news
stringlengths
299
12.4k
class
class label
3 classes
mohammad shami completes 100 test wickets - 3rd quickest indian fast bowler కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్ తర్వాతి స్థానంలో షమీ! దక్షిణాఫ్రికా జరుగుతోన్న రెండో టెస్టులో భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. TNN | Updated: Jan 14, 2018, 03:04PM IST భారత పేస్‌బౌలర్ మహమ్మద్ షమీ టెస్టు క్రికెట్లో వంద వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సెంచూరియన్ టెస్టులో రెండో రోజు ప్రారంభంలోనే కేశవ్ మహారాజ్‌ను పెవిలియన్ చేర్చడం ద్వారా షమీ ఈ ఘనత సాధించాడు. అతి తక్కువ టెస్టుల్లో వంద వికెట్లు తీసిన భారత పేసర్ల జాబితాలో షమీ మూడో స్థానంలో నిలిచాడు. కపిల్ దేవ్ 25 టెస్టుల్లోనే వంద వికెట్లు పడగొట్టగా.. 28 టెస్టుల్లో ఇర్ఫాన్ పఠాన్ ఈ రికార్డ్‌ను అందుకున్నాడు. 29 టెస్టుల్లోనే వంద వికెట్ల మార్క్‌ను అందుకున్న షమీ మూడోస్థానంలో నిలిచాడు. ప్రస్తుత భారత పేసర్లలో ఇషాంత్ శర్మ 33 టెస్టుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. భారత్ తరఫున ఓవరాల్‌గా ఏడుగురు పేసర్లు మాత్రమే టెస్టుల్లో వంద వికెట్లను పడగొట్టారు. జవగళ్ శ్రీనాథ్ (30 టెస్టులు), కర్షన్ ఘావ్రి (36 టెస్టులు), జహీర్ ఖాన్ (37 టెస్టులు) ఈ ఘనత సాధించిన ఇతర భారత పేస్ బౌలర్లు.
2sports
వాళ్లను డాక్టర్ల దగ్గర చూపించండి... వాళ్లకు కచ్చితంగా ఎయిడ్స్ ఉంటుంది Highlights వాళ్లను డాక్టర్ల దగ్గర చూపించండి... వాళ్లకు కచ్చితంగా ఎయిడ్స్ ఉంటుంది నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన తెలుగు సినీ రంగంలో లైంగిక ఆర్థిక దోపిడీలపై మహిళా సంఘాల అధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు.. జూనియర్ ఆర్టిస్ట్ లు హాజరయ్యారు. వీరికి అండగా పలు మహిళా సంఘాలు వారు తమ వాదనను వినిపించారు. ఇక్కడ ఒక జూరియర్ ఆర్టిస్ట్ వ్యాఖ్యలు పెను సంచలనానికి కారణమైంది.టీవీల్లో బతుకు జట్కా బండి అంటూ షోలో కూర్చొని నీతులు చెప్పే జీవిత.. బయట చేసేది మాత్రం బ్రోకర్ పనులని.. అదేంటో తనకు అర్థం కావట్లేదన్నారు. ఇండస్ట్రీలో చాలామంది ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారని.. వాళ్ల పెళ్లాలు.. ఇంట్లో వాళ్లు జాగ్రత్తగా ఉండాలని.. ప్రతి ఒక్కళ్లకు ఎయిడ్స్ ఉంటుందన్నది తన నమ్మకంగా చెప్పారు. కచ్ఛితంగా ఎయిడ్స్ ఉండే ఉంటుంది. ఎందుకైనా మంచిది టెస్ట్ చేయించి.. చికిత్స చేయించాలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. Last Updated 16, Apr 2018, 5:08 PM IST
0business
Jun 25,2016 ప్రభావం స్వలకాలికమే: జైట్లీ                 బీజింగ్‌: బ్రెక్సిట్‌ కారణంగా ఎదరయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత సన్నద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. చైనా పర్యటనలో ఉన్న జైట్లీ 'బ్రెక్సిట్‌' తీర్పుపై స్పందించారు. ఐరోపా సమాజం నుంచి బ్రిటన్‌ వైదొలగాలన్న అక్కడి ప్రజల నిర్ణయాన్ని స్వాగతించారు. బ్రెక్సిట్‌ ప్రభావం ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలపైనా ప్రతిబింబించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అంతర్జాతీయ అవనికపై కీలక పరిణమాలు జరిపినపుడు మార్కెట్లు జారడం సాధారణమేనన్నారు. పరిస్థితులను బట్టి అన్ని రకాల చర్యలు తీసుకొని బ్రెక్సిట్‌ ప్రభావాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. స్వల్పకాలంలో ఫారెక్స్‌ మార్కెట్లో ఎదరయ్యే ఒడుదొ డుకులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బ్రెక్సిట్‌ కారణంగా ఎదురేయే స్వల్పకాలిక, మధ్య కాలిక పరిణామాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక మూలాలు బలంగా ఉన్న భారత్‌ వంటి ఆర్థిక వ్యవస్థలపై బ్రెక్సిట్‌ ప్రభావం తాత్కాలికమేనని అన్నారు. త్వరలోనే పరిస్థితులు పూర్వ స్థితికి చేరుతాయన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
రోమాలు నిక్కబొడిచేలా ‘భాగమతి’ ఇంటర్వెల్ సీన్: హీరో నాని TNN| Jan 21, 2018, 11.05 PM IST ఫ్యామిలీలో ఎవరైనా సూపర్ స్టార్ ఉంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో.. ఇప్పుడు తనకు అనుష్క విషయంలో అలాంటి అనుభూతే ఉందని న్యాచురల్ స్టార్ నానీ అన్నాడు. కొద్ది కాలం పరిచయంతోనే తనకు స్వీటీ ఓ ఫ్యామిలీ మెంబర్‌ అయిపోయిందని చెప్పాడు. అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ ‘భాగ‌మ‌తి’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం (జనవరి 21) హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు అతిథిగా హాజరైన నానీ మాట్లాడుతూ.. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీకి సాలీడ్ బ్లాక్ బస్టర్ ఇంకా పడలేదని.. ‘భాగమతి’ ఆ లోటు తీరుస్తుందని చెప్పాడు. భాగమతి ఇంటర్వెల్ సీన్ రోమాలు నిక్కబొడిచేలా ఉందని నానీ అన్నాడు. తనకు బాగా తెలిసిన వ్యక్తి భాగమతి రీ-రికార్డింగ్ సందర్భంగా అక్కడే ఉన్నాడని, ఆ సీన్ చూడగానే తనకు ఫోన్ చేసి విషయం చెప్పాడని నానీ తెలిపాడు. ఈ విషయం ఇప్పటిదాకా స్వీటీకి కూడా చెప్పలేదని నానీ తెలిపాడు. సినిమాలో అనుష్క పర్‌ఫార్మెన్స్ చూస్తుంటే.. ఈ ఏడాది అవార్డులన్నీ ఆమెనే వరించేలా ఉన్నాయని నానీ కొనియాడాడు. అశోక్‌‌ను ఇప్పటిదాకా ‘పిల్ల జమీందార్’ డైరెక్టర్‌గా గుర్తు పెట్టుకున్నారని, జనవరి 26 తర్వాత అశోక్ అనగానే.. ‘భాగమతి’ దర్శకుడు అంటారని నానీ అన్నాడు. అనుష్క మాట్లాడుతూ.. యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది. తనకు భాగమతి కథను 2012లో వినిపించారని.. కానీ, కాల్షీట్లు కుదరకపోవడంతో సినిమా ఆలస్యమైందని ఆమె తెలిపింది. ‘ఇంతకాలం నిర్మాతలు నా కోసం వేచి చూశారు. నన్ను కాదని మరో హీరోయిన్‌తో సినిమా పూర్తి చేస్తే చాలా బాధ పడేదాన్ని’ అని స్వీటీ చెప్పుకొచ్చింది. స్టేజీపై ఉన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్ చెప్పిన అనుష్క.. తనను అందరూ స్వీటీ అని ఎందుకు పిలుస్తారో మరోసారి గుర్తు చేసింది. యాంకర్ ప్రశాంతికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది. డైరెక్టర్ అశోక్‌కు త్రిప్లెట్స్ (ముగ్గురు కవలలు) పిల్లలు అని తెలిపిన స్వీటీ, వారు ఓ సినిమా ఫంక్షన్‌కు రావడం ఇదే తొలిసారని చెబుతూ హర్షం ప్రకటించింది. అనుష్కకు ‘అరుంధతి’ ఎలాంటి పేరు తీసుకొచ్చిందో.. ‘భాగమతి’ కూడా అలాంటి పేరునే తీసుకురావాలని ఆశిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఈ కార్యక్రమానికి మారుతి, గాంధీ, వంశీ, ప్రమోద్ తదితరులు హాజరయ్యారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ‘భాగమతి’ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి మరోసారి ప్రతినాయక పాత్రలో అలరించనున్నాడు. జ‌య‌రామ్‌, ఉన్ని ముకుంద‌న్‌, ఆశా శ‌ర‌త్ కీల‌క పాత్రలు పోషించారు. భాగమతి థీమ్ సాంగ్..
0business
Banks మార్కెట్లకు రుచించని బ్యాంకుల విలీనం ముంబయి, జూన్‌ 16: బ్యాంకింగ్‌రంగంలో పేరుకుని పోతున్న ఎన్‌పిఎల పరిష్కారానికి రిజర్వుబ్యాంకు విస్తృత అధికారాలు దాఖలుపరచడం, రానిబాకీల పైనా, ఉద్దేశ్యపూర్వక ఎగవేత దారులపైనా దివాళా చట్టం ప్రయోగించి రికవరీచేయడం వంటి వాటితో పాటు చిన్న బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బ్యాింంగ్‌రంగంలో పునరేకీకరణకు కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ముందుకువచ్చింది. భారతీయ స్టేట్‌బ్యాంకు అనుబంధ బ్యాంకులను విలీనంచేసిన ప్రక్రియ తరహాలోనే దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మరికొన్నింటిని విలీనంచేసేందుకు సిద్ధం అవుతోంది. చిన్నబ్యాంకులు దేనాబ్యాంకు, విజయా బ్యాంకు, యూకోబ్యాంకు, యూనియన్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ఇండియా, కెనరా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలను విలీనం చేసేందు కు ఆర్థికశాఖ సిద్ధం అవుతోంది. మార్కెట్లపరంగా ఈ విలీనం సమాచారానికి ఆశించిన స్థాయిలో స్పం దన రాలేదనే తెలుస్తోంది. కెనరాబ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు ఒకటిశాతం చొప్పున ఎన్‌ఎస్‌ఇ లో క్షీణించాయి. ఇంట్రాడే డీల్స్‌లో రూ.353, రూ.171వద్ద నడిచాయి. ఇతరత్రాచూస్తే ఇతర చిన్న బ్యాంకులు 1-3శాతంమధ్యలోనే దిగువన ట్రేడింగ్‌ ముగించాయి. నిఫ్టీ బ్యాంక్‌ సూచి నిఫ్టీ 50సూచీలు 0.5శాతం, 0.3శాతం చొప్పున దిగజారాయి. ప్రస్తుతం పెరిగిపోయిన రానిబాకీలు, మొండి బకాయిల దృష్ట్యా ప్రభుత్వరంగ బ్యాంకు ల్లో ఎక్కువ కొనుగోళ్లు చేయవద్దని కూడా ఇన్వెస్టర్లకు బ్రోకింగ్‌ సంస్థలు సూచిస్తున్నాయి. విలీనానికి సంబం ధించి మరికొంత స్పష్టత వచ్చేంత వరకూ వీటిజోలికి వెళ్లకపోవడమే మంచిదని చెపుతున్నారు. ఆర్‌బిఐకి విస్తృతఅధికారాలు ఇవ్వడం ద్వారా ఎన్‌పిఎలకు పరిష్కారం లభి స్తుందని అంచ నా వేస్తున్నారు. గడచిన కొన్ని నెలలుగా ఈ వార్తలతోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు పెరిగాయి. ప్రస్తుత స్థాయిని పరిశీలిస్తే ఈస్టాక్స్‌లో కొనుగోళ్లు శ్రేయస్క రంకాదని బ్రోకర్లు హెచ్చరిస్తున్నారు. బిజినెస్‌ వాతా వరణం సజావుగాలేదని బ్యాంకుల్లో రుణాలవృద్ధి కూడా ఆశించిన స్థాయిలో లేదని ఎస్‌ఎంసి గ్లోబల్‌ ఉపా ధ్యక్షుడు సౌరభ్‌జైన్‌ అన్నారు. ఎన్‌పిఎలకు పరిష్కారం హడావుడిగా జర గదని ప్రభుత్వం ఈబ్యాంకు లను వాటి సామర్ధ్యం ఆధారంగా ఎంచు కుని చిన్నసైజు బ్యాంకులను విలీనం చేయా లని చూస్తోంద న్నారు.ఈ ఎంపిక చేసిన బ్యాంకు ల ఆస్తిఅప్పుల పట్టీలుఇప్పటికే దిగ జారాయి. ఈ బ్యాం కుల్లోఇప్పటికే పెట్టుబడు లు పెట్టిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థలు కూడా ఇదే సూచిస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాం కులకంటే ప్రైవేటురంగ బ్యాంకులు శ్రేయస్కరమని వారు చెపుతున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో చిన్న బ్యాంకులు విలీనం అయితే మరింతగా బ్యాంకు ఆస్తిఅప్పుల పట్టీ దిగజారుతుందని అంచనా. అందువల్ల పిఎస్‌యు బ్యాంకుల షేర్లు కొనుగోలు చేయమని సిఫారసు చేయలేమని ఏంజెల్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ ఈక్విటీ రీసెర్చి హెడ్‌ సిద్ధార్ధ్‌ పురోహిత్‌ వెల్లడించారు. కెనరాబ్యాంకుపరంగా కొంత ఆశాజనకమేనని ఎన్‌పిఎలపరంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కంటే తక్కువగానే ఉన్నాయని బ్రోకింగ్‌సంస్తలు చెపుతు న్నాయి. ఏదిఏమైనా ఎన్‌పిఎల సమస్యలు సమూ లంగా పరిష్కారం అయితేనే ప్రభుత్వరంగ బ్యాంకుల స్టాక్‌ కొనుగోలు మంచిదని బ్రోకింగ్‌ సంస్థలు సూచిస్తున్నాయి. ఇక రెండోవిడత విలీనం పరంగా కెనరాబ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలలో ఎక్కువ బ్యాంకులు విలీనాలు కావచ్చని ప్రభుత్వ పరంగా సంకేతాలు అందుతున్నాయి. ప్రభుత్వం రెండోవిడత విలీనాల పరంగా ఆరేడు బ్యాంకులతో విలీనాలపై సంప్ర దింపులు జరుపుతోంది. వచ్చే రెండు నెలల్లోనే ఈ విలీనం ప్రక్రియ తెరపైకి రావ చ్చన్న వార్తలతో బ్యాంకింగ్‌షేర్లు ఊపందుకుంటా యని భావించిన ఇన్వెస్టర్లకు నిరాశే ఎదురయింది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ముంబయిలో ఇమ్రాన్ ఖాన్ చిత్రపటంపై పరదా క్రికెట్, రాజకీయాలు వేరు.. మేము ఎప్పుడూ వాటిని కలపదలుచుకోలేదు. కానీ.. తాజాగా పుల్వామా దాడి దేశ ప్రజల్ని కలచివేస్తోంది. అందుకే.. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని తాము ఇమ్రాన్ ఖాన్‌ చిత్రపటంపై పరదా కప్పి నిరసన తెలియజేస్తున్నాం - సీసీఐ అధ్యక్షుడు ప్రేమాల్ ఉడాని Samayam Telugu | Updated: Feb 17, 2019, 03:21PM IST హైలైట్స్ అమర జవాన్ల పిల్లల చదువు బాధ్యత తీసుకున్న సెహ్వాగ్ నెల జీతం విరాళంగా ప్రకటించిన బాక్సర్ విజేందర్ సింగ్ ముంబయిలోని క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా గ్యాలరీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ చిత్రపటంపై పరదా దేశ ప్రజల మనోభావాలే తమకి ముఖ్యమని సీసీఐ అధ్యక్షుడు ప్రకటన పుల్వామా ఉగ్ర దాడిని దేశం మొత్తం ముక్త కంఠంతో నిరసిస్తోంది. దాడిలో అసువులు బాసిన వీర జవాన్ల కుటుంబాలకి మద్దతుగా నిలుస్తూ.. వారికి ఆర్థిక సాయం చేసేందుకు సెలబ్రిటీలు, కార్పోరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పటికే వీర జవాన్ల పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించగా.. హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న బాక్సర్ విజేందర్ సింగ్ తన నెల జీతం మొత్తాన్ని విరాళంగా ప్రకటించాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV నవంబర్ 6న భయపెడతానంటున్న 'త్రిపుర' ఈ మధ్యకాలంలో 'టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ'గా మారిన చిత్రాల్లో 'త్రిపుర' ఒకటి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన త్రిపుర రిలీజ్‌కి రెడీ అయ్యింది. | Updated: Oct 28, 2015, 07:30PM IST ఈ మధ్యకాలంలో 'టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ'గా నిలిచిన చిత్రాల్లో 'త్రిపుర' ఒకటి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందింది. తమిళ చిత్రం టైటిల్ 'తిరుపుర సుందరి'. ఈ చిత్రం ఆరంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. 'స్వామి రారా', 'కార్తికేయ' వంటి విజయాల తర్వాత స్వాతి నటించిన చిత్రం కావడం, థ్రిల్లర్ కథాంశం కావడం, 'గీతాంజలి' వంటి సక్సెస్‌ఫుల్ థ్రిల్లర్ మూవీ తర్వాత రాజ్ కిరణ్ దర్శకత్వం వహించిన చిత్రం కావడం వంటివన్నీ ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ముఖ్య కారణమయ్యాయి. స్వాతి టైటిల్ రోల్‌లో జె. రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెల 29న ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ - " ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. రాజ్ కిరణ్ అద్భుతమైన కథ రాశారు. ఆ కథను అంతే అద్భుతంగా తెరకెక్కించారు. కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ అందించిన స్క్రీన్ ప్లే ఓ హైలైట్. కథ, కథనం, స్వాతి నటన, రాజ్ కిరణ్ టేకింగ్, ఫైట్ మాస్టర్ విజయన్ సమకూర్చిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. కమ్రాన్ స్వరపరచిన పాటలు అదనపు ఆకర్షణ అవుతాయి. కథ డిమాండ్ మేరకు రాజీపడకుండా ఖర్చు పెట్టాం'' అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ - "బలమైన కథతో ఈ చిత్రం చేశాం. త్రిపుర ఏం చేస్తుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. సప్తగిరి చేసిన కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్. పిల్లలు, పెద్దలు చూసే విధంగా ఉండే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది'' అని చెప్పారు. నవీన్ చంద్ర , శ్రీమాన్, పూజ, సప్తగిరి, రావు రమేశ్, షకలక శంకర్ , ధన్‌రాజ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్, కథ-దర్శకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు.
0business
sandhya 196 Views 1 lakh crore dividend , PSB's , rbi RBI ముంబయి: ఆర్ధికలోటు కట్టడికి ప్రభుత్వం కొత్తగా రిజర్వుబ్యాంకు,ప్రభుత్వరంగ బ్యాంకులనుంచి 1.06 లక్షలకోట్ల డివిడెండ్‌ను కోరుతోంది. బ్యాంకులనుంచి డివిడెండ్‌, ఆర్‌బిఐనుంచి మిగులు నిధులరూపంలో ఈ ఏడాది ప్రభుత్వానికి బదలాయించాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగసంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో కొంతమేరార్ధికలోటును 3.4శాతంనుంచి 3.3శాతానికి తీసుకురాగలమన్న ధీమా వ్యక్తం అవుతున్నది. తాత్కాలిక బడ్జెట్‌లో ఆర్ధికలోటును 3.4శాతంగాచూపితే ఇపుడు పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 3.3శాతానికి కుదించారు. ఇందుకోసం ఇపుడు విధిగా బ్యాంకులు, ఇతర ఆర్ధికసంస్థలనుంచి డివిడెండ్‌రూపంలో 1,06,041.56 కోట్ల రూపాయలు కోరుతున్నది. 2018-19 బడ్జెట్‌ అంచనాలు 54,817.25 కోట్లతో పోలిస్తే రెట్టింపుస్థాయిలో ఉంది. గత ఏడాది సవరించిన అంచనాల్లో 74,140.37కోట్ల రూపాయలు డివిడెండ్‌, మిగులు రూపంలోప్రభుత్వం రాబట్టాలని చూసింది. ఆ తర్వాత ఆర్ధికశాఖ కార్యదర్శి సుభాష్‌చంద్రగార్గ్‌ మాట్లాడుతూ ఆర్‌బిఐ 90వేల కోట్లు డివిడెండ్‌ రూపంలో ఈ ఆర్ధికసంవత్సరంలో పెంచుతామని అంచనా. రిజర్వుబ్యాంకునుంచి గతంలో ఎన్నడూలేనంత భారీ మొత్తంలో ఈ డివిడెండ్‌వచ్చింది. ఫిబ్రవరిలో ఆర్‌బిఐ తాత్కాలిక డివిడెండ్‌గా 28 వేల కోట్లు కేంద్రానికి బదలాయించాలనినిర్ణయించింది. ప్రతి ఏటా కూడా ఆర్‌బిఐ ప్రభుత్వానికి డివిడెండ్లను చెల్లిస్తూ వస్తోంది. నోట్లముద్రణ, ఇతర పెట్టుబడులపరంగా వచ్చిన లాభాల్లో కొంతమొత్తం డివిడెండ్‌రూపంలో ప్రభుత్వానికి అందిస్తుంది. సహజంగా ఆగస్టునెలలో వీటిని చెల్లిస్తారు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
1entertainment
Suresh 86 Views తొలి వన్డేలో కుప్పకూలిన శ్రీలంక దంబుల్లా: నాలుగువన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఆదివారం రాణ్‌గిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడి యంలో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక మహిళలు కుప్పకూలిపోయారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక మహిళలు కనీసం పోరాడకుండానే క్యూకట్టారు.ఓపెనర్‌ జయం గని,మరో ఓపెనర్‌ వీరక్కోడి పరుగులేమి చేయకుండానే నిష్క్రమించగా,ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన కుమారి హామీ తొలి బంతికి పెవిలియన్‌ చేరింది.ఆపై మరాంగిక,హన్సికలు డకౌట్లుగా వెనుదిరుగగా, ఇమాల్కా మెండిస్‌ పరుగు మాత్రమే చేసి నిష్క్రమించింది.ఇనోషి ప్రియదర్శిని కూడా డకౌట్‌గా పెవిలియన్‌ బాట పట్టింది.దీంతో శ్రీలంక ఆరు వికెట్లను డకౌట్ల రూపంలో నష్టపోయింది.కాగా మధ్యలో రణవీర 32 పరుగులు నాటౌట్‌,కౌశల్య 14 పరుగులతో ఫర్వాలేదనిపించడంతో శ్రీలంక 24.5 ఓవర్లలో 76 పరు గుల అత్యల్ప స్కోరుకే పరిమితమైంది.ఆస్ట్రేలియా బౌలర్లలో ఫెర్లింగ్‌,బీమ్స్‌ ఒక్కొక్కరు మూడు వికె ట్లతో సత్తా చాటగా, ష్కట్‌, ఓస్‌ టోర్నీలకు ఒక్కొక్కరికి రెండు వికెట్లు లభిం చాయి.అనంతరం బ్యా టింగ్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా 15.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
2sports
READ ALSO: దీపిక పదుకోన్ స్కూల్ రిపోర్ట్ కార్డ్ చూశారా.. ఎన్ని రిమార్కులో ‘ప్రపంచంలోనే అందమైన యువతి ఐశ్వర్య రాయ్ . అలాంటిది ఆమెకు ఈ చెత్త డ్రెస్ వేసి అసహ్యంగా తయారుచేస్తారా? ఐష్ డ్రెస్‌ను డిజైన్ చేసిన వ్యక్తిని వెంటనే తొలగించండి. వాడికి హాలోవీన్ పండగ వచ్చే నెలలో అని చెప్పండి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఐష్ ఫొటోను పోస్ట్ చేస్తూ కామెంట్ చేశాడు. ఐష్ వేసుకున్న డ్రెస్‌ని పారిస్‌కి చెందిన డిజైనర్ జియామ్ బటిస్టా వల్లీ డిజైన్ చేశారు. డ్రెస్ బాగానే ఉంది కానీ ఐష్ వేసుకున్న మేకప్ మాత్రం కాస్త ఓవర్ అయింది. కళ్లకు మల్టీకలర్డ్ రంగులు పూసుకున్నారు. చెప్పులు కూడా చూడటానికి ఫన్నీగా ఉన్నాయి. అయితే ఆ డిజైనర్ చేసిన కామెంట్‌పై ఐష్ ఇంకా స్పందించలేదు. అయినా ఐష్ ఇలాంటి కామెంట్స్‌ని అస్సలు పట్టించుకోరు. గతంలో ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్లినప్పుడు పర్పుల్ కలర్ లిప్‌స్టిక్ వేసుకున్నారు. దాంతో ఆమె లుక్ తెగ వైరల్ అయింది. చాలా మంది అభిమానులకు ఐష్ అలాంటి లిప్‌స్టిక్ వేసుకోవడం నచ్చలేదు. తనపై అన్ని కామెంట్స్ వచ్చినా కూడా తాను పట్టించుకోనని ఐష్ తెలిపారు. ప్రస్తుతం ఐష్ వెళ్లిన ఫ్యాషన్ షోకు ఎప్పటిలాగే తన కుమార్తె ఆరాధ్యను కూడా తీసుకువెళ్లారు. READ ALSO: ‘14 సినిమాలు ఫ్లాప్ అయ్యాయ్. నా కెరీర్ అయిపోయిందనుకున్నా’ ఇక ఐష్ వర్క్ విషయానికొస్తే చివరగా ఆమె హిందీలో ‘ఫ్యాన్నే ఖాన్’ సినిమాలో నటించారు. అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఐష్ ఫేమస్ సింగర్ పాత్రను పోషించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఆ తర్వాత కొంతకాలం సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య.. ఇటీవల తన గురూజీ అయిన మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ అనే తమిళ సినిమాకు సంతకం చేశారు. ఇందులో ఐష్ చోళా మహారాజు భార్య పాత్రలో నటించనున్నారు. ఆమె విలన్‌గా డబుల్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తర్వాత ఐష్, మణిరత్నం కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV అర్ధశతకం బాదిన ధావన్ ఔట్ పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధశతకం సాధించిన అనంతరం TNN | Updated: Oct 25, 2017, 08:01PM IST పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధశతకం సాధించిన అనంతరం ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 30వ ఓవర్ వేసిన మిల్నే బౌలింగ్‌లో బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించిన ధావన్ (68: 84 బంతుల్లో 5x4, 2x6) ఫీల్డర్ రాస్ టేలర్‌కి చిక్కాడు. దీంతో 64 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఓపెనర్ రోహిత్ శర్మ (7) ఆదిలోనే ఔటైనా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (29)తో కలిసి శిఖర్ ధావన్ జట్టు స్కోరు బోర్డుని నడిపించాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌లో బంతిని ప్లిక్ చేసేందుకు ప్రయత్నిస్తూ విరాట్ కోహ్లి కూడా పెవిలియన్ చేరిపోయాడు. అనంతరం వచ్చిన దినేశ్ కార్తీక్‌తో కలిసి మూడో వికెట్‌కి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ధావన్ అర్ధశతకం సాధించడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. ధావన్ ఔటయ్యే సమయానికి భారత్ 29.2 ఓవర్లలో 145/3తో ఉంది. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 230 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
2sports
విదేశీ ఏజెంట్లుగా భారత్‌ ఐటి కంపెనీలు -ఇన్ఫోసిన్‌ నారాయణమూర్తి ఆవేదన హైదరాబాద్‌: భారతీయ ఐటి కంపెనీలు రానురాను విదేశీ కంపెనీలకు ఏజెంట్లుగా మారుతున్నాయని ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ కంపెనీలో అంతర్జాతీయ కంపెనీలుగా వ్యవహరించటం లేదని, విదేశీ నియామకాలోల ఆ స్థాయి కన్పించటం లేదన్నారు. హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా యాన విలేకరులతో మాట్లాడారు.. భారతీయ కంపెనీలు కేవలం ఏజంట్లుగా వ్యవహరిస్తూ తమ ఉద్యోగులకు విసా గ్యారెంటీ, గ్రీన్‌కార్డు గ్యారంటీ వంటివి ఇచ్చి కేవలం ఏజెంట్‌ విధులే నిర్వహిస్తున్నాయన్నారు. కేవలం ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్లుగా మాత్రమేగా భారత్‌ ఐటి కంపెనీలు పనిచేస్తున్నాయని చెప్పగలనని పేర్కొన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో కీలక ప్రసంగం చేసేందుకు వచ్చిన నారాయణమూర్తి గవర్నింగ్‌ బోర్డు సభ్యునిగా కూడ వ్యవహరిస్తున్నారు.
1entertainment
సత్తా ఉన్న జట్టు టీమిండియా షేన్‌వాట్సన్‌ కోల్‌కతా : టెస్టుల్లో,వన్డేల్లో ఎలా ఉన్న టి20లో మాత్రం టీమిండియా సత్తా ఉన్న జట్టు అని షేన్‌వాట్సన్‌ పేర్కొన్నాడు.కాగా జస్ప్రీత్‌ బూమ్రా భారత్‌ జట్టుకు దొరికిన మంచి బౌలర్‌గా కితాబిచ్చాడు. టి20 ప్రపంచ కప్‌కు సమయం ఆసన్నమవుతున్న క్రమంలో ఇటీవల తమ దేశంలో పర్యటించిన భారత జట్టు ప్రదర్శన ఆస్ట్రేలియా జట్టు టి20లో బెంబేలెత్తిపోయింది. వరుసగా నాలుగు వన్డేల్లో గెలిచిన ఆసీస్‌ జట్టు ఆ తరువాత టి20లో చతికిలపడింది.కాగా అయిదు వన్డేల సిరీస్‌లో చివరి వన్డేలో జూలు విదిల్చిన ధోనీ సేన ఆ తరువాత జరిగిన మూడు టి20లో ఆసీస్‌ను వైట్‌ వాష్‌ చేసింది. చివరి టి20లో ఆసీస్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగిన వాట్సన్‌ ఏకంగా సెంచరీ చేసిన ఆ జట్టు టీమిండియా చేతిలో ఓడిపోయింది.కాగా ఈ నేపథ్యంలో షేన్‌ వాట్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20ల్లో భారత్‌ ఓడించడం కష్టమేనన్నాడు.కాగా రానున్న టి20 ప్రపంచ కప్‌ ఫేవరేట్‌ భారత జట్టుగా పేర్కొన్నాడు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ​ ఓడారు సరే.. పోరాట పటిమ ఎక్కడ..? భారత్‌పై తొలి టీ20 మ్యాచ్‌లో ఓడినదానికంటే.. ఓడిన విధానం తనని ఎక్కువగా బాధిస్తోందని శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ ఆవేదన వ్యక్తం TNN | Updated: Dec 21, 2017, 02:28PM IST ​ ఓడారు సరే.. పోరాట పటిమ ఎక్కడ..? భారత్‌పై తొలి టీ20 మ్యాచ్‌లో ఓడినదానికంటే.. ఓడిన విధానం తనని ఎక్కువగా బాధిస్తోందని శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ ఆవేదన వ్యక్తం చేశాడు. కటక్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన శ్రీలంక 16 ఓవర్లలోనే 87 పరుగులకి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను చేజార్చుకున్న లంక.. కనీసం టీ20ల్లోనైనా మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఆశించిన తనకి నిరాశే ఎదురైందని ఈ ఓపెనర్ వివరించాడు.
2sports
నేనే చెప్దామనుకున్నా.. కానీ మీడియా నన్ను కొట్టేసింది-నాగార్జున Highlights నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో కొత్త మూవీ గతంలో శివ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ,నాగ్ కాంబో తిరిగి అంతకుమమించిన అద్భుతమైన చిత్రాన్నిస్తామంటున్న వర్మ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, మన్మథుడు నాగార్జున కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివ సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఈ కాంబినేషన్ 28 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపారు. ఈ ఇద్దరూ గతంలో మాదిరిగానే మళ్లీ టాలీవుడ్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు. అవును. ఈ సెన్షేషనల్ కాంబోలో ఇన్నేళ్లకు మళ్లీ ఓ మూవీ తెరకెక్కబోతోంది.   నవంబర్ 20 తేదీన అన్నపూర్ణ స్టూడియోలో శివ షూటింగ్ ప్రారంభమైన చోటే.. వర్మ, నాగ్ ల చిత్రం ప్రారంభం కానున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాను ఉద్దేశించి నాగార్జున ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పోలీస్ స్టోరీతో దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించబోయే చిత్రంలో నటించనున్నాననే విషయం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అయితే నేను స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాలనుకొన్నాను. కానీ ఈ విషయంలో మీడియా నన్ను కొట్టేసింది. అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.   శివ సినిమా సమయంలో అంతా షాక్ అయ్యారు. 1988లో రాంగోపాల్ వర్మ తీసే సినిమాలో నటించనున్నారనే వార్తకు... ఇందేంటీ ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకొన్నాడు అని అందరూ అనుకొన్నారు. అయితే వారందరికీ ఆర్జీవీ షాకిచ్చాడు. ఇప్పుడు 2017లో కొందరు హ్యాపీగా మరికొందరు షాక్‌లో ఉన్నారు. రాము మళ్లీ విజృంభిస్తారు. అనే ఫీలింగ్‌తో నేను ఉన్నాను అని నాగార్జున మరో ట్వీట్ చేశారు.   నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఓ ప్రత్యేకత కూడా సంతరించుకొన్నది. 1988లో రాంగోపాల్ వర్మ తండ్రి ముహుర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. 2017లో వచ్చే ఈ చిత్రానికి కూడా ఈ నెల 16న ఓపెనింగ్‌ షాట్‌కు క్లాప్ కొట్టనుండటం విశేషం.   25 ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ సినిమా తీస్తున్నానని చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉంది. శివ చిత్రానికి సీక్వెల్ అని మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఈ చిత్రం శివ పాత్రకుగానీ, కథకు గానీ సంబంధం లేదు అని ఫేస్‌బుక్‌లో వర్మ పోస్ట్ చేశారు. నాగార్జునతో తీయబోయే సినిమా చాలా కొత్తరకమైన కథ. నాగార్జున ముందెన్నడూ నటించని పాత్ర. మీరు అలాంటి పాత్రలో నాగ్‌ను కూడా చూసి ఉండరు. నాకు శివతో దర్శకుడిగా బ్రేక్ ఇచ్చిన నాగార్జునతోపాటు శివను ఆదరించిన ప్రేక్షకుల అంచనాలకు సైతం మించి మా సినిమా ఉంటుందన్నారు వర్మ. వచ్చే ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూపై త్వరలో నిర్ణయిస్తామన్నారు. త్వరలోనే వారి వివరాలను వెల్లడిస్తాను అని వర్మ తెలిపారు. Last Updated 25, Mar 2018, 11:37 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV విజయ్ దేవరకొండకు ఇది స్పెషల్ బర్త్ డే! ఇతడు గత బర్త్ డే జరుపుకున్నప్పుడు ఎవరికీ పెద్దగా పట్టలేదు. కానీ ఇది మాత్రం విజయ్ దేవరకొండకు చాలా స్పెషల్ బర్త్ డే. Samayam Telugu | Updated: May 9, 2018, 07:43AM IST ఇతడు గత బర్త్ డే జరుపుకున్నప్పుడు ఎవరికీ పెద్దగా పట్టలేదు. కానీ ఇది మాత్రం విజయ్ దేవరకొండకు చాలా స్పెషల్ బర్త్ డే. గత ఏడాది ఆగస్టులో విడుదల అయిన ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ జాతకం మారిపోయింది. టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు చేతినిండా అవకాశాలు. క్రేజీ ప్రాజెక్టులు. బహుభాష సినిమాలు. ఇది విజయ్‌కి ఉన్న క్రేజ్ ఇప్పుడు. ఇలా హ్యాపీ హ్యాపీగా తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు ఈ హీరో. ఈ సారి మే 9 విజయ్‌కి చాలా ప్రత్యేకం. అర్జున్ రెడ్డి తర్వాత ఇతడు సైన్ చేసిన సినిమాల్లో ఒకటైన ‘మహానటి’ ఈ రోజు విడుదల అయ్యింది. ఇలాంటి సినిమాలో నటించడం ఒక రకంగా ఆనందకరం అయితే, అది తన పుట్టిన రోజు నాడు విడుదల కావడం ఈ హీరోకి రెట్టింపు ఆనందాన్ని ఇస్తోంది.
0business
వెయ్యికోట్లు రీఫండ్‌ చెల్లించాలని ఆదేశం vodafone idea ముంబయి: కార్పొరేట్‌చరిత్రంలో ఒక సంస్థకు ఐటిశాఖ వెయ్యికోట్లు రీఫండ్‌ చేయాలని ఉత్తర్వులు రావడం ఇదే ప్రథమం కావచ్చు. బాంబే హైకోర్టు వొడాఫోన్‌ ఐడియా సంస్థకు వెయ్యికోట్లు రీఫండ్‌వెంటనే చెల్లించాలని ఉత్తర్వులు జారీచేయడం కార్పొరేట్‌చరిత్రలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు ఆదాయపు పన్నును సుమారు 1000 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. రెండువేరువేరుకేసులను విచారించిన కోర్టు పన్నుల శాఖ ముందు 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను 788కోట్లు చెల్లించాలని, తర్వాత 2015-16కు సంబంధించి 224 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. 2017-18 అసెస్‌మెంట్‌ సంవ్సరానికి సంబంధించి కంపెనీ 6600 కోట్ల నష్టాలు చవిచూసింది. అంతకుముందు సంవత్సరంలో కంపెనీ 286 కోట్లు రాబడులుగా సూచించింది. అయితే ఐటిశాఖ పూర్తిగా విచారణజరిపి రీఫండ్‌చెల్లించాల్సి ఉండటంతో సాంకేతిక లోపాలతో ఇప్పటివరకూ చెల్లించలేదు. అంతకుముందు సంవత్సంలో సానుకూల ఆదాయం ఉందని తర్వాత సంవత్సరంలోవచ్చిననష్టాన్ని పరిగణనలోనికితీసుకోకపోవడం సాంకేతికలోపంగా భావించలేమని కోర్టు వెల్లడించింది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
Jewellery Market వారాంతంలో వెనకడుగు ముంబై, జనవరి 8: విదేశీ మార్కెట్లలో పసిడిధరలు వారాంతంలో వెనకడుగు వేసాయి. అమెరికాలో వేతనాలు జోరందుకున్న గణాం కాలతో పసిడి మార్కెట్‌లో అమ్మకాలు పెరిగాయి. దీనితో న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ బంగారం అంటే 31.1 గ్రాముల ధరలు ఫిబ్రవరి డెలివరీకి సంబంధించినవి 0.7శాతం అంటే ఎనిమిది డాలర్లు తగ్గి 1173 డాలర్లవద్ద స్థిరపడింది. నెలరోజుల గరిష్టం నుంచి కొంతమేర తగ్గింది. డిసెంబరునెలలో ఉపాధి కల్పన కొంత మందిగించినా గడచిన ఎనిమిదేళ్లలోనే అత్యధిక స్థాయి వేతనాలు వృద్ధి నమోదయింది. ఫెడ్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపు పాలసీకి దోహదం చేస్తుందన్న అంచనాలు పెరిగాయి. దీనితో బంగారం అమ్మకాలు తలెత్తాయని నిపుణుల అంచనా. డిసెంబరునెలలో 1.56లక్షల వ్యవసాయేతర ఉద్యోగాలు లభిం చడంతో నిరుద్యోగం 4.7శాతానికి చేరింది. నవంబరులో 4.6 శాతంగా నమోదయింది. 1.83లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించి నట్లు ఆర్థికవేత్తల అంచనరా. వెండి కూడా ఔన్స్‌ ఒక్కింటికి 0.7శాతం క్షీణించి 16.51డాలర్లుగా ముగిసింది. ఇక అమెరికా కొత్త అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత రెండునెలల్లోనే డాలర్‌బలం పుంజుకుంది. ట్రెజరీ రాబడులుకూడా 2.7శాతానికి పెరిగాయి. పన్నుల్లో కోతలు, ఇన్‌ఫ్రా, వినియోగం వంటి రంగాలపై వ్యయాలు ట్రంప్‌ప్రణాళికలు ఆర్థికవ్యవస్థ వృద్ధికి సహకరించగలవన్న అంచనాలున్నాయి. దీనితో ధరలు పెకరిగే అవకాశం ఉందన్న అంచనాలతో ఫెడ్‌రిజర్వు ఏడాది తర్వాత డిసెంబరులో మళ్లీ వడ్డీరేటు పెంచుతుందని అంచనా. మధ్యలో పసిడిధరలు 11నెలల కనిష్టమైన 1124 డాలర్లను తాకింది. ఆకర్ష ణీయ స్థాయికి చేరిన పిడిలో ఆపై కొనుగోళ్లు జోరందుకోవడంతో కోలుకుంటూ వచ్చాయి. గత వారం 1180 డాలర్లను అధిగమిం చడం ద్వారా నెలరోజుల గరిష్టానికి చేరిన విషయం విదితమే. కాగా 6తో ముగిసిన గతవారంలో పసిడి రెండుశాతం పుంజుకుం ది. రెండునెలల్లోనే అత్యధిక లాభాలు నమోదుచేసింది. గతంలో 2016 డిసెంబరు ఐదున పసిడి ఔన్స్‌ ఒక్కింటికి 1185డాలర్లుగా నడిచింది. ఇక దేశీయ మార్కెట్లలోకూడా ఎంసిఎక్స్‌లో బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ పదిగ్రాములు 61రూపాయలు తగ్గి 27,887 కు చేరగా వెండి మార్చి ఫ్యూచర్స్‌ కెజి 106 రూపాయలు క్షీణించి 40,342వద్ద నిలిచింది. ఇకస్పాట్‌ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల పసిడిధర ఢిల్లీలో నామమాత్రంగా తగ్గి 28,710వద్ద నిలిచింది. వెండికిలో 500పతనమై కిలో 40,100వద్ద ముగి సాయి. విదేశీమార్కెట్లలో ధరలు పుంజుకోవడంతోగడచిన మూడు రోజుల్లో పసిడి 10గ్రాములు 430రూపాయల వరకూ పెరిగింది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కోహ్లీతో సచిన్ ‘100 శతకాల’ రికార్డ్‌కీ గండమే..! విరాట్ కోహ్లీ నిలకడ అమోఘం. అతను ఇలానే ఫిట్‌నెస్‌, ఫామ్‌ని కొనసాగించగలిగితే.. సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డ్‌ని కూడా బ్రేక్ చేయగలడు -మహ్మద్ అజహరుద్దీన్ Samayam Telugu | Updated: Jan 16, 2019, 08:57AM IST కోహ్లీతో సచిన్ ‘100 శతకాల’ రికార్డ్‌కీ గండమే..! భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలానే నిలకడగా ఆడితే సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డ్‌ని కూడా బ్రేక్ చేస్తాడని మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (104: 112 బంతుల్లో 5x4, 2x6) సెంచరీ సాధించగా.. 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన విషయం తెలిసిందే. వన్డే కెరీర్‌లో విరాట్ కోహ్లీకి ఇది 39వ శతకంకాగా.. మొత్తంగా 25 టెస్టు శతకాలతో కలుపుకుని 64 శతకాలతో అత్యధిక సెంచరీల రికార్డ్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అతని కంటే ముందు వరుసలో సచిన్ టెండూల్కర్ 100 శతకాలు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ 71 శతకాలతో ఉన్నారు. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ కోహ్లీ శతకం సాధించిన విషయం తెలిసిందే. దీంతో.. ఆ గడ్డపై నెల వ్యవధిలోనే రెండు శతకాలు బాదినట్లైంది..! విరాట్ కోహ్లీ శతకం గురించి అజహరుద్దీన్ మాట్లాడుతూ ‘విరాట్ కోహ్లీ నిలకడ అమోఘం. అతను ఇలానే ఫిట్‌నెస్‌, ఫామ్‌ని కొనసాగించగలిగితే.. సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డ్‌ని కూడా బ్రేక్ చేయగలడు. అతను ఇప్పటికే చాలా మంది గొప్ప ఆటగాళ్ల రికార్డ్‌ను కనుమరుగు చేశాడు. కోహ్లీ శతకం సాధిస్తే..? భారత్ జట్టు ఓడిపోవడం చాలా అరుదు’ అని వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 14, Sep 2018, 3:42 PM IST Highlights పాండ్యా క్రికెట్ వదిలేసి వేరే కెరిర్ ఎంచుకోవాలని వెటకారంగా సలహాలు ఇస్తున్నారు.  టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు మరోసారి మండిపడుతున్నారు. ఇంగ్లండ్‌పై టీమిండియా టెస్టు సిరీస్‌ ఓడిపోవడానికి గల కారణాల్లో పాండ్యా ప్రధాన కారణమంటూ అతడిని అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో పాండ్యా షేర్ చేస్తున్న తన ఫోటోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. పాండ్యా క్రికెట్ వదిలేసి వేరే కెరిర్ ఎంచుకోవాలని వెటకారంగా సలహాలు ఇస్తున్నారు.  ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు అనంతరం లండన్‌ వీధుల్లో విహరిస్తూ దిగిన ఫోటో షేర్‌ చేయగా దానిపై నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌పై కూడా అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ‘ఇంగ్లండ్‌ పర్యటనలో చాలా పోరాడాం. ఈ సిరీస్‌ చాలా ఉపయోగపడింది. చాలా రోజుల తర్వాత ఇంటికి రావడం సంతోషంగా ఉంది. కానీ తక్కువ సమయంలోనే ఆసియా కప్‌ కోసం బయల్దేరాలి’అంటూ తన న్యూ లుక్‌తో దిగిన ఫోటో పోస్ట్‌ చేశాడు. దీనిపై ఆగ్రహించిన అభిమానులు ‘నువ్వు క్రికెట్‌ ఆడటానికి పనికిరావు, ర్యాపర్‌గా సెట్‌ అవుతావు.. ఆ ప్రయ​త్నం మొదలు పెట్టు’ అంటూ సలహాలు ఇచ్చారు. ‘పాండ్యా నువ్వు ఓ గ్యాంగ్‌ స్టర్‌లా ఉన్నావు ’ అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. పాండ్యాకు స్టైల్‌ మీద ఉన్న ప్యాషన్‌ క్రికెట్‌పై లేదని మరికొంత మంది ఎద్దేవా చేశారు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో పాండ్యా అట్టర్‌ఫ్లాఫ్‌ కావడంతోనే కోహ్లి సేన ఓడిపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. Last Updated 19, Sep 2018, 9:25 AM IST
2sports
ఆ "బూతు" పాత్రను అనుష్క అంగీకరిస్తుందా.. Highlights భాగమతి సక్సెస్ తో తన రేంజ్ నిరూపించిన అనుష్క అనుష్క తో బాల దర్శకత్వంలో జ్యోతిక నటించిన నాచియార్ రీమేక్  చేయాలని యోచన ఆ బూతు డైలాగులు అనుష్కతో చెప్పిస్తే అద్దిరిపోద్దని భావిస్తున్న మేకర్స్ బాహుబలి అనంతరం వచ్చిన ‘భాగమతి’ సూపర్ సక్సస్ తో అనుష్క తన రేంజ్ ని మరొకసారి నిరూపించుకుంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో అనుష్క తప్పించి మరెవ్వరు లేరు అన్నది మరోసారి ‘భాగమతి’ సక్సస్ తో నిరూపించింది. ఇప్పటికే అనుష్క పెళ్లి పై అనేక రూమర్లు వస్తూ ఉన్నా ఇంకా మరికొంత కాలం తాను సినిమాలలో నటిస్తాను అంటూ అనుష్క లీకులు ఇస్తోంది.     ఈ నేపథ్యంలో అనుష్క నటించబోయే మరో లేటెస్ట్ సినిమాకు సంబంధించిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమిళ దర్శకుడు బాల దర్శకత్వంలో ఒకనాటి హీరోయిన్ జ్యోతిక తిరిగి ‘నాచియార్’ అనే మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి ఒక తమిళ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ పేరు ఈమూవీ ట్రైలర్ విడుదలైన దగ్గర నుండి కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలు మొదలయ్యాయి.   దీనికి కారణం ఈమూవీలో జ్యోతిక ఈమూవీలోని మరో ప్రధాన పాత్ర అయిన ఒక దొంగను ఉద్దేశించి వాడిన ఐదు అక్షరాల బూతు పదం ఎటువంటి బీప్ సౌండ్ లేకుండా ఆ బూతు పదాన్ని జ్యోతిక చేత చెప్పించేయడంతో అనేక మంది అభ్యంతరాలు చెప్పడమే కాకుండా అనేక విమర్శలు కూడ వచ్చాయి. తమిళ దర్శకుడు బాల సినిమాలలో సహజత్వం కోసం సీన్స్ సంభాషణలు చాల పచ్చిగా బూతుతో ఉంటాయి.     ఈమూవీలో జ్యోతిక ఒక పోలీసు ఆఫీసర్ గా నటించింది. ఈసినిమా కమర్షియల్ గా పెద్ద సక్సస్ కాకపోయినా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈమూవీని తెలుగులో రీమేక్  చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ్యోతిక నటించిన పోలీసు పాత్రను పోషించడానికి అనుష్కను సంప్రదిస్తే ఈ పోలీసు పాత్ర పై అనుష్క తన మోజును పెంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జ్యోతికలా అనుష్క ఎటువంటి మొహమాటం లేకుండా ఆ ఐదు అక్షరాల బూతు డైలాగ్ ను ధైర్యంగా చెప్పడానికి అంగీకరిస్తుందో లేదో చూడాలి. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV 150 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ అంత‌ర్జాతీయ మార్కెట్ల బలహీనతల కారణంగా నీరసంగా ప్రారంభమైన మార్కెట్లు రోజు మొత్తం నష్టాలతోనే కదిలాయి. TNN & Agencies | Updated: Mar 15, 2018, 04:37PM IST అంత‌ర్జాతీయ మార్కెట్ల బలహీనతల కారణంగా నీరసంగా ప్రారంభమైన మార్కెట్లు రోజు మొత్తం నష్టాలతోనే కదిలాయి. అయితే మిడ్‌ సెషన్‌లో ఊపందుకున్న అమ్మకాలు చివరి అర్థగంటలో మరింత పెరగడంతో ఇంట్రాడే కనిష్టంవద్దే మార్కెట్లు ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 150 పాయింట్లు దిగ‌జారి 33,685 వద్ద నిలవగా.. నిఫ్టీ 51 పాయింట్లు క్షీణించి 10,360 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్ఈలో అన్ని రంగాలూ నష్టపోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ ఎన్ఎస్ఈలో ఏసియ‌న్ పెయింట్స్, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, కోల్ ఇండియా, బ‌జాజ్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు స్వ‌ల్పంగా లాభ‌ప‌డిన వాటిలో ఉండ‌గా, మ‌రో వైపు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్, యెస్ బ్యాంక్, రిల‌య‌న్స్, గెయిల్, ఐసీఐసీఐ బ్యాంకు త‌దిత‌ర షేర్లు న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి.
1entertainment
Suresh 144 Views గెలుపు ఓటములను పట్టించుకోను: డెల్‌ పాట్రో న్యూయార్క్‌్‌: ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌ పురుషుల టెన్నిస్‌లో వరల్డ్‌ నంబర్‌్‌ వన్‌ నొవాక్‌ జుకోవిచ్‌ను,స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ను ఓడించిన అర్జెంటీనా ఆటగాడు డెల్‌ పాట్రో తాజాగా జరుగుతున్న యుఎస్‌ ఓపెన్‌లో ప్రీ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు.పురుషుల సింగిల్స్‌లో భాగంగా మూడవ రౌండ్‌లో ప్టాఓ 7-6(7 3),6-2,6-3 తేడాతో స్పెయిన్‌ ఆటగాడు,పదకొండవ సీడ్‌ రోజర్‌ ఫెదర్రర్‌పై విజయం సాధించాడు. తన ప్రస్తుత ఫామ్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న పాట్రో తాను ఆడే క్రమంలో గెలిచానా?ఓడినా? అనే విషయాన్ని ఎప్పుడు లెక్కచేయనని,కేవలం తన సహజసిద్దమైన గేమ్‌ను ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నాడు.కాగా 2009 యుఎస్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన పెట్రో మరోసారి అదే రిపీట్‌ అయినా కావచ్చని వివరించాడు.గతంలో తాను ఆడిన ఫోర్‌ హ్యాండ్‌ షాట్లను మరోసారి ఆడితే మాత్రం యుఎస్‌ గ్రాండ్‌ స్లామ్‌ను రెండవసారి కైవసం చేసుకోవడం ఏ మాత్రం కష్టం కాదన్నాడు.గత ఏడు సంవత్సరాల క్రితం జరిగిన యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో రోజర్‌ ఫెదరర్‌ను ఓడించి సంచలన సృష్టించిన ఈ డేల్‌ పాట్రో తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌ స్లామ్‌ అందుకున్నాడు.ఆ తరువాత చాలా సార్లు మణికట్టు గాయం బారిన పడిన పాట్రో పెద్దగా ఆకట్టుకోలేదు.అయితే రియోలో రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు.కాగా ఈ నేపథ్యంలో యుఎస్‌ ఓపెన్‌లో పాట్రో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.
2sports
Hyderabad, First Published 1, Oct 2018, 9:36 AM IST Highlights టాలీవుడ్ ని పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. పెద్ద సినిమాలతో పాటు క్రేజ్ ఉన్న చిన్న సినిమాలకు కూడా ఈ పైరసీ బాధలు తప్పడం లేదు. దీనిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆకతాయిల ఆగడాలు మాత్రం ఆగడంలేదు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'గీత గోవిందం' సినిమా పైరసీ బారిన పడిన సంగతి తెలిసిందే.  టాలీవుడ్ ని పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. పెద్ద సినిమాలతో పాటు క్రేజ్ ఉన్న చిన్న సినిమాలకు కూడా ఈ పైరసీ బాధలు తప్పడం లేదు. దీనిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆకతాయిల ఆగడాలు మాత్రం ఆగడంలేదు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'గీత గోవిందం' సినిమా పైరసీ బారిన పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ నటించిన 'టాక్సీవాలా' కూడా పైరసీకి గురైనట్లుగా వార్తలు వచ్చాయి. తాజగా ఈ వార్తలు నిజమేనని తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో కొంతమంది ఆకతాయిలు మొబైల్ లో టాక్సీవాలా సినిమా చూస్తుండగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి వారికి సినిమా ఎక్కడ నుండి వచ్చింది..? ఎవరెవరికి ఈ సినిమా ఫార్వార్డ్ చేశారనే విషయాలు తెలుసుకుంటున్నారు. రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావల్సివుంది. కానీ గ్రాఫిక్స్ పనుల కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా మాళవిక నాయర్, ప్రియాంక జువాల్కర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.   Last Updated 1, Oct 2018, 9:36 AM IST
0business
Suresh 125 Views telnor రెండువేల స్టోర్లలో టెలినార్‌ ఇ-కెవైసి హైదరాబాద్‌, నవంబరు 3: టెలినార్‌ సంస్థ దేశవ్యాప్తంగా 2000 స్టోర్లలో ఇ-కెవైసిని ప్రారం భించింది. సిమ్‌ యాక్డివేషన్‌కోసం ఈ సౌకర్యం ప్రస్తుతం ఆరుసర్కిళ్లలో అమలుచేస్తున్నట్లు ఎపి తెలంగాణ హెడ్‌ శ్రీనాధ్‌ కొటియన్‌ వెల్లడిం చారు. ఇప్పటికే 700 స్టోర్లలో ఈసౌకర్యం అమ లవుతోందని, నవంబరు చివరినాటికి రెండువేల స్టోర్లలో ఇకెవైసి అమలుచేస్తామని ఆయన అన్నారు. కస్టమరు తన ఆధార్‌నంబరు సాయం తోనే సిమ్‌ను పొంది యాక్టివేట్‌ చేయించుకునే సదుపాయం అందుతున్నట్లు తెలిపారు. కేవలం కొద్దినిమిషాల్లోనే సిమ్‌ యాక్టివేట్‌ అయిపోతుంద న్నారు. కంపెనీ చీఫ్‌ మార్కెటింగ్‌ అధికారి ఉపాంగ దత్తా మాట్లాడుతూ ఇ-కెవైసి ద్వారా కొత్త డిజిటల్‌ప్రంపంచానికి కస్టమర్లను పరిచ యం చేసినట్లయిందన్నారు. త్వరలోనే టెలినార్‌ 10వేల పాయింట్‌ఆఫ్‌ సేల్స్‌తో ఇ-కెవైసి అమలు చేస్తుందని కస్టమర్లకు మరింతచేరువగా ఉండేం దుకు కృషిచేస్తుందని అన్నారు. కాగిత రహిత ఇ-కెవైసితోకేవలం ఆధార్‌ నంబరుసాయంతోనే పరి శీలన పూర్తిచేసి సిమ్‌ను యాక్టివేట్‌ చేస్తామన్నారు.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV చివరి టీ20లో కోహ్లి చేతికి టెస్టు ‘గద’ దక్షిణాఫ్రికాతో శనివారం రాత్రి జరగనున్న మూడో టీ20 మ్యాచ్ ముగియగానే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చేతికి టెస్టు గద TNN | Updated: Feb 24, 2018, 04:42PM IST చివరి టీ20లో కోహ్లి చేతికి టెస్టు ‘గద’ దక్షిణాఫ్రికాతో శనివారం రాత్రి జరగనున్న మూడో టీ20 మ్యాచ్ ముగియగానే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చేతికి టెస్టు గద రానుంది. ఏటా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం నిలిచిన జట్టు‌కి ఐసీసీ నజరానాతో పాటు టెస్టు గద ఇవ్వనున్న విషయం తెలిసిందే. తాజాగా ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు 121 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత దక్షిణాఫ్రికా (115), ఆస్ట్రేలియా (104), న్యూజిలాండ్ (100), ఇంగ్లాండ్ (99) జట్లు టాప్-5లో ఉన్నాయి. ఏప్రిల్ 3న కటాఫ్ డేట్ ఉండగా.. అప్పటిలోపు ఏ జట్టూ కూడా భారత్‌ని అధిగమించే అవకాశం లేకపోవడంతో టీమిండియాకే నజరానాతో పాటు గదని శనివారమే ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. గత ఏడాది కూడా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ గదని అందుకున్న విషయం తెలిసిందే.
2sports
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు Ganesh| Last Updated: గురువారం, 3 జులై 2014 (09:50 IST) రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో గురువారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.353 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.80గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.357, విశాఖపట్నంలో రూ.367, విజయవాడ రూ.349, చిత్తూరులో రూ.391, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.349 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.398 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.363 రూపాయలుగా పలుకుతోంది. సంబంధిత వార్తలు
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఫ్రెండ్ పెళ్లిలో విరాట్ కోహ్లీ స్టెప్పులు వరుస సిరీస్‌ల తర్వాత రెస్ట్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెకేషన్‌ ను ఎంజాయ్ చేస్తున్నాడు. స్నేహితుడి పెళ్లికి హాజరైన విరాట్... డ్యాన్స్‌ తో మరోసారి అదరగొట్టాడు. వేడుకలో అందర్ని పలకరిస్తూ ఫుల్ జోష్‌ లో కనిపించాడు. TNN | Updated: Mar 6, 2018, 08:20PM IST ఫ్రెండ్ పెళ్లిలో విరాట్ కోహ్లీ స్టెప్పులు వరుస సిరీస్ ల తర్వాత రెస్ట్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. స్నేహితుడి పెళ్లికి హాజరైన విరాట్... డ్యాన్స్ తో మరోసారి అదరగొట్టాడు. వేడుకలో అందర్ని పలకరిస్తూ ఫుల్ జోష్ లో కనిపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారాడు. తన ఫ్రెండ్ గగన్ గుజ్రాల్ పెళ్లి వేడుకకు వెళ్లి... స్టెప్పులేశాడు. బాలీవుడ్ పాటలకూ డ్యాన్స్ ఇరగదీశాడు. ముఖ్యంగా బంటీ ఔర్ బబ్లీ సినిమాలని కజరారే పాటకు విరాట్ వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారట. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వేడుకకు కోహ్లీ తన అత్తమామలతో కలిసి హాజరుకాగా... అనుష్క శర్మ షూటింగ్ల తో బిజీగా ఉండటంతో వెళ్లలేకపోయింది. A post shared by VirushkaUpdates (@virushkaupdates) on Mar 4, 2018 at 5:35am PST   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
naga chaitanya says yuddham with srikanth, sharanam with my family యుద్ధం శ్రీకాంత్‌తో.. శరణం నా ఫ్యామిలీతో..: నాగ చైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి డీసెంట్ హిట్ తరవాత అక్కినేని నాగచైతన్య చేసిన సినిమా ‘యుద్ధం శరణం’. TNN | Updated: Sep 7, 2017, 05:29PM IST ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి డీసెంట్ హిట్ తరవాత అక్కినేని నాగచైతన్య చేసిన సినిమా ‘యుద్ధం శరణం’. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తరవాత యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నాడు ఈ యంగ్ హీరో. దీనికి తగ్గట్టుగానే ప్రచారం చేస్తున్నారు. యుద్ధం శరణం టూర్ పేరుతో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలసి తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. కృష్ణ మరిముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హీరో నాగచైతన్యతో కాసిన్ని ముచ్చట్లు.. సినిమా ఎలా ఉండబోతుంది? మొదటిసారి థ్రిల్లర్ జోనర్‌లో నటిస్తున్నాను. అయితే కేవలం థ్రిల్లర్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ట్రాక్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే మాత్రం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. Recommended byColombia ఈ సినిమా ఎలా వర్కవుట్ అయింది? డైరెక్టర్ కృష్ణ నాకు మంచి స్నేహితుడు. కథ చెప్పగానే బాగా నచ్చింది. గత ఏడాదిగా ఈ సినిమాపై పని చేస్తూనే ఉన్నాం. పక్కా ప్రణాళిక వేసుకొని షూటింగ్ మొదలుపెట్టాం. 60 నుంచి 65 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రీప్రొడక్షన్ పనుల మీద ఎక్కువ సమయం కేటాయించాం. డైరెక్టర్ మీ ఫ్రెండ్ అని ఛాన్స్ ఇచ్చారా..? చాలా రోజులుగా నా ఫ్రెండ్‌తో కలిసి వర్క్ చేయాలనే డ్రీమ్ ఉంది. ఆ అనుభవం ఈ సినిమాతో వచ్చింది. కృష్ణ కూడా నలుగురైదుగురు దర్శకుల దగ్గర పని చేశాడు. రెండు, మూడు కథలు రాసుకున్నాడు. అవి రిజక్ట్ అయ్యాయి. కానీ ఈ కథకు అన్నీ సెట్ అయ్యాయి. సాయి కొర్రపాటి గారు బాగా ప్రోత్సహించారు. శ్రీకాంత్ రోల్ ఎలా ఉంటుంది? శ్రీకాంత్ గారు నెగెటివ్ రోల్‌లో నటించడానికి అంగీకరిస్తారని మొదట ఊహించలేదు. సినిమాకు ఆయన పాత్ర హైలైట్ అవుతుంది. నా పాత్రకు ఆయన మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం బాగా అనిపించింది. సినిమాను ఎక్కువగా రాత్రి పూట షూట్ చేసినట్లున్నారు? సినిమా మొత్తం ఒక రోజులో అయిపోతుంది. కథకు తగ్గట్లుగా ఎక్కువగా రాత్రి పూట షూట్ చేశాం. సహజంగా ఉండాలనే అలానే చేశాం. నేను సినిమా చూశాను. చాలా కొత్తగా అనిపించింది. ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ సినిమాలో డ్రోన్ అనే గాడ్జెట్ ఉపయోగించాం. సినిమాలో నేనొక డ్రోన్ మేకర్‌ని. ఆ డ్రోన్‌ను ఒక క్యారెక్టర్‌లా డిజైన్ చేశాం. సినిమా మొత్తం ఆ క్యారెక్టర్ నడుస్తుంటుంది. యూత్‌కు ఈ పాయింట్ బాగా కనెక్ట్ అవుతుంది. కార్తికేయతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? రాజమౌళి గారబ్బాయి కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశాడు. ఎవరికి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. టీంలో మొత్తం 30 ఏళ్లలోపు వాళ్లమే. యుద్ధం ఎవరితో..? శరణం ఎవరితో..? యుద్ధం శ్రీకాంత్ గారితో.. శరణం నా ఫ్యామిలీతో.. పెళ్లి సంగతులేంటి? అక్టోబర్ 6న గోవాలో పెళ్లి ప్లాన్ చేస్తున్నాం. ముందుగా 6న హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపి, 7న క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరపనున్నాం. తరవాత ప్రాజెక్ట్స్..? చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే సినిమా చేస్తున్నాను. సెప్టెంబర్ 20న తాతగారి పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టాలని భావిస్తున్నాం. అది పక్కా కమర్షియల్ సినిమా. ఆ సినిమాలో హీరో పాత్రకు ఎడమ చేయి కంట్రోల్‌లో ఉండదు. అది ఒక వ్యక్తిలా ఆలోచిస్తుంది. కుడి చేతితో సమానంగా ఎడమ చేతికి కూడా శక్తి ఉంటుంది. మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారని విన్నాం.. నిజమేనా? అవును.. మారుతి గారితో ఓ సినిమా కమిట్ అయ్యాను. ‘మహానుభావుడు’ విడుదలైన తరువాత దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదు.
0business
India need to include Ajinkya Rahane, KL Rahul in the playing XI: Kiran More స్కోర్లు చూడండి.. రహానెకి ఛాన్సివ్వండి దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం అజింక్య రహానెని తుది జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోర్ సూచించారు. TNN | Updated: Jan 11, 2018, 01:05PM IST దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం అజింక్య రహానెని తుది జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోర్ సూచించారు. శనివారం నుంచి సెంచూరియన్ వేదికగా రెండో టెస్టు జరగనుండగా.. గత సోమవారం ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. పేస్‌‌కి స్వర్గధామమైన కేప్‌టౌన్ పిచ్‌పై భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో ఆ సఫారీ పిచ్‌లపై అనుభవం ఉన్న రహానెకి తుది జట్టులో ఛాన్సిస్తే భారత్‌కి విజయావకాశాలు మెరుగవతాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ‘సెంచూరియన్ టెస్టులో అజింక్య రహానె , కేఎల్ రాహుల్‌కి తుది జట్టులో చోటిస్తే మేలు. ఐదుగురు లేదా ఆరుగురు బ్యాట్స్‌మెన్.. ఏ కాంబినేషన్‌తో భారత్‌ బరిలోకి దిగుతుందోననేది ఇప్పుడు ఆసక్తికరం. అయితే.. తొలి టెస్టు ఓటమి నేపథ్యంలో కచ్చితంగా బ్యాటింగ్‌ బలం పెంచుకోవడం ఇప్పుడు టీమిండియాకి అవసరం’ అని కిరణ్ వివరించారు. రహానె స్థానంలో రోహిత్‌ శర్మని తొలి టెస్టులో ఆడించగా.. అతను విఫలమయ్యాడు. 2013-14 దక్షిణాఫ్రికా పర్యటనలో రహానె ఆడిన రెండు టెస్టుల్లో 47, 15 (జొహనెస్ బర్గ్), 51 నాటౌట్, 96 (డర్బన్) సత్తా చాటాడు. అదే సిరీస్‌లో రోహిత్ శర్మ వరుసగా 14, 16... 0, 25తో ఫెయిల్ అయ్యాడు. అయినా.. తొలి టెస్టులో అతనికి అవకాశం ఇవ్వడం కోహ్లి పేలవ నిర్ణయమేనని విమర్శిస్తున్నారు.
2sports
Nov 12,2019 అద్యంతం ఊగిసలాటలో మార్కెట్లు! ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొత్త ట్రేడింగ్‌ వారాన్ని తీవ్ర ఊగిసలాటల మధ్య ప్రారంభించాయి. టేడ్రింగ్‌ ప్రారంభం.. ముగింపుల్లో లాభాల్లో నిలిచిన సూచీలు రోజంతా తీవ్ర ఊగిసలాటను నమోదు చేశాయ. అయిటే ఎట్టకేలకు కొనుగోళ్ల మద్దతుతో బెంచ్‌మార్క్‌ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో క్లోజయ్యాయి. బ్యాంక్‌ షేర్లు మెరుగైన ర్యాలీని నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 21 పాయింట్ల లాభంతో 40,345 పాయింట్ల వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 11,913 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. 40,151 పాయింట్ల వద్ద ప్రారంభంమైన సెన్సెక్స్‌ ఇంట్రా ట్రిడింగ్‌లో 40,417 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతంర మార్కెట్లు ముగిసే సమయానికి 40,345 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 15 షేర్లు లాభాల్లోనూ, 15 స్టాక్స్‌ నష్టాల్లోనూ నిలిచాయి. ఒక స్టాక్‌లో ఎలాంటి కదలికా కనిపించలేదు. బ్యాంకింగ్‌ షేర్ల కొనుగోళ్ల కారణంగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఏకంగా 31,000 పాయింట్ల మార్క్‌పైకి చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ వంటి హెవీవెయిట్‌ షేర్లలో కొనుగోళ్లు కలిసొచ్చాయి. అయితే రిలయన్స్‌ ఇండిస్టీస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ సుజుకీ వంటి షేర్లలో అమ్మకాలు లాభాలను హరించేశాయి. నిఫ్టీ సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి.నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మీడియా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు లాభాల్లో క్లోజయ్యాయి. ఇక మిగతావన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ 50లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, యస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్‌ బ్యాంక్‌ దాదాపు 6 శాతం పరుగులు పెట్టింది. అదేసమయంలో హీరో మోటొకార్ప్‌, హిందాల్కో, వేదాంత, సిప్లా షేర్లు నష్టపోయాయి. హీరో మోటొకార్ప్‌ 2 శాతానికి పైగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 1.30 శాతం తగ్గుదలతో 61.66 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 1.59 శాతం క్షీణతతో 56.33 డాలర్లకు తగ్గింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మన్మధుడు-2, సీక్వెల్‌ పార్ట్‌లో హీరో ఎవరు? అక్కినేని నాగార్జున హిట్ సినిమాల్లో ఒకటి ‘మన్మధుడు’. Samayam Telugu | Updated: Aug 13, 2018, 04:09PM IST అక్కినేని నాగార్జున హిట్ సినిమాల్లో ఒకటి ‘మన్మధుడు’. త్రివిక్రమ్ రచనలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దాదాపు దశాబ్దంన్నర కిందట వచ్చింది. సరదా సరదాగా సాగిపోయే ఈ సినిమా ఇప్పటికీ టీవీలో ప్రసారం అవుతూ అలరిస్తూ ఉంటుంది. త్రివిక్రమ్ స్టైల్ రచన ఈ సినిమాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. ‘మన్మధుడు’కు సీక్వెల్ రాబోతోంది అనేది. ఈ మేరకు టైటిల్ కూడా రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. అది కూడా మన్మధుడును నిర్మించిన అక్కినేని వారి హోం బ్యానర్ తరఫు నుంచినే ‘మన్మధుడు-2’ టైటిల్ రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. టైటిల్ ను బట్టి మన్మధుడుకు సీక్వెల్ వస్తోందని అనుకోవాలి.
0business
Vaani Pushpa 79 Views increase , ITC ITC ముంబై: ఎఫ్‌ఎంసిజి దిగ్గజ సంస్థ అయితే ఐటిసి సోమవారం ప్రారంభంలోనే 9శాతానికి పైగా పుంజుకుంది. బిఎస్‌ఇలో ఈ సంస్థ షేరు రూ.249.10వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గత వారంలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో పొగాకు ఉత్పత్తులపై శ్లాబ్‌ను పెంచవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. కౌన్సిల్‌ పొగాకు ఎలాంటి రేటును పెంచకపోవడంతో పాటు హోటల్‌ గదులపై జిఎస్‌టి తగ్గించింది. ఇక కేంద్రం ప్రకటించిన కంపెనీలపై కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కూడా ఐటిసి కంపెనీకీ భారీగా కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నేడు మార్కెట్‌ ప్రారంభంలోనే ఐటిసి షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఒక దశలో 9.50శాతం ర్యాలీ చేసి రూ.260.30వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఇక ఈ ఏడాదిలో ఈ సంస్థ షేర్లు రూ.234.10వద్ద ఏడాది కనిష్టానికి, రూ.310.00వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో సూచీలు రెండోరోజూ లాభాల బాటాపట్టాయి. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
Hyderabad, First Published 12, Aug 2019, 3:16 PM IST Highlights గతంలో తమన్నాతో కలిసి కాజల్ నిర్మాణ రంగంలోకి దిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ అలాంటి ఆలోచన లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ స్వయంగా  వెల్లడించింది. మరో మంచి పార్టనర్ కోసం చూస్తున్నట్లు కాజల్ చెప్పింది.  దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ మంచి పార్టనర్ కోసం ఎదుచూస్తోందట. అయితే అది తన లైఫ్ షేర్ చేసుకునే లైఫ్ పార్టనర్ కాదట. మంచి సినిమాలను రూపొందించే నిర్మాణ భాగస్వామి. పార్టనర్ దొరికితే సినిమా ప్రొడక్షన్ మొదలుపెట్టాలనేది కాజల్. ఏకే వెంచర్స్ పేరుతో ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థను రిజిస్టర్ చేయించింది కాజల్. కాకపోతే ఆ బ్యానర్ పై  సోలో ప్రొడ్యూసర్ గా కాకుండా.. మరో పార్టనర్ ని కూడా కలుపుకొని సినిమాలు నిర్మించాలనేది ఆమె ఆలోచన. ఇలా చేయడం వలన రిస్క్, ప్రెషర్ రెండూ తగ్గుతాయనేది ఆమె ఆలోచన. గతంలో తమన్నాతో కలిసి ఆమె నిర్మాణ రంగంలోకి దిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ అలాంటి ఆలోచన లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ స్వయంగా వెల్లడించింది. మరో మంచి పార్టనర్ కోసం చూస్తున్నట్లు కాజల్ చెప్పింది. కాజల్ నిర్మాతగా మారాలకుంటే ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లు సిద్ధంగా ఉన్నాయి. తేజ చెప్పిన ఓ కథతో పాటు ప్రశాంత్ వర్మతో మరో సినిమాపై చర్చలు సాగిస్తోంది కాజల్. వీటిలో ఏదోక సినిమా కాజల్ ఎంపిక చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి నిర్మాతగా మారే ఆలోచన లేదని.. నటనపైనే పూర్తిగా ఫోకస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దానికి కారణంగా మంచి నిర్మాణ భాగస్వామి దొరకకపోవడమే.. అయితే ఫ్యూచర్ లో మాత్రం కచ్చితంగా సినిమాలు నిర్మిస్తానని అంటోంది. తనకు నచ్చే కథలను ఎన్నుకుంటూ సొంతంగా సినిమాలు నిర్మించుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'రణరంగం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
0business
SomDev ప్రొఫెషనల్‌ టెన్నిన్‌కు సోమ్‌దేవ్‌ రిటైర్మెంట్‌ న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ క్రీడాకారుడు సోమ్‌దేవ్‌ దేవ్‌ వర్మన్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.దశాబ్ద కాలం నుంచి భారత టెన్నిస్‌కు పలు విజయాలను అందించాడు. ముఖ్యంగా సింగిల్స్‌లో సోమ్‌దవ్‌ సత్తా చాటాడు. సుమారు రెండు సంవత్సరాల కిందట ఎన్‌ఎస్‌ఎ ఎఫ్‌ 10 ప్యూచర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సెబాస్టియన్‌ పెన్సిలోతో 3-6,2-6 తేడాతో పరాజయం చెందాడు.ఆ తరువాత ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.2008లో జరిగిన డేవిస్‌ కప్‌ సింగిల్స్‌లో భారత్‌ తరపున తొలిసారిగా పాల్గొన్నాడు.ఆ తరువాత పలు టోర్నీలో బాగా ఆడి భారత్‌కు విజయాలను తెచ్చి పెట్టాడు. ముఖ్యంగా ఇటీవల వరకు మంచి ఫామ్‌నే కొనసాగించాడు. 2009 చెన్నై ఓపెన్‌,2011 దక్షిణాఫ్రికా ఓపెన్‌ సిరీస్‌ల్లో సింగిల్స్‌విభాగంలో ఎటిపి టైటిల్‌కు దగ్గరకు వచ్చినా ఒకే ఒక భారతీయ టెన్నిస్‌ క్రీడాకారుడు సోమ్‌దేవ్‌.
2sports
internet vaartha 300 Views న్యూఢిల్లీ : వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ వ్యవహార శైలి అంతేనని ఆస్ట్రేలియా ఆటగాడు షేన్‌ వాట్సన్‌ పేర్కొన్నాడు.కాగా తన సమకాలీన ఆటగాడైన గేల్‌ పలు సందర్భాలలో ఆటకు అవసరం లేని వివాదాలను కలుగజేసుకుం టాడన్నాడు. తామిద్దరం చాలా మ్యాచ్‌లు వ్యతిరేకంగా ఆడామని చెప్పిన వాట్సన్‌, అతిగా ప్రవర్తించడం ద్వారా గేల్‌ తలనొప్పులు కొనితెచ్చుకుంటున్నాడన్నాడు. గేల్‌ నుంచి ఆ రకమైన ప్రవర్తన ఊహించినదేనని వాట్సన్‌ పేర్కొన్నాడు.గేల్‌ను బ్యాన్‌ చేయాలన్న వారికి వాట్సన్‌ మద్దతు పలికాడు.వ్యక్తిగత ప్రవర్తన వల్ల క్రికెట్‌కు మచ్చ తేవడం సరికాదని వాట్సన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.వేసవిలో జరిగే సిరీస్‌ గేల్‌ ఆఖరి ఆసీస్‌ పర్యటన కావచ్చని వాట్సన్‌ పేర్కొన్నాడు.
2sports
internet vaartha 360 Views హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా తన రెస్టారెంట్లతో విస్తరణ ప్రణాళిక చేపట్టిన చైనా రెస్టారెంట్‌ ఛైన్‌ బ్రిస్టో కొత్తగా హైదరాబాద్‌లో ప్రవేశించింది. చైనీస్‌, ఆసియా వ్యాప్తంగా రుచులకు ప్రసిద్ధి చెందిన చైనా బ్రిస్టో రెస్టారెంట్‌ ముంబైలో ఇప్పటికే నాలుగు ఔట్‌లెట్లు నిర్వహిస్తున్నట్లు సిఎండి సంజయ్ వజిరాని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫుడ్‌లిక్‌ రెస్టారెంట్స్‌ ఆధ్వర్యంలో చైనా బ్రిస్టోను ప్రారంభించారు. చైనా, ఆసియా దేశాల రుచులకు ప్రసిద్ధిచెందిన బ్రిస్టో హైదరాబాదీ యులకు కూడా చేరువ అవుతున్నదని పేర్కొన్నారు. ముంబైలో మంచి ఆదరణ పొందిన తమకు హైద రాబాద్‌లో కూడా మార్కెట్‌ వాటా పెరుగుతుందన్న ధీమా వజీరాని వ్యక్తం చేశారు. జూబ్లిహిల్స్‌ రోడ్‌ నంబర్‌వన్‌లో విశాలమైన ప్రాంగణంలో ప్రారంభించారు. సాంప్రదాయకమైన చైనారంగులు, డిజైన్లతో గోడలు ఆహ్లాదకరమైన వాతావరణంలో మెను ఉంటుందన్నారు మెనూలో చైనా, కొరియా, పాన్‌, ఇండో నేసియా, హాంకాంగ్‌దేశాలకు చెందిన ప్రియమైన రుచులు అందిస్తున్నట్లు తెలిపారు సామ్‌ టామ్‌సలాడ్‌, చియాంగ్‌ ఫంగ్‌డిమ్‌సమ్స్‌ వంటివి చైనాబ్రిస్టో ప్రత్యేకతలని వెల్లడించారు. రూ.395 నుంచిప్రారంభం ధరగా మెనులు లభిస్తాయి. వివిధ రుచులతోపాటు పానీయాలు కూడా అందిస్తోంది. కాక్‌టేల్స్‌, మాక్‌ టేల్స్‌, ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌ తదితరపానీయాలన్నీ అందుబాటులోఉంటాయని వజీరియా వెల్లడించారు.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Matthew Hayden: ఏంటీ.. రాయుడి సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారా..? 2018 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యుత్తమంగా రాణించిన అంబటి రాయుడు.. టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. దీంతో.. సుదీర్ఘ విరామం తర్వాత గత ఏడాది మళ్లీ టీమిండియా నుంచి పిలుపొచ్చింది. Samayam Telugu | Updated: Mar 15, 2019, 09:53AM IST Matthew Hayden: ఏంటీ.. రాయుడి సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారా..? హైలైట్స్ ఆస్ట్రేలియాపై వరుసగా మూడు వన్డేల్లో విఫలమైన అంబటి రాయుడు చివరి రెండు వన్డేల్లో రాయుడి (నెం.4) స్థానంలో ఆడిన కోహ్లి, పంత్ ప్రపంచకప్‌ జట్టు ఒక స్థానంపై చర్చ జరగాలని కోహ్లీ వెల్లడి నెం.4లో కేఎల్ రాహుల్, విజయ్ శంకర్‌ని ఆడించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు ఆస్ట్రేలియాతో బుధవారం ముగిసిన వన్డే సిరీస్‌లో విఫలమైన భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడికి ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ మద్దతుగా నిలిచాడు. తొలి మూడు వన్డేల్లో నెం.4 స్థానంలో ఆడిన అంబటి రాయుడు 13, 18, 2 పరుగులతో పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో.. ఆఖరి రెండు వన్డేల్లో అతనిపై వేటు పడగా.. నాలుగో వన్డేలో రాయుడు ప్లేస్‌లో ఆడిన కోహ్లీ 7 పరుగులు, ఐదో వన్డేలో ఆడిన రిషబ్ పంత్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో.. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా మొదలుకానున్న ప్రపంచకప్‌లో విజయ్ శంకర్‌ లేదా కేఎల్ రాహుల్‌ను ఆ స్థానంలో ఆడించాలనే ఆలోచనలో భారత్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రపంచకప్‌ జట్టు కోసం ఒక స్థానంపై చర్చ జరగాాలని పరోక్షంగా వెల్లడించాడు. భారత్ తరఫున నెం.4 స్థానంలో ఇప్పటి వరకూ 14 ఇన్నింగ్స్‌లు ఆడిన అంబటి రాయుడు ఒక సెంచరీ, రెండు అర్ధశతకాలు సాధించాడు. అయినప్పటికీ ప్రపంచకప్‌లో అంబటి రాయుడ్ని పక్కన పెట్టాలనే వార్తలు రావడంపై తాజాగా మాథ్యూ హెడెన్ స్పందించాడు. ‘నెం.4 స్థానంలో అంబటి రాయుడి బ్యాటింగ్‌ సామర్థ్యంపై అందరూ ప్రశ్నించడాన్ని నేను నమ్మలేకపోతున్నా. గత కొంతకాలంగా అతను చక్కగా రాణిస్తున్నాడు. కానీ.. ఎందుకు ఇలా అతని బ్యాటింగ్‌ను ప్రశ్నిస్తున్నారో..? నాకు అర్థం కావడం లేదు. బహుశా.. ప్రపంచకప్‌కి ముందు మాట్లాడుకోవడానికి ఓ అంశం కావాలనుకుంటున్నారేమో..? నెం.4 స్థానానికి రాయుడి తరహాలో కేఎల్ రాహుల్ అర్హుడు కాదు. కానీ.. మూడో ఓపెనర్‌గా ప్రపంచకప్‌లో అతను ఆడే అవకాశం ఉంది’ అని మాథ్యూహెడెన్ వెల్లడించాడు. ఐపీఎల్ 2019 షురూ.. 11 సీజన్ల విజేతల లిస్ట్ 2018 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యుత్తమంగా రాణించిన అంబటి రాయుడు.. టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. దీంతో.. సుదీర్ఘ విరామం తర్వాత గత ఏడాది మళ్లీ టీమిండియా నుంచి పిలుపొచ్చింది. తాజాగా మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. మరోసారి చెలరేగి ఈ తెలుగు బ్యాట్స్‌మెన్ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకుంటాడేమో..? చూడాలి..!!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
అఖిల్ మాజీ ప్రేయసి పెళ్లి.. సంబరాల్లో మెగాఫ్యామిలీ Highlights మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య అయిన ఉపాసనకు అనిందిత్ కజిన్ కావడంతో మొదటి నుండి ఆమె ఈ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు నమ్రత, లావణ్య త్రిపాఠి, ప్రగ్యాజైస్వాల్ వంటి తారలు హాజరయ్యారు అక్కినేని అఖిల్.. డిజైనర్ శ్రియా భూపాల్ ను ప్రేమించిన సంగతి తెలిసిందే. నిశ్చితార్ధం కూడా జరుపుకున్నారు. కానీ ఊహించని విధంగా పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో అఖిల్ సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే శ్రియా మాత్రం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిదింత్ రెడ్డితో ఏప్రిల్ లో శ్రియకు ఎంగేజ్మెంట్ జరిగింది. గత కొద్దిరోజులుగా ప్రీవెడ్డింగ్, మెహందీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పెళ్లి వేడుకతో ఈ జంట ఒక్కటైంది. శుక్రవారం వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య అయిన ఉపాసనకు అనిందిత్ కజిన్ కావడంతో మొదటి నుండి ఆమె ఈ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు నమ్రత, లావణ్య త్రిపాఠి, ప్రగ్యాజైస్వాల్ వంటి తారలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
0business
READ ALSO: అయోధ్యలో మసీదు ఎందుకు: ప్రశ్నిస్తున్న Salman Khan తండ్రి తన కెరీర్‌లో దాదాపు 25వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు లతా మంగేష్కర్. ఆమెను అంతా నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. భారత ప్రభుత్వం లతను పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇప్పటికీ ఆమె పాటలకు ఎంతో ఆదరణ ఉంది. ప్రస్తుతం లత వయసు 90. అయితే కొన్నేళ్ల క్రితం సినిమాలకు పాటలు పాడటం మానేశారు లత. కేవలం భక్తి పాటలను మాత్రమే పాడుతున్నారు. ఇందుకు ఆమె ఆరోగ్యం సహకరించకపోవడం ఒక కారణమైతే, ఇప్పుడు సినిమాల్లో వస్తున్న పాటలన్నీ బూతు పదాలతో నిండిపోయి ఉన్నాయని అలాంటి పాటలను తాను పాడనని వెల్లడించారు. READ ALSO: నటిని అక్కడ పట్టుకున్న ప్రియుడు.. రచ్చ పుట్టిస్తున్న సెల్ఫీ లతా మంగేష్కర్ కారణంగా ఓ పేద మహిళ ఉన్నత స్థాయికి ఎదిగారు. కోల్‌కత్తాలోని రణఘాట్ రైల్వే స్టేషన్‌లో రణు మోండల్ అనే పేద మహిళ పాటలు పాడుతూ బతుకీడుస్తుండేది. లత మంగేష్కర్ పాడిన ఓ పాటను పాడటంతో ఆమె సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్ సినిమాలకు పాటలు పాడే రేంజ‌్‌కి ఎదిగిపోయింది. ఈ విషయం తెలిసి లత కూడా స్పందించారు. ఎవరైనా సొంత ట్యాలెంట్‌తో పేరు తెచ్చుకోవాలి కానీ ఇలా మరొకరు పాడిన పాటలు కాదని అన్నారు. ఏదేమైనా తన పాట వల్ల ఓ పేద మహిళ జీవితం బాగుపడిందంటే అంతకుమించి ఇంకేం కావాలని అన్నారు. READ ALSO: హృతిక్ రోషన్‌పై కోపం.. భార్యను చంపేసిన భర్త   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
బ్యాంక్‌ మోసాలు @ రూ.70వేల కోట్లు - గత మూడేండ్లలో అత్యధికంగా వెలుగులోకి.. - బ్యాంకుల దూకుడు, అవినీతే కారణమట.. -  వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఎన్‌పీఏ 139! న్యూఢిల్లీ: కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక బ్యాంకింగ్‌ రంగంలో మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు మోసాల కారణంగా దాదాపు రూ.70,000 కోట్ల సొత్తును కోల్పోయినట్టుగా స్వయంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. దేశంలోని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు 2015-16, 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా రూ.16,409, రూ.16,652, రూ.36,694 కోట్ల మేర నిధులను మోసాల కారణంగా కోల్పోయినట్టుగా ఆయన మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అంతకు ముందు భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇదే విషయమై ఒక నివేదికను వెల్లడిస్తూ ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంకుల్లో మోసాల విలువ రూ.32,048.65 కోట్లకు చేరినట్టుగా అంచనాకట్టింది. ఇప్పుడు సర్కారే స్వయంగా ఈ మొత్తం రూ.70,000 కోట్లకు చేరుకున్నట్టుగా వెల్లడించడం విశేషం. ఆర్‌బీఐ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తాము ఈ లెక్కలను వెల్లడిస్తున్నట్టుగా మంత్రి పార్లమెంట్‌కు తెలిపారు. ఇదే సమయంలో బ్యాంకులు రుణాల రూపంలో అందజేసే మొత్తం కూడా 2008 నుంచి 2014 మార్చి ముగింపు నాటికి రూ.25.03 లక్షల కోట్ల నుంచి రూ.68.75 లక్షల కోట్లకు చేరుకున్నట్టుగా ఆయన ఎగువసభకు తెలియజేశారు. బ్యాంకులు దూకుడుగా వ్యవహరిస్తూ రుణాలను మంజూరు చేయడం, ఉద్దేశపూర్వక ఎగవేతలు, అవినీతి, ఆర్థిక వ్యవస్థ మందగించడం తదితరాల కారణంగానే బ్యాంకుల్లో మోసాలు పెరిగిపో యినట్టుగా ఆయన వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో రూ.1000 కోట్లు అంతకం టే ఎక్కువ మొత్తంలో నిరర్థక ఆస్తులను కలిగి ఉన్నవారి సంఖ్య 139 వరకు ఉన్న ట్టుగా ఆయన రాజ్యసభకు వివరించారు. దేశంలో డర్టీ డజన్‌గా మారి బ్యాంకింగ్‌ వ్యవస్థకు భారంగా పరిణమిస్తున్న 12 బడా రుణస్వీకర్తలపై బ్యాంక్‌రప్టసీ కోడ్‌ (ఐపీసీ) కింద దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా ఆర్‌బీఐ మార్గనిర్దేశకాలను జారీ చేసిందని ఆయన సభకు వివరించారు. దాటవేసేలా సమాధానం..! బ్యాంకుల్లో మోసాల విలువ అంతకంతకు పెరుగుతున్నట్టుగా గణాంకాలు వెలువడుతున్న వేళ ప్రభుత్వం దాటవేసే సమాధానం తెలిపినట్టుగా అర్ధమవుతోంది. బ్యాంకుల్లో మోసాల మొత్తం రూ.70,000 కోట్లకు చేరువైన నేపథ్యంలో మంత్రి చట్టసభలోని సభ్యుల దృష్టిని పక్కదారి పట్టించేలా తన వివరణనిచ్చారు. ఈ మోసాలు సంబంధిత ఆర్థిక సంవత్సరంలోనే జరిగినవి మాత్రమే కావని వెల్లడించారు. తాము పరిగణనలోకి తీసుకున్న మూడేండ్ల కాలంలో వెలుగులోకి వచ్చిన మోసాల విలువ మాత్రమేనని ఆయన వెల్లడించారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులు కాస్త విస్మయం వ్యక్తం చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
IPO రెట్టింపు రిటర్నులు తెచ్చిన ఐపిఒలు ముంబై,: ఐపిఒలపరంగా ఇన్వెస్టర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో మంచి రిటర్నులు తెచ్చినపెట్టిన ట్లు తెలుస్తోంది. రాబడులు గణనీయంగా పెరగడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు వృద్ధికూడా అదేస్థాయిలో ఉన్నట్లు నిపుణుల అంచనా. బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ సుమారు 16శాతంగా పెరిగింది. మొత్తం 21 ఐపిఒ ల్లో 15 వరకూ మార్కెట్లకు వచ్చిన ఐపిఒలు భారీగా విజయవంతం అయ్యాయి. ఐపిఒలద్వారా వచ్చిన సగటు రిటర్నులు 38శాతంగా ఉందని అంచనా. బిఎస్‌ఇ ఐపిఒ సూచి కొత్తగా జాబితా అయిన కంపెనీ ల పనితీరుకు ప్రామాణికంగా నిలుస్తుంది. ఈ సూచి ఏప్రిల్‌ ఒకటి 2016 నుంచి ఇప్పటివరకూ 32 శాతం పెరిగింది. ఇన్వెస్టర్లు ఈ ఐపిఒ కంపనీల్లో పెట్టుబడులు పెట్టారు. 2017 ఆర్థికసంవత్సరం ఐపిఒ లకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. పటిష్టమైన ఆర్ధ్థికపరిపుష్టి, ఆర్థిక వనరులు, మంచి బిజినెస్‌ మోడళ్లు ఉండటంతో మార్కెట్లలో ఇన్వెస్టర్లకు ఐపిఒలు ఆకర్షణీ యంగా మారాయి. సమీపకాలం నుంచి మధ్యకాలికం గా కూడా ఇదేతీరు కొనసాగుతుందని కోటక్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంకింగ్‌అసోసియేట్‌ డైరెక్టర్‌ సుభ్రజిత్‌రా§్‌ు అన్నారు. ఇక నాలుగు ఆర్థిక కంపెనీలు క్వెస్‌కార్ప్‌, ఆర్‌బిఎల్‌బ్యాంకు, ఉజ్జీవన్‌ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లతో పాటు మహానగర్‌ గ్యాస్‌ కంపెనీలు మూడంకెల రిట ర్నులు ఇన్వెస్టర్లకుఅందించాయి. ఇతరత్రా హెచ్‌పిఎల్‌ ఎలక్ట్రిక్‌, విద్యుత్‌ వంటివి అధ్వాన్నంగా పనిచేసాయి. మొత్తం స్టాక్‌ఎక్ఛేంజిల్లో జాబితా అయిన కంపెనీల్లో కొన్ని కంపెనీల షేర్లు 47శాతం వరకూ దిగజారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆసక్తిరమైన విషయం ఏమిటంటే భారీస్థాయిఐపిఒలు విజయం సాధిం చలేకపోయాయనే చెప్పాలి. ఐసిఐసిఐప్రుడెన్షియల్‌ లైఫ్‌ గడచిన ఆరేళ్లలో అతిపెద్ద ఐపిఒగా నిలిచింది. ఐసిఐసిఐప్రు షేర్లు 11శాతం గరిష్టంగా ఉన్నాయి. ఇక ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్‌ 11శాతం నష్ట పోయింది. ఈ ఆర్థికసంవత్సరంలో ఇప్పటివరకూ 21 కంపెనీలు మార్కెట్లనుంచి 25,282 కోట్ల రూపా యలు నిధులు రాబట్టినట్లు ప్రైమ్‌డేటాబేస్‌ చూపిస్తోంది. గడచిన ఆరేళ్లలో ఈ తీరు అత్యుత్తమ ఫలితా లిచ్చినట్లుగా అంచనా. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు ఇదేతీరు మరింత ముందుకు వెళుతుందని, మరికొన్ని కంపెనీలు ఐపిఒలు జారీ చేస్తాయని చెపుతున్నారు. విద్యావనరుల కంపెనీ సిఎల్‌ఎడ్యుకేట్‌, గృహా వసరాల మెరుగుదల కంపెనీ శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్సు కంపెనీ తమతమ ఆఫరింగ్స్‌ను ఈ ఏడాదిలోపే జారీచేస్తాయి. ఇక మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌, డిమార్ట్‌ కంపెనీలు ఇప్పటికే విజయవంతం అయ్యాయి. ఇదేతీరు మరికొంతకాలం ఐపిఒలు ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉంటాయని నిపుణుల అంచనా.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రోహ్‌తంగ్‌లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ-స్నేహ అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ ప్రస్తుతం హిమగిరుల్లో సరదాగా గడుపుతున్నారు. TNN | Updated: Oct 31, 2017, 11:55AM IST నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే మెగాఫ్యామిలీ హీరోలు అల్లు అర్జున్ , రామ్ చరణ్ హిమగిరుల్లో సరదాగా గడిపారు. మంచు దున్నపై రామ్ చరణ్‌ రైడింగ్ చేస్తోన్న ఫోటోలను సోమవారం ఉపాసన షేర్ చేయగా.. బన్నీ, చెర్రీలు రోహ్‌తక్‌లో దిగిన ఫొటోల్ని అల్లు శిరీష్ మంగళవారం ట్వీట్ చేశాడు. మనాలీలో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నవీరు అక్కడి ప్రకృతి అందాలను కెమెరాలో బంధించారు. భార్యతో బన్నీ కలిసి ఉన్న ఫొటోను, చెర్రీ శిఖరం అంచున నిల్చున్న ఫొటోలను శిరీష్ ట్వీట్ చేశాడు. — Allu Sirish (@AlluSirish) October 31, 2017 నా పేరు సూర్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్నీ.. కాస్త గ్యాప్ తీసుకొని పీర్‌పంజల్ శ్రేణుల్లోని రోహ్‌తంగ్ కనుమల్లో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. చెర్రీ కూడా రంగస్థలం షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తయ్యాక మెగాస్టార్ నటించనున్న సైరా షూటింగ్ ప్రారంభం కానుంది.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV నేడు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఆ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రం నో ప్రాబ్లమ్ ..! బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. బ్యాంక్ ఉద్యోగులు నేడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ఇందుకు కారణం. దీంతో ఈ రోజు బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. Samayam Telugu | Updated: Oct 22, 2019, 09:42AM IST హైలైట్స్ బ్యాంక్ ఉద్యోగుల ఒక్క రోజు దేశవ్యాప్త సమ్మె దీంతో స్తంభించిపోనున్న బ్యాంకింగ్ కార్యకలపాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా సమ్మె దీంతో బ్యాంక్ ఖాతాదారులపై ప్రతికూల ప్రభావం బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపి 4 బ్యాంకులుగా మార్చాలనే మోదీ ప్రభుత్వపు నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె బాట పట్టినట్లు బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. ఈ సమ్మెలో ఏకంగా 2 లక్షలకు పైగా బ్యాంక్ ఉద్యోగులు పాల్గొనవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. విలీన ప్రక్రియ ప్రైవేటీకరణకు దారితీస్తుందనే విషయాన్ని తాము అర్థం చేసుకోగలమని, అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ) తెలిపింది. అందుకే నేడు (అక్టోబర్ 22) సమ్మెకు దిగామని పేర్కొంది. ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) కూడా సమ్మెకు మద్దతు తెలిపింది. Also Read: శుభవార్త.. రూ.1,950 పడిపోయిన బంగారం..! బ్యాంకుల విలీనం వల్ల పెద్ద సంఖ్యలోనే బ్రాంచులు మూతపడతాయని, దీంతో స్టాఫ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందని, అప్పుడు ఉద్యోగాల కోత ప్రారంభమౌతుందని బీఈఎఫ్ఐ తెలిపింది. మొండి బకాయిలను వసూలు చేయడం, డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడం, కస్టమర్లపై చార్జీల బాదుడు తగ్గింపు వంటి పలు అంశాలను కూడా యూనియన్లు వాటి డిమాండ్లలో చేర్చాయి. Also Read: ఆంధ్రా బ్యాంక్ ‘గోల్డ్’ స్కీమ్: బయటి కన్నా ఇక్కడ బంగారం ధర రూ.2,150 తక్కువ! బ్యాంక్ స్ట్రైక్ వల్ల కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ రెగ్యులేటరీకి తెలియజేసింది. అయితే బ్యాంక్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని పేర్కొంది. సమ్మెలో పాల్గొంటున్న యూనియన్లలో తమ సిబ్బంది తక్కువ మందే ఉన్నారని, దీంతో బ్యాంకింగ్ సేవలపై పెద్దగా ప్రభావం ఉండబోదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. Also Read: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం.. బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. కాగా కేంద్ర ప్రభుత్వం దేశీ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆగస్ట్ నెలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీన ప్రక్రియను ప్రకటించింది. దీంతో దేశంలో ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు దిగిరానుంది.
1entertainment
Visit Site Recommended byColombia ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి అంతా సిద్ధమైంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమా స్థాయి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ట్రైలర్‌ను తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రైలర్ కోసం రజినీ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు పుల్‌స్టాట్ పెడుతూ ట్రైలర్ విడుదల తేదీని లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. నవంబర్ 3న ట్రైలర్ వచ్చేస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ‘2.ఓ’ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘ఫిఫ్త్ ఫోర్స్ వస్తోంది. మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని ట్వీట్‌లో పేర్కొంది. పగిలిన మొబైల్ స్క్రీన్‌లో ట్రైలర్ విడుదల తేదీ, ఆ ఫోన్‌ను పట్టుకున్న చేయికి భయంకరంగా ఉన్న గోళ్లతో పోస్టర్ అదిరిపోయింది. మరి ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. The FIFTH FORCE is coming! Are you ready for it? #2Point0Trailer #2Point0TrailerOnNov3 #2Point0FromNov29… https://t.co/y1Cq7s7Q7G — 2.0 (@2Point0movie) 1540704840000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
- తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి విమాన సంస్థ! - వేజ్‌'కట్‌'కు సహకరించాలని సిబ్బందికి విజ్ఞప్తి.. - 2 నెలలకు మించి నడపలేమన్న సంస్థ: మీడియా ముంబయి: దేశంలో మరో విమాన సంస్థ నేలకొరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద ప్రయివేటు విమాన సంస్థగా సేవలందిస్తోన్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఆర్థిక కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరిగిపోతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, నిర్వహణ ఖర్చులు ఆకాశాన్ని అంటుతుండడంతో ఎయిర్‌లైన్‌ సంస్థను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధులే ప్రత్యక్షంగా వెల్లడించారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చుల భారం తగ్గించుకోకపోతే సంస్థను 60 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగించలేమంటూ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు మీడియాకు వివరించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. సంస్థ భవిష్యత్తు నిమిత్తం ఎయిర్‌లైన్‌ చైెర్మెన్‌ సహా యాజమాన్య బృందం ఇటీవల పలుమార్లు సంస్థ సిబ్బందితో చర్చలు జరిపి పరిస్థితిని వివరించినట్టుగా ఆ కథనాలు తెలిపాయి. వాటా విక్రయం దిశగా ఆలోచనలు.. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో వరుస లాభాలను ఆర్జించిన జెట్‌ ఎయిర్‌వేస్‌. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.767 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే సంస్థకు రూ.1000 కోట్ల నష్టం రావొచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏటా సిబ్బంది వేతనాల కోసం రూ.3000 కోట్లు ఖర్చు చేస్తోంది. దీన్ని తగ్గించుకోవాడానికి గాను ఇప్పటికే సిబ్బంది జీతాల్లో కోత విధించేందుకు జెట్‌ఎయిర్‌వేస్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. సిబ్బంది వేతనాల ఆధారంగా 5 నుంచి 25శాతం వరకు కోత విధించాలని ఎయిర్‌లైన్‌ నిర్ణయించింది. ఇదే విషయాన్ని సదరు సిబ్బందితో యాజమాన్యం చర్చించింది. ఈ తగ్గింపు వల్ల సంస్థకు రూ.500 కోట్ల భారం తగ్గుతుందని సంస్థ ఆశిస్తోంది. ఈ ప్రయత్నాలలో భాగంగానే మరోవైపు ఎయిర్‌ లైన్‌లో కొంత మేరవాటాను అమ్మేయాలని కూడా సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ చితికి పోయిందని వార్తలు వెలువడిన క్రమంలో స్టాక్‌ మార్కెట్‌లో ఈ విమానయాన సంస్థ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6 శాతం వరకు క్షీణించాయి. రూ.323.90 వద్ద ప్రారంభమైన దీని షేరు రూ.312.15 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. ఎదురు 'నిలుస్తాం' జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోందని త్వరలో నేలకొరిగే దిశగా ముందుకు సాగుతోందంటూ మీడియాలో వస్తోన్న వార్తలను ఆ సంస్థ సీఈవో వినరు దూబే తోసిపుచ్చారు. ఈ వార్తలు సత్యదూరమైనవని, కల్పితాలని ఆయన అన్నారు. మీడియాలో వస్తున్న వార్తల్లో ఏది నిర్ధిష్టంగా సత్య దూరమన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా తాము ఉద్యోగులతో చర్చలు జరుపుతున్న విషయాన్ని ఆన ధ్రువీకరించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆరోగ్యవంతమైన, దృఢమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు గాను విక్రయాలు, పంపిణీ, పేరోల్‌, నిర్వహణ, ఫ్లీట్‌ సింప్లిఫికేన్‌ విభాగాలలో వ్యయనియంత్రణ చర్యలను పరిశీలిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మోహన్ బాబుకు చీఫ్ గెస్ట్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు సంబంధించిన ఓ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇదే వేడుకకు దాసరి నారాయణరావు, నాగార్జున, వెంకటేష్ తదితరులు అతిథులుగా హాజరవుతున్నారు... TNN | Updated: Sep 16, 2016, 06:25PM IST మోహన్ బాబు హీరోగా, విలన్ గా తనకే సొంతమైన ట్రేడ్ మార్క్ డైలాగ్స్ తో యాక్టింగ్ తో ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీకి 'కలెక్షన్ కింగ్' అయ్యారు. అంతేకాదు నిర్మాతగా మారి ఎంతో మంది స్టార్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మోహన్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పటికి 40 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో 'లలిత కళా పరిషత్' వారు మోహన్ బాబుని ' నవరస నట తిలకం ' అనే పురస్కారంతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17న వైజాగ్ లోని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ని ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం చిరంజీవి తన 150వ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ మోహన్ బాబు కోసం తీరిక చేసుకొని ఈ కార్యక్రమానికి హాజరవుతానని చిరు చెప్పారు. వీరిద్దరి మధ్య ఎన్ని విబేధాలు వచ్చాయన్నా, ఎన్ని వివాదాలు ఉన్నా అవన్నీ వీరిమధ్య గల సాన్నిహిత్యంలోని ఒక భాగమే అని తెలుస్తోంది. ఇంకా ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయసుధ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మోహన్ బాబుకు చీఫ్ గెస్ట్ చిరంజీవి
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV హాకీలో పాక్ చిత్తు.. ఫైనల్లో భారత్ ఆసియా కప్ హాకీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ని రెండోసారి మట్టికరిపించిన భారత్ సగర్వంగా ఫైనల్‌కి చేరింది. సూపర్-4లో TNN | Updated: Oct 21, 2017, 08:42PM IST ఆసియా కప్ హాకీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ని రెండోసారి మట్టికరిపించిన భారత్ సగర్వంగా ఫైనల్‌కి చేరింది. సూపర్-4లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు 4-0 తేడాతో పాక్‌పై ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయిస్తూ.. పాకిస్థాన్ గోల్ పోస్ట్‌లపై పదే పదే దాడులు చేస్తూ వచ్చిన భారత్ ఆటగాళ్లు చివరి వరకూ పాక్‌ని ఊపిరి పీల్చుకోనివ్వలేదు. దీంతో ఆ జట్టు కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ టోర్నీ గ్రూప్ దశలోనూ భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇరు జట్లకీ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ కావడంతో 39వ నిమిషం వరకూ ఒక గోల్ కూడా నమోదు కాలేదు. షబ్బీర్ సింగ్ చూడచక్కని గోల్‌తో మొదట భారత్ ఖాతా తెరవగా.. అనంతరం 51వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. దీంతో పాక్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఇదే అదునుగా భావించి భారత్‌కి.. నిమిషం వ్యవధిలోనే లలిత్ ఉపాధ్యాయ గోల్‌ చేసి ఆనందాన్ని రెట్టింపు చేయగా.. చివరగా 57వ నిమిషంలో గుర్జాంత్ సింగ్ గోల్‌తో ఆధిక్యాన్ని 4-0తో ముగించి భారత్‌‌ ఫైనల్ సంబరాలకి తెరలేపాడు.
2sports
పట్టణాలకు జియో గిగా ఫైబర్  Reliance Jio ముంబయి: ”జియో” అపరిమిత ఆఫర్లతో మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ రంగంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు తాజాగా మరో ప్రయోగానికి తెరతీస్తుంది. ”జియో గిగా” ఫైబర్‌ పేరుతో ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌లతో ఇంటర్నెట్‌ వినియోగం రూపురేఖలను మార్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది. జియో ఉచిత హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో పాటు ఉచిత ల్యాండ్‌లైన్‌ అందిస్తుంది. అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ను దేశమంతా అందించే ఈ ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌తో ఇప్పుడు వినియోగదారులు పడుతున్న సిగ్నల్‌ ఇబ్బందులకు చెక్‌ చెప్పవచ్చు. ఇప్పటికే నగరాలలో విస్తృతంగా కనెక్షన్‌లు ఇచ్చిన జియో గిగా ఫైబర్‌ సేవలు మధ్యతరహా పట్టణాలకూ అందించనుంది. నెలకు 1100 జీబీ డేటా ఉచితం ఉచిత ప్రివ్యూ ఆఫర్‌ పేరిట ఇస్తున్న ఈ కనెక్షన్లు దాదాపు సంవత్సరం పాటు ఉచితంగా లభిస్తాయని చెబుతున్నారు. వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించడం ఆలస్యమైన పక్షంలో ఇంకా ఎక్కువ కాలమే ఉచితం కొనసాగవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జియో గిగాఫైబర్‌ సేవలను రిఫండబుల్‌ డిపాజిట్‌తో వినియోగించుకోవచ్చు. 50 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ చాలనుకుంటే రూ.2500, 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ కావాలంటే రూ.4500 డిపాజిట్‌గా చెల్లించాలి. వినియోగదారుడు సర్వీస్‌ అవసరం లేదనుకుంటే తాను చెల్లించిన డిపాజిట్టు ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు. ఈ రెండు పథకాలలోనూ నెలకు 1100 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో పాటు ఈ పథకంలో ఉచిత ల్యాండ్‌లైన్‌ ఇస్తున్నారు. ఈ ల్యాండ్‌లైన్‌ నుంచి దేశమంతా అపరిమిత ఉచిత కాల్స్‌ పొందవచ్చు.ల్యాండ్‌లైన్‌గానే కాకుండా జియో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్‌ నుంచి సైతం ల్యాండ్‌లైన్‌ నెంబర్‌తో కాల్స్‌ చేసుకోవచ్చు.. అందుకోవచ్చు. జియో కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇదే కనెక్షన్‌పై కేబుల్‌ టీవీ ప్రసారాలను అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV హీరో సినిమాకోసం అభిమాని ఉపవాసం హీరో రామ్‌కు కొత్త చిక్కొచ్చింది . ఈహీరో నేను శైలజ మూవీ హిట్ తరువాత హైపర్‌లో నటించినప్పటికీ.. ఆ మూవీ అంతంత మాత్రంగానే ఆడటంతో నెక్స్ట్ మూవీకి టైం తీసుకుని కథలు వినే పనిలో ఉన్నాడు. TNN | Updated: Feb 21, 2017, 09:50PM IST హీరో రామ్‌కు కొత్త చిక్కొచ్చింది . ఈహీరో నేను శైలజ మూవీ హిట్ తరువాత హైపర్‌లో నటించినప్పటికీ.. ఆ మూవీ అంతంత మాత్రంగానే ఆడటంతో నెక్స్ట్ మూవీకి టైం తీసుకుని కథలు వినే పనిలో ఉన్నాడు. అయితే ఈ లాంగ్ గ్యాప్‌ని తట్టుకోలేని రామ్ వీరాభిమాని ఒకరు దిమ్మతిరిగే ట్వీట్ చేశాడు. రామ్ అన్నయ్యా.. మీ నెక్స్ట్ మూవీ ఎనౌన్స్ చేస్తేనే నేను తిండి తింటా.. అప్పటి వరకూ ఉపవాసం ఉంటానని.. ఇది మొదటిరోజు లవ్ యూ అన్నయ్యా.. అంటూ తరుణ్ సాయి ప్రకాష్ అనే అభిమాని ట్వీట్ చేయడంతో రామ్ వెంటనే స్పందించాడు.
0business
internet vaartha 131 Views హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికరాజధానిగా కొనసాగుతున్న విజయవాడలో పారిశ్రామిక, నాన్‌బ్యాంకింగ్‌ సంస్థలకార్యాలయాలు కొత్తగా ఏర్పాటవుతున్నాయి. ముత్తూట్‌ గ్రూప్‌ విలువైన లోహాల విభాగం ముత్తూట్‌ ఎగ్జిమ్‌ తన పసిడి రీసైక్లింగ్‌ కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించింది. ముత్తూట్‌ గోల్డ్‌పాయింట్‌ పేరిట విజయవాడలోని ఈ కేంద్రంలో బంగారాన్ని రీసైక్లింగ్‌ చేస్తుంది. ముత్తూట్‌ ఎగ్జిమ్‌ 2017 చివరినాటికి 16 ముత్తూట్‌గోల్డ్‌ పాయింట్‌ సెంటర్లు ప్రారంభిస్తామని, 2018 నాటికి రెండుటన్నుల స్క్రాప్‌ గోల్డ్‌ను రీసైకిల్‌ చేసేందుకు ప్రణాళికలు అమలుచేస్తున్నట్లు సిఇఒ కేయూర్‌షా వెల్లడించారు. ఇప్పటికే కోయంబత్తూరు, చెన్నై, ఢిల్లీ,ముంబై, కోల్‌కత్తా, అహ్మదాబాద్‌ల తర్వాత దేశంలో ఏడో కేంద్రంగా విజయవాడలో ప్రారంభించామన్నారు. పసిడి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేదిశగా ముత్తూట్‌ తన కేంద్రాలద్వారా కస్టమర్ల నుంచి కంపెనీ పాత వినియోగించిన బంగారు ఆభరణాలు ఉత్పత్తులు కొనుగోలుచేసి తిరిగి కరిగించి శుద్ధిచేస్తుందని, మేలిమి బంగారు కడ్డీలుగా మార్చి దేశీయ అవసరాలకు పంపిణీ చేస్తుందన్నారు. కంపెనీ ఇప్పటివరకూ 125 కిలోలబంగారం రీసైక్లింగ్‌ చేసినట్లు వివరిం చారు. వచ్చే ఏడాది ఈతరహా కేంద్రాలు తొమ్మిది వరకూ ప్రారంభం అవుతాయని ఎగ్జిక్యూటివ్‌ డైరె క్టర్‌ థామస్‌ ముత్తూట్‌ వెల్లడించారు. సాంకేతిక శిక్షణకోసం, స్క్రాప్‌గోల్డ్‌ను శుద్ధిచేసేందుకు ముంబై కు చెందిన ఇన్ఫినియమ్‌ ప్రెషన్‌ రీసెర్సెస్‌ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నట్లు థామస్‌ ముత్తూట్‌ వివ రించారు. కంపెనీ ఇప్పటికే స్వర్ణవర్షం, శ్వేత వర్షం, ముత్తూట్‌ గోల్డ్‌ పాయింట్‌, కార్పొరేట్‌ గిఫ్టింగ్‌ వంటి స్కీంలతో మార్కెట్‌లో స్థిరమైన వృద్ధిని సాధించినట్లు ముత్తూట్‌ థామస్‌ వివరించారు.
1entertainment
Visit Site Recommended byColombia భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా భాగం కానున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. తెరపై కాకుండా తెర వెనకనుంచి ‘సైరా’లో అల్లు అర్జున్ మెప్పించబోతున్నారట. అంటే, సైరాలోని కొన్ని సన్నివేశాలకు అల్లువారబ్బాయి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అలాగే, సినిమాలోని ప్రతి పాత్రను అల్లు అర్జునే తన గొంతుతో పరిచయం చేస్తారట. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ, మెగా అభిమానులకు మాత్రం ఇది మంచి కిక్ ఇచ్చే వార్త. అయితే, అల్లు అర్జున్ ‘సైరా’కు వాయిస్ ఓవర్ ఇవ్వడంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే రామ్ చరణ్ చెప్పారు. ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమా ద్వారా లాభాలు వస్తే అది మాకు బోనస్ అనుకుంటాం. ఒకవేళ లాభం రాకపోయినా అదీ మాకు ఆనందమే. బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయడంలేదు’ అని రామ్ చరణ్ చెప్పారు. అంటే, ఈ సినిమా విషయంలో చరణ్ ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఈ చిత్ర బడ్జెట్ రూ.200 కోట్లని అంటున్నారు. ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV పతాకధారిగా సింధు.. అట్టహాసంగా కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆరంభోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. Samayam Telugu | Updated: Apr 4, 2018, 05:18PM IST పతాకధారిగా సింధు.. అట్టహాసంగా కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆరంభోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. ఆస్ట్రేలియా సంస్కృతి ఉట్టి పడేలా 21వ కామన్వెల్త్ గేమ్స్ ఆరంభ ఉత్సవాలను నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో 71 దేశాలకు చెందిన క్రీడాకారులు 18 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. గత కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన స్కాట్లాండ్ ఆటగాళ్లు ముందుగా కర్రారా స్టేడియంలో నిర్వహించిన పరేడ్‌లో అడుగుపెట్టారు. అనంతరం ఖండాల వారీగా.. ఆంగ్ల అక్షరమాల ప్రకారం వివిధ దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహించారు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు త్రివర్ణ పతాకధారిగా ముందుకు సాగగా.. 218 భారత అథ్లెట్లు ఆమె వెంట నడిచారు. ఈ క్రీడల ఆరంభోత్సవంలో పతకాధారులుగా 39 మంది పురుష అథ్లెట్లు ముందు నడవగా.. 32 మంది మహిళా అథ్లెట్లు తమ దేశ జాతీయ పతాకంతో పరేడ్ నిర్వహించారు. ఈ స్థాయిలో మహిళా అథ్లెట్లు పతాకధారులుగా నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. #PVSindhu leads #TeamIndia #CWG2018 https://t.co/JZiETLEaOs — Ishani (@IshaniDg) 1522841283000 గురువారం నుంచి పోటీలు ప్రారంభం కానుండగా... ఈ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు భారీ సంఖ్యలో పతకాలు సాధించే అవకాశం ఉంది. గత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 30 రజతాలు, 18 కాంస్యాలు సాధించి పతకాల పట్టికలో ఐదోస్థానంలో నిలిచింది. ఈసారి షూటర్లు, బాక్సర్లు, షట్లర్లు, రెజ్లర్లు మెరుస్తారని భారత్ ఆశిస్తోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Visit Site Recommended byColombia విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా షమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో అనసూయ ఒక ముఖ్య పాత్ర పోషించారు. అది అక్క పాత్ర అని అనసూయ స్వయంగా చెప్పారు. చాలా స్ట్రిక్ట్‌గా ఉండే అక్క పాత్రట. అందుకే, ఇప్పటి వరకు అత్తగా తనను చూసిన ఈ కుర్రాళ్లు సడెన్‌గా అక్క అంటే జీర్ణించుకోగలరా అని అనసూయ వేదికపై అన్నారు. నిజం చెప్పాలంటే అనసూయ మాట్లాడటానికి వేదికపై వచ్చిన వెంటనే గోల మొదలైంది. అస్సలు ఆమెను మాట్లాడనివ్వకుండా ఒకటే అరుపులు, కేకలు. Also Read: ‘భాస్కర్ ఒక రాస్కల్’ అంటున్న అమలాపాల్ ఇంకేముంది.. అనసూయను ఆపలేం కదా. ఆ అభిమానాన్ని చూసి ఆకాశానికి ఎక్కేశారు. ‘నన్ను టీజ్ చేస్తున్నారా, ర్యాగింగ్ చేస్తున్నారా’ అంటూ సరదాగా నవ్వుతూ అన్నారు. ‘‘మీ ఫేవరేట్ రౌడీ గురించి ఈ సినిమా చూస్తారని నాకు తెలుసు. మీరు ఊహించిన దానికి మించి ఈ సినిమాటో ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. నవంబర్ 1 నుంచి థియేటర్లలో ఈ సినిమాను చూడండి. మీకన్నా ఒక్కరోజు ముందు నేను సినిమా చూసేస్తా’’ అంటూ చిన్న పిల్లలా భుజాలు ఎగరేశారు అనసూయ. ఇకపై అనసూయను అక్క అని పిలవాలట..!! X
0business
Hyderabad, First Published 5, Oct 2018, 4:51 PM IST Highlights కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఏఆర్.మురగదాస్ షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా మొదలైంది అంటే ఏ మ్యాటర్ కూడా బయటకు లీక్ కాకూడదని చూసుకుంటారు. ఇకపోతే రీసెంట్ గా ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలోని జూనియర్ ఆర్టిస్ట్ లకి గట్టి వార్నింగ్ ఇచ్చారు.  కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఏఆర్.మురగదాస్ షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా మొదలైంది అంటే ఏ మ్యాటర్ కూడా బయటకు లీక్ కాకూడదని చూసుకుంటారు. ఇకపోతే రీసెంట్ గా ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలోని జూనియర్ ఆర్టిస్ట్ లకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడమని చెప్పారు.  ప్రియమైన సర్కార్ కాస్ట్ - క్రూ చాలామంది ఈ చిత్ర నిర్మాణం కోసం కృషి చేశారు. అయినప్పటికీ జూనియర్ ఆర్టిస్ట్ లు అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇది అనైతికమైనది. భవిష్యత్తులో మా అనుమతి లేకుండా ఇంటర్వ్యూలు ఇచ్చే వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ మురగదాస్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరిక జారీ చేశారు.  విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న సర్కార్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబందించిన కొన్ని విషయాలు జనాల్లో నానుతుండడంతో సర్కార్ దర్శకుడు మురగదాస్ కొంచెం సీరియస్ అయ్యారు. సినిమాలో నటించిన జూనియర్ ఆర్టిస్ట్ లు ఇస్తున్న ఇంటర్వ్యూల వలన సినిమాకు సంబందించిన విషయాలు బయటపడుతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు  Last Updated 5, Oct 2018, 4:54 PM IST
0business
Mumbai, First Published 20, Aug 2019, 12:27 PM IST Highlights ఇక ముందు వినియోగదారులు ఎస్బీఐ డెబిట్‌ కార్డులు వాడే అవసరమే ఉండదని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. ఐదేళ్లలో కార్డు అవసరం అత్యంత పరిమితం అని, డిజిటల్ చెల్లింపుల దిశగా తమ ఖాతాదారులను మళ్లిస్తామన్నారు.   ముంబై: డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు తొలగించి, మరిన్ని డిజిటల్‌ చెల్లింపు విధానాలను అమల్లోకి తేవాలని భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్బీఐ) యోచిస్తోంది. దేశంలో అయిదోవంతు జనాభాకు ఎస్బీఐ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తోంది. ఎస్బీఐ ఖాతాదార్లలో అత్యధికులు డెబిట్‌కార్డులపై ఆధారపడి ఉన్న సంగతి విదితమే.  బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి ప్లాస్టిక్‌ కార్డులను తొలగించాలని తమ యోచన అని, ఇది సాధ్యం చేయగలమని భావిస్తున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు. దేశం మొత్తంమీద దాదాపు 93 కోట్ల డెబిట్‌, క్రెడిట్‌కార్డులు వినియోగంలో ఉన్నాయని చెప్పారు.  ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చిన యోనో వంటి యాప్‌ల ద్వారా, దేశీయంగా డెబిట్‌కార్డుల వినియోగాన్ని తగ్గించగలమనే అభిప్రాయాన్ని రజనీశ్‌ వ్యక్తం చేశారు. యోనో యాప్‌ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించొచ్చని, కార్డు లేకుండా దుకాణాల్లో చెల్లింపులు పూర్తి చేయవచ్చన్నారు.  యోనో కేంద్రాల సంఖ్యను ప్రస్తుత 68 వేల నుంచి ఏడాదిన్నరలో 10 లక్షలకు చేర్చాలనే ప్రణాళికతో ఉన్నామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు.  అప్పుడు కార్డు అవసరమే రాకపోవచ్చన్నారు. కొన్ని ఉత్పత్తుల కొనుగోలుకు యోనో యాప్‌ ద్వారా రుణం కూడా పొందవచ్చన్నారు. అందువల్ల క్రెడిట్‌కార్డు కూడా ‘బేబులో ప్రత్యామ్నాయ సాధనం’గా మిగిలిపోతుందని ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీష్ కుమార్ వివరించారు. వచ్చే ఐదేళ్లలో దేశీయంగా కార్డు అవసరం అత్యంత పరిమితం అవుతుందని, వర్చువల్‌ కూపన్లే ప్రధానపాత్ర పోషిస్తాయని తెలిపారు. చెల్లింపులకు ప్రస్తుతం అనుసరిస్తున్న క్యూఆర్‌ కోడ్‌ విధానం కూడా ఖరీదైనదేనని పేర్కొన్నారు.
1entertainment
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV పది మందితో యాంకర్ శ్యామల డేట్.. లిస్ట్ వదిలింది Anchor Syamala Youtube Channel: తన యూట్యూబ్ ఛానల్‌ను జనంలోకి తీసుకువెళ్లేందుకు తన క్రియేటివిటీ మొత్తాన్ని వాడేస్తోంది యాంకర్ శ్యామల. ‘ఏం చెప్పారు శ్యామల గారూ’ అంటూ ఇటీవల ఓ ట్యూబ్ ఛానల్‌ను స్టార్ట్ చేసిన శ్యామల.. డేటింగ్ కాంటెస్ట్ నిర్వహించింది. Samayam Telugu | Updated: Oct 30, 2019, 08:39PM IST యాంకర్ శ్యామల యూట్యూబ్ ఛానల్ ‘ఏం చెప్పారు శ్యామల గారూ’.. ఇది ఆమెను పొగడటం కాదు కాని. ఇది ఆమె యూట్యూబ్ ఛానల్ పేరు. యాంకర్‌గా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా క్రేజ్ సంపాదించిన యాంకర్ శ్యామల తనకు ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఈ మధ్య కాలంలో ‘ఏం చెప్పారు శ్యామల గారూ’ అనే యూట్యూబ్ ఛానల్‌కి రిబ్బర్ కటింగ్ చేసింది. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలను షేర్ చేస్తూ గంట మోగించండి బాబులూ అంటూ ప్రచారం మొదలుపెట్టింది. అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెండు మూడు వీడియోలు షేర్ చేసేసరికి 20k సబ్‌క్రైబర్స్ వచ్చేశారు. దీంతో మరింతగా తన యూట్యూబ్ ఛానల్‌ని జనంలోకి తీసుకుని వెళ్లేందుకు తన బుర్రకు పదునుపెట్టి ఆడియన్స్‌కి ఓ కాంటెస్ట్ నిర్వహించింది శ్యామల.
0business
Visit Site Recommended byColombia ఆస్ట్రేలియా విజయానికి చివరి 18 బంతుల్లో 21 పరుగులు అవసరంకాగా.. ఆ జట్టు చేతిలో రెండు వికెట్లే ఉన్నాయి. కానీ.. క్రీజులో అప్పటికే సెటిలైన స్టాయినిస్ ( (52: 65 బంతుల్లో 4x4, 1x6) ఉండటంతో.. భారత్ శిబిరంలో కంగారుల మొదలైంది. కానీ.. ఇన్నింగ్స్ 48వ ఓవర్ వేసిన జస్‌ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసి ఒక్క పరుగు మాత్రమే ఇవ్వగా.. తర్వాత ఓవర్ వేసిన షమీ 9 పరుగులిచ్చాడు. దీంతో.. సమీకరణం 6 బంతుల్లో 11 పరుగులుగా మారింది. మరోవైపు షమీ, బుమ్రా ఓవర్ల కోటా ముగిసింది. ఈ దశలో పెద్దగా అనుభవంలేని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ చేతికి కెప్టెన్ కోహ్లీ బంతినివ్వగా.. ఒత్తిడిని జయించిన శంకర్ తొలి మూడు బంతుల్లోనే రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ఆస్ట్రేలియా చివరి రెండు వికెట్లూ పడగొట్టేశాడు. అయితే.. విజయ్ శంకర్‌ని ఆఖరి ఓవర్‌లో బౌలింగ్ చేయించాలని తనకి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, వైస్ ‌కెప్టెన్ రోహిత్ శర్మ సలహా ఇచ్చారని మ్యాచ్ అనంతరం కోహ్లీ వెల్లడించాడు. Vijay shankar, who threw the last over to the 11 run in # viishankar, dropped the highest run-off stoiis in 52. In… https://t.co/cAB9KcY35M — Thirunavukarasu (@thiruna18987352) 1551850212000 ఆస్ట్రేలియా విజయానికి చివరి 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో బౌలింగ్ వ్యూహంపై తాను ధోనీ, రోహిత్‌తో చర్చించిన తీరు గురించి కోహ్లీ మాట్లాడుతూ ‘ఇన్నింగ్స్ 46వ ఓవర్‌ని కేదార్ జాదవ్ లేదా విజయ్ శంకర్‌తో వేయించాలని నేను అనుకున్నా. ఇదే విషయమై మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మతో కూడా చర్చించాను. కానీ.. ధోనీ ఆఖరి ఓవర్‌ వరకూ విజయ్ శంకర్‌ని పక్కనపెట్టి బుమ్రా, షమీ బౌలింగ్‌ను కొనసాగించాలని చెప్పాడు. అప్పటికి ఆస్ట్రేలియా చేతిలో 4 వికెట్లే ఉండటంతో.. 49వ ఓవర్‌లోపు బుమ్రా, షమీ ఆ వికెట్లు పడగొడితే మ్యాచ్‌పై పట్టు సాధించొచ్చని సలహా ఇచ్చాడు. ఊహించినట్లే 46వ ఓవర్‌లో ఒక పరుగే ఇచ్చిన బుమ్రా రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు’ అని వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 11, Sep 2019, 1:29 PM IST Highlights చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం సైరా. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో చిత్రం టీమ్ ప్రమోషన్స్ వేగం చేయాలని ప్లాన్ చేస్తోంది. గతంలో బాలీవుడ్ మాత్రమే దేశం మొత్తం తిరిగి తన సినిమాలను ప్రమోట్ చేసుకునేది. ఇప్పుడు తెలుగు సినిమా కూడా అదే బాట పట్టింది. ప్రమోషన్స్  కోసం పెద్ద సినిమాలు వాళ్లు దేశం మొత్తం చుట్టముట్టాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అవుతోంది. ఆ మధ్యన విజయ్ దేవరకొండ ....డియర్ కామ్రేడ్ చిత్రం కోసం సౌత్ లో మెయిన్ సిటీలు కవర్ చేసే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత రీసెంట్ గా సాహో సినిమా ప్రమోషన్ నిమిత్తం హీరో ప్రభాస్ ...దేశంలో అన్ని ప్రధాన పట్టణాలు చుట్టారు. అదే క్రమంలో ఇప్పుడు చిరంజీవి సైతం ప్రయాణం పెట్టుకోబోతున్నట్లు సమాచారం. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం సైరా. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో చిత్రం టీమ్ ప్రమోషన్స్ వేగం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాక హిందీ, తమిళం,మళయాళ,కన్నడ భాషల్లో రిలీజ్ అవటంతో అక్కడ కూడా చిరు స్వయంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాకు నార్త్ ఇండియాలో మాగ్జిమమ్ ఎక్సపోజర్ రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు చిరంజీవి ..ముందుగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ప్రమోషన్ టూర్ చేయనున్నారు. ఆ మాత్రం చేయకపోతే మిగతా చోట్ల సినిమాకి గుర్తింపు రాదని రామ్ చరణ్ భావిస్తున్నారట. అందుకోసం బాలీవుడ్ నుంచి కొందరు మిత్రుల సహాయం తీసుకుని టూర్ ప్లాన్ చేస్తున్నారట. Last Updated 11, Sep 2019, 3:51 PM IST
0business
ఒకే మ్యాచ్ లో పది వికెట్లు తీసిన భారత బౌలర్ Highlights ఇంగ్లాండ్ వేదికపై సత్తాచాటిన భారత యువ బౌలర్... క్రికెట్ మ్యాచుల్లో బౌలర్లు విజృంబించి ఆడటాన్ని చూస్తుంటాం. మంచి ఫామ్ లో ఉన్న బౌలర్ అయినా, ఎంత చక్కగా బౌలింగ్ చేసినా ఐదు లేదా ఆరు వికెట్లు తీయడానికి తెగ కష్టపడిపోతారు. అలాంటిది ఒకే బౌలర్ పది వికెట్లు తీస్తే...అది ప్రభంజనమే. కానీ ఆ అసాధ్యాన్ని కొందరు టాప్ బౌలర్లు మాత్రమే సుసాధ్యం చేశారు. తాజాగా రంజీ టీం కు చెందిన  ఓ భారత యువ బౌలర్ విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించాడు. రంజీల్లో విధర్భ తరపున ప్రాతినిధ్యం వహించే శ్రీకాంత్ వాఘ్ అనే ఫేస్ బౌలర్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లడ్ లో జరుగుతున్న నార్త్‌ యార్క్‌షైర్‌ సౌత్‌ దుర్హామ్‌(ఎన్‌వైఎస్‌డీ) క్రికెట్ లీగ్ లో శ్రీకాంత్ స్టోక్స్ స్లే క్రికెట్ క్లబ్ తరపున ఆడుతున్నాడు. మిడిల్స్ బ్రాగ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 11.4 ఓవర్లు వేసిన శ్రీకాంత్ 39 పరుగులిచ్చి పదికి పది వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీకాంత్ చాలా మంది టాప్ బౌలర్లకు సాధ్యం కాని అరుదైన రికార్డును సాధించాడు. గతంలో ఇలా ఓ టెస్ట్ మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా పది వికెట్లు తీసిన బౌలర్లు వరల్డ్ క్రికెట్ లో కూడా చాలా తక్కువమందే ఉన్నారు.  చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో శ్రీకాంత్ వాఘె దిగ్గజ బౌలర్ల సరసన స్థానం సంపాదించి వారి చేతే శభాష్ అనిపించుకున్నాడు.  Last Updated 2, Jul 2018, 5:45 PM IST
2sports
Hyd Internet 77 Views Sanjay Rajagopalan Sanjay Rajagopalan బెంగుళూరు: ప్రముఖ ఐటి దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌కు వరుసగా ఆ కంపెనీ అధికారులు రాజీనామాలు చేస్తున్న విషయం తెలుసు. ఐతే తాజాగా మరో సీనియర్‌ అధికారి రాజీనామా చేశారు. ఇన్ఫోసిస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, డిజైన్‌ అండ్‌ రిసెర్చ్‌ హెడ్‌ సంజయ్‌ రాజగోపాలన్‌ రాజీనామా చేయడమే కాకుండా తనకు ఇప్పుడు స్వేఛ్చగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ కంపెనీలో ఆగస్టు 2014 నుంచి పనిచేస్తున్నారు. గతంలో విశాల్‌ సిక్కా ద్వారానే రాజగోపాలన్‌ ఈ కంపెనీలో చేరారు.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఢిల్లీని సెమీస్ చేర్చిన గౌతమ్ గంభీర్ భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన మార్క్ ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకర్షించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా TNN | Updated: Dec 11, 2017, 02:47PM IST ఢిల్లీని సెమీస్ చేర్చిన గౌతమ్ గంభీర్ భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన మార్క్ ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకర్షించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో సోమవారం ముగిసిన రెండో క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ (95: 129 బంతుల్లో 9x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్‌లో బెర్తు ఖాయం చేసుకుంది. 2009-10 సీజన్ తర్వాత.. ఈ టోర్నీలో ఢిల్లీ సెమీస్ చేరడం ఇదే తొలిసారి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఎయిర్‌టెల్ : రూ.99 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ టెలికాం రంగంలో టారిఫ్ ల యుద్ధం మరింత ముదిరింది. ఇటీవల ప్రకటించిన రూ.99 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ మరింత ఆకర్షణీయంగా మార్చింది. Samayam Telugu | Updated: Jun 18, 2018, 12:45PM IST టెలికాం రంగంలో టారిఫ్ ల యుద్ధం మరింత ముదిరింది. ఇటీవల ప్రకటించిన రూ.99 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఈ ప్లాన్‌పై గతంలో 28 రోజుల కాలానికి ఒక జిబి డేటాను ఆఫర్‌ చేసింది. ఇప్పుడు దీన్ని రెండు జీబీకి పెంచింది. అపరిమిత కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. రోజుకు 100 చొప్పున ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఎయిర్టెల్ ఇటీవల రిలయన్స్‌ జియో ప్రకటించిన రూ.98 విలువైన ‘డబుల్‌ ధమాకా’ ప్రీపెయిడ్‌ ఆఫర్‌కు ప్రతిగా ఎయిర్‌టెల్‌ ఈ చర్య తీసుకుంది. 28 రోజుల గడువు ఉండే జియో డబుల్‌ ధమాకా ఆఫర్‌ కింద ఉచిత వాయిస్‌ కాల్స్‌తో పాటు 2జీబీ వ‌ర‌కూ 4జీ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్‌ గడువైన 28 రోజుల్లో 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ఇస్తోంది.
1entertainment
ఒకే ఒక్క పిక్ తో సోషల్ మీడియా మొత్తం స్తంభించిపోతోంది Highlights షామా సికందర్ గ్లామర్ ప్రియులకు ఈమెతో బాగానే పరిచయం ఉంటుంది బాలీవుడ్ సినిమాల్లో నటించిన షామా సికందర్.. సోకుల ఆరబోయడంలో బాగా దిట్ట​ షామా సికందర్ గ్లామర్ ప్రియులకు ఈమెతో బాగానే పరిచయం ఉంటుంది. కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన షామా సికందర్.. సోకుల ఆరబోయడంలో బాగా దిట్ట. ఇప్పుడీ బ్యూటీ సోషల్ మీడియాలో కొంతకాలం క్రితం నాటి ఓ బికినీ పిక్ ను పోస్ట్ చేసింది. ఆస్ట్రేలియా వెకేషన్ సందర్భంగా దిగిన ఓ సూపర్బ్ ఫోటోను ఫాలోయర్స్ తో పంచుకుంది సికందర్. అయినా.. ఇలాంటి టూ పీస్ బికినీ వేసుకుని ఓ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. సౌందర్యాన్ని ఆరాధించకుండా ఉంటారా.? అంతటి ఎండలో కూడా ఈమె వయ్యారాలు ఏ రేంజ్ లో మెరిసిపోతోన్నాయో గమనించారా.. వంకలు పెట్టలేనన్ని వయ్యారాలను కలిగిన వనితలు కాసింత అరుదుగానే ఉంటారు. వారిలో ఈ షామా సికందర్ ను కూడా చేర్చేయచ్చు కదూ. అన్నట్లు ఈమె సినిమాల్లో మాత్రమే కాదండోయ్.. టెలివిజన్ లో ఇంకా ఎక్కువ ఫేమస్. మాయ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈమె రచ్చ బాగానే ఉంటుంది.  Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV కే విశ్వనాథ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, కళాతపస్వి కే విశ్వనాథ్ అసాధారణ ప్రతిభ కల దర్శకులు అని కొనియాడారు ప్రధాని నరేంద్ర... TNN | Updated: May 5, 2017, 04:50PM IST దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, కళాతపస్వి కే విశ్వనాథ్ అసాధారణ ప్రతిభ కల దర్శకులు అని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోడీ. మే 3వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న కే విశ్వనాథ్‌ని అభినందిస్తూ ట్వీట్ చేశారు మోడీ. ఈ సందర్భంగా కే విశ్వనాథ్ ఒక ఔట్‌స్టాండింగ్ ఫిలింమేకర్ అని తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. Shri K Vishwanath has distinguished himself as an outstanding filmmaker. I congratulate him on being conferred the Dada Saheb Phalke award. — Narendra Modi (@narendramodi) May 4, 2017 సంస్కృతి, సంప్రదాయాలు, నాట్య కళలు, మంచి నడవడిక, పద్ధతులు వంటి అంశాలని తన సినిమాల్లో సున్నితంగా స్పృశిస్తూ, సమాజంలోని అనేక సంఘర్షణలని ప్రతిబింభించేలా తెరకెక్కించడమే కళాతపస్వి ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Salman Khan: కత్రినాను మర్చిపోలేక, ఆ హీరోయిన్‌ని ‘క్యాట్’ అని పిలిచేస్తున్నాడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఒకప్పుడు ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కత్రినా.. రణ్‌బీర్ కపూర్ కోసం సల్మాన్ ఖాన్‌ను వదిలేసింది. తమది 16 ఏళ్ల చిరకాల స్నేహం అని చెబుతూ ఉంటుంది. Samayam Telugu | Updated: Sep 30, 2019, 10:04AM IST సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి.. బార్బీ డాల్ కత్రినా కైఫ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ పరంగా కత్రినాకు సల్మాన్ పిల్లర్‌లా నిలిచాడు. అవకాశాలు లేకపోతే తన సినిమాల్లోనే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు. కత్రినా విషయం తెలీదు కానీ.. సల్మాన్ ఖాన్ మాత్రం ఆమెను చాలా ప్రేమించాడు. కానీ పాపం ఆయన ప్రేమ ఫలించలేదు. సల్మాన్ కంటే రణ్‌బీర్ కపూర్ బెటర్ అనుకున్న కత్రినా అతనితో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉండటానికి నిర్ణయించుకుంది. సరే.. జరిగిందేదో జరిగిపోయింది. ప్రేమ ఫలించకపోయినప్పటికీ సల్మాన్, కత్రినా ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్‌లా ఉంటున్నారు. READ ALSO: అమ్మాయిలను తెచ్చుకోగలను, 200 కోట్లు కావాలి- ప్రియాంకకు కమెడియన్ పంచ్ చూడబోతే సల్మాన్ కత్రినాను మర్చిపోలేకపోతున్నట్లున్నారు. ఏ హీరోయిన్‌ని చూసినా పొరపాటున కత్రినా అని పిలిచేస్తున్నారు. ఆదివారం సల్మాన్ తాను ఎప్పటినుంచో హోస్ట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్ 13 సీజన్‌ను ప్రారంభించారు. ఈ షోలో బాలీవుడ్ నటి కోయినా మిత్రా కూడా పాల్గొన్నారు. అయితే ఆమెను పొరపాటున ‘క్యాట్’ (కత్రినా ముద్దు పేరు) అని పిలిచేశారు. దాంతో అక్కడున్నవారంతా ఓ..ఓ.. అంటూ కేకలు వేశారు. ఆ తర్వాత తన మిస్టేక్ తెలుసుకున్న సల్మాన్ కోయినా అని పిలవడం మొదలుపెట్టారు. దీనిని బట్టే అర్థమవుతోంది సల్మాన్ కత్రినాను మర్చిపోలేకపోతున్నారని. READ ALSO: మంచు విష్ణు హాలీవుడ్ మూవీలో బాలీవుడ్ హీరో అంతేకాదు.. ఓసారి ఓ మీడియా ఛానెల్ సల్మాన్‌ను ప్రశ్నిస్తూ.. ‘మీరు కలిసి పనిచేసిన హీరోయిన్ల గురించి మూడు ముక్కల్లో చెప్పండి’ అని అడిగారు. ఇందుక సల్మాన్.. కరీనా కపూర్ గురించి, ఐశ్వర్య రాయ్ గురించి ఇంకా చాలా మంది గురించి కేవలం కొన్ని సెకన్లు మాత్రమే మాట్లాడారు. కానీ కత్రినా కైఫ్ గురించి మత్రం దాదాపు మూడు నిమిషాల పాటు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ సల్మాన్‌కు కత్రినాపై అంతే ప్రేముంది. కత్రినాను సల్మాన్ కాకుండా మరెవ్వరూ అంత ప్రేమగా చూసుకోలేరేమో. ఏదైతేనేం.. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా ఉంటున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. మున్ముందూ మరిన్ని సినిమాలు రావాలని అభిమానులూ కోరుకుంటున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Gowtham అంత ధర ఊహించలేదు : క్రిష్ణప్ప గౌతమ్‌ బెంగళూరు: ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ నేర్చుకోవడానికి అతడికి టీమిండియాక్రికెటర్‌ హర్భజన్‌ ఆదర్శం. ఐపిఎల్‌ వేలంలో హర్భజన్‌ ఉన్న జట్టులో అతడు చోటు దక్కించుకోవడంపై కర్ణాటకు చెందిన క్రికెటర్‌ క్రిష్ణప్ప గౌతమ్‌ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. బెంగళూరులో జరిగిన ఐపిఎల్‌ వేలంలో క్రిష్ణప్ప గౌతమ్‌ను ముంబై ఇండియన్స్‌ 2 కోట్లకు కొనుగోలు చేయడంపై సంతోషం వ్యక్తం చేశాడు.వేలంలో గౌతమ్‌ కనీస ధరను 10 లక్షలుగా నిర్ణయించారు. అయితే బిడ్డింగ్‌లో అతడికి 2 కోట్లు చెల్లించి ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది.వేలం అనంతరం ఆయన మాట్లాడుతూ వేలంలో తనకు 2 కోట్ల ధర పలుకుతుందని ఊహించలేదన్నాడు.ఏదో ఒక ప్రాంచైజీ తనను కొనుగోలు చేస్తే బాగుండని అనుకున్నానని గౌతమ్‌ వివరించాడు.లెజెండ్స్‌తో కలిసి ఆడటం కొంచెం ఇబ్బందిగా ఉంది.ఐపిఎల్‌ వేలం పాటను కుటుంబ సభ్యులతో కూర్చుని టివిలో వీక్షిస్తున్నాను.ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యుడిని అయినందుకు సంతోషంగా ఉంది.సచిన్‌,హర్భజన్‌,జయవర్థనే. కీరన్‌ పోలార్డ్‌, రోహిత్‌శర్మ లాంటి వారు ఆడిన జట్టులో చోటు దక్కించుకోవడం నిజంగా అదృష్టంగా అని పేర్కొన్నాడు. బౌలింగ్‌లో నాకు ఎంతో ప్రేరణగా నిలిచిన హర్భజన్‌తో కలిసి ఆడే అవకాశం లభించింది. నిజంగా నాకు ఇది ఒక గొప్ప అవకాశం.ప్రస్తుత పరిస్థితుల్లో నా ఫీలింగ్స్‌ను వర్ణించలేను. జీవితంలో ఇప్పటి వరకు హర్భజన్‌ను కలువ లేదని, అలాంటిది అతడితో కలిసి ఆడే అవకాశం వచ్చిందన్నాడు.2012లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన గౌతమ్‌ ఇప్పటి వరకు 12 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తీసు కున్నాడు.20 టి20ల్లో 16 వికెట్లు తీసుకున్నాడు.
2sports
PAK TEAM పాక్‌ జట్టుకు భారీ నజరానా ఇస్లామాబాద్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ని ఓడించి టైటిల్‌ గెలిచిన పాకిస్తాన్‌ జట్టుకి ఆదేశ క్రికెట్‌ బోర్డు, ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆదివారం ముగిసిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ఫై 180 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి ఈటైటిల్‌న పాక్‌ చేజిక్కించుకుంది. దీంతో పాకిస్తాన్‌ అభిమానులు సంబరాలు ఆకాశన్నంటాయి. మంగళవారం ఆదేశానికి చేరిన క్రికెట్‌ జట్టుకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ షహర్యార్‌ ఖాన్‌ తాజగా ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన పాక్‌ జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.10లక్షల చొప్పున బోనస్‌ ప్రకటించగా…ఆదేశ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ సైతం రూ.10లక్షల నజరానా ప్రకటించారు. టోర్నీ ద్వారా వచ్చిన ఫ్రైజ్‌మనీ 29మిలియన్‌ డాటర్లు కూడా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆధారంగా ఆటగాళ్లందరికీ పంచనున్నట్లు క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ప్రధాన కోచ్‌ మిక్కి ఆర్డర్‌తో జట్టు సహాయకులకి సముచిత రీతిలో నజరానా అందనున్నట్లు బోర్డు వెల్లడించింది.
2sports
Suresh 110 Views wcc final ఇంగ్లాండ్‌: పురషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఆదరణ తగ్గుతున్న వేళ మహిళల క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు అత్యంత ఆదరణ లభించడం విశేషం. ఇప్పుడు ఎక్కడ చూసిన నేడు భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌ గురించే చర్చ. అన్‌లైన్‌, టీవీలు, సామాజిక మాధ్యమాలలో సైతం ఈ మ్యాచ్‌ హట్‌ టాఫిక్‌. దీనికంతటికి కారణం ఇంగ్లాండ్‌లో క్రికెట్‌కు మంచి గుర్తింపు ఉండటం, ప్రపంచ కప్‌లో మిథాలీ సేన సాధించిన విజయాలు. అయితే లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సీటింగ్‌ సామర్థ్యం 30 వేలు కాగా ఇప్పటికే 26వేల ఐదు వందల టికెట్లు ఆమ్ముడయ్యాయి. మిగతా వాటికి కూడా మంచి డిమాండ్‌ ఉంది. దీన్ని బట్టి చెప్పవచ్చు ఈ మ్యాచ్‌కు గల ప్రాధాన్యత. మరోవైపు ఈ మ్యాచ్‌లో తమ జట్టే గెలవాలని ఇరు దేశాల ప్రజలు ఆకాక్షిస్తున్నారు. అయితే విజయం ఎవరిని వరిస్తుందో మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
2sports
TEAM INDIA భారత్‌ గెలుపు బాట పల్లెకలె: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో ఆటతోనే భా రత్‌ గెలుపునకు బాటలు వేసుకుంది. తొలి ఇన్నిం గ్స్‌లో 487 పరుగులకి ఆలౌటైన భారత్‌, ఆతిథ్య లంకేయుల్ని కేవలం 135 పరుగులకే తొలి ఇన్నిం గ్స్‌లో కుప్పకూల్చి భారీ ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం ఫాలోఆన్‌లో భాగంగా 352 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంక ఆదివారం ఆట ముగిసే సమయానికి 19/1తో నిలి చింది. ఆజట్టు ఇంకా 333 పరుగులు వెనుకబడి ఉండగా, స్పిన్నర్లకు అనుకూలిస్తున్న ఈ పిచ్‌ 9 వికెట్లను పడగొట్టడం భారత్‌ బౌలర్లకి నల్లేరుపై నడకేనని చెప్పవచ్చు. మెరుపు సెంచరీతో కదం తొక్కిన హార్థిక్‌ పాండ్యా: ఆటలో రెండో రోజైన ఆదివారం 329/6 పరుగు లతో ఆటను ప్రారంభించిన భారత్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. సాహా (19) ఫెర్నాండో బౌలింగ్‌లో దిల్‌రువాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరి గాడు. అనంతరం పాండ్యా దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించి శతకం నమోదు చేశాడు. ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా, టీ20 తరహా ఆటతో రెచ్చిపోయి 86బంతుల్లో 103 పరుగులు చేశాడు. టెస్టు కెరీర్‌లో పాండ్యాకిది తొలి శతకం. అంతకు ముందు 50 పరుగులు పూర్తి చేయడానికి 61 బం తులను తీసుకున్న పాండ్యా, ఆ తర్వాత దూకుడు పెంచాడు. సిక్స్‌లు, ఫోర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో 50 పరుగులను కేవలం 25 బంతుల్లోనే పాండ్యా పూర్తి చేయడం విశేషం. భారత్‌ రెండో రోజు బోజన విరామ సమయానికి 9 వికెట్ల నష్టానికి 487 పరుగలు చేసింది. విరా మం అనంతరం హార్థిక్‌ పాండ్యా సండకాన్‌ బౌలిం గ్‌లో దిల్‌రువాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో భారత్‌ తొలిఇన్నింగ్స్‌ ముగిసింది. కులదీప్‌యా దవ్‌ 26, షమీ8, ఉమేశ్‌యాదవ్‌ 3(నాటౌట్‌) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో లంక బౌల ర్లలో సండకాన్‌ 5, పుష్పకుమార 3, ఫెర్నాండో 2 వికెట్లు తీశారు. టీమిండియా బౌలర్ల దాటికి 135 పరుగులకే కుప్పకూలిన లంక ఇన్నింగ్స్‌: అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంకని ఆదిలోనే పేసర్‌ మహ్మద్‌ షమీ దెబ్బతీశాడు. ఓపెనర్లు కరుణరత్నె (4), ఉపుల్‌ తరంగ(5)ని ప్రారంభంలోనే బోల్తా కొట్టించాడు. ఇద్దరూ కీపర్‌ సాహాకే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన కుశాల్‌ మెండిస్‌ (18)లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటవ్వగా, మాథ్యూస్‌(0) కనీసం ఖాతా తెరవకుండానే హార్థిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్‌ ఛండీమాల్‌ 87 బంతుల్లో 6ఫోర్లతో 48 పరుగులు, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన డిక్వెల్లా 31 బంతుల్లో 4ఫోర్లతో 29 పరుగులుతో కలిసి కాసే పు పోరాడినా, కుల్దీప్‌ యాదవ్‌ ఈ జోడినీ విడ దీసి లంకని ఒత్తిడిలోకి నెట్టాడు. డిక్వెల్లా అనం తరం లంకేయులు వరుసగా వికెట్లు చేజార్చుకు న్నారు. కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న చైనా మెన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (4/40) బ్యాట్స్‌ మెన్‌ను ఉక్కిరి బిక్కిరి చేయగా, అశ్విన్‌ (2/22) తన వంతు సహకారం అందించాడు. దీంతో శ్రీలంక కేవలం 37.4ఓవర్లలోనే 135 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. భారత్‌కు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో సారథి కోహ్లీ శ్రీలంకను ఫాలో ఆన్‌ ఆడించాడు. శ్రీలంక ఆదివారం ఆట ముగిసే సమయానికి 19/1తో నిలిచింది. ఒకే ఓవర్‌లో 26 పరుగులు బాది రికార్డు సృష్టించిన పాండ్యా:శ్రీలంకతో మూడో టెస్టులో వేగవంతమైన శతకం బాదిన హిట్టర్‌ హార్థిక్‌ పాండ్యా భారత్‌ తరుపున అరుదైన రికార్డు నెలకొల్పాడు. 23 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ టెస్టులో ఒకే ఓవర్‌ లో కపిల్‌దేవ్‌ వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి 24 పరుగులు రాబట్టాడు. తాజాగా పల్లెకలె టెస్టులో శ్రీలంక స్పిన్నర్‌ పుష్పకుమార బౌలింగ్‌లో హార్థిక్‌ పాండ్యా వరుసగా 4, 4, 6, 6, 6 బాది 26 పరుగులతో ఆ రికార్డుని బద్దలుకొట్టాడు. టెస్టు చరిత్రలో ఒకే ఓవర్‌లో 28 పరుగులు బాదిన క్రికెటర్‌గా వెస్టిండీస్‌ దిగ్గజ హిట్టర్‌ బ్రియాన్‌ లారా (4, 6, 6, 4, 4, 4) అగ్రస్థానంలో ఉన్నాడు. 2003-2004 టెస్టు సీజన్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ రాబిన్‌ పీటర్సన్‌ బౌలింగ్‌లో లారా హిట్టింగ్‌తో చెలరేగిపోయాడు. ఈ జాబితా టాప్‌- 10లో హార్థిక్‌ పాండ్యా ఒక్కడే భారత్‌ తరు పున ఉండటం విశేషం. తొలి రెండు ఫోర్లు బాదిన అనంతరం, క్రీజు వెలుపలకి వస్తూ హ్యాట్రిక్‌ సిక్స ర్లు బాదిన పాండ్యా, చివరి బంతిని హిట్టింగ్‌ చేయలేకపోవ డంతో అరుదైన నెం.1 రికార్డు ముం గిట ఆగిపో యాడు. ఒక వేళ చివరి బంతి సిక్స్‌గా వెళ్లుంటే 30 పరుగులతో అన్ని రికార్డులు బద్దలై పోయేవి.
2sports
YUVRAJ1, Brevo డారెన్‌ బ్రావోకి యువరాజ్‌ అరుదైన గౌరవం అంటిగ్వా: ఐదు వన్డేలు , ఓ టీ20 కోసం కోహ్లీసేన వెస్టిండీస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ముగిసిన అనంతరం భారత క్రికెటర్లు డ్వేన్‌ బ్రావో ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఈ విందు కార్యక్రమంలో బ్రావో ఆటగాళ్లకు స్థానిక వంటకాలను రుచి చూపిం చాడు. టీమిండియాలో పలువురి ఆటగాళ్లల బ్రావోకి మంచి స్నేహం ఉంది. మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని నేతృత్వంలో ఐపిఎల్‌ జట్టులో బ్రావో ఆడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా వెస్టిండీస్‌ ఆటగాడు డారెన్‌ బ్రావో భారత జట్టు వెటరన్‌ క్రికెటర్‌ యువీని కలిశాడు. ఈసందర్భంగా యువరాజ్‌ సింగ్‌ ఒక బ్యాట్‌ను బ్రావోకు గిఫ్ట్‌గా అందించాడు.
2sports
దాదా  సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది:  మెగాస్టార్ చిరంజీవి! Highlights కళాతపస్వి కె.విశ్వనాథ్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి దాదా  సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుద‌నం వ‌చ్చిందన్న మెగాస్టార్ రేపు ఉదయం విశ్వనాథ్ ను కలవనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ కు  ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కె విశ్వనాథ్ కు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మెగా కుటుంంబంతో విశ్వనాాథ్ కు అథ్యంత సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఆయనకు ఈ అవార్డు రావడం పట్ల చిరు కుటుంబసభ్టులు ఆనందం వెలిబుచ్చారు.   ఈ సంద‌ర్భంగా  మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు విశ్వ‌నాథ్ గారితో ఉన్న అనుబంధం న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ని కాకుండా కుటంబ ప‌రంగాను మంచి  రిలేషన్ ఉంది. ఆయ‌న‌కు  ఈ అవార్డు రావ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతికి లోన‌వుతున్నా. అవార్డు  రావాల్సిన స‌మ‌యంలో వ‌చ్చిందా?  లేదా అన్న దానిపై ఇప్పుడు  మాట‌లు అన‌వ‌స‌రం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వ‌రించాల్సింది. కానీ కాస్త ఆల‌స్య‌మైన అవార్డు ఆయ‌న్ను వ‌రించ‌డం సంతోషంగా ఉంది. ఆయ‌న ఎలా ఫీల్ అవుతున్నారో తెలియ‌దు గానీ, మేము మాత్రం చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. ఆయ‌న‌కు అవార్డు రావ‌డం తో ఆ అవార్డుకు నిండుద‌నం వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా శుభాబివంద‌నాలు తెలుపుతున్నా. ఎప్ప‌టికీ ఆయ‌న ఆశీస్సులు కోరే మ‌నిషినే..ఆయ‌న చిరంజీవినే` అని అన్నారు. Last Updated 25, Mar 2018, 11:48 PM IST
0business
Yuvraj Singh wins INR 25 lakh in season finale of Kaun Banega Crorepati కేబీసీలో రూ.25లక్షలు గెలుచుకున్న యువీ భారత జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన నాలెడ్జ్‌తో కౌన్‌బనేగా కరోడ్‌పతి (కేబీసీ) షోలో రూ. 25లక్షలను గెలుచుకున్నాడు. బాలీవుడ్ TNN | Updated: Nov 10, 2017, 01:40PM IST భారత జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన నాలెడ్జ్‌తో కౌన్‌బనేగా కరోడ్‌పతి ( కేబీసీ ) షోలో రూ. 25లక్షలను గెలుచుకున్నాడు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో కలిసి పాల్గొన్న యువీ.. తన సమాధాన చాతుర్యంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సీజన్‌కి ఇదే చివరి ఎపిసోడ్ కావడం దీనికి తోడు ఇద్దరు సెలబ్రెటీలు షోకి రావడంతో అభిమానులు నుంచి అనూహ్య స్పందన లభించింది. షో మధ్యలో క్యాన్సర్‌తో పోరాటం గురించి అమితాబ్ అడగ్గా.. యువరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఒక క్రీడాకారుడిగా ఆ వార్తని నేను తొందరగా జీర్ణించుకోలేకపోయాను. రోజుకి 6-8 గంటలు క్రికెట్ ఆడే నాకు.. క్యాన్సర్ రావడమేంటని తొలుత నమ్మకలేకపోయా. డాక్టర్లు నిర్ధారించిన తర్వాత కూడా.. నేను చికిత్స నుంచి తప్పించుకుని క్రికెట్ ఆడేవాడ్ని. దీంతో.. చికిత్సని నిర్లక్ష్యం చేస్తే తర్వాత దాని నుంచి బయటపడటం కష్టమని డాక్టర్లు గట్టిగా హెచ్చరించారు. ఇక తప్పని పరిస్థితుల్లో క్రికెట్‌ని వదిలి.. క్యాన్సర్‌కి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది’ అని యువీ భావోద్వేగానికి గురయ్యాడు. శ్రీలంకతో డిసెంబరులో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కి ఎంపికయ్యేందుకు.. యువీ ఈ నెల చివరి వారంలో యోయో టెస్టుకి హాజకానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2sports
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
Sep 29,2018 వాణిజ్య యుద్ధంతో భారత్‌కు మేలే: జైట్లీ న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం వల్ల కొంత అస్థిరత్వం ఏర్పడినప్పటికీ.. భవిష్యత్‌లో ఇది భారత్‌పై సానుకూల ప్రభావమే చూపగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. వాణిజ్య యుద్ధం వల్ల భారత్‌లో క్రమంగా వాణిజ్య, తయారీ రంగంలో అవకాశాలు మెరుగుపడుతాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. స్థానికంగా పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వార్షిక సదస్సులో పాల్గొన్న జైట్లీ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు భారత్‌పై కొంత ప్రభావం చూపిస్తున్నాయి. అయితే మున్ముందు ఇవే పరిస్థితులు దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడగలవని తెలిపారు. వ్యాపార, తయారీ రంగంలో అవకాశాలు మెరుగుపడుతాయి' అని వివరించారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు కూడా మన ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారాయని జైట్లీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు భారత్‌ అని, దేశంలోని చమురు అవసరాలను తీర్చేందుకు 81శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు. అయితే ఈ సవాళ్లను అధిగమించే రోజు దగ్గర్లోనే ఉందని జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక నేరగాళ్లను జైట్లీ పరోక్షంగా హెచ్చరించారు. 'వ్యాపార సంస్థలు నైతిక విధానాలను అనుసరించాలి. ఈ విధానాల వల్ల వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి. సంస్థలు తమ పన్ను బకాయిలను తప్పనిసరిగా చెల్లించాల్సిందే. ఎందుకంటే రాత్రికి రాత్రే విదేశాలకు పారిపోకుండా దివాలా చట్టం అడ్డుకుంటుంది. రుణ దాతల నుంచి డబ్బు తీసుకున్నప్పుడు ఆ అప్పును సరైన కాలంలో తీర్చాలి. అంతేగానీ.. డబ్బు ఇచ్చినందుకు రుణదాతలు నిద్రలేని రాత్రులు గడిపే స్థితి రాకూడదు' అని జైట్లీ వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 142 Views FUNDS , rbi , Union Government Reserve Bank of India న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులు బదిలీ కానున్నాయి. కేంద్రానికి నిధులను బదిలీ చేసేందుకు ఆర్బీఐ సమ్మతి తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన బోర్డు సమావేశంలో నిధుల బదిలీకి ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో, త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,76,051 కోట్లు బదిలీ కానున్నాయి. నిధుల బదిలీ ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ… గత ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ నిధుల బదలాయింపుకు ఒప్పుకోలేదు. దీంతో, ఆయనను రాజీనామా చేయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ధరలు ఇలా! పసిడి ధరలు రూ.90 మేర తగ్గడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,950 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.31,800కి చేరింది. Samayam Telugu | Updated: Nov 24, 2018, 08:37AM IST స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ధరలు ఇలా! అంతర్జాతీయ బలహీన పరిణామాలు, స్థానిక నగల వ్యాపారాల నుంచి డిమాండ్ మందగించడంతో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.90 తగ్గి రూ.32,040 నుంచి రూ.31,950 కి దిగి వచ్చింది. గురువారం బంగారం ధర రూ.90 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి ధర కూడా రూ.200 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.38,000 నుంచి రూ.37,800 కి పతనమైంది. Visit Site Recommended byColombia పసిడి ధరలు రూ.90 మేర తగ్గడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,950 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.31,800కి చేరింది. ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,800 వద్దే కొనసాగుతోంది. మరోవైపు వారంతపు డెలివరీ ధరలు రూ.302 తగ్గి రూ.36,586 కి చేరింది.100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.73,000 ఉండగా.. అమ్మకం ధర రూ.74,000 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌ను పరిశీలిస్తే.. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 0.1 శాతం తగ్గి 1224.34 డాలర్లకు చేరింది. వచ్చేవారంలో అర్జెంటినా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో 'జి20 సమావేశం'లో చైనా, అమెరికా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య తగాదాలపై ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉండటంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఈ ప్రభావం బంగారం ధరలపై పడింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.30,940 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,400 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర రూ.41,100 వద్ద కొనసాగుతున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
ఏటీఎం కార్డులను మార్చుకోండి.. -  ఖాతదారులకు ఎస్‌బీఐ తాజా విజ్ఞప్తి న్యూఢిల్లీ: అయ స్కాంత పట్టితో (మ్యాగ్‌స్ట్రైప్‌) జారీ చేసిన ఏటీఎం కార్డులను కలిగిన వినియోగదారులు సదరు కార్డులను ఈఎంవీ చిప్‌తో కూడిన కార్డులతో మార్చుకోవాలని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) తాజాగా తన ఖాతాదారులను కోరింది. కార్డు వెనుక నల్లటి పట్టీ కలిగి ఉంటే ఆ కార్డును మ్యాగ్‌స్ట్రైప్‌ ఏటీఎం, డెబిట్‌ కార్డుగా గుర్తించాలని బ్యాంక్‌ సూచించింది. దానిని చిప్‌తో కూడిన ఈఎంవీ కార్డుతో డిసెంబరు నెలాఖరు నాటికి మార్చుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. కార్డు వెనుక నల్లటి పట్టీ కాకుండా కార్డు ముందు భాగంలో ఎడమవైపు బంగారపు రంగులో చిప్‌తో కూడిన కార్డును గనుక వినియోగదారులు కలిగి ఉంటే వినియోగదారులు కొత్త కార్డుకు మారాల్సిన అవసరం లేదని బ్యాంక్‌ వెల్లడించింది. భారతీయ రిజర్వు బ్యాంక్‌ జారీ చేసిన నిబంధనల మేరకు ఈ ఏడాది చివరి నాటికి అత్యంత సురక్షితంగా ఉండే ఈఎంవీ కార్డులతో మాత్రమే లావాదేవీలు జరిపేలా జాగ్రత్త వహించాల్సి ఉందని.. ఈ ప్రక్రియలో భాగంగానే మ్యాగ్‌స్ట్రైప్‌ కార్డులు కలిగి ఉన్న వారిని కొత్త కార్డులు పొందాల్సిందిగా కోరుతున్నట్టుగా బ్యాంక్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఈఎంవీతో కూడిన కార్డుల ద్వారా ఏటీఎం యంత్రాల వద్ద కార్డు స్కిమ్మింగ్‌ వంటి మోసాలకు ఆస్కారం ఉండదని అన్నారు. ఈ కార్డు లావాదేవీలు సురక్షితమని, ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా కార్డుల జారీయే అమలులో ఉన్నందున ఆర్‌బీఐ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చినట్టుగా ఎస్‌బీఐ తెలిపింది. ఈ కార్డు మార్పిడిని తాము ఉచితంగా చేపట్టనున్నట్టుగా ఎస్‌బీఐ తెలిపింది. వీటికి వార్షిక నిర్వహణకు కూడా ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయబోమని బ్యాంక్‌ తెలిపింది. వినియోగదారులు ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా గానీ.. లేదా తమ సంబంధిత శాఖలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా కొత్త కార్డులను పొందవచ్చని ఎస్‌బీఐ వర్గాలు తెలిపాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
జ‌క్క‌న్న నెక్ట్స్ మూవీ  హిరో  రామ్ చ‌ర‌ణ్ Highlights బాహుబ‌లి మూవీతో ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్ అయిన రాజ‌మౌళి జ‌క్క‌న నెక్ట్స్ మూవీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్ష‌కులు జ‌క్క‌న్న సినిమాలో హిరో ఎవ‌ర‌నేది ఇప్పుడు హాట్ టాఫిక్  మెగా హిరో రామ్ చ‌ర‌ణ్ తో జ‌క్క‌న్న మూవీ అని ప్ర‌చారం    బాహబలి సినిమాతో భారతదేశంలోనే టాప్ దర్శకులల్లో ఒకరిగా పేరు సంపాదించినా రాజమౌళి తర్వాత సినిమా ఏ విధంగా తీయబోతున్నాడన్నది అందరిలో ఆసక్తిని రేపుతోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానాన్ని చెప్పకుండా ఎంత కాలం వెయిట్ చేయించాడో అంతకంటే ఎక్కువగా ఇపుడు ఆయన ఎవరితో ఎటువంటి సినిమా తీస్తాడన్నది టాలీవుడ్ లో తాజా చ‌ర్చ‌. అయితే ఈ మధ్య ఆయన ఎవరితో మాట్లాడినా ఆ హీరోతోనే సినిమా అని గాసిప్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. కానీ రాజమౌళి మాత్రం ఇంకా ఏది డిసైడ్ కాలేదని చెబుతున్నాడు. కానీ ఈ మధ్య ఆయన చెర్రీతో ఎక్కువగా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. వీళ్ళిద్దరూ ప్రవరిస్తున్న తీరును చూస్తుంటే కూడా ఆ అనుమానాలకు ఇంకా బలాన్ని చేకూరుస్తున్నట్లు అనిపిస్తోంది.  ఎందుకంటే ఈ నెల 15న శ్రీవల్లి చిత్రం రిలీజ్ అవుతున్న సందర్బంగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చెర్రీ గెస్ట్ గా రాబోతున్నాడు. ఇప్పుడు చెర్రీ రావడాన్ని చూస్తుంటే చాలామంది ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అదేమిటంటే.సైరా సినిమాకు పిలవగానే రాజమౌళి వెళ్ళాడు. ఇప్పుడు జక్కన్న పిలవగానే చెర్రీ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి మరీ   ఫంక్షన్ కి రాబోతున్నాడనే.  ఈ విషయం సాధారణమైనదే అయినా మగధీరుడు అండ్ దర్శకదీరుడు ఈ మధ్య ఎక్కువగా కలుసుకుంటున్నారన్నది వాస్తవం. దీంతో ఎదో పెద్ద ప్రాజెక్టు కే టెండర్ వేసినట్లు ఉన్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.అయితే ప్రస్తుతం చెర్రీ సుకుమార్ సినిమాతోతో బిజీగా ఉన్నాడు అలాగే తర్వాత సినిమాని కొరటాలతో ఫిక్స్ చేసుకున్నాడు.  ఒకవేళ సినిమా తియ్యడానికి రెడీ అయితే తప్పకుండా తీసేటట్లు ఉండాలి లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. సో చెర్రీ బిజీ షెడ్యూల్ వల్ల కరెక్ట్ గా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.  Last Updated 25, Mar 2018, 11:56 PM IST
0business
తెలంగాణలో నిర్మాణ సామగ్రి పార్క్‌ - రూ.600 కోట్ల వ్యయంతో ఏర్పాటు - సుమారు 250 ఎకరాలలో నిర్మాణం - కేఈఎఫ్‌తో కలిసి ఏర్పాటుకు కృషి -10,000 మందికి ఉపాధి అవకాశం : పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలంగాణలో నిర్మాణ సామగ్రి పార్క్‌ను (బిల్డింగ్‌ మెటీరియల్స్‌ పార్క్‌) ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన కేఈఎఫ్‌ హోల్డింగ్స్‌ సంస్థతో కలిసి తాము పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంయుక్త పత్రికా సమావేశంలో మంత్రి ఈ పార్క్‌ వివరాలను వెల్లడించారు. దేశంలోనే ఇలాంటి పార్క్‌ ఏర్పాటు చేయనుండడం ఇదే తొలిసారని తెలిపారు. కేఈఎఫ్‌ హోల్డింగ్స్‌ అండ్‌ కేఈఎఫ్‌ ఇన్‌ఫ్రా సంస్థలు కలిసి దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో ఈ పార్క్‌లో ప్రధాన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన వివరించారు. దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లుగా విశ్లేషించారు. పార్క్‌ ఏర్పాటునకు అవసరమైన స్థల సేకరణకు అన్వేషణ జరుపుతున్నట్టుగా కేటీఆర్‌ తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌ చట్టుపక్కల నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసినట్లుగా ఆయన వివరించారు. పార్క్‌ ఏర్పాటునకు అవసరమైన భూమిని, మౌలిక సదుపాయాలను సర్కారు సమకూర్చుతుందని ఆయన అన్నారు. దీనికి తోడు స్థానిక యువత ఉపాధి కోసం అవసరమైన శిక్షణను కూడా ప్రభుత్వమే అందజేస్తుందని మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదిత పార్క్‌తో దాదాపు 10,000 మందికి ప్రత్యక్షంగానూ.. వేలాది మందికి పరోక్షంగాను ఉపాధి లభించనుందని కేటీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా కేఈఎఫ్‌ హోల్డింగ్స్‌ అండ్‌ కేఈఎఫ్‌ ఇన్‌ఫ్రా సంస్థల వ్యవస్థాపకులు, చైర్మెన్‌ ఫైజల్‌ ఈ కొట్టికొల్లోన్‌ మాట్లాడుతూ తమ ప్లాంట్‌ ఏర్పాటుకు దేశంలోని వివిధ రాష్ట్రాలు ముందుకు వచ్చాయని అన్నారు. ఆయితే ఆయా రాష్ట్రాలు కల్పిస్తున్న అవకాశాలను విశ్లేషించుకున్న తరువాత తాము తెలంగాణలో ప్లాంటు పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల విధానాన్ని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణలో మెరుగైన రవాణా సౌకర్యాలతో పాటుగా.. ప్లాంటు నిర్మాణానికి పలు అనుకూలమైన అంశాలున్నందునే తాము దక్షిణాదిలకీ రాష్ట్రంలో అత్యధిక పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేష్‌ రంజన్‌తో పాటు సంస్థకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV 72 రోజుల నిరీక్షణ, 9 వేల కి.మీ. ప్రయాణం.. ధోనీ@ 10,000 రన్స్ మహేంద్ర సింగ్ ధోనీ భారత్ తరఫున పది వేల పరుగులు పూర్తి చేశాడు. సంగక్కర తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఐదో బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్. Samayam Telugu | Updated: Jan 12, 2019, 01:10PM IST 72 రోజుల నిరీక్షణ, 9 వేల కి.మీ. ప్రయాణం.. ధోనీ@ 10,000 రన్స్ హైలైట్స్ మహేంద్ర సింగ్ ధోనీ భారత్ తరఫున పది వేల పరుగులు పూర్తి చేశాడు. సంగక్కర తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌. భారత్ తరఫున ఐదో బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్. మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని భారత్ తరఫున వన్డేల్లో పది వేల పరుగులు పూర్తి చేశాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ దిశగా సింగిల్ తీసి ఈ మైలురాయిని అందుకున్నాడు. 334వ వన్డే ఆడుతున్న ధోనీ .. భారత్ తరఫున పదివేల పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత్ తరఫున ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), విరాట్ కోహ్లీ (10,235) 10 వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV నంది అవార్డ్స్‌పై మరో నిర్మాత ఫైర్! నంది అవార్డ్స్ వివాదంపై సినీ రంగం నుంచి హాటు, ఘాటు స్పందనలు కొనసాగుతున్నాయి. TNN | Updated: Nov 18, 2017, 09:14AM IST నంది అవార్డ్స్ వివాదంపై సినీ రంగం నుంచి హాటు, ఘాటు స్పందనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ అవార్డ్స్ విషయంలో పలువురు సినీ ప్రముఖులు తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అవార్డ్స్ అన్నీ ఒక కులస్తులకే దక్కాయని కొందరు, తెలుగుదేశం పార్టీ అవార్డ్స్ లా ఉన్నాయివి అని మరికొందరు.. ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో నంది అవార్డ్స్ కమిటీ సభ్యులు కొందరు ఎదురుదాడికి దిగుతున్నారు. నీఛమైన పదజాలంతో వీరు స్పందించడం గమనార్హం. తాము అవార్డులను ప్రకటించిన తీరును వీరు దారుణమైన బాషలో సమర్థించుకోవడం.. అవార్డుల కమిటీలోని వారే ఇలా మాట్లాడటం.. అవార్డుల స్థాయిని మరింత దిగజార్చింది. ఇదిలా ఉంటే ఈ అవార్డ్స్ ప్రకటన తీరుపై మండి పడ్డారు మరో నిర్మాత. ఈ సారి వంతు చంటి అడ్డాలది. ఇది వరకూ ప్రముఖ హీరోలతో సినిమాలు తీసిన నేపథ్యం ఉంది ఈ నిర్మాతకు. మనం, రుద్రమదేవి, రేసుగుర్రం.. వంటి సినిమాలకు సరైన స్థాయిలో అవార్డులు దక్కకపోవడాన్ని చంటి ఆక్షేపించారు. వాటికి అవార్డులు తీసుకునే అర్హత లేదా? అని ఈయన ప్రశ్నించారు.
0business
Suresh 279 Views   ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో శనివారం టీమిండియా విజయం సాధించింది. సిరీస్‌ కోల్పోయినా వైట్‌ వాష్‌నుంచి తప్పించుకుంది. చివరివన్డే లో భారత్‌ 331 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగి 6 వికెట్ల నష్టానికి విజయంసాధించింది. మనీష్‌ పాండే అద్భుతంగా ఆడి అంతులేని విజయాన్ని జట్టుకు అందించాడు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Bigg Boss Episode 27 Highlights: బిగ్ బాస్: పులిహోర రాహుల్‌కి పునర్నవి ప్లాట్.. రాఖీ సాక్షిగా లవ్ ట్రాక్ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు 26 ఎపిసోడ్‌‌లను ముగించుకుని శుక్రవారం నాడు 27వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. నిన్నటి ఎపిసోడ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించగా.. నేటి ఎపిసోడ్‌లో హోలీ వేడుకలతో హౌస్‌లో ఉత్సాహం నిండింది. ఎవరు ఎవరికి రాఖీ కట్టారు.. పునర్నవి- రాహుల్‌ల మధ్య ఎలాంటి డిస్కషన్ నడిచింది లాంటి ఆసక్తికరమైన నేటి (ఆగస్టు 16) ఎపిసోడ్‌ రంజుగా మొదలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. Samayam Telugu | Updated: Aug 17, 2019, 10:49AM IST Bigg Boss Episode 27 Highlights: బిగ్ బాస్: పులిహోర రాహుల్‌కి పునర్నవి ప్లాట్..... వంటగదిలో శ్రీముఖి.. బాబా భాస్కర్‌ల మధ్య వంటనూనె విషయంపై సరదా చర్చ నడిచింది. గత వారం ఐదు లీటర్ల నూనె ఇచ్చి ఇప్పుడు రెండు లీటర్ల నూనె ఇచ్చారు అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది శ్రీముఖి. ఇక డైనింగ్ టేబుల్‌ మీద వితికాతో పాటు రాహుల్-పునర్నవిలు ఒకే ప్లేట్‌లో తింటూ ముచ్చట్లు పెట్టారు. ఇక పునర్నవి.. రాహుల్ తినిపించడంతో మిమ్మల్ని ఇలా చూస్తే మీకు పెళ్లి అవ్వదు అంటూ చురక అంటించింది వితికా షెరు. అయితే ఏ.. తినిపిస్తే తప్పా పెళ్లి కాకపోతే ఏం.. అంటూ కొసరి కొసరి రాహుల్‌కి తినిపించింది పునర్నవి. ఇక రాహుల్.. పునర్నవి చేతి ముద్దలు తింటూ మైమరిచాడు. ఎంత టేస్ట్‌గా ఉందో ఈమె తినిపిస్తుంటే అంటూ ఆస్వాదించాడు. మీరు ఇలా చేస్తే పుకార్లు వస్తాయి అని వితికా అనడంతో అయితే నేనే తింటాలే అని పునర్నవి ప్లేట్‌లో చేయిపెట్టి తింటూ.. ఇది పెద్దగా టేస్ట్ అనిపించడంలేదు. పునర్నవి తినిపిస్తే టేస్ట్‌గా ఉందంటూ తనదైన శైలిలో పులిహోర కలిపి పునర్నవిని లైన్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. Read Also: డోన్ట్ మిస్ ఇట్.. బిగ్ బాస్ ఆసక్తికర కథనాలకోసం క్లిక్ చేయండి. మరోవైపు బిగ్ బాస్ కంటెంస్టెంట్‌లకు మెదడుకు మేత వేసే ప్రయత్నం చేశారు బిగ్ బాస్. అందుకు గానూ హౌస్‌లో ఉన్న పురుషులు, మహిళలను రెండు గ్రూప్‌లుగా చేసి వారికి జీకే క్వచ్ఛన్స్ పెట్టారు. ఈ టాస్క్‌లో శివజ్యోతి ప్రశ్నలు అడగగా.. కంటెస్టెంట్స్ ఆన్సర్‌లు ఇచ్చారు. హోరా హోరీగా సాగిన ఈ ఆటలో మహిళలపై పురుషులు విజయం సాధించారు. హౌస్‌లో రాఖీ సంబరాలు రక్షా బంధన్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో రాఖీ సంబరాలు జరిగాయి. కంటెస్టెంట్స్‌కి వాళ్ల ఇంటి దగ్గర నుండి పంపించిన రాఖీలు హౌస్‌లో ఉన్న వాళ్లతో కట్టించుకుని ఎమోషన్ అయ్యారు. తొలుత వరుణ్ సందేశ్‌కి హిమజ రాఖీ కట్టగా.. అలీకి శివజ్యోతి రాఖీ కట్టి ఎప్పటిలాగే గుక్కపెట్టి ఏడ్చేసింది. శ్రీముఖి డిఫరెంట్.. అయితే అందరూ అక్క, చెల్లెలుగా భావించి రాఖీ కట్టించుకుంటుంటే.. తన తమ్ముడు పంపిన రాఖీని ఎవరితోనూ షేర్ చేసుకోలేనని.. ఆ రాఖీ నేను కట్టించుకుంటా అంటూ బాబా భాస్కర్‌లో కట్టించుకుంది శ్రీముఖి. బాబా భాస్కర్.. శ్రీముఖికి రాఖీ కట్టి మంచి భర్త రావాలని ఆశీర్వదించారు. పులిహోర రాజాకి పునర్నవి ప్లాట్.. ఇక ఒకరికొకరు రాఖీలు కడుతుండగా.. పునర్నవి వంతు వచ్చింది. ఆ సందర్భంలో వరుణ్ సందేశ్, రాహుల్‌లు పక్కనే కూర్చుని ఉన్నారు. ఈ సందర్భంలో అతన్ని చూస్తే మా తమ్ముడు గుర్తొస్తాడు.. అతనిలో మా తమ్ముడ్ని చూస్తున్నా అని వరుణ్ ఉద్దేశించే అనగా.. పక్కనే ఉన్న రాహుల్‌ కంగారయ్యాడు. ఆమె ఇటు చూస్తుంటే కంగారు వచ్చింది.. పారిపోదాం ఇక్కడ నుండి అనుకున్నా అనడంతో హౌస్‌లో నవ్వులు మొదలయ్యాయి. ఇక పునర్నవి కల్పించుకుని.. ‘హౌస్ ఉన్న వాళ్లందరికీ రాఖీ శుభాకాంక్షలు ఒక్క రాహుల్‌కి తప్ప అంటూ పులిహోర రాజా రాహుల్ లైన్‌లోకి వచ్చినట్టుగా ఇన్ డైరెక్ట్‌గా చెప్పింది పునర్నవి. మొత్తానికి నేటి ఎపిసోడ్ రాహుల్-పునర్నవిల లవ్ ట్రాక్ మెల్లగా పట్టలెక్కింది. డైనింగ్ టేబుల్ దగ్గర తినిపించుకోవడాలు.. రాఖీ రాహుల్‌కి లేదని లవ్ ట్రాక్‌లోకి వచ్చినట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పునర్నవి. మొత్తానికి రాహుల్ తొలి నుండి కలుపుతున్న పులిహోర బాగానే వర్కౌట్ అయినట్టుగానే కనిపిస్తుంది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం కలుపుతాడో చూడాలి. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి.. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్‌లో.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Visit Site Recommended byColombia ఈ ఏడాది మార్చి 18న బంగ్లాదేశ్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో 19 బంతులాడిన విజయ్ శంకర్ కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పేలవ రీతిలో ఔటయ్యాడు. ముఖ్యంగా.. ఆఖర్లో బంతుల్ని ఎక్కువగా వృథా చేయడంతో అతనిపై విమర్శల వర్షం కురిసింది. దీంతో.. తీవ్ర ఒత్తిడి మధ్య ఐపీఎల్ 2018 సీజన్‌ని ఆరంభించిన శంకర్.. తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతులాడి కనీసం ఒక బౌండరీ కూడా కొట్టలేక 13 పరుగుల వద్దే ఔటయ్యాడు. రెండో మ్యాచ్‌లోనూ 3 పరుగులకే వికెట్ చేజార్చుకున్నాడు. ‘ఐపీఎల్ 2018 సీజన్‌లో రెండో మ్యాచ్ ముగిసిన తర్వాత కోచ్ రికీ పాంటింగ్ దగ్గరకి వెళ్లాను. నా ఆటకి ఎలా మెరుగులు దిద్దుకోవాలో సూచించాలని కోరాను. అప్పటికి నాకు నేను చాలా కఠిన పరిస్థితుల్లో ఉన్నట్లు ఊహించుకున్నా. కానీ.. రికీ పాంటింగ్.. నీ బ్యాటింగ్‌ టెక్నిక్‌ని మళ్లీ అందుకో చాలు.. అని చాలా తేలికపాటి సూచన చేశాడు. ఆ సూచనతో.. మ్యాచ్‌కి అనుగుణంగా ఆడటం నేర్చుకున్నా. కచ్చితంగా ఈ ఏడాది ఐపీఎల్‌ నా కెరీర్‌ని మార్చేసింది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ స్థానాలు మార్చి బ్యాటింగ్‌ చేయాల్సి రావడంతో.. పరిస్థితులకి అనుగుణంగా ఆటతీరు మార్చుకున్నా’ అని విజయ్ శంకర్ వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా అశ్విన్ విండీస్ తో జరిగిన తొలి టెస్ట్ లో విశేషంగా రాణించిన అశ్విన్ ఐసీసీ ర్యాంకింగ్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. TNN | Updated: Jul 26, 2016, 04:15PM IST ఐసీసీ టెస్ట్ బౌలర్ల విభాగంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్ తొలి నుంచి అశ్విన్ అద్భుత ఆటతీరు కనబరుస్తూ వస్తున్నాడు. తాజాగా విండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ లో తాను విశేషంగా రాణించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పాయింట్లు మెరుగుపరచుకొని అశ్విన్ మళ్లీ టాప్ ప్లేస్ లో నిలబడ్డాడు. ఐసీపీ ఆల్ రౌండర్ల విభాగంలోనూ అశ్విన్ టాప్ ప్లేస్ లో కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా టెస్ట్ బౌలర్ల విభాగంలోనూ అతను టాప్ ప్లేస్ నిలబడటం విశేషం. ఇదిలా ఉండగా టెస్ట్ బౌలర్ల విభాగంలో మరో భారత స్పిన్నర్ జడేజా 6వ స్థానంలో నిలవగా.. ఇషాంత్ శర్మ 20 వ స్థానంలో ఉన్నాడు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ధోనీ.. భారత్‌కు అరుదైన ఆరో క్రికెటర్! ఇంతకు ముందు ఇన్ని మ్యాచ్‌లు ఆడింది కేవలం ఐదుగురే.. వారు.. TNN | Updated: Aug 31, 2017, 01:04PM IST కొలంబో వేదికగా నేడు శ్రీలంకతో జరగనున్న వన్డే మ్యాచ్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి 300 మ్యాచ్ అనే అంశం భారతక్రికెట్ అభిమానులకు తెలియనిది ఏమీ కాదు. ధోనీని అమితాభిమానంతో ఆరాధించే, అభిమానించే అభిమానులు ఈ రికార్డు ఫీట్ గురించి అవగాహనతోనే ఉన్నారు. ఇటీవలే.. యువరాజ్ సింగ్ తన కెరీర్ లో మూడు వందల వన్డే మ్యాచ్ లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆ ఫీట్ ను సాధించిన ఐదో భారత క్రికెటర్ గా యువీ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ ఆరో ఆటగాడిగా ఆ జాబితాలో స్థానం సంపాదించబోతున్నాడు. మరి యువీ, ధోనీలకు ముందు కేవలం నలుగురు భారత క్రికెటర్లకే మూడొందలు, అంతకు మించిన సంఖ్యలో మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. ఆ నలుగురు ఎవరంటే.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మహ్మద్ అజారుద్ధీన్, సౌరవ్ గంగూలీ.
2sports
Hyderabad, First Published 3, May 2019, 12:49 PM IST Highlights ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ స్థాయి సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ స్థాయి సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. కొన్ని చిత్రాలు గర్వించేవిధంగా ఉంటుంటే మరికొన్ని మాత్రం చూడడానికే సిగ్గుపడేలా చేస్తున్నాయి. యూత్ ని ఆకట్టుకోవడానికి సినిమాలో ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ఉంటే చాలని అనుకుంటున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో బూతు కంటెంట్ తో సినిమాలు తీస్తూ జనాలపై వదులుతున్నారు. తాజాగా మరో సినిమా బూతు ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'డిగ్రీ కాలేజ్' అనే ఈ సినిమాను టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. నరసింహా నంది అనే వ్యక్తి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం లిప్ లాక్ సీన్లు, సెక్స్ సీన్లతో  నింపేశారు. వరుణ్, దివ్యారావు హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఇవాళే రిలీజైన ప్రభాస్ మూవీ 'వీరబలి' ఇవాళ ప్రభాస్ సినిమా రిలీజవడం ఏంటి? అది కూడా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి-2' కాకుండా మధ్యలో... | Updated: Oct 21, 2016, 08:11PM IST ఇవాళ ప్రభాస్ సినిమా రిలీజవడం ఏంటి ? అది కూడా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి-2' కాకుండా మధ్యలో ఈ వీరబలి ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే మీరు ఈ స్టోరీ చదివితీరాల్సిందే. 2012లో తెలుగులో ప్రభాస్-తమన్నాల కాంబినేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ డైరెక్షన్‌లో ఓ సినిమా రిలీజైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో వీరబలి అనే టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత తమిళంలోనూ ప్రభాస్‌కి బాగా క్రేజ్ వచ్చింది. దీనికితోడు కోలీవుడ్ ఆడియెన్స్‌కి బాగా సుపరిచితులైన తమన్నా, లారెన్స్‌లు కలిసి పనిచేసిన సినిమా కావడంతో తెలుగులో ఆశించినంత హిట్ అవని ఈ సినిమాని తమిళంలో రిలీజ్ చేసి మళ్లీ ఎంతో కొంత క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. మరి ఈ శుక్రవారం ఇతర తమిళ సినిమాలతోపాటే రిలీజైన ఈ సినిమాని అక్కడి ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే ఓ రెండు రోజులు ఆగాల్సిందే!
0business
internet vaartha 120 Views హైదరాబాద్‌ : దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సైబర్‌ సెక్యూరిటీ చట్టాన్ని అమలులోనికి తీసుకు వస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటి కమ్యూనికేషన్స్‌ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ వెల్లడించారు. సైబర్‌ నేరాలను అదుపు లోనికి తీసుకురావడం ఈకామర్స్‌ విధానాన్ని మరింత డిజిటలైజ్‌ చేయడం ఇ-కామర్స్‌ కొనుగోళ్లకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం తమ లక్ష్యం అన్నారు. ఎఫ్‌ట్యాప్సీ ఆధ్వర్యంలో ఫెడరేషన్‌ హౌస్‌లో జరిగిన ఇ-కామర్స్‌ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎఫ్‌ట్యాప్సీ అధ్యక్షుడు రవీంద్రమోడీ అధ్యక్షతన జరిగిన సదస్సులో పలువురు ఇ-కామర్స్‌ నిపుణులు ప్రసంగించారు. జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ సెప్టెంబరు నుంచి అమలులోనికి వస్తున్న సైబర్‌ చట్టం ద్వారా ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ఇతరరాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రంలో ఐటి విధానం సులభతరంగా ఉందని, ఏకగవాక్ష విధానం, సరళతరమైన అనుమతుల విధానం, ఐటిరంగంలో ప్రోత్సాహాన్నిస్తోందన్నారు. ఐటి అనుమతులతో ఇబ్బందులవల్ల బెంగళూరులో ఏర్పాటుకానున్న అమెజాన్‌ కేంద్రం మనరాష్ట్రానికి తరలివచ్చిందని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కూడా తోడైందన్నారు. దేశంలోనే అగ్రభాగంలో తెలంగాణ రాష్ట్రం ఐటిరంగంలో అగ్రభాగంలో ఉన్నా ఇప్పటికీ ఈమెయిల్‌ వాడుతున్న వారిసంఖ్యకేవలం 16 శాతం మాత్రమేనని ఐటిరంగంలో మరింత అభి వృద్ధికి తాము కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇ-కామర్స్‌ విధానం అమెరికాలాంటి దేశాల్లో ఎక్కు వ వినియోగంలో ఉందన్నారు. భారత్‌లో కూడా ఈకామర్స్‌ వ్యాపారానికి అపార అవకాశాలున్నాయ ని ప్రతిసూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, రిటైల్‌రంగ వ్యాపార వేత్తలు ఈ రంగం సేవలను అందిపుచ్చుకోవాలన్నారు. సదస్సులో ట్రిపుల్‌ ఐటి డీన్‌ తురభ్‌ లక్డావాలా, టెంపెస్ట్‌ ఎండి మనిఖంఠ రాచర్ల, షాప్‌టాప్‌ సిఇఒ రజత్‌ షాహి, హ్యాక మానియా సిఇఒ హరీష్‌ కోట్రా, డా.రవికుమార్‌జైన్‌, డా.శ్రీధర్‌ వైథ్యనాధన్‌, కృష్ణ లకంసాని, సీనియర్‌ ఉపాధ్యక్షుడు గౌరాశ్రీనివాస్‌, ఐటిఐటిసేవల విభాగం ఛైర్మన్‌ మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌, జ్యూయలర్స్‌ అసోసిఏషన్‌ అధ్యక్షుడు అవి నాష్‌కుమార్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఎఫ్‌ట్యాప్సీ అధ్యక్షుడు రవీందమోడీ మాట్లాడుతూ ఈకామర్స్‌ రంగం భారత్‌ వృద్ధికి కీలకంగా మారిందన్నారు. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థ ఊపందుకుంటున్నదని ఈతరుణంలో ఇ-కామర్స్‌ రంగానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఆన్‌లైన్‌లో బహుళ ఉత్పత్తులు అందుబాటులోకి రావాలన్నారు. ఇ-కామర్స్‌భారత్‌లో 34శాతం వార్షిక వృద్ధితో ఉందని, 2014లో 16.4 బిలియన్‌ డాలర్లుగా ఉంటే 2016 చివరికి 22బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందన్నారు. భారత్‌లో ఇపుడిపుడేయువ పారి శ్రామిక వేత్తలు పెరుగుతున్నారని ఆరంగాల్లో ఇ-కామర్స్‌ ఒకటన్నారు. ఉపాధి అవకాశాలు, జిడిపి వృద్ధికి ఈ రంగం కీలకంగా మారుతోందని, ఇ-కామర్స్‌, ఇ-రిటైలింగ్‌, పెట్టుబడుల వంటివి బిజినెస్‌ అవకాశాలు పెంచుతాయన్నారు.
1entertainment
Iyan ఇయాన్‌ బోథమ్‌ తరువాత స్థానంలో ఒకీఫ్‌ న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఒకీఫ్‌ భారత పర్యటనకు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన క్రికెటర్‌.ఈ టెస్టుకు ముందు కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఒకీఫ్‌ పై ఆసీస్‌ కూడా భారీ ఆశలు పెట్టుకోలేదు. భారత్‌ లోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి కాబట్టి ఒకీఫ్‌కు ఆసీస్‌ జట్టులో స్థానం కల్పించారు.అయితే ఇప్పుడు ఒకీఫ్‌ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.అసలు సొంతగడ్డపై గత 20 మ్యాచ్‌ల్లో ఒక్క పరాజయం కూడా లేని టీమిండియాకు గట్టి షాకిచ్చి సెలబ్రెటిగా అయిపోయాడు.ఈ మ్యాచ్‌లో మొత్తం ఒకీఫ్‌ సాధించిన వికెట్లు 12.తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసుకున్న ఒకీఫ్‌ రెండవ ఇన్నింగ్స్‌లో కూడా 35 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లను తీసుకున్నాడు.దీంతో తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేసుకున్నాడు.మరోవైపు దిగ్గజాల సరసన కూడా చేరిపోయాడు ఒకీఫ్‌.భారత్‌పై భారత్‌లో ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండవ బౌలర్‌గా ఒకీఫ్‌ నిలిచాడు.ఈ రికార్డు పరంగా ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ ఇయాన్‌ బోథమ్‌ ముందు వరుసలో ఉన్నాడు.1980 పిబ్రవరి 15వ తేదీన భారత్‌తో ముంబైలో జరిగిన టెస్టులో ఇయాన్‌ బోథమ్‌ ఒక టెస్టు మ్యాచ్‌లో 13 వికెట్లు సాధించాడు.ఆ తరువాత వరుసగా ఒకీఫ్‌ రెండవ బౌలర్‌గా గుర్తింపు పొందాడు.ఆపై ఫజూల్‌ మొహ్మాద్‌ పాకిస్థాన్‌,ఏమీ రాబర్ట్స్‌ వెస్టిండీస్‌,డేవిడ్‌ సన్‌ ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఒకీఫ్‌ కీలక పాత్ర పుణే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజం చెందింది.టార్గెట్‌ చేధనకు బరిలోకి దిగిన టీమిండియా 33.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది.తద్వారా చాలా సంవత్సరాల తరువాత భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ గెలిచింది.ఆస్ట్రేలియా విజయం వెనుక స్పిన్నర్‌ స్టీఫెన్‌ ఒకీఫ్‌ కీలక పాత్ర పోషించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత పర్యటకు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చాడు.పుణే టెస్టుకు ముందు కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.భారత్‌లోని పిచ్‌లు అనుకూలిస్తాయి కాబట్టి ఒకీఫ్‌కు ఆస్ట్రేలియా జట్టులో చోటు కల్పించారనే విషయం అందరికి తెలిసిందే.అయితే పుణే టెస్టుల ఒక్కసారిగా ఒకీఫ్‌ సత్తా చాటడంతో హీరోగా మారిపో యాడు. దీంతో భారత్‌లో ఆసీస్‌ మ్యాచ్‌ గెలువడంలో ఒకీఫ్‌ కీలక పాత్ర పోషించాడు. స్వదేశంలో వరుసగా 20 టెస్టుల్లో పరాజయం అనేది లేకుండా దూసుకుపోతున్న భారత్‌కు పుణే టెస్టు గట్టి షాక్‌ ఇచ్చిందనే పేర్కొనాలి.పుణే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన ఒకీఫ్‌ రెండవ ఇన్నింగ్స్‌లో కూడా 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. తద్వారా తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ క్రమంలో ఒకీఫ్‌ ఆస్ట్రే లియన్‌ మాజీ దిగ్గజాల సరసన చేరాడు. భారత్‌లో 2008లో నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టులో ఆసీస్‌ స్పిన్నర్‌ జాసన్‌ క్రేజా నమోదు చేసిన రికార్డును సైతం ఒకీఫ్‌ అధిగమించాడు. మరోవైపు భారత్‌లో ఒఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌ ఒకీఫ్‌ నిలిచాడు.ఈ రికార్డు పరంగా ఇంగ్లండ్‌ పేసర్‌ ఇయాన్‌ బోథమ్‌ ముందు వరుసలో ఉన్నాడు. 1980 ఫిబ్రవరి 15న భారత్‌తో ముంబైలో జరిగిన టెస్టులో ఇయాన్‌ బోథమ్‌ ఒక టెస్టు మ్యాచ్‌లో 13 వికెట్లు సాధించాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కామ‌న్ వెల్త్ గేమ్స్: ప‌త‌కాల్లో 3వ స్థానంలోకి భార‌త్ కామ‌న్ వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్ ఆశాజ‌న‌కమైన ప‌నితీరును క‌న‌బ‌రుస్తోంది. ఈ రోజు ఒక్కరోజే భార‌త్ ఖాతాలో మూడు స్వ‌ర్ణాలు, ఒక ర‌జ‌తం వ‌చ్చి చేరాయి. Samayam Telugu | Updated: Apr 14, 2018, 12:07PM IST కామ‌న్ వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్ ఆశాజ‌న‌కమైన ప‌నితీరును క‌న‌బ‌రుస్తోంది. ఈ రోజు ఒక్కరోజే భార‌త్ ఖాతాలో మూడు స్వ‌ర్ణాలు, ఒక ర‌జ‌తం వ‌చ్చి చేరాయి. బాక్సింగ్‌లో మేరీకోమ్, గౌర‌వ్ సోలంకికి, షూటింగ్‌లో సంజీవ్ రాజ్ పుత్ బంగారు ప‌త‌కాలు గెలుచుకోగా బాక్సింగ్‌లో భార‌త్ ఏక‌ప‌క్షంగా ముందుకెళుతోంది. అమిత్ 46-49కేజీల విభాగంలో ర‌జ‌త ప‌త‌కం ద‌క్కించుకున్నాడు. కామ‌న్ వెల్త్ ప‌త‌కాల వేట‌లో భార‌త్ దీంతో ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ టాప్3లో నిల‌వ‌గ‌లిగింది. మొత్తం 21 స్వ‌ర్ణాలు, 13 ర‌జ‌తాలు, 14 కాంస్య ప‌త‌కాల‌తో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ త‌ర్వాత మూడో స్థానంలో ఇండియా ఉంది. భార‌త్ గెలిచిన ప‌త‌కాల సంఖ్య హాఫ్ సెంచ‌రీకి(48) అతి చేరువ‌లో ఉంది. మ‌రో వైపు బ్యాడ్మింట‌న్ పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీ‌కాంత్ ఫైన‌ల్ చేరాడు. ఇక షూటింగ్‌లోనూ భారత్ జోరు కొనసాగింది. షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ తన ఖాతాలో గోల్డ్ మెడల్ వేసుకున్నాడు. పురుషుల 50మీ రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్‌లో సంజీవ్ కామెన్‌వెల్త్ గేమ్స్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
2sports
sandhya 164 Views ENG vs PAK , nattingham ENG vs PAK నాటింగ్‌ హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ప్రారంభమయింది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో గత మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లాండ్‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. ఐతే వెస్టిండీస్‌ చేతిలో ఘోర పరాజయం చెందిన పాక్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుంది. తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV పెళ్లెప్పుడో చెప్పిన నాగచైతన్య బాహుబలి సినిమా లాగే టాలీవుడ్ లవ్ బర్డ్స్ నాగ చైతన్య- సమంతల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. సెలబ్రిటీ కుటుంబానికి చెందిన ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానంటూ గతంలో సమంత చెప్పిన నాటి నుండి 'సామ్ -చైతూ' మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్నారు... TNN | Updated: Sep 18, 2016, 05:29PM IST పెళ్లెప్పుడో చెప్పిన నాగచైతన్య బాహుబలి సినిమా లాగే టాలీవుడ్ లవ్ బర్డ్స్ నాగ చైతన్య- సమంతల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. సెలబ్రిటీ కుటుంబానికి చెందిన ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానంటూ గతంలో సమంత చెప్పిన నాటి నుండి ' సామ్ -చైతూ ' మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్నారు. వీరిద్దరికీ పెళ్లి చేయబోతున్నట్లు ఇటీవలే నాగార్జున ప్రకటించడంతో ఇక ఈ జంట పెళ్లి వార్తలు అఫీషియల్ అయ్యాయి. అయితే నాగార్జున, సామ్ -చైతూల పెళ్లి చేస్తున్నట్లు చెప్పారు కానీ ఎప్పుడనేది వీరిద్దరికే తెలియాలి. వాళ్లు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి చేస్తాం. నాగ చైతన్య తన ప్రేమ విషయం చెప్పాడు కానీ తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానేది చెప్పలేదు అని నాగార్జున అన్నారు. అయితే ఇంతవరకూ ఈ విషయంపై స్పందించని నాగ చైతన్య తాజాగా తన మనసులో మాటను చెప్పేశాడు. సెలబ్రిటీ బాడ్మింటన్ లీగ్ కు సంబంధించి 'టాలీవుడ్ థండర్స్ టీమ్' కు నాగచైతన్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ టీమ్ పరిచయ కార్యక్రమం శనివారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పెళ్లి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు చైతూ సమాధానం చెబుతూ.. ''వచ్చే ఏడాది సమంతతో తన వివాహం జరగబోతుంది. అయితే మ్యారేజ్ డేట్ మాత్రం ఇంకా.. డిసైడ్ చేయలేదు" అని చెప్పాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 'అజ్ఞాతవాసి' సాంగ్స్ ట్రాక్ లిస్ట్ ఇదిగో! రాజధాని నగరంలో 'అజ్ఞాతవాసి' హంగామా మొదలైంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా వేడుక.. 'అజ్ఞాతవాసి' ఆడియో రిలీజ్ ఈరోజే కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హైదరాబాద్ నగరానికి పయనం అయ్యారు. TNN | Updated: Dec 19, 2017, 02:00PM IST రాజధాని నగరంలో ' అజ్ఞాతవాసి ' హంగామా మొదలైంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా వేడుక.. 'అజ్ఞాతవాసి' ఆడియో రిలీజ్ ఈరోజే కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హైదరాబాద్ నగరానికి పయనం అయ్యారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రారంభంకానున్న 'అజ్ఞాతవాసి' ఆడియో రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా హీరోలందరూ హాజరౌతున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లో ఫుల్ టైం కేటాయిస్తాననటంతో పాటు.. మరే ఇతర ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో పవన్ కెరియర్‌లో 'అజ్ఞాతవాసి' మూవీనే చివరి సినిమాగా మిగిలిపోనుంది. దీంతో 'అజ్ఞాతవాసి' ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్‌ను చేసేందుకు మెగా అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పవన్ ఫ్యాన్స్ అత్యధికంగా హాజరయ్యే అవకాశం ఉండటంతో ఈ ఫంక్షన్‌కు బయోమెట్రిక్ పాస్‌లు కేటాయించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఆడియో రిలీజ్‌కు ముందే ఆదిత్య మ్యూజిక్ ద్వారా అయిదు పాట‌ల ట్రాక్ లిస్ట్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఇప్ప‌టికే ఇందులోని రెండు పాట‌లు సోషల్ మీడియా ద్వారా విడుదల కాగా మిగతా సాంగ్స్‌ను 'అజ్ఞాతవాసి' ఆడియో వేడుక కార్యక్రమంలో విడుదల చేయనున్నారు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV బిగ్‌బాస్‌లో ‘ఆనందో బ్రహ్మ’ బ్యూటీ! తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’32 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 33వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. TNN | Updated: Aug 18, 2017, 07:58AM IST తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’32 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 33వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. నిన్నటి ‘బిగ్‌బాస్ హోటల్’ టాస్క్’లో గెలిపొందిన టీంలకు లగ్జరీ బడ్జెట్ ఇచ్చారు బిగ్‌బాస్. టాస్క్‌లో గెలిపొందిన సెలబ్రిటీలకు రకరకాల వస్తువులను ఇచ్చాడు బిగ్ బాస్. ఒక్కరికీ మూడు వస్తువులను డిస్ ప్లే చేస్తూ అందులో ఒకటిని కోరుకోవాలనగా.. ఎవరికి ఇష్టం వచ్చిన వాటిని వాళ్లు లగ్జరీ బడ్జెట్‌గా గెలిపొందారు. ఇక ఎప్పటిలాగే ఈరోజు ఎపిసోడ్‌లో ధనరాజ్-దీక్షల మధ్య వివాదం రేగింది. బిగ్‌బాస్ హోటల్ టాస్క్‌లో తనకు ఇచ్చిన పనిని తాను చేశానని దాన్ని టాస్క్‌లా చూడకుండా కావాలని తనను కార్నర్ చేస్తున్నారంటూ దీక్ష ఏడ్చేయడంతో శివబాలాజీ, ధనరాజ్‌లు పెద్ద నాటకం ఆడి దీక్ష ఏడుపును ఆపే ప్రయత్నం చేశారు. ధనరాజ్‌ను కొట్టినట్లు.. దానకిి అతడు ఫీల్ అయినట్లు.. ఇదంతా చూస్తున్న ముమైత్ అంతా నిజమే అనుకుని శివబాలాజీపై సీరియస్ కావడం అంతా పెద్ద డ్రామానే నడిచింది. ఇంతలో బిగ్‌బాస్‌లో హౌస్‌లోకి ‘ఆనందో బ్రహ్మ’ హీరోయిన్ తాప్సీ సడన్ ఎంట్రీ ఇవ్వడంతో హౌస్ అంతా సందడిగా మారింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌ నుండి తన మూవీ ముచ్చట్లను తెలిపింది తాప్సీ. ఈసందర్భంగా బిగ్ బాస్ ఆదేశాల మేరకు పాపులర్ మూవీలోని క్యారెక్టర్స్‌ను సెలబ్రిటీలకు ఇచ్చి అలా నటించాలని ‘ఆనందో బ్రహ్మ’ మూవీ స్టైల్‌లో టాస్క్ ఇవ్వడంతో కన్టెస్టెంట్స్ రెచ్చిపోయి పర్ఫామెన్స్ చేశారు. ముఖ్యంగా ధనరాజ్, దీక్షలు పశుపతి, అరుంధతిలుగా పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేశారు. ఇక బిగ్‌బాస్ హౌస్ మొత్తం తిరుగుతూ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుంది తాప్సీ. మరోవైపు మీలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారని పోటీదారులను అడగగా.. ఎక్కువ మంది ధనరాజ్, నవదీప్, ముమైత్‌ల పేర్లు చెప్పగా, దీక్షకు టైటిల్ పొందకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో మరో ఇంట్రస్టింగ్ టాస్క్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బిగ్‌బాస్ టీం.
0business
Suresh 199 Views   సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో విజయానికి భారత్‌ 331 పరుగుల విజయ లక్ష్యాన్ని ప్రత్యర్థిజట్టు నిర్దేశించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్‌, మార్స సెంచరీలతో కదం తొక్కటంతో ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 330 పరుగులుచేసింది. దీంతో భారత్‌ ముందు 331 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్‌ బౌలర్లు ఇషాంత్‌ శర్మ, బుమ్రాహ్‌ చోరో రెండు వికెట్లు తీసుకోగా, ఆమేష్‌ యాదవ్‌, రషీ ధావన్‌ చెరో వికెట్‌, రనౌట్‌రూపంలో మరో వికెట్‌ పడగొట్టారు.
2sports
ఇంగ్లాండు ఆటగాడి బ్యాట్ పై అసభ్య పదజాలం Highlights ఇంగ్లాండ్‌ బ్యాట్స్ మన్ జోస్‌ బట్లర్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మందలించింది. హెడింగ్లే: ఇంగ్లాండ్‌ బ్యాట్స్ మన్ జోస్‌ బట్లర్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మందలించింది. క్రికెట్ అభిమానులు కూడా బట్లర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. తన బ్యాట్‌పై ఉన్న అసభ్యకరమైన పదజాలానికి అతను ఐసిసి ఆగ్రహానికి గురయ్యాడు.  తొలి టెస్టులో పాకిస్తాన్ పై పరాజయం పాలైన ఇంగ్లాండ్‌ ఆ తర్వాత పుంజుకుని రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది.  ఇంగ్లాండ్‌ విజయంలో బట్లర్‌ కీలకపాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.  రెండో టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట మధ్యలో డ్రింక్స్‌ విరామ సమయంలో బట్లర్‌ తన హెల్మెట్‌తో పాటు బ్యాట్‌ను మైదానంలో ఉంచాడు. ఆ సమయంలో బట్లర్‌ బ్యాట్‌ హ్యాండిల్‌పై రాసిన అసభ్య పదజాలం ‘f**k it’ని కెమెరా పట్టుకుంది.  దాన్ని గమనించిన అభిమానులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ‘బట్లర్‌ తన బ్యాట్‌పై ఏమి రాసుకున్నాడో చూశారా’ అంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తూ వెళ్లారు.  ఆ పదజాలంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  మరోసారి ఇలా చేయకూడదని బట్లర్ ను మందలించి వదిలేసింది. Last Updated 4, Jun 2018, 5:01 PM IST
2sports
Visit Site Recommended byColombia కొలంబో నుండి ముంబై వస్తోన్న ఫ్లై ఇండియా విమానం మార్గమధ్యలో మిస్ కావడం.. దాన్ని ‘మిషన్ గెట్ లాస్ట్’ ఆపరేషన్ ద్వారా వెతికిపట్టడం.. వరుస హత్యల మిస్టరీని ఛేదించడం లాంటి క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ‘వీర భోగ వసంత రాయలు’ ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ‘నిజంగానే మా ఇల్లు తప్పిపోయింది సర్‌’ అని ఓ కుర్రాడు పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న సుధీర్ బాబుకి కంప్లైంట్ చేయడం.. దీనికి సుధీర్‌బాబు.. ‘ఇలాంటి అద్భుతాన్ని వినడం కంటే చూస్తే ఇంకా బాగుంటుంది కదా..’ అనడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇందులో నారా రోహిత్‌, శ్రియ సీబీఐ అధికారులుగా సీరియస్ పాత్రలో కనిపిస్తున్నారు. అక్టోబర్ 26న ప్రేక్షకులు ముందుకు వస్తున్న ఈ మూవీకి ఇంద్రసేన దర్శకత్వం వహించారు. బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు బెళ్లన నిర్మిస్తున్నారు. మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందించారు. Veera Bhoga Vasantha Rayalu: ‘వీర భోగ వసంత రాయులు’ ట్రైలర్ X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ఛాన్స్ కోసం కాళ్లు మొక్కుతా అంటూ బతిమిలాడిన శ్రీముఖి Highlights ఛాన్స్ కోసం కాళ్లు మొక్కుతా అంటూ బతిమిలాడిన శ్రీముఖి తెలుగులో ప్రధాన యాంకర్లు  సుమ, అనుసూయ, శ్రీముఖి, రష్మీ,  తదితరులు తన అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఇటీవల తెలుగులో స్టార్ట్ అయిన ఓ ఎంట ర్‌టైన్ ప్రొగ్రాంలో సుమను ఆటపట్టించేందుకు రష్మీ, శ్రీముఖి చేసిన ప్రాంక్ కాల్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. అసలు ఏం జరిగిందంటే.. రష్మీ యాంకర్‌గా వ్యవహరించే ఓ వినోద కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి ప్రాంక్ కాల్ చేయాల్సి వచ్చింది. దాంతో సుమకు ప్రాంక్ కాల్ చేస్తానని శ్రీముఖి చెప్పి కాల్ చేసింది.  సుమకు శ్రీముఖి కాల్ చేసి.. గుంటూరు నుంచి నేను పుష్ఫను కాల్ చేస్తున్నాను. చాలా కష్టపడితే నీ ఫోన్ నంబర్ దొరికిందమ్మా. నీతో ఫోన్‌లో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది అని శ్రీముఖి గొంతు మార్చి చెప్పింది. నీతో మాట్లాడినందుకు ఈ రోజు అన్నం తిననే అని శ్రీముఖి అనగా.. మూడు రోజులు పాటు తినకు. చాలా మందికి భోజనం మిగులుతుంది సుమ బదులిచ్చింది. దాంతో టెలివిజన్‌లో మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు సుమమ్మా అని శ్రీముఖి అనగానే.. లేదమ్మా నేను ఫోన్‌లో మాట్లాడుతున్నాను అని సుమ పంచ్ ఇచ్చింది.సుమమ్మా నీవు ఊ అంటే ఒక్కసారి స్టార్ మహిళలకు వచ్చిపోతాను అని ఫోన్‌లో వెంటపడింది. నేను బిజీగా ఉన్నాను అని సుమ చెబుతుండగా.. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటా అని శ్రీముఖి చెప్పగా.. కావాలంటే నా కాళ్లు వాట్సప్‌లో పంపిస్తా.. అప్పుడు నా కాళ్లను పట్టుకో అని సుమ పంచ్ విసిరింది. Last Updated 28, Apr 2018, 6:15 PM IST
0business