news
stringlengths
299
12.4k
class
class label
3 classes
నువ్వా నేనా కు బదులు నువ్వు నేను అంటున్న టాలీవుడ్ హీరోలు Highlights ఫ్రెండ్ షిప్ తో సర్ప్రైజ్ చేస్తున్న టాలీవుడ్ హీరోస్ మెగా హీరోస్ తో సూపర్ స్టార్ మహేష్ స్నేహం సాయి ధరమ్ తేజ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎన్టీఆర్ టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు కొత్త సంప్రదాయాలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా వెండితెరపై పోటీపడే బడా బడా హీరోలు సైతం ఫ్యాన్స్ ను సైతం విస్మయానికి గురిచేస్తూ... తమదైన శైలిలో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారు. ఒకరితో ఒకరు ఏ రేంజ్ లో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారంటే... అభిమానులు అనుకున్నట్లుగా నువ్వా నేనా అంటూ పోటీపడే హీరోలు సైతం నువ్వు నేను అంటూ స్నేహం మనదేరా అంటున్నారు.   యువ అగ్ర హీరోలు ఒకరి సినిమా ఓపెనింగ్ లకు ఒకరు హాజరవుతూ అభిమానులను అలరించడం దగ్గర్నించి మొదలు పెడితే ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ అందించటం, ఇతర హీరోల పాటలను ప్రమోట్ చేస్తూ ఒకరికొకరు తెగ సాయం చేసేసుకుంటున్నారు. తాజాగా ఓ మెగా హీరో పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా పేజ్ లో రిలీజ్ చేయనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా విన్నర్. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తమన్ అందించిన ఆడియో త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ఒక పాటను మహేష్ తన సోషల్ మీడియా పేజ్ లో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న మహేష్ బాబు. షూటింగ్ లోకేషన్ నుంచే ఈ రోజు (బుధవారం) సితార అనే విన్నర్ తొలి పాటను రిలీజ్ చేశాడు. సితార.. మహేష్ కూతురి పేరు కావటంతో మహేష్ చేతులు మీదుగా ఆ పాటను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అలా మెగా హీరో పాటను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేయటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
super star mahesh babu opts out of sankranthi race మహేష్ ఔట్.. చరణ్ ఇన్! టాలీవుడ్‌‌లో 2018 సంక్రాంతి పోటీ రసవత్తరంగా జరగనుంది. పవన్ కల్యాణ్-త్రివిక్రమ్‌ల సినిమా సంక్రాంతి రేసులో ముందంజలో ఉంది. TNN | Updated: Sep 10, 2017, 05:29PM IST టాలీవుడ్‌‌లో 2018 సంక్రాంతి పోటీ రసవత్తరంగా జరగనుంది. పవన్ కల్యాణ్-త్రివిక్రమ్‌ల సినిమా సంక్రాంతి రేసులో ముందంజలో ఉంది. ఆ తరువాత బాలకృష్ణ సినిమా, అలానే మహేష్ బాబు నటిస్తోన్న 'భరత్ అనే నేను' చిత్రాలు కూడా సంక్రాంతికి రానున్నాయనే వార్తలు బలంగా వినిపించాయి. మొదట సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న 'రంగస్థలం' సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ పవన్, మహేష్ సినిమాలు అదే సమయానికి వస్తుండడం పరిస్థితి మారింది. కానీ ఇప్పుడు సుకుమార్ తన సినిమా సంక్రాంతి బరిలో దింపడానికి రెడీ అవుతున్నాడు. దానికి కారణం ఇప్పుడు మహేష్ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడమే అని తెలుస్తోంది. ఇప్పటివరకు మహేష్-కొరటాల సినిమా ఇరవై శాతం కూడా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. నవంబర్‌లో మేజర్ షెడ్యూల్ మొదలుకానుంది. అప్పటికి కూడా సంక్రాంతి నాటికి షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు లేవు. దీంతో ఇక చరణ్ తన సినిమాను బరిలోకి దింపడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. దీనికి తగ్గట్లుగా సినిమా ఫస్ట్ కాపీను టైమ్‌కి రెడీ చేయాలని, రాత్రింబవళ్ళు యూనిట్ షూటింగ్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ జరుగుతోంది.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV హాకీ వరల్డ్‌కప్‌లో భారత్‌కి రేపు కఠిన పరీక్ష..! ఇప్పటి వరకు రెండు జట్లూ 19 సార్లు తలపడగా.. భారత్ గెలిచిన మ్యాచ్‌లు ఐదుకాగా.. బెల్జియం 13 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందుకుంది. Samayam Telugu | Updated: Dec 1, 2018, 05:26PM IST ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ ప్రపంచకప్‌లో ఘన విజయంతో బోణి కొట్టిన భారత్ జట్టుకి ఆదివారం కఠిన సవాల్ ఎదురుకానుంది. టోర్నీలో మొదటిరోజైన గురువారం దక్షిణాఫ్రికాని 5-0 తేడాతో చిత్తుగా ఓడించిన భారత్ జట్టు.. ఆదివారం రెండో మ్యాచ్‌లో బెల్జియంతో ఢీకొననుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన బెల్జియం జట్టు ప్రస్తుతం భారత్‌తో పోలిస్తే బలంగా కనిపిస్తోంది. కెనడాతో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 2-1 తేడాతో గెలిచిన ఆ జట్టు ఇప్పుడు మంచి జోరుమీదుంది. రికార్డుల పరంగా చూసినా.. భారత్‌పై బెల్జియం టీమ్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రెండు జట్లూ 19 సార్లు తలపడగా.. భారత్ గెలిచిన మ్యాచ్‌లు ఐదుకాగా.. బెల్జియం 13 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందుకుంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో.. రేపు బెల్జియం టీమ్‌ని ఓడించడం భారత్‌కి సవాలే..! ఆదివారం రాత్రి 7 గంటలకి మ్యాచ్ జరగనుంది.
2sports
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
1entertainment
తమ్ముడి కోసం చిరంజీవి వస్తున్నాడు! Highlights పవర్ స్టార్  కార్యక్రమంలో మెగాస్టార్ ఏం మాట్లాడతారో వినాలనే ఆసక్తి ప్రతిఒక్కరిలో కలుగుతోంది టాలీవుడ్ లో మెగాహీరోల సంఖ్య పెద్దదనే చెప్పాలి. ఒక మెగాహీరో సినిమా ఫంక్షన్ జరిగితే అక్కడకు మిగిలిన మెగాహీరోలు కూడా వచ్చి ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం తన అన్నయ్య చిరంజీవి 'అజ్ఞాతవాసి' ఆడియో ఫంక్షన్ కు రాబోతున్నాడని సమాచారం. నిజానికి ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసి సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. అయితే ఇప్పుడు సినిమా ఆడియో వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న హైదరాబాద్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. అయితే ఈ ఆడియో వేడుకకు అతిథిగా ఎవరు హాజరు కానున్నారనే విషయంలో చిరంజీవి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీని వెనక రాజకీయా కారణాలున్నాయంటున్నారు. ప్రజారాజ్యం ప్రయోగాన్ని ఈ మధ్య  పవన్ ప్రశంసించారు.దీనిని రెసిప్రొకేట్ చేసేందుకు మెగస్టార్ ఈ పంక్షన్ కు వస్తున్నాడని వినపడుతూ ఉంది. చిరంజీవి స్వయంగా తమ్ముడిని ఆశీర్వదించడానికి ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని తెలుస్తోంది. గతంలో పవన్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా ఈవెంట్ కు కూడా చిరంజీవిని అతిథిగా పిలిచి ఆయన పట్ల తన భక్తిని చాటుకున్నాడు పవన్. ఇప్పుడు తమ్ముడి కోసం చిరు ఆడియో వేడుకకు రాబోతున్నాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకేవేదికపై కనిపించనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో వీరేం మాట్లాడతారో వినాలనే ఆసక్తి ప్రతిఒక్కరిలో కలుగుతోంది. ఈ  మధ్య తన ఉత్తరాంధ్రలో పవన్  అన్నయ్యను బాగా సపోర్టు చేశారు. ప్రజారాజ్యం ప్రయోగం విఫలమయ్యేందుకు కొంత మంది వ్యక్తులు కారణమని, వారిని వదలన్నారు.  ఇలా పవన్ మాట్లాడటం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో పవన్ వొంటరి కాదు, పవన్ పోరాటానికి ఆన అండ ఆశీస్సులంటాయని  చెప్పి ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చేందుకు  మెగా స్టార్ వస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినపడుతూ ఉంది. Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పారాలింపిక్స్: మన క్రీడాధికారులకు బుద్ధే రాదా?! ఎన్ని రకాల చేదు అనుభవాలు ఎదురైనా మన క్రీడాధికారులకు గుణపాఠాలు రావడం లేదు. | Updated: Sep 7, 2016, 05:11PM IST ఎన్ని రకాల చేదు అనుభవాలు ఎదురైనా మన క్రీడాధికారులకు గుణపాఠాలు రావడం లేదు. రియో ఒలింపిక్స్ లో చేసిన పొరపాటునే మళ్లీ మన క్రీడాసంఘాల అధికారులు చేయడంతో భారత అథ్లెట్లు పారాలింపిక్స్ ప్రారంభోత్సవాల్లో పాల్గొనే అద్భుత అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఒలింపిక్ క్రీడల మాదిరిగానే పారా ఒలింపిక్ క్రీడలకు కూడా ప్రారంభోత్సవానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడాన్ని ఆయా దేశాలకు చెందిన పారా ఒలింపియన్లు గర్వంగా భావిస్తారు. అలాంటి ఘనతర కార్యక్రమంలో మన భారత అథ్లెట్లు పాల్గొనే సదవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మన పారాలింపిక్ అధికారులు పంపిణీ చేసిన నాసిరకం క్రీడాకిట్లే దీనికి కారణం. ఈ కిట్లు పారాలింపిక్ ప్రమాణాలకు అనుగుణంగా లేవని అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ(ఐపిసి) పసిగట్టి ఈ మేరకు భారత క్రీడాధికారులకు సమాచారం పంపింది. ఎంత త్వరగా సమగ్ర ప్రమాణాలు గల కిట్లను సమకూర్చుకుంటే అంతమంచిదని, లేకుంటే ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు భారత జట్టును అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్ లో కూడా కొన్ని క్రీడాంశాల్లో మన అథ్లెట్లకు భారత ఒలింపిక్ సంఘం సమకూర్చిన కిట్లు నాసిరకం కావడంతో క్రీడాకారులపై అనర్హత వేటు పడే ప్రమాదం ఏర్పడిన సంగతి తెలిసిందే.
2sports
కొలంబో: నిత్యం సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే భారత క్రికెటర్‌ శిఖర్‌ధావన్‌ విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు సైతం జట్టు సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు అభిమానులతో పంచుకుంటారు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ధావన్‌ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీటర్‌లో ఓ ఎమోషనల్‌ మెసేజ్‌ పెట్టాడు.’అందమైన నా భార్య ఆయేషాకు జన్మదిన శుభాకాంక్షలు..ఈ పుట్టిన రోజు కలిపి జరుపుకోవాలనుకున్నాం. నేను ఎప్పటికీ నీతోనే ఉంటా. మిస్‌ యూ అంటూ పోస్టు చేశారు.
2sports
పన్ను వేధింపులుంటే సత్వరం పరిష్కరిస్తా Nirmala Sitharaman న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్ర నిర్మలా సీతారామన్‌ శుక్రవారం భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ పారిశ్రామిక దిగ్గజాల నుద్దేశించి ప్రసంగించారు.పన్ను సంబంధిత అంశాల్లో వేధింపులు ఎదురవుతుంటే, సత్వరం పరిష్కరిస్తామనిసీతారామన్‌ భరోసా ఇచ్చారు. ఇందుకోసం వచ్చేవారం నుంచి దేశవ్యాప్తంగా పర్యటించి, పారిశ్రామిక వేత్తలు, వారి ప్రతినిధులతో సమావేశమవుతానని, వారు తెలిపిన పన్ను వేధింపు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ ఒకటి అభివృద్ధి చేశామని, దీనివల్ల పన్ను వేధింపు సమస్యలు నేరుగా తాను కూడా పర్యవేక్షించడానికి వీలవుతుందని మంత్రి వెల్లడించారు. ఆర్థిక వృద్ధికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ), ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయని పరిశ్రమల నిర్వాహకులకు మంత్రి తెలిపారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు జరుగుతుందని, కాకపోతే కొంత సమయం పడుతుందని వివరించారు.కొంత నెమ్మదించినా, ఇప్పటికీ ప్రపంచంలో వేగవంత వృద్ధి కలిగిన పెద్ద ఆర్థిక వ్యవస్థ మన దేశమేనని మంత్రి పేర్కొన్నారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య సౌహార్థ పూర్వక సంబంధాలున్నందున, వాణిజ్య సానుకూల వాతావరణం ఇనుమడిస్తుందని తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని కష్టపెట్టాలనే అభిప్రాయం ఏ దశలోనూ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV భారీ ధరకి అమ్ముడైన 2.0 తెలుగు రైట్స్ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 2.0 మూవీ తెలుగు రైట్స్... TNN | Updated: Aug 10, 2017, 08:05PM IST తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 2.0 మూవీ తెలుగు రైట్స్‌ భారీ ధర పలికాయి. గ్లోబల్ సినిమాస్ అనే తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 2.0 తెలుగు హక్కులని భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే, ఆ మొత్తం ఎంత అనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి గోప్యంగానే వుంచింది తమిళంలో ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. తెలుగు హక్కులు అధిక ధరకి అమ్ముడైన విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం ట్విటర్ ద్వారా తెలిపాడు. 2.0 - SOLD OUT for a Whopping Price !! AP and Telangana !!! Lyca Productions & Global Cinema partnership is a "History in the Making"!!! pic.twitter.com/mzxts7NiVj — Raju Mahalingam (@rajumahalingam) August 10, 2017 వచ్చే ఏడాది 2018న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ద్వారా తొలిసారిగా ఓ దక్షిణాది సినిమాతో సౌతిండియా ఆడియెన్స్‌కి పరిచయం అవుతున్నాడు అక్షయ్ కుమార్. అందులోనూ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించి కరెక్ట్ ఛాయిస్ వస్తే, ఎటువంటి పాత్ర పోషించడానికైనా తాను సిద్ధమే అని నిరూపించాడు అక్షయ్ కుమార్. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాదే సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన జడేజా భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది యువీ, రవిశాస్త్రి సరసన నిలిచాడు. TNN | Updated: Dec 16, 2017, 08:32AM IST <br /> భారత ఆల్&zwnj;రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. లంకతో వన్డే సిరీస్&zwnj;కు దూరమైన జడేజా.. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్&zwnj;లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఎస్&zwnj;సీఏ అంతర్&zwnj; జిల్లా టీ20 టోర్నీలో జడ్డూ ఈ ఫీట్ సాధించాడు. జామ్ నగర్ తరఫున బరిలో దిగిన జడేజా.. అమ్రేలీ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్&zwnj;లో మొత్తం పది సిక్సర్లు, 15 ఫోర్లు బాదిన జడ్డూ.. 69 బంతుల్లోనే 154 పరుగులు చేశాడు. ఆఫ్&zwnj; స్పిన్నర్&zwnj; నీలమ్&zwnj; వంజా బౌలింగ్ చెలరేగిపోయిన జడేజా.. వరుసగా ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. జడేజా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో జామ్&zwnj;నగర్&zwnj; 20 ఓవర్లలో 239/6 పరుగులు సాధించింది. అమ్రేలీ జట్టు 118 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇప్పటి వరకూ భారత ఆటగాళ్లలో రవిశాస్త్రి, యువరాజ్ మాత్రమే ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డు నమోదు చేశారు. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా.. యువీ ఇంగ్లాండ్&zwnj; బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్&zwnj;లో ఈ ఫీట్ నమోదు చేశాడు. 1985 రంజీ సీజన్లో ముంబై తరఫున బరిలో దిగిన రవిశాస్త్రి బరోడాపై ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
sandhya 156 Views david miller , SA vs IND david miller సౌతాంప్టన్‌: భారత్‌తో మ్యాచ్‌లో స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. ఓపెనర్లుగా వచ్చిన హషీమ్‌ ఆమ్లా(6) పరుగులకే బుమ్రా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్వింటన్‌ డికాక్‌(10) బుమ్రా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. డుప్లెసిస్‌(38), వాన్‌దార్‌ దుస్సేన్‌(22) లు చాహల్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఆ తర్వాత జీన్‌-పాల్‌ డుమినీ(3) కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లూ అయ్యాడు. సఫారీలు 24 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్‌ మిల్లర్‌(11), ఆండిలే ఫెహ్లుక్వాయో(5)లు ఉన్నారు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
2sports
internet vaartha 160 Views రాజ్‌కోట్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టి20లో తను చేసిన తొలి సెంచరీ తనకు ఆనందాన్ని ఇవ్వ లేదని టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ పేర్కొన్నాడు. గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం తనకు బాధనే మిగిల్చిందన్నాడు. ఏ దశలోనూ సెంచరీ గురించి ఆలోచించలేదు,జట్టు స్కోరు 170 కావడాన్నే టార్గెట్‌గా ఎంచుకున్నానని, ఆఖర్లో సెంచరీ చేసే అవకాశం దక్కింది, కానీ జట్టు ఓడిపోవడం నాకేమాత్రం ఆనందంగా లేదు అని కోహ్లీ పేర్కొన్నాడు. కాగా మ్యాచ్‌లో కోహ్లీ 63 బంతులు ఆడి 11 బౌండరీలు,1 సిక్సర్‌తో 63 పరుగులు చేసి కెరీర్‌ల తొలి టి20 సెంచరీ చేసినా అది వృధానే అయింది. గుజరాత్‌ లయన్స్‌ 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. కోహ్లీ సెంచరీతో అదరగొట్టినా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది. కాగా మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూర కోహ్లీ సెంచరీ సాయంతో 20 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు చేసింది.దినేష్‌ కార్తీక్‌ 50 పరుగులతో నాటౌట్‌గా సమయోచిత ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ చేధించింది. కాగా గేల్‌ తదుపరి మ్యాచ్‌కి అందు బాటులో ఉంటాడని కోహ్లీ పేర్కొన్నాడు. బ్యాటింగ్‌తోనే మ్యాచ్‌ గెలువ లేమని,బౌలింగ్‌ కూడా ముఖ్యమని కోహ్లీ వివరించాడు. తమ జట్టు బౌలర్లు మరింత బాగా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. ఇదిలా ఉండగా కోహ్లీ సెంచరీ చేయడం పట్ల సహచర ఆటగాడు గుజరాత్‌ లయన్స్‌ కెప్టెన్‌ సురేష్‌ రైనా ఆనందం వ్యక్తం చేశాడు.తమ జట్టు ఆటగాళ్లు సమిష్టిగా ఆడటం వల్ల గెలుపు సాధ్యమైందన్నాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సినిమాల్లో ముద్దిస్తావుగా, నాకూ ఇవ్వు! నటి అదాశర్మకు ఒక అభిమాని నుంచి చిత్రమైన అనుభవం ఎదురైంది. TNN | Updated: Dec 7, 2017, 05:32PM IST నటి అదాశర్మకు ఒక అభిమాని నుంచి చిత్రమైన అనుభవం ఎదురైంది. మద్దు పెట్టమంటూ ఒక ఆకతాయి అభిమాని ఆమెను ఒకింత వేధించాడు. పబ్లిక్ గానే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి అదా ట్విటర్లో అసహనాన్ని వ్యక్తం చేసింది. అభిమాని అనుచితంగా ప్రవర్తించిన వైనాన్ని ఆమె వివరించింది. ముంబై ఎయిర్ పోర్టులో ఈ సంఘటన చోటు చేసుకుందట. ఇందుకు సంబంధించి తన వివరణతో అదా వరస ట్వీట్లను పోస్టు చేసింది. వాటి సారాంశం ఏమిటంటే..&lsquo;ముంబై ఎయిర్ పోర్టులో ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. నువ్వు నా కూతురు లాంటి దానివి.. ముద్దు ఇవ్వవా? అని అతడు అడిగాడు. నీను స్పందించకపోయే సరికి.. సినిమాల్లో అయితే ముద్దు పెడతావు, ఇప్పుడేం.. అని అతడు గద్దించాడు. ఇదంతా కొంతమంది వీడియోలు తీశారు. వాటిని చూసి మరికొంతమంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ముద్దిస్తే పోయేదిగా అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నవిషయమే గా అంటున్నారు.. అది వీళ్లు ఎలా నిర్ణయిస్తారు? Visit Site Recommended byColombia నా వ్యక్తిగత జీవితంలో ఇలా ఎవరైనా అడిగితే నా చేతుల్లో దెబ్బలు తింటారు. సినిమాల్లో చేస్తావుగా అంటే.. అది సినిమా. అందులో పాత్రలు చేస్తాయి తప్ప, నేను చేయను. హార్ట్ ఎటాక్ సినిమాలో నేను చేసిన &lsquo;హయతీ&rsquo;పాత్ర ముద్దు పెట్టింది కానీ, నేను కాదు. నేను నటించిన కమాండో 2లో కూడా ముద్దు సీన్ ఉంది. అందులోనే నేను చేసిన భావన రెడ్డి పాత్ర ముద్దు ఇచ్చింది కానీ నేను కాదు. ఈ ట్వీట్లు పరుష జాతికి వ్యతిరేకం కాదు. సినిమాల్లో చేశావు కదా.. నిజ జీవితంలో ఏమైంది? అని ప్రశ్నించడం దారుణమైన విషయం. మరి అలా అంటే నేను 1920 సినిమాలో దెయ్యంగా నటించాను..రాత్రిళ్లు చాలా మందిని చంపేశాను.. నిజజీవితంలో కూడా అలానే ఉండాలనేవాళ్ళు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి..&rsquo; అంటూ అదా వరస ట్వీట్లు పెట్టి ఎయిర్ పోర్టులో పరిణామంపై తన అసహనాన్ని వ్యక్తం చేసింది. I have never had a twitter outburst in the 3 yrs that I've been on twitter but accusations of &quot;being insulted&quot; for not being given a &quot;HARMLESS KISS&quot; have provoked me. I speak for a lot of girls here when I say the following ... &mdash; Adah Sharma (@adah_sharma) December 5, 2017 A kiss for me isn't harmless!You say &quot;what's the big deal&quot; well who are u to decide what deal is big and small for me?Deals aside,I want to choose who I exchange saliva with or whose cheeks/other parts I plant my lips on! Or who I want to make eye contact with too.(Male/female) &mdash; Adah Sharma (@adah_sharma) December 5, 2017 Bhavana Reddy kissed in a public place in Commando2, Hayaati had a 1 hr 45 minute kiss in Heartattack but I'm Adah Sharma am NOT THEM!!!i'm happy my performances convince you that I am these people but the real me reacts,dresses,breathes,lives differently
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV తమిళంలోకి నాగార్జున హిట్ సినిమా! తమిళంలో నాగార్జున హిట్ సినిమా! | Updated: Jan 18, 2017, 04:08PM IST క్రమక్రమంగా నాగార్జునకి కోలీవుడ్&zwnj;లో కూడా మార్కెట్ పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. గతేడాది నాగ్, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఊపిరి మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, నాగ్ నటించిన మరో హిట్ సినిమా ఇప్పుడు కోలీవుడ్&zwnj;లో డబ్బింగ్ అవుతోంది. 2015 సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయిన నాగార్జున సినిమా సోగ్గాడే చిన్నినాయన మూవీ తమిళ డబ్బింగ్ వెర్షన్ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. సోగ్గాడే చిన్నినాయన మూవీ బాగా నచ్చడంతోపాటు తమిళతంబీల అభిరుచికి అనుగుణంగా వుందట. అంతేకాకుండా ఈ చిత్రంలో నటించిన లీడింగ్ లేడీస్ రమ్యక్రిష్ణ, అనుష్క, లావణ్యా త్రిపాఠి, హంసానందిని వంటి వాళ్లంతా తమిళ ఆడియెన్స్&zwnj;కి కూడా సుపరిచితమే. ఇక నాగ్ విషయానికొస్తే, ఇటీవలే ఊపిరి మూవీతో కోలీవుడ్ ఆడియెన్స్&zwnj;కి దగ్గరయ్యాడు నాగ్. అలా మొత్తానికి 'సోగ్గాడు' కోలీవుడ్ బాట పట్టినట్టు సమాచారం. ఇదే ఫిబ్రవరిలో నాగ్ లేటెస్ట్ మూవీ 'ఓం నమో వేంకటేశాయ' సైతం రిలీజ్&zwnj;కి రెడీ అవుతోంది.
0business
మిస్త్రీ వాటా విక్రయం దిశగా అడుగులు..! - టాటా గ్రూపు కసరత్తు - నూతన చైర్మెన్‌ రేసులో ప్రముఖులు న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు పక్కలో బల్లెంగా మారిన సైరస్‌ మిస్త్రీ వాటాలను ఇతరులకు విక్రయించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. మిస్త్రీ ఉద్వాసనతో చెలరేగిన దుమారానికి చెక్‌ పెట్టేందుకు గాను టాటా సన్స్‌ ఈ యోచనలో ఉందని బ్లూమ్‌బర్గ్‌ ఒక ప్రత్యేక కథనాన్ని వెల్లడించింది. టాటాలోని మెజార్టీ స్టాక్‌ హోల్డర్స్‌ అయినా మిస్త్రీ కుటుంబానికి చెందిన షాపూర్జీ, పల్లోంజి గ్రూప్‌ వాటా కొనుగోలుదారులకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. టాటా సన్స్‌లోని షాపూర్జీ పల్లోంజికి 18 శాతం వాటా ఉంది. దీని కొనుగోలుకు ఆసక్తిగల భాగస్వాముల కోసం టాటా గ్రూపు అన్వేశిస్తోందని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. దీని విలువ 16 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సమర్థవంతమైన కొనుగోలుదారుల కోసం ప్రాథమిక చర్చలు మొదలు పెట్టిందని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. కాగా టాటాలు మిస్త్రీ కుటుంబం వాటాను కొనుగోలుకు ఆసక్తి ఉన్న సావరిన్‌ హెల్త్‌ ఫండ్‌ (ప్రభుత్వ ఆధీనంలో ఇన్వెస్ట్మెంట్‌ ఫండ్‌) ఇతర దీర్ఘకాల పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. మార్కెట్‌ విలువ ప్రకారం టాటా సన్స్‌ లిస్టెడ్‌ కంపెనీ 65 బిలియన్‌ డాలర్ల వాటాను కలిగి ఉంది. టాటా సన్స్‌లో టాటా ట్రస్టుకు 66 శాతం వాటా ఉంది. పల్లోంజీ గ్రూపు 18 శాతం వాటా కలిగి ఉంది. కాగా ఆసియాలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, టాటా మోటార్స్‌, జగ్వార్‌ అండ్‌ లాండ్‌ రోవర్‌ వాహనాలతో పాటు ఇండియన్‌ హోటళ్లు టాటా సన్స్‌లో కీలకంగా ఉన్నాయి. ఈ వాటా కొనుగోలు, విక్రయాలపై వ్యాఖ్యానించడానికి టాటాసన్స్‌, షాపూర్జీ పల్లోంజీ గ్రూపు తిరస్కరించాయి. ఈ విక్రయం జరిగితే టాటా గ్రూపు మరింత అనిశ్చితిలోకి నెట్టబడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈవార్తలను ఈక్విటీ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పరాస్‌ బోత్రా ఖండించారు. ఇది అంత సులభంగా తేలే వ్యవహారం కాదనీ పేర్కొన్నారు. మిస్త్రీ తన పోరాటాన్ని వదులుకోరని అభిప్రాయపడ్డారు. మొదలైన టాటా చైర్మెన్‌ రేసు.. టాటా అండ్‌ సన్స్‌ నూతన చైర్మెన్‌ ఎంపిక కసరత్తులో ఆ కంపెనీ బిజీబిజీగా ఉంది. కొత్త చైర్మెన్‌ కోసం అత్యున్నత స్థాయి బందం అన్వేషణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మెన్‌ పదవికి టీసీిఎస్‌ సీఈఓ ఎన్‌.చంద్రశేఖరన్‌, జాగ్వార్‌ లాండ్‌రోవర్‌ అధినేత రాల్ఫ్‌స్పెత్‌లను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా చైర్మెన్‌ పదవికి మిస్త్రీ బావ, ట్రెంట్‌ లిమిటెడ్‌ చైర్మెన్‌ నోయెల్‌ టాటా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఫిబ్రవరి నెలాఖరులోగా కొత్త చైర్మెన్‌ను ఎంపిక చేయనున్నారు. ఈ విషయమై చంద్రశేఖరన్‌, రాల్ఫ్‌స్పెత్‌లు టాటా అండ్‌ సన్స్‌ సంస్థ కానీ ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అయితే ప్రాథమిక జాబితా మారే అవకాశం ఉందని, ఈ నియామకాన్ని పూర్తి చేసేందుకు సెర్చ్‌ కమిటీకి నాలుగు నెలలు తీసుకోవచ్చని సమాచారం. తప్పు చేస్తే వదలం : మంత్రి అశోక గజపతి రాజు ఎయిర్‌ ఆసియా ఒప్పందంపై ఏమైనా అవకతవకలు, ఉల్లంఘనలు జరిగాయా అన్న అంశం పరిశీలిస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ప్రకటించారు. టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్‌లైన్స్‌ వెంచర్స్‌లో పలు లోపాలున్నాయని, ఎయిర్‌ ఆసియా డీల్‌లో 22 కోట్ల రూపాయల తప్పుడు లావాదేవీలు జరిగాయని సైరస్‌ మిస్త్రీ ఆరోపించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఎవరైనా సరే దేశీయ చట్టాలకు కట్టుబడాల్సిందేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించినట్టు ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని లోతుగా పరిశీలిస్తామని ఆయన అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రూ. 14 వేలకే ఆకట్టుకునే ల్యాప్‌టాప్, మంచి అవకాశం దేశీయ ల్యాప్‌టాప్ మార్కెట్లోకి మరో సరికొత్త‌ ల్యాపీ వచ్చి చేరింది. అందుబాటు ధరల్లో ల్యాపీలను విడుదల చేస్తూ ముందుకు దూసుకెళుతున్న దిగ్గజం ఐబాల్ సంస్థ తాజాగా అత్యంత తక్కువ ధరలో మరో డివైస్ విడుదల చేసింది Samayam Telugu | Updated: May 10, 2018, 03:32PM IST ఐబాల్ కాంప్‌బుక్ దేశీయ ల్యాప్‌టాప్ మార్కెట్లోకి మరో సరికొత్త‌ ల్యాపీ వచ్చి చేరింది. అందుబాటు ధరల్లో ల్యాపీలను విడుదల చేస్తూ ముందుకు దూసుకెళుతున్న దిగ్గజం ఐబాల్ సంస్థ తాజాగా అత్యంత తక్కువ ధరలో మరో డివైస్ విడుదల చేసింది. కాంప్‌బుక్ మెరిట్‌ జీ9 పేరుతో విండోస్‌ 10 ల్యాప్‌టాప్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. 1.1కేజీల అతి తేలికపాటి బరువుతో తమ ల్యాప్‌టాప్‌లో సెల్‌రాన్‌ ఎన్‌3350 ప్రాసెసర్‌ , మల్టీ ఫంక్షనల్‌ టచ్ ప్యాడ్‌, ఆరు గంటల బ్యాటరీ లైఫ్‌ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెబుతోంది. ఐబాల్‌ కాంప్‌బుక్ మెరిట్‌ జీ9 రోజువారీ కస్టమర్ల కంప్యూటింగ్ అవసరాలను తీర్చడం కోసం ప్రీమియం డిజైన్‌తో ఆల్-ఇన్-వన్ ల్యాప్‌ట్యాప్ కు రూపకల్పన చేశామని ఐబాల్ డైరెక్టర్, సీఈఓ సందీప్‌ పరశాంపురియా ఒక ప్రకటనలో తెలిపారు. ఫీచర్ల గురించి ఈ కింద తెలుసుకుందాం. ఐబాల్‌ కాంప్‌బుక్ మెరిట్‌ జీ9 స్పెసిషికేషన్స్ 11.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే 1366x768 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 2.4గిగాహెడ్జ్‌ ఇంటెల్‌ సెల్‌రాన్‌ ఎన్‌ 3350 ప్రాసెసర్‌ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఎక్స్‌టర్నల్‌ ఎస్‌ఎస్‌డీ ద్వారా ఒక టీబీ విస్తరణ సామర్ధ్యం. 0.3 మెగాపిక్సెల్‌ వెబ్ కెమెరా డ్యుయల్ బ్యాండ్ వైర్‌లెస్‌ ఏసీ3165, బ్లూటూత్ 4.0, మినీ హెచ్‌డీఎంఐ 4.1పోర్ట్, 2.0.+ 3.0 యూఎస్‌బీ పోర్ట్స్‌   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కంగనా-హృతిక్‌ ఎఫైర్ ఎందుకు చెడింది ? బాలీవుడ్‌లో గ్రీక్ గాడ్‌గా పేరున్న హృతిక్ రోషన్‌కి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌కి మధ్య ఎఫైర్ వుందనేది బాలీవుడ్ టాక్. TNN | Updated: Jan 31, 2016, 05:24PM IST కంగనా-హృతిక్‌ ఎఫైర్ ఎందుకు చెడింది ? బాలీవుడ్‌లో గ్రీక్ గాడ్‌గా పేరున్న హృతిక్ రోషన్‌కి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌కి మధ్య ఎఫైర్ వుందనేది బాలీవుడ్ టాక్. అయితే ఈ మధ్య కాలంలో ఆ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ దెబ్బతిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం తాజాగా ఆయన తనపై వస్తున్న డేటింగ్‌కి సంబంధించిన వార్తల్ని ఖండించడంతోపాటు అసలు ఆమె ఎవరో తనకి ఏ మాత్రం తెలీదు అన్నట్టుగా వ్యవహరించడమేనట. రెండ్రోజుల క్రితం ఈ రూమర్స్‌పై స్పందించిన హృతిక్.. ఆమె పేరు చెప్పకుండానే పోప్‌తో డేటింగ్ చేయడానికైనా సిద్ధమే కానీ అటువంటి వారితో డేటింగ్ చేయలేనని ట్వీట్ చేశాడు. అన్నింటికిమించి తన ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోననే భయంతో కంగనాతో తనకే సంబంధం లేదన్నట్టుగా హృతిక్ మాట్లాడటం ఆమెకి అస్సలు మింగుడు పడటం లేదట. గత కొంతకాలంగా హృతిక్, కంగనా డేటింగ్‌లో వున్నారని బలీవుడ్ అంతా కోడై కూస్తోంటే ఆయన మాత్రం తనకేమీ తెలీదన్నట్టుగా వ్యవహరిస్తుండటంపై కంగనా తీవ్ర అసంతృప్తితో వున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. బాలీవుడ్‌లో ఓపెన్ మైండెడ్ హీరోయిన్‌గా పేరున్న కంగనా.. అవసరమైతే, సమయం వచ్చినప్పుడు తాను చెప్పాలనుకున్నదేదో బహిరంగంగానే చెప్పి తీరుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 2, Aug 2019, 4:03 PM IST Highlights సినీ నటుడు రాజశేఖర్ పై సోషల్ మీడియాలో ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ రూల్స్ విషయంలో సామాన్యుల పట్ల ఒకలా, సెలబ్రిటీల విషయంలో మరోలా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. హీరో రాజశేఖర్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినందుకుగాను రూ. 18 వేల వరకు చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు వచ్చాయి.  సినీ నటుడు రాజశేఖర్ పై సోషల్ మీడియాలో ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ రూల్స్ విషయంలో సామాన్యుల పట్ల ఒకలా, సెలబ్రిటీల విషయంలో మరోలా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. హీరో రాజశేఖర్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినందుకుగాను రూ. 18 వేల వరకు చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు వచ్చాయి.  ఆ వార్త గురించి ప్రస్తావిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది. చలానాలు పెండింగ్ లో ఉన్నా రాజశేఖర్ ఫ్రీగా హైదరాబాద్ లో తిరుగుతున్నారు.. పోలీసులు ఏం చేయలేరా అని ప్రశ్నించింది. దీని రాజశేఖర్ సమాధానం ఇచ్చారు. డోంట్ వర్రీ.. చలానాలు కట్టేశా. భవిష్యత్తులో నా చలానాలు పెండింగ్ లో ఉండవు.  తప్పు చేసిన వారు ఎవరైనా ఫ్రీగా తిరగలేరు. పోలీసులు స్పందించలేదు అంటే దానికి కారణం వారితో నేను చర్చలు జరుపుతున్నాను అని రాజశేఖర్ వెల్లడించారు. సినిమాల విషయాన్ని వస్తే రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం ఇటీవల విడుదలై పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.  Last Updated 2, Aug 2019, 4:03 PM IST
0business
internet vaartha 164 Views రెండు రోజులు ప్రపంచ రికార్డు రియో  డి జెనీరో : తొలి ఒలింపిక్స్‌ ఆడుతున్న ఒక కుర్రాడు రికార్డు సాధించాడు. కాగా రెండు రోజుల్లో రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడం దిగ్గజ క్రీడా కారులకు కూడా సాధ్యం కాదు. అయినా బ్రిటన్‌కు చెందిన యువ స్విమ్మర్‌ ఆడమ్‌ పేటీ రియో ఒలింపిక్స్‌లో జరిగిన స్విమ్మింగ్‌ 100 మీటర్ల బ్రెస్ట్‌ స్టోక్‌ పోటీల్లో పాల్గొన్న పీటి క్వాలిఫైయింగ్‌ పోటీల్లో కూడా విజృంభించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కాగా 57.55 సెకన్లలో టార్గెట్‌ చేరుకున్న పీటీ ఇంతటితో తృష్టి పడలేదు. ఒలింపిక్స్‌ స్వర్ణంపై దృష్టిపెట్టాడు. ఫైనల్స్‌లో తన రికార్డును తాను బద్దలు కొడుతూ 57.13 సెకన్ల టైమింగ్‌ నమోదు చేశాడు.
2sports
Yadav చివరి టెస్టులో కీలక మార్పులు చెన్నై: ఇంగ్లండ్‌తో చివరి ఐదవ టెస్టుకు టీమిండియాలో రెండు కీలక మార్పులు చేశారు.కాగా గాయపడిన జయంత్‌ యాదవ్‌లు విశ్రాంతి నిచ్చి,అతని స్థానంలో అమిత్‌ మిశ్రాను తుది జట్టులోకి తీసుకున్నారు.అలాగే యువ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో సీనియర్‌ ఇషాంత్‌ శర్మను తీసుకున్నారు.ఈ రెండు మార్పులు మినహా నాలుగవ టెస్టులో ఆడిన భారత ఆటగాళ్లే అయిదవ మ్యాచ్‌ లో బరిలోకి దిగారు.చెన్నైలో శుక్రవారం ఆరంభమైన ఐదవ టెస్టులో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. కోహ్లీ సేన ఇప్పటికే ఈ సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకున్న సంగతి తెలిసిందే.చెన్నై టెస్టులో విజయం సాధించి,సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలనే పట్టుదలతో ఉంది
2sports
internet vaartha 103 Views హైదరాబాద్‌ : కార్పొరేట్‌ సామాజిక బాధ్యతల్లో భాగంగా మాగ్మాఫిన్‌కార్ప్‌ తాజాగా 50 మంది నిరుపేద విద్యార్ధులకు ఉపకార వేతనాలను అందిస్తోంది. ఇంటర్మీడియేట్‌ మంచి ప్రతిభ కలిగిన విద్యార్ధులకు వారి ఉన్నత విద్యకోసం ఈ అవకాశాలు కల్పిస్తోంది. మాగ్మాఫిన్‌కార్ప్‌ సామాజిక బాధ్యతల్లో భాగంగా ఈ ఎంస్కాలర్‌ను ఆవిష్కరించినట్లు సిఎస్‌ఆర్‌ హెడ్‌ కౌశిక్‌సిన్హా వివరించారు. గత ఏడాది 50 మందికి అందించామని, ఏడాదికి సిఎస్‌ఆర్‌ రూపంలో ఐదు కోట్లు ఖర్చుచేస్తున్నామని, ఉన్నత విద్యలో మూడేళ్లపాటు ప్రతిఏటా 50 మందికి కొత్తవారికి సైతం ఈ ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. నెలసరి ఆదాయం రూ.10వలు తక్కువ ఉన్నవారికి ఈ ఉపకార వేతనాలు అందిస్తామన్నారు. భారతీయపౌరులైనవారు, ఆగస్టు నాటికి 20 ఏళ్లు నిండి ఉండాలి. విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీకోర్సులు అందుతాయి. నెలకు ఐదువేల రూపాయల చొప్పున సంస్థ విద్యార్థులపేరిట బ్యాంకు ఖాతాలకు జమచేస్తుందని కౌశిక్‌ వెల్లడించారు. కనీసం 80శాతం ఆపై మార్కులు సాధించిన నిరుపేద విద్యార్ధులకు ఉన్నత విద్యను అందిస్తామన్నారు. బ్యాంకకుఆతావివరాలు, 12వ తరగతి మార్కుల జాబితా, రెండు పాస్‌ పోర్టు ఫోటోలు, వయసు ధృవీకరణ, చిరునామా, తల్లితండ్రుల ఆదాయ సర్టిఫికేట్లు ఉండాలి. దరఖాస్తులు ఈనెల 30వ తేదీలోపు అందించాలని కౌశిక్‌ వివరించారు. అభ్యర్ధులు సిఎస్‌ఆర్‌ పేరిట మాగ్మాడాట్‌కోడాట్‌ఇన్‌ కు మెయిల్‌ ద్వారా పంపించవచ్చని, తన వ్యక్తిగత వాట్సాప్ నెంబరు 7044033714కు మిస్‌కాల్‌ ఇచ్చినా తాము చేస్తామని లేదా దేశవ్యాప్తంగా తమ కార్యాలయాల్లో సంప్రదిస్తే వారే దరఖాస్తులు స్వీకరిస్తారని మాగ్మా సిఎస్‌ఆర్‌ హెడ్‌ వివరించారు. కేవలం విద్యారంగానికేకాకుండా పిసిఆర్‌ఐ సౌజన్యంతో ట్రక్‌డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించినట్లు కౌశిక్‌ వెల్లడించారు.
1entertainment
services సేవల రంగంలో శరవేగంగా వృద్ధి న్యూఢిల్లీ, జూన్‌ 7: భారత్‌సేవలరంగం వృద్ధి గడచిన అక్టోబరు నుంచి శరవేగంగా వృద్ధిచెందు తున్నట్లు నిక్కీ పిఎంఐ సూచి సర్వేలు వెల్లడిస్తున్నా యి. ఉత్పత్తి రంగంలో స్వల్పవృద్ధికంటే సేవల రంగంలో వృద్ధి మరింతగా పెరుగుతున్నట్లు పిఎంఐ సర్వే వెల్లడించింది. భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు గడచిన నాలుగేళ్లలో కల్పించిందన్నారు. ఉత్పత్తిరం గంలో ఉపాధి గణాంకాలు తగ్గాయి. సేవలరంగంలో ఇదేతీరు వృద్ధి కొనసాగితే దేశ ఆర్థికవృద్ధి మొదటి త్రైమాసికంలోనే మరింత పెరుగుతుందని అంచనా వేసింది. భారత్‌ ఆర్థికవృద్ధి నాలుగుత్రైమాసికాల దిగు వన అంటే 6.1శాతంగా ఉందని పెద్దనోట్ల రద్దు ప్రభావమే ఇందుకు కీలకమని నిక్కీ పిఎంఐ ప్రకటించింది. భారతీయ రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించనున్న రెపోరేట్ల సమీక్ష కొంత ప్రభావం చూపిస్తుందని అంచనా. ఆతిధ్యరంగంలోని పిఎంఐ 52.2 పాయింట్లుగా నమోదయింది. ఏప్రిల్‌లో50.2 పాయింట్ల నుంచి పెరిగింది. 50 పాయింట్లను దాటితే వృద్ధిగాను, తగ్గితే తిరోగమనంగాను పరిగణిస్తారు. కొత్త బిజినెస్‌పరంగా సేవలరంగంలో వృద్ధి కనిపిస్తుంది. అదే స్థాయిలో ఉపాధి కల్పనలో కూడా వృద్ధి ఉంటుందని అంచనావేసింది. సేవలరంగంలో వృద్ధి మొదటిత్రైమా సికంలో స్థూల దేశీయోత్పత్తి మరింతగా పెంచేందుకు దోహదంచేస్తుందని రానురాను మరింతగాపెరుగుతుం దని, ఐహెచ్‌ఎస్‌ మార్కెట్‌ ఆర్థికవేత్త పాల్లియాన్నా డిలీమా వెల్లడించారు. నిక్కీ ఇండియా కాంపోజిట్‌ పిఎంఐ ఉత్పత్తి సూచి, సేవలరంగసూచి రెండూ కూడా సానుకూలంగాఉన్నాయి. ఏడునెలల గరిష్టస్థాయికి అంటే 52.5 పాయింట్లకు మేనెలలో చేరాయి. అదే ఏప్రిల్‌నెలలో 51.3 పాయిం ట్లుగా ఉన్నాయి. అయితే ఈ లోపు రిజర్వుబ్యాంకు ఆర్థికవృద్ధికి ఊతం ఇస్తూ కొంత వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని డీలీమా వెల్లడించారు.
1entertainment
ఈ సీన్ సినిమాలో ఉంటే.. థియేటర్ దద్దరిల్లేది! (వీడియో) Highlights  బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎందుకు ఆలస్యమైందో మహేశ్ ఇచ్చే వివరణ సూపర్ స్టార్ మహేష్ బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ భరత్ అనే నేను. ఈ సినిమాలో ప్రతీ సీన్ హైలెటే. ముఖ్యంగా అసెంబ్లీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అసెంబ్లీలో కమెడియన్ పృధ్వీ, పోసాని కృష్ణ మురళిల మధ్య సీన్స్ కామెడీని పండించాయి. అయితే ఈ సినిమాలో చూపించని సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి.
0business
ఐపిఎల్‌లో అరుదైన రికార్డు ధావన్‌-వార్నర్‌ల భాగస్వామ్యం న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, డేవిడ్‌ వార్నర్‌ల జోడీ అరుదైన రికార్డుని నెల కొల్పింది.టి20 క్రికెట్‌లో 2000 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడిగా చరిత్ర సృష్టిం చారు.టి20 ఫార్మెట్‌ల ఏ వికెట్‌ కైనా ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం.సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరు కలిసి ఆరవసారి తొలి వికెట్‌కు వంద పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.తద్వారా టి20 ఫార్మాట్‌లో 2 వేల మైలురాయిని కూడా అధిగమించారు.అంతే కాదు ఐపిఎల్‌ చరిత్రలో ఆరుసార్లు 100 పరుగులు సాధించిన ఓపెనింగ్‌ జోడీ కూడా వీరిద్దరే కావడం విశేషం.దీంతో పాటు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు.ఉప్పల్‌ స్టేడియంలో 1000 పరుగులు చేసిన అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ ఈ రికార్డు సాధించాడు.కౌల్టర్‌ -నైట్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నాలుగవ బంతిని బౌండరీ బాదడంతో వార్నర్‌ ఈ ఘనతకు చేరుకున్నాడు.మరోవైపు ఈ మ్యాచ్‌లో 59బంతులు ఆడి 8 సిక్సర్ల సా యంతో 126 పరుగులు చేసిన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అత్యంత వేగంగా సెంచరీ సాధించిన అయిదవ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు డివిలియర్స్‌ తో కలిసి ఈ స్థానంలో నిలిచాడు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV కబాలి.. 26న తెలుగు ఆడియో లాంచ్ కబాలి సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న రజనీ అభిమానులకు సంతోషాన్నిచ్చే వార్త. TNN | Updated: Jun 21, 2016, 02:17PM IST కబాలి.. 26న తెలుగు ఆడియో లాంచ్ కబాలి సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న రజనీ అభిమానులకు సంతోషాన్నిచ్చే వార్త. ఈ సినిమా కోసం తెలుగులోనూ ఆడియో ఫంక్షన్‌ను నిర్వహించాలని ఆ చిత్ర నిర్మాతలు డిసైడయ్యారు. జూన్ 26న ఆడియో విడుదల ఉంటుందని తలిపిన నిర్మాతలు కె. ప్రవీణ్ కుమార్, కె.పి. చౌదరి ఇప్పటికే సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఆడియో వేడుక కోసం సినీ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. తమిళంలో కబాలికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. తెలుగు వెర్షన్‌కు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, వనమాలి పాటలు రాశారు. కబాలి టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. యూట్యూబ్లో టీజర్ పెట్టిన నాలుగు రోజుల్లోనే 49 లక్షల మందికి పైగా ఈ టీజర్ వీక్షించారు. ఈ టీజర్లో రజనీ చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఈ సినిమా కోసం తమిళ, తెలుగు చిత్ర రంగాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
చమురు మంటకు ఎగిసిన ద్రవ్యోల్బణం - నాలుగు నెలల గరిష్టానికి డబ్ల్యూపీఐ - మూడు నెలల ఎగువకు చేరిన సీపీఐ న్యూఢిల్లీ: ముడి చమురు ధరల మంటకు గత నెలలో టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణాలు పెరిగాయి. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) నాలుగు నెలల గరిష్టాన్ని తాకగా.. వినియోగదారు ధరల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం (సీపీఐ) మూడు నెలల గరిష్టానికి ఎగిసినట్టుగా సర్కారు గణాంకాలు చెబుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌, కూరగాయలు, పండ్ల ధరలు పెరగడంతో గత (ఏప్రిల్‌) నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ పెరిగింది. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ నెలలో టోకు ద్రవ్యోల్బణం 3.18 శాతంగా నమోదైంది. అంతకుముందు మార్చి నెలలో ఇది 2.47శాతంగా ఉంది.గతేడాది ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐ 3.85 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్భణం పెరగడానికి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం.. దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమనడమే కారణమని ప్రభుత్వ తన వివరణలో పేర్కొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణానిది అదే బాట.. మరోవైపు ఏప్రిల్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. మార్చిలో 4.28 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నాటికి 4.58 శాతానికి చేరుకున్నట్టుగా సర్కారు సోమవారం తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ‘బ్యాంక్ దోపిడీ చేస్తే ఐపీసీ సెక్షన్ 393 కింద ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించాల్సి ఉంటుంది’ అని సరదాగా ట్వీట్ చేశారు. ఇందుకు ప్రియాంక స్పందిస్తూ.. ‘అయ్యో.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయా. ప్లాన్ బి యాక్టివేట్ చేయాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర పోలీసులు క్రైమ్ కేసులనే కాదు అప్పుడప్పుడూ సినిమాలపైనా వారు స్పందిస్తుంటారు. ఏదన్నా సినిమాలో తమకు పనికొచ్చే సన్నివేశాలు కానీ డైలాగులు కానీ ఉంటే వాటిని స్క్రీన్ షాట్ తీసి ట్విటర్‌లో పోస్ట్ చేస్తుంటారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి కూడా వారు సినిమా డైలాగులను వాడుతుంటారు. Seven years imprisonment with fine under IPC Section 393 #ColoursOfLaw #TheSkyIsPink @priyankachopra @FarOutAkhtar https://t.co/0lTGrY0uZS &mdash; Maharashtra Police (@DGPMaharashtra) 1568126393000 READ ALSO: అవును.. అతనితో ప్రేమలో ఉన్నాను: తాప్సి ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమాను షొనాలీ బోస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక, ఫర్హాన్ అక్తర్ భార్యాభర్తలుగా నటించారు. ‘దంగల్’ ఫేం జైరా వాసిం... ప్రియాంక, ఫర్హాన్ల కుమార్తె పాత్రను పోషించారు. అయితే జైరా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుంటుంది. ఎక్కువ రోజులు బతకదు అని వైద్యులు తేల్చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రియాంక, ఫర్హాన్‌ల మధ్య గొడవలు తలెత్తుతాయి. తన తల్లిదండ్రుల 25 ఏళ్ల ప్రేమ గురించి జైరా తన నరేషన్‌లో చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంక చోప్రా నటిస్తు్న్న బాలీవుడ్ చిత్రమిది. X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
jr ntr bigg boss episode 57 in telugu బిగ్‌బాస్: రేస్ రివర్స్.. ప్రిన్స్ ఔట్! బిగ్‌బాస్ సీజన్ 1 చివరిదశకు చేరుకోవడంతో రోజు రోజుకూ సస్పెన్స్ థ్రిల్లర్‌‌ను తలిపిస్తుంది బిగ్ బాస్ షో. ఇప్పటికి 56 ఎపిసోడ్‌లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి 57వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. TNN | Updated: Sep 10, 2017, 11:38PM IST బిగ్&zwnj;బాస్ సీజన్ 1 చివరిదశకు చేరుకోవడంతో రోజు రోజుకూ సస్పెన్స్ థ్రిల్లర్&zwnj;&zwnj;ను తలిపిస్తుంది బిగ్ బాస్ షో . ఇప్పటికి 56 ఎపిసోడ్&zwnj;లను సక్సెస్&zwnj;ఫుల్&zwnj;గా కంప్లీట్ చేసి 57వ ఎపిసోడ్&zwnj;లోకి ఎంటర్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ రేస్&zwnj;లో ఉన్న ఆదర్శ్, ప్రిన్స్, నవదీప్&zwnj;లు ఎలిమినేషన్&zwnj;లో ఉండటంతో వీరిలో హౌస్&zwnj;ని వీడేదెవరన్న ఆసక్తితో సాగింది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జీని ఎప్పటిలాగే బిగ్&zwnj;బాస్&zwnj;లో పాస్ చేస్తూ కన్టెస్టెంట్స్&zwnj;తో వెరైటీ కబడ్డీ ఆడించారు ఎన్టీఆర్. దీనికోసం హౌస్&zwnj;లో ఉన్న కన్టెస్టెంట్స్&zwnj;ను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రిన్స్, శివబాలాజీ, అర్చనలు ఒక టీం కాగా.. ఆదర్శ్, హరితేజ,నవదీప్&zwnj;&zwnj;లు మరో గ్రూప్&zwnj;గా ఉన్నారు. అయితే కూతకు వెళ్లే కన్టెస్టెంట్స్ కబడ్డీ.. కబడ్డీ అని కాకుండా హౌస్&zwnj;లో ఉన్న తమకు ఇష్టమైన పేరును కూతగా పెట్టాలంటూ కండిషన్ పెట్టారు. ఇక దీక్షను లెగ్ బాగోలేక పోవడంతో &lsquo;కబడ్డీ గేమ్&zwnj;కు ఆధ్వర్యం వహించమన్నారు. ఇక గేమ్ స్టార్ట్ కావడంతో &lsquo;శివ.. శివ.. శివ&rsquo;అంటూ కూత మొదలు పెట్టేసి శివబాలాజీని టచ్ చేసి తొలిపాయింట్ కొట్టేసింది. ఫన్నీ.. ఫన్నీగా సాగిన ఈ కబడ్డీ గేమ్&zwnj;లో అర్చన టీం రెండు పాయింట్ల తేడా హరితేజ టీంపై గెలుపొందింది. &mdash; STAR MAA (@StarMaa) September 10, 2017 &lsquo;నిప్పు లాంటి నిజం&rsquo; ఇప్పటి వరకూ షేర్ చేసుకోని నిజాన్ని బిగ్ బాస్ హౌస్&zwnj;లో బహిర్గతం చేయాలని అయితే కేవలం నిజం మాత్రమే చెప్పాలన్నారు. దీంతో ప్రిన్స్ జీవితంలో జరిగిన యాక్సిడెంట్&zwnj;ను తన తండ్రికి తెలియకుండా దాచానని అదే నిప్పులాంటి నిజం అంటూ ఆటను ప్రారంభించాడు. ఈ తరువాత దీక్ష, హరితేజ, ఆదర్శ్,అర్చన తమ జీవితంలో దాచిన నిజాలను షేర్ చేసుకోగా.. శివబాలాజీ తనకు ఎలాంటి నిజాన్ని దాచే అలవాటు లేదని అందుకే సీక్రెట్స్ ఏం లేవన్నారు. ఒక యాక్సిడెంట్ విషయంలో తన ప్రమేయం లేకుండా ఒక కుటుంబ పెద్ద దిక్కుని కోల్పోయిందని వాళ్లని క్షమించమని కోరుతున్నట్టు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా ఆ కుటుంబాన్ని నవదీప్&zwnj; తరపున క్షమించమని కోరారు. ఇక ఈవారం ఎప్పటిలాగే కాలర్ ఆఫ్ వీక్&zwnj;లో భాగంగా హైదరాబాద్&zwnj; నుండి ఫోన్ చేసిన శివ.. హౌస్&zwnj;లో ఉన్న శివబాలాజీతో మాట్లాడాలని మీ రొమాంటిక్ ట్రాక్ వే మారినట్లు ఉందని మొదట్లో దీక్ష అన్నారు. ఇప్పుడేమో కాస్త మారినట్లు ఉందని ఎవరో మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అని కాలర్ అడగగా.. ఎవరో కాదు హరితేజనే అంటే చెప్పేశాడు శివబాలాజీ. ఇక తప్పకుండా శివబాలాజీ బిగ్ బాస్ విన్నర్ కావాలని కోరుకుంటున్నట్టు కాలర్ తెలియజేయడంతో ధన్యవాదాలు చెప్పారు శివబాలాజీ. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీని వ్యతిరేకించిన ఆదర్శ్&zwnj;పై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. బిగ్ బాస్ అనేది 18 భాషల్లో టెలికాస్ట్ అవుతుందని ప్రతిచోట వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని దాన్ని మనం వ్యతిరేకించడం కరెక్ట్ కాదన్నారు. ఒకవేళ నువ్ అనుకున్నట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీని వ్యతిరేకిస్తే.. దీక్షను కూడా వ్యతిరేకించాలి నవదీప్&zwnj;ను మాత్రమే టార్గెట్ చేయడానికి టైటిల్ రేస్&zwnj;లో ఉండటమే కారణం అని అనుకోవచ్చా అని ఎన్టీఆర్ అడగటంతో అవుననే సమాధానం ఇచ్చారు ఆదర్శ్. ఇక ఈవారం ఎలిమినేషన్&zwnj;లో ఉన్న నవదీప్, ప్రిన్స్, ఆదర్శ్&zwnj;లలో నవదీప్ సేఫ్ జోన్&zwnj;లో ఉన్నట్టు ప్రకటించారు ఎన్టీఆర్. ఇక బిగ్ బాస్ హౌస్&zwnj;లో ఆదర్శ్ చేసిన తప్పిదం వల్ల ప్రిన్స్ ఈ వారం బిగ్ బాస్ హౌస్&zwnj;ను వీడితున్నట్టు ప్రకటించారు ఎన్టీఆర్. దీంతో ప్రిన్స్ మిగిలిన కన్టెస్టెంట్స్&zwnj;కు ధైర్యం చెప్తూ హౌస్&zwnj; నుండి బయటకు వచ్చేశాడు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన ప్రిన్స్.. బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ నవదీప్, హరితేజలలో ఎవరో ఒకరు గెలవొచ్చనన్నారు. ఇక వెళ్తూ.. వెళ్తూ బిగ్&zwnj;బాంబ్&zwnj;ను దీక్షపై వదిలాడు ప్రిన్స్. ఈ బాంబ్&zwnj;తో దీక్ష వారం రోజులపాటు ఎక్కడకు వెళ్లినా పాకుతూనే వెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్&zwnj;లో ప్రిన్స్ బిగ్&zwnj;బాస్ హౌస్&zwnj; వీడుతూ తన జీవితంలో బిగ్ బాస్ హౌస్ ఎప్పటికీ మరిచిపోలేనంటూ ఉద్వేగంగా మాట్లాడుతూ హౌస్&zwnj;ను వీడాడు ప్రిన్స్.
0business
morgon అంఫైర్‌పై ఫిర్యాదు చేయనున్న కెప్టెన్‌ మోర్గాన్‌ న్యూఢిల్లీ: రెండవ టి20లో ఇంగ్లండ్‌ ఓటమికి అంపైరింగ్‌ కారణమని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేసేందుకు సిద్దమ య్యాడు.నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో జోరూట్‌ను ఎల్‌బిడబ్ల్యూగా ప్రకటించిన అంపైర్‌ షంషుద్దీన్‌పై మోర్గాన్‌ మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేయ నున్నాడు.ముఖ్యంగా జోరూట్‌ ఔట్‌పై ఇయాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.అంపైరింగ్‌ నాణ్యతకు సంబంధించిన పీడ్‌ బ్యాక్‌తో రిఫరీకి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నాడు. జో రూట్‌ వివాదాస్పద ఔట్‌ తదుపరి గేమ్‌కు ముందే అంపైరింగ్‌పై ఫిర్యాదు చేసే అవకాశం లభించింది. క్లిష్ట సమయంలో జో రూట్‌ వివాదాస్పదంగా ఔట్‌ కావడం మా పరాజయానికి కారణమైంది.దీనిపై రిఫరీకి ఫిర్యాదు చేయనున్నాం,టి20లో డిఆర్‌ఎస్‌ ఎందుకు లేదో అర్థం కావడం లేదు అని మోర్గాన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు.20 ఓవర్‌లో విజయం నుంచి దూరం కలిగింది.ఇంగ్లండ్‌ను చాలా నిరాశపరిచింది. జో రూట్‌ వికెట్‌ కోల్పోవడంతో 20వ ఓవర్‌లో విజయం నుంచి దూరంగా వెళ్లింది.తమ ఇన్నింగ్స్‌ 20 ఓవర్‌లో జో రూట్‌ ఔట్‌ కావడమే మలుపు తిప్పింది.ఒకవేళ జో రూట్‌ ఔట్‌ను తాము సవాల్‌ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా మ్యాచ్‌ను గెలిపించే వాళ్లం అని మోర్గాన్‌ ధీమా వ్యక్తం చేశాడు. జో రూట్‌ను తొలి బంతికే ఎల్‌బిడబ్ల్యూగా చివరి ఓవర్‌ వేసిన టీమిండియా పేసర్‌ బుమ్రా,జో రూట్‌ను తన తొలి బంతికే ఎల్‌బిడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు.అయితే ఆ బంతి జో రూట్‌ బ్యాట్‌కి తగిలిన తరువాత అతని ప్యాడ్‌కు తాకినట్లు రిప్లేలో స్పష్ట మైంది. కొన్ని సందర్భాలలో ఇలా జరగడం సాధర ణమే అయినా,అదే తాము మ్యాచ్‌ కోల్పోవడానికి కారణమైందని ఇంగ్లండ్‌ పేర్కొంటుంది.చివరి ఓవర్‌లో విజయానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిన ఇంగ్లండ్‌ను కట్టడి చేసే బాధ్యతను జస్‌ప్రీత్‌ బుమ్రాకు భారత కెప్టెన్‌ కోహ్లీ అప్పగించాడు.చివరి ఓవర్‌లో ఇంగ్లండ్‌ జట్టు 8పరుగులు చేయాల్సి ఉండగా బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌ చేశాడు.తొలి బంతిలోనే జో రూట్‌ను ఔట్‌ చేశాడు.రెండవ బంతికి మోయిన్‌ అలీ సింగిల్‌ తీయగా,మూడవ బంతిలో ఒక్క పరుగు కూడా రాలేదు. నాలుగవ బంతిలో జోస్‌ బట్లర్‌ 15 పరుగుల వద్ద క్లీన్‌ బౌల్డ య్యాడు.ఐదవ బంతిలో ఒక పరుగు లెగ్‌బై రూపంలో ఇంగ్లండ్‌కు లభిం చింది.దీంతో చివరి బంతిలో ఇంగ్లండ్‌ గెలువడానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. కానీ బంతికి మె యిన్‌ అలీఔట్‌ కావడంతో ఒక్క పరుగు కూడా లభిం చలేదు.టీమిండియా ఐదుపరుగుల తేడాతో గెలి చింది. చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌల్‌ చేసిన జస్‌ప్రీత్‌ బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది
2sports
'అన్ని రకాల స్పెక్ట్రమ్‌ మా సొంతం' - అవసరం మేరకు జియోతో కాల్పనిక విలీనం - కంపెనీకి నా కుమారుడు 'అన్మోల్‌' అదృష్టం - ఏజీఎంలో ఆర్‌కామ్‌ అధినేత అనిల్‌ అంబానీ ముంబయి: రిలయన్స్‌ ఇండిస్టీస్‌ వ్యవస్థాపకుడు ధీరూభారు అంబానీ స్వప్నం సాకరం చేసేందుకు ముఖేష్‌ అంబానీ తాను ఇద్దరం ఒకే దిశగా కృషి చేస్తున్నట్లుగా ఆర్‌కామ్‌ అధినేత అనిల్‌ అంబానీ తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వాటాదారుల వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెలికాంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు అంబానీ సోదరుల వద్ద అవసరమైన 2జీ, 3జీ, 4జీ స్పెక్ట్రమ్‌తో సహా స్పెక్ట్రమ్‌ వాణిజ్యం, టెలికాం రంగంలో మౌలిక వసతులను పంచుకొనే ఒప్పందాలు తమ మధ్య ఉన్నట్లు తెలిపారు. టెలికాం అవసరాల కోసం జియో, ఆర్‌కామ్‌ సంస్థలు కాల్పనిక విలీనానికి దగ్గరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. ఇప్పటికే రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, ఆర్‌కామ్‌ మధ్య స్పెక్ట్రమ్‌ పంపక ఒప్పందం ఉంది, దీనికి తోడు జియో కూడా ఆర్‌కామ్‌తో మొబైల్‌ టవర్ల పంచుకొనే ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఇతర సంస్థలు అధికంగా వ్యయం చేయాల్సి ఉంటుందని అన్నారు. జియోతో ఒప్పందం కారణంగా తమకు ఆ అవసరం లేదని అన్నారు. ఈ అంశం తమకు బాగా కలిసి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే తమ సంస్థ రుణభారాన్ని 75% మేర తగ్గించుకొనేందుకు కృషి చేస్తున్నామన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కోహ్లీ కెప్టెన్సీలో ఆ మార్పేది..?: గవాస్కర్ సిరీస్ జరిగిన తీరు గురించి గురువారం మీడియాతో మాట్లాడిన గవాస్కర్.. కోహ్లీ కెప్టెన్సీలో అపరిపక్వత స్పష్టంగా కనబడుతోందని వెల్లడించాడు. Samayam Telugu | Updated: Sep 13, 2018, 08:24PM IST భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్ల గడుస్తున్నా.. ఫీల్డింగ్ కూర్పు, బౌలర్ల మార్పులో విరాట్ కోహ్లీ ఇంకా పరిణతి సాధించలేదని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విమర్శించాడు. ఇంగ్లాండ్ గడ్డపై మంగళవారం ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌ని భారత్ జట్టు 1-4 తేడాతో పేలవరీతిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. సిరీస్ జరిగిన తీరు గురించి గురువారం మీడియాతో మాట్లాడిన గవాస్కర్.. కోహ్లీ కెప్టెన్సీలో అపరిపక్వత స్పష్టంగా కనబడుతోందని వెల్లడించాడు. 2014 చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీతో పాటు టెస్టు క్రికెట్‌కి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
2sports
May 04,2015 జాత్యాహంకార పోలీస్‌ మాకొద్దుఅమెరికాలో నల్లజాతీయుల డిమాండ్‌ వాషింగ్టన్‌: 25 ఏళ్ల ఆఫ్రో అమెరికన్‌ యువకుడు ఫ్రెడ్డీ గ్రే విషాదాంతానికి కారణమైన ఆరుగురు పోలీసు అధికారులపై అభియోగాలు నమోదు చేస్తున్నట్లు అమెరికా న్యాయశాఖ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన నల్లజాతీయులు అమెరికాలో ఇకనైనా వర్ణ వివక్షకు తెరదించాలని డిమాండ్‌ చేశారు. 'నల్లవసంతం ఆరంభమైంది' (బ్లాక్‌ స్ప్రింగ్‌ హాజ్‌ బిగాన్‌) అంటూ వారు నినాదాలతో హోరెత్తించారు.                 'న్యాయం లేకుండా శాంతి లేదు..జాత్యాహంకార పోలీస్‌ మాకొద్దు' శనివారం అమెరికాలోని బాల్టిమోర్‌ నగర వీధుల్లో వినిపించిన నినాదాలివి. అమెరికన్‌ నల్ల జాతీయులునిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఇచ్చిన ఉద్యమ నినాదాలు. గత నెల 19న ఫ్రెడ్డీ గ్రే అనే అమెరికన్‌ ఆఫ్రికన్‌ పోలీస్‌ కస్టడీలో మృతి చెందడంతో ఆగ్రహించిన నల్ల జాతీయులు అమెరికాలోని పలు నగరాల్లో పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల విధ్వంసానికి పాల్పడ్డారు. భవనాలు, వాహనాలకు నిప్పు పెట్టడంతోపాటు పోలీసులపై దాడులకు దిగారు. ఫ్రెడ్డీ గ్రే కస్టడీ మృతిపై విచారణ జరిపిన ప్రాసిక్యూషన్‌ శుక్రవారం ఈ కేసులో నిందితులైన ఆరుగురు పోలీస్‌ అధికారులపై చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీంతో, బాల్టిమోర్‌లోని నల్లజాతీయులు విక్టరీ ర్యాలీ నిర్వహించారు. ఐతే, నగరంలో కర్ఫ్యూ అమలులో ఉండటంతో చట్టాన్ని ఉల్లంఘించారంటూ 40మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాల్టిమోర్‌లో నల్లజాతీయుల విజయోత్సవ ర్యాలీ                 పోలీసు దౌష్ట్యాన్ని నిరసిస్తూ శనివారం నాడు అమెరికాలోని వివిధ నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. బోల్డర్‌, కొలరాడో, డల్లాస్‌, హోస్టన్‌, టెక్సాస్‌, క్లీవ్‌లాండ్‌, టోలెడో, కొలంబస్‌, ఒహియో, ఫయట్టివెల్లె, అర్కన్సాస్‌, విల్లింగ్టన్‌ అండ్‌ ఛాపెల్‌ హిల్‌, నార్త్‌ కరోలినా, అల్బనీ, న్యూయార్క్‌ సిటీ, న్యూయార్క్‌, నాక్స్‌విల్లె, టెన్నిస్సి, సెయింట్‌ లూయీస్‌, మిస్సోరీ, ఆర్లాండో, తంపా, ఫ్లోరిడా, గ్రాండ్‌ రాపిడ్స్‌, మిచిగన్‌, అట్లాంటా, జార్జియా, లూయిస్‌విల్లె, లెక్సింగ్‌టన్‌, కెంటకీ, ప్రావిడెన్స్‌, రోడ్‌ ఐలండ్‌, బోస్టన్‌, మిసాచుసెట్స్‌, రిచ్‌మండ్‌, వర్జీనియా, లాస్‌ఏంజెల్స్‌, కాలిఫోర్నియా, హారిస్‌బర్గ్‌, పిట్స్‌బర్గ్‌, పెన్సిల్వేనియా, బేటన్‌రోగ, లూసియానా నగరాలతో పాటు కెనడాలోని టొరంటో, ఒంటారియో నగరాలలో భారీ ప్రదర్శనలు జరిగాయి. పోలీసు దౌర్జన్యాలకు గురవుతున్న తమలో సహనం నశించినందునే ఈ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని ఆఫ్రో అమెరికన్‌ ప్రతినిధులు వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 10, Jul 2019, 7:44 AM IST Highlights టాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న  మల్టీస్టారర్ RRRపై రోజుకో రూమర్ చక్కర్లు కొడుతోంది.. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ పాత్రలపై ఎన్ని పుకార్లు షికార్లు చేస్తున్నా చిత్రయూనిట్ పెద్దగా పట్టించుకోవడం లేదు.  టాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న  మల్టీస్టారర్ RRRపై రోజుకో రూమర్ చక్కర్లు కొడుతోంది.. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ పాత్రలపై ఎన్ని పుకార్లు షికార్లు చేస్తున్నా చిత్రయూనిట్ పెద్దగా పట్టించుకోవడం లేదు. రీసెంట్ గా స్టార్ హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ కోసం జక్కన్న 45కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్ వచ్చింది.  ఇక ఇప్పుడు అజయ్ దేవగన్ పాత్రకు సంబందించిన మరొక రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజయ్ దేవగన్ అల్లూరి సీతారామరాజు తండ్రిగా కనిపించనున్నట్లు చాలా రోజులుగా టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పాత్ర కోసం కూడా జక్కన్న భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ క్లి సంబందించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం 12కోట్ల మేర బడ్జెట్ నిర్ణయించినట్లు సమాచారం.  నెక్స్ట్ షెడ్యూల్ లో ఆ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. అజయ్ దేవగన్ కనిపించేది కొద్దీ సేపే అయినప్పటికీ సినిమాలో ఆ పాత్రకు సంబందించిన ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని టాక్. దర్శకుడు రాజమౌళి హీరోల స్టార్ డమ్ ని దృష్టిలో ఉంచుకొని యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు. 2020 జులై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.     Last Updated 10, Jul 2019, 7:44 AM IST
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV అమెజాన్‌లో జీతం: గంటకు కనీసం 15 డాలర్లు! అయితే ఈ జీత భత్యం కేవలం అమెరికాలో పని చేసే అమెజాన్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. భారత ద్రవ్యమానంలో చెప్పాలంటే, ప్రస్తుతం రూపాయి మారక విలువ ప్రకారం.. Samayam Telugu | Updated: Oct 3, 2018, 04:03PM IST తన ఉద్యోగుల జీతభత్యాల విషయంలో ఆసక్తిదాయకమైన మార్పును చేసింది ఇ కామర్స్ సంస్థ అమెజాన్ . ఈ అమెరికన్ బేస్డ్ కంపెనీ తన ఉద్యోగుల కనీస వేతనాన్ని గంటకు 15 డాలర్లుగా సెట్ చేసింది. కంపెనీలో పని చేసే పర్మినెంట్, పార్ట్ టైమ్, సీజనల్.. ఉద్యోగులు ఎవరికైనా ఇక నుంచి గంటకు కనీసం 15 డాలర్ల వేతాన్ని ఇవ్వనున్నట్టుగా ఈ కంపెనీ ప్రకటించింది. అయితే ఈ జీత భత్యం కేవలం అమెరికాలో పని చేసే అమెజాన్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. భారత ద్రవ్యమానంలో చెప్పాలంటే, ప్రస్తుతం రూపాయి మారక విలువ ప్రకారం.. అమెరికాలోని అమెజాన్ ఉద్యోగులు గంటకు కనీసం 1,100 రూపాయల వేతనాన్ని పొందుతారు.
1entertainment
MIDHALI RAJ అమ్మాయిలకు ఐపిఎల్‌ నిర్వహించండి: మిథాలీ రాజ్‌ లార్డ్స్‌: ఐసిసి మహళల ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన చూశాకైనా అమ్మాయిలకి ఐపిఎల్‌ నిర్వహంచాలనే ఆలోచన బిసిసిఐకి వస్తే బాగుంటుందని కెప్టెన్‌ మిథాలీరాజ్‌ అభిప్రాయపడింది. లార్డ్స్‌ వేధికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓడినా, చివర వరకు పోరాడి ఆకట్టు కుంది. టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్‌, అగ్రశ్రేణి జట్లకు సైతం షాకులిస్తూ ఫైనల్‌కు చేరడంతో జట్టులోకి ఒక్కో క్రికెటర్‌కి రూ.50లక్షల నజరానాని బిసిసిఐ ప్రక టించిన విషయం తెలిసిందే. లీగ్‌ దశలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత భారత జట్టు ఫైనల్‌కు చేరుతుందని ఎవ రూ ఊహించి ఉండరు. కానీ…అసాధారణ ప్రదర్శనతో ఇంగ్లాం డ్‌తో తుదిపోరులో ఢీకొన్నాం. ఆస్ట్రేలియాలో జరిగే మహిళల బిగ్‌ బాస్‌ లీగ్‌లో మంధానా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆడి ఉండటం ఇక్కడ కలిసొచ్చింది. జట్టులోని ఎక్కువమందికి ఇలా ప్రైవేట్‌ లీగ్స్‌లో ఆడే అవకాశం లభిస్తే వారు తమ ఆటను మెరుగుపర్చుకుంటారు. భారత్‌ జట్టు ప్రదర్శనపై ప్రస్తుతం బిసిసిఐ సంతృప్తిగానే ఉంటుందని అనుకుంటున్నానని మిథాలీ వివరించారు. మహిళల ఐపిఎల్‌కు శ్రీకారం చుట్టేందుకు ఇదే తగిన సమయమని మిథాలీ పేర్కొన్నారు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV MS Dhoni, Kohli సిక్స్‌ల మోత.. అరుదైన క్లబ్‌లో.. బెంగళూరులో కోహ్లి, ధోనీ అరుదైన క్లబ్‌లో చేరారు. భారత్ తరఫున టీ20ల్లో 50కిపైగా సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో చేరారు. ధోనీ ఈ జాబితాలో చేరిన కాసేపటికే కోహ్లి చేరడం విశేషం. Samayam Telugu | Updated: Feb 27, 2019, 08:57PM IST MS Dhoni, Kohli సిక్స్‌ల మోత.. అరుదైన క్లబ్‌లో.. హైలైట్స్ బెంగళూరులో కోహ్లి, ధోనీ అరుదైన క్లబ్‌లో చేరారు. భారత్ తరఫున టీ20ల్లో 50కిపైగా సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో చేరారు. ధోనీ ఈ జాబితాలో చేరిన కాసేపటికే కోహ్లి చేరడం విశేషం. చిన్నస్వామి స్టేడియంలో ధోనీ, కోహ్లి 50 సిక్స్‌ల క్లబ్‌లోకి చేరారు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధోనీ.. తర్వాత కసిగా బ్యాటింగ్ చేశాడు. డార్సీ షార్ట్ వేసిన తర్వాతి ఓవర్లో మోకాళ్ల మీద నిలబడి సిక్స్ కొట్టిన ధోనీ.. డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్స్‌లు కొట్టిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్స్‌లు బాదిన ధోనీ 40 పరుగులు చేశాడు. ధోనీ 13వ ఓవర్లో 50 సిక్స్‌ల క్లబ్‌‌లో చేరిన కాసేపటికే.. కోహ్లి కూడా చేరాడు. నైల్ విసిరిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాది బెంగళూరు స్టేడియాన్ని హోరెత్తించాడు. చిన్నస్వామి స్టేడియంలో టీ20ల్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో డివిలియర్స్ (102)ను దాటేశాడు. గేల్ బెంగళూరులో 150 సిక్స్‌లు కొట్టడం విశేషం. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో.. రోహిత్ శర్మ 102 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. యువరాజ్ 74 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. సురేశ్ రైనా 58 సిక్స్‌లతో మూడో స్థానంలో నిలిచాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 18, Apr 2019, 9:52 AM IST Highlights యంగ్‌ రెబెల్‌ స్టార్ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్కౌంట్ తెరిచిన సంగతి తెలిసిందే. అయితే తెరిచిన వెంటనే తన ఖాతాలో  ప్రొఫైల్‌ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్‌ చేయకపోవటం అభిమానులకు నిరాశకలిసిగించి. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ పోస్ట్‌ పెట్టకపోయినా అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన ఎక్కౌంట్ కు ఎనిమిది లక్షలకు చేరువలో ఫాలోవర్లు ఉండటం గమనార్హం.   యంగ్‌ రెబెల్‌ స్టార్ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్కౌంట్ తెరిచిన సంగతి తెలిసిందే. అయితే తెరిచిన వెంటనే తన ఖాతాలో  ప్రొఫైల్‌ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్‌ చేయకపోవటం అభిమానులకు నిరాశకలిసిగించి. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ పోస్ట్‌ పెట్టకపోయినా అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన ఎక్కౌంట్ కు ఎనిమిది లక్షలకు చేరువలో ఫాలోవర్లు ఉండటం గమనార్హం.   కేవలం ఎక్కౌంట్ కు యాక్టర్‌ ప్రభాస్‌ అన్న పేరు మాత్రమే పెట్టుకున్నా ....ఆ ఒక్క పేరు చూసి ఇంత మంది అభిమానులు ఖాతాను అనుసరించడం మొదలుపెట్టారంటే ‘బాహుబలి’కి ఉన్న ఫాలోయింగ్‌ ఎంతో అర్థమవుతోంది. దాంతో ఆయన  బాహుబలి సినిమాలో పిక్‌ని ఫస్ట్ పోస్ట్ చేశారు.. ఆ ఫొటోను చూసి ‘కత్తిలా ఉంది’ అంటున్నారు ఫ్యాన్స్ . బాహుబలి సినిమాలోని ఈ ఫొటో కానీ,సీన్ కానీ బయిటకు రాలేదు.  దాంతో ఈ ఫొటోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ప్రభాస్ అభిమానలు ఈ ఫొటోను తమ ప్రొఫైల్ గా పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’షూటింగ్ తో బిజీగా ఉన్నారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్‌ ‘సాహో’కు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ . సినిమా మొత్తంలో ప్రభాస్‌ చేసే జెట్‌మ్యాన్‌ స్టంట్‌ హైలైట్‌గా ఉంటుందని చిత్రవర్గాలు అంటున్నాయి. ఈ సన్నివేశం ఉండాలని ప్రభాసే నిర్ణయించారట. ఇందుకోసం ఆయన హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ను నియమించుకున్నారు. అంతేకాదు.. సినిమాలో అన్ని యాక్షన్‌ సన్నివేశాలను, స్టంట్లను డూప్‌ లేకుండా ప్రభాసే చేశారని చెప్తున్నారు. ఆగస్ట్‌ 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  Last Updated 18, Apr 2019, 9:52 AM IST
0business
Suresh 116 Views phones phones స్వైప్‌ టెక్నాలజీస్ నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో మ‌రో 4జీ స్మార్ట్‌ఫోన్ విడుద‌లైంది. స్వైప్‌ ఎలైట్‌ 4జీ పేరుతో రూ.4,000కు అన్ని ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన‌ ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగ‌దారులు సొంతం చేసుకోవ‌చ్చు. బ్లాక్‌, గ్రే, గోల్డ్ క‌ల‌ర్ల‌లో ఈ ఫోన్‌ను విడుద‌ల చేశారు. యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ కార్డ్‌ హోల్డర్స్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపును కూడా అందుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో, 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌, 5 ఇంచెస్‌ హెచ్‌డీ ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, 8 మెగా పిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌, 64 జీబీ వరకు విస్తరణ మెమరీ, గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, డ్యూయల్‌ సిమ్, 3.5ఎంఎ ఆడియో జాక్ ఇందులో ఫీచ‌ర్లు.
1entertainment
Jun 30,2018 ఖాతాదారులకు అవగాహన సదస్సు నవతెలంగాణ, వాణిజ్య విభాగం: వినియోగదారుల సేవల అగ్రపథంలో నిలిచే బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంకింగ్‌ కోడ్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండి యాతో (బీసీఎస్‌బీఐ) కలిసి హైదరాబాద్‌లో ఖాతాదారుల అవగాహన సదస్సును నిర్వహించింది. స్థానిక హోటల్‌ సిద్ధార్థాలో ఏర్పాటు చేసిన బీసీఎస్‌బీఐ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ శిరవాధేకర్‌ మాట్లాడుతూ బ్యాంకింగ్‌ కోడ్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ గురించి విషయ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్‌ హైదరాబాద్‌ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ జి.ఎస్‌. భగూర్కర్‌ మాట్లాడుతూ వినియోగదారుల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు చెందిన పలువురు ప్రముఖ ఖాతాదారులతో పాటుగా బ్యాంక్‌కు చెందిన వివిధ శాఖల మేనేజర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అరుణ్‌ శిరవాధేకర్‌ చేసిన పీపీటీ ప్రదర్శన ఖాతాదారులకు ఎంతో విషయ పరిజ్ఞానాన్ని కలిగించేలా సాగింది. ఖాతాదారుల హితం కోరుతూ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రశంసించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
GST11 జిఎస్‌టిపై అవగాహనకు డెల్‌ ‘డిజి వ్యాపారీ హైదరాబాద్‌, మే 26: చిన్నవ్యాపారులు, వ్యాపారసంస్థలకు జూలై ఒకటి నుంచి అమలుకానున్న జిఎస్‌టి పై అవగాహన కల్పించేందుకు డెల్‌ కంప్యూటర్స్‌ సంస్థ డిజివ్యాపారీస్‌ను ప్రారంభించింది. ఇందుకోసం రెడీ డెల్‌ వోస్ట్రో పిసిలు కూడా విడుదలచేసింది. సమగ్ర వ్యవస్థ ద్వారా చిన్న వ్యాపారాలకు జిఎస్‌టిపై అవగాహన పెంపొందించేందుకు కృషిచేస్తున్నట్లు డెల్‌ ప్రకటించింది. జిఎస్‌టి సాంకేతికత ఆధారిత పన్ను వ్యవస్థ అయినందున డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ వేదికచేసుకోవాలని డెల్‌ చెపుతోంది.k డెల్‌ ప్రముఖ మార్కెట్‌ క్లస్టర్లలోని చిన్న వ్యాపార సంఘాలకు వ్యాపారులు జిఎస్‌టిని అవగాహన చేసుకునేందుకు డిజివ్యాపారీ ఎంతో మేలు చేస్తుందని సాంకేతిక ఆక్షరాస్యతను పెంచుతుం దని డెల్‌చెపుతోంది. కొత్త డెల్‌ పిసిలు అధీకృత స్టోర్లలో అందుబాటులో ఉంటాయని, ఎనిమిది భాషల్లో జిఎస్‌టి వివరాలను కస్టమర్లకు అందు బాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. డెల్‌వోస్ట్రో పిసిలు రూ.24,490ల ధరలనుంచి అందు బాటులో ఉంటాయన్నారు. అలాగే ఈ కంప్యూటర్లు కొనుగోలుచేసిన క్టమర్లకు బిజి జిఎస్‌టి ఉన్న అకౌంటింగ్‌ ప్యాకేజ్‌, కెనాన్‌ కలర్‌ ఆల్‌ఇన్‌వన్‌ ప్రింటర్‌ను అదనంగా రూ.2999లు చెల్లించి పొందవ చ్చన్నారు. లేదా ఒక ఏడాది డెల్‌అదనపు వారెంటీ పొందే అవకాశం ఉందన్నారు. డెల్‌ జిఎస్‌టి రెడీ పిసిలపై ఎస్‌ఎంబి ఉపాధ్యక్షుడు పి.కృష్ణకుమార్‌ మాట్లాడుతూ చిన్న వ్యాపారాలతో భాగస్వామ్యం వల్లనే జిఎస్‌టిని అందరికీ చేరువచేసే లక్ష్యంతో ఈ పిసిలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బంగ్లాదేశ్‌ టూర్‌ని బహిష్కరించిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల కాంట్రాక్ట్ ముగిసి దాదాపు మూడు వారాలు గడుస్తున్నా.. బోర్డు నుంచి ఎలాంటి సానుకూల స్పందన TNN | Updated: Jul 24, 2017, 04:08PM IST బంగ్లాదేశ్‌ టూర్‌ని బహిష్కరించిన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్ బోర్డు మధ్య నెలకొన్న వేతనాల వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఆటగాళ్ల కాంట్రాక్ట్ ముగిసి దాదాపు మూడు వారాలు గడుస్తున్నా.. బోర్డు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఆగస్టు&zwnj;లో ఆరంభంకానున్న బంగ్లాదేశ్ పర్యటనని బహిష్కరిస్తున్నట్లు క్రికెటర్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్&zwnj;స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్&zwnj;తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 22 నుంచి బంగ్లాదేశ్&zwnj;తో రెండు రోజుల వార్మప్ మ్యాచ్&zwnj; ఆడిన అనంతరం.. ఆగస్టు 27 నుంచి రెండు టెస్టుల సిరీస్&zwnj;లో ఆస్ట్రేలియా పోటీపడాల్సి ఉంది.
2sports
sandhya 127 Views India vs NewZealand , Rohit Sharma Rohit Sharma మాంచెస్టర్‌: టీమిండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మళ్లీ మొదలైన ఆటలో కొద్దిసేపటికే 3 వికెట్లు వరుసగా పడడంతో కివీస్‌ ఖంగుతింది. 50 ఓవర్లు పూర్తిగా ఆడిన కివీస్‌ 8 వికెట్లు నష్టపోయి 239 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు టార్గెట్‌ 240 పరుగులయ్యింది. ఇండియా కూడా తన బ్యాటింగ్‌ను ప్రారంభించింది. 2 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 5 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(1) మాథ్‌ హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారి పట్టాడు. ప్రస్తుతం క్రీజులో లోకేశ్‌ రాహుల్‌(1), విరాట్‌ కోహ్లి(1)లున్నారు. తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/
2sports
పెట్రో రిటైలింగ్‌ ప్రయివేటు పరం! Thu 24 Oct 00:16:29.881141 2019 దేశంలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్న మోడీ సర్కారు.. అందుకు గాను ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను ఫణంగా పెడుతోంది. రిటైల్‌ చమురు రంగంలో మేటిగా వెలుగొందుతున్న కుంగిన స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు Wed 25 Jan 01:06:18.886044 2017 పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గత నవంబరు మాసంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 31 శాతం మేర పడిపోయాయి. దేశం లోని 50 ప్రధాన నగరాలలో అమ్మక ాలను విశ్లేషించి ఇంటర్‌నేషనల్‌ డేటా బీఎస్‌ఈ ఇష్యూకు సూపర్‌ స్పందన Wed 25 Jan 01:05:53.526266 2017 బాంబే స్టాక్‌ ఎక్స్చేంజీ (బీఎస్‌ఈ) పబ్లిక్‌ ఆఫర్‌కు అనూహ్య స్పందన లభించింది. రూ.1,243 కోట్ల విలువైన ఈ ఐపీవోకు రెండో రోజైన మంగళవారం పూర్తి సబ్‌స్క్రిబ్షన్‌ లభించింది. ఇష్య లాభాలతో ముగిసిన మార్కెట్లు.. Tue 24 Jan 05:41:10.845775 2017 ముంబయి : పలు ప్రతికూల, అనుకూల పరిణామాల మధ్య సోమవారం మార్కెట్లు ఆటుపోట్లకు గురి అయ్యాయి. జనవరి డెరివేటివ్స్‌ గడువు బుధవారంతో ముగియనుండటం మరోవైపు వచ్చే వారం ఫిబ్రవరి 1న కేం ఫేస్‌బుక్‌లో విక్రయానికి హెలికాప్టర్‌ Tue 24 Jan 05:41:20.126141 2017 న్యూఢిల్లీ : నగర రోడ్లలో ట్రాఫిక్‌తో తీవ్ర చిర్రేత్తుకొస్తున్న ధనవం తులకు బంఫర్‌ ఆఫర్‌ ఒక్కటి వెలువడింది. న్యూఢిల్లీలోని ఒక ప్రయివేటు వ్యక్తి ఏకంగా 2009 నాటి హెలికాప్టర్‌ హెచ్‌యుఎల్‌ ఫలితాలు భేష్‌.. Tue 24 Jan 05:41:33.491948 2017 న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ హిందుస్థాన్‌ యూనీలివర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో 6.82 శాతం వృద్ధితో రూ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్‌ Tue 24 Jan 05:41:40.975262 2017 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల కోసం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.149తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా అన్ని నెట్‌వర్క ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విరాళ్‌ ఆచార్య బాధ్యతలు Tue 24 Jan 05:41:49.240473 2017 ముంబయి : రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా విరాళ్‌ ఆచార్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఆయన మూడేం డ్లపాటు కొనసాగుతారు. ఏషియన్‌ పెయింట్స్‌ లాభాల్లో స్వల్ప వృద్ధి Tue 24 Jan 05:42:01.143447 2017 న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి ఏషిియన్‌ పెయింట్స్‌ ఏకికృత నికరలాభం 1.52శాతం పెరిగి రూ.489.31 కోట్లుగా ప్రకటించింది. గతేడాది జియోస్పేషియల్‌తో నాగరికత ఉన్నతి Tue 24 Jan 02:58:21.205861 2017 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: జియోస్పేషి యల్‌ టెక్నాలజీని మానవ నాగరికత ఉన్నతికి ఉపయోగపడే సాంకేతిక విజ్ఞానంగా వినియోగించు కోవచ్చని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య న పొగాకుకు 'పన్ను' పోటు Tue 24 Jan 02:57:26.823852 2017 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: గత కొద్ది సంవత్సరా లుగా పొగాకు, పొగాకు ఉత్పత్తులపై అధిక, వివక్షాపూరిత పన్నుల కారణంగా ఈ రంగంపై అధారపడిన వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఫ బడ్జెట్‌ భారాలు తీర్చేనా..! Mon 23 Jan 05:40:15.68419 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సంప్రదాయానికి కాస్త భిన్నంగా సర్కారు మరో వారం రోజుల్లో 2017-18కి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ప్రవేశపెట్టనుంది. మోడీ నేతృత్వం కొనసాగనున్న ఒత్తిడి..! Sun 22 Jan 05:53:29.121919 2017 ముంబయి: బడ్టెట్‌ అంచనాలు, బడ్జెట్‌లో కల్పించనున్న కేటాయింపుల గురించి ప్రభుత్వం ఇచ్చే లీకులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాణిజ్య వ్యవహారశైలి ప్రధానంగా రేపటి (23) నుంచి ప్రా ఎల్‌ అండ్‌ టీ టెక్‌ లాభాల్లో 17% క్షీణత Sun 22 Jan 05:53:35.568221 2017 న్యూఢిల్లీ: డిసెంబరుతో ముగిసిన త్రైమా సికానికి ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెం సీమెన్స్‌ నుంచి అత్యధిక సామర్థ్య మోటర్లు Sun 22 Jan 05:53:41.70837 2017 హైదరాబాద్‌: ప్రముఖ ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల సంస్థ సీమెన్స్‌ అధిక ఇంధన సామర్థ్యం కలిగిన 'సిమోటిక్స్‌ 1ఎల్‌ఈ7 మోటార్‌'ను దేశీయ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఈ కొత్త మోటర్లు తక భారతీయాక్సా సీఈవోగా శ్రీనివాసన్‌ Sun 22 Jan 05:53:47.882615 2017 హైదరాబాద్‌: భారతీయాక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా సంజీవ్‌ శ్రీనివాసన్‌ నియమితులయ్యారు. 2016 ఆగస్టులో శ్రీనివాసన్‌ చీఫ్‌ కమర్షియల్‌, ప్రిన పీఎంజీకేవై కింద రూ.300 కోట్లు వెలుగులోకి Sun 22 Jan 05:53:56.242397 2017 ముంబయి: పెద్దనోట్ల రద్దు తరువాత కూడా నల్లధనం వెల్లడికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 'ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన' (పీఎంజీకేవై) పథకానిక అల్ట్రాటెక్‌ లాభంలో 5% వృద్ధి Sun 22 Jan 05:54:04.481985 2017 న్యూఢిల్లీ: సిమెంట్‌ రంగ దిగ్గజ కంపెనీ అల్ట్రాటెక్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంస్థ లాభం 4. కుషాల్‌ ట్రేడ్‌ వాటాదారులకు బోనస్‌ షేర్లు Sun 22 Jan 05:31:07.842932 2017 న్యూఢిల్లీ : కుషాల్‌ ట్రేడ్‌లింక్స్‌ తన వాటాదారులకు బోనస్‌ వాటాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్న రెండు వారాల్లో సాధారణ స్థితి Sat 21 Jan 06:45:32.583232 2017 న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన నగదు కష్టాలు మరో రెండు వారాల్లో సాధారణ స్థితికి చేరుకోగలవని 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ) గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ విశ ట్రంపు భయానికి వారాంతంలో నష్టాలు Sat 21 Jan 06:45:43.443437 2017 ముంబయి: స్వజాతీయ వాదిగా తెరపైకి వచ్చిన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంపు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో దేశ, విదేశీ మదుపర్లలో తీవ్ర ఆందోళన మొదలయ్ ఫిబ్రవరి 7న బ్యాంకు ఉద్యోగుల సమ్మె! Sat 21 Jan 06:45:53.685124 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం పెద్దనోట్ల రద్దు కష్టాలు, బ్యాంకింగ్‌ వ్యవస్థలో పెరిగిపోతున్న మొండి బాకీల సమస్యలపై దేశ వ్యాప్తంగా ఉద్యమించాలని పలు బ్యాకింగ్‌ ఉద్యోగ సంఘాలు నిర్ ఒత్తిడిలోనూ భారత్‌ రాణిస్తోంది: రాష్ట్రపతి Sat 21 Jan 06:46:13.62654 2017 కోల్‌కతా: స్థిరమైన, తక్కువ వడ్డీ రేట్ల ద్వారానే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రా యపడ్డారు. తక్కువ వడ్డీరేట్ల కారణంగా పెట్టుబడులు పెరుగ దూసుకుపోతున్న సెంట్రల్‌ బ్యాంక్‌ Sat 21 Jan 06:46:26.328153 2017 నవతెలంగాణ, వాణిజ్య వి భాగం: ప్రభుత్వ బ్యాంకింగ్‌ సంస్థ 'సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా' విస్తరణ పథంలో దూసుకు పోతోంది. బంజారా హిల్స్‌లోని రోడ్డు నం.12లో ఏర్పాటు చేసిన కొత్త జెబ్రోనిక్స్‌ నుంచి కారు మౌంట్లు Sat 21 Jan 06:46:42.841198 2017 నవతెలంగాణ వాణిజ్య విభాగం: జెబ్రోనిక్స్‌ ఇండియా కొత్తగా స్మార్ట్‌ఫోన్ల కోసం కారు మౌంట్లను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. మొబైల్‌ యాక్ససరీస్‌ విభాగంలో వేగంగా దూసుకుపోతున్న జ సహకార బ్యాంకుల అధికారాలకు కోత! Sat 21 Jan 06:46:53.29793 2017 న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సహకార బ్యాంకుల్లో భారీగా అక్రమాలు వెలుగు చూసిన నేపథ్యంలో ఇతర బ్యాంకులతో సమానంగా ఈ బ్యాంకులకున్న అధికారాల్లో కొత విధించే దిశగా సర్కా రూ.10 లక్షలు దాటిన పద్దులు తెలపండి Fri 20 Jan 07:11:28.053252 2017 న్యూఢిల్లీ: దేశంలో పన్ను పరిధిని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించింది. ఏడాది రెడ్‌మి నోట్‌ 4 భారత్‌లోకి వచ్చేసింది.. Fri 20 Jan 07:11:42.466281 2017 న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ షియోమికి చెందిన రెడ్‌మి నోట్‌4 భారత మార్కెట్లోకి వచ్చేసింది. రెడ్‌మి నోట్‌4ను 2జీబీ, 3జీబీ 4జీబీ ర్యామ్‌ మోడల్‌లలో అందజే విపణిలోకి అత్యాధునిక ఫోర్డ్‌ వాహనం Fri 20 Jan 07:11:52.341283 2017 న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్‌ అప్‌గ్రేడెడ్‌ క్యాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఈకోస్పోర్ట్‌ ఎడిషన్‌ భారత విపణిలోకి విడుదల చేసింది. ఈ వాహన (పెట్రోల్‌) ధర రూ.10.39 లక్షలు, (డీ మార్కెట్లోకి కొత్త కేటీఎం బైక్‌లు Fri 20 Jan 07:12:01.206159 2017 న్యూఢిల్లీ, హైదరాబాద్‌ : ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్‌ సరికొత్త కేటీఎం ఆర్‌సీ 390,ఆర్‌సీ 200ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ధరల శ్రేణి రూ.2.25 లక్షలు, బడ్జెట్‌ 'హల్వా' షురూ.. Fri 20 Jan 07:12:09.763186 2017 న్యూఢిల్లీ: ప్రభుత్వ పద్దుకు సంబంధించిన బడ్జెట్‌ ప్రక్రియకు గురువారం అధికారికంగా ఆంకురార్పణ జరిగింది. వచ్చే నెల 1వ తేదీనే కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గురువ మూడేండ్లలో విండోస్‌7కు గుడ్‌బై Fri 20 Jan 07:12:21.439062 2017 న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రముఖ ఆపరేటింగ్‌ సిస్టం మరో మూడేళ్ల తర్వాత కనుమరుగు కానుంది. విండోస్‌ 7 తర్వాత వచ్చిన విండోస్‌ 8, విండోస్‌ 10 వెర్షన్లు వచ్చాయి. అయిన రూ.350 కోట్ల సమీకరణ:హెచ్‌డీఎఫ్‌సీి ఎర్గో Fri 20 Jan 04:15:40.829471 2017 హైదరాబాద్‌ : ప్రయివేటు రంగంలోని జీవితేతర బీమా సంస్థ అయిన హెచ్‌డిఎఫ్‌సి గ్రూపునకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీి ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌ మాక్స్‌ 13 స్టోర్లకు విస్తరణ Fri 20 Jan 04:15:23.064896 2017 హైదరాబాద్‌ : ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ మాక్స్‌ తెలంగాణలో 13 స్టోర్లకు విస్తరించింది. తాజాగా హైదరాబాద్‌ మల్కాజిగిరి వద్ద ఈ స్టోర్‌ను తెరిచింది. ఈ సందర్బంగా మ్యాక్స్‌ ఫ్యాషన లాభాల్లోనే ముగిసిన మార్కెట్లు Fri 20 Jan 04:15:04.550816 2017 ముంబయి: స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు మోస్తారు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, మరోవైపు త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తాజా పరిణామాలపై సీి9ను ఆవిష్కరించిన సామ్‌సంగ్‌ Thu 19 Jan 07:00:01.905851 2017 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ మార్కెట్లోకి గెలాక్సీ సీరిస్‌లో సీి9ను విడుదల చేసింది. బుధవారం హైదరాబాద్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎయిర్‌టెల్‌ సీఎంవోగా రాజ్‌ పూడిపెద్ది Thu 19 Jan 07:00:09.657274 2017 న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు టెలికం కంపెనీ ఎయిర్‌టెల్‌ ఇండియాకు చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (సీిఎంవో)గా రాజ్‌ పూడిపెద్ది నియమితులయ్యారని ఆ సంస్థ ఒక ప్రకటనలో పే మార్కెట్లోకి టాటా హెక్సా Thu 19 Jan 06:15:30.891898 2017 ముంబయి : దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రీమియం స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ విభాగంలో హెక్సాను మార్కెట్లోకి విడుదల చేసింది. న్యూఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద దీని ధర ప్రభుత్వ బీమా సంస్థల వాటాల అమ్మకం.. Thu 19 Jan 07:00:19.752516 2017 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఐదు సాధారణ బీమా కంపెనీల్లో వాటాల విక్రయానికి ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోంది. ఇందుకోసం ఆయా సంస్థలను స్టాక్‌ మార్కెట్‌ పరిధిలోకి తీసుకురావాలని Thu 19 Jan 07:00:57.904751 2017 వాణిజ్య విభాగం Thu 19 Jan 07:01:25.610039 2017 వాణిజ్యవిభాగం తెలుగు రాష్ట్రాల్లో మరింత పట్టు.. Wed 18 Jan 06:36:13.378672 2017 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మరింత పట్టు సాధించడంతో పాటు అతి త్వరలోనే కోటి మంది వినియోగదారుల మైలురాయిని చేరుకుంటామని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగా డీజీ ధన్‌ మేళాలో ఆంధ్రాబ్యాంకు స్టాల్‌ Wed 18 Jan 06:36:20.826901 2017 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: డీజీ ధన్‌ మేళాలో ఆంధ్రాబ్యాంక్‌ స్టాల్‌ను ఏర్పాటు చేసినట్టు బ్యాంకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌ త్రినాథ్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. ఈ మేళాను హైదరా విపణిలోకి నిస్సాన్‌ సన్నీ వెర్షన్‌ Wed 18 Jan 06:36:28.125625 2017 న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్‌ మార్కెట్లోకి సరికొత్త సన్నీ మోడల్‌ను విడుదల చేసింది. న్యూఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద దీని ధర రూ.7.91లక్షలుగా నిర్ణయించింది. వ రోజంతా అమ్మకాల ఒత్తిడితో.. తుదకు నష్టాలు Wed 18 Jan 06:36:34.898694 2017 ముంబయి : అంతర్జాతీయ పరిణామాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్లలో లోహ, ఆయిల్‌, గ్యాస్‌, మౌలిక వసతులు, పీఎస్‌యూ సూచీలు ఒత్తిడికి గురి అయ్యాయి. మంగళవారం ఉదయం లాభాల్లోనే మొదలయినప్ కేరళ పర్యాటకం మరింత ఆకర్షణీయం Wed 18 Jan 06:36:41.409646 2017 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: దేశీయ పర్యాటక రంగంలో కేరళ కొత్త పుంతలు తొక్కుతోందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కెపీ నంద కుమార్‌ అన్నారు. పర్యాటకంలో కొత్త ఆకర్షణలన ఆఫర్లతో హైజాక్‌ Tue 17 Jan 06:24:27.014652 2017 న్యూఢిల్లీ :కొత్త ఏడాదిలో టెలికం కంపెనీలు పోటాపోటీలో భాగంగా తమ వినియోగదారులకు ఆకర్షణీయ పథకాలను ప్రకటిస్తున్నాయి. రిలయన్స్‌ జియో మార్చి 31 వరకు ఉచిత ఆఫర్‌ను కొనసాగించాలని నగదు సరఫరాపై ఆర్‌బీఐవి అబద్ధాలే.. Tue 17 Jan 06:24:21.984159 2017 న్యూఢిల్లీ : నగదు సరఫరాపై రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అబద్ధాలు అడుతోందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్మెన్‌ ప్రతీప్‌ చౌదరి విమర్శించారు. ఆయన ఓ వార్తా స ఎస్‌బీహెచ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మణి పల్వేసన్‌ Tue 17 Jan 06:24:39.63225 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' (ఎస్‌బీహెచ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మణి పల్వేసన్‌ బాధ్యతలు చేపట్టారు. శ స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు Tue 17 Jan 06:24:32.606988 2017 ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కార్పొరేట్‌ కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు వెల్లడించన ున్నాయనే అంచనాల్లో సోమవారం 24 లక్షల డీమాట్‌ ఖాతాలు జారీ Tue 17 Jan 06:24:51.078026 2017 న్యూఢిల్లీ : గతేడాది దేశంలో మొత్తంగా 24 లక్షల కొత్త డిమాట్‌ ఖాతాలు తెరవబడ్డాయి. 2008 తర్వాత తొలి సారి అత్యధికంగా నమోదయ్యాయి. దేశంలో సంప్రదాయంగా ప్రజలు బంగారం, రియల్‌
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఉతికారేసిన అజామ్.. వరల్డ్ ఎలెవెన్‌పై పాక్ బోణీ ఎనిమిదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు తమ దేశానికి వచ్చారన్న ఆనందం.. దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్ధరించాలనే గట్టి పట్టుదల.. ఇవే పాకిస్థాన్ క్రికెటర్లు అదరగొట్టడానికి కారణం కావచ్చు. TNN | Updated: Sep 13, 2017, 12:03PM IST ఎనిమిదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు తమ దేశానికి వచ్చారన్న ఆనందం.. దేశంలో అంతర్జాతీయ క్రికెట్&zwnj;ను పునరుద్ధరించాలనే గట్టి పట్టుదల.. ఇవే పాకిస్థాన్ క్రికెటర్లు అదరగొట్టడానికి కారణం కావచ్చు. వివిధ జట్లకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లతో కూడిన వరల్డ్&zwnj; ఎలెవన్&zwnj;తో మూడు టీ20ల ఇండిపెండెన్స్&zwnj; కప్&zwnj;కు శ్రీకారం చుట్టిన పాకిస్థాన్&zwnj;.. సిరీస్&zwnj;లో బోణీ కొట్టింది. లాహోర్&zwnj;లో మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో 20 పరుగుల తేడాతో వరల్డ్&zwnj; ఎలెవన్&zwnj;ను పాకిస్థాన్ ఓడించింది. టాస్&zwnj; గెలిచిన వరల్డ్ ఎలెవెన్ కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్&zwnj; చేసిన పాక్&zwnj; నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 197 పరుగుల భారీ స్కోరు చేసింది. బాబర్&zwnj; అజామ్&zwnj; అద్భుతంగా ఆడాడు. ఎలెవన్ బౌలర్లను ఉతికారేసిన అజామ్ 52 బంతుల్లో 86 పరుగులు (10 ఫోర్లు, రెండు సిక్సులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. షోయబ్&zwnj; మాలిక్&zwnj; (38), అహ్మద్&zwnj; షెజాద్&zwnj; (39) మెరిశారు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (4) నిరాశపరిచినా.. చివర్లో ఇమాద్ వసీం (15 నాటౌట్) భారీ సిక్సర్లతో స్కోరుని 190 దాటించగలిగాడు. అనంతరం బ్యాటింగ్&zwnj;కు వచ్చిన వరల్డ్&zwnj; ఎలెవన్&zwnj; నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులే చేసింది. ఆ జట్టులో హషీమ్&zwnj; ఆమ్లా (26), టిమ్&zwnj; పైన్&zwnj; (25), డుప్లెసిస్&zwnj; (29) ఇన్నింగ్స్&zwnj;లను బాగానే ఆరంభించినా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. చివర్లో డారెన్&zwnj; సామి (29 నాటౌట్&zwnj;) పోరాడినా ఫలితం లేకపోయింది. సాధించాల్సిన రన్&zwnj;రేట్&zwnj; బాగా పెరిగిపోవడంతో ముందే వరల్డ్&zwnj; ఎలెవన్&zwnj; ఓటమి ఖరారైపోయింది. పాక్&zwnj; బౌలర్లలో సోహైల్&zwnj; ఖాన్&zwnj;, రయీస్&zwnj;, షాదాబ్&zwnj; ఖాన్&zwnj; రెండేసి వికెట్లు తీశారు. అజామ్&zwnj;కు &lsquo;మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్&rsquo; అవార్డు దక్కింది. చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ స్టార్లు పాక్&zwnj;లో మ్యాచ్&zwnj; ఆడటంతో స్టేడియం లోపల, బయట పండగ వాతావరణం నెలకొంది. సిరీస్&zwnj;లో మిగతా రెండు మ్యాచ్&zwnj;లు బుధ, గురువారాల్లో జరుగుతాయి.
2sports
sandhya 519 Views finance and service sectors , jobs jobs ముంబయి: ఆర్థికసేవలరంగంలో 2020 ఆర్థికసంవత్సరం మొదటి ఆరునెలల్లోనే 47,800 కొత్తకొలువులు వస్తాయని సర్వేలు చెపుతున్నాయి. గ్రామీణమార్కెట్లలో ఎక్కువ అవకాశాల ఉంటాయని, ఆర్థికసేవలపరంగా గ్రామీణుల్లో పెరుగుతున్న చైతన్యమే ఇందుకు కీలకమని ప్రత్యేకించి రెండు, మూడోశ్రేణి నగరాల్లో ఈ అవకాశాలు పెరుగుతాయని సర్వేలు ప్రస్తావిస్తున్నాయి. బ్యాంకులు, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో ఎక్కువ ఉంటాయని అంచనా. బ్యాంకింగ్‌ ఆర్థిక, బీమా సేవలరంగంలోనే ఎక్కువ అవకాశాలు ఒకమోస్తరు నగరాల్లో కూడా పెరుగుతాయని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ హెడ్‌ అమిత్‌వాదేరా వెల్లడించారు. రెండోశ్రేణి నగరాల్లో ఐదుశాతం వృద్ధి ఉంటుందని, ఏప్రిల్‌ సెప్టెంబరులో ఈ వృద్ధి నమోదయితే మూడోశ్రేణి పట్టణాల్లోను, గ్రామీణప్రాంతాల్లోను రెండుశాతం చొప్పున ఆర్థికసేవలరంగంలో ఉపాధి పెరుగుతుందని వాదేరా వెల్లడించారు. కంపెనీ ఏప్రిల్‌ -సెప్టెంబరు ఆర్థిక నివేదికను ఆయన విడుదలచేసారు. 19 సెక్టార్లు, 14 భౌగోళిక ప్రాంతాల్లో మొత్తం 775 సంస్థలుభారత్‌లోను, 85 బిజినెస్‌ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగాను ఎంచుకుని సర్వేచేసింది. సర్వే ఆధారంగాచూస్తే ఢిల్లీలోనే ఎక్కువ ఉపాధి వస్తుంది. 5420 మందికి కొత్త ఉద్యోగాలుంటాయి. అనంతరం ముంబయిలో 5380 మందికి కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు తేలింది. బ్యాంకుల డిజిటైజేషన్‌ కారణంగా ఈ రంగంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా. సీనియర్‌ స్థాయి మినహాయించి మిగిలిన కేటగిరీల్లో నియామకాలు పెరుగుతున్నట్లు తేలింది. మధ్యస్థాయిలో నాలుగుశాతం పెరుగుతుందని, ప్రారంభ స్థాయి జూనియర్‌ కేటగిరీల్లో మూడుశాతం చొప్పున ఉంటుందని తేలింది. మధ్యస్థాయి బిజినెస్‌సంస్థలు కూడా ఐదుశాతం మేర పెరుగుతాయని అంచనా. ఉపాధి అవకాశాల్లో రెండుశాతం వృద్ధి ఉంటుంది. ఇక ఇవికాకుండా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఇంజనీరింగ్‌ ఐదుశాతం, ఆఫీస్‌సేవలు నాలుగుశాతం, బ్లూకార్‌ కేటగిరీ ఆలుగుశాతం, మార్కెటింగ్‌ మూడుశాతం ఉంటాయి. ఇక ఈ రంగాలనుంచి తరచూ కొలువులు మారుతున్న శాతం ఎక్కువగానే ఉంది. మొత్తం 19 రంగాల్లో తరచూ ఉద్యోగులు కంపెనీలు వీడి వెళుతున్నారు. మరో ఐదు ఇతర రంగాలు మరింతగా ఎక్కువ నిష్క్రమణలు చవిచూస్తున్నాయి. రియల్‌ఎస్టేట్‌, ఐటి, కెపిఒ, టెలికమ్యూనికేషన్‌, పర్యాటక, ఆతిథ్యరంగాల్లో ఈ తరచూ ఉద్యోగుల నిష్క్రమణలు ఎక్కువ ఉన్నాయి. ఇక వ్యవసాయం, ఆగ్రోకెమికల్స్‌, విద్యాసేవలు, ఎఫ్‌ఎంసిజి, ఆర్థికసేవలు, రిటైల్‌రంగాల్లో కొంతమేర పెరుగుతున్నట్లు టీమ్‌లీజ్‌సర్వే ప్రస్తావించింది. తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/
1entertainment
Southampton, First Published 1, Sep 2018, 7:40 AM IST Highlights నాలుగో టెస్టు మ్యాచులో భారత్ బ్యాట్స్ మెన్ ను ఇంగ్లాండు స్పిన్నర్ మొయిన్ అలీ వణికించాడు. అతని ధాటికి సగం మంది బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు చేరుకున్నారు. ఛతేశ్వర్ పుజారా ఒక్కడే నిలిచి భారత్ ను ఆదుకున్నాడు. సౌతాంప్టన్: నాలుగో టెస్టు మ్యాచులో భారత్ బ్యాట్స్ మెన్ ను ఇంగ్లాండు స్పిన్నర్ మొయిన్ అలీ వణికించాడు. అతని ధాటికి సగం మంది బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు చేరుకున్నారు. ఛతేశ్వర్ పుజారా ఒక్కడే నిలిచి భారత్ ను ఆదుకున్నాడు.   చటేశ్వర్‌ పుజారా (257 బంతుల్లో 16 ఫోర్లతో 132 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేసి సాధించిన సెంచరీతో భారత్‌ కోలుకుంది.  195 పరుగులకు 8 వికెట్లు పడిన దశలో టెయిలెండర్ల సహకారంతో జట్టుకు 27 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 84.5 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్‌ అ య్యింది.  కెప్టెన్‌ కోహ్లీ (46) ఫరవాలేదనిపించాడు. అలీకి ఐదు, బ్రాడ్‌కు 3వికెట్లు దక్కాయి. ఆతర్వాత ఇంగ్లండ్‌ శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో4 ఓవర్లలో 6 పరుగులు చే సింది. క్రీజులో కుక్‌ (2 బ్యాటింగ్‌), జెన్నింగ్స్‌ (4 బ్యాటింగ్‌) ఉన్నారు. రెండోరోజు తొలిసెషన్‌లో కో హ్లీ, పుజారా లంచ్‌ విరామానికి భారత్ స్కోరును 100/2 కి చేర్చారు. 19/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ధావన్‌ (23), రాహుల్‌ (19) నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేశారు.  అయితే కొద్ది వ్యవధిలోనే బ్రాడ్‌ వీరిద్దరినీ అవుట్ చేశాడు. భారత్‌ 50 పరుగులకు 2 వి కెట్లను కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ, పుజారా రన్‌రేట్‌ను పెంచా రు. లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా చూసుకున్నారు.   లంచ్ బ్రేక్‌ తర్వాత భారత్‌ తడబడింది. కోహ్లీ, రహానె (11)తో పాటు రిషభ్‌ వికెట్లను కోల్పోయింది. అర్ధ సెంచరీ వైపు వెళుతున్న కోహ్లీని కర్రాన్‌ దెబ్బతీశాడు. దీంతో మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో ఐదు ఓవర్ల తర్వాత స్టోక్స్‌ ఇన్‌స్వింగర్‌కు రహానె ఎల్బీ అయ్యాడు. 29 బంతులాడినా రిషబ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే అలీ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు.    టీ విరామం తర్వాత స్పిన్నర్‌ మొయిన్‌ అలీ బంతులకు భారత బ్యాట్స్ మెన్ తల వంచుతూ వెళ్లారు. పుజారాకు అండగా నిలవలేక పాండ్యా (4), అశ్విన్‌ (1), షమి (0) ఆరు పరుగుల వ్యవధిలో అలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరుకున్నారు.  ఈ దశలో పుజారా బౌండరీలతో వేగం పెంచాడు. 71వ ఓవర్‌లో ఇషాంత్‌ (14)ను కూడా అలీ అవుట్‌ చేయడంతో 96 పరుగుల వద్ద ఉన్న పుజారా శతకంపై ఉత్కంఠ చోటు చేసుకుంది. దీంతో తనే ఎక్కువ స్ట్రయిక్‌ తీసుకుని 210 బంతుల్లో 15వ శతకాన్ని పూర్తి చేశాడు.  ఆ తర్వాత మరింత వేగం పెంచి బ్రాడ్‌ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో చెలరేగాడు. ఆఖర్లో బుమ్రా అతడికి సహకరించడంతో పదో వికెట్‌కు 46 పరుగులు వచ్చాయి. బుమ్రా అవుట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. Last Updated 9, Sep 2018, 1:20 PM IST
2sports
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
Hyderabad, First Published 7, Feb 2019, 3:35 PM IST Highlights ఒక కథ మొదలైతే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోల తలుపు తట్టడం సహజం. రీసెంట్ గా మారుతి సెట్ చేసుకున్న కథ కూడా అదే తరహాలో ఒక హీరో నుంచి మరో హీరో దగ్గరికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో ప్లాప్ అందుకున్న మారుతి నెక్స్ట్ హీరో కోసం గత కొంత కాలంగా వేట సాగిస్తున్నాడు.  ఒక కథ మొదలైతే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోల తలుపు తట్టడం సహజం. రీసెంట్ గా మారుతి సెట్ చేసుకున్న కథ కూడా అదే తరహాలో ఒక హీరో నుంచి మరో హీరో దగ్గరికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో ప్లాప్ అందుకున్న మారుతి నెక్స్ట్ హీరో కోసం గత కొంత కాలంగా వేట సాగిస్తున్నాడు.  బలే బలే మగాడివోయ్ కాంబో రిపీట్ చెయ్యాలని గీత ఆర్ట్స్ మరోసారి నాని దగ్గరికి మారుతిని పంపగా నాని ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు చెప్పి డ్రాప్ అయ్యాడు. అయితే ఇప్పుడు అదే స్టోరీని సాయి ధరమ్ తేజ్ చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అసలే మనోడికి హిట్టు లేదు. మారుతి సినిమాలపై కూడా జనాలు ఎంతవరకు ఆసక్తి చూపుతారనేది సందేహమే.  అయితే గతంలో కూడా నాని రిజెక్ట్ చేసిన చిత్రలహరి సినిమాను సాయి ధరమ్ తేజ్ చేసేందుకు ఒప్పుకున్నాడు. నేను శైలజా దర్శకుడు కిషోర్ తిరుమల ఆ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సాయి చేతిలో ఉన్న రెండు సినిమాలు నాని రిజెక్ట్ చేసినవే. అతని కోసమే దర్శకులు కథను సిద్ధం చేయగా అనుకోని విధంగా చేయలేకపోయాడు. మరి సాయి ఈ సినిమాలతో ఏ లెవెల్లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.  Last Updated 7, Feb 2019, 3:35 PM IST
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Hyderabad, First Published 27, Jun 2019, 10:22 AM IST Highlights మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అనంతరం కొరటాల శివతో వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా షూటింగ్ మొదలవ్వకముందే సినిమాకు సంబందించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అనంతరం కొరటాల శివతో వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా షూటింగ్ మొదలవ్వకముందే సినిమాకు సంబందించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొరటాల మొదటిసారి తనకు ఇష్టమైన టెక్నీషియన్ ని కూడా మెగాస్టార్ కోసం పక్కనెట్టేస్తున్నట్లు సమాచారం.  మిర్చి సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన దర్శకుడు కొరటాల శివ ఆ సినిమా ద్వారా దేవి శ్రీ ప్రసాద్ తో జర్నీ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సినిమా మ్యూజిక్ క్లిక్కవ్వడంతో ఆ తరువాత శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ - భరత్ అనే నేను సినిమాలకు కూడా కొరటాల రాక్ స్టార్ తోనే మ్యూజిక్ చేయించుకున్నాడు. అయితే ఈ కాంబోకి మొదటిసారి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.  ఎందుకంటే సైరా సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదికి మెగాస్టార్ మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఫిదా అయిన చిరు నెక్స్ట్ కొరటాల శివ తో చేయబోయే సినిమాకు కూడా ట్యూన్స్ చేయాలనీ అఫర్ ఇచ్చేశాడు. దీంతో కోరటాల తన ఆస్థాన సంగీత దర్శకుడిని పక్కనెట్టక తప్పడం లేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.   Last Updated 27, Jun 2019, 10:24 AM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV శ్రీలంక క్రికెట్‌లో కుదుపు.. సెలక్టర్లు రాజీనామా శ్రీలంక క్రికెట్‌లో భారీ కుదుపు.. భారత్ చేతిలో టెస్టు, వన్డే సిరీస్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ జట్టు సెలక్టర్లు మూకుమ్మడిగా TNN | Updated: Aug 29, 2017, 07:21PM IST శ్రీలంక క్రికెట్&zwnj;లో భారీ కుదుపు.. భారత్ చేతిలో టెస్టు, వన్డే సిరీస్&zwnj; ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ జట్టు సెలక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య అధ్యక్షుడిగా ఉన్న సెలక్షన్ కమిటీలో నలుగురు సభ్యులుండగా.. అందరూ తమ రాజీనామా పత్రాన్ని ఆ దేశ క్రీడల మంత్రి దయసిరి జయశేఖరకి మంగళవారం పంపించారు. గత ఆదివారం పల్లెకలె వేదికగా ముగిసిన మూడో వన్డేలో శ్రీలంక జట్టు ఓటమిని జీర్ణించుకోలేక అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంలోనే నిరసన తెలిపి.. మైదానంలోకి వాటర్ బాటిల్స్&zwnj; విసురుతూ మ్యాచ్&zwnj;కి అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. అంతకముందు తొలి వన్డే సమయంలో కూడా శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సును అభిమానులు అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ చర్యలు ఆటగాళ్ల భద్రతని ప్రశ్నించే విధంగా ఉందని లంక బోర్డు భద్రతపై హామీ ఇవ్వాలంటూ ఐసీసీ కూడా ఘాటుగా లేఖ రాసింది. సుదీర్ఘ సిరీస్&zwnj; మొదట్లోనే మూడు టెస్టుల్లో క్లీన్&zwnj;స్వీప్&zwnj;కి గురైన శ్రీలంక.. ఐదు వన్డేల సిరీస్&zwnj;ను ఇప్పటికే 3-0తో చేజార్చుకుంది. దీంతో ఇంటా.. బయటా శ్రీలంక జట్టు ఆటతీరుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ఓటములకి నైతిక బాధ్యత వహిస్తూ సెలక్టర్లు తప్పుకున్నారు.
2sports
sumalatha 187 Views bse , NSE , stock market BSE Sensex Rises ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నష్టాలకు ముగింపు పలికి… ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈనాటి ఇంట్రాడే ట్రేడింగ్ లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు… ఆ తర్వాత భారీగా పెరిగాయి. బ్యాంకింగ్ షేర్ల అండతో లాభాల బాట పట్టాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 11వేల మార్క్‌ పైన మొదలైంది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 264 పాయింట్లు ఎగబాకి 37,333 వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 11,023 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు కోలుకుని 71.56గా కొనసాగుతోంది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/national/
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రాహుల్ ద్రవిడ్‌కి ఊరట.. ఫిర్యాదు కొట్టివేత రిటైర్మెంట్ తర్వాత కూడా భారత క్రికెట్‌కి తన వంతు సేవల్ని రాహుల్ ద్రవిడ్ అందిస్తున్నాడు. అలాంటి ద్రవిడ్‌కి విరుద్ధ ప్రయోజనాల అంశం కింద నోటీసులు పంపిస్తారా..? ఇది మాజీ క్రికెటర్లని భారత క్రికెట్‌కి దూరం చేయడమేనని ఇటీవల భారత దిగ్గజ క్రికెటర్లు గళమెత్తారు. Samayam Telugu | Updated: Nov 15, 2019, 07:58AM IST రాహుల్ ద్రవిడ్‌కి ఊరట.. ఫిర్యాదు కొట్టివేత హైలైట్స్ రాహుల్ ద్రవిడ్‌కి ఇటీవల బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ నోటీసులు విరుద్ధ ప్రయోజనాల అంశం కింద వివరణ ఇవ్వాలని ఆదేశం ఎన్‌సీఏ డైరెక్టర్, ఇండియా సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా ద్రవిడ్ హుందాగా వివరణ ఇచ్చిన ద్రవిడ్.. ఫిర్యాదు కొట్టివేత విరుద్ధ ప్రయోజనాల అంశం కింద ఇటీవల బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ నుంచి నోటీసులు అందుకున్న భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కి ఊరట లభించింది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)‌కి డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ .. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి చెందిన ఇండియా సిమెంట్స్‌లోనూ వైస్ ప్రెసిడెంట్‌గా ఉండటం విరుద్ధ ప్రయోజనాల కిందకి వస్తుందని ఇటీవల ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన డీకే జైన్.. వివరణ ఇవ్వాలని రాహుల్ ద్రవిడ్‌కి నోటీసులు పంపారు. Read More: షమీ బంతికి నోరెళ్లబెట్టిన రహీమ్.. క్లీన్‌బౌల్డ్ భారత-ఎ, అండర్-19 టీమ్స్ కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్.. యువ క్రికెటర్లని టీమిండియాకి అందించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అలాంటి ద్రవిడ్‌కి నోటీసులు పంపిస్తారా..? ఇది మాజీ క్రికెటర్లని భారత క్రికెట్‌కి దూరం చేయడమేనని దిగ్గజ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తదితరులు మండిపడ్డారు. అయితే.. నోటీసులపై హుందాగా సమాధానమిచ్చిన రాహుల్ ద్రవిడ్.. ఇండియా సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా తాను ఉన్నప్పటికీ ప్రస్తుతం లాంగ్ లీవ్‌లో ఉన్నట్లు వివరణ ఇచ్చాడు. దీంతో.. అతనిపై ఉన్న విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదుని డీకే జైన్ తాజాగా కొట్టివేశారు. Read More: బంగ్లాపై టెస్టులో రోహిత్ శర్మ టీ20 షాట్.. ఔట్ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడిగా ఉన్న సంజీవ్ గుప్తా ఇటీవల రాహుల్ ద్రవిడ్‌తో పాటు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులపై విరుద్ధ ప్రయోజనాల అంశం కింద బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేశాడు. దీంతో.. క్రికెట్ సలహా కమిటీ అప్పట్లో గంగూలీ, సచిన్, లక్ష్మణ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటీవల దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ కూడా విరుద్ధ ప్రయోజనాల కింద నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. మొత్తంగా.. సౌరవ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విరుద్ద ప్రయోజనాల అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. Read More: 10ఏళ్ల తర్వాత మళ్లీ పాక్ గడ్డపై టెస్టు క్రికెట్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV మార్కెట్‌లోకి నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్..! మొబైల్స్ తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదలచేసింది. 'నోకియా 6.1' (నోకియా (2018) వేరియంట్)పేరుతో బుధవారం (మే 9) మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ మే 13 నుంచి అమెజాన్‌ ద్వారా రూ.18,999 ధరకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. TNN | Updated: May 9, 2018, 07:40PM IST మార్కెట్‌లోకి నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్..! మొబైల్స్ తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదలచేసింది. ' నోకియా 6.1 ' ( నోకియా (2018) వేరియంట్)పేరుతో బుధవారం (మే 9) మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ మే 13 నుంచి అమెజాన్‌ ద్వారా రూ.18,999 ధరకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అదేరోజు అమెజాన్ సమ్మర్‌సేల్ కూడా ప్రారంభమవుతుండటం విశేషం. ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌తోపాటు, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. 128 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇందులో 16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అందిస్తుండటం మరో విశేషం. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే ఎయిర్‌టెల్ కస్టమర్లకు రూ.2 వేల క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఎయిర్‌టెల్ టీవీయాప్‌కు ఉచిత సభ్యత్వం కూడా లభిస్తుంది. మేక్ మై ట్రిప్‌ ద్వారా దేశీయంగా చేసుకునే హోటల్స్ బుకింగ్‌పై 25 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఈ ఫోన్ కొన్నవారు 'కోటక్ 811' సేవింగ్స్ అకౌంట్‌ను తెరిస్తే వారికి ఏడాది ఉచిత సర్విఫై యాక్సిడెంటల్ మొబైల్ డ్యామేజ్ ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం కల్పించనున్నారు. నోకియా 6.1 ఫీచర్లు... 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4జీ వీవోఎల్‌టీఈ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ Level up your game with Nokia 6.1, now with 4GB RAM & 64GB ROM. Be the first one to know when this ever-reliable sm… https://t.co/E0E8eWcTxy &mdash; Nokia Mobile India (@NokiamobileIN) 1525853870000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
"అదిరింది" మూవీ రివ్యూ రేటింగ్ Highlights నటీనటులు : విజయ్, సమంత, కాజల్, నిత్యామీనన్, ఎస్.జె.సూర్య, సత్యరాజ్, వడివేలు తదితరులు సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌ నిర్మాణం : శ్రీ తేండాల్‌ ఫిలింస్‌ ఆసియానెట్ రేటింగ్ : 3/5 తమిళ దలపతి విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయ్‌కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోయినా ‘మెర్సల్’ వివాదంతో దాని తెలుగు అనువాదం ‘అదిరింది’పై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అయితే విడుదల వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు ‘అదిరింది’ గురువారం (నవంబర్ 9న) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!  కథ:  ఇది మెడికల్ మాఫియా చుట్టూ అల్లుకున్న కథ. సిటీలో వరసగా ఒక హాస్పిటల్ చెయిన్ కు సంబంధించిన వాళ్ళు కిడ్నాప్ అవుతుంటారు. ఆ తర్వాత హత్యకు గురవుతారు. అందరికి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుని ఐదు రూపాయలకే సేవ చేసే  డాక్టర్ గా పేరున్న భార్గవ్(విజయ్)మీద అనుమానం వస్తుంది. మరోవైపు మేజిక్ షోలు చేస్తూ ఉండే విజయ్(విజయ్)పాత్ర ఎంటర్ అవుతుంది. స్టేజి మీద అందరు చూస్తుండగానే ఒక హత్య చేసి పారిపోతాడు. అసలు భార్గవ్ కి, విజయ్ కి ఉన్న సంబంధం ఏంటి, ఒక మారుమూల గ్రామంలో విజయ్-భార్గవ్ ల బాల్యంలో హత్య చేయబడ్డ తండ్రి దళపతి(విజయ్)కు కనెక్షన్ ఏంటి  అనేది తెరమీద చూడాల్సిన బాలన్స్. ఈ ముగ్గురి జీవితంతో ఆడుకున్న డాక్టర్ డేనియల్(ఎస్ జె సూర్య)కూడా కథలో కీలక భాగం. విశ్లేషణ:  జీఎస్టీ, కార్పొరేట్ హాస్పిటళ్లు ఇలా సమాజాన్ని ఇబ్బంది పెడుతున్న అంశాలను ప్రధాన అంశంగా తీసుకొని దర్శకుడు అల్లుకున్న కమర్షియల్ కథ ఆడియన్స్‌ను మెప్పిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే తమిళంలో వివాదాలకు కారణమైన జీఎస్టీకి సంబంధించిన డైలాగులను తెలుగు వెర్షన్‌లో మ్యూట్ చేయడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. సినిమా ఒక ఫ్లోలో వెళ్తునప్పుడు ఇలా డైలాగ్స్‌ను వినిపించకుండా చేశారు. సినిమాలో ఒక్క సన్నివేశం కూడా అభ్యంతరకరంగా అనిపించలేదు. సమాజంలో ఏదైతే జరుగుతుందో.. దానినే తెరపై చూపే ప్రయత్నం చేశారు. ‘ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి జబ్బు చేసిందని పొరపాటున కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్తే.. ఆ టెస్ట్, ఈ టెస్ట్ అంటూ అక్కర్లేని పరీక్షలన్నీ చేసి చివరికి వారి గుండె బరువెక్కేంత బిల్లును చేతిలో పెడతారు. కొన్ని హాస్పిటల్స్‌లో సాధారణ ప్రసవాలకు బదులు కావాలని సిజరిన్లు చేస్తున్నారు. పేదవాడికి సకాలంలో వైద్యం అందే పరిస్థితి మన దేశంలో కనిపించడంలేదు. దీనంతటికీ కారణం మన నేతల పరిపాలనే..’ ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ, ప్రశ్నిస్తూ దర్శకుడు అట్లీ రాసుకున్న కథ ప్రశంసనీయం.   నటీనటులు : మూడు విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్‌, ప్రతీ పాత్రలోనూ వేరియేషన్‌ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. స్టైల్‌, యాక్షన్‌ తో మాస్‌ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని  మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. ముఖ్యంగా ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో వచ్చే సన్నివేశాల్లో విజయ్‌ నటన కంటతడి పెటిస్తుంది. హీరోయిన్లుగా కాజల్‌, సమంత నిత్యామీనన్‌లు కనిపించినా.. చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది మాత్రం ఒక్క నిత్యామీనన్‌కే. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో వచ్చే నిత్యా పాత్ర సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌లో ఒకటి. విలన్‌ ఎస్‌జే సూర్య సూపర్బ్‌ అనిపించాడు. తన బిజినెస్‌ కోసం ఎలాంటి అన్యాయమైనే చేసే క్రూరుడిగా అద్భుతంగా నటించాడు. ఇతర పాత్రల్లో సత్యరాజ్‌, వడివేలు, కోవే సరళ తమ పాత్రలకు న్యాయం చేశారు.   సాంకేతిక నిపుణులు : కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. రెహ్మాన్ అందించిన పాటలు మెప్పిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఆకట్టుకుంటుంది. అయితే సినిమాలో పాటలు ఎక్కువయ్యాయనే భావన కలుగుతుంది. సినిమా నిడివి కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా కాలంగా విజయ్ తెలుగులో మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో అతడి కోరిక తీరిందనే చెప్పాలి. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడికి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్లస్ పాయింట్స్ :
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV నీ స్టిల్స్ సెక్సీ ఉన్నాయి.. మరిన్ని పంపుతావా? కేరళకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ మేకప్ ఆర్టిస్ట్‌తో ఓ సీరియల్ నటుడు చేసిన చాటింగ్ ఇది.. TNN | Updated: Sep 21, 2017, 08:45PM IST నీ స్టిల్స్ సెక్సీ ఉన్నాయి.. మరిన్ని పంపుతావా? మలయాళీ నటులు తమ సినిమాలు, షూటింగ్&zwnj;లకు సంబంధించిన వార్తల కంటే.. వివాదాలతోనే ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ ప్రముఖ నటిపై గ్యాంగ్ రేప్ వెనుక హస్తం ఉందనే ఆరోపణలతో దిలీప్ వార్తల్లో నిలవగా.. తాజాగా మరో యాక్టర్ వంతు వచ్చింది. ట్రాన్స్&zwnj;జెండర్ మేకప్ ఆర్టిస్ట్ అయిన వినీత్ సీమా .. ఓ &lsquo;స్పెషల్ ఫ్రెండ్&rsquo; తనతో చేసిన చాటింగ్&zwnj;కు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫే&zwnj;స్&zwnj;బుక్&zwnj;లో పోస్ట్ చేశారు. వినీత్ సీమా అనే ట్రాన్స్&zwnj;జెండర్ వధువులకు మేకప్ చేస్తారు. తను గతంలో కామెడీ పాత్రల్లో నటించేవారు. యెహియా కాదెర్ అనే సీరియల్ నటుడు తనతో చేసిన చాటింగ్ వివరాలను వినీత్ బుధవారం ఫేస్&zwnj;బుక్&zwnj;లో పోస్ట్ చేయగా.. అవి కాస్తా వైరల్&zwnj;గా మారింది. నీ ఫొటోలు సెక్సీగా ఉన్నాయి. మరిన్ని ఫొటోలు చూడాలనుకుంటున్నా.. పంపుతావా అంటూ వినీత్&zwnj;తో ఫేస్&zwnj;బుక్ ద్వారా చాట్ చేశాడు. తనకు ఇంట్రెస్ట్ లేదని వినీత్ చెప్పడంతో.. కోపంగా చాట్ చేశాడు. గత ఏడాది చివర్లో అతడు పంపిన ఆ మెసేజ్&zwnj;లను వినీత్ ఇప్పుడు షేర్ చేశారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
నన్ను సాగనంపి తను వెళ్లిపోయింది...దూరంగా Highlights భార్య అనిత మరణంపై స్పందించిన దిల్ రాజు శతమానం భవతి, నేను లోకల్ లాంటి బ్లాక్ బస్టర్లతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఐతే అనుకోకుండా తన కుంటుంబంలో పెద్ద విషాదం చోటు చేసుకుంది. దిల్ రాజు భార్య అనిత గత నెల 11న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో దాదాపు నెల రోజుల పాటు ఆయన ఇంటి నుంచి బయటికే రాలేదు. ఈ మధ్యే కొంచెం తేరుకుని బయటికి వచ్చాడు రాజు. ఈ సందర్భంగా భార్య మరణంపై ఓపెనయ్యాడు రాజు. తన భార్య అనితకు పెద్దగా ఆరోగ్య సమస్యలమీ లేవని.. గత ఏడాది మాత్రం మోకాళ్ల నొప్పులతో బాధపడిందని రాజు చెప్పాడు. బరువు ఎక్కువయ్యావని.. 15 కిలోల దాకా తగ్గాలని తాను చెబితే.. లైపో చేయించకుంటానని చెప్పేదని రాజు తెలిపాడు. చనిపోయే ముందు రోజు తనకు పావ్ బాజీ చేసి పెట్టిందని.. తినేవరకు వదిలిపెట్టలేదని.. అదే ఆమె చేతిలో తిన్న చివరి ఫుడ్ అని రాజు తెలిపాడు. మామూలుగా తాను అర్ధరాత్రి తర్వాత ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే.. తన భార్యను నిద్ర లేవొద్దని చెబుతానని.. కానీ చనిపోయే ముందు రోజు మాత్రం రాత్రి 2 గంటలకు ఫ్లైట్ ఎక్కాల్సి వస్తే తను లేచి తనను సాగనంపిందని రాజు చెప్పాడు. అనిత చనిపోయే సమయనికి తాను అమెరికాలో ఉన్నానని.. అప్పటికి సమయం తెల్లవారుజామున ఐదున్నర అని.. ఆ విషయం తెలియగానే పది నిమిషాల పాటు బ్లాంక్ అయిపోయానని రాజు చెప్పాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకోవడానికి 27 గంటలు పట్టిందని.. ఆ 27 గంటల్లో తాను నరకం చూశానని.. భార్య జ్నాపకాలతో అసలు కన్నే మూయలేదని తెలిపాడు. తాను జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని.. కానీ భార్య మరణాన్ని జీర్ణించుకోవడం మాత్రం సాధ్యం కాలేదన్నాడు. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
Oct 25,2016 ఎన్‌ఎండీసీ-మిథానీల కీలక ఒప్పందం నవతెలంగాణ- వాణిజ్యి విభాగం :ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్‌ఎండీసీ, మిథాని తాజాగా కీలక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 'టంగ్‌స్టాన్‌ మైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాసెసింగ్‌ టెక్నలాజీ' పంపిణీ నిమిత్తం ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పంద పత్రాలపై ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ (ప్రొడక్షన్‌) పి.కె. సంపత్‌, మిథాని పీఅండ్‌ఎం డైరెక్టర్‌ ఎస్‌.కె. జా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎండీసీ డైరెక్టర్లు నరేంద్ర కె నందా, సందీప్‌ తులా, బిజి రాజులు పాల్గొన్నారు. టంగ్‌స్టన్‌ లోహం ఉత్పత్తి కోసం ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశంలో ఈ లోహ ఉత్పత్తి, లభ్యత చాలా తక్కువగా ఉన్నందున దీనిని పెంచాలని ఇరు సంస్థలు సంయుక్తంగా నిర్దేశించుకున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ఈ సినిమాను ప్రకటించడంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన వర్మ.. ఆ తరవాత ఒక్కొక్కటిగా పాత్రలను పరిచయం చేసుకుంటూ వదిలిన పోస్టర్లతో రచ్చ చేశారు. ఇక రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ అయితే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అందులో నారా లోకేశ్ పాత్రధారికి చంద్రబాబు పాత్రధారి పప్పు వడ్డించడం మరీ ఫేమస్ అయ్యింది. ఇంతటితో ఆగారా వర్మ అంటే లేదు. స్పీకర్ పమ్మినేని రామ్ రామ్ అనే పాత్ర పోస్టర్ వదిలారు. నిజ జీవితంలో ఈ పాత్ర ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాత్రను సినిమాలో అలీ పోషించారు. Also Read: ‘దర్బార్’ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన మహేష్.. ఆయనంటే ఎప్పటికీ గౌరవమే ఇక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కామెడీ పీస్‌గా మారిన కేఏ పాల్‌ పాత్రను రీసెంట్‌గా వర్మ పరిచయం చేశారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఒక నటుడితో పాల్ పాత్ర వేయించారు. ఇదీ కామెడీనే. ఆ తరవాత నారా లోకేశ్ పాత్రధారిని పవన్ కళ్యాణ్ పాత్రధారి ఓదారుస్తున్నట్టున్న పోస్టర్ వదిలారు. కానీ, ఇప్పుడు మాత్రం బాగా వివాదాస్పదమయ్యే పాత్రను పరిచయం చేశారు. అదికూడా నిజ జీవితంలో ఆ క్యారెక్టర్ ఎవరిదో చెబుతూ ట్వీట్ చేశారు. దీనిలోనూ వర్మ స్టైల్ సెటైర్ ఉంది. బెజవాడకు చెందిన ప్రముఖ కాపు నాయకుడు వంగవీటి రంగ తనయుడు, ఒకప్పటి వైసీపీ నేత అయిన వంగవీటి రాధ పాత్రను వర్మ పరిచయం చేశారు. ఈ పాత్రలో ధన్‌రాజ్ నటించాడు. అయితే, ఈ పాత్ర పేరును సినిమాలో గంగవీటి భవాని అని పెట్టారు వర్మ. ఈ భవానీని సిట్ ఆఫీసర్ సుందరి పోలీస్ స్టేషన్‌లో బట్టలు విప్పించి మరీ ఇంటరాగేషన్ చేస్తోంది. ఇంతకీ ఆ సిట్ ఆఫీసర్ సుందరి ఎవరో కాదు న్యూస్ ప్రెజెంటర్, యాంకర్ స్వప్న. ఈ పోస్టర్‌ను వదులుతూ వర్మ చేసిన రెండు ట్వీట్లు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. Also Read: ‘ఏడు చేపల కథ’ టాక్: ఏముందిరా అయ్యా ఇందులో.. తిట్టిపోస్తున్న జనం ‘‘వంగవీటి రాధాను సిట్ ఆఫీసర్ సుందరి విచారిస్తున్నారు.. సారీ సారీ, నా ఉద్దేశం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో గంగవీటి భవానిని’’ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. మరొక ట్వీట్ చేసిన వర్మ.. ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లులో బెజవాడ రౌడీ వంగవీటి రాధ సన్ ఆఫ్ వంగవీటి రంగ.. సారీ సారీ నా ఉద్దేశం గంగవీటి భవాని సన్ ఆఫ్ గంగవీటి గంగ’’ అని వెటకారంగా పేర్కొన్నారు. The bezawada rowdy in KAMMA RAJYMLO KADAPA REDDLU is Vangaveeti Radha s/o Vangaveeti Ranga ..Sorry sorry sorry I me… https://t.co/hyClVah3MT &mdash; Ram Gopal Varma (@RGVzoomin) 1573145168000 SIT officer Sundari interrogating Vangaveeti Radha ..Sorry sorry, I mean Gangaveeti Bhavani in KAMMA RAJYAMLO KADAP… https://t.co/dq9z2xkmjx &mdash; Ram Gopal Varma (@RGVzoomin) 1573140381000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Oct 21,2015 మార్కెట్లో లాభాల స్వీకరణ ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ల వరుస లాభాలకు తెర పడింది. ప్రధానంగా మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ పరిణామాలకు తోడు లోహ, చమురు అండ్‌ సహజ వాయు సూచీలు ఒత్తిడికి గురి కావడంతోతో మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58.09 పాయింట్లు క్షీణించి 27,306.83 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 13.4 పాయింట్లు నష్టపోయి 8,216.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లలో కమోడిటీ ధరలు మరింతగా పడిపోనున్నాయన్న అంచనాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఒత్తిడి పెరిగింది. బీఎస్‌ఈలో రంగాల వారిగా లోహ సూచీ అత్యధికంగా 1.8 శాతం మేర కుంగింది. ఇదే క్రమంలో చమురు అండ్‌ సహజవాయు సూచీ 0.72 శాతం, రియాల్టీ 0.66 శాతం, వైద్య సూచీ 0.33 శాతం చొప్పున నష్టపోయాయి. మరోవైపు విద్యుత్తు సూచీ 1.33 శాతం, ఐటీి 1 శాతం, టెక్నాలజీ సూచీ 0.75 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ 0.46 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్‌-30లో టీసీఎస్‌ 1.6 శాతం, మారుతీ సుజుకీ 1.22 శాతం, టాటా మోటార్స్‌ 1.19 శాతం, ఇన్ఫోసిస్‌ 1.18 శాతం, ఎన్‌టీపీసీ 0.39 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు వీఈడీిఎల్‌ 6.42 శాతం, టాటా స్టీల్‌ 2.69 శాతం, హిందాల్కో 2.37 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 2.23 శాతం, సిప్లా 2.13 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.2-0.5 శాతం మధ్య నష్టపోయాయి. మొత్తంగా మదుపర్ల మద్దతుతో 1,419 స్టాక్స్‌ లాభాల్లో ముగియగా, మరోవైపు 1,326 స్టాక్స్‌ నష్టాలలో నడిచాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ప్రియా ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ అంటూ రిషి కపూర్ కూడా పడిపోయాడు Highlights రిషి కపూర్ ను సైతం ఫ్లాట్ చేసిన ప్రియా వారియర్ ప్రియా ఇన్నాళ్లు ఎక్కడున్నవ్ అంటూ రిషి ట్వీట్ యూత్ ఫ్లాట్ అయిపోతారంటూ రిషి ప్రశంసలు లేటెస్ట్ సెన్సేషన్ ప్రియా వారియర్ సంచలనాలు కొనసాగుతున్నాయి. సాధారణ యూత్ మాత్రమే కాక యంగ్ హీరోల నుంచి సీనియర్ సెలెబ్రిటీల వరకు అంతా ప్రియా వారియర్ జపం చేస్తున్నారు. ఆమె ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సీనియర్ నటుడు రిషి కపూర్ తాజాగా ప్రియా వారియర్ గురించి స్పదించారు. మై డియర్ ప్రియా అంటూ సంభాషించారు. ప్రముఖ సెలెబ్రిటీలంతా ప్రియా వారియర్ గురించి ఆరాతీస్తుండడంతో ఆమె జాతీయ స్థాయిలో బిగ్ సెలేబ్రిటిగా మారిపోతోంది.   ఒక్క వాలు చూపుతో ప్రియా వారియర్ కన్ను గీటి ఒక్క వాలు చూపుతో అందరిని పడగొట్టేసింది. ప్రియా వారియర్ ముఖంలోని చిరునవ్వు, ఆమె హావ భావాలు యువతకు కలలో కూడా మరచిపోని విధంగా మారిపోయాయి.    జాతీయ స్థాయిలో సెలెబ్రిటీలు ప్రియా వారియర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్అన్ని చిత్ర పరిశ్రమల వరకు ప్రియా వారియర్ ఎవరంటూ ఆరాతీయడం మొదలు పెట్టారు. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఇంకాస్త ముందడుగేసి మై డియర్ ప్రియా అంటూ సంభోదించారు. ఆమె పలికించిన హావా భావాలూ అమోఘం అంటూ కితాబిచ్చారు. రానున్న రోజుల్లో నీ ఏజ్ గ్రూప్ వారు నీ కోసం తహతహ లాడుతారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నేనున్న రోజుల్లో ఎందుకు రాలేదు ప్రియా అంటూ సరదాగా ట్విట్టర్ లో కామెంట్ పెట్టారు.   ఒరు ఆడార్ లవ్ చిత్రంలోని ఒక్క వీడియోతో ప్రియా స్టార్ డమ్ ఇలా పెరిగిపోయింది. ఆ వీడియోలో ఆమె కనుసైగలతోనే అద్భుతమైన హావ భావాలని పలికించి అబ్భుర పరిచింది. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
సీనియర్ నటితో యంగ్ హీరో ఎఫైర్.. సపోర్ట్ కోసమేనా..? Highlights ప్రేమ, పెళ్లి అయితే ఓకే.. కానీ ఇండస్ట్రీలో ఓ యువ నటుడు మాత్రం పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయితో సన్నిహితంగా మెలగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం కాంప్రమైజ్ అవుతున్నారనే విషయాలు గతంలో చాలానే విన్నాం. ఎక్కువగా అమ్మాయిల పేర్లే ఇందులో బయటకు వస్తుంటాయి. ఇదో రకమైతే.. కాస్త ఫేమ్, సపోర్ట్ కోసం బడా ఫ్యామిలీలకు చెందిన అమ్మాయిలతో హీరోలు సన్నిహితంగా మెలగడం ఇప్పుడు ట్రెండ్ అయింది. మొన్నామధ్య ఓ యంగ్ హీరో ఇండస్ట్రీకి చెందిన మెగా కుటుంబం నుండి అమ్మాయిని లైన్ లో పెట్టాడని, ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని విన్నాం. ప్రేమ, పెళ్లి అయితే ఓకే.. కానీ ఇండస్ట్రీలో ఓ యువ నటుడు మాత్రం పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయితో సన్నిహితంగా మెలగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సదరు అమ్మాయికి గతంలో పెళ్లి కూడా జరిగింది. కానీ భర్తతో విడాకులు తీసుకోవడం ఆ తరువాత అతడు చనిపోవడంతో ఆమె తన కుటుంబానికి చెందిన ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ కాలం గడుపుతుంది. అయితే ఆమె కూడా ఈ యంగ్ హీరో స్నేహాన్ని కోరుకుంటోంది. అలాగని ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం అనుకుంటే పొరపాటే.. ఆమె మీద ఇష్టంతో ఈ హీరో గారు ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ ను రాసి సినిమాలో ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ సినిమాతోనే రీసెంట్ గా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇందులో హీరోగా నటించింది కూడా అతడే. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది. ఈ యంగ్ హీరోకి సపోర్ట్ గా నిలుస్తోన్న ఈ సీనియర్ ఆర్టిస్ట్ త్వరలోనే తన ఫ్యామిలీకి చెందిన ప్రొడక్షన్ హౌస్ లో ఈ హీరోతో ఓ సినిమా నిర్మించాలనుకుంటుందని టాక్. మరి ఈ వ్యవహారం ఇంకెక్కడ వరకు వెళ్తుందో చూడాలి! Last Updated 3, Aug 2018, 5:39 PM IST
0business
MaheshBabu అభిబస్‌ యాప్‌తో ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ హైదరాబాద్‌, అక్టోబరు 29: రవాణారంగంలో అన్ని కేటగిరీల్లో కస్టమర్లకు మరింత చేరువ అవుతున్న అభిబస్‌ కొత్తగా యాప్‌ను కూడా విడుదలచేసింది. అంతేకాకుండా కంపెనీ తన ప్రచారకర్తగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబును నియమించుకుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతోడుగా అభిబస్‌ నినాదంతో విస్తృత ప్రచారం చేస్తోంది అభిబస్‌ సిఒఒబిజు మాథ్యూ స్‌ మాట్లాడుతూ బస్‌ టికెట్ల జారీలో దేశవ్యాప్తంగా అగ్ర గామిగా కొనసాగు తున్నామని, ప్రభు త్వరంగంలోని రవా ణా కార్పొరేషన్లేకాకుండా ప్రైవేటురంగ సంస్థల టికెట్లు కూడా కస్టమర్లకు చేరువ చేసినట్లు తెలి పారు. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో అభిబస్‌ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయం ఉందన్నారు. సేవల్లో నాణ్యత, స్థిరత్వం, విశ్వాసం పెంపొందించే విధంగా అభిబస్‌ అన్ని వయసుల వారికి మరింతగా చేరువ కాగలదని మాథ్యూస్‌ ధీమా వ్యక్తం చేశారు.
1entertainment
చరిత్ర సృష్టించిన ధోనీ (వీడియో) Highlights  చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు . టీం ఇండియా మాజీ కెప్టెన్ . ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు .ఐపీఎల్ చరిత్రలో ఎవరు సొంతం చేసుకోలేని ఘనతను ధోనీ సొంతం చేసుకున్నాడు . ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నూట యాభై మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడిగా రికార్డును తన సొంతం చేసుకున్నాడు .2008 నుండి చెన్నై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ ఆ జట్టును రెండు సార్లు ఛాంపియన్ గా నాలుగు సార్లు రన్నరప్ గా నిలిపాడు ..   Visit IPLT20.com the official IPLT20 website for minute-to-minute LIVE updates. Last Updated 30, Apr 2018, 1:28 PM IST
2sports
India vs New Zealand: Did You Know-India Has Never Beaten Kiwis in T20Is కోహ్లిసేన ముంగిట సరికొత్త రికార్డ్..! న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ముందు భారత్ ముంగిట ఓ సరికొత్త సవాల్ నిలిచింది. ఇప్పటికే ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో TNN | Updated: Oct 31, 2017, 05:17PM IST న్యూజిలాండ్&zwnj;తో టీ20 సిరీస్&zwnj;కి ముందు భారత్ ముంగిట ఓ సరికొత్త సవాల్ నిలిచింది. ఇప్పటికే ముగిసిన మూడు వన్డేల సిరీస్&zwnj;ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా.. ఒకసారి కూడా న్యూజిలాండ్&zwnj;ని టీ20ల్లో ఓడించలేకపోయింది. దీంతో ఈ చెత్త రికార్డుని బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరగనున్న తొలి టీ20తో తుడిచిపెట్టేయాలని కోహ్లిసేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు.. వన్డే సిరీస్&zwnj;ని కొద్దిలో చేజార్చుకున్న కివీస్ కూడా కనీసం టీ20 సిరీస్&zwnj;తోనైనా స్వదేశానికి గౌరవంగా తిరిగి వెళ్లాలని ఆశిస్తోంది. భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు ఐదు సార్లు టీ20ల్లో తలపడగా.. ఐదింట్లోనూ కివీస్&zwnj;దే పైచేయిగా నిలిచింది. చివరి సారి.. నాగ్&zwnj;పూర్ వేదికగా గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్&zwnj;లో న్యూజిలాండ్&zwnj;తో తలపడిన భారత్ జట్టు ఘోరంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్&zwnj; 126 పరుగులకే పరిమితమవగా.. అలవోకగా లక్ష్యాన్ని ఛేదిస్తుందనుకున్న టీమిండియా అనూహ్యంగా 79 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ మ్యాచ్&zwnj;లో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 11 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.
2sports
- రోజుకు 10వేల ఫోన్‌కాల్స్‌ - పరిష్కార మార్గాలందిస్తున్నాం : జీఎస్టీఎన్‌ చైర్మెన్‌ వెల్లడి న్యూఢిల్లీ/హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను 'జీఎస్టీ)పై వ్యాపార వర్గాల్లో భారీ అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. కొత్తగా అమల్లోకి తెచ్చిన ఈ పన్ను విధానంపై ట్రేడర్లకు, పన్ను చెల్లింపుదారులకు వచ్చే సందేహాలను నివతి చేయడానికి ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నెంబర్లకు కొన్ని వేలల్లో ఫోన్‌కాల్స్‌ వస్తోన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదు రోజులు అవుతోన్న ఈ నెంబర్లకు రోజుకు సగటున 10వేల కాల్స్‌ వస్తున్నాయని జీఎస్టీ నెట్‌వర్క్‌ చైర్మెన్‌ నవీన్‌ కుమార్‌ తెలిపారు. ట్రేడర్లు, పన్ను చెల్లింపుదారులు ఈ కాల్స్‌ చేస్తున్నట్టు తెలిపారు. జీఎస్టీపై వ్యాపారుల్లో ఇంకా కాస్త గందరగోళం నెలకొందని, దాని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు తమను ఆశ్రయి స్తున్నారని తెలిపారు. నోయిడా నుంచి ఆపరేట్‌ చేస్తున్న ఈ కాల్‌సెంటర్‌లో 400 మంది ప్రతినిధుల బందం పన్ను చెల్లింపుదారుల సందేహాలకు సమాధానాలు ఇస్తుందన్నారు. రెండు కొత్త సర్వీసుల కోసం జీఎస్టీఎన్‌ రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభిం చిందని చెప్పారు. దేశమంతా ఒకే పన్ను నినాధంతో జులై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదురోజులు గడిచినా, ప్రజల్లో ఇంకా స్పష్టత రావడం లేదు. ఏ వస్తువుపై పన్ను తగ్గింది, ఏ వస్తువుపై పెరిగిందో తెలుసుకోలేక తీవ్ర అయో మయంలో ఉన్నారు. దీంతో హెల్ప్‌లైన్‌ సెంటర్లు, సహాయక కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. జీఎస్టీ విధానంలోకి మారే క్రమంలో ఏర్పడ గందరగోళాలను తొలగించేందుకు తాము వారికి సహకరిస్తున్నట్టు నవీన్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆ హెల్ప్‌లైన్‌ సెంటర్లు... ప్రముఖ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రాలతో కలిసి జీఎస్టీఎన్‌ నెట్‌వర్క్‌ రెండు కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇందులో పన్ను చెల్లింపుదారులకు హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 0120-4888999 అందుబాటులోకి తేగా, పన్ను అధికారులకు 0124-4479900 నెంబర్‌ను ఏర్పాటు చేసింది. అవగాహన అంతంతే..! వే2 ఆన్‌లైన్‌ నివేదిక జీఎస్టీపై అతి తక్కువ మందికే అవగాహన ఉందని హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న వే2 ఆన్‌లైన్‌ సర్వేలో వెల్లడయ్యింది. జూన్‌ 26 నుంచి 30 మధ్య దేశ వ్యాప్తంగా ఈ సంస్థ 3.6 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో 55 శాతం మంది తమకు జీఎస్టీపై అవగాహన లేదని తెలిపారు. కాగా 45 శాతం మంది మాత్రం తమకు అవగాహన ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 64 శాతం మంది తమకు జీఎస్టీపై అవగాహన ఉన్నట్టు పేర్కొన్నారు. చాలా మంది పన్నుల వ్యవస్థలో ఈ మార్పును స్వాగతించడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కేవలం 42 శాతం మంది మాత్రమే జీఎస్‌టీ వల్ల ప్రయోజనం చేకూరు తుందన్న అభిప్రాయపడ్డారు. మిగిలిన 58 శాతం మంది ప్రయోజనం ఉండదన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా 76 శాతం మందికి, పశ్చిమ బెంగాల్‌లో 68 శాతం మంది తమకు అవగాహన లేదని పేర్కొన్నారు. జీఎస్టీ అమలు పైన ఎన్నో అవంతరాలు ఉన్నట్టు గమనించామని వే2ఆన్‌లైన్‌ సీఈవో రాజు వనపాలా పేర్కొన్నారు. 80 శాతం మంది ప్రజలకు జీఎస్టీ అమలు దాని విధానంపైన ఎటువంటి అవగాహన లేదన్నారు. జీఎస్టీ వల్ల ధరలు పెరుగుతాయి అనే భావన ఉందన్నారు. జీఎస్టీపై సాధారణ ప్రజానికానికి ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
భూ సేకరణ కాదు..కొనుగోలు ప్రాజెక్టుల అంశంపై ముఖ్యమంత్రి - నిర్వాసితులకు అనుకూలంగా ఉండే విధానం - బాధితులతో నేరుగా చర్చలు జరపాలి - కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశం నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌           నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు ఇతర అభివృద్ధి పనుల విషయంలో భూ సేకరణకు బదులుగా...భూమిని కొనుగోలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. భూ నిర్వాసితులకు అనుకూలంగా ఉండే విధానాన్ని అనుసరించాలని సూచించారు. పనుల్లో ఆలస్యాన్ని నివారించాలని కోరారు. గోదావరి పుష్కరాలు, గృహనిర్మాణం, పౌర సరఫరాలు, ప్రాజెక్టులకు భూ సేకరణ తదితరాంశాలపై చర్చించేందుకు ఆదివారం సిఎం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భూ సేకరణ వివాదాలు తేలకపోవటంతో ప్రాజెక్టులు దశాబ్దాలపాటు ఆగిపోయాయని పేర్కొన్నారు. భూమి కోల్పోయే వారితో నేరుగా చర్చలు జరిపి ప్యాకేజీ నిర్ణయించాలని సూచించారు. వెంటనే డబ్బులు చెల్లించాలని కోరారు. భూ నిర్వాసితుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. 'రేషన్‌'పై కఠిన వైఖరి            పేదలకోసం సరఫరా చేసే సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతున్నాయని ఈ సందర్భంగా సిఎం పేర్కొన్నారు. బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కొందరు వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి రైస్‌ మిల్లర్లకు అమ్ముతున్నారని తెలిపారు. పోలీసుల సహకారం తీసుకుని వారిని కట్టడి చేయాలని ఆదేశించారు. దీనిలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దని సూచించారు. రేషన్‌ షాపుల ద్వారా ప్రతి నెలలో ఏయే తేదీల్లో సరుకులు పంపిణీ చేయాలనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించాలని సూచించారు. అనాథ పిల్లల వివరాల సేకరణ            జిల్లాల వారీగా అనాథ పిల్లల వివరాలను సేకరించాలని కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. వారికోసం ప్రత్యేక హాస్టళ్లు కాకుండా ఇంటిగ్రేటెడ్‌ హాస్టళ్లలోనే వాటిని కలపాలని సూచించారు. అనాథ పిల్లలకు ఏం చేయాలనే విషయమై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోందని చెప్పారు. నగరంలో దాదాపు 20 లక్షల మంది ఫుట్‌పాత్‌, రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటున్నారని చెప్పారు. సిమెంటు, స్టీల్‌ కంపెనీలతో చర్చలు            రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఒకసారి నిర్మిస్తే అవి కనీసం రెండు తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ఇళ్లులేని నిరుపేదలకు దశలవారీగా ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.5.04 లక్షల వ్యయంతో ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ధరలు తగ్గించే విషయంలో సిమెంట్‌, స్టీల్‌ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు. కేజీ వీల్స్‌ వద్దు...            వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లకు కేజీ వీల్స్‌ అమర్చడం వల్ల రహదారులు పాడవుతున్నాయని సిఎం ఈ సందర్భంగా తెలిపారు. ఈ విధంగా తిరక్కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశాలపై గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో పేకాట రాయుళ్ల ఆటలు కట్టించాలని కోరారు. ఈ విషయంలో సీఐలు, ఎస్‌ఐలు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యుదుత్పత్తికి స్థలాల సేకరణ            హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్థలాలను సేకరించాలని సిఎం ఆదేశించారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు, కల్తీ పురుగు మందులు సరఫరా కాకుండా నాణ్యమైన విత్తనాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV బంగారం ధర తగ్గనుందా? పెద్ద నోట్ల రద్దు తరువాత దాని ప్రభావం బంగారం కొనుగోళ్లపై అమితంగా పడింది. TNN | Updated: Nov 29, 2016, 12:24PM IST బంగారం ధర తగ్గనుందా? పెద్ద నోట్ల రద్దు తరువాత దాని ప్రభావం బంగారం కొనుగోళ్లపై అమితంగా పడింది. అన్ని రంగాల కన్నా బంగారం కొనుగోళ్లపై దాని ప్రభావం బాగా పడింది. కొనేవారు లేకపోవడంతో బంగారం ధర దిగివస్తోంది. రానున్న రోజుల్లో ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.28750 వరకు ఉండగా, అది రూ.28వేల దిగువకు చేరుకోవచ్చని అంటున్నాయి. ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి నుండి పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నోట్లు రద్దయిన తరువాత నల్ల కుబేరుల కళ్లు బంగారం కొనుగోళ్లపై పడిన మాట వాస్తవమే అయినా, తరువాత తరువాత వారు కూడా ఆదాయపన్ను శాఖ భయంతో కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఎదుర్కోవచ్చనే భయంతో జ్యూయెలరీ దుకాణదారులు నల్లబాబుల నల్ల డబ్బుకు బంగారాన్ని దొడ్డి దారిన సమకూర్చేందుకు వెనక్కుతగ్గడమే దీనికి కారణం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV తమిళ దర్శకుడితో బాలకృష్ణ తర్వాతి చిత్రం బసవతారకరామపుత్ర బాలకృష్ణ తన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. | Updated: Jan 28, 2017, 05:07PM IST బసవతారకరామపుత్ర బాలకృష్ణ తన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కెరీర్&zwnj;లో 100వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలన్న తన కల సాకారం చేసుకున్న బాలయ్య బాబు ఇప్పుడు నెమ్మదిగా ఫోకస్&zwnj;ని తన తర్వాతి చిత్రంపైకి మార్చారు. 100వ చిత్రం తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే చిత్రం చేయాలని భావించారు బాలకృష్ణ. అయితే, ఉన్నట్టుండి ఏమయ్యిందో ఏమో తెలీదు కానీ ప్రస్తుతానికి బాలకృష్ణ ఆ చిత్రంతోపాటు దర్శకుడిని కూడా మార్చేసినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు సౌతిండియాలో రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి లీడ్ హీరోలతో సినిమాలు చేసి, హిట్స్ కొట్టిన తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈమధ్యే రవికుమార్ వినిపించిన స్టోరీ లైన్ బాలయ్యకు బాగా నచ్చిందట. అందుకే ఆ స్టోరీనే ఇక పట్టాలపైకి ఎక్కించాలని డిసైడ్ అయినట్టుగా సినీవర్గాల్లో ఓ ప్రచారం జరుగుతోంది. కృష్ణవంశీ, రవికుమార్ చిత్రాల్లో ఏది సెట్స్ పైకి వెళ్తుందో తెలియాలంటే ఇంకొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే.
0business
BSE సెన్సెక్స్‌ 1,00,000 పాయింట్లకు చేరుతుందా? ముంబయి, మే 27: ఆసియాలోనే అతిపెద్ద స్టాక్‌ ఎక్ఛేంజిగాను ప్రపంచంలోని పది టాప్‌ ఎక్ఛేంజిల్లో ఒకటిగా నిలిచిన బిఎస్‌ఇ ప్రామాణిక సూచి వచ్చే 2024నాటికి లక్ష పాయింట్లకు చేరు తుందా అన్న విశ్లేషణలు జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం 30,750 పాయింట్లవద్ద ఉన్న సెన్సెక్స్‌ రానున్న కాలంలో 69,250 పాయింట్లు అదనంగా పెరిగి 225శాతం వృద్ధి నమోదుచేస్తుందన్న అంచ నాలు పెరిగాయి. 2009 ఏప్రిల్‌లో దీర్కఆలిక అంచనాలకింద 15ఏళ్లలో సెన్సెక్స్‌ 1లక్ష పాయింట్ల కు చేరుతుందని అంతర్జాతీయ నిపుణుడు గాలా సేవ్‌స్కీ వెల్లడించారు. సెన్సెక్స్‌ భారీఎత్తున పెరుగు తుందనడానికి ఇదేమీ కొత్తకాదు. 2014లో కూడా కార్వి పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ హెడ్‌ వరుణ్‌ గోయల్‌ సెన్సెక్స్‌ 2020 నాటికి లక్ష పాయింట్లకు చేరుతుందని అంచనాలుప్రకటించారు. గతంలోను, వర్తమానంలో కూడా ఇందుకు అనేక అంశాలు దోహదంచేస్తున్నట్లు ఆయన వివరించారు. గ్లోబల్‌ మార్కెట్ల తీరుతెన్నులు సైతం ఇందుకు దోహదం చేస్తాయన్నారు. ఉదాహరణకు డౌజోన్స్‌ 1980 ప్రాంతంలో భారీ వృద్ధిని నమోదుచేసింది. 1982ఆగస్టునెల 12వ తేదీ 777 పాయింట్ల నుంచి ఒక్కసారిగా 2000వ సంవత్సరం నాటికి 1500 శాతం పెరిగి 11,722.98 పాయింట్లఉ చేరింది. 2020 నాటికి కార్వి విభాగాధిపతి అంచనాలను చూస్తే లక్ష పాయింట్లకు చేరుతుంది. 20-25శాతం రాబడుల్లో వృద్ధి ఉంటుందని, అలాగే మరో 15 నుంచి పదహారు పదిహేడు రెట్లు వచ్చే కొన్నేళ్లలోనే అదనపు వృద్ధిని నమోదుచేస్తాయన్నారు. జిడిపి వృద్ధి కూడా ఆరుశాతంగా ఉంటుందని, ద్రవ్యోల్బ ణం ఏడుశాతం అటూ ఇటూగా ఉంటుందని అన్నా రు. ఈకారణాలతో సాధారణ జిడిపివృద్ధి 13శాతం గా ఉంటుందని ఆయన అంచనావేసారు. ఇక అంత ర్జాతీయ స్టాక్‌ నిపుణులు ఇల్లియట్‌వేవ్‌ ఇంటర్నేష నల్‌ ప్రతినిధి మార్క్‌ గాలాసివేస్కీ సాంకేతిక విశ్లేష ణలను వివరిస్తూ ఆర్థికరంగ మార్కెట్లలో ఇన్వెస్టర్ల మనస్తత్వం ధరల్లో హెచ్చుతగ్గులు, ఇతర కీలక అంశాలను సైతం ప్రస్తావించారు. ఇక సెన్సెక్స్‌ నిఫ్టీ రెండూ కూడా దీర్గకాలంలో ఎగువకు వస్తాయని అంచనా. 1979లో సెన్సెక్స్‌ 1979నుంచి ఎగువ కు వెళుతూనే వచ్చింది. ఈకారణాలదృష్ట్యా భారత్‌ లో అమలయ్యే సంస్కరణలు, అంతర్జాతీయ మార్కెట్‌ ధోరణులు, వివిధ అగ్రదేశాల సెంట్రల్‌ బ్యాంకుల వైఖరి వంటివి దేశీయ మార్కెట్లపై ప్రభా వం చూపుతాయి. అందువల్లనే 2024 నాటికి సెన్సెక్స్‌ లక్షపాయింట్లకు చేరుతుందనిమార్క్‌ వివరి స్తున్నారు. వార్షిక వృద్ధి కూడా వచ్చే ఏడేళ్లపాటు 22శాతంగా ఉంటుందని ఆయన అన్నారు. సెన్సెక్స్‌సూచి వార్షిక వృద్ధి గడచిన 17 ఏళ్లు గా 14శాతంగాఉంది. 3999 స్థాయి నుంచి ఈ ఏడాది మేనెల 25వతేదీనాటికి 30,750 పాయిం ట్లకు పెరిగింది. మార్కెట్లబేస్‌ మొత్తంగాచూస్తే ఎగు వకు వెళుతోంది. నిధుల రాక, విలువలు పెరగ డం, సాంకేతికంగా వివిధ సూచీల వృద్ధితో నిఫ్టీ 50సూచి కూడా 10-12శాతం చొప్పున ప్రతి ఏటా పెరుగుతుందని ఇల్లియట్‌వేవ్‌ అంచనావేసింది. ఈ దృష్ట్యానే నిఫ్టీసూచి ఏడువేల పాయింట్ల నుంచి 17వేల పాయింట్లస్థాయికి వెళుతుందని అంచనా వేసారు. అదే సెన్సెక్స్‌ 55వేల పాయింట్లనుంచి 60 వేల పాయింట్లు అదనపు వృద్ధిని సాధించి లక్ష పాయింట్ల మార్కును చేరుతుందని మార్క్‌ వివరిం చారు. ఇక నిధుల రాక, ఆర్ధిక వ్యవస్థ తీరుతెన్ను లు, దేశీయ, విదేశీ నిధుల కుమ్మరింత, కార్పొరేట్‌ ఫలితాలు, ప్రభుత్వ విధానాలు, భౌగోళిక తీరు తెన్నులు వంటివి కూడా కొంత దోహదంచేస్తాయని మరికొందరు నిపుణులు చెపుతున్నారు. నిఫ్టీ తక్షణ టార్టెస్‌కింద 10,800గా ఉంటుందని, మరింతగా పెరిగి 11,400 పాయింట్లకు చేరగలదని ట్రేడ్‌ బుల్స్‌ టెక్నికల్‌ ఉపాధ్యక్షుడు సచ్చితానంద్‌ ఉత్తే కర్‌ వెల్లడించారు. ఈసూచి ప్రతిఏటా 10-15 శాతం చొప్పున వచ్చే రెండు, మూడేళ్లపాటు పెరు గుతుందని ఆయన అంచనావేసారు. స్టాక్‌మార్కెట్ల లో క్షేత్రస్థాయి వాస్తవాలు శరవేగంగా మారు తుంటాయి. మరో రెండు త్రైమాసికాలు వేచి చూస్తే ఆర్థిక రంగంలోని మార్పులకు ఫలితాలు స్పష్టత నిస్తాయని ఫలితంగా మార్కెట్ల వృద్ధి తీరు కూడా తెలుస్తుందని సచ్చితానంద్‌ వెల్లడించారు
1entertainment
Visit Site Recommended byColombia అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.30 క్షీణించింది. దీంతో ధర రూ.36,850కు దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం రూ.130 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,900కు ఎగసింది. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.38,850 వద్దనే స్థిరంగా కొనసాగింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగానే రూ.37,650 వద్ద ఉంది. Also Read: వెండి కొంటున్నారా? ఈ విషయాలు గుర్తించుకోండి! బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. కేజీ వెండి ధర మాత్రం పైకి కదిలింది. రూ.130 పెరుగుదలతో రూ.48,900కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ ‌పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. Also Read: ట్రైన్ టికెట్ క్యాన్సల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి! అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.10 శాతం తగ్గుదలతో 1,494.40 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.30 శాతం క్షీణతతో 17.82 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. Also Read: దీపావళి తర్వాత 50 లక్షల మంది ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్? బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. Also Read: నెలకు కేవలం రూ.2,000తో చేతికి ఏకంగా రూ.50 లక్షలు..!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
Hyderabad, First Published 17, Apr 2019, 3:27 PM IST Highlights   వరుస అపజయాలతో సతమతమవుతున్న నితిన్ ఈ సారి నెక్స్ట్ సినిమాతో పర్ఫెక్ట్ హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల చెప్పిన బీష్మ కథను మెచ్చిన నితిన్ త్వరలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. వరుస అపజయాలతో సతమతమవుతున్న నితిన్ ఈ సారి నెక్స్ట్ సినిమాతో పర్ఫెక్ట్ హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల చెప్పిన బీష్మ కథను మెచ్చిన నితిన్ త్వరలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. అయితే ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.  హీరోయిన్ రష్మిక మందన్న ను ఇదివరకే సెలెక్ట్ చేసిన చిత్ర యూనిట్ మరో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. కొన్ని మీడియాలో అయితే దాదాపు సెకండ్ హీరోయిన్ ఖరారయినట్లు కథనాలు కూడా వచ్చాయి. ఇక ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు.  సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రశ్మిక మందన్న నటిస్తోందని చెబుతూ.. త్వరలో మిగతా నటీనటుల వివరాలు అలాగే టెక్నీషియన్స్ గురించి తెలియజేస్తామని వెంకీ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. దీంతో నితిన్ అభిమానుల్లో సినిమా పై ఒక క్లారిటి వచ్చినట్లయ్యింది. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. Last Updated 17, Apr 2019, 3:27 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV టాటా స్టీల్ నుంచి మిస్త్రీకి ఉద్వాసన టాటా స్టీల్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగిస్తూ శుక్రవారం సాయంత్రం కంపెనీ నిర్ణయం తీసుకుంది. TNN | Updated: Nov 25, 2016, 07:46PM IST టాటా స్టీల్ నుంచి మిస్త్రీకి ఉద్వాసన టాటా స్టీల్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగిస్తూ శుక్రవారం సాయంత్రం కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానాన్ని కంపెనీ స్వతంత్ర డైరెక్టర్&zwnj;గా ఉన్న ఓపీ భాటియా భర్తీ చేస్తారు. అలాగే కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి నూస్లీ ఎన్ వాడియా తొలగింపుపై డిసెంబర్ 21న ఎక్స్&zwnj;టార్డినరీ జనరల్ మీటింగ్ (EGM) నిర్వహించనున్నట్లు టాటా స్టీల్ ప్రకటించింది. కాగా, నాటకీయ పరిణామాల మధ్య గత నెలలో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్&zwnj;గా రతన్ టాటా కొనసాగుతున్నారు. అయితే తనను చైర్మన్ పదవి నుంచి తొలగించడం వెనక రతన్ టాటా పూర్తి ప్రమేయం ఉందని, ఆయనపై మిస్త్రీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీసీఎస్, టాటా స్టీల్ విషయంలో కూడా రతన్ టాటా సొంత నిర్ణయాలు తీసుకున్నారని కూడా గతంలో ఆరోపించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
మహేష్ తో మనస్పర్ధలు నిజమే: మణిశర్మ Highlights టాలీవుడ్ లో ఎన్నో హిట్ ఆల్బమ్స్ చేసిన సంగీత దర్శకుడు మణిశర్మకు పస్తుతం అవకాశాలు  టాలీవుడ్ లో ఎన్నో హిట్ ఆల్బమ్స్ చేసిన సంగీత దర్శకుడు మణిశర్మకు పస్తుతం అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం ఆయన సంగీతం కోసం ఎదురుచూసేవారు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరి సినిమాలకు పని చేసిన మణిశర్మకు మహేష్ బాబుతో మనస్పర్ధలు ఉన్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'మహేష్ కెరీర్ మొదలైనప్పటి నుండి అయన నటించిన చాలా సినిమాలకు వర్క్ చేశాను. మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. అయితే మా మధ్య ఏవో మనస్పర్ధలు రావడంతో మహేష్ చాలా బాధ పడ్డాడు. ఏ విషయంలో ఆయన బాధపడ్డారో తెలుసుకుందామని ఆయనను కలవడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు. అని స్పష్టం చేశారు.  ప్రస్తుతం యువ సంగీత దర్శకుల హవా పెరగడం మణిశర్మ చరిష్మా తగ్గడంతో దర్శకనిర్మాతలలో మణిశర్మతో కలిసి పని చేసే ఆలోచన పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఆయన తన వద్ద పనిచేసే వారిని  బాగా తిడుతుంటారనే వార్తలు వినిపించేవి. వీటిపై స్పందించిన ఆయన వారిపై నాకు ఎలాంటి కోపం ఉండదు. వర్క్ లో పెర్ఫెక్షన్ కోసం కోప్పడుతూ ఉంటాను అంతే.. అని స్పష్టం చేశారు. Last Updated 19, Jun 2018, 1:17 PM IST
0business
RBI రెపో రేట్లు యథాతథం ముంబై,: రిజర్వుబ్యాంకు అందరూ ఊహించినట్లుగా కాకుండా భిన్నంగా వ్యవహరించింది. రెపోరేట్లను పావుశాతం తగ్గి స్తుందని మెజార్టీ కార్పొరేట్‌, ఆర్థికరంగాలు వేసిన అంచనాలకు భిన్నంగా రేట్లను యధాతథంగా కొనసాగించింది. రెపోరేట్లు ప్రస్తు తం ఉన్న 6.75శాతంవద్దనే కొనసాగించింది. రివర్స్‌రెపోబ్యాంకు రేటు 5.75శాతంగాను, 6.75శాతంగాను కొనసాగించింది. ఆర్‌బిఐ తన ఆరవ ద్వైమాసిక ద్రవ్యవిధాన సమీక్షలో బుధవారం రెపోరేటును ద్రవ్యసర్దుబాటు సౌకర్యం(ఎల్‌ఎఎఫ్‌) కింద స్థిరంగానే కొనసాగించింది. రివర్స్‌రేట్‌ను మాత్రం 5.75శాతంవద్ద కొన సాగించింది. ఇక స్వల్పకాలిక సర్దుబాటు (మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ)ని బ్యాంక్‌ వడ్డీరేటును 6.75శాతంగా నిర్ణయించింది. 25 బేసిస్‌ పాయింట్లు కోత విధిస్తుందని అన్ని వర్గాలు ఊహిం చాయి. ఖచ్చితంగా ఉంటుందని ఆర్థికవ్యవస్థకు అనివార్యం అవు తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఎండి మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడిం చారు. అంతర్జాతీయ అనిశ్చితి, ముడిచమురుధరలు పెరగడం కీలకద్రవ్యోల్బణం కీలకపాత్ర పోషించాయి. దీనివల్లనే వడ్డీరేట్లను కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లు మిరే అసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హెడ్‌ మహేంద్రకుమార్‌ జాజూ వెల్లడించారు. ఇక రానున్న ఆర్థిక సంవత్సరానికి స్థూల విలువల జోడింపు అంచ నాలు 6.9శాతంగా ఉంటుందని అంచనా. ఆర్‌బిఐ తన స్థూల విలువల జోడింపు(జివిఎ)ను 7.4 శాతం వద్ద కొనసాగించింది. రానున్నరోజుల్లో వృద్ధి గణనీయంగా ఉంటుందని సెంట్రల్‌ బ్యాంకు అంచనా వేసింది. నగదుఆధారితరంగాలైన రిటైల్‌ట్రేడ్‌, హోటల్స్‌ రెస్టారెంట్లు, రవాణారంగం అసంఘటితరంగం వంటివి మంచి వినిమయశక్తితోను పెట్టుబడుల డిమాండ్‌తో వృద్ధినిసాగిస్తాయన్నారు. డిసెంబరునెలపరంగా ఆర్‌బిఐ ద్రవ్యోల్బణం ఐదుశాతంగా అంచనావేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లోను ఆర్‌బిఐ ద్రవ్యోల్బ ణాన్ని నాలుగు నుంచి 4.5శాతంగా నిర్ణయించింది. రెండో అర్ధభాగంలో 4.5శాతం నుంచి ఐదుశాతానికి వస్తుందని ప్రకటించింది. ముడిచమురుధరలు పెరగ డం, కరెన్సీ మారకంవిలువల్లో అనిశ్చితి వంటివి అంత ర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో చోటుచేసుకునే పరిణామాలు వంటివి కొంతకీలకం అవుతాయి. అలాగే ఏడో వేతన సంఘానికి సంబంధించి ఇంటి అద్దె భత్యాలు వంటివి కూడా కీలకం అవు తాయి. మానిటరీ పాలసీ కమిటీ వైఖరి తటస్థంగా ఉంది. సిపై ద్రవ్యోల్బణం ఐదుశాతానికి వచ్చేంతవరకూ ఈ విధానం కొన సాగుతుందని, మధ్యంతరంగా ఆర్‌బిఐ నాలుగుశాతం లక్ష్యంతో అదనంగా రెండుశాతం అటూ ఇటూగా ఉండవచ్చని చెపుతోంది. పొదుపుఖాతాలపై విత్‌డ్రా ఆంక్షల సడలింపు ఇక పొదుపుఖాతాలు నగదు విత్‌డ్రా పరిమితులను తొలగించింది. మానిటరీపాలసీ సమీక్షలో ఆర్‌బిఐ నగదు పరిమితులను ప్రస్తు తం ఉన్న 24 వేల నుంచి రూ.50వేలకు పెంచింది. వారానికి 50వేలు దాటకుండా విత్‌డ్రాచేసు కోవచ్చు. ఈనెల 20వ తేదీ నుంచి ఈఉత్తర్వులు అమలులోకి వస్తాయి. అన్ని నగదు విత్‌డ్రాఆంక్షలను వచ్చే నెల 13వ తేదీనుంచి ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించింది. కరెంటుఖాతా లపై విత్‌డ్రా పరిమితులను ఇప్పటికే తొలగించింది. చెక్కులు, ఎటిఎంల ద్వారా ఉన్న వాటిని కూడా సడలిం చింది. ఆర్‌బిఐ ప్రకటించిన పాలసీ రేట్లను క్షేత్రస్థాయికి బ్యాంకులు తీసు కెళ్లాలని ఆదేశించింది. బ్యాంకింగ్‌ రంగంలోని నిరర్ధక ఆస్తులను సాధ్య మైనంత త్వరగా పరిష్కరించుకోవా లని, బ్యాంకుల పునఃమూలధనీక రణ అనివార్యం అవుతుందని బ్యాంకు అభిప్రాయం వ్యక్తంచేసింది. అలాగే చిన్నమొత్తాల పొదుపు పథకాలపై ఉన్న వడ్డీరేట్ల సర్దుబాట్లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో రాబడులు పెంచేవిగా ఉండాలని, తదనంతరం మెచూరిటీ నాటికి వచ్చే రాబడుల మొత్తాన్ని పూర్తిగా అమలయ్యేవిధంగా చూడాలని సూచించింది. మొత్తం మీద అందరి అంచనాలకు భిన్నంగా రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లను యధాతథంగానే కొనసాగించింది.
1entertainment
Pranay, Kashyap యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు  అనాహైమ్‌:యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ఫ్రీ గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్లు పారుపల్లి కశ్యప్‌, హెచ్‌ఎస్‌ ప్రణ§్‌ు ఫైనల్లోకి దూసుకెళ్లారు. 21 నెలల తర్వాత కశ్యప్‌ ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌కు చేరడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో భాగంగా రెండో సెమీఫైనల్లో కొరియాకు చెందిన క్వాంగ్‌ హీ హెయోపై 15-21, 21-15, 21-16తో విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో హెచ్‌ ఎస్‌ ప్రణ§్‌ు వియత్నాంకు చెందిన తియెన్‌ మిన్‌ ఎన్గుయెన్‌ఫై 21-14, 21-19తో గెలుపొందాడు. ఓ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు చెందిన ఇద్దరు షట్లర్లు ఫైనల్లో తలపడటం ఇది రెండో సారి. ఈఏడాది ఏప్రిల్‌లో జరిగిన సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్లో భారత్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ తలపడిన సంగతి తెలిసిందే. ఈపోరులో సాయి ప్రణీత్‌ విజయం సాధించిన విజయం తెలిసిందే. అంతకముందు పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ ప్రణ§్‌ు 10-21, 21-15, 21-18 తేడాతో జపాన్‌ క్రీడాకారుడు కంటట్యునియామపై విజయం సాధించగా పారుపల్లి కశ్యప్‌, సమీర్‌ వర్మ మధ్య జరిగిన ఈమ్యాచ్‌లో కశ్యప్‌ 21-13, 21-16తేడాతో కశ్యప్‌ విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. ఫైనల్లో కశ్యప్‌, ప్రణ§్‌ు తలపడనున్నారు.
2sports
internet vaartha 237 Views న్యూఢిల్లీ : మళ్లీ టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడతానని టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ పేర్కొన్నాడు. కాగా ముంబైలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్‌ అనంతరం మాట్లాడుతూ మళ్లీ టెస్ట్‌ మ్యాచుల్లో చోటు సంపాదించి బాగా ఆడతానన్నాడు. అలాగే తదుపరి వరల్డ్‌ కప్‌లో ఆడటం తన ముందున్న మరో టార్గెట్‌ అని పేర్కొన్నాడు. తాను వీలైనన్ని ఎక్కువ రోజులు క్రికెట్‌ ఆడిన తరువాతనే రిటైర్డవుతానని, అప్పటి వరకు క్రికెట్‌లో మేటి ఆట కొనసాగించడానికే ప్రయత్నిస్తూనే ఉంటానన్నాడు. ఇటీవల జరిగిన టి20 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాయపడిన తదుపరి మ్యాచ్‌కు దూరం కావడం బాధ కలిగించిందన్నాడు. బాగా ఆడి ఆకట్టుకుని 2019 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చేరడానికి ప్రయత్నిస్తానని, ఆ వరల్డ్‌కప్‌లో ఆడితే అదే నాకు పదివేలు అని పేర్కొన్నాడు.
2sports
May 14,2016 టయోటా నుంచి సరికొత్త ఇన్నోవా హైదరాబాద్‌: వాహన ప్రియు లు గత కొంత కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇన్నోవా శ్రేణికి చెందిన ''ఇన్నోవా క్రిస్టా'' మార్కెట్లోకి వచ్చేసింది. ఈ మోడల్‌ను ఆ కంపెనీ శనివారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ది ఇన్నోవా క్రిస్టా ఆటోమాటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ విభాగంలో జడ్‌ఎక్స్‌, జీఎక్స్‌ రెండు మోడళ్లు, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ తరగతిలో జడ్‌ఎక్స్‌, వీఎక్స్‌, జీఎక్స్‌, జీ మోడళ్లలో లభిస్తుందని తెలిపింది. హైదరాబాద్‌ ఎక్స్‌షోరూం వద్ద దీని ధర రూ.14,06,621 నుండి రూ.21,13,477గా నిర్ణయించింది. సరికొత్త 2.8ఎల్‌ డీజిల్‌ ఇంజిన్‌ మరియు సరికొత్త 5 స్పీడ్‌ మాన్యుయల్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన 2.4ఎల్‌ డీజెల్‌ ఇంజిన్‌ రకాలను ఇన్నోవా క్రిస్టాలో అందిస్తుంది. 2.8ఎల్‌ లీటరుకు 14.29 కిలోమీటర్ల మైలేజీ, 2.4ఎల్‌ లీటరుకు 15.10 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ Ê సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ Ê మార్కెటింగ్‌) ఎన్‌. రాజా తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ ఈ విభాగంలో ఇన్నోవా తొలి స్థానంలో ఉందన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ఈ సందర్భంగా నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందన్నారు. తమ గత చిత్రాలు మాదిరిగానే ఇది కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. నాగ చైతన్య ప్రెష్ లుక్, నటన సినిమాకు బాగా కలిసొస్తుందని తాము నమ్ముతున్నామన్నారు. దర్శకుడు చందు మొండేటి బాగా కష్టపడ్డారని, మంచి ఔట్‌పుట్ ఇచ్చారని కొనియాడారు. ఫస్టాఫ్ అంతా చాలా ఎంటర్‌టైనింగ్‌గా.. సెకండాఫ్‌లో మాధవన్, నాగచైతన్య మధ్య పోరుతో సినిమా చాలా బాగుంటుందన్నారు. అయితే, చైతన్య సినిమాల్లోనే భారీ బడ్జెట్ చిత్రమని అంటున్నారని.. ఇంత ఖర్చుపెట్టడానికి కారణం ఏంటని ఓ రిపోర్టర్ నవీన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. కథను నమ్మే తాము ఇంత బడ్జెట్ పెట్టామని చెప్పారు. అనుకున్నదాని కంటే కాస్త ఎక్కువగా ఖర్చయిందని, గతంలో కూడా ఇలా జరిగిందని తెలిపారు. ఖర్చు ఎక్కువగా అయినప్పటికీ తాము సేఫ్ జోన్‌లోనే ఉన్నామన్నారు. ఇప్పటికే మంచి బిజినెస్ జరిగిందని చెప్పారు. సీవీ మోహన్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుందని, థియేటర్‌లో ప్రేక్షకులు కూడా ఇదే అనుభూతిని పొందుతారనే నమ్మకం తమకుందని చెప్పారు. ఈ సినిమాకు కాన్సెప్టే హైలైటన్నారు. ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ వల్ల ఎడమచేయి దానంతట అదే పనిచేయడమే హైలైట్ అని చెప్పారు. ఈ పాయింటే ఫన్, ఎమోషన్‌ను జనరేట్ చేస్తుందని తెలిపారు. కీరవాణి ఈ సినిమాకు మరో హీరో అన్నారు. ఆయనిచ్చిన ట్యూన్లు, రీరికార్డింగ్ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఆయనచేసిన పెద్ద సినిమాల్లో దేనికీ తక్కువ కాకుండా ‘సవ్యసాచి’కి బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఇచ్చారని కొనియాడారు. ‘సవ్యసాచి’ నిర్మాతల ఇంటర్వ్యూ X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ఆ సినిమాలో నన్ను బాగా వాడేశారు.. హీరోయిన్ కామెంట్స్! Highlights సినిమాలో నటించింనందుకు తను తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.6 లక్షల రూపాయలు మాత్రమేనని, దర్శకుడు అజయ్ భూపతి తనను సినిమాలో బాగా వాడేశాడని చెప్పింది. అయితే దానికి తను బాధ పాడడం లేదని సినిమా మంచి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందంటోంది పాయల్ 'RX100' సినిమాతో తెలుగు వారికి పరిచయమైన నటి పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే యూత్ అందరికీ దగ్గరైంది. ఈ సినిమాలో అమ్మడు ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. సినిమా సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువ శాతం ఆమెకే దక్కుతుంది. సినిమాలో హీరో, హీరోయిన్లకు మధ్య దాదాపు 45 కి పైగా కిస్ సీన్స్, హగ్ సీన్స్ ఉన్నాయి. ఇక హీరోయిన్ గా పాయల్ చేసిన ఎక్స్ పోజింగ్ కి హద్దే లేదు. ఈ అంశాలు యూత్ ని ఎట్రాక్ట్ చేయడంతో సినిమా మంచి విజయ్ సాధించి కలెక్షన్స్ కూడా బాగా వసూలు చేసింది. కానీ దీనివల్ల పాయల్ కు క్రేజ్ వచ్చినా.. అదే రేంజ్ లో విమర్శలు కూడా వచ్చాయి. ఇది సినిమా కాదని, మొత్తం బూతులు ఉన్నాయంటూ మహిళా సంఘాలన్నీ విరుచుకుపడ్డాయి. అయితే తను సినిమాలో ఆ విధంగా నటించడానికి కారణం సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికే అని చెబుతోంది పాయల్. సినిమాలో నటించింనందుకు తను తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.6 లక్షల రూపాయలు మాత్రమేనని, దర్శకుడు అజయ్ భూపతి తనను సినిమాలో బాగా వాడేశాడని చెప్పింది. అయితే దానికి తను బాధ పాడడం లేదని సినిమా మంచి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందంటోంది పాయల్. ఇకపై మాత్రం తను రెమ్యునరేషన్ పెంచుతున్నట్లు ప్రకటించింది. టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుందని వెల్లడించింది.    Last Updated 4, Aug 2018, 12:34 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Vivek Oberoi: అభిషేక్‌కి ఐష్ మాజీ ప్రియుడి విషెస్.. జరిగిందంతా మర్చిపోతారా? బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్.. అభిషేక్ బచ్చన్‌కు విషెస్ చెప్పారు. అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. ఈ సందర్భంగా వివేక్ సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు. | Updated: Sep 18, 2019, 11:09AM IST Vivek Oberoi: అభిషేక్‌కి ఐష్ మాజీ ప్రియుడి విషెస్.. జరిగిందంతా మర్చిపోతారా? కాలు జారితే వెనక్కి తీసుకోగలం. కానీ నోరు జారితే దాని వల్ల కలిగే పరిణామాలను ఊహించలేం. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌కు ఇప్పటికే ఈ విషయం అర్థమై ఉంటుంది. ఎక్కడ ఏది మాట్లాడాలో.. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో సెలబ్రిటీలకు బాగా తెలుసు. కానీ ఏదో సరదాగా ట్వీట్ చేస్తే పోలా అనుకున్న వివేక్‌కు ఇతర సినీ ప్రముఖులు బాగా బుద్ధి చెప్పారు. ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే.. వివేక్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. చాలా కాలం తర్వాత అభిషేక్.. ‘ది బిగ్ బుల్’ అనే సినిమాలో నటించబోతున్నారు. READ ALSO: ఆ లైంగిక వేధింపుల వీడియోను దిలీప్‌కి ఇవ్వొద్దు: సుప్రీంను కోరిన నటి ఈ సందర్భంగా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు వివేక్ ట్వీట్ చేశారు. ఇందులో విషయం ఏముంది అనుకుంటున్నారా? అయితే ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లా్ల్సిందే. ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ , వివేక్ ఒబెరాయ్ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత ఐష్ సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేశారు. ఇది కూడా సెట్ అవ్వలేదు. మొత్తానికి ఐష్, అభిషేక్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో పోల్ రిజల్ట్, ఎగ్జిట్ పోల్స్ అంటూ వివేక్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో ఐష్ వివేక్‌తో, సల్మాన్‌తో, అభిషేక్‌తో కలిసి ఉన్నారు. దాంతో సినీ ప్రముఖులు వివేక్ చీప్ పోస్ట్‌పై ధ్వజమెత్తారు. వారి టార్చర్ తట్టుకోలేక వివేక్ ఆ ఫొటో డిలీట్ చేసి సారీ చెప్పారు. READ ALSO: రానాకు కీర్తి సురేశ్ నో చెప్పిందా? అయితే ఈ ఫొటో విషయంపై ఐష్ కానీ అభిషేక్ కానీ స్పందించలేదు. అభిషేక్‌తో ఎలాగైనా మంచిగా మెలగాలని నిర్ణయించుకున్న వివేక్ ఈరోజు ఆయన సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ విష్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వివేక్ ఇంతవరకూ మరో ప్రాజెక్ట్‌ గురించి ప్రకటించలేదు. మున్ముందు ఆయన చేయబోయే సినిమాలకు ఎక్కడ సహ నటీనటులు సపోర్ట్ చేయరోనన్న ఉద్దేశంతో వివేక్.. అభిషేక్‌కు మంచి జరగాలని కోరుకుంటూ ట్వీట్ చేసి ఉండొచ్చు. ఏదేమైనా గతంలో జరిగిన చెడు అనుభవాలను సెలబ్రిటీలు అంత త్వరగా మర్చిపోలేరు కదా..   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
`శివ‌లింగ` ట్రైల‌ర్‌ ట్రెండింగ్ Highlights లారెన్స్ శివ లింగా మూవీ ట్రయలర్ కు మంచి స్పందన మిలియన్ వ్యూస్ దాటిన ట్రయలర్ కన్నడ శివలింగా మూవీని రీమేక్ చేసిన లారెన్స్       కొరియోగ్రాప‌ర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ న‌టించిన తాజా చిత్రం ‘శివ‌లింగ’  త్వ‌ర‌లో రిలీజ్కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. `చంద్ర‌ముఖి` వంటి సంచ‌ల‌న చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌  పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన `శివ‌లింగ ` చిత్రాన్ని అదే టైటిల్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై  నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్‌కి అసాధార‌ణ‌మైన వ్యూస్ వ‌చ్చాయి.  ఇప్ప‌టికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో 10 ల‌క్ష‌ల వ్యూస్  సాధించింది ట్రైల‌ర్‌.    ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ``కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్  అయిన చిత్రమిది. పి.వాసు గారి చంద్రముఖి ఎంత‌టి సెన్సేష‌నో తెలిసిందే. అలాగే లారెన్స్ కాంచన , గంగ ఏ స్థాయిలో విజ‌యాలు సాధించాయో తెలుసు. వాటిని మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది.  ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ట్రైల‌ర్‌ , పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇప్ప‌టికే యూట్యూబ్‌లో 10 ల‌క్ష‌ల మంది  ట్రైల‌ర్‌ని చూశారు. ఈనెల‌లోనే సినిమాని రిలీజ్ చేయ‌నున్నాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రం`` అని తెలిపారు.    రితికా సింగ్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో వ‌డివేలు, శ‌క్తివాసు, రాధార‌వి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కెమెరా: స‌ర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సాహిత్యంః రామ‌జోగ‌య్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః అన‌ల్ అర‌సు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌, నిర్మాతః ర‌మేష్‌.పి.పిళ్లై , దర్శకత్వంః పి.వాసు⁠⁠⁠⁠ Last Updated 26, Mar 2018, 12:01 AM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 'వాట్సాప్‌' అప్‌డేట్ చేసుకోండి..! తన వినియోగదారులు వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్ సంస్థ కోరుతోంది. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ కొత్త ఫీచర్ కోరుకునేవారు వెంటనే వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది. TNN | Updated: Mar 27, 2018, 04:36PM IST తన వినియోగదారులు వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్ సంస్థ కోరుతోంది. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ కొత్త ఫీచర్ కోరుకునేవారు వెంటనే వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా...టైమ్‌తోపాటు లొకేషన్‌ స్టికర్లను పంపుకొనే అవ‌కాశం క‌ల్పించింది. ఇంతకు ముందు యూజర్లు గూగుల్‌ మ్యాపింగ్‌ ద్వారా లొకేషన్‌ షేర్‌ చేసుకునే వారు. అయితే... ఇకపై ఆ అవసరం ఉండదు. దీని ద్వారా... ఫోటోలు, వీడియోలు పంపుకునే ఆప్షన్‌(స్టిక్కర్ల) ద్వారానే లోకేషన్‌ను పంచుకునే వీలు కల్పించింది. అంతేకాదు మీరు ఎక్కడున్నది టైమ్‌తో సహా షేర్‌ చేసుకోవచ్చు. దీనివల్ల యూజర్లకు చాలా సమయం కలిసొస్తుందని సంస్థ పేర్కొంది. కాగా, కొద్ది రోజుల క్రితమే పేమెంట్స్‌ సౌకర్యాన్ని కూడా వాట్సాప్‌ కల్పించిన విషయం తెలిసిందే.
1entertainment
సెప్టెంబర్ 4న స్పైడర్ సెకండ్ సింగిల్ Highlights సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సెప్టెంబర్ 27న తెలుగు,తమిళ భాషల్లో వాల్డ్ వైడ్ రిలీజ్ కానున్న స్పైడర్ సెప్టెంబర్ 4న స్పైడర్ సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్   సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పైడర్. స్పైడర్ చిత్రంలోని సెకండ్ సింగిల్ సాంగ్ ను సెప్టెంబర్ 4న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ తో భారీ హైపై క్రియేటైంది. దసరా కానుకగా రిలీజ్ కానున్న స్పైడర్ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
Hyd Internet 75 Views air india Air India ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియాకు అత్యవసర వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.1500కోట్లు అందాయని అ సంస్థ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఎయిర్‌ ఇండియా టెండర్‌ పిలిచిన నెలరోజుల లోపే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానుంచి ఆ నిధులు అందడం విశేషం. కాగా ఎయిర్‌ ఇండియా ప్రభుత్వరంగ బ్యాంక్‌ నుంచి రుణాన్ని తీసుకోవడం ఇటివలి నెలల్లో ఇది రెండవసారి. అనేక ఆర్థిక పరమైన తలనొప్పులతో బాధపడుతున్న చివరికి పెట్టుబడుల ఉపసంహరణకు సిధ్ధమైన ఎయిర్‌ ఇండియా అప్పుల భారాన్ని తగ్గించుకోడానికి అనేక మార్గాలు వెతుకుతోంది. ఇందులో నిరుపయోగంగా ఉన్న అప్రధాన అస్తులను విక్రయించడం, కార్యకలాపాలను విస్తరించడం ఉన్నాయి. కాగా ఈ రుణానికి సంబంధించి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం రాలేదు. అత్యవసర రోజువారి కార్యకలాపాల అవసరాలకోసం రూ.1500కోట్ల స్వల్ప కాలిక రుణాలు అవసరం అని ఎయిర్‌ ఇండియా ఇటివల పత్రికల్లో ప్రకటనాలు కూడా ఇచ్చింది. దినికి ప్రభుత్వ గ్యారెంటి కూడా ఉంటుందని తెలిపింది. దినికన్నా ముందు ఎయిర్‌ ఇండియా రెండు బ్యాంక్‌లు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి రూ.3250 కోట్ల స్వల్ప కాలిక రుణాలు తిసుకుందని ఆవర్గాలు తెలిపాయి. 50వేల కోట్లకు పైగా అప్పుల భారంలో ఉన్న ఎయిర్‌ ఇండియాను తిరిగి విజయవంతం చేయడానికి ప్రభుత్వం అనేక మర్గాలు వెతుకుతుంది. ఇందులో భాగంగా పదేళ్ల కాలానికి ఆ సంస్థకు రూ.30,231కోట్ల నిధులను సమాకురుస్తుంది. మరో వైపు సంస్థలోతన వ్యూహాత్మక వాటాను విక్రయించడానికి సరైన సంస్థ కోసం వెతకడంతో పాటు దానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చెస్తోంది.త
1entertainment
sumalatha 145 Views bse , NSE , stock market sensex ముంబయి: ఈరోజు భారీ దేశీయ స్టాక్‌ మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పతనమవుతూనే వచ్చాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 769 పాయింట్లు నష్టపోయి 36,562కి పడిపోయింది . నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి 10,797కు దిగజారింది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
1entertainment
Suresh 776 Views ipl ముంబైని గెలిపించిన పోలార్డ్‌ బెంగళూరు: ఐపిఎల్‌ పదవ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.గాయం కారణంగా ఇప్పటి వరకు మూడుమ్యాచ్‌లకు దూరమైన కోహ్లీ ముంబయి జట్టుపై తాజాగా 62 పరుగులతో హాఫ్‌ సెంచరీ సాధించాడు.ముంబై ఇండియన్స్‌ తమ బౌలింగ్‌తో మరోసారి ఆకట్టుకుంది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును 5 వికెట్లకు 142 పరుగుల వద్ద పరిమితం చేసింది.తరువాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్‌ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులుచేసింది.దీంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ముంబయి ఇండియన్స్‌ స్పిన్‌,సీమ్‌తో కోహ్లీ సేనను ఇబ్బంది పెట్టింది.ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ 27 బంతులు ఆడి2 బౌండరీలు,1 సిక్సర్‌తో 22పరుగులు చేయగా, కెప్టెన్‌ కోహ్లీ 47 బంతులు ఆడి 5 బౌండరీలు,2 సిక్సర్లతో పవర్‌ ప్లే ఓవర్లలో నిలకడగా ఆడటంతో బెంగళూరు పది ఓవర్లకు 1 వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది.ఈ క్రమంలో డివిలియర్స్‌ 21 బంతులు ఆడి 1సిక్సర్‌తో 19 పరుగులు చేశాడు. డివిలియర్స్‌తో కలిసి కోహ్లీ గేర్‌ మార్చాడు. అంది వచ్చిన బంతుల్ని చక్కగా బౌండరీకి తరలించాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బుమ్రావేసిన 13.5వ బంతిని లాంగాఫ్‌లో భారీ సిక్సర్‌ బాది హాఫ్‌సెంచరీ చేశాడు.ఆ తరువాత రెండు ఓవ ర్లలోనే కోహ్లీ,డివిలియర్స్‌ ఔట్‌కావడంతో బెంగళూరు స్కోరుకు కళ్లెం పడింది.ఆడుకొం టాడనుకొన్న కేదార్‌ జాదవ్‌ 13సైతం పరుగులు చేయలేకపోయాడు. దీంతో 20 ఓవర్లకు బెంగ ళూరు 5వికెట్లకు 142 పరుగులకు పరిమిత మైంది. ముంబయిబౌలర్లు మెక్లె నగన్‌ 2 వికెట్లు, హార్థిక్‌,కృనాల్‌లకు తలో వికెట్‌ లభించింది. జట్టును గెలిచిపించిన పోలార్డ్‌: ముంబయి ఇండియన్స్‌కు చెందిన పోలార్డ్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఓపెనర్లు నిరాశకు గురి చేసినా పోలార్డ్‌తోపాటు పాండ్యా సత్తా చాట డంతో స్కోరులో వేగం పెరిగింది.ఓపెనర్‌ పటేల్‌ 8 బంతులు ఆడి 3పరుగులు చేసి బద్రీ బౌలిం గ్‌లో గేల్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఔటయ్యాడు.మరో ఓపెనర్‌ బట్లర్‌ 5బంతులు ఆడి 2 పరుగులు చేసి బిన్నీ బౌలింగ్‌లో గేల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరి గాడు.శర్మ 2 బంతులు ఆడి జిరో పరుగుల వద్ద ఔటయ్యాడు. మక్లెనగన్‌ కూడా 1 బంతి ఆడి జిరో పరుగుల వద్ద ఔటయ్యాడు. రైనా 16 బంతులు ఆడి 1బౌండరీతో 11 పరుగులు చేసి బద్రీ బౌలిం గ్‌లో అరవింద్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఔటయ్యాడు. పోలార్డ్‌ బాగా నిలదొ క్కుకుని 47 బంతులు ఆడి 3 బౌండరీలు,5 సిక్సర్లతో 70 పరుగులు చేసి చాహల్‌ బౌలింగ్‌లో డివిల్లియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.పాండ్యా 30 బంతులు ఆడి 3బౌం డరీలు,1సిక్సర్‌తో 37 పరుగులు,హెచ్‌హెచ్‌ పాం డ్యా 4బంతులు ఆడి 1సిక్సర్‌తో 9పరుగులు చేసి నాటౌట్‌గానిలిచారు.దీంతోముంబైఇండియన్స్‌ 18.5ఓవర్లలో 6వికెట్లకు 145పరుగులు చేసింది.
2sports
Dec 06,2016 సీఎంఆర్‌ఎఫ్‌కు ఆంధ్రాబ్యాంకు విరాళం హైదరాబాద్‌: ఆంధ్రా బ్యాంకు ఎండీ, సీఈవో సురేష్‌ ఎన్‌ పటేల్‌ సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును ప్రగతి భవన్‌లో కలుసుకున్నారు. అనంతరర ఆయన సీఎం సహాయ నిధికి (సీఎంఆర్‌ఎఫ్‌ కు) రూ.50 లక్షల విరాళాల్ని అందజేశారు. ఈ కార్యక్రమ ంలో బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజిత్‌ కుమార్‌ రత్‌, తెలంగాణ రాష్ట్ర సర్కిల్‌ జీఎం సత్యనారాయణ మూర్తి, అధికారులు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
actor nikhil siddharth clarifies the mudra movie release date Nikhil Siddharth: ఈ ‘ముద్ర’ నాది కాదు.. నన్ను వాడేస్తున్నారు: నిఖిల్ ట్వీట్ నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ముద్ర’ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింది. దీంతో సోషల్ మీడియాలో స్పందించారు నిఖిల్. Samayam Telugu | Updated: Jan 24, 2019, 05:31PM IST ‘కేశవ’, ‘కిరాక్ పార్టీ’ చిత్రాలతో వరుస ఫ్లాప్‌లు అందుకున్న హీరో నిఖిల్ ‘ముద్ర’ అంటూ మరో వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహించారు. గన్ను కంటే పెన్ను గొప్పది అనే కాన్సెఫ్ట్‌తో జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతుందీ చిత్రం. ఇందులో నిఖిల్ జర్నలిస్ట్‌ అర్జున్‌గా కనిపించబోతున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉండగా.. ఊహించని షాక్ తగిలింది. ‘ముద్ర’ పేరుతో అదే లోగో టైటిల్‌ని నిఖిల్ పేరును వాడుకుంటూ రేపే (జనవరి 25) ‘ముద్ర’ మూవీ రిలీజ్ అంటూ టిక్కెట్లను ఆన్ లైన్‌లో పెట్టేశారు. దీంతో షాకైన నిఖిల్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘గాయ్స్ .. నా సినిమా ఈ వారంలో రిలీజ్ కావట్లేదు. కొందరు కావాలని నా సినిమా లోగో మరియు నా పేరును వాడుకొని బుకింగ్ యాప్స్‌లోపెట్టారు. మా నిర్మాతలు దీనిపై చర్యలు తీసుకుంటారు. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తా.. ఇది చాలా అవమానకరం’ అంటూ ‘ముద్ర’ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు నిఖిల్. Guys My Movie is NOT RELEASING this week... SOME ppl with evil intentions have used the exact SAME LOGO DESIGN nd p… https://t.co/yb5CFuTstt &mdash; Nikhil Siddhartha (@actor_Nikhil) 1548317572000
0business
bse మందగమనంతో ముగిసిన మార్కెట్లు ముంబై, అక్టోబరు 10: బెంచ్‌మార్క్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మందగమనంతో ముగి సాయి. ఇన్వెస్టర్ల భాగస్వామ్యం తక్కువగా ఉంది. ఐటి మేజర్‌ కంపెనీలు కూడా తమ రెండోత్రైమాసిక ఫలితాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లపరంగా అప్రమత్తం అయ్యారు. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 21 పాయింట్లు దిగు వన 28,082 పాయింట్లవద్ద స్థిరపడితేనిఫ్టీ 50 సూచ 11 పాయింట్లు దిగువన 8709 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ముగించింది. మార్కెట్లలో బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ 0.2శాతంతోను, స్మాల్‌క్యాప్‌సూచి 0.2శాతం దిగువన ముగిసాయి. మార్కెట్లపరంగా 1702 కంపెనీలు లాభాల్లోను 1104 కంపెనీలు స్వల్పనష్టాలతో ట్రేడింగ్‌ ముగించాయి. అయితే మంగళ, బుధవారాల్లో దసరా, మొహర్రంల సంద ర్భంగా మార్కెట్లకుసెలవు. ఇక ఈవారంలో మూడు రోజులు మాత్రమే ట్రేడింగ్‌ ఉంటుంది. విదేశీ ఇన్వె స్టర్లు గత శుక్రవారం ఒక్కరోజే కేవలం 56కోట్లు పెట్టుబడులుపెట్టారు. ఇక ఐటి ఎగుమతి సంస్థలు కొంతమేర లాభాల్లో ఉంటాయని అంచనా. ఇన్ఫో సిస్‌ శుక్రవారం తన ఫలితాలు విడుదలచేస్తుంది. 1.7శాతం పెరిగింది. టిసిఎస్‌ 0.5శాతం, విప్రో నిలకడగాను ముగిసాయి. ఫార్మాషేర్లపరంగాచూస్తే లూపిన్‌,సిప్లా, సన్‌ఫార్మా, 0.6 నుంచి 1.9శాతం పెరిగాయి. టాటాస్టీల్‌ మూడుశాతం పెరిగింది. కంపెనీ విక్రయాలు 12శాతం పెరిగి 2.62 మిలి యన్‌టన్నులకు పెరిగినట్లు ప్రకటించింది. ఐటిసి 0.5శాతం పెరిగింది. ఎఫ్‌ఎంసిజి మేజర్‌కంపెనీగా ఉన్న ఐటిసి తన మొత్తం వాటాను అమెరికా కేంద్రంగా ఉన్న కింగ్‌మేకర్‌ మార్కెటింగ్‌కు 24 మిలియన్‌ డాలర్లకు విక్రయించింది. జిఎస్‌పిసి గ్యాస్‌కంపెనీ నుంచి ఒఎన్‌జిసి వాటాలు కొనుగోలు చేయడంతో కొంత లాభాల్లో ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ లో మెటల్‌సూచీ 52వారాల గరిష్టస్థాయికి చేరింది. నేషనల్‌ అల్యూమినియం, వేదాంత, జెఎస్‌డబ్ల్యు స్టీల్‌, హిందాల్కో, సెయిల్‌ కంపెనీలు 1-6శాతం చొప్పున పెరిగాయి. ఇతరత్రాచూస్తే జెఎస్‌డబ్ల్యు స్టీల్‌ రెండుశాతం పెరిగింది. కంపెనీ షేర్లవిభజన కోసం ఈనెల 27వ తేదీ సమావేశం అవుతోంది. 8కెమైల్స్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ 9శాతం ర్యాలీ తీసింది. స్టీల్‌స్ట్రిప్స్‌ ఏడుశాతం పెరిగాయి. కంపెనీ కారవాన్‌ స్టీల్‌ వీల్స్‌ను యూరోపియన్‌ యూనిన్‌ ట్రైలర్‌ మార్కెట్‌కు సరఫరా ఒప్పందం సాధిం చింది. సునీల్‌ హైటెక్‌ ఇంజనీర్స్‌ 19శాతం పెరిగింది. కంపెనీ బోర్డు మంగళవారం సమావే శమై బోనస్‌ షేర్లకేటాయింపుపై చర్చిస్తున్నట్లు ప్రక టించింది. మొత్తం మీద రెండోత్రైమాసిక ఫలితాల జాడతో మార్కెట్లు మందగమనంతో ముగిసాయి.
1entertainment
CLARRK టీమిండియాను సొంతగడ్డపై ఓడించడం కష్టమే : క్లార్క్‌ సిడ్నీ: సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం కష్టమేనని ఆస్ట్రేలియా మాజీ సారథి మైకెల్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్య ఆస్ట్రేలియా ఐదు వన్డేలు, మూడు టీ20ల కోసం భారత్‌ రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా క్లార్క్‌ మాట్లాడుతూ…వన్డే-టెస్టు క్రికెట్‌ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వన్డే క్రికెట్‌లో కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. భారత్‌ పర్యటనలో ఆసీస్‌ మంచి ప్రదర్శన చేసి విజయం సాధిస్తుందని భావిస్తున్నా. కొకపోతే ఇది కొంచెం కష్టమని తెలుసు. ఎందుకంటే భారత్‌ను సొంతగడ్డపై ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్నది అని క్లార్క్‌ అన్నాడు. భారత్‌ క్రికెట్‌ జట్టు సారథి కోహ్లీ వ్యూహాన్ని గమనిస్తే….అతను టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ రెండు వరుస టెస్టు మ్యాచ్‌లకు ఒకే జట్టును ఎంచుకోలేదు. వెస్టిండీస్‌, శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించి విజయాలు దక్కించుకున్నాడు. గత రెండేళ్లుగా నేను క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. ప్రస్తుత భారత జట్టుపై నేను ఆడలేదు. కోహ్లీ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. తన విజయపరంపరను ఇలాగే కొనసాగిస్తే ప్రపంచలోనే టీమిండియా నంబర్‌వన్‌ టీమ్‌గా నిలవడం ఖాయమని క్లార్క్‌ తెలిపాడు.
2sports
Hyderabad, First Published 4, Jul 2019, 8:29 PM IST Highlights రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రాజశేఖర్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు.  రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రాజశేఖర్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. గతంలో కల్కి చిత్రం కథని బాలకృష్ణ కోసం సిద్ధం చేశారనే ఊహాగానాలు వినిపించాయి. ఆ వార్తలపై ప్రశాంత్ వర్మ తాజగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.  ఈ కథని బాలకృష్ణ కోసం రూపొందించలేదు. ఈ చిత్రం కోసం బాలకృష్ణ గారిని హీరోగా కూడా ఎప్పుడూ అనుకోలేదు. కథ సిద్ధం చేయడం, రాజశేఖర్ గారు ఓకే చేయడం చక చకా జరిగిపోయాయని ప్రశాంత్ వర్మ తెలిపాడు. బాలయ్య కోసం తన వద్ద ఓ కథ ఉన్నట్లు కూడా ప్రశాంత్ వర్మ తెలిపాడు.  గతంలో బాలకృష్ణ  కల్కి టైటిల్ తో సినిమా తీయాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ప్రశాంత్ వర్మ అదే టైటిల్ తో కథ సిద్ధం చేయడంతో బాలయ్య కోసం అంటూ రూమర్లు మొదలయ్యాయి.  మొత్తంగా అ!, కల్కి చిత్రాలతో తాను మంచి కాన్సెప్ట్ లతో సినిమా చేసే దర్శకుడినని ప్రశాంత్ వర్మ నిరూపించుకున్నాడు. ఈ యువ దర్శకుడు తదుపరి చిత్రం ఏ జోనర్ లో ఉండబోతోందో మరి!
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV 5 భారత వికెట్లు తీస్తే.. స్టెయిన్ టాప్ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కెరీర్‌లో అరుదైన మైలురాయికి అత్యంత చేరువలో ఉన్నాడు. గత ఏడాది కాలంగా భుజం గాయంతో క్రికెట్‌కి TNN | Updated: Jan 1, 2018, 12:50PM IST 5 భారత వికెట్లు తీస్తే.. స్టెయిన్ టాప్ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కెరీర్&zwnj;లో అరుదైన మైలురాయికి అత్యంత చేరువలో ఉన్నాడు. గత ఏడాది కాలంగా భుజం గాయంతో క్రికెట్&zwnj;కి దూరంగా ఉన్న స్టెయిన్.. శుక్రవారం నుంచి భారత్&zwnj;తో జరగనున్న తొలి టెస్టుతో పునరాగమనం చేయనున్నాడు. కేప్&zwnj; టౌన్ వేదికగా జరిగే ఈ టెస్టులో స్టెయిన్ ఐదు వికెట్లు పడగొట్టగలిగితే.. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్&zwnj;గా రికార్డుల్లోకెక్కనున్నాడు. కెరీర్&zwnj;లో మొత్తం 108 టెస్టులాడిన సఫారీ దిగ్గజ బౌలర్ షాన్ పొలాక్ 421 వికెట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉండగా.. కేవలం 85 టెస్టుల్లోనే డేల్ స్టెయిన్ 417 వికెట్లతో ఆ రికార్డుని సమీపించాడు. 2004లో టెస్టు క్రికెట్&zwnj;లోకి అరంగేట్రం చేసిన స్టెయిన్ తన వేగం, కచ్చితత్వంతో ప్రపంచంలోనే మేటి పేసర్&zwnj;గా గుర్తింపు పొందాడు. సాఫీగా సాగిపోతున్న ఈ బౌలర్&zwnj; కెరీర్&zwnj;కి భుజం గాయం బ్రేక్ వేసింది. 2015 డిసెంబరులో తొలిసారి భుజం గాయంతో కొన్ని రోజుల పాటు క్రికెట్&zwnj;కి దూరమైన స్టెయిన్.. అనంతరం పునరాగమనం చేసినా.. 2016 నవంబరులో మళ్లీ ఆ గాయం తిరగబెట్టడంతో మూడు శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చింది. దీంతో దాదాపు 14 నెలల పాటు అతను ఆటకి దూరమయ్యాడు. పునరాగమనంలో స్టెయిన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. భుజం గాయం అతడి వేగాన్ని తగ్గిస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
- పెద్దోళ్ల అక్రమాలతో మరో 'నల్ల జాబితా' .. - 'ప్యారడైజ్‌ పేపర్స్‌' పేరుతో వెలుగులోకి.. - దేశాంతర కంపెనీల్లో అక్రమ పెట్టుబడులు - దాదాపు 714 మంది భారతీయుల పేర్లు.. - జాబితాలో మంత్రి జయంత్‌, ఎంపీ సిన్హా - వైఎస్‌ జగన్‌, జీఎంఆర్‌, హెటీరోకు లింక్‌! నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రపంచ ప్రముఖుల అక్రమ ఆర్థిక లావాదేవీలు మరోమారు వెలుగులోకి వచ్చాయి. ఇదే విషయమై 18 నెలల కిందట వెలువడిన 'పనామా పేపర్స్‌' సష్టించిన కల్లోలం పూర్తిగా సర్దుమానక ముందే.. తాజాగా 'ప్యారడైజ్‌ పేపర్స్‌' పేరుతో బడాబాబుల అక్రమాలు మరోమారు బయటకు వచ్చాయి. పెదోళ్ల ఆర్థిక అక్రమాలకు సంబంధించిన అధారాలతో కూడిన 1.34 కోట్ల ప్రతాలు 'ప్యారడైజ్‌ పేపర్స్‌' రూపంలో వెెల్లడయ్యాయి. పనామా పత్రాలు మాదిరిగానే జర్మనీ వార్తాపత్రిక సుడేషీ జుటంగ్‌ వీటిని సంపాదించింది. పరిశీలన జరపాల్సిందిగా 'ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు'లను (ఐసీఐజే) కోరింది. బీబీసీ పనోరమా పేరుతో దాదాపు 100 మీడియా సంస్థలు వీటిని విశ్లేషిస్తున్నాయి. పన్నుల బెడదలేని స్వర్గధామాలుగా పేరుపొందిన 19 దేశాలకు ప్రముఖులు తమ సొమ్మును ఎలా పెట్టుబడుల రూపంలో తరలించారనే విషయాలు ఈ పత్రాల్లో దాగి ఉన్నాయి. రెండు సంస్థల నుంచి డేటా.. 'ప్యారడైజ్‌ పేపర్స్‌'కు సంబంధించిన సమాచారాన్ని సుడేషీ జుటంగ్‌ ప్రధానంగా బెర్ముడాకు చెందిన అప్లేబీ, సింగపూర్‌కు చెందిన ఏషియాసిటీ అనే న్యాయ, ఆర్థిక సలహా సంస్థల నుంచి సమీకరించినట్టు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు ప్రపంచంలోనే అత్యధికంగా కుబేరులకు అక్రమ పెట్టుబడులకు సంబంధించిన న్యాయ, ఆర్థిక సలహాలను అందిస్తున్నాయి. ఈ సంస్థల వద్ద భారీ మొత్తం లో ప్రపంచంలోని కుబేరులు ఏయే రూపాల్లో తమ సొమ్మును వివిధ సంస్థల్లోకి మళ్లించారన్న పూర్తి డేటా ఉంది. ఈ కీలక పత్రాల్లో మొత్తం 180 దేశాలకు సంబం ధించిన వారి వివరాలు ఉన్నాయి. అక్రమార్కుల సంఖ్యాప రంగా చూస్తే భారత్‌ ఈ జాబితాలో 19వ స్థానంలో ఉంది. మొత్తం 714 మంది భారతీయుల పేర్లు ఇందులో ఉన్నట్టుగా సమాచారం. అప్లెబీ ఖాతాదారుల్లో భారతీ యులు రెండోస్థానంలో ఉన్నారు. అప్లెబీ సంస్థ రికార్డుల్లో ఆఫ్‌షోర్‌ కంపెనీలు, క్లయింట్ల బ్యాంకు అకౌంట్లకు సంబం ధించిన డేటా ఉంది.ఈ ప్యారడైజ్‌ పేపర్లు ఆఫ్‌షోర్‌ కంపెనీ ల్లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాలను కూడా లీక్‌ చేసింది. పేపర్ల లీకేజీపై స్పందించిన 'అప్లెబీ'తమ సమాచారం అపహరణకు గురైందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలు జరగలేని స్పష్టం చేసింది. మంత్రి రాజీనామాకు డిమాండ్‌ .. డెఫెన్స్‌లో బీజేపీ.. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం పెద్ద నోట్లను ప్రకటించి ఏడాది పూర్తయిన క్రమంలో 'యాంటీ-బ్లాక్‌ మనీ డే'ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో ప్యారడైజ్‌ పేర్లు వెలుగులోకి రావడం తీవ్ర ప్రకంపనాలను సష్టిస్తోంది. 'ప్యారడైజ్‌ పేపర్ల' లీక్‌ ప్రకంపనలు దేశీయంగా మొదలయ్యాయి. జాబితాలో పేర్లున్నట్టుగా సమాచారం అందుతున్న వారిలో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ దగ్గర్నుంచి.. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వస్తున్నాయి. కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా, బీహార్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కిశోర్‌ సిన్హాల పేర్లు బయటకు రావడంతో బీజేపీ డెఫెన్స్‌లో పడిపోయింది. ఇదే అదనుగా కాంగ్రెస్‌ సిన్హా రాజీనామాకు డిమాండ్‌ చేసింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలకు సిన్హా ట్విటర్‌ ద్వారా వివరణ ఇచ్చారు. సదరు మీడియా పేర్కొన్న వివరాలన్నీ చట్టబద్ధమైనవేనని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ఒమిడ్‌యార్‌ నెట్‌వర్క్‌లో తాను గతంలో భాగస్వామిగా మాత్రమే ఉన్నానని.. అంతేగాక.. ఆ సంస్థ చేసిన లావాదేవీలన్నీ చట్టబద్ధమైనవని చెప్పారు. ఒమిడ్‌యార్‌ నుంచి బయటకు వచ్చాక.. డి.లైట్‌ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్నానని చెప్పారు. అయితే కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డి.లైట్‌ బోర్డుకు రాజీనామా చేశానని.. కంపెనీ వ్యవహారాల నుంచి పూర్తిగా వైదొలిగానని జయంత్‌ సిన్హా వివరించారు. మరోవైపు ఎంపీ సిన్హా మాత్రం తాను వారం రోజుల మౌన వ్రతంలో ఉన్నందున మాట్లాడలేనంటూ మీడియాకు సమాచారం ఇచ్చారు. జాబితాలో వైఎస్‌ జగన్‌, హెటీరో పార్థసారథి, జీఎంఆర్‌.. పన్నుల బెడదలేని స్వర్గధామ దేశాల్లోని కంపెనీలతో ఆర్థిక లావాదేవీలు జరిపిన భారతీయుల జాబితాలో ప్రధానంగా వైఎస్సార్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినవస్తోంది. దీనికి తోడు తెలుగు సంతతికి చెందిన హెటీరో డ్రగ్స్‌ వ్యవస్థాపకులు బండి పార్థసారథి రెడ్డి, జీఎంఆర్‌ సంస్థల పేర్లూ బయటకు వస్తున్నాయి. పత్రాల్లో రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌, సచిన్‌ పైలట్‌ కుమారుడు, వాయిలార్‌ రవి కుమారుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మోయిలీ కుమారుల కంపెనీలు 'ప్యారడైజ్‌'లో భాగమేనని 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' తెలిపింది. బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాలకు తరలిపోయిన యునైటెట్‌ బ్రూవరీస్‌ చైర్మెన్‌ విజరు మాల్యా పేరు ప్రముఖంగా ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, మరో ప్రముఖ నటుడు సంజరుదత్‌ భార్య మాన్యతా దత్‌, ఫోర్టీస్‌ ఎస్కార్ట్‌ చైర్మెన్‌ అశోక్‌సేథీ, కార్పొరేట్‌ లాబీయిస్ట్‌గా పేరొందిన నీరా రాడియా పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు జరిపిన భారత సంస్థల జాబితాలో అపోలో టైర్స్‌, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌, హ్యావెల్స్‌, హిందుజా, జిందాల్‌ స్టీల్‌, వీడియోకాన్‌, హీరానందనీ గ్రూపు, సన్‌ గ్రూపు, యునైటెట్‌ స్పిరిట్‌ తదితర సంస్థలు ఉన్నాయి. అప్లేబీ వద్ద లభించిన సమాచారం మేరకు సన్‌గ్రూపు సంస్థ వ్యవస్థాపకుడు నంద్‌లాల్‌ కేమ్కా దాదాపు విదేశాల్లో 118కి పైగా కంపెనీలను కలిగి ఉన్నట్టుగా పేర్కొన్నారు. సంస్థ వద్ద ఉన్న ఖాతాదారుల్లో ఈయనే రెండో అతిపెద్ద క్లయింట్‌ అని ప్యారడైజ్‌ పేపర్స్‌ వెల్లడించాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఈ క్యూట్ గర్ల్ ను గుర్తు పట్టారా? TNN| May 12, 2016, 03.29 PM IST భామనే...సత్యభామనే అంటూ నడివయసు మహిళగా కమలహాసన్ నటించి మెప్పించిన సినిమా గుర్తుందా? తమిళం, తెలుగులో హిట్టయిన ఈ సినిమా హిందీలో కూడా చాచీ 420 పేరుతో నిర్మితమై హిట్ కొట్టింది. అందులో ముద్దు ముద్దు మాటలతో కమలహాసన్ కూతురిగా నటించి మెప్పించిన క్యూట్ గర్ల్ అందరికీ తెగ నచ్చింది. ఫాతిమా సనా షేక్ అనే ఈ బాలిక సినిమాలో ముఖ్యమైన రోల్ ను అవలీలగా పోషించింది. ఆ తరువాత షారూక్ ఖాన్ జుహీ చావ్లాల సినిమా ‘వన్ 2 కా 4’ అనే సినిమాలో నటించింది. అననంతరం చాలామంది బాలనటుల్లాగే కనుమరుగైంది. మళ్లీ అమీర్ ఖాన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ‘దంగల్’ సినిమాలో అమీర్ ఖాన్ కూతురిగా సనా నటిస్తోంది. అప్పుడెంత క్యూట్ గా ఉందో ఇప్పుడూ అంతకంటే బ్యూటిఫుల్ గా తయారై బాలీవుడ్ ను రాక్ చేసేందుకు వస్తోంది. ఈ ఫోటోలు చూస్తే మీరూ ఫ్లాట్ కావటం ఖాయం.
0business
రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. ప్లాన్ చేస్తున్నారు Highlights రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ అలాంటి ఆలోచన ప్రస్తుతానికి లేదని కొట్టిపారేసిన ఎన్టీఆర్ కానీ హరికృష్ణ సారథ్యంలో అన్న టీడీపీతో రంగంలోకి దిగాలని ప్లాన్స్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగునాట ఎంతటి ఫాలోయింగ్ వుందో తెలిసిందే. తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థుతం సినిమాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సాధించి.. తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నారు. మాస్ ఫాలోయింగ్ లో పవన్ కళ్యాణ్ తో పోటీపడగలిగినంత సత్తా వున్న తారక్ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా వున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు ఎన్నికల్లో తారక్ ప్రచారం మూలంగానే తెలుగుదేశం  సీట్ల సంఖ్య పెరిగిందనే టాక్ వుంది.   అలాంటి ఎన్టీఆర్ మరోసారి తన రాజకీయరంగ ప్రవేశంపై స్పందించారు. జై లవ కుశ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ రాజకీయాల్లోకి వస్తాడా అనే ప్రస్తావన వచ్చింది. దీంతో తన రాజకీయరంగ ప్రవేశానికి సంబంధించిన ప్రశ్నపై తారక్ స్పందిస్తూ.. "రాజకీయాల్లోకి వస్తానా రానా అనే అంశంపై తనకే ఇంకా ఓ క్లారిటీ లేనప్పుడు దానిపై తాను ఎలా స్పందించగలను" అని అన్నాడు.   ''తాను గతంలోనూ ఇదే సమాధానం చెప్పాను. ఇప్పుడు కూడా అదే సమాధానం చెబుతున్నాను. ఏ విషయంపైనైనా స్పందించేటప్పుడు పూర్తి స్పష్టతతో మాట్లాడితేనే బాగుంటుంది అనేది తన ఉద్దేశం'' అని సమాధానం ఇచ్చి అసలు సమాధానం కోసం ఎదురుచూస్తున్న వారిని మళ్లీ సస్పెన్స్‌లోనే పెట్టాడు తారక్. అయితే... పక్కా ప్రణాళికతో.. అన్న తెలుగుదేశం పార్టీని మళ్లీ పునరుద్ధరించాలనే ప్లాన్ అంతర్గతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి హరికృష్ణ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో.. జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా పార్టీని నడిపిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొని వుంది. కొంత సమయం తీసుకున్నా పక్కాగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.  Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV IPL 2019 KKR vs SRH Match: ఈరోజే హైదరాబాద్ మ్యాచ్.. వార్నర్ రీఎంట్రీ..! సుదీర్ఘకాలం ఓపెనర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడిన శిఖర్ ధావన్ ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారిపోయాడు. ఈ నేపథ్యంలో.. డేవిడ్ వార్నర్‌కి జోడీగా ఎవరు ఈరోజు ఓపెనర్‌గా ఆడతారో..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. Samayam Telugu | Updated: Mar 24, 2019, 09:20AM IST IPL 2019 KKR vs SRH Match: ఈరోజే హైదరాబాద్ మ్యాచ్.. వార్నర్ రీఎంట్రీ..! హైలైట్స్ కోల్‌కతా సొంతమైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈరోజు సాయంత్రం మ్యాచ్ ఏడాది నిషేధం తర్వాత హైదరాబాద్ ఓపెనర్ వార్నర్ రీఎంట్రీ హిట్టర్లతో కళకళలాడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ హైదరాబాద్ ప్రధాన బలం బౌలింగ్ ఐపీఎల్ 2019 సీజన్‌లో తొలి మ్యాచ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీకొననుంది. బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది నిషేధం వేటు పడటంతో గత ఏడాది ఐపీఎల్‌కి దూరమైన డేవిడ్ వార్నర్ పునరాగమనంలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు మ్యాచ్ జరగనుంది. సుదీర్ఘకాలం ఓపెనర్‌గా జట్టుతో ఆడిన శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారిపోయిన నేపథ్యంలో.. డేవిడ్ వార్నర్‌కి జోడీగా ఎవరు ఓపెనర్‌గా ఆడతారో..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఏడాది కొన్ని మ్యాచ్‌ల్లో శిఖర్ ధావన్‌కి జోడీగా ఓపెనర్‌గా శ్రీవాత్స గోస్వామి, సాహాని ఆడించారు. ఈ ఏడాది ఎవరితో ప్రయోగం చేస్తారో..? చూడాలి. బంగ్లాదేశ్‌తో ఇటీవల టెస్టు మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఫిట్‌నెస్‌పై ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ అతను పూర్తి ఫిట్‌గా లేకపోతే.. వైస్ట్ కెప్టెన్ భువనేశ్వర్ కెప్టెన్‌గా జట్టుని నడిపించే అవకాశం ఉంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతగడ్డపై బోణి కొట్టాలని ఆశిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్, క్రిస్‌లిన్, బ్రాత్‌వైట్, ఆండ్రీ రసెల్‌ తదితర హిట్టర్లతో కళకళలాడుతోంది. అయితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం బౌలింగ్ అనే విషయం తెలిసిందే. భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, షకీబ్ అల్ హసన్ ప్రదర్శన కీలకం కానుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ‘ఐలవ్యూ నాన్నా.. నువ్ దీక్ష చేయకు’.. చంపేస్తారు! ‘‘ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు వదిలెయ్యడానికి నేను సిద్ధం.. విజయవాడ నడిరోడ్డుమీద ఆమరణ దీక్ష చేస్తా.. మీరూ వస్తారా?” ఆ దమ్ము మీలో ఉందా? Samayam Telugu | Updated: Mar 21, 2018, 10:27PM IST ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయం పక్కనపెడితే.. ఈ విషయంలోకి సినిమా పరిశ్రమను లాగి తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పెద్ద దుమారమే రేపారు. నంది అవార్డుల విషయంలో రచ్చ చేసిన సినిమా వాళ్లు.. హోదాపై నోరు విప్పరా అంటూ సినిమా వాళ్లు డబ్బు మత్తులో జోగుతున్నట్లుగా చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రముఖ నటుడు, దర్శక, రచయిత పోసాని కృష్ణమురళి. వీటిని ఖండిస్తూనే హోదా కంటే ప్యాకేజీ ముద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా చెబితే అది నిజమని నమ్మామని.. ఇప్పుడు మోడీతో లెక్కల్లో తేడా వస్తే అదేదో ఏపీ ప్రజల సమస్యగా మాట్లాడటం ఎంతవరకూ కరెక్ట్ అని నిలదీశారు పోసాని. ‘‘హోదా కోసం ప్రాణాలు వదిలెయ్యడానికి కూడా సిద్ధం.. హోదా కోసం విజయవాడ నడిరోడ్డుమీద ఆమరణ దీక్ష చేస్తా.. మీరూ వస్తారా?” అంటూ తెలుగుదేశం పార్టీ నేతలకు సవాల్ విసిరారు పోసాని. ఇక ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకు దిగుతానన్న పవన్ కళ్యాణ్‌‌పై పలు సంచలన కామెంట్ చేశారు పోసాని.
0business