news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Visit Site Recommended byColombia రాజమాత శివగామి ‘బాహుబలి-1’లో చిన్నారితో జలపాతం వద్ద కనిపిస్తుంది. బాహుబలి-2 ట్రైలర్‌లో చూస్తే ఆమె ఆ బిడ్డను ‘మహేంద్ర బాహుబలి’ అని జనాలకు పరిచయం చేస్తున్నట్లు కనిపించింది. జలపాతం వద్ద, మహేంద్ర బాహుబలిని పరిచయం చేస్తున్నప్పుడు పచ్చ చీర ధరించింది. అంటే, అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత ఆమె ఆ ప్రకటన చేసి ఉంటుందని, ఆ తర్వాత ఆ బిడ్డను చంపేందుకు బల్లాలదేవ ప్రయత్నిస్తుంటే తప్పిస్తూ జలపాతంలో పడిపోతారని తెలుస్తోంది. ఇద్దరు కాదు.. ముగ్గురు ప్రభాస్‌లు... బాహుబలిలో ప్రభాస్ ద్విపాత్రాభినయం పోషించిన సంగతి తెలిసిందే. అయితే, మహేంద్ర బాహుబలి తాత ధర్మేంద్ర బాహుబలిని పెయింటింగ్‌లో ప్రభాస్ పోలికలతోనే ఉన్నట్లు చూపించారు. అంటే, ప్రభాస్‌ను మూడు పాత్రల్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రభాస్ అభిమానులు అతన్ని ధర్మేంద్ర బాహుబలిగా మూడో పార్టులో చూసే అవకాశాలు ఉంటాయేమో. కట్టప్ప - మహేంద్ర బాహుబలి శివగామి చేతిలో ఉన్న చిన్నారి మహేంద్ర బాహుబలి పాదాన్ని తలపై పెట్టుకుంటాడు. ఆ సమయంలో తలపై గాయాలతో యుద్ధక్షేత్రం నుంచి వచ్చినట్లు కనిపించాడు. అంటే, అమరేంద్ర బాహుబలిని చంపిన తర్వాత ఆ సన్నివేశం ఉంటుందని తెలుస్తోంది. మహిష్మతి రాజ్యం రహస్యాలు ఎవరికి అందాయి? మహిష్మతి రాజ్యం రహస్యాలను దొంగచాటుగా చేరవేసిన సైనికుడిని మహేంద్ర బాహుబలి, భల్లాలదేవ పట్టుకుంటారు. అయితే, అప్పటికే రాజ్యం రహస్యాలు కాలకేయులకు అందుతాయి. అయితే, యుద్ధం సమయంలో కాలకేయులు రహస్యాల ఆధారంగా యుద్ధక్షేత్రానికి వచ్చినట్లు కనిపించరు. అంటే, కాలకేయుల్లోనే మరొకరికి ఆ రహస్యాలు అందుతాయని, మహిష్మతి రాజ్యంపై మరోసారి దండెత్తడానికి ఆ రహస్యాలు ఉపయోగపడతాయని తెలుస్తోంది. అమరేంద్ర బాహుబలి మరణానికి ముందే.. భల్లాలదేవ రాజు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సందేహమే కాదు, మరో విషయం కూడా సినిమాపై ఆసక్తి కలిగిస్తుంది. 2014లో విడుదల చేసిన బాహుబలి-1 ప్రోమో వీడియోల్లో ప్రభాస్ రాజదర్భార్‌లో కత్తి తిప్పుతూ కనిపిస్తాడు. ఆ సమయంలో భల్లాలదేవ సింహాసనంపై కనిపిస్తాడు. అయితే, బాహుబలి-1 చివరిలో శివగామి.. అమరేంద్ర బాహుబలిని రాజుగా ప్రకటిస్తుంది. అమరేంద్ర బాహుబలి సింహాసనం... భల్లాలదేవకి ఎలా దక్కుతుందనేది ప్రధాన ప్రశ్న. ఈ విషయం రెండో భాగం విడుదలైన తర్వాతే తెలుస్తుంది. సో, అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు....
0business
Hyderabad, First Published 9, Sep 2019, 9:41 AM IST Highlights చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇటీవల అస్వస్థత కారణంగా స్థానికరామచంద్ర ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.   ప్రముఖ దర్శకుడు, సీనియర్ నటుడు రాజశేఖర్ అనారోగ్యం కారణంగా మృతిచెందారు. ఆయన వయసు 62 ఏళ్లు. చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇటీవల అస్వస్థత కారణంగా స్థానికరామచంద్ర ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు అంత్యక్రియలు జరపనున్నారు. ఆయన మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజశేఖర్ ఆ తరువాత నటుడిగా మారారు. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన 'నిళల్ గల్' చిత్రంలోఒక హీరోగా రాజశేఖర్ నటించారు. 'ఇదు ఒరు పొన్ మాలై పొళుదు..' అనే పాట ద్వారా అందరికీ సుపరిచితుడయ్యాడు. 'పలైవనచోలై', 'చిన్నపూవే మెల్ల పెసు' తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఎయిర్‌లిఫ్ట్‌ చిత్రంలో మరో పాట విడుదల సెలవుల్లో తన అభిమానులకు కానుకగా పాట విడుదల చేస్తున్నట్లు అక్షయ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. TNN | Updated: Dec 25, 2015, 06:15PM IST బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రధానపాత్రలో నటిస్తున్న ఎయిర్‌లిఫ్ట్‌ చిత్రంలో మరో పాట విడుదలైంది. సెలవుల్లో తన అభిమానులకు కానుకగా దీనిని విడుదల చేస్తున్నట్లు అక్షయ్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 1990లో ఇరాక్‌, కువైట్‌లో జరిగిన ఉగ్రదాడుల ఆధారంగా ఈ చిత్రాన్ని రాజాకృష్ణ మేనన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అక్షయ్‌కి జంటగా నిమ్రత్‌ కౌర్‌ నటిస్తోంది.
0business
Pakistan batting 30 ఓవర్లకు పాకిస్థాన్‌ 166-1 చాంపియన్స్‌ట్రోఫీ లో భాగంగా కార్డిఫ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 30 ఓవర్లు పూర్తయే సరికి వికెట్‌ నష్టానికి 166 పరుగులు చేసింది. విజయం సాధించటానిఇక 20 ఓవర్లలో 46 పరుగులు మాత్రమే చేయాలి సుంది.. అజర్‌ ఆలీ 72, బాబర్‌ అజామ్‌ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
2sports
Feb 23,2016 టాటా కొత్తకారు పేరు 'టైయాగో' న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కొత్తగా మార్కెట్లోకి తేనున్న బుల్లి హ్యాచ్‌బ్యాక్‌ కారు పేరును కంపెనీ 'టైయాగో'గా మార్చింది. అంతకు ముందు ఈ కారుకు సంస్థ 'జైకా'గా నామకరణం చేసి మార్కెట్లోకి తేవాలని నిర్ణయించింది. ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న 'జికా' వైరెస్‌ మాదిరిగానే ఈ కారు పేరు కూడా పలుకుతున్న నేపథ్యంలో... కొత్తకారు పేరు మార్చాలని కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్‌ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా కొత్త కారుకు పేరు సూచించాల్సిందిగా పోటీ నిర్వహించింది. దాదాపు 37 వేల సూచనలు అందాయి. ఇందులో 'అడోర్‌', 'సివియెట్‌', 'టైయాగో' పేర్లను ఎంపిక షార్ట్‌లిస్ట్‌ చేశారు. ఇందులో ఎక్కువ మంది నెట్‌జెన్‌లు 'టైయాగో'కు ఓటు వేయడంతో కంపెనీ కొత్త కారుకు అదే పేరును ఖరారు చేసింది. ఈ కొత్త కారును ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేసేది కంపెనీ వెల్లడించలేదు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
is these 15 contestants confirmed for bigg boss 3 telugu? బిగ్ బాస్ 3: ఆ 15 మంది సెలబ్రిటీలు వీరే! ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్లు ఖరారైపోయారా? ఆ 15 మంది సెలబ్రిటీలు వీరేనా? ఈ ప్రశ్నలకు సోషల్ మీడియా ఔననే అంటోంది. ఎందుకంటే 15 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కూడిన జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Samayam Telugu | Updated: Jul 14, 2019, 07:33PM IST ‘బిగ్ బాస్’ మూడో సీజన్ మొదలవుతోంది. ఈనెల 21 నుంచి బిగ్ బాస్ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచనుంది. కింగ్ నాగార్జున తొలిసారి ‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేస్తుండటంతో ఈ మూడో సీజన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీనికి తగ్గట్టుగానే షో నిర్వాహకులు, స్టార్ మా ఛానెల్ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 100 రోజులపాటు ఈ షోను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇదిలా ఉంటే, హౌజ్‌లోకి అడుగుపెట్టనున్న కంటెస్టెంట్లు వీరేనంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న సెలబ్రిటీల జాబితా: 1. నటుడు వరుణ్ సందేశ్ 4. నటుడు తరుణ్ 5. యాంకర్ ఉదయభాను 6. గాయకుడు హేమచంద్ర 7. ‘తీన్‌మార్’ సావిత్రి (యాంకర్ శివ జ్యోతి) 8. శ్రీరెడ్డి 10. యాంకర్ శ్రీముఖి 11. యాంకర్ లాస్య 14. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ 15. జర్నలిస్ట్ ‘ముఖాముఖి’ జాఫర్ ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న జాబితా మాత్రమే. ఈ జాబితాలో ఒక్క పేరును కూడా ఇంకా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు ఖరారు చేయలేదు. కానీ.. యాంకర్ శ్రీముఖి, ‘తీన్‌మార్’ సావిత్రి, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఖరారయ్యారని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది కచ్చితంగా చెపుతున్నారు. అయితే, ‘బిగ్ బాస్’లో చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను ఇప్పటికే యాంకర్ లాస్య, ఉదయభాను, తరుణ్ ఖండించారు. తాము ఈ షోలో చేయడం లేదని చెప్పారు. తాను ‘బిగ్ బాస్’లో చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు అంటూ శ్రీరెడ్డి వరుసపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీళ్లు నలుగురు తప్ప మిగిలిన సెలబ్రిటీలు ఈ వార్తలపై స్పందించలేదు. ‘బిగ్ బాస్’ వార్తలను ఖండించిన ముగ్గురిని పక్కన బెడితే మిగిలిన 12 మంది సెలబ్రిటీల పేర్లు ఖరారేనా అంటే.. చెప్పలేని పరిస్థితి! ఎందుకంటే, ఈ జాబితాలో జర్నలిస్టు జాఫర్ పేరు కూడా ఉంది. టీవీ9 ఛానెల్‌లో ‘ముఖాముఖి’తో బిజీగా ఉండే జాఫర్.. 100 రోజులు హౌజ్‌లో ఉండటానికి అంగీకరించారా? అనే అనుమానం కలుగుతోంది. శ్రీరెడ్డి పేరు జాబితాలో ఉన్నా ఆమెను తీసుకునే ధైర్యం ‘బిగ్ బాస్’ నిర్వాహకులు చేయరని ఇండస్ట్రీకి చెందినవారు అంటున్నారు. మిగిలిన సెలబ్రిటీల పేర్లు మాత్రం నమ్మే విధంగానే ఉన్నాయి. చూద్దాం ఈ జాబితాలో ఎంత మంది హౌజ్‌లోకి వెళ్తారో..!!!
0business
AMEER KHAN అమీర్‌ఖాన్‌కు భారత్‌ మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ తెలియదా? హైదరాబాద్‌: భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఎవరు అని టివి వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె పేరు నాకు తెలుసు కాకపోతే ఇప్పుడు గుర్తుకు రావడం లేదని అమీర్‌ బుకాయించాల్సిన పరిస్థితి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ మైదానంలో చోటు చేసుకుంది. భారత్‌-ఆసీస్‌ మధ్య చివరి టీ20కి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లీ ఆహ్వానం మేరకు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్‌కి వచ్చిన అమీర్‌ఖాన్‌, జైరావశీంతో కలిసి మైదానంలో సం దడి చేశారు. ఈ సందర్భంగా టివి వ్యాఖ్యాత జతిన్‌ సప్రూ, వీరేంద్ర సెహ్వాగ్‌లు వీరిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ట్రైబ్రేకర్‌ ప్రశ్న అంటూ భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఎవరు అని ప్రశ్నించారు. దీనికి అమీర్‌, జైరా సమాధానం చెప్పలేకపోయారు. నాకు తెలుసు కానీ ఇప్పుడు గుర్తుకురావడం లేదని అమీర్‌ అన్నాడు. భారత మహిళా క్రికెట్‌ జట్టును రెండు సార్లు ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, అమీర్‌కు తెలియకపోవడం ఏమిటని నెటిజన్లు విస్మయం చెందుతున్నారు. అప్పటికీ సప్రూ వారికి కొన్ని సూచనలు ఇస్తున్నా ఫలితం లేకపోయింది. అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే.
2sports
this day that year: 'master blaster' sachin tendulkar makes his test debut 28 ఏళ్ల క్రితం ఇదే రోజు.. సచిన్ vs వకార్! అది 1989వ సంవత్సరం.. తేదీ నవంబర్ 15.. కరాచీలోని నేషనల్ స్టేడియం.. ఇండియా, పాకిస్థాన్ మధ్య టెస్టు మ్యాచ్.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితంలో మరిచిపోలేని రోజు. TNN | Updated: Nov 15, 2017, 01:04PM IST అది 1989వ సంవత్సరం.. తేదీ నవంబర్ 15.. కరాచీలోని నేషనల్ స్టేడియం.. ఇండియా, పాకిస్థాన్ మధ్య టెస్టు మ్యాచ్.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితంలో మరిచిపోలేని రోజు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఒక గొప్ప ఆటగాడు అడుగు పెట్టిన క్షణమది. సరిగ్గా ఇదే రోజు నవంబర్ 15న పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్ ద్వారా లిటిల్ మాస్టర్ అతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ తన కెరీర్‌ను సుదీర్ఘకాలం పాటు విజయవంతంగా కొనసాగించాడు. క్రికెట్ గాడ్‌గా నిలిచిపోయాడు. తన అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో సచిన్ ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 24 బంతులు ఆడిన సచిన్.. రెండు బౌండరీలతో 15 పరుగులు సాధించాడు. పాక్ బౌలింగ్ దిగ్గజం వకార్ యూనిస్ వేసిన ఓ చక్కటి బంతికి సచిన్ వెనుదిరిగాడు. వకార్ యూనిస్‌కు కూడా ఇదే తొలి టెస్టు కావడం విశేషం. ఆ తరవాత వకార్ కూడా పాక్ ప్రధాన బౌలర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. సచిన్ ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌ను భారత్‌ డ్రాగా ముగించింది.
2sports
Manipalswsan ఎస్‌బిహెచ్‌ ఎండిగా మణిపల్వేశన్‌ హైదరాబాద్‌, జనవరి 16: తెలంగాణ లీడ్‌బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ మేనేజింగ్‌ డైరె క్టర్‌గా మణిపల్వేశన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 14వ తేదీనుంచే ఆయన నియామక ఉత్త ర్వులు అమలులోకివచ్చాయి. 1982లో బ్యాంకు లోప్రొబేషనరీ అధికారి గా నియమితులయిన మణిపల్వేశన్‌వివిధ పద వులు నిర్వహించారు. అంతకుముందే ఎస్‌బిఐ హాంకాంగ్‌ శాఖలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారిగాపనిచేసారు. ఎస్‌బిఐ క్యాప్‌ సెక్యరిటీస్‌కుఎండిగాను, ముంబై కార్పొరేట్‌ కార్యా లయంలోను పనిచేసారు. అలాగే కేంద్ర కార్యాల యంలో డిఫ్యూటీఎండి కార్యాలయంలో చీఫ్‌ ఆప రేటింగ్‌ అధి కారిగాను, చీఫ్‌ ఝనరల్‌ మేనేజర్‌ ఒఎస్‌డిగాను పనిచేసారు. అంచలంచెఉగా ఎదిగిన పల్వేశన్‌ ఎస్‌బిహెచ్‌లో గతనెలలోనే ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌డ్యూటీగా సిజిఎంగా నియమితులయ్యారు. తదనంతరం ఆయన్నుఎండిగా పదోన్నతి కల్పిస్తూ ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
1entertainment
బిగ్ బాస్2: శ్యామలను కావాలనే ఎలిమినేట్ చేశారా..? Highlights నిజానికి శ్యామల కంటే నూతన్ నాయుడుకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. అలాంటప్పుడు ఆయన ఒక్కరినే హౌస్ లోకి పంపిస్తే సరిపోతుంది కానీ శ్యామలను కూడా తీసుకోవడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు కలుగుతున్నాయి బిగ్ బాస్ సీజన్2 ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. తేజస్వి, కౌశల్, భాను శ్రీ ఇష్యూతో షో టీఆర్పీ రేటింగ్స్ సంగతి పక్కన పెడితే హౌస్ లో పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఇక శ్యామలను ఎలిమినేట్ చేసి ఇప్పుడు మళ్లీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రప్పించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. శ్యామలను కావాలనే హౌస్ నుండి ఎలిమినేట్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి శ్యామల ఎలిమినేషన్ ఎపిసోడ్ లో కూడా ఆమె బయటకు వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. జూలైలో ఆమె కుమారుడి మొదటి పుట్టినరోజు ఉండడంతో కావాలనే ఆమెను ఎలిమినేట్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఆమె కుమారుడు పుట్టినరోజు జరిగిన రెండు రోజులకే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపిస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించడంతో ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. నిజానికి శ్యామల కంటే నూతన్ నాయుడుకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. అలాంటప్పుడు ఆయన ఒక్కరినే హౌస్ లోకి పంపిస్తే సరిపోతుంది కానీ శ్యామలను కూడా తీసుకోవడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు కలుగుతున్నాయి.    Last Updated 31, Jul 2018, 2:23 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రియోలో మెరిసిన నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ రియో ఒలింపిక్స్ లో తళుక్కుమన్నారు. TNN | Updated: Aug 8, 2016, 09:49AM IST రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ రియో ఒలింపిక్స్ లో తళుక్కుమన్నారు. ఒలింపిక్స్ ఐవోసీ సభ్యురాలైన ఆమె ఒలింపిక్స్ కు ముందే రియో చేరుకుంది. మహిళల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ లో ఫైనల్ పోటీలు జరిగాయి. అందులో గెలిచిన విజేతలకు నీతా అంబానీ చేతుల మీదుగానే పతకాలను అందించారు. నీతా అంబానీ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీలో సభ్యత్వం పొందిన తొలి భారత మహిళగా ఆమె ఇప్పటికే ఘనత సాధించింది.
2sports
Hyderabad, First Published 19, Sep 2018, 12:24 PM IST Highlights ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై లైట్ మెన్ గా పని చేసే ఓ కార్మికుడు సోమవారం ఫిర్యాదు చేశారు. మణిరత్నం ఆదుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని అంటున్నారు. సినీ లైట్ మెన్ గా పని చేసిన ఆయన లైట్ మెన్ సంఘంలో సభ్యుడిగా ఉన్నానని వెల్లడించారు.  ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై లైట్ మెన్ గా పని చేసే ఓ కార్మికుడు సోమవారం ఫిర్యాదు చేశారు. మణిరత్నం ఆదుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని అంటున్నారు. సినీ లైట్ మెన్ గా పని చేసిన ఆయన లైట్ మెన్ సంఘంలో సభ్యుడిగా ఉన్నానని వెల్లడించారు. పదేళ్ల క్రితం మణిరత్నం సినిమాలకు పని చేశానని, అభిషేక్ బచ్చన్ హీరోగా మణిరత్నం రూపొందించిన గురు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను విష జ్వరానికి గురైనట్లు తెలిపారు. ఆసుపత్రిలో చేరగా రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో తాను పేదవాడిని కావడంతో తమ వద్ద డబ్బు లేకపోవడంతో మణిరత్నం సహాయం కోరగా ఆయన స్పందించలేదని వెల్లడించారు. లైట్ మెన్ సంఘం నుండి సహాయం చేయాలని కోర్టు ఆదేశించగా.. ఆ డబ్బు ఇవ్వడం కోసం ఆ సంఘం ఇరవై వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారనే విషయాన్ని బయట పెట్టాడు. మణిరత్నం సినిమాలకు పని చేసినందుకు గాను ఆయన మానవత్వంతో ఆర్ధిక సమయం చేయాలని కోరాదరు. లేకపోతే కుటుంబంతో సహా నిరాహార దీక్ష చేస్తామని అన్నారు.  Last Updated 19, Sep 2018, 12:24 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Kuldeep Yadav: చాహల్ కంటే కుల్దీప్ యాదవ్ డేంజర్ కుల్దీప్ యాదవ్ ప్రధాన బలం బంతిని గాల్లో టర్న్ చేయడం. గతంలో షేన్‌వార్న్ విసిరిన బంతి కూడా ఇలానే బ్యాట్స్‌మెన్‌కి సమీపించేలోపు గాల్లో అనూహ్యంగా టర్న్ తీసుకునేది. ఇక చాహల్ అంటారా..? -మాథ్యూ హెడెన్ Samayam Telugu | Updated: Mar 11, 2019, 05:27PM IST Kuldeep Yadav: చాహల్ కంటే కుల్దీప్ యాదవ్ డేంజర్ హైలైట్స్ మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలు చాహల్ కంటే కుల్దీప్ యాదవ్ ప్రమాదకర బౌలరని మాథ్యూ హెడెన్ హెచ్చరిక ఆస్ట్రేలియాతో బుధవారం ఆఖరి వన్డే ఆడనున్న భారత్ భారత మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ , చాహల్ గత కొంతకాలంగా ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. ఈ ఇద్దరే భారత్ జట్టు ప్రధాన అస్త్రాలని ఇప్పటికే మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్‌ కూడా చేరాడు. అయితే.. చాహల్‌ కంటే కుల్దీప్ యాదవే ప్రమాదకర బౌలరని ఈ మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం మధ్యాహ్నం భారత్ జట్టు ఐదో వన్డేలో తలపడనుంది. ‘కుల్దీప్ యాదవ్ ప్రధాన బలం బంతిని గాల్లో టర్న్ చేయడం. గతంలో షేన్‌వార్న్ విసిరిన బంతి కూడా ఇలానే బ్యాట్స్‌మెన్‌కి సమీపించేలోపు గాల్లో అనూహ్యంగా టర్న్ తీసుకునేది. ఇక చాహల్ అంటారా..? అతను ప్రత్యేకమైన బౌలర్. ఎక్కువగా స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేసేందుకే మొగ్గు చూపుతాడు. నేను ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌గా ఉండింటే..? చాహల్ బౌలింగ్‌‌ని ఎదుర్కొనేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడ్ని. కుల్దీప్ యాదవ్‌లా అతను బంతిని టర్న్ చేయలేడు. అందుకే.. చాహల్‌తో పోలిస్తే.. కుల్దీప్ యాదవే ప్రమాదకర బౌలర్’ అని హెడెన్ వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
ఆర్‌బీఐలో ఇక 'బోర్డు' పెత్తనం..! - గవర్నర్‌కు చెక్‌ చెప్పేలా సర్కారు కొత్త వ్యూహం.. - ఆర్‌బీఐ, ఉర్జిత్‌ బృందాన్ని డమ్మీ చేయనున్నారా.. - 19న సమావేశంలో ఈ దిశగానే అడుగులు.. - అస్త్రాలను తయారు చేసుకుంటున్న సభ్యులు! నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారతీయ రిజర్వు బ్యాంక్‌ను(ఆర్‌బీఐ) పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకొని.. దానిని ఇంటి సంస్థగా మార్చుకొనేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు పక్కాగా వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్‌, ఆయన బృందానికి పరోక్షంగా చెక్‌ చెప్పేలా సర్కారు సెంట్రల్‌ బోర్డు సభ్యులను రంగంలోకి దించాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. సర్కారుకు అనుకూలంగా బోర్డులో నిర్ణయాల తీసుకొని.. తద్వారా ఆర్‌బీఐ గవర్నర్‌తో పాటు ఆయన బృందంతోనే సదరు ర్ణయాలను అమలయ్యేలా చూడాలని కేంద్రం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆర్‌బీఐ వద్ద ఆర్థిక విపత్తులను ఎదుర్కొనేందుకు నిల్వగా ఉన్న సొమ్ముపై సర్కారు కన్నెసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడం.. దేశంలో కరెంటు ఖాతా లోటు అంతకంతకు పెరుగుతన్న నేపథ్యంలో.. డబ్బులు లేకుండా దేశంలో కొత్తగా ఓటరు ఆకర్షణ పథకాలను తీసుకు వచ్చేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో సర్కారు కన్ను ఆర్‌బీఐ వద్ద నిల్వ ఉన్న నిధులపై పడింది. ఈ నిధులను వ్యవస్థలోకి తేవడం ద్వారా లోటును అధిగమించాలన్నది సర్కారు ప్లాన్‌. దీనికి తోడు ఆర్‌బీఐ బ్యాంకుల పట్ల వ్యవహరిస్తున్న పీసీఏ కఠిన వైఖరితో కార్పొరేట్‌ సంస్థలకు గతంలో మాదిరిగా అప్పు పుట్టడం లేదు.. దీంతో వీరు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు విరివిగా రుణాలు ఇచ్చేలా ఆర్‌బీఐ నిబంధనలను సవరించాలని కూడా ప్రభుత్వం.. పెద్ద బ్యాంక్‌పై మరింత ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం. అందరి దృష్టి 19వ తేదీపైనే.. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈనెల 19న జరగనున్న ఆర్‌బీఐ కేంద్ర బోర్డు సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7 అధికారాలను ఉపయోగిస్తూ.. గతనెల 10న ఆర్థిక శాఖ చేసిన సూచనలను పరిగణించాలని సెంట్రల్‌ బోర్డులోని ప్రభుత్వ నామినీలు ఆర్‌బీఐని కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ, బోర్డు సభ్యులకు మధ్య వాడిగా వేడిగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బోర్డు పాత్ర, దాని అధికారాలు, నియంత్రణపరమైన నిర్ణయాలు వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి కేంద్ర బోర్డు కల్పించే అధికారాలతో.. బోర్డు తరఫున ఆర్‌బీఐ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. పాలన విషయాల్లో ఆర్‌బీఐ యాథాతథ స్థితిని కోరుకుంటోంది. అయితే, ప్రభుత్వ నామినీలు మాత్రం ఆర్‌బీఐ చట్టం ప్రకారంగా ఇకపై బోర్డు కూడా కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ, ఇందుకు ఆర్‌బీఐ సుముఖంగా లేదు. పాలనలో ఆర్‌బీఐ పూర్తి స్వయంప్రతిపత్తిని కోరుకుంటోంది. ఆర్‌బీఐపై ఒత్తిడి తెస్తాం.. విశాలమైన దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు అమలయ్యేలా ఈ నెల 19న జరగనున్న కేంద్ర బోర్డు సమావేశంలో తాము ఆర్‌బీఐపై ఒత్తిడి తేనున్నట్టుగా బోర్డులో ప్రభుత్వ తరఫున ప్రాతినిధ్యం వహించే వారు చెబుతున్నట్టు రాయిటర్స్‌ సంస్థ ఒక కథనాన్ని వెల్లడించింది. 'ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యాలను ఆర్‌బీఐ గవర్నర్‌ గుర్తించాలి దీనికి సంబంధించి బోర్డు సభ్యులతో ఉర్జిత్‌ చర్చించాల్సిందే' అని ప్రభుత్వ ఆర్థిక శాఖలోని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. 'ఇందుకు భిన్నంగా ఆర్‌బీఐ గవర్నర్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ మందుకు పోవాలని భావిస్తే ఆయన తన పదవి నుంచి తప్పుకోవడమే మేలు' అని సదరు అధికారి తెలిపారు. ఇదే విషయమై ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సభ్యుడు ఒకరు స్పందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతలను కాపాండేందుకు తాము అవసరమైన అన్ని చర్యలు చేపడతామని రాయిటర్స్‌కు తెలిపారు. గవర్నర్‌ ఆయన బృందం వారు తీసుకుంటున్న నిర్ణయాలను వివరించడంతో పాటు తగు విధ:గా సమర్థించుకోవాల్సి ఉంటుందని అన్నారు. దీనితో పాటు పలువురు ఆర్థిక శాఖ అధికారులు, బోర్డు సభ్యులు కూడా 19న జరిగే సమావేశంలో ఆర్‌బీఐపై ఒత్తిడి తెచ్చేందుకే అస్త్రాలను తయారు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బోర్డులో అత్యధికులు సర్కారు సమర్థకులే.. రిజర్వు బ్యాంక్‌ వ్యవహారాలను సెంట్రల్‌బోర్డు లోని డైరెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. ఆర్‌బీఐ చట్టం 1934 ప్రకారం ఈ బోర్డును కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. బోర్డు సభ్యులు పదవీ కాలం నాలుగేండ్లు. ఆర్‌బీఐ కేంద్ర బ్యాంకులో అధికారిక, అనధికారిక డైరెక్టర్లు ఉంటారు. ఆర్‌బీఐ గవర్నర్‌తో పాటు గరిష్టంగా నలుగురు డిప్యూటీ గవర్నర్లను ప్రభుత్వం అధికారిక డైరెక్టర్లుగాను, పలు రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను, ఇద్దరు ప్రభుత్వ అధికారులతో కలిపి గరిష్టంగా పది మందిని కేంద్రం అనధికారిక డైరెక్టర్లుగా నామినేట్‌ చేస్తుంది. దీనికి తోడు ఆర్‌బీఐకి చెందిన నాలుగు స్థానిక బోర్డుల నుంచి ఒక్కో సభ్యుడికి సెంట్రల్‌ బోర్డులో స్థానం ఉంటుంది. కాగా.. ప్రస్తుతం బోర్డులో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌తో పాటు నలుగురు డిప్యూటీ గవర్నర్‌లు అఫిషియల్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. వీరికి తోడు కేంద్ర ప్రభు త్వం ప్రతినిధులుగా సుభాష్‌ చంద్రగార్గ్‌, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం కలిగిన ఎస్‌.గురుమూర్తి, సతీష్‌ కాశీనాథ్‌ మరాఠేతో పాటు ఎన్‌. చంద్రశేఖరన్‌ (టాటా సన్స్‌), బీఎన్‌ దోషి (మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్స్‌), సుధీర్‌ మన్‌కడ్‌ (టీమ్‌లీజ్‌ సంస్థ చైర్మెన్‌), దిలీప్‌ ఎన్‌ సంఘ్వీ (సన్‌ ఫార్మా), పీకే మహంతీ, రేవతీ ఐయ్యర్‌ (మాజీ బ్యూరోక్రాట్లు), సచిన్‌ చతుర్వేది (డైరెక్టర్‌ జనరల్‌, రీసెర్స్‌ సిస్టమ్‌ ఫర్‌ డెవలపింగ్‌ కంట్రీస్‌) తదితరులు ఉన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
- మరో రూ.1,700 కోట్ల జరిమాన - కెేజీ-డీి6లో ఉత్పత్తి లక్ష్యాన్ని చేరని రిలయన్స్‌, బీపీ - రూ.20వేల కోట్లకు చేరిన మొత్తం పెనాల్టీ :తాజాగా చమురు మంత్రిత్వ శాఖ వెల్లడి న్యూఢిల్లీ : ఉత్పత్తి లక్ష్యాన్ని చేరని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ దాని భాగస్వామి బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ) కంపెనీలు మరోమారు భారీ జరిమానకు గురి అయ్యాయి. ఈశాన్యంలోని కేజీ-డీ6 క్షేత్రంలో ఆ కంపెనీలు ప్రభుత్వానికి హామీ ఇచ్చిన సహాజ వాయువు ఉత్పత్తి లక్ష్యాన్ని నెరవేర్చకపోవడంతో కేంద్రం ఈ చర్యకు దిగింది. 2015-16కు గాను 264 మిలియన్‌ డాలర్లు (రూ.1,700 కోట్లు పైగా) జరిమాన విధించినట్లు చమురు మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. గత ఆరు సంవత్సరాల నుంచి ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఈ క్షేత్రంలో ఉత్పత్తి లక్ష్యాన్ని చేరలేకపోతోంది. 2010 ఏప్రిల్‌ ఒక్కటో తేది నుంచి ఇదే పరిస్థితి. దీంతో ఆ కంపెనీపై ఇప్పటి వరకు పడిన మొత్తం జరిమాన 3.2 బిలియన్‌ డాలర్లు (రూ.20వేల కోట్లకు పైగా) చేరుకుందని మంత్రిత్వ శాఖ సదరు అధికారి వెల్లడించారు. గ్యాస్‌ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం నుంచి నిర్వహణ, పెట్టుబడి వ్యయాలన్నింటీని రిలయన్స్‌ దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్‌ పెట్రోలియం, కెనడాకు చెందిన నికో రిసోర్సెస్‌లు వెనక్కి తీసుకునెందుకు ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు అనుమతిస్తోంది. ఆ తర్వాతే ప్రభుత్వంతో లాభాలను పంచుకోవాలని నిర్దేశిస్తుంది. తాజా జరిమానాలతో ప్రభుత్వానికి 175 మిలియన్‌ డాలర్ల మేర అధిక ఆదాయం లభించనుందని అంచనా. కేజీ-డీ6 బ్లాక్‌లోని ధీరుబాయి-1, ధీరుబాయి-3 గ్యాస్‌ క్షేత్రాల్లో ప్రతీ రోజు 80 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్లు (ఎంఎస్‌ఎస్‌సిఎండి) గ్యాస్‌ ఉత్పత్తి చేపడుతామని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ తొలుత ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. కాగా 2011-12లో ఇది కేవలం 35.33 ఎంఎంఎస్‌సిఎండి ఉత్పత్తిని మాత్రమే సాధించింది. 2012-13లో 20.88 ఎంఎంఎస్‌సిఎండి, 2013-14లో 9.77 ఎంఎంఎస్‌సిఎండిగా నమోదయ్యింది. ఇక్కడ ప్రతీ ఏడాది ఉత్పత్తి వరుసగా పడిపోతూ వస్తోంది. గ్యాస్‌ ధర పెంపున కోసం రిలయన్స్‌ ఉత్పత్తిని తక్కువ చేసి చూపిస్తోందన్న ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఉత్పత్తి లక్ష్యాన్ని నెరవేర్చని రిల్‌, దాని భాగస్వామ్య కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం వరుసగా 2010-11లో 457 మిలియన్‌ డాలర్లు, 2011-12లో 548 మిలియన్‌ డాలర్లు, 2012-13లో 792 మిలియన్‌ డాలర్లు, 2013-14లో 579 మిలియన్‌ డాలర్లు, 2014-15లో 380 మిలియన్‌ డాలర్లు, 2015-16లో 264 మిలియన్‌ డాలర్ల చొప్పున జరిమాన విధించింది. 2016-17కు గాను ఉత్పత్తి లక్ష్యం ఖరీదును వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం లెక్కించనుందని సదరు అధికారి తెలిపారు. బంగాళాఖాతంలోని ఈ క్షేత్రంలో రిలయన్స్‌ ఇండిస్టీస్‌కు 60 శాతం వాటా ఉంది. దాని భాగస్వామ్య కంపెనీలు బ్రిటిష్‌ పెట్రోలియంకు 30 శాతం, నిక్కీకి 10 శాతం చొప్పున వాటాలున్నాయి. గత కొన్నేళ్లుగా రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గ్యాస్‌ ధరలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ధర 4 డాలర్లకు పైగా ఉంది. కెజి బేసిన్‌లో ఒఎన్‌జిసి గ్యాస్‌ను రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అక్రమంగా తోడుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఒఎన్‌జిసికి చెందిన బ్లాక్‌ల నుంచి రిలయన్స్‌ ఏడేళ్లుగా గ్యాస్‌ను తోడేసుకున్నట్లు జస్టిస్‌ ఏపీ షా కమిటీ తేల్చిచెప్పింది. ఇందుకుగాను ఒఎన్‌జిసికి నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంది. కేజీ-డీ6లో ఓఎన్‌జీసీ ఉన్న గోదావరి-పిఎంఎల్‌, కెజి-డిడబ్ల్యూఎన్‌-98/2 బ్లాక్‌లు ఆర్‌ఐఎల్‌కు ఉన్న కేజీ-డీ6 ప్రధాన క్షేత్రం పక్కనే ఉన్నాయి. వీటి నుంచి 2009 ఏప్రిల్‌ 1 నుంచి 2015, మార్చి 31 మధ్య కాలంలో ఆర్‌ఐఎల్‌ కేజీ-డీ6కు 11.122 బిలియన్‌ ఘనపు మీటర్ల మేర గ్యాస్‌ తరలిపోయినట్లు స్వతంత్ర అధ్యయన సంస్థ డిఅండ్‌ఎం గతేడాది నవంబర్‌లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అప్పటి సహజ వాయువు ధరలు (యూనిట్‌కు 4.2 డాలర్లు) ప్రకారం దీని విలువ 1.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.11,055 కోట్లు)గా లెక్కగట్టింది. ఓఎన్‌జీసీ కి రావాల్సిన ఈ మొత్తం చెల్లింపులపై ప్రభుత్వ చొరవ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 10, Sep 2018, 11:37 AM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. నిన్నటి ఎపిసోడ్ లో శ్యామల ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. తాజాగా సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు 'ఫుల్లీ ఛార్జెడ్ అప్' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ 2 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. నిన్నటి ఎపిసోడ్ లో శ్యామల ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. తాజాగా సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు 'ఫుల్లీ ఛార్జెడ్ అప్' అనే టాస్క్ ఇచ్చారు. దీనికోసం హౌస్ మేట్స్ రెండు టీమ్ లుగా విడిపోయి తమకు ఇచ్చిన టాస్క్ ని పూర్తి చేయాలి. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ప్రోమోని బట్టి ఇదొక ఫిజికల్ టాస్క్ అని తెలుస్తోంది. మరోసారి ఒకరినొకరు తోసుకొని, ఎవరిలో ఎంత దమ్ముందో చూపించుకునే టాస్క్ ఇది. తనీష్, సామ్రాట్, అమిత్ ల మధ్య తోపులాట ఓ రేంజ్ లో జరగబోతోంది. దీప్తి కూడా ఏం తగ్గడం లేదని తెలుస్తోంది. ఎప్పటిలానే ఫిజికల్ టాస్క్ కి కాస్త దూరంగా ఉండే గీతామాధురి ఈసారి కూడా అదే కంటిన్యూ చేసినట్లుంది. ఈ టాస్క్ పూర్తయిన తరువాత ఎలిమినేషన్ కి నామినేషన్స్ చేపట్టే అవకాశం ఉంది.
0business
Farmers రైతులకు ఊరట న్యూఢిల్లీ, నవంబరు 21:నోట్లరద్దు తర్వాత తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న రైతాంగానికి ప్రభు త్వం కొంత సడలింపులు ఇచ్చింది. రైతులు తమ వద్ద ఉన్న రూ.500 పాతనోట్లను వినియోగించుకుని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవ చ్చని అనుమతించింది. రబీ సీజన్‌లో విత్తనాలు ముఖ్యం అవుతున్నందున ఆర్థిక శాఖ ఈ నోటీస్‌ జారీ చేసింది. ప్రభుత్వ అధీకృత ఏజెన్సీల్లోనే రైతులు విత్తనాలు కొనుగోలుచేస్తూ పాతనోట్లను ఇచ్చి తెచ్చు కోవచ్చని సూచించింది. రైతులు, రోజువారి కూలీలు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నష్టాలు చవిచూపారు. రైతులకు తోడ్పాటునందించే లక్ష్యంతో వారికి పాతనోట్ల తో కొనుగోళ్లకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఔట్‌లెట్లు, ప్రభుత్వరంగ సంస్థల యూనిట్లు, జాతీయ, రాష్ట్ర విత్తన సంస్థలు, కేంద్ర రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలు, ఇకార్‌ వంటి సంస్థల నుంచి గుర్తింపుకార్డు చూపించి కొనుగోళ్లు చేసుకోవచ్చని సూచించింది. అంతేకాకుండా రైతులు వారంలో 25 వేల వరకూ ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంకులు ఇప్పటివరకూ 1,03,316 కోట్లు కొత్తనోట్లు పంపిణీచేసాయని ఎటిఎంలు, బ్యాంకుశాఖల ద్వారా ఎనిమిదవ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఈ మొత్తం పంపిణీ జరిగిందని ఆర్‌బిఐ ప్రకటించింది. ఇదిలా ఉండగా బ్యాంకులు 5,44,571 కోట్ల పాతనోట్లు డిపాజిట్లు స్వీకరించాయని, వీటిలో 33,006 నోట్ల మార్పిడి అనంతరం మిగిలిన మొత్తం డిపాజిట్లుగా వచ్చాయని ఆర్‌బిఐ ప్రకటించింది. రిజర్వుబ్యాంకు కౌటర్లు, వాణిజ్యబ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయించింది.
1entertainment
SINDU ఓపెన్‌క్వార్టర్‌ ఫైనల్‌లో సింధు నిష్క్రమణ న్యూఢిల్లీ: సింగపూర్‌ ఓపెన్‌ సిరీస్‌ నుంచి సింధు నిష్క్రమించింది.క్వార్టర్‌ ఫైనల్లో కరోలినా మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు పరాజయం చెం దింది.సింధుపై 21-11,21-15తేడాతో మారిన్‌ విజయం సాధించింది. ఇండోనేషియాకు చెందిన 27వ ర్యాంకర్‌ ఫిత్రానిపై సింధు 19-21,21-17, 21-8తేడాతో విజయం సాధించింది.దీంతోసింధు క్వార్టర్‌కు చేరింది.అయితే శుక్రవారం క్వార్టర్‌ ఫైనల్లో కరోలినా మారిన్‌తో సింధు పరాజయం చెం దింది. సింధుపై 21-11,21-15తో మారిన్‌ విజయం సాధించింది.
2sports
`లై` సినిమాలో న‌టించ‌డం ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ - యాక్ష‌న్ కింగ్  అర్జున్‌ Highlights విజయవంతంగా రన్ అవుతున్న నితిన్, హను రాఘవపూడిల 'లై' లై చిత్రంలో కీలక పాత్రలో నటించిన యాక్షన్ కింగ్ అర్జున్ లై చిత్రంలో నటించడం మరువలేని అనుభూతి అన్న అర్జున్   యూత్‌స్టార్‌ నితిన్‌ నటించిన చిత్రం 'లై'. 'అందాల రాక్షసి', కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా వెంకట్‌ బోయిన్‌పల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై టేస్ట్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'లై'. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలైంది. ఈ సినిమాలో విల‌న్ ప‌ద్మ‌నాభం పాత్ర‌లో మెప్పించిన సీనియ‌ర్ హీరో యాక్ష‌న్ కింగ్‌ అర్జున్‌తో ఇంట‌ర్వ్యూ... కొత్తగా చేయాలనిపించి... 150 సినిమాల్లో నటించిన హీరోగా నాకే ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. ఆ కొత్తదనం కూడా నేను ఇప్పుడే చేయగలను అనిపించింది. హీరోగా సినిమాలు వస్తున్నాయి. చేస్తున్నాను. ఏదైనా కొత్తగా పాత్రలో నటించినప్పుడే ఏదైనా కొత్తగా చేసి చూపించడానికి అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్‌ సినిమాలో కూడా డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నాను. ఇన్ని వేరియేషన్స్‌లో చేయడం బావుంది. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదనిపించింది.  కొత్త ఎక్స్‌పీరియెన్స్‌...  - లై సినిమాలో నటించడం ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌. హను రాఘవపూడి వచ్చి కథ చెప్పగానే నచ్చింది. కానీ విలన్‌గా చేయడం అంటే నేను ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు సంబంధించి చాలా విషయాలు ముడిపడి ఉంటాయి. సినిమాను బిజినెస్‌ యాంగిల్‌లో కూడా ఆలోచించాలి. కథ వినగానే నటుడిగా మంచి డైమన్షన్‌ ఉందనిపించింది. అలాంటప్పుడు ఎందుకు విలన్‌గా నటించకూడదనిపించింది. నితిన్‌తో అల్రెడి నటించాను. నటుడుగా తను మంచి హార్డ్‌వర్కర్‌. తనంటే చాలా ఇష్టం. అందుకే లై సినిమా చేశాను.  రెస్పాన్స్‌ బావుంది..  - హీరోగా నటించినప్పుడు అందరి నుండి ఎలాంటి స్పందన వచ్చిందో లై క్యారెక్టర్‌ చేయడం వల్ల అంత మంచి స్పందన వచ్చింది.  సినిమా అనేది వన్‌ మేన్‌ షో కాదు...  - సినిమా సక్సెస్‌ అనేది వన్‌ మ్యాన్‌ షో అనే మాటను నేను నమ్మను. అలా ఎవరైనా అన్నారంటే వాళ్లు పిచ్చివాళ్లకిందే లెక్క. ఎందుకంటే సినిమా అనేది ఏ ఒక్కరి కష్టం కాదు. డైరెక్టర్‌, కెమెరామెన్‌ సహా ఎందరో టెక్నిషియన్స్‌ పనిచేయాల్సి ఉంటుంది. అందరి కష్టమే సినిమా.  సినిమా స్టైల్‌ మారుతుంది...  - సినిమా మేకింగ్‌ స్టైల్‌ మారుతుంది. హాలీవుడ్‌లో ఓ సినిమాలో హీరోగా నటించినవాడు మరో సినిమాలో విలన్‌గా నటిస్తాడు. మరో సినిమాలో చిన్న క్యారెక్టర్‌ చేస్తాడు. మన ఇండియన్‌ సినిమాలోనే ఆ వేరియేషన్‌ కనపడేది. కానీ ఇప్పుడు ఆ వేరియేషన్‌ మారుతుంది. అందరూ భిన్నమైన రోల్స్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను కూడా అంతే, 150 సినిమాల్లో యాక్ట్‌ చేసిన నేను భిన్నమైన పాత్రలు చేయాలి. నాతో ఎవరూ సినిమా చేయకపోయినా, నేనే నిర్మాతగా, దర్శకుడిగా సినిమా చేసుకుంటాను.  అంత నాలెడ్జ్‌ నాకు లేదు...  - మంచి రాజకీయ నాయకుడైనా, చెడ్డ రాజకీయ నాయకుడైనా, ఎవరైనా సరే, రాజకీయాలంటే పూర్తి అవగాహన ఉండాలి. నాకు రాజకీయాలపై అంత నాలెడ్జ్‌ లేదు. సినిమాలో ఉన్నాం కదా, పాపులారిటీ ఉంది కదా, అని రాజకీయాల్లోకి వచ్చేస్తాం అని రాకూడదు. సినిమాల్లో కూడా ఉండి మంచి చేయవచ్చు. నా గత చిత్రం జైహింద్‌2 సినిమాను తెలుగు, తమిళం, కన్నడంలో విడుదల చేశాం. కన్నడంలో నా సినిమా స్టేట్‌ అవార్డ్‌ కూడా వచ్చింది. ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌పై సామాన్యుడి పోరాటమే ఆ చిత్రం. అలాంటి సినిమాలు చేయడం కూడా మంచి పరిణామమే. దేశభక్తి అంటే సరిహద్దుల్లో కాపలా కాయడమొక్కటే కాదు దేశానికి ఉపయోగపడే మంచి పని ఏది చేసిన అది దేశభక్తే అవుతుంది. అన్నం లేని వాడికి అన్నం పెట్టడం, ఇంటిని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం వంటివన్నీ దేశభక్తి కిందికే వస్తాయి.  మా అమ్మాయితో సినిమా చేస్తున్నాను...  - నా కుమార్తె ఐశ్వర్య ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్నాను. షూటింగ్‌ కూడా అయిపోవచ్చింది. తమిళం, కన్నడలో చేస్తున్నాను. నా కూతురిని సినిమాలోకి తీసుకొచ్చేటప్పుడు చాల మంది ఎందుకు అని అన్నారు. 35 ఏళ్లుగా నేనున్న పరిశ్రమనే నేను నమ్మలేకపోతే ఎలా. ప్రతి దాంట్లో తప్పుంటుంది, ఒప్పుంటుంది. అది మన మీదే ఆధారపడి ఉంటుంది. Last Updated 26, Mar 2018, 12:02 AM IST
0business
sumalatha 102 Views arrest warrant , cricket , Mohammed shami Mohammed Shami కోల్‌కతా: గృహ హింస కేసులో క్రికెటర్ మొహమ్మద్ షమీకి అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. విండీస్ టూర్ నుంచి తిరిగి వచ్చిన 15 రోజుల్లోపు లొంగిపోవాలంటూ కోర్టు షమీని ఆదేశించింది. గత ఏడాది షమీ భార్య హసీన్ జహాన్ అతనిపై కేసు పెట్టింది. అయితే, కోర్టు వాయిదాలకు షమీ హాజరుకాకపోవడంతో… అతనికి అరెస్ట్ వారెంటును కోర్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలో షమీకి కోర్టు స్వల్ప ఊరటను కలిగించింది. షమీని అరెస్ట్ చేయకుండా రెండు నెలల పాటు స్టే విధించింది. తదుపరి విచారణ నవంబర్ 2న జరగనుందని షమీ తరపు న్యాయవాది సలీమ్ రెహ్మాన్ తెలిపారు. ఇండియా తరపున షమీ 70 వన్డేలు, 42 టెస్టులు, 7 టీ20లు ఆడాడు. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/
2sports
ఈ విడియో చూస్తే సెక్స్ పట్ల మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది-వర్మ Highlights పోర్న్ స్టార్ మియా మల్కోవాతో కలిసి వర్మ సంచలనం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అంటూ వర్మ దర్శకత్వంలో వీడియో ఈ వీడియో చూసాక సెక్స్ పట్ల అభిప్రాయం పూర్తిగా మారుపోతుందంటున్న వర్మ వర్మ తన తాజా విడియో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ గురించి చెప్తూ పెట్టిన పోస్ట్ ఇదే... "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్"  సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు...ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం. "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" మొత్తం ఫైనల్  వీడియో  ఈ జనవరి 26 ఉదయం 9 గంటలకి 'మియా మాల్కోవా' పేరుతో ఉన్న అఫీషియల్ విమియో ( www.vimeo.com ) ఛానల్లో విడుదలవుతోంది. జనవరి 26న రిలీజ్ అవ్వబోయే ఆ  ఫుల్ వీడియో లో మాల్కోవా సంపూర్ణ నగ్నత్వంలోని అణువణువునీ నా కెమెరాతో ఒక  పెయింటింగ్ లా తీర్చిదిద్దాను. ఒక  అమ్మాయి నగ్న సౌందర్యాన్ని ఎంత అందంగా చూపించవచ్చు అనే  విషయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని  యూరోప్ లో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. నా కెమెరా కన్ను ఆమె సుందర  నగ్నశరీరంలోని అంగాంగాన్ని ఆరాధించడమే కాకుండా ఆమె ఆలోచనల్లో వ్యక్తమయ్యే గూఢతని, ఆమెలో నిక్షిప్తమై ఉన్న శృంగార గాఢతని కూడా ఒక  ఆధ్యాత్మిక కోణంలో ప్రకటిస్తుంది.  దేవుడు, సెక్స్ మరియు నిజం లో  మియా మాల్కోవా.. సమాజం అసభ్యం అనుకునే పదజాలాన్ని కూడా  పలుకుతుంది..దానికి  కారణం  ఏది  ఎవరికి సభ్యం, ఏది ఎవరికి అసభ్యం అని అనాది నుంచి  వస్తున్న ప్రశ్నకి  సమాధానమివ్వటానికే. విపరీత  కట్టుబాట్ల సమాజం, ఒక  పద్ధతి  ప్రకారం అణచిపెట్టిన ప్రకృతిపరమైన  స్వేఛ్చాలోచనల్ని బహిరంగ  పరచడమే ఈ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" యొక్క ముఖ్య  ఉద్దేశ్యం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక మాగాడు తనపై చూపే శృంగారమయమైన ఆరాధనకు లొంగి శారీరకంగా, మానసికంగా ఆనందంలో తేలియాడాలనే స్వేచ్ఛను కోరుకున్న ప్రతి స్త్రీకి ఈ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే ప్రాజెక్టు  ఒక ప్రతినిధి.  సెక్స్ పరంగా పొందే అపరాధ భావాలని, బలవంతపు బంధాలని, కుహనా నైతిక విలువలని అధిగమించడానికి ఈ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనేది ఒక మహోన్నత సాధనం. అప్పటి వరకు ఉన్న ఆలోచనలకి అవతల ఏముందో ఆలోచించినప్పుడే ఏ మనిషికైనా ఒక బలమైన తాత్వికత పుడుతుంది. అదే జీవితాన్ని ఒక సరికొత్త కోణంలో దర్శించడానికి దోహదపడుతుంది.  ఈ చిత్రానికి సంగీతాన్ని అందించినది అనేక అవార్డులను పొందిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి. "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" కి తాను కూర్చిన సంగీతం మియా మాల్కోవా శృంగారంలో నాణ్యతనే కాకుండా ఆమె భావప్రకటనల్లోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని కూడా అత్యంత శక్తివంతంగా వ్యక్తపరచడానికి దోహదపడింది. సాధారణ స్వరకల్పనలకి అందని మహాద్భుతమైన  "బాహుబలి" కి, ఆధ్యాత్మికతని నిలువెల్లా నింపుకున్న "అన్నమయ్య"కి సంగీతాన్ని కూర్చిన అత్యంత గొప్ప స్వరకవి కీరవాణి సెక్స్  విషయంలో కూడా అంతే నిబద్ధతని చూపడం, మియా మాల్కోవాలోని నిక్షిప్త నిధికి సరితూగే సంగీతాన్ని ఇవ్వటం నన్ను అబ్బురపరిచింది. మియా మాల్కోవా మీద నాకున్న అత్యంత గౌరవానికి గల కారణం తాను తనకు నచ్చిన విధంగా జీవించే నిర్ణయం తీసుకోవడం, తనకు తోచిన విధంగా సెక్స్ ని ఎంజాయ్ చెయ్యాలనే నిర్ణయం తీసుకోవడం....అంతే కాకుండా  సెక్స్ ని పవిత్రంగా చూస్తూ అందులో మునిగి తేలడానికి సిగ్గు, అపరాధభావం ఉండకూడదని  చెప్పే తన ఆలోచనల వెనక వున్న లోతుల్ని కూడా నేను చూడగలగడం. ఈ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" లో మియా మాల్కోవా తన నిజాయితీ లోని శక్తితోటి, తన నమ్మకాలపై ఉన్న పట్టుతోటి,  జగదేక  సుందరిలాంటి తన అందమైన ముఖంలోని అమాయకత్వంతోటి ప్రతి వారిని సమ్మోహనంగా వశపరుచుకుంటుంది. మియాలోని అందం మరియు తాత్వికత, నిజాయితీ కలగలిసిన మాటల మూలాన సెక్స్ లోని అన్ని అంశాలు కళ్ళు, మెదడున్న ఎవరికైన స్వచ్ఛంగా, పవిత్రంగా, అందంగా కనిపిస్తాయి.  మియా మాల్కోవా ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే బలమైనది . ఎందుకంటే తాను కేవలం అందం అనే ఆయుధంతో యుద్ధం ప్రకటించి దాపరికాల సరిహద్దులన్నీ దాటి హిపోక్రిటికల్ మానవ సమాజంపై  ధ్వజమెత్తి జయించటానికి  నడుం కట్టుకుంది. ఏ మాత్రం కల్తీలేని ఆనందాన్ని ఎన్నో లక్షల మంది ప్రజలకి ఇవ్వడంలో మియా మాల్కోవా ఒక చారిటీ క్వీన్. అందుకనే ఆమె ఆలోచనలని అర్థం చేసుకునే బుర్ర వున్న ప్రతి ఒక్కరు ఆమెకు మనసారా కృతజ్ఞతలు చెప్పి సెల్యూట్ చేస్తారు.  పేరుకుపోయిన సామాజిక కట్టుబాట్లు, దొంగ ముసుగులు, అనవసరమైన సంకెళ్లు అన్నింటినీ ఒక అందమైన నగ్న స్త్రీ నుంచి వచ్చే సహేతుకమైన ఆలోచనలతో పటాపంచలు చేసి ఒక కొత్త సెక్స్ ఒరవడిని సృష్టించడమే ఈ "గాడ్ సెక్స్ అండ్ ట్రూత్" వెనుక ఉన్న ఒక తాత్వికత. ఒక్క మాటలో చెప్పాలంటే, “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" లో మియా మాల్కోవాని చూసి, విని అర్ధం చేసుకున్న వారందరి మనస్సులో సెక్స్ కి అర్ధమే మారిపోతుంది!! ఇట్లు మీ - రామ్ గోపాల్ వర్మ అంటూ వర్మ బహిరంగ లేఖ రాసాడు. Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0business
కార్పొరేట్లకు రుణ మాఫీ ఐదున్నరేండ్లలో రూ.3.68 లక్షల కోట్లు - ఇందులో ప్రభుత్వ బ్యాంకుల వాటానే అత్యధికం - ప్రతీ ఏటా పెరుగుతున్న 'రైట్‌ ఆఫ్‌'ధోరణి భారతదేశంలో బ్యాంకుల తీరు ఎంతో ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు గత 5ఏండ్లలో రూ.3.68 లక్షల కోట్లను 'రైట్‌ ఆఫ్‌' చేసిపారేశాయి. అంటే...రూ.3.68 లక్షల కోట్ల విలువైన రుణాలు వసూలు చేసుకోలేకపోయామని అధికారికంగా ఒప్పుకొని, రుణ ఖాతాను మూసేయటం. బ్యాంకుల్లో ఈ ధోరణి ప్రతి ఏటా పెరుగుతూ రావటం పట్ల ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాలన్స్‌ షీట్‌ను (రాబడి, వ్యయం, పరపతి) మెరుగుపర్చుకోవటం కోసమే 'రైట్‌ ఆఫ్‌' చేస్తున్నామని బ్యాంకులు సమర్థించుకుంటున్నాయి. కానీ ఇందులో కనిపించని కుట్రలు, ఆర్థిక మోసాలు దాగి ఉన్నాయన్నది ఆర్థిక రంగ నిపుణుల అంచనా. విజరు మాల్యా కేసే ఇందుకు పక్కా ఉదాహరణ. న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు 'రైట్‌ ఆఫ్‌' చేసిన రుణాల విషయంలో సమాచార హక్కు ద్వారా ఆర్‌బీఐను ప్రశ్నిస్తే, వచ్చిన సమాధానం '2012-13 నుంచి సెప్టెంబరు 2017 నాటికి రైట్‌ ఆఫ్‌ చేసిన రుణాలు రూ.3,67,765 కోట్లు''. కార్పొరేట్‌ కంపెనీలతో రాజీ ఒప్పందం కుదుర్చుకొని 'రైట్‌ ఆఫ్‌' చేసిన మొత్తం కూడా ఇందులోనే ఉంది. రుణాల్ని రైట్‌ ఆఫ్‌ అని ప్రకటించటమంటే, వసూలు చేసుకోలేని స్థితి లేదా రుణాలు ఎగ్గొట్టటం. ఇందులో ఒక్కొక్క కేసు ఒక్కోలా ఉంటుంది. కొన్ని కేసుల్లో రుణ గ్రహీతలతో రాజీ ఒప్పందం కుదురుతుంది. ''మా దగ్గర ఇంతే ఉంది. దీంతో ముగించేయండి'' అంటూ చెప్పేస్తారు. ఆస్తి తనఖా పెడితే...బ్యాంకు దాన్ని వేలం వేసి రుణం కింద జమకడుతుంది. కానీ కింగ్‌ ఫిషర్‌ యజమాని విజరు మాల్యా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రూ.9 వేల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పులు ఇచ్చాయి. ముంబయిలో అతని స్థిరాస్థుల్ని అమ్మడానికి చూస్తే కొనేనాథుడు లేడు. బ్యాంకులు ఇచ్చినదానికి...వేలం ద్వారా అందుతున్నదానికి పొంతనే లేదు. ప్రతి ఏటా పెరుగుతున్న 'రైట్‌ ఆఫ్‌'లు 'రైట్‌ ఆఫ్‌' ఖాతాల వివరాలు తెలపండి' అంటూ...సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్‌బీఐను సామాజిక కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ కోరారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ బయటపెట్టిన లెక్కలు చూస్తే, ప్రతీ ఏటా బ్యాంకులు చేస్తున్న 'రైట్‌ ఆఫ్‌' మొత్తాలు పెరుగుతున్నాయన్న విషయం బయటకొచ్చింది. 2012-13లో రూ.32,127 కోట్లు, 2013-14లో రూ.40,870 కోట్లు, 2014-15లో రూ.56,144 కోట్లు, 2015-16లో రూ.69,210 కోట్లు, 2017-18 తొలి 6నెలల్లో రూ.66,162 కోట్లు...రుణాల్ని పరస్పర ఒప్పందంతో బ్యాంకులు 'రైట్‌ ఆఫ్‌' చేశాయి. అత్యధికం ప్రభుత్వ బ్యాంకులవే... ఆర్‌బీఐ ఇచ్చిన సమాచారంలో మరో ఆందోళనకరమైన విషయం, ప్రభుత్వ రంగ బ్యాంకులే అత్యధిక మొత్తంలో రుణాల్ని రైట్‌ ఆఫ్‌ చేశాయి. గత 5ఏండ్ల కాలంలో ప్రయివేటు రంగ బ్యాంకులు రూ.64,187 కోట్లు రైట్‌ ఆఫ్‌ చేస్తే, ప్రభుత్వ రంగ బ్యాంకులు చేసినవి రూ.3,03,578 కోట్లు. బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, సహజంగా బ్యాంకులు ఆస్తుల్ని తనఖా పెట్టుకొని రుణాలు ఇస్తాయి. మరి రుణాన్ని చెల్లించకపోతే తనఖా ఆస్తిని అమ్మేసి సొమ్మును రాబట్టుకోవచ్చు కదా ! అంటే ఇక్కడో కిటుకు ఉంది. అదేంటంటే... ముఖ్యంగా బడా కార్పొరేట్‌ ప్రముఖులు పొందే రుణాల్లో ఆస్థి తనఖా, ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. అయితే ఈ ఆస్తిని విలువ కట్టడంలో 'అతి అంచనా' ఉంటుంది. రాజకీయ, అధికార వర్గాల ఒత్తిడితో విజరు మాల్యా లాంటి వ్యక్తుల ఆస్తి, వ్యాపార విలువ వేల కోట్లలో లెక్కగట్టి రుణాల్ని అందజేశారు. తీరా ఇప్పుడు అమ్మబోతే ఏం జరుగుతోంది. అందులో పదో వంతు కూడా రావటం లేదు. ఉదాహరణకు ఒక బడా వ్యాపారవేత్త రూ.1000 కోట్లు రుణాల్ని పొంది, చేతులెత్తేశాడు అనుకుందాం. అతని తనఖా ఆస్తిని బ్యాంకు వేలం వేస్తుంది, కానీ అప్పుడు ఆ ఆస్తి, వ్యాపార విలువ రూ.300 కోట్లు చేసిందన్న నిజం బయటపడుతుంది. మరి మిగతా రూ.700 కోట్లు మాటేంటి ? దీనిని ఏదో విధంగా రాబట్టుకోవడానికి బ్యాంకులు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాయి. అంటే క్రిమినల్‌, చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈడీ, సీబీఐ దాడులు చేపడతాయి. కానీ ఏం లాభం. బ్యాంక్‌ రుణాలు తిరిగి వస్తాయన్న భరోసా ఉండదు. రూ.700 కోట్లను వసూలు చేసుకోలేక పోయామని బ్యాలన్స్‌ షీట్‌లో చూపించుకుంటే సదరు బ్యాంకు పరపతి, వ్యాపారం దెబ్బతింటుంది. షేర్‌ మార్కె ట్‌లో స్టాక్‌ విలువ పడిపోతుంది. దీని నుంచి తప్పిం చుకోవడానికి బ్యాంకులు ఎంచుకున్న మార్గమే 'రైట్‌ ఆఫ్‌'. అంటే భౌతికంగా బ్యాలన్స్‌ షీట్‌లో ఆ రూ.700 కోట్లను చూపించవు. కానీ అందుకోసం ఏ రాజీ ఒప్పందమో, చట్టపరమైన చర్యలో కొనసాగుతున్నాయని బ్యాంక్‌ యాజ మాన్యం ప్రకటిస్తుంది. ఇంతటితో ఈ 'రైట్‌ ఆఫ్‌' కథను ముగిస్తుంది. ఈ ధోరణి మంచిది కాదు.. బ్యాంకులు ఇలా రుణ ఖాతాల్ని 'రైట్‌ ఆఫ్‌' చేయటం మంచి ధోరణి కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బ్యాంక్‌ వినియోగదారులకు ఒక తప్పుడు సందేశం అందుతోందని, ఒకనాటికి మొత్తం బ్యాంకు దివాలా తీస్తుం దనివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'రైట్‌ ఆఫ్‌' పొంది న వ్యక్తులు, ప్రయివేటు సంస్థలు మరో కొత్త కంపెనీ ఎలా ప్రారంభిస్తున్నారని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ మోసం, కుట్రం దాగి ఉన్నాయన్న విషయం అర్థమ వుతోందని వారు చెబుతున్నారు. బడా బాబులకు, పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు అప్పులివ్వటం ఎందుకు ? ఇచ్చాక, వసూలు చేసుకోలేక చతికిలపడటమెందుకు ? అన్నది సగటు భారతీయుడికి అర్థం కాని విషయంగా మారింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV నా పెళ్లి అక్కడే జరుగుతుందంటున్న జాన్వి కపూర్ బాలీవుడ్ నటి జాన్వి కపూర్ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను పెళ్లంటూ చేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదంతో పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుపతిలోనే జరుగుతుందని తెలిపారు. Samayam Telugu | Updated: Sep 9, 2019, 04:12PM IST నా పెళ్లి అక్కడే జరుగుతుందంటున్న జాన్వి కపూర్ పెళ్లంటూ చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటానని అంటున్నారు అలనాటి తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ . ప్రస్తుతం ఆమె ‘గుంజన్ సక్సేనా- ది కార్గిల్ గర్ల్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి పెళ్లి గురించి ఓ ప్రముఖ మ్యాగజైన్‌తో మాట్లాడారు. ‘నా పెళ్లి నాకు కావాల్సిన వారి సమక్షంలో జరగాలి. అంతా రియలిస్టిక్‌గా అనిపించాలి. అయితే భారీగా, హంగామాతో మాత్రం ఉండకూడదు. నా పెళ్లి ఎటూ ఎంతో సంప్రదాయబద్ధంగాజరుగుతందని తెలుసు. నేను పెళ్లంటూ చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటాను. పెళ్లికి కాంజీవరం జరీ చీర కట్టుకుంటాను. పెళ్లయ్యాక నాకు ఎంతో ఇష్టమైన దక్షిణాది వంటకాలు ఇడ్లీ సాంబార్, పెరుగన్నం, పాయసంతో ఘనంగా విందు ఇస్తాను’ అన్నారు. అనంతరం కాబోయేవాడు ఎలా ఉండాలో వివరిస్తూ.. ‘నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి చాలా టాలెంటెడ్ అయి ఉండాలి. తాను చేసే పనిపై ఇష్టం, గౌరవం ఉండాలి. అతని నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకోగలగాలి. ముఖ్యంగా అతనికి హాస్యచతురత కలిగి ఉండాలి. మొత్తానికి నేనంటే పిచ్చి ప్రేమ కలిగి ఉండాలి’ అని తెలిపారు. అయితే గతంలో జాన్వి తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకు ఇటలీ అంటే ఎంతో ఇష్టమని తన పెళ్లంటూ జరిగితే ఇటలీలోని ప్రదేశాల్లోనే జరగాలని అన్నారు. ఇప్పుడేమో తిరుపతిలో చేసుకుంటానని అంటున్నారు. అయితే జాన్వి తల్లి శ్రీదేవికి తిరుపతి అంటే ఎంతో ఇష్టం. ప్రతీ సినిమా మొదలవడానికి ముందు విడుదల అవడానికి ముందు జాన్వి తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. https://www.instagram.com/p/B2Lj6R4AFiv/ జాన్వి నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. శరణ్ శర్మ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దఢక్’ సినిమా తర్వాత జాన్వి నటిస్తున్న రెండో చిత్రమిది. దీంతో పాటు ఆమె రాజ్‌కుమార్ రావుకి జోడీగా ‘రూహీ అఫ్జా’, కార్తిక్ ఆర్యన్‌కు జోడీగా ‘దోస్తానా’ సినిమాలతో బిజీగా ఉన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
డైరెక్టర్ మాట విని.. రిస్క్ లో పడ్డ హీరోయిన్! Highlights దర్శకుడు పెర్ఫెక్ట్ గా రావాలని చెప్పడంతో.. శృతి మించి ఆమె ప్రాక్టీస్ చేసిందని ఆ కారణంగానే ఇలా జరిగిందని దిశా సన్నిహితులు అంటున్నారు. తదుపరి షెడ్యూల్ మొత్తం కూడా దిశా సీన్లే షూటింగ్ చేయాల్సి ఉండడంతో షూటింగ్ వాయిదా వేయక తప్పలేదు తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దిశాపటాని.. వెంటనే బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వరుస అవకాశాలు రావడంతో హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. రీసెంట్ గా ఆమెకు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న 'భరత్' అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. పాత్ర ప్రకారం సినిమాలో దిశా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో నటించాల్సివుంది. గతంలో ఆమె యాక్షన్ సీన్స్ కోసం శిక్షణ తీసుకోవడంతో ఈ సినిమాలో డూప్ లేకుండా తనే  రిస్కీ షాట్స్ లో నటిస్తానని చెప్పింది. దర్శకుడు కూడా ఆమెను ప్రోత్సహించడంతో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె కాలికి విపరీతంగా దెబ్బలు తగిలాయి. దర్శకుడు పెర్ఫెక్ట్ గా రావాలని చెప్పడంతో.. శృతి మించి ఆమె ప్రాక్టీస్ చేసిందని ఆ కారణంగానే ఇలా జరిగిందని దిశా సన్నిహితులు అంటున్నారు. తదుపరి షెడ్యూల్ మొత్తం కూడా దిశా సీన్లే షూటింగ్ చేయాల్సి ఉండడంతో షూటింగ్ వాయిదా వేయక తప్పలేదు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  Last Updated 21, Jul 2018, 6:12 PM IST
0business
Visit Site Recommended byColombia మోదీ సర్కార్‌ అంతేకాకుండా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (టీఏ) కూడా పెంచింది. డీఏ పెంపు కారణంగా టీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ.810 నుంచి రూ.4,320 మధ్యలో పెరగనుంది. ఉద్యోగుల వేతనంలో ప్రతి నెలా ఈ అలవెన్స్ ఆటోమేటిక్‌గానే యాడ్ అవుతుంది. టీఏ పెంపు, డీఏ పెంపు అనేవి ఇంటర్ కనెక్టెడ్‌గా ఉంటాయి. Also Read: మోదీ కీలక నిర్ణయం.. ఏకంగా రూ.6,000కు పైగా పెరగనున్న పెన్షన్! ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం మోదీ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగి నియామకమైన సిటీ కేటగిరి ప్రాతిపదికన ట్రావెల్ అలవెన్స్‌ను అందిస్తుంది. 7వ సీపీసీ ప్రకారం.. అర్బన్ సిటీస్‌లో పనిచేసే ఉద్యోగులకు టీఏ కనీసం రూ.1,350 ఉంది. గరిష్ట పరిమితి రూ.7,200. అలాగే చిన్న పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు టీఏ రూ.900 నుంచి రూ.3,600 మధ్యలో ఉంది. Also Read: బిగ్ న్యూస్.. 50 లక్షల మంది ఉద్యోగులకు మోదీ ‘దీపావళి’ బొనాంజా..! కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. టైర్ 1 పట్టణాల్లో డియర్‌నెస్ అలవెన్స్ 5 శాతం పెరిగినప్పుడు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కూడా 5 శాతం మేర పెరుగుతుంది. అంటే అప్పుడు టైర్1 పట్టణాల్లో ఉద్యోగుల రూ.7,200 అప్రూవ్డ్ టీఏ రూ.360 అవుతుంది. దీంతో ఏడాదిలో ఉద్యోగుల జీతం రూ.4,320 పెరుగుతుంది. Also Read: ఉద్యోగులకు మోదీ షాక్..! రిటైర్మెంట్ వయసు తగ్గింపు?   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
Vijayanand అమర్‌రాజా సిఇఒగా విజయానంద్‌ హైదరాబాద్‌: అమర్‌రాజా కంపెనీ సిఇఒగా ఎస్‌ విజయానంద్‌ నియమితులయ్యా రు. ప్రస్తుతం అమర్‌రాజా పవర్‌సిస్టమ్స్‌కు సిఇఒగా వ్యవహరిస్తున్న విజయానంద్‌ అమర్‌ రాజా గ్రూప్‌లోనే 1992నుంచి కొనసాగుతు న్నారు. హిందూస్థాన్‌ లీవర్‌ కంపెనీ నుంచి కెరీర్‌ ప్రారంభించిన విజయానంద్‌ అమర్‌రాజాగ్రూప్‌ లో 1992లో చేరారు. ఇండస్ట్రియల్‌ బ్యాటరీస్‌ డివిజన్‌కు ఎస్‌బియు హెడ్‌గా వ్యవహరించారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బిటెక్‌ డిగ్రీ సాధించారు. ఎంటెక్‌ ఐఐటినుంచిసాధించారు. అమర్‌రాజాగ్రూప్‌ ఛర్మన్‌ డా.రామచంద్ర ఎన్‌ గల్లా మాట్లాడుతూ విజయానంద్‌ను అమర్‌రాజాసిఇఒగా స్వాగతిస్తున్న ట్లు వెల్లడించారు. తనకు అత్యున్నతస్థాయి పదవి రావడం పట్ల విజయానంద్‌ హర్షం వ్యక్తంచేస్తూ కంపెనీ వృద్ధికి నిరంతరం పాటుపడతానన్నారు.
1entertainment
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు PNR| Last Updated: గురువారం, 28 ఆగస్టు 2014 (10:15 IST) రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో గురువారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.290 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.30గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.294, విశాఖపట్నంలో రూ.305, విజయవాడ రూ.295, చిత్తూరులో రూ.328, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.295 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.335 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.300 రూపాయలుగా పలుకుతోంది. సంబంధిత వార్తలు
1entertainment
అమితాబ్ ను కలిసిన పవన్ కల్యాణ్.. బిగ్ బీ కోసం రోల్స్ రాయిస్ కార్ Highlights అలా బిగ్ బీని రాయల్ గా చూసుకున్నాడు మెగాస్టార్. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ఎక్కడకి వెళ్లినా ఘనస్వాగతాలు, అతిథి మర్యాదలు లభిస్తాయి. సైరా నరసింహా రెడ్డి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ సైరా చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. అమితాబ్ బసచేసిన హోటల్ నుంచి షూటింగ్ లొకేషన్ వరకు ఆ కారులోనే ప్రయాణించారట.   షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ లో వున్నన్ని రోజులు బాలీవుడ్ మెగాస్టార్ కు మన మెగాస్టార్ చిరు అద్భుతమైన ఆతిధ్యం అందించారని తెలుస్తోంది. అమితాబ్ హైదరాబాద్ లో ఉన్న సందర్భంగా చిరు తన రోల్స్ రాయిస్ కారుని బిగ్ బి కోసం ఇచ్చారట. అమితాబ్ సెక్యూరిటీ విషయంలో కూడా చిరు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారట.   అమితాబ్ బచ్చన్ సైరా చిత్ర షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. సైరా చిత్రంలో అమితాబ్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రని సైరా నరసింహారెడ్డి గా చిత్రీకరిస్తున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.   అమితాబ్ బచ్చన్ ని ఆయన బస చేసిన హోటల్ లో సతీ సమేతంగా పవన్ కళ్యాణ్ కలుసుకున్నట్లు సమాచారం. గురువారం రోజు పవన్ కళ్యాణ్ అమితాబ్ ని కలుసుకున్నారని సమాచారం.   ఇక అమితాబ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఇటీవల సైరా చిత్రంలోని ఓ పిక్ ను షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమితాబ్ రాజ గురువు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ లుక్ మరియు సైరా గెటప్ లో మెగాస్టార్ లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. అయితే... పోరాట యోధుడు నరసింహారెడ్డిగా చిరు వేరే గెటప్ లో కనిపిస్తారని తెలుస్తోంది. Last Updated 31, Mar 2018, 6:45 PM IST
0business
Hyd Internet 93 Views URJITH PATEL URJITH PATEL న్యూఢిల్లీ: ద్రవ్యోల్భణం పెరుగుతున్న నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా  బుధవారం ప్రకటించింది.దీంతో విశ్లేషకులు అంచనాలు నిజమయ్యాయని పేర్కొనాలి.కాగా ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జీత్‌ పటేల్‌ ఆధ్వర్యంలోని  పరపతి విధాన కమిటీ సమావేశం జరిగింది.ఇందులో రెపోరేటు యథాతథంగా 6 శాతం కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది.రివర్స్‌  రెపో రేటు,సిఆర్‌ఆర్‌లలో కూడా ఎలాంటి మార్పులు చేయకుండా 5.75 శాతం,4 శాతంగా ఉంచారు.అయితే ఎస్‌ఎల్‌ఆర్‌ను మాత్రం 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 19.5 శాతం చేశారు.కాగా 2017-18 సంవత్సరంలో వృద్దిరేటు మరింత తగ్గుతుందని ఆర్‌బిఐ అంచానా  వేసింది.మొదట వృద్దిరేటు 7.3 శాతం ఉంటుందని అంచనా వేసిన రిజర్వు బ్యాంకు తాజాగా దాన్ని 6.7 శాతానికి సవరించింది.అయితే ద్రవ్యోల్బణం మాత్రం 4.2 నుంచి 4.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. స్టాండర్డ్‌ లిక్విడిటి నిష్పత్తి 50 బేసిక్‌పాయింట్లు తగ్గింపు  అక్టోబరు ద్రవ్య పరపతిఇ సమీక్షా విధానంలో భాగంగా ఆర్‌బిఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచేందుకు సుముఖత చూపించింది.కాగా  రెపో 6 శాతం వద్ద,రివర్స రెపో 5.75 శాతం వద్ద కొనసాగిస్తుననట్లు ప్రకటించింది.అయితే స్టాండర్డ్‌ లిక్విడిటీ నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్‌) మాత్రం 50  బేసిక్‌ పాయింట్లు తగ్గించింది.దీంతో అక్టోబరు 14 నుంచి ఎస్‌ఎల్‌ఆర్‌ 19.50 శాతానికి దిగిరానుంది.ప్రస్తుతానికి న్య్టూట్రల్‌ ధృక్పథానిన  అవలంభిస్తున్నట్లు తెలిపింది.మరోవైపు ఆర్థిక వ్యవస్థలో మందగమన కొనసాగుతుందని ఆర్‌బిఐ భావించింది.తత్పలితగా ప్రస్తుత  ఆర్థిక సంవత్సరం వృద్దిరేటు అంచనాలను 7.3 శాతం నుంచి 6.7శాతానికి తగ్గించింది.అక్టోబరు నుంచి వృద్ది ఊపందుకుంటుందని  అంచనా వేసింది. సిపిఐ ద్రవ్యోల్భణం ప్రస్తుత త్రైమాసికానికి 4.2 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. సేవల రంగంలో  పురోగతి ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతుందని భావిస్తున్నట్లు తెలిపింది.ఆర్థిక వ్యవస్థ విత్తలోటు మరో 50 బిపిఎస్‌ మేర పెరగవచ్చని పేర్కొంది.జిఎస్‌టి ప్రేరిత సమస్యలు త్వరలోనే సమసిపోతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.
1entertainment
Hyderabad, First Published 18, Aug 2019, 1:31 PM IST Highlights మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.  అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ప్రారంభించింది. అందులో భాగంగా రీసెంట్ గా  సినిమా మేకింగ్‌ వీడియో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయటానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు టీజర్ రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తూ ఓ  పోస్టర్ ని వదిలింది టీమ్. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.  మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.  అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ప్రారంభించింది. అందులో భాగంగా రీసెంట్ గా  సినిమా మేకింగ్‌ వీడియో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయటానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు టీజర్ రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తూ ఓ  పోస్టర్ ని వదిలింది టీమ్. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.  ప్రమోష‌న్ పోస్టర్ ఆద్యంతం దేశ భ‌క్తిని ర‌గిల్చేలా క‌నిపిస్తోంది. ఇక టీజ‌ర్ ఊహ‌కే అంద‌ని విధంగా ఉంటుంద‌ని, సినిమా ఏంటనేది దాంతో అర్దమవుతుంది యూనిట్ స‌భ్యులు నమ్మకంగా ఉన్నారు.  ఇప్పటికే తొలి టీజ‌ర్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.  స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న  ‘సైరా’ రెండేళ్లుగా ఈ చిత్రం సెట్స్‌పైనే ఉంది. క్వాలిటీ కోసం సురేందర్ రెడ్డి  సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. చివరికి చిరు మెప్పు పొందాడు సురేందర్ రెడ్డి. ఈయన తెరకెక్కించిన సీన్స్ చిరుకు తెగ నచ్చేసాయని సమాచారం. మేకింగ్ వీడియో, టీజర్ పోస్టర్ ఇలా ఉందంటే  సినిమా ఎలా ఉండబోతోందో అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.  రామ్‌ చరణ్‌ నిర్మాత. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. Last Updated 18, Aug 2019, 1:31 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కలెక్షన్స్ సునామీ: ఆ మూవీకి 2 వేల కోట్లు! ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించి భారీ వసూళ్లను సాధించడం హారర్ సినిమాల ప్రత్యేకత. TNN | Updated: Aug 16, 2017, 07:19PM IST ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించి భారీ వసూళ్లను సాధించడం హారర్ సినిమాల ప్రత్యేకత. ఇక హాలీవుడ్‌లో హారర్ చిత్రాల బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతుంది. ప్రతియేటా హాలీవుడ్‌లో పలు ఫ్రాంచైజీలు ప్రత్యేకించి సీక్వెల్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కాంజురింగ్' సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లను సాధిస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా తాజాగా విడుదలైన 'అనబెల్లే3' ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఉన్న హారర్ సినిమాల రికార్డులను తిరగరాస్తూ దాదాపు 2,224 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇవి కేవలం ఓపెనింగ్ వీకెండ్ వసూళ్లు మాత్రమే. ఇప్పటికీ సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించడం, భయపెట్టడం ద్వారా ఈ చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. ఇక ఇదే సిరీస్‌లో 1999 లో విడుదలైన 'ది సిక్స్త్ సెన్స్' సూపర్ నేచురల్ హారర్ త్రిల్లర్ టాప్ గ్రాసర్‌గా నిలిచింది. 1973లో రిలీజైన 'ది ఎగ్జార్సిస్ట్', 2013లో రిలీజైన 'కాంజురింగ్‌', 2016లో రిలీజైన 'కాంజురింగ్ 2' చిత్రాలు టాప్ 10లో ఉన్న హారర్ చిత్రాలుగా రికార్డ్స్ నెలకొల్పాయి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పోరాడి ఓడిన భారత్.. రోహిత్ శర్మ శ్రమ వృధా ఓపెనర్‌గా క్రీజులోకి దిగిన రోహిత్ సౌతాఫ్రికా ఆటగాళ్లకి చుక్కలు చూపిస్తూ ఆడిన ఆటంతా వృధా అయ్యింది. TNN | Updated: Oct 11, 2015, 06:11PM IST రోహిత్ శర్మ పడిన కష్టానికి ఫలితం దక్కలేదు. ఓపెనర్‌గా క్రీజులోకి దిగిన రోహిత్ సౌతాఫ్రికా ఆటగాళ్లకి చుక్కలు చూపిస్తూ ఆడిన ఆటంతా వృధా అయ్యింది. సఫారీలని బౌండరీలకి పరుగెత్తిస్తూ చేసిన 150 పరుగులు, అజింక్యా రహానే సాధించిన 60 పరుగులు... కేవలం సఫారీలు సాధించిన 5 పరుగుల ఆధిక్యం ముందు తల దించుకున్నాయి. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో కాన్పూర్‌లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. 304 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి ఓటమితో వెనుదిరిగింది. మొదటి నుంచి సఫారీలపై మంచి పట్టు సాధిస్తూ వచ్చిన భారత్... చివరివరకు పోరాడి ఓడింది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV లారెన్స్‌ను విచారించిన పోలీసులు ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ ను చెన్నైలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. TNN | Updated: Jun 22, 2016, 08:18AM IST ప్రముఖ కొరియోగ్రాఫర్ , నటుడు, దర్శకుడు లారెన్స్ ను చెన్నైలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. ఓ నిందితుడితో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతోనే లారెన్స్ ను విచారించినట్టు తెలుస్తోంది. వేందర్ మూవీస్ అధినేత మదన్ ఓ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యకు సీట్లు ఇప్పిస్తానని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అనంతరం ఓ రోజు కనిపించకుండా పోయాడు. 25 రోజుల నుంచి అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు మదన్ కోసం తీవ్రంగా వెతుకుతున్నప్పటికీ దొరకలేదు. మదన్ ఇద్దరు భార్యలను, తల్లిని కూడా పోలీసుల విచారించినా ఫలితం లేదు. అయితే మదన్ తో లారెన్స్ సంబంధం ఉందని సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ ఆయన్ను కూడా రెండు గంటల పాటూ ప్రశ్నించారు.
0business
బ్రెజిల్.. బెల్జియం ఎవరి సత్తా ఎంత.. Highlights ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇవాళ్టీ నుంచి క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు జరగున్నాయి.. మాజీ ఛాంపియన్ బ్రెజిల్... డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియంలు ఇవాళ తలపడున్నాయి.  ఫిఫా ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్వార్టర్ ఫైనల్స్ ఇవాళ్టీ నుంచే ప్రారంభంకానున్నాయి. ఆరోసారి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోవాలని చూస్తోన్న బ్రెజిల్‌కు... భారీ అంచనాలున్న బెల్జియంకు ఇవాళ పోరు జరగనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. స్టార్ ఆటగాడు నెయ్‌మార్ ఫాంలోకి రావడంతో పాటు ఫిర్మినో గోల్స్ చాకచక్యంగా మెరుస్తూ ఉండటంతో బ్రెజిల్ ‌దూకుడుగా ఉంది. ఇక దుర్భేద్యమైన ఆ జట్టు రక్షణ శ్రేణిని చేధించడం అసాధ్యం..మిరిండా, తియాగో ద్వయం అడ్డుగోడగా నిలుస్తూ ప్రత్యర్థులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు.. ఈ టోర్నీలో బ్రెజిల్ ఒక్క గోల్ మాత్రమే ఇచ్చిందంటే.. ఆ జట్టు రక్షణశ్రేణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..కాకపోతే ఇప్పటి వరకు ఆడిన అన్ని జట్లు హాట్ ఫేవరేట్లు కాదు.. తొలిసారిగా ఓ అగ్రశ్రేణి జట్టుతో పోరాటానికి రెడీ అయ్యింది బ్రెజిల్. అటు బెల్జియం విషానికి వస్తే.. మ్యాచ్ మ్యాచ్‌కు ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా ఫ్రిక్వార్టర్స్‌లో ఓడిపోయే స్థితిలో జపాన్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. లుకాకు, డిబ్రుయిన్ వంటి ఎటాకింగ్ ఆటగాళ్లతో బెల్జియం ఏ మాత్రం తగ్గడం లేదు. టోర్నీలో ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌లు అడగా, బ్రెజిల్ 3 సార్లు,  బెల్జియం 4 సార్లు గెలిచాయి. బ్రెజిల్ 7 గోల్స్ కొట్టి ..1 గోల్ ఇవ్వగా, బెల్జియం 12 గోల్స్ కొట్టింది 4 గోల్స్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ను కనుక ఓడిస్తే. 1986 తర్వాత బెల్జియం సెమీస్‌కు చేరినట్లే.. అన్ని గణాంకాలను విశ్లేషిస్తే. బ్రెజిల్‌కు 64.1శాతం, బెల్జియంకు 35.9శాతం విజయావకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. "
2sports
షాకింగ్ న్యూస్ : ‘రంగస్థలం’ లో సర్ ప్రైజ్ విలన్? Highlights షాకింగ్ న్యూస్ : ‘రంగస్థలం’ లో సర్ ప్రైజ్ విలన్? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా, డిఫరెంట్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైన సినిమా రంగస్థలం. ఈ సినిమా నేపధ్యం మొత్తం 1985 నాటిది కాబట్టి అప్పటి పరిస్థితులను అద్దంపట్టేలా సినిమాలో సెట్టింగ్ లు రూపకల్పన చేయడం జరిగింది. అలానే సుకుమార్ కూడా ఎక్కడా అప్పటి ఫీల్ ని మిస్ కాకుండా సినిమా తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ మొత్తం రంగస్థలం అనే ఊరిలో జరిగే రాజకీయాల చుట్టూనే తిరుగుతుంటుందని తెలియవస్తోంది. కాగా ఇందులో జగపతిబాబు ఆ ఊరి ప్రెసిండెంట్ గా నటిస్తున్నారు. అయితే అందరూ ఇప్పటివరకు అంటున్నట్లు ఈ సినిమాలో జగపతి బాబు మెయిన్ విలన్ కాదని సమాచారం. హీరో రాంచరణ్ ఇందులో చిట్టిబాబు పాత్ర చేస్తుండగా, ఆయన అన్న కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మొదటినుండి పాజిటివ్ గా ట్రావెల్ అయ్యే కుమార్ బాబు పాత్ర చివరకు నెగటివ్ షేడ్ కి తిరుగుతుందని అంటున్నారు. అంటే ఈ సినిమాలో ఇద్దరు విలన్లా, లేక ఒకరేనా? అసలు విలన్ జగపతి బాబా, లేక ఆదినా? అనే పలు సందేహాలు వెంటాడుతున్నాయి. నిజానికి ఇప్పుడు మనం అనుకున్నది ఊహాజనితమే, అయినప్పటికీ అసలు ఎవరు విలనో తెలియాలంటే రేపటి సినిమా విడుదల వరకు ఆగాల్సిందే మరి….. Last Updated 29, Mar 2018, 6:40 PM IST
0business
Sachin, Anjali met Modi సినిమా ప్రచారంలో సచిన్‌ బిజీ న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన ఒకే ఒక్కడు సచిన్‌.ఆయన తను నటించిన సినిమా ప్రచారంలో బిజిగా కనిపిస్తున్నారు.ఇటీవలే ఆయన ప్రధాని మోడిని కూడా కలిసి తాను నటించిన సినిమాకు సంబందించిన వివరాలు మోడికి వివరించాడు. ఆయన ప్రధాని మోడీతో తన జీవితం ఆధారంగా నిర్మిస్తున్న డాక్యూఫిల్మ్‌ సచిన్‌ ఏ బిలియన్‌ డ్రీమ్స్‌ గురించి ప్రధానికి వివరించిన సంగతి తెలిసిందే.తన అసమాన ఆటతీరు. కళాత్మక బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా సచిన్‌ అభిమానులను సంపాదించుకున్నాడు.దిగ్గజాల చేతి శభాష్‌ సచిన్‌ అనిపించుకున్నాడు కూడా. సచిన్‌ ఆటలో ఎంత సొగసుందో కెరీర్‌లోనూ అంతే వేదన కనిపిస్తుంది. ఫామ్‌ కోల్పోయిన ప్రతిసారి విమర్శల పాలయ్యాడు. కఠోర సాధన చేసి పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. తన జీవితం ఆధారంగా వస్తున్న సినిమా సచిన్‌ ఎ బిలియన్‌ డ్రీమ్స్‌ ద్వారా తన ప్రేమకథ గురించి అందరూ తెలుసుకుంటారని సచిన్‌ విలేకరులతో పేర్కొన్నాడు.ఈ సినిమా కెరీర్‌ గురించే కాకుండా తన ప్రేమ కథ గురించి కూడా తెలుసుకుంటారన్నాడు. ఈ చిత్రంలో నా జీవితంలోని ప్రణయ గాథను మీరు చూస్తారని వివరించాడు.తన క్రీడా ప్రస్థానాన్ని మలచడంలో సతీమణి అంజలి పాత్ర ఎంతో కీలకం అని సచిన్‌ ఒక టివి ఛానెల్‌తో పేర్కొన్నాడు.అంజలి నా కెరీర్‌లో సమ్మిళిత భాగం.నా జీవితంలోని అత్యుత్తమ భాగం అంజలి.అయితే ఎప్పుడు అంజలి నా కెరీర్‌లో జోక్యం చేసుకోలేదని సచిన్‌ వివరించాడు.ఈ బయోపిక్‌ ద్వారా నా వ్యక్తిగత ఆలోచనలు,సంఘటనలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నానని సచిన్‌ వెల్లడించాడు. తానెప్పుడు ఎడమ కాలికే ముందు ప్యాడ్‌ వేసు కొంటానని అది తనకు సెంటిమెంట్‌ అన్నాడు. ఈనెల 26న సచిన్‌ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. =====
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV టెస్టులకి పక్కనపెట్టడంపై బాధ లేదు: రోహిత్ టెస్టు మ్యాచ్‌లకు తనని ఎంపిక చేయకుండా సెలక్టర్లు పక్కన పెట్టడంపై తానేమీ బాధ పడటం లేదని భారత ఓపెనర్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ ఏడాది Samayam Telugu | Updated: May 29, 2018, 05:13PM IST టెస్టులకి పక్కనపెట్టడంపై బాధ లేదు: రోహిత్ టెస్టు మ్యాచ్‌లకు తనని ఎంపిక చేయకుండా సెలక్టర్లు పక్కన పెట్టడంపై తానేమీ బాధ పడటం లేదని భారత ఓపెనర్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవడంతో.. జూన్ 14 నుంచి అఫ్గనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకి సెలక్టర్లు అతడ్ని ఎంపిక చేయలేదు. భారత జట్టులోకి 2010లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మకి 2013లో టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది. కానీ.. ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో అంచనాల్ని అందుకోలేకపోయిన ఈ ఓపెనర్ ఇప్పటి వరకు ఆడింది 25 టెస్టులేకాగా.. ఇందులో 3 శతకాలు, 9 అర్ధశతకాలు మాత్రమే ఉన్నాయి. ‘క్రికెటర్ కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. నేను ఇప్పటికే సగం కెరీర్‌ పూర్తి చేసేశాను. ఇప్పుడు కూడా నేను భారత జట్టులోకి ఎంపికవుతానా..? తుది జట్టులో ఉంటానా..? అని ఆలోచించడం భావ్యం కాదు. నేను ఆ స్థాయిని కూడా దాటేశాను. కెరీర్‌ తొలినాళ్లలో ఆ కంగారు ఉండేది. కానీ.. ఇప్పుడు నా దృష్టి అంతా ఆటని ఆస్వాదించడంపైనే ఉంది. ఒకవేళ సెలక్షన్ గురించి నేను ఎక్కువ ఆలోచించానంటే తప్పకుండా అది ఆటపై ప్రభావం చూపుతుంది. అలాకాకుండా ఆటని ఎంజాయ్ చేస్తూ.. నా వరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. 20 ఏళ్లప్పుడే భారత్ జట్టులో ఆడే అవకాశం దక్కింది. అరంగేట్రం చేసిన ఏడాదిలోనే టెస్టుల్లో కూడా ఛాన్స్ వచ్చింది. కానీ.. గాయంతో ఆ అవకాశం చేజారింది. అప్పుడే నాకు అర్థమైంది.. దేనికైనా టైమ్ రావాలని’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
అభిమానులను తిట్టడం కరెక్ట్ అనిపించిందన్న నాగబాబు Highlights అభిమానులపై చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానన్న నాగబాబు గతంలో పవన్ కళ్యాణ్ అభిమానులపై విరుచుకుపడ్డ మెగా బ్రదర్ 2015వ సంవత్సరంలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులపై నోరుపారేసుకున్న మెగా బ్రదర్   మెగా బ్రదర్ నాగబాబు కొంచెం ఆలస్యంగా స్పందించాడు. తాను గతంలో అభిమానులపై గతంలో చేసిన దుందుడుకు వ్యాఖ్యల పట్ల ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నాడు. 2015లో మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తాను తిట్టిపోయడంపై ఇప్పుడు చింతిస్తున్నాడు. పవన్ అభిమానులు శ్రుతిమించారని నాగబాబు అంటున్నా... తను వాళ్ల మీద అప్పుడు ఆ స్థాయిలో విరుచుకుపడాల్సింది కాదని నాగబాబు అభిప్రాయపడ్డాడు.  పవన్ కల్యాణ్ అభిమానులంటే మెగా అభిమానులేనని.. పవన్ ఎదుగుదలకు వారంతా పిల్లర్ల లాగా ఉపయోగపడ్డారని నాగబాబు అన్నాడు. ఐతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్లలో వారు చేసే గోల శ్రుతి మించిపోయిందని.. అదీ కాక తమ ఫ్యామిలీ హీరోల కార్యక్రమాల్లోనే కాకుండా ఇతర హీరోల ఫంక్షన్లలోనూ వారు చేసే అల్లరి వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని నాగబాబు అన్నాడు. ఐతే ఒక హీరోపై నిజమైన ప్రేమను చూపించేది అభిమానులేనని.. కాబట్టి న్యూసెన్స్ చేశారని అభిమానులపై తాను ఆగ్రహం వ్యక్తం చేసినందుకు చింతిస్తున్నానని నాగబాబు చెప్పాడు. ఐతే ఆ సమయంలో తనకు అదే కరెక్ట్ అనిపించిందని, అందుకే అభిమానుల్ని తిట్టానని నాగబాబు స్పష్టం చేశాడు. 2015లో చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తుంటే నాగబాబు కోపం పట్టలేకపోయాడు. పవన్ ఎందుకు ఇలాంటి కార్యక్రమాలకు రావట్లేదో అతడి ఇంటి ముందుకు వెళ్లి అడగాలని.. అంతే తప్ప ఇక్కడ వచ్చి గొడవ చేయడం సంస్కారం కాదని నాగబాబు తీవ్ర స్వరంతో అభిమానులపై మండి పడ్డాడు. Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
కేజీ బేసిన్‌పై రిలయన్స్‌ 'లోతైన' దృష్టి! - బీపీతో కలిసి 40వేల కోట్ల పెట్టుబడులు - కే-సిరీస్‌లో మూడు ప్రాజెక్టుల అభివృద్ధి - 3-5 యేండ్లలో అందుబాటులోకి ఉత్పత్తి - దిగిరానున్న దిగుమతి భారం: రిలయన్స్‌ - బహుముఖంగా విస్తరిస్తాం: బీపీ సంస్థ న్యూఢిల్లీ: ముఖేష్‌ అంబానీ నేపథ్యంలోని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ కృష్ణా-గోదావరి బేసిన్‌లోని తమ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఇందుకు గాను ఆ సంస్థ బ్రిటీష్‌ చమురు దిగ్గజం బీపీ పీఎల్‌సీతో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించింది. రానున్న రోజుల్లో బ్రిటీష్‌ సంస్థతో కలిసి దాదాపు రూ.40,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టుగా ప్రకటించింది. రెండు సంస్థలు కలిసి కేజీ బేసిన్‌లో మరో మూడు సహజ వాయువు ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్టుగా రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, బీపీ గ్రూపు అధినేత బాబ్‌ డూబ్లేలు గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. కేజీ-బేసిన్‌లోని శాటిలైట్‌ క్షేత్రాలు, కే-సిరీస్‌ క్షేత్రాలను అభివృద్ధి చేయడం ద్వారా 2020-22 నాటికి రోజుకు 30-35 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సహజ వాయువును ఉత్పత్తి చేయాలని తాము నిర్ణయించినట్టుగా అంబానీ ప్రకటించారు. తాజాగా తాము చేపట్టిన ప్రాజెక్టులు దేశ ఇంధన వనరుల అవసరాలను తీర్చేందుకు ఎంతగానో దోహదం చేస్తాయని.. దేశ చమురు దిగుమతులు చాలా వరకు (దాదాపు 10 % వరకు)దిగివస్తాయని ఆయన వివరించారు. భారత్‌లో గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు తాజా ప్రాజెక్టులు దన్నుగా నిలుస్తాయని అన్నారు. భారత్‌లో ఇంధన, మొబిలిటీ రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని.. డిమాండ్‌ను అందిపుచ్చుకొని ఎదిగేందుకే రిలయన్స్‌తో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా బీపీ గ్రూపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బాబ్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా రిలయన్స్‌-బీపీ బంకులు..! భారత్‌ తక్కువ కాలుష్య కారక ఇంధనాల వైపు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో రెండు సంస్థలు తమ భాగస్వామ్యాన్ని ఇతర విభాగాలకు కూడా విస్తరించాలని యోచిస్తున్నాయి. దేశీయ ఇంధన, సంప్రదాయక రవాణా వ్యవస్థతో పాటు విమాన ఇంధనాల రిటైలింగ్‌, సాంప్రదాయేతర రవాణా వ్యవస్థ ఎలక్ట్రిఫికేషన్‌, డిజిటైజేష్‌లకు కూడా ఈ రెండు సంస్థలు విస్తరించనున్నాయి. రెండు సంస్థలకు ఉన్న అపార అనుభవంతో దేశంలోని వ్యవసాయ, పట్టణ, గ్రామీణ, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల అవసరాలు తీర్చేలా వ్యాపార ప్రణాళికలతో ముందుకు సాగాలని ఇరు సంస్థలు నిర్ణయించుకున్నాయి. దేశీయంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే విధంగా వివిధ వ్యాపార కార్యకలాపాలను చేపట్టనున్నట్టుగా ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు. బీపీ సంస్థ ఇప్పటికే భారత్‌లో పూర్తి స్థాయిలో పెట్రోలు బంక్‌లను ఏర్పాటు చేసుకొనేందుకు గాను లైసెన్స్‌లను కలిగి ఉంది. తాజా భాగస్వామ్యంతో రానున్న కాలంలో ఇరు సంస్థలు విస్తృతంగా పెట్రోలు బంకులను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త రకం ఇంధనాలు.. తక్కువ కాలుష్య కారక ఇంధనాలను మార్కెట్లోకి తెచ్చేందుకు కూడా రెండు సంస్థలు కృషి చేయనున్నాయి. ఇంధన రిటైల్‌పై దృష్టి పెట్టండి: ధర్మేంద్ర న్యూఢిల్లీ: సహజ వాయువును వెలికి తీసేందుకు జట్టుకట్టి కృషి చేస్తున్న రిలయన్స్‌, బీపీ సంస్థలు దేశంలోని ఇంధన రిటైల్‌ రంగంపై దృష్టి సారించాలని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కోరారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, బీపీ గ్రూపు అధినేత బాబ్‌ డూబ్లేలు గురువారం మంత్రితో దాదాపు 80 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రిలయన్స్‌ సంస్థ దేశ వ్యాప్తంగా దాదాపు 1,400 పెట్రోలు పంపులను కలిగి ఉంది. గత ఏడాదే బీపీ సంస్థకు ఇంధన రిటైలింగ్‌ అనుమతులు లభించిన సంగతి విధితమే. ఇప్పటి వరకు ఈ రెండు సంస్థల మధ్య ఇంధన రిటైలింగ్‌ విషయంలో ఎలాంటి సౌజన్యం లేదు. ఆరేండ్ల నుంచి గ్యాస్‌ ఉమ్మడి వేట..! సముద్ర తీరానికి దాదాపు 70 కి.మీ. లోపల దాదాపు 2000 మీటర్ల లోతు నుంచి డ్రైగ్యాస్‌ను వెలికితీయడమే కే-సీరిస్‌ ప్రాజెక్టు. కేజీ బేసిన్‌లోని లోతైన సముద్ర భూగర్భాలలో చమురు వాయువును వెలికి తీసేందుకు గాను బ్రిటీష్‌ చమురు దిగ్గజం బీపీ పీఎస్‌సీ 2011లో రిలయన్స్‌తో జట్టు కట్టింది. అప్పటి నుంచి కేజీ బేసిన్‌లో గ్యాస్‌ నిక్షేపాల కోసం ఇరు సంస్థలు కలిసి గత మే ముగింపు నాటి వరకు దాదాపు రూ.10,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. తాజాగా ఇదే ప్రాజెక్టులో మరో రూ.40,000 కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడం విశేషం. గ్యాస్‌ వెలికితీతకు సంబంధించిన కాంట్రాక్టులను త్వరలో ఆయా సంస్థలకు కేటాయించనున్నారు. తాజాగా చేపట్టిని ఆర్‌-సిరీస్‌ క్షేత్రాల నుంచి వచ్చే గ్యాస్‌తో 2022 నాటికి దేశీయ గ్యాస్‌ దిగుమతి అవసరాలు దాదాపు 10 శాతం మేర దిగివచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 110 Views bse , NSE , stock market stock market ముంబయి: నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లుస్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 85 పాయింట్లు నష్టపోయి 37,897 వద్ద, నిఫ్టీ 1 పాయింటు నష్టపోయి 11,329 వద్ద ట్రేడవుతున్నాయి. వేదాంతా, మారుతీ, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీలోని అన్ని సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ లోహ, నిఫ్టీ ఆటో సూచీలు 1.3శాతం నష్టపోయాయి. రూపాయి 15 నష్టంతో రూ.69.09 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అమెజాన్ ఫ్రీడ‌మ్ సేల్ సంద‌ర్భంగా మ‌ళ్లీ ఆఫ‌ర్లు భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని అమెజాన్ ఇండియా ఫ్రీడ‌మ్ సేల్ అనే స‌రికొత్త ఈవెంట్‌ను ప్ర‌క‌టించింది. దీనిలో భాగంగా ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌పై భారీ డిస్కౌంట్ల‌ను అందివ్వ‌నుంది. Samayam Telugu | Updated: Aug 4, 2018, 09:57AM IST స్వాతంత్య్ర దినోత్స‌వ నేప‌థ్యంలో అమెజాన్ ఇండియా మ‌రో సేల్‌ను ప్రకటించింది. దీనికి అమెజాన్ ఫ్రీడమ్ సేల్ అనే పేరు పెట్టారు. ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 12 అర్ధరాత్రి వరకు ఈ సేల్ కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, టీవీలులాంటి వాటిపై మొత్తం 20 వేల డీల్స్ అందుబాటులో ఉంటాయ‌ని కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్, వివో, జేబీఎస్, ఎల్‌జీ, ఫిలిప్స్, కాసియో బ్రాండ్లపై పెద్ద ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా పది శాతం రాయితీ లభిస్తుంది. అన్నిఉత్ప‌త్తులపై ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయని అమెజాన్ తెలిపింది. ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. వన్‌ప్లస్ 6, రియల్‌మి 1 6జీబీ, హానర్ 7ఎక్స్, మోటో జీ6, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8, హువావీ పీ20 లైట్, హానర్ 7సీ, మోటో ఈ5 ప్లస్, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్, వివో నెక్స్, నోకియా 6.1, ఒప్పో ఎఫ్5, ఎల్జీ వీ30లాంటి మొబైల్స్‌పై ఎక్స్చేంజీతో కూడిన‌ డిస్కౌంట్లు సైతం ఉంటాయి. సేల్‌లో భాగంగా హానర్ ప్లే, హువావీ నోవా 3ఐ, బ్లాక్‌బెర్రీ కీ2 మొబైల్స్ కూడా లాంచ్ చేయనున్నారు. ఆగస్ట్ 9న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 కూడా సేల్‌లో భాగంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొబైల్స్ కాకుండా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్స్, కెమెరాలు, హెడ్‌ఫోన్లపై కూడా భారీగా ఆఫర్లు ప్రకటించింది అమెజాన్.
1entertainment
షమీ, యాదవ్‌ల విజృంభణ వెస్టిండీస్‌ 243 ఆలౌట్‌ వెనకబడిన విండీస్‌ జట్టు ఆంటిగ్వా : వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల క్రికెట్‌ సిరీస్‌లో భాగంగా నార్త్‌ సౌండ్‌లోని సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్‌ షమీ దుమ్మ రేపాడు.నిప్పులు చెరిగే బంతితో విరుచుకుపడి కరీబియన్ల వెన్ను విరిచాడు.షమీ 66 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా ఇతనికి తోడు ఉమేష్‌ యాదవ్‌ 41 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. వీరు విజృంభించడంతో వెస్టిండీస్‌ 243 పరుగులకే ఆలౌటైంది.దీంతో తొలి టెస్టులో భారత్‌ పట్టుబిగించింది.ఫాలోఆన్‌కు దిగిన విండీస్‌ ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది.ఆట ముగిసే సమయానికి 1 వికెట్‌కు 21 పరుగులతో నిలిచింది.భారత్‌కు టార్గెట్‌  నిర్దేశించాలంటే విండీస్‌ మరో 302 పరుగుల పైన సాధించాల్సి ఉంటుంది.ఓవర్‌నైట్‌ స్కోరు 1 వికెట్‌కు 31 పరుగులతో మూడవ రోజు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌కు భారత్‌ బౌలర్‌ షమీ,ఉమేష్‌యాదవ్‌ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరూ విండీస్‌ పతనంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు అమిత్‌ మిశ్రా కూడా 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. కాగా మూడవ రోజు విండీస్‌ను దెబ్బతీయడంలో పేసర్‌ షమీది కీలక పాత్ర అదనపు బౌన్స్‌తో అతడు అత్యంత ప్రతిభావంతంగా బౌలింగ్‌ చేశాడు. నిజానికి ఉదయం నిర్జీవమైన పిచ్‌పై విండీస్‌ ఓపెనర్‌్‌ క్రెయింగ్‌ బ్రాత్‌వైట్‌ నైట్‌ వాచ్‌మెన్‌ బిషూ 12 భారత బౌలర్లను 16 ఓవర్లపాటు తీవ్ర అసహనానికి గురి చేశారు. ముఖ్యంగా బ్రాత్‌వైట్‌ తీవ్రంగా ప్రతిఘటించాడు. తొలి సెషన్‌లో అతడు 91 బంతులను ఎదుర్కోగా,విండీస్‌ 59 పరుగులు మాత్రమే చేయగలిగింది.అయితే తమ భాగస్వామ్యంలో బ్రాత్‌వైట్‌,బిషు ఇబ్బందులు ఎదుర్కోక  తప్పలేదు.బంతి చాలాసార్లు బిషు బ్యాట్‌ అంచును తాకి వెళ్లింది.తొలి ఎనిమిది ఓవర్లలో అతడు కేవలం 15 బంతులే ఎదుర్కొన్నాడు. పేసర్లు ఒత్తిడి తెచ్చినా దాన్ని స్థిరంగా కొనసాగించలేకపోయారు. అయితే షమీ నిలకడగా ఆఫ్‌స్టంప్‌ అవతల బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ ను పరీక్షించాడు.చివరికి బిషును ఔట్‌ చేయడం ద్వారా మిశ్రా రెండవ వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు.ఎటాకింగ్‌ బౌలింగ్‌ కొనసాగించిన షమీ డారెన్‌ బ్రావో 11 ను త్వరగా వెనక్కి పంపించాడు.షమి,కీపర్‌ క్యాచ్‌ ద్వారా బ్రావోను వెనక్కి పంపించడంతో లంచ్‌ సమయానికి విండీస్‌ 3 వికెట్లకు 90 పరుగుల వద్ద నిలిచింది. లంచ్‌ తరువాత దూకుడు కొనసాగించిన షమీ ఒకే ఓవర్‌లో వికెట్లు పడగొట్టి విండీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు.విరామం తరువాత తన మూడవ ఓవర్‌లో శామ్యూల్స్‌ 1,బ్లాక్‌వుడ్‌ జిరో వద్ద పెవిలియన్‌కు బాట పట్టించాడు.ఆప్‌స్టంప్‌ లోగిలిలో షమీ బంతిని ఆడబోయిన శామ్యూల్స్‌,సాహా చేతికి చిక్కాడు.టెస్టుల్లో షమీకి ఇది 50వ వికెట్‌.రహానే అందుకున్న చక్కని క్యాచ్‌్‌కు బ్లాక్‌వుడ్‌ నిష్క్రమించాడు. దీంతో 5 వికెట్లక 92 పరుగులు వద్ద విండీస్‌ చిక్కుల్లో పడింది.అయితే మొండిగా పాతుకుపోయిన క్రెయిగ్‌ బ్రాత్‌వెట్‌ మాత్రం పోరాటాన్ని కొనసాగించాడు.చేజ్‌ 23 కూడా ప్రతిఘటించడంతో ఒక దశలో విండీస్‌ 5 వికెట్లకు 139 పరుగుల వద్ద విండీస్‌ స్కోరు నిలిచింది.కాగా ఉమేష్‌ వరుస ఓవర్లలో చేజ్‌,బ్రాత్‌వైట్‌లను ఔట్‌చేసి విండీస్‌ను గట్టి దెబ్బతీశాడు. హోల్డర్‌,బ్రాత్‌వైట్‌,గాబ్రియల్‌ వరుసగా వెనుదిరగడంతో వెస్టిండీస్‌ 243 పరుగులకు ఆలౌటైంది.ఈ క్రమంలో రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీకు ఇషాంత్‌ శర్మ రూపంలో తొలి దెబ్బ తిగిలింది.తొలి ఓవర్లలోనే బ్రాత్‌వైట్‌ 2 వికెట్‌ కోల్పోయింది.మూడవ రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ 3 వికెట్లకు 21 పరుగులతో నిలిచింది. విండీస్‌ ఆశలు గల్లంతు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు ఏమి దక్కని ఇషాంత్‌ శర్మ రెండవ ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్‌ తీసుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌ హీరో బ్రాత్‌ ను కేవలం రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్‌డిడబ్ల్యూగా వెనక్కి పంపాడు.దీంతో ఇక విండీస్‌ ఆశలు గల్లంతయ్యాయి.భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో చేసిన 566 పరుగుల భారీ స్కోరును కనీసం చేరుకోవాలన్నా కూడా ఇంకా 302 పరుగులు చేయాలి. కాగా దూసుకుపోతున్న టీమిండియా బౌలర్లను దాటుకుని అంత స్కోరు చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో విండీస్‌ జట్టుకు కష్టమే.దీంతో ఏదైనా అనుకోని విధంగా పరిస్థితి కలిగితే తప్ప తొలి టెస్టు భారత్‌ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇన్నింగ్స్‌ తేడాతో గెలుపు ముంగిట టీమిండియా  తొలి టెస్టులో భారత్‌ పట్టు బిగించింది.తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 566 పరుగుల వద్ద డిక్లేర్‌ చేయగా వెస్టిండీస్‌ 243 పరుగుల కే కుప్పకూలింది.దీంతో ఫాలోఆన్‌ ఆడాల్సిన పరిస్థితిలో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసిన ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌,రెండవ ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే శర్మ బౌలింగ్‌లో ఎల్‌డిడబ్ల్యూగా ఔటై పెవిలియన్‌ బాట పట్టాడు.దీంతో రెండు పరుగుల వద్దే కీలక వికెట్‌ కోల్పోయిన విండీస్‌ జట్టు 13 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టా నికి 21 పరుగుల వద్ద ఆట కొనసాగించనుంది. ఇక మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ తేడాతో భారత్‌ విజయం సాధించాలంటే మరో 9 వికెట్లు తీయాలి. ఇక వెస్టిండీస్‌ కోలుకుని బాగా ఆడి మరో 302 పరుగుల కన్నా ఎక్కువ చేయగలిగితేనే ఇన్నింగ్స్‌ తేడా పరాజయాన్ని తప్పించుకోగలుగుతుంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కొంత కష్టమే.
2sports
Visit Site Recommended byColombia ఓసారి మ్యాచ్ జరుగుతున్నప్పుడు మహీ భాయ్‌కు జోక్ చెప్పా. అంతే అతడు పడి పడి నవ్వాడని కోహ్లి చెప్పాడు. ‘నేను అండర్ 17 క్రికెట్ ఆడే రోజుల్లో కొత్త కుర్రాడికి బంతిని ఇచ్చా. ఏ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తావని అడగడం కోసం ఎక్కడి నుంచి అని అడిగా. తనేమో ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతున్నా అనుకొని నజఫ్‌గఢ్ నుంచి అని చెప్పాడు. ఇదే విషయం ధోనీకి చెబితే తెగ నవ్వాడు’. నాకు తెలిసి అత్యుత్తమ క్రికెట్ బ్రెయిన్ ధోనీదే. ఏ సందర్భంలోనైనా సలహా అడగాల్సి వస్తే.. ధోనీ చెబుతాడు. అతడ పదిసార్లు చెబితే.. 8 లేదా 9 సార్లు కచ్చితంగా అతడి ప్లాన్ పని చేస్తుందని కోహ్లి చెప్పాడు. Their bonding has become stronger with the passage of time and skipper Virat Kohli is proud of the fact that no external force has been able to affect his friendship with predecessor Mahendra Singh Dhoni. "A lot of people try to plug in stories of rift between us. The best part is neither he reads those articles nor do I. And when the people see us together, they wonder 'wasn't there rift between the two'. We laugh amongst ourselves and say we didn't know there was one," Kohli said during an episode of web-series 'Breakfast With Champions'.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మటన్ సమోసా కోసం.. గూగుల్‌లో జాబ్ వదిలేశాడు! మటన్ సమోసాలు అమ్ముకోడానికి బంగారంలాంటి ‘గూగుల్’ జాబ్‌ వదిలేసుకున్నాడా? అతనికేమైనా మతిపోయిందా? అనుకోవద్దు. ఎందుకంటే.. అతని మస్తిష్కానికి తట్టిన ఐడియా అలాంటిది మరి. TNN | Updated: Jul 15, 2017, 01:23PM IST మటన్ సమోసాలు అమ్ముకోడానికి బంగారంలాంటి ‘గూగుల్’ జాబ్‌ వదిలేసుకున్నాడా? అతనికేమైనా మతిపోయిందా? అనుకోవద్దు. ఎందుకంటే.. అతని మస్తిష్కానికి తట్టిన ఐడియా అలాంటిది మరి. భారతీయులు కొత్త రుచులు చూసేందుకు చాలా ఇష్టపడతారు. విదేశీ వంటకాలకు అంత ఆధరణ లభిస్తుందంటే కారణం అదే. మరి, దేశీ వంటకానికి సరికొత్త రుచులను అద్దితే.. ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. ముంబయికి చెందిన మునఫ్ కపాడియాకు ఇదే ఐడియా వచ్చింది. ‘అమ్మ’ చేతి వంట రుచి తెలిసిన మునఫ్.. ఆ నమ్మకంతో ‘మటన్ సమోసా’కు ప్రాణం పోశాడు. దానికి మరికొన్ని సరికొత్త హంగులు చేర్చి రొటీన్‌కు భిన్నంగా వడ్డిస్తూ.. కేవలం రెండేళ్లలోనే వ్యాపారంలో దూసుకుపోతున్నాడు. తల్లితో కలిసి ‘ద బొహ్రీ కిచెన్’ పేరుతో మొదలుపెట్టిన ఈ కొత్త బిజినెస్‌కు ఏడాదికి రూ.50 లక్షల టర్నోవర్ లభిస్తోంది.
1entertainment
Visit Site Recommended byColombia దీనిపై నటి ఖుష్బూ కూడా మండిపడ్డారు. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయి అయినంత మాత్రాన అక్కడి నటీనటులనే వేడుకలకు ఆహ్వానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవిలను ఓ సమావేశానికి ఆహ్వానించారు. త్వరలో తండ్రీ కొడుకులు దిల్లీలోని పీఎంఓ కార్యాలయంలో మోదీని కలవబోతున్నారు. అయితే ఉపాసన చేసిన ట్వీట్‌పై తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ఉపాసన అలా కామెంట్ చేసిన విషయం తనకు అస్సలు తెలీదని అన్నారు. ఒకవేళ మోదీని ఉద్దేశిస్తూ ఉపాసన ట్వీట్ చేస్తున్నట్లు తనకు తెలిసుంటే అలా చేయకుండా ఆపేవాడినని తెలిపారు. READ ALSO: అందమైన నటి గుండె ఆగిపోయేంత భయంకరంగా తయారైంది..చూసి తట్టుకోగలరా? ఇక చెర్రీ వర్క్ విషయానికొస్తే ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో నిర్మాతగా మంచి విజయం అందుకున్నారు. కొద్దిరోజులు విరామం తీసుకున్నాక ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఓ షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్‌ను ఫాస్ట్‌గా చేశారట. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆలియా భట్ రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్నారు. 2020 జూన్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV రామ్ చరణ్‌కు మెగాస్టార్ అల్టిమేటం! సైరా నరసింహా రెడ్డి విషయంలో చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్‌కు అల్టిమేటం జారీ చేశారట. TNN | Updated: Oct 12, 2017, 04:14PM IST మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి. స్వాతంత్ర్యం రాక ముందు నాటి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవిగా ఈ మూవీలో కనిపించనున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు. 1940ల నాటి సినిమా కావడంతో ఇందులో భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించనున్నారు. ‘సైరా’తో భారీ విజయం అందుకోవాలని చిరంజీవి భావిస్తుండగా.. రామ్ చరణ్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. బ్రిటిష్ పాలనను కళ్లకు కట్టేలా.. భారీ రేంజ్‌లో ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించనున్నారని తెలుస్తోంది. గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడొద్దని మెగాస్టార్ తన కుమారుడికి అల్టిమేటం జారీ చేశారట. దీంతో చరణ్ లండన్లోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలను సంప్రదించారని తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV బీజేపీ గెలుపుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో మంగళవారం స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో కొనసాగాయి. TNN | Updated: Dec 19, 2017, 05:50PM IST గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కాస్త వెనుకంజ వేయడంతో సోమవారం తొలుత నష్టాల్లోకి వెళ్లి అనంతరం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం జోరు కొనసాగించాయి. కీలకమైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గెలుపొందడంతో స్టాక్ మార్కెట్లకు కొత్త కళ వచ్చింది. మదుపర్లు నమ్మకం ఉంచడంతో మంగళవారం సెన్సెక్స్ 235 పాయింట్ల లాభంతో 33,836 వద్ద ముగిసింది. నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 10,463 స్థాయిలో ముగిసింది. మారుతీ సుజుకీ లైఫ్ టైం హై స్థాయికి చేరుకొని 9,985 పాయింట్ల వద్ద ముగియడం విశేషం. మారుతి 5.82 శాతం లాభాలను పొందగా.. ఇతర ఆటో స్టాక్‌లు హీరో మోటోకార్ప్ 4.51 శాతం, టాటా మోటార్స్ 3.56 శాతం, బజాజ్ ఆటో 2.8 శాతం లాభపడ్డాయి. రూపాయి కూడా బలపడి మధ్యాహ్నం సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.02కు చేరింది.
1entertainment
క్యాస్టింగ్ కౌచ్ నిజమే.. నన్ను కూడా ఆ పనికి పిలిచేవారు Highlights క్యాస్టింగ్ కౌచ్ నిజమే.. నన్ను కూడా ఆ పనికి పిలిచేవారు జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా తెలుగు సినీ జ‌నాల‌కు బాగా ద‌గ్గ‌రైన యాంక‌ర్‌ల‌లో ర‌ష్మీ ఒక‌రు. ఎంత‌లా అంటే.. అటు బుల్లితెర‌పై.. ఇటు వెండి తెర‌పై యువ‌త‌కు మాంచి కిక్ ఇచ్చి, త‌న‌దైన న‌ట‌న‌తో బాగా క్రేజ్ సంపాదించుకునేంత‌లా. అందులోను తాను యాంక‌రింగ్ చేసిన షోలు, న‌టించిన చిత్రాలు వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తుండ‌టంతో త‌న అందాల ఆర‌బోతకు హ‌ద్దులను చెరిపేసింది ర‌ష్మీ. బుల్లితెర‌ను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ నిత్యం అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వుతూ యాంక‌ర్ క‌మ్ యాక్ట‌ర్ అంటూ ప్ర‌శంస‌లందుకుంటోంది. ఇదిలా ఉండ‌గా టాలీవుడ్‌లో ఎప్ప‌ట్నుంచో ఉన్న కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం ఇటీవ‌ల కాలంలో ప‌డ‌గ విప్పిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ప‌లువురు స్టార్ హీరోయిన్లు మీడియా ముఖంగా స్పందించి మ‌రీ ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్ల‌తోపాటు.. బ‌ఢా ప్రొడ్యూస‌ర్ల పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఇదే విష‌యంపై స్పందించిన ర‌ష్మీ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారాన్ని కేవ‌లం ఒక్క సినీ ఇండ‌స్ట్రీకి క‌ట్ట‌బెట్ట‌డం మించిది కాద‌ని, అన్ని రంగాల్లోనూ మ‌హిళ‌లు తీవ్ర లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నార‌ని చెప్పింది. గ‌తంలో త‌న‌ను కూడా కొంద‌రు ఇలా అడిగార‌ని, అందుకు తాను ఒప్పుకోక‌పోవ‌డంతో ప‌లు ఛాన్సులు కూడా మిస్సైన‌ట్టు చెప్పుకొచ్చింది ర‌ష్మీ. Last Updated 17, May 2018, 11:00 AM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV అప్పట్లో కండోమ్ ప్యాకెట్స్ తో హోలీ ఆడేవాళ్లం... అయితే అవి కండోమ్స్ అని అప్పటికి మాకు తెలీనే తెలియదు..’ అని అంటూ రాఖీ తాము హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరును వివరించింది. TNN | Updated: Mar 15, 2017, 04:16PM IST వివాదాల పుట్ట రాఖీ సావంత్ మరో సారి హాట్ కామెంట్స్ చేసింది. తాము చిన్నప్పుడు కండోమ్ లతో హోలీ పండగ జరుపుకునే వాళ్లం అంటూ రాఖీ చెప్పడం చోద్యంగా మారింది. ఏ వ్యవహారం గురించి స్పందించడంలో అయినా.. సెక్స్, హాట్ నెస్ ప్రస్తావన తప్పకుండా తెచ్చే రాఖీ హోలీ పండగ గురించి చెబుతూ కూడా అలాంటి మాటలే మాట్లాడింది. దీంతో ఈమె తీరు మరోసారి చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ రాఖీ సావంత్ ఏమందంటే.. ‘చిన్నప్పుడు మేము హోలీని బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్లం. వాటర్ బెలూన్స్ ను విసురుకునే వాళ్లం. అయితే బెలూన్స్ లేనప్పుడు.. కండోమ్ లలోకి రంగు నీళ్లను పోసి వాటిని ఒకరిపై మరొకరు విసురుకునే వాళ్లం.. అయితే అవి కండోమ్స్ అని అప్పటికి మాకు తెలీనే తెలియదు..’ అని అంటూ రాఖీ తాము హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరును వివరించింది.
0business
చిరుకు హోదా సెగ.. రంగస్థలం ఈవెంట్ లో విద్యార్థుల నిరసన Highlights చిరుకు హోదా సెగ.. రంగస్థలం ఈవెంట్ లో విద్యార్థుల నిరసన మెగాస్టార్ చిరంజీవికి పొలిటికల్ సెగ తగిలింది. రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆదివారం చిరంజీవి వైజాగ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవికి ప్రత్యేక హోదా సెగ తగిలింది. ప్రత్యేక హోదా కోసం ఏపీ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరు రాకతో ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు ప్లకార్డులతో నిరనస తెలియజేసారు. చిరు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే.   చిరంజీవికి తన తనయుడు రాంచరణ్ సినిమా ఈవెంట్స్ మినహా ఏపీ సమస్యలు పట్టవా అంటూ ఏయూ యువత ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు కాబోతున్న సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఏయూ విద్యార్థులని పోలీస్ లు నిలువరించారు. పాలిటిక్స్ కి బ్రేక్ ఇచ్చిన తరువాత చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో సైరా చిత్రంలో నటిస్తున్నారు. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
Abu Dhabi - United Arab Emirates, First Published 26, Sep 2018, 5:45 PM IST Highlights ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కొద్దిసేపటిక్రితమే ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బంగ్లా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.   అబుదాబి: ఆసియా కప్ చివరి సూపర్ ఫోర్ పోరులో పాకిస్తాన్ ను చిత్తు చేసి బంగ్లాదేశ్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత్ తో బంగ్లాదేశ్ ఫైనల్లో తలపడనుంది.  బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 37 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది.  పాకిస్తాన్ 18 పరుగులకు 3 వికెట్లు చేజార్చుకుంది. ఫఖర్‌ జమాన్‌ (1)ను తొలి ఓవర్లోనే మెహదీ హసన్‌ ఔట్ చేశాడు. ముస్తఫిజుర్‌ తన వరుస రెండు ఓవర్లలో బాబర్‌ ఆజమ్‌ (1), సర్ఫరాజ్‌ (10)లను ఔట్ చేసి పాకిస్తాన్ గుండెల్లో గుబులు రేపాడు.  ఈ స్థితిలో ఇమామ్, షోయబ్‌ మాలిక్‌ (51 బంతుల్లో 30; 2 ఫోర్లు) కలిసి ఇన్నింగ్సును నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే బంగ్లాదేశ్ కట్టుదిట్టమైన బౌలింగు వల్ల, ఫీల్డింగ్ వల్ల పరుగులు రాబట్టడం పాకిస్తాన్ కు గగనమే అయింది. ఇమామ్, మాలిక్‌ మూడో వికెట్‌కు 16.4 ఓవర్లలో 67 పరుగులు మాత్రమే జోడించగలిగారు. మిడ్‌ వికెట్‌లో కెప్టెన్‌ మొర్తజా అద్భుత క్యాచ్‌ పట్టడంతో మాలిక్‌  వెనుదిరిగాడు. ఆ తర్వాత షాదాబ్‌ (24 బంతుల్లో 4) ఐదో వికెట్‌గా అవుటయ్యాడు.  ఇమామ్‌ ఉల్‌ హక్ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి ఆసిఫ్‌ అలీ (47 బంతుల్లో 31; 3 ఫోర్లు) అండగా నిలిచాడు. అయితే రెండు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని లిటన్‌ దాస్‌ స్టంపౌట్‌ చేయడంతో పాకిస్తాన్ మ్యాచుపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.   టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా జట్టు 48.5 ఓవర్లలో 239 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ముష్పికర్ రహీమ్ 99 పరుగులు వద్ద ఔటయ్యి ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు దిగిన రహీమ్, మిథున్ లు సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు సాధించారు. దీంతో బంగ్లా 239 పరుగులు సాధించగల్గింది. వీరిద్దరు మినహాయిస్తే బంగ్లా బ్యాట్ మెన్స్ ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.  పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ 4, షాహీన్ అప్రిది 2, హసన్ అలీ 2, షాదన్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నారు. బంగ్లాదేశ్ చివరి ఇద్దరు బ్యాట్ మెన్స్ రనౌట్లయ్యారు. ఇలా  పాకిస్థాన్ కు 140 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది బంగ్లా.  బంగ్లా ఆటగాడు ముష్పికర్ రహీమ్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇతడు షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో ఔటయ్యాడు. సెంచరీ షాట్ కు ప్రయత్నిస్తూ బంతిని గాల్లోకి లేపడంతో పాక్ కెప్టెన్ సర్పరాజ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో రహీమ్ సెంచరీ మిస్సై పెవిలియన్ బాట పట్టాల్సివచ్చింది. ఇలా 197 పరుగుల వద్ద బంగ్లా ఆరో వికెట్ కోల్పోయింది. రహీమ్ 116 బంతుల్లో 99 పరుగులు చేశాడు. ఎట్టకేలకు బంగ్లా నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మ్యాచ్ ఆరంభంలోనే కేవలం 12 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్ ను రహీమ్, మిథున్ లు ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండానే స్కోరును సెంచరీ మార్కు దాటించి ఇద్దరూ అర్థశతకాలు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మహ్మద్ మిథున్ ను పాక్ బౌలర్ హసన్ అలీ ఔట్ చేశాడు. దీంతో 156 పరుగుల వద్ద బంగ్లా నాలుగో వికెట్ కోల్పోయింది. అయితే మిథున్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్ ఎక్కువసేపు నిలబడలేడు. షాదన్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 167 పరుగల వద్ద బంగ్లా ఐదో వికెట్ కోల్పోయింది.  ప్రస్తుతం క్రీజులో రహీమ్, మహ్మదుల్లా లు ఉన్నారు. అయితే రహీమ్ సెంచరీకి మరో ఐదు పరుగుల దూరంలో ఉన్నాడు. మొత్తానికి బంగ్లా 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.  ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లా బ్యాట్ మెన్స్ మొదట్లో తడబడి వెంటవెంటనే మూడు వికెట్లు సమర్పించుకున్నారు. అయితే ఆ తర్వాతి క్రీజులోకి వచ్చిన రహీమ్, మిథున్ లు ఆచితూచి ఆడుతూ నెమ్మదిగానే స్కోరు వేగాన్ని పెంచుతున్నారు. ఈ క్రమంలో జట్టు స్కోరు సెంచరీకి చేరింది. ఇదే క్రమంలో రహీమ్( 73 బంతుల్లో 61 పరుగులు), మిథున్( 72 బంతుల్లో 53 పరుగులు) అర్థ శతకాలను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం బంగ్లా 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది.  ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కొద్దిసేపటిక్రితమే ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బంగ్లా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ నిర్ణయం తప్పని తెలియడానికి బంగ్లాకు ఎంతో సమయం పట్టలేదు. పాక్ బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  బంగ్లా ఓపెనర్ సౌమ్య  సర్కార్ రెండో ఓవర్ లోనే జునైద్ ఖాన్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మోమినల్ హక్ (5 పరుగులు)ను షాహిన్ అఫ్రిది వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత జునైద్ ఖాన్ బౌలింగ్ లో లిటన్ దాస్ మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో కేవలం 12 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది.  ఆదిలోనే 3 వికెట్లు పడటంతో బంగ్లా బ్యాట్ మెన్స్ ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో ముష్పికర్ రహ్మాన్ (21 బంతుల్లో 13 పరుగులు), మహ్మద్ మిథున్ (16 బంతుల్లో 3 పరుగులు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 10 ఓవర్లలో 31 పరుగులు చేసిన బంగ్లా 3 వికెట్లు కోల్పోయింది.
2sports
Hyderabad, First Published 13, Sep 2019, 12:36 PM IST Highlights దర్శకుడు గౌతమ్‌మీనన్‌ జయలలిత జీవిత చరిత్రను వెబ్‌ సిరీస్‌గా రూపొందించేశారు. క్వీన్‌ పేరుతో రూపొందించిన ఇందులో జయలలితగా నటి రమ్యకృష్ణ నటించారు. ఈ వెట్‌ సిరీస్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు.  దర్శకుడు గౌతమ్ మీనన్ కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. ఆయన రూపొందిస్తోన్న సినిమాలు రిలీజ్ కి నోచుకోవడం లేదు. వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఈయనపై కేసు వేస్తానని అంటున్నారు దివంగత ముఖ్యమంత్రి సోదరుడి కుమారుడు దీపక్. జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి కోలివుడ్ లో పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు విజయ్ 'తలైవీ' పేరుతో జయలలిత బయోపిక్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్.. జయలలిత పాత్ర పోషించనుంది. అలానే దర్శకురాలు ప్రియదర్శిని 'ది ఐరన్‌ లేడీ' పేరుతో జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నటి నిత్యామీనన్‌ నటించనుంది. ఇది ఇలా ఉండగా.. దర్శకుడు గౌతమ్ మీనన్ జయలలిత జీవిత చరిత్రను వెబ్ సిరీస్ గా రూపొందించారు. 'క్వీన్' పేరుతో రూపొందించిన ఈ సిరీస్ లో జయలలితగా రమ్యకృష్ణ నటించింది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాడు దీపక్. అసలు జయలలిత గురించి గౌతమ్ మీనన్ కి ఏం తెలుసని ప్రశ్నించాడు. జయలలిత బయోపిక్ ని గౌతమ్ మీనన్ రూపొందిస్తే ఆయనకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ చిక్కుల్లో పడింది. మరి దీనిపై గౌతమ్ మీనన్ ఎలా స్పందిస్తాడో చూడాలి!
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కోహ్లి, అనుష్క ఎంగేజ్‌మెంట్ ఆ రోజేనా? ​ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ చాలా కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి గురించి ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది TNN | Updated: Dec 29, 2016, 02:51PM IST "Even if players wanted to focus on cricket, their wives were a big distraction... స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి , బాలీవుడ్ నటి అనుష్క శర్మ చాలా కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి గురించి ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. జనవరి 1న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా.. కోహ్లి, అనుష్క ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలుస్తోంది. డెహ్రాడూన్‌లో వీరికి నిశ్చితార్థం జరగనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం కోసం ఇప్పటికే వీరిద్దరూ డెహ్రాడూన్‌ చేరుకున్నారు. ఈ వారాంతంలో కోహ్లి ఎంగేజ్‌మెంట్ ఉంటుందని కొందరు నమ్మకంగా చెబుతున్నారు. ఓ మీడియా సంస్థ కథనం ప్రకారం.. డెహ్రడూన్‌కి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ హోటల్లో కోహ్లి, అనుష్క శర్మ బస చేస్తున్నారు. వీరి నిశ్చితార్థ వేడుకలకు ఇరువురి కుటుంబాలతోపాటు.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ, ఆయన భార్య టీనాలు అతిథులుగా విచ్చేయనున్నారు.
2sports
ఈ 'బెంజ్‌' చాలా దృఢమైంది గురూ..! -  బుల్లెట్‌ దెబ్బలకు ఏ మాత్రం చెదరదు -  ధర రూ.10.5 కోట్లు న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌ అత్యాధునిక శత్రుదుర్భేద్యమైన కారు 'మేబాక్‌ ఎస్‌ 600 గార్డ్‌' కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ ప్రత్యేక రక్షణ వాహన ధర రూ.10.5 కోట్లు మాత్రమే (ఎక్స్‌షోరూమ్‌, న్యూఢిల్లీ). దాదాపు 4.7 టన్నుల బరువు ఉండే ఈ సరికొత్త కారు 'వీఆర్‌ 10 బ్యాలిస్టిక్‌ ప్రొటెక్షన్‌ లెవల్‌' ధ్రువీకరణ పొందింది. కొత్త కారు అద్దాలతో సహా మొత్తం బాడీని బలమైన ఉక్కుతో రూపొందించారు. ఫలితంగా రైఫల్‌ నుంచి దూసుకువచ్చే బుల్లెట్లను కూడా తట్టుకొని ఈ వాహనం దృఢంగా నిలిచి ఉంటుందనీ.. ఇందులో ప్రయాణించే వారికి వీలైనంత గరిష్ఠ రక్షణనిస్తుందని మెర్సిడెజ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ రోనాల్డ్‌ ఫ్లోజెర్‌ తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు ఉన్న బెంజ్‌ కార్ల వాహన శ్రేణిలో ఇదే అతి ఖరీదైన వాహనమని కంపెనీ వర్గాలు తెలిపాయి. 100కి.మీ. వేగాన్ని ఈ కారు 7.9 సెకన్లలో అందుకోవడంతో పాటు అత్యధికంగా గంటకు 190 కి.మీ. గరిష్ట వేగంతో పరుగులు తీయగలదు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కత్తి, పవన్ సమస్యను చిరంజీవి పరిష్కరించాలి-వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి Highlights రోజురోజుకు ముదురుతున్న కత్తి పవన్ వివాదం వివాదంలో తలదూర్చిన లక్ష్మీస్ వీరగ్రంధం దర్శకుడు చిరంజీవి జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కేతిరెడ్డి డిమాండ్   కత్తి మహేష్ ,అభిమానుల వివాదం లో ఒక మంచి వారుగా ,ఆత్మీయ వ్యక్తిగా ప్రజల గుండెల్లో ఉన్న చిరంజీవి గారు జోక్యం చేసుకొని ఈ వివాదంనకు తెరదించాలని సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చిరంజీవి ని అర్ధించారు. ఒక ప్రకటన లో గతంలో మీ పట్ల సినీ నటుడు రాజశేఖర్ వ్యాఖ్యలు చేస్తే అందుకు నిరసన గా మీ అభిమానులు ఆయన పై దాడి చేయగా, మీరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించి ఒక మంచి సంస్కృతికి నిదర్శనమై ఆ వివాదంను పరిష్కరించారు.   కానీ పవన్ కల్యాణ్ ఆయనకున్న  గుణగణాలను బట్టి ఆయన ఎవరి కి తలవంచడు. ఇది జగమేరిగిన సత్యం. గతం లో కూడా  ప్రజారాజ్యం పార్టీ యువనేతగా కాంగ్రెస్ వారి పంచెలు విప్పాలి అని కూడా వారు ఒక సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ నిజాయితీ పరుడు. నిజాయితీ ఉన్నవాడికి ఆవేశం ఎప్పుడు ఉంటుంది. తాము చెప్పాలనుకొన్న మాటలను నిక్కచ్చిగా చెప్పేందుకు సంకోచించరు.ఇక రాజకీయాలంటారా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఏర్పాటు చేసిన జనసేన పార్టీ లక్యం నచ్చితే జనం తప్పకుండా ఆదరిస్తారు...తను చంద్రబాబు నాయుడు గారికి గత ఎన్నికల్లో ప్రచారం చేసి అ పార్టీ విజయం లో భాగస్వామి అయ్యాడు కాబట్టి ..రాష్ట్రం లో ఆయన తన దుష్టికి వచ్చిన సమస్యలను  తీసుకుపోవటం ఆయన బాధ్యత.   ఇక రేపు జరగబోయే ఎన్నికల్లో ఆయన ,చంద్రబాబు కు మద్దతు ఇస్తాడా..లేక జగన్ కో,.బీజేపీ కో ఇస్తాడా,లేకపోతే ఆయనే సొంతం గా ఎన్నికల్లో పోటీ చేస్తాడా అనేది ఇప్పుడు మాట్లాడటం అనవసరం.ఆ రోజు ఉన్న రాజకీయసమికరణల పై ఆధార పడి ఉంటుంది ...ఇది ఆయన జనసేన పార్టీ భవిష్యత్తు... రాజకీయాల లో శాశ్విత శత్రువులు ఉండ రు....ఇది మొదటి గా పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రహించాలి ...రాజకీయం వేరు సినిమా అభిమానం వేరు....ఉదాహరణకు ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ పై నాయకులందరూ  విమర్శలు చేసారు.... అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు....అవకాశం లేనప్పుడు...అవసరం ను వాడు కోవటమై రాజకీయ సిద్ధాంతం. ఇది పవన్ కల్యాణ్ అభిమానులు తెలుసుకొని సంయమనం పాటించి మీ నాయకుడికి మంచి పేరును తీసుకువచ్చి ..సమజాసేవ లో నిమగ్నం కండి.. మీ నాయకుడు నినాదం అయిన ప్రశ్నించే హక్కుతో మీరు ప్రశ్నించుచూ ముందుకు వెళ్లి ప్రజాసమస్యల పట్ల అవగాహన పెంచుకొని నాయకుడికి ,పార్టీకి మంచి పేరు తీసుకురండి....మీలో చాలా మంది ఇతను ఏంటి మాకు సలహాలు అని అనుకొంటారు...మూడు నెలల నుంచి జరుగుతున్న పరిణామాలను చూసి బాధతో, చెపుతున్న మాటలు మాత్రమే. సలహా లు కావు . జనం లో ఉన్నదే...ఈ సందేశం.   ఇక అన్నయ్య చిరంజీవి గారి ని ఇప్పుడు జరుగుతున్న కత్తి మహేష్.పవన్ కళ్యాణ్ అభిమానుల గొడవల కారణం గా ప్రజలలో మీ కుటుంబం పట్ల ఉన్న గౌరవం సన్న గిల్లు తుంది ,మిమ్మల్ని అభిమానించే మా అందరిని ఈ వ్యవహారం ఆందోళన కు గురి చేయుచుంది. బైట అందరూ మీ కుటుంబం అంటే గిట్టని వారు ఈ వివాదంను  పెంచి పొషించుచూ నవుకొంటున్నారు. ఇందులో మూడవ వారి పాత్ర ప్రమేయం ఎక్కువ అయ్యింది. కత్తి మహేష్ విషయం ను గోరుతో పొయ్యే దానిని గొడ్డలి వరకు తీసుకురావటం. మీ కుటుంబంను అభిమానించే అందరికి చాలా బాధ అనిపించుచున్నది. మీరు గతంలో మీ అభిమానులకు ఎన్నో సంఘసేవ కార్యక్రమంలలో భాగస్వామ్యలు చేసి అభిమానులు రోడ్డు న పడటం కాదు ..మమ్మల్ని అభిమానించటం కాదు ప్రజలను అభిమానించండి అనే సందేశం తో నాంది పలికారు.   కానీ ఇప్పుడు ఉన్న హీరోల  అభిమానులు తమ హీరోను ఎవ్వరైనా ఏమన్నా అంటే ఒప్పుకోరు నిజమే కానీ మీ ప్రత్యర్థులు మాట్లాడే మాటలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తాయి ...ఎందుకు అంటే   మనం ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజా సేవ చేయాలనుకొంటున్నం  కాబట్టి మీ ప్రతీ చర్య ఆ రాజకీయ పార్టీ పై ఉంటుంది  కాబట్టి ఆ అభిమానుల కు సరి అయ్యిన సూచనలు ఇవ్వండి... చిరంజీవి గారు కొంతమంది సోషల్ మీడియాలో మీ కుటుంబం ను పొగుడుతూ... వ్యతిరేకులు తిడుతూ మీ కుటుంబ గౌరవంను రోడ్డుకు ఈడ్చటం, సొంత  దూషణలు చేయటం, ఈ సంస్కృతి ఇరువర్గాలకు మంచిది కాదు. ఎవ్వరి మధ్యో జరుగుతున్న దానికి మనం ఎందుకు సమ్మతించాలి. అనీ మనం వూరుకుంటే పోయేది మన పరువు కాబట్టి మీరు వెంటనే సహృద్భావంతో ఆలోచించి.. కత్తి మహేష్ ని పిలిచి మాట్లాడి ప్రజల లో మీ పట్ల గౌరవం పెంచుకొని ఈ సంక్రాంతి తో ఈ వ్యవహారానికి ముగింపు పలికి...చిరంజీవి.... చిరంజీవి.... గా మా గుండెల్లో ఉండాలి అని ,ఒక సామాన్యు పరిస్థితి నుంచి వచ్చిన చిరంజీవి ఇంత పెద్ద చిరంజీవి కుటుంబ సభ్యుల యొక్క కోరికను మన్నించుతారని మా కోరిక. అని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆ ప్రకటనలో చిరంజీవి ని కోరారు. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
Womens T20 indai టి20లో భారత్‌ సరికొత్త రికార్డు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం న్యూఢిల్లీ: ఆసియాకప్‌ మహిళల టి20 టోర్నమెంట్‌లో భారత జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది. కాగా నేపాల్‌తో శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 99పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది.నెల్లా స్వామి వనితా 21పరుగులు,అనుజ్‌ పటేల్‌ 16 పరుగులు,పార్వీన్‌ 13 పరుగులు, శిఖా పాండే 39 పరుగులతో నాటౌట్‌గా నిలువగా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ 14 నాటౌట్‌ పరుగులతో సత్తా చాటింది.అనంతరం 121పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిననేపాల్‌ జట్టును భారత్‌ ఆదిలోనే దెబ్బతీ సింది. ఆ తరువాత వరుసగా పెవిలియన్‌కు చేరారు.దీంతో నేపాల్‌ 21 పరుగులకే ఆలౌటైంది.ఈ మ్యాచ్‌లో సరిత షుగర్‌ చేసిన ఆరు పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం.నేపాల్‌ జట్టులో నలుగురు క్రీడాకా రిణులు డకౌట్‌గా వెనుదిరిగారు.కాగా మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ కే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్‌లో భారత్‌ ఏడుఎక్స్‌ట్రా పరుగులిచ్చింది.భారతబౌలర్లలో పూనమ్‌ పాండే మూడు వికెట్లు తీసుకోగా మేఘనా,అనుజా పటేల్‌లు ఒక్కొక్కరు రెండు వికెట్లు సాధించారు.శిఖా పాండే,జోషి,ఏక్తా బిస్త్‌లు ఒక్కొక్కరు ఒక వికెట్‌ తీసు కున్నారు.ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో ఫైనల్‌ చేరిన భారత్‌ మహిళల జట్టుకు ఇది అయిదవ విజయం.కాగా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
2sports
legendary singer sp balasubrahmanyam about pm modi stars meet మోదీ సెక్యూరిటీ మా ఫోన్లు లాగేసుకున్నారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాంధీ 150వ జయంతి సందర్భంగా నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన స్టార్స్‌ మీట్‌పై మరో ప్రముఖులు విమర్శలు గుప్పించారు. ఆ కార్యక్రమంలో మోదీ సెక్యూరిటీ మా సెల్‌ఫోన్లు తీసుకున్నారని, కానీ కొంతమంది తారలు మాత్రం తమ ఫోన్లలో సెల్పీలు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. Samayam Telugu | Updated: Nov 3, 2019, 11:00AM IST ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మహాత్మ గాంధీ 150 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సినీ ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 29న జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు పలువురు సౌత్‌ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే సౌత్‌లో అగ్రతారలకు ఆహ్వానాలు అందకపోవటంతో, కార్యక్రమంలో పాల్గొన్న కొద్ది మంది దక్షిణాది సినీ ప్రముఖుల ఫోటోలు కూడా బయటకు రాకపోవటంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు. మెగా కోడలు, రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన ట్విటర్‌ వేదికగానే మోదీ తీరుపై విమర్శలు కురిపించారు. దక్షిణాది నటులను ఆహ్వానించకపోవటం ఎంతో బాదించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ మీట్‌పై మరో సౌత్‌ లెజెండ్ స్పందించారు. మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సౌత్‌ ను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం హారయ్యారు.
0business
Jul 10,2015 ఇదే సరైన సమయం: జైట్లీ యూఎఫ్‌ఏ (రష్యా): ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు మందగమనంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అభివర్ణించారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా భారత్‌ 7-7.5శాతం నుంచి 8 శాతం వృద్ధితో దూసుకుపోతోందని ఆయన అన్నారు. మందమనం నుంచి గరిష్ఠ స్థాయిలో లబ్దిపొంది, మరింత మెరుగైన వృద్ధిని సాధించేందుకు గాను భారత ఆర్థిక విధానాల్ని అభివృద్ధి పరుచుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు రాజకీయ ప్రోద్బలం కూడా ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలలో చర్చనీయా ంశాల గురించి మంత్రి మాట్లాడుతూ ఈ దఫా సమావేశాలలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లునకు పార్లమెంట్‌ పూర్తి ఆమోదం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దూరదర్శన్‌ ప్రతినిధితో ఆయన ఇక్కడ మాట్లాడుతూ కొంత మంది జీఎస్‌టీ బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమేనని ఆయన అన్నారు. 'సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ) గురించి మంత్రి వివరణనిస్తూ ఇది దేశంలో ఉన్న బాధలను, పేదరికాన్ని ప్రతిబింబించిందని తెలిపారు. ఈ గణాంకాలు అవసరమైన వారికి సాయం అందించేందుకు దేశంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన విధానాల రూపకల్పనకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు. లోక్‌సభ అనుమతి పొందిన జీఎస్‌టీ బిల్లు ప్రస్తుతం రాజ్యసభ కమిటీ పరిశీలనలో ఉంది. ఇక్కడ అధికార పార్టీకి తగిన మెజర్టీ లేని సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి జీఎస్‌టీ బిల్లును ఎలాగైనా అమలులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ఎలాగైనా వాళ్లతో ఈ పని నేను చేయను అని అనిపించుకోవడం కోసం వాళ్లతో రకరకాల పనులు చేయించుకున్నాడు. అందులో మొదట హౌస్‌లో కోపిష్ఠిగా ఉన్న బాలాజీతో కాళ్లు పట్టించుకోగా.. అర్చనతో కాళ్లు పట్టించుకుని తన చెవని నాలుకతో క్లీన్ చేయమని ఆదేశించాడు దానికి అర్చన నిరాకరించింది. మరోవైపు ధనరాజ్‌తో బాడీమసాజ్ చేయించుకుని అండర్‌వేర్‌తో తనకు సేవలు చేయాలని ఆదేశించగా.. దానికి ధనరాజ్ రెడీ అయ్యాడు. నీతోపాటు ఆదర్శ్‌ని అండర్‌వేర్‌తో సర్వీస్ చేయమనగా.. మేనేజర్‌గా ఉన్న ప్రిన్స్ అలాంటివి మా హోటల్ చేయరని చెప్పేశాడు. ఇక దీక్షకు పర్శనల్ అసిస్టెంట్‌గా ఉన్న ముమైత్ ఖాన్‌తో అన్ని సేవలు చేయించుకుంటూ... స్మోక్ చేయకుండా అడ్డుకుంది. దీనికి ముమైత్ ఖాన్ అయిష్టంగానే పలుసార్లు కోపాన్ని తట్టుకుంటూ టాస్క్‌ని కంటిన్యూ చేసింది. ఇక శివబాలాజీని బట్టలు లేకుండా పింక్ టవల్ మాత్రమే కట్టుకుని మసాజ్ చేయాలని దీక్ష కోరింది. అతడు టవల్ పైకి కడితే ఇంకా కిందికి కట్టాలని తనకు అప్పుడే నచ్చుతుందంటూ కండిషన్ పెట్టి శివబాలాజీతో దీక్ష మసాజ్ చేయించుకుంది. సరిగాచేయి ఇంకా పైన చేయి అంటూ విసిగించే ప్రయత్నం చేసింది. తను మసాజ్‌లో పర్ఫెక్ట్ కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ దీక్ష ఎక్కడా తగ్గకుండా మసాజ్ చేయించుకుంది. పనిలో పనిగా ధనరాజ్‌తో కూడా కాళ్లు పట్టించుకుంది దీక్ష. అయితే రియాలిటీ షో అంటే.. గొడవలు, అఫైర్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు కామన్‌గానే ఉంటాయి. అయితే ఇప్పటివరకూ బిగ్ బాస్ షో లో జరిగిన టాస్క్‌లన్నీ పెద్ద అభ్యంతరకరంగా లేకపోయినప్పటికీ ఈ టాస్క్‌ కుటుంబంతో కలిసి చూడటానికి కాస్త ఇబ్బందిగానే ఫీల్ అవుతారు ప్రేక్షకులు . మసాజ్‌‌లు, బట్టలు విప్పించడాలు, అండర్‌వేర్‌తో ఉండటం, దీక్షకు శివబాలాజీ మసాజ్ చేయటాలు ఇవన్నీ కాస్త అభ్యంతరకరమైనవిగానే ఉన్నాయి. మరి రేపటి ఎపిసోడ్‌లో ఈ టాస్క్‌లో భాగంగా ఇంకెన్ని చూపిస్తారో బిగ్‌బాస్. ఇక ఈ టాస్క్ సంగతి పక్కనపెడితే... ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ బిగ్‌బాస్ హౌస్‌లోని సెలబ్రిటీలతో వీడియో ద్వారా పలకరించారు. దేశం కోసం పోరాడుతున్న భారతసైన్యానికి సెల్యూట్ చేయిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ఎన్టీఆర్.
0business
ఆరో భారతీయుడిగా సచిన్‌… Sachin Tendulkar న్యూఢిల్లీ: క్రికెట్‌ లెజెండ్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి)హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం లభించింది. ‘లెజండ్‌ అనే పదం సచిన్‌కు తక్కువే. తాజాగా ఐసిసి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఆయనకి స్థానం కల్పించాం అని ఐసిసి తన అధికారిక ట్విటర్‌లో ట్వీట్‌ చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అటు టెస్టులు, ఇటు వన్డేల్లో అత్యధిక పరుగులతో పాటు వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌ సచిన్‌ అంటూ ఐసిసి ప్రశంసల జల్లు కురిపించింది. సచిన్‌కు ఈ ఘనత దక్కడం పట్ల తాజా మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ అలెన్‌ డొనాల్డ్‌, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లకు సైతం ఐసిసి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది. ఇక ఈ ఘనత దక్కడం పట్ల సచిన్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘నాకు లభించిన ఈ గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉంది, ఇది నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా అంటూ సచిన్‌ పేర్కొన్నాడు. కాగా ఈఘనత అందుకున్న ఆరో భారతీయుడిగా సచిన్‌ నిలిచాడు. గతంలో బిషన్‌ సింగ్‌ బేడి(2009), సునీల్‌ గవాస్కర్‌ (2009), కపిల్‌దేవ్‌ (2009), అనిల్‌ కుంబ్లే(2015), రాహుల్‌ ద్రవిడ్‌(2018)లకు ఈఘనత దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్న ఆరో భారత క్రికెటర్‌గా సచిన్‌ టెండూల్కర్‌ నిలిచారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలెన్‌ డొనాల్డ్‌, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్‌ కేథరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌ కూడా తాజాగా ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దీంతో ఐసిసి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్న క్రికెటర్ల సంఖ్య 87కు చేరింది. అత్యధికంగా ఇంగ్లాండ్‌ నుంచి 28మంది క్రికెటర్లు, ఆస్ట్రేలియా నుంచి 25మంది ఉండగా…అత్యల్పంగా శ్రీలంక నుంచి ఒక్కరే ఇందులో స్థానం దక్కించుకున్నారు. సచిన్‌కు ఆలస్యం కావడానికి కారణాలు… 200టెస్టుల్లో 15921 పరుగులు…అందులో 51శతకాలు, 463 వన్డేల్లో 18426 పరుగులు…49శతకాలు…అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ క్రికెటర్‌కు లేనంత మెరుగైన రికార్డు మాస్టర్‌ బ్లాస్టర్‌ సొంతం. అయినా ప్రతిష్టాత్మక హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సచిన్‌కు స్థానం ఎందుకు ఆలస్యమైంది? సగటు క్రికెట్‌ అభిమాని మదిలో ఈ ప్రశ్న ఉండే ఉంటుంది. అందులోనూ అనిల్‌కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత సచిన్‌ ఈ వరుసలో నిలవడానికి ఐసిసి నిబంధనలే కారణం. నిబంధనలు ఇలా… బ్యాట్స్‌మెన్‌ అయితే వన్డేలు లేదా టెస్టుల్లో కనీసం 8వేల పరుగులు పూర్తిచేసి ఉండాలి. అదేవిధంగా 20 శతకాలు నమోదు చేసి ఉండాలి. సగటు 50కిపైనే ఉండాలి. బౌలర్ల విషయానికొస్తే 50టెస్టులు, 30వన్డేలు ఆడి కనీసం ఏదో ఒక ఫార్మట్‌లో 200వికెట్లు పడగొట్టి ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తవ్వాలి. అందుకే వారి తర్వాత మాస్టర్‌…అనిల్‌కుంబ్లే 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అతనికి 2015లో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కింది. రాహుల్‌ ద్రవిడ్‌ 2012లో రిటైర్మెంట్‌ ప్రకటించడంతో 2018లో ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇక సచిన్‌ టెండూల్కర్‌ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. దీంతో తాజాగా ఈ గౌరవాన్ని దక్కించుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా నిలిచారు. వీరి కంటే ముందు బిషన్‌సింగ్‌ బేడి(2009), సునీల్‌ గవాస్కర్‌(2009), కపిల్‌దేవ్‌ (2009) భారత్‌ తరుపున ముందు వరుసలో ఉన్నారు.
2sports
internet vaartha 184 Views ముంబై : మహారాష్ట్రకు చెందిన క్రికెటర్‌ విరాగ్‌ మారే గిన్నస్‌ బుక్‌ రికార్డు సృష్టించాడు. కాగా లాతూర్‌కు చెందిన విరాగ్‌ ఏకంగా మూడు రోజుల పాటు నెట్స్‌లో బ్యాటింగ్‌ చేసిన గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. కాగా 24 సంవత్సరాల విరాగ్‌ నెట్స్‌లో 50 గంటల, 5 నిముషాల, 52 సెకన్ల పాటు బ్యాటింగ్‌ చేశాడు. అంతేకాదు ఆ సమయంలో 2,447 ఓవర్లలో 14,682 బంతులను ఎదుర్కొన్నాడు. పుణేలోని కార్వెనగర్‌లో మహాలక్ష్మి లాన్స్‌లో అతను ఈ ఫీట్‌ చేశాడు. దీంతో ఇంగ్లాండుకు చెందిన డవేన్యూమాస్‌,రిచర్డ్స్‌ వేల్స్‌ పేరిట ఉన్న 48 గంటల రికార్డు బద్దలైంది.నెట్స్‌లో విరాగ్‌కు బౌలింగ్‌ కోసం బౌలర్లతో పాటు బౌలింగ్‌ యంత్రాలను ఉపయోగించారు. అతను గంటకోసారి విశ్రాంతి తీసుకుంటూ బ్యాటింగ్‌ చేశారు.కాగా 24 గంటలు బ్యాటింగ్‌ చేశాక విరాగ్‌ బాగా అలసిపోయాడు. ఈ దశలో తండ్రితో పాటు సహచరుల ప్రోత్సాహంతో బ్యాటింగ్‌ కొనసాగించాడు .అయితే పదిహేను వేల బంతులను ఎదుర్కోవాలన్న అతని టార్గెట్‌ మాత్రం నెరవేరలేదు. కాగా విరాగ్‌ మారే 16 సంవత్సరాల వయసులోనే ముంబైలోని రమాకాంత్‌ అచ్రేకర్‌ అకాడమీలో చేరాడు. అయితే ఫీజ కట్టలేక కొన్నాళ్లకే అకాడమీకి దూరమయ్యాడు. ఆ తరువాత బతుకు దెరువు కోసం పుణేలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అతను వడాపావ్‌ బండిని నడుపుతున్నాడు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పీఎన్‌బీ కుంభ‌కోణం ఎలా జ‌రిగింది? దేశంలోని అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైన ఈ వ్యవహారంపై దృష్టి సారించిన సీవీసీ, స్పష్టమైన ద్రవ్య విధానాలున్నప్పటికీ ఇంత పెద్ద మోసం ఎలా జరిగిందో పదిరోజుల్లోగా నివేదిక సమర్పించాలని పీఎన్‌బీ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించింది. TNN & Agencies | Updated: Feb 20, 2018, 10:42AM IST చేతులు కాలాక ఆకులు క‌ట్టుకున్న‌ట్లు ఉంది మ‌న ప్ర‌భుత్వ తీరు. నేరం జ‌రిగినప్పుడు క‌నీసం అనుమానం కూడా వ్య‌క్తం చేయ‌ని ఆర్బీఐ, ద‌ర్యాప్తు సంస్థ‌లు ఇప్పుడు హ‌డావిడి చేస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణంపై ఇప్పటికే సీబీఐ, ఈడీ విస్తృత దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కూడా సోమవారం రంగంలోకి దిగింది. ఈ కుంభకోణం ఎలా జరిగిందో వివరించాలంటూ కేంద్ర ఆర్థికశాఖ, పీఎన్‌బీ అధికారులకు నోటీసులు ఇచ్చింది. భవిష్యత్‌లో అక్రమాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దేశంలో రెండో అతిపెద్ద ప్ర‌భుత్వ‌ బ్యాంక్ అయిన‌ పీఎన్‌బీలో రూ.11,400 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసిన ఈ కుంభకోణంపై సీవీసీ దృష్టి సారించింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, మెహుల్ ఛోస్కీలకు సంబంధించిన సంస్థలు ఎలా మోసానికి పాల్పడ్డాయో వివరించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీనియర్ అధికారులకు తాఖీదులు పంపింది. అవకతవకలకు అవకాశం కల్పించిన బ్యాంకు విధానాల్లోని లోపాలేమిటో చెప్పాలని, నిఘావ్యవస్థ వైఫల్యాలపై సంజాయిషీ ఇవ్వాలని ఆ అధికారులను సీవీసీ ఆదేశించింది. దేశంలోని అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైన ఈ వ్యవహారంపై దృష్టి సారించిన సీవీసీ, స్పష్టమైన ద్రవ్య విధానాలున్నప్పటికీ ఇంత పెద్ద మోసం ఎలా జరిగిందో పదిరోజుల్లోగా నివేదిక సమర్పించాలని పీఎన్‌బీ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించింది. అంతకుముందు సీవీసీతో భేటీ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థికశాఖ అధికారులు కుంభకోణం జరిగిన తీరు, దర్యాప్తులో పురోగతిని వివరిస్తూ రెండు గంటల పాటు దృశ్య శ్రవ‌ణంతో కూడిన వివ‌ర‌ణ ఇచ్చారు.పీఎన్‌బీ కుంభకోణంలో సంబంధాలపై ఆరా తీస్తున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి.. సోమవారం సదరు బ్యాంక్ సీనియర్ ఉద్యోగులను, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను కలిశారు. ఉదయం ఇక్కడ 11 గంటలకు ప్రారంభమైన సమావేశం.. రెండు గంటలకుపైగా జరిగింది. ఈ సందర్భంగా పీఎన్‌బీ పైస్థాయి ఉద్యోగులు తాము తీసుకున్న చర్యల గురించి సీవీసీకి వివరించారు. కాగా ఈ కుంభకోణం నేపథ్యంలో మళ్లీ అలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వరంగ సంస్థలకు కొన్ని మార్గదర్శకాలను సీవీసీ జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో, ముఖ్యంగా బ్యాంకుల్లో ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తున్న సీనియర్ అధికారులను, ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న గుమస్తా స్థాయి సిబ్బందిని బదిలీ చేయాలని సూచించింది.
1entertainment
హోమ్ క్రీడలు మాజీ క్రికెటర్‌ పేరున ఫేస్‌బుక్‌ ఖాతా.. మాజీ క్రికెటర్‌ పేరున ఫేస్‌బుక్‌ ఖాతా.. August 28, 2019,   3:13 PM IST Share on: మాజీ క్రికెటర్‌,బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌, సందీప్‌ పాటిల్‌ పేరుతొ ఓ గుర్తు తెలియని వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచి బీసీసీఐలోని పెద్దల ఫోన్‌ నంబర్లను అడుగుతున్నాడు. స్నేహితుడు ద్వారా ఈ విషయం తెలుసుకున్న సందీప్‌ పాటిల్‌ సంబంధిత ఖాతాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  సందీప్‌ పాటిల్‌ పేరుతొ ఓ వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచి పాటిల్‌ స్నేహితుడు ఆనంద్‌ యల్విజీకి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించాడు. మ్యూచ్‌వల్‌ ఫ్రెండ్స్‌ 13 మంది ఉండడంతో అతను రిక్వెస్ట్‌ దృవీకరించాడు. వెంటనే మాజీ క్రికెటర్లు, బీసీసీఐలోని పెద్దల ఫోన్‌ నంబర్లు అడిగాడు. అనుమానం వచ్చిన ఆనంద్‌ తన మిత్రుడు పాటిల్‌కి ఫోన్‌ చేయడంతో విషయం తెలిసింది. ఆనంద్‌ మాట్లాడుతూ... 'పాటిల్‌ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ వచ్చింది. మ్యూచ్‌వల్‌ ఫ్రెండ్స్‌ 13 మంది ఉన్నారు. దీంతో రిక్వెస్ట్‌ అంగీకరించా. వెంటనే బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి ఫోన్ నెంబర్ అడిగాడు. ఆ తర్వాత డయానా ఎడుల్జీ నంబర్‌ అడిగాడు. ఆపై నా నంబర్‌ కూడా అడిగాడు. నేను ఇచ్చాను. కానీ.. ఛాటింగ్‌ శైలి చూస్తుంటే అనుమానం వచ్చి పాటిల్‌కు ఫోన్‌ చేయడంతో విషయం తెలిసింది. వెంటనే సదరు ఖాతాను బ్లాక్‌ చేశా' అని ఆనంద్‌ తెలిపాడు.   పాటిల్ మాట్లాడుతూ... ఆగస్టు 19న శివాజీ పార్క్‌ జింఖానా మైదానం వద్ద మిత్రులతో ఉన్న సమయంలో ఆనంద్‌ ఫోన్ చేసాడు. తన పేరుతో నకిలీ ఖాతా ఉందని తెలియడంతో ఆశ్చర్యపోయా. తనకెలాంటి సోషల్‌ మీడియా ఖాతాలు లేవని అతడికి చెప్పా. తన మిత్రుల నంబర్లు ఎందుకు అడుగుతా' అని పేర్కొన్నాడు. ఇక బీసీసీఐకి సైతం ఇదే విషయం స్పష్టం చేశాడు. నకిలీ ఖాతాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత వార్తలు
2sports
udan ఉడాన్‌ స్కీంకు నిధుల సమీకరణ న్యూఢిల్లీ, మే 17: పౌరవిమానయాన రంగంలో ప్రవేశపెట్టిన ఉడాన్‌స్కీంకు నిధుల సమీకరణకింద వాణిజ్య విమానయాన సంస్థల నుంచి రూ.5000 లు వంతున వసూలు చేయాలని నిర్ణయించింది. కీలకరూట్లలో రాకపోకలు సాగించే విమానాలపై ఈ సొమ్ము వసూలుచేసిన ఆ మొత్తం ఉడాన్‌ స్కీంకు కేటాయిస్తుంది. జూన్‌ ఒకటవ తేదీ నుంచి అమలు కు వస్తున్నట్లు డిజిసిఎ వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ రూ.5వేల సుంకం కొనసాగుతుందని డిజిసిఎ సర్క్యులర్‌ జారీచేసింది. ప్రాంతీయ కనెక్టివిటీస్కీంను పెంచేందుకుగాను నిధు ల సమీకరణ చేపట్టిన పౌరవిమానయాన మంత్రి త్వశాఖ కీలకరూట్లలో రాకపోకలు సాగించే విమా నాలపై రూ.8500 వరకూ సుంకం విధిస్తుంది ముంబై, ఢిల్లీ వంటి కీలక రూట్లను ప్రామాణికంగా తీసుకుంది. పౌరవిమానయానశాఖ డైరెక్టరేట్‌ జన రల్‌ ఇప్పటికే ఈ సుంకం చెల్లించిన ఎయిర్‌లైన్స్‌ కొత్త సుంకంవివరాలకు సర్దుబాటుచేయడం జరుగు తుందని వెల్లడించింది. ఎయిర్‌పోర్ట్సుఅథారిటీ ఆఫ్‌ ఇండియా ఉడాన్‌స్కీంకు నోడల్‌సంస్థగా వ్యవహరి స్తోంది. ఏడాది ప్రయాణానికిగాను రూ.2500గా ఉడాన్‌ స్కీంధరలు నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ స్కీం కింద మొదటి ఆర్‌సిఎస్‌ విమానం షిమ్లా నుంచి న్యూఢిల్లీకి ప్రారంభించారు. ఎయిర్‌ ఇండియా అనుబంధంగా ఉన్న అలయన్స్‌ఎయిర్‌ ఈ ఉడాన్‌ విమానం నడిపింది. ఉడాన్‌ స్కీం కింద కనీసం సగం సీట్లు కేటాయించాలని, సబ్సిడీ ధరల కే అందించే లక్ష్యంతోప్రభుత్వం ఉడాన్‌ను ప్రవేశ పెట్టింది. ఈసంస్థలకు వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ద్వారా కొంత వెసులుబాటు ఉంటుంది. అయితే విజిఎఫ్‌ కింద వసూలుచేస్తున్న ఈ సుంకంపట్ల విమానయాన సంస్థలు న్యాయస్థానాల్లో సవాల్‌ చేసాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌ సంస్థలు భారతీయ విమానయానసంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఎ)గా ఏర్పడి ఒకే పిటిషన్‌ దాఖలు చేసాయి. ఎఎఐ ఛూఐర్మన్‌ గురుప్రసాద్‌ మొహా పాత్ర మాట్లాడుతూ ఉడాన్‌కు ఉన్న ప్రస్తుత నిబం ధనలను ప్రభుత్వం పునఃపరిశీలించి ప్రక్షాళన చేసే లక్ష్యంతో ఉందని అన్నారు. రెండోవిడత ఉడాన్‌ బిడ్డింగ్‌లో కొత్త విధానం అమలుకు రావచ్చన్నారు రానున్న మూడునెలల్లోనే కొత్త బిడ్డింగ్‌ ప్రకటన వస్తుంది. మొదటి విడతలో ఉడాన్‌ బిడ్డింగ్‌కు ఐదు ఎయిర్‌లైన్‌సంస్థలు 128రూట్లలో దాఖలుచేసాయి. వీటిలో 70ఎయిర్‌పోర్టులు వస్తున్నాయి. ఇప్పటి వరకూ 31ఎయిర్‌పోర్టులకు సేవలే లేని కేంద్రాలు ఉన్నాయి. రెండోవిడత బిడ్డింగ్‌కు ముందు ఈ సుంకం స్కీం పునఃపరిశీలనచేస్తామనిమహాపాత్ర వివరించారు.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పెళ్లిచూపులు డైరెక్టర్ తో డైరెక్ట్ గా మాట్లాడా : నాగ్ ప్రజెంట్ గా టాలీవుడ్ లో కొత్త దర్శకులు ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారని అది తనకు ఎంతో ఆనందం కలిగిస్తుందని అక్కినేని నాగార్జున రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. TNN | Updated: Sep 10, 2016, 05:22AM IST ప్రజెంట్ గా టాలీవుడ్ లో కొత్త దర్శకులు ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారని అది తనకు ఎంతో ఆనందం కలిగిస్తుందని అక్కినేని నాగార్జున రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. వాళ్లంతా రోటిన్ కు డిఫరెంట్ గా ఆలోచిస్తూ సినిమాలు చేయడం తనకెంతో నచ్చిందట. కేవలం స్టార్లతోనే సినిమాలు చేయాలని కాకుండా కథకు తగ్గట్లుగా హీరోలను ఎన్నుకుంటుండడం చాలామంచి విషయమని నాగ్ తన మనస్సులోని మాట చెప్పారు. ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా మంచిదని చెప్పుకొచ్చారు. అసలు ఇదంతా నాగ్ ఎందుకు చెప్పారంటే ఆయన కన్నుపెళ్లి చూపులు డైరెక్టర్ త‌రుణ్ భాస్క‌ర్ పై ప‌డింది. చిన్నబడ్జెట్‌ తో రూపొందిన పెళ్లి చూపులు బాక్సాఫీసు బద్దలు కొట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది హీరోలు, నిర్మాత‌లు తరుణ్ తో సినిమా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున కూడా ఈ మూవీపై స్పందించాడు. పెళ్లిచూపులు మూవీ తనకు బాగా నచ్చిందన్నారు. అందువల్ల ఆ మూవీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారట. ఈ సినిమాను చూస్తే తన హండ్రెడ్ డేస్ మూవీస్ గుర్తుకొచ్చాయని తరుణ్ భాస్కర్ తో చెప్పాడట. అఖిల్‌, నాగచైతన్యలకి వెంటనే స్టోరీస్ రెడి చేయమన్నాడట. సో.. తరుణ్ భాస్కర్ నెస్ట్ ప్రాజెక్స్ అక్కినేని ఫ్యామిలీతో ఉంటాయన్నమాట.
0business
Oct 25,2015 దీపిక 'ఆల్‌ ఎబౌట్‌ యు'ఫ్యాషన్‌ బ్రాండ్‌ న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ మింత్రా ప్రత్యేకంగా ప్రముఖ బాలీవుడ్‌ నటీ దీపిక పదుకునె సొంత బ్రాండ్‌ 'ఆల్‌ ఎబౌట్‌ యు'ను ఆవిష్కరించింది. ఇందులో కనీస ధర రూ.1,500 నుంచి ప్రీమియం వస్త్ర ఉత్పత్తులు లభిస్తాయని ఆ సంస్థ తెలిపింది. ఇందుకోసం మింత్రా దీపికతో ఒప్పందం ఒక్క కుదుర్చుకుంది. మింత్రా భాగస్వామ్యం ఆనందాన్ని కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు. 18-35 ఏళ్ల మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆకర్షణీయ ఉత్పత్తులు విక్రయించనున్నట్లు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 115 Views ముంబై : కోటక్‌ మహీంద్రబ్యాంకు నికర లాభం నాలుగురెట్లు పెరిగి 741.97 కోట్లకు చేరినట్లు ప్రకటించింది. నికరలాభం గత ఏడాది 189.79 కోట్లు మాత్రమే ఉంది. మొత్తం రాబడులపరంగా బ్యాంకుకు 5120.03 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాది 4583.86 కోట్లు ఏప్రిల్‌ జూన్‌ నెల కాలానికి 516.57 కోట్ల నుంచి ఒక్కసారిగా 1067.10 కోట్లకు పెరిగింది. ఆదాయవనరులు పరంగా 7866.88 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది 6384.63 కోట్లుగా ఉంది. స్థిరాస్థి ప్రమాణాల పరంగా కొంత మెరుగుపడింది. నిరర్ధక ఆస్తులు 2.2శాతంగా ఉన్నాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 2.04శాతంగా ఉన్నాయి. నికర నిరర్ధక ఆస్తు లు 1.06శాతంగా ఉన్నాయి. గతఏడాది 0.93శాతంగా ఉన్నాయి. స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఇక రానిబాకీలు, ఇతర తక్షణ ఖర్చు లకు బ్యాంకు కేటాయింపులు 213.57 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇదేకాలంలో 321.90 కోట్లు కేటాయించింది. బ్యాంకు షేర్లు 1.80శాతం దిగజారి 768.10 రూపాయలుగా బిఎస్‌ఇలో కొనసాగాయి.
1entertainment
veteran sandalwood actor and producer sudarshan passes away ప్రముఖ నటుడు, నిర్మాత సుదర్శన్ ఇక లేరు ప్రముఖ సినీనటుడు, నిర్మాత సుదర్శన్ ఇక లేరు. కన్నడంతోపాటు తమిళం, మళయాళం, తెలుగు, హిందీ భాషల్లో నటించిన... TNN | Updated: Sep 8, 2017, 03:31PM IST ప్రముఖ కన్నడ సినీనటుడు, నిర్మాత సుదర్శన్ ఇక లేరు. కన్నడంతోపాటు తమిళం, మళయాళం, తెలుగు, హిందీ భాషల్లో నటించిన అతికొద్ది మంది నటుల్లో సుదర్శన్ ఒకరు. ప్రస్తుతం ఆయన వయస్సు 78 ఏళ్లు. వయస్సు పైబడటంతో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సుదర్శన్ బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన నటించిన చివరి కన్నడ చిత్రం 'జూమ్'. సినిమాల్లోనే కాకుండా అగ్నిసాక్షి, మరగంత వెనై, మాయా మచింద్రా వంటి టీవీ సీరియల్స్‌లోనూ సుదర్శన్ నటించారు. సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న సుదర్శన్ వివిధ భాషల్లో నటించడమేకాకుండా పలు కన్నడ చిత్రాల్లో పాటలు కూడా పాడారు. ఆయన పాడిన 'హూవొందు బల్లిబందు' పాట సంగీత ప్రియులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సుదర్శన్ మృతి వార్త తెలుసుకున్న వివిధ భాషల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
0business
Visit Site Recommended byColombia అయితే ఎయిర్‌పోర్ట్ నుంచి కారులో తన ప్యాలెస్‌కు వెళుతుండగా దారి మర్చిపోయారు సైఫ్. ఏం చేయాలో తెలీక కారు రోడ్డు పక్కకు ఆపుకొన్నారు. అక్కడే నడుచుకుంటూ వెళుతున్న స్థానికులను పటౌడీ ప్యాలెస్‌కు అడ్రెస్ అడిగారు. ఒక్కసారిగా సైఫ్‌ను చూసి ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఇదే మంచి సందర్భం అనుకుని అక్కడి స్థానికులు సైఫ్‌తో కలిసి ఫొటోలు కూడా దిగారు. ఇలా తన ప్యాలెస్ అడ్రెస్ మర్చిపోతానని సైఫ్, స్టార్ హీరో కారులో వచ్చి తమను అడ్రెస్ అడుగుతారని అక్కడి స్థానికులు కలలో కూడా ఊహించి ఉండరు. పటౌడీ కుటుంబీకులకు ఆ ప్యాలెస్ వారసత్వంగా వస్తోంది. ప్రస్తుత పటౌడీ నవాబ్ సైఫ్ అలీ ఖానే. ఆ ప్యాలెస్‌ను ఇంటిలా చూసుకోవాలని అనుకుంటున్నానని, మ్యూజియంలా మార్చడానికి తాను ఒప్పుకోనని ఒకానొక సందర్భంలో తెలిపారు. READ ALSO: కరీనా కపూర్: అసలు నువ్వు హీరోయిన్ ఎలా అయ్యావని అడిగారు అంతేకాదు.. తన కుమారుడు తైమూర్ కోసం సైఫ్ పటౌడీ ప్యాలెస్ చుట్టు పక్కన ఉన్న ఇళ్లకు కూడా వెళ్లా్ల్సి వస్తోంది. తన కుమారుడికి ఆవులను చూపిద్దామని సైఫ్ వాడిని తీసుకుని ప్యాలెస్ పరిసరాల్లో ఉన్న ఓ ఇంటికి వెళ్లారు. ‘దీదీ.. ఓసారి మీ ఇంట్లోని ఆవులను చూడొచ్చా’ అని రిక్వెస్ట్ చేసి మరీ తైమూర్‌కు ఆవులను చూపించారు. వర్క్ పరంగా సైఫ్ ‘సేక్రెడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం ఆయన ‘లాల్ కప్తాన్’, ‘దిల్ బిచారా’, ‘జవానీ జానేమన్’, ‘తానాజీ- ది అన్‌సంగ్ వారియర్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోపక్క కరీనా ‘గుడ్ న్యూస్’, ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలు చేస్తున్నారు. దీంతో పాటు రియాల్టీ డ్యాన్స్ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’‌కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Abu Dhabi - United Arab Emirates, First Published 25, Sep 2018, 4:45 PM IST Highlights ఆసియాకప్ లో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన పోరులో భారత్ అద్భుత విజయాలు సాధించింది. ఒకసారి కాదు జరిగిన రెండు మ్యాచుల్లోని పాకిస్థాన్ ను ఓడించి భారత జట్టు తిరుగులేని ఆదిపత్యాన్ని కొనసాగించింది. లీగ్ దశలో కాస్త పోరాటపటిమ కనబర్చిన పాక్ ఆటగాళ్లు సూపర్ 4 మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. ఇలా తమ జట్టు చిత్తుగా ఓడిపోవడాన్ని పాక్ అభిమానులు సహించలేకపోతున్నారు. అదీ భారత్ చేతుల్లో ఘోర పరాభవాన్ని పొందడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో జట్టు సభ్యులపై ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై పాక్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అతడి వల్లే పాక్ జట్టు సూఫర్ 4 లో ఓటమిపాలయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియాకప్ లో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన పోరులో భారత్ అద్భుత విజయాలు సాధించింది. ఒకసారి కాదు జరిగిన రెండు మ్యాచుల్లోని పాకిస్థాన్ ను ఓడించి భారత జట్టు తిరుగులేని ఆదిపత్యాన్ని కొనసాగించింది. లీగ్ దశలో కాస్త పోరాటపటిమ కనబర్చిన పాక్ ఆటగాళ్లు సూపర్ 4 మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. ఇలా తమ జట్టు చిత్తుగా ఓడిపోవడాన్ని పాక్ అభిమానులు సహించలేకపోతున్నారు. అదీ భారత్ చేతుల్లో ఘోర పరాభవాన్ని పొందడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో జట్టు సభ్యులపై ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై పాక్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అతడి వల్లే పాక్ జట్టు సూఫర్ 4 లో ఓటమిపాలయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకోడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. అంతకు ముందు జరిగిన లీగ్ మ్యాచ్ లో చేసిన తప్పులే మళ్లీ పునరావృతం చేశారని మండిపడ్డారు. లీగ్ మ్యాచ్ కంటే చెత్త ప్రదర్శనతో దాయాది జట్టు ముందు దేశ పరువు తీశారంటూ దుమ్మెత్తిపోశారు. కొందరు అభిమానులైతే కాస్త ఘాటుగా స్పందించారు. అసలు జట్టులో ఆడటానికి కూడా పనికిరాని వ్యక్తిని కెప్టెన్ గా చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని  ఓ అభిమాని  విరుచుకుపడ్డాడు.  '' సర్పరాజ్ కు ప్రతిభ లేదు, ఫామ్ లేదు...అసలు అతడికి బుర్రే లేదు" అంటూ మరో అభిమాని విమర్శించాడు. '' అత్యంత సోమరి కెప్టెన్లలో సర్పరాజ్ ఒకడు...అతడి కెప్టెన్సీని ఇక మీదట మేం అంగీకరించం" అంటూ మరో అభిమాని అసహనం వ్యక్తం చేశాడు.
2sports
Hyderabad, First Published 6, Sep 2019, 12:59 PM IST Highlights ఇండస్ట్రీ ఏదైనా అందరు హీరోలతో కలిసి పనిచేయాలని ఉందని అంటున్నారు మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్. అయితే కన్నడ సూపర్‌స్టార్ యశ్‌‌తో కలిసి పనిచేయాలని ఉందా? అని అడిగిన ప్రశ్నకు ప్రియా తనదైన శైలిలో సమాధానమిచ్చారు.   మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. త్వరలోనే నితిన్ సినిమాతో నేరుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. అలానే 'శ్రీదేవి బంగ్లా' అనే సినిమాతో బాలీవుడ్ కి వెళుతోంది. మరోపక్క 'విష్ణుప్రియ' అనే సినిమాతో కన్నడలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాకి ఓ ప్రశ్న ఎదురైంది. 'కన్నడ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టేశారు. సూపర్‌స్టార్ యశ్‌తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా?' అని ఓ విలేకరి అడిగారు. దీనికి సమాధానంగా.. ''ఈ ప్రశ్నకు ఇంతకుముందు కూడా సమాధానమిచ్చాను. నేను ఎవ్వరి పేర్లు బయటికి చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే కేవలం ఫలానా హీరోతో మాత్రమే సినిమా చేయాలని ఉందని చెబితే నా చేతిలో ఉన్న మిగతా సినిమాలు పోతాయి. నేను అందరితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక అందరూ తనను వింక్ గర్ల్ అని పిలుస్తున్నారని.. అలా పిలవొద్దని.. తన ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేయడానికి తన కళ్లే కీలక పాత్ర పోషిస్తాయని.. కన్ను కొట్టడంతో పాటు ఈ సినిమాలో విభిన్నంగా నటించడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సెప్టెంబ‌రు 1 నుంచి రైల్వే ఉచిత బీమా లేదు రైల్వే ప్ర‌యాణికులకు చేదువార్త‌. ప్రయాణికులకు రైల్వేలు వర్తింప చేస్తున్న 'ఉచిత ప్రయాణ బీమా' పథకాన్ని సెప్టెంబరు 1 నుండి నిలిపివేస్తున్నట్లు ఇండియ‌న్ రైల్వేస్ ప్ర‌క‌టించింది. Samayam Telugu | Updated: Aug 12, 2018, 07:09AM IST రైల్వే ప్ర‌యాణికులకు చేదువార్త‌. ప్రయాణికులకు రైల్వేలు వర్తింప చేస్తున్న 'ఉచిత ప్రయాణ బీమా' పథకాన్ని సెప్టెంబరు 1 నుండి నిలిపివేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు శనివారం తెలిపారు. ఆ త‌ర్వాత కూడా బీమా సౌక‌ర్యం ఆప్ష‌న‌ల్‌గా అందుబాటులో ఉంటుంది. అయితే ఉచిత ప్రయాణ బీమాను నిలిపివేయాలని ఇండియన్‌ రైల్వేస్‌ కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సిటిసి) నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. కొంత మొత్తం చెల్లించి ఇక‌పై కూడా రైల్వే ప్ర‌యాణానికి బీమా సౌక‌ర్యాన్ని వినియోగించుకోవ‌చ్చు ఉచిత ప్రమాద బీమా ఇక ఐచ్ఛికమేనని తెలిపింది. వెబ్‌సైట్‌, మొబైల్‌ ద్వారా టిక్కెట్‌ పొందే వారు తమ దరఖాస్తులోఉచిత ప్రయాణ బీమా అవసరం, అవసరం లేదు అనే ఐఛ్చికాలలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని తెలిపింది. 2017 డిసెంబ‌రు నుంచి ప్ర‌యాణికుల‌కు ఐఆర్‌సీటీసీ ఉచిత ప్ర‌యాణ బీమా సౌక‌ర్యాన్ని అంద‌జేస్తోంది. డిజిటల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హించేందుకు రైల్వే అప్ప‌ట్లో ఉచిత ప్ర‌యాణ బీమా స‌దుపాయాన్ని మొద‌లుపెట్టింది. సెప్టెంబ‌రు 1 త‌ర్వాత ఈ సౌక‌ర్యాన్ని పొందాల‌నుకుంటే రైల్వే టిక్కెట్ ఛార్జీతో పాటు ప్రీమియం కింద కొంత న‌గ‌దు అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది.
1entertainment
Apr 05,2016 పనామా 'పంచ్‌' పడింది! ముంబయి: 'పనామా' మహా మోసంలో పలువురు వ్యాపారవేత్తలు, వ్యాపార సంస్థల ప్రమోటర్లకు సంబంధం ఉన్నట్లు వార్తలు రావడంతో పలు సంస్థల షేర్లు సోమవారం పతనమైయ్యాయి. పనామా నల్లధన వీరుల జాబితాలో డీఎల్‌ఎఫ్‌ అధినేత కె.పి.సింగ్‌తో పాటు అతని కుటుంబానికి చెందిన తొమ్మిది మంది, అపోలో టైర్స్‌ ప్రమోటర్లు, ఇండియా బుల్స్‌కు చెందిన సమీర్‌ గెహ్లట్‌, గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీలు ఉన్నట్లు వార్తలు రావడంతో వీరికి సంబంధించిన కంపెనీల స్టాక్‌లు కొంత పతనమైయ్యాయి. ముఖ్యంగా డీఎల్‌ఎఫ్‌, ఇండియా బుల్స్‌ గ్రూపు సంస్థలు, అపోలో టైర్స్‌కు చెందిన స్టాక్‌లు దాదాపు నాలుగు శాతం మేర కుంగాయి. అపోలో టర్స్‌ షేర్లు గరిష్ఠంగా ఒక దశలో దాదాపు 3.01 శాతం మేర కుంగి రూ.169.15కి పడిపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి 2.15 శాతం మేర నష్టపోయి రూ.170.65 వద్ద ముగిసింది. మరోవైపు డీఎల్‌ఎఫ్‌ వాటాలు కూడా గరిష్ఠంగా 2.85 శాతం మేర పడి చివర్లో కొంత కోలుకున్నాయి. మార్కెటు ముగిసే సమయానికి 1.82 శాతం నష్టంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్క్రిప్‌ గరిష్ఠంగా 3.61 శాతం, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ అత్యధికంగా 2.85 శాతం, హోల్‌సేల్‌ సర్వీసెస్‌ 3.93 శాతం మేర కుంగాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
జీఎస్‌టీకి సహకరించండి - అఖిలపక్షానికి ప్రధాని మోడీ విజ్ఞప్తి న్యూఢిల్లీ: 'వస్తు సేవల పన్ను' (జీఎస్‌టీ) బిల్లునకు పార్లమెంట్‌ ఆమోదం లభించేలా ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష నేతలను కోరారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమలులోకి తీసుకురాదలచిన ఈ బిల్లుకు ఆమోదం లభించేలా చూడాలన్నారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీలో ఆయన పాల్గొన్నారు. జీఎస్‌టీ విషయమై ప్రతిపక్షాల్లో ఉన్న సందేహాలు, వివిధ కీలక బిల్లులకు సంబంధించి అపోహలను తీర్చేందుకు గాను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆయా పక్షాల వారితో సంప్రదింపులు జరుపుతారని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేలా పార్లమెంట్‌ సమావేశాలు అర్ధంతంగా సాగేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్షాలను కోరారు. కాగా జేడీ(యూ) జీఎస్‌టీ బిల్లుకు తమ పార్టీ మద్దతును ప్రకటించింది అఖిల పక్ష సమావేశం అనంతనం ఆ పార్టీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ ఈ విషయమై మాట్లాడుతూ జీఎస్‌టీకి తమ మద్దతు తెలిపారు. రాష్ట్రాలకు స్పష్టతనివ్వాలి: ఏచూరి జీఎస్‌టీ విషయమై సీపీఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ కొత్త విధానం అమల్లోకి వస్తే పన్ను వసూళ్ల విషయంలో శాసనాధికారాలను కోల్పోవాల్సి వస్తుందని రాష్ట్రాలు భావిస్తున్నాయని అన్నారు. ఇదే విషయమై స్పష్టతనిచ్చేలా కేంద్రం చర్చలు జరపాలని అన్నారు. ఇదే విషయాని వామపక్షాలు పలుమార్లు ప్రభుత్వానికి వివరిస్తున్నప్పటికీ ఈ దిశగా సర్కార్‌ ఏలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
May 08,2017 నలుగురు స్వతంత్ర డైరెక్టర్లను ఎన్నుకోనున్న ఎస్‌బీఐ ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నలుగురు స్వతంత్ర డైరెక్టర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షేర్‌ హోల్డర్ల సమక్షంలో జూన్‌ 15న నలుగురిని నియమిస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్లుగా ఉన్న వారిలో సునీల్‌ మెహతా రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు దీపక్‌ అమిన్‌, సంజీవ్‌ మల్హోత్ర, ఎండీ మాల్యాల మూడేండ్ల పదవీకాలం ముగిసింది. దీంతో కొత్తగా డైరెక్టర్లను ఎన్నుకునేందుకు ఎస్‌బీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించే డైరెక్టర్లు 2020 వరకూ అంటే మూడేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు. జూన్‌ 15న జరిగే సాధారణ సర్వసభ్య సమావేశంలో షేర్‌ హోల్డర్లు వీరిని ఎన్నుకుంటారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కోహ్లిని చూసి దూకుడు పెంచేస్తున్నా..! మైదానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడు చూసి.. తాను కూడా బౌలింగ్‌లో దూకుడు పెంచుతున్నట్లు స్పిన్నర్ TNN | Updated: Sep 18, 2017, 03:39PM IST మైదానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడు చూసి.. తాను కూడా బౌలింగ్‌లో దూకుడు పెంచుతున్నట్లు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం ముగిసిన తొలి వన్డేలో చాహల్ (3/30) పొదుపుగా బౌలింగ్ చేసి.. కీలక వికెట్లు పడగొట్టడంతో భారత్ 26 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా భారీ షాట్లతో విరుచుకుపడిన ఆస్ట్రేలియా హిట్టర్ మాక్స్‌వెల్ (39: 18 బంతుల్లో 3x4, 4x6)ని బోల్తా కొట్టించడమే తొలి వన్డే‌లో కీలక మలుపు. ‘మణికట్టు స్పిన్నర్లు సాధారణంగా అటాకింగ్ బౌలింగ్‌ శైలిని అవలంబిస్తుంటారు. జట్టు కెప్టెన్ కూడా అదే దూకుడుతో ఉంటే.. ఇక స్పిన్నర్లకి పూర్తిగా స్వేచ్ఛ దొరికినట్లే. కానీ.. కొన్ని సమయాల్లో వ్యూహాలు మార్చాల్సి వచ్చినప్పుడు మాత్రం మేము వెనక్కి తగ్గుతాం. జట్టులో నా తోటి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ కూడా అటాకింగ్ బౌలింగ్ చేస్తుంటాడు. అయితే.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా మేమిద్దరం బౌలింగ్ సమయంలో చర్చించుకుంటూ ఉంటాం. అతను తన తొలి ఓవర్ బౌలింగ్ చేస్తుంటే.. ఎక్కడ బంతి బాగా స్పిన్ అవుతుందో.. బ్యాట్స్‌మెన్‌‌కి ఎలాంటి బంతి వేస్తే ఔటవుతాడో నేను కుల్దీప్‌కి సూచనలు చేస్తుంటా’ అని చాహల్ వివరించాడు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్ మైదానంలో గురువారం రెండో వన్డే జరగనుంది.
2sports
Hyderabad, First Published 28, Sep 2018, 2:19 PM IST Highlights టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసింది చిత్రబృందం. నిజానికి అక్టోబర్ 5న సినిమా విడుదల చేయడమనేది విజయ్ కి కానీ, సినిమా టీమ్ కి కానీ ఇష్టం లేదట.  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసింది చిత్రబృందం. నిజానికి అక్టోబర్ 5న సినిమా విడుదల చేయడమనేది విజయ్ కి కానీ, సినిమా టీమ్ కి కానీ ఇష్టం లేదట. అక్టోబర్ 11న ఎన్టీఆర్ సినిమా ఉండడం, ఆ తరువాతి వారంలో రామ్ సినిమా ఉండడంతో 'నోటా'ని అక్టోబర్ 5న విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రిలీజ్ డేట్ విషయంపై విజయ్ దేవరకొండ మొదట సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయ్ పై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ సినిమాకి పోటీగా విడుదల చేసే ధైర్యం చేస్తావా..? అంటూ అతడిపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న విజయ్ కి ఎదురైంది. దీనిపై స్పందించిన విజయ్.. ''తారక్ అన్న సినిమాతో నా సినిమా రిలీజ్ ని ఫ్యాన్స్ వద్దనడం కరెక్ట్ కాదు.. సినిమాలను సినిమాలుగా చూడాలి'' అని తారక్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇక సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో 'ది నోటా పబ్లిక్ మీట్' పేరుతో ప్రమోషనల్ ఈవెంట్లని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30న విజయవాడ బెంజ్ సర్కిల్ లో, అక్టోబర్ 1న హైదరాబాద్- యూసఫ్ గూడలోని కోట్లవిజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ ఈవెంట్ జరగనుంది.  Last Updated 28, Sep 2018, 2:19 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్? యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకోనున్నాడు. అఫ్ఘానిస్థాన్‌తో భారత్ తలపడనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు అయ్యర్‌ను ఎంపికచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Samayam Telugu | Updated: May 7, 2018, 08:32PM IST కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్? యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకోనున్నాడు. దేశీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఈ బ్యాట్స్‌మన్‌ను అఫ్ఘానిస్థాన్‌తో భారత్ తలపడనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో జరగనున్న ఈ ఏకైక టెస్టుకు కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు జూన్‌లో కోహ్లి ఇంగ్లండ్ వెళ్తున్న విషయం తెలిసిందే. కౌంటీలో ఆరు మ్యాచ్‌లు ఆడేందుకు సర్రే జట్టుతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూలైలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అఫ్ఘాన్‌తో జరిగే ఎకైక టెస్టు, ఐర్లాండ్‌ సిరీస్‌కు కోహ్లి దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ పేరును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే అయ్యర్‌ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినట్టే. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో భుజం గాయంతో బాధపడ్డ కోహ్లికి బ్యాకప్‌ ప్లేయర్‌గా అయ్యర్‌ను ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో అయ్యర్‌కు అవకాశం రాలేదు. అతని స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించాడు. ఇదిలా ఉంటే, కోహ్లీ గైర్హాజరీతో జూన్ 14 నుంచి బెంగళూరులో అఫ్ఘాన్‌తో జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు ఆజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌కు రోహిత్‌ శర్మ సారథ్యం వహించే అవకాశం ఉంది. అలాగే అఫ్ఘాన్‌తో టెస్టుకు చతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం వారు ఇంగ్లండ్ కౌంటీలో ఆడుతున్నప్పటికీ అఫ్ఘాన్‌తో టెస్టు సమయానకి వారి షెడ్యూల్ ఖాళీగానే ఉంటారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అలాగే జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌, హార్డిక్‌ పాండ్యా బదులు విజయ్‌ శంకర్‌ పేర్లు సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
New Delhi, First Published 4, May 2019, 1:28 PM IST Highlights సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ వ్యాపారుల కోసం ‘వాట్సాప్ బిజినెస్’ యాప్ తీసుకొచ్చింది. తమ కస్టమర్లు, క్లైంట్లతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉపయోగపడుతుంది.    సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ వ్యాపారుల కోసం ‘వాట్సాప్ బిజినెస్’ యాప్ తీసుకొచ్చింది. తమ కస్టమర్లు, క్లైంట్లతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉపయోగపడుతుంది.  అయితే, సాధారణంగా ఉండు వాట్సాప్ కంటే బిజినెస్ వాట్సాప్ కొంత భిన్నంగా ఉంటుంది. ఈ యాప్ కూడా ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. తమ బిజినెస్‌కు సంబంధించిన విషయాలను కస్టమర్లతో పంచుకోవచ్చు.  వాట్సాప్ బిజినెస్ యాప్‌ను కూడా కంప్యూటర్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. వాట్సాప్ లాగే వాట్సాప్ బిజినెస్ యాప్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. బిజినెస్ యాప్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా మీరు యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ బిజినెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంది.  అందులో ఉన్న వ్యాపారాల జాబితా నుంచి మీ బిజినెస్ ఎంచుకోవాలి. నియమ నిబంధనల్ని యాక్సెప్ట్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ప్రొఫైల్‌లో మీ బిజినెస్ పేరు, డిస్క్రిప్షన్, బిజినెస్ ఇమెయిల్ ఐడీ, మీ వెబ్‌సైట్ లింక్, బిజినెస్ అడ్రస్ లాంటి వివరాలను సమర్పించాలి.  మీరు ఒక ఫోన్ నెంబర్‌తో సాధారణ వాట్సాప్ లేదా బిజినెస్ అకౌంట్ ఏదైనా ఒకటే క్రియేట్ చేసే అవకాశం ఉంది. అందుకే బిజినెస్ అకౌంట్ కోసం మరో నెంబర్ ఉపయోగిస్తే మంచిది. కస్టమర్లకు వేగంగా సమాధానాలు ఇవ్వడానికి ఆటోమెటెడ్ మెసేజ్ సెట్ చేసుకోవాలి. మీ కాంటాక్ట్స్, చాట్స్, లేబుల్స్‌తో వాట్సాప్ బిజినెస్ యాప్‌ను నిర్వహించుకోవచ్చు. Last Updated 4, May 2019, 1:28 PM IST
1entertainment
Rupees 11పైసలు పెరిగిన డాలర్‌ వర్సెస్‌ రూపాయి ముంబై: డాలరుతో రూపాయి మారకం విలువలు కొంతమేర కోలుకున్నాయి. 11పైసలు పెరిగి నాలుగునెలలగరిష్టస్థాయికి చేరాయి. 66.60 రూపాయలకు ఒక డాలరు పలుకుతోంది. అమెరికా కరెన్సీ విక్రయాలు భారీగా పెరిగాయి. ఎగుమతి దారులు, బ్యాంకుల్లోఅమ్మకాలు పెంచడంతో డాలర్‌ పటిష్టం అయింది. విదేశీకరెన్సీ మార్కెట్‌ సెంటి మెంట్‌ మరింత బలంగా కనిపించింది. ప్రాథమిక స్థాయిలో కొంత అనిశ్చితి పరిస్థితులు తలెత్తినా రానురాను పరిస్థితులు రికవరీ అయ్యాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రనముఖంగా యుపిలో విజయం సాధించడం మారెఓ్కట్లకు కొంత ఊతం ఇచ్చిందనే చెప్పాలి. నవంబరు పదవ తేదీ తర్వాత ఇదే అత్యంత గరిష్టస్థాయికి చేరినట్లు అంచనా. ఎగ్జిట్‌పోల్స్‌లోనే కాకుండా వాస్తవ ఫలి తాల్లో కూడా బిజెపి యుపిలో ఏకైక అతిపెద్ద పార్టీ గా అవతరించింది. గోవాతోపాటు ఉత్తరాఖండ్‌ల కూడా అధికారం సాధిస్తుందని నిపుణుల అంచనాల తో మార్కెట్లకు ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెంచుతు న్నారు. ఈక్విటీ డెట్‌ మార్కెట్లకు నిధుల రాక పెరిగింది. దీనితో రూపాయికి కొంత మద్దతు లభిం చింది. స్థానిక ఈక్విటీ మార్కెట్లు కూడా ఇందుకు మద్దతు పలికాయి. విదేశీ నిధులు 487.61 కోట్ల రూపాయలు ఒక్క గురువారమే పెట్టుబడులు పెట్టా యి. బిజెపి విజయం కారణంగా కీలక సంస్కరణ లకు తెరలేపినట్లయింది. విదేశీ న్రపత్యక్ష పెట్టుబ డులు మరింతగాపెరుగుతాయని జిఎస్టీ అమలు లోకి వస్తే మరింతగా పెట్టుబడులు ఊపందుకుంటా యనిఅంచనా. డాలరుతోరూపాయి కరెన్సీ 66.72 వరకూ వెళ్లింది. గురువారం ముగింపు 66.71గా నిలిచింది. ఇంటర్‌బ్యాంక్‌ విదేశీ కరెన్సీ మార్కెట్‌లో 66.73వరకూ రూపాయి వెళ్లింది డాలర్‌ డిమాండ్‌ పెరగడమే ఇందుకుకీలకం. తదనంతరం కొంతమేర పటిష్టం అయి 66.56కుచేరింది. చివరకు 66.60 వద్ద ముగిసింది. దీనితో 11పైసలు రూపాయి లాభ పడినట్లు తేలింది. అంతర్జాతీయంగా చూస్తే ఇన్వె స్టర్లు అమెరికా ఉపాధి గణాంకాల పరంగాపటిష్టం గా ఉన్నట్లు విశ్వసించారు. వీటికితోడు ఫెడ్‌ రిజర్వు వడ్డీరేట్లు పెంపు కూడా వచ్చేవారం ఉంటుందన్న అంచనాలు డాలర్‌ను మరింత పటిష్టంచేసే అవ కాశంఉంది. ఇక ముడిచమురు ధర ల ఒత్తిడి పెరుగుతుంది. మెరికా వెస్ట్‌టెక్సాస్‌ ఇంటర్మీడియేట్‌ బెంచ్‌ మార్క్‌ ధరలు బ్యారెల్‌కు 50 డాల ర్లుగా నిలిచాయి. అమెరికా డాలర్‌ సూచీని పరిశీలిస్తే మరింత పటిష్టం అవుతుందని అంచనా. మొత్తం ఆరు మేజర్‌ కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ పట్టిష్టం అవుతోంది. డాలర్‌ సూచి 101.87వద్ద ట్రేడింగ్‌ జరి గింది. ఆర్‌బిఐ పరంగా డాలర్‌తో రూపాయి మారకం విలువలు 66.6880వద్ద సిఫారసు చేసింది. యూరోధరలు 70.6426గా ప్రక టించింది. ఇకబ్రిటిష్‌ పౌండ్‌ 80.95కుచేరింది. జపాన్‌ ఎన్‌ మాత్రం ప్రతి వంద యెన్‌లకు58.41రూపాయల నుంచి57.73 రూపా యలకు తగ్గింది. అంటే రూపాయి పటిష్టం అయిం దని భావించాలి. మొత్తంమీద ఈ వారంలో రూపాయిస్వల్పంగా పటిష్టంఅయిందని చెప్పవచ్చు.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Karan Joharతో చిందేసిన హార్దిక్ పాండ్య..! ఐపీఎల్ 2019 సీజన్‌కి ఫిట్‌నెస్ సాధించాలని ప్రస్తుతం ట్రై చేస్తున్న హార్దిక్ పాండ్య.. తాజాగా ముంబయిలో జరిగిన ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతా వివాహానికి హాజరై సందడి చేశాడు. Samayam Telugu | Updated: Mar 10, 2019, 09:49AM IST Karan Joharతో చిందేసిన హార్దిక్ పాండ్య..! హైలైట్స్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోతో చిక్కుల్లో పడిన హార్దిక్ పాండ్య ఈ ఏడాది జనవరిలో హార్దిక్‌పై కొన్నిరోజులు నిషేధం విధించిన బీసీసీఐ తాజాగా మళ్లీ కరణ్ జోహార్‌తో కలిసి హుషారుగా స్టెప్‌లేసిన హార్దిక్ పాండ్య గాయం కారణంగా భారత్ జట్టుకి దూరం.. ఐపీఎల్‌‌కి ఫిట్‌నెస్ సాధించే అవకాశం వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియా‌తో సిరీస్‌కి దూరమైన హార్దిక్ పాండ్య తాజాగా కరణ్ జోహార్‌తో కలిసి డ్యాన్స్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో అమ్మాయిలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా హార్దిక్ పాండ్య కొన్నిరోజులు నిషేధం కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. బీసీసీఐ పాలకుల కమిటీ ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేయగా.. ఆ తర్వాత భారత్ జట్టులోకి పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్య.. మళ్లీ గాయం కారణంగా టీమ్‌కి దూరమయ్యాడు. Those moves... #KaranJohar https://t.co/Gs4fSu2icy — Ruby (@iperfectlywrong) 1552149441000 ఐపీఎల్ 2019 సీజన్‌కి ఫిట్‌నెస్ సాధించాలని ప్రస్తుతం ట్రై చేస్తున్న హార్దిక్ పాండ్య.. తాజాగా ముంబయిలో జరిగిన ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతా వివాహానికి హాజరై సందడి చేశాడు. తన సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి వచ్చిన హార్దిక్.. వేదికపై కాసేపు కరణ్ జోహార్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆకాశ్ అంబానీ కుటుంబానికి చెందిన ముంబయి ఇండియన్స్ టీమ్‌కి పాండ్యా బ్రదర్స్ గత మూడేళ్ల నుంచి ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభంకానుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
"కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ First Published 10, Nov 2017, 12:37 PM IST "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ "కేరాఫ్ సూర్య" మూవీ వర్కింగ్ స్టిల్స్ Recent Stories
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 4 రోజుల టెస్టుకి స్టార్‌ క్రికెటర్లు నో..! నాలుగు రోజుల ఐసీసీ టెస్టు ప్రతిపాదనని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తిరస్కరించారు. ఇటీవల TNN | Updated: Oct 25, 2017, 06:27PM IST నాలుగు రోజుల ఐసీసీ టెస్టు ప్రతిపాదనని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తిరస్కరించారు. ఇటీవల ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో ప్రేక్షకుల నుంచి టెస్టులకి ఆదరణ తగ్గుతుండటంతో ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకి మ్యాచ్‌ని కుదించాలని ప్రతిపాదించారు. దీనిపై టెస్టు హోదా ఉన్న సభ్య దేశాల అభిప్రాయాలను కూడా సేకరించారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా డిసెంబరులో దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య జరగనున్న నాలుగు రోజుల టెస్టుని కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ‘వ్యక్తిగతంగా చెప్పాలంటే.. నాకు ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ అంటేనే ఇష్టం. భవిష్యత్‌లో కూడా ఈ తరహా టెస్టులే ఆడాలని కోరుకుంటున్నా’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ ‌స్మిత్ అభిప్రాయపడ్డాడు. ‘టెస్టు క్రికెట్ బాగా సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. ఒక మ్యాచ్‌ ఐదో రోజుకి చేరిందంటే అదో గొప్ప విషయం. ముఖ్యంగా.. ఆ రోజు చివరి గంట ఎంత కీలకమో..? నాకు తెలిసి ఆ చివరి నిమిషాలే ఆటలో ఎక్కువ మజా ఇస్తాయి’ అని డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. నవంబరు చివరి వారంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ జరగనుంది.
2sports
will bollywood actor shahid kapoor do justice to nani shraddha srinath film jersey షాహిద్.. నాని పేరు మాత్రం చెడగొట్టకు నాని కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జెర్సీని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ ఈ సినిమాలో నాని పాత్రను పోషించనున్నాడు. నాని పాత్రకు షాహిద్ న్యాయం చేయగలుగుతాడా? Samayam Telugu | Updated: Oct 27, 2019, 11:55AM IST షాహిద్ కపూర్ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌కు రీమేక్‌లు బాగా కలిసొస్తున్నాయి. తెలుగులో మంచి విజయం అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో తెరకెక్కించారు. ఇందులో షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటించారు. సినిమా ఎంత వివాదాస్పదమైందో అంతకంటే ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు అదే నమ్మకంతో ‘జెర్సీ’ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కూడా షాహిద్ కపూరే నటించనున్నాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్‌ను కూడా తెరకెక్కింనున్నాడు. ఇందులో శ్రద్ధా కపూర్‌ను కథానాయికగా ఎంపిక చేసుకోవాలని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. READ ALSO: సల్మాన్.. బట్టలు విప్పేసి ఇలా కూడా విషెస్ చెప్తారా? మరి కబీర్ సింగ్ సినిమాలాగే షాహిద్ జెర్సీ రీమేక్‌కు కూడా న్యాయం చేయగలడా? నాని ఇమేజ్‌ను ఎక్కడా డ్యామేజ్ చేయకుండా సినిమా చేయగలడా? జెర్సీ రీమేక్‌ను ప్రకటించగానే సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలివి. బ్రో.. నాని పరువు మాత్రం తీయకు అంటూ పలువురు అభిమానులు కామెంట్లు కూడా చేశారు. అన్ని రీమేక్ సినిమాలు హిట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. అలాగని ఫ్లాప్ అవుతాయని కూడా లేదనుకోండి. కానీ కబీర్ సింగ్‌కి జెర్సీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకటేమో లవ్ ఫెయిల్యూ్ర్, ఆల్కహాల్ ఎడిక్షన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినది, మరొకటి కుటుంబం, ప్రేమ, కెరీర్ ఇలా ఓ ఎమోషనల్ రైడ్‌తో సాగేది. కబీర్ సింగ్ సక్సెస్ నుంచి షాహిద్ పూర్తిగా బయటికి వస్తే కానీ జెర్సీ రీమేక్‌లోని తన పాత్రలో ఒదిగిపోలేడు. READ ALSO: ప్రియాంక భర్తను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసిన ఫ్యాన్ ఈ సినిమాను రీమేక్ చేయకపోవడమే మంచిదని పలువురు సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే కొన్ని సినిమాలు ఒక్కసారి తీస్తేనే బాగా వస్తాయి. రెండోసారి తీస్తే మొదటిసారి వచ్చినంత బాగా రాదు. జెర్సీలో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. వీరిద్దరిదీ కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారు. కానీ షాహిద్, శ్రద్ధా కపూర్ ఇదివరకే ‘బత్తీ గుల్ మీటర్ చాలూ’ అనే ఫ్లాప్ సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిందే. లక్ కలిసొచ్చి షాహిద్‌కు ఈ రీమేక్‌ కూడా హిట్ అయితే ఆయన కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కినట్లే. అసలే కబీర్ సింగ్‌కి ముందు వరకు వరుస ఫ్లాప్స్‌తో షాహిద్ సతమతమయ్యాడు. ఇప్పుడిప్పుడే ట్రాక్‌లోకి వస్తున్నాడు. మరి జెర్సీ రీమేక్‌ను జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురాగలడో లేదో వేచి చూడాలి.
0business
ప్రభుత్వాలలో చిత్తశుద్ధి కనిపిస్తోంది - పరిశ్రమల వికేంద్రీకరణ జరగాలి - అందరి చూపూ భారత్‌ వైపే.. - అవినీతి కొంత తగ్గుముఖం పట్టింది - విద్యుత్తు కోతలను పరిశ్రమ గమనిస్తోంది - 'నవ తెలంగాణ' ప్రత్యేక ఇంటర్వ్యూలో 'ఫ్ట్యాఫ్సీ' సీనియర్‌ ఉపాధ్యక్షుడు అనిల్‌ రెడ్డి               కేంద్రం, తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వాలు అధికారంలోకి రావడం పరిశ్రమ వర్గాలకు, దేశ ప్రగతికి శుభసూచికమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల మరియు వాణిజ్య సమాఖ్య (ఫ్ట్యాఫ్సీ) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ రెడ్డి వెన్నమ్‌ అన్నారు. భౌగోళికంగా తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పటికీ పరిశ్రమ, వాణిజ్య రంగాలపై దాని ప్రభావం పెద్దగా లేదని.. అందరూ కలిసి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని ఆయన వివరించారు. కొన్ని సమస్యలున్నా ప్రభుత్వాలలో చిత్తశుద్ధి కనిపిస్తోందని.. వ్యాపారానికి హద్దులుండవని,.. రాష్ట్రంలో అవినీతి తగ్గిందని చెబుతున్న అనిల్‌రెడ్డితో 'నవతెలంగాణ' ప్రత్యేక ఇంటర్వ్యూ.. విభజన ప్రభావం ఎలా ఉంది           రాష్ట్ర విభజన పరిశ్రమ వర్గాలను పెద్దగా ప్రభావితం చేయడం లేదు. విభజనకు ముందు నాలుగైదు సంవత్సరాలుగా జరిగిన ఉద్యమాలు, నిరసనలు కొన్ని ప్రతికూల అంశాలు పరిశ్రమలను బాగా కుంగదీశాయి. అప్పటి గాయాల నుంచి పరిశ్రమ వర్గాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. జోరు పెరగడానికి కొంత సమయం పడుతుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు కొత్త నమ్మకాలను, విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ఇక్కడి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలి వెళ్తాయా            ఇది కేవలం అపోహ మాత్రమే. కొన్ని కంపెనీల ఉత్పాదక ప్లాంటులు ఆంధ్రాప్రాంతంలో ఉన్నాయి. వాటి ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. కంపెనీ లా, ఇతర చట్టాల ప్రకారం ఇతర రాష్ట్రాలలో కార్యాలయాలు ఉంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు ఆయా కంపెనీలు తమతమ కార్యాలయాలను తరలించవచ్చు. అంతే గానీ ఇక్కడి ప్లాంటులను మూసివేసి అక్కడ తెరవడానికి ఎవరూ సాహసించరు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. కాకుంటే అక్కడ తమ విస్తరణ కార్యక్రమాలను చేపట్టవచ్చు. కొత్త ప్రభుత్వాల ప్రోత్సాహం ఎలా ఉంది?            ఇరు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా ప్రగతిని కాంక్షించే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అవి ఇప్పుడిప్పుడే కొన్ని చర్యలను ప్రారంభించాయి. వాటి ప్రతిఫలాలు రానున్న రోజుల్లో మనకు అందుతాయి. తెలంగాణ రాష్ట్రం అందుబాటులోకి తెచ్చిన సింగిల్‌ విండో విధానం చాలా బాగుంది.            దాదాపు పరిశ్రమ పెట్టెందుకు అవసరమైన 36-40 శాఖల అనుమతుల ఒకే చోట లభిస్తుండడం మంచి పరిణామం. దీని వల్ల అవినీతి చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇక్కడి ప్రభుత్వం అవినీతి నిరోధానికి చిత్త శుద్ధితో పని చేస్తోంది. నేతలు, ఉన్నతాధికారులలో కార్యదక్షత కనిపిస్తోంది. ఇంకా కిందిస్థాయిలో కొంత అవినీతి పేరుకొని ఉన్నా.. రానున్న రోజుల్లో ఇది కూడా తగ్గగలదని ఆశిస్తున్నాము. కొత్త పరిశ్రమల రాక ఎలా ఉంది?           చాలా మంది హైదరాబాద్‌ చుట్టుపక్కల పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న సూరళీకరణ చర్యలు, ప్రోత్సాహకాలను గురించి ఒక స్పష్టత కోసం వారు వేచి చూసో ధోరణిలో ఉన్నారు.           ఇప్పుడు బడ్జెట్‌ కూడా ప్రకటించడంతో ఇక వారు తమ కార్యాచరణను ప్రారంభించవచ్చు. ఇకనైనా పరిశ్రమల వికేంద్రీకరణ జరగాలి. దీని వల్ల పట్టణాలకు వలసలు తగ్గి అన్ని ప్రాంతాలల అభివృద్ధి జరుగుతుంది. విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు తగ్గవచ్చా?            పరిశ్రమలకు హైదారాబాద్‌ ఎప్పటికీ హాట్‌స్పాటే. ఇక్కడి భౌగొళిక పరిస్థితులు, వివిధ దేశాలతో కనెక్టివిటీ, వాతావరణం పరిస్థితుల కారణంగా కొత్త పరిశ్రమలు ఇక్కడికి వచ్చేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నా యి. దీంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు పరిశ్రమపై ఎలా ఉండవచ్చు?               ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు పరిశ్రమ వర్గాలపై స్వల్పమే. ఎందుకంటే మన మూలాలు బలంగా ఉన్నాయి దీంతో అందరూ భారత్‌ వైపే చూస్తున్నారు. విదేశీ పెట్టుబడులు తగ్గవచ్చన్న భావన కూడా సరికాదు. విద్యుత్తు కోతల ప్రభావం ఎలా ఉంది?           విద్యుత్తు సమస్యను అధిగమించడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒక ఛాలెంజ్‌గా తీసుకొని పని చేస్తోంది. ఈ వేసవిలో ఇప్పటి వరకు పరిశ్రమలకు విద్యుత్తు కోతలు రాకుండా ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటోంది.            దీనిని పరిశ్రమ వర్గాలు, కొత్తగా పెట్టుబడులు పెట్టాలుకునే వారు చాలా దగ్గరగా గమనిస్తున్నారు. రానున్న రెండేళ్లలో తెలంగాణాకు విద్యుత్తు కోతల బాధ తగ్గుతుందన్నది వాస్తవం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఇంకొంచెం తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 23 పైసలు తగ్గి రూ.83.30 గా ఉండగా.. డీజిల్ ధర 22 పైసలు తగ్గి రూ.79.60 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.82.50 ఉండగా.. డీజిల్‌ ధర రూ.78.36 వద్ద కొనసాగుతోంది. Samayam Telugu | Updated: Nov 5, 2018, 08:36AM IST అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుండటంతో సోమవారం (నవంబరు 5) కూడా దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 22 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధర రూ.78.56 కి చేరింది. డీజిల్ ధర 20 పైసలు తగ్గి రూ.73.16 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 22 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.84.06 కి చేరగా.. డీజిల్ ధర 21 పైసలు తగ్గి రూ.76.67 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరింత తగ్గి 72.41 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 23 పైసలు తగ్గి రూ.83.30 గా ఉండగా.. డీజిల్ ధర 22 పైసలు తగ్గి రూ.79.60 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.82.50 ఉండగా.. డీజిల్‌ ధర రూ.78.36 వద్ద కొనసాగుతోంది.
1entertainment
sumalatha 255 Views bse , NSE , stock market stock market ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఆద్యంతం ఒడుదొడుకుల్లో సాగాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో 200 పాయింట్ల వరకు ఎగబాకిన సెన్సెక్స్‌ కొద్ది క్షణాలకే ఆ లాభాలను కోల్పోయింది. నిఫ్టీ కూడా నేడు ఫ్లాట్‌గా మొదలైంది. సెన్సెక్స్‌ స్వల్పంగా 23 పాయింట్లు లాభపడి 39,839 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,917 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం రూ.68.90 విలువగా కొనసాగుతోంది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
1entertainment
'అర్జున్ రెడ్డి'లో జాన్వీ నటించాల్సిందట! Highlights టాలీవుడ్ లో ఘన విజయం సొంతం చేసుకున్న 'అర్జున్ రెడ్డి' సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే టాలీవుడ్ లో ఘన విజయం సొంతం చేసుకున్న 'అర్జున్ రెడ్డి' సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. తార సుతారియ హీరోయిన్ గా కనిపించనుంది. ఒరిజినల్ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ హిందీ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా జాన్వీ కపూర్ ను సంప్రదించినట్లు సమాచారం. ఈ ఆఫర్ తన వద్దకు వచ్చినప్పుడు జాన్వీ కపూర్ మెంటర్ కరణ్ జోహార్ వద్దని చెప్పాడట. కెరీర్ ఆరంభంలో బోల్డ్ సినిమాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పడంతో జాన్వీ ఈ సినిమా ఆలోచనను పక్కన పెట్టేసింది. కరణ్ జోహార్ స్వయంగా తార సుతారియను రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాన్వీ 'ధడక్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ గా తన డెబ్యూ సినిమా కావడంతో సినిమా రిలీజ్ పట్ల జాన్వీ ఒకింత టెన్షన్ ఉందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.  Last Updated 2, Jul 2018, 3:31 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV హార్దిక్ పాండ్యాని రాక్‌స్టార్ అని పిలిస్తే..? మైదానంలో ఉత్సాహానికి మారుపేరుగా గత కొంతకాలంగా తెగ సందడి చేస్తున్నాడు టీమిండియా నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. TNN | Updated: Sep 9, 2017, 02:20PM IST మైదానంలో ఉత్సాహానికి మారుపేరుగా గత కొంతకాలంగా తెగ సందడి చేస్తున్నాడు టీమిండియా నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య . కానీ.. గ్రౌండ్ వెలుపల మాత్రం అతను చాలా రిజర్వ్‌గా ఉంటాడట. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యానే స్వయంగా వెల్లడించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన సుదీర్ఘ సిరీస్‌‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన హార్దిక్.. మెరుపు శతకంతో జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే.. సిరీస్ చివర్లో గాయం కారణంగా వన్డే, ఏకైక టీ20 మ్యాచ్‌కి దూరమైన ఈ ఆల్‌రౌండర్ తాజాగా మీడియాతో తన వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు. ‘మైదానంలో నన్ను చూస్తే.. సరదాల్లో మునిగితేలే వ్యక్తిగా అనిపిస్తాను. కానీ.. వాస్తవంగా నేను చాలా రిజర్వ్‌గా ఉంటాను. పార్టీలు, పబ్‌లపై నాకు ఆసక్తి లేదు. నా దృష్టి ఎప్పుడూ ఆటపైనే ఉంటుంది. ఇక చిత్రమైన కేశాలంకరణ, టాటూస్ అంటారా..? అవి నా వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. రాబోవు క్రికెటర్లు అలా ఉండాలనే నియమం అయితే ఏమీ లేదు. ఎవరికైనా ఆసక్తి ఉంటే వాటిని వేసుకోవచ్చు. అది పూర్తిగా వారి వ్యక్తిగతం. జట్టులో నన్ను ఎందుకు రాక్‌స్టార్ అని పిలుస్తారో నాకైతే సరిగా కారణం తెలీదు. కానీ.. అలా పిలుస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ.. ఎప్పటికీ తన ఆటపై నమ్మకం ఉన్న హార్దిక్‌ పాండ్యగానే గుర్తింపు పొందాలని ఉంది’ అని హార్దిక్ వివరించాడు.
2sports
sumalatha 152 Views Chandrasekaran , TATA SONS Tata Sons Chairman Chandrasekaran ముంబయి: 2019 ఆర్థిక సంవత్సరానికి టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ పారితోషికం అందుకోనున్నారు. 2018లో చంద్రశేఖరన్‌ రూ.55.11కోట్లు అందుకోగా..ఈ ఏడాది రూ.65.52కోట్లు పారితోషికంగా అందుకోనున్నారు. అంటే దాదాపు 19శాతం వృద్ధి చెందింది. ఇందులో రూ.54కోట్లు ఆయన కమిషన్‌గా అందుకుంటారు. అదే 2018లో రూ.47కోట్ల కమిషన్‌ పుచ్చుకున్నారు. అంతేకాక ఆయనతో పాటు కంపెనీలోని పలువురి ప్రముఖుల వేతనాల్లో భారీ పెరుగుదల కనిపించింది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ అగర్వాల్‌ వేతనం సైతం 22శాతం పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరానికి ఆయన రూ.16.45కోట్లు అందుకున్నారు. అందులో రూ.12కోట్లు కమిషన్‌. స్వతంత్ర డైరెక్టర్లలో వేణు శ్రీనివాసన్‌ కమిషన్‌ తీసుకోవడానికి నిరాకరించగా.. అజయ్‌ పిరమాల్‌ రూ.1.9కోట్ల కమిషన్‌ స్వీకరించారు. రోనేంద్ర సేన్‌ రూ.2కోట్లు, హరీష్‌ మన్వాణీ రూ.1.85కోట్లు, ఫరీదా 1.9కోట్లు కమిషన్‌గా అందుకోనున్నారు. ఈ పారితోషికాలను ఆగస్టులో ముంబయిలో జరగనున్న టాటా సన్స్‌ 101వ వార్షిక సమావేశంలో అందజేయనున్నారు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఫీల్డర్‌ని చూస్తూ.. రోహిత్ శర్మ రనౌట్..! పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కపుగెదర వేగంగా బంతిని సమీపిస్తుండటంతో అతని వైపు చూస్తూ.. బౌలింగ్ ఎండ్‌వైపు TNN | Updated: Aug 20, 2017, 07:12PM IST శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో 217 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన లసిత్ మలింగ బౌలింగ్‌లో బంతిని పాయింట్ దిశగా తరలించిన రోహిత్ శర్మ (4: 13 బంతుల్లో) సింగిల్ కోసం మరో ఎండ్‌లో ఉన్న శిఖర్ ధావన్‌ని పిలిచాడు. దీనికి ధావన్ కూడా వేగంగా స్పందించడంతో సింగిల్ భారత్‌కి సులభంగా వచ్చేలా కనిపించింది. కానీ.. పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కపుగెదర వేగంగా బంతిని సమీపిస్తుండటంతో అతని వైపు చూస్తూ.. బౌలింగ్ ఎండ్‌వైపు రోహిత్ శర్మ నెమ్మదిగా పరుగెత్తాడు. దీని పసిగట్టిన కపుగెదర గురి చూసి వికెట్లవైపు నేరుగా బంతిని విసరగా.. క్రీజుకి ఒక అడుగు దూరంలో రోహిత్ శర్మ బ్యాట్‌ని జారవిడిచి ముందుకు కదిలాడు. అతని పాదం గాల్లో ఉండగానే బంతిని వికెట్లను గీరాటేయడంతో రోహిత్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఒకవేళ బ్యాట్‌ని జారవిడచకపోయినా రోహిత్‌కి జీవనదానం లభించేంది. మొత్తం వ్యవహారం చూస్తే.. బద్ధకంతోనే లంకేయులకి రోహిత్ శర్మ వికెట్ సమర్పించుకున్నట్లు అయ్యింది.
2sports
Hyderabad, First Published 11, Oct 2018, 12:53 PM IST Highlights ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా రోజు రానేవచ్చింది. అరవింద సమేత కోసం అభిమానులు గత కొన్ని రోజులుగా ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అక్టోబర్ 11వ తేదీ ఉదయం మొదటి షో ముగియగానే సంబరాలు మొదలయ్యాయి.  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా రోజు రానేవచ్చింది. అరవింద సమేత కోసం అభిమానులు గత కొన్ని రోజులుగా ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అక్టోబర్ 11వ తేదీ ఉదయం మొదటి షో ముగియగానే సంబరాలు మొదలయ్యాయి. సినిమాకు మంచి రెస్పాన్స్ అందడంతో అందరి ద్రుష్టి  కలెక్షన్స్ పై పడింది.  అయితే ఎంత పెద్ద సినిమా అయినా పైరసి భూతం నుంచి తప్పించుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. అదే విధంగా అరవింద సమేత చిత్ర యూనిట్ ఎన్ని  జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పైరసి భూతం స్వైర విహారం చేస్తున్నట్లు తెలుస్తోంది.  సినిమాలో ఎన్టీఆర్ కి సంబందించిన ఇంట్రడక్షన్  సీన్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో నందమూరి అభిమానులు వీలైనంతవరకు ఆ సీన్ ను ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక నిమిషం 28 సెకన్ల నిడివి కలిగిన ఆ సిన్ ను ముబైల్ లో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే స్పెషల్ టీమ్ తో రపైరసి అరికట్టేందుకు రెడీగా ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎవరో ఒకరు లీక్ చేస్తుండడం వారికి తలనొప్పిగా మారింది. మరి ఈ పైరసి భూతాన్ని వారు ఎంతవరకు అడ్డుకుంటారో చూడాలి.
0business
Suresh 117 Views RELIANCE పన్నుల చెల్లింపులోను రిలయన్స్‌ దిగ్గజమే! ముంబయి, ఆగస్టు 15: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశంలోనే అత్యధికంగా పన్నులు చెల్లించిన సంస్థగా నిలిచింది. గడచిన పదేళ్లుగా కంపెనీ రూ.2.88 లక్షలకోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు సమకూరుస్తు న్నది. ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ గడచిన ఐదేళ్లలో 3.30లక్షల కోట్లను పెట్టుబడులుపెట్టింది. ఒక్క జియో ఇన్ఫోకామ్‌లోనే రూ.2 లక్షలకోట్లు పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్‌ అంతేకాకుండా 1.30లక్షల కోట్లు ఇంధన, మెటీరియల్స్‌ బిజినెస్‌లలో పెట్టుబ డులు పెట్టింది. 5.7 బిలియన్‌ డాలర్లు అమెరికా షేల్‌గ్యాస్‌లో పెట్టుబడులుపెట్టింది. రిలయన్స్‌ గ్రూప్‌ మొత్తంగా 2.5 లక్షలమంది ఉద్యోగులను నియమించుకుంది. అంతేకాకుండా సుమారు 50 లక్షలమంది కి ప్రత్యక్షంగాను పరోక్షంగాను జియోద్వారా ఉపాధి కల్పిస్తున్నది. రిలయన్స్‌ ఎగుమతి ఉత్పత్తులు రూ.16.8లక్షల కోట్లుగా ఉన్నాయి. గడచిన పదేళ్లలో ఈమొత్తం 262 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ పరంగా దేశంలో అతిపెద్ద కార్పొరేట్‌ సామాజిక విభాగంలో వ్యయం చేస్తున్న కంపెనీగా నిలిచింది. గడచిన ఐదేళ్లలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ 3150 కోట్ల రూపాయలను సిఎస్‌ఆర్‌ కార్యకలాపాలకు వెచ్చింది. అంటే నికరలాభాల్లో రెండుశాతం వెచ్చించినట్లు కంపెనీ వర్గాలు చెపుతున్నాయి.
1entertainment
FM Council వృత్తినైపుణ్యానికి ఎఫ్‌ఎం కౌన్సిల్‌ ప్రోత్సాహం హైదరాబాద్‌: పనిచేసే వ్యవస్థ లో నిర్వహణ నైపుణ్యాన్ని మరింతగా ప్రోత్సహించే నిపుణులకు చెందిన సంఘం నాలుగో ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌(ఎఫ్‌ఎంకౌన్సిల్‌) సదస్సును ఐటిశాఖ కార్య దర్శి జయేష్‌ రంజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎం కౌన్సిల్‌ తెలంగాణ చాప్టర్‌తోపాటు మొబైల్‌ యాప్‌ను కూడా విడుదలచేసారు. మున్సిపల్‌ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి, సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ ఎండి డా.గురవారెడ్డి, ఎఫ్‌ఎం కౌన్సిల్‌ అధ్యక్షుడు సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్న ఈ సదస్సుకు దేశం నలు మూలల నుంచి 250మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఆధునిక కార్పొరేట్లు నిరంతరాయంగా పనిచేసేందుకు ఎఫ్‌ఎంకౌన్సిల్‌ దోహదం చేస్తుందని, ప్రజలను వ్యవస్థలను, ప్రదేశం, సాంకేతిక ప్రక్రియలు ఒకదానితో ఒకటిని అనుసంధానంతో ఏకీకృతంచేయడం ద్వారా బహుళ విభాగాలు కలిగి ఉన్న సంస్థ ఎఫ్‌ఎంకౌన్సిల్‌ అని సంస్త అధ్యక్షుడు సత్యన్నారాయణ పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి, టిఎస్‌ఐఐసి, లమండలి, సైబరాబాద్‌ పోలీస్‌, హైసియా వంటి సంస్థల తో అనుబంధం గ్వారా ఎఫ్‌ఎంసి వివిధ కార్పొరేట్‌ సామాజిక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పని చేస్తుందని అన్నారు. తమతమ వృత్తులు, సేవల్లో అసాధారణమైన కృషి, ప్రతిభను చూపించినం దుకుగాను వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతినిధులకు ఎఫ్‌ఎం కౌన్సిల్‌ అవార్డులు ప్రధానంచేసింది.
1entertainment
Washington D.C., First Published 20, Aug 2019, 12:50 PM IST Highlights ఆర్థిక మాంద్యం కోరల్లో అమెరికా చిక్కుకుంటున్నది. వచ్చే రెండేళ్లలో అమెరికన్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన సహజమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఫీల్ గుడ్ అన్నట్లు ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు.  వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు ఉన్నది ముసళ్ల పండుగ అని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ వచ్చే రెండేళ్లలో మాంద్యం కోరల్లో చిక్కుకోవడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు. మెజారిటీ ఆర్థిక విశ్లేషకులు 2020, 2021ల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అమెరికా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే సోమవారం విడుదలైన ఓ సర్వేలో అమెరికా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నదన్న అభిప్రాయాలు వినిపించాయి. గత వారం అమెరికా ఆర్థిక గణాంకాలు మిశ్రమంగా విడుదలైన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాంద్యం భయాలను కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనామిస్ట్స్ (ఎన్‌ఏబీఈ) సర్వేలో మెజారిటీ ఆర్థిక నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు పొంచి ఉన్నదని చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. 2021 ఆఖరికల్లా మాంద్యం ముప్పు తప్పదన్న నిపుణులు ఫిబ్రవరి సర్వేతో పోల్చితే ఈ ఏడాది తదుపరి మాంద్యం ప్రారంభం అవుతుందని ఎన్‌ఏబీఈ అధ్యక్షుడు హంటర్ అన్నారు. ఈ ఏడాది సంగతెలా ఉన్నా వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాలు చాలావరకు వినిపిస్తున్నాయి. కాగా, సర్వేలో పాల్గొన్నవారిలో 34% ఆర్థికవేత్తలు 2021 ఆఖరుకల్లా అమెరికా మాంద్యం బారిన పడుతుందని అంటున్నారు.  ఫిబ్రవరితో పోలిస్తే మాంద్యం ప్రభావం ఎక్కువని తేల్చిన ఆర్థికవేత్తలు కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సర్వేలో అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్పిన వారు 25 శాతం మంది మాత్రమే ఉండటం గమనార్హం. ఇక తాజా సర్వేలో 38 శాతం మంది 2020లోనే ఆ ఛాయలు కనిపిస్తాయని అంటుండగా, రెండు శాతం మంది ఈ ఏడాదే ఆ ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు.  అంతర్జాతీయ ఆర్థిక ప్రభావం డాలర్ ప్రభావం సహజమే అమెరికా ఆర్థిక ఇబ్బందులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సహజంగానే పడతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దదిక్కుగా ఉన్న అమెరికా కరెన్సీ డాలరే ప్రపంచ కరెన్సీగా ఉండటంతో అంతర్జాతీయంగా ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతున్న విషయం తెలిసిందే. నిజానికి అమెరికా ఫెడ్ రిజర్వ్ చాలా ఏళ్ల తర్వాత కీలక వడ్డీరేట్లను తగ్గించింది. వడ్డీరేట్లు తగ్గించాలని ఫెడ్ రిజర్వుపై ట్రంప్ ఒత్తిడి దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహం నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నది. ట్రంప్ సైతం వడ్డీరేట్లను తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్‌పై ఒత్తిడి తెచ్చారు. అయినా మాంద్యం దెబ్బ అమెరికాకు ఇప్పటికే తగిలిందని, ఇది వచ్చే రెండేళ్లలో తారాస్థాయికి చేరితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డోంట్ ప్రాబ్లం.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రతి దాన్నీ భయంతో చూడాల్సిన అవసరం లేదని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. భారతీయ ఆర్థిక పరిస్థితులపై విచారం, దిగులు అక్కర్లేదన్న ఆయన అందరు తమ ముందు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని కోరారు. ఆర్థిక మాంద్యం, జాతీయ - అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్న మాట నిజమేనని అంగీకరించినా.. ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.  ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరమన్న రఘురామ్ రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగానే ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం భయపడే స్థాయిలోనే ఉందన్నారు. ముఖ్యంగా విద్యుత్, బ్యాంకింగేతర ఆర్థిక రంగాల్లో నెలకొన్న సమస్యలను కేంద్రం వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని ఓ ఇంటర్వ్యూలో సూచించారు.  అన్ని రంగాల్లో మాంద్యం ఎపెక్ట్ అన్న రాజన్ ప్రస్తుతం అన్ని రంగాల్లో మందగమనం కనిపిస్తున్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ పరిస్థితులు మారాలంటే ఉద్దీపనలు అవసరం అని అన్నారు. అలాగే పడకేసిన జీడీపీని పరుగులు పెట్టించాలంటే మళ్లీ కొత్తగా సంస్కరణల బాట పట్టాల్సిందేనన్న ఆయన అంతర్జాతీయ మార్కెట్లలో రుణ సమీకరణ సంస్కరణ కాదని, అదొక వ్యూహాత్మక చర్య మాత్రమేనని పేర్కొన్నారు.  ఆర్థిక వ్యవస్థకు ఏమీ కాదంటున్న డొనాల్డ్ ట్రంప్ తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమీ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘అన్నింటికీ నేను సిద్ధంగానే ఉన్నా. మాంద్యం గురించి నేను అస్సలు దిగులు చెందడం లేదు. మా పాలనలో అమెరికా ఆర్థిక పరిస్థితులు బలపడ్డాయి. అమెరికన్ కస్టమర్లు చాలా సంపన్నులు అని మీడియాతో అన్నారు.  మిగతా దేశాలకే ప్రాబ్లం అంటున్న ట్రంప్ ‘అద్భుతమైన రీతిలో నేను పన్ను ప్రోత్సాహకాలను అందించాను. అమెరికన్ల వద్ద ఇప్పుడు బోలెడు డబ్బు ఉన్నది. వారి కొనుగోలు శక్తి బాగున్నది. వాస్తవానికి చాలామంది ఆర్థికవేత్తలు అమెరికాకు ఏమీ కాదని అంటున్నారని, ప్రపంచంలోని మిగతా దేశాలకు మాత్రం సమస్యలే’ అని హెచ్చరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ట్రంప్ ముఖ్య ఆర్థిక సలహాదారు లర్రీ కుడ్లో సైతం మాంద్యం ప్రభావాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘మహానటి’ డిలీటెడ్ సీన్: ఆయన గిల్లుడికి కీర్తి సురేష్ కెవ్వుకేక సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై లాంగ్ రన్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. Samayam Telugu | Updated: May 29, 2018, 08:13PM IST సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై లాంగ్ రన్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. సావిత్రి జీవితంపై అప్పటి వరకూ ఉన్న అనేక అపోహలు, సందేహాలకు చాలా వరకూ సమాధానాలు ఈ చిత్రంలో లభించాయి. ప్రమోషన్స్ విషయంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతుంది ‘మహానటి’ చిత్ర యూనిట్. సినిమా విడుదలకు ముందు ఈ చిత్రంలో నటించిన ఒక్కో పాత్రనూ రివీల్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. ‘మహానటి’ చిత్రం దాదాపు 3 గంటల నిడివితో విడుదల చేశారు. అయితే నిడివి మరీ ఎక్కువగా ఉండటంతో చాలా వరకూ సీన్స్ కట్ చేశారు. ఆ కట్ చేసిన సీన్స్‌ను వరుసగా విడుదల చేస్తున్నారు. రిలీజ్ తరువాత కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో డిలీట్ చేసిన సీన్స్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ నుండి మరో డిలీటెడ్ సీన్‌‌ను విడుదల చేశారు. రాజేంద్రప్రసాద్, కీర్తిసురేష్‌లపై.. కొబ్బరి తోటలో చిత్రీకరించిన ఈ సీన్‌లో.. ‘ఏంటి చౌదరి పాపను ఇలా తీసుకువచ్చావ్.. ఏమైనా కొత్త నాటకాలు వేయిస్తున్నావా ఏంటి? అనగానే.. ఏం నాటకాల్లే పెదబాబు... ఉన్న డబ్బులన్నీ డ్రామా కంపెనీలోనే పెట్టేశాను. ఇప్పుడు అందరికీ సినిమాల పిచ్చి పట్టుకుంది. నా చిన్నారి తల్లి నాకు సినిమాల్లో నటించాలి ఉంది పెదనాన్న అని అడిగింది.. అంటే నేనా అంటూ కీర్తి సురేష్ అమాయకంగా అడగటం.. పెదబాబుకి మస్కా కొట్టి మద్రాస్ వెళ్లేందుకు అతని దగ్గర డబ్బులు తీసుకునే సీన్‌లో.. రాజేంద్రప్రసాద్.. కీర్తిసురేష్‌ను గట్టిగా గిల్లడం.. దానికి ఆమె కెవ్వున అరవడం.. సరదాగా.. హాస్యభరితంగా ఉంది. ఇందులో కీర్తి సురేష్, రాజేంద్రప్రసాద్ హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ డిలీటెడ్ సీన్‌పై మీరూ ఓ లుక్కేసేయండి. X
0business
Hyderabad, First Published 25, Apr 2019, 12:53 PM IST Highlights రష్యాకు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్త పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం చెన్నైకి వచ్చింది.  రష్యాకు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్త పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం చెన్నైకి వచ్చింది. స్థానిక ఎంఆర్సీ నగర్ లో నివసిస్తూ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇటీవల రాఘవ లారెన్స్ తెరకెక్కించిన 'కాంచన 3' సినిమాలో కూడా ఈమె నటించింది. అయితే బుధవారం నాడు ఆమె తనపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయని పోలీసులను ఆశ్రయించింది. ఆమెతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన రుబేశ్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది.  తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రుబేశ్ పలు భంగిమల్లో ఫోటోలు తీసినట్లు ఆమె చెప్పింది. ఆ తరువాత ఆ ఫోటోలను వాట్సాప్ చేసి.. తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు చెప్పింది. తన కోరిక తీర్చకపోతే ఆ ఫోటోలను ఇంటర్నెట్ లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు మాధవరం, పొన్నియమ్మన్ మేడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.  Last Updated 25, Apr 2019, 12:53 PM IST
0business
Recommended byColombia జట్టులో యువరక్తం పరవళ్లు..! 2019 ప్రపంచకప్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ ఏడాది సెలక్టర్లు ఎక్కువ మంది యువ క్రికెటర్లకి జట్టులో అవకాశం ఇచ్చారు. కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షిరాజ్, జయదేవ్ ఉనద్కత్‌లు ఇప్పటికే టీమిండియా జెర్సీ ధరించి తమ సత్తా నిరూపించుకున్నారు. గత ఏడాది నుంచి జట్టులో ఉన్న హార్దిక్ పాండ్య ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మెరుపులు మెరిపిస్తూ.. లోయర్ మిడిలార్డర్ నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. జస్‌ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్.. సీనియర్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్ స్థానాల్ని వన్డే, టీ20 జట్టులో పూర్తిగా భర్తీ చేసేశారు. చర్చల్లో నిలిచిన వివాదాలు..! టీమిండియాకి ఈ ఏడాది రెండు వివాదాలు ఎక్కువ చర్చనీయాంశంగా మారాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ బెంగళూరు‌లో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా డీఆర్‌ఎస్ కోరే ముందు జట్టు సహాయసిబ్బంది సాయం కోరడంతో వివాదానికి బీజం పడింది. అప్పటికే రెండు సార్లు స్మిత్ అలా సాయం తీసుకోవడం తాను చూశానని మీడియా సమావేశంలో కోహ్లి చెప్పడంతో ఆసీస్ మీడియా మన కెప్టెన్‌పై అక్కసు వెళ్లగక్కింది. ఒకానొక దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కోహ్లిని పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ వివాదం అలా సమసిపోయిందో లేదో..? విరాట్ కోహ్లి- అనిల్ కుంబ్లే మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. జూన్ వరకు భారత్ జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేసిన అనిల్ కుంబ్లే తమతో హెడ్‌మాస్టర్‌‌లా వ్యవహరిస్తున్నాడంటూ టీమిండియా మొత్తం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రాక్టీస్ సెషన్‌లో కుంబ్లే‌‌పై కోహ్లి నోరుజారినట్లు కూడా అప్పట్లో వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కుంబ్లే.. మరోసారి కోచ్‌గా ఎంపికయ్యే అవకాశం ఉన్నా.. ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టలేనంటూ పక్కకి తప్పుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జస్‌ప్రీత్ బుమ్రా నోబాల్ విసిరి ఎక్కువ వార్తల్లో నిలిచాడు. కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక కూడా కొద్ది రోజులు చర్చల్లో నిలిచింది. రికార్డుల మోత మోగించారు..! మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలోనే మూడు వన్డే ద్విశతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి అయితే.. టెస్టుల్లో వరుస ద్విశతకాలు.. వన్డేల్లో శతకాలతో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ రికార్డుల్ని బద్దలుకొట్టే దిశగా శరవేగంతో దూసుకెళ్తున్నాడు. వన్డేల్లో సచిన్ 49 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. 28 ఏళ్ల కోహ్లి ఇప్పటికే 32 శతకాలతో ద్వితీయ స్థానానికి చేరుకున్నాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఎక్కువ మందిని ఔట్ చేసిన వికెట్‌ కీపర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. స్పిన్నర్ చాహల్ ఈ ఏడాదిలోనే ఎక్కువ టీ20 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. భారత్ జోరు ఎలా ఉందంటే.. ఈ ఏడాది స్వదేశంలో ఒక్క వన్డే సిరీస్‌ని కూడా భారత్ చేజార్చుకోలేదు. టెస్టుల్లో వరుసగా తొమ్మిది సిరీస్‌లు విజయాలు సాధించి జైత్రయాత్ర సాగిస్తోంది. టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ టెస్టుల్లో అగ్రస్థానం.. వన్డేల్లో రెండో స్థానం, టీ20ల్లో టాప్-5లో కొనసాగుతోంది. మొత్తంగా టీమిండియా గెలుపుకాంక్షతో తొణికిసలాడుతోంది..!!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భర్తతో ‘నువ్వు నేను’ హీరోయిన్ బాత్‌టబ్ రొమాన్స్ నువ్వు నేను హీరోయిన్ అనిత తన భర్తతో సెక్సీ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. బాత్ టబ్‌లో తన భర్తతో పడుకుని రొమాంటిక్ పోజులిచ్చారు. Samayam Telugu | Updated: Nov 8, 2019, 06:52PM IST అనిత ప్రముఖ బుల్లితెర నటి అనితా హస్సానందని లేటెస్ట్ ఫొటో షూట్ సెగలు పుట్టిస్తోంది. అదేనండీ.. 1990ల్లో వచ్చిన బ్లాక్ బస్టర చిత్రం ‘నువ్వు నేను’లో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి. తెలుగులో అరకొర సినిమాలు చేసి ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అయితే అక్కడ సినిమా అవకాశాలు రాక సీరియల్స్‌లో నటిస్తూ బతికేస్తోంది. అయితే ఆమెకు టెలివిజన్ రంగంలో ఓ నటికి ఉండాల్సిన క్రేజ్ కంటే ఎక్కువ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా అనిత తన భర్త రోహిత్ రెడ్డితో కలిసి ఓ సెక్సీ ఫొటో షూట్‌లో పాల్గొంది. ఓ బాత్ టబ్‌లో ఇద్దరూ పడుకుని ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ ఇచ్చిన స్టిల్స్ పిచ్చ హాట్‌గా ఉన్నాయి. READ ALSO: Me Too నిందితుడితో కలిసి రజనీ, కమల్ పకపకలు ఈ ఫొటోలు చూసి అనిత ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఫొటోల్లో అనిత తన కళ్లతో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మత్తెక్కిస్తున్నాయి. ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూసి రోహిత్ టెంప్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. వీరిద్దరూ డ్యాన్స్ రియాల్టీ షో ‘నచ్ బలియే 9’లో పాల్గొన్నారు. కానీ రన్నరప్స్‌గా మిగిలిపోయారు. 2001లో వచ్చిన ‘నువ్వు నేను’ సినిమా రికార్డులు తిరగరాసింది. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు. ఆ తర్వాత ‘శ్రీరామ్’ సినిమాతో మళ్లీ రేణు, ఉదయ్ జత కట్టారు. ఈ సినిమా కూడా హిట్ అయింది. ఉదయ్ కిరణ్, అనిత జోడీకి చాలా మంది ఫిదా అయ్యారు. ఆ తర్వాత అనితకు పూర్తి స్థాయి హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు. అనిత READ ALSO: నాలుగో హీరోయిన్‌తో Kamal Haasan డేటింగ్? ఆ తర్వాత వచ్చిన ‘తొట్టిగ్యాంగ్’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘ఆడంతే అదో టైపు’, ‘నేను పెళ్లికి రెడీ’, ‘అహ నా పెళ్లంట’, ‘మనలో ఒక్కడు’ సినిమాల్లో నటించారు. కానీ ముందు చేసిన సినిమాలతో వచ్చినంత క్రేజ్ మరే సినిమాతో రాలేదు. మధ్యలో చాలా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. అయితే ఆమెకు సిల్వర్ స్క్రీన్ చెప్పుకునేంత స్టార్‌డం తెచ్చిపెట్టలేకపోయింది. దాంతో సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టారు. ‘నాగిన్’ అనే సీరియల్ అనితకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. 2013లో రోహిత్ రెడ్డి అనే తెలుగు అబ్బాయిని అనిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. See Photo Story: 'నువ్వు- నేను' హీరోయిన్... హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు పిచ్చెక్కున్!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business