మరింత భారం
Sun 02 Sep 05:31:51.854554 2018
ముంబయి: దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రుణాలపై వడ్డీరేట్లను స్వల్పం గా పెంచింది. తమ బ్యాంకు ఇచ్చే అప్పులపై వడ్డీరేటు 0.2 శాతం పెంచుతున్నట
హెచ్ఏఎల్ సీఎండీగా మాధవన్
Sun 02 Sep 05:32:08.212896 2018
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏ ఎల్) నూతన చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్. మాధవన్ నియమి తులయ్యారు. ఇంతక్రితం ఆయన
లాక్మే ఫ్యాషన్ వీక్లో మెరిసిన శ్రీకృష్ణ
Sun 02 Sep 05:32:17.615062 2018
ముంబయి: హైద రాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న శ్రీ కృష్ణా జ్యువెల్లర్స్ ముంబయిలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్లో తళుక్కుమంది. ఫ్యాషన్వీక్లో మలైకా అరోరా కొరకు ప్రత్
71% పెరిగిన ఐటీఆర్ దాఖలు
Sun 02 Sep 05:32:27.390002 2018
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో (ఐటీఆర్) దాదాపు 71 శాతం వృద్ధి నమోదైనట్టుగా సర్కారు వెల్లడించింది. ఐటీఆర్ దాఖలుకు శ
పెరిగిన జీడీపీ
Sat 01 Sep 03:51:10.691544 2018
న్యూఢిల్లీ : వ్యవసాయ, తయారీ రంగాల మద్దతుతో దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు పెరిగింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో జీడ
క్లెయిమ్ల పరిష్కారంలో ఎల్ఐసీ టాప్
Sat 01 Sep 03:51:17.128945 2018
నవతెలంగాణ -వాణిజ్య విభాగం మొత్తం బీమా పరిశ్రమలోనే క్లెయిమ్ల పరిష్కారంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉందని దక్షిణ మధ్య జోనల్ మేనేజర్ టిసి సుశీల్ కుమార్ అన
డాలర్ 71 రూపాయి
Sat 01 Sep 03:51:24.914608 2018
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. వాణిజ్య లోటు భయాలు, డాలర్కు డిమాండ్ పెరగడం, హెచ్చు చమురు ధరలు దేశీయ కరెన్సీ విలువను చరిత్రలో ఇది
లెక్క సరే.. వారికి దిక్కెవరు!
Fri 31 Aug 03:50:56.146824 2018
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: కేంద్రంలోని మోడీ సర్కారు గొప్పగా ఊహించుకొని దేశంలో చేపట్టిన నోట్లరద్దు ప్రక్రియ విఫలమైందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తాజా గణాంకాలు తేల్
అయిదో బలమైన ఆర్థిక శక్తిగా భారత్
Fri 31 Aug 03:51:02.862731 2018
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నాటికిి మన దేశం బ్రిటన్ను దాటేసి ప్రపంచంలోనే అయిదో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. అంత
మరో 23 పైసలు దిగజారిన రూపాయి..
Fri 31 Aug 03:51:09.835536 2018
ముంబయి: దేశీయ కరెన్సీ రూపాయి విలువలో క్షీణత కొనసాగుతోంది. అమెరికా కరెన్సీ డాలర్కు డిమాండ్ పెరగడంతో గత కొన్ని రోజులుగా పడిపోతూ వస్తున్న రూపాయి.. గురువారం మరోసారి జీవనకాల
మరింత పెరగనున్న నిరర్థక ఆస్తులు!
Thu 30 Aug 03:39:01.450098 2018
న్యూఢిల్లీ / ఇండోర్: దేశంలో మొండి బాకీల వల్ల బ్యాంకింగ్ రంగానికి నెలకొన్న ముప్పు తొలిగిపోలేదని పెద్ద బ్యాంక్ 'భారతీయ రిజర్వు బ్యాంక్' (ఆర్బీఐ) తాజాగా వెల్లడించిన ఒక
బ్యాంకులకు 99.3 శాతం రద్దయిన నోట్లు!
Thu 30 Aug 03:39:20.389528 2018
న్యూఢిల్లీ: 2016లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రు.500, రు.1000 నోట్లలో 99.3 శాతం మేర తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. రద్దయి
మరింతగా పతనమైన రూపాయి!
Thu 30 Aug 03:39:27.243197 2018
ముంబయి: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతోంది. ఇప్పటికే జీవన కాల కనిష్టం వద్ద నమోదు అవుతున్న రూపాయి విలువ.. బుధవారం డాలరు డిమాం
బిగ్సీలో ఒప్పో 'ఎఫ్9 ప్ర్రొ' సేల్స్ షురూ!
Thu 30 Aug 03:39:32.798834 2018
నవతెలంగాణ, వాణిజ్య విభాగం:ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయాల సంస్థ బిగ్ సీ మరో మేటి స్మార్ట్ఫోన్ను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఒప్పో సంస్థ కొత్త
రేపటి నుంచి గోల్డన్ జూబ్లీ వేడుకలు..
Thu 30 Aug 03:39:38.131753 2018
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఆర్సీ ఆఫ్ ఐసీఏఐ) గోల్డెన్ జూబ్లీ వే
రూ.5000 కోట్ల టర్నోవరే లక్ష్యం
Thu 30 Aug 03:39:43.93605 2018
నవతెలంగాణ, వాణిజ్య విభాగం:ఫ్రీడమ్ సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ తయారీదారు జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫాట్స్ ఇండియా (జీఈఎఫ్ ఇండియా) కాకినాడ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని
చమురు క్షేత్రాల్లో సరికొత్త 'వేదాంత'ం!
Wed 29 Aug 03:22:53.099221 2018
న్యూఢిల్లీ: దేశంలో విలువైన చమురు సహజ వాయువు బ్లాక్లను ఫలహారంలో ప్రయివేటు సంస్థలకు అప్పగించే కార్యక్రమాన్ని సర్కారు దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతోంది. చమురు సహజ వాయువు రం
బస్తీ దుకాణాల్లో అమెజాన్ 'ఈజీ'
Wed 29 Aug 03:22:59.088489 2018
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ క్రమంగా ఆఫ్లైన్ వేదికగా తమ వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ కొత్తగా 'అమెజాన్ ఈ
రాయల్ ఇన్ఫీల్డ్ నుంచి కొత్త వాహనం..
Wed 29 Aug 03:23:06.422926 2018
న్యూఢిల్లీ: రాయల్ ఇన్ఫీల్డ్ సంస్థ డ్యూయల్ ఛానెల్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్తో (ఏబీఎస్) కూడిన సరికొత్త మోటర్ సైకిల్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 'క్లాసిక్
స్టాక్ మార్కెట్లు పరుగో పరుగు..
Wed 29 Aug 03:23:21.124838 2018
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ లాభాల్లో పరుగులు పెడు తూనే ఉన్నాయి. లాభాల పరుగులో బుల్ మార్కెట్ ఏమాత్రం అలసిపోకుండా దూసుకెళ్తోంది. పా
'గూగుల్ పే'గా మారిన 'తేజ్'
Wed 29 Aug 03:25:45.807092 2018
న్యూఢిల్లీ: నగదు బదిలీలలకు పేరెన్నిక గల డిజిటల్ వేదికగా భారతీయుల మనసు దోచుకున్న గూగుల్ పేమెంట్స్ సర్వీస్ 'తేజ్' యాప్ పేరు మారింది! ఇకపై తేజ్ యాప ్ను.. 'గూగుల్ పే
జియో ఖాతాలోకి ఆర్కామ్ 'ఫైబర్'
Tue 28 Aug 04:17:31.892531 2018
న్యూఢిల్లీ: దేశంలోని మిగతా టెలికాం సంస్థలను ఆగం పట్టిస్తూ అంబానీ బ్రదర్స్ ఆడుతున్న క్రయవిక్రయాల క్రీడ కొనసాగుతూ వస్తోంది. అప్పుల ఉబిలో కూరుకుపోయి నిధుల కోసం ఆస్తులను విక | 1entertainment
|
Visit Site
Recommended byColombia
తాజా నివేదికలో పూనె (4), కోల్కతా (5), ఢిల్లీ (8) మొదటి పదిస్థానాల్లో చోటు సంపాదించాయి. చెన్నై (14), ముంబై (20) స్థానాల్లో నిలిచాయి.
కాగా వివిధ నగరాల్లో ఆర్థిక వ్యవస్థల పనితీరు, స్థిరాస్థి మార్కెట్లో వృద్ధి కారణంగా ఆయా నగరాలు తక్కువ కాలంలోనే శీఘ్రగతిన అభివృద్ధిని నమోదు చేస్తున్నాయి. మానవ వనరులు, అనుసంధానత, స్థిరాస్థి రంగంలో పెట్టుబడులు, స్థిరాస్థుల ధరలు, ఆర్థికోత్పత్తి, కార్పొరేట్ వ్యవహారాల తీరు, నిర్మాణ, చిల్లర అమ్మకాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా నగరాల వృద్ధిని అంచనావేశారు. ఈ రంగంలో తొలినుంచి ఆధిక్యతను చూపిస్తున్న భారత్ ఇప్పుడు మరింత పట్టును సాధించింది.
శరవేగంగా అభివృద్ది చెందుతున్న జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు
తక్కువ సమయంలోనే ఇలా అభివృద్ధి నమోదు చేయడానికి స్థానిక ప్రభుత్వాలు చూపుతున్న శ్రద్ధ, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న పెట్టుబడులు కారణమని అంచనా వేశారు. కాగా దీర్ఘకాలంలో ఇదే ఒరవడి కొనసాగడానికి ఈ నివేదిక దోహదపడుతుందని, దీని ఆధారంగా పెట్టుబడిదారుల దృష్టి ఆయా నగరాలపై పడుతుందని జెఎల్ఎల్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్ చెప్పారు. భారతీయ ఆర్థిక వ్యవస్థలో జోరు నగరాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నప్పటికీ వౌలిక వసతులు, స్థానిక సౌకర్యాల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరు ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉన్నాయని, లీజింగ్ కార్యకలాపాల్లో బెంగళూరు ఇప్పటికే ఏ గ్రేడ్ స్థాయిలో ఉందని నాయర్ చెప్పారు. విదేశీ సంస్థల పొరుగు సేవల రంగానికి బెంగళూరు కేంద్రంగా మారిందని, ఇప్పుడు విదేశీ కంపెనీల పరిశోధనలు, అభివృద్ధి కేంద్రంగా వర్థిల్లుతోందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సానుకూల నిర్ణయాల కారణంగా హైదరాబాద్ అభివృద్ధి వేగం పుంజుకుందని, డెల్లాయిట్, క్వాల్కమ్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమతమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం అందుకు ఉదాహరణ అని ఆయన చెప్పారు. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబయి మెరుగైన స్థానంలో లేకపోయినప్పటికీ చింతించాల్సిన పనిలేదని, ఆయా నగరాలు ఇప్పటికే ఆర్థికంగా స్థిరమైన స్థితిలో ఉన్నాయని జెఎల్ఎల్ నివేదికలో పేర్కొంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
అన్నిటికి సిద్ధపడే వచ్చా,తేజుతో నాకు లింకా : మెగాడాటర్ నిహారిక
Highlights
నిహారిక 'ఒక మనసు' చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది
అన్నిటికి సిద్ధపడే వచ్చా
నా కజిన్తో లింకేంటి చండాలంగా
కొణిదెల నిహారిక 'ఒక మనసు' చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ మెగాడాటర్'ఒరు నల్ల నాల్ పత్తు సొల్ రే' అనే చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. జనవరి చివరి వారంలో విడుదలైన ఈచిత్రం అక్కడ మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా నిహారిక ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
తమిళంలో విడుదలైన నా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. హైదరాబాద్ లో పెదనాన్న సినిమా ఫస్ట్ డే క్రౌడ్ ఎంత ఎక్జైటింగ్గా ఉంటుందో అలాంటి ఎగ్జైట్మెంట్ అక్కడ చూశాను అని నిహారిక తెలిపారు తెలిపారు.
ఈ మూవీలో బాబాయ్ స్టైల్ కొంచెం ట్రై చేశాను. నిజానికి అది పవర్ స్టార్ స్టైల్ కాదు. కాటమరాయుడు సినిమాలో ఆయన మీసం తిప్పినట్లు ఏదో ట్రై చేశాను. నాకు మీసం లేకున్నా ఆయనలా ట్రై చేశాను.... అని నిహారిక తెలిపారు.
మా ఫ్యామిలీలో కొందరికి సెకండ్ మూవీ సెంటిమెంట్ ఉన్న మాట నిజమే. అన్నయ్య వరుణ్ తేజ్ సెకండ్ మూవీ హిట్. అదే విధంగా రామ్ చరణ్ అన్నయ్య సెకండ్ మూవీ ‘మగధీర' కూడా చాలా పెద్ద హిట్. తెలుగులో నా సెకండ్ మూవీ విడుదల కాలేదు. కెరీర్లో చూసుకుంటే తమిళ మూవీ నా రెండోది. ఇది మంచి హిట్టయింది. అలా చూసుకుంటే నాకు కూడా వారి మాదిరిగానే సెకండ్ మూవీ కలిసొచ్చిందని చెప్పొచ్చు... అని నిహారిక వ్యాఖ్యానిచారు.
మీ మీద ఈ మధ్య చాలా రూమర్స్ వచ్చాయి. మీ తొలి సినిమా కోస్టార్ నాగ శౌర్యతో మీకు లింక్ పెట్టి రూమర్స్ స్ప్రెడ్ చేశారు, వీటిని మీరు ఎలా తీసుకుంటారు? అనే ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ... ‘ఇండస్ట్రీకి వస్తే ఇలాంటి రూమర్స్ వస్తాయని తెలుసు, అన్నిండి సిద్ధపడే వచ్చాను' అని నిహారిక తెలిపారు.
నాగ శౌర్యతో మాత్రమే కాదు, చండాలంగా మా కజిన్ తో కూడా లింక్ పెట్టి రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఇది చాలా స్టుప్పిడ్... అంటూ తన మనసులోని ఆసహనాన్ని వెల్లగక్కారు నిహారిక.
మీడియాలో వారు సర్వైవ్ కావడానికి ఇలాంటివి రాస్తుంటారు. వాళ్లు అలా రాయడం వల్ల నా లైఫ్ లో ఎలాంటి మార్పు జరుగలేదు. నాకు వచ్చిన స్క్రిప్టులు పోలేదు, నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు అని నిహారిక తెలిపారు.
మీడియాకు చెప్పేది ఒకటే. ఎవరూ దేన్ని ఎక్కువ రోజులు పట్టించుకోరు. అందుకే నేను లైట్ తీసుకుంటాను. ఈ రోజు హాట్ న్యూస్ రేపు ఓల్డ్ న్యూస్ అవుతుంది. అందుకే వాటిపై నేను రియాక్ట్ అవ్వడం లేదు అని నిహారిక తెలిపారు.
‘హ్యాపీ వెడ్డింగ్' అనేది తెలుగులో నా రెండో మూవీ. లక్ష్మణ్ అనే కొత్త డైరెక్టర్ చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి ఎండింగులో లేదా మార్చి ఈ సినిమా విడుదలవుతుంది... అని నిహారిక తెలిపారు.
"కథలు ఎంచుకునే ముందు నాకు సినిమాలో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది చూస్తాను. ఎలాంటి క్యారెక్టర్... నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరా? పాజిటివ్ షేడ్ ఉన్నదా? చిన్న పిల్ల క్యారెక్టరా? మెచ్యూర్డ్ క్యారెక్టరా? అనేది చూడను. సినిమాలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేదే చూస్తాను. కథ విన్న తర్వాత నాతో సినిమా ఎంత ట్రావెల్ అయిందనే విషయాన్నే చూస్తాను. నాకు నచ్చితే చేస్తాను." నిహారిక తెలిపారు.
ఉమెన్గా నా తొలి సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇష్టపడ్డాను. అది ఎక్స్పర్మెంట్ అని తెలిసి చేశాను. ఎక్స్పర్మెంట్స్ అన్ని సార్లు హిట్టవ్వవు. నేను జెన్యూన్గా కామెడీ ఇష్టపడతాను. కామెడీ చేయడం ఇష్టం. నాలో నేను కూడా ఓ చిన్న కమెడియన్ను చూసుకుంటాను. సినిమాకు కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్.... అని నిహారిక తెలిపారు.
ఈ మధ్య కాలంలో కమెడియన్ల కంటే హీరోలే ఎక్కువ కామెడీ చేస్తున్నారు. వారి క్యారెక్టరైజేషనే అలా రాస్తున్నారు. కమెడియన్లు అంటే నాకు బ్రహ్మానందం గారే గుర్తొస్తున్నారు. గత ఐదారు సంవత్సరాల్లో చాలా మంది గ్రేట్ కమెడియన్లు చనిపోయారు. ఇది ఇండస్ట్రీకి చాలా పెద్ద లాస్. ప్రత్యేకంగా కమెడియన్ ఇష్టం అని కాకుండా కంటెంటును ఇష్టపడతాను అని నిహారిక తెలిపారు.
Last Updated 25, Mar 2018, 11:53 PM IST | 0business
|
Nitish rana
లయన్స్పై చెలరేగిన నితీశ్ రాణా
ముంబయి: ఐపిఎల్ పదవ సీజన్లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మెన్ నితీశ్ రాణా 6 బంతుల్లో 4 బౌండరీలు,2 సిక్సర్లతో 53 పరుగులతో తన జోరు కొనసాగించాడు.వాంఖడే వేదికగా గుజరాత్ లయన్స్తోజరుగుతున్న మ్యాచ్లో రెండవ హాఫ్ సెంచరీ సాధించాడు.క్రీజులో ఎదుర్కొన్న తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాడు.చక్కని స్టోక్ప్లేతో బౌండరీలు,సిక్సర్లు బాదాడు.స్పిన్నర్ జడేజా వేసిన బంతిని థర్డ్ మ్యాన్ దిశగాతరలించి హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రాణా,థంపీ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదాడు.ఆరవ ఓవర్లో ఆండ్రూ టై వేసిన షార్ట్ బాల్ను సిక్సర్గా మలిచిన తీరు ఇన్నింగ్స్కే హైలైట్.ఈ క్రమంలోనే టై వేసిన బంతిని ఆడబోయికీపర్ దినేశ్ కార్తీక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.177 పరుగుల టార్గెట్ ఛేదనకు దిగిన ముంబయి 11 ఓవర్లకు 2 వికెట్లు చేజార్చుకుని 92 పరుగులు చేసింది.రోహిత్ శర్మ,బట్లర్ క్రీజులో ఉన్నారు. | 2sports
|
వారణాసి వేదికగా విడుదలైన "మణికర్ణిక" టైటిల్ లోగో !!
Highlights
వారణాసి వేదికగా విడుదలైన క్రిష్ బాలీవుడ్"మణికర్ణిక" టైటిల్ లోగో
గబ్బర్ ఈజ్ బ్యాక్ తో బాలీవుడ్ లో సత్తా చాటిన క్రిష్
ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో నటిస్తున్న కంగనా రనౌత్
తెలుగులో "గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందింపజేసిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్ లోనూ "గబ్బర్ ఈజ్ బ్యాక్"తో తన సత్తాను చాటుకొన్నాడు. ఆయన తాజాగా తెరకెక్కించనున్న బాలీవుడ్ చిత్రం "మణికర్ణిక". వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చారిత్రక చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తోంది.
జీ స్టూడియోస్ సమర్పణలో కమల్ జైన్ ఈ చిత్రాన్ని కైరోస్ కంటెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చుతున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం సంగీత దర్శకత్వం వహించనున్నారు.
"మణికర్ణిక" టైటిల్ లోగో విడుదల మరియు రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ కార్యక్రమం వారణాసిలో జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర బృందం వారణాసిలో 20 అడుగుల పొడుగు "మణికర్ణిక" టైటిల్ లోగో పోస్టర్ ను విడుదల చేశారు. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది.. అనగా ఏప్రిల్ 27, 2018 విడుదల చేస్తున్నట్లు తెలిపారు!
Last Updated 25, Mar 2018, 11:48 PM IST | 0business
|
కొనసాగిన మార్కెట్ల పతనొం కొనసాగుతున్న ఎఫ్ఐఐల ప్రభావం
- సెన్సెక్స్ 118 పాయింట్లు నష్టం
ముంబయి : భూసమీకరణ బిల్లు అంశంలో ప్రతిపక్షాలదే పై చెయ్యిగా ఉందన్న సంకేతాలకు తోడు విదేశీ మదుపర్ల లాభాలపై పన్ను చెల్లింపుపై కొనసాగుతున్న ఊహాగానాలు మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. మరోవైపు యూరోజోన్, వాల్స్ట్రీట్ పరిణామాలు ప్రపంచ మార్కెట్లను నిరాశకు గురి చేశాయి. ఈ పరిణామాల నేపధ్యంలో వరుసగా మూడో సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలకు గురై ఆరున్నర మాసాల కనిష్టానికి దిగజారాయి. గురువారం బిఎస్ఇ సెన్సెక్స్ 118.26 పాయింట్లు లేదా 0.44 శాతం దిగజారి 26,599 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 39.7 పాయింట్లు లేదా 0.49 శాతం తగ్గి 8,057.30 వద్ద నమోదయ్యింది. సెన్సెక్స్ ఇంట్రా ట్రేడింగ్లో 26,423.99-26,850 మధ్య ఊగిసలాడింది. గతేడాది అక్టోబర్ 21న సెన్సెక్స్ ఈ స్థాయిలో చోటు చేసుకుంది.
బిఎస్ఇలో రంగాల వారిగా బ్యాంకింగ్ సూచీ అత్యధికంగా 2.33 శాతం విలువ కోల్పోయింది. ఇదేక్రమంలో రియాల్టీ 2.2 శాతం, మౌలిక వసతులు 2.18 శాతం, కన్సూమర్ డ్యూరెబుల్స్ 2.01 శాతం చొప్పున తగ్గాయి. మరోవైపు ఐటి సూచీ 1.63 శాతం, టెక్ 1.31 శాతం, ఎఫ్ఎంసిజి 0.41 శాతం చొప్పున నష్టాల పాలయ్యాయి. సెన్సెక్స్లో టిసిఎస్ 3.27 శాతం, బజాజ్ ఆటో 2.51 శాతం, కోల్ ఇండియా 2.21 శాతం, ఐటిసి 1.51 శాతం, హీరో మోటో కార్ప్ 1.21 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
మరోవైపు యాక్సిస్ బ్యాంకు 2.95 శాతం, ఒఎన్జిసి 2.94 శాతం, మారుతి సుజుకి 2.52 శాతం, హిందాల్కో 2.47 శాతం, ఐసిఐసిఐ బ్యాంకు 2.44 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. బుధవారం విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1,699 కోట్ల (265.80 మిలియన్ డాలర్లు) ఈక్విటీలను విక్రయించారు.
ఇంతక్రితం సెషన్లో 360.88 మిలియన్ డాలర్ల ఈక్విటీలను తరలించుకుపోయారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు దేశీయ స్టాక్ మార్కెట్లు 12 శాతం వరకు పడిపోయాయి. కేవలం క్రితం 14 సెషన్లలోనే 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12600 కోట్లు) షేర్లు విక్రయాలకు గురి అయ్యాయి. సెన్సెక్స్ గత మూడు వారాల్లో సుమారు 2500 పాయింట్ల నష్టాలను చవి చూసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
'గౌతమిపుత్ర శాతకర్ణి' జాబితాలో మరో అరుదైన రికార్డ్!
క్రిష్ దర్శకత్వంలో నందమూరి బసవతారకరామ పుత్ర బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డుల పరంపర కొనసాగుతోంది...
| Updated:
Jan 18, 2017, 08:35PM IST
క్రిష్ దర్శకత్వంలో నందమూరి బసవతారకరామ పుత్ర బాలకృష్ణ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నటి హేమామాలిని, శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే బాలకృష్ణ, క్రిష్ కెరీర్లలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్టర్‌గా నిలిచిన ఈ సినిమా తాజాగా తక్కువ వ్యవధిలో అత్యధిక లైకులు సొంతం చేసుకున్న ట్రైలర్‌గా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
డిసెంబర్ 16న రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కి ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ కనిపించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 7.1 మిలియన్ వ్యూస్‌లకి చేరిన ఈ ట్రైలర్ తాజాగా ఒక లక్ష లైకులని సొంతం చేసుకున్న ట్రైలర్‌గానూ రికార్డ్ కొట్టేసింది. ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయిలో వ్యూస్, లైకులు కైవసం చేసుకున్న తొలి తెలుగు సినిమా ట్రైలర్ కూడా ఇదే కావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. | 0business
|
Deviliars
గంగూలీ రికార్డు బ్రేక్ చేసిన డివిలియర్స్
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాట్స్మెన్,ఆ జట్టు కెప్టెన్ డివిలియర్స్ మరో అరుదైన రికార్డుని సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అతి తక్కువ మ్యాచ్లు,ఇన్నింగ్స్లలో 9000 పరుగుల మైలు రాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.మొత్తం 205 ఇన్నింగ్స్లలో డివిలియర్స్ఈ ఘనత సాధించాడు.ఇప్పటి వరకు ఈ రికార్డును టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ పేరిట ఉంది.228 ఇన్నింగ్స్లలో గంగూలీ 9000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.2004లో మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై గంగూలీ ఈ రికార్డుని నెలకొల్పాడు.అయితే తాజాగా గంగూలీ పేరిట ఉన్న ఈ రికార్డును డివిలియర్స్ అధిగమించాడు.మొత్తంగా చూస్తే వన్డే క్రికెట్లో 18 మంది ఈ ఘనతను సాధించారు.అయితే వీరిలో అత్యుత్తమ స్ట్రయిక్ రేట్ 99,94తో డివిలియర్స్ మొదటి స్థానంలో ఉన్నాడు.న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా మూడవ వన్డేలో డివిలియర్స్ ఈ రికార్డును నెలకొల్పాడు.ఈ మ్యాచ్లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డివిలియర్స్ 9000 వన్డే పరుగులు పూర్తి చేసుకుని గంగూలీ రికార్డును అధిగమించాడు. న్యూజిలాండ్ పర్యటనకు రాక ముందు ఈ అరుదైన ఘనతకు కేవలం 87 పరుగుల దూరంలో ఉన్న డివిలియర్స్ తొలి రెండు వన్డేల్లో వరుసగా 37 పరుగులు నాటౌట్,45 పరుగులు చేశాడు.తొమ్మిది వేల పరుగుల మైలురాయికి అవసరమైన అయిదు పరుగులను ఈ వన్డేలో సాధించాడు. జాక్వస్ రికార్డు సవరణ వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ తన పేరిట ఎన్నో రికార్డులను సృష్టించాడు.దక్షిణాఫ్రికా జట్టు నుంచి గతంలో జాక్వస్ కలిస్ 242 ఇన్నింగ్స్లలో ఉన్న రికార్డును డివిలియర్స్ 205 ఇన్నింగ్స్లలో చేసి సవరించాడు.మరోవైపు గంగూలీ రికార్డును అధిగమించిన డివిలియర్స్ ది వాల్ ద్రవిడ్ రికార్డును మాత్రం అందుకోలేకపోయాడు.వన్డేలు ఆడటం ప్రారంభించిన తరువాత 9 సంవత్సరాల్లో 322 రోజుల్లో ద్రవిడ్ 9000 పరుగులు సాధించాడు.కానీ డివిలియర్స్కు ఈ ఘనత సాధించడానికి 12 సంవత్సరాల 23 రోజులు పట్టింది.
ప్లేయర్ ప్రత్యర్థి మ్యాచ్లు ఇన్నింగ్స్
1. డివిలియర్స్ న్యూజిలాండ్ 214 మ్యాచ్లు 205
2. గంగూలీ ఆస్ట్రేలియా 236మ్యాచ్లు 228
3. సచిన్ దక్షిణాఫ్రికా 242 మ్యాచ్లు 235
4. బ్రియాన్ లారా ఆస్ట్రేలియా 246 మ్యాచ్లు 239
5. రికీ పాంటింగ్ దక్షిణాఫ్రికా 248 మ్యాచ్లు 242
6. జాక్వస్ కలిస్ ఇంగ్లండ్ 256 మ్యాచ్లు 242 | 2sports
|
బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్
లెప్టినెంట్గా కొత్త బాధ్యతలు
న్యూఢిల్లీ : బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సరికొత్త బాధ్యతలు చేపట్టారు.కాగా శుక్రవారం ఆయన భారత సైన్యంలో చేరినట్లు వెల్లడించాడు.ఠాకూర్ టెరిటోరియల్ ఆర్మీలో లెప్టినెంట్గా ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియమించారు.ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ మా తాతయ్య ఆర్మీలో పనిచేశారు.చిన్నప్పటి నుంచి నేను కూడా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కనేవాడిని. ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీలో లెప్టినెంట్ హోదాలో నా దేశ ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నాడు. పార్లమెంట్ సభ్యుడిగా టెరిటోరియల్ ఆర్మీలో చేరిన తొలి బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ కావడం విశేషం.ఠాకూర్ ఆర్మీలో చేరేందుకు పరీక్ష పాసయ్యాడు.చండీగఢ్లో నిర్వహించిన ముఖాముఃకి వ్యక్తిగతంగా హాజరై,బోపాల్లో ఆర్మీ శిక్షణ కూడా పొందారు.హమిర్పూర్ నియోజకవర్గ(హిమాచల్ ప్రదేశ్) ఎంపిగా ఉన్న ఠాకూర్ టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ ఆఫీసర్గా ఇక ఖచ్చితంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంది.టెరిటోరియల్ ఆర్మీది భారత సైన్యంలో ద్వితీయశ్రేణి.ఇందులో కేవలం స్వచ్ఛం దంగా మాత్రమే చేరతారు.ఇది వృత్తి కాదు,ఉపాధి మార్గం కాదు,ఇప్పటికే ఇతర వృత్తుల్లో ఉన్న పౌరు లను ఇందులో చేర్చుకుంటారు.వీరికి ఏడాదిలో ఒక నెల ప్రత్యేక మిలటరీ శిక్షణ ఇస్తారు.దేశానికి అత్యవసర సైనికావసరాలు ఏర్పడినసమయంలో భారత సైన్యం వీరి సేవలు వినియోగించుకుంటుంది. | 2sports
|
Money tap
మూడేళ్లలో 100 నగరాలకు మనీట్యాప్ విస్తరణ
హైదరాబాద్, డిసెంబరు 15: దేశంలోని మొట్టమొదటిసంస్థగా మొబైల్యాప్ ద్వారా రుణపరపతిని అందించే సంస్థగా మనీట్యాప్ రానున్న మూడేళ్లలో వందనగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకులు అనూజ్ కాకర్ వెల్లడించారు. వేతనాలు పొందుతున్న కేటగిరీ ఉద్యోగులకు మనీట్యాప్ అహ్మ దాబాద్, వదోదర, ఢిల్లీఎన్సిఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్చెన్నై నగరాల్లో రుణపరపతిని అందిస్తున్నదని, ఇందుకోసం ఆర్బిఎల్ బ్యాంకుతో అవగాహన కుదుర్చుకున్నట్లు అనూజ్ వెల్లడించారు. మనీట్యాప్ యాప్ను డౌన్లోడ్చేసుకుని కాగితరహిత లావాదేవీలు, ఆధార్,పాన్కార్డుసాయంతో మొత్తం నింపి పంపిస్తే సిబిల్ నివేదిక అనంతరం బ్యాంకులకు పంపిస్తామని బ్యాంకు రుణపరపతికి అంగీకరిస్తే మొత్తం నేరుగా లబ్ధిదారుని ఖాతాకు జమ అవుతుందన్నారు. 25 వేల నుంచి ఐదు లక్ష లరూపాయలవరకూ రుణపర పతి అందుతుందని, ఇఎంలు వాటి వివరాలను కూడా సమగ్రంగా పొందుపర చడం జరుగుతుందన్నారు. మూడేళ్లలోపు ఇఎంఐపద్ధతిలో చెల్లించాల్సి ఉం టుందన్నారు.
వడ్డీరేట్లు కనిష్టంగా 1.25శాతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతే ఆర్బిఎల్క్రెడిట్కార్డు కస్టమర్లకు అందిస్తారని ఇవన్నీ పోస్టుద్వారా పంపిస్తామన్నారు. రెగ్యులర్ మాస్టర్కార్డు,క్రెడిట్కార్డు డెబిట్కార్డుల సాయం తో మనీట్యాప్ రుణం తమబ్యాంకు ఖాతాలనుంచి విత్డ్రాచేసుకునే అవకాశం ఉందన్నారు. మొత్తం కెవైసి పూర్తిచేసిన తర్వాత ఒకేఒక్కసారి 499రూపాయలు పన్నులతో చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బిఎల్ బ్యాంకు యొక్కమొదటినెల బిల్లుతో చెల్లించాలి. ప్రభుత్వరంగ బ్యాంకులు, నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. రెండుశాతం ప్రాసెసింగ్ ఫీజు, 15-18శాతం వడ్డీ ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఏడునగరాల్లో 70 వేల డౌన్లోడ్లు జరిగాయని అనూజ్ వివరించారు. ఈ ఏడాది చివరినాటికి 20 నగరాలకు విస్తరిస్తామని, వచ్చే మూడేళ్లలో మనీట్యాప్యాప్ పదిలక్షల డౌన్లోడ్లు కావాలన్న లక్ష్యం ఉందని, అలాగే 100 నగరాలకు మనీట్యాప్ సేవలు విస్తరిస్తామని అనూజ్కాకర్ వివరించారు. | 1entertainment
|
Suresh 78 Views
టెన్నిస్ ఆటగాడు సాకేత్ పెళ్లి ప్రతిపాదన
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ప్రపంచంలో దూసుకు పోతున్న ఆటగాడిగా ఉన్న సాకేత్ మైనేని తన ప్రియురాలి మనసు గెలిచుకున్నారు.కాగా స్పెయిన్తో డేవిస్ కప్కు బయలుదేరే ముందు ఢిల్లీలో విందు ఏర్పాటు చేయగా, సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ తదితరులు చూస్తున్న వేళ, మెకాళ్లపై కూర్చుని తన ప్రియురాలు శ్రీలక్ష్మికి గులాబిపువ్వును ఇస్తూ తనను పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదించాడు.నవ్వుతూ దాన్ని అందుకున్న శ్రీలక్ష్మి సిగ్గు వ్యక్తం చేస్తే సాకేత్తో వివాహానికి అంగీకరించింది.దీంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా కాబోయే జంట కేక్ను కట్ చేసింది.ఇక తన సమక్షంలో ఇదే తొలి ప్రపోజల్ అని లియాండర్్ పేస్ ట్విటర్లో వెల్లడించాడు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Hardik Pandya: ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి హార్దిక్ పాండ్య ఔట్..!
ఆసియా కప్లో భాగంగా గత ఏడాది పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ వెన్నునొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే మైదానం వీడిన హార్దిక్ పాండ్య.. దాదాపు నాలుగు నెలల తర్వాత టీమిండియాలోకి ఈ ఏడాది జనవరిలో పునరాగమనం చేశాడు. కానీ.. ?
Samayam Telugu | Updated:
Feb 21, 2019, 03:39PM IST
Hardik Pandya: ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి హార్దిక్ పాండ్య ఔట్..!
హైలైట్స్
ఆస్ట్రేలియాతో విశాఖపట్నం వేదికగా ఆదివారమే తొలి టీ20
వెన్నునొప్పి గాయం కారణంగా గత ఏడాది ఆసియా కప్ మధ్యలోనే వెనుదిరిగిన హార్దిక్ పాండ్య
ప్రపంచకప్ ముంగిట మళ్లీ గాయపడిన ఆల్రౌండర్
హార్దిక్ పాండ్య స్థానంలో రవీంద్ర జడేజా ఎంపికయ్యే అవకాశం
ఆస్ట్రేలియాతో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న సుదీర్ఘ సిరీస్కి గాయం కారణంగా భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. కంగారూలతో రెండు టీ20లు, ఐదు వన్డేలను టీమిండియా ఆడనుండగా.. ఇటీవల టీ20, వన్డే జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. వన్డే సిరీస్లో ఆడే జట్టే మే నెలలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్లోనూ ఆడుతుందని పరోక్షంగా సెలక్టర్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. | 2sports
|
cash
డిపాజిట్లు పెరిగి వడ్డీరేట్లు తగ్గుతాయి!
ముంబై,నవంబరు 16: పెద్దకరెన్సీనోట్లను రద్దు చేయడం వల్ల బ్యాంకులకు డిపాజిట్లు పెరుగుతు న్నాయి. దీనివల్ల రానున్నకాలంలో వడ్డీరేట్లు మరిం తగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరుగుతున్న డిపాజిట్ల సంఖ్య రానురాను రూ.4 నుంచి రూ.5 లక్షలకోట్లకు పెరుగుతుందని చెపుతున్నారు. ఫిక్సెడ్ డిపాజిట్ ఇన్వెస్టర్లకు చేదువార్త అని ఎక్కువ బ్యాంకు డిపాజిట్లు వల్లబ్యాంకులపై వడ్డీరేట్ల తగ్గిం పు ఒత్తిడిపెరుగుతుందని అంచనా. ఇప్పటివరకూ దేశంలో రుణపరపతిలో ఎలాంటి వృద్ధిలేదు. ప్రస్తుతం నోట్లరద్దువల్ల ద్రవ్యోల్బణం మరింత తగ్గు తుందని, మరో 25-50 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుందని ఆర్ధిక నిపుణులు అంచనావేస్తున్నారు. వచ్చే డిసెంబరు ఏడవ తేదీ ఆర్బిఐ విధాన సమీక్ష ఉంటుంది. భారీఎత్తున పెరి గిన డిపాజిట్లతో ఆర్బిఐ చేపట్టే వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాలు రుణపరపతిరంగంపై సడలింపులు తెస్తాయని అంచనా. రిటైల్ద్రవ్యోల్బణం 14నెలల దిగువకు అక్టోబరునెలలో నమోదయింది.
మరిం తగా తగ్గి 3.5శాతంగా ఉంటుందని అంచనా. సేవలరంగంపై ఈ నల్లధన కట్టడి కార్యాచరణప్రభా వం ఉంటుందని, ఎందుకేంటే ఈ రంగంలోనే క్కువ నగదు లావాదేవీలు జరుగుతాయని ఎస్బిఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యకాంతిఘోష్ వెల్లడించారు. డిసెంబరులో వడ్డీరేట్ల తగ్గింపు ఉన్నా అక్కడితో ఆగిపోదని మరింత ఉంటాయని ఆయన అభిప్రాయ పడ్డారు. సిఎల్ఎస్ఎ సీనియర్ ఆర్ధికవేత్త రాజీవ్ మాలిక్ మాట్లాడుతూ ఆర్బిఐ రెపోరేట్లను మూడు పర్యాయాలు తగ్గిస్తుందని, వచ్చే ఏడాదికాలంలో ఈ కోతలు తప్పవని అన్నారు. ఇక డెట్రంగంలో యువ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక డెట్ మ్యూచువల్ ఫండ్స్కు వెళ్లడం మంచిదన్న సలహాలు వస్తున్నా యి. డెట్ లేదా బాండ్ల మార్కెట్లు ప్రస్తుతం లాభ దాయకంగా ఉంటాయి.
ఎందుకంటే డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గడం వల్ల సహజంగానే ఇన్వెస్టర్లు ఈ రంగాలపై దృష్టిసారిస్తారు. ఇకపై పన్నురహిత బాం డ్లు ఎక్కువగా మార్కెట్కు వెల్లువలా వచ్చే అవ కాశం ఉంటుంది. అయితే ఈ ఏడాదిలో ఇకపై పన్నురహిత బాండ్లు వచ్చే అవకాశం లేదు. ఈ బాండ్లు స్టాక్ ఎక్ఛేంజిల్లోనే ట్రేడ్అవుతాయి. ఇన్వె స్టర్లు వాటిని సెకండరీ మార్కెట్లనుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పన్నురహిత బాండ్లలో పెట్టుబడులు పెట్టేముందు వాటి కాలపరిమితి, రేటింగ్, ద్రవ్యవిధానం వంటి వాటిపై పరిశీలన చేసుకుని పెట్టుబడులు పెట్టుకోవచ్చని ఇన్వెస్టర్లు, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు సలహాలిస్తున్నాయి. ఇక సీనియర్ సిటిజన్లు చిన్నమొత్తాల పొదుపుపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. బ్యాంకు డిపాజిట్ల కంటే చిన్నమొత్తాల పొదుపు డిపాజిట్ల వడ్డీరేట్ల కొంత ఎక్కువగా ఉంటాయి. అందుకే సీనియర్లు ఎక్కువగా వీటిపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. మరోపక్క ఇన్వెస్టర్లు టాక్స్ఫ్రీ బాండ్లలో పెట్టు బడులు పెడితే ఆరుశాతం పన్నురహిత రిటర్నులు ఉంటాయని వాటికి ఇన్వెస్టర్లు ఎక్కువ పెట్టుబడు లకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంచనా. | 1entertainment
|
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
First Published 18, Sep 2017, 7:23 PM IST
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
నెక్ష్ట్ నువ్వే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
Recent Stories | 0business
|
Jul 13,2018
కొనుగోళ్లతో దలాల్ స్ట్రీట్ కళకళ!
ముంబయి: సానుకూల పవనాల నేపథ్యంలో దలాల్స్ట్రీట్ కళకళలాడింది. చమురు ధరలు తగ్గు ముఖం పట్టడం వంటి అంతర్జాతీయ సంకేతాలతో పాటు దేశీయ పరిణామాలపై సానుకూలతల నేపథ్యంలో మదుపర్లు స్టాక్ మార్కెట్లలో తాజా కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో గురువారం ఆరంభం నుంచే జోరుమీదున్న సూచీలు రికార్డు స్థాయిలో ముగిశాయి. సెన్సెక్స్ 282 పాయింట్లు ఎగబాకి 36,548 పాయింట్ల వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకింది. అటు నిఫ్టీ కూడా 75 పాయింట్ల లాభంతో 11,023 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 68.59గా కొనసాగుతోంది. బ్యాంకింగ్, రిలయన్స్ షేర్ల దన్నుతో గురువారం మార్కెట్లు 150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను మొదలై దూకుడును కొనసాగించాయి. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడింది. రిలయన్స్ ఇండిస్టీస్ షేర్లు దూసుకెళ్లాయి. ఇటీవల జరిగిన ఏజీఎం సమావేశంలో నేపథ్యంలో షేరు ధర 52 వారాల గరిష్ఠానికి పెరిగింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
HPCL
ముంబై: ప్రభుత్వ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పిసిఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో నికరలాభాలు 147.5శాతం వృద్ధి చెందాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.1,735కోట్ల నికరలాభం ఆర్జించింది. ముడిచమురు శుద్ధిలో వృద్ధి, అలాగే ఈ వ్యాపారంలో లాభాలు పెరగడం దీనికి ప్రధాన కారణం. 2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.700కోట్లు మాత్రమే ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో చమురు శుద్ధి, దిగుమతుల విషయంలో ఎక్కువ ఆదాయం సమకూరడమే దీనికి ప్రధాన కారణమని హెచ్పిసిఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంకె సురాన తెలిపారు. క్రితం ఏడాది ఇదేసమయంలో 550కోట్ల నష్టం రాగా, ఇప్పుడు 792కోట్లు లాభం వచ్చిందని కంపెనీ నికరలాభాలు పెరగడం ఇదే ప్రధానకారణమని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలను కూడా నమోదుచేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు రూ.54,153కోట్లుగా ఉన్నాయి. 2016లో ఇదే త్రైమాసికంలో కంపెనీ జరిపిన రూ.47,750కోట్ల అమ్మకాలే ఇప్పటివరకు రికార్డు. ఇదేసమయంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 4.6శాతం వృద్ధి చెంది 8.37మిలియన్ టన్నులకు పెరిగాయి. ముంబై, విశాఖపట్టణంలోని హెచ్పిసిఎల్ రిఫైనరీలలో క్రితం ఏడాది ఇదే సమయంలో 4.05మిలియన్ టన్నుల ముడిచమురును శుద్ధిచేయగా, ఇప్పుడు 4.64మిలియన్ టన్నుల చమురు శుద్ధిచేశాయి. అంతేకాకుండా క్రితం ఏడాది ఇదేసమయంలో చమురు శుద్ధి ద్వారా లభించే మార్జిన్ బ్యారల్కు 2.23డాలర్లుగా ఉండగా, ఇప్పుడు అది బ్యారల్కు 7.61డాలర్లకు పెరిగింది. ఇదిలా ఉండగా మలేషియాకు చెందిన ఎం3 ఎనర్జీ బెర్హాత్ సంస్థతో మధ్యవర్తిత్వ వివాదంలో కంపెనీ రూ.444కోట్ల పరిహారాన్ని పొందింది. 2009లో ముంబైలోని ఒక ఆఫ్షోర్ చమురు క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకున్నందుకు హెచ్పిసిఎల్ ఆ కంపెనీపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ చర్యలు చేపట్టింది. ఈ 444కోట్లకు తోడు 2009 నుండి ఏడాదికి 9శాతం వడ్డీ కూడా కంపెనీకి లభిస్తుందని సురాన తెలిపారు. | 1entertainment
|
RUPEES
బోనస్ ఇష్యూలతో ముందుకు వస్తున్న కార్పొరేట్లు
ముంబయి, మే 21: ఇన్వెస్టర్లకు వివిధ కంపెనీల షేర్ల పై బోనస్లు వెల్లువలా వస్తున్నాయి. ప్రస్తుత అంచ నాలప్రకారం 24 కంపెనీలకుపైగా బోనస్ ఇష్యూ జారీచేసినట్లు అంచనా. ఈ కేలండర్ సంవత్సరం లో ఇప్పటివరకూ ఇదే గరిష్టసంఖ్య. ఈ24 కంపెనీ ల్లో 12 కంపెనీలు గడచిన నెలరోజులుగా బోనస్ ఇష్యూ జారీచేసాయి. అంతకుముందు సంవత్సరం లో 15 కంపెనీలు బోనస్ ఇష్యూ జారీచేసాయి. ఇప్పటివరకూ 2017 కేలండర్ సంవత్సరంలో 27 కంపెనీలు ఐసిఐసిఐబ్యాంకు, పెట్రోనెట్ ఎల్ఎన్జి, గోద్రెజ్ కన్సూమర్, బయోకాన్, విప్రో కంపెనీలు బోనష్ ఇష్యూలుప్రకటించాయి.
మేనెలలోనే ఆరు కంపెనీలు తమ వాటాదారులకు ఈరూటులో వాటా ల కేటాయింపులుచేశాయి. ముంజాల్ ఆటో ఇండ స్ట్రీస్ కూడా ఈనెల 22వ తేదీ సమావేశం అయి నిర్ణయిస్తుంది. శిల్పి కేబుల్ టెక్నాలజీస్ తఈనెల 28 వతేదీ బోర్డు సమావేశమై బోనస్పై చర్చిలు జరుపుతుంది. ప్రముఖ సంస్థలపరంగా ఐసిఐసిఐ బోర్డు ఆమోదించింది. ప్రతి పదిషేర్ల కు ఒకషేరు అందిస్తుంది చగోద్రెజ్, పెట్రోనెట్ ఎల్ఎన్జి సంస్థలు కూడా నిష్పత్తిలో వాటా లను అందిస్తున్నాయి. ఇకైటిరంగం ఫార్మాకంపెనీ లు విప్రో ఏప్రిల్లోనేప్రకటించింది. బయోకాన్ సంస్థ వాటాలను విభజిం చింది. నగదు లభ్యతను మరింతగా పెంచుకునేందు కుగాను బోనస్ షేర్లు కేటాయింపులు జరుపుతు న్నారు.
వాటాదారులకు కేటాయింపులతోపాటు ఈ జారీ తర్వాత స్టాక్ ధరలు కూడా బోనస్ నిష్పత్తికి అనుగుణంగా సర్దుబాటు అవుతాయి. మొత్తం కంపెనీ మార్కెట్ విలువలు మాత్రం అదేస్తాయిలో ఉంటాయి. బోనస్ జారీలో అంతరార్ధం ఏమిటంటే స్టాక్ ధరలు తగ్గించేందుకేనని తెలుస్తోంది. అయితే కంపెనీ ఆర్థికవనరులకు ఏమాత్రం దెబ్బతగుల కుండా జాగ్రత్తలు తీసుకుంటాయి, బోనస్ జారీ వల్ల కంపెనీ తీరు ఏమాత్రం మారిపోదని స్టాక్ ధర లు తగ్గుతాయని అన్నారు. ఐటిరంగ స్టాక్స్పరంగా బోనస్ బైబ్యాక్ ఈరెండింటిలో ఏదైనా అవలంభిం చే అవకాశం ఉంది.
ఇన్వెస్టర్ల సామర్ధ్యాన్ని కూడా ఈ బోనస్షేర్ల జారీ నిర్ణయిస్తుంది. అలాగే ఎక్ఛేం జిల ట్రేడింగ్ పరిమాణం కూడా పెంచుతుందని అంచనా. బోనస్ఇష్యూద్వారా వాటాదారులకు షేర్ల కేటాయింపుతో కంపెనీలు డివిడెండ్ అందించడం వంటి పద్ధతులకు స్వస్తిచెపుతాయి.
వీటివల్ల తక్కు వ స్థాయిలో డివిడెండ్ పంపిణీ పన్నును అందించే అవకాశం ఉంటుంది. బోనస్షేర్ల జారీలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందని తేలింది. బోనస్ ఇష్యూ అంటేనే ప్రస్తుత వాటాదారు లకు అదనపు వాటాలు కల్పించడమేనని ఇన్వెస్టర్లు దీనివల్ల పన్ను ప్రోత్సాహకంకూడా పొందగలుగుతారని నిపుణుల అంచనా. ఎక్కువ డివిడెండ్ కేటాయించడం వల్ల ప్రభు త్వానికి డిడిటి కూడా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ఐడిబిఐ కేపిటల్ రీసెర్చి హెడ్ ఎకెప్రభాకర్ వెల్లడించారు.
కేంద్ర బడ్జెట్ 2016-17లోప్రభుత్వం పదిశాతం డివిడెండ్ చెల్లింపులపై పన్ను ప్రకటించింది. పదిలక్షలు దాటిన వారికి ఈపన్ను వర్తిస్తుంది. హిందూ అవిభక్త కుటుంబం లేదా భాగస్వామ్య సంస్థ లు ఏవైనా సరే ప్రైవేటు ట్రస్టులకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించిం ది. 2011లో 48 సంస్థలు బోనస్షేర్లు జారీచేస్తే 2012లో 55సంస్థలు, 2013లో 59సంస్థలు, 2014లో 490, 2015లో 59, 20167లో 69 సంస్థలు బోనస్షేర్లు జారచేసాయి. 2017లో ఇప్పటి వరకూ 27 కంపెనీలు బోనస్షేర్లజారీని చేపట్టాయి. | 1entertainment
|
Visit Site
Recommended byColombia
‘క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన క్రిస్‌గేల్, యువరాజ్ సింగ్‌లు ప్రాథమిక ధరకే పంజాబ్‌కి సొంతమవడం గొప్ప విషయం. ఇది బేరమాడితే వచ్చే ధర. ఒకవేళ వేలంలో వీరి కోసం ఫ్రాంఛైజీల మధ్య పోటీ ఏర్పడి ఉంటే..? భారీ ధరకే అమ్ముడుపోయేవారు. ఎందుకంటే.. ఈ ఇద్దరూ గొప్ప మ్యాచ్ విన్నర్లు. ఈ ఏడాది టోర్నీలో ఈ ఇద్దరూ చెరో రెండు లేదా మూడు మ్యాచ్‌లు గెలిపిస్తే చాలు.. పంజాబ్ ఫ్రాంఛైజీ పెట్టుబడి వెనక్కి వచ్చేసినట్లే..!’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన యువరాజ్ సింగ్ పేలవ ఫామ్‌తో నిరాశపరచగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన క్రిస్‌గేల్ రెండు మ్యాచ్‌లు మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది లేదు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Recommended byColombia
గత ఎపిసోడ్లో జరిగిన కథ..
మనోరమ ద్వారా విషయం తెలుసుకున్న సమీర్.. చిన్నీ కోసం జైల్కి పరుగుతీశాడు. అయితే అక్కడ చిన్నీ సమీర్కి నిజం చెప్పదు. ‘నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావో? ఎవరు నిన్ను బెదిరిస్తున్నారో.. అంతా తెలుసుకుంటా.. బైయిల్ ఏర్పాట్లు చేస్తాను’ అని చెప్పి వెళ్లిపోతాడు. అయితే సమీర్ని బైయిల్ ఏర్పాట్లు చేయకుండా ఉండేందుకు రక్తం కావాలి అని చెప్పి ఫోన్ చేసి సమీర్ని హాస్పెటల్కి పిలుస్తుంది మనోరమ.
705 ఎపిసోడ్లో హైలైట్స్..
ఉపలక్షిత జైల్కి వచ్చి చిన్నీని కలుసుకుంటుంది. ఆమెకు జరిగిందంతా చెబుతుంది చిన్నీ. అయితే ఉపలక్షిత.. ‘ఇది చిన్న కేసు కాదు.. జీవితం నాశనం చేసుకోకు. నాకు తెలిసి.. లక్ష్మీ ఆంటీ కూడా ఈ పని చేసి ఉండరు.. ఏదో జరిగింది.. మొదట నువ్వు నీ మీద కేసు వేసుకోవడం సరికాదు’ అంటూ చాలా చెబుతుంది. కానీ చిన్నీ బాగా ఏడుస్తూ.. ‘నా తల్లి లేకపోతే నాకు జీవితమే లేదు. నాకోసం ఎన్నో త్యాగాలు చేసిన నా తల్లి కోసం నేను ఈ మాత్రం చేయలేనా? మా అమ్మ జైలు పాలు అయితే నేను తట్టుకోలేను’ అంటుంది.
Read Also: మీరు ‘కోయిలమ్మ’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్లు ఒక్క క్లిక్తో!
అమర్ ఆలోచనలో ఉంటాడు.చిన్నీ దగ్గర వాగ్మూలం తీసుకోవడానికి పోలీసులు చిన్నీ సంతకం చేయాలని చెబుతారు. దాంతో ఒకసారి అమర్తో మాట్లాడాలని ఫోన్ చేసి ఇవ్వమంటుంది. అయితే అమర్ చిన్నీతో మాట్లాడటానికి ఇష్టపడడు. చిన్నీ బాధపడుతూ సైన్ చేసి ఇచ్చేస్తుంది. ఇంతలో మనోరమా కావాలనే అమర్ దగ్గరకు వచ్చి.. ‘మన సమీర్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు.. మీ నాన్నకు ఈ పరిస్థితి కలిపించిన ఆ చిన్నీకి సాయం చేయడానికి వెళ్లాడు.. ఇంకా రాలేదు’ అంటూ ఎక్కిస్తుంది. ఇంతలో సమీర్ వచ్చి.. ‘రక్తం కావాలన్నారుగా అత్తయ్యా? ఇచ్చేసి వస్తాను’ అంటాడు.
ఇంతలో లాయర్ నుంచి సమీర్కి కాల్ వస్తుంది. ‘సారీ లాయర్ గారూ ఇందాక చూసుకోలేదు. మా వదిన చిన్నీకి బైయిల్ వచ్చేలా చేయండి’ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అమర్ ఆవేశంగా వెళ్లి లాగిపెట్టి సమీర్ని కొడతాడు. ఫోన్ కింద పడిపోతుంది. సమీర్ షాక్లో ఉంటాడు.‘ఏం చేస్తున్నావ్ రా? మన డాడీ ఈ పరిస్థితికి కారణం అయిన మనిషికి నువ్వు సాయం చేస్తున్నావా? నువ్వు డాడీకి రక్తం ఇవ్వడానికి వీళ్లేదు’ అంటూ గొడవ పడతాడు. అంతే కాకుండా.. ‘నువ్వు డాడీకి రక్తం ఇవ్వాలనుకుంటే చిన్నీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సాయం చేయనని డాడీ మీద ఒట్టు పెట్టు’ అంటూ మాట తీసుకుంటాడు. దాంతో సమీర్ చాలా బాధపడతాడు.
తండ్రి రమేష్ చంద్రకు రక్తం ఇచ్చి వచ్చిన తర్వాత అమర్ దగ్గరకు వెళ్లి, పక్కనే కూర్చుని.. ‘అన్నయ్యా.. వదిన తప్పు చేసి ఉండదు అన్నయ్యా ఒక్కసారి వదినని కలువు.. మన పరువు పోతుంది. డాడీ మామూలు అయ్యే సరికి ఇంటి కోడలే అతడిని చంపాలనుకుందనే విషయం ప్రపంచానికి తెలిస్తే.. డాడీ పరువు పోతుంది.. వెళ్లు అన్నయ్యా..’ అంటూ బతిమాలాడి అమర్ని పంపిస్తాడు. డాక్టర్స్ రమేష్ చంద్రను పరీక్షించి ‘కోలుకునే అవకాశం ఉంది’ అని చెప్పడంతో.. మనోరమా రమేష్ చంద్రను ఎలాగైనా చంపెయ్యాలని నిర్ణయించుకుంటుంది. అందుకే సమీర్ని ఏదైనా తినిరారా అంటూ బయటికి పంపిస్తుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కోయిలమ్మ కొనసాగుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Feb 05,2016
ఆటో ఎక్స్పో అదరహో..
న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న 'ఆటో ఎక్స్పో-2016' రెండో రోజూ అనేక కొత్త మోడళ్ల ఆవిష్కరణకు వేదికగా నిలిచింది. గురువారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, అనంత గీతేలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకి, స్కానియా, జేబీఎం, ఫియెట్, రెనో , నిస్సాన్, ఫోక్స్వ్యాగన్ తదితర ఆటోమొబైల్ కంపెనీలు తమ నూతన వాహన శ్రేణులతో చూపరులను కట్టిపడేశాయి. కేంద్రం ఆటో పరిశ్రమకు అండగా ఉంటుందని ఈ సందర్బంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే హామీ ఇచ్చారు. ఇదే సమయంలో పర్యావరణానికి అధికంగా హాని కలిగించని విద్యుత్తు, హైబ్రిడ్ వాహనాల తయారీపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. జలరవాణాకు అనువైన వాహనాల తయారీకి భారత ఆటోమొబైల్ పరిశ్రమ కషి చేయాలని కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరి సూచించారు. కొత్త సాంకేతికతపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు రెండో రోజూ పలు నూతన మోడళ్లను ఆవిష్కరించాయి. నేడు భారతీయ ఆటో దిగ్గజం మహీంద్రా కార్ల విభాగంలో మూడు కొత్త వాహనాల్ని ఆటో ఎక్స్పోకు పరిచయం చేసింది. వీటిలో ఈ2వో, ఎక్స్యూవీ ది ఏరో, శాంగ్యంగ్కు చెందిన టివోలి వాహనాన్ని ఆవిష్కరించారు. వాణిజ్య వాహనాల విభాగంలో 'ది బ్లేజ్' పేరుతో కొత్త ట్రక్కును ఆవిష్కరించింది. ఫియట్ కొత్తగా మూడు మోడళ్లను ఆవిష్కరించింది. వీటిల్లో పుంటో ప్యూర్, ది ఫియట్ లైన్, అర్బన్ క్రాస్ వంటి మోడళ్లుఉన్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఆ పని చేయడం అంత సులువేం కాదంటున్న సన్నీ (వీడియో)
Highlights
చేయడం చాలా కష్టం.
దక్షిణాదిలోను సన్నీ హవా కొనసాగుతుంది. రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్రంలో ఐటెం సాంగ్తో మెప్పించిన సన్నీ వీరమహాదేవి అనే చారిత్రాత్మక చిత్రం చేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో ఇది రూపొందుతుంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం సన్నీ గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి పలు విద్యలు నేర్చుకుంది. రీసెంట్గా ఈ అమ్మడు తన సోషల్ మీడియా పేజ్లో కసరత్తుకి సంబంధించిన వీడియో పోస్ట్ చేసి దానికి కామెంట్ పెట్టింది. ఈ వర్కవుట్ చేయడం చాలా కష్టం. నా కాళ్లకి ఉన్న బ్యాండ్ అంత ఈజీగా చేయనవివ్వదు అని ట్వీట్ చేసింది. ఈ వీడియో వైరల్గా మారింది. | 0business
|
యుజువేంద్ర, రసూల్లకు ఇదొక అవకాశం: కోహ్లీ
న్యూఢిల్లీ:యుజువేంద్ర చాహల్,పర్వేజ్ రసూల్లు అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు ఇంగ్లండ్తో జరిగే మూడు టి20 సిరీస్ ఒక అద్భుతమై అవకాశామని టీమిండియా కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.మూడు టి20ల సిరీస్లో భాగంగా కోహ్లీ మీడియాతో మాట్లా డాడు.కాన్పూర్ వేదికగా గురువారం ఇంగ్లండ్తో మొట్టమొదటి టి20 సిరీస్ ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ టి20 జట్టులో పెద్దగా మార్పులు ఉండవని పేర్కొన్నాడు.ముఖ్యంగా అశ్విన్ స్థానంలో చోటు దక్కించుకున్న రసూల్కు ఇదొక చక్కటి అవకాశమని వివరించాడు.దేశీయ టి20 మ్యాచ్లతో పాటు ఐపిఎల్లో సత్తా చాటుతున్న యుజువేంద్ర చాహల్,రసూల్లు ఈ సిరీస్లో మంచి ప్రదర్శన కనబరుస్తారని పేర్కొన్నాడు.ఇక పర్వేజ్ రసూల్ విషయానికి వస్తే ఐపిఎల్లో తన కెప్టెన్సీలో ఆడాడని,ఈ ఇద్దరికీ ఈ సిరీస్ మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు. టి20 సిరీస్లో సత్తా చాటుతారు: దేశీయ టోర్నీలలో సత్తా చాటిన విధంగానే ఈ టి20 సిరీస్లో వీరిద్దరు బౌలింగ్లో తప్పక దూసుకుపోతారని,ఈ ఏడాది మార్చిలో జరిగిన వరల్డ్ టి20 తరువాత ఒకే మ్యాచ్ కూడా ఆడని రైనా ఈ సిరీస్లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.రైనాకు ఇంకా అద్భుతమైన అవకాశాలున్నాయని చెప్పిన కోహ్లీ జట్టులో నిలకడ లేనప్పుడే సమస్యలు వస్తాయని అవసరమైతే తాను ఓపెనర్గా వస్తానన్నాడు. బ్యాటింగ్ లైనప్లో టీమిండియాకు ఎన్నో ప్రత్యామ్నాయాలున్నాయని,తాను ఇప్పటికి రెండు సార్లు మాత్రమే ఓపెనింగ్ చేశానని కోహ్లీ వెల్లడించాడు.ఐపిఎల్లో పూర్తిగా ఓపెనింగ్ చేసిన అనుభవం తనకుందన్నాడు.టీమిండియా టెస్టులు, వన్డేల్లో మంచి ఫలితాలను సాధిస్తుందని, టి20ల్లోనూ ఆడే ఆటతీరును కనబరుస్తామని కోహ్లీ పేర్కొన్నాడు. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘జబర్దస్త్’ సెల్ఫీ వీడియో: రోజా విత్ లక్ష్మీస్
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే.. సినీ నటి రోజా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా అయ్యారు. వైసీపీ ఫైర్ బ్రాండ్గా పేరొందిన రోజా తన పార్టీ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను ఫేస్ బుక్ ద్వారా ఫ్యాన్స్తో పంచుకుంటూ ...
TNN | Updated:
Dec 7, 2017, 06:09PM IST
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే.. సినీ నటి రోజా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా అయ్యారు. వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా తన పార్టీ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను ఫేస్ బుక్ ద్వారా ఫ్యాన్స్‌‌తో పంచుకుంటూ ఇప్పటికే రెండు మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించారు. ఇకపోతే ఇటీవల తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసిన వీడియో అటు సినీ సర్కిల్‌లో పాటు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అవకతవకలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బస్ యాత్ర చేపట్టిన వైసీపీ నేతల హంగామాను ఫేస్ బుక్‌లో షేర్ చేశారు రోజా. వీటిలో ఎమ్మెల్యే రోజా.. లక్ష్మీ పార్వతితో దిగిన సెల్ఫీ వీడియో వైసీపీ శ్రేణులకు తెగ నచ్చేస్తుంది. పార్టీని డిఫెండ్ చేయడంతో ఎప్పుడూ ముందుండే ఫైర్ బ్రాండ్‌లు ఇద్దరూ ఒకేచోట చేరిన సెల్ఫీ వీడియోపై తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు రోజా అండ్ లక్ష్మీస్ సెల్ఫీపై పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంటే మరికొంత మంది సెటైర్లు విసురుతున్నారు. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బన్నీ, మహేష్ అయితే ఏంటి.? తగ్గేది లేదంటున్న నందమూరి హీరో
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా `ఎంత మంచివాడవురా`. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.
Samayam Telugu | Updated:
Nov 8, 2019, 02:08PM IST
ఎంత మంచివాడవురా!
ప్రతీ ఏడాది లాగే 2020లో సంక్రాంతి సీజన్ టాలీవుడ్కు రసవత్తరంగా మారనుంది. ఇద్దరు టాప్ స్టార్లు అల్లు అర్జున్, మహేష్ బాబులు ఈ సీజన్లో తలపడుతున్నారు. అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఈ ఇద్దరు స్టార్లు జనవరి 12న ఒకే రోజు బరిలో దిగుతున్నారు. అయితే ఓ బిగ్ ఫైట్ను తప్పించేందుకు ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు.
Visit Site
Recommended byColombia
మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురములో సినిమాలో ఒకే రోజు రిలీజ్ అయితే థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్ కలెక్షన్ల మీద కూడా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు ఈ సీజన్లో మరో సినిమా రిలీజ్ చేస్తే నామ మాత్రంగా కూడా థియేటర్లు దొరకటం కష్టమే.
Also Read: ప్రభాస్ కొత్త సినిమా కథ.. పాత చింతకాయ పచ్చడే..!
అయితే ఇంత టఫ్ సిచ్యువేషన్లోనూ వెనక్కి తగ్గేది లేదంటున్నాడు నందమూరి అందగాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిచిన చిత్రయూనిట్ టీజర్ను కూడా రిలీజ్ చేశారు.
Also Read: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు
ప్రస్తుతానికి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ అయితే ఉంది. సరైన సమయంలో రిలీజ్ అయితే సినిమాకు మంచి టాక్రావటం కాయం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి సీజన్ మిస్ కావద్దని భావిస్తున్నారు యూనిట్. బన్నీ, మహేష్ లాంటి టాప్ స్టార్స్ బరిలో ఉన్నా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జనవరి 15న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
See Photo Story: హన్సిక..జస్ట్ ఎక్సోప్లోరింగ్ ద టర్కీ టూర్
ఆదిత్య మ్యూజిక్ బ్యానర్పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్కు జోడిగా మెహరీన్ నటిస్తోంది. గోపి సుందర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు రాజ్ తోట సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
Also Read: యాంకర్ ప్రదీప్కు ఏమయ్యాడు..? ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు నిజమేనా?
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
internet vaartha 135 Views
ముంబై : రిజర్వుబ్యాంకు గవర్నర్లకు మూడేళ్ల పదవీకాలం సరిపోదని ఐదేళ్లకాలానికి పొడిగిం చాల్సి ఉంటుదని ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మరో తొమ్మిది వారాల్లో పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో రాజన్చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఆర్థికశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు రాజన్ మొత్తం ఆర్థికవ్యవస్థ ప్రస్తుత తీరుతెన్నులు వివరిం చారు. అలాగే వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెరుగుతున్న నిరర్ధక ఆస్తులవివరాలు వాటిని ఎదుర్కొనే వ్యూహం వంటి వాటిని వివరించారు. ఇక రిజర్వుబ్యాంకు గవర్నర్ పదవీకాలం మూడేళ్లు అనేది స్వల్ప మని ఐదేళ్లకు ఉండాలని వెల్లడించారు. స్థాయీ సంఘం సభ్యులు గవర్నర్ పదవీ కాలం ఎంతవరకూ ఉండాలన్న ప్రశ్నలకు రాజన్ సమాధానమిస్తూ ఐదేళ్లు ఉండాలని సూచించారు. అమెరికా ఫెడ్రిజర్వు పదవీ కాలాన్ని ఈ సందర్భంగా రాజన్ ఉటంకించారు. ఫెడ్రిజర్వులో బోరునీ ర్మన్, వైస్ చైర్మన్ల పదవీకాల నాలుగేళ్లు ఉంటుందని, వివిధ నియమాకాల్లో ఉన్న పముఖులు తమ పదవీ కాలం పూర్తయ్యేంత వరకూ కొనసాగుతారని పేర్కొన్నారు. సెప్టెంబరు 4వ తేదీతో ముగుస్తున్న పదవీకాలం తర్వా త రెండోసారి కొనసాగేందుకు రాజన్ సుముఖత వ్యక్తం చేయలేదు. మూడు గంటలపాటు జరిగిన ఈ స్థాయీ సంఘం సమావేశాన్ని కాంగ్రెస్ ఎంపి వీరప్పమొయిలీ అధ్యక్షతన జరిగింది. ఆర్థిక వ్యవస్థ సంస్కరణలు, ఆర్బిఐ పునర్వ్యవస్థీకరణ, బ్యాంకింగ్ వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లు వంటివి చర్చకు వచ్చాయి. రానిబాకీల సమస్యలు ఎదుర్కొనేందుకు రిజర్వుబ్యాంకు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యాచరణను కూడా రాజన్ ఈ సందర్భంగా వివరించారు. బ్యాంకుల్లో స్థూల నిరర్ధక ఆస్తులు మొత్తం 9.3శాతానికి చేరుతుంది. 2016 మార్చినాటికి 7.6శాతంగా ఉన్నట్లు వివ రించారు. బ్యాంకుల రుణపరపతి సామర్ధ్యంపై కూడా రాజన్ కమిటీకి వివరించారు. రుణపరపతిలో ప్రైవేటు బ్యాంకర్లు ముందంజలో ఉన్నారని, ప్రభుత్వ రంగ బ్యాంకులు వెనుకబడి ఉన్నట్లు తెలిపారు. | 1entertainment
|
లొంగదీసుకున్నాడు.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన రోజా!
Highlights
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల భద్రత కోసం 'మా' అసోసియేషన్ ప్రత్యేకంగా ఓ కమిటీను కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తామని మహిళలను లొంగదీసుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా జూనియర్ ఆర్టిస్ట్ రోజా తనను ఒక వ్యక్తి మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అసలు విషయంలోకి వస్తే.. నటిగా సినిమాలు చేయాలనుకున్న రోజాను జూనియర్ ఆర్టిస్ట్ శ్రీశాంత్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.
సినిమాలో అవకాశాలు ఇప్పిస్తాననే నెపంతో ఆమెను లొంగదీసుకున్నాడు. తను మోసపోయానని తెలుసుకున్న ఈ యువతీ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. కొందరు మహిళా జూనియర్ ఆర్టిస్టులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన రోజా అక్కడే శ్రీశాంత్ రెడ్డిపై చెప్పులతో దాడి చేసింది. అతడిని శిక్షించాలని మహిళా ఆర్టిస్టులంతా ఆందోలనకు దిగారు.
Last Updated 10, May 2018, 6:22 PM IST | 0business
|
Visit Site
Recommended byColombia
శివమ్ దూబే, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, కార్లోస్ బ్రాత్వైట్ రూ.5 కోట్ల చొప్పున ధర పలికారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సాహాను తిరిగి సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో కూడా ఆరెంజ్ ఆర్మీలో చేరనున్నాడు. యువరాజ్ సింగ్ను ముంబై ఇండియన్స్ ప్రాథమిక ధరైన రూ.1 కోటికే దక్కించుకుంది. గప్టిల్ను సన్రైజర్స్ కొనుగోలు చేసింది. ఆంధ్రా క్రికెటర్ బండారు అయ్యప్పను రూ.20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
లైవ్ అప్డేట్స్..
* ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారీని దక్కించుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు బిడ్ వేసింది. ముంబైతో పోటీ పడిన ఢిల్లీ అతణ్ని రూ.2 కోట్లకు దక్కించుకుంది.
* షిమ్రాన్ హెట్మెయర్ను రూ. 4 .20 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు.
* ఆల్రౌండర్, విండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్వైట్ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్. గత ఏడాది బ్రాత్వైట్ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన సన్రైజర్స్.
* గురు కీరత్ సింగ్ను కొనుగోలు చేసిన ఆర్సీబీ.
* ప్రాథమిక ధరను తగ్గించుకున్నా.. యువరాజ్ సింగ్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు.
* హెన్రిక్యూస్ను రూ.1 కోటికి దక్కించుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
* అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ, పంజాబ్ పోటాపోటీ. రూ.5 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.
* జానీ బెయిర్స్టోను రూ.2.2 కోట్లకు కొనుగోలు చేసిన సన్రైజర్స్.
* వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరాన్ను రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
* వృద్ధిమాన్ సాహా కోసం బిడ్ వేసిన సన్రైజర్స్ హైదరాబాద్. రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసిన హైదరాబాద్.
* గత సీజన్లో రూ.11.5 కోట్లు పలికిన జయదేవ్ ఉనద్కత్. ఈ ఏడాది రూ.1.5 కోట్ల ప్రాథమిక ధరతో వేలానికి. రూ.8.4 కోట్లకు తిరిగి దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్.
* ఇషాంత్ శర్మను రూ.1.10 కోట్లకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.
* లంక పేసర్ లసిత్ మలింగను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.
* భారత పేసర్ మహ్మద్ షమీని రూ.4.80 కోట్లకు సొంతం చేసుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
* వరుణ్ ఆరోన్ను రూ.2.40 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్.
* మోహిత్ శర్మను రూ.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్.
* దేవ్దత్ పడిక్కల్ను రూ.20 లక్షలకు సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
* అన్మోల్ప్రీత్ సింగ్ను రూ.80 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.
* సర్ఫరాజ్ ఖాన్ను రూ.25 లక్షలకు సొంతం చేసుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
* శివమ్ దూబేను కోసం పోటీపడిన ఫ్రాంచైజీలు. రూ.20 లక్షల ప్రాథమిక ధరతో వేలానికి వచ్చి.. రూ.5 కోట్లకు అమ్ముడుపోయిన దూబే. యువ ఆల్రౌండర్ను దక్కించుకున్న బెంగళూరు.
* రూ.20 లక్షల ప్రాథమిక ధరతో వేలానికి వచ్చి.. రూ.8.40 కోట్లకు అమ్ముడుపోయిన వరుణ్ చక్రవర్తి. తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ దక్కించుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ . తమిళనాడు ప్రీమియర్ లీగ్లో మధురై పాంథర్స్ తరఫున అద్భుత ఆటతీరు కనబర్చిన వరుణ్. విజయ్ హజారే ట్రోఫీలో 9 మ్యాచ్ల్లో 22 వికెట్లు తీసిన వరుణ్.. వైవిధ్యంగా బంతుల్ని విసరగలడు.
* అంకుశ్ బెయిన్స్ను రూ.20 లక్షలకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.
* నాథూ సింగ్ను రూ.20 లక్షలకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.
* ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజాను కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు.
* దక్షిణాఫ్రికా టీ20 బ్యాట్స్మెన్ కాలిన్ ఇన్గ్రామ్ కోసం ఫ్రాంచైజీల పోటాపోటీ. రూ.6.40 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్. చివర వరకూ పోటీ పడ్డ సన్రైజర్స్.
* హషీమ్ ఆమ్లా, ఏంజెలో మాథ్యూస్, షాన్ మార్ష్ పట్ల ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు.
* ఇంగ్లాండ్ యువ క్రికెటర్ సామ్ కర్రాన్ కోసం ఫ్రాంచైజీల పోటాపోటీ. రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఈ సీజన్లో ఇప్పటి వరకూ అత్యధిక ధర పలికిన ఓవర్సీస్ ఆటగాడు ఇతడే. భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో మెరిసిన కర్రాన్.
* హెన్రిక్ క్లాసెన్ను రూ.50 లక్షలకు దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
* బరీందర్ శ్రాన్ను రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.
* ల్యాకీ ఫెర్గ్యుసన్ను రూ.1.6 కోట్లకు కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్.
* షెర్ఫేన్ రూథర్ఫర్డ్ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.
* అన్రిక్ నోర్జేను రూ.20 లక్షలకు దక్కించుకున్న కోల్కతా నైట్ రైడర్స్.
* ఒషానే థామస్ను రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్.
* హర్డస్ విల్జోయెన్ను రూ.75 లక్షలకు దక్కించుకున్న పంజాబ్.
* హిమ్మత్ సింగ్ను రూ.65 లక్షలకు కొనుగోలు చేసిన బెంగళూరు.
* నిఖిల్ నాయక్ను రూ.20 లక్షలకు సొంతం చేసుకున్న కోల్కతా.
* అర్షదీప్ సింగ్ను రూ.20 లక్షలకు దక్కించుకున్న పంజాబ్.
* హార్రీ గుర్నేను రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్.
* పంకజ్ జైస్వాల్ను రూ.20 లక్షలకు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్.
* మిలింద్ కుమార్ను రూ.20 లక్షలకు దక్కించుకున్న బెంగళూరు.
* దర్శన్ నాల్కండేను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్
* శశాంక్ సింగ్ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్.
* వికెట్ కీపర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కోసం ఫ్రాంచైజీల పోటాపోటీ. రూ.20 లక్షల ప్రారంభ ధరతో వేలంలోకి.. రూ.4.8 కోట్లకుకొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ యాజమాన్యం. పంజాబ్ అండర్-23 అంతర్ జిల్లా పోటీల్లో 298 పరుగులు చేసిన సింగ్.
* రిసిక్ దార్ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై.
* పృథ్వీ రాజ్ యర్రాను రూ.20 లక్షలకు దక్కించుకున్న కోల్కతా నైట్ రైడర్స్.
* లియామ్ లివింగ్స్టోన్ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్.
* కీమో పాల్ను రూ.50 లక్షలు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.
* ప్రయాస్ రాయ్ బర్మన్ను రూ. 1.50 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు.
* అగ్నివేశ్ అయాచీని రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్న కింగ్స్ ఎలెవన్
* హర్ప్రీత్ బ్రార్ను రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్న కింగ్స్ ఎలెవన్
* మార్టిన్ గప్టిల్ను రూ.1 కోటికి దక్కించుకున్న సన్రైజర్స్.
* యువరాజ్ సింగ్ను రూ.1 కోటికి సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్
* అక్షదీప్ నాథ్ను రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసిన బెంగళూరు.
* జలజ్ సక్సేనాను రూ.20 లక్షలకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
* మురుగన్ అశ్విన్ను రూ.20 లక్షలకు దక్కించుకున్న పంజాబ్
* రుతురాజ్ గైక్వాడ్ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై
* శుభ్మన్ రంజానేను రూ.20 లక్షలకు సొంతం చేసుకున్న రాజస్థాన్
* జోయ్ డెన్లీని రూ.1 కోటికి లక్షలకు దక్కించుకున్న కోల్కతా
* ఆంధ్రా క్రికెటర్ బండారు అయ్యప్పను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
* శ్రీకాంత్ ముదేను రూ.20 లక్షల ప్రాథమిక ధరకే సొంతం చేసుకున్న కోల్కతా
* మనన్ వోహ్రాను రూ.20 లక్షల ప్రాథమిక ధరకే కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
* ఆస్టన్ టర్నర్ను రూ.50 లక్షలకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
* రియాన్ పరాగ్ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్.
అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు..
⇢ జయదేవ్ ఉనద్కత్ - రూ.8.40 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
⇢ వరుణ్ చక్రవర్తి - రూ.8.40 కోట్లు (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
⇢ సామ్ కర్రాన్ - రూ.7.2 కోట్లు (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
⇢ కాలిన్ ఇన్గ్రామ్ - రూ.6.4 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
⇢ శివమ్ దూబే - రూ.5 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
⇢ మోహిత్ శర్మ - రూ.5 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
⇢ అక్షర్ పటేల్ - రూ.5 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
⇢ కార్లోస్ బ్రాత్వైట్ - రూ.5 కోట్లు (కోల్కతా నైట్ రైడర్స్)
⇢ ప్రభ్సిమ్రాన్ సింగ్ - రూ.4.8 కోట్లు (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
⇢ మహ్మద్ షమీ - రూ.4.8 కోట్లు (కింగ్స్ ఎలెవన్)
⇢ నికోలస్ పూరాన్ - రూ.4.2 కోట్లు ( కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
⇢ షిమ్రోన్ హెట్మేయర్ - రూ. 4.2 కోట్లు (బెంగళూరు)
⇢ వరుణ్ ఆరోన్ - రూ.2.4 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
⇢ లసిత్ మలింగ - రూ.2 కోట్లు (ముంబై ఇండియన్స్)
⇢ హనుమ విహారీ - రూ.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
అత్యధిక బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు ఉండగా.. ఈ కేటగరిలో 10 మంది ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. అత్యధిక ధర ఉన్న ఈ కేటగిరీలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. రూ.1.5 కోట్ల బేస్ ప్రైజ్ కేటగిరీలో 10 మంది ఆటగాళ్లు ఉండగా.. భారత్ నుంచి జయదేవ్ ఉనద్కత్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నాడు. కోటి రూపాయల కేటగిరీలో 19 మంది ఆటగాళ్లు ఉండగా.. యువీ సహా నలుగురు భారత ఆటగాళ్లు ఈ కేటగిరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈసారి ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ ఐదుగురు ఆటగాళ్లను దక్కించుకునే వీలుంది. గత సీజన్లో ఆడిన 17 మంది ఆటగాళ్లను సన్రైజర్స్ రిటైన్ చేసుకుంది. శిఖర్ ధావన్ బదులుగా ముగ్గురు ఆటగాళ్లను దక్కించుకుంది. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్.. వేలంలో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయగలదు. ఈ ఫ్రాంచైజీ గరిష్టంగా రూ.9.70 కోట్లు ఖర్చు చేయొచ్చు.
డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు జట్టు మొత్తాన్ని తనతోనే అట్టిపెట్టుకుంది. ఈసారి వేలంలో చెన్నై జట్టు ఇద్దరు భారత ఆటగాళ్లను కొనుగోలు చేయగలదు. ఆ ఫ్రాంచైజీ దగ్గర బిడ్డింగ్ కోసం రూ.8.4 కోట్లు ఉన్నాయి.
ఐపీఎల్ ఆరంభం నుంచి వేలం ప్రక్రియను నిర్వహించిన రీచర్డ్ మ్యాడ్లీ సేవలను ఈ ఏడాది బీసీసీఐ వద్దనుకుంది. అతడి స్థానంలో హుగ్ ఎడ్మేడ్స్ 2019 ఐపీఎల్ వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నారు. హేగ్కి వేలం నిర్వహణలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1984 నుంచి ఆయన వేలం ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి సేవలు అందించిన తనను సింగిల్ లైన్ మెయిల్ ద్వారా తొలగించడం పట్ల రీచర్డ్ మ్యాడ్లీ నొచ్చుకున్నాడు. బీసీసీఐ తనకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదని వాపోయాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్
యుఎఇ 176/4 (20 ఓవర్లు)
అప్ఘానిస్థాన్ 160 ఆలౌట్ (19.5 ఓవర్లు)
ఫతుల్లా : ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్ తొలి టి20 మ్యాచ్లో అప్ఘనిస్తాన్పై యుఎఇ విజయం సాధించింది.కాగా ఆల్రౌండర్ షోతో యుఎఒ అప్ఘాన్పై 16 పరుగులు తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది.కాగా టాస్ గెలిచిన యుఎఇ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు నమోదు చేసింది.యుఎఇ ఓపెనర్లు రోహన్ ముస్తాఫా 77 పరుగులు,మహ్మద్ కలీమ్ 22 పరుగులు చేసి తొలి వికెట్కు 83 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు.అనంతరం షమాన్ అన్వర్ 11 పరుగులు,జావేద్ 4 పరుగులతో నిరాశ పరిచినా,ఉస్మాన్ ముస్తాక్ 23 పరుగులతో నాటౌట్గా నిలువగా షహజాద్ 25 పరుగులతో నాటౌట్గా కొనసాగారు.తరువాత 177 పరుగలు టార్గెట్తో బరిలోకి దిగిన అప్ఘాన్ 19.5 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది.అప్ఘాన్ ఆటగాళ్లలో కరీమ్ సిద్ధిఖ్ 72 హాఫ్ సెంచరీ మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.యుఎఒ బౌలర్లలో రోహన్ ముస్తాఫా మూడు వికెట్లు తీసుకోగా మహ్మద్ నవీద్,ఫర్హాన్ ఆహ్మద్లు ఒక్కొక్కరికి రెండు వికెట్లు లభించాయి. | 2sports
|
internet vaartha 167 Views
హైదరాబాద్ : వాణిజ్య బ్యాంకుల్లో ఎవరు ఎక్కువ వడ్డీరేటు ఇస్తే ఆ బ్యాంకులోనే తమ వద్ద ఉన్న పసిడి నిల్వలను డిపాజిట్ చేయాలని తిరుపతి బాలాజీ దేవాలయం అధికారులు నిర్ణయానికి వచ్చారు. రెండు రోజులక్రితం జరిగిన ఎగ్జిక్యూటివ్ అధి కారి డి.సాంబశివరావు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల కమిటీ వివిధ బ్యాంకుల్లో దాచిన బంగారం ఇతర పెట్టుబడులపై సమీక్ష నిర్వహించింది. బ్యాంకుల్లో దాచిన నిల్వలపై వస్తున్న వడ్డీకి సంతృప్తి వ్యక్తంచేసింది. ఏడాది, లేదా మూడేళ్లపాటు బ్యాంకుల్లో ఉంచితే ఎక్కువ వడ్డీరేటు ఎవరిస్తే ఆ బ్యాంకులోనే పసిడి నిల్వలను దాచాలని నిర్ణయించింది. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యతలకింద టిటిడి చేపట్టే కార్యక్రమాలు, పథకాలను కూడా సమీక్షించింది. మొత్తం 1311 కిలోల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉంచినట్లు టిటిడి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని టిటిడి పర్యవేక్షిస్తోంది ప్రపంచంలోనే అత్యంత సంపన్నదేవాలయంగా భావించే తిరుమల దేవస్థానంకు వందలకోట్ల రూపాయలవరకూ సాలీ నా మొక్కుబడులు రూపంలో వస్తున్నాయి. మూడేళ్ల స్వల్పకాలిక పసిడి డిపాజిట్ స్కీం కింద పంజాబ్ నేషనల్ బ్యాంకులో నిల్వచేసింది. వార్షిక వడ్డీరేటు 1.75శాతంగా ఉంది. స్వల్పకాలిక పథకంలో అయితే కాలపరిమితి పూర్తయిన తర్వాత తిరిగి బంగారం రూపంలోనే పొందాల్సి ఉంటుంది. మధ్య తరహా, దీర్ఘకాలిక డిపాజిట్లపై కూడా బంగారం తిరిగి ఇచ్చేటట్లు చూస్తే మరింతగా దేవాలయాల నుంచి పసిడినిల్వలు బ్యాంకులకు చేరతాయని అంతేకాకుండా దేవాలయాలకు ఆకర్షణీయమైన రిటర్నులు కూడా ఉంటాయని రిజర్వుబ్యాంకుకు టిటిడి లేఖలు కూడా రాసింది.
నగదు, ఆభరణాలు, బంగారం, వెండి, ఇతర విలువైన ఖనిజాల రూపంలోను, రత్నాలు, స్థిరాస్తి పట్టాలు, డీమాట్షేర్ బదిలీల రూపంలో కూడా టిటిడికి మొక్కులు వస్తుంటాయి. ఏడాదికి టన్నుకు తగ్గకుండా బంగారం టిటిడికి వస్తుంది. స్థిరాస్థి పట్టాలరూపంలో అయితే టైటిల్డీడ్ మార్చేందుకు సంబంధించి ప్రభుత్వశాఖ సహకారం అవసరం అవుతుంది. అంతేకాకుండా దేవాలయానికి వజ్రాలు, వెండి వంటి విలువైన ఖనిజవనరులు కూడా మొక్కుబడులుగా వస్తాయి.
టిటిడి అధికారుల వివరణ ప్రకారం ఈ ఏడాది టిటిడి రాబడులు 2600 కోట్ల రూపాయలవరకూ ఉంటుంది. హుండీల్లో వేసే మొక్కుబడుల విలువ రూ.1000 కోట్లవరకూ ఉంటుందని అంచనా. వడ్డీరాబడులు కూడా రూ.800 కోట్లకుపైబడి ఉంటాయి. టికెట్లు విక్రయం, ప్రసాదం విక్రయం ఇతరత్రా వనరులరూపంలో రూ.600 కోట్లవరకూ ఉంటుందని అంచనా. ఇక కేశఖండన ద్వారా వచ్చే ఆదాయం కూడా రూ.140 కోట్లవరకూ ఉంటుంది. వేతనాలు, జీతాలు రూపంలో మాత్రమే అధికంగా రూ.500 కోట్లవరకూ ఈ ఏడాది టిటిడి వెచ్చించాల్సి ఉంటుంది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
క్యాచ్ మిస్.. నోరుజారిన వెస్టిండీస్ కెప్టెన్
మైదానంలో క్రమశిక్షణ తప్పి నోరుజారిన వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ ఐసీసీ నుంచి మందలింపునకు గురయ్యాడు.
TNN | Updated:
Aug 29, 2017, 06:39PM IST
మైదానంలో క్రమశిక్షణ తప్పి నోరుజారిన వెస్టిండీస్‌ కెప్టెన్ హోల్డర్‌ ఐసీసీ నుంచి మందలింపునకు గురయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఫీల్డర్ క్యాచ్ జారవిడచడంతో సహనం కోల్పోయిన హోల్డర్.. అతడ్ని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ల ఫిర్యాదు మేరకు ఐసీసీ అతడి ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లను చేర్చి.. దూషణకి దిగినందుకు తీవ్రంగా మందలించింది.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతుండగా.. 70వ ఓవర్ వేసిన హోల్డర్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్ బంతిని ప్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్‌వైపు గాల్లోకి లేచింది. కానీ.. ఫీల్డర్ కీరన్ పొవెల్ క్యాచ్‌ని అందుకోవడంలో తడబడి బంతిని నేలపాలు చేశాడు. దీంతో సహనం కోల్పోయిన హోల్డర్ రెండు అసభ్య పదాలతో అతడ్ని దూషించాడు. వీటిని ఫీల్డ్ అంపైర్లు స్పష్టంగా వినడంతో హోల్డర్‌ వాదన వినకుండానే ఐసీసీ శిక్ష ఖరారు చేసింది. సాధారణంగా ఇలా క్రమశిక్షణ తప్పితే డీమెరిట్ పాయింట్లతో పాటు కనీసం 50 శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తారు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఫేస్బుక్ కంటే యూట్యూబ్ పైనే మక్కువ ఎక్కువ
సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ కంటే యూట్యూబ్నే నెటిజన్లు అధికంగా ఇష్టపడుతున్నారు.
Samayam Telugu | Updated:
Jun 4, 2018, 03:42PM IST
సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ కంటే యూట్యూబ్నే నెటిజన్లు అధికంగా ఇష్టపడుతున్నారు. ఫేస్బుక్ చాటింగ్ కంటే యూట్యూబ్లో వీడియోలు చూసేందుకే యువత మొగ్గు చూపుతోందని అమెరికాకు చెందిన ప్యూ పరిశోధన కేంద్రం వెల్లడించింది. ఈమేరకు తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. దానిలోని వివరాల ప్రకారం...అమెరికాలో 13 నుంచి 17 ఏండ్ల వయసు యువతీ యువకుల్లో 85శాతం మంది యూట్యూబ్ వీడియోలను చూడటానికే అధిక సమయం కేటాయిస్తున్నారు. ఆ తర్వాత 72శాతం మంది ఇన్స్టాగ్రాంలో 69 శాతం మంది స్నాప్చాట్లో, 51శాతం మంది ఫేస్బుక్లో సమయం వెచ్చిస్తున్నట్టు తెలిపింది.
యూట్యూబ్ వీడియోలకే యూత్ మొగ్గు
'ఈ వయోశ్రేణి(13-17) అమెరికన్లలో 95శాతం మందికి స్మార్ట్ఫోన్ వాడకం తెలుసు. 43 శాతం మంది నిత్యం ఇంటర్నెట్ను వాడుతున్నారు. సామాజిక మాధ్యమం వల్ల మంచే ఎక్కువని వారిలో 31శాతం మంది చేటే ఎక్కువని 24 శాతం మంది నమ్ముతున్నట్టు చెప్పారు'' అని సర్వే సంస్థ తన నివేదికలో పేర్కొంది. మార్చి 7 నుంచి ఏప్రిల్ 10వరకు మొత్తం 743 మంది యువతను ప్రశ్నించి ఈ నివేదికను తయారుచేసింది. అల్పాదాయం ఉన్న వారు అధికంగా ఫేస్బుక్ ఉపయోగిస్తున్నారని, అధిక ఆదాయం ఉన్న యువత ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ను ఉపయోగిస్తున్నారని ప్యూ సంస్థ వెల్లడించింది. యువతులు ఎక్కువగా స్నాప్చాట్ యాప్ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
చెన్నై టెస్టు గెలిస్తే.. చరిత్ర తిరగరాసినట్లే!
చెన్నైలో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ జట్టు 477 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ స్కోరును చేధించి మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ చరిత్ర తిరగరాసినట్టే.
TNN | Updated:
Dec 17, 2016, 03:59PM IST
చెన్నైలో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ జట్టు 477 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ స్కోరును చేధించి మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ చరిత్ర తిరగరాసినట్టే. ఎందుకంటే.. భారత్‌లోనే కాకుండా ఆసియా గడ్డ మీద ఇప్పటి వరకూ 617 టెస్టులు జరగ్గా.. తొలి ఇన్నింగ్స్‌లో 475కి పైగా పరుగులు చేసిన జట్టు కేవలం ఒక్కసారి మాత్రమే ఓటమిపాలైంది. 2010లో భారత్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 478 రన్స్ చేయగా.. సచిన్ డబుల్ సెంచరీ సాధించడంతో భారత్ 498 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 223 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
ఇప్పుడు ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. ఆరేళ్ల కిందట ధోనీ గ్యాంగ్ చేసిన ఫీట్‌ను కోహ్లి సేన మరోసారి సాధించినట్లు అవుతుంది. ధోనీ కెప్టెన్సీ రికార్డులన్నింటినీ సాధిస్తోన్న కోహ్లి.. ఈ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంటాడా? | 2sports
|
BOLT11
ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: బోల్ట్
లండన్: ఇటీవల లండన్ వేదికగా ముగిసిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో తన ఆఖరి పరుగులో ఉసేన్ బోల్ట్ అభిమానులను నిరాశ పరిచినే సంగతి తెలిసిందే. 4ఇన్టూ100 రిలే రేసులో ఆఖరి అంచెలో పరుగెత్తిన బోల్ట్ గాయం తో ట్రాక్పై అనూహ్యంగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో స్వర్ణంతో కెరీర్కు వీడ్కోలు పల కాలన్న బోల్ట్ ఆశలు నెరవేరలేదు. ఈనేపథ్యంలో తన గాయంపై వస్తున్న అనుమానాలపై ఉసేన్ బోల్ట్ సోషల్ మీడియాలో స్పందించాడు. చివరి రేసులో ఉసేన్ బోల్ట్ ట్రాక్పై కుప్పకూలిపో వడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఉసేన్ బోల్ట్కు ఎంతో బాధ కలిగించాయట. దీంతో తన గాయా నికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. గాయం వల్ల రేసు పూర్తి చేయలేకపోయాను. కోలుకోవడానికి మూడు నెలల సమయం పడుతుంది. సాధారణంగా నా వైద్య నివేదికలను వెల్లడించను. కానీ గాయం నిజం కాదంటూ వస్తున్న వదంతులకు ముగింపు పలకాలనే ఇలా చేస్తున్నా, అని ఉసేన్ బోల్ట్ పేర్కొన్నాడు. నా అభిమానులను నేనెప్పుడూ మోసం చేయాలని అనుకోలేదు.ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో చివరిసారిగా నా అభిమానుల కోసం పరుగెత్తాను. మీ మద్ధతుకు ధన్యవాదాలు. గాయం మానేంత వరకు విశ్రాంతి తీసుకుని తర్వాత జీవితానికి స్వాగతం పలుకుతాను అని బోల్ట్ అందులో పేర్కొన్నాడు. | 2sports
|
2013-14 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 5.8 శాతం
PNR|
201-14 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 5.8 శాతంగా నమోదు కావొచ్చని అమెరికాకు చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ (బీవోఎఫ్ఏ- ఎంఎల్) ప్రకటించింది. గతంలో అంచనా వేసిన 6 శాతం నుంచి 5.8 శాతానికి సవరించిన ఈ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ... వచ్చే ఆర్థిక సంవత్సర అంచనాను 6.8 శాతానికి తగ్గించింది.
భారత్లో నీరసించిన పారిశ్రామిక రంగం వృద్ధిరేటు, మార్కెట్లో నిధుల ప్రవాహం తగ్గుముఖం పట్టడం, వడ్డీరేట్ల తగ్గింపు అటకెక్కడంతో వృద్ధి అంచనాలను తగ్గించినట్లు సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అయితే, ఆర్బీఐ మాత్రం 5.7 శాతంగా ఉంటుందని పేర్కొంది.
సంబంధిత వార్తలు | 1entertainment
|
AU FINANCE
అంచనాలకు మించిన ఎయుస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ముంబయి, జూలై 11: ఐపిఒద్వారా స్టాక్ మార్కెట్లలో హల్చల్చేసిన ఎయు స్మాల్ఫైనాన్స్ బ్యాంకు స్టాక్ మార్కెట్లలో రూ.525వద్ద జాబితా అయింది. ఐపిఒ ఇష్యూధర రూ.358 కంటే 47శాతం ప్రీమియం కు ధరలు కొనసాగాయి. ఉదయం పది గంటలకు స్టాక్ 528వద్ద ట్రేడింగ్ జరిగింది. ఇంట్రాడేలో రూ.544వద్ద ట్రేడింగ్ కొనసాగింది. మొత్తం 8.57మిలియన్ షేర్లు చేతు లు మారినట్లు అంచనా, నాన్బ్యాంకింగ్ఫైనాన్స్ కంపెనీ ఐపిఒకు భారీ స్పందనవచ్చింది. 53.60రెట్లు బిడ్లు దాఖలయ్యాయి. ఎక్కువగా కుబేరుల జాబితా నుంచే బిడ్లు వచ్చాయి. 144రెట్లు ఎక్కువ దాఖలైతే అర్హులైన సంస్థాగత కొనుగోలుదారులనుంచి 79రెట్లు అధికంగా బడ్లు దాఖలయ్యా యి.
రిటైల్ఇన్వెస్టర్ల భాగంలో 3.52రెట్లు బిడ్లు ఎక్కువ వచ్చినట్లు ఎక్చేంజి గణాంకాలు చెపుతున్నాయి. ఎయుస్మాల్ఫైనాన్స్ బ్యాంకు ఇటీవలే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్సంస్థ నుంచి స్మాల్ఫైనాన్స్ బ్యాంకుగా మారింది. కంపెనీఒక్కటే ఎన్బి ఎఫ్సి విభా గంలో రిజర్వుబ్యాంకు నుంచి ఎస్ఎప్బి లైసెన్సును పొందగలిగింది. ఇక విలువలపరంగాచూస్తే ప్రస్తుత బుక్ విలువలపరంగా 5.3రెట్లు ఎక్కువగానే ఉంది. ప్రీమియం ధరలకు 3.5 రెట్లు ఎక్కువ ఉంది. | 1entertainment
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
Jun 05,2015
ఫెడరల్ బ్యాంకుకు గ్రీన్టెక్ అవార్డు
హైదరాబాద్: బెంగళూరులో ఫెడరల్ బ్యాంకు ట్రయినింగ్, అభివృద్ధిలో అత్యుత్తమ ప్రగతిని కనబర్చినందుకు గాను ఆ సంస్థకు గ్రీన్టెక్ హెచ్ఆర్ ఎక్సలెన్సీ అవార్డు -2015 లభించింది. ఉద్యోగుల్లో నైపుణ్య శిక్షణలో నూతన ఆవిష్కరణలకు గాను తమ సంస్థకు ఈ అవార్డు లభించిందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ అవార్డును ఆ బ్యాంకు ఫెడరల్ బ్యాంకు ఉద్యోగుల శిక్షణ అధికారి ఉషా మేరి మాథన్కు ఒఎన్జిసి మాజీ డైరెక్టర్ కెఎస్ జమెస్టిన్, గ్రీన్టెక్ ఛైర్మన్ కె శరన్ అందజేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 5, Oct 2018, 2:32 PM IST
Highlights
సెలక్టర్లు ఒక్క మాట కూడా చెప్పలేదని ఓపెనర్ మురళీ విజయ్ చేసిన కామెంట్ పై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.
టెస్టు సిరీస్లో తనను జట్టు నుంచి తప్పించే క్రమంలో కనీసం సెలక్టర్లు ఒక్క మాట కూడా చెప్పలేదని ఓపెనర్ మురళీ విజయ్ చేసిన కామెంట్ పై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో ఘోరంగా విఫలమైన మురళీ విజయ్పై వేటు వేసిన సెలక్టర్లు.. అతని స్థానంలో చివరి రెండు టెస్టులకి పృథ్వీ షాని ఎంపిక చేశారు. అయితే.. జట్టు నుంచి తనని తప్పించే ముందు సెలక్టర్లు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మురళీ విజయ్ నిన్న ఆవేదన వ్యక్తం చేశాడు. అతనితో పాటు ఇటీవల కరుణ్ నాయర్, హర్భజన్ సింగ్ కూడా సెలక్టర్ల తీరుపై మండిపడిన విషయం తెలిసిందే.
మురళీ విజయ్ వ్యాఖ్యలపై తాజాగా భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ‘జట్టు నుంచి మురళీ విజయ్ని తప్పించేటప్పుడు అతనికి సమాచారం ఇవ్వలేదనే మాట అవాస్తవం. జట్టు ఎంపిక సమయంలో నా సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ ఓపెనర్ మురళీ విజయ్తో మాట్లాడాడు. అతడ్ని ఎందుకు జట్టు నుంచి తప్పిస్తున్నామో కారణం కూడా సవివరంగా చెప్పాడు. కానీ.. మురళీ విజయ్ తనకి సమాచారం ఇవ్వలేదని నిన్న చెప్పడం నన్ను ఆశ్చర్యపరిచింది’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు.
ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి 26 పరుగులు మాత్రమే చేసిన మురళీ విజయ్ను మూడో టెస్టు నుంచి తప్పించారు. ఆపై నాలుగు, ఐదు టెస్టుల్లో సైతం అతనికి చోటు దక్కలేదు. కాగా, దీనిపై తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం బాధ కల్గించిందని విజయ్ తాజాగా పేర్కొన్నాడు.
read more news | 2sports
|
డీజిల్ వాహనాలతో కాలుష్యం తక్కువే..
- ఢిల్లీ, ఎన్సీఆర్లలో అమ్మకాలపై నిషేధం ఎత్తివేయండి..
- 'సుప్రీం'ను ఆశ్రయించిన ప్రముఖ వాహన సంస్థలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో (ఎన్సీఆర్) 2000సీసీ సామర్థ్యానికి మించిన డిజిల్ వాహనాలపై విధించిన నిషేధాన్ని తొలగించాలంటూ వాహన తయారీ సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. తయారీలో ప్రభుత్వం సూచించిన అన్ని కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటిస్తున్న నేపథ్యంలో తాము తయారు చేస్తున్న వాహనాల నుంచి చాలా తక్కువ మొత్తంలో కాలుష్యం వెలువడుతోందంటూ కార్లు, స్పోర్ట్ యుటిలిటీ వాహన తయారీదారు సంస్థలు కోర్టుకు గడపతొక్కారు. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెజ్ బెండ్, జనరల్ మోటార్స్, టయోట కిర్లోస్కర్ సంస్థలు తమ వాదనలను విడివిడిగా అత్యున్నత న్యాయస్థానానికి దాఖలు చేసుకున్నాయి. రాజధాని ప్రాంతంలో డిజిల్ వాహనాల వినియోగం పెరగడం కారణంగా కాలుష్యం పెరుగుతన్న నేపథ్యంలో 2000 సీసీ కంటే కూడా ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన డీజిల్ వాహనాల విక్రయాలపై మార్చి 31 వరకు సుప్రీం కోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ టి.ఎస్.థాకూర్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం ఈ విషయమై మంగళవారం విచారణ చేపట్టనుంది. డీజిల్ వాహనాలను రూపొందించేందుకు ఇప్పటికే ప్రముఖ వాహన తయారీ సంస్థలు వందల కోట్లలో నిధులను ఖర్చు చేశాయి. దేశంలోని ప్రధాన మార్కెట్లలో ఒకటైన ఢిల్లీలో నిషేధం కారణంగా ఈ సంస్థలు అత్యధికంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా సంస్థలు అత్యున్నత న్యాయస్థానం గడపతొక్కారు. కోర్టు తీర్పులో మార్పు వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఎంగురి డ్యామ్లో `పిఎస్వి గరుడువేగ 126.18ఎం` షూటింగ్
Highlights
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రాజశేఖర్ పి.ఎస్.వి గరుడవేగ
చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం
జార్జియాలోని ఎంగురి డ్యామ్ లో 7 రోజులపాటు గరుడవేగ యాక్షన్ సీన్స్ షూట్
యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరో గా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం” . ప్రస్తుతంజార్జియాలో ఎంగురి డ్యామ్లో ఇప్పుడు గరుడ వేగ టీం సందడి చేస్తుంది. జార్జియా దేశానికి మూడొంతులు పైగా ఎలక్ట్రిసిటీ, తాగునీటిని సరఫరా చేసే డ్యామ్ ఇది. జార్జియా పశ్చిమాన ఉన్న ఈ డ్యామ్ ప్రపంచంలోనే 6వ ఎత్తైన (271.5 మీ లేదా 891 అడుగులు) డ్యామ్. ఈ ప్రాంతంలో ఏడు రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరణ జరుపుతున్నారు.
పారాచ్యూట్స్, మిలటరీ విమానాలు, ఎం-16 మెషీన్స్ సహా భారీగా పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. జార్జియా అధికారులు, డ్యామ్ అధికారులు యూనిట్కు సహకారం అందిస్తున్నారు. డ్యామ్ చీఫ్ ఇన్చార్జి జాన్ ఛనియా దగ్గరుండి పర్యవేక్షిస్తుండటం విశేషం. అంతే కాకుండా 4 డిగ్రీల చలిలో ముప్పై మైళ్ళ వేగంతో గాలులు వీస్తుంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా యూనిట్ సభ్యులు ఎంతో కష్ట నష్టాలకోర్చి సినిమా షూటింగ్ చేస్తున్నారు.
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్ గృహిణి పాత్రలో నటిస్తుంది. జార్జ్ అనే కరుగుగట్టిన విలన్ పాత్రలో కిషోర్ సహా నాజర్, పోసాని కృష్ణమురళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శత్రు, సంజయ్ స్వరూప్, రవివర్మ, ఆదర్శ్, చరణ్ దీప్, రవి రాజ్ తది తరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేకప్ః ప్రశాంత్, ప్రొడక్షన్ మేనేజర్స్ః శ్రీనివాసరావు పలాటి, సాయి శివన్ జంపన, లైన్ ప్రొడ్యూసర్ః మురళి శ్రీనివాస్, కాస్ట్యూమ్స్ డిజైనర్ః బాబీ అంగార, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజన్ః సి.వి.రావ్(అన్నపూర్ణ స్టూడియోస్), స్టంట్స్ః సతీష్, నుంగ్, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫర్ః విష్ణుదేవా, ఎడిటర్ః ధర్మేంద్ర కాకరాల, రచనః ప్రవీణ్ సత్తారు, నిరంజన్ రామిరెడ్డి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ః శ్రీచరణ్ పాకాల, సమర్పణః శివాని శివాత్మిక ఫిలింస్, నిర్మాణంః జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్రఫీః అంజి, సురేష్ రగుతు, శ్యామ్ ప్రసాద్, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచరణ్ పాకాల, ప్రొడ్యూసర్ః ఎం.కోటేశ్వర్ రాజు, కథ, కథనం, దర్శకత్వంః ప్రవీణ్ సత్తారు.
Last Updated 25, Mar 2018, 11:51 PM IST | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
నాగ్కి విలన్గా చేయాలని ఉందట
హీరో జగపతి బాబు క్లాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా ముద్ర వేయించుకున్నాడు.
TNN | Updated:
Jun 22, 2016, 09:53AM IST
నాగ్కి విలన్గా చేయాలని ఉందట
హీరో జగపతి బాబు క్లాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా ముద్ర వేయించుకున్నాడు. అలాంటిది ఇప్పుడతను తెలుగు సినిమాలకు టాప్ విలన్గా తయారయ్యాడు. రాజశేఖర్, శ్రీకాంత్... అదే బాటలో వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాగా టాప్ హీరోల్లో ఒకరైన నాగార్జునకి కూడా పవర్ ఫుల్ విలన్ గా చేయాలని కోరికగా ఉందట. ఈ మధ్య జరిగిన సాహసం శ్వాసగా సాగిపో ఆడియో వేడకలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. అన్ని రకాల పాత్రల్లోనూ తాను నటించానని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. స్టేజీపై ఉన్న గౌతమ్ మీనన్ కు ఈ విషయం ఆయన స్వయంగా చెప్పడం గమనార్హం. నాగార్జునను విలన్ రోల్ లో చూసే అవకాశం ఇంకెంతో దూరంలో లేదని టాలీవుడ్ టాక్.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
NEHRA
నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తా : నెహ్రా
న్యూఢిల్లీ: భారత ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా నవంబర్ 2న సొంత మైదానంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో నెహ్రా ఇప్పుడు ఏం చేస్తాడు అన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. తాజాగా నెహ్రా దీనిపై స్పందించాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెహ్రా మాట్లాడుతూ…ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా చాలా సులువుగా తీసుకోవచ్చు. ప్రస్తుతం వీలైనంత ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతా. ఆ తర్వాత క్రికెట్కు సంబంధించిన ఏదో ఒక రంగాన్ని ఎంచుకుంటా. అది కోచ్గా లేదంటే కామెంటేటర్గా. త్వరలో దీనిపైన తుది నిర్ణయం ప్రకటిస్తా. ప్రస్తుతం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు విదేశీ గడ్డపై సైతం అద్భుత విజయాలు సాధిస్తోంది. విదేశీ గడ్డపై మన జట్టు సాధించే విజయాలను మరిన్ని చూడాలని ఆశిస్తున్నానని నెహ్రా తెలిపాడు. | 2sports
|
హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ పూర్తి చేసుకున్న హీరో రామ్
Highlights
నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న రామ్ చిత్రం
చిత్రంలో హీరోయిన్లుగా అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్
హైదరాబాద్ లో తాజా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మూడో షెడ్యూల్ జూన్ 14 వరకూ హైదరాబాద్లో జరిగింది. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్. సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ కథానాయికలు.
నిర్మాత `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ ``రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్, వైజాగ్లో రెండో షెడ్యూల్ చేశాం. మూడో షెడ్యూల్ను ఇటీవల ఐదు రోజుల పాటు హైదరాబాద్లో తెరకెక్కించాం. జూన్ 10, 11న కెజీ రెడ్డి కాలేజీలోనూ, 12న సంజీవయ్య పార్కులోనూ, 13న రామోజీ ఫిల్మ్ సిటీలోనూ, 14న రాత్రి అంబేద్కర్ యూనివర్శిటీలోనూ షూటింగ్ చేశాం. ఈ నెలాఖరు నుంచి వైజాగ్, అరకులో మరో షెడ్యూల్ ఉంటుంది`` అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ``రామ్ హీరోగా నా దర్శకత్వంలో వచ్చిన `నేను శైలజ` సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల్లో తాజా సినిమా పట్ల అంచనాలు పెరిగాయి. వాటిని చేరుకునేలా మేం కథను సిద్ధం చేశాం. ఈ కథ తప్పకుండా ఫ్రెష్ ఫీల్ని కలిగిస్తుంది. రామ్ లుక్కు ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది. నాయికలు అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాశ్.. ఇద్దరూ సినిమాకు ప్లస్ అవుతారు. వారి పాత్రలు కూడా కీలకమైనవే. దేవిశ్రీప్రసాద్ మంచి బాణీలను అందించారు. ఇప్పటివరకు తెరకెక్కించిన సన్నివేశాలు సంతృప్తికరంగా వచ్చాయి`` అని అన్నారు.
శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాశ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్రెడ్డి, సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
అరుదైన రికార్డ్..
రామ్ హీరోగా గతేడాది విడుదలైన `నేను శైలజ` సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందే ఆ చిత్రంలోని పాటలు శ్రోతల్లో విపరీతమైన క్రేజ్ను సంపాదించుకున్నాయి. ఇప్పుడు ఆ క్రేజ్ మరింత పెరిగింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహించిన `క్రేజీ క్రేజీ ఫీలింగ్` అనే పాటను ఇప్పటికే యూట్యూబ్లో మూడు కోట్ల మంది వీక్షించారు. తెలుగు సినిమా పాటల్లో ఇది అరుదైన రికార్డుగా అభివర్ణించవచ్చు. `నేను శైలజ` చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై `స్రవంతి` రవికిశోర్ నిర్మించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించారు
Last Updated 25, Mar 2018, 11:59 PM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సల్మాన్ ఖాన్ 'ట్యూబ్లైట్' ఫస్ట్లుక్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరో సినిమాకు రెడీ అయిపోయాడు. దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందిస్తున్న 'ట్యూబ్లైట్' సినిమాలో సల్లూభాయి నటిస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ సరసన చైనీస్ నటి ఝూ ఝూ హీరోయిన్ గా నటిస్తోంది...
TNN | Updated:
Aug 15, 2016, 06:02PM IST
'సుల్తాన్' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరో సినిమాకు రెడీ అయిపోయాడు. దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందిస్తున్న ' ట్యూబ్లైట్ ' సినిమాలో సల్లూభాయి నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'ఏక్ థా టైగర్' మరియు 'బజరంగి భాయిజాన్' సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి యాక్షన్, అడ్వెంచర్ సినిమాతో రాబోతున్నారు. 'ట్యూబ్లైట్'కు సంబంధించిన ఫస్ట్లుక్ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా దర్శకుడు కబీర్ ఖాన్ ఈరోజు విడుదల చేశారు. అయితే సల్మాన్ ముఖం కనిపించకుండా వెనక నుంచి చూపించారు. ఈ సినిమాలో సల్మాన్ సోల్డియర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. లేహ్ లడఖ్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో సల్మాన్ సరసన చైనీస్ నటి ఝూ ఝూ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఈద్ కు ఈ సినిమా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. | 0business
|
internet vaartha 185 Views
మహీంద్ర వృద్ధి-మారుతి క్షీణత
న్యూఢిల్లీ : మహీంద్ర అండ్మహీంద్ర ఫిబ్రవరి విక్రయాల్లో 15.7శాతం వృద్దిని ప్రకటించింది. మొత్తం 44,002 వాహనాలు విక్రయించామని, గత ఏడాది 38,030 కంటే ఎక్కువేనని ప్రకటించింద.ఇ దేశీయంగా 34,918యూనిట్లనుంచి పెరిగి 18.41 శాతం వృద్ధిని సాధించామని, 41.348 యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది. ఎగుమతులపరంగా చూస్తే 14.71శాతం క్షీణించాయి. 3112 యూనిట్లనుంచి 2654 యూనిట్లకు పడిపోయాయి. స్కార్పియో ఎక్స్యువి500, గ్జైలో, బొలేరో, వెరిటో 26.99శాతం వృద్ధిని సాధించి 22,612 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్యవాహనాల పరంగాచూస్తే 16శాతం పెరిగి 13,864 యూనిట్లకు పెరిగాయి. మహీంద్ర అంచనాల ప్రకారం చూస్తే గత ఏడాది 11,945 యూనిట్లుగా ఉన్నాయి. ఇక మహీంద్ర ట్రాక్టర్ల విక్రయాలు పెరిగాయి. 12,702యూనిట్లను ఫిబ్రవరిలో విక్ర యించినట్లు ప్రకటించింది. గతఏడాది 10,267 యూనిట్లు విక్ర యిస్తే ఈఏడాది గణనీయంగా పెరిగాయని ప్రకటించింది. మొత్తం గా ఎగుమతులు దేశీయవిక్రయాలు కలిపితే 13,574యూనిట్లుగా ఉన్నాయి. మోటారుబైక్లపరంగా దిగ్గజంగా ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ 63శాతం విక్రయాలు పెకరిగాయి. 49,156వరకూ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. 350సిసి వాహనాలు 43,741 విక్రయించింది. 350సిసి కెపాసిటీకిపైబడిన ఇంజన్లు 5415 యూనిట్లుగా ఉన్నాయి.45శాతం పెరిగాయి. ఎగుమతులపరంగా కూడా 749 యూనిట్లనుంచి ఈ ఏడాది 1589యూనిట్లకు పెరిగాయని కంపెనీ ప్రకటించింది. ఇక హిందూజాగ్రూప్లోని అశోక్లేలాండ్ విక్రయాలు 25శాతం పెరిగినట్లు ప్రకటించింది. 13,403యూనిట్లు ఫిబ్రవిలో విక్రయించినట్లు అశోక్లేలాండ్ వెల్లడించింది. గత ఏడాది ఇదేనెలలో కంపెనీ 10,762 యూనిట్లు విక్రయించింది. భారీ, మధ్యతరహా వాణిజ్యవాహనాలను పరిగణనలోనికి తీసుకుంటే 31శాతం పెరిగి 10,798యూనిట్లకు పెరిగాయి. గతఏడాది 8230 నుంచి భారీవృద్ధిని సాధించాయి. తేలికపాటి వాణిజ్య వాహనాలను పరిశీలిస్తే 3శాతంపెరిగి 2532నుంచి 2695 వాహనాలకు పెరిగాయి. ఇక దేశంలోని చిన్నకార్ల దిగ్గజం మారుతిసుజుకి ఇండియా ఫిబ్రవరి విక్రయాలు క్షీణించాయి. గత ఏడాది ఇదేనెలలో 1,18,551యూనిట్లు విక్రయించిన కంపెనీ ఈ ఏడాది 1,17,451యూనిట్లు విక్రయించింది. కంపెనీ దేశీయ విక్రయాలు కొంత పెరిగాయి. 1,07,892 యమూనిట్లనుంచి 1,08,115యూనిట్లకు పెరిగాయి. కార్మికు ల సమ్మె కొంత ఉత్పత్తిని దెబ్బతీసింది.విడిభాగాల సరఫరాకూడా దెబ్బతిన్నది. మొత్తం ఉత్పత్తి పదివేలయూనిట్లు దెబ్బతిన్నాయని మారుతి సుజుకి ప్రకటించింది. ఇక మిని సెగ్మెంట్ కార్లలో ఆల్టో, వ్యాగన్ఆర్ 11.2శాతం దిగజారి 35,495యూనిట్లకు పడిపోయాయి. గతఏడాది ఇదేకాలంలో 39,988 యూనిట్లకు పెరిగింది. కాంపాక్ట్ సెగ్మెంట్లోని స్విఫ్ట్, ఎస్టిల్లో, రిట్జ్, డిజైర్, బాలినో వాహనాలు 42,970 వరకూ ఉన్నాయి. గత ఏడాది 42,778యూనిట్లు విక్రయించింది. ఇక యుటిలిటి వాహనాలపరంగాచూస్తే జిప్పీ, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎస్క్రాస్ వంటివి 44.7శాతం పెరిగాయి. 5863యూనిట్ల నుంచి 8484కు పెరిగాయి. ఒమ్నివ్యాన్, ఎకోవ్యాన్లు 10.5శాతం పెరిగాయి. గత ఏడాది 11,301 వాహనాలు విక్రయిస్తే ఈ ఏడాది 12,482యూనిట్లు విక్రయించింది. ఎగుమతులపరంగా కూడా 12.4శాతం దిగజారాయి. 10,659 యూనిట్లు గత ఏడాది ఎగుమతిచేస్తే ఈ ఏడాది కేవలం 9336 యూనిట్లు మాత్రమే ఎగుమతిచేసినట్లు ప్రకటించింది. మిడ్సైజ్ సెడాన్స్ 5162 యూనిట్లను విక్రయించింది. ప్రీమియం సెడాన్ కిజాషి విక్రయాలు లేనేలేవు. | 1entertainment
|
internet vaartha 143 Views
దుబాయ్ : ఇంగ్లండ్లో 2019లో నిర్వహించనున్న వన్డే ప్రపంచ కప్ మేనేజింగ్ డైరెక్టర్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ స్టీవ్ ఎల్వర్తీని నియమించారు. ఐసిసి, ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించాయి. ఇంతకు ముందు టోర్నీ డైరెక్టర్ హోదాలో మూడు ఐసిసి గ్లోబల్ ఈవెంట్లను సమర్థంగా పర్యవేక్షించిన ఎల్వర్తీ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పదవికి ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఎన్నో ఐసిసి ఈవెంట్లలో పాలుపంచుకున్నానని, అయితే 2019 ప్రపంచ కప్ చాలా పెద్ద టోర్నీ అని ఎల్వర్తీ పేర్కొన్నాడు. యుకె ఇప్పటికే ఎన్నో ప్రపంచ శ్రేణి ఈవెంట్లకు ఆతిథ్యమిచ్చిందని, ఈ టోర్నీని కూడా చాలా గొప్పగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఎన్నో టోర్నీలు, ఈవెంట్లు నిర్వహించడంలో భాగ స్వామిని అయిన తనకు ఇంత భారీ అవకాశం వస్తుందని ఊహించ లేదని ఎల్వర్తీ వ్యాఖ్యానించాడు. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
చేసిన తప్పు ఒప్పుకున్న మహేష్ బాబు
Highlights
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ నేడే విడుదల
సూపర్ హిట్ టాక్ ను రిలీజ్ ముందే తెచ్చుకున్న స్పైడర్
శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం కథ సరిగా లేకనే ఫ్లాప్ అయిందన్న మహేష్ బాబు
“బ్రహ్మోత్సవం” కధను ఎంపిక చేసుకోవడం ప్రిన్స్ మహేష్ బాబు తన కెరీర్ లో వేసిన భారీ తప్పటడుగుగా అప్పట్లో సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత అదే తరహా పాత్రను ఎంపిక చేసుకోవడం అనేది మహేష్ చేసిన మొదటి తప్పుగా అభివర్ణించారు. ఇక బ్రహ్మోత్సవం తర్వాత తాజాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘స్పైడర్’ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు ప్రిన్స్. మరోవైపు స్పైడర్ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మోత్సవం పరాజయానికి కారణం కథేనన్న విషయాన్ని మహేష్ బాబు కూడా అంగీకరించారు.
‘బ్రహ్మోత్సవం’ చేయడం తన సరైన నిర్ణయం కాదని చెప్పిన మహేష్, ఇలాంటివే తనకు పాఠాలు నేర్పుతుంటాయని కూడా అన్నారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదల తర్వాత బాగా డిజప్పాయింట్ అయిన మాట నిజం అని, దాని నుండి బయటపడేసింది తన పిల్లలే అని, ఈ సినిమా వలన చాలా మంది బాధపడ్డారని, తనను నమ్మి డబ్బులు పెట్టిన వారు ఇబ్బందులు పడ్డారని, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవడమే తన బాధ్యత అని చెప్పారు ప్రిన్స్.
జీవితంలో అన్ని అనుకున్నట్లు జరగవని, మనం అనుకున్నవి కొన్ని తలక్రిందులు అవుతుంటాయని, ‘బ్రహ్మోత్సవం’ కూడా అలాంటిదేనని కాస్త వేదాంతధోరణిలో కూడా మాట్లాడారు. “స్పైడర్” ఫలితంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ కధ యూనివర్సల్ కావడంతో, రెండు భాషల్లో కూడా విజయవంతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచిన ప్రిన్స్, ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న “భరత్ అనే నేను” గురించి మాట్లాడడానికి ఆసక్తి కనపరచలేదు. షూటింగ్ ఇటీవలే మొదలైందని, ఇప్పుడే మాట్లాడడం సరైనది కాదని అన్నారు.
Last Updated 25, Mar 2018, 11:51 PM IST | 0business
|
Vaani Pushpa 84 Views ADITYA BIRLA , Capital , raising of the funds
Aditya birla
ముంబయి: ఆదిత్యబిర్లా కేపిటల్ సంస్థ 2100 కోట్ల నిధులను ప్రాధాన్యతా షేర్ల కేటాయింపుతో నిధులు సమీకరించుకోవాలని నిర్ణయించింది. జోమేఇ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థకు ఈ వాటాలను జారీచేస్తోంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ అయిన జోమేయితోపాటు పిఐ ఆపర్చునిటీస్ ఫండ్కు సైతం షేర్లను కేటాయిస్తోంది. ఆదిత్యబిర్లా గ్రూప్లోని కీలకమైన సంస్థ ప్రస్తుతానికి 1000 కోట్ల మూలధన వనరులు అవసరమని భావిస్తోంది. 770 కోట్లు జోమేయి ఇన్వెస్ట్మెంట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నుంచి సేకరిస్తుండగా పదికోట్లు వాటాలు, మరో 7.70 కోట్ల పూర్తి అధీకృత చెల్లింపు వాటాలను వందరూపాయలు చపొ2న జోమేయి, గ్రాసిమ్లకు విడుదల చేస్తోంది. ఎబిసిఎల్ కంపెనీ 230 కోట్లు, మరో వందకోట్ల రూపాయలను ప్రమోటర్గ్రూప్ పిఐ ఆపర్చునిటీస్ ఫండ్-1నుంచి సేకరిస్తోంది కంపెనీ 2.30 కోట్లమేర వాటాలు జారీచేస్తుంగా వాటిలో కోటికిపైగా పూర్తి అధీకృత చెల్లింపు ఈక్విటీవాటాలను రూ.100 చొప్పున ప్రమోటర్గ్రూప్, పిఐ ఆపర్చునిటీస్ ఫండ్-1కు కేటాయిస్తున్నది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
Aug 23,2016
ఎంపిక అందుకే : డీబీఎస్
సింగపూర్ : భారత రిజర్వ్ బ్యాంకు తదుపరి గవర్నర్గా కేంద్రప్రభుత్వం ఉర్జిత్ పటేల్ను నియమించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సానుకూలత వ్యక్తమవుతోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి, సంస్కరణలు కొనసాగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆర్బీఐ అనుసరిస్తున్న యథాపూర్వక స్థితిని కొనసాగించేందుకే ఉర్జిత్ పటేల్ను భారత ప్రభుత్వం నియమించిందని ద డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్(డీబీఎస్) పేర్కొన్నది. 'విధాన నిర్ణయాల ప్రకారం ద్రవ్యోల్భణ కట్టడికి చర్యలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ద్రవ్యోల్భణాన్ని 4శాతం వద్ద కట్టడి చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. జనవరి 2014లో జరిగిన విధాన సమీక్షలో ఉర్జిత్ పటేల్ కీలక పాత్ర పోషించారు. వచ్చే 12-24 నెలల్లో ద్రవ్యోల్భణాన్ని 4శాతానికి కట్టడి చేయాలని అప్పుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటికి పరిష్కార మార్గాలు చూపడంలో ఉర్జిత్ కీలక పాత్ర పోషించారు. ఆ కీలక నిర్ణయాలను కొనసాగించేందుకు ప్రభుత్వం ఉర్జిత్ పటేల్ను ఆర్బీఐ గవర్నర్గా నియమించింది' అని డీబీఎస్ తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కొరటాల కథలు దొంగలించారు!
Highlights
కొరటాల కథలు దొంగలించారు!
నిన్న జరిగిన భరత్ అనే నేను సక్సెస్ మీట్ లో పోసాని కృష్ణ మురళి ఒక దర్శకుడి మీద విరుచుకు పడ్డారు. తన మేనల్లుడైన కొరటాల శివ చాలా మంచి రచయిత అని..పాజిటీవ్ ఆటిట్యూడ్ ఉన్నవాడిని, అతని దగ్గర ఉన్న కథలు కొంతమంది కాజేశారని, ఆ కథలతో కొరటాల సినిమాలు తీసి ఉంటె.. కొరటాల శివ ఖాతా లో పది బ్లాక్ బస్టర్ హిట్స్ చేరేవని అన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆ దర్శకుడి పేరు పోసాని ప్రస్తావించకపోయినా.. బోయపాటి శీను గురించే పోసాని చెప్పారని, సినిమా ప్రేమికులకు యిట్టె అర్ధం అయిపోతుంది. సింహ సినిమా.. కథ, మాటల విషయం లో బోయపాటికి – కొరటాల శివ కు గొడవలు జరిగాయని .. యూట్యూబ్ లో కొరటాల ఇంటర్వూస్ లో ప్రత్యేకంగా చెప్పారు.
మరి ఇన్ని తెలిసిన కొరటాల శివ కూడా.. శ్రీమంతుడు కథ, శరత్ చంద్ర రాసిన నవల ‘చచ్చేంత ప్రేమ’ నుండి కాపీ చేసిందే కాదు? ఆ రైటర్ నాంపల్లి కోర్ట్ లో కేసు వేసి భారీ మొత్తం తీసుకున్నట్లు తెలిసిందే కదా. భరత్ అనే నేను కథ కూడా శ్రీహరి నాను దగ్గర నుండి కొరటాల కోటి రూపాయలిచ్చి కొన్నాడని చెప్పుకుంటుంటే … ‘భరత్ కథ నాదే’ అని చెప్పిన కొరటాల, సక్సెస్ మీట్ లో శ్రీహరి నాను కథ ఇచ్చాడని, మా బంధం ఇలాగె కొనసాగాలన్నారు. ఈ రెండు నాల్కల మాటలేల?. సినిమాలో.. మూల కథ శ్రీహరి నాను అని వేసాడనుకోండి. అయినా పోసాని అందించిన కథలు ఏమంత కళాఖండాలు కావు, భద్ర, బృందావనం, సింహ సినిమాలు మామూలు హిట్స్ ఏ కదా..!
Last Updated 30, Apr 2018, 2:51 PM IST | 0business
|
Visit Site
Recommended byColombia
బడ్జెట్ తదనంతర పరిణామాల కారణంగా ఆర్థికమాంద్యం తలెత్తినా.., ఇప్పటికే నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు కొరతతో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కుంటున్న మోడీ ప్రభుత్వానికి ఇది ఓ మాయని మచ్చలా మిగిలిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
నోట్ల రద్దు కారణంగా గతేడాది 7.6శాతంగా వున్న జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతానికి పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయని బ్లూమ్‌బర్గ్ జరిపిన ఓ ఎకనమిక్ సర్వే స్పష్టంచేసింది. బడ్జెట్ తదనంతర పరిణామాల కారణంగా ప్రైవేటు సెక్టారు మరింత ఆర్ధిక భారం మోయాల్సి వస్తే, అది ఆర్ధిక వృద్ధిని సైతం క్షణింపచేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అవసరమైతే, రాష్ట్రాలు ఎదుర్కునే రెవిన్యూ లోటుని పూడ్చడానికి మోడీ సర్కారు జీడీపీలోంచి 0.3 శాతం వెచ్చించి రాష్ట్రాలకి చెల్లించాల్సి వస్తుంది.
యూనివర్శల్ బేసిక్ ఇన్‌కమ్ విధానంపై చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 2వ దేశంగా పేరున్న భారత్‌కి ఆ విధానాన్ని అమలుచేయడం అత్యంత అసాధారణ విషయం అని చెబుతున్నారు హెఎస్‌బీసీలో ఆర్ధిక నిపుణుడిగా వున్న ప్రంజుల్ భండారి.
ఇవన్నీ ఇలా వుంటే, అతి త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై సైతం ఈ బడ్జెట్ ప్రభావం ఉండకపోదు అనేది ఇంకొందరి వాదన. ఇటువంటి తరుణంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పైనే ప్రస్తుతం అన్నివర్గాల దృష్టి నెలకొని వుంది. | 1entertainment
|
Suresh 177 Views
సానియా జోడీ ఓటమి
రియో డిజెనీరో: రియె ఒలింపిక్స్లో టెన్నిస్ విభాగంలో సానియా మిర్జా – ప్రర్థనాతోంబ్రే జోడీ ఓటమి పాలైంది. దీంతో భారత్కు నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో భారత తరపున బరిలోకి దిగదిన సానియా మిర్జా, ప్రార్థన తోంబ్రే జోడీ 6-7, 5-7, 7-5 తేడాతో చైనా క్రీడాకారిణులు జంగ్-పెంగ్ జోడీ చేతిలో ఓటమి పాలైంది. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘డియర్ కామ్రేడ్’ రీమేక్కు భారీ ధర.. బాలీవుడ్లో ఇదో రికార్డ్!
Vijay Deverakonda | విజయ్ దేరకొండ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా రీమేక్ రైట్స్కు దక్కనంత మొత్తం ‘డియర్ కామ్రేడ్’కు దక్కింది. ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu | Updated:
Jul 29, 2019, 02:16PM IST
‘డియర్ కామ్రేడ్’ రీమేక్కు భారీ ధర.. బాలీవుడ్లో ఇదో రికార్డ్!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ , కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా బాగుందని కొంత మంది అంటే.. బాలేదని మరికొందరు అంటున్నారు. సినిమా టాక్ ఎలా ఉన్నా దీని హిందీ రీమేక్ హక్కులకు పలికిన ధర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాను చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. ‘డియర్ కామ్రేడ్’ చాలా బాగుందంటూ కొనియాడారు. ఈ చిత్రాన్ని హిందీలో తానే రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
అయితే, ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్ హక్కుల కోసం కరణ్ జోహార్ ఏకంగా రూ.6 కోట్లు చెల్లించారని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే నిజమైతే.. ఇప్పటి వరకు బాలీవుడ్లో ఏ రీమేక్కు చెల్లించనంత ఎక్కువ మొత్తం కరణ్ జోహార్ చెల్లించినట్లవుతుంది. ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమా ‘సింబా’గా రీమేక్ చేశారు. ఇప్పుడు లారెన్స్ ‘కాంచన’ చిత్రాన్ని ‘లక్ష్మీ బాంబ్’గా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాల రీమేక్ హక్కులకు చెల్లించిన మొత్తం ప్రస్తుతం కరణ్ జోహార్ చెల్లించనదాని కన్నా చాలా తక్కువ అని అంటున్నారు.
వాస్తవానికి సాజిద్ నడియాద్వాలా, భూషణ్ కుమార్, మురద్ ఖేతాని, విజయ్ గలాని వంటి బడా నిర్మాతలు ‘డియర్ కామ్రేడ్’ రీమేక్ హక్కుల కోసం పోటీపడ్డారట. వీరందరికీ షాక్ ఇస్తూ కరణ్ జోహార్ రూ.6 కోట్ల భారీ ధరకు ‘డియర్ కామ్రేడ్’ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారట. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ మధ్య ఉన్న స్నేహం కూడా ఈ రీమేక్ హక్కులు కరణ్కు అందేలా చేసిందట. ఈ సినిమా హిందీ రీమేక్లో ఇషాన్ ఖట్టర్, జాన్వి కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా కోసం ఇంకా హీరోహీరోయిన్లను ఖరారు చేయలేదుని ఇటీవల కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.
All the best and big success to the team of #DearComradeOnJuly26th ! Also a CLARIFICATION! No lead actors have bee… https://t.co/HSvaI6Z7u8
— Karan Johar (@karanjohar) 1564048742000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
May 16,2015
ఎన్ఎండిసికి బిటి స్టార్ పిఎస్యు అవార్డు
హైదరాబాద్ : ప్రముఖ ఇనుప ఖనిజం ఉత్పత్తి సంస్థ ఎన్ఎండిసి లిమిటెడ్కు మహారత్న కేటగిరిలో ఈ ఏడాది బిటి స్టార్ పిఎస్యు అవార్డు లభించింది. ఈ అవార్డును అండమాన్ అండ్ నికోబర్ ఐస్లాండ్స్ లెప్టినెంట్ గవర్నర్ ఎకె సింగ్ ఎన్ఎండిసి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కొఠారీకి న్యూఢిల్లీలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవ వనరుల సహాయ మంత్రి రామ్ శంకర్ కథేరియా, నిర్వహణ కమిటీ ఛైర్మన్ భాస్కర ఛటర్జీ తదితరులు పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
నా హీరో సూపర్ - 'రా రండోయ్..వేడుక చూద్దాం' పాటల వేడుకలో నాగార్జున
Highlights
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్ ..వేడుక చూద్దాం'
కళ్యాణ్కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నాగచైతన్య, రకుల్ హీరో హీరోయిన్లు
చిత్ర ఆడియో వేడుకలో.. నా హీరో సూపర్ అని ప్రసంశించిన నిర్మాత కింగ్ నాగార్జున
యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కళ్యాణ్కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్ ..వేడుక చూద్దాం' సినిమా పాటల విడుదల కార్యక్రమం పాటల వేడుక చూద్దాం ఆదివారం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో జరిగింది. ఆడియో జ్యూక్ బ్యాక్స్ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. తొలి సీడీని కింగ్ నాగార్జున విడుదల చేసి తొలి సీడీని యువ సామ్రాట్ నాగచైతన్యకు అందజేశారు. ఈ సందర్భంగా...
మళ్ళీ వస్తున్నాం, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం
కింగ్ నాగార్జున మాట్లాడుతూ - ''ఒక సంవత్సరం మా అబ్బాయిలకు రెండు బ్లాక్బస్టర్స్ ఇస్తానని అభిమానులకు ప్రామిస్ చేశాను. అందులో ఒక బ్లాక్బస్టర్ 'రా రండోయ్ వేడుక చూద్దాం'.ఇక సెకండ్ హిట్ అఖిల్ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి చాలా మంచి కారణం. అందులో ముఖ్యుడు దేవిశ్రీప్రసాద్, తను ఎప్పుడూ నేను, తను చేసిన మన్మథుడు సినిమానే తన కెరీర్ స్టార్ట్ అయ్యిందని అంటుంటాడు. తను ఎప్పుడూ నా సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్తో పాటు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ సినిమాతో దేవిశ్రీప్రసాద్కు హ్యాట్రిక్ గ్యారంటీ. కళ్యాణ్కృష్ణ క్యారెక్టర్స్ను బాగా రాస్తాడు. నాకు బంగార్రాజు క్యారెక్టర్ను రాసినట్టే ఈ సినిమాలో భ్రమరాంబ క్యారెక్టర్ను రాశాడు. అలాగే శివ అనే క్యారెక్టర్లో చైతును ఆల్రౌండర్గా చూపించాడు. విశ్వేశ్వర్ ప్రతి సీన్ను అద్భుతంగా, అందంగా చూపించాడు. రకుల్ని ఇప్పటి వరకు గ్లామర్గా, మోడ్రన్గా చూసుంటారు. ఈ సినిమాలో మొండితనం, పెంకితనం ఉన్న భ్రమరాంబ క్యారెక్టర్లో చక్కటి పెర్ఫార్మెన్స్ చేసింది. ఇక చైతు గురించి చెప్పాలంటే కొడుకు గురించి తండ్రి పొగడ కూడదు. కానీ ఈ సినిమాకు నేను తండ్రిని కాను, నిర్మాతను. నిర్మాతగా చెబుతున్నాను. నా హీరో సూపర్. అభిమానులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమాలో కనపడతాడు. షర్ట్ బటన్స్ తెగిపోతాయి. ఈ సినిమా చూసిన వారందరూ చైతుతో లవ్లో పడతారు. సోగ్గాడే చిన్ని నాయనా సమయంలో నేను మేం మళ్ళీ వస్తున్నాం, కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని ఎలా చెప్పానో, అలాగే ఇప్పుడు చెబుతున్నాను. ఈసారి కూడా మేం వస్తున్నాం, కొడుతున్నాం. ఇది ఫిక్స్'' అన్నారు.
అభిమానులు నన్నెలా చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమా ఇది
అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ - ''అక్కినేని అభిమానులకు థాంక్స్. సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే వన్ మిలియన్ వ్యూస్ వచ్చింది. ప్రతి సాంగ్కు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. నేను చేసిన ఏ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రాలేదు. నాన్నకు, కళ్యాణ్కు థాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా చేసే ముందు కాస్తా టెన్షన్ పడ్డాను. ఇప్పటి వరకు ఒక సేఫ్జోనర్లో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు ఈ సినిమాతో కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నామని అనుకున్నాను. కానీ కళ్యాణ్ సినిమాను అద్భుతంగా తీశాడు. నాన్నగారైతే మనం సినిమాను తీసేటప్పుడు ఏ ఇన్టెన్షన్తో తీశారో, ఈ సినిమాను కూడా అదే ఇన్టెన్షన్తో చేశారు. నన్ను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్ళే సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సాంగ్స్తో పాటు అద్భుతమైన ఆర్.ఆర్ ఇచ్చాడు. మరో సూపర్హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. అభిమానులు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో, అలాంటి సినిమా ఇది'' అన్నారు.
చైతు నిజంగా బంగారమే
దర్శకుడు కళ్యాణ్కృష్ణ కురసాల మాట్లాడుతూ - ''నేను ఈ రోజు ఇలాంటి స్టేజ్పై నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం అక్కినేని నాగార్జునగారు. ఆయన్ను ప్రతి క్షణాన్ని, ఆయన ఇచ్చిన విలువైన సలహాలను నేనెప్పటికీ మరచిపోలేను. ఆయన రుణాన్ని జీవితాంతం తీర్చుకోలేను. నాగార్జునగారు నాకు బిగ్ బ్రదర్లాంటివారు. దేవిశ్రీప్రసాద్గారు చాలా మంచి మ్యూజిక్, ఆర్.ఆర్ ఇచ్చారు. చైతును అందరూ ఎందుకు అంత ఇష్టపడతారో ఈ సినిమాలో తనతో వర్క్ చేసిన తర్వాత తెలిసింది. చైతు నిజంగానే బంగారం. తను నాకు మంచి ఫ్రెండ్లా దొరికాడు. రకుల్ భ్రమరాంబ క్యారెక్టర్లో బాగా యాక్ట్ చేసింది. విసుగారు, గౌతంరాజుగారు, సాహిసురేష్గారు సహా అందరికీ థాంక్స్'' అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ - ''భ్రమరాంబ అనే క్యారెక్టర్ చేయడం నా అదృష్టం. ఇంత మంచి క్యారెక్టర్ నేను చేయడానికి కారణమైన డైరెక్టర్ కళ్యాణ్గారికి, నాగార్జునగారికి, నాగచైతన్యకు థాంక్స్. ఈ పాత్రలో ప్రేక్షకులు నన్ను గుర్తుపెట్టుకునేంత బావుంటుంది'' అన్నారు.
ఈ కార్యక్రమంలో సంపత్, సినిమాటోగ్రాఫర్ ఎస్.వి.విశ్వేశ్వర్, భాస్కరభట్ల, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.
యువసామ్రాట్ నాగచైతన్య, రకుల్ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్, కౌసల్య, ఇర్షాద్(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్, ఇష్క్ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్ప్లే: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్, ఎడిటింగ్: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్: రాజుసుందరం, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: రామ్లక్ష్మణ్, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్కృష్ణ కురసాల.
Last Updated 26, Mar 2018, 12:04 AM IST | 0business
|
Stewe
బిసిసిఐపై స్మిత్ అసంతృప్తి
న్యూఢిల్లీ: బిసిసిఐ తీరుపై ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్టు గత శనివారం ధర్మశాలలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మూడవ రోజు ఆటలో ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్,టీమిండియా ఆటగాడు జడేజా మధ్య మైదానంలో మాటల యుద్దం జరిగిన విషయం తెలిసిందే.
జడేజా-వేడ్ మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియోను బిసిసిఐ వెబ్సైట్లో ఉంచింది.దీనిపై ఆసీస్ సారథి స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఆటగాళ్ల మధ్య ఇలాంటి సంఘటను చోటు చేసుకోవడం సహజమే అని మ్యాచ్ ముగిసిన అనంతరం స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.ఈ తరహా సంఘటనలకు సంబంధించిన వీడియోలను అందుబాటులో ఉంచడం మంచి పద్దతి కాదు. ఈ సిరీస్లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయని వివరించాడు.చివరి టెస్టు మూడవ రోజు ఆట తొలి సెషన్లో లైయన్ వేసిన 103వ ఓవర్లో వేడ్,జడేజాను కవ్విస్తూ మాట్లాడాడు.వెంటనే జడేజా అంఫైర్ దగ్గరికి వెళ్లి వేడ్ ఆపకపోతే తాను మొదలుపెట్టాల్సి వస్తుందన్నాడు.అనంతరం అంపైర్లు సర్ధి చెప్పడంతో యాధావిధిగా మ్యాచ్ కొనసాగింది.ఆసీస్ రెండవ ఇన్నింగ్స్లో జడేజా-వేడ్ మధ్య చిన్న గొడవ జరిగింది.ఇద్దరు పరస్పరం దూషించు కున్నారు కూడా.మూడవ రోజు ఆట ముగిసిన అనంతరం వాగ్వాదం గురించి జడేజాని అడగ్గా మ్యాచ్ ముగిసిన అనంతరం ఖాళీ సమయంలో భోజనానికి వెళ్లామని వేడ్ని కోరినట్లు పేర్కొన్నాడు. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
పన్ను ఎగవేతలపై కేంద్రం దృష్టి
జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ తర్వాత కేంద్ర ప్రభుత్వం తదుపరి పన్ను ఎగవేతలపై దృష్టి సారించనుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది.
Samayam Telugu | Updated:
Apr 3, 2018, 04:54PM IST
<p>జీఎస్టీలో ఎగవేతలపై కేంద్రప్రభుత్వం<br></p>
జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ తర్వాత కేంద్ర ప్రభుత్వం తదుపరి పన్ను ఎగవేతలపై దృష్టి సారించనుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. మొదటి రెండేళ్లు జీఎస్టీ వసూళ్లు తక్కువ ఉంటాయని ముందుగానే ఊహించినప్పటికీ ఈ స్థాయిలో జీఎస్టీ పన్ను వసూళ్లు నిరాశజనకంగా ఉండటం ప్రభుత్వానికి ఎంతో నష్టం కలిగిస్తోంది. దీంతో మొదట్లో వ్యాపారులను ఇబ్బంది పెట్టకూడదని భావించి కొంత సమయం ఇచ్చిన తర్వాత ఇప్పుడు పన్ను ఎగవేతలపై భారీగా కన్నేసినట్లు తెలుస్తోంది. ఇక నుంచి నెలలో చివరి వారం పన్ను ఎగవేతదారులపై అధికారులు దాడి చేయడంతో పాటు సాంకేతికత ఉపయోగించి పన్ను ఎగవేతదార్లను గుర్తించడం జరుగుతుంది. ఇటీవలే ఏప్రిల్ 1 నుంచి ఈ-వే బిల్లులను సైతం కేంద్రం అమల్లోకి తెచ్చింది.
Visit Site
Recommended byColombia
ఈ-వే బిల్లుల రాకతో జీఎస్టీ వచ్చిన తర్వాత 9 నెలలు గడవడంతో ఇకపై పన్ను ఎగవేతలు అంత సులువు కాదని వ్యాపారులను కేంద్రం హెచ్చరిస్తోంది. పన్ను ఎగవేతల కోసం వ్యాపారస్థులు ఎలాంటి దారులు ఎంచుకుంటున్నారో తెలుసుకునేందుకు జీఎస్టీ సమాచార సాయంతో ఫ్రాడ్ అనలిటిక్స్ ప్రొవైడర్ల సాయం తీసుకుంటారు. జులై 1వ తేదీ ప్రారంభమైన జీఎస్టీ పన్ను వ్యవస్థలో వ్యాపారులు భారీగా పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. అయితే జీఎస్టీఎన్ నెట్వర్క్లో ఉన్న లోపాల కారణంగా వీటి పట్ల కేంద్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చింది. అయితే పన్ను ఎగవేతల కారణంగా కేంద్రానికి భారీగా ఆదాయం గండిపడుతుండటంతో ఐటీ, సీబీఈసీ, ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వంటి వివిధ విభాగాల సమన్వయంతో ఎక్కడ లోపం ఉంది, పన్ను ఎగవేతలకు ఎక్కడెక్కడ ఆస్కారం ఉందనే అంశాలను అధ్యయనం చేసింది. ఇప్పుడు పక్కా సమాచారంతో పన్ను ఎగవేతదార్లపై ఉక్కు పాదం మోపబోతున్నట్లు సమాచారం.
<p>జీఎస్టీలో ఎగవేతలపై కేంద్రప్రభుత్వం<br></p>
సోమవారం ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్టాడుతూ పన్ను వ్యవస్థ అమలును దారిలో తీసుకొచ్చినందున ఇకపై ప్రభుత్వం దృష్టి పన్ను వసూళ్లను పెంచడంపైనే ఉంటుందని చెప్పారు. ఇకపై పన్ను అధికారులు పన్ను ఎగవేతదారులపై దృష్టి సారిస్తారని వెల్లడించారు. అంతే కాకుండా వస్తువులను తరలించే వాహనాలు ఈవే బిల్లులు నిర్వహిస్తున్నాయో లేదో తెలుసుకుంటారని వివరించారు. ఈ-వే బిల్లు అంటే గూడ్స్ తరలించే వాహనాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డాక్యుమెంటేషన్. దీని ద్వారా ఎంత స్థాయిలో వస్తువులను తరలించేది కచ్చితమైన సమాచారం రికార్డు అయినట్లు అవుతుంది. ఇంతే కాకుండా కొనుగోలుదార్ల ఇన్వాయిస్లు, అమ్మకం దార్ల రివర్స్ చార్జీ మెకానిజమ్ వంటి వాటిని సరిచూస్తారు. ఎంతో మంది నమోదు కాని అమ్మకందార్లకు సంబంధించి నమోదిత కొనుగోలుదారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం చాలా వరకూ ప్రభుత్వానికి సమస్యగా తయారైంది. పన్ను ఎగవేతలకు దారులు మూసివేసే చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని కనిష్ట స్థాయికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఒక్కొక్కటిగా అస్త్రాలను బయటకు తీస్తోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Dec 08,2017
'నువొకొ విస్టాస్'కు ఫిక్కీ సీఎస్ఆర్ అవార్డు
న్యూఢిల్లీ : బిల్డింగ్ మెటీరియల్స్ తయారీ సంస్థల్లో ఒకటైన నువొకొ విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ 2016-17కు గాను మహిళాసాధికారికత విభాగంలో ఫిక్కీ సీఎస్ఆర్ జ్యూరీ రికమండేషన్ అవార్డును దక్కించుకున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ సీఎస్ఆర్ అవార్డ్స్ 16వ ఎడిషన్ లో ఈ అవార్డును పొందామని నువొకొ కంట్రీ సీఈవో ఉజ్వల్ బాత్రియా పేర్కొన్నారు. జీవనోపాధి సుస్థిరదాయక వనరుల్లో స్థానిక మహిళలను నిమగం చేస్తూ సంస్థ చేపట్టిన 'సమృద్ధి' ప్రాజెక్టుకు గాను ఈ అవార్డు లభించిందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కూర్చోబెట్టిన బౌలరే.. గెలిపించాడు..!
మొహాలి వన్డేలో రిజర్వ్ బెంచ్పై కూర్చోబెట్టిన బౌలరే .. విశాఖపట్నం వన్డేలో భారత్ జట్టుని గెలిపించాడు. ఆదివారం ముగిసిన
Rajendra G , Samayam Telugu | Updated:
Dec 17, 2017, 09:12PM IST
కూర్చోబెట్టిన బౌలరే.. గెలిపించాడు..!
మొహాలి వన్డేలో రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టిన బౌలరే .. విశాఖపట్నం వన్డేలో భారత్‌ జట్టుని గెలిపించాడు. ఆదివారం ముగిసిన ఈ వన్డేలో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ ‌చేసిన కుల్దీప్ యాదవ్ 42 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ ఆరంభంలోనే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ శతకానికి చేరువైన ఉపుల్ తరంగ (95: 82 బంతుల్లో 12x4, 3x6)ని తెలివైన బంతితో బోల్తా కొట్టించి మ్యాచ్‌ని మలుపు తిప్పిన కుల్దీప్ యాదవ్.. అనంతరం డిక్వెల్లా (8), అఖిల ధనంజయ (1)లను ఔట్ చేశాడు.
మ్యాచ్‌లో 3/42తో మెరుగైన ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా గత ఆదివారం జరిగిన తొలి వన్డేలో కనీసం ఒక ఓవర్‌ కూడా బౌలింగ్ చేయని కుల్దీప్ యాదవ్‌‌ని మొహాలి వన్డే జట్టు నుంచి టీమిండియా మేనేజ్‌మెంట్ తప్పించింది. దీంతో అతను రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవ్వగా.. వాషింగ్టన్ సుందర్‌కి అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో సుందర్‌ కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. దీంతో వైజాగ్‌ వన్డే‌లో మళ్లీ కుల్దీప్ యాదవ్‌కి అవకాశం దక్కగా మెరుగైన ప్రదర్శనతో ఈ చైనామన్ బౌలర్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌‌ని 2-1 తేడాతో దక్కించుకుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyderabad, First Published 7, Sep 2019, 3:10 PM IST
Highlights
సినిమా వార్తలను మిస్ అవుతున్నారా? అయితే ఎప్పటికప్పుడు టాప్ మూవీస్ న్యూస్ ని ఇక్కడ మీరు వీక్షించవచ్చు. జస్ట్ ఆర్టికల్ ఫొటో పై ఒక్క క్లిక్ చేస్తే చాలు..
మతిపోగొట్టే భంగిమలతో డాన్స్.. గాయాలపాలైన హీరోయిన్!
పొడుగు సుందరి వాణి కపూర్ ప్రస్తుతం తన కెరీర్ లో బిగ్గెస్ట్ చిత్రంలో నటిస్తోంది. క్రేజీ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న వార్ చిత్రంలో వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు.
చంద్రయాన్ 2: 'మహర్షి' డైలాగ్ తో ఇస్రోపై మహేష్ ప్రశంసలు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది మహేష్ మహర్షి చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.
చంద్రయాన్ 2: సిగ్గులేని చర్య అంటూ విరుచుకుపడ్డ మంచు మనోజ్!
యావత్ భారత దేశంతో పాటు, ప్రపంచం మొత్తం చంద్రయాన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. శనివారం తెల్లవారు జామున చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ చందమామపై దిగే మధుర క్షణాలని ఆస్వాదించేందుకు దేశ ప్రజలంతా ఎదురుచూశారు.
బిగ్ బాస్ : కింగ్ ఈజ్ బ్యాక్.. అందరికి ఒక రౌండ్ కోటింగ్!
కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా మళ్ళీ వచ్చేశాడు. గత వారం పుట్టినరోజు సందర్భంగా నాగార్జున ఫ్యామిలీతో కలసి వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనితో గత శని, ఆదివారాలు రోజు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హాట్ గా వ్యవహరించారు. నాగ్ వెకేషన్ నుంచి తిరిగి వచేసాడు. బిగ్ బాస్ హోస్ట్ గా వేదికపైకి ఎంటర్ అయిపోయాడు.
ట్రాఫిక్ రూల్స్.. సీఎంకి హీరోయిన్ కౌంటర్
ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చాలా వరకు దొరికితే ఎదో ఒక కోణంలో ఫైన్ ల ఉచ్చులో పడుతున్నారు . హెల్మెట్ లైసెన్స్ లేకుంటే సామాన్యుడి గుండెల్లో ఫైన్ లు భయాన్ని కలుగజేస్తోంది. అయితే అదే తరహాలో చాలా మంది ప్రభుత్వాలకు కౌంటర్లు ఇస్తున్నారు. రీసెంట్ గా ముఖ్యమంత్రిని ఒక హీరోయిన్ సోషల్ మీడియాలో కౌంటర్ వదిలారు.
చిరంజీవికి అరవింద స్వామి డబ్బింగ్..?
స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బ్లాక్ బస్టర్ తర్వాత ఫ్లాప్ డైరెక్టర్ తోనా.. రామ్ కొత్త సినిమా?
నేను శైలజ చిత్రం తర్వాత రామ్ నటించిన హైపర్, ఉన్నది ఒక్కటే జిందగీ, హాలోగురు ప్రేమ కోసమే లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న రామ్ కు ఇస్మార్ట్ శంకర్ రూపంలో సూపర్ హిట్ దక్కింది. ప్రస్తుతం రామ్ నటించబోయే తదుపరి చిత్రం వార్తలు వస్తున్నాయి.
లీక్: బన్ని ‘అల వైకుంఠపురములో’కథ ఇదే
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా ఈ సినిమా టీమ్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉండవచ్చు అనేది చర్చనీయాంశంగా మారింది.
Last Updated 7, Sep 2019, 7:38 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన భరత్.. శిరీష్ సినిమాలో ముఖ్య పాత్ర
‘రెడీ’ సినిమాలో చిట్టి నాయుడిగా మాస్టర్ భరత్ పండించిన కామెడీ తెలుగు ప్రజలను కడుపుబ్బా నవ్వించింది.
Samayam Telugu | Updated:
Jun 12, 2018, 06:52PM IST
‘రెడీ’ సినిమాలో చిట్టి నాయుడిగా మాస్టర్ భరత్ పండించిన కామెడీ తెలుగు ప్రజలను కడుపుబ్బా నవ్వించింది. బొద్దుగా ఉంటూ తన ఆకారంతో, తనదైన డైలాగ్ డెలివరీ, ముఖ కవలికలతో ప్రేక్షకులను అలరించాడు. బాలనటుడిగా సుమారు 50 చిత్రాల్లో నటించిన భరత్.. కొంత గ్యాప్ తరవాత ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాడు. అల్లు శిరీష్ హీరోగా తెలుగులో రూపొందిస్తోన్న ‘ఏబీసీడీ’ చిత్రంలో భరత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. స్లిమ్గా తయారైన భరత్.. శిరీష్ బెస్ట్ ఫ్రెండ్గా సినిమా ఆద్యంతం అలరించనున్నాడు. ఇన్నాళ్లు బాలనటుడిగా ఉన్న భరత్.. ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు.
వాస్తవానికి భరత్ తన సినిమాలో నటిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. అయితే భరత్ను చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. మీసాలు, గెడ్డాలతో షూట్లో స్లిమ్గా ఉన్న భరత్ను మాస్టర్ భరత్ అని అనుకోవడం కొంచెం కష్టమే మరి. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. సంజీవ్రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర ఎంటర్టైన్మెంట్ పతాకంపై మధుర శ్రీధర్, బిగ్బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతం అందిస్తున్నారు.
Master Bharath will be seen in a full length role as my best friend in ABCD. He transitions from child artiste to a… https://t.co/04gfYIPde2
— Allu Sirish (@AlluSirish) 1528691910000 | 0business
|
నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పాటిల్, నాజర్, తనికెళ్ల భరణి, పృథ్వీ
సంగీతం : మిక్కీ జె మేయర్
దర్శకత్వం : శ్రీను వైట్ల
నిర్మాత : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
ఏసియానెట్ రేటింగ్- 2.5
కథ :
చై అలియాస్ పిచ్చయ్య నాయుడు స్పెయిన్ లో అతని అమ్మా నాన్నలతో కలిసి ఉంటుంటాడు. అక్కడికి వచ్చిన మీరాను చూసి ప్రేమలో పడతాడు. కానీ మీరా అప్పటికే మరో వ్యక్తితో ప్రేమలో ఉందని తెలుసుకుని బాధ పడతాడు. అయితే మీరా తిరిగి ఇండియాకి వెళ్లాక తన ప్రియుడుతో తన పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పెయిన్ లో ఉన్న స్నేహితుడు చైకి ఫోన్ చేస్తుంది. దీంతో ప్రేమలో ఓడిపోతే ఉండే బాధ తనకు తెలుసు కాబట్టి తను ప్రేమించిన మీరా కోసం చై ఇండియాకి వచ్చి మీరా ప్రేమను గెలిపించాలని ప్రయత్నిస్తుంటాడు. అలా మీరా కోసం ఇండియా వచ్చిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) ప్రవేశిస్తుంది. అసలు మీరా ప్రేమకథలో సమస్య ఏంటి..? చై జీవితంలోకి వచ్చిన చంద్రముఖి ఎవరు..? ఇండియాలో ఉండే తన తాతకు చై ఎందుకు దూరమయ్యాడు..? రాహుల్ వడయార్ ఆట ఎలా కట్టించాడు..? చివరకు చై.. మీరా, చంద్రముఖిలలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
తొలి సినిమా నుంచే నటుడిగా మంచి మార్కులు సాధిస్తూ వస్తున్న వరుణ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో మెప్పించే ప్రయత్నం చేశాడు. లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంటుంది. అమాకత్వం, ప్రేమ, బాధ, భయం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హెబ్బా పటేల్ కూడా అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. ప్రతినాయక పాత్రలో నికితిన్ ధీర్ డీసెంట్ లుక్స్ లో కనిపిస్తూనే క్రూయల్ విలన్ గా మెప్పించాడు. ఇతర పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, నాజర్, తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, చంద్రమోహన్, హరీష్ ఉత్తమన్, రాజేష్, 30 ఇయర్స్ పృధ్వీ ఇలా తెర నిండా కనిపించిన నటులు పరవాలేదనిపించారు.
సాంకేతిక నిపుణులు :
లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కించిన ఈ సినిమాతో శ్రీను వైట్ల ఎక్కువగా రిస్క్ చేయకుండా తన రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. విదేశాల్లో కామెడీ ఎపిసోడ్స్, పేరడీ సీన్స్, సినిమా వాళ్ల మీద పంచ్ డైలాగ్స్, పదుల సంఖ్యలో విలన్స్ ఇలా శ్రీను గత సినిమాల్లో కనిపించిన మాసాలా ఎలిమెంట్స్ అన్నీ మిస్టర్ లోనూ కనిపించాయి. ఫస్ట్ హాఫ్ లో స్పెయిన్ అందాలతో పాటు కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబుల ఊపిరి పేరడీ నవ్విస్తుంది. బాహుబలి సినిమా ప్రభావం కూడా ఈ సినిమాపై బాగానే కనిపించింది.
ఫస్ట్ హాఫ్ లో అసలు కథలోకి వెళ్లకుండా కామెడీ, రొమాంటిక్ సీన్స్ తో కథ లాగించేసిన దర్శకుడు సెకండాఫ్ ను హడావిడిగా నడిపించాడు. వరుసగా తెరమీదకు వచ్చే కొత్త పాత్రలు, మలుపులు ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తాయి. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు కొంత పరవాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కెవి గుహన్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ అయ్యింది. స్పెయిన్ లోకెషన్స్ ను మరింత అందంగా చూపించిన గుహన్, చేజ్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
హీరో హీరోయిన్ల నటన, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
లెక్కలేనన్ని మలుపులు, పాటలు, క్లైమాక్స్
చివరగా... మిస్టర్ శ్రీను వైట్ల రొటీన్ సినిమా
Last Updated 25, Mar 2018, 11:52 PM IST | 0business
|
Hyderabad, First Published 5, Nov 2018, 10:51 AM IST
Highlights
టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి హెబ్బా పటేల్ కి ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆమె నటిస్తోన్న సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెని హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.
టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి హెబ్బా పటేల్ కి ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆమె నటిస్తోన్న సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెని హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.
ఈ క్రమంలో ఆమెకి అరుణ్ ఆదిత్ సరసన '24 కిస్సెస్' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఘాటు రొమాంటిక్, ముద్దు సీన్లలో అమ్మడు నటించింది.ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకి భారీ స్పందన లభించింది.
బోల్డ్ కంటెంట్ తో ఉన్న ట్రైలర్ కి 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 23న హెబ్బా 24 ముద్దులతో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 'మిణుగురులు' లాంటి అవార్డు విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రావు రమేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి.. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
నాలుగేళ్లలో టీమిండియా 158 మ్యాచ్లు..!
భారత్ జట్టుపై మ్యాచ్ల భారం తగ్గించేందుకు బీసీసీఐ కొత్త ప్రతిపాదనని తెరపైకి తీసుకొచ్చింది. జట్టు బిజీ షెడ్యూల్ని
TNN | Updated:
Dec 11, 2017, 02:25PM IST
నాలుగేళ్లలో టీమిండియా 158 మ్యాచ్లు..!
భారత్ జట్టుపై మ్యాచ్‌ల భారం తగ్గించేందుకు బీసీసీఐ కొత్త ప్రతిపాదనని తెరపైకి తీసుకొచ్చింది. జట్టు బిజీ షెడ్యూల్‌ని సవరించాలని కోరుతూ.. ఇటీవల కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి తమ అభిప్రాయాలను బీసీసీఐ పాలకుల కమిటీ‌కి చెప్పిన విషయం తెలిసిందే. ఈ అభ్యర్థనపై ఢిల్లీలో సోమవారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అధికారులు చర్చించి షెడ్యూల్‌ని కొంతమేర మార్చారు.
ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం భారత్ జట్టు 2019 -2023 మధ్య కాలంలో మొత్తం 158 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 85 సొంతగడ్డపై కాగా.. 73 మ్యాచ్‌లు విదేశీ గడ్డపై జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల్ని ఫార్మాట్ ఆధారంగా విడదీస్తే.. 37 టెస్టులు, 67 వన్డేలు, 54 టీ20లుగా షెడ్యూల్‌ రూపొందించారు.
పాత షెడ్యూల్ ప్రకారంగా భారత్ జట్టు సొంతగడ్డపై మాత్రమే 36 టెస్టులు, 73 వన్డేలు, 18 టీ20 ఆడాల్సి ఉండేది. కానీ.. తాజాగా సవరించిన షెడ్యూల్‌లో సొంతగడ్డపై 19 టెస్టులు, 38 వన్డేలు, 28 టీ20లకే పరిమితం చేశారు. ఇందులో టీ20లు మినహా.. మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ మ్యాచ్‌లను దాదాపు సగానికి తగ్గించేశారు.
బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకి తగినంత విశ్రాంతి దొరకడం లేదని.. సమయాభావం వల్ల సిరీస్‌లకి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధత కాలేకపోతున్నట్లు కెప్టెన్ కోహ్లి కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ సీజన్లకి ముందు, తర్వాత ఉన్న మ్యాచ్‌లపైనే ఎక్కువ కోత విధించినట్లు తెలుస్తోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
దిగివస్తున్న బ్యాంకులు
- కనీస వడ్డీరేట్లలో కోతలు
ముంబయి: రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును తగ్గిస్తూ తన ద్రవ్య పరపతి విధానాన్ని మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటనను వెలువరించాయి. దీంతో గృహ, వాహన రుణాలు తీసుకున్న వారికి కొంత ఊరట లభించినట్లయింది. ఫ్రభుత్వ రంగంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రుణాలపై కనీస వడ్డీరేటును 9.85 శాతం నుంచి 9.70 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు ఈ నెల 8వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. ఎస్బీఐ గత రెండు నెలల కాలంలో వడ్డీరేట్లను తగ్గించడం ఇది రెండో సారి. అదే బాటలో అలహాబాద్ బ్యాంక్: మరో ప్రభుత్వ రంగ బ్యాంకు అలహాబాద్ బ్యాంక్ సైతం ఎస్బీఐ బాటలోనే తమ కనీస వడ్డీరేటును 0.3 శాతం మేర తగ్గించింది. దీనికి తోడు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, దేనా బ్యాంకులు సైతం తమ వడ్డీరేట్లను 0.25 శాతం మేర తగ్గించుకొని 10 శాతంగా నిర్ణియించినట్లు ప్రకటించాయి. తాజా తగ్గింపుతో అలహాబాద్ బ్యాంక్ వడ్డీరేటఉ 10.25% నుంరి 9.95 శాతానికి దిగి వచ్చింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
sandhya 153 Views Angelo Mathews , Dhananjaya Desilva , SRILANKA vs INDIA
SRILANKA vs INDIA
లీడ్స్: శ్రీలంక, భారత్ మ్యాచ్లో శ్రీలంక 40 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. బుమ్రా రెండు వికెట్లు, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు ఒక్కో వికెట్ తీశారు. వెంటవెంటనే 4 వికెట్లు పడినా తర్వాత నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం క్రీజులో ఏంజిలో మాథ్యూస్(85), ధనుంజయ డి సిల్వా(6)లు ఉన్నారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/ | 2sports
|
Recommended byColombia
ఎంత టీడీఎస్ కట్ చేశారో ఎలా తెలుసుకోవడం..
పన్ను చెల్లింపుదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో అనేక రకాల ఆదాయాలను పొందుతారు. అందులో చాలా వాటిపై టీడీఎస్ కట్టాల్సి వస్తుంది. అయితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ మినహాయంచిన సంస్థల నుంచి సంబంధిత సర్టిఫికెట్లు తీసుకుంటే ఎంత టీడీఎస్ చెల్లించారో తెలుస్తుంది. లేకపోతే ఆదాయపు పన్ను వెబ్సైట్ల నుంచి 26 ఏఎస్ ఫారంను డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో సైతం అన్ని వివరంగా ఉంటాయి.
మూలం వద్ద పన్ను
టీడీఎస్ మినహాయింపు గురించి ఉద్యోగులు ఎలా తెలుసుకోవాలి?
* ఆదాయపు పన్ను శాఖ ఈ_ఫైలింగ్ వెబ్సైట్లో త్రైమాసికానికి ఒకసారి టీడీఎస్ వివరాలను చూడొచ్చు
* మీ లాగిన్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వివరాల సాయంతో ఐటీ శాఖ వెబ్సైట్లో లాగిన్ అవ్వొచ్చు.
* లాగిన్ అయిన తర్వాత ఫారం 26ఏఎస్ పైన క్లిక్ చేయండి. తర్వాత అది మిమ్మల్ని ట్రేసెస్ వెబ్సైట్లోకి తీసుకెళుతుంది
* టాక్స్ క్రెడిట్(ఫారం 26ఏఎస్) ఆప్షన్ పైన క్లిక్ చేసి ట్రేసెస్ వెబ్సైట్ నుంచి ఫారం 26ఏఎస్్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
* నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే, ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి వెళ్లకుండానే ఈ ఫారంను పొందవచ్చు.
* నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్న పాన్ కార్డు హోల్డర్లు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫారం 26ఏఎస్ను తెచ్చుకోవచ్చు. ఇందుకోసం నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన తర్వాత అక్కడ ఆప్షన్లలోంచి ఫారం 26 ఏఎస్ అనే దాన్ని ఎంపిక చేసుకోవాలి,
* పన్ను చెల్లింపుదార్ల మొబైల్ నంబరుకు సైతం సంక్షిప్త సందేశం రూపంలో ఈ సమాచారం అందుతుంది. అయితే ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో సరైన మొబైల్ నంబర్ ఇచ్చి ఉండాలి.
* ఎక్కడా తప్పు జరగకూడదంటే సరైన మొబైల్ నంబరు, సరైన పాన్ నంబర్ ఇవ్వాలి.
* ఏదైనా తప్పు జరిగినట్లు ఉద్యోగి దృష్టికి వస్తే వెంటనే మీ సంస్థకు తెలియజేసి, సవరించిన ఫారం 16ను పొందాలి. | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
డిజిటల్ చెల్లింపుల్లో వృద్ధి అంతంతే!
- లావాదేవీల్లో ఇప్పటికీ 'నగదు'దే కీలక పాత్ర
- ప్రభుత్వ అంచనాలు ఫ్లాప్
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: నోట్ల రద్దు ప్రక్రియ ద్వారా డిజిటల్ చెల్లింపులను భారీగా పెంచుతామన్న మోడీ సర్కార్ లక్ష్యం నీరుగారింది. దేశ వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా గతేడాది కేంద్రం తీసుకున్న చర్య వల్ల ఒరిగిందేమీ లేదని వివిధ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది నుంచి కూడా డిజిటల్ చెల్లింపుల్లో అనుకున్నంత పెద్ద పురోగతి లేకపోయింది. పైగా లావాదేవీల్లో ఇప్పటికీ నగదు కీలకపాత్ర పోశిస్తూ రారాజుగా ఉందని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. డెబిట్ కార్డు, వాలెట్, నాన్ యూపీఐ బ్యాంకింగ్ యాప్స్, ఆధార్ అధారిత తదితర డిజిటల్ చెల్లింపుల్లో పెద్ద వృద్ధి లేదని స్పష్టం చేస్తున్నాయి. 2017 ఆగస్టులో రూ.200 ట్రిలియన్ల డిజిటల్ చెల్లిం పులు జరిగాయి. 2016 ఆగస్టు మాసం చెల్లింపులతో పోల్చితే ఈ చెల్లింపుల్లో కేవలం 5 శాతం మాత్రమే పెరుగుదల చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్ చెల్లింపులతో పోల్చితే 0.7శాతం తగ్గుదల నమోద య్యింది. పైగా కొన్ని కేటగిరీల్లో డిజిటల్ చెల్లింపులు భారీగా పడిపోయాయి. గతేడాది ఆగస్టు మొబైల్ బ్యాంకింగ్ చెల్లింపులతో పోల్చితే ఏకంగా 30 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. కాగా పెద్ద నోట్ల రద్దు సమ యం నాటి లావాదేవీలతో పోల్చితే 46 శాతం లావాదే వీలు పెరిగి రూ.1.5 ట్రిలియన్లకు చేరాయి. గత ఆగస్టు లో డెబిట్ కార్డు చెల్లింపులు 2.2 శాతం తగ్గి రూ. 2,706 బిలియన్లకు పరిమితమ య్యాయి. అదే 2016 అక్టోబర్లో ఈ విలువ రూ.2,767 బిలియన్లుగా ఉంది.
మొత్తం ఆన్లైన్ చెల్లింపుల్లో మొబైల్ బ్యాంకింగ్ వాటా 0.33 శాతంగా ఉంది. దీని విలువ రూ.799.13 బిలియన్లుగా ఉంది. పేటీయం, మొబిక్విక్, పలు బ్యాంకుల యాప్స్ తదితర మొబైల్ వ్యాలెట్ చెల్లింపుల విలువ రూ.102.88 బిలియన్లతో కేవలం 0.051 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2016 ఆగస్టులో వీటి వాటా ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. కాగా నవంబర్ 2016 నాటి చెల్లింపులతో పోల్చితే గత ఆగస్టులో మొబైల్ బ్యాంకింగ్ చెల్లింపుల్లో స్వల్పంగా 0.37 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. గతేడాది ఆగస్టుతో పోల్చితే ప్రస్తుత ఏడాది ఇదే మాసంలో ఆర్టీజీఎస్, చెక్కుల చెల్లింపుల్లో మాత్రం 5-15 శాతం పెరుగుదల నమోదయ్యింది. వ్యాపారస్తులు అత్యధికంగా ఆర్టీజీఎస్ చెల్లింపులు జరపడంతో ఈ విభాగంలో 15.5 శాతం పెరుగుదల నమోదయ్యింది. నోట్ల రద్దు తర్వాత ఈ చెల్లింపుల్లో 11 శాతం పెరుగుదల ఉంది. స్థూలంగా డిజిటల్ చెల్లింపుల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
SENSEX
వారం మొత్తం నష్టాలు ఒడిదుడుకులే!
ముంబై, డిసెంబరు 24: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారంలో అత్యధిక శాతం నష్టాలు చవిచూసాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్షేర్లు భారీ అమ్మకాలతో సతమతం అయ్యాయి. విదేశీ మార్కెట్ ధోరణులు ప్రోత్సాహకరంగా కొనసాగి నా దేశీయంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విక్రయాలు జోరందు కోవడంతో ప్రతికూలంగా మారాయి. 2017 ఏప్రిల్ నుంచి అమలుచేయాలని కేంద్రం నిర్ణయించిన జిఎస్టి బిల్లుకు తుది అనుమతి ఆల స్యం అవుతుండటం కూడా సెంటి మెంట్ను బలహీనపరిచిందని తెలుస్తోం ది. గతవారం 449పాయింట్ల వద్ద సెన్సె క్స్ పతనం అయి 26,041 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి కూడా 154 పాయింట్లు దిగజారి 7986 పాయింట్లవద్ద స్థిర పడింది.
మొత్తంగాచూస్తే నిఫ్టీ 8వేల పాయింట్ల మైలురాయి దిగువన స్థిరపడితే వారం మధ్యలో సెన్సెక్స్కూడా 26 వేల కీలకస్థాయిని కోల్పోయిం ది. గతవారం చిన్నషేర్లలో అమ్మకాలు జోరందుకోవ డంతో బిఎస్ఇ మిడ్క్యాప్సూచి నాలుగుశాతం పడిపోయింది. 11,761 పాయింట్ల వద్ద స్థిరపడింది. స్మాల్క్యాప్సూచి 2.6శాతం పతనం అయి 11,797 పాయింట్ల వద్ద నిలిచింది. రంగాలవారీగా చూస్తే హెల్త్కేర్, మెటల్ 4.25శాతం చొప్పున దిగజారితే బ్యాం కింగ్ 2.65శాతం, ఆటో 1.7శాతం చొప్పున క్షీణించా యి. ఇక బ్లూచిప్ కంపెనీలపరంగాచస్తే యాక్సిస్ బ్యాంకు 7.3శాతం, అదానిపోర్టులు 6.2శాతం, స్టేట్ బ్యాంకు 6శాతం చొప్పున పడిపోయాయి. టాటా స్టల్ 5.7శాతం, భారతి ఎయిర్టెల్ 4.7శాతం, ఒఎన్జిసి 4.3శాతం చొప్పున క్షీణించాయి. గెయిల్ 4శాతం సిప్లా 3శాతం చొప్పున పుంజు కున్నాయి.
గడచిన రెండునెలలుగా అమ్మ కాలకే ప్రాధాన్యం ఇస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గతవారం కూడా అదే బాటలో సాగాయి. దీనితో డిఎంబరులో ఇప్పటివరకూ దేశీయ స్టాక్స్లో ఎఫ్ఐఐ ల అమ్మకాలు దాదాపు 26,500 కోట్లకు చేరాయి. వీటితో గడచిన శుక్రవారమే రూ.1643 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వారాం తంలో మాత్రం స్టాక్ మార్కెట్లు కొంతమేర రికవరీ అయ్యాయి. ఏడు రోజులుగా కొనసాగిన నష్టాల నుంచి కొంతమేర కోలుకున్నాయనే చెప్పాలి. | 1entertainment
|
Hyderabad, First Published 1, Feb 2019, 12:42 PM IST
Highlights
దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో హరికృష్ణ పాత్రను పాజిటివ్ యాంగిల్ లోనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఎప్పుడూ తోడుగా ఉండే హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో మాత్రం హరికృష్ణను విలన్ గా చూపించబోతున్నారని టాక్.
దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో హరికృష్ణ పాత్రను పాజిటివ్ యాంగిల్ లోనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఎప్పుడూ తోడుగా ఉండే హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు.
అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో మాత్రం హరికృష్ణను విలన్ గా చూపించబోతున్నారని టాక్. దర్శకుడు వర్మ రూపొందిస్తోన్న ఈ సినిమాని ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా విడుదల ఆపడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.
కానీ వర్మ మాత్రం సైలెంట్ గా తన పని కానిచ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ అసలైన బయోపిక్ ఇదేనని వర్మ చెబుతున్నప్పటికీ సినిమా మొత్తం లక్ష్మీపార్వతి చుట్టూ తిరగనుంది. ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్న తరువాత ఎన్టీఆర్ కుటుంబం అతడికి దూరమైంది.
పార్టీ వ్యవహారాల్లో, కుటుంబ విషయాలకు సంబంధించి లక్ష్మీపార్వతి జోక్యం చేసుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ, అతడి కుమారులు లక్ష్మీపార్వతిపై ఆగ్రహాన్ని ప్రదర్శించేవారట. ముఖ్యంగా హరికృష్ణ చాలాసార్లు లక్ష్మీపార్వతికి వార్నింగ్ ఇచ్చారట. ఆ సన్నివేశాలను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో చూపించబోతున్నారని సమాచారం. '
ఇవి కూడా చదవండి.. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఫ్యాన్స్కు తేరుకోలేని షాకిచ్చిన సన్నీలియోన్!
సన్నీలియోన్ ఈ పేరు తెలియని యువత లేదనడంలో అతిశయోక్తి లేదు. సినిమాల్లోకి రాక ముందే సన్నీకి మంచి క్రేజ్ ఉంది.
| Updated:
Jul 11, 2016, 04:35PM IST
సన్నీలియోన్ ఈ పేరు తెలియని యువత లేదనడంలో అతిశయోక్తి లేదు. సినిమాల్లోకి రాక ముందే పోర్న్ స్టార్గా సన్నీకి మంచి క్రేజ్ ఉంది. ఎప్పుడైతే 'జీస్మ్ 2' చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటినుండే ఈ భామకు ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే తన అభిమానులకు షాక్ ఇచ్చే విధంగా సన్నీ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏంటి.. అనుకుంటున్నారా ..? నిన్నటివరకు తన అందాల ఆరబోతతో యువ హృదయాల్లో సంతకం చేసిన ఈ భామ త్వరలోనే సినిమాలకు గుడ్బై చెప్పాలనుకుంటోందట. ఇటీవల ఓ మీడియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. సినిమాలనేవి సంపాదన కోసం మాత్రమే.. పేరు మాత్రం ఉండదు. వ్యక్తిగా నాకంటూ ఓ పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను. అందుకే త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి మంచి బిజినెస్ మొదలు పెట్టబోతున్నానని స్పష్టం చేసింది. ఈ మాటలు విన్న సన్నీ అభిమానులు మాత్రం ఇంకా ఈ షాక్ నుండి తేరుకోలేకపోతున్నారు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
దేశవాళీ క్రికెట్లో మయాంక్ పరుగుల వరద..!
దేశవాళీ క్రికెట్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. సౌరాష్ట్రతో మంగళవారం జరుగుతున్న విజయ్
TNN | Updated:
Feb 27, 2018, 12:00PM IST
దేశవాళీ క్రికెట్లో మయాంక్ పరుగుల వరద..!
దేశవాళీ క్రికెట్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. సౌరాష్ట్రతో మంగళవారం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ (90: 79 బంతుల్లో 11x4, 3x6) అర్ధశతకం బాది ఓ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. కర్ణాటకకి చెందిన ఈ యువ ఓపెనర్ 2017-18 సీజన్‌లో అసాధారణ ఫామ్‌ని కొనసాగిస్తూ ఇప్పటికే 2,000 పరుగులు పూర్తి చేశాడు.
Visit Site
Recommended byColombia
దేశవాళీ క్రికెట్‌లో ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇప్పటి వరకు శ్రేయాస్ అయ్యర్ 1,947 పరుగులతో ఉన్నాడు. అతను 2015-16 సీజన్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. తాజాగా ఆ రికార్డ్‌ని మయాంక్ అగర్వాల్ కనుమరుగు చేసి అగ్రస్థానానికి ఎగబాకాడు. మూడో స్థానంలో వసీం జాఫర్ ఉన్నాడు. అతను 2008-2009 సీజన్‌లో 1,907 పరుగులు చేశాడు.
ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో చోటు సంపాదించగా.. ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్‌‌కి ప్రకటించిన జట్టులో మయాంక్ అగర్వాల్‌కి చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ.. సెలక్టర్లు ఈ యువ ఓపెనర్‌కి మొండిచేయి చూపారు. శ్రీలంక వేదికగా మార్చి 6 నుంచి జరగనున్న ఈ టోర్నీకి కోహ్లి, ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్, బుమ్రా, చాహల్‌కి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. యువ క్రికెటర్లకి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?
Highlights
నెగెటివ్ షేడ్ లో తారక్
రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతోన్న జూనియర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ లు ఒకే తెరపై చూడాలని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు.
దీంతో సినిమాకు సంబందించిన ఎలాంటి న్యూస్ అయినా బయటకు వచ్చిన అభిమానులు వెంటనే తెలుసుకుంటున్నారు. ఆ తరువాత సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలవుతున్నాయి. ప్రస్తుతం కూడా మరో వార్త హాట్ టాపిక్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ న్యూస్ వింటే ఎవ్వరైనా సరే చర్చించకుండా ఉండలేరు. ఎందుకంటే తారక్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది. చాలా వరకు తారక్ క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ కనిపిస్తాయట.
ఇంతకుముందు జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ రావణా అంటూ జై పాత్రలో భయంకరంగా కనిపించిన సంగతి తెలిసిందే. కానీ అది ఓ సైడ్ నుంచి ఆలోచిస్తే పాజిటివ్ అండ్ స్టైలిష్ క్యారెక్టర్. మాస్ ఆడియెన్స్ కి బాగా నచ్చేసింది. ఇక రాజమౌళి కూడా #RRR లో తారక్ క్యారెక్టర్ ను అలా నెగిటివ్ షేడ్స్ ఉండేలా డిజైన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నాయి. ఫుల్ స్క్రిప్ట్ పూర్తవ్వగానే చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలను తెలియజేయనుంది. | 0business
|
Hyd Internet 75 Views Vodafone
Vodafone
ప్రముఖ టెలికాం రంగ సంస్థ వొడాఫోన్ మరో ఆఫర్తో తమ వినియోగదారుల ముందుకు వచ్చింది. రూ.458తో రీఛార్జ్ చేయించుకుంటే అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు, 1జీబీ 3జీ లేక 4జీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు ఉంటుంది. ఇవే సౌకర్యాలతో రూ.509 ప్లాన్ కూడా ప్రకటించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ల ద్వారా రోజుకు గరిష్టంగా 250 నిమిషాల వరకు, వారానికి 1 వేయి నిమిషాల వరకు లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఇటువంటి ఆఫర్లే ఇతర టెలికాం కంపెనీలు కూడా అందిస్తోన్న విషయం తెలిసిందే. మార్కెట్లో రిలయన్స్ జియో అందిస్తోన్న ఆఫర్ల జోరుతో తమ వినియోగదారులు జారి పోకుండా ఉండేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడా అచ్చం అలాంటి ఆఫర్లనే అందిస్తున్నాయి. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
విరివిగా ఆరబోస్తూ.. డోస్ పెంచిన హాట్ బ్యూటీ
Web Title:telugu beauty sanjana naidu latest hot photos
( Telugu News from Samayam Telugu , TIL Network)
1/15
విరివిగా ఆరబోస్తూ.. డోస్ పెంచిన హాట్ బ్యూటీ
మీ కామెంట్ రాయండి
హాట్ హాట్ ఫోజులతో మరోసారి కాకరేపింది హాట్ మోడల్ సంజనా నాయుడు. తెలుగులో ఒక్క చాన్స్ ఒకే ఒక్క చాన్స్ అంటూ.. విరివిగా అందాలు ఆరబోసి హీరోయిన్ ఆఫర్ని అందుకోవడానికి చాలా మంది హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. తాజాగా టాలీవుడ్లో హీరోయిన్గా నిలదొక్కుకునేందుకు సంజనా నాయుడు అనే మోడల్ ఫోటో షూట్తో రచ్చ చేసింది. భారీ అందాలతో కాకరేపే సోకులతో షాక్ ఇచ్చింది. సంజనా నాయుడు లేటెస్ట్ హాట్ ఫోటోలు మీకోసం..
సమయం తెలుగు న్యూస్ అలెర్ట్కు సబ్స్క్రైబ్ అవ్వండి
సమయం తెలుగు నుంచి బ్రేకింగ్ న్యూస్, టాప్ స్టోరీల నోటిఫికేషన్లను తక్షణమే పొందండి
ఇప్పుడు వద్దు | 0business
|
Hyd Internet 75 Views kent logo
kent logo
రివర్స్ ఆస్మోసిస్ (ఆర్ఒ) వాటర్ ప్యూరిఫైర్స్ మార్కెట్లో ఉన్న కెంట్ ఆర్ఒ సిస్టమ్స్ లిమిటెడ్ మరిన్ని సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఆర్ఒ వాటర్ ప్యూరిఫైర్స్కు తోడు వాక్యూమ్ క్లీనర్లు, ఎయిర్ ప్యూరిఫైర్స్, షూ సోల్ క్లీనర్, రైస్ కుక్కర్లు, గ్రైండర్లు విడుదల చేస్తున్నట్టు కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) మహేశ్ గుప్తా విలేకరులతో చెప్పారు. ఆధునిక భారతీయ గృహాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్పత్తులను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ‘వాటర్ ప్యూరిఫైర్స్ మార్కెట్లో ఇప్పటికే మాకు 35 శాతం వాటా ఉంది. కొత్త ఉత్పత్తుల విషయంలోనూ మంచి మార్కెట్ వాటా సాధిస్తామని భావిస్తున్నాం’ అన్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ.850 కోట్లున్న టర్నోవర్ ఈ సంవత్సరం రూ.950 కోట్లకు చేరుతుందని కంపెనీ భావిస్తోంది. జిఎ్సటితో తమ ఉత్పత్తులపై పన్నుల భారం 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గినట్టు సిఎండి చెప్పారు. నాలుగైదు సంవత్సరాల తర్వాత అప్పటి మార్కెట్ అవసరాలను బట్టి దక్షిణ భారత్లో ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని కంపెనీ భావిస్తోంది.
రూ.60 కోట్ల వ్యాపారం
ఎపి, తెలంగాణల్లోనూ కంపెనీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని సిఎండి గుప్తా చెప్పారు. ప్రస్తుతం తమ మొత్తం టర్నోవర్లో తెలుగు రాష్ట్రాల నుంచి రూ.60 కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నట్టు తెలిపారు. దేశంలో మొత్తం మీద 12,000 మంది డీలర్లు ఉంటే అందులో 600 మంది ఎపి, తెలంగాణల్లో ఉన్నట్టు చెప్పారు. త్వరలో దేశ వ్యాప్తంగా 100 కెంట్ ఎక్స్పీరియన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీకి చెందిన అన్ని ఉత్పత్తులు ఈ కేంద్రాల్లో లభిస్తాయని సిఎండి తెలిపారు. | 1entertainment
|
internet vaartha 151 Views
హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు మరింత ఉపాధినిచ్చేందుకుగాను టాటా గ్రూప్, క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబేర్ టెక్నాలజీస్ భాగస్వామ్యం వహించాయి. దేశవ్యాప్తంగా ఉబేర్ డ్రైవర్లు వారే సొంతంగా కార్లు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా అతితక్కువ అందుబాటుధరల్లో ఇఎంఐలలో కార్లకొనుగోలుకు వారికి సాయం అందిస్తోంది. దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కార్లు కొనుగోలుచేసిన కొందరు ఉబేర్డ్రైవర్లను పరిచయం చేసింది. ఉబేర్ ఏసియా బిజినెస్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్, టాటాసన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మధు కన్నన్ మాట్లాడుతూ టాటాఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికే ఉబేర్లో పెట్టుబడులు పెట్టిందని, కస్టమర్లకు మరిన్ని సేవలందించే లక్ష్యంతో ఇండికా, ఇండిగో టాటా మోటార్స్ కార్లపై సులభ వాయిదాల పద్దతిలో డ్రైవర్లకు అందిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా 20వేల డ్రైవర్లకు ఈ ఆర్ధికసాయంతో వారే సొంతంగా కార్లు కొనుగోలు చేసుకునే విధంగా లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలిపారు. టాటా ఎఐజి,టాటామోటార్స్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తదితర సంస్థలు ఉబేర్తో భాగస్వామ్యం అయిటన్లు వివరించారు. డ్రైవర్లకు టాటా సంస్థలు అందుబాటు వడ్డీతో రుణపరపతినిస్తాయన్నారు. మొదటిసారిగా హైదరాబాద్నంచి ప్రారంభించేందుకు తెలంగాణ మార్కెట్ తమకు అత్యంత కీలకమైనదని, తెలంగాణప్రభుత్వ కార్యాచరణ తమకు ఎంతో అనువైనదిగా ఉందని పేర్కొన్నారు. ఉబెర్ ఎరిక్ అలెగ్జాండర్ మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్నుంచి 300కుపైగా స్పందన లభించిందని మరింతపెరుగుతుందన్నారు.
భారత్లో ఉబేర్ సేవలు ప్రస్తుతం 27 నగరాల్లో ఉన్నాయని వాటిని ఈ ఏడాది చివరినాటికి 50నగరాలకు పెంచుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఐటి కార్యదర్శి జయేష్రంజన్ మాట్లాడుతూ కేవలం హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా తెలంగాణలోని ఇతర తొమ్మిదిజిల్లాల్లోని యువతకు ఉపాధిపెంచాలని సూచించారు. అంతేకాకుండా వారికి వృత్తి నైపుణ్య శిక్షణతో మరింతగా తర్ఫీదునివ్వాలన్నారు. ప్రభుత్వం పారిశ్రామిక వృద్ధితోనే ఉపాధి మరింత పెరుగుతుందని విశ్వసిస్తోందని అందుకు అనుగుణంగానే సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. టాటా సంస్థలు, ఉబేర్ భాగస్వామ్యంతో డ్రైవర్లు కారుయజమానులుగా మారేందుకు సహకరించచడం ఉబేర్ డ్రైవర్లకు ఎంతోమేలు చేస్తుందని అన్నారు. | 1entertainment
|
Jun 09,2015
మరో 3 ఐపీఓలకు సెబీ అనుమతిల
ముంబయి: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గత వారం రోజులలో దాదాపు రూ.1000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి మూడు పబ్లిక్ ఇష్యూలకు (ఐపీఓ) ఆమోదం తెలిపింది. వ్యాపార విస్తరణ, చర మూలధనం అవసరాల నిమిత్తం ఆయా సంస్థలు కొత్తగా ఐపీఓ బాటను ఎంచుకొని సెబీకి దరఖాస్తు చేసుకొన్నాయి. దరఖాస్తులను పరిశీలించిన సెబీ వాటికి పచ్చజెండా ఊపింది. తాజాగా సెబీ ఆమోదం పొందిన మూడు సంస్థలను కలుపుకుంటే ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీఓ అనుమతి పొందిన సంస్థల సంఖ్య 17కు చేరింది. సెబీ అనుమతి పొందిన సంస్థలలో అమర్ ఉజాలా హిందీ దినపత్రిక ప్రచురణ సంస్థ అమర్ ఉజాలా పబ్లికేషన్స్, మౌలిక రంగ సంస్థ దిలిప్ బిల్డ్కాన్, కల్పతరువు పవర్ ట్రాన్స్మిషన్ అనుబంధ సంస్థ శ్రీ శుభం లాజిస్టిక్స్ సంస్థలు ఉన్నాయి. ఈ మూడు సంస్థలు గత ఫిబ్రవరి, మార్చి మాసాలలో డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. గత నెలలో కూడా సెబీ కొత్తగా నాలుగు ఐపీఓలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
అసలు "వీడెవడు" అంటున్న అఖిల్ అక్కినేని
Highlights
తాజాగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన అక్కినేని అఖిల్
వీడెవడు అంటూ ఓ సస్పెన్స్ పోస్టర్ ట్వీట్ చేసిన అఖిల్
పోస్టర్ లో ఉన్నది ఎవరో గెస్ చేయండంటూ ఫ్సాన్స్ కు సవాల్
అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని తాజా ట్వీట్ అందరినీ సస్పెన్స్ లో పడేస్తోంది. వీడెవడు? అంటూ ఓ పోస్టర్ ను అఖిల్ షేర్ చేసారు. అయితే అందులో హీరో వెనుక వైపు మాత్రమే కనిపిస్తోంది. వీడెవడో తెలియాలంటే ఫిబ్రవరి 14 వరకు ఆగాల్సిందే... ఈ లోగా వీడెవడో కనుక్కోండి చూద్దాం... అంటూ కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు అఖిల్.
పరికించి చూస్తే... అఖిల్ షేర్ చేసిన 'వీడెవడు?' పోస్టర్లో ఉన్నది హీరో నితిన్ అని తెలుస్తోంది. ట్విట్టర్ లో ఇది నా టీమ్ మేట్ పోస్టర్ అంటూ అఖిల్ క్లూ కూడా ఇచ్చాడు. అనుకున్నది నిజమైతే... హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో నిఖిల్ పాతబస్తీకి చెందిన కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ గత సినిమాలకు భిన్నంగా గడ్డంతో న్యూ లుక్ తో కనిపించబోతున్నారు. ఇప్పటికే బయటకు లీకైన ఫోటోలకు మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ తో పాటు అమెరికాలో ఈ సినిమాను ఎక్కువగా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో ఆయన స్టైలీష్ విలన్ గా కనిపించనున్నాడు.
ఆ పోస్టర్లో ఉన్నది నితినే అనుకుంటున్నప్పటికీ...... అఖిల్ ట్వీట్లో సస్పెన్స్ వీడి, అసలు విషయం తెలియాలంటే ఫిబ్రవరి 14న వరకు ఆగాల్సిందే.
Last Updated 25, Mar 2018, 11:47 PM IST | 0business
|
Read Also: ‘మాటే వినదుగ’ సాంగ్ తెలుగు లిరిక్స్ మీకోసం..
ముఖ్యంగా ఈ పాటలోని మెలోడీ టచ్ మ్యూజిక్ లవర్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. సిడ్ శ్రీరామ్ తన గొంతుతో మరోసారి మ్యాజిక్ చేశాడు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. జేక్స్ అద్భుతమైన రొమాంటిక్ మెలోసాంగ్ అందించాడు. ముఖ్యంగా యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్న ఈ పాట సినిమాలో కీలకమైంది. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా....రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు.
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Maate Vinadhuga Video Song: మాటే వినదుగ వీడియో సాంగ్
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
తొలి టీ20కి బ్రిస్బేన్లో భారత్ ప్రాక్టీస్..!
కృనాల్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా నెట్స్లో బౌలింగ్ చేయగా.. కోహ్లీ, మనీశ్ పాండే హిట్టింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu | Updated:
Nov 18, 2018, 07:36PM IST
ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు వెళ్లిన భారత్ జట్టు ఆదివారం బ్రిస్బేన్ స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. కంగారూలతో ఈనెల 21న బ్రిస్బేన్ వేదికగానే తొలి టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. సిరీస్లో మొత్తం మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
దాదాపు 10నెలల తర్వాత మళ్లీ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన రోహిత్ శర్మ, పార్థీవ్ పటేల్ నెట్స్లో ఎక్కువ శ్రమించగా.. యువ హిట్టర్ రిషబ్ పంత్ సెషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కృనాల్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా నెట్స్లో బౌలింగ్ చేయగా.. కోహ్లీ, మనీశ్ పాండే హిట్టింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. | 2sports
|
Visit Site
Recommended byColombia
ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ‘సాహో’ థియేట్రికల్ రైట్స్ను విక్రయించారని టాక్. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో రూ.25 కోట్ల భారీ ధరకు రాయలసీమ ప్రాంత హక్కులను విక్రయించారని అంటున్నారు. వాస్తవానికి, సీడెడ్ ఏరియాలో ఇప్పటి వరకు ‘బాహుబలి’ మినహా ఏ చిత్రం రూ.20 కోట్లను మించి షేర్ వసూలు చేయలేదు. ‘బాహుబలి’ సిరీస్ను మినహాయిస్తే అత్యధికంగా ‘రంగస్థలం’ సుమారు రూ.19 కోట్లు రాబట్టింది. అలాంటిది, ‘సాహో’ రైట్స్ రూ.25 కోట్లు పెట్టి కొనడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ.. డిస్ట్రిబ్యూటర్ చేసిన ధైర్యం చూస్తుంటే ‘రంగస్థలం’ రికార్డును ‘సాహో’ టార్గెట్ చేసిందని స్పష్టంగా తెలుస్తోంది. రూ.25 కోట్లు పెట్టి రాయలసీమ రైట్స్ కొన్నారు కాబట్టి అంతకు మించి వస్తేనే డిస్ట్రిబ్యూటర్ లాభపడినట్టు. అయితే, ఈ మార్కును ‘సాహో’ కచ్చితంగా దాటుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ఆగస్టు 30న విడుదలవుతోన్న ఈ చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమంటున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
బి.జయ 'వైశాఖం' పాటలకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రశంస
Highlights
ఆర్ జే సినిమాస్ బేనర్ పై బీఏ రాజు నిర్మించిన చిత్రం వైశాఖం
వైశాఖం సినిమా పాటలకు ఇంప్రెస్ అయిన డాషింగ్ డైరెక్టర్ పూరీ
త్వరలో విడుదలకు ముస్తాబవుతున్న "వైశాఖం" చిత్రం
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆర్.జె. సినిమాస్ కార్యాలయానికి విచ్చేసి 'వైశాఖం' పాటల్ని ప్రత్యేకంగా వీక్షించి చిత్ర యూనిట్ని అభినందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. హరీష్, అవంతిక జంటగా డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన 'వైశాఖం' చిత్రం జూన్ ఫస్ట్వీక్లో వరల్డ్వైడ్గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల హైదరాబాద్లోని ఆర్.జె. సినిమాస్ కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి 'వైశాఖం' చిత్రంలోని పాటల్ని, ట్రైలర్ని వీక్షించారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ''జయగారు ఎప్పుడు సినిమా తీసినా పిలిచి ఆ సినిమాలోని సాంగ్స్, ట్రైలర్ చూపిస్తుంటారు. రాజుగారు, జయగారు మా ఫ్యామిలీ మెంబర్స్లాగ. 'వైశాఖం' సాంగ్స్ చూశాను. చాలా బాగున్నాయి. వసంత్ చాలా బాగా మ్యూజిక్ చేశాడు. కొరియోగ్రఫీ చాలా బావుంది. హీరో హరీష్, హీరోయిన్ అవంతిక ఫుల్ ఎనర్జిటిక్గా పోటీపడి చేశారు. ఇద్దరికీ మంచి ఫ్యూచర్ వుంటుంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. వాలిశెట్టి సుబ్బారావు ఫొటోగ్రఫీ ఎక్స్లెంట్గా వుంది. లొకేషన్స్ అన్నీ చాలా కొత్తగా, రిచ్గా వున్నాయి. విజువల్స్ అన్నీ బ్యూటిఫుల్గా వున్నాయి. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.
డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. మాట్లాడుతూ - ''లవ్లీ' సాంగ్స్ చూసి పూరి జగన్నాథ్గారు మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ని కూడా అప్రిషియేట్ చెయ్యడమే కాకుండా తన నెక్స్ట్ సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ 'వైశాఖం' సాంగ్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ప్రతి పాట దేనికదే ప్రత్యేకంగా కొత్తగా వుంది. పూరిలాంటి పెద్ద డైరెక్టర్ మా ఆఫీస్కి వచ్చి సాంగ్స్ చూసి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం నిజంగా పెద్ద విజయం సాధించినట్టుగా ఫీలవుతున్నాం. పూరిగారు ఎలా ఫీలయ్యారో సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారని నా నమ్మకం. పూరిగారు సాంగ్స్ చూసి ఆ విజువల్స్ బ్యూటీకి, కొత్తదనానికి చాలా ఇంప్రెస్ అయ్యారు. విజువల్స్ అన్నీ చాలా గ్రాండియర్గా వున్నాయి. నేను కూడా ఇలా కొత్త లొకేషన్స్లో చెయ్యాలి అని ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఆయన్ని ఇన్స్పైర్ చేసేంతగా 'వైశాఖం' సాంగ్స్ వుండటం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను'' అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''పూరి జగన్నాథ్గారు మా 'వైశాఖం' సాంగ్స్ చూసి చాలా చాలా బాగున్నాయి అని చెప్పడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. పూరిగారి జడ్జిమెంట్ ఎప్పుడూ కరెక్ట్గా వుంటుంది. 'లవ్లీ' సాంగ్స్ చూసి సినిమా సూపర్హిట్ అవుతుంది అని చెప్పారు. అలాగే ఇప్పుడు 'వైశాఖం' సాంగ్స్ చూసిన వెంటనే ఈ సినిమా సూపర్హిట్ గ్యారెంటీ అవుతుందని చెప్పడం మాకెంతో బలాన్ని ఇచ్చింది. డెఫినెట్గా పూరిగారు చెప్పినట్టు ఈ సినిమా సూపర్డూపర్ హిట్ కాబోతోంది. జూన్ ఫస్ట్వీక్లో 'వైశాఖం' చిత్రాన్ని వరల్డ్వైడ్గా రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
హీరో హరీష్ మాట్లాడుతూ - ''వైశాఖం'తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. పూరి సార్ మా 'వైశాఖం' సాంగ్స్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయనది గోల్డెన్ హ్యాండ్ అని మా టీమ్ ఎప్పుడూ చెప్తుంటారు. 'లవ్లీ' సినిమా సాంగ్స్ చూసి బ్లెస్ చేశారు. అది పెద్ద హిట్ అయ్యింది. సాంగ్స్ అన్నీ చాలా గ్రాండియర్గా, కొత్తగా వున్నాయని మమ్మల్ని బ్లెస్ చేశారు. ఆడియన్స్ అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. పూరి సార్ నా డ్రీమ్ డైరెక్టర్. ఆయన వచ్చి నా సాంగ్స్ చూసి చాలా ఇంప్రెస్ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. ఆయనకి నా థాంక్స్. ఆయన బ్లెస్సింగ్స్ వుంటే మాకు సపోర్టివ్గా వుంటుంది'' అన్నారు.
హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, శశాంక్, లతీష్, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్ సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళి కొండేటి, ఫైట్స్: వెంకట్, రామ్ సుంకర, స్టిల్స్: శ్రీను, కో-డైరెక్టర్: అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్, దర్శకత్వం: జయ బి.
Last Updated 26, Mar 2018, 12:00 AM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అంబానీ అలజడి: తమ్ముడి ఆస్తులు.. అన్నకు!
తన సోదరుడు అనిల్ ఆస్తులు ఇతరుల చేతికి వెళ్లనీయకుండా ముఖేష్... ఆర్కామ్కు సంబంధించిన వైర్లెస్ స్పెక్ట్రం, టవర్స్, ఫైబర్, మల్టీ ఛానెల్ నెట్వర్క్ (MCNS)లను కొనుగోలు చేశారు.
TNN | Updated:
Dec 28, 2017, 09:56PM IST
తీవ్ర అప్పుల ఊబిలో చిక్కుకున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత అనిల్ అంబానీ ఆస్తులు కొనుగోలు చేసేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) అధినేత, ఆయన సోదరుడు ముఖేష్ అంబానీ ముందుకొచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఇరువురు ఒప్పందం కుదుర్చుకున్నారు. తన సోదరుడు అనిల్ ఆస్తులు ఇతరుల చేతికి వెళ్లనీయకుండా ముఖేష్... ఆర్‌కామ్‌కు సంబంధించిన వైర్‌లెస్ స్పెక్ట్రం, టవర్స్, ఫైబర్, మల్టీ ఛానెల్ నెట్‌వర్క్ (MCNS)లను కొనుగోలు చేశారు.
ఆర్‌కాంకు చెందిన 4జీ స్పెక్ట్రం(122.4MHz), 43వేల టవర్లు, 1,78,000 రూట్ కిలోమీటర్ల ఫైబర్ లైన్లు కూడా ఇక జియో ఆధీనంలోనే ఉంటాయని రిలయన్స్‌ జియో ప్రకటించింది. ఈ లావాదేవీలన్నీ 2018 మార్చిలోగా పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఆర్‌కాం ఆస్తులను కొనుగోలు చేసేందుకు జియోనే అత్యధిక బిడ్‌లను దాఖలు చేయడం గమనార్హం. అక్టోబరు నెలకే ఆర్‌కామ్‌కు దాదాపు రూ.45 కోట్ల రుణభారం ఉంది. దీంతో, ఆ భారాన్ని రూ.6 వేల కోట్లు పరిమితం చేసే లక్ష్యంతో స్ట్రేటజిక్ డెబ్ట్ రీస్ట్రక్చరింగ్ (SDR) కింద ఆస్తులను విక్రయించారు. | 1entertainment
|
internet vaartha 135 Views
బ్రెగ్జిట్ నిర్ణయంపై నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ : బ్రెగ్జిట్ నిర్ణయానంతరం చమురు ఎగుమతులు అంటకాగుతాయని ఆ రంగం నిపుణులు చెపుతున్నారు. యూరోజోన్కు భారతీయ చమురు మార్కెట్ ఎగుమతులు మరింతగా దెబ్బతింటాయి. ప్రత్యేకించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్పరంగాచూస్తే ఎగుమతులు అంతగా లేక పోయినా మరికొంతకాలం అనిశ్చితి ఎదురవుతుందని చెపుతున్నారు. బ్రిటన్నిర్ణయంతో మెజార్టీ సంస్థలు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. ముడిచమురుధరలు తక్కువగానే ఉన్నా, దేశీయ చమురు శుద్ధి సంస్థలకు నిర్వహణ, దిగుమతు వ్యయం తగ్గుతున్నప్పటికీ కరెన్సీ హెచ్చుతగ్గులు మరింత ప్రభావితం చేస్తాయని అంచనా. రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో అతిపెద్ద చమురు దిగుమతి సంస్థ గా నిలుస్తోంది. రిలయన్స్ యూరోజోన్కు డీజిల్ను ఎగుమతిచేస్తున్నది. ఇండియన్ ఆయిల్కార్పొరేషన్కు మాత్రం ప్రభావం అంతభారీ స్థాయిలో ఉండదని అంటు న్నారు. పెట్రోకెమికల్ ఉత్పత్తులు చిన్న మొత్తాల్లోనే ఎగుమతులు చేస్తోంది. ఇకా రేటింగ్ సంస్థ విశ్లేషణలను పరిశీలిస్తే భారీ స్థాయిలో చమురు ఎగుమతులకు నష్టం ఉండకపోవచ్చని వెల్లడించింది. అయితే ఏవి యేషన్ టర్బైన్ ఫ్యూయల్పరంగా పెట్రో ఎగుమతిదారులకు కరెన్సీ హెచ్చుతగ్గులకారణగా ఎగుమతులు నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. రిలయన్స్ పెట్రోలియం 63శాతం పెట్రోలియం ఉత్పత్తుల విక్ర యాలు ఎగుమతి మార్కెట్లకే వెళుతున్నాయి. మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్ కూడా భారత్నుంచి ఎక్కువ ఎగుమతులుచేస్తుంది. వీటితోపాటు ఎస్సార్ ఆయిల్స్ కూడా యూరోజోన్ ఎగుమ తులు ఎక్కు వే. అయితే భారత్ రిఫైనరీల నుంచి యూరోప్కు ఎగుమతి చేయదని గ్రూప్ విదేశీ సంస్థ యుకె ఎస్సా ర్ ఎనర్జీ 14 మిలియన్టన్నుల రిఫైనరీని స్టాన్లోలో నిర్వహిస్తోంది. ఈ రిఫైనరీ నుంచే బ్రిటిష్ మార్కె ట్కు వెళుతుందని పరిసర దేశాలకు కూడా అందుతుందని చెప్పారు. అయితే బ్రెగ్జిట్ కారణంగా తమ సంస్థలకు ప్రభావం ఉండదని, బిజినెస్ పటిష్టంచేసి మరింత విస్తరణకు కృషి చేస్తామని వెల్లడించింది. | 1entertainment
|
Aug 14,2015
అందుబాటులోకి కొత్త డాట్సన్ గో..
న్యూఢిల్లీ: రానున్న పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని నిస్సాన్ మోటార్ ఇండియా సంస్థ 'డాట్సన్ గో ఎన్ఎక్స్టీ' కారును మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్లు ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య కాలంలో దేశంలోని 196 డాట్సన్ ఔట్లెట్లలో లబిస్తాయని సంస్థ ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. దీని ధరను రూ.4.1 లక్షలుగా (ఎక్స్ఫోరూమ్, న్యూఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది కేవలం రూ.5000 కనిష్ఠ ధరల పెంపుతో దాదాపు రూ.20,000 విలువైన యాడ్ఆన్స్ను ఇందులో అందుబాటులో ఉంచినట్లు ఆయన చెప్పారు. రానున్న పండగల సీజన్ నేపథ్యంలో తాము చాలా విక్రయాల పెంపు పథకాలను తమ వద్ద ఉంచుకున్నట్లుగా ఆయన తెలిపారు. పవిత్ర పండగ దినాలలో వాటిని వినియోగదారులకు అందిచనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తాము కొత్త డాట్సన్ గో కారును మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 13, Oct 2018, 5:11 PM IST
Highlights
డైరెక్టర్ - హీరోల కాంబినేషన్ ఒక్కసారి సెట్టయితే అభిమానుల్లో అంచనాలు అమితంగా పెరుగుతాయి. సినిమా తెరపైకి వచ్చే ముందు బిజినెస్ డీల్స్ కూడా మొదలవుతాయి. అయితే కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లేముందు ఇద్దరిలో ఏ ఒక్కరు డిజాస్టర్ అందుకున్నా కూడా కథ మళ్ళీ మొదటికి వస్తుంది.
డైరెక్టర్ - హీరో కాంబినేషన్ ఒక్కసారి సెట్టయితే అభిమానుల్లో అంచనాలు అమితంగా పెరుగుతాయి. సినిమా తెరపైకి వచ్చే ముందు బిజినెస్ డీల్స్ కూడా మొదలవుతాయి. అయితే కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లేముందు ఇద్దరిలో ఏ ఒక్కరు డిజాస్టర్ అందుకున్నా కూడా కథ మళ్ళీ మొదటికి వస్తుంది. మొన్నటివరకు త్రివిక్రమ్ పరిస్థితి అలానే ఉంది.
అజ్ఞాతవాసి సినిమాతో అభిమానులు షాక్ అయ్యేలా చేసి గురిజి ఇలాంటి సినిమాలు కూడా చేస్తాడా? అనే కామెంట్స్ వచ్చాయి. ఇకపోతే అందరికంటే ఎక్కువగా బన్నీ మొన్నటివరకు కొంత డైలమాలో ఉన్నాడని టాక్ వచ్చింది. ఎందుకంటే గత కొంత కాలంగా వీరు ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నారు.
అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు చేశాడు. ఆ సినిమాలు బన్నీకి కూడా మంచి గుర్తింపును తెచ్చాయి. ఇక ఆ తరువాత సరైనోడు - దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మంచి హిట్స్ అందుకున్న బన్నీ ఊహించని విధంగా నా పేరు సూర్య సినిమాతో డిజాస్టర్ చూశాడు. మరో రిస్క్ చేస్తే మార్కెట్ పడిపోతుందని వేరే దర్శకులతో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. కేవలం త్రివిక్రమ్ తో చేయాలనీ ఫిక్స్ అయ్యాడు.
కానీ ఆజ్ఞాతవాసి రిజల్ట్ కొంచెం అలజడి రేపినప్పటికీ ఇప్పుడు అరవింద సమేత హిట్టవ్వడంతో ఒక్కసారిగా త్రివిక్రమ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లు క్లారిటీ వచ్చేసింది. దీంతో బన్నీ ఊపిరి పీల్చుకున్నాడు అని తెలుస్తోంది. ఇక వీరు చేయబోయే సినిమాకు కూడా భారీగా అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరి ముడవసారి కలిసే ఈ కాంబినేషన్ ఎంతవరకు హిట్ అందుకుంటుందో చూడాలి.
Last Updated 13, Oct 2018, 5:11 PM IST | 0business
|
Jun 12,2018
అప్రమత్తతో.. ఆగిన స్టాక్ మార్కెట్ల ర్యాలీ..
ముంబయి: దక్షిణ కొరియా- అమెరికాల మధ్య మైత్రీకి బాటలు వేస్తూ సింగపూర్లో చర్చలకు రంగం సిద్ధం కావడం అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు సోమవారం పరుగులు పెట్టాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూలతల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా సోమవారం ఉదయం నుంచే పరుగులు పెట్టాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తరువాత సానుకూల పవనాల నేపథ్యంలో మేటి ర్యాలీని నమోదు చేశాయి. సోమవారం మార్కెట్లలో ట్రేడింగ్లో ఎక్కువ సమయం భారీ లాభాల మధ్య కదిలినప్పటికీ చివరి గంటలో భారీగా అమ్మకాల తాకిడికి ఒక్కసారిగా దిగివచ్చాయి. మంగళవారం ఐఐపీతో సహా పలు సూక్ష్మ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు జాగురుకతతతో ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా స్టాక్స్ను విక్రయించారు. లోహ, విద్యుత్తు, స్థిరాసి రంగ స్టాక్స్లో ఎక్కువగా అమ్మకాలు నమోదు అయ్యాయి. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంలో 35,483 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 19 పాయింట్ల లాభంలో 10,787 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు సెన్సెక్స్ 35,700 పాయింట్ల గరిష్టాన్ని అధిగమించగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ గరిష్టంగా 10,850ను తాకింది. భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంకు, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సెన్సెక్స్లో అత్యధికంగా లాభపడిన స్టాక్స్గా నిలిచాయి. మరోవైపు టాటా స్టీల్, పవర్గ్రిడ్, కోల్ ఇండియా, యెస్ బ్యాంకు, హీరోమోటో, ఐసీఐసీఐ బ్యాంకు, ఆర్ఐఎల్లు అత్యధికంగా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో నిలిచాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 9 పైసల లాభంలో 67.42గా నమోదైంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
'మహానటి' టీమ్ కు మెగా సన్మానం!
Highlights
సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం' పడుతున్నారు
సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం' పడుతున్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైన స్టార్ హీరోల చిత్రాలత్ పోటీపడుతూ తన ప్రత్యేకతను చాటుతోంది. ఈ సినిమాలో సావిత్రి జీవితంలో ఎదుర్కొన్న మంచి, చెడు రెండూ చూపించాడు దర్శకుడు. ఈ సినిమాను చూసిన కొందరు రాజకీయ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా మహానటికి టీమ్ కు అభినందనలు తెలిపారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఈ చిత్రబృందాన్ని ఇంటికి పిలిపించుకొని మరీ సన్మానించడం విశేషం. మహానటి సినిమా ఎంతో అద్భుతంగా ఉందని, సావిత్రి లాంటి ఒక గొప్ప నటి కథను తెరపై తీసుకురావాలనే ఆలోచన ఎంతో గొప్పదని, ఆ ఆలోచనను సాకారం చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు, అతడికి సహకరించిన నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంక దత్ లకు నా ప్రత్యేక అభినందనలని చిరు తెలిపారు.
తెలుగుతో పాటు శుక్రవారం నాడు తమిళంలో విడుదలైన మహానటికి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను మిగల్చడం ఖాయం.
Last Updated 12, May 2018, 12:58 PM IST | 0business
|
internet vaartha 474 Views
న్యూఢిల్లీ : ఎన్డిఎ ప్రభుత్వంలో పునర్ వ్యవస్థీకరించబడిన నీతి ఆయోగ్కు సిఇఒగా పారిశ్రామిక ప్రోత్సాహక మండలి కార్యదర్శిగా పనిచేస్తున్న అమితాబ్ కాంత్ ణియమితుల య్యారు. వచ్చేనెల ఫిబ్రవరిలో రిటైర్ అయిన తర్వాత ఆయన నీతిఆయోగ్ సిఇఒగా బాధ్యతలు స్వీకరిస్తారు. అమితాబ్ కాంత్ ప్రధానంగా నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మేకిన్ ఇండియా, బిజినెస్ సానుకూల వాతావరణం ఉందన్న ప్రచారానికి కీలక అధి కారిగా వ్యవహరించారు. మాజీ ఐఎఎస్ అధికారి సింధుశ్రీఖుల్లర్ స్థానంలో ఆయనసిఇఒగా నియ మితులయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నీతిఆయోగ్కు ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు ప్రణాళికా సంఘాన్ని పునర్వ్యవస్థీకరించి భారత జాతీయ అభివృద్ధి చాలకసంస్థ (నీతి) ఆయోగ్గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
టుస్సాడ్స్లో కోహ్లి విగ్రహం ఆవిష్కరణ..!
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని
Samayam Telugu | Updated:
Jun 6, 2018, 05:34PM IST
టుస్సాడ్స్లో కోహ్లి విగ్రహం ఆవిష్కరణ..!
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని నిర్వాహకులు బుధవారం ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు కపిల్దేవ్, సచిన్ టెండూల్కర్తో పాటు మెస్సీ (ఫుట్బాల్), ఉసేన్ బోల్ట్ (స్పింటర్) విగ్రహాలు ఉండగా.. తాజాగా వారి సరసన సగర్వంగా విరాట్ కోహ్లి విగ్రహం నిలిచింది.
‘నా విగ్రహాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకుల్ని అభినందిస్తున్నా. నా జీవితంలో గుర్తుండిపోయే అనుభవాన్నిచ్చిన మేడమ్ టూస్సాడ్స్కి నా ధన్యవాదాలు. అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని కోహ్లి వెల్లడించాడు. గత మార్చిలో విరాట్ కోహ్లి మైనపు విగ్రహం కోసం.. లండన్ నుంచి నిపుణులైన ఆర్టిస్టులు భారత్కి వచ్చి దాదాపు 200 కొలతలు, ఫొటోలను తీసుకున్నారు. తాజాగా ఆవిష్కరించిన కోహ్లి మైనపు విగ్రహంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు అమితాసక్తి కనబరుస్తున్నారు.
Presenting #TussaudsDelhi's next big unveil! The run machine, the chase master, @imVkohli is here! #KohliInDelhi https://t.co/TokyEVePSp
— Madame Tussauds (@tussaudsdelhi) 1528265487000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
'జయదేవ్'తో మళ్లీ వస్తున్న దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ఇంటర్వ్యూ
Highlights
చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ సినిమా
'ప్రేమించుకుందాం.. రా', 'ప్రేమంటే ఇదేరా', 'బావగారు బాగున్నారా!' 'లక్ష్మీనరసింహా' చిత్రాలతో క్రేజ్
తాజాగా మంత్రి గంటా కుమారుడు గంటా రవిని పరిచయం చేస్తూ జయదేవ్ సినిమా
ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది?
చాలా తమాషాగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. కెమెరామెన్ జవహార్రెడ్డి ఒక రోజు కాల్ చేసి అర్జెంట్గా కలవాలి అన్నాడు. ఇంటికి రమ్మన్నాను. బెల్ కొట్టగానే డోర్ నేనే ఓపెన్ చేశా. చూడగానే జవహార్ రెడ్డి, ప్రక్కన ఆరడుగుల పొడవున్న ఓ వ్యక్తి వున్నారు. అతను ఎవరు? అని అడగ్గానే గంటా శ్రీనివాసరావుగారి అబ్బాయి. తనకి సినిమాల్లో చెయ్యాలని బాగా ఇంట్రెస్ట్. అందుకే కలవడానికి వచ్చాం అని చెప్పాడు జవహార్రెడ్డి. గంటా రవిని చూడగానే చాలా అందంగా వున్నాడు. ఇతనితో సినిమా తియ్యొచ్చు అనే ఫీల్ కలిగింది. రెండు, మూడు నెలల్లో 16 కిలోల వెయిట్ తగ్గాడు. సత్యానంద్ మాస్టర్ దగ్గర యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నాడు. కృషి, పట్టుదల, దీక్షతో ఈ చిత్రంలో ప్యాషన్తో నటించాడు.
ఈ చిత్రం మెయిన్ కథాంశం ఏమిటి?
తమిళ్లో సూపర్డూపర్ హిట్ అయిన 'సేతుపతి' చిత్రం చూశాను. నాకు బాగా నచ్చింది. అందులో మెయిన్ ఎస్సెన్స్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. పరుచూరి బ్రదర్స్ అత్యద్భుతంగా స్క్రిప్ట్ని డెవలప్ చేశారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ ఇది.
పోలీస్ స్టోరీస్ చాలా చిత్రాలు వచ్చాయి.. మరి ఈ చిత్రంలో వున్న కొత్తదనం ఏంటి?
నిజమే. ఇంతవరకూ వచ్చిన పోలీస్ చిత్రాలు అన్నీ పర్సనల్ అటాచ్మెంట్తో వుంటాయి. 'అంకుశం', 'కర్తవ్యం'.. ఇంకా ఎన్నో చిత్రాలు అలాగే వుంటాయి. అన్నింట్లో కామన్ ఒకటే పాయింట్ వుంటుంది. అలా కాకుండా ఈ చిత్రంలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన కోసం కాకుండా డ్యూటీ కోసం ప్రక్కవారి కోసం తోటి ఆఫీసర్స్, వాళ్ల ఫ్యామిలీస్ని సేవ్ చేయడం కోసం కష్టపడుతున్నాడు. సెల్ఫ్ లెస్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ. రియాల్టీకి దగ్గరగా చాలా నేచురల్గా సినిమా వుంటుంది.
గంటా రవి క్యారెక్టర్ ఎలా వుంటుంది?
'జయదేవ్'గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో గంటా రవి నటించాడు. తనలోని ప్లస్ పాయింట్స్ హైలైట్ చేస్తూ ఈ చిత్రంలో చూపించాం. సినిమా చూసి ఆడియన్స్ క్లాప్స్, విజిల్స్ కొట్టేవిధంగా సీన్స్ అన్ని వుంటాయి. ఈ చిత్రంలో 'జయదేవ్' పాత్రలో గంటా రవి అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. 'జయదేవ్' క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. మూడీగా వుంటూ షార్ట్ టెంపర్తో అతని క్యారెక్టర్ వుంటుంది.
హీరోయిన్ క్యారెక్టర్ గురించి?
'కభీ ఖుషి కభీ ఘమ్' చిత్రంలో చిన్నప్పటి కరీనాకపూర్ క్యారెక్టర్లో నటించిన మాళవికా రాజ్ని ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. బ్యూటిఫుల్గా నటించింది. గంటా రవి, మాళవిక రాజ్ ఇద్దరికీ ఇండస్ట్రీలో చాలా లాంగ్ రన్ వుంటుంది.
ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు గురించి?
ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈ చిత్రంలో వుంటుంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా వున్న వినోద్కుమార్ ఈ చిత్రంలో విలన్గా యాక్ట్ చేశాడు. చాలా టెర్రర్ పాత్ర అది. ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు వినోద్. ఒక కొత్త వినోద్కుమార్ని ఈ చిత్రం ద్వారా చూస్తారు. హ్యాట్సాఫ్ వినోద్కుమార్.
బిగ్ స్టార్స్తో సినిమాలు తీసిన మీరు ఒక కొత్త హీరోతో ఈ సినిమా చేయడానికి రీజన్?
ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయింది. కాంబినేషన్కి తప్ప స్క్రిప్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. నాకు మెయిన్ స్క్రిప్ట్ ముఖ్యం. అది వుంటే ఎవరితోనైనా సినిమా చెయ్యొచ్చు. 'ఈశ్వర్'తో ప్రభాస్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశాం. ఇప్పుడు ప్రభాస్ పెద్ద రేంజ్ హీరో అయ్యాడు. చాలా గర్వంగా వుంది. గంటా రవి కూడా ప్రభాస్ రేంజ్ హీరో అవుతాడని కాన్ఫిడెన్స్ వుంది.
మ్యూజిక్ గురించి చెప్పండి?
మణిశర్మ బ్యూటిఫుల్ మెలోడి సాంగ్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో 5 పాటలు వున్నాయి. రెండు పాటలు స్లావేనియా, యూరప్లలో చిత్రీకరించాం. మిగతావి ఇక్కడ సెట్స్ వేసి తీశాం. నేను 12 సినిమాలు చేస్తే అందులో 9 సినిమాలు మణిశర్మ మ్యూజిక్ చేశారు. అన్నీ మ్యూజికల్గా సూపర్హిట్స్ అయ్యాయి. ఇప్పటికే 4 పాటలు రిలీజ్ చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
'తీన్మార్' తర్వాత ఇంత బ్రేక్ తీసుకోవడానికి రీజన్?
'తీన్మార్' ముందు 'అల్లరి పిడుగు' చేశాను. ఐదు సంవత్సరాలు గ్యాప్ తర్వాత 'తీన్మార్' చేశా. రెండూ సరిగ్గా ఆడలేదు. దాంతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్లీ 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత 'జయదేవ్' చేస్తున్నాను. ఇది కరెక్ట్ టైమ్లో తీస్తున్న రైట్ ఫిలిం ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ని జోడించి ఆడియన్స్ ఎంజాయ్ చేసేవిధంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఒక డైరెక్టర్గా మళ్లీ నన్ను నేను ప్రూవ్ చేసుకునే చిత్రమవుతుంది.
నిర్మాత అశోక్కుమార్గారి మేకింగ్ గురించి?
వెంకటేష్ హీరోగా అశోక్కుమార్ నిర్మించిన 'ధృవనక్షత్రం' చిత్రానికి నేను క్లాప్ అసిస్టెంట్ని. డైరెక్టర్ని అయ్యాక అశోక్ బేనర్లో 'ప్రేమంటే ఇదేరా', 'ఈశ్వర్' రెండు చిత్రాలు చేశాను. రెండూ సూపర్హిట్స్ అయ్యాయి. ఇది థర్డ్ ఫిల్మ్. డెఫినెట్గా మా కాంబినేషన్లో 'జయదేవ్' హ్యాట్రిక్ సాధిస్తుంది.
మహేష్తో సినిమా ఎప్పుడు?
- మహేష్ లవ్స్టోరీ చేద్దామన్నాడు. ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ అవలేదు. అన్నీ సెట్ అయ్యాక ఒక మంచి చిత్రం చేస్తాను.
మరి ప్రభాస్తో చేసే సినిమా?
రెగ్యులర్గా ప్రభాస్తో టచ్లో వుంటాను. 'ఈశ్వర్' టైమ్లో ప్రభాస్ ఎలా వున్నాడో ఇప్పుడూ అలాగే వున్నాడు. ఏం మారలేదు. గతంలో రెండు, మూడు కథలు విన్పించాను. డేట్స్ ప్రాబ్లెమ్ వల్ల సెట్ కాలేదు. తప్పకుండా ప్రభాస్తో కూడా ఓ సినిమా చేస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు 'జయదేవ్'తో సూపర్హిట్ కొట్టబోతున్న డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ.
జయదేవ్ సినిమాలో వినోద్కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్, హరితేజ, శ్రావణ్, సుప్రీత్, కోమటి జయరామ్, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్, అరవింద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్రెడ్డి, మూల కథ: అరుణ్కుమార్, రచన: పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: కృష్ణమాయ, స్టిల్స్ నారాయణ, కో-డైరెక్టర్: ప్రభాకర్ నాగ్, ప్రొడక్షన్ కంట్రోలర్: పి.రామమోహన్రావు, నిర్మాత: కె.అశోక్కుమార్, దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ.
Last Updated 25, Mar 2018, 11:58 PM IST | 0business
|
బిగ్ బాస్2: చిన్నప్పటి అవతారాల్లో హౌస్ మేట్స్
Highlights
సోమవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగనుందని ఈరోజు విడుదల చేసిన ప్రోమోను బట్టి తెలుస్తోంది. హౌస్ లో ఉన్నవారందరి చిన్ననాటి ఫోటోలను బిగ్ బాస్ వారికి టీవీ ద్వారా చూపించారు. ఈ ఫోటోలు చూస్తూ అందరూ తెగసంతోషపడిపోయారు
బిగ్ బాస్ సీజన్2 యాభై ఎపిసోడ్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గత వారానికి గాను ఎవరినీ ఎలిమినేట్ చేయడం లేదని నాని వెల్లడించడంతో హౌస్ మేట్స్ అందరూ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇక మరో సర్ప్రైస్ ఏంటంటే.. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఆరుగురిలో ఇప్పుడు ఇద్దరు శ్యామల, నూతన్ నాయుడు హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఈ విషయాన్ని అధికారికంగా ఆదివారం ఎపిసోడ్ లో వెల్లడించారు. ఇక వారు హౌస్ లోకి ఎప్పుడు వెళ్లబోతున్నారనే విషయాన్ని సస్పెన్స్ గానే ఉంచేశారు. సోమవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగనుందని ఈరోజు విడుదల చేసిన ప్రోమోను బట్టి తెలుస్తోంది. హౌస్ లో ఉన్నవారందరి చిన్ననాటి ఫోటోలను బిగ్ బాస్ వారికి టీవీ ద్వారా చూపించారు. ఈ ఫోటోలు చూస్తూ అందరూ తెగ సంతోషపడిపోయారు.
మరికొందరు ఎమోషనల్ కూడా అయ్యారు. అయితే వారు చూపించిన ఫొటోల్లో ఎవరెవరు ఎలాంటి అవతారంలో ఉన్నారో.. అలానే ఇప్పుడు రెడీ అవ్వాలని బిగ్ బాస్ చెప్పినట్లున్నారు. దీంతో అందరూ తమ చిన్నతనం జ్ఞాపకాలను తల్చుకుంటూ మురిసిపోయారు. | 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.