news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
26 వారాల పేరెంటల్ సెలవు
Zomato
ముంబై: జొమోటోలో పనిచేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్. సరికొత్త సెలవుల విధానాన్ని ప్రకటించింది జొమోటో. 26 వారాల ప్రసూతి సెలవుల్ని ప్రకటించింది. సాధారణంగా మాతృత్వ సెలవులు, పితృత్వ సెలవులు వేర్వురుగా ఉంటాయి. మహిళలకు ఎక్కువ రోజులు, పురుషులకు కొంత తక్కువ సెలవులు ఇస్తాయి కంపెనీలు. కానీ జొమోటో మాత్రం స్త్రీ, పురుషులకు సమానంగా 26 వారాల సెలవులను ప్రకటించడం విశేషం. భారతదేశంలో మహిళలకు 26 వారాల ప్రసూతి సెలువులు ఇచ్చే సంస్థ చాలానే ఉన్నాయి. కానీ పురుషులకు కూడా అన్ని రోజులు పితృత్వ సెలవులు ఇచ్చే కంపెనీలు చాలా తక్కువనే ఉన్నాయి. కుటుంబంతో గడిపేందుకు సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తించి ఈ కొత్త సెలవుల విధానాన్ని అమలుచేస్తోంది జొమోటో. అంతేకాకుండా వెయ్యి డాలర్లు కూడా ఇవ్వనుంది సంస్థ. పిల్లల్ని కనే తల్లిదండ్రులకు 26 వారాల సెలవుల్ని ప్రకటించిన కంపెనీ జొమోటో మాత్రమే కాదు, గత ఏడాది ఫర్నీచర్ కంపెనీ ఐకియా కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేసింది. మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు, మరో 16 వారాలు డ్యూటీ టైమింగ్స్లో 50 శాతం వెసులుబాటు కల్పించింది. పురుషులకు 26 వారాల సెలవు కూడా అమలు చేసింది. భారతదేశంలో మెటర్నీటీ బెనిఫిట్స్ యాక్ట్, 1961ప్రకారం సంస్థలన్నీ 26 వారాల మాతృత్వ సెలవులు తప్పనిసరి. కానీ పితృత్వ సెలవులపై కఠినమైన నిబంధనలేవీ లేవు. అయితే పిల్లల్ని కనడం, వారి బాగోగులు చూసుకోవడంలో తల్లితో పాటు తండ్రి పాత్ర కూడా ఉంటుంది. డెలివరీ సమయంలో, ఆ తర్వాత తల్లితోపాటు తండ్రి కూడా పిల్లల దగ్గర సమయం గడపాల్సి ఉంటుంది. అందుకే మహారాష్ట్రకు చెందిన ఎంపి రాజీవ్ సతవ్ గతంలో పార్లమెంట్లో పెటర్నిటీ బెనిఫిట్ బిల్ ప్రతిపాదించారు. తల్లితోపాటు తండ్రికి కూడా సమానమైన బెనిఫిట్స్ రావాలని కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/ | 1entertainment
|
MALINGA
మలింగ అరుదైన ఘనత
కొలంబో: శ్రీలంక పేసర్ లసిత్ మలింగ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి జట్లను హడలెత్తించిన మలింగా తన కెరీర్లో 200వ వన్డే ఆడుతున్నాడు. భారత్తో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డే మలింగాకు 200వ వన్డే కావడం విశేషం.తద్వారా శ్రీలంక తరుపున 200వ వన్డే ఆడుతున్న 13వ క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. శ్రీలంక తరుపున బౌలర్లలో మురళీధరన్, చమిందావాస్ల తర్వాత ఆ ఘనత సాధించిన మూడో బౌలర్గా మలింగా అరుదైన ఘనత సాధించాడు. దీంతో పాటు మలింగా మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం వన్డేల్లో 298 వికెట్లు తీసిన మలింగా శ్రీలంక తరుపున 300 వన్డే వికెట్లను సాధించడానికి ఇంకా రెండు వికెట్ల దూరంలో నిలిచాడు. | 2sports
|
మెక్గ్రాత్
పేస్ బౌలర్లు రావడం శుభ పరిణామం:మెక్ గ్రాత్
సిడ్నీ: గత కొంతకాలంగా భారత్ క్రికెట్ నుంచి నాణ్యమైన పేస్ బౌలర్లు వస్తుండటం ఆజట్టుకు శుభ పరిణామమని ఆసీస్ దిగ్గజఆటగాడు మెక్గ్రాత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో పేస్ విభాగంలో తీవ్రమైన పోటీ నెలకొనడమే ఇందుకు ఉదాహరణగా తెలిపారు. కేవలం స్పిన్నర్లు, బ్యాట్స్ మెన్లకు మాత్రమే అనుకూలించే భారత పిచ్లపై పేసర్లు తయారుచేయడం చాలా కష్టమని ఈ సంద ర్భంగా మెక్గ్రాత్ అభిప్రాయ పడ్డారు. భారత్ నుంచి పాస్ట్ బౌలర్ తయారు కావడం అనేది కఠినమైన జాబ్ వంటిదన్నారు. ప్రధానంగా స్పిన్, బ్యాటింగ్ పిచ్లే భారత్లో మనకు కనిపిస్తాయి. అటువంటి తరుణంలో కూడా అక్కడ నుంచి పేసర్లు రావడం నిజంగా అద్భుతమేనన్నారు.భారత్లో పేసర్ తయా రు కావాలంటే విపరీతమైన శ్రమ అవసరమన్నారు. ఎంతో శ్రమిస్తే కానీ భారత్లో పేసర్ తయారు కాలే డన్నారు. ప్రస్తుతం భారత్లో పలువురు బౌర్లు 140కి.మీకు పైగా వేగంతో బౌలింగ్ వేస్తున్నారు. అది ఆజట్టు భవిష్యత్తుకు భరోసా ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని మెక్ గ్రాత్ తెలిపాడు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పాక్ని గెలిపించిన ఇంజిమామ్ మేనల్లుడు
పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్ మేనల్లుడు అరంగేట్రం వన్డేలోనే శతకంతో సత్తాచాటాడు. అబుదాబి వేదికగా
TNN | Updated:
Oct 19, 2017, 12:53PM IST
పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్ మేనల్లుడు అరంగేట్రం వన్డేలోనే శతకంతో సత్తాచాటాడు. అబుదాబి వేదికగా శ్రీలంకతో బుధవారం రాత్రి జరిగిన వన్డేలో ఇమామ్ ఉల్ హక్ (100: 125 బంతుల్లో 5x4, 2x6) సెంచరీ సాధించడంతో 209 పరుగుల లక్ష్యాన్ని పాక్ 42.3 ఓవర్లలోనే ఛేదించింది. దేశవాళీ టోర్నీలో ఇమామ్ మెరుగ్గా రాణించడంతో పాక్ వన్డే జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేశారు. అతని మేనమామ పైరవీలతోనే ఈ ఎంపిక జరిగినట్లు విమర్శలు వచ్చాయి. కానీ.. తొలి వన్డేలో శతకం బాది తన ఎంపిక ప్రతిభ ఆధారంగానే జరిగిందని ఇమామ్ నిరూపించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ (5/34) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఓపెనర్ పఖార్ జమాన్ (29: 40 బంతుల్లో 2x4, 1x6) ఆదిలోనే ఔటైనా.. బాబర్ అజామ్ (30: 39 బంతుల్లో 1x4)తో కలిసి ఇమామ్ ఉల్ హక్ జట్టుని గెలుపు దిశగా నడిపించాడు. అయితే.. వ్యక్తిగత స్కోరు 89 వద్ద శ్రీలంక వికెట్ కీపర్ డిక్వెల్లా క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న ఇమామ్ అరంగేట్రం వన్డేలోనే శతకం సాధించిన రెండో పాకిస్థాన్ క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మొత్తంగా వన్డే క్రికెట్ చరిత్రలో 13వ ఆటగాడు. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
అందరి ముందే కన్నీళ్లు పెట్టుకున్న సల్మాన్ ఖాన్!
స్టార్ హీరోలకి సినిమాల్లో తప్ప రియల్ లైఫ్లో కన్నీళ్లు రావనేది చాలామంది అభిప్రాయం. కానీ ఆ అభిప్రాయం సరైంది కాదు అని
TNN | Updated:
Apr 23, 2016, 09:36PM IST
స్టార్ హీరోలకి సినిమాల్లో తప్ప రియల్ లైఫ్లో కన్నీళ్లు రావనేది చాలామంది అభిప్రాయం. కానీ ఆ అభిప్రాయం సరైంది కాదు అని అప్పుడప్పుడు అమీర్ ఖాన్ లాంటి నటులు నిరూపిస్తూనే వున్నారు. తాజాగా ఆ జాబితాలో సల్మాన్ ఖాన్ కూడా చేరిపోయాడు. అవును.. ప్రస్తుతం సుల్తాన్ సినిమా షూటింగ్తో బిజీగా వున్న సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఓ సెంటిమెంట్ సాంగ్ కూడా పాడాడట. ఆ సాంగ్ రికార్డింగ్ అయిపోగానే నిజంగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడట సల్మాన్. ఆ సాంగ్లో అంతగా లీనమైన సల్మాన్కి కాసేపు మాటలు సైతం రాలేదని యూనిట్ వర్గాలు చెప్పినట్టుగా బాలీవుడ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. సల్మాన్ని అంతగా డిస్టర్బ్ చేసిన ఆ సాంగ్ ఎలా వుండనుంది ? ఏంటనే ఆలోచనలు అప్పుడే మొదలయ్యాయి కదా.. మరి ఆ సాంగ్లో ఎంత సెంటిమెంట్ వుందో తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం వేచిచూడక తప్పదు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సిక్సర్ల వరల్డ్ రికార్డ్ ముంగిట రోహిత్ శర్మ
బంగ్లాదేశ్తో రెండో టీ20లో సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ ఆదివారం మూడో టీ20లో మరో రెండు సిక్సర్లు బాదితే.. భారత్ తరఫున వరల్డ్ రికార్డ్ నెలకొల్పనున్నాడు.
Samayam Telugu | Updated:
Nov 9, 2019, 10:11AM IST
Rohit Sharma
భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన వరల్డ్ రికార్డ్ ముంగిట ఉన్నాడు. బంగ్లాదేశ్తో రాజ్కోట్ వేదికగా గురువారం రాత్రి ముగిసిన రెండో టీ20 మ్యాచ్లో ఆరు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో 398 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. ఇక నాగ్పూర్ వేదికగా ఆదివారం మూడో టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరో రెండు సిక్సర్లు బాదితే..? ఇంటర్నేషనల్ క్రికెట్లో 400 సిక్సర్ల మైలురాయిని అందుకున్న మూడో ఆటగాడిగా నిలవనున్నాడు.
Read More: రోహిత్ శర్మ 6, 6, 6 వెనుక గొడవే కారణమా..?
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్గేల్ 534 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 398 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ.. రెండు సిక్సర్లు బాదడం ద్వారా.. 400 సిక్సర్ల మైలురాయిని అందుకోవడంతో పాటు భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నాడు.
Read More: అప్పట్లో సచిన్.. ఇప్పుడు రోహిత్ అంతే: సెహ్వాగ్
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ 218 వన్డేలాడిన రోహిత్ శర్మ 232 సిక్సర్లు బాదేశాడు. అలానే 100 టీ20ల్లో 115 సిక్సర్లు, 30 టెస్టుల్లో 51 సిక్సర్లు నమోదు చేశాడు. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్లో పరుగుల వరద పారించిన రోహిత్ శర్మ.. ఈ ఏడాదిలోనే ఏకంగా 66 సిక్సర్లు బాదేయడం విశేషం.
Read More: IPL 2020: చెన్నై జట్టులో అదొకటే మార్పు..!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
టీమిండియాతో అనుష్క ఫోటో... ఆడటానికి వెళ్లారా..? హనీమూన్ కోసం వెళ్లారా అంటూ ఫ్యాన్స్ సెటైర్లు
Highlights
తొలి టెస్టులో గెలిచే మ్యాచ్ను చేజేతులా కోల్పోవడంతో భారత అభిమానులు టీమిండియాపై ఫైర్ అవుతున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా చెత్త షాట్లు ఆడి ఓటమి పాలయ్యారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ షేర్ చేసిన ఫోటో అభిమానుల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది.
తొలి టెస్టులో గెలిచే మ్యాచ్ను చేజేతులా కోల్పోవడంతో భారత అభిమానులు టీమిండియాపై ఫైర్ అవుతున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా చెత్త షాట్లు ఆడి ఓటమి పాలయ్యారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ షేర్ చేసిన ఫోటో అభిమానుల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది. టీమిండియా ఆటగాళ్లు లండన్లోని భారత హై కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా దిగిన ఫోటోలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది.. అయితే వీరితో పాటు బాలీవుడ్ నటి, కోహ్లీ సతీమణి అనుష్కశర్మ ఉండటం వివాదాస్పదమవుతోంది. ‘‘టీమిండియా అధికారిక కార్యక్రమానికి ప్రైవేట్ వ్యక్తులు హాజరు కావడం ఏంటంటూ’’ సోషల్ మీడియాలో చిర్రుబుర్రులాడుతున్నారు.
‘‘ఏమాత్రం విజ్ఞత లేకుండా అనుష్మ శర్మ ప్రవర్తించిందని.. వీళ్లేనా చెత్త గురించి సోషల్ మీడియాలో నీతులు బోధించిందని’’ విమర్శిస్తున్నారు. ‘‘ఇంగ్లాండ్ టూర్కు కొందరి భార్యలను మాత్రమే ఎందుకు అనుమతించింది.. వారు క్రికెట్ ఆడటానికి వెళ్లారా..? లేక హనీమూన్కా’’ అని ప్రశ్నించారు.. ‘‘టీమిండియా వైస్ కెప్టెన్ చివర ఎక్కడో నిలబడితే.. జట్టుతో ఏమాత్రం సంబంధం లేని టీమిండియా ఫస్ట్ లేడీ మాత్రం ముందు నిలబడిందని’’ ఆరోపించారు. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Bigg Boss 3 Telugu: బాబా భాస్కర్ కన్నీటిపై జాఫర్ భావోద్వేగ పోస్ట్
Bigg Boss 3 Telugu: బిగ్ బాస్ హౌస్లో అందర్నీ నవ్విస్తూ.. నవ్వుతూ ఉండే బాబా భాస్కర్ భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచారంటూ గుక్కపెట్టి ఏడ్చారు. ఈ సందర్భంగా జాఫర్ ఎమోషనల్ పోస్ట్ వదిలారు.
Samayam Telugu | Updated:
Aug 21, 2019, 01:08PM IST
Bigg Boss 3 Telugu: బాబా భాస్కర్ కన్నీటిపై జాఫర్ భావోద్వేగ పోస్ట్
ఆడలేక మద్దెల ఓడిందని చెప్పడం అసమర్థులు చేసే వాదన. బిగ్ బాస్ హౌస్లో పరిస్థితి చూస్తే ఇదే అనిపిస్తుంది. వాళ్లు ఆడలేరు.. ఎదుటి వాళ్లు గేమ్ ఆడుతుంటే చూసి ఓర్వలేక ఆరోపణలు గుప్పిస్తుంటారు. బిగ్ బాస్ హౌస్లో తొలి ఎపిసోడ్ నుండి 16 మంది కంటెస్టెంట్స్లోనూ మోస్ట్ ఎనర్జిటిక్ ఎంటర్టైన్ అందించేది వన్ అండ్ ఓన్లీ బాబా భాస్కర్ మాత్రమే.
Read Also: బిగ్ బాస్: ఆ ఇద్దర్నీ పంపేందుకే ఈవారం ఎలిమినేషన్ స్కెచ్?
కిచెన్ దగ్గర నుండి క్లీనింగ్ వరకూ.. దోసెలు వేసే దగ్గర నుండి దద్దరిల్లే స్టెప్పుల వరకూ.. ఆడాలన్నా పాడాలన్నా.. నవ్వాలన్నా.. నవ్వించాలన్నా ఒక్క బాబా భాస్కర్కే చెల్లింది. ‘ముఖాముఖి’ జాఫర్తో సైతం మెలికలు తిగిగే స్టెప్పులు వేయించి.. యోగాసనాలు చేయించి వహ్ వా అనిపించారు. బిగ్ బాస్ సీజన్ 3లో ఎనిమిద కంటెస్టెంట్గా అడుగుపెట్టిన బాబా భాస్కర్పై మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఇది తెలుగు బిగ్ బాస్ మరి తమిళ కొరియోగ్రాఫర్ని ఎలా తీసుకువస్తారు.. మన తెలుగు వాళ్లు ఎవరూ బిగ్ బాస్కి కనిపించలేదా? మనలో టాలెంట్ లేదా? అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
Read Also: బిగ్ బాస్ ఓటింగ్ విధానం ఇలా..
అయితే ఠాగూర్ సినిమాలో చెప్పినట్టు తెలుగువాళ్లకి కాస్త సెంటిమెంట్ ఎక్కువే.. ఎవరైనా నచ్చారు అంటే గుండెల్లో పెట్టుకుంటారు. వాళ్లు వీళ్లు అని కాదు.. ఎక్కడివాడైనా మనవాడే అనుకుంటారు. బాబా భాస్కర్ని కూడా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు బయట ఆడియన్స్ కూడా గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఆయన నామినేషన్లో ఉన్నా.. లక్షలాదిగా ఓట్లు వేసి గెలిపిస్తున్నారు.
Read Also: అనసూయ, రష్మిలను మించిపోయిన పటాస్ పోరి నాభి శోయగాలు
అయితే అందర్నీ నవ్వించే బాబా భాస్కర్ని నిన్నటి ఎపిసోడ్లో ఏడిపించాడు హౌస్కి కెప్టెన్గా ఉన్న అలీ. పైగా మీరు గేమ్ని సీరియస్ తీసుకోవడంలేదని.. నటిస్తున్నట్టుగా అనిపిస్తుంది? అందరితో మంచి అనిపించుకోవడానికి నిజాయితీగా గేమ్ ఆడటం లేదని ఆరోపణలు గుప్పించారు. అలీ దృష్టిలో ఆడియన్స్ను నవ్వించడం.. హౌస్ని ఎంటర్టైన్ చేయడం పెద్ద తప్పుగా అనిపించి బాబా భాస్కర్ని ఈవారం ఎలిమినేషన్కి నామినేట్ చేశారు. బహుషా అతనికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి చేతకానిది బాబా భాస్కర్ చేస్తున్నాడనే అసూయతో ఈ నామినేషన్ చేశారు అలీ.
మొదటి వారం నుండి నన్ను ఎలిమినేషన్ చేస్తే బాగుండు అని అనుకున్న బాబా భాస్కర్.. ఈవారం అలీ తనను నామినేట్ చేసినందుకు బాధగా లేదని కాకపోతే అతను చేసిన ఆరోపణలు బాధిస్తున్నాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. మంచి అనిపించుకోవడం కూడా తప్పేనా? అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. నేను ఏం చేశాను? నవ్వుతూ.. నవ్విస్తూ ఉండటం తప్పా అంటూ శ్రీముఖి దగ్గర పట్టరాని దు:ఖంతో ఎమోషనల్ అయ్యారు.
Read Also: ‘సైరా’ టీజర్: సింహంలాంటోడు దొర..!
ఈ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు సైతం బాబా భాస్కర్ ఏడుస్తుంటే భావోద్వేగానికి గురయ్యారు. ఇక హౌస్లో బాబా భాస్కర్కి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఎలిమినేట్ అయిన టీవీ 9 జర్నలిస్ట్ జాఫర్ బాబా భాస్కర్ కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయారు. ఫేస్ బుక్ వేదికగా భావోద్వేగ పోస్ట్ను వదిలారు. ఈ సందర్భంగా అలీకి చురకలేశారు. ‘యుద్ధంలో గెలవడమే ముఖ్యం కాదు . ఎలా గెలిచామనేది కూడా ముఖ్యం . బిగ్ బాస్ హౌస్లో అలీ అట ఫెయిర్గా లేదు . రాలిన ఆ కన్నీటి చుక్కలకు తన అంతరాత్మకైనా జవాబివ్వాలి’ అంటూ ఎమోషనల్ పోస్ట్ వదిలారు జాఫర్.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Hyderabad, First Published 27, Jun 2019, 1:23 PM IST
Highlights
సాధారణంగా ఒక సినిమా పూర్తయితే చాలా గ్యాప్ తీసుకునే కమ్ముల ఫిదా సక్సెస్ తో స్పీడ్ పెంచాడు. సాయి పల్లవి - నాగ చైతన్య తో ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
దర్శకుడు శేఖర్ కమ్ముల కెరీర్ లో మొదటిసారి ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. సాధారణంగా ఒక సినిమా పూర్తయితే చాలా గ్యాప్ తీసుకునే కమ్ముల ఫిదా సక్సెస్ తో స్పీడ్ పెంచాడు. సాయి పల్లవి - నాగ చైతన్య తో ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ఆ ప్రాజెక్ట్ ని చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టింది. శేఖర్ కమ్ముల ఇదివరకే మొదలుపెట్టిన లవ్ స్టోరీ ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉంది. ఆ సినిమా పనులు అయిపోగానే సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
ఫిదా సినిమాతో సాయి పల్లవికి మంచి సక్సెస్ ఇచ్చిన శేఖర్ కమ్ముల మళ్ళీ ఆమెను డైరెక్ట్ చేయబోతుండడంతో నాగ చైతన్య ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక గతంలోనే నాగ చైతన్యతో వర్క్ చేయాలనీ ఈ డిఫరెంట్ దర్శకుడు ప్లాన్ చేసినప్పటికీ కుదరలేదు. ఫైనల్ గా ఇప్పటికి కుదిరింది. మరి ఈ స్పెషల్ కాంబో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
Last Updated 27, Jun 2019, 1:23 PM IST | 0business
|
రివ్యూ: మెహబూబా
Highlights
ఓవరాల్ గా చూసుకుంటే పూరి వీరాభిమానులకు కూడా ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.
నటీనటులు: ఆకాష్ పూరి, నేహాశెట్టి. మురళీశర్మ తదితరులు
సంగీతం: సందీప్ చౌతా
సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
కథ, స్క్రీన్ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పని చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా..? అని స్టార్ హీరోలు సైతం ఆసక్తిగా ఎదురుచూసేవారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ స్టార్ రేసులో దూసుకుపోయిన ఈ దర్శకుడు ప్రస్తుతం ఒక హిట్ కోసం పరితపిస్తున్నాడు. తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా 'మెహబూబా' అంటూ తన సొంత ప్రొడక్షన్ లో సినిమాను రూపొందించాడు. మరి ఈ సినిమా పూరి జగన్నాథ్ కు ఎలాంటి విజయాన్ని అందించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథలోకి వెళ్తే..
నలభై ఏళ్ల క్రితం పాకిస్థాన్-ఇండియా సరిహద్దుల్లో ఓ యుద్ధం జరుగుతుంది. పాకిస్థాన్ సైనిక బృందం హిందుస్థాన్ కు చెందిన కొందరు ప్రజలను తమ ఆధీనంలోఉంచుకుంటుంది. కబీర్(ఆకాష్ పూరి)అనే పాకిస్థాన్ సైనికుడు మదిర(నేహాశెట్టి) అనే హిందుస్థాన్ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఇద్దరూ కూడా సరిహద్దుల కారణంగా విడిపోవాల్సి వస్తుంది. మదిరను ప్రాణంగా ప్రేమించిన కబీర్ ఆమె కోసం సరిహద్దులు దాటి ఆమెను చేరుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ కూడా మరణిస్తారు. కొన్నేళ్ళ తరువాత కబీర్.. రోషన్ గా ఇండియాలో పుడతాడు. మదిర.. అఫ్రీన్ గా పాకిస్థాన్ లో పుడుతుంది. తమ ప్రేమ కోసం మళ్ళీ పుట్టిన ఈ జంటకు అదే సరిహద్దుల సమస్య వస్తే దాన్ని ఎలా ఎదిరించి నిలిచారనేదే కథ.
నటీనటుల పనితీరు:
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో కనిపించిన ఆకాష్ పూరి హీరోగా ఇదివరకే 'ఆంధ్రాపోరి' సినిమాలో నటించాడు. మరోసారి అతడికి రీఎంట్రీ చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో పూర్తి మేకోవర్ తో కనిపించాడు. తన బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఆకట్టుకున్నాయి. కానీ హీరోగా ఆకాష్ ను తెరపై చూడడం అంత సంతృప్తిగా అనిపించలేదు. నటన పరంగా తన పాత్రలో ఇంటెన్సిటీ కనబరిచాడు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాల్లో బాగా నటించాడు. హీరోయిన్ గా నేహాశెట్టి అందంగానే ఉంది. కానీ తెరపై ఈ జంట మధ్య కెమిస్ట్రీ పెద్దగా పండలేదు. ఆకాష్ ఏజ్ గ్రూప్ అమ్మాయిని తీసుకొని ఉంటే బాగుండేది. లుక్స్ పరంగా నేహాశెట్టి బాగానే ఆకట్టుకుంది. సినిమా మొత్తం కూడా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుండడంతో మిగిలిన పాత్రలు ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. విలన్ గా కనిపించిన విషు రెడ్డి అనే కుర్రాడు ఉన్నంతలో బాగానే నటించాడు. కానీ అతడికి సరైన క్యారెక్టరైజేషన్ రాసుకోలేకపోయారు. పతాక సన్నివేశాల్లో కనిపించే లేడీ మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్ బాగుంది. మురళీ శర్మ, షాయాజీ షిండే తమ నటనతో మెప్పించారు.
సాంకేతికవర్గం పనితీరు:
ఈ సినిమా మెయిన్ అసెట్ సినిమాటోగ్రఫీ. విష్ణుశర్మ తన కెమెరా యాంగిల్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. హీరో ఎలివేషన్ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. సందీప్ చౌతా మ్యూజిక్ ఎంతమాత్రం ఆకట్టుకోదు సరికదా మరింత విసిగిస్తుంది. ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. నేపధ్య సంగీతం కొంతవరకు ఆకట్టుకుంటుంది. 'మెహబూబా' అంటూ సాగే బీజియం మాత్రం గుర్తుండిపోతుంది. పాటల్లో చూపించిన లొకేషన్స్ అందంగా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగానే ఉంది. పతాక సన్నివేశాలలో ఫ్లాష్ బ్యాక్ ను ప్రస్తుతానికి లింక్ చేస్తూ నడిపించిన ప్యారలల్ ఎపిసోడ్ బాగుంది. పూరి జగన్నాథ్ సినిమాలలో కథలు చెప్పుకునే స్థాయిలో లేనప్పటికీ హైలైట్ సీన్స్, హీరో ఎలివేషన్ సీన్స్ బాగుంటాయి. వాటికోసమే థియేటర్ కు వెళ్ళే ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. కానీ ఈ సినిమాలో అలా చెప్పుకునే సన్నివేశాలు లేకపోవడం
బాధాకరం.రెగ్యులర్ ప్యాటర్న్ లో సినిమాలు చేస్తుంటే వర్కవుట్ కాకపోవడంతో 'మెహబూబా'తో కొత్తగా ట్రై చేశాడు. నిజానికి పూరి ఫ్లాప్ సినిమాలలో కూడా తనదైన మార్క్ సీన్స్ ఉంటాయి. మెహబూబాలో అటువంటి మార్క్ సీన్స్ ఎక్కడా కనిపించవు. దర్శకుడిగా ఈ సినిమాతో పూర్వ వైభవాన్ని అందుకుంటానని ఆశించిన పూరికి నిరాశే మిగిలింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
గుర్తుండిపోయే డైలాగులు:
''జీవితంలో ఒక్కసారైనా చచ్చిపోయే పరిస్థితి వస్తేనే బ్రతికినట్టు లెక్క..''
''యుద్ధం వచ్చినా చస్తాం.. రాకపోయినా చస్తాం..''
ఇండియాలో ఉంటూ పాకిస్థాన్ ను పొగిడే కొందరిని ఉద్దేశిస్తూ.. ''కన్నతండ్రిని ఇంట్లో
పెట్టుకొని పక్కింటోడిని నాన్న అంటావ్ ఏంటి'' అంటూ హీరో పలికే మాట హైలైట్ గా నిలిచింది.
''తను కనిపించినప్పుడు నా గుండె ఆగిపోయింది ఇప్పుడు వెళ్లిపోతుంటే నా గుండె పగిలిపోతుంది''
విశ్లేషణ:
పూర్వజన్మల కాన్సెప్ట్ తో రూపొందిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. దీంతో అదే కాన్సెప్ట్ తో కొడుకుతో చిత్రీకరించాడు పూరి. నిజానికి పూరి రాసుకున్న కథ, కథనాలలో కొత్తదనం నిండివుంది. కానీ వాటిని ఆడియన్స్ కు నచ్చే విధంగా తెరకెక్కించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ పరిచయం సన్నివేశాలను సాగాదీస్తూ టైంపాస్ చేశాడు. ఊహించని విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. నలభై ఏళ్ల పాటు ఒక అమ్మాయి శవం హిమాలయాల్లో ఉంది అని చూపించడం నమ్మలేని విషయం. సైంటిఫిక్ గా ఇది సాధ్యమేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. బహుశా మైనస్ డిగ్రీ సెల్సియస్ లో సాధ్యమవుతుందేమో! ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. ప్రేమకథలో డెప్త్ లేనప్పటికీ సరిహద్దుల బ్యాక్ డ్రాప్ కావడంతో బాగానే అనిపిస్తుంది. సినిమాలో చెప్పుకోవడానికి ఏమైనా ఉంది అంటే అది ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రమే. దాన్ని కూడా సాగదీసి పూరి ఆడియన్స్ ను విసిగించాడు.ఓవరాల్ గా చూసుకుంటే పూరి వీరాభిమానులకు కూడా ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.
రేటింగ్: 1.5/5 | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
కోహ్లికి ఛాన్సివ్వకుండా.. కుంబ్లే చెక్ పెట్టాడిలా!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అనిల్ కుంబ్లే తన వ్యూహ చతురతతో చెక్ పెట్టాడు. చక్కటి టైమింగ్తో కోహ్లికి రెస్పాండ్ అయ్యే అవకాశం లేకుండా చేశాడు.
Samayam Telugu | Updated:
Mar 16, 2018, 05:16PM IST
కోహ్లికి ఛాన్సివ్వకుండా.. కుంబ్లే చెక్ పెట్టాడిలా!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో విబేధాలు తలెత్తడంతో ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో వీరిద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. దీంతో కుంబ్లే కోచ్ పదవికి గుడ్ బై చెప్పాడు. వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టుతోపాటు వెళ్లే అవకాశాన్ని బీసీసీఐ జంబోకి కల్పించింది. కానీ ఆయన మాత్రం ఐసీసీ వార్షిక సమావేశం కోసం లండన్లోనే ఉండిపోయాడు.
Visit Site
Recommended byColombia
కుంబ్లే జట్టుతో కలిసి కరేబియన్ పర్యనటకు వెళ్తాడని అంతకు ముందు బీసీసీఐ ప్రకటించింది. కానీ కోహ్లి సేన బార్బడోస్ విమానం ఎక్కగానే.. నేను విండీస్ పర్యటనకు వెళ్లడం లేదు. కోచ్ పదవి నుంచి వెంటనే తప్పుకుంటున్నా. లండన్‌‌లో జరిగే ఐసీసీ సమావేశానికి హాజరవుతానని కుంబ్లే చెప్పాడు.
టీమిండియా విమానం ఎక్కేంత వరకూ ఓపికగా ఉన్న కుంబ్లే.. ఆ తర్వాతే అసలు విషయం బయటపెట్టాడు. అదే కాకుండా మీడియాతో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. విమాన ప్రయాణంలో ఉండటంతో.. ఈ విషయంలో వెంటనే స్పందించే అవకాశాన్ని కోహ్లికి కూడా ఇవ్వకుండా జంబో తెలివిగా వ్యవహరించాడు.
కోహ్లి విమానం దిగేలోపే కుంబ్లే రాజీనామా, కరేబియన్ పర్యటనకు వెళ్లలేదనే వార్త జనంలోకి వెళ్లింది. కోహ్లి తీరు కారణంగా నొచ్చుకోవడం వల్లే కుంబ్లే కోచ్ పదవి నుంచి నిష్క్రమించాడని బలంగా ప్రచారంలోకి వచ్చింది. ఇలా కోహ్లికి స్పందించే అవకాశం ఇవ్వకుండా కుంబ్లే తన స్పిన్ మైండ్‌తో కెప్టెన్ దూకుడికి కళ్లెం వేశాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Oct 04,2016
గాయత్రి చేతికి భారీ ప్రాజెక్టు
న్యూఢిల్లీ: ప్రముఖ మౌలిక వసతుల కంపెనీ 'గాయత్రీ ప్రాజెక్ట్స్' బీహార్కు చెందిన భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ బీహార్లోని 'జాతీయ రహదారి-82' విస్తరణ పనులకు సంబంధించిన రూ.926 కోట్ల విలువ చేసే కాంట్రాక్టును తాము దక్కించుకున్నట్లు గాయత్రీ ప్రాజెక్టు బీఎస్ఈకి వెల్లడించింది. సర్కారు బీహార్లోని గయా, హిస్వా, రాజెర్, నలంద, బిహార్షరీఫ్ సెక్షన్లకు చెందిన ఎన్హెచ్-82 కు సంబంధించిన నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ చేపట్టనుంది. ఈ కాంట్రాక్టును 'బీహార్ స్టేట్ రోడ్ డెవలప్మెంంట్ కార్పొరేషన్ లిమిటెడ్', 'రోడ్ ట్రాన్స్ పోర్ట్స్ అండ్ హైవేస్' మంత్రిత్వశాఖ ద్వారా పొందినట్లు గాయత్రీ ప్రాజెక్ట్సు వెల్లడించింది. గత 18 మాసాల్లో కంపెనీ ఆర్డర్ బుక్ రెట్టింపై రూ.12,000 కోట్లకు చేరిందని తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Pune, First Published 20, Sep 2019, 9:54 PM IST
Highlights
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పూణే వేదికన జరిగిన చివరి మ్యాచ్ లో పుణేరీ పల్టాన్ జట్టు విజయాన్ని అందుకుంది. బెంగళూరు బుల్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో పూణే గెలుపొందింది.
హోం గ్రౌండ్...సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన జరిగిన మ్యాచ్ లో పుణేరీ పల్టాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్స్ పట్టికలో టాప్ లో నిలిచిన బెంగళూరు బుల్స్ ని పూణే మట్టికరిపించింది. ఇలా శివ్ చత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన చివరి మ్యాచ్ లో పూణే విజేతగా నిలిచింది. కేవలం 4 పాయింట్ల తేడాతో బుల్స్ ఓటమిని చవిచూసింది.
పుణేరీ పల్టాన్ డిఫెండర్స్ ఈ మ్యాచ్ లో అదరగొట్టారు. రైడింగ్ బెంగళూరు 30పాయింట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించగా పూణే 19 పాయింట్లకే పరిమితమయ్యింది. ఇలా రైడింగ్ లో వెనుకబడ్డా ట్యాకిల్స్ లో ఆతిథ్య జట్టు తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ విషయంలో బుల్స్ టీం 6 పాయింట్లు మాత్రమే సాధించగా పల్టాన్స్ 17 పాయింట్లు సాధించింది. ఇక పుణే ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్ట్రాల రూపంలో 3 ఇలా మొత్తం 42పాయింట్లు సాధించగా బుల్స్ ఆలౌట్ల ద్వారా 2 ఎక్స్ట్రాల రూపంలో 1తో మొత్తం 38 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో నాలుగు పాయింట్ల తేడాతో స్థానిక జట్టు విజయం సాధించింది.
పూణే ఆటగాళ్లలో పంకజ్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే సాగర్ 7, సుర్జీత్ 6, హదీ 2, దర్శన్ 2 పాయింట్లతో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. బెంగళూరు ఆటగాళ్లలో రోహిత్ 14, పవన్ 12 పాయింట్లతో రాణించినా ఫలితం లేకుండా పోయింది.
Last Updated 20, Sep 2019, 11:10 PM IST | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
సూపర్బ్ టైమింగ్.. కేఎల్ రాహుల్కు పాక్ యాంకర్ ప్రశంస
భారత బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఓపెనర్గా అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు.
Samayam Telugu | Updated:
May 9, 2018, 04:09PM IST
భారత బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఓపెనర్గా అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. క్లాసికల్ ప్లేయర్గా ముద్రపడిన ఈ యువ బ్యాట్స్మన్.. భారీ ఇన్నింగ్స్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ సీజన్లో 10 మ్యాచుల్లో 471 పరుగులు చేసిన రాహుల్.. ఇప్పటివరకూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో కేఎల్ రాహుల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆజింక్య రహానే కంటే కేఎల్ రాహులే మేలంటూ చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలో పాకిస్థాన్ స్పోర్ట్స్ యాంకర్ జైనబ్ అబ్బాస్ చేరిపోయారు.
కేఎల్ రాహుల్ను ప్రత్యేకంగా పొగుడతూ ట్వీట్ చేశారు. మే 6న ఇండోర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన కేఎల్ రాహుల్ జట్టుకు విజయాన్ని అందించాడు. 54 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లతో 84 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం జైనబ్ అబ్బాస్ ట్వీట్ చేస్తూ.. ‘కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. సూపర్బ్ టైమింగ్. చూడటానికి చాలా గొప్పగా ఉంది’ అంటూ పేర్కొంది. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ పాకిస్థాన్ మహిళా యాంకర్ ఐపీఎల్లో ఆడుతున్న ఓ భారత ఆటగాడిని పొగడటం పట్ల టీమిండియా ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
KL Rahul impressive,superb timing,great to watch.. #RRvKXIP
— zainab abbas (@ZAbbasOfficial) 1525629388000
ఇదిలా ఉంటే, ఇండోర్లో తమపై గెలిచిన పంజాబ్పై జైపూర్లో రాజస్థాన్ బదులు తీర్చుకుంది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్పై రాజస్థాన్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనూ రాహుల్ చెలరేగిపోయాడు. 70 బంతుల్లోనే రెండు సిక్సులు, 11 ఫోర్లతో 95 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే ఇతర బ్యాట్స్మన్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Team India Captain: ధోనీకి సరైన వారసుడు రోహిత్.. హిట్మ్యాన్కే కెప్టెన్సీ ఇవ్వాలని నెటిజన్ల డిమాండ్
రోహిత్ శర్మ రికార్డ్ స్థాయిలో ముంబై ఇండియన్స్కు నాలుగు ఐపీఎల్ టైటిళ్లను అందించాడు. దీంతో రోహిత్ను టీమిండియా కెప్టెన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. టీ20ల్లో అతడు భారత్కు సరైన సారథి అని నెటిజన్లు సూచిస్తున్నారు.
Samayam Telugu | Updated:
May 13, 2019, 08:43PM IST
Team India Captain: ధోనీకి సరైన వారసుడు రోహిత్.. హిట్మ్యాన్కే కెప్టెన్సీ ఇ...
హైలైట్స్
రోహిత్ శర్మ రికార్డ్ స్థాయిలో ముంబై ఇండియన్స్కు నాలుగు ఐపీఎల్ టైటిళ్లను అందించాడు.
దీంతో రోహిత్ను టీమిండియా కెప్టెన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.
టీ20ల్లో అతడు భారత్కు సరైన సారథి అని నెటిజన్లు సూచిస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. నాలుగుసార్లు ముంబైకి టైటిల్ అందించిన రోహిత్.. 2009లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు సభ్యుడిగా తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. రిక్కీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుకున్న రోహిత్.. 2013లో తన జట్టుకు మొదటిసారి ట్రోఫీని అందించాడు. తర్వాత 2015లో ముంబైకి టైటిల్ అందించిన హిట్ మ్యాన్.. 2017, 2019ల్లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ల్లో ఒక్క పరుగు తేడాతో తన జట్టును విజేతగా నిలిపాడు.
ధోనీకి సైతం సాధ్యం కాని రీతిలో నాలుగుసార్లు ముంబైని విజేతగా నిలిపిన రోహిత్ శర్మను టీ20ల్లో టీమిండియా కెప్టెన్గా నియమించాలని నెటిజన్లు కోరుతున్నారు. కోహ్లి గైర్హాజరీలో జట్టును విజయవంతంగా ముందుకు నడిపిన రోహిత్.. టీ20ల్లో ఇండియాకు ఫుల్ టైం కెప్టెన్ కావాలని ఆకాంక్షిస్తున్నారు.
Rohit Sharma the super captain. In World cup also he should be captain of team India. He is really lucky captain al… https://t.co/WUeV0i2tb6
— Varun Naik (@varunynaik) 1557729853000
ధోనీ తర్వాత భారత్కు మెరుగైన కెప్టెన్ రోహితేనని గతంలో సెహ్వాగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కోహ్లి కంటే బెటర్ బ్యాట్స్మెన్, ధోనీ కంటే బెటర్ కెప్టెన్ అతడంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
After Dhoni, if India has a better captain then its Rohit Sharma - says Sehwag on #CricbuzzLIVE #MI… https://t.co/pfuzgBtDgs
— Azor Ahai (@unrepel) 1557298311000
ధోనీ లేకుండా పరిమిత ఓవర్లలో జట్టును ఎలా ముందుకు నడపాలో రోహిత్ చూపించాడంటూ హిట్ మ్యాన్పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ధోనీ జట్టుపై ఒకే సీజన్లో రోహిత్ 4 మ్యాచ్లు గెలిచాడని గుర్తు చేస్తున్నారు.
Rohit should be the captain of Team India!
— Nishant (@NishantADHolic_) 1557685851000
విరాట్ కోహ్లి ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడు. కానీ భారత్కు మెరుగైన కెప్టెన్ కావాలి. రోహిత్ మరోసారి తనేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. కానీ బీసీసీఐ పట్టించుకోవడం లేదని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
Immediately make Rohit Sharma team India captain for World Cup. A better batsman than Kohli, a better captain than Dhoni. What a combo.
— EngiNerd. (@mainbhiengineer) 1557681883000
In all fairness, Rohit Sharma has shown India how to captain a limited overs side without Dhoni. #IPL2019Final
— Gabbbar (@GabbbarSingh) 1557685755000
@imVkohli - You are one of the greatest batsman of the world champ. But India needs a better captain. Rohit Sharma… https://t.co/MHdzYmclMP
— Shashi Kaant (@BhattuSpeaks) 1557720024000
Can somebody justify Kohli's Indian captainship? Rohit has not only how to captain India in limited overs w/o msd,… https://t.co/d9OxHeMvRT
— lucky (@lashupash) 1557706490000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyderabad, First Published 13, Aug 2018, 12:28 PM IST
Highlights
ఎవరు హౌస్ లో ఉండాలో.. ఎవరు నామినేషన్స్ లో ఉండాలో తనిష్, అమిత్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోతోంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బాబు గోగినేని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కాగా.. సోమవారం మళ్లీ నామినేషన్స్ మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోని స్టార్ మా పేజీలో పోస్టు చేశారు.
ఆ ప్రమో ప్రకారం.. ఈ వారం ఎలిమినేషన్స్ తనిష్, అమిత్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. తనిష్ కెప్టెన్ కావడం వల్ల ఈ వారం ఎలిమినేషన్స్ లో లేరు. అలాగే.. కమల్ హాసన్ ఇచ్చిన స్పెషల్ పవర్ వల్ల అమిత్ కూడా నామినేషన్స్ లో లేరు. దీంతో.. ఈ వారం నామినేషన్ల బాధ్యత బిగ్ బాస్ వీరిద్దరి చేతిలో పెట్టారు.
ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే... హౌస్ లో ఒక ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేశారు. అందులో ఒక్కో స్తంబం దగ్గర ఇద్దరిద్దరుగా హౌస్ మేట్స్ నిలబడి ఉన్నారు. ఆ ఇద్దరు హౌస్ మేట్స్.. వాళ్లు ఇంట్లో ఎందుకు ఉండాలని అనుకుంటున్నారో కారణం చెప్పాల్సి ఉంటుంది. వారి కారణాలు విని.. ఎవరు హౌస్ లో ఉండాలో.. ఎవరు నామినేషన్స్ లో ఉండాలో తనిష్, అమిత్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
Last Updated 9, Sep 2018, 1:00 PM IST | 0business
|
Australia, First Published 28, Sep 2018, 7:49 PM IST
Highlights
వన్డే క్రికెట్ లో మరో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన లిస్ట్ ఎ క్రికెటర్ ఆర్కీ షార్ట్ సరికొత్త రికార్డు నమోదుచేశాడు.వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేయడమే కాకుండా అత్యధిక సిక్సర్లు బాది మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా విద్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయి వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఒంటిచేత్తో విజయం అందించారు.
వన్డే క్రికెట్ లో మరో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన లిస్ట్ ఎ క్రికెటర్ ఆర్కీ షార్ట్ సరికొత్త రికార్డు నమోదుచేశాడు.వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేయడమే కాకుండా అత్యధిక సిక్సర్లు బాది మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా విద్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయి వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఒంటిచేత్తో విజయం అందించాడు.
వెస్టర్న్ ఆస్ట్రేలియా, క్విన్స్లాండ్ మధ్య జరిగిన దేశవాళి వన్డే మ్యాచ్లో షార్ట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా బ్యాంటింగ్ కు దిగిన షార్ట్ మొదట నెమ్మదిగాను బ్యాటింగ్ ఆరంభించాడు. ఇతడు సెంచరీ చేయడానికి 83 బంతులు ఆడాడు. అయితే సెంచరీ తర్వాత తన విశ్వరూపం చూపించాడు. కేవలం 45 బంతుల్లోనే మరో వంద పరుగులు జోడించి డబుల్ సెంచరీ చేశాడు. మొత్తం 148 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మన్ 23 సిక్సర్లు, 15 ఫోర్ల సాయంతో ఏకంగా 257 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ సాధించడమే రికార్డనుకుంటే...ఒకే ఇన్నింగ్స్ లో 23 సిక్సర్లు బాది మరో రికార్డును కూడా తన షార్ట్ ఖాతాలో వేసుకున్నాడు.
ఇతడి విద్వంసకర ఆటతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్ల్యాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో వెస్టర్న్ ఆస్ట్రేలియా 106 పరుగుల తేడాతో క్విన్స్లాండ్పై విజయం సాధించింది. | 2sports
|
UPI insotre
దేశంలోనే మొదటిసారి యుపిఐ ఇన్స్టోర్ చెల్లింపులు
హైదరాబాద్: దేశంలో మొట్టమొదటిసారిగా స్టోర్లోపల యుపిఐ చెల్లింపుల సదుపాయాన్ని జాతీయ చెల్లింపులసంస్థ రిలయన్స్ సంస్థలు సంయుక్తంగా అందిస్తున్నాయి. యాక్సిస్బ్యాంకు సహ కారంతో ఇన్నోవిటీ రూపొందించిన సమస్యలులేని డైనమిక్ క్యూఆర్ పరిష్కారంతో ఈవ్యవస్థ నడు స్తున్నది. ఎన్పిసిఐ మొబైల్ ఆధారితయుపిఐ యాప్ చెల్లింపు అవకాశాలను రిలయన్స్ రిటైల్ అంగీకరి స్తోంది. ముంబైలో ఉన్న 200రిలయన్స్రిటైల్ స్టోర్లలో అంగీకరిస్తున్నారని, రిలయన్స్ఫ్రెష్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్ తదితర స్టోర్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా త్వరలోనే అమలుచేస్తామని ఎన్పిసిఐ, రిలయన్స్ వెల్లడించాయి. ఇన్ స్టోర్ యుపిఐ చెల్లింపులను ఇన్నోవిటీసంస్థ రూపొందించిన క్యూఆర్కోడ్ ఇంటర్ఫేజ్ ద్వారా అంగీకరించారు. ప్రస్తుతం వ్యాపా రులవద్ద ఉన్న పిఒఎస్ టెర్మినల్పైనే పని చేస్తుందన్నారు.
మల్టీలేన్ రిటైల్లో వ్యక్తి గత క్యాషియర్లు యుపిఐ పేమెంట్ణిర్ధారణ చార్జ్స్లిప్ను నేరుగా తమ పిఒఎస్ టెర్మి నల్పై పొందేందుకు కొత్తపరిష్కారం అనుమతిస్తుంది. భారీ మల్టీలేన్ రిటైల్స్టోర్స్లో యుపిఐ విస్తరణ లో ఉన్న అడ్డంకులు తొలగిస్తుం దని ఎన్పిసిఐ వెల్లడించింది. కస్టమర్లు ఎన్పిసిఐ భీమ్ లేదా ఇతర బ్యాంక్ ప్రమోట్చేస్తున్న యుఇపై యాప్ ద్వారా తమ ఇన్స్టోర్ కొనుగోళ్లకోసం వినియోగించుకోవచ్చని వెల్లడించారు. రిటైల్రంగంలో ఇదొక నూతన ఆవిష్కరణ అని ఎన్పిసిఐ ఎండి సిఇఒ ఎపిహోతా వెల్ల డించారు.
రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ వి.సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద రిటైలర్ రిల యన్స్రిటైల్ డిజిటల్ లావాదేవీలకు సంబంధించి ఈ అదనపు సౌకర్యం ఎంపికను దేశంలో అంది స్తున్న మొదటి రిటైల్ స్టోర్చైన్గా రిలయన్స్ రిటైల్ నిలిచిందని అన్నారు. రిలయన్స్ డిజిటల్ సిఇఒ బ్రియాన్బేడ్ మాట్లాడుతూ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ చైన్గా ఉన్న తమసంస్థలో ఇన్స్టోర్ యాప్ చెల్లింపు లు సానుకూలంగా ఉన్నాయన్నారు. ఇన్నోవిటీ పేమెంట్ సొల్యూషన్స్ రాజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ కొత్త సదుపాయం అందించే అవకాశాలపై ఆసక్తితోఉన్నామన్నారు. మొత్తం 1.7 మిలియన్ కార్డు స్వీకరణ వ్యాపారుల వద్ద యుపిఐ చెల్లింపులు ఎలాంటి సమస్యలు లేకుండా జరుగుతాయన్నారు. | 1entertainment
|
Read More: IPL 2020: CSKకి ధోనీ గుడ్ బై.. ట్వీట్కి ఫర్ఫెక్ట్ కౌంటర్
ఇంతకీ సమస్య ఏంటంటే..? బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం.. ఏకకాలంలో బోర్డులో ఎవరూ రెండు పదువుల్లో ఉండరాదు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్నాడు. దీంతో.. అతను క్యాచ్కి రాజీనామా చేయకుండానే బీసీసీఐ బాస్గా చెలామణి అవుతున్నాడంటూ సంజీవ్ గుప్తా ఇటీవల ఫిర్యాదు చేశాడు. కానీ.. గంగూలీ అక్టోబరు 23న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే క్యాబ్కి రాజీనామా చేసినట్లు తాజాగా తేల్చి చెప్పిన డీకేజైన్.. ఫిర్యాదుని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ క్యాబ్కి గంగూలీ రాజీనామా చేయకుండా ఉండింటే..? అప్పుడు ఎథిక్స్ ఆఫీసర్ నుంచి నోటీసులు వెళ్లేవి.
Read More: రాహుల్ ద్రవిడ్కి ఊరట.. ఫిర్యాదు కొట్టివేత
భారత క్రికెట్ని ఈ విరుద్ధ ప్రయోజనాల అంశం గత కొంతకాలంగా కుదిపేస్తోంది. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, కపిల్ దేవ్ తదితరులు నోటీసులు ఎదుర్కొన్నారు. సౌరవ్ గంగూలీ కూడా ఐపీఎల్ సమయంలో క్యాబ్ అధ్యక్షుడిగా ఉంటూ.. ఢిల్లీ క్యాపిటల్స్కి మెంటార్గా ఎలా ఉంటారంటూ..? నోటీసుల ద్వారా డీకే జైన్ ప్రశ్నించారు. అయితే.. గంగూలీ బీసీసీఐ బాస్గా మారిన తర్వాత ఇటీవల రాహుల్ ద్రవిడ్పై ఆ విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదుని కొట్టివేయగా.. తాజాగా గంగూలీకి కూడా ఉపశమనం లభించింది.
Read More: రోహిత్ శర్మ సీరియస్.. ఇంకా ఆ డిఫెన్స్ ఏంటి..?
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
`ఆర్ఎక్స్ 100` హీరోతో `90 ఎంఎల్`.. రిలీజ్కు రెడీ అయిన మరో బోల్డ్ మూవీ
ఆర్ ఎక్స్ 100 ఫేం కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 90 ఎంఎల్. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.
Samayam Telugu | Updated:
Nov 12, 2019, 10:12AM IST
90 ఎంఎల్ మూవీ స్టిల్
ఆర్ఎక్స్100 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న మరో డిఫరెంట్ మూవీ 90 ఎంఎల్ . ఆర్ఎక్స్ 100 తరువాత ఆ స్థాయిలో సక్సెస్ సాధించటంలో ఫెయిల్ అవుతున్న కార్తికేయ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 90 ఎంఎల్ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు చిత్రయూనిట్.
ఆర్ఎక్స్ 100 సినిమాను నిర్మించిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది. ఈ సినిమాతో శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కార్తీకేయ సరసన నేహా సోలంకి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ని శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్కి సొంతం చేసుకున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు.
Also Read: త్రివిక్రమ్ మార్క్ డ్రామా.. `అల వైకుంఠపురములో` కథ ఇదే!
ఈ సందర్భంగా నిర్మాత అశోక్రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ... `ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 90.ఎంఎల్ అనే టైటిల్కి తగ్గట్టుగానే సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుంది. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది.
Also Read: వామ్మో.. రామ్ గోపాల్ వర్మ సినిమాలో శ్రీరెడ్డి!
విజువల్గానూ సినిమా రిచ్గా ఉంటుంది. ఇటీవల అజర్బైజాన్లో మూడు పాటలను చిత్రీకరించాం. సినిమా గురించి మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. డిసెంబర్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం` అన్నారు.
చిత్ర దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ `ఆర్ఎక్స్ 100లో కార్తికేయను చూడగానే 90 ఎంఎల్ స్క్రిప్ట్ కి పక్కాగా సరిపోయే హీరో ఇతనే అనిపించింది. డిసెంబర్ 5న థియేటర్లలో సినిమా చూసిన వారు కూడా కార్తికేయకు ఈ సినిమా టైలర్ మేడ్ కేరక్టర్ అని ఫీలవుతారు. రీసెంట్గా అజర్బైజాన్లో మూడు పాటలను చిత్రీకరించాం. ఆ పాటలు సినిమాకు హైలైట్ అవుతాయి. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. యూత్ఫుల్గా సాగే సినిమా ఇది` అని చెప్పారు.
Also Read: వివాదాలకు తెర తీయనున్న `Thalaivi`.. ప్రారంభమైన అమ్మ బయోపిక్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సిడ్నీ వన్డేలో రోహిత్ పోరాడిన భారత్కి తప్పని ఓటమి
ఓపెనర్ శిఖర్ ధావన్ (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), అంబటి రాయుడు (0) తొలి నాలుగు ఓవర్లలోపే పెవిలియన్ చేరిపోవడంతో భారత్ 4/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రోహిత్ శర్మ - మహేంద్రసింగ్ ధోని జోడీ.. నాలుగో వికెట్కి అభేద్యంగా 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
Samayam Telugu | Updated:
Jan 12, 2019, 04:08PM IST
సిడ్నీ వన్డేలో రోహిత్ పోరాడిన భారత్కి తప్పని ఓటమి
ఆస్ట్రేలియాకి సొంతగడ్డపై టెస్టులో ఓటమి రుచిచూపిన భారత్ జట్టు.. వన్డే సిరీస్ని మాత్రం ఓటమితో ఆరంభించింది. సిడ్నీ వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ (133: 129 బంతుల్లో 10x4, 6x6) శతకం బాదినా.. టీమిండియాకి 34 పరుగుల తేడాతో కంగారూల చేతిలో ఓటమి తప్పలేదు. 289 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మతో పాటు మహేంద్రసింగ్ ధోని (51: 96 బంతుల్లో 3x4, 1x6) నిలకడగా ఆడినా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో ఆఖరికి భారత్ 254/9కే పరిమితమైంది. దీంతో.. మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే అడిలైడ్ వేదికగా మంగళవారం ఉదయం 8.50 నుంచి జరగనుంది.
It's still well and truly game on with Rohit out in the middle... Stream via Kayo HERE: https://t.co/rHhkFrd50M… https://t.co/Zy2t4S25zN
— cricket.com.au (@cricketcomau) 1547286756000
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. హ్యాండ్స్కబ్ (73: 61 బంతుల్లో 6x4, 2x6), ఉస్మాన్ ఖవాజా (59: 81 బంతుల్లో 6x4), షాన్ మార్ష్ (54: 70 బంతుల్లో 4x4) అర్ధశతకాలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (2/66), కుల్దీప్ యాదవ్ (2/54) ఫర్వాలేదనిపించారు.
India are out of reviews and Dhoni has to go... #CloseMatters #AUSvIND | @GilletteAU https://t.co/WRYVQPxwIM
— cricket.com.au (@cricketcomau) 1547283826000
289 పరుగుల లక్ష్యఛేదనలో భారత్కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), అంబటి రాయుడు (0) తొలి నాలుగు ఓవర్లలోపే పెవిలియన్ చేరిపోవడంతో భారత్ 4/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ - మహేంద్రసింగ్ ధోని జోడీ.. నాలుగో వికెట్కి అభేద్యంగా 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకోవడంతో భారత్ ఒకానొక దశలో 140/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ.. జట్టు స్కోరు 141 వద్ద ధోనీ ఔటవగా.. అనంతరం వచ్చిన దినేశ్ కార్తీక్ (12), రవీంద్ర జడేజా (8) నిరాశపరిచారు. అయినప్పటికీ.. ఒక ఎండ్లో 46వ ఓవర్ వరకూ పోరాడిన రోహిత్ శర్మ.. కెరీర్లో 22వ శతకం పూర్తి చేసుకుని జట్టు స్కోరు 221 వద్ద ఔటయ్యాడు. దీంతో.. భారత్ ఓటమి ఖాయమైంది. అయితే.. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్ (29 నాటౌట్: 23 బంతుల్లో 4x4) బ్యాట్ ఝళిపించి ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Visit Site
Recommended byColombia
ఒక పోస్టర్లో షారుఖ్.. వీల్ ఛైర్లో కుర్చున్న అనుష్క శర్మతో జాలీగా సాగిపోతూ, మరో పోస్టర్లో కత్రినా కళ్లలోకి కళ్లు పెట్టి చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించారు. ఈ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండవుతున్నాయి. ఈ సినిమాను షారుఖ్ సతీమణి గౌరీఖాన్ స్వయంగా నిర్మిస్తుండటం గమనార్హం. ఆనంద్ ఎల్.రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Iss poori duniya mein, meri barabari ki ek hi toh hai... #ZeroPoster @AnushkaSharma @aanandlrai @RedChilliesEnt… https://t.co/hnPvXifOzx
— Shah Rukh Khan (@iamsrk) 1541010840000
Sitaaron ke khwaab dekhne walon, humne toh chaand ko kareeb se dekha hai. #ZeroPoster #KatrinaKaif @aanandlrai… https://t.co/i3MkehbpHY
— Shah Rukh Khan (@iamsrk) 1541011751000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
May 24,2017
టాటా మోటార్స్ లాభాలు 17% పతనం
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ 2017 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.4,296 కోట్ల నికర లాభాలతో సరిపెట్టు కుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,211 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే క్రితం క్యూ4 లాభాల్లో 17 శాతం పతనం చోటు చేసుకుంది. అయినా మార్కెట్ విశ్లేషకుల అంచనాల కంటే మెరుగైన ఫలితాలే సాధించిందని థామ్సన్ రాయిటర్స్ పేర్కొంది. టాటా మోటార్స్ లగ్జరీ బ్రాండ్ జాగర్ లాండ్ రోవన్ లాభాలు 18 శాతం పెరిగి 722.87 మిలియన్ డాలర్లకు చేరాయి. మంగళవారం బిఎస్ఇలో టాటా మోటార్స్ షేర్ 0.38 శాతం పెరిగి రూ.450.10 వద్ద ముగిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
మహీంద్రా నుంచి మరో కొత్త మోడల్ కారు
న్యూఢిల్లీ (ఏజెన్సీ)| PNR| Last Modified బుధవారం, 5 డిశెంబరు 2007 (15:57 IST)
ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి మరో కొత్త మోడల్ను విడుదలచేసింది. వీ సిరీస్ స్కార్పియో పేరుతో ప్రవేశపెట్టిన కారును మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. వీ సిరీస్ స్కార్పియో కారును మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ రూ.150 కోట్లు వెచ్చించిందని మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెటింగ్ విభాగ ఉపాధ్యక్షుడు వివేక్ నాయర్ చెప్పారు.
మార్కెట్లో స్కార్పియో కార్లకు కొనుగోలుదార్ల నుంచి మంచి డిమాండ్ ఉందని తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో కార్లు గత ఆర్ధిక సంవత్సరంలో 38,015 యూనిట్ల మేరకు అమ్మకాలు జరిగినట్టు ఆయన చెప్పారు. గత ఏడాది వీటి సంఖ్యం 31,661 యూనిట్లు మాత్రమే అని నాయర్ వివరించారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
Suresh 148 Views
అంతర్జాతీయ ధోరణులే మార్కెట్లకు కీలకం
ముంబై, ఆగస్టు 28: అంతర్జాతీయ మార్కెట్ల దోరణులు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టు బడుల వ్యూహాలు వచ్చేవారం మార్కెట్లకు కీలకం అవుతాయి. కొంత అనిశ్చితిపెరిగే అవకాశం ఉం దని అంచనా. నిఫ్టీ సాంకేతికంగా స్వల్పకాలిక మద్దతు బ్రేక్ అవుతుంది. దీనివల్ల మార్కెట్లు కొంతమేర పతనం కావచ్చు. రంగాలవారీగా చూస్తే ఎఫ్ఎంసిజి, చక్కెరలాంటి రంగాల్లో కొంతమేర భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. రియాల్టీ ఇన్ఫ్రా స్టాక్స్లో లాభాల స్వీకరణ కని పిస్తుందని నిపుణుల అంచనా. కొన్ని నెలలుగా పెరుగుతున్న మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ర్యాలీలు ఈవారం కొంతబ్రేకులు పడే అవకాశం ఉంది. వచ్చేవారం నిఫ్టీకి 8580కనిష్టంగా 8520 మద్దతునిస్తాయి. నిఫ్టీపరంగాచూస్తే 100 నుంచి 150పాయింట్ల రేంజ్లో కొనసాగుతుందని అంచ నా. గతవారంపరంగాచూస్తే మార్కెట్లు గరిష్ట స్థాయిలో లాభాలస్వీకరణ జరిగింది. పంపిణీ తీరు మరింతగాఉంది. ఎఫ్ఐఐలుగడచిన మూడు నాలుగు ట్రేడింగ్లలో అమ్మకాలకే మొగ్గుచూపిం చారు. దీనితో బుల్లిష్ మార్కెట్లకు తెరపడింది. వారం పరంగాచూస్తే నిఫ్టీ స్వల్పనష్టాలతో ముగియగా బ్యాంక్ నిఫ్టీ స్వల్పలాభాలతో ముగి సింది. ఈవారంలో మిడ్ అండ్ స్మాల్క్యాప్లు కొంతమేర పనితీరు చూపించాయి. వీటికితోడు డాలర్ రూపాయిమారకం విలువలు,ముడి చము రు ధరలకొంత ప్రభావంచూపిస్తాయని అంచనా. | 1entertainment
|
IT SECTOR
కొత్త టెక్నాలజీల్లో 85 వేల ఐటి ఉద్యోగాలు
న్యూఢిల్లీ, జూన్ 5: భారత్లోని 150 బిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న ఐటిరంగంలో లేఆఫ్లు మరింత ఎక్కువగా ఉంటున్నాయన్న వాదనను ఐటి సంస్థలు కొట్టిపారేస్తున్నాయి. రానున్న కాలంలో కొత్త టెక్నాలజీపై నైపుణ్య తర్ఫీదు ఇచ్చిన తర్వాత 85 వేల ఉద్యోగాలు కొత్తగా రానున్నట్లు కంపెనీలు ఘంటా పథంగా చెపుతున్నాయి. అయితేనిర్వ హణ వ్యయం ఆదా చేసుకునేందుకు కంపెనీలు ఆటోమేషన్ వైపు పరుగులు పెడుతున్న మాట వాస్తవమే. అందు వల్లనే ఎక్కువగా లేఆఫ్లు ఎదురవుతు న్నాయి.
కొన్ని స్థాయిల ఉద్యోగులకు పింక్స్లిప్లు జారీచేస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు పరోక్షంగా ప్రతిభ పెంచుకోకుంటే కష్టమేనన్న సంకేతా లిస్తుండటంతో అసలే మానసిక వత్తిడి అధికంగా ఉంటున్న ఐటి ఉద్యోగులకు ఇదో పెద్ద గండంగా పరిణమించింది. అయితే మన ఐటి ఉద్యోగులేమీ ఇందు కు తక్కువేమి తినలేదు. కొత్త టెక్నాలజీ అలవరు చుకునేందుకు పరుగులు తీస్తున్నారు. కొత్త నైపు ణ్యం, కొత్తభాషలపై అవగాహనపెంచుకుని కొత్త డిజిటల్ టెక్నాలజీ మార్పులవైపు పరుగులు తీస్తు న్నట్లు తెలుస్తోంది. సింప్లిలెర్న్ అనే ఆన్లైన్ శిక్షణ వేదిక అంచనాలను చూస్తే బిగ్డేటా, క్లౌడ్ డేటా సైన్స్, డెవోప్స్, సైబర్సెక్యూరిటీ వంటివి వాటిలో 50శాతం వృద్ధి కనిపిస్తున్నట్లు వెల్లడించింది. గడ చిన నాలుగేళ్లలోనే అత్యుత్తమ ప్రతిభఉందని సింప్లి లెర్న్ అంచనావేసింది.
మూడునెలల్లోనే డెవాప్స్ కేటగిరీలో 109శాతం వృద్ధి ఉంటుందని, క్లౌడ్పరం గా 70శాతం బిగ్డేటా పరంగాను, డేటాసైన్స్ పరంగాను 60శాతం, 45శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని అంచనాలు వేసింది. ఒక్క డేటాసైన్స్ విభాగంలోనే 85వేలకుపైగా ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే సరైన ప్రతిభ లేక సతమతం అవుతున్న ఈ కేటగిరీలో కొత్త ఉద్యోగాలు పుష్క లంగా ఉంటాయని సింప్లిలెర్న్ ప్రతినిధి కశ్యప్ దలాల్ వెల్లడించారు. మూడుమిలియన్లకుపైగా ఐటి ఉద్యోగులతో దేశంలోనే ఐటిరంగం అతిపెద్ద ఉపాధి రంగంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో లేవనెత్తిన ఉద్వాసన పర్వాలు లేఆఫ్ లు ఉద్యోగుల్లో కలవరం పెంపొం దించాయి.
ఫలితంగానే ఐటి ఉద్యో గుల సంఘాలు ఆవిర్భవించాయి. కాగ్నిజెంట్ వంటిపెద్ద కంపెనీల ఉద్వాసన పర్వాలతో రోడ్డునపడిన వారంతా ఆయా రాష్ట్రాల కార్మిక కమిషనర్లను సైతం కలిసి సమస్య తీవ్రతను ప్రభుత్వాల దృష్టికి తెచ్చా రు. ప్రస్తుతం ఐటి రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్లో క్లౌడ్ ఇంజినీర్, డెవోప్స్ ఇంజినీర్, అజూర్, ఎడబ్ల్యు ఎస్ కన్సల్టెంట్, క్లౌడ్ అజూర్ ఆర్కిటెక్ట్, బిగ్డేటా డేటా సైన్స్లో అడ్మినిస్ట్రేటర్, ఆర్కిటెక్ట్, డేటా సైంటిస్ట్, డైరెక్టర్; ఇంజినీర్, సైబర్ సెక్యూరిటీపరంగా సెక్యూరిటీ ఆడి టర్ ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ మేనేజర్/ఇంజినీర్, సైబ ర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ వంటి నైపుణ్యవిభాగాల్లో వేల ాది ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నట్లు నిపుణుల అంచనా. | 1entertainment
|
ఫర్నీచర్కు పర్యాయంగా బాంటియా
- చౌక ధరలతో మెరుగైన సేవలు
- సంస్థ ఎండీ సురేందర్ బాంటియా
- అత్తాపూర్లో కొత్త షోరూమ్ ప్రారంభం
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
ఫర్నీచర్ అవసారాలు అనగానే 'బాంటియా' బ్రాండ్ గుర్తుకు వచ్చేలా తాము వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు బాంటియా ఫర్నీచర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ బాంటియా తెలిపారు. అత్తాపూర్లో దాదాపు 40,000 చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బాంటియా కొత్త షోరూమ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 65 సంవత్సరాలుగా తాము పర్నీచర్ రంగంలో సేవలను అందిస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 2 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో తమ సంస్థ షోరూమ్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఫర్నీచర్ కొనుగోలు అనగానే ముందుగా తమ సంస్థ పేరు గుర్తుకు వచ్చేలా అతి తక్కువ ధరలకే, విభిన్నమైన దేశీయ మోడళ్లను, విదేశీ ఫర్నీచర్ను తాము బాంటియాలో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వివరించారు. సంస్థకు ఇప్పటికే సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, జూబ్లీహిల్స్, కొంపల్లిల్లో షోరూమ్లు ఉన్నాయి. తాము అందించే తక్కువ ధరలు ఇతర ఏ ఫర్నీచర్ దుఖాణాలలోనూ లభించవని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లభించని విభిన్న రకరకాల సోఫాలు, డైనింగ్ టేబుళ్లు, మంచాలు (బెడ్లు), సెంటర్పీస్లు అందుబాటులో ఉంచడం తమ సంస్థ ప్రత్యేకత అని ఆయన తెలిపారు. బాంటియాలో రూ.10,000 నుంచి మొదలుకొని రూ.5.5 లక్షల వరకు ధర పలికే వివిధ రకాల సోఫాసెట్లు, రూ.4000 నుంచి 1,50,000 విలువైన డైనింగ్ టేబుళ్లతో పాటు సెంటర్పీస్లు అందుబాటులో ఉన్నట్లుగా వివరించారు.
నాణ్యతే పరమావధి: అమిత్ బాంటియా
బాంటియాలో చౌక ధరలకే నాణ్యమైన ఫర్నీచర్ను అందుబాటులో ఉంచుతున్నట్లుగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ బాంటియా తెలిపారు. రకరకాల ఫర్నీచర్ను వినియోగదారులకు అందించేందుకు గాను సంస్థ తరఫున తామే వివిధ దేశాలలో పర్యటించి మేటి ఫర్నీచర్ను ఎంపిక చేసి ఆర్డరు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎక్కువ సంఖ్యలో తయారీదారులకు అర్డరు ఇస్తున్నందున చాలా తక్కువ ధరకే తమకు మేలిమి ఫర్నీచర్ లభిస్తోందని ఆయన వివరించారు. ఇదే కారణంగా తాము కూడా చౌక ధరలకు ఫర్నీచర్ను అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అమ్మ మృతిపై దర్యాపు: ప్రధానికి గౌతమి లేఖ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలున్నాయని సినీనటి గౌతమి అన్నారు.
| Updated:
Dec 9, 2016, 12:31PM IST
అమ్మ మృతిపై దర్యాపు: ప్రధానికి గౌతమి లేఖ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలున్నాయని సినీనటి గౌతమి అన్నారు. అమ్మ మృతిపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపించాలని ఆమె తన బ్లాగు ద్వారా ప్రధానికి లేఖ రాశారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన జయలలిత..కొద్దిరోజుల తర్వాత ఆరోగ్యంగా ఉన్నారని, ఎప్పుడైనా డిశ్చార్జీ కావచ్చని అపోలో వైద్యులు ప్రకటించారని గుర్తు చేసిన గౌతమి...ఆ తరువాత ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడం..ఆ మరుసటి రోజే మరణించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె పేర్కొన్నారు.
అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదని...జయ మృతి వెనుక దాగి ఉన్న నిజానిజాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గౌతమి ఆందోళన వ్యక్తం చేశారు.
అమ్మను ఆసుపత్రిలో పరామర్శించిన ప్రముఖుల్లో ఎవరూ ఆమె ఆరోగ్యంగా ఉన్నారని సూటిగా చెప్పలేదని గౌతమి గుర్తు చేశారు. సీఎం స్థాయి వ్యక్తి అనారోగ్యంగా ఉంటే తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉంటుందని, అలాంటి గోప్యత ఎందుకు పాటించారని ప్రశ్నించారు.
జయలలిత మరణం సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోకూడదని..ప్రధాని తన విన్నపానికి స్పందించి దర్యాప్తునకు ఆదేశిస్తారని గౌతమి ఆశాభావం వ్యక్తం చేశారు.
Actor Gauthami express a serious of doubts on former chief minister of Tamili Nadu J Jayalalithaa’s death. She wrote to prime minster Narendra Modi to look into the matter and pleaded to investigate Amma’s death, said in her blog.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లంకకి కెప్టెన్ గండం.. నెలలోనే ఐదుగురు
శ్రీలంక జట్టు సంక్షోభంలో కూరుకుపోతోందా..? రాజకీయ కారణాలు, జట్టు మేనేజ్మెంట్ ఉదాసీనత ఆ దేశ క్రికెట్ చరిత్రని
TNN | Updated:
Aug 30, 2017, 03:06PM IST
శ్రీలంక జట్టు సంక్షోభంలో కూరుకుపోతోందా..? రాజకీయ కారణాలు, జట్టు మేనేజ్‌మెంట్ ఉదాసీనత ఆ దేశ క్రికెట్ చరిత్రని మసకబార్చుతున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి.. ఇటీవల జరిగిన అనూహ్య పరిణామాలు. భారత్‌తో టెస్టు, వన్డే సిరీస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మంగళవారం సనత్ జయసూర్య అధ్యక్షుడిగా ఉన్న సెలక్షన్ కమిటీ తమ పదువులకి రాజీనామా చేయగా.. అభిమానులు మూడో వన్డేలో మైదానంలోకి వాటర్ బాటిల్స్‌ని విసిరి మ్యాచ్‌కి అరగంట పాటు అంతరాయం కలిగించారు. కొలంబో వేదికగా భారత్‌తో జరగనున్న నాలుగో వన్డేకి తాజాగా లసిత్ మలింగని కెప్టెన్‌గా నియమించారు. తొలి వన్డేకి కెప్టెన్‌గా ఉపుల్ తరంగపై స్లో ఓవర్ రేట్ కారణంగా నిషేధం వేటు పడగా.. మూడో వన్డేలో కెప్టెన్‌గా ఉన్న కపుగెదర గాయంతో సిరీస్‌కి దూరమయ్యాడు.
భారత్‌తో నెల క్రితం ఈ సుదీర్ఘ సిరీస్ ఆరంభమవగా.. తొలి టెస్టుకి సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తర్వాత మిగిలిన రెండు టెస్టులకి దినేశ్ చండిమాల్‌ నాయకత్వం వహించాడు. ఇక వన్డేల్లో తీసుకుంటే.. తొలి రెండు వన్డేలకూ ఉపుల్ తరంగ.. మూడో వన్డేకి కపుగెదర.. తాజాగా గురువారం జరిగే నాలుగో వన్డేకి మలింగ కెప్టెన్‌గా వ్యవహరించానున్నాడు. అంటే.. ఒక సిరీస్‌లో ఐదు మంది కెప్టెన్లు మారారు. మరోవైపు భారత్ మాత్రం.. కెప్టెన్ విరాట్ కోహ్లి నాయకత్వంలోనే ఓటమి ఎరుగకుండా మొత్తం సిరీస్ ఆడుతోంది. లంక మేనేజ్‌మెంట్ ఉదాసీనత కారణంగా.. ఆటగాళ్ల ఫిటెనెస్ స్థాయి ఘోరంగా పడిపోయిందని ఇప్పటికే ఆ దేశ క్రీడల మంత్రి హెచ్చరించిన విషయం తెలిసిందే. | 2sports
|
పైసావసూల్ ప్రమోషన్ కు ఎన్టీఆర్ ను కాదని రానాను ఎంచుకున్న బాలకృష్ణ
Highlights
పైసావసూల్ సినిమాతో సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలకృష్ణ
మూవీ ప్రమోషన్ కోసం జెమిని టీవీలో రానా చేస్తున్న నెం.1 యారి షోకు హాజరైన బాలకృష్ణ
ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోను కాదని రాానాను ఎంచుకున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం పైసా వసూల్ ప్రమోషన్ లో బిజీబిజీగా వున్నారు. ఇప్పటికే ఆడియోకు ఆఢియెన్స్ నుంచి సూపర్ డూపర్ హిట్ స్పందన రావటంతో పాటు... ప్రమోషన్స్ పనుల్లో టీమ్ అంతా నిమగ్నమయ్యారు. అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్ చేస్తూ.. వేగంగా పూర్తి చేసినందుకు టీమ్ అంతా ఖుషీగా వుంది. ఆ ఖుషీని కంటిన్యూ చేస్తూ... బాలయ్య కూడా ఛానెల్స్ లో ఇక్కడా అక్కడా మూవీని తెగ ప్రమోట్ చేస్తున్నాడు.
ఇక ఇటీవల రేటింగ్స్ లో అదర గొడుతున్న జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో లాంటి చోట ప్రమోషన్ చేస్తే బాగుంటుందని నిర్మాతలు కోరారని సమాచారం. అయితే.. బిగ్ బాస్ ను కాదని బాలకృష్ణ రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న నెం.1 యారి కార్యక్రమంలో ప్రమోషన్ కోసం వెళ్లాడు. ఇప్పటికే బాలయ్య పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా జెమిని టీవీ రిలీజ్ చేసేసింది.
పైసా వసూల్ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది.
Last Updated 26, Mar 2018, 12:02 AM IST | 0business
|
అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలకు నష్టామే..
- గ్లోబల్ ట్రేడ్వార్పై డబ్ల్యుటీవో ఆవేదన
వాషింగ్టన్: వాణిజ్య యుద్దాల వల్ల అన్ని దేశాలకు నష్టమేనని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో) హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై వాణిజ్య ఆంక్షలు, సుంకాల పెంపుతో ట్రేడ్వార్కు తెరలేపిన విషయం తెలిసిందే. దీని వల్ల ముఖ్యంగా ఉద్యోగాలు ఊడుతాయని డబ్ల్యుటీవో ప్రతినిధి రాబర్టో అజెవెడొ అన్నారు. ట్రంపు సారథ్యంలో అమెరికా భారీగా సుంకాలను పెంచుతుందన్నారు. ముఖ్యంగా అమెరికా తన వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి చైనాను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఇక్కడ జరిగిన నేషనల్ ఫారిన్ ట్రేడ్ కౌన్సిల్లో రాబర్టో మాట్లాడుతూ ప్రపంచ వృద్ధి రేటు పెరుగుదలకు ప్రత్యామ్నాయాలు అవసరమన్నారు. గ్లోబల్ ట్రేడ్ వార్ వల్ల అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగించే అవకాశం ఉందన్నారు. ఇదే విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా హెచ్చరించిందన్నారు. అదే విధదంగా టెక్నలాజీలో వస్తున్న మార్పులు కూడా ఉపాధి కల్పనను దెబ్బతీస్తున్నాయన్నారు. వృద్ధికి ప్రధానం ఉత్పత్తి, వినూత్న కల్పనలు, ఉద్యోగాల కల్పనలు కీలకమైనవన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Rates: పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి
గత మూడు రోజులుగా బంగారం పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరల జోరుకు డిసెంబర్ 5న బ్రేకులు పడ్డాయి.
Samayam Telugu | Updated:
Dec 5, 2018, 08:20PM IST
Gold Rates: పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి
బంగారం ధరలు నేటి ట్రేడింగ్లోనూ పెరిగాయి. మంగళవారం రూ.390 పెరగగా, బుధవారం మరో 100 రూపాయల ధర పెరిగింది. బుధవారం (డిసెంబర్ 5) ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,850 నుంచి 31,950 అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,800 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు పతనమయ్యాయి. బుధవారం వెండి ధర రూ. 140 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.37,740 నుంచి 37,600 చేరుకుంది. గత రెండు రోజుల్లోనే రూ.1200 పెరిగిన వెండి ధరలు నేటి ట్రేడింగ్లో కాస్త తగ్గాయి.
ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.24,800 కి చేరింది. ఇక వారంతపు వెండి ధర కేవలం రూ.26 పెరిగి రూ.36,394కి చేరుకుంది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ. 100 పెరిగింది. దీంతో కొనుగోలు ధర రూ.73,000 కాగా.. అమ్మకం ధర రూ.74,000 అయింది.
అంతర్జాతీయంగా చూస్తే బంగారం ధరలు తగ్గాయి. ఔన్స్ బంగారం ధర 0.2 శాతం తగ్గడంతో 1,235.31 డాలర్లకు చేరుకుంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్లో బంగారం ధర 0.5 శాతం తగ్గి 1240.7 డాలర్లుగా ఉంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
హోమ్ క్రీడలు నేడు భారత్ -వెస్టిండీస్ రెండో టీ20
నేడు భారత్ -వెస్టిండీస్ రెండో టీ20
August 04, 2019, 1:44 PM IST
Share on:
విండీస్తో జరుగుతున్న సిరీస్లో భాగంగా టీమిండియా మొదటి టీ20లో విజయం సాధించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 ఇవాళ జరుగుతుంది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. విండీస్ తమ సర్వశక్తులు ఒడ్డించి.. ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది. ఇక భారత్.. మొదటి మ్యాచ్లో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఈ మ్యాచ్ గెలిచి.. సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళూరుతోంది.ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్ టెలికాస్ట్ కానుంది.
సంబంధిత వార్తలు | 2sports
|
Hyderabad, First Published 16, Aug 2018, 4:10 PM IST
Highlights
గూఢచారి టీమ్ ని అభినందిస్తూ హీరో శోభిత సూపర్ హాట్ గా ఉందంటూ ఆయన అన్నారు. శోభిత చాలా బాగా నటించిందని, తనకు బాగా నచ్చిందని, తాను సూపర్ హాట్ అంటూ జగపతి బాబు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కాస్త ఇప్పుడు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అయిపోయింది
హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత విలన్ గా టర్న్ తీసుకున్న నటుడు జగపతి బాబు ఇటీవల 'గూఢచారి' సినిమాలో తన పాత్రతో అందరినీ మెప్పించారు. నటుడిగా ఆయన ప్రయాణం ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవడంతో కెరీర్ లో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చారు. అలానే 'గూఢచారి' సినిమా తన ఎంతో సంతృప్తిని కలిగించిందని ఆ సినిమాను కొనియాడారు.
ఈ సందర్భంలో 'గూఢచారి' సినిమాలో హీరోయిన్ గా నటించిన శోభిత దూళిపాళ్లపై జగపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గూఢచారి టీమ్ ని అభినందిస్తూ హీరో శోభిత సూపర్ హాట్ గా ఉందంటూ ఆయన అన్నారు. శోభిత చాలా బాగా నటించిందని, తనకు బాగా నచ్చిందని, తాను సూపర్ హాట్ అంటూ జగపతి బాబు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కాస్త ఇప్పుడు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అయిపోయింది.
అడివి శేష్ కి జంటగా శోభిత ఈ సినిమాలో నటించింది. గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటించి యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్ల వద్ద తన సత్తా చూపిస్తూనే ఉంది. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కలిసి పనిచేస్తాం: శశాంక్ మనోహర్
బోర్డు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా అందరం కలిసి పనిచేస్తామని నూతన బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తెలిపారు.
TNN | Updated:
Oct 5, 2015, 11:57AM IST
ముంబై : బోర్డు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా అందరం కలిసి పనిచేస్తామని నూతన బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తెలిపారు. ఇక్కడ మేం విబేధాలతో పనిచేయడం సాధ్యం కాదు... కాబట్టి అందరితో సహకారంతో పనిచేస్తామన్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నూతన అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ బాధ్యతలు చేపట్టారు. జగన్మోహన్ దాల్మియా మృతితో ఏర్పడిన అధ్యక్ష పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇన్నేళ్లుగా బోర్డులో చక్రం తిప్పిన శ్రీని.. కనీసం అభ్యర్థిని నిలపడానికి అవసరమైన మద్దతు కూడా పొందలేక పోవడం గమనార్హం. దీంతో ఎటువంటి పోటీ లేకుండా బోర్డు 36వ అధ్యక్షుడిగా మనోహర్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. గతంలో బిసిసిఐ అధ్యక్షుడిగా పనిచేసిన మనోహర్కు మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ కూడా ఉండడం..కలిసి వచ్చింది. ఈ కాలంలో కూడా సెల్ఫోన్ వాడని, సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వంక కూడా చూడని వ్యక్తి శశాంక్. సొంత ఈ-మెయిల్ అకౌంట్ కూడా లేదు. నాగ్పూర్లో ప్రముఖ లాయర్ అయిన మనోహర్తో మాట్లాడాలనుకుంటే ఇంట్లో లేదా ఆఫీసులో ఉండే లాండ్లైన్ ఒక్కటే ఆధారం. 2008-11 వరకు మూడేళ్లు అధ్యక్షుడిగా పనిచేసినా.. ఒక్క వివాదం కూడా రాలేదు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
విడాకుల వార్తలు నిజమేనన్న రజనీ కూతురు
తన విడాకుల విషయమై మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనని రజనీకాంత్ కుమార్తె సౌందర్య ట్విట్టర్ ద్వారా తెలిపారు.
TNN | Updated:
Sep 17, 2016, 12:09PM IST
తన విడాకుల విషయమై మీడియాలో వస్తున్న వార్తల పట్ల రజనీకాంత్ కుమార్తె సౌందర్య స్పందించారు. ఏడాది కాలంగా తాను, భర్త అశ్విన్ విడివిడిగా ఉంటున్నామని పేర్కొన్న ఆమె.. విడాకుల వార్తలు నిజమేనన్నారు. డైవర్స్ తీసుకునే విషయమై ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఇది పూర్తిగా తమ కుటుంబ వ్యవహారమని, దీనిపై అనవసర ఊహాగానాలకు తావివ్వవద్దంటూ ట్విట్టర్లో కోరారు. తమ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న సోదరి ఐశ్వర్య భర్త ధనుష్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గ్రాఫిక్స్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయిన సౌందర్య 2010లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అశ్విన్ రామ్కుమార్ను పెళ్లాడారు. ఇటీవలే ఏడాది ఆమె ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం ఈ మధ్య ఎక్కువైంది. ఇటీవలే అమలాపాల్- విజయ్ జంట విడాకులు కోసం కోర్టుకెక్కగా ఇప్పుడు రజనీ కుమార్తె సౌందర్య కూడా వారి బాటలోనే పయనిస్తోంది.
News about my marriage is true. We have been separated for over a year & divorce talks are on. I request all to respect my family's privacy. | 0business
|
sandhya 112 Views stock market
stock market
ముంబై: ఎఫ్పిఐలపై సర్ఛార్జీల విషయంలో, బైబ్యాక్లపై ప్రభుత్వం విధిస్తామన్న పన్ను విషయంలో స్పష్టత లేకపోవడం విషయంపై దేశీయ మార్కెట్లు ఊగిసలాట ధోరణి కొనసాగుతున్నది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 10 పాయింట్లు లాభపడి 38,730 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 11,555 వద్ద ముగిశాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
వాటర్ హెల్త్తో వొడాఫోన్ జట్టు
నవతెలంగాణ- బిజినెస్ బ్యూరో
వొడాపోన్ ఇండియా గురువారం హైదరాబాద్లో వాటర్ హెల్త్ ఇండియా (డబ్ల్యుహెచ్ఐఎన్)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్నాకట, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని 450 ప్రాంతాల్లో డబ్ల్యుహెచ్ఐఎన్ నగదు వసూళ్లకు వొడాఫోన్ సహకరించనుంది. పబ్లిక్, ప్రయివేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేసే కమ్యూనిటీ వాటర్ సిస్టమ్స్ (సిడబ్ల్యుసి) వ్యాపారంలో వొడాఫోన్ ఎం-పెసా ద్వారా వినియోగదారుల నుంచి రుసుంల వసూలకు సహకరించనుంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరిస్తామని వాటర్ హెల్త్ ఇంటర్నేషనల్ సీవోవో వికాస్ షా తెలిపారు. 2020 నాటికి 10 కోట్ల మందికి దీన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎం-పెసా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 90,000 ఎజెంట్లను కలిగి ఉందని వొడాఫోన్ ఇండియా ఎం-పెసా బిజినెస్ హెడ్ సురేష్ సేథీ అన్నారు. తెలుగు రాష్ట్రాలకు తమ సేవలను విస్తరించినట్లుయిందని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Visit Site
Recommended byColombia
భారత్తో సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జట్టుని ప్రకటించిన తర్వాత.. బంగ్లా క్రికెటర్లు స్ట్రైక్ చేశారు. జీతాల పెంపుతో పాటు 11 డిమాండ్లని బోర్డు ముందు ఉంచి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే..? భారత్ టూర్కి వెళ్తామని స్పష్టం చేశారు. ఈ స్టైక్ని షకీబ్ అల్ హసనే ముందుండి నడిపించాడు. అయితే.. ఈ స్ట్రైక్ జరుగుతున్న సమయంలోనే బంగ్లాదేశ్కి చెందిన లోకల్ టెలికాం సంస్థ గ్రామీణఫోన్ తమ బ్రాండ్ అంబాసిడర్గా షకీబ్తో ఒప్పందం చేసుకుంది. బీసీబీ నిబంధనల ప్రకారం.. బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ఆటగాడు ఏ టెలికాం సంస్థతోనూ ఒప్పందం చేసుకోకూడదు. దీంతో.. క్రమశిక్షణ తప్పిన షకీబ్కి బోర్డు అతనికి షోకాజ్ నోటీసులు పంపింది. రెండు రోజుల క్రితం ఆటగాళ్ల డిమాండ్లపై బీసీబీ సానుకూలంగా స్పందించడంతో స్ట్రైక్ ముగిసిన విషయం తెలిసిందే.
Read More: భారత్లో బంగ్లాదేశ్ టూర్.. మ్యాచ్ల షెడ్యూల్ ఇదే
‘టెలికాం సంస్థ ఒప్పందంపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. ఒప్పందం చేసుకున్న ఆటగాడితో పాటు కంపెనీ నుంచి కూడా నష్టపరిహారాన్ని కోరతాం. ఇప్పటికే టెలికాం సంస్థ గ్రామీణఫోన్కి లీగల్ నోటీసులు పంపాం. అలానే ఒప్పందం చేసుకున్న షకీబ్ నుంచి కూడా వివరణ కోరాం. బోర్డు నిబంధనల్ని షకీబ్ ఉల్లఘించినట్లు తేలితే అతనిపై చర్యలు తీసుకుంటాం’ అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్లా హసన్ స్పష్టం చేశాడు. | 2sports
|
Suresh 135 Views rbi
భారత్కు మద్దతిచ్చే దేశాలకే పెట్టుబడులు!
ముంబై, జనవరి 26: భారత్కు సహకరించని, దేశా లు ప్రాంతాల్లో భారతీయ వ్యక్తులు, సంస్థలు పెట్టు బడులు పెట్టడాన్ని భారతీయ రిజర్వుబ్యాంకు నిషే ధం ప్రకటించింది. ఆర్థికకార్యాచరణ నిఘా సంస్థ (ఎఫ్ఎటిఎఫ్) సంస్థ అందచేసిననివేదికను అను సరించి అంతర్ ప్రభుత్వా ల టాస్క్ఫోర్స్ చేసిన సిఫారసులు ఆధారంగా రిజర్వుబ్యాంకు ఈ నిర్ణ యం ప్రకటించింది. భార త్, అమెరికా, బ్రిటన్, చైనా, యూరోపియన్ కమిషన్ వంటి దేశాల తోపాటు మొత్తం 35 మంది సభ్యులున్న దేశా లతో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ పనిచేస్తోంది. భారత విదేశీ మారకద్రవ్య చట్టం నిబంధనలను అనుసరించి సమతుల్యత పాటించేందుకువీలుగా భారత్కు మద్ద తులేని దేశాలు, ప్రాంతాల్లో పెట్టుబడులపై నిషే ధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ ఏ భారత సంస్థ, వ్యక్తుల పెట్టుబడులపైనా ఇలాంటి ఆంక్షలులేవు. ఆయా దేశాల నిబంధనలు అను సరించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులరూపంలో భార త పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇకపై ఈ టాస్క్ఫోర్స్ గుర్తించిన దేశాల్లో భారత్కు చెంది న వ్యక్తులు కానీ, సంస్థలు కాని ఎఫ్డిఐ కింద పెట్టుబడులు పెట్టేందుకు వీలులేదని స్పష్టం మవు తోంది. జాయింట్ వెంచర్లు కానీ, పరోక్ష పెట్టుబడులు, లేదా అనుబంధ సంస్థగా కానీ కొనసాగేందుకు వీలులేదు, పెట్టుబ డులు పెట్టేందుకు సైతం వీలులేదు. 1989లో ఏర్పాటయి నఎఫ్ఎటిఎఫ్ ఆయా దేశాలకు సహకరించ ని దేశాల్లో తమతమ పెట్టుబడులను నియంత్రిం చుకునేందుకు ఉద్దేశించింది. న్యాయపరమై, చట్ట పరమైన నిర్వహణ అంశాలు, మనీలాండరింగ్ నిర్మూలన, ఉగ్రవాదసంస్థలకు ఫైనాన్సింగ్ చేయ డం వంటి వాటిపై విస్తృతంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థల సహకారంతో ఎఫ్ఎటిఎఫ్ తన కార్యాచరణను అమలుచేస్తుంది. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పాక్పై తొలి టెస్టులో ఆసీస్ టార్గెట్ 462
ఆదివారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 482 పరుగులు చేయగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు కేవలం 202 పరుగులకే కుప్పకూలిపోయింది.
Samayam Telugu | Updated:
Oct 10, 2018, 03:30PM IST
దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుకి 462 పరుగుల టార్గెట్తో పాకిస్థాన్ కఠిన సవాల్ విసిరింది. ఆటలో నాలుగోరోజైన బుధవారం ఓవర్నైట్ స్కోరు 45/3తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన పాకిస్థాన్ జట్టు రెండో సెషన్లో 181/6 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 280 పరుగులు కలుపుకుని.. మొత్తం 462 పరుగుల భారీ టార్గెట్ని ఆస్ట్రేలియా ముందు పాక్ నిలిపింది. మ్యాచ్ మరో ఒకటన్నర రోజు మాత్రమే మిగిలి ఉండగా.. దాదాపు 137 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ క్రీజులో నిలవడం కత్తిమీద సామే..!
ఆదివారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 482 పరుగులు చేయగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు కేవలం 202 పరుగులకే కుప్పకూలిపోయింది. పాక్ అరంగేట్ర స్పిన్నర్ ఆసిఫ్ బిలాల్ (6/36)తో చెలరేగాడు. 280 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో.. ఆస్ట్రేలియాని పాకిస్థాన్ ఫాలో ఆన్ ఆడిస్తుందని అంతా భావించారు. కానీ.. నిన్న రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్.. ఈరోజు రెండో సెషన్లో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. | 2sports
|
internet vaartha 152 Views
కాబూల్ : ఇష్టమైన క్రికెటర్లు కనిపిస్తేచాలు వారితో కలిసి పోటోలు దిగేందుకు, ఆటోగ్రాప్ల కోసం వెంటపడుతుంటాం.కానీ ఒక పొటోలో మాత్రం క్రికెటర్లు అభిమాని వెంటపడుతున్నారు. కానీ ఆటో గ్రాప్ కోసమో, సెల్ఫీ కోసమో కాదు. ఇక్కడి పోటోలు బాలుడి వెంటపడుతున్న వారు అప్ఘానిస్థాన్కు చెందిన క్రికెటర్లు. ఓ రోజు పోలీయో వ్యాక్సినేషన్పై అక్కడి క్రికెటర్లంతా కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులోనూ అప్ఘానిస్థాన్లో పోలియో వ్యాధి ఇప్పటికీ వ్యాప్తిస్తూనే ఉంది. ఇందులో భాగంగా క్రికెటర్లు పిల్లలకు పోలీయో చుక్కలు వేయించారు. కానీ ఓ బాలుడు మాత్రం పోలియో చుక్కలు వేయించుకోనని మారాం చేస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. కాగా ఆ బాలుడిని పట్టుకోవడానికి క్రికెటర్లు వెంటపడ్డారు.ఇంతకీ ఆ బాలుడిని వారు పట్టుకున్నారో లేదో తెలీదు కానీ ఇందంతా అక్కడే ఉన్న మీడియా చిత్రీకరించింది. దీంతో ఆ పోటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
యాపిల్ ఐపాడ్ ప్రో అమ్మకాల తిప్పలు!
TNN | Updated:
Sep 16, 2015, 01:18PM IST
ఆర్భాటంగా విడుదలైన యాపిల్ ఐప్యాడ్ ప్రో అమ్మకాలు ఆశించిన రీతిలో జరగకపోవడంతో ఆ సంస్థలో గుబులు మొదలైంది. ఇప్పటివరకు విడుదలైన ఐప్యాడ్ లతో పోలిస్తే ఈ కొత్త ఐప్యాడ్ ప్రో అత్యంత శక్తిమంతమని యాపిల్ చెప్పినప్పటికీ కొనుగోలుదారుల్లో ఆసక్తి రావడం లేదు. పేరుకు ఐ ప్యాడ్ ప్రో అయినప్పటికీ ఇందులో సరికొత్తగా వ్యాపార వర్గాలకుపయోగపడే ఫీచర్లేవీ లేవంటున్నారు. యాపిల్ సంస్థకు అమ్మకాల పరంగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద వ్యాపార సంస్థల నుండి మంచి ఆదరణే ఉంది. కానీ ఈ ప్రో దగ్గరకొచ్చేసరికి పరిస్థితి తిరగపడింది. బోలెడంత డబ్బు పోసి ఏమాత్రం అధునాతన ఫీచర్లు లేని ఉత్పాదనను కొనుగోలుచేయడానికి పెద్ద కంపెనీలు ఇష్టపడటం లేదు. తన నూతన ఐ ప్యాడ్ ప్రో విడుదల చేసే సమయంలో యాపిల్ సంస్థ , ఆ ఉత్పాదనకు బాగా గిరాకీ ఉంటుందని భావించింది. ఆయా కంపెనీలు ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఇతర సంస్థల పరికరాలను వదిలేసి ఐప్యాడ్ ప్రోకు మారిపోతారనుకుంది. | 1entertainment
|
internet vaartha 248 Views
ట్విట్టర్లో మీడియాపై మాల్యా రుసరుసలు
న్యూఢిల్లీ : నేను అంతర్జాతీయ వాణిజ్యవేత్తను. భారత్నుంచి ఎక్కడికైనా తరచూ వెళుతుంటారు. భారత్నుంచి పరారీఅయిరాలేదు. అలాగే నేను పరారయ్యే వక్తినీ కాదు. ఈ ఆరోపణలన్నీ రబ్బిష్ అంటూ కింగ్ఫిషర్ ఛైర్మన్ విజయ్ మాల్యా ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసారు. మీడియా బాస్లు తానుచేసిన సాయం మరిచిపో కూడదు. వారికి ఒనగూరిన ప్రయోజనాలు విస్మరిస్తున్నారు. వసతిఏర్పాటు నుంచి అన్ని పొందారు. కొన్నేళ్లపాటు మీడియాకు సహకరించా ఇపుడు టిఆర్పికోసం నాపైనే ప్రచారం చేస్తున్నాయంటూ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఒక భారత పార్లమెంటు సభ్యునిగా నేను భారత్ చట్టాలను ఎంతో గౌరవిస్తానని పేర్కొన్నారు. చట్టాలకు కట్టుబడి ఉంటానని, భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. అయితే మీడియా తనను విచారించాల్సిన పనిలేదని పేర్కొన్నారు. తాను పరారీ కాలేదనడానికి మీడియా ముందుకు రావనవసరం లేదని పేర్కొన్నారు. మీడియా బాస్లు టిఆర్పిరేటింగ్స్కోసం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. కొన్నే ళ్లుగా నానుంచి పొందిన వసతి, ఇతర ప్రయోజనాలు, సహకారం అన్నింటినీ విస్మ రిస్తున్నారు. నేడు టిఆర్పికోసం అబద్దాలు ప్రచారంచేస్తున్నారు. మీడియా వేట ప్రనారంభం అయితే నిప్పురాజేసినట్లేనని అదేసమయంలో ఈ మీడియా ప్రచారం వల్ల నిజాలు వాస్తవాలు ఈ నిప్పులాంటి అవాస్తవాల్లో మసైపోతాయని మాల్యా ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. మార్చి2వ తేదీ దేశంవిడిచి వెళ్లిపోయారని అటార్ని జనరల్ ముకుల్రోహ్తగి స్వయంగా సుప్రీంబెంచ్కు నివేదించారు. మార్చి 9వతేదీ 17 ప్రభుత్వరంగ బ్యాంకుల కూటమి తమ కింగ్ఫిషర్ బకాయిల వసూలు కోసం మాల్యాను దేశం విడిచి వెళ్లకుండా చూడాలని, పాస్పోర్టు స్వాధీనంచేసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశాయి. అయితే రెండవ తేదీనే మాల్యా దేశం విడిచివెళ్లి పోయారని బహుశా లండన్లో ఉండవచ్చని అటార్నిజనరల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 900కోట్ల రుణానికి సంబంధించి ఐడిబిఐబ్యాంకు కేసులో మాల్యా ఇప్ప టికే సిబిఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ ఛైర్మన్ పదవి నుంచి పూర్తిగా వైదొలగడం ద్వారా ఆయనకు వచ్చే రూ.515 కోట్లను లండన్కు చెందిన డియోజియోసంస్థ ఐదేళ్లపాటుదశలవారీగా చెల్లించే ఒప్పందం జరిగింది. ఈ మొత్తం కూడా బకాయిలకు జమచేయించుకునేందుకు ఎస్బిఐ ఇతర బ్యాంకులు ముంబై లోని డిఆర్టిలో కేసులు దాఖలుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై డిఆర్టి చెప్పేం తవరకూ ఈసొమ్ము పంపిణీచేయవద్దంటూ డియోజియోను డిఆర్టి ఆదేశించింది. మీడియాలో వస్తున్న కథనాలపైనే మాల్యా ప్రత్యేక దృష్టిపెట్టి తనగళం మొదటి సారి వినిపించారు. తనకున్న ట్విట్టర్ హ్యాండిల్ను ఇందుకు సాధనంగా ఉపయో గించుకుని ఒక్కొక్కటిగా వ్యాఖ్యలు చేస్తుండటం సంచలనాలకు తావిస్తోంది. కాగా మాల్యా దేశం వీడి వెళ్లడంపై పార్లమెంటులో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేసాయి. సిబిఐ లుక్ఔట్ నోటీసు జారీచేసిన తర్వాత మాల్యాఎలా వెళ్లగలిగా రంటూ నిలదీశాయి. ప్రభుత్వం ఇందుకు సహకరించిందా? అన్న సందేహాలను వ్యక్తంచేశాయి. అధికార విపక్షాల మధ్య మాటలయుద్ధం తారస్థాయిలో జరిగింది. ఒకదశలో నాటికాంగ్రెస్ హయాంలో దేశంవిడిచివెళ్లిన ఆయుధవ్యాపారి ఓట్టోవియో ఖత్రోచి వ్యవహారాన్ని కూడా బిజెపి తెరపైకి తెచ్చింది. భారత్లో ఇటీవలి కాలంలో వివాదాస్పద వ్యక్తిగా లలిత్మోడీ రాజకీయ పార్టీలమధ్యనలిగితే తాజాగా వ్యాపార దిగ్గజం విజ§్ుమాల్యా రాజకీయ పార్టీలకు కేంద్రబిందువుగా మారారు. ఇదిలా ఉండగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈనెల 18వతేదీ మాల్యాను విచారణకు రావా లని ఆదేశాలు జారీచేసింది. రూ.9వేలకోట్ల రుణబకాయిలకు సంబంధించి మాల్యా విచారణకు హాజరుకావాలని కోరింది. కంపెనీ చీఫ్ఫైనాన్షియల్ అదికారి ఆర్,నెండుంగాడి ఇడిఅధికారులను కలిసి పూర్తి వివరాలిచ్చినేట్లు తేలింది. ఇడి విచారణకు పూర్తి వివరాలతోరావాలని కోరినట్లు ఇడికి చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ఆయన టాక్స్రిటర్నుల ప్రూఫ్తోపాటు స్థిరాస్తులు, ఆయన పెట్టుబడులు పెట్టిన సంస్థల వివరాలు మొత్తం కోరి నట్లు తేలింది. ఇడి కింగ్ఫిషర్ఎయిర్లైన్స్ మాజీ సిఎఫ్ఒ రఘునందన్ ను విచారించింది. ఐడిబిఐ బ్యాంకు 950కోట్లకు సంబంధించిన రుణం పై ఇడిప్రశ్నలు వేసినట్లు సమాచారం. రఘునందన్ అందరికంటే సీని యర్ అధికారి అయినందున అన్ని లావాదేవీలు ఆయనకు తెలుసునని ఇడి అధికారులు పేర్కొంటున్నారు. ఐడిబి ఐబ్యాంకు మాజీ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ అగర్వాల్ను కూడా ఇడిశనివారం విచారించను న్నది. 2009లో సిఎఫ్ఒగా రఘునందన్ బ్యాంకులను స్వల్పకాలిక రుణాలుగా మంజూరుచేయాలని కోరినట్లు సమాచారం. మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలో ఇడి మాల్యా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, ఐడిబిఐ అధికారులమధ్యకేసు నమోదుచేసింది. ఈరుణమొత్తంలో కొంతభాగమై నా విదేశాలకు తరలివెళ్లిందా అన్న అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉంది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వన్డే జట్టు సారథిగా రిషబ్ పంత్
టీమిండియాలో చోటు కోసం పరితపిస్తున్న రిషబ్ పంత్పై సెలక్టర్లు అనూహ్య నిర్ణయం
TNN | Updated:
Feb 10, 2017, 04:33PM IST
యువ క్రికెటర్‌కి అవకాశమివ్వాలనే ఉద్దేశంతో సెలక్టర్ల సూచన మేరకు వెటరన్ బ్యాట్స్‌మెన్ గౌతం గంభీర్ ఢిల్లీ వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పకున్నాడు. దీంతో ఇటీవల భారత టీ20 జట్టులోకి అరంగేట్రం చేసిన వికెట్‌ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కి వన్డే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అతుల్ హసన్ నిర్ణయం తీసుకున్నారు. గంభీర్‌తో సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే నాయకత్వ మార్పు చేసినట్లు ఛైర్మన్ వెల్లడించారు. 'ఈ సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీ చివరి టోర్నీ. రాష్ట్ర జట్టును సమర్థంగా నడిపించే నాయకుడిని గుర్తించడానికి ఇదే మంచి తరుణమని మా ఉద్దేశం. గంభీర్ తర్వాత ఎవరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలో మేము ఇప్పటి వరకు ఆలోచించనే లేదు’ అని ఢిల్లీ సెలక్టర్ నిఖిల్ చోప్రా తెలిపారు.
విజయ్ హజారే సిరీస్ రిషబ్ పంత్ కెప్టెన్సీకి పరీక్ష లాంటిది. అయితే అతడు గంభీర్ పర్యవేక్షణలో తొందరగా నేర్చకుంటాడనేదే మా ఉద్దేశమని చోప్రా వివరించాడు. గత ఏడాది భారత్ టెస్టు జట్టులోకి గంభీర్ పునరాగమనం చేసినా ఆశించిన మేర రాణించలేకపోవడంతో జట్టు నుంచి స్థానం కోల్పోవాల్సి వచ్చింది. విజయ్ హజారే ట్రోఫీ ఫిబ్రవరి 25 నుంచి ఆరంభం కానుంది. ఇప్పుడిప్పుడే టీమిండియా తరఫున ఆడేందుకు పరితపిస్తున్న రిషబ్ పంత్‌ భుజాలపై ఢిల్లీ జట్టు పెద్ద బాధ్యతలనే మోపింది. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
టీ20 లీగ్ నుంచి అర్జున్ తెందుల్కర్ ఔట్..!
ముంబయి పరిధిలోని యువ క్రికెటర్లని వెలుగులోకి తెచ్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా ఆరంభిస్తున్న ‘ముంబయి టీ20 లీగ్’
TNN | Updated:
Mar 2, 2018, 01:41PM IST
టీ20 లీగ్ నుంచి అర్జున్ తెందుల్కర్ ఔట్..!
ముంబయి పరిధిలోని యువ క్రికెటర్లని వెలుగులోకి తెచ్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా ఆరంభిస్తున్న ‘ముంబయి టీ20 లీగ్’ నుంచి సచిన్ తెందుల్కర్ కుమారుడు అర్జున్ తెందుల్కర్ అనూహ్యంగా తప్పుకున్నాడు. ఈ లీగ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తన తండ్రి సచిన్ తెందుల్కర్‌ సూచన మేరకే అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. మంబయి అండర్-19 జట్టులో ఇటీవల చోటు సంపాదించిన అర్జున్.. బ్యాటింగ్‌ కంటే బౌలింగ్‌లోనే మెరుగ్గా రాణిస్తున్నాడు.
కోచ్ అతుల్ గైక్వాడ్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న అర్జున్‌.. ఇటీవల తన బౌలింగ్‌ శైలిని కొద్దిగా మార్చుకున్నాడట. దీంతో.. ఆ శైలిని గమనించిన సచిన్.. మరికొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలని సూచిస్తూనే.. శైలికి అలవాటుపడేవరకూ ఏ లీగ్ ఆడకుండా ఉండాలని చెప్పాడట. తండ్రి సూచన మేరకు.. తాజాగా టీ20 లీగ్‌ నుంచి అర్జున్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11 నుంచి 21 వరకు ముంబయి లీగ్ జరగనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price: ఆరేళ్ల గరిష్ఠ స్థాయికి బంగారం ధరలు
ఆరేళ్ల తర్వాత మళ్లీ పది గ్రాముల బంగారం ధర రూ.32,625 స్థాయికి చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Samayam Telugu | Updated:
Oct 26, 2018, 12:38PM IST
Gold Price: ఆరేళ్ల గరిష్ఠ స్థాయికి బంగారం ధరలు
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో డిమాండ్ బాగా పెరుగుతోంది. దేశీయ నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం, అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి బలహీనపడటం.. తదితర కారణాలతో పసిడి ధరలు పట్ట పగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాయి. ఆరేళ్ల తర్వాత మళ్లీ పది గ్రాముల బంగారం ధర రూ.32,625 స్థాయికి చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బంగారం సంగతి ఇలా ఉండగా.. వెండి ధర మాత్రం రూ.130 వరకు పతనమైంది. పరిశ్రమల నుంచి డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో వెండి ధర క్షీణించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధర మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను బంగారం కొనుగోలుకు మళ్లిస్తున్నారని బులియన్ వర్గాలు తెలిపాయి. నిన్నటి ట్రేడింగ్లో రూ.125 మేర బంగారం ధరలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ.32,625 ఉండగా.. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్లు) ధర రూ.32,475 కి చేరింది. నవంబర్ 29, 2012 తర్వాత ఇదే అత్యధిక ధర. హైదరాబాద్ బులియన్ విపణిలో 10గ్రా. మేలిమి బంగారం రూ.32,800, కిలో వెండి రూ.39,370గా నమోదవుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
మొండి బకాయిలపై బ్యాంకర్లతో జైట్లీ చర్చలు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో పెరిగి పోతున్న నిరర్ధక ఆస్తులపై సమగ్ర చర్చలు జరిపేం దుకు ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అత్యున్నతస్థాయి ఆర్బిఐ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగే ఈసమావేశంలో ఆర్ధికసేవల కార్య దర్శి అంజూలై చిబ్దుగ్గల్ కూడా హాజరై సమ స్యాత్మక ఆస్తులపై తక్షణ పరిష్కారం కోసం చర్చలు జరుపుతారని తేలింది. ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్సుబ్రహ్మణియన్ ఇప్పటికే ఒక బ్యాడ్ బ్యాంక్ను సృష్టించి ఈసమస్యకు పరిష్కారం అన్వే షించాలని సూచించారు. రిజర్వుబ్యాంకు డిప్యూటి గవర్నర్ వైరల్ ఆచార్య రెండు అంశాలను ప్రతిపా దించారు. ప్రైవేటు స్థిరాస్తి యాజమాన్యకంపెనీ, జాతీయ అసెట్మేనేజ్మెంట్ కంపెనీలను స్థాపించి వీటిని పరిష్కరించుకోవచ్చన్నారు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు 5.5 లక్షలకోట్లనుంచి 6.3 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రతి త్రైమాసికం ముగిసేనాటికి 79,977 కోట్ల రూపాయలు పెరు గుతున్నాయి. గతనెలలో అరవింద్సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ ప్రభుత్వరంగంలోనే స్థిరాస్తి పునర్ వ్యవస్థీకరణ కంపెనీ (ఎఆర్సి)లనుఏర్పాటు చేయా లని లేదా బ్యాడ్బ్యాంక్ ఏర్పాటుచేసి పెరుగుతున్న ఎన్పిఎలను కట్టడిచేయాలని సూచించారు. ఇక ఆచార్య ప్రతిపాదించిన పిఎఎంసి ప్లాన్ మెటల్స్, నిర్మాణరంగం, టెలికాం, టెక్స్టైల్స్రంగాలకు అమలుచేయవచ్చని సూచించారు. స్వల్పకాలంలో ఈ స్థిరాస్తులు ఆర్థికవిలువలు కలిగి ఉంటాయి. ఈ ప్రణాళిక ప్రకారంచూస్తే బ్యాంకింగ్రంగం 50 భారీ సమస్యాత్మక బాకీలను ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీకల్లా పునర్వ్యవస్థీకరించాలని సూచించే అవ కాశం ఉంది. జాతీయ స్థిరాస్తి యాజమాన్య కంపెనీ గా (ఎన్ఎఎంసి)వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న రుణాలను రికవరీచేసేందుకు అవసరమైన ప్రణాళికలతోపాటు ఆయా కంపెనీల ఆర్థికపరిపుష్టి ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా. మొత్తంగాచూస్తే అత్యున్నత స్థాయి అధికారులతోఎఎన్పిఎలపై అరుణ్జైట్లీ సమ గ్రంగా చర్చిస్తారని అంచనా. ఇదిలా ఉండగా అంత ర్జాతీయ రేటింగ్స్సంస్థ ఫిట్జ్రేటింగ్స్ కొన్ని భార తీయ బ్యాంకులు ప్రత్యేకించి ప్రభుత్వరంగ బ్యాం కులు జారీచేసిన బాండ్లపై రెండేళ్లపాటు చెల్లింపులు దాటవేయవచ్చని అంచనావేసింది. ఇందుక ఆర్థికపరిపుష్టి క్షీణించడమే కారణమని అభిప్రాయ పడింది. రానిబాకీలు పెరగడం, ఆర్థిక సమతుల్యత దెబ్బతినడమే ఇందుకు కారణం. అంతేకాకుండా సుమారు 70వేల కోట్లు ఇందుకు కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. బ్యాంకుల్లో ఇండియన్ ఓవర్సీస్బ్యాంక్కు అధ్వాన్నంగా మారిపోయింది. ఏప్రిల్ణుంచి డిసెంబరువరకూ తొమ్మిదినెలల కాలంలో నష్టాలు 132శాతానికి పెరిగాయి. పంపిణీ చేయదగిన రిజర్వులో 30శాతానికి నష్టాలుమించి పోయాయి. బ్యాంక్ఆఫ్మహారాష్ట్ర,ఐడిబిఐబ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లు కూడా ఇదే తీరులో ఉన్నట్లు ఫిట్స్రేటింగ్స్ వెల్ల డించింది. బ్యాంకింగ్ వ్యవస్థ పరిపుష్టం కావాలంటే 2019నాటికి 90బిలియన్ డాలర్ల తాజా మూల ధనంవనరులు అవసరంఅవుతాయి. బేసెల్3 నిబం ధనలకింద మూలధనవనరులు పరిపుష్టంచేసుకోవా లంటే ఇందుకుఎంతోనిధులు అవసరం అవుతాయి. | 1entertainment
|
Hyderabad, First Published 30, Sep 2018, 3:11 PM IST
Highlights
బాహుబలి సినిమా వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. చిత్రంలో నటించిన రానా అనుష్క నుంచి సినిమాలు వచ్చాయి గాని ప్రధానమైన దర్శకుడు రాజమౌళి నుంచి ప్రభాస్ నుంచి మరొక ప్రాజెక్టు రాలేదు. రాజమౌళి సంగతి పక్కనపెడితే ప్రభాస్ కోసం అభిమానులుకొంచెం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.
బాహుబలి సినిమా వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. ఈ చిత్రంలో నటించిన రానా అనుష్క నుంచి సినిమాలు వచ్చాయి గాని ప్రధానమైన దర్శకుడు రాజమౌళి నుంచి ప్రభాస్ నుంచి మరొక ప్రాజెక్టు రాలేదు. రాజమౌళి సంగతి పక్కనపెడితే ప్రభాస్ కోసం అభిమానులుకొంచెం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సాహో యొక్క రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చెప్పడం కష్టమే.
ఇకపోతే జిల్ దర్శకుడు రాధాకృష్ణతో ఒకే చేసిన ప్రాజెక్టును వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే నటీనటులను ఫైనల్ చేసిన చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనుంది. టెక్నీషియన్స్ ముందుగానే ఇటలీకి వెళ్లిపోగా రీసెంట్ గా ప్రభాస్ తో పాటు మిగిలిన నటీనటులు అక్కడి టీమ్ తో జాయిన్ అయ్యారట.
పిరియడ్ డ్రామాగా తెరకెక్కబోయే ఈ సినిమాలో ప్రభాస్ తో పూజ హెగ్డే నటించనుంది. ఒక రొమాంటిక్ కథగా దర్శకుడు కథను తెరకెక్కించనున్నాడు. ప్రధాన తారాగణం మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం అందుతోంది. మరి ప్రభాస్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Last Updated 30, Sep 2018, 3:13 PM IST | 0business
|
Visit Site
Recommended byColombia
ఈ కార్యక్రమంలో నల్లటి డ్రెస్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హీరోయిన్ అనుపమ తెలుగులో అదిరిపోయే స్పీచ్ ఇచ్చింది. అనుపమ మాట్లాడుతూ.. నాకు కొంచెం హెల్త్ బాలేదు.. అందుకే సరిగా మాట్లాడలేపోతున్నా.. ‘హలో గురు ప్రేమ కోసమే’ నా 7వ చిత్రం. ‘శతమానం భవతి’ చిత్రం తరువాత నిర్మాత దిల్ రాజుతో చేసిన రెండో సినిమా ఇది. ఇంత మంచి టీంతో వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన చాలా ఫన్నీగా ఉంటారు. నన్ను షూట్లో బాగా ఏడిపించేవారు.
హీరో రామ్, ప్రకాష్ రాజ్లతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పాలంటే.. ఆయన ‘శతమానం భవతి’ చిత్రంలో నాకు గ్రాండ్ ఫాదర్ చేశారు. ఈ సినిమాలో ఫాదర్గా నటించారు. నెక్స్ట్ సినిమాలో నా బాయ్ ఫ్రెండ్గా చేసినా చేస్తారు. అంత యంగ్గా కనిపిస్తారాయన. ఆయన అద్భుతమైన నటుడు.. షూటింగ్లో చాలా విలువైన సలహాలు ఇస్తారు.
హీరో రామ్తో రెండోసారి చేస్తున్నా.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ తరువాత వెంటనే ఆయనతో నాకు నటించే అవకాశం వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ అందించారు. ఆయనతో కూడా నాకు ఇది రెండో సినిమా. ఈ చిత్రానికి కూడా పెద్ద సక్సెస్ అందించాలన్నారు అనుపమ.
Anupama Super Cute Speech @Hello Guru Prema Kosame Pre Release Event https://t.co/paGJYQXtwW
— Shreyas Group (@shreyasgroup) 1539444371000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు…
మాస్టర్స్ చాంపియన్స్ లీగ్
న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు మాస్టర్స్ చాంపియన్స్ లీగ్(ఎంసిఎల్) వేదిక కాబోతుంది.కాగా మరోసారి మాజీ క్రికెటర్లు తమ ఆటతో అలరించేందుకు సిద్దమవుతున్నారు.యుఎఇలోని పలుచోట్ల జరిగే మాస్టర్స్ చాంపియన్స్ లీగ్లో మొత్తం ఆరు జట్టు పాల్గొంటున్నాయి.లిబ్రా లెజెండ్స్,జెమినీ అరేబియన్స్,కాప్రికోర్న్ కమాండర్స్,లియో లైవ్స్,విర్గో సూపర్ కింగ్స్,సాగిటారియన్ స్ట్రైకర్స్ పోటీకి సిద్దమవుతున్నాయి.కాగా ఈ లీగ్లో లిబ్రా లీజెండ్స్కు గంగూలీ నేతృత్వం వహిస్తుండగా,జెమినీ అరేబియన్స్ జట్టుకు సెహ్వాగ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు.టీమిండియా వన్డే,టి20 కెప్టెన్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుండటం మరో విశేషం.తొలి ఎడిషన్లో సెమీ ఫైనల్,ఫైనల్ మ్యాచ్లతో కలుపుకుని మొత్తం 18 మ్యాచ్లు జరుగనున్నాయి.ఎంసిఎల్లో టోర్నీలో బ్రియాన్ లారా,ముత్తయ్య మురళీధరన్,అడమ్ గిల్క్రిస్ట్,పాల్ కాలింగ్ వుడ్,బ్రెట్ లీ,జాక్వస్ కల్లీస్,మహేలా జయవర్థనే,కుమార సంగక్కర తదితరులు పాల్గొంటారు.కాగా ఈ లీగ్ను సోనీ టెలివిజన్ ప్రసారం చేయనుంది. | 2sports
|
Jun 04,2015
విప్రో ఉద్యోగుల వేతనాలు 7% పెంపు
న్యూఢిల్లీ : విప్రో తమ ఉద్యోగుల వేతనాలను 7 శాతం పెంచుతూ ప్రకటన చేసింది. అర్హులైన ఉద్యోగుల వేతన పెంపు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆ కంపెనీ మానవ వనరుల విభాగం గ్లోబల్ హెడ్ సురబ్ గోవిల్ తెలిపారు. అప్షోర్ ఉద్యోగుల వేతనాలు 7 శాతం, ఆన్సైట్ ఉద్యోగుల వేతనాలు 2 శాతం చొప్పున పెంచామన్నారు. ప్రతిభ చూపిన ఉద్యోగులకు రెండంకెల్లో వేతనం పెంచనున్నామని గత ఏప్రిల్లో ఆ కంపెనీ ప్రకటించింది.
ఈ ఏడాది ఐటి ఉద్యోగులు సగటున 8-10 శాతం వేతనం పెంపును ఆశిస్తున్నారు. జూనియర్ స్టాప్కు ప్రస్తుతం ఇస్తున్న బేసిక్ను పెంచింది. గత మార్చి 31 నాటికి విప్రోలో మొత్తంగా 1,58,217 మంది సిబ్బంది పని చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తమ ఉద్యోగులకు 8 శాతం వేతనాలు పెంచింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 251 Views
అభిమానుల కోసం వినూత్న ప్రయోగం
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు క్రికెట్ పీవర్ పట్టుకుంది.ఏ క్రికెట్ అభిమాని నోట విన్నా వరల్డ్ టి20 టోర్నీ గురించి మాట్లాడుకుంటున్నారు. టి20 ప్రపంచ కప్ మన దేశంలో జరుగుతుండ టంతో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటు న్నారు. ఇది ఇలా ఉండగా,ఈ మెగా టోర్నీకి ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు వ్యాపారుస్థులు.క్రికెట్ సీజన్లో వివిధ ఆఫర్లతో తమ ఉత్పత్తులను విక్రయిస్తూ లాభాలు గడించడం సాధారణ విషయమే.అయితే ఢిల్లీలోని ఒక రెస్టారెంట్ యాజమాన్యం కొత్తగా ఆలోచించింది. ప్రముఖ హోటల్ తన మెనూను క్రికెట్ ప్యాన్స్ను ఆకట్టుకునేలా రూపొందించింది.రెస్టారెంట్లోని ఆహార పదార్ధాలకు క్రికెట్ షాట్ల పేరు పెట్టింది.లెగ్ గ్లాన్స్,లేట్ కట్,హెలికాప్టర్ షాట్లను మోనూలో పొందుపరిచింది. నోరూరించే పుట్టగొడుగుల పైకి టీమిండియా ధోనీ షాటైన హెలికాప్టర్ షాట్ పేరు పెట్టింది.ఇక వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఫేమస్ షాట్ లేట్ కట్ అని ఆర్డర్ చేస్తే వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ టేబుల్ పైకి వచ్చేస్తుంది.మటన్ స్కేవెర్డ్కు సంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఫేమస్ క్రిన్స్ డ్రైవ్ పేరు పెట్టింది.మట్టి పాత్రలో తయారు చేసిన ఈ వంటకాన్ని తింటుంటే సచిన్ ట్రేడ్ మార్క్ స్ట్రయిట్ డ్రైవ్ చూస్తున్నంత ఫీలింగ్ కలుగుకమాన దని నిర్వాహకులు చెబుతున్నారు. అదే విధంగా టి20 ప్రపచం కప్ మ్యాచ్లను వీక్షించేందుకు ప్రత్యేక తెరలను కూడా ఏర్పాటు చేసింది. మైదానంలో ఆటగాళ్లు కొట్టే షాట్లను చూస్తూ తమ కిష్టమైన షాట్లను పసందుగా ఆరగించేయవచ్చన్న మాట. ఈ రెస్టారెంట్ వినూత్న ప్రయత్నాన్ని క్రికెట్ అభిమానులు కూడా బాగానే ఆదరిస్తుండటం గమనార్హం. | 2sports
|
Wellington, First Published 4, Feb 2019, 7:54 AM IST
Highlights
రిప్లేలో పాండ్యా బ్యాటు క్రీజును తాకలేదని తేలింది. జారిపోతున్న బ్యాటును క్రీజుపైకి విసిరేసి రెండో పరుగు కోసం ప్రయత్నించినట్టు రిప్లేలో కనిపించింది.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరిగిన ఐదో వన్డేలో హార్దిక్ పాండ్యా ఓ చిన్న తప్పు చేసి పరుగును కోల్పోయాడు. నీషమ్ వేసిన 49వ ఓవర్ నాలుగో బంతికి రెండు పరుగులు తీశాడు. అయితే, తొలి పరుగును వేగంగా పూర్తి చేసే క్రమంలో క్రీజుపై బ్యాటు పెట్టకముందే అది కాస్తా జారిపోయింది.
క్రీజుకు బ్యాట్ తాకలేదనే విషయాన్ని గమనించని పాండ్యా రెండో పరుగు తీశాడు. దీంతో ఆ బంతికి రెండు పరుగులొచ్చాయి. అయితే పాండ్యా తొలి పరుగును పూర్తి చేయకుండానే రెండు పరుగు తీసినట్టు గుర్తించిన కివీస్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ ఆ విషయాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు.
రిప్లేలో పాండ్యా బ్యాటు క్రీజును తాకలేదని తేలింది. జారిపోతున్న బ్యాటును క్రీజుపైకి విసిరేసి రెండో పరుగు కోసం ప్రయత్నించినట్టు రిప్లేలో కనిపించింది. దీంతో అంపైర్ ఓ పరుగు తగ్గించి ఓ పరుగును మాత్రమే ఇచ్చాడు.
Last Updated 4, Feb 2019, 7:53 AM IST | 2sports
|
దుమ్మురేపిన భారత్ బౌలర్లు
వెస్టిండీస్ 143 ఆలౌట్ (19.4 ఓవర్లు) టీమిండియా ఇన్నింగ్స్కు అంతరాయం
లాడర్ హిల్: టీమిండియాతో వెస్టిండీస్కు జరుగుతున్న రెండవ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది.దీంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు.కాగా మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 143 పరుగులకు ఆలౌటైంది.టార్గెట్ చేధనలో టీమిండియా 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది.అజింక్యా రహానే 4 పరుగులు,రోహిత్ శర్మ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు… వెస్టిండీస్తో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో భారత బౌలర్లు అదరహో అనిపించారు.కాగా తొలి ఓవర్ నుంచి వ్యూహాత్మ కంగా బంతులు విసురుతూ కరీబియన్లను 143 పరుగులకే కుప్పకూల్చారు. సీమర్లు బంతి నుంచి స్వింగ్ రాబడుతూ ఆప్ సైడ్ బంతులు, యార్కర్లతో బెంబేలెత్తించిగా స్పిన్నర్లు వూరించే బంతులతో ప్రత్యర్థులను పెవిలియన్కు పంపించారు.విండీస్ జుట్టలో ఓపెనర్ జాన్సన్ ఒక్కడే 43 పరుగులు చేయగా మిగతా వారు భారత బౌలర్ల దెబ్బకు ఎవరూ 20కి పైగా స్కోరు చేయలేకపోయారు.కాగా తొలి మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన లూయిస్ 7 ను సమీ నాలుగవ ఓవర్లో పెవిలియన్కు పంపించాడు.చార్లెస్కు మిశ్రా ఔట్చేయగా,ప్రమాదకరంగా మారుతున్న సిమన్స్ను 19 పరుగులు వద్ద అశ్విన్ బౌలింగ్లో వెనక్కి వెళ్లాడు.కాగా భారత బౌలర్లలో మిశ్రా 3 వికెట్లు,షమీ 2 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు,బుమ్రా 2 వికెట్లు,భువనేశ్వర్ 1 వికెట్తో సత్తా కనబరిచారు. టీమిండియాతో జరిగిన రెండవ టి20లో వెస్టిండీస్ తొలి రోజు దూకుడు తగ్గింది.కాగా పరిమిత స్కోరుకే టీమిండియా వెస్టిండీస్ను కట్టడి చేసింది.టాస్ గెలిచి టీమిండియా వెస్టిండీస్ను బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరడంతో 19.4 ఓవర్లలో 143 పరుగులు చేసి ఆలౌటైంది.ఒపెనర్ చార్లెస్ 25 బంతులు ఆడి 5 బౌండరీలు,2 సిక్సర్లతో 43 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్లో రహానేకు క్యాచ్ ఇవ్వడంతో ఔట్కాగా మరో ఒపెనర్ లావిస్ కేవలం 6 బంతులు ఆడి 1 బౌండరీతో 7 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్లో ఔటయ్యాడు.సామూల్స్ 10 బంతులు ఆడి 5 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో పెవిలియన్కు వెళ్లిపోయాడు.ఫ్లెచర్ 9 బంతులు ఆడి 3 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.పోలార్డ్ 8 బంతులు ఆడి 1 బౌండరీ,1 సిక్సర్తో 13 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరగా రసెల్ 15 బంతులు ఆడి 1 సిక్సర్తో 13 పరుగులు చేసి కుమార్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇవ్వడంతో ఔటయ్యాడు.కాగా బ్రావో 6 బంతులు ఆడి 3 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్లో ఔట్ కాగా,బ్రాత్ వెట్ 10 బంతులు ఆడి 2 బౌండరీలు,1 సిక్సర్తో 18 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్లో వెనుదిరిగాడు.నరైన్ 7 బంతులు ఆడి 1 సిక్సర్తో 9 పరుగులతో నాటౌట్గా నిలువగా బద్రీ 4 బంతులు ఆడి 1 పరుగు చేసి మహ్మద్ షమీ బౌలింగ్లో ఔటయ్యాడు. | 2sports
|
Hyd Internet 65 Views SBI
sbi
ఢిల్లీః ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకున్న స్టేట్ బ్యాంకు
ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. అనుబంధ బ్యాంకుల పాత చెక్ బుక్లు, ఐఎఫ్ఎస్ కోడ్లు 2017 సెప్టెంబర్
30 నుంచి పనిచేయవని పేర్కొంది. ఈ మేరకు అనుబంధ బ్యాంకుల అకౌంట్లు కలిగి ఉన్న కస్టమర్లు కొత్త చెక్ బుక్ల
కోసం ఎంత వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, వాటితో పాటు కొత్త ఐఎఫ్ఎస్ కోడ్ను పొందాలని సూచించింది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
హైదరాబాద్ కేంద్రంగా మరో బ్యాంకు కుంభకోణం
దేశంలో వరుసగా వెలుగుచూస్తున్న బ్యాంకు కుంభకోణాల్లో తాజాగా మరో కుంభకోణం చేరింది.. హైదరాబాద్కు చెందిన తొట్టెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థ వివిధ బ్యాంకులకు సుమారు రూ.1394 కోట్ల మేర రుణాలకు ఎగవేసిందని అధికారులు తెలిపారు
TNN | Updated:
Mar 23, 2018, 03:39PM IST
తొట్టెంపూడిపై కేసు బుక్ చేసిన సీబీఐ
దేశంలో వరుసగా వెలుగుచూస్తున్న బ్యాంకు కుంభకోణాల్లో తాజాగా మరో కుంభకోణం చేరింది.. హైదరాబాద్కు చెందిన తొట్టెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థ వివిధ బ్యాంకులకు సుమారు రూ.1394 కోట్ల మేర రుణాలకు ఎగవేసిందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తొట్టెంపూడి సలలిత్ ఛైర్మన్ అండ్ ఎండీగా వ్యవహరిస్తున్న తొట్టెం ఇన్ఫ్రా సంస్థ 1997లో హరియాణాలోని గుడ్గావ్లో ఏర్పాటయింది. ఈ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంక్గా ఉన్న ఎనిమిది బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణాలు తీసుకుంది. ఆ తర్వాత ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి రుణాల ద్వారా పొందిన సొమ్మును మళ్లించారు. వేతనాలు, ఇతర ఖర్చులను భారీగా లెక్కలు చూపుతూ ఆ సొమ్మును సాహ్వా చేశారు. ఆ తర్వాత రుణాలు చెల్లించకుండా చేతులెత్తేశారు. ఈ సంస్థ రుణాలను 2012 జూన్ 30న మొండి బకాయిలుగా బ్యాంకుల కన్సార్టియం ప్రకటించింది. లావాదేవీలన్నీ కన్సార్టియంలో ఉన్న బ్యాంకుల్లో కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా నిర్వహించినట్టు గుర్తించారు.
తాజాగా యూబీఐ ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది. తమను రూ.313 కోట్ల మేర మోసం చేశారని యూబీఐ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్లోని తొట్టెం సంస్థ కార్యాలయంతో పాటు డ్కెరెక్టర్లు సలలిత్, లలిత ఇళ్లల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తొట్టెంపూడి ప్రమోటర్లపై సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దేశం విడిచిపెట్టకుండా అడ్డుకునేందుకు, కదలికలను తెలుసుకునేందుకు దర్యాప్త సంస్థ ఇలా చేస్తోంది. | 1entertainment
|
rohit sixer makes virat wow
రోహిత్ సిక్సర్.. చూపు తిప్పుకోలేకపోయిన కోహ్లి!
కాన్పూర్ వన్డేలో రోహిత్ ఆడిన ఓ షాట్కు కోహ్లి ఫిదా అయిపోయాడు. బంతిని అలాగే చూస్తూ.. చూపు తిప్పుకోలేకపోయాడు.
TNN | Updated:
Oct 29, 2017, 05:45PM IST
కాన్పూర్ వన్డేలో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి సెంచరీలతో చెలరేగిపోయారు. మ్యాచ్ ప్రారంభం నుంచే మంచి టచ్‌లో కనిపించిన రోహిత్.. కాన్పూర్‌లో వరుసగా రెండో భారీ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2015లో దక్షిణాఫ్రికాపై 150 పరుగులు చేసిన రోహిత్ అదే దూకుడును కివీస్‌పై కూడా కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన వైస్ కెప్టెన్ భారత్ తరఫున 150 సిక్సర్లు బాదిన ఐదో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో సచిన్, గంగూలీ, ధోనీ, యువరాజ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
మిల్నే వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో బంతిని మిడ్ వికెట్ మీదుగా పుల్ చేసిన రోహిత్ బంతిని బౌండరీ వెలుపలికి దాటించాడు. రోహిత్ చక్కటి టైమింగ్‌తో కొట్టిన ఈ సిక్సర్‌కు నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న కోహ్లి ఫిదా అయిపోయాడు. వావ్.. భలే షాట్ ఆడాడే అన్నట్టుగా అలాగే బంతిని చూస్తుండిపోయాడు. ఈ సిక్సర్‌తో భారత్ 50 పరుగులు దాటింది.
Rohit makes Virat go WOW https://t.co/8qpuQ89BYA | 2sports
|
- అందుకే 'చిన్న' వారికి పన్ను ఊరట
-పెద్దలపై సర్ఛార్జీతో లోటును తీర్చుకుంటాం : జైట్లీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో పన్నులు ఎగరవేస్తున్న వారి సంఖ్య భారీగా ఉంటోందని ఆర్థిక మంత్రి జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న వారిపై ఇలాంటి ఎగవేతదారుల భారం మోయాల్సివస్తోందని ఆయన అన్నారు. దీనిని నివారించేందుకే చిన్న మొత్తంలో పన్ను చెల్లించే వారికి బడ్జెట్లో కొంత ఊరట నిచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఇది వరకు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 10శాతం పన్ను పరిధిలోకి వచ్చేవారని.. దీనిని దీన్ని 5 శాతానికి పరిమితం చేసినట్టుగా తెలిపారు. దీంతో దాదాపు 2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభిస్తుందని వివరించారు. ఇది వరకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు పన్ను పరిధిలోకి రావడంతో రూ.50,000కు గాను రూ.2,500 పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. దీనికి కూడా ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. అంటే రూ.3 లక్షల వరకూ పన్ను మినహాయింపు లభించనుంది. ఇక్కడ సెక్షన్ 80సి నిబంధనను ఉపయోగించుకుంటే మరో రూ.1,50,000 మీద పన్ను తగ్గించుకోవచ్చు. రూ.5 లక్షల నుంచి రూ.50లక్షల లోపు ఆదాయం పొందే వారికి రూ.12,875 అదనపు ఊరట లభించనుంది. ఈ మినహాయింపు ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గనుంది. దీన్ని పూడ్చుకోవటానికి గాను రూ.50లక్షలకు పైబడి రూ.కోటి లోపు ఆదాయం ఉన్నవారిపై మరో 10శాతం సర్ఛార్జి విధించారు. రూ. కోటి పైబడిన ఆదాయం ఉన్నవారు 15శాతం అదనపు సర్ఛార్జి చెల్లించాలి. కాగా ఐదు లక్షల్లోపు ఆదాయం కలిగిన వారు ఒక్కపేజీలో రిటర్న్ సమర్పించే అవకాశం కల్పించారు.
పన్ను గణాంకాలు దారుణం..
దేశంలో జరుగుతున్న కార్ల అమ్మకాలు, విదేశీ పర్యాటనల సంఖ్య తదితర గణంకాలతో పోల్చితే పన్ను ఎగవేస్తున్న వారి సంఖ్య భారీగా ఉందన్నారు. 2015-16లో 3.7 కోట్ల మంది వ్యక్తిగత పన్ను రిటర్నులు దాఖలు చేసినట్టుగా తెలిపారు. వీరిలో 99 లక్షల మంది 5 లక్షల లోపు ఆదాయాన్ని చూపారన్నారు. 1.9 కోట్ల మంది 2.5-5 లక్షల లోపు, 52 లక్షల మంది 5-10 లక్షలు, కేవలం 24 లక్షల మంది మాత్రమే 10 లక్షల పైన ఆదాయం చూపినట్టుగా తెలిపారు. 76 లక్షల మంది వ్యక్తులు 5 లక్షల పైన ఆదాయం చూపించగా, వాళ్లలో 54 లక్షల మంది ఉద్యోగులే ఉన్నారు. 50 లక్షల పైన ఆదాయం చూపించినవాళ్ల సంఖ్య 1.72 లక్షలేనన్నారు. కానీ గత ఐదేళ్లలో 1.2 కోట్లకు పైగా కార్లు అమ్ముడయ్యాయి, విదేశాల్లో ప్రయాణించిన వాళ్లు 2 కోట్ల మంది ఉన్నారని కానీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య మాత్రం ఇంతకు తక్కువగా ఉందని తెలిపారు. పెద్దనోట్ల రద్దు అనంతరం పాత కరెన్సీ డిపాజిట్లు రూ.2 లక్షల నుంచి రూ. 80 లక్షల లోపు 1.09 కోట్ల ఖాతాల్లో వచ్చి చేరాయన్నారు. అంటే సగటున ఒక్కో ఖాతాలో రూ.5.03 లక్షల సొమ్ము డిపాజిటయినట్టుగా వివరించారు. గణంకాలతో పోల్చితే పన్ను విస్తతిని పెంచి, ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని చూస్తున్నామని జైట్లీ పేర్కొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఎన్టీఆర్ "జై లవ కుశ" చిత్రానికి U / A
Highlights
జై లవకుశ సినిమాకు సెన్సార్ పూర్తి
యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన లసెన్సార్ బోర్డు
సెప్టెంబర్ 21న విడుదల కానున్న జైలవకుశ
వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ' . యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U / A సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు ఖరారు చేసింది.
ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా భారీ స్థాయి లో "జై లవ కుశ" చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. కేవలం 38 గంటల లో కోటి కి పైగా వ్యూస్ ను "జై లవ కుశ" ట్రైలర్ సంపాదించుకుంది.
"యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో పాటు, అన్నదమ్ముల మధ్య నడిచే ఒక బలమైన కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెన్సార్ కార్యక్రమం పూర్తి అయ్యింది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా విడుదల చేస్తున్నాం" అని నిర్మాత కళ్యాణ్ రామ్ అన్నారు.
కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్)
Last Updated 25, Mar 2018, 11:53 PM IST | 0business
|
పర్యాటకప్రదేశ్ : ఏపీలో 8 ప్రాజెక్టుల ఒప్పందాల ఖరారు
pnr| Last Updated: శనివారం, 10 అక్టోబరు 2015 (19:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక ప్రదేశ్గా మార్చుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీన్ని నిజం చేసేలా శనివారం ఒక్కరోజే ఏడు పర్యాటక ప్రాజెక్టుల ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి మరో ముందడుగు వంటివి.
విజయవాడలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.1240 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టులపై ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడ, తిరుపతి, విశాఖల్లో ఎమ్యూజెమెంట్, వాటర్ వరల్డ్ పార్కులు నిర్మించనున్నారు.
డెస్టినేషన్ అండ్ ప్యాకేజ్ టూర్లు, హోటల్స్, రిసార్టులు, బీచ్ రిసార్టులు , ఫైవ్స్టార్, తీస్టార్ హోటళ్లు, కడపలో వే సైడ్ అమెనిటీస్ ఏర్పాటు తదితర ఒప్పందాలు ఖరారయ్యాయి. తిరుచానూరులో గేట్వే హోటల్ నిర్మాణానికి ఒప్పందం జరిగింది. రెండకెరాల విస్తీర్ణంతో రూ.85 కోట్ల పెట్టుబడితో గేట్వే హోటల్ను నిర్మించనున్నారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
మీడియా ఎందుకు ఇలా తయారైంది: శ్రీదివ్య
Highlights
నిన్న వీరంతా శ్రీదేవి మ్యామ్ గొప్పతనం గురించి చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న ఈ దారుణాన్ని ఎందుకు ప్రసారం చేయడం లేదు
శ్రీదివ్య ప్రశ్నకు సమాధానం ఇచ్చే ధైర్యం మీడియాకు ఉందా?
అలనాటి హీరోయిన్ అందాల తార శ్రీదేవి మరణ వార్త అందరినీ కలచివేస్తూనే ఉంది. ఆమె మృతదేహం ఇంకా ఇండియాకు చేరలేదు. పంపేందుకు దుబాయ్ అధికారులు ఎప్పటికి పర్మిషన్ ఇస్తారో తెలియలేదు. ఇదే అభిమానులను కలచివేస్తుంటే.. మీడియా తీరు మరీ దారుణంగా ఉంది.
అంతలోనే అనుమానాస్పద మృతి అంటూ.. ఎవరికి తోచినట్లుగా వారు కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఆల్కహాల్ కారణంగా అంటూ.. బాత్ టబ్ లో మునిగిందంటూ.. ఆత్మహత్య అంటూ.. హత్య కోణం అంటూ ఎవరి వాదన వారు వినిపించేస్తున్నారు. అందులోనూ టీఆర్పీల కోసం పాకులాడే కొన్ని ఛానళ్ల తీరు మరీ దారుణంగా ఉంది. మీడియా ప్రవర్తన తీరుపై టాలీవుడ్ హీరోయిన్ శ్రీదివ్యకు విసుగు వచ్చేసినట్లుగా ఉంది. అందుకే మీడియాను నేరుగా ఆరోపించకుండానే.. కౌంటర్ వేసింది.
'నిన్న వీరంతా శ్రీదేవి మ్యామ్ గొప్పతనం గురించి చెప్పారు. ఇప్పుడు వీరంతా తప్పుల కోసం వెతుకుతున్నారు. మీడియా ఎందుకు ఇలా తయారైంది. అదే మీడియా.. ప్రస్తుతం జరుగుతున్న ఈ దారుణాన్ని ఎందుకు ప్రసారం చేయడం లేదు. ఏం.. ఈ పిల్లలు మనుషులు కాదా' అంటూ సిరియా ఉదంతంలో వర్ణనాతీతమైన బాధలు పడుతున్న చిన్నారుల వీడియోను పోస్ట్ చేసింది. మరి శ్రీదివ్య ప్రశ్నకు సమాధానం ఇచ్చే ధైర్యం మీడియాకు ఉందా?
Last Updated 25, Mar 2018, 11:39 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
డ్రగ్స్ హీట్: కాజల్ కొత్త నిర్ణయం!
డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడం, అనేక మంది సినిమా వాళ్ల పేర్లు డ్రగ్స్ వినియోగదారుల జాబితాలో వినిపించడం,
TNN | Updated:
Aug 4, 2017, 10:55AM IST
డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడం, అనేక మంది సినిమా వాళ్ల పేర్లు డ్రగ్స్ వినియోగదారుల జాబితాలో వినిపించడం, కొందరు పోలీసుల విచారణను కూడా ఎదుర్కొంటూ ఉండటంతో.. సినిమా వాళ్ల వ్యవహారశైలిలో చాలా మార్పులు వస్తున్నాయి. డ్రగ్స్ సరఫరాదారులుగా అరెస్టైన వారితో చాలా మంది సినీతారల సెల్ఫీలే ఈ వ్యవహారం హీటును పెంచాయి. సదరు డ్రగ్స్ సరఫరాదారులు ఎవరో తమకు తెలియదని, ఏదో అడిగారు కాబట్టి సెల్ఫీలు దిగాం.. అని సినిమా వాళ్లు చెప్పుకొంటూ వస్తున్నారు. అలాగే కొంతమంది సినిమా వాళ్ల మేనేజర్లు, ఈవెంట్ మేనేజర్లు కూడా డ్రగ్స్ రాకెట్ లో పట్టుబడ్డారు. దీంతో కొంతమంది సినీతారలపై అనుమానాలు రేగాయి.
ఈ క్రమంలో.. కాజల్ పేరు కూడా డ్రగ్స్ వ్యవహారంలోకి ఎక్కింది. డ్రగ్స్ డీలర్ గా అరెస్టు అయిన రోనీ అనే వ్యక్తి కాజల్ కు మేనేజర్. కాజల్ డేట్స్ ను చూడటం దగ్గర నుంచి కాజల్ ఏం తినాలి, ఏం తినకూడదనే డైట్ ను చూడటం వరకూ.. రోనీ బాధ్యతగానే ఉండేదట. కాజల్ అంతగా అతడి మీద ఆధారపడిందట. ఇప్పుడు రోనీ డ్రగ్స్ వ్యవహారంలో దొరికిపోవడంతో కాజల్ షాక్ కు గురైందని సమాచారం. తను అమాయకురాలిని అని, తన మేనేజర్ చేసిన పనులతో తనకేం సంబంధం లేదని కాజల్ చెబుతోంది. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘సాహో’ యాక్షన్ సీక్వెన్సెస్కి పాతిక కోట్లా?
బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్.. ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్తో యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది.
TNN | Updated:
Nov 1, 2017, 06:33PM IST
బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్.. ప్రస్తుతం ' సాహో ' సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రభాస్ క్రేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఖర్చు పెడుతున్నారు. మోస్ట్ స్టైలిష్ సినిమాను ప్రభాస్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే సినిమా బడ్జెట్ విషయంలో వెనుకడుగు వేయడం లేదు.
తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా డిజైన్ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నిపుణులను రంగంలోకి దింపారు. సినిమాలో 20 నిమిషాల పాటు సాగే ఓ భారీ యాక్షన్ ఛేజింగ్ సీన్ ఉంటుందట. హాలీవుడ్ ట్రాన్స్ ఫార్మర్స్ సినిమాకు పని చేసిన స్టంట్ మాస్టర్ ఇప్పుడు ఆ ఛేజింగ్ సీన్‌ను కంపోజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఒక్క సీన్ కోసం దాదాపు 25 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. పాతిక కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు. ఈ ఒక్క ఫైట్‌కు అయ్యే ఖర్చుతో భారీ బడ్జెట్ సినిమాను రూపొందించవచ్చు. దీని బట్టి ప్రభాస్ ‘సాహో’ ఏ రేంజ్‌లో తెరకెక్కుతోందో అర్ధమవుతోంది. పైగా దర్శకుడు సుజీత్‌కు పెద్ద సినిమాలు చేసిన అనుభవం కూడా లేకపోయినప్పటికీ ప్రభాస్ క్రేజ్‌ను బట్టి ఈ రేంజ్‌లో ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. | 0business
|
Visit Site
Recommended byColombia
ఇంగ్లాండ్ వేదికగా గత ఏడాది జరిగిన మహిళల ప్రపంచకప్ టోర్నీలో భారత్ జట్టు ఫైనల్కి చేరడంలో ఓపెనర్ స్మృతి మంధాన క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో మెరుగ్గా రాణించిన స్మృతి మంధాన.. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన మూడు వన్డేల సిరీస్లోనూ పరుగు వరద పారించి భారత్ జట్టు సిరీస్ గెలవడంలో కీలకంగా వ్యవహరించింది.
ఏడాది కాలంగా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ ఇద్దరి క్రికెటర్ల పేర్లని అర్జున అవార్డు కోసం బుధవారం పంపినట్లు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మీడియాతో వెల్లడించారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అనుపమే ఇప్పుడు హాట్ టాపిక్
ఎవరీ అనుపమ.... ఏ సినిమాలో చేసింది? ఇప్పుడిదే టాలీవుడ్ టాక్.
TNN | Updated:
Feb 15, 2016, 11:02AM IST
అనుపమే ఇప్పుడు హాట్ టాపిక్
ఎవరీ అనుపమ.... ఏ సినిమాలో చేసింది? ఇప్పుడిదే టాలీవుడ్ టాక్. ఒక్క సినిమా కూడా చేయకుండానే... తెలుగులో పెద్ద సినిమా ఆఫర్లను కొట్టేస్తోంది అనుపమ పరమేశ్వరన్ . మిగతా హీరోయిన్లందరూ అనుపమపై జెలస్ కూడా ఫీలవుతున్నారట. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో అ... ఆ... సినిమాలో నటిస్తోంది అనుపమ. అలాగే నాగచైతన్య సరసన మజ్నులో కూడా చేస్తోంది. ఇప్పడు మరో సినిమా కూడా వరసలో ఉందని సమాచారం. అలాగే కోలీవుడ్లో మరో భారీ ఆఫర్ కూడా వచ్చిందట. ధనుష్ తో ‘కోడి’ అనే సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ముందు ఆ పాత్రకి బేబీ షామిలీని అనుకున్నారు. ఏమైందో తనని తప్పించి అనుపమను చేర్చుకున్నట్టు సమాచారం. ఇంతవరకు ఆమె చేసిన సినిమా మళయాళంలో ‘ప్రేమం’ మాత్రమే. అది పెద్ద హిట్ కొట్టింది. అంతే అనుపమకు ఆఫర్ల మీద ఆపర్లు వచ్చేస్తున్నాయి. సో లక్కీ గర్ల్.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Hyderabad, First Published 6, Nov 2018, 9:45 AM IST
Highlights
గంభీర్ అసలు ఏమైంది నీకు.. మీరంటే ఎంతో గౌరవం కానీ మీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయనుకోలేదు
టీం ఇండియా సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ గంట మోగించడంపై ఢిల్లీ బ్యాట్స్మన్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. అజహర్ పై గంభీర్ చేసిన ఆరోపణలపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.
‘గంభీర్ అసలు ఏమైంది నీకు.. మీరంటే ఎంతో గౌరవం కానీ మీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయనుకోలేదు’ అని, హైకోర్ట్ అతని నిషేధంపై క్లీన్చీట్ ఇచ్చిన విషయం తెలియదా? అని.. అతను ఎంపీ కూడా అయ్యారని మరొకరు కామెంట్ చేశారు. ముందు సీనియర్ క్రికెటర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోమ్మని, నార్త్ క్రికెటర్లను ఒకలా.. సౌత్ క్రికెటర్లను ఒకలా చూడటం మానేయాలని హితవు పలుకుతున్నారు.
భారత్ తరపున 99 టెస్ట్లు, 334 వన్డేలాడిన అజహరుద్దీన్పై 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ జీవితకాల నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేదాన్ని 2012లో హైదరాబాద్ హైకోర్టు ఎత్తేసింది. అప్పటి నుంచి అజహర్ క్రికెట్ తరహా అధికారిక కార్యకలపాల్లో పాలుపంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
తొలి ప్రయత్నంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసాడు. నిషేదం ఎత్తివేతపై స్పష్టత లేదని తొలుత నిరాకరించిన బీసీసీఐ ఆ తరువాత అనుమతినించింది. అలాగే బీసీసీఐ, ఐసీసీల్లో ఎలాంటి బాధ్యతలు చేపట్టకుండా అతనిపై నిషేధం విధించలేమని కూడా స్పష్టం చేసింది. హైదరాబాదీ అజహర్కు ఈడెన్తో ప్రత్యేక అనుబంధం ఉండటంతో అతను భారత్-వెస్టిండీస్ తొటి టీ20కు ముందు గంట మోగించారు.
అలా అజహర్ గంట మోగించినడాన్ని తప్పుబడుతూ గంభీర్ నిన్న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
read more news | 2sports
|
హోటళ్ల నిర్మాణంలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ (ఏజెన్సీ)| PNR| Last Modified సోమవారం, 4 ఫిబ్రవరి 2008 (17:42 IST)
కొత్త హోటళ్ళ నిర్మాణంలో పర్శ్వంత్ డెవలపర్స్ లిమిటెడ్ (పిడిఎల్) సంస్థ తమ అనుబంధ కంపెనీ పర్శ్వంత్ హోటల్స్ లిమిటెడ్తో కలసి 2500 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే మూడు, ఐదేళ్ళలో దేశ వ్యాప్తంగా యాభై హోటళ్లను నిర్మించేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఒక ప్రణాళికను రూపొందించి, రూ.2,500 కోట్లను వెచ్చించనున్నట్టు ఆసంస్థ సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం ఐటిసి లిమిటెడ్ సంస్థతో కలసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన యాభై హోటళ్లలో ఐదు నక్షత్రాల హోటల్స్, మరో ఇరవై ఫోర్ స్టార్ హోటల్స్, ఐదు త్రీ స్టార్ హోటల్స్ను నిర్మించనున్నట్టు పీహెచ్ఎల్ పేర్కొంది. ఐటీసీతో కుదిరిన ఒప్పందం మేరకు పీహెచ్ఎల్ హోటల్స్ నిర్మిస్తుందని, ఎఫ్పిహెచ్ఎల్ హోటల్స్ పర్యవేక్షణ నిర్వహించనుంది. ఈ హోటల్స్ను ఫార్చూన్ సెలక్ట్, ఫార్చూన్ పార్క్, ఫార్చూన్ ఇన్, ఫార్చూన్ ఫైయిత్ అనే బ్రాండెడ్ పేర్లతో హోటల్స్ను నడుపనున్నట్టు పేర్కొంది.
సంబంధిత వార్తలు | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Virat Kohli కోపానికి బెదిరిపోయా: రిషబ్ పంత్
నేను ఎవ్వరికీ భయపడలేదు. కానీ.. ఇటీవల విరాట్ కోహ్లీ కోపానికి బెదిరిపోయా. మ్యాచ్లో అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే..? కోహ్లీకి కోపం రాదు. కానీ.. ఏదైనా తప్పిదాలు చేస్తే మాత్రం.. అతను కచ్చితంగా కోప్పడతాడు. -రిషబ్ పంత్
Samayam Telugu | Updated:
Mar 23, 2019, 06:35PM IST
Virat Kohli కోపానికి బెదిరిపోయా: రిషబ్ పంత్
హైలైట్స్
ఆస్ట్రేలియాపై ఇటీవల చివరి రెండు వన్డేల్లో ధోనీ స్థానంలో ఆడిన రిషబ్ పంత్
వరుస స్టంపౌట్ తప్పిదాలతో మ్యాచ్ని చేజార్చిన వైనం
ఈరోజు నుంచే ఐపీఎల్ 2019 సీజన్ మొదలు
ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కోపానికి తాను భయపడిపోయినట్లు యువ వికెట్ కీపర్/ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్లో చివరి రెండు వన్డేల్లోనూ ధోనీకి విశ్రాంతినిచ్చిన టీమిండియా మేనేజ్మెంట్.. రిషబ్ పంత్ను ఆడించింది. కానీ.. వికెట్ల వెనుక తడబడిన రిషబ్ పంత్ క్యాచ్లు, స్టంపౌట్స్ని జారవిడిచి పరోక్షంగా మ్యాచ్ ఓటములకి కారణమయ్యాడు. దీంతో.. అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి రిషబ్ పంత్ ఆడనున్నాడు.
ఐపీఎల్ కోసం తాజాగా సిద్ధమవుతున్న రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించాడు. ‘నేను ఎవ్వరికీ భయపడలేదు. కానీ.. ఇటీవల విరాట్ కోహ్లీ కోపానికి బెదిరిపోయా. మ్యాచ్లో అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే..? కోహ్లీకి కోపం రాదు. కానీ.. ఏదైనా తప్పిదాలు చేస్తే మాత్రం.. అతను కచ్చితంగా కోప్పడతాడు. అది కూడా ఒకరకంగా మంచిదే.. తప్పుల నుంచే కదా మనం నేర్చుకునేది’ అని పంత్ వెల్లడించాడు.
చెపాక్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకి టోర్నీ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీకొంటుండగా.. ముంబయి ఇండియన్స్తో రేపు రాత్రి 8 గంటలకి ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
internet vaartha 230 Views
న్యూఢిల్లీ : ఈశాన్య భారత్లో ఉన్న ఐదు గ్రామీణ బ్యాం కులు త్వరలోనే భారతీయ స్టేట్బ్యాంకులో విలీనం అవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రూరల్బ్యాంకు, మేఘాలయ రూరల్ బ్యాంకు, మిజోరమ్ రూరల్బ్యాంకు, నాగాలాండ్ రూరల్ బ్యాం కు, లాంగప్పిదేహంగి రూరల్బ్యాంకు (అస్సాం) బ్యాంకులను ఎస్బిఐలో విలీనం చేయాలని అంచనా. ఇటీవలే ఎస్బిఐ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వద్దకు తెచింది. గ్రామీణ బ్యాంకుల విలీ నంపై బోర్డు ఆమోదం పొందాల్సిఉంది. రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాల ఆమోదం ఇందుకు అవసరం అవుతుంది. ఎస్బిఐ ఈ బ్యాంకుల్లో 35శాతం వాటాతో ఉంటాయి. కేంద్రం 50శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 15శాతం వరకూ ఉంటాయి. ఎస్బిఐ ఇందుకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయడంలేదు. ఈ విలీనం చేయనునన్న ఐదుబ్యాంకుల్లో 3578 కోట్ల రూపాయలు డిపా జిట్లు, అడ్వాన్సులు 1736 కోట్ల రూపాయలు ఉన్నాయి. మొత్తం నికరలాభాలు ఐదు బ్యాంకులకు కలిపి 44.52 కోట్లుగా ఉన్నా యి. ఈ ఐదు బ్యాంకుల్లోను నాగాలాండ్ గ్రామీణబ్యాంకు ఒక్కటే నష్టాలు ఆర్జించినట్లు గత ఆర్థిక సంవత్సరంలోఉంది. ప్రస్తుతం ఈ బ్యాంకులను ప్రాయోజితం చేస్తున్న ఎస్బిఐ మాస్టర్మైండ్గా వ్యవహరిస్తోంది మూడు ఇతర గ్రామీణబ్యాంకులు కూడా ఈశాన్య భారత్లో ఎస్బిఐ ప్రాయోజిత బ్యాంకులుగా పనిచేస్తున్నాయి. ఎస్బిలో విలీనం చేసే ప్రక్రియ ప్రతిపాదనలు కూడా వచ్చాయని అఖిల భారత గ్రామీన బ్యాంకు ఉద్యోగులసంఘం సెక్రటరీ జనరల్ సయీద్ఖాన్ వెల్లడించారు. 2001లోభారతీయ రిజర్వు బ్యాంకు ఒక కమిటీని నియమించి ఛైర్మన్గా విఎస్ వ్యాస్ ను నియమించింది. వ్యవసాయ రుణాలకోసం పనిచేసిన ఈ కమిటీ గ్రామీణ బ్యాంకుల ప్రాధాన్యతపై అధ్యయనం చేసింది. ఈ కమి టీ 2005లో చేసిన సిఫారసుల ఆధారంగా గ్రామీణ బ్యాంకుల పనితీరును సంతులనం చేసారు. విలీనం మొదటి దశలో గ్రామీణ బ్యాంకులు ఒకే రాష్ట్రంలోఉంటే స్పాన్సర్ బ్యాంకుల నిర్ణయాల ఆధారంగా విలీనం జరుగుతుంది రెండోదశలో ఒకరాష్ట్రం లోని వివిధ బ్యాంకులు స్పాన్సర్చేసిన బ్యాంకుల విలీనం జరుగుతుంది. విలీనాల కారణంగా గ్రామీణ బ్యాంకుల సంఖ్య 196 నుంచి 64కు పడిపోయింది. ప్రస్తుతం 56కు చేరింది. దేశంలోని 644 జిల్లాలను కవర్చేస్తూ 20,059 శాఖలు ఈ బ్యాంకులు పరిధిలో పనిచేస్తున్నాయి. మొత్తం ఐదు బ్యాంకులు విలీనం చేసే ప్రతిపాదనలో మిజోరమ్ గ్రామీణ బ్యాంకు ఒక్కటే అతిపెద్ద బ్యాంకుగా ఉంది. రుణాల బకాయిల్లో కూడా అగ్రగామిగానే ఉంది. 2015 డిసెంబరు నాటికి 203.52 కోట్ల బాకీలున్నాయి. నాగా లాండ్ గ్రామీణబ్యాంకు అతిచిన్న బ్యాంకుగా బకాయిల్లో ఉంది. కేవలం 5.52కోట్లు మాత్రమే ఈ బ్యాంకుకు బాకీలు రావాల్సి ఉంది. అరుణాచల్ప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు 27శాఖలున్నాయి. డిపాజిట్లు 365 కోట్లు ఉంటే అడ్వాన్సులు 100 కోట్లుగా ఉన్నా యి. స్థూల నిరర్ధక ఆస్తులు 15.50శాతం, నికరలాభం 81 లక్షలుగా ఉంది. లాంగ్పిదేహాంగి గ్రామీణ బ్యాంకు 57శాఖలతో 464కోట్ల డిపాజిట్లతో ఉంది. అడ్వాన్సులు 244 కోట్లు జారీ చేసింది. స్థూల నిరర్ధక ఆస్తులు 5.01శాంగా ఉన్నాయి. నికర లాభం 5.21కోట్లు. మేఘాలయ గ్రామీణ బ్యాంకు 92శాఖలో 1193కోట్ల డిపాజిట్లతో ఉంటే అడ్వాన్సులు 616 కోట్లుజారీ చేసింది. నిరర్ధక ఆస్తులు 4.30శాతంగా ఉన్నాయి. 18.24 కోట్లు నికరలాభం ఆర్జించింది. మిజోరమ్ గ్రామీణ బ్యాంకు పరంగా 77 శాఖలతో 1492 కోట్ల డిపాజిట్లతో ఉంది.756 కోట్ల రుణాలిస్తే నిరర్ధక ఆస్తుల శాతం అడ్వాన్సుల్లో 5.03 శాతంగా ఉంది. నికర లాభం 21.16 కోట్లుగా ఉన్నట్లు అంచనా. నాగాలాండ్ గ్రామీణ బ్యాంకు పదిశాఖలున్నాయి. డిపాజిట్లు 64 కోట్లు, అడ్వాన్సులు 20కోట్లు జారీచేస్త నిరర్ధక ఆస్తులు 18.48 శాతం ఉన్నాయి. నికరనష్టం 90 లక్షలుగా బ్యాంకు చెపుతోంది. | 1entertainment
|
Hyderabad, First Published 29, Oct 2018, 2:39 PM IST
Highlights
బాలీవుడ్ లో పలు సీరియళ్లు, సినిమాలలో నటించిన శ్వేతా సాల్వే ఇటీవల తన కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం గోవాకి వెళ్లింది. అక్కడ బికినీలో స్మోక్ చేస్తూ తీసుకున్న ఫోటోని శ్వేతా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు.
బాలీవుడ్ లో పలు సీరియళ్లు, సినిమాలలో నటించిన శ్వేతా సాల్వే ఇటీవల తన కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం గోవాకి వెళ్లింది. అక్కడ బికినీలో స్మోక్ చేస్తూ తీసుకున్న ఫోటోని శ్వేతా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. ఇలా చేయడానికి మీకు సిగ్గు లేదా..? అంటూ ఆమెను వ్యక్తిగతంగా దూషించారు.
మరికొందరు మీ పిల్లలకు కూడా ఈ అలవాట్లే వస్తాయంటూ కామెంట్లు పెట్టారు. వీరిపై స్పందించిన శ్వేతా వారికి ఘాటు సమాధానమిచ్చింది. ''నేను తాగుతాను.. స్మోక్ చేస్తాను. నిజాయితీగా ఉంటాను. నేను డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం వంటి కారణాల వలన మంచి తల్లిని కాకుండా పోతానా..? నా జీవితాన్ని వృధా చేసుకోవడం మీరు చూశారా..? పని చేయకుండా ఖాళీగా ఉండడం మీరు చూశారా..?
నా పిల్లలను నేను నిర్లక్ష్యంగా వదిలేయడం మీరు చూశారా..? రోజూ ఎన్నో పనులతో నేను బిజీగా ఉంటాను. నేను నటిని, డాన్సర్ ని, పారిశ్రామికవేత్తని కూడా.. ఇతరులను నేను ఈ విధంగా ప్రశ్నించను. కాబట్టి నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరు కూడా ఇలాంటి ప్రశ్నలు వేయకండి. నా తల్లితండ్రులు నన్ను పద్దతిగానే పెంచారు.
సమాజంలో మంచి, చెడు రెండు తెలిసేలా పెంచారు. వాళ్లు కూడా మందు తాగినవారే, ధూమపానం చేసినవారే.. ఇప్పటికి కూడా మేం జరుపుకునే వేడుకల్లో నా తల్లితండ్రులతో కలిసి మద్యం సేవిస్తాను. నా పద్ధతి మీకు నచ్చకపోతే నన్ను అన్ ఫాలో చేయొచ్చు'' అంటూ మద్యం తాగుతున్న ఫోటోని షేర్ చేసింది.
Last Updated 29, Oct 2018, 2:39 PM IST | 0business
|
బీసీసీఐ చరిత్రలో తొలిసారి!
October 23 , 2019 | UPDATED 16:18 IST
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పడి ఇప్పటికే ఆరు దశాబ్దాలు దాటాయి. అయితే ఇంతవరకూ ఆ క్రికెట్ పాలక మండలికి చరిత్రలో ఎన్నడూ ఒక్క క్రికెటర్ కూడా అధ్యక్షుడిగా కాలేదు. ఎంతసేపూ మహారాజాలు, లాబీయిస్టులు, రాజకీయ నేతలు బీసీసీఐని శాసిస్తూ వచ్చారు. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన క్రీడా బోర్డుల్లో బీసీసీఐ ఒకటి. దానిపై ఆధిపత్యం కోసం అలాంటి వాళ్లంతా పోటీ పడ్డారు.
అయితే తొలిసారి ఒక క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యాడు. ఇంత వరకూ క్రికెటర్లు ఎవరూ బీసీసీఐ అధ్యక్ష స్థానాన్ని అధిష్టించని నేపథ్యంలో తొలిసారి ఆ బాద్యతలను తీసుకున్నాడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ చండీదాస్ గంగూలీ మహరాజ్. కెప్టెన్ గా గంగూలీ భారత క్రికెట్ గతిని మార్చాడు.
స్ట్రైట్ ఫార్వర్డ్, కఠిన నిర్ణయాలకు, సాహసోపేత చర్యలకు ఏమాత్రం వెనుకాడని తత్వం గంగూలీది. రెండేళ్ల నుంచి కోర్టు నియమిత పాలకమండలి చేతుల్లో ఉండిన బీసీసీఐ ఇప్పుడు గంగూలీ చేతికి వచ్చింది. తను బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి, బెంగాల్ లో బీజేపీ రాజకీయాలకూ ఎలాంటి సంబందం లేదని సౌరవ్ తేల్చి చెప్పాడు.
మమతా బెనర్జీకి కూడా ధన్యవాదాలు చెప్పాడు సౌరవ్. ఇలా తనకు బీజేపీతో లాలూచీలు లేవని తేల్చిచెప్పాడు. రంజీ ఆటగాళ్ల జీతభత్యాలు పెంచబోతున్నట్టుగా సౌరవ్ ప్రకటించాడు. ఇది యంగ్ క్రికెటర్లలో ఉత్సాహాన్ని ఇచ్చేఅంశమే. అలాగే బీసీసీఐలో సంస్కరించాల్సిన అంశాలు ఉన్నాయని, వాటిపైనే తన దృష్టి అని నూతన బీసీసీఐ అధ్యక్షుడు ప్రకటించారు. | 2sports
|
Hyderabad, First Published 14, Nov 2018, 8:10 PM IST
Highlights
టాలీవుడ్ లో గత కొంత కాలంగా వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్న హీరోల్లో రామ్ కూడా ఉన్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా రామ్ కి ఉన్న క్రేజ్ ఎప్పుడు తగ్గలేదు.
టాలీవుడ్ లో గత కొంత కాలంగా వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్న హీరోల్లో రామ్ కూడా ఉన్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా రామ్ కి ఉన్న క్రేజ్ ఎప్పుడు తగ్గలేదు. సినిమా బజ్ క్రియేట్ అయ్యేలా బాగానే చేసుకుంటున్నాడు గాని ఆశించిన స్థాయిలో అతనికి హిట్టు అందడం లేదు.
రీసెంట్ గా వచ్చిన హలో గురు ప్రేమ కోసమే కూడా అతనికి విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ఆడియెన్స్ ని మెప్పించాలని కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు గాని ఒక స్టైలిష్ లుక్ ని రామ్ మెయింటైన్ చేస్తున్నట్లు ఒక ఫొటో ద్వారా తెలుస్తోంది.
ఫుట్ బాల్ ప్లేయర్స్ లా మధ్యలో ఉన్న జుట్టును పైకి నిలబెట్టి సైడ్ కి షార్ట్ కట్ చేయించడం అందరిని ఆకట్టుకుంటోంది. కొంచెం సేపు అలా చూస్తూ ఉంటె ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తరహాలో ఉన్నట్లు అనిపిస్తోంది కదా! ఇక ఈ హీరో నెక్స్ట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడనే టాక్ ఉంది. గతంలో చర్చలు జరుగుతున్నాయని రామ్ చెప్పాడు. కానీ ఆ పనులు ఎంతవరకు వచ్చేయో క్లారిటీ ఇవ్వలేదు.
Last Updated 14, Nov 2018, 8:10 PM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నిర్మాతగా సుకుమార్ రెండో సినిమా
టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా పేరున్న సుకుమార్ ఇటీవలే నిర్మాతగా మారి నిర్మించిన సినిమా కుమారి 21 F.
| Updated:
Dec 24, 2015, 05:38PM IST
టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా పేరున్న సుకుమార్ ఇటీవలే నిర్మాతగా మారి నిర్మించిన సినిమా కుమారి 21 F . యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అనిపించుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగానూ యూనిట్కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సూర్యప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ , ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వంటివాళ్లెందరో కలిసి పనిచేశారు. రాజ్ తరుణ్, హెబా పటేల్ జంటగా నటించిన ''కుమారి'' మూవీ... నిర్మాతగా సుకుమార్కి శుభారంభాన్నే ఇచ్చింది. దీంతో ఇదే జోష్లో తాజాగా సుకుమార్ తన ప్రొడక్షన్లో రెండో సినిమాకి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
'కుమారి 21 F'లాగే తానే సొంతంగా రాసుకున్న కథని మరో డైరెక్టర్ చేత తెరకెక్కించే ఏర్పాట్లలో సుకుమార్ బిజీగా వున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ' డైరెక్టర్ ' అనే పేరుని కూడా ఖరారు చేసుకున్నాడట. ఇదిలావుంటే, సుకుమార్ డైరెక్ట్ చేసిన 'నాన్నకి ప్రేమతో' మూవీ సంక్రాంతి రేసులోకి దూసుకొస్తోంది. ఎన్టీఆర్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
యార్కర్లు వేయబోయి.. రోహిత్కి దొరికాం
మొహాలి వన్డేలో శ్రీలంక వ్యూహం యార్కర్ల వేయడమని.. కానీ.. వ్యూహం బెడిసికొట్టి రోహిత్ శర్మకి దొరికిపోయినట్లు ఆ జట్టు
TNN | Updated:
Dec 14, 2017, 11:43AM IST
యార్కర్లు వేయబోయి.. రోహిత్కి దొరికాం
మొహాలి వన్డేలో శ్రీలంక వ్యూహం యార్కర్ల వేయడమని.. కానీ.. వ్యూహం బెడిసికొట్టి రోహిత్ శర్మకి దొరికిపోయినట్లు ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్ తిలాన్ సమరవీర వెల్లడించారు. బుధవారం ముగిసిన ఈ వన్డేలో రోహిత్ శర్మ (208 నాటౌట్: 153 బంతుల్లో 13x4, 12x6) విధ్వంసక రీతిలో అజేయ డబుల్ సెంచరీ బాదేసిన విషయం తెలిసిందే. గత ఆదివారం జరిగిన ధర్మశాల వన్డేలో భారత్ టాప్ ఆర్డర్‌ని వణికించిన ఫాస్ట్ బౌలర్లు లక్మల్, నువాన్ ప్రదీప్‌లు రోహిత్ శర్మ ఊచకోతకి బలై భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
ఇన్నింగ్స్‌ 44వ ఓవర్ వేసి రోహిత్ శర్మతో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టించుకున్న లక్మల్ మ్యాచ్‌లో మొత్తం 8 ఓవర్లు వేసి 71 పరుగులు సమర్పించుకోగా.. 10 ఓవర్లు వేసిన నువాన్ ప్రదీప్ ఏకంగా 106 పరుగులిచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 141 పరుగుల తేడాతో గెలుపొంది మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. మ్యాచ్ అనంతరం మీడియాతో సమరవీర మాట్లాడుతూ ‘మ్యాచ్‌ స్లాగ్ ఓవర్లలో యార్కర్లు వేయాలనేది శ్రీలంక వ్యూహం. అలా అయితే.. భారత్ జట్టు పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయచ్చని భావించాం. కానీ.. రోహిత్ శర్మ తన భీకర హిట్టింగ్‌తో.. మా బౌలర్ల వ్యూహం బెడిసికొట్టేలా చేశాడు. ఫుట్‌వర్క్ కదలికతో కొన్ని యార్కర్ బంతుల్ని కూడా ఫుల్‌టాస్‌గా అందుకుని సిక్సర్లు బాదేయడంతో మా దగ్గర ప్రత్యామ్నాయ మార్గమే లేకపోయింది’ అని సమరవీర వెల్లడించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Jul 09,2015
సరికొత్త హోండా 'జాజ్' వచ్చేసింది
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా సరికొత్త ప్రిమియం హ్యచ్బ్యాక్ 'జాజ్'ను మార్కెట్లోకి విడుదల చేసింది.మూడో తరానికి చెందిన జాజ్ వాహనాన్ని కంపెనీ బుధవారం భారత్లో ఆవిష్కరించింది. దీని ధరను కంపెనీ రూ.5.3 నుంచి రూ.8.59 లక్షలుగా (ఎక్స్షోరూమ్ న్యూఢిల్లీ) నిర్ణయించింది. పెట్రోలు, డీజిల్ వర్షన్లలో లభించే ఈ కారు మార్కెట్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్, హ్యుందారు మోటార్ ఎలైట్ ఐ20లకు పోటీగా నిలవనుంది. భారత్లో హోండా కార్ల జోరును ఈ సరికొత్త జాజ్ మరింతగా పెంచనుందని హోండా కార్స్ ఇండియా (హెచ్సీఐఎల్) అధ్యక్షుడు, సీఈవో కత్సుషీ ఇనోయి అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా సంస్థ వ్యాపారాన్ని బాగా విస్తరించేందుకు జాజ్ బాగా దోహద పడిందనీ.. భారత్లో కూడా ఇదే తరహా ప్రతిస్పందన లభిస్తుందని తాము ఆశిస్తున్నట్లుగా సంస్థ ఆసియా విభాగం అధ్యక్షుడు, డైరెక్టర్ నొరైకీ అబీ అన్నారు. పెట్రోలు వేరియంట్ జాజ్ వాహనం 1.2 లీటర్ ఇంజిన్తోనూ, డీజిల్ వేరియంట్ 1.5 లీటర్ ఇంజిన్తోను లభించనుంది. పవర్ట్రైన్ ఇంజిన్తో జాజ్ వాహనాన్ని మొట్టమొదటి సారిగా భారత్లోనే తాము ప్రవేశపెడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Suresh 142 Views
జిమ్నాస్ట్ దీపకు సచిన్ అభినందన
రియో: భారత మహిళా జిమ్నాస్ట్ దీప కర్మాకర్ను సచిన్ టెండూల్కర్ అభినందించారు. ఒలింపిక్స్లో ఫైనల్కు అర్హత సాధించటంతో దీపను ఆయన అభినందించారు. భారత్ నుంచి తొలిసారి ఒలింపిక్స్్కు అర్హత సాధించటమే కాకుండా తొలి ప్రయత్నంలోనే ఫైనల్కు వెళ్లటం దేశానికి గర్వకారణమని సచిన్ వ్యాఖనించారు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Bumrah, Shami, Ishant: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ త్రయం
భారత పేస్ బౌలింగ్ త్రయం బుమ్రా, షమీ, ఇశాంత్ శర్మ.. టెస్టు క్రికెట్ రికార్డులను తిరగరాశారు. ఈ ఏడాది విదేశీ గడ్డ మీద సత్తా చాటి.. అత్యుత్తమ బౌలింగ్ త్రయంగా 34 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు.
Samayam Telugu | Updated:
Dec 29, 2018, 09:29PM IST
Bumrah, Shami, Ishant: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ త్రయం
2018లో భారత బౌలర్లు అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. విదేశీ పిచ్లపై చెలరేగిన పేస్ త్రయం బుమ్రా, షమీ, ఇషాంత్.. ఈ ఏడాది సంయుక్తంగా 131 వికెట్లు తీశారు. కేలండర్ ఇయర్లో టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా వీరు రికార్డులకెక్కారు. వెస్టిండీస్ దిగ్గజ త్రయం జోయెల్ గార్నర్, మైకెల్ హోల్డింగ్, మాల్క్లమ్ మార్షల్ 34 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును వీరు బ్రేక్ చేశారు. ఈ ముగ్గురు విండీస్ బౌలర్లు 1984లో 130 వికెట్లు పడగొట్టారు. | 2sports
|
internet vaartha 118 Views
కోల్కత్తా : ఇమామి ఆగ్రో కంపెనీ విస్తరణదిశగా శరవేగంగా కదులుతోంది. రూ.650 కోట్ల పెట్టుబడులతో వచ్చే 15నెలల్లో రెండు కొత్త ప్లాంట్లను ప్రారంభించాలని నిర్ణయించింది. వంటనూనెల సెగ్మెంట్లో మరింత వృద్ధిని కాంక్షిస్తున్న ఇమామి ఆగ్రోటెక్ మొత్తం 685 కోట్ల పెట్టుబడులు పెడతామని యుకె కేంద్రంగా ఉన్న నిపుణులు ఇందుకు సహకరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం 18 మిలియన్ టన్నుల మార్కెట్లో కంపెనీ మార్కెట్ వాటా 5.5శాతంగా ఉందని గ్రూప్ డైరెక్టర్ మనీష్ గోయంకా వివరించారు. వచ్చే రెండేళ్లలో 10- 11శాతం వృద్ధిని సాధిస్తామన్నారు. వచ్చే 15 నెలలకాలంలో రెండు కొత్తప్లాంట్లు ఏర్పాటు చేస్తామని మొదటి ప్లాంట్ గుజరాత్లో 3-4 వేల టన్నుల సామర్ధ్యంతో ఉంటుందని, పామా యిల్, సోయా ఆయిల్ విభాగంలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. 350కోట్లు పెట్టుబడు లు పెడతామన్నారు. మరో ప్లాంట్ రాజస్థాన్ లో ఏర్పాటుచేస్తామని ఇందుకు 80కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. మరో 200 కోట్లు ఉత్పత్తిని హాల్దియా యూనిట్లో పెంచేందుకు కృషిచేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరో ప్లాంట్ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. ఇందుకు 55 కోట్లు ఖర్చవుతుందన్నారు. వచ్చే 15నెలల్లోనే రాజస్థాన్, గుజరాత్ ప్లాంట్లు ప్రారంభం అవుతాయని, హాల్దియా విస్తరణ డిసెంబరు కల్లా పూర్తవుతుందని గోయంకా వెల్లడించారు. మొత్తం అమ్మకాల్లో పామాయిల్ 75శాతంగా ఉంది. సోయా, పొద్దుతిరుగుడు, తౌడునుంచి తీసేనూనె, ఆవనూనెలు మిగిలిన వాటాతో ఉన్నాయి. కంపెనీ పొద్దుతిరుగుడునుంచి సోయా ఆయిల్ వెరైటీలకు కూడా మారుతుందన్నారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు 15వేల టన్నులు విక్రయాలున్నాయి. కమోడిటీరంగంలో నిపుణుడైన యుకెకు చెందిన జేమ్స్ఫ్రైను పిలి పించినట్లుతెలిపారు. మార్కెట్ధోరణులపై ఆయనఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళతామన్నారు. | 1entertainment
|
కార్పొరేట్ల గిప్టులకు జీఎస్టీ దెబ్బ
- దీపావళి బడ్జెట్లో 35-40% కోత : అసోచామ్ తాజా సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ప్రతికూలతలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి ప్రభావంతో కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులు, ఇతర కీలక వ్యక్తులకు అందించే బహుమానాల బడ్జెట్కు భారీగా కొత పెట్టాయని పరిశ్రమ బాడీ అసోచామ్ సర్వేలో వెల్లడయ్యింది. ప్రస్తుత దీపావళి పండుగకు అందించే గిప్టుల బడ్జెట్లో 35-40 శాతం మేర కోత పెట్టాయని ఈ సర్వేలో తేలింది. ఈ అంశంపై దేశంలోని అహ్మాదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నరు, లక్నో, ముంబయి తదితర ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాల్లోని 758 కంపెనీలను అసోచామ్ సర్వే చేసింది. ప్రతీ ఏడాది దీపావళి సందర్బంగా కార్పొరేట్ కంపెనీలు తమ అసోసియేట్, నెట్వర్క్ భాగస్వాములు, ఉద్యోగులు, ఇతర ముఖ్యమైన వ్యక్తులకు బహుమతులు ఇస్తుంటాయి. జీఎస్టీ , పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ సారి పండుగకు బహుమానాలు భారీగా తగ్గాయని అసోచామ్ పేర్కొంది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల వ్యాపారాలపై ప్రభావం పడటంతో ఆయా కంపెనీలు నిర్వహణ వ్యయం తగ్గించుకునే పనిలో భాగంగా కోతలకు దిగాయని పేర్కొంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు పండుగ సీజన్లో చాకోలెట్, కూకీస్, స్వీట్ల అమ్మకాలపై ఆశలు పెంచుకుంటాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ రావత్ పేర్కొన్నారు. అయితే ఈసారి సాధారణం కంటే తక్కువ అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అదే విధంగా వాషింగ్ మిషన్లు, రిఫ్రీజిరేటర్లు, ఒవెన్లు, విద్యుత్ స్టవ్ తదితర కన్సూమర్ డ్యూరెబుల్స్ అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. అత్యధిక విలువ కలిగిన స్మార్ట్ఫోన్ అమ్మకాలు కూడా ఈ సారి ఎక్కువగానే దెబ్బతిన్నాయన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
చైతూ పుట్టినరోజును స్పెషల్ గా ప్లాన్ చేసిన సమంత
Highlights
నాగ చైతన్య పుట్టినరోజు వేడుకల కోసం సెలవు పెట్టిన సమంత
ప్రస్థుతం సినిమా షూటింగులతో బిజీ బిజీగా చై సామ్
చైతూ పుట్టినరోజు కోసం సెలవుపెట్టి స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న సమంత
నాగచైతన్య పెళ్లి తర్వాత త్వరలోనే తన ఫస్ట్ బర్త్ డే జరుపుకోనున్నాడు. చైతూ కోసం కొత్త పెళ్లి కూతురు సమంత స్పెషల్ గా ప్లాన్స్ వేస్తోంది. తన భర్తకు కలకాలం గుర్తుండిపోయేలా ట్రీట్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈమధ్యే సమంత నటిస్తున్న కొత్త సినిమా షెడ్యూల్ ప్రారంభమైంది. అయితే చైతూ పుట్టినరోజు సందర్భంగా రేపు ఒక్కరోజు ఈ షూటింగ్ కు సెలవు పెట్టింది సమంత. రేపంతా నాగచైతన్యతోనే గడపాలని నిర్ణయించుకుంది. నిజానికి పెళ్లిరోజులా ఈ పుట్టినరోజును కూడా డెస్టినేషన్ బర్త్ డే గా ప్లాన్ చేసింది ఈ జంట. ఎక్కడికైనా ఓ మంచి ప్రదేశానికి వెళ్లిపోయి జాలీగా సెలిబ్రేట్ చేసుకోవాలనుకున్నారు.
అయితే ప్రస్థుతం సమంత, నాగచైతన్య ఇద్దరూ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. సమంత చేతిలో 3 సినిమాలుంటే, సవ్యసాచి షూటింగ్ తో చైతూ కూడా బిజీగా ఉన్నాడు. సో.. ఈ స్పెషల్ బర్త్ డేను హైదరాబాద్ లోనే సెలబ్రేట్ చేసుకోవాలని వీళ్లిద్దరూ నిర్ణయించారు.
చైతూ కోసం సమంత ప్లాన్ చేసిన ఆ సర్ ప్రైజ్ ఏంటనే విషయం సెలియాలంటే సమంత సోషల్ మీడియా ఎకౌంట్స్ ఫాలో అయితే సరి. తన విషయాలన్నీ షేర్ చేయడం సమంతకు అలవాటే కాబట్టి... సమంత ఈ బర్త్ డే పిక్స్ ను కూడా పోస్ట్ చేస్తంది కదా మరి.
Last Updated 25, Mar 2018, 11:59 PM IST | 0business
|
Hyd Internet 86 Views BSNL
bsnl
ఢిల్లీ: దేశంలోని మవోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ డేటా వినియోగం భారీగా పెరిగిందని, వామపక్ష భావజాలం ఉన్న 9 రాష్ట్రాల్లో 2జీ నెట్ వర్క్పై రోజుకు 400 జీబీ డేటా వినియోగం జరుగుతుందని ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, వీఎన్ఎల్ సంయుక్తంగా ప్రకటించాయి. నక్సల్స్ ఏరియాలో హింసను అరికట్టడంతో పాటు సమాచారాన్ని త్వరగా తెలుసుకునేందుకు వీలుగా 2013లో మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని అప్పటి కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా 2016 డిసెంబర్ నాటికి సౌర విద్యుత్ ద్వారా పని చేసే 2,199 బీఎస్ఎన్ఎల్ టవర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా దాదాపు 20 వేల గ్రామాలు లబ్ధి పొందుతున్నాయి. దీని ప్రకారం నక్సల్స్ ఏరియాల్లో బీఎస్ఎన్ఎల్ డేటా వినియోగం బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. | 1entertainment
|
Hyderabad, First Published 2, Nov 2018, 4:35 PM IST
Highlights
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకి కొదవ ఉండదు. కాంబినేషన్స్, గెస్ట్ రోల్స్ ఇలా చాలా విషయాల్లో సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' సినిమాకి కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నారు. నటి మాళవిక నాయర్ 'టాక్సీవాలా' సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకి కొదవ ఉండదు. కాంబినేషన్స్, గెస్ట్ రోల్స్ ఇలా చాలా విషయాల్లో సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' సినిమాకి కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
నటి మాళవిక నాయర్ 'టాక్సీవాలా' సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. కథ మొత్తం కూడా ఆమె చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఇప్పటివరకు మాళవిక నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి. ఇప్పుడు ఆమె గోల్డెన్ లెగ్ ఈ సినిమాకి కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకండా సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా కనిపిస్తుండగా.. ముఖ్య పాత్రలో మాళవిక కనిపించనుంది. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నటించింది మాళవిక. ఆ సినిమాలో ఇద్దరు స్నేహితులుగా కనిపిస్తారు.
ఈ సినిమాలో కూడా ఆమెది హీరో సరసన కనిపించే టిపికల్ హీరోయిన్ రోల్ కాదని తెలుస్తోంది. ఆమె పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. గీతా2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాతో రాహుల్ సాంక్రిత్యన్ అనే దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు.
ఇది కూడా చదవండి.. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వన్డేల్లో ధోనీపై వేటు వేయబోతున్నారా..?
ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న రిషబ్ పంత్తో ధోనీ కెరీర్కి ఎలాంటి ప్రమాదం ఉండదు. 2019 ప్రపంచకప్ వరకూ ధోనీ ఆడతాడని మన అందరికీ తెలుసు -బీసీసీఐ అధికారి
Samayam Telugu | Updated:
Oct 10, 2018, 01:43PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై వన్డేల్లో వేటు వేయబోతున్నారా..? అంటే అవుననే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెస్టిండీస్తో ఈనెల 21 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్ కోసం త్వరలోనే జట్టుని సెలక్టర్లు ప్రకటించనున్నారు. అయితే.. ఈ జట్టులో మహేంద్రసింగ్ ధోనీకి చోటు దక్కడం అనుమానంగా కనిపిస్తోంది.
ఇటీవల ఇంగ్లాండ్పై చివరి టెస్టులో శతకం బాది వెలుగులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ .. గత వారం వెస్టిండీస్తో ముగిసిన తొలి టెస్టులోనూ 92 పరుగులతో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో.. వన్డేల్లోనూ వికెట్ కీపర్గా అతనికి అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండంతో సెలక్టర్లు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహేంద్రసింగ్ ధోనీ కూడా గత కొంతకాలంగా పేలవ ఫామ్తో నిరాశపరుస్తున్నాడు. గత నెల దుబాయ్లో ముగిసిన ఆసియా కప్ తొలి మ్యాచ్లో హాంకాంగ్పై డకౌటైన ధోనీ.. టోర్నీలో భారత్ని గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
స్టార్ ఇండియాకే ఐపీఎల్ మీడియా రైట్స్..!
ఐపీఎల్ మీడియా రైట్స్ని స్టార్ ఇండియా దక్కించుకుంది. ఐదేళ్ల పాటు ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారం,
TNN | Updated:
Sep 4, 2017, 02:20PM IST
ఐపీఎల్ మీడియా రైట్స్‌ని స్టార్ ఇండియా దక్కించుకుంది. ఐదేళ్ల పాటు ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం, డిజిటల్ హక్కుల కోసం బీసీసీఐ టెండర్లు నిర్వహించగా.. స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్లకి వీటిని దక్కించుకుంది. దీంతో 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ మీడియా హక్కులు స్టార్ ఇండియా వద్దనే ఉండనున్నాయి. బిడ్డింగ్‌లో సోనీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్న స్టార్ ఇండియా ఎట్టకేలకి తన పంతాన్ని నెగ్గించుకుంది. ఈ హక్కుల కోసం సోనీ రూ.11,058 కోట్లని మాత్రమే బిడ్డింగ్ చేసినట్లు సమాచారం.
ఐపీఎల్ ఆరంభంలో అంటే.. 2008లో సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ మ్యాచ్‌ల ప్రసారం కోసం పదేళ్ల కాలానికి రూ.8200 కోట్లతో ఒప్పందం చేసుకుంది. 2015లో డిజిటల్ హక్కులను మూడేళ్ల కాలానికి నోవి రూ.302.2 కోట్లతో దక్కించుకుంది. అయితే.. ఈ సారి టీవీ, డిజిటల్ విభాగాల్లో మొత్తం ఏడు హక్కుల కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించగా.. స్టార్‌ ఇండియా పెద్ద మొత్తంలో బిడ్ చేసి వాటిని సొంతం చేసుకుంది. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
మనసులోని కోరికను బయటపెట్టిన మిస్ వరల్డ్ మానుషి
Highlights
మనసులోని కోరికను బయటపెట్టిన మిస్ వరల్డ్ మానుషి
మిస్వరల్డ్ మానుషి చిల్లర్ వార్తల్లోకి వచ్చేసింది. సినిమాల్లోకి వచ్చేందుకు ఆమె సిద్ధమవుతోందంటూ కొద్దిరోజులుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను ప్రస్తావించింది. తాను ఫ్యూచర్లో ఎటువైపు వెళ్తున్నానో అనేదానిపై క్లారిటీ ఇచ్చేసింది. మిస్ వరల్డ్ అయి ఇంకా ఆరు నెలలే అవుతుందని, కాలేజీని ఇంకా పూర్తి చేయలేదని తెలిపింది.
ప్రతీరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నానని, ఈ ఇండస్ర్టీలో ఫ్యాషన్ ఉందని, సినిమాలు చూడటమంటే ఎంతో ఇష్టమని వెల్లడించింది. కెమెరా ముందు తనను తాను కొత్తగా చూసుకున్నానని, తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే చూస్తానని తెలిపింది. మొత్తానికి సినిమాల్లోకి రావాలన్న తన ఆలోచనను చెప్పకనే చెప్పింది.
Last Updated 21, Jun 2018, 1:14 PM IST | 0business
|
Mumbai, First Published 2, Feb 2019, 5:24 PM IST
Highlights
భారత దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవ లేదని భారత సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ స్ఫష్టం చేశాడు. ప్రస్తుతమున్న క్రికెట్ జట్టు అత్యుత్తమప్రతిభ కలిగిన ఆటగాళ్లను కలిగి వుందన్నారు. దేశవాళీ క్రికెట్ టోర్నీల వల్ల యువ ఆటగాళ్లు రాటుదేలుతున్నారని...అందువల్లే అంతర్జాతీయ జట్టు అంత పటిష్టంగా మారిందని ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
భారత దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవ లేదని భారత సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ స్ఫష్టం చేశాడు. ప్రస్తుతమున్న క్రికెట్ జట్టు అత్యుత్తమప్రతిభ కలిగిన ఆటగాళ్లను కలిగి వుందన్నారు. దేశవాళీ క్రికెట్ టోర్నీల వల్ల యువ ఆటగాళ్లు రాటుదేలుతున్నారని...అందువల్లే అంతర్జాతీయ జట్టు అంత పటిష్టంగా మారిందని ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
దేశ వాళీ క్రికెట్ మ్యాచులను చూడటాన్ని తానెంతో ఇష్టపడతానని ప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ మ్యాచుల కంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అందువల్ల దేశవాళి క్రికెటర్లలో ఎవరూ బాగా ఆడుతున్నారో తెలుస్తుందని...వారికి అంతర్జాతీయ జట్టుల్లో అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని ఎంఎస్కే వెల్లడించారు.
భారత క్రికెట్ భవిష్యత్ మొత్తం దేశవాళి క్రికెట్లోనే వుందన్నారు. ఈ మ్యాచుల ద్వారానే యువ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థానం కోసం ప్రస్తుతం చాలా మంది యువ క్రికెటర్లు ఎదురు చూస్తున్నారని...ఈ పోటీ క్రికెట్ కు మంచిదేన పేర్కొన్నారు. మరో పదేళ్ల పాటు భారత జట్టులో నాణ్యమైన క్రికెటర్లకు లోటు లేదని ఎంఎస్కే అభిప్రాయపడ్డారు.
భారత-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ యువ క్రికెటర్లకు ఉత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నాడని ప్రశంసించారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించి ఆకట్టుకున్న క్రికెటర్లు ద్రవిడ్ పర్యవేక్షణలోనే శిక్షణ పొందినట్లు తెలిపారు. అటను తన అనుభవంతో యువ క్రికెటర్లకు శిక్షణనిచ్చే తీరు ఎంతో భావుంటుందని ఎంఎస్కే ప్రసాద్ అన్నారు.
Last Updated 2, Feb 2019, 5:24 PM IST | 2sports
|
నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు
Highlights
ట్విట్టర్ బెదిరింపులపై అప్పీల్ చేసిన సింగర్ చిన్మయి
తనకు రేప్ చేస్తామంటూ బెదిరింపు రావటంపై సీరియస్
సుచీలీక్స్ ట్విట్టర్ పోస్టులతో తీవ్ర మనస్థాపం చెందిన చిన్మయి
సుచీలీక్స్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన తాజా పోస్ట్ ల నేపథ్యంలో... తీవ్రంగా మనోభావాలు దెబ్బతిన్న సింగర్ చిన్మయి. తనపై జరిగిన వివక్ష, కుట్రలపై స్పందించి ట్విట్టర్లో తన మనోభావాలను వెల్లడించినందుకు అత్యాచార, యాసిడ్ దాడుల హెచ్చరికలు రావడం పట్ల గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా బెెదిరింపులకు పాల్పడే వారిని ఉపేక్షించరాదని, ట్విట్టర్ నుంచి వారి ఖాతాలను మూకుమ్మడిగా తొలగించాలని కోరారు. మహిళలపై లైంగిక దాడి హెచ్చరికలను ట్వీట్ చేసే వారిపై తీవ్ర చర్యలు చేపట్టాలని ట్విట్టర్కు విజ్ఞప్తి చేశారు. తనకు వచ్చిన హెచ్చరికలు తీవ్రంగా కలిచివేశాయని,జీవితంపై భయాన్ని కలిగించాయని ఆందోళన వ్యక్తం చేశారు.తనకు వచ్చిన బెదిరింపు ట్వీట్లను ఆమె వివరించారు.
'నిన్ను రేప్ చేయాలి'..నీ ముఖంపై యాసిడ్ పోస్తా..నువ్వు మరోసారి పాడకుండా చూస్తా' అంటూ ఈ ట్వీట్లు సాగాయని చెప్పారు.ఈ బెదిరింపులపై ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లగా,పోలీసు కేసు నమోదైతేనే తాము చర్యలు చేపడతామని వారు చెప్పినట్టు చిన్మయి తెలిపారు.దీంతో చిన్మయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేధింపులకు గురిచేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తన ఆలోచనా తీరును మార్చివేసిందని చిన్మయి చెప్పారు.ప్రతిరోజూ అత్యాచార హెచ్చరికలను ఎదుర్కొనే కోట్లమంది సామాన్య మహిళలు ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారని ఆమె ప్రశ్నించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసే సమయం, తీరిక,ఖర్చును తట్టుకునే శక్తి ఎంతమందికి ఉంటుందన్నారు.తమ వేదికను మహిళలను వేధించేందుకు ఉపయోగించుకోవడాన్ని నిలువరించే బాధ్యత ట్విట్టర్పై ఉందన్నారు.ఉగ్రవాదంతో సంబంధం ఉన్న ఖాతాలను ట్విట్టర్ మూసివేస్తున్న క్రమంలో మహిళలపై హింసను ప్రేరేపించే వారిపైనా ఇదే అనుసరించాలని చిన్మయి స్పష్టం చేశారు.
— Chinmayi Sripaada (@Chinmayi) 7 March 2017
Last Updated 25, Mar 2018, 11:45 PM IST | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
internet vaartha 157 Views
కోల్కత్తా : తలనొప్పులు వంటి రుగ్మ తల నుంచి బైటపడేసే బామ్ల మార్కెట్ విలువ వార్షికపద్ధతిలో చూస్తే రూ.800 కోట్లవరకూ ఉందని, ఏటా నాలుగుశాతం వృద్ధి చెందుతు న్నట్లు ఇమామి డైరెక్టర్ మోహన్ గోయంకా వెల్లడించారు. ఆయుర్వేద వారసత్వానికి ప్రతీక అయిన ఇమామి వందేళ్లుగా జండుబామ్ను అందిస్తోందన్నారు. జండుబామ్ను పూర్తి రీడిజైన్చేసి కొత్త ఉత్పత్తిన మార్కెట్కు విడుదల చేసారు. బామ్ల మార్కెట్లో జండూబామ్ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటామని వెల్లడించారు. అత్యధికంగా తలనొప్పి, వంటి నొప్పి, జలుబు రుగ్మతలకు ఎక్కువ వినియో గించే బామ్లలో జండూబామ్దే అగ్రస్థానంగా ఉందన్నారు. కొత్త జండూబామ్ 1ఎంఎల్, 4.5 ఎంఎల్, 8ఎంల్, 25ఎంఎల్ప్యాక్లలో లభిస్తుం ది. రెండు రూపాయల నుంచి 80 రూపాయల ధరల్లో ప్యాక్లున్నట్లు గోయంకా వివరించారు. | 1entertainment
|
ఇరానీ కప్ రెస్టాఫ్ ఇండియా సొంతం
సాహా డబుల్ సెంచరీ -సెంచరీతో అలరించిన పుజారా
న్యూఢిల్లీ: ఇరానీ కప్లో భాగంగా బ్రాబోర్న్ స్టేడియంలో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో బెంగాల్ వికెట్ కీపర్,బ్యాట్స్మెన్ వృద్దిమాన్ సాహా డబుల్ సెంచరీతో చెలరేగడంతో గుజరాత్పై రెస్టాఫ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 379 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రెస్టాప్ ఇండియా 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఓపెనర్లు హెర్వాద్కర్ 20 పరుగులు,ముకుంద్ 19 పరుగులు,కరుణ్నాయర్ 7 పరుగులు,తివారి 7 పరుగులకే పెవిలియన్కు చేరారు. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన సాహా,పుజారా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కది ద్దారు.4 వికెట్లకు 266 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం ఇన్నింగ్స్ని ప్రారంభించిన సాహా 272 బంతులు ఆడి 26 బౌండరీలు,6 సిక్సర్లతో అజేయంగా 203 పరుగులు చేసి రెస్టాఫ్ ఇండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
సాహాకి తోడుగా సౌరాష్ట్ర బ్యాట్స్మెన్, రెస్టాఫ్ ఇండియా కెప్టెన్ పుజారా 116 పరుగులతో సెంచరీ పూర్తి చేశాడు.వీరిద్దరూ అజేయంగా 316 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రెస్టాఫ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.379 పరుగులు టార్గెట్తో బరిలోకి దిగిన రెస్టాఫ్ ఇండియా 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో రెస్టాఫ్ ఇండియాను సాహా, పుజారాల జోడి ఆదుకుంది.తొలి మూడు రోజులు గుజరాత్ ఆధిపత్యం కొనసాగించింది.అయితే వీరి ద్దరు సత్తాచాటడంతో నాలుగవ రోజు నుంచి మ్యాచ్ రెస్టాఫ్ ఇండియా చేతుల్లోకి వెళ్లింది. ఐదవ రోజు మంగళవారం ఆటను కొనసాగించిన వీరిద్దరు మరో వికెట్ పడకుండా విజాయన్ని అం దించారు.ఈ మ్యాచ్లో సాహా డబుల్ సెంచరీ చేయగా,పుజారా సెంచరీ చేశాడు. | 2sports
|
Hyderabad, First Published 10, Apr 2019, 10:06 AM IST
Highlights
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎంపికను రాజమౌళి ఎన్నో కసరత్తలు చేసి ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా అదో సమస్యగా మారింది.
ఇప్పటికే హీరోయిన్ డైసీ.. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించడానికి ఒప్పుకొని తీరా సమయానికి హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించింది డైసీ ఎడ్గర్ జోన్స్ . నా కుటుంబ సమస్యల వల్ల ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటించలేక పోతున్నానని అందుకే ఆర్ ఆర్ ఆర్ నుండి తప్పుకున్నానని చెప్పింది. దాంతో వేరే హీరోయిన్ వేటలో పడ్డారు.
అయితే ఇప్పుడు ఈ టీమ్ కు మరో పెద్ద అడ్డంకి ఏమిటీ అంటే అలియా భట్ డేట్స్. రామ్ చరణ్ సరసన నటించటానికి ఓకే చేసిన ఆమె వరస పెట్టి పెద్ద ప్రాజెక్టులలో బిజీగా ఉంది. సడక్ 2, ఇన్షా అల్లా, హమ్ ఆపకే హై కౌన్ సీక్వెల్, బ్రహ్మాస్త్ర ఇలా వరసగా సినిమాలు ఉన్నాయి. దాంతో అలియా భట్ డేట్స్ చాలా జాగ్రత్తగా ఎడ్జెస్ట్ చేసుకుంటూ వెళ్తోంది. ఎక్కడ ఎవరి షెడ్యూల్ అప్ సెట్ అయ్యినా ఆమెతో పనిచేసే మిగతా సినిమావాళ్లకు ఇబ్బందిగా మారుతోంది.
ఈ నేపధ్యంలో రాజమౌళి చేయాలని కమిటైన ఆర్ ఆర్ ఆర్ కు డేట్స్ కేటాయించే విషయంలో ఆమెకు కంటిన్యూ డేట్స్ ఇవ్వలేని పరిస్దితి ఏర్పడిందిట. దాంతో ఆమె ఉన్నప్పుడే హీరోల డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటూ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.జూన్ లో కొద్ది రోజులు, జూలై లో కొద్ది రోజులు ఆమె డేట్స్ ఇస్తానందిట. మే నుంచి బ్రహ్మాస్త్ర బిజిలో పడిపోతుందిట. దాంతో రాజమౌళి టీమ్...ప్రతీ క్షణం విలువైందిగా, రీటేక్స్ విషయంలో జాగ్రత్తలు వహించాల్సిన పరిస్దితి ఏర్పడిందిట.
బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో రాజమౌళి ఏ విషయంలోనూ రాజీ పడటంలేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించుకుంటూ టాప్ టెక్నీషియన్లతో ముందుకు వెళ్లున్నాడు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
Last Updated 10, Apr 2019, 10:06 AM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హాలీవుడ్లో నాగార్జున సినిమా రీమేక్!
కింగ్ నాగార్జున నటించిన ఊపిరి సినిమా త్వరలోనే హాలీవుడ్లో రీమేక్ కానుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ...
TNN | Updated:
Aug 8, 2017, 02:56PM IST
కింగ్ నాగార్జున నటించిన ఊపిరి సినిమా త్వరలోనే హాలీవుడ్‌లో రీమేక్ కానుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో నాగ్, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఊపిరి మూవీని హాలీవుడ్‌లో 'ది అప్‌సైడ్' టైటిల్‌తో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మొదటిసారిగా ఫ్రెంచ్‌లో తెరకెక్కిన ది ఇన్‌టచబుల్స్ మూవీని తెలుగులో ఊపిరి పేరుతో రీమేక్ చేయగా అది నాగ్ రీసెంట్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ అవడంతోపాటు 2016లో టాప్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే.
హాలీవుడ్ రీమేక్‌లో నాగ్ పాత్రని బ్రియన్ క్రాన్‌స్టాన్ పోషించనుండగా కార్తి పాత్రలో కెవిన్ హర్ట్ నటిస్తున్నాడు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా పాత్రలో హాలీవుడ్ బ్యూటీ నికోల్ కిడ్‌మన్ కనిపించనుంది. ఫ్రెంచ్‌లో హిట్ అయిన ది ఇన్ టచబుల్స్ సినిమాను తెలుగులో ఊపిరి పేరుతో తీయగా అది కూడా అంతే సూపర్ హిట్ అయింది. మరి తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి వెళ్తున్న ఈ రీమేక్ అక్కడ ఏ మేరకు సత్తా చాటుకుంటుందో తెలియాలంటే ఇంకో ఏడాదిపాటు ఆగాల్సిందే. | 0business
|
Hyderabad, First Published 4, Feb 2019, 2:39 PM IST
Highlights
దక్షిణాది అగ్ర దర్శకుల్లో టాప్ డైరెక్టర్ అయిన మణిరత్నం సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తుంటారు.
దక్షిణాది అగ్ర దర్శకుల్లో టాప్ డైరెక్టర్ అయిన మణిరత్నం సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. గతేడాదిలో ఆయన డైరెక్ట్ చేసిన 'నవాబ్' సినిమా విడుదలై మంచి సక్సెస్ అయింది.
ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మణిరత్నంకి రజినీకాంత్ కూతురు రూపంలో పెద్ద షాక్ తగిలింది. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే హిస్టారికల్ నవల ఆధారంగా సినిమా తీయలనుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
కానీ ఇంతలో రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య ఇదే నవల ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు ప్రకటించేసింది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ కంపనీతో కలిసి ఆమె ఈ వెబ్ సిరీస్ ని నిర్మించబోతుంది. సూర్య ప్రతాప్ ఎస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.
మణిరత్నం కంటే ముందే సౌందర్య రజినీకాంత్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో మరి మణిరత్నం ఏం చేస్తాడా..? అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మణిరత్నం తన సినిమాకు సంబంధించిన కాస్టింగ్ ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరి ఈ విషయంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి!
Last Updated 4, Feb 2019, 2:42 PM IST | 0business
|
Hyderabad, First Published 12, Oct 2018, 5:19 PM IST
Highlights
సముద్రం లాంటి మహాభారతాన్ని తెరక్కించడమంటే అంత సాధారణమైన విషయం కాదు. ఆ కాలంలో సీనియర్ నటులు వారి స్టైల్ లో తెరకెక్కించి శబాష్ అనిపించుకున్నారు.రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనని కెరీర్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు.
సముద్రం లాంటి మహాభారతాన్ని తెరక్కించడమంటే అంత సాధారణమైన విషయం కాదు. ఆ కాలంలో సీనియర్ నటులు వారి స్టైల్ లో తెరకెక్కించి శబాష్ అనిపించుకున్నారు.రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనని కెరీర్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. ఇక బాలీవుడ్ సైడ్ అమిర్ ఖాన్ కూడా మహాభారతంలో నటించడానికి సిద్ధమని అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పేశాడు.
అయితే అందరికంటే ముందే మోహన్ లాల్ భారీ బడ్జెట్ తో మహాభారతంలో నటిస్తున్నట్లు కొన్నేళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. 1000 కోట్లతో ప్రముఖ వ్యాపార వేత్త బీఆర్ శెట్టి సినిమాను నిర్మించనున్నట్లు కథనాలు కూడా చాలానే వచ్చాయి. ప్రముఖ రచయిత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన రంధమూలం నవల ఆధారంగా దర్శకుడు శ్రీ కుమార్ ఇంటర్నేషనల్ లెవెల్లో చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు.
స్క్రీన్ ప్లే ను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చిత్రం షూటింగ్ మొదలవ్వకముందే అటకెక్కేటట్లు ఉందని ప్రస్తుతం పరిస్థితులను చుస్తే అర్ధమవుతోంది. ఎందుకంటే సినిమా రచయిత వాసుదేవన్ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. మూడేళ్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకొని సినిమాను స్టార్ట్ చేస్తామని చెప్పారు. నాలుగేళ్లయినా సినిమాను స్టార్ట్ చేయలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రచయిత కథ కథనాలను తీరిగి ఇప్పించాలని కోర్టుమెట్లు ఎక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Last Updated 12, Oct 2018, 5:27 PM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘RRR’ అప్డేట్.. ఎన్టీఆర్, చరణ్ పాత్రలు ఇవేనట!
సినిమా ప్రారంభానికి ముందే ‘RRR’పై బోలెడన్ని రూమర్లు వచ్చాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ అన్నదమ్ములుగా కనిపిస్తారని.. ఇద్దరూ బాక్సర్లని వార్తలు వచ్చాయి.
Samayam Telugu | Updated:
Nov 26, 2018, 05:05PM IST
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘RRR’ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ తెలుగునాట దీనిపైనే చర్చ. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. అయితే రాజమౌళి సినిమాను ప్రకటించి షూటింగ్ ప్రారంభించేశారు కానీ.. అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి? ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? వంటి విషయాలపై ఒక్క లీకు కూడా ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాపై బోలెడన్ని ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి.
సినిమా ప్రారంభానికి ముందే ‘RRR’పై బోలెడన్ని రూమర్లు వచ్చాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ అన్నదమ్ములుగా కనిపిస్తారని.. ఇద్దరూ బాక్సర్లని వార్తలు వచ్చాయి. ఆ తరవాత చరణ్ పాజిటివ్ రోల్, ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ పోషిస్తు్న్నారని అన్నారు. ఇప్పుడు ఈ సినిమా కథకు సంబంధించి మరో అంశంపై తెరపైకి వచ్చింది. ఈ సినిమా దొంగా పోలీస్ నేపథ్యంలో ఉండనుందని అంటున్నారు. బందిపోటు దొంగగా ఎన్టీఆర్ నటిస్తుంటే, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చరణ్ కనిపిస్తారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాకుండా విజయేంద్ర ప్రసాద్ 1920 నాటి కథాంశాన్ని తీసుకున్నారని టాక్. | 0business
|
Hyderabad, First Published 5, Apr 2019, 1:04 PM IST
Highlights
ఈ మధ్యకాలంలో దిల్ రాజు తన టీమ్ ని చాలా బాగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో దిల్ రాజు తన టీమ్ ని చాలా బాగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'ఎఫ్ 2' సినిమా సక్సెస్ కావడంతో యూనిట్ మొత్తాన్ని ట్రిప్ కోసం తన సొంత ఖర్చులతో విదేశాలకు పంపించాడు.
తాజాగా ఓ డైరెక్టర్ కి కారుని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో దర్శకుడు వేణుశ్రీరాం 'ఎంసిఏ' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్ అయినప్పటికీ వేణుశ్రీరాం తన నెక్స్ట్ సినిమాకి మరో నిర్మాత దగ్గరకి వెళ్లకుండా దిల్ రాజు వద్దే ఉన్నాడు.
రీసెంట్ గా కథ సిద్ధం చేసుకొని అల్లు అర్జున్ కి వినిపించాడు. అది బన్నీకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయనున్నాడు.
ఈ సందర్భంగా దిల్ రాజు.. తన డైరెక్టర్ కి హ్యుండయ్ కంపనీకి చెందిన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడట. ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలలో వేణు-బన్నీల సినిమా సెట్స్ పైకి వెళ్తుంది!
Last Updated 5, Apr 2019, 1:04 PM IST | 0business
|
హోమ్ క్రీడలు టీం ఇండియా కొత్త కోచ్ కి ఇంటర్వ్యూలు ప్రారంభం
టీం ఇండియా కొత్త కోచ్ కి ఇంటర్వ్యూలు ప్రారంభం
August 16, 2019, 2:02 PM IST
Share on:
టీమ్ఇండియా కొత్త కోచ్ పదవికి ఇంటర్వ్యూలు ప్రారంభమైనవి. మాజీ కెప్టెన్ కపిల్దేవ్ ఆధ్వర్యంలోని అన్షుమాన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిల క్రికెట్ సలహా మండలి ఈరోజు ముంబయిలోని బీసీసీఐ కార్యాలయంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. దాదాపు 2 వేల మందికి పైగా ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందులో ఆరుగురిని మాత్రమే ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. వారిలో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితో సహా, మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్, లాల్చంద్ రాజ్పుత్, మైక్ హెస్సన్, టామ్మూడీ, ఫిల్ సిమ్మన్స్ ఉన్నారు. ఇప్పటికే రాబిన్సింగ్ ఇంటర్వ్యూ పూర్తైందని తెలుస్తోంది. ఈ ఆరుగురినీ ఈరోజు ఇంటర్వ్యూ చేసి రాత్రికి కొత్త కోచ్ని ప్రకటించే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు | 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.