news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Suresh 159 Views
హైదరాబాద్: బాలీవుడ్లో బయోపిక్ల ఆధారంగా పలు సినిమాల నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే.క్రీడాకారుల జీవిత చరిత్రలను సినిమాలుగా మలిచేందుకు కొంత మంది దర్శకులు ఆసక్తి కనబర్చుతున్నారు.తాజాగా బ్యాడ్మింటన్లో రికార్డుల దిశగా దూసుకుపోతున్న భారత స్టార్ షట్లర్ పివి సింధు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసేందుకు ఎవరైనా ముందుకు వస్తే నటించేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆమె ప్రకటించారు.అయితే ఈ సినిమాను ఎవరు తీస్తారు? ఎన్నిరోజుల్లో తీస్తారనేది ప్రధాన అంశమన్నారు.కాగా టోర్నమెంట్లకు ఇబ్బందులు లేకుండా షూటింగ్కు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు.ఎస్ అనే అక్షరం తను బాగా కలిసి వచ్చిందన్నారు.సానియా మీర్జా, సైనా నెహ్వాల్ పద్మ అవార్డులను అందుకోవడమే అందుకు ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు.కాగా మ్యూజిక్ అంటే ఇష్టమని చెప్పిన సింధు సినిమాలు ఎక్కువగానే చూస్తానని తెలిపారు.రాబోయే టోర్నీల్లో మరింతగా ఆడతాననే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.కాగా ఆదివారం జరిగిన మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రీ టైటిల్ను సింధు గెలుచుకుంది. | 2sports
|
సుకుమార్ అద్భుతంగా తీశాడు... చరణ్ కుమ్మేశాడు : పవన్ కళ్యాణ్
Highlights
సుకుమార్ అద్భుతంగా తీశాడు... చరణ్ కుమ్మేశాడు
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కూడా ఈ సినిమా చూసి టీమ్ ను అభినందించారు. రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉండటం వలన నిన్నటి వరకూ పవన్ కల్యాణ్ ఈ సినిమా చూడటం కుదరలేదు. నిన్న రాత్రి తన సతీమణితో కలిసి హైదరాబాద్ .. ఐ మాక్స్ లో ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. చరణ్ .. ఉపాసనతో పాటు ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా వాళ్లతో థియేటర్ కి వచ్చారు.
ఈ సినిమా చూసిన పవన్ కల్యాణ్ .. మీడియాతో మాట్లాడుతూ " నేను చేసిన 'తొలిప్రేమ' తరువాత మళ్లీ థియేటర్ కి వచ్చి చూసిన సినిమా ఇదే. నిర్మాతలు ఒక గొప్ప చిత్రాన్ని తీసినందుకు సంతోషంగా వుంది. వాస్తవానికి దగ్గరగా చాలా మంచి కథను సిద్ధం చేసుకుని .. ఆ కథను నడిపించే తీరుతో సుకుమార్ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఇక నటన పరంగా చరణ్ అదరగొట్టేశాడు .. నా మనసుకు బాగా నచ్చిన సినిమాల్లో ఇదొకటి" అని చెప్పుకొచ్చారు.
Last Updated 10, Apr 2018, 11:28 AM IST | 0business
|
internet vaartha 144 Views
హైదరాబాద్ : రంజాన్ పండుగాఫర్లుగా ఎయిర్సెల్ స్థానిక,జాతీయ, ఐఎస్డి కాల్స్పై ఆఫర్లు ప్రకటించింది. స్థానిక, ఎస్టిడి కాల్స్ నిమిషానికి 30 పైసలుచొప్పున ఆఫర్ ప్రకటించింది. రంజాన్ప్యాక్ ద్వారా అత్యధిక రాయితీలను వాయిస్కాలింగ్పై రాత్రిపూట అందిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో ఈ ఆఫర్లు రూ.86తో ప్రారంభం అవుతాయి. ఇఫ్తార్ తర్వా త తమ బంధువులతో కనెక్ట్ అయ్యేందుకు ఉపక రిస్తుంది. 91 రూపాయల టాక్టైమ్ ఆఫరింగ్తో లోకల్, ఎస్టిడి కాలింగ్ అర్ధరాత్రి 12నుంచి ఉదయం ఆరుగంటల వరకూ నిమిషానికి 30పైసల ధరలో అందిస్తోంది. యుఎఇ, సౌదీ అరేబియాకు చేసే కాల్ధరలను సెకనకుకు 16 పైసలకు తగ్గించింది. బంగ్లాదేశ్ కాలింగ్ను సెకనుకు నాలుగు పైసలకే అందిస్తున్నట్లుప్రకటించింది. ఈ ఆఫర్ కాలపరిమితి కేవలం 21రోజులుమాత్రమేనని ఎయిర్సెల్ సర్కిల్హెడ్ వెంకటేషన్ వివరించారు. ఇఫ్తార్ తర్వాత లోకల్, ఎస్టిడి, ఐఎస్డి కాల్స్ అధికంగాచేసే కస్టమర్ల ప్యాట్రన్ను గమనిం చి కంపెనీ ప్రత్యేక ప్యాక్ను ఆవిష్కరించిందన్నారు. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ప్రిన్స్ వద్దన్నాడు... సూర్య హిట్ కొట్టాడు
మహేష్ బాబు వద్దన్న సినిమాలే సూర్యకి కలిసొస్తున్నట్టున్నాయి.
TNN | Updated:
Jan 27, 2016, 11:15AM IST
ప్రిన్స్ వద్దన్నాడు... సూర్య హిట్ కొట్టాడు
గజిని సినిమా తమిళంలోనే కాదు, తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. అందులో చేసిన అసిన్కి, సూర్యకి మంచి అవకాశాల్ని తెచ్చిపెట్టింది. తెలుగులో సూర్య మార్కెట్ ఆ సినిమాతోనే పెరిగిపోయింది. అసిన్ అయితే బాలీవుడ్ కే ఎగుమతి అయిపోయింది. ఆ సినిమాని ఇష్టపడి మరి అమీర్ ఖాన్ హిందీలో రీమేక్ చేశాడు. అక్కడ కూడా బంపర్ హిట్ కొట్టింది. ఇలాంటి సినిమాని మహేష్ బాబు వదిలేసుకున్నాడు. ఇటీవలే ఈ విషయం బయటికి వచ్చింది. మొదట మురుగదాస్ గజిని కథని సిద్ధం చేసుకుని మహేష్ కి వినిపించాడట. అప్పటికే మహేష్ నాని సినిమా ఇచ్చిన షాక్ లో ఉన్నాడట. వెంటనే మరొక ప్రయోగం చేయలేనని చెప్పి, సినిమాని తిరస్కరించాడు. దాంతో అవకాశం సూర్యకి వెళ్లింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే సూర్య ప్రస్తుతం 24 అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా దర్శకుడు విక్రం కుమార్ ముందు ఆ కథను మహేష్ కు వినిపించాడు. కథ నచ్చింది కానీ అభిమానులకు నేను ఆ పాత్రలో నచ్చుతానో లేదో అని సినిమాని తిరస్కరించాడట. మళ్లీ ఆ సినిమా సూర్య ఖాతాలో పడింది. ఇప్పటికే ఆ సినిమా పోస్టర్స్ విడుదలయ్యాయి. వాటిని చూస్తుంటే మరొక బంపర్ హిట్ కొట్టేట్టే కనిపిస్తున్నాడు సూర్య. ఇది కూడా హిట్ అయితే... మహేష్ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను చేతులారా వదిలేసుకున్నవాడే అవుతాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
దీపావళి తర్వాత 50 లక్షల మంది ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్?
కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తతో సిద్ధమైంది. దీపావళి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పెంపు ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన నివేదికలు వెలువడుతున్నాయి.
Samayam Telugu | Updated:
Oct 26, 2019, 01:50PM IST
దీపావళి తర్వాత 50 లక్షల మంది ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్?
హైలైట్స్
ఉద్యోగులకు మరో తీపికబురు
వేతన పెంపు ఉండొచ్చనే అంచనాలు
7వ సీపీపీ వేతన పెంపు ప్రతిపాదనపై చర్చలు
నవంబర్ మీటింగ్లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం
మోదీ సర్కార్ ఉద్యోగులకు మరో శుభవార్త అందించేందుకు రెడీ అవుతోంది. డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపుతో ఇప్పటికే దీపావళి గిఫ్ట్ అందించించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు ఇంకొక తీపికబురు అందిచనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఉద్యోగుల వేతనాన్ని పెంచాలని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ గవర్నమెంట్ ఉద్యోగుల వేతన పెంపుపై ప్రధానంగానే దృష్టి సారించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 7వ సీపీసీ వేతన పెంపు ప్రతిపాదనపై తగిన నిర్ణయం తీసుకోబోతోందనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. నవంబర్లో జరగనున్న మీటింగ్లో ఈ అంశంపై ఒక నిర్ణయం వెలువడొచచనే అంచనాలున్నాయి. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ప్రారంభమైన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది.
| Updated:
Jan 7, 2017, 06:26PM IST
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌ థీమ్ పార్కులో జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఎందరో అతిథులుగా హాజరయ్యారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర నిర్మాత అశ్వనీదత్, మరో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య చేతుల మీదుగా నీరు 'నీరు... రైతు కంట నీరు' సాంగ్ ఏవీ ప్లే చేయడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది.
అనంతరం ప్రముఖ సింగర్స్ సింహ, సాయిశిల్పలతోపాటు ఇతర గాయనీ, గాయకుల లైవ్ పర్‌ఫార్మెన్స్‌, డ్యాన్సులతో ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊపందుకుంది. ఈ ఈవెంట్‌కి హాజరవడానికి మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకి వచ్చారు. అక్కడి నుంచి అభిమానుల ఘన స్వాగతం, భారీ ర్యాలీ మధ్యహాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌కి చేరుకున్నారు. | 0business
|
SEYILING. 2
నేటి నుంచి సెయిలింగ్ పోటీలు
హైదరాబాద్: హైద్రాబాద్లోని యాచ్ క్లబ్లో తెలంగాణ స్టేట్ ఓపెన్ సెయిలింగ్ ఛాంపి యన్ షిప్ ఆదివారం నుంచి కనువిందు చేయనుంది. హుస్సేన్ సాగర్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూలై 12వరకు కొనసాగనున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా పలువురు సెయిలర్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. సముద్ర తీర నగరాలైన చెన్నై, ముంబైలతో పాటు, భోపాల్ నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు తరలివచ్చారు. మొత్తం మీద తమిళనాడు, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో సెయిలర్లు పాల్గొంటున్నారు. రెగట్టా పేరుతో వ్యవహరిస్తున్న ఈ క్రీడా పోటీలను రాష్ట్ర టూరిజమ్ శాఖతో కలిసి తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహి స్తోంది. దీనికి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. జూనియర్, యూత్, సీనియర్ అనే 3కేటగిరీల్లో ఈ పోటీనలు నిర్వహిస్తున్నారు. రెండో సారి నిర్వహిస్తున్న ఈపోటీలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ వస్తోంది నిర్వాహకులు తెలిపారు. వీటివల్ల తెలంగాణలో సెయిలింగ్ క్రీడలో ప్రతిభ గల క్రీడాకారులు ఎదుగుతున్నారని వారు తెలిపారు. ప్రస్తుత పోటీల్లో గౌతమ్ కంకట్లతోపాటు మస్తీ సాయిబాబా సత్తా చాటుతారన్న విశ్వాసం ఉందని వారు వెల్లడించారు. యూత్ లెవల్లో తెలంగాణ తరుపున తనిష్క్, దేశా§్ు మంచి ప్రతిభ కనుబరుస్తాడని అంచనా వేస్తున్నారు. గతేడాది పోలిస్తే ఈసారి పోటీదారుల సంఖ్య పెరిగిందని, ఈఏడాది పోటీల్లో కొత్తగా కొన్ని అంశాలు ప్రముఖ్యత సంతరించుకుందని నిర్వాహకులు పేర్కొన్నారు. | 2sports
|
Hyderabad, First Published 3, Feb 2019, 9:48 AM IST
Highlights
ఛలో సినిమాతో నాగశౌర్య టైమ్ స్టార్ట్ అయినట్లే అయ్యి ఆగిపోయింది. తర్వాత వచ్చిన నర్తనశాల సినిమా నాగశౌర్యని మళ్ళీ ప్లాఫ్ ల రోజుల్లోకి తీసుకెళ్లిపోయింది. అయితే లక్ ఫ్యాక్టర్ ఇంకా నాగశౌర్యని విడిచిపెట్టినట్లులేదు.
ఛలో సినిమాతో నాగశౌర్య టైమ్ స్టార్ట్ అయినట్లే అయ్యి ఆగిపోయింది. తర్వాత వచ్చిన నర్తనశాల సినిమా నాగశౌర్యని మళ్ళీ ప్లాఫ్ ల రోజుల్లోకి తీసుకెళ్లిపోయింది. అయితే లక్ ఫ్యాక్టర్ ఇంకా నాగశౌర్యని విడిచిపెట్టినట్లులేదు. చిన్న చిత్రాలను తెరకెక్కిస్తోన్న దర్శకుడు సుకుమార్ తన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో నాగశౌర్య కు అవకాసం ఇచ్చారు. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు.
నాగశౌర్య హీరోగా సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాతో ‘రంగస్థలం’ చిత్రానికి రచయితగా పని చేయడంతో పాటు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశి విశాల్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై సుకుమార్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ శరత్ మరార్ కలయికలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క చివరి దశలో వుంది. సుకుమార్ స్క్రిప్టు కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.
ఇక ఈ ఎనౌన్సమెంట్ ని హడావిడికి ఇవ్వటానికి కారణం...హీరో నాగశౌర్య కెరీర్లో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన ‘ఛలో’ సినిమా విడుదలైన (ఫిబ్రవరి 2) తేదీనే ఈ కొత్త సినిమా అనౌన్స్మెంట్ చెయ్యాలనుకోవటమే అని తెలుస్తోంది.
Last Updated 3, Feb 2019, 9:48 AM IST | 0business
|
Nov 23,2017
ఉబర్ కీలక సమాచారం హ్యాక్!
శాన్ఫ్రాన్సిస్కో : ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్కు చెందిన 5.7 కోట్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించినట్లు ఆ సంస్థ తెలిపింది. గత ఏడాది అక్టోబర్లో హ్యాకర్లు ఈ డేటాను హ్యాక్ చేశారు. హ్యాక్ అయిన సమాచారాన్ని సైట్లలోంచి తొలగించేందుకు ఉబేర్ హ్యాకర్లకు భారీ ఎత్తున 1,00,000 డాలర్లు (దాదాపు రూ.65కోట్లు) చెల్లించినట్లు సమాచారం. 2016 అక్టోబరులో జరిపిన ఉల్లంఘన గురించి ఇటీవలే తెలుసుకోగలిగామని ఉబర్ సీఈవో డారా ఖోస్రోషాహి తెలిపారు. సంస్థ క్లౌడ్ సర్వర్ను హ్యాక్ చేసి డేటాను దొంగలించినట్లు ఆయన తెలిపారు. హ్యాక్ అయిన డేటాలో రైడర్ల పేర్లు, ఈమెయిల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లతో పాటు డ్రైవర్ల పేర్లు, వారి లైసెన్స్ల వివరాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం సమాచారమంతా సురక్షితంగా ఉందని డారా అన్నారు. ఇకపై డ్రైవర్లు, రైడర్ల డేటాకు మరింత భద్రత అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఈనెల 20న సంపూర్ణేష్ బాబు "వైరస్" ఆడియో విడుదల!
Highlights
సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై..
ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్
ఈనెల 20న పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు
సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్". "నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్" అనేది ట్యాగ్ లైన్. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పుల్లరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు. మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్ ద్వయం సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆడియోను మే 20న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సలీమ్.ఎం.డి మాట్లాడుతూ.. "హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన "వైరస్" సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 20న పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: వి.జె, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, మాటలు: దుర్గాప్రసాద్ రాయుడు, నిర్మాతలు: సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఆర్.కృష్ణ!
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
internet vaartha 102 Views
కరాచీ : తమతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడేందుకు సుముఖంగా లేమంటూ స్పష్టం చేసిన బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్పై పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ ధ్వజమెత్తాడు.కాగా అసలు ఇండో-పాక్ క్రికెట్ సంబంధాలపై ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలియకుండా ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని విమర్శించాడు.ఇరు దేశాల మధ్య క్రికెట్ జరగాలని ప్రజలు కోరుకున్న ప్పుడు ఈ క్రీడలో రాజకీయ పరమైన అంశాలను ముడిపెట్టకూడదన్నాడు.నేను ఎప్పుడూ భారత్తో సిరీస్ ఆడటానికి ఇష్టపడుతుంటాను. ప్రత్యేకంగా భారత్ ఆడుతున్నప్పుడు పాక్ కెప్టెన్గా ఉండాలని అనుకుంటా క్రికెట్ అనే క్రీడలో రాజకీయ జోక్యం లేకపుడు మాత్రమే ఇరు దేశాల క్రికెట్ సిరీస్ జరుగుతుందని మిస్బా విమర్శనాస్త్రాలు సంధించాడు.అంతకు ముందు పలువురు పాక్ మాజీ క్రికెటర్లు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అనురాగ్ ఠాకూర్ ఒక క్రికెట్ బోర్డు అధ్యక్షునిడిగా మాట్లాడుతున్నారా? లేక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా? అంటూ పాక్ దిగ్గజ ఆటగాడు మొహ్మద్ యూసఫ్ విమర్శించాడు.అనురాగ్ తాజా ప్రకటన ఖచ్చితమైన రాజకీయ వ్యాఖ్యగా ఉందంటూ విమర్శించాడు. ఒక స్పోర్టింగ్ బాడీలో భాగమైన బిసిసిఐ రాజకీయ పరమైన ఆధిపత్యం చెలాయిస్తుందనడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ అని అబ్దుల్ ఖాదిర్ విమర్శించాడు. | 2sports
|
ధవన్ స్థానంలో రహానే
పాండేకు లభించిన అవకాశం
ముంబై : వెస్టిండీస్తో జరిగిన టి20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్కు టీమిండియా తుది జట్టులో మార్పులు చేశారు.ఈ మెగా ఈవెంట్లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న ఓపెనర్ ధవన్కు కీలక సెమీ ఫైనల్ పోరుకు పక్కన బెట్టారు.రిజర్వ్ బెంచ్కు పరిమితమైన అజింక్యా రహానెను ధవన్ స్థానంలో ఓపెనర్గా తీసుకున్నారు.ఇక గాయం కారణంగా ఆల్రౌండర్ యువరాజ్ దూరం కావడంతో మనీశ్ పాండేకు తుది జట్టులో స్థానం దక్కింది.టీమిండియా వన్డే,టి20 కెప్టెన్ ధోనీ అండ్ కో బస చేసిన హోటల్లో సమావేశమై జట్టులో మార్పుల గురించి చర్చించారు.కాగా ఈ టోర్నీలో టీమిండియా ఎక్కువగా కోహ్లీపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే.బ్యాటింగ్లో కోహ్లీకి ధోనీ,యువరాజ్ మాత్రమే అండగా ఉంటున్నారు.ఓపెనర్లు రోహిత్శర్మ,ధవన్,సురేష్రైనా,పాండ్యాలు కూడా సరిగా ఆడలేకపోతున్నారు. దీనికి తోడు యువరాజ్ గాయంతో దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో భారత్ తుది జట్టులో మార్పులు చేశారు.రహానె,పాండేలకు అవకాశం ఇచ్చారు. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
స్టాక్ మార్కెట్: రెండో రోజూ అదే దూకుడు..
స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజు లాభాల్లో దూసుకెళ్లాయి. సోమవారం (సెప్టెంబర్ 11) నాటి ట్రేడింగ్లో ఈ సీజన్లో రెండోసారి 10 వేల మైలురాయిని అందుకున్న నిఫ్టీ.. మంగళవారం మార్కెట్ ప్రారంభమవగానే 10,100 పాయింట్లకు..
TNN | Updated:
Sep 12, 2017, 06:42PM IST
స్టాక్‌ మార్కెట్లు వరసగా రెండో రోజు లాభాల్లో దూసుకెళ్లాయి. సోమవారం (సెప్టెంబర్ 11) నాటి ట్రేడింగ్‌లో ఈ సీజన్లో రెండోసారి 10 వేల మైలురాయిని అందుకున్న నిఫ్టీ.. మంగళవారం మార్కెట్ ప్రారంభమవగానే 10,100 పాయింట్లకు చేరువైంది. మరోవైపు సెన్సెక్స్‌ మళ్లీ 32 వేల బెంచ్‌ మార్క్‌ను దాటింది. చివరికి మార్కెట్ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 10,093.05తో ముగియగా.. బీఎస్‌ఈ సెన్సెక్స్ 276.5 పాయింట్లు లాభపడి 32,158.66 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావం, పారిశ్రామికోత్పత్తి అంచనాలు, సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్‌కు సానుకూలంగా ఉంటాయన్న అంచనాలతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆద్యంతం లాభాల్లో కొనసాగాయి.
భారత్‌ పెట్రోలియం, గెయిల్‌, టాటామోటర్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సన్‌ఫార్మా షేర్లు లాభపడగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, హీరో మోటొ కార్ప్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.01గా కొనసాగుతోంది.
మార్కెట్ వాల్యూ పరంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. దేశంలో రెండో విలువైన కంపెనీగా అవతరించడం ఇవాళ్టి ప్రధాన విశేషం. ఈ స్థానంలో ఇప్పటి వరకూ టీసీఎస్ కొనసాగగా.. దాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెనక్కి నెట్టింది. మంగళవారం మధ్యాహ్నానికి ఈ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 4,73,530.72 కోట్లకు చేరింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 4,72,733.32 కోట్లుగా ఉంది. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
విరాట్ కోహ్లి, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్కి రెస్ట్..?
దక్షిణాఫ్రికా గడ్డపై సుదీర్ఘ సిరీస్ ఆడిన భారత సీనియర్ క్రికెటర్లకి విశ్రాంతినివ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. దక్షిణాఫ్రికాతో
TNN | Updated:
Feb 23, 2018, 02:05PM IST
దక్షిణాఫ్రికా గడ్డపై సుదీర్ఘ సిరీస్ ఆడిన భారత సీనియర్ క్రికెటర్లకి విశ్రాంతినివ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. దక్షిణాఫ్రికాతో శనివారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌తో ఆ సిరీస్‌ ముగియనుండగా.. అనంతరం భారత్ మార్చి 6 నుంచి శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఆడనున్నాయి. అయితే ఈ ముక్కోణపు టీ20 సిరీస్‌ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లి, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రాకి విశ్రాంతినివ్వాలని భారత సెలక్టర్లు చర్చిస్తున్నారట. గత రెండేళ్లుగా వన్డే, టీ20ల్లో మెరుగ్గా రాణిస్తూ.. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్టుల్లోకి కూడా జస్‌ప్రీత్ బుమ్రా అరంగేట్రం చేశాడు.
ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్.. అనంతరం కీలకమైన ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో ఈ ఫాస్ట్ బౌలర్‌కి రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా దక్షిణాఫ్రికాతో ఇప్పటికే వరుసగా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, రెండు టీ20లు విరామం లేకుండా ఆడాడు. దీంతో అతడికి కూడా విశ్రాంతినిస్తే.. బాగుంటుందని సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. ముక్కోణపు సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు ఆదివారం జట్టుని ప్రకటించనున్నారు. అయితే.. జట్టుని ప్రకటించే ముందు సీనియర్ క్రికెటర్లతో ఒకసారి చర్చించి అనంతరం నిర్ణయం తీసుకోవాలనే సెలక్టర్లు ఉన్నారట..! | 2sports
|
ASWIN!
అశ్విన్ రికార్డు
న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో ఘనతను సాధించాడు. కాగా ఈ ఏడాదిటెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా అశ్విన్ రికార్డు సృష్టించాడు.కాగా 2016లో ఇప్పటి వరకు 55 వికెట్లు తీసి ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు.ఈ క్రమంలో 54 వికెట్లతో ఇప్పటివరకు తొలిస్థానంలో ఉన్న శ్రీలంక స్పిన్నర్ హెరాత్ను అశ్విన్ అధిగమించాడు.ఈ ఏడాది అయిదువికెట్లను అశ్విన్ ఆరుసార్లు తీశాడు. కాగా 10 వికెట్లను రెండుసార్లు తీసుకు న్నాడు. విశాఖలో ఇంగ్లండ్తో జరిగిన రెండవ టెస్టు తొలిఇన్నింగ్స్లో అయిదు వికెట్లు సాధిం చిన అశ్విన్ రెండవ ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీశాడు. | 2sports
|
New Delhi, First Published 13, Apr 2019, 5:11 PM IST
Highlights
ఇప్పటి వరకు యూ ట్యూబ్కు అమెరికాలోనే ఎక్కువ మంది వినియోగదారులుండేవారు. కానీ, ఇప్పుడు భారత్ అమెరికాను దాటేసింది. తాజాగా కామ్కోర్ ప్రకారం.. గూగుల్కు చెందిన యూ ట్యూబ్కు భారతదేశంలో నెలవారీగా 256 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు యూ ట్యూబ్కు అమెరికాలోనే ఎక్కువ మంది వినియోగదారులుండేవారు. కానీ, ఇప్పుడు భారత్ అమెరికాను దాటేసింది. తాజాగా కామ్కోర్ ప్రకారం.. గూగుల్కు చెందిన యూ ట్యూబ్కు భారతదేశంలో నెలవారీగా 256 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అమెరికాలో సుమారు 200 మిలియన్లకుపైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
వార్షిక ఫ్లాగ్షిప్ ఈవెంట్ బ్రాండ్క్యాస్ట్ సందర్భంగా ఆన్లైన్ ఈకోసిస్టమ్ పెరుగుదల, ఇది ఇండియాలో ఇంటర్నెట్ వృద్ధికి ఎలా సాయపడిందనే విషయాలను వెల్లడించింది.
ప్రస్తుతం ఇండియా నుంచే మాకు పెద్ద సంఖ్యలో ఆడియెన్స్ ఉన్నారు.. ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఆడియెన్స్ సంఖ్య కూడా ఈ దేశం నుంచే ఉన్నారని యూట్యూబ్ సీఈఓ సుసన్ వోజిసికి తెలిపారు.
వినోదం కోసమైనా.. ఏదైనా సమాచారం కోసమైనా.. ఇంటర్నెట్ యూజర్లు మొట్టమొదటగా యూట్యూబ్నే సందర్శిస్తున్నారని ఆయన వెల్లడించారు.
భిన్నమైన కంటెంట్ లభిస్తుండటంతో ఎక్కువమంది యూజర్లు యూట్యూబ్లో అధిక సమయం గడుపుతున్నారని తెలిపారు.
గత సంవత్సరం మొబైల్ యూట్యూబ్ వినియోగం 85శాతం పెరిగింది. భారతదేశంలోని ఆరు పెద్ద మెట్రో నగరాల నుంచి కాకుండా 60శాతం వీక్షణ సమయం పెరిగిందని ఆయన వెల్లడించారు.
ఐదేళ్ల క్రితం మిలియన్ సబ్ స్క్రైబర్స్తో ఇద్దరు క్రియేటర్స్ ఉండగా.. ఇప్పుడు 1200 ఇండియన్ క్రియేటర్స్.. వన్ బిలియన్ సబ్ స్క్రైబర్ మైల్స్టోన్ దాటేశారని చెప్పారు. ఎఫెక్టివ్ స్టోరీ టెల్లర్స్ కారణంగానే ఇది సాధ్యమైందని వివరించారు.
Last Updated 13, Apr 2019, 5:11 PM IST | 1entertainment
|
శ్రీదేవి కూతుళ్ల కోసం ఎంత ఆస్తి పెట్టిందో తెలుసా.?
Highlights
శ్రీదేవి చిన్నతనం నుండి తను నటించిన సినిమాల ద్వారా బాగానే సంపాదించింది.
శ్రీదేవి బోనీకపూర్ వివాహ సమయానికి ఆమెకు ఆస్తులేమి మిగలలేదు.
బోనీకపూర్ తో వివాహం తర్వాత శ్రీదేవి సినిమాలకు సినిమాలకు దూరమైన సంగతి తెల్సిందే.
శ్రీదేవి బోనీకపూర్ పెళ్లి టైంకి ఆమె వద్ద పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. చిన్నతనం నుండి తను నటించిన సినిమాల ద్వారా బాగానే సంపాదించింది. తల్లి అనవసరపు ఇన్వెస్ట్మెంట్స్ చెల్లి మోసం చేయడం వలన దాదాపు ఆస్తి మొత్తం కొల్పోయింది. కేవలం నాటుగేళ్ల వయసు నుండే బాలనటిగా తేరంగ్రేటం చేసి అద్బుత నటనతో స్టార్ మీరోయిన్ స్థాయికి ఎదిగింది.
కానీ శ్రీదేవి బోనీకపూర్ వివాహ సమయానికి ఆమెకు ఆస్తులేమి మిగలలేదు. చిన్నప్పటి నుండి తన సినిమాల గురించి రెమ్యునరేషన్ గురించి ఆమె తండ్రి చూసుకునేవాడు, నర్మాతలు బ్లక్ మనీ ఇస్తుండటంతో తనకు నమ్మకమైన స్నేహితులు బంధువులు వద్ద ఉంచారు. అయితే ఆయన మరణం తర్వాత చాలా మంది డబ్బు తిరిగి ఇవ్వక చాలా మంది మోసం చేశారు. తండ్రి మంణం తర్వాత డబ్బు వ్యవహారాలు తల్లి చూసుకునేవారు. ఆమె శ్రీదేవి డబ్బుతో చాలా వరకు లిటికేషన్ లో ఉన్న ఆస్తులు కొనుగోలు చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. బోనీకపూర్ ను పెళ్లాడే సమయానికి ఆమె వద్ద పెద్దగా ఆస్తుల్లేవని అంటుంటారు. శ్రీదేవి సోదరి తన పొరిగింటి కుర్రాడిని పారిపోయి పెళ్లి చేసుకుంది. దాంతో శ్రీదేవి డబ్బుతో తన పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తులను మళ్లీ శ్రీదేవి పేరుమీద రాస్తు తల్లి వీలునామా రాసింది. తర్వాత శ్రీదేవి తల్లికి బ్రేయిన్ ఆపరేషన్ తప్పుగా జరగడంతో ఆమె మెంటల్ పేషంట్ అయ్యారు.
అనంతరం శ్రీదేవి సోదరి ఆస్తుల పై కోర్టుకెక్కారు. తన తల్లి మతిస్థిమితం లేని సమయంలో వీలునామా రాశారని శ్రీదేవికి ఉన్న కొద్దిపాటి ఆస్తుల్లో సగం లాక్కున్నారు. బోనీకపూర్ తో వివాహం తర్వాత శ్రీదేవి సినిమాలకు సినిమాలకు దూరమైన సంగతి తెల్సిందే. లక్స్ తనిష్క లాంటి బ్రాండ్లకు ప్రచారం చేసి మంచి ఆదాయన్ని సంపాదించుకున్నారు. శ్రీదేవి బోనీకపూర్ నివాసం ముంబాయిలోని అందేరి ప్రాంతంలో ఉంది. ఇక్కడ వారికి విలాసంతమైన భవంతి ఉంది ఆ ఇంటి కరీదు 220 కోట్లు ఉంటుందని అంచనా. రీ ఎంట్రీ తర్వాత ఆమె ఆస్తి పదకొండు కోట్లు ఉంటుందని అంచనా. శ్రీదేవి కుటుంబానికి పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులో రెండు కోట్లు విలువ చేసే బెంట్లీ కారు కూడా ఉంది.అవన్నీ శ్రీదేవి పేరు మీదే ఉన్నాయి. ఈ కర్ల విలువ తొమ్మిది కోట్లు ఉండచ్చని అంచనా. శ్రీదేవి పేరు మీద 620 కోట్ల విలువ చేసే బంగళాలు ఉన్నట్టు సమాచారం. శ్రీదేవి సంబందించిన ఆస్తులన్నీ శ్రీదేవి కూతుళ్లకు సమానంగా చెందుతుందని సమాచారం.
Last Updated 25, Mar 2018, 11:54 PM IST | 0business
|
internet vaartha 176 Views
కింగ్స్టన్ : ఇటీవలి కాలంలో టెస్టు క్రికెట్లో పెద్దగా ఆడలేకపోతున్నట్లు విమర్శలకు గురైన ఓపె నర్ పుజారా మీడియా ముందుకు వచ్చాడు.కొన్ని మ్యాచ్లలో తన నుంచి భారీ స్కోర్లు రాలేదని అంగీకరించిన ఆయన ఎప్పుడూ సెంచరీలు, డబుల్ సెంచరీలు సాధించలేమన్నాడు. కాగా తన ఫామ్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తాను హాఫ్ సెంచరీ చేసి ఆరు మ్యాచ్లు మాత్రమే అయిందని పుజారా గుర్తుచేశాడు. అవతలి ఎండ్లో ఉన్న ఆటగాళ్లతో స్ట్రయిక్ రొటేట్ చేయడంలో తన వంతు సహకారాన్ని అందించడంలో విజయవంతమ వుతున్నాని ఆయన వివరించాడు.గతంలో కీలక పరిస్థితుల్లో మంచి ఇన్నింగ్స్ ఆడానని చెప్పిన పుజారా వెస్టిండీస్ మ్యాచ్లో మాత్రం చెత్తషాట్ ఆడ బోయి వికెట్ను సమర్పించుకున్నానని అంగీకిరించాడు. బ్యాటింగ్ను మరింతగా మెరుగు పర్చుకునేందుకు కోచ్ కుంబ్లేతో చర్చిస్తున్నానని పేర్కొ న్నాడు. వెస్టిండీస్తోజరుగుతున్న సిరీస్లో వారిని 4-0తేడాతో ఓడించడమే టార్గెట్టన్నాడు. | 2sports
|
Visit Site
Recommended byColombia
కీలక బౌలర్లకు విశ్రాంతినిస్తే.. ముంబై ఇండియన్స్పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఆ జట్టు జస్ప్రీత్ బుమ్రా సేవలను కోల్పోయే అవకాశం ఉంది. పేసర్లపై పనిభారం ఎంత మేర ఉందనే విషయమై బీసీసీఐ వివరాలను సిద్ధం చేస్తోంది. ఆసీస్తో టెస్టు సిరీస్కు భువీ దూరంగా ఉన్నాడు. కాబట్టి సన్రైజర్స్పై ప్రభావం పడే అవకాశం లేకపోవచ్చు. బుమ్రాకు విశ్రాంతి కల్పించాలని ముంబై ఇండియన్స్తో బీసీసీఐ మాట్లాడనుంది. ఒకవేళ బుమ్రా ఫిట్గా ఉంటే.. కీలక మ్యాచ్ల్లో ఆడించి మిగతా మ్యాచ్ల్లో విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇలా చేయడం వల్ల ప్రయాణాల వల్ల అలసిపోకుండా ఉండటం సాధ్యపడుతుంది. కీలక బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాలని కోహ్లి సూచించగా.. కెప్టెన్ నిర్ణయంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ విబేధించాడు. ముంబై జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్ చేరితే.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వలేమని తేల్చి చెప్పాడు.
వరల్డ్ కప్ కోసం సన్నద్ధం కావడానికి ఆటగాళ్లకు ఐపీఎల్ సరైన వేదిక అని ఇటీవలే ధోనీ కూడా అభిప్రాయపడ్డాడు. పనిభారం పెరగకుండా చూసుకోవడం కూడా ముఖ్యమేనని మహీ అంగీకరించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో విజయం తర్వాత బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని కోహ్లి కొనియాడాడు. మెల్బోర్న్ టెస్టులో బుమ్రా 9 వికెట్లు తీశాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
దాసరి ఇప్పటికీ సలహాలు ఇస్తున్నారు!
Highlights
టాలీవుడ్ లో 150కి పైగా చిత్రాలను డైరెక్ట్ చేసిన ఘనత దర్శకరత్న దాసరి సొంతం. నటుడిగా, దర్శకుడిగా
టాలీవుడ్ లో 150కి పైగా చిత్రాలను డైరెక్ట్ చేసిన ఘనత దర్శకరత్న దాసరి సొంతం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన ఈయన అత్యధిక చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.
సినిమా ఇండస్ట్రీకు విశేష సేవలు అందించిన ఆయన గతేడాది మే ౩౦న అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం టాలీవుడ్ కు తీరని లోటు. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఒంటి చేత్తో పరిష్కరించే దాసరి ఇక లేరు అనే విషయం బాధాకరం. ఎన్నడూలేని విధంగా ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో చాలా సమస్యలు తలెత్తాయి. ఈ కలహాలు చోటు చేసుకున్న సమయంలో దాసరి ఉంటే విషయం ఇంత దూరం వచ్చి ఉండేది కాదని ఆయన్ను తలుచుకున్న వారెందరో..
ఈరోజు దాసరి నారాయణరావు తొలి వర్ధంతి. ఆయన మనల్ని విడిచి సంవత్సరం పూర్తవుతున్న తరుణంలో ఆయన శిష్యుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ''మీరు మాకు దూరమై ఏడాది అయిందని ఎవరన్నారు..అనుక్షణం ఎదుటే ఉన్నారు.. కలలో ఉన్నారు.. సలహాలు ఇస్తున్నారు.. మా కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నారు.. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం..'' అని ఎమోషనల్ అయ్యారు.
మీరు మాకు దూరమై ఏడాది అయిందని ఎవరన్నారు..
అనుక్షణం ఎదుటే ఉన్నారు.. కలలో ఉన్నారు.. సలహాలు ఇస్తున్నారు..
మా కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నారు..
ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం.. pic.twitter.com/cBA3ZUlZtp
— Mohan Babu M (@themohanbabu) May 30, 2018
Last Updated 30, May 2018, 12:39 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
డోపీగా తేలిన ఇంద్రజిత్ సింగ్
డోపింగ్ పరీక్షల్లో ఇప్పటికే రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పట్టుబడగా తాజాగా షాట్పుట్ ఆటగాడు ఇంద్రజిత్ సింగ్ కూడా డోపీగా తేలాడు.
TNN | Updated:
Jul 26, 2016, 10:03AM IST
రియో ఒలింపిక్స్ బృందంలో సభ్యుడిగా ఉన్న షాట్పుట్ ఆటగాడు ఇంద్రజిత్ సింగ్ డోపీగా తేలాడు. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు డోపింగ్ పరీక్షల్లో తేలింది. జూన్ 22న నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో ఇంద్రజిత్ పట్టుబడ్డాడు. ఇంతకు ముందు రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కూడా డోపీగా తేలగా, ఇప్పుడు ఇంద్రజిత్ కూడా డోపింగ్ పరీక్షల్లో విఫలమవడం రియో ఒలింపిక్స్ ముందు భారత్కు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. హర్యానాకు చెందిన ఇంద్రజిత్ 2014 ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించాడు. డోపీగా తేలడంతో వీరిద్దరూ రియో ఒలింపిక్స్ బరిలో దిగే అవకాశాలు మూసుకుపోయాయి. అంతే కాకుండా కొత్తగా అమల్లోకి వచ్చిన వాడా కోడ్ ప్రకారం నాలుగేళ్లపాటు నిషేధం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఈ ఏడాది తొలినాళ్లలో టార్గెట్ ఒలింపిక్స్ పోడియం పథకంలో భాగంగా భారత ప్రభుత్వం ఇంద్రజిత్ను అమెరికా పంపి శిక్షణ ఇప్పించింది. | 2sports
|
five best monthly income plans in india
ఈ 5 పథకాలతో ప్రతి నెలా మీ చేతికి డబ్బులు..!
నెల నెల రాబడి పొందాలని చూస్తున్నారా? అయితే మీకు ఐదు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందొచ్చు.
Samayam Telugu | Updated:
Nov 2, 2019, 04:25PM IST
ఈ 5 పథకాలతో ప్రతి నెలా మీ చేతికి డబ్బులు..!
హైలైట్స్
ప్రతి నెలా రాబడి పొందాలని భావిస్తున్నారా?
అయితే మీకు ఐదు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి
వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా ఆదాయం వస్తుంది
రిటైర్మెంట్ అయిన వారికి ఇవి అనువుగా ఉంటాయి
డబ్బు సంపాదించాలని చూస్తున్నారా? అది కూడా ప్రతి నెలా ఆదాయం పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఆరు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి నెలా క్రమం తప్పకుండా డబ్బులు పొందొచ్చు. అవేంటో చూద్దాం..
Bajaj Finance - బజాజ్ పైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. 36 నెలల నుంచి 60 ఏళ్ల కాలపరిమితిలోని డిపాజిట్లపై 8 శాతానికి పైగా వడ్డీ పొందొచ్చు. ఈ స్కీమ్లో చేరితే ప్రతి నెలా ఆదాయం పొందొచ్చు. వడ్డీ మొత్తం చెల్లిస్తారు.
Mutual Funds - మ్యూచువల్ ఫండ్స్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ను అందిస్తూ ఉంటాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి నెలా ఆదాయం పొందొచ్చు. అయితే ఇక్కడ రాబడి మార్కెట్ పనితీరు ప్రాతిపదికన మారుతుంది. అందువల్ల వచ్చే ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు.
Also Read: ఎస్బీఐ కొత్త రూల్స్.. ఈ రోజు నుంచి అమలులోకి .. ఖాతాదారులపై ప్రభావం!
Post Office Monthly Income Plan - పోస్టాఫీస్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వల్ల ప్రతి నెల స్థిర ఆదాయం వస్తుంది. 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేసే సౌకర్యం ఉంది.
Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన వెండి.. బంగారం ధర మాత్రం..
Mahindra Finance - మహీంద్రా ఫైనాన్స్ కూడా డిపాజిట్ సేవలు అందిస్తోంది. ఈ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేయడం వల్ల 8 శాతానికి పైగా వడ్డీ పొందొచ్చు. 33 నెలల నుంచి 40 నెలల వరకు డిపాజిట్లకు ఈ రేటు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్కు సాధారణ డిపాజిటర్ల కన్నా కొంత ఎక్కువ వడ్డీ వస్తుంది. కనీసం రూ.50,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
పీఎన్బీ విషయంలో ఆర్బీఐని తప్పుపట్టిన సీవీసీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం జరగడానికి ఆర్బీఐ ఆడిటింగ్ తీరు సరిగా లేకపోవడం కూడా కారణమని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి విమర్శించారు
Samayam Telugu | Updated:
Apr 4, 2018, 05:40PM IST
పీఎన్బీ స్కాం విషయంలో ఆర్బీఐని తప్పుపట్టిన సీవీసీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం జరగడానికి ఆర్బీఐ ఆడిటింగ్ తీరు సరిగా లేకపోవడం కూడా కారణమని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి విమర్శించారు. కుంభకోణం జరిగిన సమయంలో ఆర్బీఐ నుంచి సరైన ఆడిటింగ్ జరగలేదన్నారు. మరింత పటిష్టమైన ఆడిటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.
ఆర్బీఐ ఆడిటింగ్ సరిగా లేదు: కేవీ చౌదరి
బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నియంత్రణ బాధ్యతలు ఆర్బీఐకి ఉన్నప్పటికీ ఆ విషయంలో చిత్తశుద్ధి లోపిస్తే సీవీసీ పర్యవేక్షిస్తుందన్నారు. ‘‘రిస్క్ను గుర్తించేందుకు వారికంటూ కచ్చితంగా కొన్ని కొలమానాలు ఉండాలి. కానీ, అంత పెద్ద ఆర్థిక మోసాలు జరుగుతున్న సమయంలో ఆర్బీఐ నుంచి సరైన ఆడిటింగ్ లేదు. ఆర్బీఐ ఏటా కాకుండా రిస్క్ ఆధారిత ఆడిగింగ్ చేస్తోంది. ఇది మంచి విధానమే. కానీ, వారు రిస్క్ను ఎలా కొలుస్తారు. కుంభకోణాలు ఎందుకు బయటకు రావడం లేదు’’అని చౌదరి అన్నారు. ఆర్బీఐ సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తోంది తప్ప బ్యాంకు శాఖల వారీగా పరిశీలన చేయడం లేదన్నారు. నైతిక విలువలతో, సక్రమంగా వ్యాపారం చేయడమన్నది బ్యాంకుల ప్రాథమిక బాధ్యతగా చౌదరి గుర్తు చేశారు. పీఎన్బీకే కుంభకోణాలు పరిమితం కాలేదన్న ఆయన బ్యాంకింగ్ రంగానికి మెరుగైన వ్యవస్థ అవసరమని, ఆ వ్యవస్థను అవి అనుసరించాలని సూచించారు. ‘‘కచ్చితమైన సమయ పాలన ఉండాలి. నిఘా యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలి. మార్గదర్శకాలు, నిర్వహణ విధానాన్ని కూడా బలోపేతం చేయాలి. వాటిని అవి అనుసరించేలా చూడాలి’’ అని చౌదరి పేర్కొన్నారు. పీఎన్బీ, ఆర్బీఐకి సంబంధించి చాలా అంశాలు సీవీసీ పరిశీలనలో ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సీవీసీ కేవీ చౌదరి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఐపీఎల్ 2017 వేలం: రేసులో 351 ప్లేయర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2017 సీజన్ కోసం నిర్వహించే వేలంలో మొత్తం 351 మంది ఆటగాళ్లు పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు.
TNN | Updated:
Feb 14, 2017, 06:21PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2017 సీజన్ కోసం నిర్వహించే వేలంలో మొత్తం 351 మంది ఆటగాళ్లు పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు. మొత్తం 799 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా ఫ్రాంచైజీలు 351 మందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మంగళవారం వెల్లడించింది. వీరిలో 122 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈ దేశాల ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొంటున్నారు.
ఆఫ్ఘానిస్తాన్ నుంచి అస్ఘర్ స్టానిక్జియా, మహమ్మద్ నబీ, మహమ్మద్ షాజాద్, రషీద్ ఖాన్, దవ్లత్ జద్రాన్‌తో పాటు యూఏఈ ప్లేయర్ చిరాగ్ సూరి వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, క్రిస్ వోక్స్ రూ. 2 కోట్ల ప్రారంభ ధరతో వేలంలో నిలుస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్ పెయిర్ మిచెల్ జాన్సన్, పాట్ కమ్మిన్స్‌తో పాటు శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ కూడా అత్యధిక బేస్ ప్రైజ్ లిస్టులో ఉన్నారు.
మొత్తం 23 మంది రూ. 2 కోట్ల ప్రారంభ ధరతో పోటీలో ఉండగా.. భారత్ నుంచి కేవలం ఇశాంత్ శర్మ మాత్రమే ఈ లిస్టులో ఉన్నాడు. కాగా, ఐపీఎల్ 2017 ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 20 నుంచి జరగనుంది. | 2sports
|
DCB-1
తెలంగాణలో డిసిబి బ్యాంకు ఐరిస్ ఎటిఎం
హైదరాబాద్,జూన్ 16: డిసిబి బ్యాంకు మొట్టమొదటిసారిగా తెలంగాణలోని మూడు శాఖల్లో ఆధార్ ఐరిస్ఐస్కాన్, వేలిముద్రలసాయంతో పనిచేసే ఎటిఎంలను ప్రారంభించింది. మంచిర్యాల, మోతే, నర్సాపూర్ గ్రామాల్లోని రైతులకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువచేసేందుకువీలుగా ఈ చర్యలు చేపట్టింది. అంతేకాకుండా రైతులతోపాటు వ్యక్తిగతరుణాలు, వ్యవసాయం, వ్యాపారం, స్వయం సహా యక బృందాల వ్యాపారం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణపరపతిని అందించేందుకబ్యాంకు విశే షంగా కృషిచేస్తున్నట్లు ప్రకటించింది. ఆధార్సాయం తో ఐరిస్స్కాన్, చేతివేలిముద్రలసాయంతో నడిచే ఎంటిఎంలను ప్రారంభించింది.
బ్యాంకు ఇప్పటికే ట్రాక్టర్లు, డైయిరీ, పంటరుణాలు, భూమి అభివృద్ధి, వ్యవసాయ శుద్ధి కార్యకలాపాలకు రుణపరపతిని అందిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే గోదాము రసీ దుల సెక్యూరిటీతోరతులకు రుణాలిస్తుందని, పసిడి రుణాలు, ఎంఎస్ఎంఇలకు రుణాలు, విదేశీ కరెన్సీ సేవలు వంటి వాటిని కూడా ఇతోధికంగా డిసిబి బ్యాంకు అందిస్తుందని బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు ముఖ్య ఆర్థిక అధికారి భరత్ సంపత్ మాట్లా డుతూ తెలంగాణలో మొట్టమొదటి ఆధార్ ఆధారిత ఎటిఎంను ప్రారంభించామని ఇదొక చక్కని అవకాశం అన్నారు. డిసిబి బ్యాంకుకు తెలంగాణ ఎంతో కీలకమార్కెట్ అన్నారు. కొత్త ఎటిఎంలు, శాఖల్లో కూడా ఖాతాదారులకు విస్తృత సేవలందుతాయన్నారు.
వ్యవసాయం, ఆర్ధికచేకూర్పు విబాగం హెడ్ నరేంద్రనాధ్ మిశ్రా మాట్లాడుతూ తెలంగాణలోని డిసిబి బ్యాంకుశాఖలు స్నేహపూర్వక సేవలు అందిస్తాయన్నారు. ప్రైవేటురంగంలోని కొత్తతరం బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టిన డిసిబిబ్యాంకుకు మొత్తం 18 రాష్ట్రాల్లోను, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోను 262 శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీ, మౌలికవనరులను పెంచుకోవడం ద్వారా ఇంటర్నెట్ సేవల్లో బ్యాంకు అగ్రగామిగా ఉందని, ఇటీవలే బ్యాంకు ఆధార్ ఆధారిత ఎటిఎం సేవలు కూడా ప్రారంభించినట్లు వివరించారు.
==== | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మీకు తెలుగు వచ్చా? 25 డాలర్లు గెలవొచ్చు!
తన సినిమాలకు అచ్చ తెలుగు టైటిల్స్ పెట్టడంలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి ప్రత్యేకత ఉంది.
Samayam Telugu | Updated:
Jun 11, 2018, 09:46AM IST
తన సినిమాలకు అచ్చ తెలుగు టైటిల్స్ పెట్టడంలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి ప్రత్యేకత ఉంది. ‘జెంటిల్మన్’ అంటూ ఇంగ్లిష్ టైటిల్తో కూడా ఇతడు సినిమా తీశాడు కానీ, అంతకు ముందు ‘అష్టాచమ్మా’ వంటి అచ్చ తెలుగు టైటిల్తో ఇప్పుడు ‘సమ్మోహనం’ అంటూ వస్తున్న దర్శకుడు ఇతడు. ఇప్పుడు ఇలా అచ్చతెలుగు టైటిల్ను పెట్టడమే కాదు, అందరి తెలుగుకూ ఒక పరీక్ష కూడా పెడుతున్నాడు. ఈ పరీక్షలో సత్తా చూపించిన వారికి 25 డాలర్ల బహుమానం ఉంటుందని కూడా ప్రకటించారు.
ఇందుకు సంబంధించి ఒక వెబ్ లింక్ను ఇచ్చారు. ఈ లింక్ను ఓపెన్ చేస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి. వాటికి కరెక్ట్ గా సమాధానాలు ఇస్తే మీరు గెలిచినట్టే. ఈ వెబ్ టెస్ట్లో పాల్గొనే వారిలో కరెక్టు ఆన్సర్లు ఇచ్చిన ఐదు మందికి బహుమతులు ఇస్తారట. కరెక్టుగా ఆన్సర్లు చెప్పిన వారిలో కూడా వేగంగా ఆన్సర్లు ఇచ్చిన వారే విజేతలుగా నిలిచే అవకాశం ఉంది. మరి మీ లక్ను, మీ తెలుగు టాలెంట్కు పరీక్ష పెట్టదల్చుకున్నారా.. అయితే ఈ కింది లింక్ను క్లిక్ చేయండి. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
చరిత్రకి అడుగు దూరంలో ఆంధ్ర బోల్తా..!
విజయ్ హజారే ట్రోఫీ చివరి అంకంలో అనూహ్యంగా ఆంధ్ర జట్టు బోల్తా కొట్టింది. టోర్నీ చరిత్రలోనే తొలిసారి సెమీ ఫైనల్కి
TNN | Updated:
Feb 25, 2018, 06:18PM IST
చరిత్రకి అడుగు దూరంలో ఆంధ్ర బోల్తా..!
విజయ్ హజారే ట్రోఫీ చివరి అంకంలో అనూహ్యంగా ఆంధ్ర జట్టు బోల్తా కొట్టింది. టోర్నీ చరిత్రలోనే తొలిసారి సెమీ ఫైనల్‌కి చేరిన ఆంధ్ర.. ఫిరోజ్ షా కోట్ల వేదికగా సౌరాష్ట్ర జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర జట్టు 49.1 ఓవర్లలో 255 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో రవీంద్ర జడేజా (56: 51 బంతుల్లో 4x4, 1x6), ఆర్పిత్ వసవాడ (58: 59 బంతుల్లో 4x4, 2x6) అర్ధశతకాలతో మెరిశారు. కెప్టెన్ చతేశ్వర్ పుజారా (17) నిరాశపరిచాడు.
ఛేదనలో ఆంధ్ర జట్టు పేలవ రీతిలో నిరాశపరిచింది. కెప్టెన్ హనుమ విహారి (25) పేలవ రీతిలో ఔటవగా.. రికీ భుయ్ (13), అశ్విన్ హెబ్బార్ (12) వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. దీంతో 91/4తో ఒత్తిడిలో పడిన జట్టుని సుమంత్ (42: 63 బంతుల్లో 2x4, 1x6), రవితేజ (42: 53 బంతుల్లో 1x4) ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో.. చివరికి 45.3 ఓవర్లలోనే 196 పరుగులకే ఆంధ్ర జట్టు కుప్పకూలిపోయింది. కర్ణాటక, సౌరాష్ట్ర మధ్య టోర్నీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం జరగనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
బ్యాడ్మింటన్ క్రీడాకారులకు క్యాస్ అవార్డును అందజేసిన సన్షౖౖెన్
ఫతేమైదాన్,నవంబరు 23 ప్రభాతవార్త: బ్యాడ్మింటన్లో అద్భుతంగా రాణిస్తున్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు సికింద్రాబాద్లోని సన్షైన్ అసుపత్రి యాజమాన్యం ముగ్గురు బ్యాడ్మింటన్ క్రీడా కారులకు 5లక్షల చెక్కులు అందజేసింది. అనేక బ్యాడ్మింటన్పోటీలలో పతకాలు సాధించి క్రీడాకా రులకు ఈ ఆ సంస్థ చెక్కులు అందజేసింది. చెక్కులు అందుకు బ్యాడ్మింటన్ క్రీడాకారినిలు జె.మేఘన 2 లక్షలు, మేఘనారెడ్డి 2లక్షలు, కవి ప్రియకు 1 లక్ష నగదును చెక్కురూపంలో తెలంగాణ శాట్స్ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరనాధ్, పుల్లెల గోపిచంద్ వీరికి అందజేశారు. | 2sports
|
గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి బాగోలేదు
Sourav Ganguly
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పగ్గాలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక కానున్నారు. 47 ఏళ్ల గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో గంగూలీ మాట్లాడుతూ, బీసీసీఐ అధ్యక్షుడు కావడమనేది ఒక గొప్ప అనుభూతి అని చెప్పారు. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించిన తనకు ఇది ఒక గొప్ప అనుభూతి అని అన్నారు. గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి బాగోలేదని, ఇమేజ్ దెబ్బతిందని… ఇలాంటి స్థితిలో తాను పగ్గాలు చేపట్టబోతున్నానని చెప్పారు. బీసీసీఐ ఇమేజ్ ను మళ్లీ పెంచడానికి ఇది తనకొక గొప్ప అవకాశమని తెలిపారు.
డొమెస్టిక్ క్రికెట్ ను బలోపేతం చేసే క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడమే తన ప్రథమ కర్తవ్యమని గంగూలీ చెప్పారు. తన తొలి ప్రాధాన్యత ఫస్ట్ క్లాస్ క్రికెటర్లే అయినప్పటికీ… తన ఆలోచనపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీసీసీఐ అడ్వైజరీ కమిటీకి గత మూడేళ్లుగా తాను ఇదే విషయం చెబుతున్నానని… అయితే వారు పట్టించుకోలేదని చెప్పారు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ అతి పెద్ద ఆర్గనైజేషన్ అని, ఆర్థికంగా ఒక పవర్ హౌస్ వంటిదని… అలాంటి బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడం ఒక ఛాలెంజ్ అని తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/ | 2sports
|
బిగ్ బాస్2: గెలిచేది వాళ్లిద్దరిలో ఒకరే.. శ్యామల కామెంట్స్
Highlights
బిగ్ బాస్2 సీజన్ పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. కానీ ఇప్పటి నుండే విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంలో సోషల్ మీడియాలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్2 సీజన్ పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. కానీ ఇప్పటి నుండే విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంలో సోషల్ మీడియాలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. కౌశల్ కోసం ఏకంగా ఓ ఆర్మీ కూడా తయారైంది. హౌస్ లో ఎవరికీ దక్కనంత ఆదరణ కౌశల్ దక్కించుకున్నాడు. ఇక ఆయన ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు కాబట్టి హౌస్ నుండి వెళ్తారా..? లేదా..? అనేది తెలియాల్సివుంది.
గడిచిన ఆరు వారాల్లో హౌస్ నుండి ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వారిలో శ్యామల కూడా ఉన్నారు. అయితే ఈ షోకి విజేతగా ఎవరు నిలుస్తారని అనుకుంటున్నారనే ప్రశ్నకు సమాధానంగా శ్యామల ఇద్దరి పేర్లను వెల్లడించింది. 'కౌశల్, గీతామాధురి ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్ అవుతారని అనుకుంటున్నాను. ఎంతమంది ఎన్ని చేసినా.. వాళ్లు మాత్రం తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారు.
అందుకే వాళ్లిద్దరిలో ఒకరు విజేతగా నిలిచే ఛాన్స్ ఉంది' అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఒకరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువగా శ్యామల పేరు వినిపిస్తుండడం విశేషం.
Last Updated 27, Jul 2018, 6:27 PM IST | 0business
|
Narayana murthy
ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్కు ప్రమోటర్ల కృషి
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఇటీవల చేపట్టిన షేర్ల బైబ్యాక్ కోసం ప్రమోటర్లు కృషిచేస్తున్నారు.షైర్ల బైబ్యాక్లో భాగంగా ప్రమోటర్ల గ్రూప్లోని షేర్లలో 1.77 కోట్ల వాటాలను విక్రయించనున్నారు.దీని ప్రకారం 13 వేల కోట్ల బైక్యాక్ లో ప్రమోటర్లే ఈ 2038 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నటు అవు తుంది.ప్రస్తుతం ఇన్ఫోసిస్ ప్రమోటర్ల గ్రూపులో అత్యధికంగా వ్యవస్థాపకులు,వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. వీరికి 12,75 శాతం వాటాతో 28.28 కోట్లు వాటాలున్నాయి.దీంతో కంపెనీ ప్రకటించిన బైబ్యాక్ను విజయవంతం చేసేందుకు చొరవ తీసుకుంటు న్నారు. ప్రస్తుతం విక్రయానికి సిద్ధం చేసిన ప్రమోటర్ల గ్రూపు షేర్లలో నారా యణమూర్తి, నందన్ నీలేకనికి వాటాలు ఉన్నాయి. నీలేకని కుటుంబం 58 లక్షల షేర్లను బైబ్యాక్లో ఆఫర్ చేయగా మూర్తి ఆయన సతీమణి సుధా కలిసి 54లక్షల షేర్లను ఆఫర్ చేశారు. ఇక గోపాలకృష్ణన్ 22 లక్షల షేర్లు, కె.దినేష్ 29 లక్షల షేర్లు, శిబులాల్ భార్య, కుమారుడు 14 లక్షల షేర్లను ఆఫర్ చేశారు. | 1entertainment
|
May 18,2018
మార్కెట్లకు చమురు దెబ్బ..!
ముంబయి: అంతర్జాతీయ పరిణామాలతో పాటు ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. పెరిగిన ముడిచమురు ధరలు దేశీయ ద్రవ్యలోటుపై ప్రభావం చూపుతాయనే భయాందోళనల నడుమ మదుపర్లు విస్తృతంగా స్టాక్స్ అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. కర్నాటకలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో గురువారం ఉదయం సూచీలు లాభాలను అందుకున్నాయి.. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైంది. ఇదే సమయంలో అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ముడి చమురు ధరల పెరుగుదలతో సూచీలు కొద్దిసేపట్లోనే ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఆ తరువాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. చివరకు సెన్సెక్స్ 239 పాయింట్లు కోల్పోయి 35,149 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 58 పాయింట్ల నష్టంతో 10,683 వద్ద ముగిసింది. బ్యాంకులు, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని కనబరిచింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘తలకాయ కోస్తా’.. డైలాగ్తో అరిపిస్తున్న ఎన్టీఆర్
‘అరవింద సమేత’ చిత్రంలో విలన్కి హీరోకి మధ్య జరిగిన ‘పీస్ మీటింగ్’ డైలాగ్ సినిమాకై హైలైట్.. ఈ డైలాగ్ను యూట్యూబ్లో విడుదల చేసింది చిత్ర యూనిట్.
Samayam Telugu | Updated:
Oct 26, 2018, 09:02PM IST
‘తలకాయ కోస్తా’.. డైలాగ్తో అరిపిస్తున్న ఎన్టీఆర్
‘పులివెందుల పూల అంగళ్ల నుండి కడప కోటిరెడ్డి సర్కిల్ దాక .. కర్నూల్ కొండరెడ్డి బురుజు కాడ్నుంచి అనంతపుర్ క్లోక్ టోవర్ దాంకా.. బల్లారీ గనుల్లో దాంకున్నా.. బెలగావ్ పొలాల్లో పనుకున్నా వదాలా.. తరుముకుంటూ వస్తా తలకాయ్ కోస్తా..’ డైలాగ్ ‘అరవింద సమేత’ చిత్రంలో కీలకమైంది. విలన్కి హీరోకి మధ్య జరిగిన ‘పీస్ మీటింగ్’ లో ఎన్టీఆర్ వీర రాఘవుడి అవతారంలో చెప్పిన ఈ డైలాగ్కి నందమూరి అభిమానులు థియేటర్స్లో విజిల్స్ మోత మోగిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్లో విడుదలైన ‘అరవింద సమేత’ చిత్రంలోని డైలాగ్లలో ‘పీస్ మీటింగ్’ డైలాగ్ సినిమాకే హైలైట్. నిమిషం పాటు సాగిన ఈ పాపులర్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్ని థియేటర్లో చూడలేకపోయిన ప్రేక్షకుల కోసం యూట్యూబ్లో విడుదల చేసింది నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్. | 0business
|
Venkaiah Naidu
జిఎస్టీ బిల్లుదు ఆమోదం శుభపరిణామం
ఢిల్లీ: జిఎస్టీ ఆమోదం పొందటం శుభసూచకమని కేంద్ర మంత్రి వెంకయ్య్ననాయుడు తెలిపారు.. పన్ను సంస్కరణల్లో ప్రధాని , ఆర్థికమంత్రుల కృషి ఫలించిందన్నారు.. వివిధ రాష్ట్రాల మంత్రులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు.. ఓపుర్పుతో నేర్పుతో బిల్లును ఆమోదింపజేసి అరుణ్జైట్లీకి అభినందనలు తెలిపారు. | 1entertainment
|
మరో రెండేండ్లు ఆగాల్సిందే..
- ఇప్పట్లో ఆర్థికం కుదరుకోవడం కష్టమే
- నోట్లరద్దు, జీఎస్టీ ప్రాభావమూ కారణమే సేవల రంగం బాగా ప్రభావితమైంది
- బ్యాంకింగ్ సవాళ్లను అధిగమించాలి: డెలాయి భారత చైర్మెన్ రమేశ్
న్యూఢిల్లీ: వివిధ కారణాల వల్ల ప్రభావితమైన దేశ ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి కనీసం మరో ఏడాది నుంచి రెండేండ్ల కాలం పట్టొచ్చని ఆర్థిక సేవల సంస్త డెలాయి ఇండియా ఛైర్మన్ పి.ఆర్. రమేశ్ అపాయపడ్డారు. పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ)కి తోడు బ్యాంకింగ్ రంగం ఎన్పీఏలు వంటి సవాళ్లను ఎదుర్కొంటుండడం వల్ల వృద్ధి రేటు మూడున్నరేండ్ల కనిష్టానికి చేరిందని ఆయన అన్నారు దీనికి డోతు అంతర్జాతీయంగా అమెరికాలో డొనాల్డ్ ట్రంపు విధానపరమైన నిర్ణయాల మూలంగా దేశీయ సేవల రంగంపై భారీగానే ప్రభావం పడిందని పేర్కొంది. ఐటీ రంగంలో వేల ఉద్యోగాలు పోయాయని వెల్లడించారు. వీటన్నిటిని అధిగమించడానికి కనీసం 12 నెలల నుంచి 24 మాసాల వరకు కాలం పట్టొచ్చన్నారు. 11 నెలల క్రితం కేంద్రం ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు చర్య ఇంకా ప్రభావం చూపుతూనే ఉందని, అయితే ఇది స్వల్ప కాలమేనని ఆయన బిజినెస్ స్టాండర్ట్కు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు.
ప్రభుత్వ చర్యలనుబట్టే ప్రగతి
భారత ఆర్ధిక వ్యవస్థ అథమ స్థాయికి చేరిందని.. ఇక ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో అందించే ప్రోత్సాహకాలకు అనుగుణంగానే అది పుంజుకొనే అవకాశం ఉందని డూన్ అండ్ బ్రాడ్స్టీట్ (డీఅండ్బీ) తన తాజా రిపోర్టులో పేర్కొంది. పేర్కొంది. ముఖ్యంగా ప్రయివేటు రంగంలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని లేకుంటే దేశం మెరుగైన వృద్ధి రేటు సాధించడం చాలా కష్టమని సంస్థ ఇండియా లీడ్ ఎకనామిస్ట్ అరుణ్ సింగ్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు నుంచి భారీ అంచనాలు వేశామని... కాని వాటిని చేరలేకపోయామని పేర్కొన్నారు.
అయితే ఈ మధ్య కాలంలో కొంత పురోగతి కనబడుతుందన్నారు. పారిశ్రామికోత్పత్తి కొంత పెరిగిందన్నారు. అదే విధంగా ఎగుమతులు పుంజుకోవడం, వడ్డీ రేట్ల తగ్గింపు, తక్కువ స్థాయిలోనే ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు నియంత్రణలో ఉండటం, ఎఫ్డీఐల్లో స్థిరత్వం తదితర అంశాలు కొంత ఆశాభావాన్ని పెంచాయన్నారు. వృద్ధి రేటు పెరగాలంటే గ్రామీణ ప్రాంతాల వినియోగమూ పెరగాలన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyd Internet 125 Views Kidambi Srikanth
Kidambi Srikanth
ఢిల్లీః భారత అగ్రశ్రేణి షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్.. చైనా ఓపెన్ సూపర్ సిరీస్కు దూరమయ్యాడు. నాగ్పూర్లో ఇటీవల ముగిసిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో శ్రీకాంత్ కాలుకు గాయమైంది. గాయాన్ని పరీక్షించిన వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. దీంతో అతడు నవంబరు 14 నుంచి 19 వరకు జరిగే చైనా ఓపెన్ సూపర్ సిరీస్కు దూరం కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ..‘కాలు కండరాలు పట్టేయడంతో వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి సూచించారు. దీంతో నేను చైనా ఓపెన్ సూపర్ సిరీస్లో పాల్గొనడం లేదు. వారం రోజుల్లో నేను పూర్తిగా కోలుకుంటా. ఆ తర్వాత నవంబరు 21 నుంచి 26 మధ్య జరిగే హాంకాంగ్ సూపర్ సిరీస్లో పాల్గొంటా’ అని తెలిపారు. | 2sports
|
ROOYI
బ్యాడ్మింటన్ ఛాంపియన్ రూహి
హైదరాబాద్: యుఎస్ఏ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో హైద్రాబాద్ అమ్మాయి రూహి రాజు సత్తాచాటింది. అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈటోర్నీలో 13ఏళ్ల రూహి సింగిల్స్ విభాగంలో ఛాంపి యన్గా నిలిచి టైటిల్ను గెలుచుకుంది. బాలికల సింగిల్స్ ఫైనల్లో రూహి 22-20, 18-21, 21-15తో మూడో సీడ్ నేత్రపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్లో 2017 జూనియర్ ఇంటర్నేషనల్ ట్రయల్స్ విజేత జోలీ వాంగ్ను వరుస గేముల్లో ఓడించి రూహి ఫైనల్కు చేరుకుంది. లీగ్ దశలోనూ తన కన్నా మెరుగైన క్రీడాకారులను ఓడించి ఆమె ఆకట్టుకుంది. ప్రస్తుతం సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో రూహిశిక్షణ తీసు కొంటోంది. | 2sports
|
internet vaartha 171 Views
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జెఫ్ లాసన్ పై వెస్టిండీస్ ఆల్రౌండర్ మార్లోస్ శామ్యూల్స్ పరువు నష్టం దావా వేశాడు. వెస్టిండీస్ జట్టు టి20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ఏప్రిల్ 4న బిగ్ స్పోర్ట్స్ బ్రేక్ పోస్ట్ రేడియో కార్యక్రమంలో లాసన్ మాట్లాడుతూ వెస్టిండీస్ లోని మాఫియా వ్యక్తులతో శామ్యూల్స్కు సంబంధాలున్నాయి. అతడి వెనుక ఎవరున్నారో మీకు తెలియదు, ప్రపంచంలోని హత్యల రాజధానిగా పేరు పొందిన వాటిలో ఒకటైన జమైకాలోని కింగ్స్టన్ నుంచి అతడు వచ్చాడు. అక్కడి హంతక ముఠాలతో అతడికి సంబంధాలున్నాయని ఆరోపణలు చేశాడు. దీనికి సంబంధించిన శామ్యూల్స్, లాసన్ వ్యాఖ్యలు తనను అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ పరువు నష్టం దావా వేశాడు. లాసన్ కామెంట్స్ న్యాయవిరుద్దంగా ఉండటమే కాకుండా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. జర్నలిస్టు జేమ్స్ మాథహి పేరు కూడా ఈ దావాలో చేర్చడం విశేషం.విండీస్ టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో శామ్యూల్స్ పాత్ర ప్రధానమైన దన్న సంగతి తెలిసిందే. | 2sports
|
internet vaartha 279 Views
ముంబై : బ్రిటన్ యువరాజు విలియమ్స్ ముంబైల బాలలతో కలిసి క్రికెట్ ఆడనున్నాడు. కాగా ఈ కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా పొల్గొంటారు. బ్రిటన్ యువరాజు, ఆయన సతీమణి కేట్మిడిల్టన్ భారత్లో పర్యటించనున్నారు.ఈనెల 10 నుంచి దేశంలో పర్యటించబోతున్న వీరి కోసం ముంబై సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. తాజ్ మహల్ ప్యాలెస్లో వీరిద్దరూ బస చేస్తారు.దిలీప్ వెంగ్సర్కార్ క్రికెట్ మైదానంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని బాలలతో కలిసి బ్రిటన్ యువరాజ్ క్రికెట్ ఆడతాడు.కాగా 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించనున్నారు.అనంతరం దక్షిణ ముంబైలో యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు.తాజ్ క్రిస్టర్ రూమ్లో క్రీడలు,వ్యాపార,బాలీవుడ్ దిగ్గజాలతో విలియమ్స్,కేట్ పరిచయ కార్యక్రమం,విందు జరుగుతాయి.
విండీస్పై సచిన్ ప్రశంసల జల్లు
ఐసిసి టి20 వరల్డ్ కప్ మెగా టోర్నీల కోల్కతాలోని ఫ్రఖ్యాత ఈడెన్గార్డెన్స్లో ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోరులో వెస్టిండీస్ జట్టు విజేతగా నిలిచింది.ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్ను చిత్తు చేసి టైటిల్ సాధించింది.కాగా ఈ సందర్భంగా విండీస్ జట్టు విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు హోరెత్తాయి.టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ట్విటర్ వేదికగా సచిన్ పోస్టు చేసిన మెసేజ్ చూస్తే విండీస్ విన్నర్గా నిలిచిన కార్లోస్ బ్రాత్వైట్ మురిసిపోక తప్పదు,బ్రాత్ వైట్ వాజ్ బ్రీత్ టేకింగ్ అంటూ సచిన్ అభివర్ణించారు. అండర్-19,మహిళలు,పురుషుల విభాగాల్లో విండీస్ విజేతగా నిలిచిన వైనాన్ని ప్రస్తావించిన సచిన్ ఆ దేశ జట్ల ఆట తీరును ప్రశంసించారు. | 2sports
|
ఆ అనుష్కకు కోహ్లీ అంటే ఇష్టం! మరి ఈ అనుష్కకు?
Highlights
టాలీవుడ్ లో టాప్ హిరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటిన స్వీటీ
బాహుబలితో మరింత క్రేజ్, ప్రభాస్ తో లవ్ అంటూ రూమర్స్
తాజాగా క్రికెటర్ తో తన ప్రేమ గురించి మనసులోమాట చెప్పిన అనుష్క షెట్టి
సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క ప్రస్తుతం దక్షిణాదిలో అగ్రకథానాయికగా చెలామణి అవుతోంది. అరుంధతి సినిమాతో స్టార్డమ్ సంపాదించుకున్న అనుష్క రుద్రమదేవి, బాహుబలి లాంటి చిత్రాలతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తన ప్రేమ వ్యవహారానికి సంబంధించి అనుష్క యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో ప్రేమలో ఉన్నారనే రూమర్లు కూడా వినిపించాయి. ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. కానీ వీటిని ప్రభాస్ ఖండించారు.
తాజాగా రెండు రోజుల కిందటే అనుష్క తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ క్రికెటర్తో పీకల్లోతు ప్రేమలో పడిపోయానని తెలిపారు. ఆయన మరెవరో కాదు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్. తాను ద్రావిడ్కు వీరాభిమానినని, ఆయనంటే తనకు చిన్నప్పటి నుంచి పిచ్చి అని, ఒకానొక సమయంలో అతనితో పీకల్లోతు ప్రేమలో పడిపోయానని అనుష్క తెలిపింది. ప్రస్తుతం భాగమతి చిత్రంలో నటిస్తోంది. కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలకు అనుష్క పేరు ముందు వరుసలో ఉంటుంది.
చిత్ర పరిశ్రమకు, క్రికెట్కు విడదీయరాని అనుబంధం ఉంది. నాటి తరం షర్మిలా ఠాగూర్ నుంచి నేటి తరం అనుష్క శర్మ వరకు. ఒక్కో నటికి ఒక్కో క్రికెటర్ అంటే అభిమానం ఉంటుంది.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
Hyderabad, First Published 9, Apr 2019, 4:14 PM IST
Highlights
ప్రముఖ సింగర్ స్మిత ఎన్నిక నేపధ్యంలో ఓటర్లను ఉద్దేశిస్తూ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రముఖ సింగర్ స్మిత ఎన్నిక నేపధ్యంలో ఓటర్లను ఉద్దేశిస్తూ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 'నా పేరు ఆంధ్రా.. నా వయసుఐదేళ్లు' అనే పేరుతో రూపొందించిన ఈ వీడియోలో స్మితా కూతురు శివి నటించింది.
ఈ పాటలో ఏ పార్టీ ప్రస్తావన తీసుకురాకుండా.. తను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా వీడియో ద్వారా చెప్పింది. అనుభవం ఉన్న నాయకుడు ఉంటేనే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు.
ఈ వీడియో స్మిత ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా తీసినట్లు కనిపిస్తున్నా.. అనుబహవం ఉన్న నాయకత్వం ఉంటేనే రాజధాని నిర్మాణం పూర్తవుతుందని పరోక్ష సందేశం వినిపిస్తోంది. గతంలో స్మిత 2014 ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీకి మద్దతుగా ఓ ఆల్బం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Last Updated 9, Apr 2019, 4:14 PM IST | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
ఐపీఎల్-12 మార్చి 23న షురూ
ఆరంభ పోరులో చెన్నైతో బెంగళూరు ఢీ
17 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల
ఎన్నికల తేదీలు ప్రకటించాక తుది విడత
ముంబయి
ఆసక్తికర సమరంతో ఐపీఎల్ పన్నెండో సీజన్కు తెరలేవనుంది. లీగ్లో అత్యంత ఆదరణ పొందిన ఫ్రాంఛైజీలు తొలి మ్యాచ్లో ఢీకొననున్నాయి. మార్చి 23న ఆరంభ పోరులో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. విరాట్ కోహ్లి నేతృత్వంలోని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్తో తలపడనుంది. చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఐపీఎల్-12 తొలి రెండు వారాల షెడ్యూల్ను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి షెడ్యూల్ను ప్రకటించలేదు. ఎన్నికల తేదీలు ఖరారయ్యాక అందుకు తగ్గట్టుగా తుది షెడ్యూల్ను రూపొందించనుంది. తొలి రెండు వారాల్లో మొత్తం 8 జట్ల మధ్య 17 మ్యాచ్లు జరగనున్నాయి. అందులో బెంగళూరు, దిల్లీ ఐదేసి మ్యాచ్లు ఆడనుండగా మిగతా ఆరు జట్లు నాలుగేసి మ్యాచ్ల్లో పోటీపడనున్నాయి. షెడ్యూల్ను ప్రకటించిన బోర్డు మ్యాచ్ సమయాలను మాత్రం పేర్కొనలేదు. ప్రసారదారు కోరిక మేరకు సమయాల్లో మార్పులు చేసే అవకాశముంది. సన్రైజర్స్ హైదరాబాద్.. మార్చి 24న కోల్కతాతో, మార్చి 29న రాజస్థాన్ రాయల్స్తో, మార్చి 31న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, ఏప్రిల్ 4న దిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.
ప్రధానాంశాలు | 2sports
|
Jul 21,2018
అంచనాల్ని మించిన విప్రో
బెంగళూరు/న్యూఢిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద టెక్ సంస్థ విత్త సంస్థ విప్రో ఇండియా మార్కెట్ అంచనాలకు మించి మెరుగైన ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. 2018 జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో సంస్థ 5.16 శాతం వృద్ధితో రూ.2,121 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.2,026.80 కోట్ల లాభాలు నమోదు చేసింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ లాభాలు రూ.2,100 కోట్లకు దిగువలో ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కాగా ఇంతకంటే మెరుగైన ఫలితాలు నమోదు చేయడం విశేషం. 2017-18 మొదటి త్రైమాసికంలో రూ.11,791.4 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం ఈ ఏడాది తొలి త్రైమాసికానికి రూ.12,157.20 కోట్లకు చేరింది. ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 2,009-2,094 కోట్ల మధ్య ఉండొచ్చని ఆ కంపెనీ అంచనా వేసింది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో విప్రో షేర్ విలువ 0.77 శాతం తగ్గి రూ.283.05 వద్ద ముగిసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐటీ వ్యయం పెరుగుతుందని విప్రో చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ అబిదాలి జడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర అమెరికా, బీఎఫ్ఎస్ఐ వ్యాపారంలో పెరుగుదల ఉందన్నారు. భారత సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమ దాదాపుగా 154 బిలియన్ డాలర్ల విలువ చేస్తుంది. ఇందులో టీసీఎస్ తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఇన్ఫోసిస్ కొనసాగుతుంది.
అమెరికా సంస్థ వ్యాపారంపై కన్ను..
అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న అలైట్ సొల్యూషన్స్కు చెందిన భారతదేశ వ్యాపార సేవలను విప్రో కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. అలైట్స్ క్లయింట్లకు అందిస్తున్న హెచ్ఆర్ సేవలకు కొత్త రూపం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ ఎత్తుగడ భాగస్వామ్యం అలైట్ పెట్టుబడులు పెంచడం ద్వారా వైద్య, ఆదాయ, క్లౌడ్ బిజినెస్ల్లో ఆటోమేషన్, మెషన్ లెర్నింగ్, డాటా ఎనలిటిక్స్ను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించింది. అలైట్కు ప్రస్తుతం గుర్గావ్, నోయిడా, ముంబయి, చెనైలో టెక్నలాజీ కేంద్రాలు ఉన్నాయి. అలైట్ ఇండియా బృందానికి తమ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నట్లు అబిదాలి తెలిపారు. ఆ సంస్థ టెక్నలాజీ ఆస్తులను మరింత ఆధునీకరించనున్నామన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Nov 17,2016
రోజుకు వెయ్యి కోట్ల డిపాజిట్లు..
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో బ్యాంకుల్లో కరెంట్ అండ్ సేవింగ్ ఖాతాల్లో (కాసా) డిపాజిట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకులో ఎనిమిది రోజుల్లో రూ.8000 కోట్ల కాసా డిపాజిట్లు నమోదయ్యాయి. ఇదే విషయాన్ని బిజినెస్ స్టాండర్డ్ ఒక కథనంలో వెల్లడించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు కాసా డిపాజిట్లు రూ.3,026 కోట్లు పెరిగి రూ.48,031 కోట్లకు చేరాయి. 2015 ఇదే సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.45,005 కోట్లుగా నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రతి రోజు సగటున రూ.1,000 కోట్ల చొప్పున డిపాజిట్లు నమోదయ్యాయని ఆ బ్యాంకు ఉన్నతాధికారి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆంధ్రా బ్యాంకు 3,000 శాఖలతో విస్తరించి ఉంది. ఆర్బీఐ జాబితా ప్రకారం దేశంలో 10 పెద్ద బ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు పెరుగుతున్నాయని పేర్కొంది. ద్వితీయ త్రైమాసికంలో ఆంధ్రా బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.3.19 లక్షల కోట్లుగా నమోదయ్యింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Manitue
భారత్లో ఫ్రాన్స్ ‘మనిటౌ విస్తరణ
హైదరాబాద్,జూన్ 13: అన్ని రకాల వాతావరణాల్లోను, అన్ని బౌగో ళిక ప్రాంతాల్లోను భారీ సామగ్రిని ఎత్తగలిగేనిర్మాణ, వ్యవసాయ, పారిశ్రామికరంగ యంత్రసామగ్రిని అందించే మనిటౌగ్రూప్ భారత్ లో భారీ విస్తరణకు శ్రీకారంచుట్టింది. ఫోర్క్ లిప్టులు, స్కిట్స్టీర్స్, ట్రాక్ లోడర్లు, ఆర్టిక్యూలేటెడ్ లోడర్లు, యాక్సెస్ ప్లాట్ఫమ్, ట్రక్మౌంటెడ్ ఫోర్క్లిఫ్ట్లు, గోదాముల యంత్రసామగ్రి వంటివి చేపట్టింది. కీలకబ్రాండ్లుగా మనిటౌ, గెహల్, వేుస్తాంగ్ వంటి బ్రాడ్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా 1400మందికిపైగా డీలర్లుతో కస్టమర్లకు ఉత్తమ సేవలందిస్తోందని కంపెనీ సిఇఒ మైఖేల్ డెనిస్ అన్నారు. అన్నిప్రాంతాల్లోను, అన్నిరకాల సీజన్లలో కూడాయంత్ర సామగ్రిసాయంతో నిర్మాణ, వ్యవసాయ పారిశ్రామిక రంగానికి తమ కంపెనీ ఇతోధిక సేవలందిస్తుందని అన్నారు. ఇటీవలే కంపెనీ టెరెక్స్ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ను కొనుగోలుచేసింది. ఫ్రాన్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మనిటౌ ఎక్విప్మెంట్ ఇండియా కేంద్ర కార్యాలయం గ్రేటర్ నోయిడాలో ఏర్పాటుచేసింది. 340కిపైగా మనిటౌ ఇంజినీరింగ్ ఉద్యోగులు రెండుదేశాలమధ్య పర స్పర సాంకేతిక సహకారం అందించుకుంటూ లక్ష్యాలను సాధిస్తున్నట్లు కంపెనీ సిఇఒ వివరించారు. | 1entertainment
|
xiaomi to launch new phone with color changing ability
సంచలనం! ఇక మీ మొబైల్ ఫోన్ కలర్స్ మార్చుకోవచ్చు..
మీ ఫోన్ కలర్ బోర్ కొట్టేసిందా.. త్వరలోనే రంగులు మార్చుకోగలిగే కొత్త ఫోన్ రానుంది. షియోమీ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించి తమ కస్టమర్లకు శుభవార్త అందించింది.
Samayam Telugu | Updated:
Mar 31, 2018, 07:50PM IST
స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఎప్పటికప్పుడు మార్కెట్లో వచ్చే కొత్త మోడళ్లకు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. మురిపెంగా కొన్న ఫోన్ నెల తిరిగే సరికే బోర్ కొట్టడం, మరిన్ని ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఫోన్ రావడం లాంటి కారణాలతో తరచూ పాత ఫోన్లు అమ్మేసి, కొత్త ఫోన్లు కొంటూనే ఉంటారు. అయితే.. ఈ ఫోన్లు అమ్మేయడానికి ప్రధాన కారణాల్లో వాటి రంగు కూడా ఒకటి. మార్కెట్లోకి మంచి రంగు ఫోన్ విడుదలైతే.. జనం ఎగబడి కొంటారు. ఆ వెంటనే మంచి కలర్తో మరో ఫోన్ వస్తే.. ఫోన్ మార్చాల్సిందేనా? షియోమీ రెడ్ మీ యూజర్లకు ఇక ఈ పరిస్థితి ఉండదట. ఈ మొబైల్ సంస్థ త్వరలోనే రంగులు మార్చుకోగలిగే కొత్త ఫోన్ను తీసుకురానుందట. షియోమీ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించి తమ కస్టమర్లకు శుభవార్త అందించింది.
స్మార్ట్ఫోన్ల ప్రపంచంలో మొబైల్ కంపెనీలు తమ వినియోగదారులను ఆకట్టుకునేలా వారి అభిరుచులకు తగినవిధంగా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను తీసుకొస్తూనే ఉన్నాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ.. అదనపు హంగులతో కొత్త ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ విషయంలో శాంసంగ్, యాపిల్, షియామీ తదితర సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. | 1entertainment
|
amarraja
అమర్రాజా ఛైర్మన్ రామచంద్రకు ఎక్సెలెన్సీ అవార్డు
హైదరాబాద్, మే 10: అమర్రాజా గ్రూప్వ్యవస్థాపక ఛైర్మన్ డా.రామ చంద్ర ఎన్ గల్లాకు జీవితసాఫల్యపురస్కారం లభించింది. హెచ్ ఎంటివి న్యూస్ఛానెల్ నిర్వహించిన వేడుకల్లో బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డుల పురస్కారంలో రామచంద్రకు జీవనసాఫల్య పురస్కారం లభించింది. కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయల చేతులమీదుగా హెచ్ఎంటివి ఈ అవార్డులను బహూకరించింది. బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డులను ఏడుగురు సభ్యులున్న జ్యూరీ ఎంపికచేసింది. ట్రిపుల్ ఐటి ప్రొఫెసర్ రమేష్ లోగనాధన్, సిఐఐ, ఎఫ్ట్యాప్సీ, హైసియా, క్రెడా§్ు, ఐటి కంపెనీల నుంచి ఉన్న జ్యూరీ ఈ ఎంపికచేసింది. వందలాది నామినేషన్లు మొత్తం 14 రంగాలనుంచి వచ్చినట్లు హెచ్ఎంటివి వెల్లడించింది. మొత్తం 14వేల మంది ఉద్యోగులతో నికరంగా ఆరువేల కోట్ల రాబడులతో అమర్రాజా అత్యద్భుతపనితీరును చూపించింది. ఆమ్రాన్ బ్రాండ్ బ్యాటరీలతో మంచి మార్కెట్ నెట్వర్క్తో దూసుకుపోయింది. ఆహారశుద్ది, పారిశ్రామిక సేవలు, ఇన్ఫ్రా అభివృద్ధి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగాల్లో అమర్రాజాగ్రూప్ దశదిశలా వ్యాపించింది. | 1entertainment
|
sachin, kamble
అపూర్వ స్నేహితుడితో సచిన్
ముంబయి: పాఠశాల వయసులోనే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేసి వెలుగులోకి వచ్చారు. భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు. స్కూల్ టోర్నమెంట్లో భాగంగ జరిగిన ఓ మ్యాచ్లో ఈజోడి ఏకంగా 664 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి అప్పటి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆమ్యాచ్లో వినోద్ కాంబ్లీ 349పరుగులు చేయగా, సచిన్ టెండూల్కర్ 326 పరుగులతో నాటౌట్గా నిలిచారు. స్కూల్ క్రికెట్ నుంచి వీరి స్నేహం క్రమంగా భారత జట్టుకి ఆడేవరకు సాఫీగానే కొనసాగింది. కానీ…మధ్యలో ఏవో చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినట్లు వార్తలొ చ్చాయి. అయితే వాటిపై ఇద్దరూ సీరియస్గా స్పందించలేదు. తాజాగా సచిన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సచిన్: ఎ బిలినియర్ డ్రీమ్స్ చిత్రం విడుదల కావడంతో వినోద్ కాంబ్లీ తమ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ‘డియర్ మాస్టర్ బ్లాస్టర్…’ఐ లవ్ యూ అంటూ అందులో రాసుకొచ్చి స్నేహితుడిపై ప్రేమను కురిపించాడు. ఇద్దరూ కొంతకాలం భారత్ జట్టుకి ఆడినా…వ్యక్తిగత కారణాలతో వినోద్ కాంబ్లీ మధ్యలోనే కెరీర్కి స్వస్తి చెప్పేశారు. | 2sports
|
Hyderabad, First Published 25, Sep 2018, 2:35 PM IST
Highlights
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రం సంచలన కామెంట్స్ చేశారు.
ఆసియా కప్ లో తనదైన శైలిలో జట్టును విజయదిశగా నడిపిస్తున్న టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రం సంచలన కామెంట్స్ చేశారు. విరాట్ కోహ్లీలేకపోయినా..రోహిత్ శర్మ జట్టును అద్భుతంగా ముందుకు తీసుకువెళుతున్నాడన్నారు. పాక్తో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా.. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ శతకంతో చెలరేగడం తనను ఆకట్టుకుందని వసీం అన్నారు.
‘రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలను గొప్పగా నిర్వర్తిస్తున్నాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సులభంగా పరుగులు రాబడుతున్నాడు. ధావన్ కూడా అతనితో సమానంగా రాణిస్తున్నాడు. వీరిద్దరూ క్రీజులోకి వచ్చారంటే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు.’ అని వసీం అక్రమ్ ఒక మీడియా సంస్థతో తెలిపారు. కేవలం వసీం మాత్రమే కాదు.. రోహిత్ కెప్టెన్సీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
Last Updated 25, Sep 2018, 2:35 PM IST | 2sports
|
సెలక్షన్ కమిటీపై గంగూలీ అసంతృప్తి
Sourav Ganguly
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి వెస్టిండీస్ పర్యటనకు బీసీసీఐ సెలక్షన్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అన్ని ఫార్మాట్లకు ఒకే ఆటగాళ్లను ఎంపిక చేసే సమయం సెలక్షన్ కమిటీకి ఆసన్నమైంది. దీని వల్ల ఆటగాళ్లు మరింత విశ్వాసంతో రాణిస్తారు. శుభ్మన్ గిల్కు అవకాశం ఇవ్వకపోవడం, అజింక్య రహానెను టెస్టులకు మాత్రమే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. సెలక్షన్ కమిటీ మొత్తం మూడు ఫార్మాట్ల్లో ఒకే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని, అందరినీ సంతోషపరచడానికీ జట్టుని ఎంపిక చేయరాదని కేవలం కొంతమంది ఆటగాళ్లు మాత్రమే మూడు ఫార్మాట్ల్లో ఆడుతున్నారు. గొప్ప జట్లలో ఆటగాళ్లు స్థిరంగా ఉంటారు. అందర్నీ సంతోషపరచడానికి జట్టును ఎంపిక చేయకూడదు. దేశానికి ఉత్తమ జట్టుని అందివ్వాలి.’ అని బీసీసీఐని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/ | 2sports
|
Hyd Internet 194 Views SPICE CARD
SPICE CARD
న్యూఢిల్లీ: కార్డ్ స్వైపింగ్ సిస్టమ్ కారణంగా దేశంలోని బ్యాంకులు ప్రతి సంవత్సరం 3,800 కోట్లు నష్టపోతున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కార్డ్ స్వైపింగ్ మెషీన్లపై బ్యాంకులు పెడుతున్న పెట్టుబడి కారణంగానే ఈ నష్టం వస్తున్నట్లు ఒక సర్వేలో తేలిందని ఎస్బిఐ పేర్కొంది. జూలై లెక్కల ప్రకారం అన్ని బ్యాంకులకు కలిపి 28.4 లక్షల కార్డ్లు స్వైప్ మెషీన్లు ఉన్నాయని తెలుస్తుంది.డీమానిటైజేషన్కు ముందు కేవలం 15.1 లక్ష మెషీన్లు ఉండగా ఆ తరువాత ఇంచుమించుగా రెట్టింపయ్యాయి.ఇక ఎస్బిఐ విషయానికి వస్తే డిమానిటైజేసన్కు ముందు అంటే 2016 అక్టోబరు నాటికి 3.4 లక్షల మెషీన్లు ఉండగా ఈ సంవత్సరం జులై నాటికి అవి 6.13 క్షలకు చేరాయి.అయితే పిఒఎస్ మెషీన్ల ద్వారా నెలవారీ లావాదేవీలు సగటున నెలకు 150 ఖర్చు కావడం అలాగే డెబిట్ కార్డులపై ట్రాన్సాక్షన్ చార్జీలు పెరగడమే బ్యాంకుల నష్టాలకు కారణమని ఎస్బిఐ పేర్కొంది.కార్డు లావాదేవీను ప్రోత్సహించడంలో భాగంగా మరిన్ని పిఒఎస్ మిషిన్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని దీంతో బ్యాంకులు రోజుకు సగటున 5 వేల ఇఓఎన్లను తీసుకొస్తున్నాయని ఎస్బిఐ రిపోర్టు వెల్లడించింది. కాబటి పిఒఎస్ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం బ్యాంకులను కొన్ని రాయితీలు ఇవ్వాలని ఎస్బిఐ అభిప్రాయం వ్యక్తం చేసింది.ఇదిలాగే కొనసాగితే బ్యాంకులు తీవ్రంగా నష్టపోవడం ఖాయమని పేర్కొంది.దీన్నిబట్టి చూస్తే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకపోతే బ్యాంకులన్నీకలిసి వినియోగదారుల నుంచే తన నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడతాయని తెలుస్తుంది. | 1entertainment
|
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (గ్యాలరి)
First Published 24, Nov 2017, 6:58 PM IST
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
2 కంట్రీస్ సినిమా టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
Recent Stories | 0business
|
telugu titans
ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ విజయం
లఖ్నవూ: ప్రో కబడ్డీ ఐదో సీజన్లో భాగంగా వరుసగా ఏడు ఓటముల నమోదు చేసిన తెలుగు టైటాన్స్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఈసీజన్లో రెండో విజయం నమోదు చేసుకుంది.టోర్నీ ఆరంభంలో తొలి మ్యాచ్లో గెలిచిన టైటాన్స్ ఏడు ఓటములతో డీలా పడింది. గెలిచే అవకాశమున్న ప్రతి మ్యాచ్ను డిఫెండర్లు పొరపాట్లు చేయడంతో ఓటమలు పరంపరం కొనసాగింది. కానీ అదే డిఫెండర్లు 9వ మ్యాచ్లో కసిగా ఆడి విజయంలో కీలక పాత్ర పోషించారు. లక్నో బాబు బనారాసి దాస్ ఇండోర్ స్టేడియం వేదికగా యు మంబా జట్టుతో జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ ముంబాపై 37-32తేడాతో విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ 18 రైడ్ పాయింట్లు, 14 టాకిల్ పాయింట్లు, 4 ఆల్ అవుట్ పాయింట్లు, ఒక అదనపు పాయింటు సాధించగా…ముంబా జట్టు 18 రైడ్ పాయింట్లు, 9 టాకిల్ పాయింట్లు, 2 ఆల్ అవుట్ పాయింట్లు, 3 అదనపు పాయింట్లు సాధించింది. తెలుగు టైటాన్స్లో రాహుల్ చౌదరి అత్యధికంగా 13 పాయింట్లు సాధించగా…ముంబా జట్టులో అనూప్ కుమార్ అత్యధికంగా 9పాయింట్లు సాధించాడు. మ్యాచ్ తొలి అర్థభాగంలో తెలుగు టైటాన్స్ 19 పాయింట్లు, మలి అర్ధభాగంలో 18 పాయింట్లు సాధించగా…ముంబా జట్టు తొలి అర్థభాగంలో 15 పాయింట్లు, మలి అర్ధభాగంలో 17 పాయింట్లు సాధించడంతో తెలుగు టైటాన్ 5 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ముంబాను వణికించిన రాహుల్… రైడ్ మిషన్ రాహుల్ చౌదరి 13 రైడ్ పాయింట్లతో ముంబాను వణికించాడు. రెండుసార్లు సూపర్ రౌడ్స్ చేశాడు. ఇక డిఫెండర్ సోంబిర్ 7 ప్రయత్నాల్లో 8టాకిల్ పాయింట్లు సాధించాడు. అందులో ఒక సూపర్ ట్యాకిల్ కూడా ఉంది. తొలి అర్థభాగంలో మెరుగ్గా ఆడటంతో టైటాన్స్ 19-15తో నిలిచింది. ఆ తర్వాత 27-18తో పూర్తి ఆధిక్యంలో నిలిచింది. ఈదశలో టైటాన్స్ సారథి రాహుల్ అనవసరంగా డూఆర్డై రైడ్కు పోయి చిక్కడంతో ముంబా చెలరేగింది. 27-27తో స్కోరు సమం చేసింది. తెలుగు టైటాన్స్ ఆలౌట్ ప్రమాదంలో చిక్కుకున్నా డిఫెండర్లు రైడర్లు తెలివిగా ఆడటంతో 37-32తో విజయం సాధించింది. | 2sports
|
Hyderabad, First Published 10, Jul 2019, 5:59 PM IST
Highlights
చిత్ర పరిశ్రమకు సంక్రాంతి కాసులు కురిపించే సీజన్. ప్రతి ఏటా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి చూస్తుంటాం. సాధారణ సీజన్లో స్టార్ హీరోల సినిమాలు తక్కువ గ్యాప్ లో విడుదలైతే వసూళ్లపై ప్రభావం ఉంటుంది.
చిత్ర పరిశ్రమకు సంక్రాంతి కాసులు కురిపించే సీజన్. ప్రతి ఏటా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి చూస్తుంటాం. సాధారణ సీజన్లో స్టార్ హీరోల సినిమాలు తక్కువ గ్యాప్ లో విడుదలైతే వసూళ్లపై ప్రభావం ఉంటుంది. కానీ సంక్రాంతికి మాత్రం ఆ ప్రభావం కనిపించదు. సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ విడుదలైన ప్రతి చిత్రానికి మంచి ఆదరణ ఉంటుంది.
అందుకే నిర్మాతలు తమ చిత్రాలని సంక్రాంతి బరిలో నిలిపేందుకు ఆరు నెలల ముందుగానే రిలీజ్ డేట్స్ ప్రకటిస్తుంటారు. 2020 సంక్రాంతి బరిలో నిలిచిన తొలి చిత్రం సూపర్ స్టార్ మహేష్ దే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్నట్లు దిల్ రాజు ఇదివరకే ప్రకటించారు.
తాజాగా మరో భారీ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి సమరం రంజుగా మారబోతోంది.
Important update for all the fans and film lovers regarding #AA19 .
The #TrivikramSrinivas directorial starring Stylish Star @alluarjun and @hegdepooja will release for Sankranthi 2020.
— Haarika & Hassine Creations (@haarikahassine) July 10, 2019
Last Updated 10, Jul 2019, 5:59 PM IST | 0business
|
ప్రభాస్ పక్కన మరొకరిని రానివ్వదేమో.. సాహోలో కూడా..
Highlights
ప్రబాస్ తో హిట్ పెయిర్ అనిపించుకున్న అనుష్క
బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో ప్రభాస్ సరసన నటించిన అనుష్క
తాజాగా సాహో చిత్రంలోనూ తనే హీరోయిన్ అని వినిపిస్తోంది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవ్వలేదని బయటికి అంటున్నారు. బాలీవుడ్ భామలు పరిణితి చోప్రా అని, కత్రినీ కైఫ్ అని, శ్రద్ధా కపూర్ అని ఇలా చాలా పేర్లు వినిపించాయి. కాని అసలు విషయం ఏంటంటే ప్రభాస్ పక్కన మళ్లీ అనుష్కకే ఛాన్స్ ఇచ్చినట్టు ఎక్స్ క్లూజివ్ సమాచారం. బాహుబలిలో దేవసేనగా అదరగొట్టిన అనుష్క మరోసారి ప్రభాస్ తో రొమాన్స్ కు రెడీ అయ్యింది.
బాహుబలి రిలీజ్ రోజునే సాహో టీజర్ థియేటర్లలో వదలగా అప్పటికి హీరోయిన్ ను ఫైనల్ చేశారట. ప్రభాస్ పక్కన ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా మళ్లీ అనుష్కకే ఆ ఛాన్స్ వచ్చింది. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలతో సూపర్ హిట్ పెయిర్ గా ప్రశంసలు అందుకున్న ప్రభాస్, అనుష్కలు సాహోలో కూడా సర్ ప్రైజ్ ఇవ్వనుందని తెలుస్తోంది.
రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎయిర్ ఫైట్ లాంటి అంశాలను పెట్టి ఇదో హాలీవుడ్ రేంజ్ లో సినిమా అప్పియరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ లో ఆ మేరకు షాట్స్ కట్ చేసిన టీమ్.. బాహుబలితో నేషనల్ వైడ్ మార్కెట్ ఏర్పరచుకున్న ప్రభాస్.. సాహోని కూడా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తే కలెక్షన్స్ వర్షం కురిపిస్తాడని భావిస్తున్నారు.
Last Updated 25, Mar 2018, 11:45 PM IST | 0business
|
Hyderabad, First Published 16, Apr 2019, 6:10 PM IST
Highlights
ఎలక్షన్స్ కి ముందు ఆమె పై ఎన్ని కథనాలు వచ్చినా స్పందించని పూనమ్ ఎన్నికల అనంతరం సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
పూనమ్ కౌర్ కి సంబందించిన వార్తలు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పేరును కూడా ఇరికించిన విషయం విదితమే. అయితే ఎలక్షన్స్ కి ముందు ఆమె పై ఎన్ని కథనాలు వచ్చినా స్పందించని పూనమ్ ఎన్నికల అనంతరం సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
తన పేరును ప్రస్తావిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అదే విధంగా తనను మానసికంగా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ పై నెగిటివ్ కామెంట్స్ చేయకున్నా ఎదో రకంగా పవన్ ప్రస్తావన తెస్తూ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసిన పూనమ్ తెలియకుండానే వైరల్ అయ్యింది.
ఇక ఎలక్షన్ దగ్గరపడుతున్న సమయంలో పవన్ గురించి ఆమె ఫోన్ లో మాట్లాడినట్లు కొందరు ఒక ఆడియో టేప్ ను సృష్టించడం అందరికి తెలిసిందే. ఆ వీడియో ఫెక్ అని అందరికి తెలిసినా పూనమ్ పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. ఇక పవన్ పై నెగిటివ్ కామెంట్ చేస్తూ ఇతరులు ఆమె పేరు ప్రస్తావించినా స్పందించలేదు.
పుకార్లు పుట్టి నెలలు గడిచింది. పుచ్చిపోయి అందరూ మరచిపోయాక ఆమె కేసు వేయడం గమనార్హం. అయితే ఫైనల్ గా ఇప్పుడు పూనమ్ ఎన్నికల ముందు అసత్య ప్రచారాలు చేసినందుకు కేసు వేసిందా? లేక ప్రస్తుతం ఆమెను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నందుకు పోలీసులను ఆశ్రయించిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘భరత్ అనే నేను’ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది!
‘భరత్ అనే నేను’ మూవీ పాటల సందడికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ప్రిన్స్ మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీలో మహేష్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
Samayam Telugu | Updated:
Mar 23, 2018, 08:49PM IST
‘భరత్ అనే నేను’ మూవీ పాటల సందడికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ప్రిన్స్ మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీలో మహేష్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో పొలిటికల్ హీట్ నడుస్తున్న సందర్భంలో మహేష్ పొలిటికల్ డ్రామా మూవీ ‘భరత్ అనే నేను’కి ప్రాధాన్యత సంతరించుకుంది.
‘శ్రీమంతుడు’ సినిమాలో పుట్టిన ఊరి కోసం ఏదైనా చేయాలంటూ సోషల్ మెసేజ్ ఇచ్చిన మహేష్.. ఈ మూవీలో సొసైటీ అంటే భయం, బాధ్యత ఉండాలంటూ ‘భరత్ అనే నేను’ టీజర్లోనే ఈ మూవీ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు. జనవరి 26న విడుదలైన ఫస్ట్ వోథ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహేష్ వాయిస్ ఇప్పటికే రింగ్టోన్స్, కాలర్ ట్యూన్స్గా సందడి చేస్తుండగా.. ఈ మూవీ సాంగ్స్ను ఒక్కొక్కటిగా విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది చిత్రయూనిట్.
X
‘భరత్ అనే నేను’ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ను మార్చి 25 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్టు తెలిపే పోస్టర్ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్లో మహేష్ బాబు న్యూ లుక్లో మెరిసిపోతున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. ఆదివారం నాడు విడుదల కాబోతున్న ఫస్ట్ సాంగ్కు హరిరామజోగయ్య లిరిక్స్ అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. ఏప్రిల్ 20న భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ‘భరత్ అనే నేను’.
Launching our First Single from #BharatAneNenu, #TheSongOfBharatOn25th https://t.co/LAxylKzWjB
— Mahesh Babu (@urstrulyMahesh) 1521811930000 | 0business
|
Hyd Internet 125 Views eaden gardens stadium
eaden gardens stadium
కోల్కతా: భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే కోల్కతా వేదికగా గురువారం జరగనున్న మ్యాచ్కు వరుణిడి రూపంలో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో శనివారం వరకు కోల్కతాలో వాతావరణం మేఘావృతమై ఉండనుంది. వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. దీంతో మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. గతంలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం డ్రైనేజీ, అవుట్ ఫీల్డ్ సమస్యలను ఎదుర్కోవడం కూడా కలవరపెడుతోంది. కొన్నేళ్ల క్రితం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఐపిఎల్ మ్యాచ్ను రద్దు చేశారు. అదొక్కటే కాదు సౌతాఫ్రికాతో జరగాల్సిన ఓ టీ20 మ్యాచ్ కూడా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో రద్దయ్యింది. కానీ బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించాక పరిస్థితిలో మార్పు వచ్చింది. హోవర్ కవర్గా పిలిచ్ పిచ్ కవర్ను గంగూలీ ఇంగ్లాండ్ నుంచి తెప్పించాడు. వర్షం నీరు నిలవకుండా ఉండేందుకు తగిన మార్పులు చేపట్టారు. నీటిని పీల్చే సూపర్ సోప్పర్లను తెప్పించారు. బుధవారం నుంచి శనివారం వరకు నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. చిరుజల్లులు మ్యాచ్కు ఏ మాత్రం ఆటంకం కలిగించవని క్యాబ్ గ్రౌండ్ కమిటీ హెడ్ దేబబ్రతా దాస్ తెలిపారు. నాలుగు గంటల పాటు వర్షం కురిసినా కూడా 20 నిమిషాల్లో నీటిని బయిటకు తోడేస్తామని ఆయన ధీమాగా చెప్పారు. పిచ్ కవర్లపై నిలిచిన నీటిని పీల్చే యంత్రాలను తెప్పించామని ఆయన తెలిపారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచి పోకుండా ఉండేందుకు అత్యాధునిక యంత్రాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఇటీవలే శ్రీలంక సొంతగడ్డ మీద భారత్ చేతిలో వైట్ వాష్కు గురైంది. చండీమాల్ నాయకత్వం లోని లంక జట్టు మాథ్యూస్, రంగన హెరాత్పై అధికంగా ఆధారపడుతోంది. గత 35 ఏళ్లలో ఆ జట్టు భారత గడ్డ మీద 16 టెస్టులు ఆడిన ప్పటికీ… ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించ లేకపోయింది. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పీడబ్ల్యూసీ చేతికి పీఎన్బీ కుంభకోణం వ్యవహరం
2011 నుంచి నిర్వహించిన పలు ఖాతాలను స్క్రుటినీ చేయనున్నారు. అంతే కాకుండా ఏ విధంగానైనా నీరవ్ మోదీని ఏ విధంగానైనా ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా గుర్తించేందుకు అవసరమైన ఆధారాలను సేకరించేందుకు పీఎన్బీ అడుగులు వేస్తోంది.
TNN & Agencies | Updated:
Feb 24, 2018, 12:35PM IST
పీఎన్బీ కుంభ‌కోణం విచార‌ణ‌కు పీడ‌బ్ల్యూసీ
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పిఎన్‌బి)లో చోటు చేసుకున్న దాదాపు రూ.11,500 కోట్ల కుంభకోణంపై ఆడిటర్‌ పిడబ్ల్యుసి విచారణ జరపనుందని సమాచారం. ఆర్ధిక నేరగాళ్లు నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ చేసిన ఘరాన మోసంపై ప్రైస్ వాట‌ర్ కూప‌ర్(పీడ‌బ్ల్యూసీ) ఆధారాలు సేకరించి ఇవ్వనుందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా అంతర్జాతీయ ఆర్ధిక నేరాలపై పీడ‌బ్ల్యూసీ విచారణ చేస్తుంది. నీరవ్‌ మోసాలపై బ్యాంకు 15 పాయింట్లతో కూడిన ప‌త్రాల‌తో కూడిన‌ పనిని ఫిబ్రవరి 21న పీడ‌బ్ల్యూసీకి అందజేసిందని స‌మాచారం. ఇందులో ముఖ్యంగా నీరవ్‌ మోడీకి బ్యాంకర్లు ఎల్‌ఒయు ఎలా అందజేశారు. దీన్ని మోడీ ఎలా తప్పుడుగా వాడుకున్నాడు అనే దానిపై విచారణ చేయనుంది. అదే విధంగా మోడీ కంపెనీ బ్యాలెన్స్‌ షీట్స్‌, రికవరీ అప్పులు, ఆయన ఆస్తులపై పిడబ్ల్యుసి ఆడిటింగ్‌ చేయనుంది. ఈ విషయమై పీఎన్‌బీ పీడ‌బ్ల్యూసీలు స్పందించలేదు.
నష్టంపై అంచనా..
ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న పీడ‌బ్ల్యూసీ యూనిట్‌కు దినేష్‌ ఆనంద్‌ హెడ్‌గా ఉన్నారు. ఈ సంస్థ మోడీ గ్రూపునకు చెందిన ఐదు సంస్థలు ఫైర్‌స్టార్‌ డైమాండ్స్‌, ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌, సోలార్‌ ఎక్స్‌పోర్టు, స్టెల్లర్‌ డైమాండ్‌, డైమాండ్‌ఆర్‌ హజ్‌లపై విచారణ చేయనుంది. 2011 నుంచి ఆ కంపెనీ ఆర్ధిక లావాదేవీలను విశ్లేషించనుంది. ఆ కంపెనీ బ్యాలెన్స్‌ షీట్లలో చూపని ఆస్తులు, బోగస్‌ లావాదేవీలను గుర్తించడం చేయనుంది. మోడీ వల్ల బ్యాంకుకు ఎంత నష్టం జరిగిందో అంచనా వేయనుంది. ఈ సమాచారాన్ని సీబీఐతోనూ ఆ సంస్థ పంచుకోవడం ద్వారా మోడీ, ఆయన సంస్థలు, అనుచరులపై కోర్టులో వ్యతిరేకంగా ఆధారాలు ప్రవేశపెట్టనుంది. అదే విధంగా అంతర్జాతీయ బ్యాంకింగ్‌ విధానంలో ఎలా బలోపేతం కావాలో పీఎన్బీకి పీడ‌బ్ల్యూసీ సూచించే అవ‌కాశం ఉంది. | 1entertainment
|
- చమురు ధరల్లో కరెక్షన్తో కొత్త ఊపు
- లాభాల్లో నిలిచిన అన్ని రంగాల స్టాక్స్
- 262 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్్
- 10,605 పాయింట్ల ఎగువకు నిఫ్టీ
ముంబయి: ముడి చమురు ధరల్లో కరెక్షన్, రూపాయి బలపడటం తదితర అనుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్మార్కెట్లు వారాంతంలోనూ మురిశాయి. దేశీయ, అంతర్జాతీయల అనుకూలతల నేపథ్యంలో సూచీలు గురువారం నాటి జోష్ను శుక్రవారం కూడా కొనసాగించాయి. గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు కిందకి పడిపోయాయి. రష్యా నుంచి ఆయిల్ సప్లై పెరుగుతుందనే సంకేతాలతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3 శాతం పడిపోయి బ్యారల్కు 78 డాలర్లుగా నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారల్కు 80.50 డాలర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు రూపాయి విలువ కూడా వరుసగా రెండో రోజు బలపడింది. 18 నెలల కనిష్టస్థాయిల నుంచి 55 పైసల వరకు లాభపడి రూ.67.79గా నమోదైంది. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్సియల్, చమురు, మెటల్స్, టెక్నాలజీ స్టాక్స్ మార్కెట్కు మద్దతునిచ్చాయి. శుక్రవారం ఉదయం 60 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరి వరకూ లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం వరకు అదే జోరును కొనసాగిస్తూ.. చివరికి 261.76 పాయింట్లు లాభపడి 34,924.87 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 91.30పాయింట్లు లాభపడి 10,605.15వద్ద ముగిసింది. శుక్రవారం నాటి ట్రేడింగ్లో సూచీలు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 2 శాతం వరకు ర్యాలీ కనబరచడం విశేషం. శుక్రవారం నాటి మార్కెట్లో అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ట్రేడవ్వడం విశేషం. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు లాభాల బాట కొనసాగించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, ఐబీ హౌసింగ్, హిందాల్కో, హెచ్పీసీఎల్, బజాజ్ ఫిన్, ఓఎన్జీసీ, గెయిల్, టాటా స్టీల్, యస్బ్యాంక్, బీపీసీఎల్లు 5.4-2.7 శాతం లాభపడగా.. ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ 1-0.5 శాతం మధ్య నష్టాలలో ముగిశాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఐటీ రిటర్నుల ఫైలింగ్ ఏడాదిలో 16.3% పెరిగింది
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో మంచి పురోగతి కనబడింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాథమిక లెక్కలను కేంద్రం విడుదల చేసింది.
TNN & Agencies | Updated:
Apr 4, 2018, 03:03PM IST
ఐటీ రిటర్నుల్లో మంచి వృద్ది
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో మంచి పురోగతి కనబడింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాథమిక లెక్కలను కేంద్రం విడుదల చేసింది. దాని ప్రకారం 2017-18లో 6.84 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ చేశారు. అదే అంతకుముందు సంవత్సరం కేవలం 5.43 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. 2016-17 సంవత్సరంతో పోలిస్తే గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్ 26% వృద్దిని కనబరిచింది. ఎక్కువ మంది కొత్తగా(మొదటిసారి) రిటర్నులు ఫైల్ చేయడం వల్లే ఈ పురోగతి కనబడ్డట్లు తెలుస్తోంది.
2017-18 ఆర్థిక సంంవత్సరంలో మార్చి 30 నాటికి కొత్తగా ఐటీ రిటర్నులు ఫైల్ చేసినవారి సంఖ్య 99.49 లక్షలకు పెరిగింది. అదే 2016-17లో కొత్తగా ఐటీ రిటర్నులు ఫైల్ చేసిన 85.51లక్షలతో పోలిస్తే 16.3% వృద్ది కనబడినట్లు లెక్క. ఇంకా 2017-18 సంవత్సరంలో ఐటీ రీఫండ్లు దాదాపు 1.49 లక్షల కోట్లకు చేరాయి. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Prabhas : బాక్సాఫీస్ `బాహుబలి` బర్త్ డే స్పెషల్
ఒక్కో హీరోకి కొంతమంది అభిమానులు ఉంటారు. కానీ అందరు హీరోల అభిమానులు ప్రభాస్ను ఇష్టపడతారు అన్న పేరుతెచ్చుకున్న డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్డే విషెస్ తెలియజేస్తోంది సమయం.
Samayam Telugu | Updated:
Oct 23, 2019, 08:26AM IST
ప్రభాస్...ఈ పేరుని అభిమానించే వాళ్ళు తక్కువ. ప్రేమించే వాళ్ళు ఎక్కువ. అందుకే డార్లింగ్ అనే పదాన్ని తన ఇంటిపేరుగా మార్చుకోగలిగాడు. అతని ముద్దుపేరు కూడా అదే. మారుపేరు అన్నా తప్పులేదు. ఇలా డార్లింగ్ అనే పదాన్ని దత్తత తీసుకున్న స్వీటెస్ట్, స్ట్రాంగెస్ట్, క్రేజియెస్ట్ స్టార్ హీరో ఆఫ్ టాలీవుడ్ ప్రభాస్కి ముందుగా హ్యాపీ బర్త్ డే ఫ్రమ్ సమయం తెలుగు. సాహోరే ప్రభాస్.
ప్రభాస్...ఆ ఆరడుగుల కట్ అవుట్ కి సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా భారీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కానీ దాన్ని వాడుకోకుండా గ్రౌండ్ లెవెల్ నుండే తన జర్నీ మొదలు పెట్టాడు. అవకాశాలకోసం అన్వేషించాడు, కానీ ఆ అవకాశం అందినప్పుడు మాత్రం అలుపెరగకుండా శ్రమించాడు. డిక్షనరీలో డెడికేషన్ అనే పదానికి అర్ధంగా ప్రభాస్ పేరు చేర్చాలని అంటుంటారు అతనితో పనిచేసిన డైరెక్టర్స్. ఇది వినడానికి కాస్త అతిశయోక్తిగా అనిపించినా ప్రభాస్ కష్టపడే తీరు చూస్తే అది నిజం అని ఒప్పుకుని తీరుతాం. అలాగే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఇప్పడు బాహుబలిగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందితో సాహో అనిపించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ పేరుతో ఉన్న రికార్డ్స్ మరే ఇతర తెలుగు హీరోకి లేవు అనేది మాత్రం ఎవరయినా ఒప్పుకుని తీరాల్సిన నిజం.
ప్రభాస్ అనే పేరుకి ఇప్పడు ఇండియన్ మార్కెట్లో, అలాగే వరల్డ్ మార్కెట్లో ఉన్న గుర్తింపు, పాపులారిటీ చూస్తే అసలు ఇతను ఇక సాధారణ తెలుగు హీరోనా అనిపిస్తుంది. నిజమే అతను సాధారణ తెలుగు హీరో కాదు, అసాధారణ తెలుగు హీరో. 100 కోట్ల వసూళ్లు సాధిస్తే గొప్పగా చెప్పుకునే టాలీవుడ్లో 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు వంటి మైలు రాళ్లను సునాయాసంగా దాటి ఇండియా లోనే అత్యధిక వసూళ్లు సంపాదించిన సెకండ్ సినిమాగా నిలిచిన కలెక్షన్ల సునామి బాహుబలి హీరో అతను. రాజమౌళి మామూలుగా మాటలతో చెప్పిన కథను నమ్మి హై రేంజ్లో ఉన్న తన కెరీర్లో 5 సంవత్సరాలు ఒకే సినిమా కోసం కేటాయించడం అనేది సామాన్యమైన సాహసం కాదు. అందుకే కేవలం మాహిష్మతి మాత్రమే కాదు మొత్తం ప్రపంచమంతా బాహుబలి అంటూ నినాదాలు చేసి జేజేలు కొట్టింది.
ప్రభాస్
ఇప్పడు టాలీవుడ్లో సినిమాకి సంబందించిన ఏ రికార్డ్ అయినా కూడా నాన్ బాహుబలి అనే క్యాటగిరిలో లెక్కిస్తున్నారు. ఆ సినిమా దరిదాపుల్లోకి వెళ్లే సినిమా ఇప్పట్లో అయితే వచ్చే అవకాశం లేదు అనేది అక్షర సత్యం. బాహుబలి విజయకేతనం ఎగరవెయ్యడం వెనుక ప్రభాస్ కష్టం ఎంత ఉంది అనేది యూనిట్లో ప్రతీ ఒక్కరికి తెలుసు. ఒకే సినిమా కథపై అన్ని సంవత్సరాలు ఫోకస్గా, డేడికేటెడ్గా పనిచెయ్యడం..... పూర్తిగా దానికి అంకితమైపోవడం చెప్పుకున్నంత తేలిక కాదు. ఊహించినంత చిన్న విషయం కాదు. సుదీర్ఘంగా సాగిన బాహుబలి మహాప్రస్థానంలో కొన్ని సార్లు ఢీలా పడిన రాజమౌళికే తన పాజిటివిటీతో ధైర్యం చెప్పి, వెన్ను తట్టి అండగా నిలబడ్డాడు. అయిదు సంవత్సరాలపాటు కంటికి సరిపడా నిద్ర, వంటికి సరిపడా తిండి లేకుండా శ్రమించి ప్రభాస్ సాధించుకున్న వెలకట్టలేని ఖ్యాతి కిరీటం బాహుబలి విజయం.
బాహుబలికి ముందు కూడా ప్రభాస్ స్టార్ హీరోనే. కానీ అతను మొదలుపెట్టిన స్థానం, స్థాయి నుండి చూస్తే అతి తక్కవ కాలంలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈశ్వర్ అనే సినిమాతో 2002లో తెరంగేట్రం చేసాడు ప్రభాస్. కృష్ణం రాజు గారి తమ్ముడు కొడుకు, అరగడుగుల హైట్ ఉన్నాడు, మంచి బాడి బిల్డర్.... మొదటి సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రభాస్ బయోగ్రఫీ ఇదే. అక్కడినుండి ఒక్కో అడుగు వేసుకుంటూ, విజయాలు అందుకుంటూ బాహుబలి దాకాచేరిన ప్రస్థానంలో ప్రభాస్ నమ్మకుంది తన కష్టం, ఆ కష్టం తన అభిమానులు ఇష్టపడేలా ఉండడం. ఈశ్వర్, రాఘవేంద్ర.. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్కి అలవాటు పడ్డారు జనం. కానీ అతనికి ఒక ఇమేజ్ అంటూ లేదు. ఎలాంటి సినిమా చేస్తాడు అనే ఐడియా అంతకంటే లేదు. దాంతో అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న ప్రొడ్యూసర్ MS రాజు ప్రభాస్ హీరో గా వర్షం అనే సినిమా తీశారు. సంక్రాంతికి థియేటర్స్ లోకి వచ్చిన వర్షం బాక్స్ ఆఫీస్ ని కలెక్షన్ల వర్షంలో ముంచెత్తింది. సిల్వర్ స్క్రీన్ పై ఆరడగుల హైట్తో ప్రభాస్ చేసిన డాన్సులు, ఫైట్స్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ అనే గ్రూప్ క్రియేట్ అయిపోయింది.
ప్రభాస్
వర్షం సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్రేక్ అందుకున్న ప్రభాస్ అనేకమంది కమర్షియల్ డైరెక్టర్స్ దృష్టిలో పడ్డాడు. అలా అప్పట్లో స్టార్ డైరెక్టర్గా వెలుగొందుతున్న బి.గోపాల్ ఒకప్పటి సూపర్ హిట్ సినిమా అయిన అడవిరాముడు పేరుతో ప్రభాస్తో సినిమా స్టార్ట్ చేసాడు.సినిమా పేరులానే ఆ సినిమా కథ కూడా పాతవాసనలతో కూడిన ఒక లవ్ స్టోరీ. ఇక ఫిక్స్డ్ హీరోయిన్స్తో సినిమాలు తీసే అలవాటు ఉన్న బి.గోపాల్ ఆర్తి అగర్వాల్ని హీరోయిన్గా తీసుకున్నాడు. ఆ సినిమా వరకు ప్రభాస్తో ఆమె పెయిర్ కాస్త ఆడ్గా అనిపించింది. అలా అనేక రాంగ్ రీజన్స్తో ఆ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన చక్రం కాస్త డిఫరెంట్ సినిమా అయినప్పటికీ ప్రభాస్కి నప్పే సబ్జెక్ట్ కాదు అని ఆడియన్స్ తీర్పు ఇచ్చారు. ఆ రెండు సినిమాలు నటుడిగా ప్రభాస్కి ఇంకాస్త ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇవ్వగలిగాయి.
హైట్ ఉన్న హీరోకి వెయిట్ ఉన్న డైరెక్టర్ జతకలిస్తే ఆ కాంబో ఎలా ఉంటుంది, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, అన్న విషయం ఛత్రపతి ప్రూవ్ చేసింది. అప్పటివరకు అన్ని రకాలుగా కట్టుకున్న ప్రభాస్ కి అతని వాయిస్ చిన్న మైనస్. ఎప్పుడూ కూడా హీరో స్ట్రెంగ్త్స్ తో తన కథను ఎలివేట్ చేసే రాజమౌళి ప్రభాస్ కోసం తక్కువగా మాటలు ఉండేలా ఒక కథను డిజైన్ చేసుకున్నాడు. ఆ సినిమా మొత్తంలో ప్రభాస్ మాట్లాడే నాలుగు సీన్స్ మాత్రమే సినిమాకి హార్ట్. మిగిలిసిన సినిమా అంతా కూడా ప్రభాస్ ఆరాతో నడిచిపోతుంది. ఇక ఫైట్స్ అండ్ డాన్సులు ఎలాగూ దుమ్ము లేచిపోయాయి. దాంతో ఛత్రపతి వీరంగానికి బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేకుండా పోయింది. అప్పటిలెక్కల్లో 8 కోట్లతో తెరకెక్కిన ఛత్రపతి 22 కోట్లు కలెక్ట్ చేసి విజయగర్వంతో మీసం తిప్పాడు.
ప్రభాస్
ప్రభాస్ పాదరసం లాంటి ఆర్టిస్ట్, ఏ పాత్ర కమిట్ అయితే ఆ రకంగా మేకోవర్ అయిపోతాడు. అందుకే ఛత్రపతి లాంటి హెవీ యాక్షన్ మోడ్ మూవీ తరువాత పౌర్ణమి అనే లైటర్ లవ్ స్టోరీ ఎంచుకున్నాడు. అయితే ఆ సినిమా ప్రభాస్కి మిస్ ఫిట్ అయ్యింది. అంతకుముందు ఛత్రపతి లో ప్రభాస్ పాత్ర అందరికి కళ్ళముందు మెదులుతుంది.అలాంటి టైం లో రకరకాలుగా ఉన్న ప్రభాస్ పాత్ర, తెలుగు నేటివిటీకి దూరంగా ఉన్న లొకేషన్స్ అండ్ సీన్ ట్రీట్మెంట్స్ పౌర్ణమికి శాపంగా మారాయి. హెవీ హైప్ తో థియేటర్స్ లోకి వచ్చిన ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది.
వరుస హిట్స్ తో మంచి ఊపుమీదున్న దిల్ రాజు నిర్మాత. యూత్లో మంచి క్రేజ్ ఉన్న ఇలియానా హీరోయిన్. మరో పక్క హారిస్ జై రాజ్ ఇచ్చిన మనసా సాంగ్ వేవ్స్ క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ అండ్ టీజర్ లో ప్రభాస్ స్టైలింగ్ చూస్తే హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ట్రైలర్ లోనే వంశీ షాట్ డివిజన్ అండ్ టేకింగ్ ఆకట్టుకుంది. ఇక ఇది హిట్టు బొమ్మ అనే రేంజ్లో థియేటర్స్ లోకి వచ్చింది మున్నా. ఏదో చేశాడు అనుకున్న మున్నా కేవలం తన తండ్రిమీద రివెంజ్ తీర్చుకుంటాడు అనగానే ఆడియన్స్ డిసపాయింట్ అయ్యారు. అలా అని మున్నా బ్యాడ్ ఫిల్మ్ కాదు. దానివెంటనే హీరోల యాటిట్యూడ్ మేకోవర్ స్పెషలిస్ట్ పూరిజగన్నాథ్తో బుజ్జిగాడు సినిమా చేసాడు ప్రభాస్. ప్రభాస్ డెసిషన్స్ లో అది చాలా క్రూషియల్. అప్పటివరకు ప్రభాస్ లో ఎవ్వరూ చూపించని కామెడీ టైమింగ్ ని ఫస్ట్ టైం షో కేస్ చేసాడు పూరి. ముందు ఆ సినిమాలో శ్రియ హీరోయిన్ కానీ బిజీ వల్ల ఆమె తప్పుకోవడంతో త్రిష ముచ్చటగా మూడోసారి ప్రభాస్ తో జతకట్టింది. చివరికి చిట్టి చిట్టి అంటూ డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు బుజ్జిగాడు.
ప్రభాస్
బుజ్జిగాడు సినిమా నుండి కాస్త మెచూరిటీ ఉన్న కథలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు ప్రభాస్. సినిమా సినిమాకి కథతో పాటు తన లుక్ అండ్ యాటిట్యూడ్ కూడా కొత్తగా ఉండేలా చూసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఆ స్టెప్ ప్రభాస్ కి బాగా ఉపయోగపడింది. యాక్షన్ సినిమా అయినా కూడా స్టైలింగ్ మాత్రం చాలా క్లాస్ గా ఉండేలా మెయిన్టైన్ చేసాడు. దాంతో ప్రభాస్ కి క్లాస్ ఆడియన్స్ అండ్ లేడీస్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆ టైం లో తన హోమ్ బ్యానర్ గోపికృష్ణ మూవీస్ లో బిల్లా అనే స్టైలిష్ యాక్షన్ మూవీ చేసాడు ప్రభాస్. ఆ సినిమాలో ప్రభాస్ లుక్స్ కిల్లింగ్ అనే చెప్పాలి. ప్రభాస్ మ్యానరిజమ్స్ ని ఆ సినిమాలో షోకేస్ చేసినంతగా వేరే ఏ సినిమాలో కూడా చేసిఉండరు. ఇక ప్రభాస్ ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఒక పక్క ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ డాన్ గా, మరో పక్క విలేజ్ లో చిల్లరదొంగగా టోటల్ వేరియేషన్ తో నటించి మెప్పించాడు. ఆ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ కి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అయితే అంతకుముందు పనిచేసిన పూరి తో మళ్ళీ ఏక్ నిరంజన్ సినిమా చేసాడు ప్రభాస్.అయితే ఆ సినిమా మాత్రం ఫస్ట్ వీక్ ఎండ్ వరకు 21 కోట్లు కొల్లగొట్టి ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ వీక్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచినా సెకండ్ వీక్ నుండి వీక్ అయ్యి యావరేజ్ అనిపించుకుంది.
ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ని మార్చి, అతనికి ఒక కన్సిస్టెంట్ ఇమేజ్ ని ఇచ్చిన సినిమా డార్లింగ్. ఆ సినిమాలో ప్రభాస్ స్టైలింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కాజల్ తో ప్రభాస్ పెయిరింగ్ అదిరిపోయింది. ఆ సినిమాలో ఒక పక్క లవర్ బోయ్ గా క్లాస్ లుక్ తో అలరిస్తూనే మరోపక్క యాక్షన్ తో కూడా దుమ్ములేపాడు. ఆ సినిమా ముందు వరకు ప్రభాస్ పేరుముందు ఉన్న యంగ్ రెబెల్ స్టార్ బిరుదును డార్లింగ్ రీప్లేస్ చేసింది. అప్పటినుండి ప్రభాస్ కి అభిమానులు,అభిమానులకు ప్రభాస్ కూడా డార్లింగ్ ఫరెవర్ గా ఫిక్స్ అయిపొయింది. ఆ వెంటనే మళ్ళీ కాజల్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేసి క్లాస్ అండ్ మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ కెరీర్ లోనే అవుట్ అండ్ అవుట్ లైవ్లీ మూవీ గా నిలిచింది మిస్టర్ పర్ఫెక్ట్. 15 సెంటర్స్ లో 100 రోజులు ఆడిన ఆ సినిమా 30 కోట్లవరకు కలెక్ట్ చేసింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విజయంతో ప్రభాస్ ఎలాంటి సినిమా అయినా చెయ్యగలడు అని, అతను ఏ సినిమా చేసినా కూడా బావుంటే ఏ కంప్లైంట్ కూడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అని ప్రూవ్ అయ్యింది.
ప్రభాస్
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఊపుమీదున్న ప్రభాస్ కి స్పీడ్ బ్రేకర్ లా నిలిచింది రెబెల్. క్లాస్ మూవీస్ చేసిన ప్రభాస్ చేంజ్ ఓవర్ కోసం చేసిన రెబెల్ కమర్షియల్ గా ఓకే అనిపించినా నటుడిగా ప్రభాస్ కి ఎలాంటి గుర్తింపు తీసుకురాలేదు. అయితే ఆ తరువాత రైటర్ గా ఉన్న కొరటాల కి డైరెక్టర్ గా ప్రొమోషన్ ఇస్తూ మిర్చి సినిమా చేసాడు. ఆ సినిమాలో ప్రభాస్ నటన అవుట్ స్టాండింగ్.ఎమోషన్స్ ని ప్రభాస్ అంత బాగా పండించగలడు అని చూపించిన సినిమా మిర్చి. ఆ సినిమాలో ప్రభాస్ మ్యానరిజం డైలాగ్ అనేకమందికి ఊతపదంగా మారిపోయింది. ఇక ఆ సినిమా విజయం తో పాటే బాహుబలి ఆఫర్ రావడంతో పూర్తిగా ఆ సినిమాకే అంకితం అయిపోయాడు.ఇక ఆ తరువాత ప్రభాస్ ప్రస్థానం గురించి కేవలం తెలుగువాళ్లు మాత్రమే కాదు మొత్తం ఆల్ ఇండియా రేంజ్ లో మాట్లాడుకున్నారు. సాహో సినిమాతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తన క్రేజ్, రేంజ్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్.
స్ట్రయిట్ హిందీ సినిమాల ఆఫర్స్ ని వదులుకున్న ప్రభాస్ అంతకుముందెప్పుడో ప్రభుదేవా డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ జాక్సన్ లో చిన్న సాంగ్ బిట్ లో కనిపించాడు. అప్పుడే మన డార్లింగ్ కి అక్కడ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక బాహుబలి తో నేషనల్ రేంజ్ హీరో అయినా ప్రభాస్ మరొక అరుదయిన ఘనత కూడా దక్కించుకున్నాడు. అన్ని రంగాల నుండి మహామహుల వాక్స్ స్టాట్యూస్ ఉంచే మేడమే టుస్సాడ్స్ మ్యూజియం లో ప్రభాస్ వాక్స్ స్టాట్యూ ని ఏర్పాటు చేసారు. ఈ ఘనత దక్కించుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ ప్రభాస్.
సక్సెస్ లు వచ్చినప్పుడు పొంగిపోలేదు ,ఫెయిల్యూర్స్ వచ్చినప్పడు కుంగిపోలేదు. తన ఎదుగుదలకు తోడ్పడిన వాళ్ళను మర్చిపోలేదు, తనని నమ్ముకున్న వాళ్ళను విడిచిపెట్టలేదు... అందుకే అతను అందరితో డార్లింగ్ అని పిలిపించుకున్నాడు, పిలిపించుకుంటున్నాడు. పైకి ఆరడుగుల ఆకారంతో గంభీరంగా కనిపించే ప్రభాస్ చాలా భోళా మనిషి. హార్ట్ ఫుల్ గా మాత్రమే మాట్లాడగలడు. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు అందుకే అరుదయిన విజయాలను కైవసం చేసుకున్నాడు. సో, బాక్సాఫీస్ బాహుబలి, మంచి మనసున్న డార్లింగ్, ఓవర్ ఆల్ గా మిస్టర్ పర్ఫెక్ట్ ముందు ముందు కూడా బాహుబలి లాంటి భారీ విజయాలు అందుకుంటూ పాన్ ఇండియా హీరో నుండి యూనివర్సల్ హీరోగా ఎదగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు ప్రభాస్. | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
హైదరాబాద్ టెస్ట్: ఆ రెండు రోజుల టిక్కెట్టు డబ్బులు వాపస్
ఈ నెల 10న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జింఖానా గ్రౌండ్స్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి టిక్కెట్టు డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు హెచ్సీఏ తన ప్రకటనలో పేర్కొంది.
Samayam Telugu | Updated:
Nov 7, 2018, 05:26PM IST
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కిందటి నెల రెండో టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 12 నుంచి 16 వరకు జరగాల్సిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 10 వికెట్ల తేడాతో టెస్టును కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడంతో చివరి రెండు రోజులు టిక్కెట్టు కొనుక్కున్న క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే వాళ్లకు ఇప్పుడు శుభవార్త అందింది. అక్టోబర్ 15, 16 తేదీల మ్యాచ్ టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వాపస్ ఇస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రకటించింది.
ఈ నెల 10న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జింఖానా గ్రౌండ్స్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి టిక్కెట్టు డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు హెచ్సీఏ తన ప్రకటనలో పేర్కొంది. నాలుగో, ఐదో రోజు మ్యాచ్ టికెట్లు కొన్న వారు ఒరిజినల్ టికెట్లతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలతో కౌంటర్ వద్ద సంప్రదించాలని వెల్లడించింది. ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా కొనుగోలు చేసినవారికి నేరుగా వారి సంబంధిత ఖాతాల్లోకి డబ్బులు పంపుతారు. అయితే, మొత్తం మ్యాచ్ వీక్షించేందుకు సీజన్ టికెట్ తీసుకున్న వారికి ఎలాంటి వాపసు ఉండదని హెచ్సీఏ స్పష్టం చేసింది. | 2sports
|
'ఆదాయానికి గండి కొడుతున్నాయి'
- వాట్సాప్, స్కైప్ లాంటి సంస్థలను నియంత్రించాలి
- వాటిని లైసెన్సింగ్ పరిధిలోకి తీసుకురావాలి
- 'ట్రాయ్ 'కి టెలికాం సంస్థల అభ్యర్థన
ముంబయి: ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్, మెసేజింగ్ వంటి సేవలను అందిస్తున్న వాట్సాప్ మరియు స్కైప్ వంటి ఓవర్ -ది- టాప్ (ఓటీటీ) సంస్థలను కూడా తమ మాదిరిగానే లైసెన్సింగ్ విధానం పరిధిలోనికి తీసుకురావాలని దేశీయ టెలికాం రంగ సంస్థలు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్ )ని కోరాయి. ఈ నెల 24తో నెట్ సమానత్వంపై అభిప్రాయాల సేకరణ ముగిసిన నేపథ్యంలో ట్రాయ్ వాటిని విశ్లేషించడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ట్రాయ్ నెట్ సమానత్వంపై తమ అభిప్రాయాలను వెల్లడించిన దాదాపు పది లక్షల మంది పేర్లను వారి ఈ-మెయిల్ల సమాచారాన్ని వెల్లడించింది. ఇందులో దేశంలోని ప్రధాన టెలికాం సంస్థలు ఓటీటీలపై తమ విధానాన్ని నిక్కచ్చిగా బహిర్గంతం చేశాయి. ఓటీటీలు తమ ఆధాయనికి గండి కోడుతున్నాయని ఫలితంగా తాము భారీగా ఆధాయాన్ని కోల్పోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంస్థలు మాత్రం తాము ఆయా ఓటీటీలతో పరస్పర ఒప్పందం కుదుర్చుకొని సేవలు అందించేలా తమను అనుమతించాలని కోరాయి. టెలికాం సేవలు అందించే సంస్థలన్నింటిపైన న్యాయమైన నియంత్రణతో పాటు ఇంటర్నెట్ విషయమై ఒక న్యాయమైన వాణిజ్య పరిష్కారాన్ని కనుగొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని.నెట్ ఆధారిత సేవలను నియంత్రించాలని వొడాఫోన్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కాగా దీన్ని పూర్తి విరుద్ధంగా ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇంటర్నెట్ ప్లాట్ఫాంలకు, కమ్యూనికేషన్ సేవలకు ఎలాంటి లైసెన్స్ అవసరం లేదని అభిప్రాయ పడింది. వాయిస్ సేవలకు సంబంధించి ఓటీటీలు టెలికాం సంస్థలు ఒకే విధమైన సేవలను అందిస్తున్నాయని అయితే టెలికాం సంస్థలను మాత్రం లైసెన్స్ ఫీజులని, పన్నులని, సెక్యూరిటీ నిబంధనలని వివిధ నియమాలను పెడుతున్నారని, ఓటీటీ సంస్థలకు అలాంటివేమి లేవని ఎయిర్టెల్ అవేదన వ్యక్తం చేసింది. ఐడియా సంస్థ కూడా ఒకే రకమైన సేవలకు ఒకే రకమైన నిబంధనలు ఉండాలంటూ నెట్ వేదికగా నినదించింది. ఓటీటీలు టెలికాం ఆపరేటర్ల సంప్రదాయక ఆదాయాలకు గండి కొడుతున్నాయని వాదనతో ఇంటర్నెట్ అండ్ మోబైల్ అసోసియేషన్ ఆప్ ఇండియా (ఐఏఎంఏఐ) విభేదించింది. టెలికాం సంస్థల ఆదాయ వివరాలను విశ్లేషిస్తే డాటా సేవలే టెలికాం కంపెనీలకు కల్పవృక్షంలా మారాయన్న విషయం నిరూపితమవుతుందని వెల్లడించింది. నెట్సమానత్వంపై భారీ స్థాయిలో అభిప్రాయాలు వెలువడడంతో వాటిని ట్రాయ్ మూడు విభాగాలుగా విభజించి విశ్లేషిస్తోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ms dhoni is a legend and team india has no doubts: bhuvneshwar kumar
ధోనీ లెజెండ్.. ఏంచేసినా జట్టు కోసమే: భువనేశ్వర్
మహేంద్ర సింగ్ ధోనీ మీద విమర్శలు ఇప్పుడు మొదలైనవి కాదు. టీమిండియాకు కెప్టెన్గా ఉన్నప్పటి నుంచే ధోనీ ఇక తప్పుకోవాలని, కుర్రాళ్లకి అవకాశం ఇవ్వాలని సీనియర్లు ఉచిత సలహాలు ఇచ్చారు.
TNN | Updated:
Nov 7, 2017, 04:17PM IST
మహేంద్ర సింగ్ ధోనీ మీద విమర్శలు ఇప్పుడు మొదలైనవి కాదు. టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచే ధోనీ ఇక తప్పుకోవాలని, కుర్రాళ్లకి అవకాశం ఇవ్వాలని సీనియర్లు ఉచిత సలహాలు ఇచ్చారు. ఆ తరవాత ధోనీనే స్వయంగా టెస్టులకు టాటా చెప్పి, పొట్టి ఫార్మాట్‌లోనూ కెప్టెన్‌గా తప్పుకుని విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ధోనీని క్రికెట్ పెద్దలు టార్గెట్ చేశారు.
కాన్పూర్‌లో జరిగిన టి20లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోవడం, భారీ లక్ష్య ఛేదనలో ధోనీ నెమ్మదిగా ఆడటం పట్ల సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధోనీ టైం అయిపోయిందని, ఇక తప్పుకోవాలని వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ లాంటి సీనియర్ ఆటగాళ్లు సూచించారు. ధోనీకి వ్యతిరేకంగా కొంతమంది విమర్శలు చేస్తుండగా.. కోహ్లి, సెహ్వాగ్ లాంటి వారు అతనికి అండగా నిలిచారు. ధోనీకి ఒకరు సలహా ఇవ్వాల్సిన అవసరంలేదని, సమయం వస్తే అతనే స్వయంగా తప్పుకుంటాడని చెప్పారు. | 2sports
|
విశాల్ మూవీ 'డిటెక్టివ్' స్టిల్స్
First Published 28, Oct 2017, 8:54 PM IST
విశాల్ మూవీ 'డిటెక్టివ్' స్టిల్స్
విశాల్ మూవీ 'డిటెక్టివ్' స్టిల్స్
విశాల్ మూవీ 'డిటెక్టివ్' స్టిల్స్
విశాల్ మూవీ 'డిటెక్టివ్' స్టిల్స్
విశాల్ మూవీ 'డిటెక్టివ్' స్టిల్స్
విశాల్ మూవీ 'డిటెక్టివ్' స్టిల్స్
విశాల్ మూవీ 'డిటెక్టివ్' స్టిల్స్
విశాల్ మూవీ 'డిటెక్టివ్' స్టిల్స్
విశాల్ మూవీ 'డిటెక్టివ్' స్టిల్స్
విశాల్ మూవీ 'డిటెక్టివ్' స్టిల్స్
Recent Stories | 0business
|
- 18 మాసాల కనిష్టానికి పతనం
- డాలర్తో రూ.68.42కు క్షీణత
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభు త్వ విధానాలు అంతర్జా తీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువను వెలవెలపోయేలా చేశాయి. తాజాగా 18 మాసాల కనిష్ట స్థాయికి దిగజార్చాయి. బుధవారం డాలర్తో రూపాయి మారకం విలువ మరో 38 పైసలు పతనమై 68.42కు క్షీణించింది. 2016 నవంబర్లో రూపాయి విలువ ఈ స్థాయిలో చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు రూపాయి విలువ 6 శాతం పతన మైంది. దీంతో దిగుమతులు భారమై కరెంట్ ఎకౌంట్ లోటు అమాంతం పెరగనుంది. కొద్ది రోజుల్లో రూపాయి విలువ 70కి పడిపోయిన ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదని ఐఎఫ్ఎ గ్లోబల ్కు చెందిన ఫారెక్స్ అడ్వైజరీ పేర్కొంది. గత వారం నుంచి భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. గత ఏడు సెషన్లలో బిఎస్ఇ సెన్సెక్స్ దాదాపుగా 1200 పాయింట్ల మేర నష్టపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోతున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
icici
ఐసిఐసిఐ బ్యాంకు నికర లాభాల్లో పతనం
ముంబై,: ప్రైవేటురంగంలోని బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐబ్యాంకు మూడోత్రైమాసికంలో నికరలాభాలు 19శాతం దిగజారాయి. రానిబాకీలు పెరుగుదలే ఇందుకు కీలకమని తేలింది. అయితే అంచనాలకు అనుగుణంగానే స్వల్పంగా తగ్గినట్లు బ్యాంకు భావిస్తోంది. గత ఏడాది ఇదేకాలంలో 3018 కోట్లు నికరలాభం ఆర్జించిన బ్యాంకు డిసెంబరు త్రైమాసికంలో ఈ ఏడాది 2442 కోట్లు ఆర్జించింది. బ్యాంకింగ్ రంగ నిపుణుల అంచనాలప్రకారం చూస్తే 2170కోట్లు ఆర్జిస్తుందని తేలిం ది. అయితే నిపుణుల అంచనాలకంటే కొంతమేర పెరిగింది. రానిబాకీల పరంగాచూస్తే మొత్తం అడ్వాన్సుల్లో 7.91శాతానికి పెరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదేకాలంలో 4.72 శాతంగాఉన్నాయి. సెప్టెంబరు త్రైమా సికంలో 6.82 శాతంగా ఉన్నాయి. భారతీయ బ్యాంకుల్లో నవంబరునాటి కరెన్సీ నోట్ల రద్దు ఒకషాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీనివల్ల అనేక సంస్థలు పెద్దనోట్లను మార్పిడి చేసుకు నేందుకు సతమతం అయ్యాయి. బ్యాంకుల్లో అయితే రుణపరపతిపై తీవ్ర ప్రభావం చూపించింది. బ్యాంకింగ్ రంగంలో మార్చి చివరినాటికి ఆస్తి అప్పుల పట్టీలను ప్రక్షాళన చేసుకోవాలన్న ఉత్తర్వులు పాటించాల్సి ఉంది. ఐసిఐసి నికర వడ్డీ ఆదాయం డిసెంబరు త్రైమాసికంలో 5363 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదేకాలంలో 5453 కోట్లుగా ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు షేర్లు 0.7శాతం దిగజారాయి. | 1entertainment
|
Najma mamaji
నోవోటెల్ హోటల్ డైరెక్టర్గా నజ్మామామాజి
హైదరాబాద్, డిసెంబరు 20: నోవాటెల్ హైదరా బాద్ ఎయిర్పోర్టు సేల్స్ అండ్మార్కె టింగ్ డైరెక్టర్గా నజ్మా మామాజీ నియమితులయ్యా రు. కొత్తబాధ్యతల్లో భాగంగా నజ్మా నోవోటెల్ హోటల్ రాబడులను మరింతగా పెంచడంలో కృషిచేస్తారు. ఆతిథ్యరంగంలో అత్యున్నత స్థాయి ర్యాంకింగ్ ఉన్న నోవోటెల్కు డైరెక్టర్గా నజ్మా రావడం శుభపరిణామమని యాజమాన్యం ప్రకటించింది. డా.డివైపాటిల్ హోటల్మేనేజ్ మెంట్ కాలేజినుంచి గ్రాడ్యుయేషన్చేసిన నజ్మా కు సినిమాలంటే ఇష్టం బాలివుడ్ సంగీతంతో ఆమె ప్రశాంతత లభిస్తుందని చెపుతారు. దశా బ్దానికిపైగా హోటల్రంంలో అనుభవం ఉన్న నజ్మా మామాజీ నోవోటెల్ హైదరాబాద్ ఎయిర్పోర్టు హోటల్లో చేరకముందు హిల్టన్, హయత్ హోటల్స్, ఐహెచ్హెచ్ఆర్, ఇండి యన్ హోటల్స్ కంపెనీల్లో సేవలందించారు. | 1entertainment
|
గౌతమ్ నంద రివ్యూలతో కష్టంగా అనిపించిందన్న సంపత్ నంది
Highlights
గౌతమ్ నంది సినిమా రివ్యూలపై సంపత్ నంది అసంతృప్తి
రేటింగ్స్ చూసి బాధేసిందన్న దర్శకుడు సంపత్ నంది
సక్సెస్ మీట్ పెట్టి అంతా హ్యాపీ అన్నా సంపత్ నంది నిజం చెప్పాడు
హీరో గోపీచంద్, డిరెక్టర్ సంపత్ నంది కెరీర్లకు చాలా కీలకమైన సినిమా 'గౌతమ్ నంద'. ఈ సినిమాపై వాళ్లిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశల్ని నిలబెట్టలేకపోయింది 'గౌతమ్ నంద'. నెగెటివ్ టాక్తో మొదలైన ఈ చిత్రం.. అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టలేకపోయింది.
విడుదలైన వారం రోజులకు ఈ చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి.. అందరూ చెప్పే మాటలే చెప్పింది. 'గౌతమ్ నంద' ఆరు రోజుల్లో రూ.22 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు వివరించాడు నిర్మాత. హీరో గోపీచంద్ కూడా సినిమా గురించి పాజిటివ్ గానే మాట్లాడాడు. కానీ దర్శకుడు సంపత్ నంది మాత్రం 'గౌతమ్ నంద' గురించి ముందు కొంచెం నిజాయితీగానే స్పందించాడు.
'గౌతమ్ నంద'కు తొలి రోజు తాము ఆశించిన రెస్పాన్స్ రాలేదని సంపత్ నంది తెలిపాడు. రివ్యూలు.. రేటింగ్స్ నిరాశ కలిగించాయని.. అందువల్లే తొలి రోజు సాయంత్రం వరకు తన మిత్రులు, సన్నిహితులు కూడా తనకు కాల్స్ చేయలేదని సంపత్ తెలిపాడు. బహుశా అందుకు రివ్యూలే కారణం కావచ్చని సంపత్ తెలిపాడు. ఐతే సాయంత్రం తర్వాత నెమ్మదిగా తనకు కాల్స్ మొదలయ్యాయని చెప్పాడు.
తాను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కథ పరంగా తనకు అత్యంత సంతృప్తినిచ్చిన సినిమా 'గౌతమ్ నంద'నే అని సంపత్ తెలిపాడు. తనకు తన తండ్రి.. తన కుటుంబానికి సన్నిహితుడైన ఐఏఎస్ అధికారి సాంబశివరావు స్ఫూర్తి అని.. వాళ్లిద్దరికీ ఈ సినిమా చాలా బాగా నచ్చిందని.. అది తనకెంతో సంతోషం కలిగించిన విషయమని సంపత్ తెలిపాడు.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST | 0business
|
Fed intrest
మార్కెట్లకు ఫెడ్ వడ్డీరేట్ల మద్దతు
ముంబై,: ఫెడ్రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం పెంచేందుకు నిర్ణయించడంతో నిఫ్టీ సూచి ఒక్కసారిగా తాజా రికార్డుస్థాయి నమోదుచేయ డంతో పాటు రూపాయి కూడా పటిష్టపడింది. కనీసం 17 నెలల గరిష్టస్థాయి ని నమోదుచేసింది. వీటన్నింటికంటే ద్రవ్యవిధానంలో సానుకూలధోరణితో ఉన్నట్లు ఫెడ్రిజర్వు వ్యక్తంచేయడం వల్ల ఈవిధానాలు మార్కెట్లకు కొంత అనుకూలించాయనే చెప్పాలి. నిఫ్టీ సూచి 74 పాయింట్లు పెరిగి 9158 పాయింట్లవద్ద స్థిరపడింది. గతంలో 9122 పాయింట్లకు చేరింది. సూచి 9153 పాయింట్లవద్ద ముగిసింది. 69పాయింట్లు లాభ పడింది. బిఎస్ఇ సెన్సెక్స్ 217 పాయింట్లు లాభపడింది. వాణిజ్యం మధ్యలో 29,615పాయింట్లకు సైతం వెళ్లింది. చివరకు 30షేర్ సెన్సెక్స్ 439 పాయింట్ల పెరిగి 29,585 పాయింట్ల వద్ద స్థిరపడింది.
తన జీవితకాల గరిష్టస్థాయికి కేవలం 430 పాయింట్లు మాత్రమే చేరుకో వాల్సిఉంది. బిఎస్ఇ మిడ్క్యాప్ సూచీ స్మాల్ క్యాప్ సూచీలు 1.5 శాతం, 1శాతం చొప్పున ముగిసాయి. మార్కెట్లపరంగా బిఎస్ఇలో 1784 షేర్లు పెరిగితే 1042 కంపెనీల షేర్లు తగ్గాయి. 185 పాయింట్లు స్థిరంగా ఉన్నట్లుతేలింది. బిఎస్ఇ మెటల్సూచి 3శాతం పెరిగింది. సెయిల్ 6శాతం, హిందూస్థాన్ జింక్ ఐదుశాతం, జెఎస్డబ్ల్యు స్టీల్ 5శాతం పెరిగాయి. కేపిటల్గూడ్స్ కంపెనీలు వరుసగా ఐదోరోజు కూడా లాభపడ్డా యి. బిఎస్ఇ కేపిటల్గూడ్స్ సూచి 18 నెలల గరిష్టస్థాయికి చేరింది. 1.5శాతం వద్ద సూచి ముగిసింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 3శాతం లాభపడింది. 864వద్ద ముగిసింది. షేర్ల బైబాక్ ప్రతిపాదనలకు బోర్డు సమా వేశం సోమవారం జరుగుతుంది.
కంపెనీ స్టాక్ రెండుశాతం ఎగువన 854 రూపాయలవద్ద ముగిసింది. అశోక్ బిల్డ్కాన్ షేర్లు 52 వారాల గరిష్టస్థాయి వద్ద నిలిచాయి. 199.65 వద్ద స్థిరపడింది. 7శాతం ఇంట్రాడే ట్రేడ్ లో కంపెనీభారీలాభాలు సాధించింది. అశోకాకన్సెషన్స్ ఎన్హెచ్ఎఐ కు అతితక్కువ మొత్తం బిడ్దాఖలుచేసింది. నాగార్జున ఫర్టి లైజర్స్ 12.84 వద్ద ముగిసింది. ఐదుశాతం క్షీణించింది. కోరమాండల్ ఇంటర్నేషనల్ ఈ కంపెనీని కొనుగోలు చేసేదిశగా యోచిస్తోంది. ఎల్అండ్టి రెండుశాతం పెరిగింది. ఎల్అండ్టి ఎలక్ట్రికల్ఆటోమేషన్ ఎఫ్జడ్ఇ రూ500 కోట్ల విలువైన ఖతార్ రైల్ కంపెనీ ఆర్డరు సాధించింది. దోహామెట్రో ప్రాజెక్టును సాధించినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లపరంగాచూస్తే ఫెడ్ ప్రకటన తాజా వడ్డీరేట్లపెంపును నిర్ణయిస్తుంది. యూరోపియన్ స్టాక్స్600 సూచి 0.35శాతం గరిష్టంగాఉంది. బ్రిటన్ ఎఫ్టిఎస్ఇ జర్మనీ డాక్స్ ఒకటి శాతంచొప్పున పెరిగాయి. ఫ్రాన్స్సిఎసి 40 0.7శాతంగా నిలిచాయి. ఆసియా మార్కెట్లపరంగా హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ రెండుశాతం, చైనాషాంఘై కాంపో జిట్ 0.8శాతం గరిష్టంగా ఉంది. జపాన్నిక్కీ స్వల్పంగా మార్పులు సాధించింది. | 1entertainment
|
internet vaartha 200 Views
చెన్నై: టి20 ఫార్మాట్ వల్ల క్రికెట్ ఎన్నో మార్పులు వచ్చాయని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ పేర్కొన్నాడు.ప్రత్యేకంగా బ్యాటింగ్ విధానం పూర్తిగా మారిపోయిం దన్నాడు. ఎంఆర్ఎఫ్ టైర్స్్కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ మార్చి నుంచి ప్రారంభం కానున్న టి20 ప్రపంచ కప్పై మాట్లాడాడు.టి20లు క్రికెట్లో ఎన్నో మార్పులను తెచ్చాయి.ఫాస్ట్బ్ఔలర్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడటమన్నది అప్పట్లో ఊహకు కూడా అందని విషయం.వీక్షకులు కూడా దీన్ని ఆస్వాదిస్తున్నారు. క్రికెట్తో పెద్దగా పరిచయం లేని వారిని టి20 ఫార్మాట్ ఆకట్టుకుంటుంది.కాగా మూడు గంటల పాటు అభిమానులను ఉత్కంఠ వినోదంతో ముంచెత్తుతుంది అని సచిన్ పేర్కొన్నాడు. | 2sports
|
sumalatha 122 Views bse , NSE , stock market
SENSEX DOWN
ముంబయి: నాలుగో రోజూ సూచీలు నష్టాలను చవి చూశాయి. ఈరోజు నాటి ట్రేడింగ్లో స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 48.39 పాయింట్ల నష్టపోయి, 37,982.74వద్దకు చేరగా, నిఫ్టీ 15.15 పాయింట్ల నష్టంతో 11,331 పాయింట్లకు పడిపోయింది. నేటి ట్రేడింగ్లో పవర్ గ్రిడ్ కార్ప్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్ తదితర షేర్లు లాభపడగా, ఎస్బీఐ, ఇండియాబుల్స్ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో తదితర షేర్లు నష్టాలను చవి చూశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లతోపాటు, ఆటో, లోహ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, ఇన్ఫ్రా, ఐటీ రంగాల షేర్లు 3శాతం మేర నష్టపోయాయి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/ | 1entertainment
|
Visit Site
Recommended byColombia
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.36,730కు చేరింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,950కు ఎగసింది.
ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పరుగులు పెట్టింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో ధర రూ.38,700కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.37,500కు ఎగసింది.
Also Read: గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండిదీ ఇదే దారి!
బంగారం ధర బాటలోనే సిల్వర్ కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.48,950కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.
Also Read: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేయొద్దు!
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్స్కు 0.05 శాతం క్షీణతతో 1,514.55 డాలర్లకు దిగొచ్చింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్కు 0.06 శాతం పెరుగుదలతో 18.07 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.
Also Read: శుభవార్త.. ఏకంగా రూ.2,000కు పైగా పడిపోయిన బంగారం ధర!
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
Also Read: పెన్షన్ తీసుకుంటున్నారా? అయితే వెంటనే ఇలా చేయకపోతే మీకు పింఛన్ రాదు!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Hyderabad, First Published 1, Sep 2019, 5:47 PM IST
Highlights
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి కళాఖండం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని డివివి దానయ్య 350 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దేశం మొత్తం ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి కళాఖండం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని డివివి దానయ్య 350 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దేశం మొత్తం ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి.
1920 బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, అలియా భట్ ఈ ఈచిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతటి భారీ చిత్ర పేరుని అడ్డం పెట్టుకుని కొందరు వ్యక్తులు ఘరానా మోసానికి తెరతీశారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో అవకాశం ఇప్పిస్తాం అని కొందరు సోషల్ మీడియా వేదికగా అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో తెలిపింది. సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని అయినా తామే అధికారికంగా తెలియజేస్తాం. ఇలా అపరిచితులు చెప్పే మాటలు విని మోసపోవద్దకు అని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో హెచ్చరించింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ పై అంతా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2020 జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Last Updated 1, Sep 2019, 10:02 PM IST | 0business
|
ఫెడ్ పెంపుతో ప్రమాదం అంతంతే..!
- ముందు క్షీణించినా తరువాత జోరు కొనసాగుతుంది
- వర్ధమాన దేశాలే ఎఫ్ఐఐలకు ప్రీతికరం
- గత చరిత్ర చెబుతున్న నిజం ఇదీ
- స్థిరీకరణ స్థాయికి చేరిన మార్కెట్లు
- కొత్తగా వచ్చే నష్టం నామమాత్రమే అంటున్న విశ్లేషకులు
నవ తెలంగాణ వాణిజ్య విభాగం
ఆర్థిక ప్రపంచమంతా ఆందోళనగా వేచి చూస్తున్న సమయం ఆసన్నమైంది. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపునకు రంగం సిద్ధం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా వర్ధమాన దేశాలతో పాటుగా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు కూడా ఈ విషయంలో అమెరికా వైఖరి గురించి ఆందోళనగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడో.. అప్పుడో.. అంటూ చాలా సార్లు మార్కెట్ల భయపెడుతూ వచ్చిన అమెరికా వడ్డీరేట్ల పెంపు నిర్ణయం మరికొన్ని గంటల్లోనే వెలువడనుంది.
ఎందికింత క్రేజీ..
అమెరికా గత తొమ్మిది సంవత్సరాలుగా వడ్డీరేట్లను పెంచలేదు. దాదాపు సున్నాకు దగ్గరల్లోనే వడ్డీరేట్లు ఉండడంతో ఆక్కడి మదుపరులు తమ పెట్టుబడులను భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు తరలించారు. ఇక్కడి ఫైనాన్షియల్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అగ్ర దేశంలోనే వడ్డీరేట్లు పెరుగనుండడంతో అక్కడ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం లభించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. దీంతో డాలర్లలో పెట్టుబడులు పెట్టిన చాలా మంది ధనిక మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని ఇప్పటికే ఫెడ్ వడ్డీపెంపునకు సిద్ధమవుతున్నారు. ఇదే కారణంగా గత కొన్ని రోజులుగా వర్ధమాన దేశాల మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. చిన్న మదుపరులైతే చితికిపోయారు.
చరిత్ర చెప్పే సత్యమిదీ..
1983 నుంచి అమెరికా ఫెడ్ ఇప్పటి వరకు ఆరు సార్లు వడ్డీరేట్లను పెంచింది. చివరిసారిగా ఫెడ్ 2004లో వడ్డీరేట్లను సవరించింది. మన మార్కెట్ల దృష్ట్యా చూస్తే 1994, 1999, 2004లో చేసిన మూడు వడ్డీ సవరణలు చాలా ముఖ్యంగా పరిగణించాలి.
1994 ఫిబ్రవరిలో ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకొనేందుకు ముందు ఆరు నెలల కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్లో దాదాపు 69 శాతం వృద్ధి నమోదు అయింది. 2,336 పాయింట్ల స్థాయి వద్ద ఉన్న సెన్సెక్స్ 3,947 పాయింట్ల స్థాయికి చేరింది. ఫెడ్ నిర్ణయంతో తదుపరి ఆరు నెలల కాలంలో మార్కెట్ గతి ఎనిమిది శాతం మేర మందగించి 4,276 పాయింట్ల స్థాయిని చేరింది. అయితే ఈ ఆరు నెలల కాలంలో ఎఫ్ఐఐల పెట్టుబడులు మాత్రం పెరగడం విశేషం.
జూన్ 30,1999 నుంచి ఫెడ్ వడ్డీ పెంపు మొదలైంది. డాట్కామ్ బూమ్ బద్దలయ్యేందుకు ముందు రోజుల్లో ఆమెరికా ఫెడ్ వడ్డీరేట్లను పెంచడం మొదలు పెట్టింది.. భారత మార్కెట్లు కూడా ఆ సమయంలో మంచి ఊపు మీద ఉన్నాయి. ఫెడ్ నిర్ణయం తీసుకొనే నాటికి సెన్సెక్స్ 35 శాతం వృద్ధితో 4144 పాయింట్ల స్థాయి వద్ద ఉంది. ఫెడ్ నిర్ణయంతో మార్కెట్లు తమ ఊపును కొనసాగించాయి. మరో 30 శాతం మేర పెరిగి ఆరు నెలల 5375 స్థాయిని చేరాయి. పెంపునకు ముందు ఆరు నెలల కాలంలో ఎఫ్ఐఐల పెట్టుబడులలో మంచి వృద్ధి కనిపించింది. పెంపు నిర్ణయం వెలువడిన మూడో నెలల నుంచి విఫరీతమై అమ్మకాలకు దిగారు. ఆ తరువాత మళ్లీ వీరు మళ్లీ వర్ధమాన దేశాల మార్కెట్ల వైపే దృష్టి సారించారు.
జూన్, 2004లో ఫెడ్ వడ్డీరేట్లను పెంచింది. ఆ సమయంలో కేంద్రంలో ప్రభుత్వం అధికారం కోల్పోయింది. దీంతో ఏడాది మొదటి రోజున 5,915 పాయింట్ల వద్ద ఉన్న మార్కెట్ 18 శతం మేర కుంగి 4,874 వద్ద తచ్చాడుతూ కనిపించింది. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు ప్రభావం స్వల్పంగానే కనిపించింది. తరువాత కాలంలో మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. గతంలో ఫెడ్ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకున్న ప్రతీసారి మార్కెట్లు కొంత మందగించినప్పటికీ తరువాత నెలల్లో పుంజుకొని ఆరు నెలల్లోనే తమ పాత జోరును అందుకున్న సాక్షాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితి వేరు..
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ గతంలో వడ్డీరేట్లను పెంచడానికీ.. ఈ దఫా వడ్డీరేట్లు పెండానికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గతంలో ఎప్పుడు వడ్డీరేట్లు దాదాపు తొమ్మిదేళ్లుగా పెంచకుండా ఉన్న పరిస్థితి లేదు. ఆర్థిక మాం ద్యం నేపథ్యంలో తగ్గించిన వడ్డీ రేట్లు గత జీరో స్థాయి బేస్ వద్ద ఉన్నాయి. ఇలా జీరో స్థాయి వద్ద నుంచి వడ్డీరేట్ల పెంపు ఉన్న సంఘటనలు గతంలో దాదాపు లేవు. ఈ నేపథ్యంలో ఫెడ్ నిర్ణయం గురించి మదుపరులు, ప్రపంచ దేశాలు ఆసక్త్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఫెడ్ భయాలు, ఆర్థిక మందగమనం నేపథ్యంలో మార్కెట్లు ఇప్పటికే స్థిరీకరణ స్థాయికి చేరాయనీ ఇప్పుడు వడ్డీరేట్లు పెరిగినా కొత్తగా వచ్చే నష్టం నామమాత్రంగానే ఉండవచ్చన్నది మార్కెట్ వర్గాల మాట. అయితే ఫెడ్ చర్యవల్ల ఆర్థిక వ్యవస్థ కు కలిగే పరోక్ష నష్టాన్ని మాత్రం ఇప్పట్లో అంచనా వేయ లేమని చెబుతున్నారు. | 1entertainment
|
హార్డిక్ పాండ్యా లవ్ స్టోరీ: ఆమెకు బ్రేకప్, ఈమెతో చెట్టాపట్టాల్
Highlights
టీమిండియా క్రికెటర్ల డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
ముంబై: టీమిండియా క్రికెటర్ల డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్వీడన్ మోడల్, నటి ఎల్లీ అవ్రామ్ బ్రేకప్ చెప్పినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
పాండ్యా అన్నయ్య, క్రికెటర్ కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ హాజరైంది. అప్పుడే వీరి డేటింగ్ రిలేషన్ బయటి ప్రపంచానికి తెలిసింది. అయితే, ఈ మధ్య వారిద్దరు దూరమైనట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అందుకు ‘హేట్ స్టోరీ 4’ నటి ఊర్వశి రౌతెలా కారణమనే ప్రచారం సాగుతోంది. పారిశ్రామికవేత్త గౌతం సింఘానియా పార్టీలో హార్ధిక్ పాండ్యా, ఊర్వశి కలుసుకున్నారు. అప్పటి నుంచి వారి మధ్య బంధం ప్రారంభమైనట్లు చెబుతున్నారు.
గతంలో ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను విమాశ్రయంలో డ్రాప్ చేసి వెళ్తూ ఎల్లీ కెమెరా కంటికి చిక్కింది. ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజా పుకార్లపై ఎల్లీ గానీ, పాండ్యా గానీ స్పందించలేదు.
Last Updated 2, Jun 2018, 6:53 PM IST | 2sports
|
Visit Site
Recommended byColombia
నోట్ల రద్దు తర్వాత నల్ల ధనం వెలికితీతకు ప్రధాని నరేంద్ర మోడీ అవలంభిస్తున్న తీరు చూస్తోంటే, ఇకపై రూ.50,000లకి మించి బంగారం, వెండి ఆభరణాలు కానీ గోల్డ్ బార్స్ కానీ ఏవీ ఖరీదు చేసినా సదరు జువెలరీ దుకాణంలో కొనుగోలుదారులు తమ ప్యాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి వుంటుందేమో అని అంచనా వేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్.
ప్రస్తుతం అమలులో వున్న నిబంధనల ప్రకారం రూ.2 లక్షల విలువకు మించిన బంగారు లేదా వెండి ఆభరణాలు, గోల్డ్ బార్స్ కొనుగోలు చేసినప్పుడే ఈ డీటేల్స్ ఇవ్వాల్సిన అవసరం వుంది. కానీ నోట్ల రద్దు తర్వాత మోడీ అవలంభిస్తున్న విధానాలు చూస్తోంటే ఇకపై రూ.50,000లకి మించి బంగారం, వెండి కొనుగోళ్లపై ప్యాన్ / ఆధార్ నెంబర్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందేమో అంటున్నారు జెమ్స్ అండ్ జెవెలరీ రంగంలో వాణిజ్య సంస్థలకి ఛార్టర్డ్ ఎకౌంటెంట్‌గా సేవలు అందిస్తోన్న భార్గవ్ వైద్య.
ఒకవేళ భార్గవ్ వైద్య అంచనాలు నిజమే అయితే, ఇకపై రూ.50,000లకి మించి బంగారం లేదా వెండి కొనుగోళ్లు జరిపేటప్పుడు మీరు మీ వెంట ప్యాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి వుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే, ప్యాన్ కాడ్ కానీ లేదా ఆధార్ కార్డ్ కానీ లేని వాళ్లు తమ కిసాన్ క్రెడిట్ కార్డుని వెంట తీసుకువెళ్లవచ్చు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price Today:స్థిరంగా బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,550 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400 కి వద్ద ఉంది.
Samayam Telugu | Updated:
Oct 30, 2018, 10:44AM IST
Gold Price Today:స్థిరంగా బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర
సోమవారం నాటి ట్రేడింగ్లో బంగారం ధరలు స్థిరంగా నిలిచాయి. అంతకు ముందు ట్రేడింగ్లో రూ.32,550 వద్ద ముగిసిన ధరల్లో ఎలాంటి మార్పులేదు. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ మందగించడం బంగారం ధరల స్థిరత్వానికి కారణమైంది. మరోవైపు వెండి ధర రూ.100 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.39,600 నుంచి రూ.39,500 కి చేరింది. నవంబరు 5న 'ధన్ తేరాస్' సందర్భంగా బంగారం ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు. గతేడాది 'ధన్ తేరాస్' సందర్భంగా 10 గ్రా. బంగారం ధర రూ.30,000 స్థాయికి వచ్చిన సంగతి తెలిసిందే. | 1entertainment
|
Hyderabad, First Published 27, Oct 2018, 8:23 PM IST
Highlights
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతొన్న చిత్రం" చంద్రోదయం". .ఈ బయోపిక్ ను పి.వెంకటరమణ దర్శకత్వం లొ జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తి చెసుకుంది. ఇటివలే ముఖ్యమంత్రి కార్యాలయంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసారు యూనిట్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతొన్న చిత్రం" చంద్రోదయం"..ఈ బయోపిక్ ను పి.వెంకటరమణ దర్శకత్వం లొ జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తి చెసుకుంది. ఇటివలే ముఖ్యమంత్రి కార్యాలయంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసారు యూనిట్.
ఈ సందర్భంగాదర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. "ఆకులు ఎన్ని కాల్చిన బొగ్గులు కావు బ్రదర్ . జిత్తులమారి నక్కలు , తోడేళ్ళు ఎన్ని ఏకమైనా అడవికి రాజు , మృగరాజు న అల్లుడే " అనే ఎన్టీఆర్ క్యారెక్టర్ డైలాగ్ తో షూటింగ్ విజయవాడ లో పూర్తి అయ్యింది . చంద్రబాబు నాయుడు గారు దేశ చరిత్రలొనె ఆదర్శవంతమైన నాయకుడు. ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబు గారి బయోపిక్ ను తెరమీదకు తీసుకువస్తున్నాము. చిత్రీకరణ పూర్తిచేశాము. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యమైన స్దాయికి చెరిన ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా తెరమీదకు తీసుకువస్తున్నామని"న్నారు.
నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ..నారా వారి పల్లె, హైదరాబాద్ ,అమరావతి, సింగపూర్ లాంటి లొకెషన్స్ లో సినిమా షూటింగ్ చెశాము. మహా నాయకుడి బయోపిక్ ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది. పాటలను నవంబర్ 2 వ వారంలొ విడుదల చెస్తాము. సంక్రాంతి కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.
వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ. | 0business
|
telugu titans
హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఐదో సీజన్లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతుంది.
బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్
24-30తేడాతో ఓటమి పాలైంది. ప్రథమార్థంలో నువ్వా? నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో ద్వితీయార్థంలో
పుంజుకొనేందుకు వచ్చిన ఆవకాశాలను వినియోగించుకోవడంలో విఫలమైన తెలుగు టైటాన్స్ జట్టు
మ్యాచ్ను చేజార్చుకుంది. | 2sports
|
కొత్త సినిమాలు
ఆకట్టుకుంటున్న ‘మహానాయకుడు’ ప్రోమో..
హైదరాబాద్: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘యన్టిఆర్: మహానాయకుడు’ సినిమాకు సంబంధించిన ఓ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ‘నా ప్రాణాలకు ప్రాణంగా.. నా బిడ్డలకు తల్లిగా.. నా సాహధర్మచారిణిగా.. నీ అనుమతి కావాలి తారకం..ఇష్టమేనా?’ అంటూ బాలకృష్ణ(ఎన్టీఆర్).. విద్యాబాలన్ (బసవతారకం)తో చెబుతున్న డైలాగ్తో ప్రోమో మొదలైంది. ఇందుకు విద్యాబాలన్ సమాధానంగా.. ‘నీకూ నాకూ రెండు ఇష్టాలుంటాయా బావా..’ అని చెప్పడం హైలైట్గా నిలిచింది.
క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బీకే ఫిలింస్ బ్యానర్పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ ఇంటింటి గడపకి పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. ‘యన్టిఆర్’ బయోపిక్కు సంబంధించిన రెండో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. | 0business
|
Hyderabad, First Published 5, Feb 2019, 12:57 PM IST
Highlights
అవసరం వస్తే మాత్రం కొందరు నటీనటులు సిగ్గు లేకుండా తనకు ఫోన్లు చేస్తుంటారని.. బాలీవుడ్ నటి కంగనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. ఇతర నటీనటుల ప్రవర్తన గురించి మాట్లాడింది.
అవసరం వస్తే మాత్రం కొందరు నటీనటులు సిగ్గు లేకుండా తనకు ఫోన్లు చేస్తుంటారని.. బాలీవుడ్ నటి కంగనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. ఇతర నటీనటుల ప్రవర్తన గురించి మాట్లాడింది. అవసరం వస్తే తనకు ఫోన్లు చేసి అడుగుతారని, తనకోసం మాత్రం ఎవరూ ముందుకు రారని
ఫైర్ అయింది కంగనా.
2014లో కంగనా నటించిన 'క్వీన్' సినిమా విడుదలై పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను నిర్మించిన ఫాంటమ్ ఫిలిమ్స్ సంస్థ క్రెడిట్ మొత్తం తీసేసుకుందని, తన గురించి మాత్రం ఎవరూ మాట్లాడేవారు కాదని చెప్పింది కంగనా. ఎక్కడకి వెళ్లినా.. ఆ సంస్థ తెరకెక్కించిన సినిమాల స్క్రీనింగ్స్ ప్రదర్శించేవారని తన సినిమాల స్క్రీనింగ్స్ ని ఎవరూ వచ్చేవారు కాదని అన్నారు.
వారికేదైనా.. అవసరం వస్తే మాత్రం సిగ్గు లేకుండా ఫోన్లు చేస్తుంటారని, వారి కోసం సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని మరీ వెళ్లేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. 'రాజి' సినిమా విడుదల సమయంలో అలియా భట్, డైరెక్టర్ మేఘనాలతో అరగంట మాట్లాడానని చెప్పింది. అలియా తనకు ట్రైలర్ లింక్ పంపించి ప్లీజ్ చూడడాని అని రిక్వెస్ట్ చేస్తే చూసి తనను అభినందించినట్లు చెప్పిన కంగనా.. తన సినిమాకు రమ్మని పిలిచినప్పుడు మాత్రం ఎవరూ స్పందిచలేదని చెప్పింది.
అమీర్ ఖాన్ 'దంగల్' సినిమా గురించి మాట్లాడడానికి అంబానీ ఇంటికి వెళ్లారని తెలిసి తను కూడా వెళ్లినట్లు గుర్తు చేసుకున్న కంగనా.. తన సినిమా ప్రీమియర్ స్క్రీనింగ్ కి మాత్రం ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
Last Updated 5, Feb 2019, 12:57 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఇక నుంచి డీఎస్పీ గీతా ఫోగట్
భారత మహిళా రెజ్లర్ గీతా ఫోగట్ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమించాలని హర్యానా మంత్రివర్గం గురువారం నిర్ణయించింది.
TNN | Updated:
Oct 20, 2016, 05:39PM IST
భారత మహిళా రెజ్లర్ గీతా ఫోగట్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్‌గా నియమించాలని హర్యానా మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర హోం శాఖ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
‘‘అంతర్జాతీయ స్థాయి రెజ్లర్ అయిన గీతా డిగ్రీ పట్టభద్రురాలు. అంతేకాకుండా 2010లో ఢిల్లీలో జరిగిన 19వ కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకం కూడా సాధించింది’’ అని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు. గీతాతో పాటు పర్వతారోహకుడు రాం లాల్‌ను సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. గతంలో కూడా హర్యానా నుంచి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు రాష్ట్ర ప్రభుత్వ, హర్యానా పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విజేందర్ సింగ్ కూడా గతంలో హర్యానా పోలీస్ శాఖలో ఉద్యోగం పొందాడు. | 2sports
|
సినిమా కథ విని పెళ్లి చేసుకోవాలనిపించింది: నితిన్
Highlights
నన్ను మా ఇంట్లో పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉన్నారు. అయితే తరువాత చేసుకుంటానులే అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాను. సతీష్ వేగ్నేశ నా దగ్గరకి వచ్చి కథ చెప్పగానే నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను
యంగ్ హీరో నితిన్ నటించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు పెళ్లి గెటప్ లో వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు హీరో నితిన్. ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ ఫిలింగా నిలిచిపోతుందని నితిన్ అన్నాడు. సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసిన ఈ కథ మొదట విన్నప్పుడు తనకు కూడా పెళ్లి చేసుకోవాలనిపించిందని నితిన్ అన్నాడు.
మరిన్ని విషయాలు చెబుతూ.. ''నన్ను మా ఇంట్లో పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉన్నారు. అయితే తరువాత చేసుకుంటానులే అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాను. సతీష్ వేగ్నేశ నా దగ్గరకి వచ్చి కథ చెప్పగానే నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అయితే పెళ్లంటే ఇప్పుడు జరిగే పెళ్లిలా కాదు.. మా సినిమాలో జరిగే పెళ్లిలా చేసుకోవాలని అనుకున్నా.. షూటింగ్ ఆరంభంలోనే పెళ్లి సన్నివేశాలు షూట్ చేశారు.
ఆ పూజలు, వ్రతాలు చూసి బాబోయ్ పెళ్లంటే ఇలా ఉంటుందా అనుకున్నా.. అది విని మా అమ్మ కంగారు పడుతుందేమోనని టెన్షన్ పడకు మమ్మీ పెళ్లి కచ్చితంగా చేసుకుంటా అని చెప్పాను'' అంటూ ఈ సినిమా తనను ఎంతగా ప్రభావితం చేసిందో.. వెల్లడించాడు.
Last Updated 23, Jul 2018, 10:57 AM IST | 0business
|
Apr 14,2015
మూడు నెలల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం
ముంబయి: అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నప్పటికీ ఆహార ఉత్పత్తుల ధరలు వెనువెంటనే పెరగకపోవడంతో మార్చి మాసం రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠ స్థాయికి దిగివచ్చింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం మార్చి మాసంలో 5.17 శాతానికి చేరింది. ఇది అంతకు ముందు రెండు నెలల ద్రవ్యోల్బణం కన్నా తక్కువ. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.19%, ఫిబ్రవరిలో 5.37 శాతంగా నమోదు అయింది. వినియోగారుల ఆహార ధరల ద్రవ్యోల్బణం మార్చిలో 6.14 శాతంగా నిలిచింది. తృణ ధాన్యాలు (11.48%), కూరగాయలు (11.26%), సుగంధ ద్రవ్యాలు (9.03%), పాలు, పాలాధారితోత్పత్తుల (8.35%) ధరలు గత ఏడాది మార్చితో పోలిస్తే పెరిగాయి. ధరలు తగ్గిన వాటిలో గుడ్లు, చెక్కర, కన్ఫెక్షనరీతో పాటు రవాణా తదితరాలు నిలిచాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చైతు బైక్ ఖరీదు 11 లక్షలు!
నాగచైతన్యకు నటనతో పాటు బైక్స్ అంటే చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మార్కెట్లో ఏ కొత్త బైక్ వచ్చినా..
| Updated:
Jul 11, 2016, 03:34PM IST
నాగచైతన్యకు నటనతో పాటు బైక్స్ అంటే చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మార్కెట్లో ఏ కొత్త బైక్ వచ్చినా.. చైతుకి తెలియాల్సిందేనట. ఆ బైక్ తనకు నచ్చితే.. సొంతం చేసుకోకుండా మాత్రం ఉండడు. బైక్స్ అంటే చైతుకి అంత ఇష్టం మరి. ఈ నేపధ్యంలో 'ట్రియూంప్' అనే కంపనీ కొత్తగా మార్కెట్లోకి 'త్రక్స్టన్ ఆర్' అనే మోడల్ గల బైక్ను లాంచ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న చైతు సుమారుగా రూ.11 లక్షల రూపాయలు పెట్టి మరీ ఈ బైక్ కొన్నాడు. బైక్ కొన్న తర్వాత దానిపై రైడ్కు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. అఫ్కోర్స్! ఆ బైకుని ఇష్టపడి మరీ కొనుగోలు చేసిందే అందుకు కదా!! చైతు స్వయంగా తమ షోరూమ్కి రావడం, బైక్ కొనుగోలు చేయడం పట్ల ఆ కంపెనీ నిర్వాహకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్నట్లు చైతు బైక్ మీద ప్రయాణం చేసే సినిమాగా 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదేకాకుండా చైతు 'ప్రేమమ్' సినిమాలో నటిస్తున్నాడు. | 0business
|
Hyderabad, First Published 17, Aug 2019, 8:05 AM IST
Highlights
విజయ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని తీసుకోవాలని పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఛార్మి.. జాన్వీతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఆమె గనుక అంగీకరిస్తే సినిమాకు హైప్ వస్తుందని భావిస్తున్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ తన ప్రొడక్షన్ పార్టనర్ ఛార్మితో కలిసి ఇటీవల ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తన బ్యానర్ పై సినిమా తీయబోతున్నాడు. నిజానికి పూరి తీసిన 'ఇస్మార్ట్ శంకర్' విజయ్ కోసం రాసుకున్న కథ అని చెబుతారు.
కానీ అతడితో చేయడం కుదరలేదు. ఇప్పుడు వీరి కాంబోలో సినిమా అంటే ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన కాస్టింగ్ ప్రాసెస్ జరుగుతోంది. విజయ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని తీసుకోవాలని పెద్ద ప్లాన్ చేస్తున్నారు.
ఈ మేరకు ఛార్మి.. జాన్వీతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఆమె గనుక అంగీకరిస్తే సినిమాకు హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల ఓ టీవీ షోలో జాన్వీ టాలీవుడ్ లో తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని అతడితో కలిసి నటించాలనుందని చెప్పింది. ఇప్పుడు పూరి చెప్పే కథ గనుక ఆమెకి నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అప్పుడు విజయ్ దేవరకొండ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతుంది. మరి తన తల్లి మాదిరి తెలుగులో కూడా జాన్వీ సత్తా చాతుతుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బయోపిక్ అలానే 'తక్త్' అనే చిత్రాల్లో నటిస్తోంది!
Last Updated 17, Aug 2019, 8:05 AM IST | 0business
|
మార్చి 24న మణిరత్నం డ్యూయెట్
Highlights
కార్తీ, అదితి రావ్ హీరో-హీరోయిన్లుగా మణిరత్నం మూవీ
డ్యూయెట్ టైటిల్ తో వస్తున్న మూవీ రిలీజ్ మార్చి 24న
ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు మణిరత్నం ఓకె బంగారం సినిమా తరువాత కూడా మరోసారి తన మార్క్ రొమాంటిక్ టచ్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కార్తీ, అదితీరావ్ హైదరీలు హీరో హీరోయిన్లుగా మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మణిరత్నం తన సొంతం నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్ లో స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న మణిరత్నం ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగులో డ్యూయెట్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
Last Updated 25, Mar 2018, 11:38 PM IST | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఒట్టేశాం కదా అని ఓటేస్తే.. పవన్ని గాంధీతో పోల్చిన హైపర్ ఆది
పవన్ కళ్యాణ్పై ఈగవాలినా తన పంచ్లకు పనిచెప్తాడు. పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనే కోరికతో జనసైనికుడిగా మారాడు. తనవంతుగా తన మాటల తూటాలను పెట్టుబడిగా పెట్టి పవర్ ఫుల్ పంచ్లతో జనసేనకు అండగా నిలుస్తున్నాడు.
Samayam Telugu | Updated:
Oct 16, 2018, 04:46PM IST
ఒట్టేశాం కదా అని ఓటేస్తే.. పవన్ని గాంధీతో పోల్చిన హైపర్ ఆది
హైపర్ ఆది.. జబర్దస్త్ కామెడీ షోలో తనదైన శైలి పంచ్లతో పాపులర్ అయిన ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వీర విధేయుడు. జనసేన పార్టీకి స్పోక్ పర్సన్. పవన్ కళ్యాణ్పై ఈగవాలినా తన పంచ్లకు పనిచెప్తాడు. పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనే కోరికతో జనసైనికుడిగా మారాడు. తనవంతుగా తన మాటల తూటాలను పెట్టుబడిగా పెట్టి పవర్ ఫుల్ పంచ్లతో జనసేనకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా సోమవారం నాడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో నిర్వహించిన ‘జనసేన కవాతు’లో పాల్గొని జనసైనికుల్లో ఉత్సాహం నింపారు.
Recommended byColombia
జబర్దస్త్ ప్రాసతో తనదైన శైలి యాసను జతచేసిన హైపర్ ఆది పంచ్ పటాకా లాంటి ప్రసంగం ఇదే..
‘ధవళేశ్వరం బ్రిడ్జి మీద కొన్ని మైళ్లు పరిగెత్తి.. అవతలవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ అవతలివాళ్లు అంటే కార్యకర్తలు కాదు.. నిజాయితీ లేని అవినీతి నాయకుల గుండెల్లో. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు సమస్యలపై పోరాడుతున్నారు.. మిగిలిన వాళ్లు ఆయనపై పోరాడుతున్నారు. వీళ్లు స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పుట్టి ఉంటే.. బ్రిటీష్ వాళ్ల మీద కాకుండా గాంధీజీ మీద పోరాటం చేసేవాళ్లు. ఖచ్చితంగా ఇప్పుడు అలాంటిదే జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ గెలిస్తే.. ప్రజలు బాగుపడతారు. వేరేవాళ్లు ఎవరు గెలిచినా నాయకులు బాగుపడతారు. త్వరలో మీ ఇంటికి ఓట్ల కోసం వస్తారు.. మీకు డబ్బులు ఇస్తారు. మీ పిల్లలపై ఒట్లు పెట్టించుకుంటారు. ఒట్టేసి మాట తప్పితే మీ పిల్లలకు ఏమౌతుందో చెప్పలేను కాని.. ఒట్టేశాం కదా అని ఓటేస్తే.. మీ పిల్లలకు భవిష్యత్ ఉండదు.
ప్రస్తుత రాజకీయాల్లో నిస్వార్ధ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఒక్కసారి ఆయనకు ఓటు వేసి చూడండి ఐదు సంవత్సరాలు కాపాడే బాధ్యత ఆయనిది. ఒక్కడకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటు వేస్తే చాలు ఆయన సీఎం అయిపోవడం ఖాయం. మీరు మాత్రమే ఓటు వేయడమే కాకుండా మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరితో ఓటు వేయించాలని కోరారు హైపర్ ఆది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
GST
జిఎస్టీతో మారనున్న భారత్ రూపురేఖలు
బెంగళూరు,జూలై 20: జిఎస్టి అమలుతో ఈ ఆర్థికసంవత్సరంలో భారత్ మరింత శరవేగంగా వృద్ధిచెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలు స్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచదేశాల్లో పెద్ద ఆర్థికవ్యవస్థ కలిగిన దేశంగా భాసిల్లుతుందని అంచనా. కొత్త పన్నుల వ్యవస్థద్వారా భారత్ ఆర్థికవృద్ధి మరింత పెరుగుతుం దని, అంతేకాకుండా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్ల కోతపై కూడా కొంత దోహదంచేస్తుందని అంచనావేస్తున్నారు. రెండుదశాబ్దా లుగా జిఎస్టి అమలుపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోవడం తో ప్రభుత్వం అతిపెద్ద దేశీయ పన్నుల సంస్కరణలను తెచ్చిం ది. ఈ కొత్తపన్నులకారణంగా బహుళపన్నులవిధానం తొలగి ఒకేపనున్న ఒకేదేశంగా భాసిల్లింది.
మొత్తం 35 మంది ఆర్థిక వేత్తల అంచనాలను చూస్తే భారత్ ఆర్థికవ్యవస్థ ఈఆర్థిక సంవ త్సరంలో 7.3శాతంగా ఉంటుందని అంచనావేసారు. 2017 లో క్రమేపీ వృద్ధిచెంది 2018 మార్చినాటికి వృద్ధి పెరుగు తుందని, గత ఏడాది ప్రభుత్వం ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నుంచి ఇపుడిపుడేఆర్థికవ్యవస్థ కుదుటపడుతున్నట్లు ఆర్థికవేత్తలు చెపుతున్నారు. గతంలో చేసిన అంచనాలు 7.5శాతం నుంచి కొంత వృద్ధి అంచనాలను తగ్గించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆర్థికవృద్ధి అంచనాలను 7.2శాతంగా ప్రకటించింది. అదేసమయంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న చైనా 6.6శాతంగా ఉంది. జిఎస్టి స్థూల దేశీయోత్పత్తికి మరో రెండుశాతం పాయింట్లను చేరుస్తుందని అంచనా. మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా పన్ను ఆటం కాలను తొలగించి ఏకీకృత మార్కెట్ స్థాపనకు మార్గం వేస్తుందని, ఎగుమతిదారులమధ్య పోటీతత్వం పెరిగిబిజినెస్ సానుకూలత మరిం త పెరుగుతుందని హెచ్డిఎఫ్సి బ్యాంకు సీనియర్ ఆర్థికవేత్త తుషార్ అరోరా వెల్లడించారు.
ఎన్ఎస్ఇ నిఫ్టీ సోమవారం రికార్డుస్థాయికిపెరిగి 20శాతం నమోదుచేసింది. ఇదేతరహా ర్యాలీ ఈ ఏడాదిలో కొనసాగు తుందని కూడా అంచనావేస్తున్నారు. రుతుపవనాలు సాధారణ సగటు కంటే ఎక్కువ ఉంటుందని, దీనివల్ల వ్యవసాయ రంగ దిగుబడులు పెరుగుతాయని చెపుతున్నారు. భారత్ రెండులక్షలకోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం 15శాతం గా ఉందని 130కోట్ల జనాభాలో 50 శాతానికిపైగావ్యవసాయంపైనే ఆధార పడి ఉన్నందున సగటు వేతనం పెరు గుతుందని చెపుతున్నారు. భారత్ రిటైల్ద్రవ్యోల్బణం 1.54శాతంగా ఉం ది. అయితే 2018 మధ్యస్తం నాటికి కొంతపెరుగుతుందని అంచనా. కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని నిపుణుల అంచనా. ఆగస్టు 2వ తేదీ బ్యాంకు పాలకవర్గ సమావేశం జరుగనున్నది. ఆర్బిఐ వచ్చే కొన్నినెలలకు సరళీకృత విధానాలు అనుసరించే అవకాశం ఉం దని, నాలుగుశాతం ద్రవ్యోల్బణ లక్ష్యా నికి అనుగుణంగా కృషిచేస్తుందని హెచ్ఎస్బిసిసెక్యూరిటీస్ముఖ్య ఆర్థిక వేత్త ప్రాంజల్భండారి వెల్లడించారు. వచ్చేఏడాది చివరివరకూ ఆర్బిఐ వైఖరి కొంతస్థిరంగానే కనిపిస్తుందని ఆర్థికవేత్తల అంచనాగా ఉంది | 1entertainment
|
మూడు లక్షలు దాటితే...అంతే
- సిట్ సిఫారసులతో కేంద్రం అడుగులు
న్యూఢిల్లీ : నల్లధనానికి చెక్ పెట్టే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్) సిఫారసులకనుగుణంగా నగదు లావాదేవీలపై పరిమితిని విధించనుంది. దేశఆర్థిక వ్యవస్థలో నల్లధనం చలామణిని నిరోధించే లక్ష్యంతో రూ. 3 లక్షలు దాటిన నగదు లావాదేవీలను నిషేధించునుంది. బంగారం ఆభరణాలు, ఇతర నగదు మార్పిడిలపై కొరడా ఝుళిపించనుంది. నగదు ఒప్పందాలు, నగలు లేదా కార్లను కొనుగోలు ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇలా లెక్కల్లోకి రాని భారీ లావాదేవీలు బహిర్గతం కానున్నాయి. అయితే ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కొంత పరిమితి మేరకే లావాదేవీలను అనుమతిస్తున్నట్టు సిట్ ఉదహరించింది. రూ. 3 లక్షల పరిమితిని మించిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, చెక్కుల లావాదేవీలను సులభంగా గుర్తించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
సిట్ సిఫారసు చేసిన రూ 15 లక్షలకు పైన నగదు నిల్వలను నిషేధించే అంశంపై కూడా తీవ్రంగా ఆలోచిస్తోందని తెలిసింది. వాణిజ్య, ఇతర పరిశ్రమల వ్యతిరేకత కారణంతో రూ .15 లక్షల నగదు హౌల్డింగ్స్ నిషేధం ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్యతో పన్ను అధికారుల వేధింపులు పెరుగుతాయనే ఆందోళన వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
కాగా నగదు రహిత లావాదేవీలపై దష్టిపెట్టిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రభుత్వసేవలపై డెబిట్, క్రెడిట్, చార్జీలను రద్దు చేసింది. ప్రభుత్వం ఇప్పటికే ఆస్తుల లావాదేవీల్లో రూ .20,000కు పైన క్యాష్ అడ్వాన్స్లపై నిషేధం సహా పలు చర్యలకు ఉపక్రమించింది. బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించే సమయంలో ఇదే విధమైన పరిమితిని విధించిన సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Visit Site
Recommended byColombia
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాకు సీక్వెల్ను ప్రకటించాడు వర్మ. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్.. ఇతర ముఖ్య నాయకులపై వల్లభనేని వంశీ చేస్తున్న తీవ్ర ఆరోపణలు, ఫైరింగ్ ఇంటర్వ్యూలు చూసిన తరువాత ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చిందంటూ ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్ను సీక్వెల్కు ఫిక్స్ చేశాడు వర్మ.
ఇదిలా ఉంటే.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా లోకేష్ బాబుని కించపరుస్తూ పప్పు లాంటి అబ్బాయి అనే ప్రోమో సాంగ్ను విడుదల చేశాడు వర్మ. ఈ పాటపై పెద్ద వివాదమే నడుస్తున్న సందర్భంలో వల్లభనేని వంశీ కూడా లోకేష్ బాబుని పప్పు అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.
అయితే తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటూ లోకేష్ బాబుని పప్పు అని ప్రత్యేకించి నేను అన్నది లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను లోకేష్ బాబుని ఎప్పుడూ అన్న అని నేను అనలేదు. అతను నాకంటే చిన్నవాడు.. బాబు అనే అనేవాడిని. లోకేష్ని పప్పు అని, గున్న ఏనుగు అని నేను అనలేదు. ఎవడో రామ్ గోపాల్ వర్మ అనేవాడు అన్నాడు. అది ఒక కోటిమంది చూశారు. నేను పప్పు అని అన్నానా? పప్పు లాంటి అబ్బాయి అనే పాట నేను తీశానా? చెప్పండి.
వాడెవడ్నో అడిగితే గూగుల్లో ఏపీ పప్పు అని కొట్టు చూడు అన్నాడు. నాకు నిజంగానే తెలియక.. గూగుల్లో ఏపీ పప్పు అని కొట్టా. మీరు కూడా కొట్టి చూడండి. లోకేష్ బాబు పేరు రాకపోతే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా. ప్రత్యేకించి లోకేష్ను నేను పప్పు అని అనడం ఏంటి? ఎవడో రామ్ గోపాల్ వర్మ అనేవాడు పప్పు అని అన్నాడు. వాడు ఎక్కడో బొంబాయిలో ఉంటాడు ఎవరికీ కనిపించడు కాబట్టి వాడ్ని కెలికితే ఇంకేం తీస్తాడో అని భయం వీళ్లకు. చెరుకురసం తీయగా ఉందని.. పాలు తీయగా ఉంటాయని.. పప్పు వేసినట్టు చూపిస్తాడో అని రామ్ గోపాల్ వర్మని ఏం చేయలేక నన్ను అంటారేంటి?
See Photo Story: కస్సుమనే మిస్ఇండియా అందాలే... డోంట్ మిస్ నికితా గోఖలే
మీకు దమ్ముంటే వర్మగాడ్ని పట్టుకోండి వాడికి నోటీసులు ఇవ్వండి. ఎక్కడున్నాడో ఆ రామ్ గోపాల్ వర్మ బయటకు లాగండి. వాడు ‘రెడ్డి రాజ్యంలో కమ్మ ఫ్యాన్స్’ అని సినిమా తీస్తానంటున్నాడు. ఎవడి ఇష్టం వాడిది. నేను కూడా ‘టచ్ చేసి చూడు’ అని సినిమా తీశా. ఎవడైనా నన్ను టచ్ చేస్తే కరెంట్ షాక్ ఏమైనా తగులుతుందా? నేను వారసత్వ రాజకీయాలు గురించి మాట్లాడా.. అయితే మా అబ్బాయినే అన్నాడని మీరు ఎలా అంటారు. మీ అబ్బాయి కాకుండా రాజకీయాల్లో ఇంకెవరూ లేరా? నేను ఇప్పటి వరకూ చాలా సరళమైన భాషలోనే మాట్లాడా? వాళ్లే వివాదం చేసుకుంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు వల్లభనేని వంశీ.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
హాలీవుడ్ మూవీ జురాసిక్ పార్క్ లో ఆఫర్ తిరస్కరించిన శ్రీదేవి
Highlights
భారత చిత్ర పరిశ్రమలో తిరుగులేని తారగా శ్రీదేవి
బాలీవుడ్ లో బిజీగా వుండటంతో హాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించిన శ్రీదేవి
అందాల నటి తిరస్కరించిన ఆఫర్లలో బాహుబలి శివగామి కూడా ఒకటి
అందం, అభినయంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక ముద్రవేసింది ‘అతిలోక సుందరి’ శ్రీదేవి. నిజంగానే ఇంద్రలోకం నుంచి దిగొచ్చిన దేవ కన్యలా అనిపిస్తుందామె. తన పాత్ర ప్రాధాన్యం, నిడివి వంటి అంశాలను జాగ్రత్తగా గమనించుకున్నాకే శ్రీదేవి ఏ చిత్రానికైనా సంతకం చేసేదట. పాత్రల ఎంపికలో అంత నిక్కచ్చిగా వ్యవహరించే ఈమె ఓ సంచలన సినిమాన్ని వదులుకున్నారు. 1993లో స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ‘జురాసిక్ పార్క్’లో ఓ పాత్రను పోషించాల్సిందిగా దర్శకుడు శ్రీదేవిని కోరగా అమె మొదట ఒప్పుకొంది. అయితే అప్పటికే భారత సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతున్న ఈమె హాలీవుడ్కి వెళ్లే ఆలోచన లేకపోవడంతో ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిందట.
తరవాత ఆ పాత్రకు హాలీవుడ్ నటి ఏరియానా రిచర్డ్స్ను తీసుకున్నారట. తర్వాత ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ పాత్రను వదులుకున్నందుకు శ్రీదేవి బాధపడిందట. అయితే ఆమెకి బ్లాక్ బస్టర్ చిత్రాలను తిరస్కరించడం ఇదేం తొలిసారి కాదు. 1993లో షారూక్ ఖాన్, సన్నీడియోల్, జుహీ చావ్లా ప్రధాన తారగణంగా తెరకెక్కిన ‘డర్’లో కథానాయికగా మొదట శ్రీదేవినే సంప్రదించారు. తెలుగు సినీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’ రెండు భాగాల్లో శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవినే అనుకున్నారు. ఆమె కాదనడంతో ఆ అవకాశం రమ్యకృష్ణను వరించింది.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
Apr 02,2015
సతీష్ పద్మనాభన్ సోనీ ఇండియాకు కొత్త బాసు
ముంబయి: సోనీ ఇండియా అమ్మకాల విభాగాధిపతిగా సతీష్ పద్మనాభన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న సునిల్ నయ్యర్ అమెరికాలోని సోనీ యూనిట్కు వెళ్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో పద్మనాభన్ను నియమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. సతీష్ పద్మనాభన్ ప్రస్తుతం సంస్థ టీవీ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
sumalatha 43 Views bse , NSE , stock market
sensex
ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ పుంజుకున్నాయి. లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 95 పాయింట్లు లాభపడి 39,059కి పెరిగింది. నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 11,604కు చేరుకుంది. నిన్న 16.66 శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్ ఈరోజు 1.14 శాతం పెరిగింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/ | 1entertainment
|
Akshay Kumar plays the villain in 'Robot 2'
ఆ బాలీవుడ్ టాప్ హీరో... రోబో-2 విలన్
రోబో 2 లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం
TNN | Updated:
Dec 17, 2015, 11:54AM IST
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న శంకర్ చిత్రం రోబో 2 . రజనీకాంత్, అమీజాక్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ముందు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెంగర్ ను విలన్ గా అనుకున్నారు అయితే... ఆ కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ను ఇండియా తెచ్చి నటింపజేయడానికి చాలా అనుమతులు అవసరం ఉండడంతో విరమించుకున్నారు. తరువాత బాలీవుడ్లో వెతుకులాట ప్రారంభించారు. హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ పేర్లను కూడా పరిశీలించారు. అప్పటికే ధూమ్ 2 లో విలన్ గా చేసిన అనుభవం హృతిక్ కి ఉంది. మరెందుకో కాని వారిద్దరినీ కూడా తప్పించారు. ఆ ఛాన్స్ ను బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ దక్కించుకున్నట్టు సమాచారం. బుధవారం సాయంత్రం అక్షయ్ ముంబయి నుంచి చెన్నై వెళ్లి దర్శకుడు శంకర్, హీరో రజనీకాంత్ లను కలిసి వచ్చారు. సినిమా షూటింగ్ ప్రారంభ పూజలో కూడా పాల్గొన్నారు. ఆ సినిమాకు పనిచేసేవారందరిని పరిచయం చేసుకున్నారు. ఇంకా చిత్రయూనిట్ మాత్రం అక్షయ్ కుమారే విలన్ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అక్షయ్ కూడా ఈ విషయంపై నోరు విప్పడం లేదు. | 0business
|
Aug 08,2017
11లక్షల పాన్ కార్డులు రద్దు
న్యూఢిల్లీ : నకిలీ పాన్కార్డుల రద్దునకు కేంద్ర ప్రభుత్వం నడుంకట్టింది. ఇందు కోసం ప్రభుత్వంతో పాటు ఆదాయపన్ను శాఖ కూడా చురుగ్గా పని చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం జులై 27 నాటికి దేశ వ్యాప్తంగా 11,44,211 నకిలీ పాన్ కార్డులను రద్దు చేసినట్టుగా సమాచారం. అలాగే ఈ నెలాఖరు నాటికి ఆధార్తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ పాన్ నెంబర్ పని చేస్తోందో లేదో తెలుసుకో వడానికి ఆదాయపు పన్ను శాఖ పలు సూచనలు ఇచ్చింది.
1. ఆదాయం పన్ను ఈఫైలింగ్ పోర్టల్ సందర్శించవచ్చు.
2. ఇందులోని హోమ్ పేజీలో 'సర్వీ సులు' అనే టాబ్ కింద 'నో యువర్ పాన్' క్లిక్ చేయాలి.
3. అక్కడ మీరు చేయాల్సిన పని. పేరు, పుట్టిన తేదీ, జెండర్, రిజిస్టర్డ్ మొబైల్ నం బర్ను ఇవ్వాలి.
4. రిజిస్టర్ మొబైల్ నంబరుకు వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి వ్యాలిడేట్ అనే బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.
5. దీంతో పాన్ చెల్లుబాటులో ఉన్నట్ట యితే రిమార్క్ కాలంలో 'యాక్టివ్' అన్న సందేశం వస్తుంది.
ఎస్ఎంఎస్తోనూ..
ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ ద్వారానే కాకుండా 567678 లేదా 56161కు ఎస్ఎం ఎస్ చేయడం ద్వారా పాన్ అనుసంధానం చేసుకోనే వీలుంది. ఈ ప్రక్రియకు గానూ యుఐడిపాన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెలు గల మీ ఆధార్ నంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, మీ 10 అంకెల పాన్ నెంబర్ ఎంటర్ చేసి పైన తెలిపిన నెంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. దీన్ని నిర్ధారిస్తూ మొబైల్కు ఒక సందేశం వస్తుంది.
దీంతో కీలకమైన ఆధార్తో పాన్ అనుంసంధానం ముగుస్తుంది. ఆదాయ పన్ను దాఖలుకు ఆధార్తో పాన్కార్డు లింక్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31లోపు ఆధార్తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దువుతాయని ఆదాయ పన్ను శాఖ ఇది వరకే హెచ్చరించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyderabad, First Published 17, Apr 2019, 1:39 PM IST
Highlights
తాజాగా అల్లు అర్జున్ , వేణు శ్రీరామ్ ల కాంబినేషన్ లో రూపొందే చిత్రం ఓ ఫిలిప్పీన్స్ చిత్రం కాపీ అంటూ ప్రచారం మొదలైంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలిజీ రోజులివి. ప్రతీ విషయం ఫింగర్ టిప్స్ మీద ఉంటోంది. అక్కర్లేని సమాచారం సైతం మన మెదళ్లకు ఎక్కేస్తోంది. దాంతో ఏది నిజమో..ఏది అబద్దమో కూడా తెలియకుండా దాన్ని బుర్రకెక్కించుకుని ప్రచారం చేసేస్తున్నాం. ఇది ప్రతీ ఫీల్డ్ లోనూ జరుగుతోంది. సినిమా ఫీల్డ్ లో వచ్చే రూమర్స్ విషయంలో అయితే మరీను. మనకు ప్రమాదం లేదు కదా అని వాటిని ఫార్వర్డ్ చేసేస్తున్నారు. లాజిక్ గా ఆలోచిస్తే అందులో నిజమెంతో తెలిసే అవకాసం ఉన్నా ఎవరూ చేయటం లేదు.
తాజాగా అల్లు అర్జున్ , వేణు శ్రీరామ్ ల కాంబినేషన్ లో రూపొందే చిత్రం ఓ ఫిలిప్పీన్స్ చిత్రం కాపీ అంటూ ప్రచారం మొదలైంది. నాపేరు సూర్య.. సినిమా తరువాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా రీసెంట్ గా ప్రారంభం అయ్యింది. దీని తరువాత సుకుమార్, ఆ తరువాత వేణు శ్రీరామ్ తో సినిమా చేయాలి. రీసెంట్ గా వేణు శ్రీరామ్ తో చేయబోయే సినిమా టైటిల్ అప్పుడే ఎనౌన్స్ చేశారు. ఐకాన్.. కనటబడటం లేదు.
ఈ టైటిల్ ను బట్టి చూస్తే.. ఇది ఫిలిప్పీన్స్ లో రెండేళ్ల క్రితం వచ్చిన కిటకిట సినిమా కాన్సెప్ట్ లా ఉందంటూ ప్రచారం మొదలైంది. ఆ సినిమాలో హీరో హీరోయిన్లు అనుకోకుండా కలవడం అదే సమయంలో హీరోయిన్ తన కళ్ళను తాత్కాలికంగా కోల్పోవడంతో... ఆమెకు హీరో తోడుగా ఉండి జర్నీ చేస్తాడు. కామెడీ, సెంటిమెంట్ డ్రామా ఎక్కువగా ఉన్న ఫిలిప్పీన్స్ సినిమా ఆకట్టుకుంది.
అయితే అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో చేయదగ్గ కథ కాదది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అది. అందులో హీరో ప్రాధాన్యత పెద్దగా ఉండదు. అలాంటి కథను ఏదో చిన్న హీరోలు అయితే చేయగలుగుతారు కానీ బన్ని వంటి స్టార్ వ్యాల్యూ ఉన్న హీరోకు ఎన్ని మార్పులు చేసినా చేయటం కష్టం. అల్లు అర్జున్ కూడా కమర్షియల్ కొలతలు తెలిసిన వాడే కావటంతో ఆయన కూడా ఒప్పుకోరు. కేవటం టైటిల్ చూసి ఫలానా సినిమాకు ఫ్రీమేక్ అని ప్రచారం చేయటం మాత్రం దారుణం.
Last Updated 17, Apr 2019, 1:39 PM IST | 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.