news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ... పెళ్లైన గర్భవతిని పెళ్లిచేసుకోవడం..ఇదోరకం ప్రేమ
Highlights
నటీనటులు: విజయ్ దేవరకొండ, షాలిని, రాహుల్ రామకృష్ణ, కాంచన, సంజయ్ స్వరూప్ తదితరులు
సంగీతం: రాధన్
నిర్మాతలు: ప్రణయ్ రెడ్డి వంగ
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ
ఆసియానెట్ రేటింగ్: 2.5/5
పెళ్లి చూపులు సక్సెస్ తో.. ఊపు మీదున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాలోని ముద్దు సీన్లు, బూతుల పంచాంగం మూలంగా గత కొన్ని రోజులుగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రి రిలీజ్ ఫంక్షన్ లో.. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు సినిమాపై అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాయి. మరి సినిమా హైప్ క్రియేట్ చేసినట్టే.. జనాలకు రీచ్ అయిందా... చూద్దాం.
కథ:
అర్జున్ రెడ్డి(విజయ్ దేవరకొండ)మంగళూరులో సంట్ మేరీస్ మెడికల్ కాలేజీ లో మెడిసిన్ చేస్తుంటాడు. చదువులలో, ఆటల్లో అన్నింటా టాపర్ గా వున్నా అర్జున్ కు కోపం అనే వీక్ నెస్ వుంది. అయితే కాలేజీలో అర్జున్ రెడ్డి పేరు చెబితే.. ఎవరైనా గప్ చుప్ అయిపోవాల్సిందే. అదే కాలేజీలో ప్రీతీ(శాలిని పాండే) జాయిన్ అవుతుంది. తొలి చూపులోనే తనను ప్రేమించిన అర్జున్ చివరికి ప్రీతీని తన ప్రేమలో పడేలా చేసుకుని మానసికంగా, శారీరకంగా దగ్గర అవుతాడు. కాని ప్రీతి తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ప్రీతీకి వేరే అబ్బాయితో పెళ్లి కూడా చేసేస్తాడు. దీంతో సహజంగా కోపిష్టి అయిన అర్జున్ తట్టుకోలేక పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు. తండ్రిపై కోపంతో ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోయి ఒక ప్రైవేటు హాస్పిటల్ లో ఉద్యోగం చేసుకుంటూ అన్ని రకాల వ్యసనాలకు బానిసగా మారతాడు. మద్యం సేవించి సర్జరీలు కూడా చేస్తుంటాడు. ఇది మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణించే నేరం. అనుకోకుండా హాస్పిటల్ లో చేసిన సర్జరి ఫైనల్ స్టేజ్ లో తనవల్ల కాక అసిస్టెంట్ నర్స్ తో చేయిస్తాడు. అలా కేసులో ఇరుక్కుంటాడు. మరి అర్జున్ రెడ్డి పై ఆ కేసు ప్రభావం ఎలా పడింది. చివరికి ప్రీతిని ఏ పరిస్థితుల్లో కలుసుకున్నాడు. గర్భవతిగా మారిన ఆ అమ్మాయిని ప్రేమకోసం పెళ్లి చేసుకున్నాడా అన్నదే అసలు కథ.
నటీనటులు:
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి పాత్రలో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో తండ్రితో తిట్లు తింటూ ఫ్యూచర్ గురించి కన్ఫ్యూజ్ అయ్యే కుర్రాడు ఇతనేనా అనిపిస్తాడు. యారోగెంట్ గా, తేడాగా, ఒకరకంగా చెప్పాలంటే బాగా తిక్కగా ఉన్న అర్జున్ రెడ్డి పాత్రకు ప్రాణం పోసాడు. తన చుట్టూ ఉన్న నిస్సహాయ పరిస్థితుల పట్ల అసహనం చూపించే పాత్రలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. భవిష్యత్తులో విజయ్ ఎన్ని సినిమాలు చేసినా ఇదే అతని కెరీర్ టాప్ వన్ గా మిగిలిపోయినా ఆశ్చర్యం లేదు. కొన్ని చోట్ల బాడీ లాంగ్వేజ్ మితిమీరినట్టు అనిపించినా అది కథ డిమాండ్ మేరకే కాబట్టి అదొక్కటి క్షమించవచ్చు. మంచి సబ్జెక్ట్ పడితే తనలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడని విజయ్ దేవరకొండ మరో సారి రుజువు చేసాడు. ఇక హీరొయిన్ శాలిని పాండే చాలా క్యూట్ గా, హోమ్లీ గా అర్జున్ ప్రేమ కోసం తపించిపోయే ప్రియురాలిగా చాలా బాగా చేసింది. కానీ సెకండ్ హాఫ్ లో తనను మిస్ అయిన ఫీలింగ్ ఆ పాత్రను ఇష్టపడిన వాళ్ళకు ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఈ ఇద్దరి తర్వాత ఆకట్టుకునేది మాత్రం అర్జున్ రెడ్డి తో సమానంగా సినిమా మొత్తం ట్రావెల్ చేసిన ఫ్రెండ్ శివ పాత్ర వేసిన రాహుల్ రామకృష్ణ మాత్రం అదరగొట్టాడు. బక్కపలచని పర్సనాలిటీ తో హీరో యారోగెన్సి కి ధీటుగా పంచులు వేస్తూ కడుప్పుబ్బా నవ్వించే ఈ పాత్ర లేకుండా అర్జున్ రెడ్డిని ఊహించుకోవడం కష్టం. నెలసరి గురించి చెప్పిన డైలాగ్ కి నవ్వని ప్రేక్షకుడు లేడు. అలనాటి నటి కాంచన హీరో నాన్నమ్మగా చక్కగా చేసింది. హీరో అన్న కమల్ కామరాజు కూడా ఓకే. సెకండ్ హీరొయిన్ జియా శర్మకు అంత మైలేజ్ ఇచ్చే పాత్ర కాదు. ఇక మిగిలిన వారందరూ సీన్ కు తగ్గట్టు కనిపించి చేసి వెళ్ళిన వారే
సాంకేతిక వర్గం:
దర్శకుడు సందీప్ వంగా తన సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు అందరు ఇది సహజమేలే అనుకున్నారు. కాని స్క్రీన్ మీద తనలో ఉన్న క్రియేటివ్ మేకర్ ని ఒక సరికొత్త ఫీల్ తో ఆవిష్కరించి మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు. ప్రేమ అనే ఎమోషన్ ని కోపం అనే ఎమోషన్ తో క్లాష్ చేసినప్పుడు ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో అర్జున్ రెడ్డి చేసే స్ట్రగుల్ ద్వారా సందీప్ ఆవిష్కరించిన తీరుకి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అవసరానికి మించి బోల్డ్ నెస్ చూపించినా అది వెగటు అనిపించకుడా బాలన్స్ చేయటంలో అతను చూపిన టెక్నిక్ నిజంగా ఫెంటాస్టిక్. భావోద్వేగాల మీద అదుపు లేనప్పుడు ఎంతటివాడైనా పతనం చూస్తాడు అనే నిజాన్ని చాలా సున్నితంగా చూపించడం కట్టిపడేస్తుంది. అర్జున్, ప్రీతీల ప్రేమ కథను ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగానే ఉంది కాని ప్రీతీ అతని ప్రేమలో సడన్ గా పడిపోవడం బహుషా లెంగ్త్ తగ్గించడం కోసం జరిగిన ఎడిటింగ్ లో మిస్ అయ్యుండొచ్చు.
సందీప్ లో మాత్రం ఒక ఫ్రెష్ టాలెంట్ ఉందనేది మాత్రం ప్రూవ్ అయ్యింది. కాని పదే పదే అర్జున్, ప్రీతీ పాత్రల మధ్య ముద్దుల ప్రహసనం పెట్టడం ఎమోషన్ కోసమే అయినా మరీ ఇన్ని సార్లు అవసరమా అనిపిస్తుంది.రాదన్ సంగీతం అర్జున్ రెడ్డి మరో అతి పెద్ద బలం. ఇలాంటి ప్రేమ కథలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇందులో రాదన్ తన బిజిఎంతో వినిపిస్తాడు. పాటలు మరీ గొప్పగా లేనప్పటికీ విజువల్ గా చూస్తూ ఉంటె మాత్రం గుడ్ ఫీల్ క్యారీ చేయిస్తాయి.
లెంగ్త్ కొంచెం ఎక్కువ అనిపించినా ఇప్పటికే అరగంట కట్ చేస్తేనే మూడు గంటలు వచ్చిందని దర్శకుడే చెప్పాడు కాబట్టి ఎడిటర్ శశాంక్ కు పెద్దగా పని చెప్పలేదు అనిపిస్తుంది. రాజు తోట సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. భద్రకాళి సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి. భారీ బడ్జెట్ కాదు కాబట్టి స్పెషల్ గా మెన్షన్ చేయాల్సింది ఏమి లేదు
ప్లస్ పాయింట్స్:
విజయ్ దేవరకొండ, మ్యూజిక్, దర్శకత్వం, రాహుల్ కామెడీ, ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్
నెగటివ్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ లెంగ్త్, మరీ బోల్డ్ గా ఉన్న కొన్ని సీన్స్, బూతుల వాడకం ఎక్కువైంది
చివరిగా :
అర్జున్ రెడ్డిది అదోరకం మనస్తత్వం.. కానీ ప్రేమోన్మాదం మాత్రం కాదు. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని మాత్రం అడల్ట్ కంటెంట్ దూరం చేస్తుంది.
Last Updated 25, Mar 2018, 11:53 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
#NoteBan: పాత నోట్లు.. ఇక్కడ చెల్లుతాయి!
బ్యాంకుల్లో ఇక పాత నోట్లను మార్చుకునేందుకు వీలు లేదని బెంగపడొద్దు. డిసెంబరు 15 వరకు వివిధ ప్రభుత్వ సేవల కోసం వాటిని వినియోగించవచ్చు. లేదా వాటిని మీ బ్యాంకు ఖాతాల్లో జమా చేసుకోవచ్చు.
TNN | Updated:
Nov 25, 2016, 02:47PM IST
బ్యాంకుల్లో ఇక పాత నోట్లను మార్చుకునేందుకు వీలు లేదని బెంగపడొద్దు. డిసెంబరు 15 వరకు వివిధ ప్రభుత్వ సేవల కోసం వాటిని వినియోగించవచ్చు. లేదా వాటిని మీ బ్యాంకు ఖాతాల్లో జమా చేసుకోవచ్చు. నోట్ల మార్పిడిలో జరుగుతోన్న అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, రిజర్వు బ్యాంకు కౌంటర్లలో పాత నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే, వివిధ క్రయ విక్రయాలు, సేవలు, చెల్లింపులకు కూడా మినహాయింపు ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కార్యాలయాలు, సంస్థల్లో సైతం పాత నోట్లను స్వీకరిస్తారు. మున్ముందు ప్రభుత్వం ఈ ఆంక్షలను కఠినతరం చేసే అవకాశాలున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా పాత నోట్లను వదిలించుకోవడం మంచింది. గురువారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వం విధించిన కొత్త ఆంక్షలను, సడలింపులను పరిశీలిస్తే... | 1entertainment
|
internet vaartha 105 Views
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్ల పర్యవేక్షణ సంస్థ సెబి యునైటెడ్ స్పిరిట్స్లో మాల్యా, డియోజియో మధ్యజరిగిన లావాదేవీలపై స్పిరిట్స్ అధికారులను విచారించాలని నిర్ణయించింది. యుఎస్ఎల్ బోర్డు నుంచి వైదొలిగినందుకుగాను డియోజియో మాల్యాకు 75 మిలియన్ డాలర్ల ప్యాకేజిని ప్రకటించింది. ఈ ప్యాకేజికి సంబంధించిన చట్టపరమైన నియమ నిబంధనలు అనుసరించిందీలేనిదీ సెబి విచారిస్తోంది. ఈనెల 9వ తేదీనే యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ తాజాగా మాల్యా హయాంలో 1200 కోట్ల రూపాయలు కంపెనీ నుంచి మాల్యాకు చెందిన ఇతర ఆస్తులకు సంస్థలకు బదలాయించారని ఆరోపించింది. ఫోర్స్ఇండియా, వాట్సన్ ఇండియా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు ఈ నిధులు బదలాయించినట్లు చెపుతున్నారు. సెబిదర్యాప్తు విభాగం ఈ విచారణను చేపట్టింది. కంపెనీ నిఘా విభాగంనుంచి అందిన నివేదిక మేరకు ఈ దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు సెబి వెల్లడిం చింది. అలాగేకార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. యునైటెడ్ స్పిరిట్స్లోని డైరెక్టర్లు, స్వతంత్ర సభ్యుల పాత్రపై కూడా సెబి దృష్టి సారించింది. కంపెనీని ఆడిట్చేసిన ఆడిటర్లు కార్యకలాపాలపై కూడా విచారణచేస్తోంది. 201-2013 సంవత్సరాలమధ్య లావాదేవీలపై సెబి స్కాన్ చేస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆడిటింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ఆధారంగా ముందుకు సాగుతోంది. ప్రైస్వాటర్ కూపర్స్యుకె సంస్థ గడచిన ఏడాది ఏప్రిల్ 2015లో అందచేసిన నివేదిక మేరకు మాల్యాను యుఎస్ఎల్ ఛైర్మన్ పదవినుంచి తప్పించాల్సివచ్చింది. ఇందుకుగాను బ్రిటన్సంస్థ మాల్యాకు 75 మిలియన్ డాలర్ల ప్యాకేజి ని ప్రకటించింది. ఇదిలా ఉండగా యునైటెడ్ స్పిరిట్స్లో తాము తీసుకున్ననిర్ణయాలన్నీ అప్పటి వాటా దారులు, డైరెక్టర్ల బోర్డు ఆమోదం మేరకు మాత్రమే జరిగాయని, 1235 కోట్ల రూపాయలు అక్రమంగా దారిమళ్లించినట్లు చెపుతున్న లెక్కలు వాస్తవం కాదని, ఇందులో తన ప్రమేయం ఏమీ ఉండదని, డైరెక్టర్ల బోర్డు, వాటాదారుల అనుమతులతోనే అన్నీ అమలయ్యాయని మాల్యా తీవ్రంగా ఖండించారు. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బాలీవుడ్లోకి అడుగిడిన సీఎం వైఫ్
ఆమె ఓ రాష్ర్ట ముఖ్యమంత్రికి భార్య. వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. అటు ఆఫీసులో.. ఇటు ఇంట్లో రెండు చోట్లా ఫుల్లు బిజీ. అంత బిజీ షెడ్యూల్లోనూ...
TNN | Updated:
Dec 28, 2015, 07:03PM IST
ఆమె ఓ రాష్ర్ట ముఖ్యమంత్రికి భార్య. వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. అటు ఆఫీసులో.. ఇటు ఇంట్లో రెండు చోట్లా ఫుల్లు బిజీ. అంత బిజీ షెడ్యూల్లోనూ ఆమెకున్నపాటలు పాడాలనే ప్యాషన్ తనని బాలీవుడ్కి పరిచయం చేసింది. ఆమెవరో కాదు.... మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ . అవును.. మొదటి నుంచీ బాలీవుడ్ సర్కిల్లో కనిపించే అమృతకి ఇండస్ట్రీ ప్రముఖులతో పరిచయం, సాన్నిహిత్యం వుంది. కానీ తాజాగా ఆమే ఓ బాలీవుడ్ సెలబ్రిటీ అయిపోయింది. మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్రకే చెందిన దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే జీవిత చరిత్ర ఆధారంగా ' సంఘర్ష్ యాత్ర ' అనే ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అమృత ఓ పాట పాడింది. ఇదే కాకుండా మరో రెండు బాలీవుడ్ సినిమాలకి పాటలు పాడిన అమృత.. తన బ్యాంకింగ్ జాబ్ మాత్రం వదులుకోనంటోంది. తాను పాటలు పాడింది కూడా వీకెండ్ రోజుల్లోనే కావడంతో తన ఉద్యోగానికి వచ్చిన ఇబ్బంది సైతం ఏమీ లేదు. జాబ్ ఫస్ట్.. తర్వాతే సింగింగ్ అంటున్న అమృత, తన స్వస్థలమైన నాగ్పూర్ని, అక్కడి ఫ్రెండ్స్ని ఎంతో మిస్ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
హాట్: టు పీస్తో ‘రోగ్’భామలు రచ్చ.. రచ్చ
పూరీ జగన్నాథ్ రోగ్ మూవీతో తనలోని టాలెంట్ను పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చేస్తున్నాడు. అందుకు కొత్త భామలు సైతం మీరు ఎలా చూపించాలో చెప్పండి పూరీ.. సార్, మేము చూపించేస్తాం.. నో మొహమాటమ్స్ అన్నట్టు రెచ్చిపోతున్నారు.
TNN | Updated:
Feb 20, 2017, 02:53PM IST
పూరీ జగన్నాథ్ రోగ్‌ మూవీతో తనలోని టాలెంట్‌ను పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చేస్తున్నాడు. అందుకు కొత్త భామలు సైతం మీరు ఎలా చూపించాలో చెప్పండి పూరీ.. సార్, మేము చూపించేస్తాం.. నో మొహమాటమ్స్ అన్నట్టు రెచ్చిపోతున్నారు.
'బద్రి' నుంచి 'ఇజమ్‌' వరకు తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌, మేనరిజం డిఫరెంట్‌గా వుండేలా చూసుకుంటూ రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన సినిమాలను రూపొందించే డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇప్పుడు మరో డిఫరెంట్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
యంగ్‌ హీరో ఇషాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా. సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ)తో ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి.
అనుష్క, అసిన్‌, హన్సిక, రక్షిత, దిశా పటాని, కంగనా రనౌత్‌, శియా గౌతమ్‌, నేహాశర్మ, సమీక్ష, అయేషా టకియా, అదాశర్మ వంటి గ్లామరస్‌ హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన పూరి జగన్నాథ్‌ 'రోగ్‌' చిత్రం ద్వారా డబుల్‌ ధమాకాగా ఇద్దరు హీరోయిన్లను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇషాన్‌ సరసన మన్నారా చోప్రా, ఏంజెలా నటిస్తున్నారు. తన ప్రతి సినిమాలోనూ హీరోయిన్లను ఎంతో గ్లామర్‌గా చూపించే పూరి ఈ సినిమా కాస్త డోస్‌ పెంచి ఇద్దరు హీరోయిన్లతో కనువిందు చేయబోతున్నారు.
'రోగ్‌' అనే డిఫరెంట్‌ టైటిల్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించిన పూరి డిఫరెంట్‌ ప్రమోషన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచుతున్నారు. 'రోగ్‌' మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీగా అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ డిస్కషన్‌ పాయింట్‌గా మారింది.
హీరోని తలకిందులుగా వేలాడదీసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన పూరీ.. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేసి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాశాడు. తాజాగా రోగ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలోని హీరోయిన్స్‌ మన్నారా చోప్రా, ఏంజెలా స్టిల్స్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చాలా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
internet vaartha 220 Views
హైదరాబాద్ : ద్విచక్రవాహన తయారీకంపెనీల్లో భారీ కంపెనీ టివిఎస్మోటార్స్ తాజాగా టివిఎస్ విక్టర్ కొత్త మోడల్ను ప్రవేశపెట్టింది. కంపెనీ సేల్స్ వైస్ప్రెసిడెంట్ జెఎస్శ్రీనివాసన్ ఈ బైక్ను లాంఛనంగా తెలంగాణ మార్కెట్కు విడుదలచేసారు. 2002లో ప్రవేశపెట్టిన టివిఎస్విక్టర్ తొలిసారే విజయవంతం అయిందని, భారత్లో టివిఎస్ మోటార్స్కు పునాదులు వేసిందన్నారు. ప్రస్తుతం టివిఎస్ విక్టర్ ప్రపంచ స్థాయిలో ఉత్పత్తి అవుతోందని, పనితీరుకు సంబంధించి ధృఢంగా ఉంటుందన్నారు. 2002లో విడుదయిన సమయంలోనే ప్రతినెలా 40వేల యూనిట్లు విక్రయించి నట్లు టివిఎస్ శ్రీనివాసన్ వెల్లడించారు. ఇపుడు తాజాగా టివిఎస్ విక్టర్ కొత్త మోడల్లో ఆధునిక స్టయి లింగ్, అత్యుత్తమమైన ఇంజన్పనితీరు, తనశ్రేణిలో మార్గదర్శకమైన సౌకర్యాల విశిష్టమైన ఓకలయికగా ఉందన్నారు. అత్యాధునికమైన స్టైల్3 వాల్వ్ ఎకో థ్రస్ట్ ఇంజన్ఉందని, అత్యధికశక్తి మైలేజి రెండింటినీ అందిస్తుందని శ్రీనివాసన్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ స్టార్ట్ 4స్పీడ్ పవర్ట్రైన్ వల 80-00 ఆర్పిఎం శక్తితో ఉంటుంది. 6000 ఆర్పిఎంతో 9.4ఎన్ఎంటార్క్ సాధించేలా చేస్తుందని వెల్లడించారు. పెట్రోలు నింపిన ఫ్రంట్ టెలిస్కోప్ సస్పెనష్టన్, వెనుకవైపు ఐదు స్టెప్అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సిరీస్ స్ప్రింగ్ సస్పెన్షన్ ప్రయాణాన్ని నిర్వహణను సులభతరం చేస్తాయన్నారు. విశాలమైన సీటు కూడా మోటార్సైకిల్కు అదనంగా జత చేస్తుందని, టివిఎస్ విక్టర్ కొత్త అద్దాలు, ఇన్స్ట్రుమెంట్ ప్యానల్తో వచ్చిందన్నారు. 55వాట్స్ హెడ్లైట్ అత్యంత ప్రకాశవంతంగా ఉంటుందన్నారు. టివిఎస్విక్టర్ డిస్క్, డ్రమ్ఎంపికలతో ఆకర్షణీయమైన వైవిధ్యం కలిగిన గ్రాఫిక్స్ తో ఎరుపు, నలుపు, నలుపుఎరుపు, నల్లటి సిల్వర్గ్రే, సిల్వర్ బ్లూ రంగుల్లో లభిస్తుందని శ్రీనివాసన్ వివరించారు. | 1entertainment
|
అల్లు అరవింద్ మాట తప్పారు.. అందుకే మగధీర 100రోజుల ఫంక్షన్ కు వెళ్లలేదు
Highlights
మగధీర 100 రోజుల ఫంక్షన్ కు ఎందుకు రాలేదో చెప్పేసిన రాజమౌళి
అల్లు అరవింద్ గారు ముందు అనుకున్న విధంగా చేయలేదు
100 రోజుల ఫంక్షన్ కు అరవింద్ గారి వల్లే రాలేదన్న జక్కన్న
బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికకి చెప్పిన రాజమౌలికి హిట్లు కొత్తకాదు. దేశంలో నెంబర్ వన్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా బాహుబలి రికార్డులకెక్కినా... రాజమౌళి ప్రతీ సినిమా హిట్టే. వాటిలో అల్లు అరవింద్ నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
అయితే.. మగధీర చిత్ర వంద రోజుల వేడుకకు జక్కన్న రాజమౌళి హాజరు కాలేదు. హుబలి కంటే ముందు 2009లోనే రాజమౌళి తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం 'మగధీర'. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్. ఆ సందర్భంలో ఓ వైపు మగధీర విజయాన్ని మెగా ఫ్యామిలీ, అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో... కొన్ని రూమర్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. సినిమా విజయానికి ప్రధాన కారణమైన రాజమౌళిని మెగా ఫ్యామిలీ పక్కన పెట్టేసిందని, సినిమా విజయంలో ఆయన ప్రాధాన్యతను కావాలనే పంచుకోవడం లేదనే వార్తలు వచ్చాయి.
అప్పట్లో మగధీర విజయానికి కారణం రాజమౌళి కాదు.. రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ ఇమేజే కారణం అనేలా సీన్ క్రేయేట్ చేయడంతో... హర్టైన రాజమౌళి కావాలనే ‘ఈగ'ను పెట్టి సినిమా తీసి తన సత్తా చాటుకున్నారని అప్పట్లో జనం పుంఖాను పుంఖాలుగా మాట్లాడేసుకున్నారు. రాసేశారు. అయితే మగధీరపై వచ్చిన ఈ వార్తలపై రాజమౌళి తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో వివరంగా మాట్లాడారు.
అసలు మగధీర సక్సెస్ లో తనకు క్రెడిట్ ఇవ్వకపోవడం అంటూ ఏమీలేదని రాజమౌలి స్పష్టం చేశారు. మగధీర యాభై రోజులు ఆడిన తరువాత నేను, చరణ్ గుర్రంపై రైడ్ చేస్తున్న పోస్టర్ డిజైన్ చేయించారు. అరవింద్గారు ఆ పోస్టర్ చూపించారు. కనిపించడం ఇష్టమే కానీ, మరీ అంత వద్దు అని చెప్పాను. అయినా వినకుండా వేయించారు. సక్సెస్లో నాకు క్రెడిట్ ఇవ్వకపోవడం అనే మాటేమీ లేదు. అది వాస్తవం కాదు అని రాజమౌళి తెలిపారు.
మగధీరకు ముందు.. సినిమాలు వంద రోజులు ఆడినా ఆడకపోయినా.. థియేటర్ల సంఖ్య పెంచేసి.. ఆ నెంబర్ ప్రకటించేవారు. అన్ని సినిమాలకూ ఇలాగే చేసేవారు. నాకేమో అలా నచ్చేది కాదు. ‘సింహాద్రి' సినిమా సరిగ్గా గుర్తులేదు కానీ చాలా థియేటర్లలో వంద రోజులు ఆడింది. అది జెన్యూన్. చాలా ఆనందపడ్డాం. అక్కడితో ఆగకుండా 175 డేస్ కూడా ఆడించాలని చెప్పి 15 థియేటర్లలో ఆడితే, మరో 15 థియేటర్లలో ఆడించారు. నాకది చాలా ఇబ్బందిగా ఉండేది. ‘సింహాద్రి' సినిమాకే కాదు, అన్ని సినిమాలకూ, అందరి హీరోలకూ ఇలానే ఉండేది.
నేను అరవింద్గారితో సినిమా మొదలుపెట్టినపుడు ఈ విషయాన్నే చర్చించాం. ‘అలాంటి ప్రకటనలకు మనం దూరంగా ఉందాం సార్' అన్నాను. ఆయన ‘ఓకే డన్' అన్నారు. కానీ.. మేము ముందుగా పరస్పరం అనుకున్నది ఒకటి.. అల్లు అరవింద్ గారు చేసింది మరొకటి. 100 డేస్ థియేటర్స్ పెంచడం మొదలుపెట్టారు. అప్పుడు నేను అరవింద్గారి దగ్గరికి వెళ్లి.. ‘‘మనం అలాంటి ప్రకటనలు వద్దనుకున్నాం కదా'' అనడిగాను. అప్పుడాయన ‘నాకూ ఆపేయాలనే ఉంది రాజమౌళీ.. కానీ, ఫ్యాన్స్ తో చాలా ఇబ్బందిగా ఉంది. మాకుండే డెలికేట్ ఇష్యూస్ నీకు తెలియదు' అన్నారు, ఆయన అలా చేయడం నాకు నచ్చలేదు అని రాజమౌళి వివరించారు.
అందుకే అల్లు అరవింద్ గారు చేసిన దానికి కోపంతో ‘100 డేస్ ఫంక్షన్కు రాలేను' అని చెప్పాను. ‘నువ్వు రాకపోతే సిట్యుయేషన్ ఎలా ఉంటుందో తెలుసా' అన్నారు. నాకర్థమయింది కానీ రాలేను అని చెప్పాను. తప్ప గొడవలేం రాలేదు. వేరే ప్రొడ్యూసర్తోనైతే అంతవరకు కూడా రాదు. అరవింద్గారు అంత చనువు ఇచ్చారు కాబట్టే మాట్లాడాను అని రాజమౌళి తాజాగా ఆర్కే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Last Updated 25, Mar 2018, 11:40 PM IST | 0business
|
Jakarta, First Published 27, Aug 2018, 11:25 AM IST
Highlights
ఆసియా క్రీడల్లో హైదరబాదీ స్టార్ షట్లర్ సైనా అనుకున్న రీతిలో రాణించలేకపోయింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సైనా బ్యాడ్మింటన్ సెమి ఫైనల్లో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది.
ఆసియా క్రీడల్లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటమిపాలయ్యింది. స్వర్ణమే లక్ష్యంగా ఇండోనేషియాలో అడుగుపెట్టిన ఈ టాప్ ఇండియన్ ప్లేయర్ కేవలం కాంస్యంతో వెనుదిరగాల్సి వచ్చింది.
ఇవాళ జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమిఫైనల్లో హైదరాబాదీ షట్లర్ సైనా ఘోర పరాజయ్యాన్ని చవిచూసింది. చైనా క్రీడాకారిణి తైజ్ ఇంగ్ చేతిలో 2-0 తేడాతో సైనా ఓడిపోయింది. దీంతో ఈ ఈవెంట్ నుండి వైదొలగిన సైనా కేవలం కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
హోరాహోరీగా జరుగుతుందనుకున్న మ్యాచ్ లో సైనా భారత అభిమానులను నిరుత్సాహ పర్చింది. మొదటి రౌండ్ ను 17-21 తో కోల్పోయిన సైనా సెకండ్ రౌండ్ లో కూడా అదే ఆటతీరును కనబర్చింది. దీంతో 14-21 తేడాతో సెకండ్ రౌండ్ ను కూడా కోల్పోయి 2-0 తేడాతో పరాజయం పాలయ్యింది. ఈ మ్యాచ్ లో వరల్డ్ నెంబర్ వన్ తైజు ఇంగ్ చక్కటి ఆటతీరుతో, సైనా కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయాన్ని కైవసం చేసుకుంది.
ఈ కాంస్యంతో భారత పతకాల సంఖ్య 37 కు చేరింది.ఇందులో 7 స్వర్ణాలు, 10 సిల్వర్, 20 కాంస్య పతకాలున్నాయి.
Last Updated 9, Sep 2018, 1:12 PM IST | 2sports
|
పింక్ ప్రాక్టీస్ మొదలైంది
- ఇండోర్లో భారత్ గులాబీ సాధన
ఇండోర్ : తొలి డే నైట్ టెస్టు కోసం టీమ్ ఇండియా ముందుగానే సిద్ధమవుతోంది. నవంబర్ 24 నుంచి కోల్కత ఈడెన్ గార్డెన్స్లో భారత్, బంగ్లాదేశ్ తమ తొలి డే నైట్ టెస్టు ఆడనున్నాయి. గులాబీ బంతి మ్యాచ్కు ముందు భారత్ రెండు రోజుల ప్రాక్టీస్ సమయం మాత్రమే ఉంది. అందుకే ఇండోర్లో తొలి టెస్టుకు ముందు నుంచే కోహ్లిసేన పింక్ బాల్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. సాధారణంగా ప్రాక్టీస్ సెషన్లకు మూడు నెట్స్ను సిద్ధం చేస్తారు. భారత జట్టు అభ్యర్థన మేరకు ఇండోర్లో నల్లని తెరలతో, ఫ్లడ్లైట్ల వెలుతురులో ఓ నెట్స్ను మైదాన సిబ్బంది ఏర్పాటు చేశారు. త్రో డౌన్స్ నిపుణుడు రాఘవేంద్ర పర్యవేక్షణలో తొలుత కెప్టెన్ విరాట్ కోహ్లి గులాబీ బంతి సాధన చేశాడు. పింక్ బాల్పై విరాట్ సౌకర్యవంతంగా కనిపించాడు. గులాబీ బంతి సాధన తర్వాత రెగ్యులర్ ఎస్జీ ఎర్ర బంతితో కోహ్లి సాధన కొనసాగింది. కెప్టెన్ కోహ్లి తర్వాత చతేశ్వర్ పుజార, అజింక్య రహానె, శుభ్మన్ గిల్ గులాబీ బంతిని ఎదుర్కొన్నారు. బెంగళూర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో టెస్టు స్పెషలిస్టులు పుజార, రహానె, శుభ్మన్ల కోసం ద్రవిడ్ పర్యవేక్షణలో పింక్ బాల్ ప్రాక్టీస్ జరిగిన సంగతి తెలిసిందే. భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు ఇండోర్ వేదికగా గురువారం నుంచి ఆరంభం కానుంది
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 2sports
|
Mar 08,2017
మళ్లీ అపర కుబేరుడు అంబానీయే!
ముంబయి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు ప్రక్రియ భారత్లో సామాన్యులతో పాటు సంపన్నులను కూడా ప్రభావితం చేసిందని హురున్ గ్లోబల్ రిచ్ సంస్థ పేర్కొంది. సర్కారు చేపట్టిన నోట్ల రద్దు కారణంగా భారత్లోని కుబేరుల సంపద తరగిపోయినట్టుగా తెలిపింది. దీంతో 11 మంది కుబేరులు బిలియనీర్ల హోదాను కోల్పోయినట్టుగా హురున్ వివరించింది. భారత సంతతకి చెందిన దాదాపు 132 కుబేరుల జాబితాలను హురున్ గ్లోబల్ రిచ్ వెల్లడించింది. వీరి సంపద బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్టుగా తెలిపింది. పెద్దనోట్ల రద్దుతో పాటు సర్కారు చేపట్టిన సంస్కరణల కారణంగా సంపన్నుల సంపద కొంత తగ్గినట్టుగా సంస్థ ఎండీ చీఫ్ రీసర్చర్ అనస్ రహమాన్ జునైద్ తెలిపారు. ఈ జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భారత్లోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. మొత్తం రూ.1,75,400 కోట్ల (26 బిలియన్ల) సంపదతో అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. మరోవైపు దాదాపు రూ.1,01,000 కోట్లు (14 బిలియన్లు) సంపదతో ఎస్.పి.హిందుజా కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. రూ.99,000 కోట్ల సంపదతో సన్ఫార్మా అధినేత దిలిప్ సంఘ్వీ మూడో స్థానంలో నిలిచారు. నాలుగో స్థానాన్ని ఫలోంజీ మిస్త్రీ (రూ.82,700 కోట్ల) దక్కించుకున్నారు. మొత్తం జాబితాలో 1.9 బిలియన్ డాలర్ల సంపదతో కిరణ్ మజూందార్ షా ఒకరే ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
sumalatha 125 Views cricket , doping , prithvi shah , sports
Prithvi Shaw
ముంబయి: టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషాకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన అతడిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. 8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో భాగంగా ఇండోర్లో మ్యాచ్ ఆడుతుండగా అతడికి డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ముంబయి క్రికెట్ సంఘం అనుబంధ ఆటగాడైన పృథ్వీషా నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్టు తేలింది. షా మూత్రం నమూనాల్లో ఖటర్బుటలైన్గ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కమిటీ బీసీసీఐ ఏడీఆర్ ఆర్టికల్ 2.1 ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/ | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Bigg Boss 3: ‘వెయిటింగ్ ఓవర్ నాన్నా.. థాంక్యూ రా చైతూ’: నాగ్కి చైతూ వెల్కమ్
నాగార్జున హోస్ట్ చేస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సీజన్ 1కి ఎన్టీఆర్, సీజన్ 2కి నాని హోస్ట్లుగా వ్యవహరించగా.. సీజన్ 3కి నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో ఈ రియాలిటీ షోపై ప్రేక్షకుల్లో అమితాసక్తి ఏర్పడింది.
Samayam Telugu | Updated:
Jul 21, 2019, 04:53PM IST
మరికొన్ని గంటల్లో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 బుల్లి తెరపై సందడి చేయనుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్.. నేటి (జూలై) రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. ఇక ఈ షో ప్రసారానికి ముందే వివాదాలు చుట్టేయడంతో హాట్ టాపిక్గా మారింది. బిగ్ బాస్ షో అంటే వివాదం.. వివాదమే ఈ షోకి పెట్టుబడి అన్నట్టుగా ప్రసారానికి ముందే బిగ్ బాస్ను వరుస వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఒక వైపు బిగ్ బాస్ ఆడిషన్స్ కంప్లీట్ చేసి చివరి క్షణంలో దగాపడ్డ కంటెస్టెంట్స్ యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తాలు ఢిల్లీ స్థాయిలో బిగ్ బాస్ను ప్రసారం కాకుండా అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అయితే వీరికి న్యాయం జరుగుతుందా? బిగ్ బాస్ యాజమాన్యం స్పందిస్తుందా? లాంటి విషయాలను పక్కన పెడితే.. ఈ ఇద్దరు కాంట్రివర్శి సెలబ్రిటీల ద్వారా బిగ్ బాస్కు విపరీతమైన హైప్ వచ్చేసింది.
సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తరువాత ఆ స్థాయిలో కాంట్రివర్శి పర్శనాలిటీస్గా ఉన్న శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తాలు బిగ్ బాస్పై యుద్ధం ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటూ.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అనేవారు లేకపోలేదు. వ్యూహం ఏదైనా మొత్తానికికైతే ఈ ఇద్దరి వల్ల బిగ్ బాస్కి మోయలేనంత ప్రీ పబ్లిసిటీ వచ్చేసింది. కొన్ని కోట్ల ఖర్చు పెట్టిన ఈ రేంజ్లో పబ్లిసిటీ రాదనేది వాస్తవం.
ఇదిలా ఉంటే.. అనేవి వివాదాలు, విమర్శలు, ధర్నాలు, అరెస్టులతో నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం నేటి రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ ముందు చేసే హంగామా అంతా బిగ్ బాస్కి చూపిస్తున్నారు నాగార్జున అభిమానులు. ఇప్పటికే అక్కినేని ఫ్యాన్స్ ‘బాస్’ నాగార్జునకి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ట్వీట్ల మోత మోగిస్తుండగా.. నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్య సైతం ట్వీట్ వదిలారు.
‘వెయిటింగ్ ఓవర్.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వచ్చేసింది’.. అంటూ ట్వీట్ చేశారు. దీనిపై బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున స్పందిస్తూ.. ‘థాంక్స్ రా’ అని రిప్లై ఇచ్చారు. కాగా.. నేటి రాత్రి ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఎపిసోడ్లో కింగ్ నాగార్జున ఎంట్రీ ఓ రేంజ్లో ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
The wait is over for the Biggest Reality Show!!! #BiggBossTelugu3 with @iamnagarjuna Starting Today at 9 PM on… https://t.co/AljQBzUKpz
— chaitanya akkineni (@chay_akkineni) 1563699857000 | 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
1996లో నా వల్లే జయలలిత ఓడిపోయారు : రజినీకాంత్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళి అర్పించేందుకు నడిగర్ సంఘం ఏర్పాటు చేసిన సంతాప సభలో...
TNN | Updated:
Dec 11, 2016, 11:22PM IST
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళి అర్పించేందుకు నడిగర్ సంఘం ( సౌతిండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) ఏర్పాటు చేసిన సంతాప సభలో పాల్గొన్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆమె గురించి చెబుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జయలలితకు వున్న ఉన్నతమైన వ్యక్తిత్వం, గొప్పతనం గురించి చెబుతూ.. "1996లో నా వల్లే జయలలిత ఓటమిపాలయ్యారని.. అయినా అదేమీ మనసులో పెట్టుకోకుండా నా కూతురు పెళ్లికి హాజరై నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు" అని అన్నారు రజినీకాంత్.
చెన్నైలో ఆదివారం జరిగిన ఈ సంతాప సభలో జయలలితని తమిళ సినీపరిశ్రమ స్మరించుకున్న సందర్భంలో ఆమె గురించి మాట్లాడిన రజినీకాంత్... 1996లో తనకు, ఆమెకు మధ్య జరిగిన కొన్ని అనుభవాలని సభ్యులతో పంచుకున్నారు. అప్పటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తాను ఓటర్లని ఉద్దేశించి మాట్లాడుతూ... "జయలలితకు మళ్లీ ఓటేసి అధికారంలోకి తీసుకువస్తే, ఇక తమిళనాడుని ఆ దేవుడు కూడా కాపాడలేడు" అని ఆమెకు వ్యతిరేకంగా తాను చేసిన ప్రచారాన్ని రజినీ గుర్తుచేసుకున్నారు. | 0business
|
ఆర్సిఎ అధ్యక్షుడిగా సిపి జోషి
లలిత్ మోడీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భారీ అవకతవకలకు పాల్పడిన లలిత్ మోడీ కొన్నేళ్ల కిందటే భారత్ నుంచి పారిపోయిన సంగతి తెలి సిందే. ప్రస్తుతం అతను లండల్లో తలదాచుకుం టున్నాడు. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్ని కల్లో (ఐపిఎల్) మాజీ కమిషనర్ లలిత్ మోడీకి చుక్కెదురైంది. ఆర్సిఓ అధ్యక్షుడిగా పోటీ చేసిన లలిత్ మోడీ తనయుడు రుచిర్ మోడీ ఓటమి పాలయ్యాడు. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్య క్షపదవి కోసం మే 29న ఎన్నికలు నిర్వహించారు. కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం వెల్లడైన ఆర్సిఓ ఎన్నికల ఫలి తాల్లో లలిత్ మోడీ ప్రత్యర్థి కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడైన సిపి జోషి అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. లలిత్మోడీ తనయుడు రుచిర్ మోడీపై ఆయన విజయం సాధించాడు. అధ్యక్ష ఎన్నికల్లో జోషి 19ఓట్లు సాధించగా, రుచిర్ మోడీకి కేవలం 14ఓట్లు మాత్రమే పోలయ్యాయి.దీంతో 5ఓట్ల తేడాతో సిపిజోషి గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే ఆర్సిఎ కార్యదర్శి, కోశాధికారి పదవులు మాత్రం లలిత్ మోడీ అనుయాయులకే దక్కడం గమనార్హం. రాజస్థాన్ క్రికెట్ అసోసి యేషన్ సెక్రటరీగా రాజేంద్ర నందు, ట్రెజరర్గా పింకేశ్ జైన్లు ఎన్నికయ్యారు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
CSK: చెన్నై సూపర్ కింగ్స్కి ‘యో-యో’ టెస్టు లేదు..!
ఐపీఎల్ 2018లో.. చెన్నై జట్టులో టాప్ స్కోరర్గా నిలిచిన అంబటి రాయుడు.. ఐపీఎల్ తర్వాత టీమిండియాకి ఆడే ముందు యో-యో టెస్టుని నిర్వహించగా. .అందులో ఫెయిలవడం గమనార్హం.
Samayam Telugu | Updated:
Mar 22, 2019, 11:36AM IST
CSK: చెన్నై సూపర్ కింగ్స్కి ‘యో-యో’ టెస్టు లేదు..!
హైలైట్స్
శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్లు మొదలు
తొలి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ
గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ని ‘డాడీ ఆర్మీ’గా ఎగతాళి
అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. టైటిల్ గెలిచిన చెన్నై
ఐపీఎల్లో అన్ని టీమ్స్తో పోలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టైలే వేరు..! మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో రెండేళ్ల నిషేధానికి గురై.. గత ఏడాది ఐపీఎల్లోకి పునరాగమనం చేసిన చెన్నై జట్టుని అందరూ ‘డాడీ ఆర్మీ’ అని ఎగతాళి చేశారు. జట్టులోని ఆటగాళ్ల వయసు సరాసరి 30 ఉండటమే దీనికి కారణం. కానీ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ గత ఏడాది ఫైనల్కి చేరిన చెన్నై.. ఏకంగా టైటిల్ను ఎగరేసుకుపోయింది.
ఐపీఎల్ 2019 సీజన్ పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి..!
ఐపీఎల్ 2018 సీజన్లో అన్ని జట్ల ఫ్రాంఛైజీలు తమ టీమ్లోని ఆటగాళ్లకి ‘యో-యో’ ఫిట్నెస్ టెస్టుని నిర్వహిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం.. ఫిట్నెస్ ఒక్కటే ముఖ్యం కాదంటూ ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా తుది జట్టులో చోటిచ్చింది. ఐపీఎల్ 2019 సీజన్లో కూడా అదే సూత్రాన్ని తాము అనుసరించనున్నట్లు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు. టీమిండియా తరఫున క్రికెటర్ మ్యాచ్ ఆడాలంటే యో-యో ఫిట్నెస్ టెస్టులో పాసవడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది చెన్నై జట్టులో టాప్ స్కోరర్గా నిలిచిన అంబటి రాయుడు.. ఐపీఎల్ తర్వాత టీమిండియాకి ఆడేందుకు ఈ టెస్టుని నిర్వహించగా. .అందులో ఫెయిలవడం గమనార్హం.
‘చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సన్నద్ధతలలో యో-యో ఫిట్నెస్ టెస్టుని చేర్చబోం. ఆటగాళ్లలో వేగం, ఫిట్నెస్ పెంచేందుకు మా పద్ధతులు మాకు ఉన్నాయి. అయితే.. ఈ పద్ధతులు కేవలం చెన్నై జట్టుకే పరిమితం. ఐపీఎల్ మ్యాచ్ల కోసం క్రికెటర్లు ఎంత ఫిట్గా ఉండాలో మాకు అవగాహన ఉంది. ఆ స్థాయిని జట్టు మొత్తం అందుకుంది కూడా. ప్రస్తుతం టీమ్లో వరల్డ్ క్లాస్ ఫిజియో, ట్రైనర్ ఉన్నాడు. అందుకే.. మేము ప్రత్యేకంగా యో-యో టెస్టు కోసం సమయాన్ని వృథా చేయదల్చుకోలేదు’ అని ఫ్లెమింగ్ వెల్లడించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
షమీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భార్య ఫిర్యాదుతో షమీతో పాటూ మరో నలుగురిపైనా కేసులు నమోదయ్యాయి. షమీపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లలో కొన్ని నాన్బెయిలబుల్వి కాగా... మరొకొన్నింటిలో పదేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది.
TNN | Updated:
Mar 9, 2018, 04:27PM IST
షమీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భార్య ఫిర్యాదుతో షమీతో పాటూ మరో నలుగురిపైనా కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. షమీపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లలో కొన్ని నాన్ బెయిల్ బుల్ వి కాగా... మరొకొన్నింటిలో పదేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది. షమీ తనను బాగా టార్చర్ పెట్టేవాడని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. | 2sports
|
Vaani Pushpa 110 Views careless playing , future , RISHAB PANT
Rishabh pant
న్యూఢిల్లీ: భారత క్రికెట్లోకి తారాజువ్వలా దూసుకొచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భవితవ్యం డైలమాలో పడినట్లే కనబడుతోంది. ఇటీవల కాలంలో పంత్ నిర్లక్ష్యంగా ఆడటంతో పాటు ఒకే తరహాలో ఔట్ కావడం టీమిండియా మేనేజ్మెంట్కు సవాల్గా మారింది. ఎంఎస్ ధోనికి సరైన ప్రత్యామ్నాయం రిషబ్ పంత్ అని భావించినా అది కాస్తా మూన్నాళ్ల ముచ్చటే అయినట్లు తెలుస్తోంది. మళ్లీ దేశవాళీ టోర్నీలో పంత్ తానేంటో నిరూపించుకునే వరకు అతికి అవకాశాలు ఇవ్వకూడదనే యోచనలో మేనేజ్మెంట్ ఉంది. ప్రపంచకప్ నుంచి ఇప్పటివరకు చూస్తే ఆడిన ఏ ఒక్క ఇన్నింగ్స్ కూడా భారత్ మేనేజ్మెంట్కు సంతృప్తినివ్వలేదు అయినా పంత్లో సత్తాను దృష్టిలో పెట్టుకుని దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో అవకాశం కల్పించారు. అక్కడ కూడా పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బదులు మళ్లీ నిర్లక్ష్యమే కనిపించింది. ప్రత్యర్థి బౌలర్లు ఊరిస్తూ వేస్తున్న బంతులకు పంత్ భారీ షాట్లకు పోయి వికెట్లు సమర్పించుకుంటున్నాడు. దాంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్కు పంత్ను పక్కకు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటివరకు పంత్కు అండగా నిలిచిన కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలు సైతం అతన్ని కొన్నేళ్లు పక్కన పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సఫారీలతో టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టులో పంత్ను ఆడించి చూద్దామని సెలెక్టర్లు అనుకున్నప్పటికీ అందుకు కోహ్లీ, రవిశాస్త్రిలు వద్దనే చెప్పారట. పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహాకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/ | 2sports
|
షకీబ్, దీపక్ వాట్సప్ సందేశాలు బహిర్గతం
- మద్దతుగా షకీబ్ అభిమానుల మానవహారం
ఢాకా: బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్-అల్-హసన్, భారత బుకీ దీపక్ అగర్వాల్ మధ్య జరిగిన వాట్సప్ సందేశాలు బహిర్గతమయ్యాయి. ఓ వ్యక్తి ద్వారా షకీబ్ ఫోన్ నంబర్ను సంపాదించిన దీపక్ పలుసార్లు వాట్సప్లో మెసేజ్లు పంపి 2017 బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్(బిపిఎల్) సందర్భంగా నవంబర్లో తొలిసారి ఫోన్లో సంప్రదించాడు. ఆ తర్వాత 2018 జనవరిలో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరీస్కు కెప్టెన్గా ఎంపికైనందుకు షకీబ్కు అభినందనలు తెలుపుతూ జనవరి 19న దీపక్ మెసేజ్ చేశాడు. 'మనం ఇప్పుడు కలిసి పనిచేద్దామా లేక ఐపిఎల్ వరకు వేచి ఉండాలా?' అని ఆ సందేశంలో అడిగాడు. ఇక్కడ 'పనిచేద్దామా' అనే పదం ఆ సిరీస్లో బంగ్లా జట్టు అంతర్గత ప్రణాళిక సమాచారాన్ని తెలుసుకోవడమే అర్ధంలో ఐసిసి విచారణ అధికారులు భావించారు. అలాగే జనవరి 23న 'బ్రో ఈ సిరీస్లో ఏమైనా ఉందా?' అని మెసేజ్ చేశాడు. ఇక ఐపిఎల్ సందర్భంగా ఏప్రిల్ 26న సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు సంబంధించిన సమాచారం ఇవ్వాలని మరోసారి దీపక్ అడిగాడు. ఈ సందర్భంగా వారి మధ్య బిల్కాయిన్స్, డాలర్ అకౌంట్స్ సమాచారంపై సంభాషణలు జరిగాయి. అయితే, షకీబ్ మాత్రం దీపక్ను వ్యక్తిగతంగా కలిసేందుకు ఆసక్తి చూపించాడు. అప్పుడు జరిగిన సంభాషణ మొత్తం డిలీట్ అయ్యిందని, అందులో జట్టు అంతర్గత సమాచారం ఇవ్వాలని దీపక్ కోరినట్లు షకీబ్ విచారణ అధికారుల వద్ద అంగీకరించాడు.
షకీబ్ సొంతపట్టణమైన మగురాలో దాదాపు 700మందితో మానవహారం నిర్మించి, నిరసన వ్యక్తం చేశారని పోలీసులు తెలిపారు. 'నిరసనకారులు నినాదాలు చేస్తూ హైవేపై పాదయాత్ర చేశారు. ఐసిసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మానవహారం నిర్మించారు' అని పోలీస్ అధికారి సైఫుల్ ఇస్లాం తెలిపారు.
షకీబ్కు బంగ్లా ఆటగాళ్ల మద్దతు
ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్ జట్టు వికెట్ కీపర్ ముష్ఫ్రికర్ రహీమ్, పేస్ బౌలర్ మొర్తాజాలు షకీబ్కు మద్దతుగా నిలిచారు. అంతేగాక వీరు బుధవారం ఓ భావోద్వేగపూరిత పోస్టులనూ పెట్టారు. '18ఏళ్ల పాటు కలిసి ఆడాం. మైదానంలో నువ్వు లేకుండా ఆడటాన్ని ఊహించుకోవడం బాధగా ఉంది. ఛాంపియన్గా మళ్ళీ తిరిగి వస్తావని ఆశిస్తున్నా... నీకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. అలాగే దేశం మద్దతు కూడా ఉంటుంది. ధైర్యంగా ఉండు' అని ముష్ఫికర్ పోస్ట్లో పేర్కొన్నాడు. ఇక మొర్తాజా అయితే... షకీబ్పై జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కచ్చితంగా తనకు కొన్ని రాత్రులు నిద్రపట్టదని, అతని సారథ్యంలో 2023 ప్రపంచకప్ ఫైనల్ ఆడతామనే ఆశతో నిద్రిస్తానని భావోద్వేగంతో చెప్పాడు. బంగ్లాదేశ్ క్రికెట్బోర్డు, ప్రధాని హసీనా సైతం మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 2sports
|
Jul 22,2018
హెచ్డీఎఫ్సీకి బంపర్ లాభాలు!
న్యూఢిల్లీ: మార్కెట్ వాటా పరంగా దేశంలో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకింగ్ సంస్థగా వెలుగొందుతున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి అదరగొట్టే అర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలానికి బ్యాంక్ నికర లాభం 18.2 శాతం మేర ఎగిసి రూ.4,601.44 కోట్లకు చేరువైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.3,893.84 కోట్లుగా నమోదు అయింది. జూన్ త్రైమాసికంలో బ్యాంక్ బ్యాంకు నికర వడ్డీపై ఆదాయం (ఎన్ఐఐ) 15.40 శాతం పెరిగి రూ.10,813.57 కోట్లకు చేరువైంది. అంతకు ముందు ఏడాది తొలి త్రైమాసికంలో సంస్థలో రూ.9,370.74 కోట్ల ఎన్ఐఐని నమోదు చేసింది. జూన్ త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం 18.8 శాతం మేర పెరిగి రూ.22,185 కోట్ల నుంచి రూ.26,367 కోట్లకు చేరుకుంది. గత జూన్ ముగింపు నాటికి బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 1.33 శాతానికి పెరిగాయి. ఇంతక్రితం మార్చి త్రైమాసికం నాటికి ఇవి 1.30 శాతంగా నమోదు అయ్యాయి. గత త్రైమాసికంలో బ్యాంక్ మొండి బాకీల కోసం రూ.1,629.37 కోట్ల కేటాయింపులు జరిపింది. ఇంతక్రితం జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.1,541 కోట్ల ప్రొవిజన్స్ ఏర్పాటు చేసింది. 2018 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో నికర నిరర్ధక ఆస్తులు 0.40 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదేత్రైమాసికంలో 0.44 శాతంగా నికర ఎన్పీఏలు నమోదయ్యాయి. శుక్రవారం బీఎస్ఈలో ఈ బ్యాంకు షేర్ 0.20 శాతం పెరిగి రూ.2190 వద్ద ముగిసింది. మొదటి త్రైమాసికం ముగింపు నాటికి బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 20 శాతం మేర పెరిగి రూ.8.05 లక్షలకు చేరుకున్నట్టుగా బ్యాంక్ తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి | 1entertainment
|
బిగ్ బాస్2: హౌస్ లోకి తేజస్వి, శ్యామల కాదు.. నూతన్ నాయుడు రీఎంట్రీ
Highlights
ఊహించని విధంగా నూతన్ నాయుడు హౌస్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈరోజు ఎపిసోడ్ లో నాని ఇదే విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. హౌస్ లోకి వచ్చిన రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ కు సోషల్ మీడియాలో అభిమానులు బాగా పెరిగారు.
బిగ్ బాస్ సీజన్ లో ఏదైనా జరగొచ్చు అంటూ ట్యాగ్ లైన్ కు తగ్గట్లే హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తేజస్వి ఉన్నంత వరకు ఏదొక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఆమె వెళ్లిన తరువాత హౌస్ కొంచెం కూల్ అయిందన్న సమయంలో అందరూ కలిసి కౌశల్ ను టార్గెట్ చేసిన విషయాలు వివాదానికి దారి తీశాయి. అది కూడా సద్దుమణిగింది అనుకునేలోపు బాబు గోగినేని, గీతామాధురిని టార్గెట్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది.
ఆయన మాటల కారణంగా గీతామాధురి బాధ పడి కంటతడి పెట్టుకుంది. అయినా.. బాబు గోగినేని మాత్రం గీతాను, కౌశల్ ను ఇంటి నుండి ఎలా పంపాలా అనే ఆలోచిస్తున్నారు. ఇక హౌస్ లో రీఎంట్రీగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఆరుగురిలో ఒకరిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్. ముందుగా తేజస్విని హౌస్ లోకి తీసుకురావడం కోసం ఇలా చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఆన్ లైన్ పోల్ లో శ్యామలకు ఎక్కువ ఓట్లు వస్తుండడంతో ఆమె రీఎంట్రీ ఇస్తుందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఊహించని విధంగా నూతన్ నాయుడు హౌస్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈరోజు ఎపిసోడ్ లో నాని ఇదే విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. హౌస్ లోకి వచ్చిన రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ కు సోషల్ మీడియాలో అభిమానులు బాగా పెరిగారు. ఆయన కూడా అదే ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగించుకొని ఎక్కువ ఓట్లు సాధించారని సమాచారం. మరి ఆయన రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి!
Last Updated 30, Jul 2018, 12:16 PM IST | 0business
|
May 14,2016
హైదరాబాద్ చేరిన అతిపెద్ద లోహ పక్షి !
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా విమానం 'ఏఎన్-225 మైరియా' హైదరాబాద్లో శుక్రవారం సందడి చేసింది. గురువారం రాత్రి నగరంలోని జీఎంఆర్ విమానాశ్రయానికి చేరుకున్న ఈ భారీ లోహ విహంగానికి జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. యుక్రేన్ 'యాంటోనోవ్ ఎయిర్లైన్స్'కు చెందిన ఈ భారీ లోహ పక్షి ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి వెళ్లే మార్గంలో భాగంగా హైదరాబాద్లో ల్యాండ్ అయింది. ఇక్కడ 24 గంటల విరామం తీసుకున్న తరువాత ఇది తన మిగతా ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు మలేషియాలోని జకార్తకు పయనం కానుంది. ఈ భారీ విమానం ప్రత్యేకతలేంటంటే ఆరు సూపర్ ఛార్జ్డ్ టర్బో ఇంజిన్లతో ఈ భారీ లోహ విహంగం గాలిలో ఎగురుతుంది. ఈ విమానం ఇంధన సామర్థ్యం 3,00,000 కిలో లీటర్లు, గరిష్ట వేగం గంటకు 850 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. గరిష్ట పరిధి 15,400 కి.మీ. వెడల్పు 276 అడుగులు, వింగ్స్పాన్ 290 అడుగులు కాగా ఎత్తు దాదాపు 60 అడుగులు. 36 టైర్ల సాయంతో ఇది పరుగులు పెడుతుంది. ఇది ఏక కాలంలోగరిష్టంగా 6,40,000 కిలోల సరకును రవాణా చేయగలదు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Visit Site
Recommended byColombia
అయితే తాను లస్ట్ స్టోరీస్ రీమేక్ను డైరెక్ట్ చేయనని చెప్పానని అన్నారు. తనకు లస్ట్, సెక్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ అంటే ఆసక్తి లేదని పేర్కొ్న్నారు. అయితే త్వరలో ఓ వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ‘మరో ఐదేళ్లలో నేను ఓ వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేస్తాను. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. కొందరు స్నేహితుల నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్. దీనిని నేను సినిమాగా తీయలేను. ఎందుకంటే సెన్సార్ బోర్డు విడుదల చేయడానికి ఒప్పుకోదు’ అని తెలిపారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా టీ సిరీస్ నిర్మి్స్తున్న ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
READ ALSO: Me Too: రేప్ చేసినోడు దర్జాగా తిరుగుతున్నాడు: బాలీవుడ్ నటి
ఇక లస్ట్ స్టోరీస్ రీమేక్ విషయానికొస్తే ఈ నందినీ రెడ్డి, తరుణ్ భాస్కర్ కూడా డైరెక్ట్ చేయబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. దీనిపై నందినీ రెడ్డి స్పందిస్తూ.. అందులో నిజం లేదని అన్నారు. ఆల్రెడీ సబ్ టైటిల్స్ ఉన్న వెబ్ సిరీస్ని మళ్లీ రీమేక్ చేయడమేంటని అన్నారు. రీమేక్లో అమలా పాల్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు గాసిప్స్ వినిపించాయి. అయితే లస్ట్ స్టోరీస్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంతకీ ఈ లస్ట్ స్టోరీస్ కాన్సెప్ట్ ఏంటంటే.. లస్ట్ అంటే సెక్స్ కోసం తహతహలాడటం. అలాగని ఇది పెద్ద తప్పు పదం ఏమీ కాదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కోరుకునేదే. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. అయితే మహిళలకు కూడా సెక్సువల్ ప్లెజర్ అనేది ఉంటుంది అని, వారికీ విభిన్నమైన లవ్ స్టోరీస్ ఉంటాయని తెలియజేయడానికి ఈ కాన్సెప్ట్ను ఎంచుకున్నారు. | 0business
|
బ్రెజిల్ vs మెక్సికో.. హాట్ పాయింట్స్ (వీడియో)
Highlights
బ్రెజిల్ vs మెక్సికో.. హాట్ పాయింట్స్
2018 ఫిఫా వరల్డ్కప్ హాట్ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్.. తన స్ధాయికి తగ్గ ప్రదర్శనను చేసింది.. సోమవారం మెక్సికోతో జరిగిన మ్యాచ్లో 2-0 తేడాతో విజయం సాధించింది. స్టార్ ఆటగాడు నెయ్మర్ మరోసారి మెరిశాడు.. మ్యాచ్కు ముందు సాధారణంగా కనిపించిన బ్రెజిల్ క్షణక్షణానికి రాటుదేలింది. గోల్ పోస్ట్ను లక్ష్యంగా చేసుకుని బ్రెజిల్ ఆటగాళ్లు రెచ్చిపోయారు.. 51వ నిమిషంలో నెయిమర్, 88వ నిమిషంలో ఫిర్మినో చెరో గోల్ సాధించి.. జట్టుకు విజయతీరాలకు చేర్చారు.
ఇక ఈ మ్యాచ్తో నమోదైన రికార్డులు చూస్తే:
* ప్రపంచకప్లో అత్యధిక గోల్స్ సాధించిన ఘనత బ్రెజిల్దే(228). ఈ మ్యాచ్కు ముందు జర్మనీతో సమానంగా ఉన్న బ్రెజిల్ రెండు గోల్స్ కొట్టి నెంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
* ఈ టోర్నీలో బ్రెజిల్ 2-0 తేడాతో గెలవడం ఇది మూడోసారి..
* ఈ టోర్నీలో అత్యధిక టార్గెట్ షాట్స్ కొట్టిన జట్టు(48)
* ఫిఫా వరల్డ్ కప్లలో రెండవ అర్థభాగంలో తొమ్మిది గోల్స్ కొట్టిన జట్టు.. నిన్న నేయిమర్ కొట్టిన గోల్స్తో బ్రెజిల్ ఈ ఘనత సాధించింది.
* ప్రపంచకప్లలో 38 షాట్స్లలో నేయిమర్ 6 గోల్స్ కొట్టాడు.. మెస్సీ 67, రోనాల్డో 74 గోల్స్లతో అతని కంటే ముందున్నారు,
* సబ్స్టిట్యూట్గా వచ్చి గోల్ కొట్టిన ఫిర్మినో.. 2016లో బోలివియాతో జరిగిన మ్యాచ్ తర్వాత కొట్టిన మొదటి గోల్..
" | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
టీ20 లీగ్ నుంచి అర్జున్ తెందుల్కర్ ఔట్..!
ముంబయి పరిధిలోని యువ క్రికెటర్లని వెలుగులోకి తెచ్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా ఆరంభిస్తున్న ‘ముంబయి టీ20 లీగ్’
TNN | Updated:
Mar 2, 2018, 01:41PM IST
టీ20 లీగ్ నుంచి అర్జున్ తెందుల్కర్ ఔట్..!
ముంబయి పరిధిలోని యువ క్రికెటర్లని వెలుగులోకి తెచ్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా ఆరంభిస్తున్న ‘ముంబయి టీ20 లీగ్’ నుంచి సచిన్ తెందుల్కర్ కుమారుడు అర్జున్ తెందుల్కర్ అనూహ్యంగా తప్పుకున్నాడు. ఈ లీగ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తన తండ్రి సచిన్ తెందుల్కర్‌ సూచన మేరకే అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. మంబయి అండర్-19 జట్టులో ఇటీవల చోటు సంపాదించిన అర్జున్.. బ్యాటింగ్‌ కంటే బౌలింగ్‌లోనే మెరుగ్గా రాణిస్తున్నాడు.
కోచ్ అతుల్ గైక్వాడ్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న అర్జున్‌.. ఇటీవల తన బౌలింగ్‌ శైలిని కొద్దిగా మార్చుకున్నాడట. దీంతో.. ఆ శైలిని గమనించిన సచిన్.. మరికొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలని సూచిస్తూనే.. శైలికి అలవాటుపడేవరకూ ఏ లీగ్ ఆడకుండా ఉండాలని చెప్పాడట. తండ్రి సూచన మేరకు.. తాజాగా టీ20 లీగ్‌ నుంచి అర్జున్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11 నుంచి 21 వరకు ముంబయి లీగ్ జరగనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
sandhya 296 Views SRI vs ENG , World Cup 2019
SRI vs ENG
లీడ్స్: ప్రపంచకప్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు ఆరంభమైంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆఫ్గనిస్తాన్తో మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. లంకపై గెలుపొంది సెమీస్కు ముందడుగు వేయాలని మోర్గాన్సేన భావిస్తుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/ | 2sports
|
ఇంగ్లాండ్-కొలంబియా మ్యాచ్ హైలెట్స్
Highlights
ఇంగ్లాండ్-కొలంబియా మ్యాచ్ హైలెట్స్
* 2006 తర్వాత ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లో గెలవడం ఇదే తొలిసారి
* మేజర్ టోర్నమెంట్లలో పెనాల్టీ షూట్ అవుట్లలో గెలవడం ఇంగ్లాండ్కు ఇది రెండవసారి.. 1996 యూరో కప్లో భాగంగా స్పెయిన్పై పెనాల్టీ షూట్ అవుట్ల ద్వారానే గెలిచింది.
* ఆడిన నాలుగు నాకౌట్ మ్యాచ్ల్లో కొలంబియా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది.
* ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ కేన్ ఆ జట్టు తరపున వరుసగా ఆరుసార్లు గోల్స్ సాధించిన క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడు. ఇంతకు ముందు 1939లో టామీలాటన్ ఈ ఘనత సాధించాడు.
" | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ధోనీ 9,999.. కోహ్లీకి ఆ పరుగు కనబడలేదా..?
వాస్తవానికి ఇప్పటికే 332 వన్డేలాడిన ధోని 10,173 పరుగులు చేశాడు. కానీ.. ఇందులో భారత్ తరఫున ఆడి చేసిన పరుగులు మాత్రం 9,999.
Samayam Telugu | Updated:
Nov 2, 2018, 05:57PM IST
వెస్టిండీస్తో తిరువనంతపురం వేదికగా గురువారం ముగిసిన ఐదో వన్డేలో ధోనీ 10,000 పరుగుల మైలురాయిని అందుకోనివ్వకుండా కోహ్లీనే ఉద్దేశపూర్వంగా అడ్డుపడ్డాడని ట్విట్టర్లో అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ సిరీస్లోనే మూడు శతకాలు సాధించడంతో పాటు వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ.. ప్రస్తుతం 9,999 పరుగులతో రికార్డుకి అడుగు దూరంలో ఉన్న ధోనీకి మాత్రం ఆ ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
గురువారం 47 ఓవర్లలోనే ముగిసిన ఐదో వన్డేలో బౌలర్లు రవీంద్ర జడేజా (4/34), బుమ్రా (2/11), ఖలీల్ (2/29) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటవగా.. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (63 నాటౌట్: 56 బంతుల్లో 5x4, 4x6), విరాట్ కోహ్లి (33 నాటౌట్: 29 బంతుల్లో 6x4) దూకుడుగా ఆడటంతో టీమిండియా 14.5 ఓవర్లలోనే 105/1తో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. ఐదో వన్డేల ఈ సిరీస్ని భారత్ జట్టు 3-1తో చేజిక్కించుకోగా.. వైజాగ్ వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే.
@bhogleharsha He should have been sent out to open today. Wonder why Kohli did not bestow the honour to Dhoni. He needed just one run.!
— S.K.Nataraj (@SKNataraj1) 1541085573000 | 2sports
|
Visit Site
Recommended byColombia
రాహుల్, పాండ్యాలు మ్యాచ్ విన్నర్లు అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచ కప్ నెగ్గాలంటే పాండ్యా, రాహుల్ లాంటి ఆటగాళ్ల సేవలు జట్టుకు చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. వారు చేసింది ముమ్మాటికే తప్పేనని, కానీ పరిస్థితులకు అనుగుణంగా టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ వ్యవహరించాలన్నాడు. ప్రపంచ కప్ లాంటి కీలకమైన సందర్భాలలో కఠిన నిర్ణయాలు తగదన్నాడు. రాహుల్, పాండ్యాలు మ్యాచ్ విన్నర్లు.. వారిని త్వరలో జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.
కాగా, త్వరలోనే ఓ ప్రత్యేక కమిటీతో విచారణ చేయించి.. ఆ తర్వాత రాహుల్, హార్దిక్ పాండ్యాలపై శిక్షని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తాము చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో తమను క్షమించాలని, మరోసారి ఇలాంటి తప్పులు చేయమన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే వీరిని బీసీసీఐ, సీఓఏలు స్వదేశానికి రప్పించాయి. తొలి వన్డేలో ఓడిన టీమిండియా, మంగళవారం జరిగిన రెండో వన్డేలో విజయంతో 1-1తో సిరీస్ సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 18న మెల్బోర్న్లో జరగనుంది.
In Videos: జట్టుకు పాండ్యా, రాహుల్ అవసరం: శ్రీశాంత్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Recommended byColombia
వితికా, వరుణ్ రొమాన్స్..
ఇక బిగ్ బాస్ రొమాంటిక్ జంట వితికా-వరుణ్లు ఎప్పటిలాగే ఒకే బెడ్పై ముచ్చట్ల మొదలుపెట్టారు. వరుణ్ గుండెలపై వాలి.. రొమాంటిక్గా వరుణ్కి దగ్గరగా ఉండటంతో ముద్దు ముచ్చట్లు మొదలుపెట్టారు. ఇక పక్కనే ఉన్న రాహుల్.. మీ మధ్య నేను ఎందుకు అని మెల్లగా సైడ్ కావడంతో మరింత దగ్గరయ్యారు వరుణ్, వితికా.
ఇక వరుణ్.. వితికాను దగ్గరకు తీసుకుని బుజ్జీ బంగారం అంటూ ముచ్చట్లు చెబుతూ శ్రీముఖితో సరదాగా ఉండని సలహా ఇచ్చాడు. నేను మామూలుగానే ఉంటున్నానని.. అయితే ఆమె తనను నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్స్ నాకు నచ్చకపోవడంతో ఆమెతో ఫ్రీగా మూవ్ కాలేకపోతున్నానంటూ గారం చేసింది. దీంతో ఓకే బంగారం అంటూ ఆమె నుదిటిపై ఓ ముద్దు పెట్టి బుజ్జగించారు. వితికా భర్త గుండెలపై వాలిపోయింది.
నాలుగో వారం ఎలిమినేషన్.. జంటగా మంట
బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారం ఎలిమినేషన్ కాస్త డిఫరెంట్గా జరిగాయి. ఒక్కొక్కరూ ఒక్కో పేరు చెప్పడం కాకుండా.. ఇద్దరిద్దర్ని పిలిపించి మీ ఇద్దరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారంటూ డిఫరెంట్గా నామినేషన్స్ మొదలుపెట్టారు. అయితే శ్రీముఖి ఇప్పటికే బిగ్ బాస్ వేసిన శిక్షకు గానూ నామినేషన్లో ఉంది. పునర్నవి, అలీలకు ఎలిమినేషన్ నుండి మినహాయింపు లభించింది.
ఎవరెవరు వెళ్లారు.. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..
తొలిత రవి, వితికా జంటగా వెళ్లగా.. రవిని వితికా రిక్వెస్ట్ చేయడంతో తనకు తానుగా నామినేట్ అయ్యాడు రవి. గత వారంలో టాస్క్లో తాను చేసిన తప్పుకు గాను తాను నామినేట్ అయినట్టు తెలిపారు రవి. రవి నామినేట్ కావడంతో వితికా సేఫ్ అయ్యింది. రవి నామినేట్ అయ్యారు.
రోహిణి, శివ జ్యోతి... జంటగా వెళ్లగా ఇద్దరి మధ్య అండర్స్టాడింగ్తో శివజ్యోతి నామినేట్ కాగా.. రోహిణి సేఫ్ అయ్యింది
వరుణ్, మహేష్.. జోడీగా వెళ్లగా ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో నేనంటే నేను సేఫ్ అవుతా అని పోటీ పడతారు. చివరికి వరుణ్ సేఫ్ కావడానికి ఒప్పుకోవడంతో మహేష్ సేఫ్ అవుతున్నట్టు ప్రకటించారు. వరుణ్ నామినేట్ అయినా సేఫ్ అవుతాడని.. నేను నామినేట్ అయితే సేఫ్ అవుతానని నమ్మకం లేదని భయం ఉందని అందుకే వరుణ్ నామినేట్ అవుతాడని ప్రకటించారు.
బాబా భాస్కర్, అషు రెడ్డిలు జంటగా వెళ్లగా.. నేనే నామినేట్ అవుతా అని స్వచ్ఛందంగా ప్రకటించారు బాబా భాస్కర్. అయితే హౌస్లో ఏమి అవుతుందనే ఆసక్తితో వచ్చానని సో ఇప్పుడు నామినేట్ అయినా పర్లేదు. అషు రెడ్డి ఉంటే బాగుంటుందని అషు రెడ్డిని సేఫ్ చేస్తున్నా అన్నారు.
అయితే అషు రెడ్డి.. మీరు స్వచ్ఛందంగా నామినేట్ కాకపోయినా నేను చేసేదాన్నని మొహమాట పడకుండా కుండబద్దలు కొట్టేసింది. కిచెన్ టీమ్ విషయంలో ఆయన చెప్పిన సమాధానం నాకు చెప్పలేదని అందుకే ఆయన్ని నామినేట్ చేసేదాన్నని కారణం చెప్పింది అషు.
హిమజ, రాహుల్లు జంటగా వెళ్లగా.. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఇంట్రాక్ట్ అవుతాడని అందుకే తనకు నచ్చలేదని రాహుల్ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది హిమజ. దీంతో రాహుల్ నామినేట్ కాగా.. హిమజ సేఫ్ అయ్యింది.
మొత్తం జంటగా మొదలైన ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసే నాటికి రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్లు నాలుగో వారం ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. ఈ ఏడుగురులో ఒకరు ఈవారం ఎలిమినేట్ కాబోతున్నారు.
శివజ్యోతి, రోహిణిలకు బిగ్ బాస్ షాక్..
నామినేషన్స్ గురించి ఒకరితో ఒకరి సంభాషించకూడదని బిగ్ బాస్ పదే పదే హెచ్చరిస్తున్నా.. శివజ్యోతి, రోహిణిలు పట్టించుకోకుండా గుసగుసలాడటంతో బిగ్ బాస్ ఈ ఇద్దర్నీ హెచ్చరిస్తూ శిక్షవిధించారు. శివజ్యోతి నాలుగోవారం ఇప్పటికే నామినేట్ కావడంతో రోహిణిని డైరెక్ట్గా నామినేట్ చేశారు. ఈవారానికి కాకుండా.. వచ్చే వారానికి కూడా ఇద్దర్నీ డైరెక్ట్గా నామినేట్ చేసి షాక్ ఇచ్చారు బిగ్ బాస్.
బిగ్ బాస్ హౌస్లో బక్రీత్ సంబరాలు..
నేడు బక్రీత్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్లో సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు విషెష్ చెప్పుకుండా డాన్స్లతో హంగామా చేశారు. అంతకు మందు బిగ్ బాస్.. కంటెస్టెంట్స్కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఒక్కో కంటెస్టెంట్కి సంబంధించిన చిన్ననాటి ఫొటోలను, వారి ఫ్యామిలీ ఫొటోలను చూపించి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఒక్కసారి కుటుంబ సభ్యుల ఫోటోలను చూపించేసరికి భావోద్వేగంతో ఏడ్చేశారు కంటెస్టెంట్స్. అషు రెడ్డి తన తండ్రిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకోగా.. బిగ్ బాస్ కన్నీటి గంగ శివజ్యోతి చనిపోయిన తన తండ్రిని గుర్తుచేసుకుని నువ్ మళ్లీ నాకే పుట్టాలి. ఎందుకంటే నీను ఇక్కడ ఇలా ఉన్నానంటే నువ్ కనడం వల్లే అంటూ ఏడ్చేసింది. ఇక రోహిణి సైతం తన పేరెంట్స్ విడిపోయిన విషయం.. తన తల్లి పడ్డ కష్టాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
మొత్తంగా నేటి ఎపిసోడ్లో ఎలిమినేషన్ రంజుగా సాగడంతో పాటు.. పండుగ వాతావరణంతో సందడిగా సాగింది. ఇక రేపు కెప్టెన్ టాస్క్ ఉండటంతో ఫిజికల్ గేమ్లో పోటీ పడుతున్నారు. ఈ రచ్చ ఎలా ఉండబోతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
internet vaartha 219 Views
మూడు అల్ట్రామెగా ప్లాంట్ల వేలం
న్యూఢిల్లీ : విద్యుత్ పంపిణీ సంస్థల రుణ భారాన్ని పునర్వ్యవస్థీకరించి క్రమబద్ధీకరించేందుకు గాను కేంద్రంమూడు అల్ట్రామెగా పవర్ ప్రాజెక్టులను వేలం వేస్తోంది. తద్వారా రూ. 80వేల కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నది. బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ఈమూడు ప్లాంట్లను విక్రయించాలని నిర్ణయించింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉద§్ు స్కీంలో విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్కమ్లకు ఎదురవుతున్న భారీ రుణభారాన్ని తగ్గించేందుకు కేంద్రం కొంతమేర వీటిని ప్రైవేటు సంస్థలు వ్యక్తులకు వేలం వేస్తోంది. విద్యుత్ శాఖ కార్యదర్శి పికె పూజారి మాట్లాడుతూ బీహార్లోని బంకా, ఒడిశాలోని బేదభహల్, తమిళనాడులోని చెయ్యూరు ప్రాజెక్టులు వేలంకు వస్తున్నాయన్నారు. ఒక్కొక్క అల్ట్రామెగా పవర్ప్లాంట్ నాలుగువేల మెగా వాటా విద్యుత్ ఉత్పత్తికి కనీసం 20వేల కోట్లు పెట్టు బడులు అవసరం అవుతాయి. ఇటీవల క్రమబద్దీకరిస్తే ఈమొత్తం రూ.27 వేల కోట్లకు చేరింది. బొగ్గు, భూముల ధరలు పెరగడం వల్ల అంచనా వ్యయం కూడా పెరిగింది. విద్యుత్ మంత్రిత్వశాఖ చెయ్యూరు, ఒడిశాల్లోని బేదబహల్ ప్లాంట్లకు బిడ్లు గత ఏడాదే ప్రారంభించింది. అయితే ప్రైవేటురంగం నుంచి స్పందన అంతంతమాత్రంగా కనిపించడంతో మొదటివిడత బిడ్డింగ్ ఉపసంహరించుకుంది. అలాగే ప్రైవేటు సంస్థలకు కూడా ఈ ప్రాజెక్టులకు ఫైనాన్స్ సమీకరించుకోవడం సంక్లిష్టంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. బిడ్ డాక్యుమెంట్ల పరంగా ఒక్కొక్క అల్ట్రా మెగా పవర్ ప్లాంట్కు నిర్దిష్టంగా రూపొం దించామని, కేబినెట్ అనుమతికోసం వెళుతుంటామని చెప్పారు. ఇప్పటికే కేంద్ర విద్యుత్శాఖ రాష్ట్రాలతో ఒప్పం దాలు కూడా చేసుకుంది. రాస్ట్రాలు కూడా డిస్కమ్ల రుణభారం రూ.4.37 కోట్లలో సగం భరించేందుకు వీలుగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన(ఉద§్ు)కింద దేశంలోని 15 రాష్ట్రాలు ఇప్పటికే తమ అంగీకారం తెలిపాయి. బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తమతమ ఒప్పందాలను ప్రస్తుతం ఖరారు చేసుకుం టున్నాయి. ఈస్కీంలో మరో 20రోజుల్లోపు ఈ రాష్ట్రాలు కూడావచ్చిచేరతాయని విద్యుత్ కార్యదర్శి అంచనా వేసారు. ఈ అల్రామెగా పవర్ ప్రాజెక్టులస్థాపనకు ఆహ్వానించే బిడ్ల ద్వారా కేంద్రానికి కనీసం రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. థర్మల్ పవర్ప్లాంట్లకు రూ.9.3 లక్షల కోట్లువస్తుం డగా ట్రాన్స్మిషన్ప్రాజెక్టులకు 78,600 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ధరల ఆధా రిత పోటీ బిడ్డింగ్ ద్వారా ఈ ప్రాజెక్టులను అప్పగించడం వల్ల 75,900 కోట్లు దీన్దయాల్ గ్రామ్జ్యోతి యోజనకింద నిధులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్కీం కింద వ్యవసాయ ఫీడర్లను పట్టణ ప్రాంతాల ఫీడర్లనుంచి వేరుచేసి ప్రత్యేక ఫీడర్లద్వారా వ్యవసాయ రం గానికి సరఫరాచేయాలన్నది ప్రధానిమోడీ ఎన్డిఎప్రభుత్వం లక్ష్యంగా ఉంది. | 1entertainment
|
Hyd Internet 143 Views nadal
Nadal
లండన్: అనుకున్నదే అయ్యింది. మోకాలి గాయం కారణంగా టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఎటిపి ప్రపంచ టూర్ ఫైనల్స్ నుంచి ప్రపంచ నంబర్ వన్ రఫెల్ నాదల్ వైదొలిగాడు. లండన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం అర్థరాత్రి దాటాక జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో నాదల్ 6-7(5/7), 7-6(7/4), 4-6తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం) చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్లో ఓటమి అనంతరం టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు నాదల్ ప్రకటించాడు. | 2sports
|
Hyderabad, First Published 13, May 2019, 9:59 AM IST
Highlights
ఐపీఎల్ ఉత్కంఠ పోరులో అంతిమ విజయం ముంబయికే దక్కింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్-12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది.
ఐపీఎల్ ఉత్కంఠ పోరులో అంతిమ విజయం ముంబయికే దక్కింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్-12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన చెన్నై... ఒక్క పరుగు తేడాతో ట్రోఫీని చేజార్చుకుంది.
కాగా... ఈ విజయంపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ హర్ష వ్యక్తం చేశారు. ఈ కప్ అందుకోవడం ముంబయి కి ఇది నాలుగోసారి. ఈ సీజన్ విజయం తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఫైనల్ మ్యాచ్ లో బౌలర్ మలింగ ను రోహిత్ ఛాంపియన్ గా పేర్కొన్నాడు.
‘‘‘ముంబయి విజయం జట్టు అందరిది. ఈ టోర్నీలో బౌలర్లు గొప్పగా రాణించారు. కీలక సమయాల్లో సత్తా చాటారు. ఒక ఛాంపియన్ బౌలర్ ఏం చేయాలో మలింగ అదే చేశాడు. ఈ మ్యాచ్ ఛాంపియన్ అతనే. 20 ఓవర్ హార్దిక్ పాండ్యతో వేయిద్దాం అనుకున్నాం. కానీ ఇలాంటి పరిస్థితిల్లో ఎలా బౌలింగ్ చేయాలో మలింగకు బాగా తెలుసు. అందుకే అతనివైపు మొగ్గు చూపిచాను’’ అని రోహిత్ పేర్కొన్నారు.
Last Updated 13, May 2019, 9:59 AM IST | 2sports
|
bsnl recharges with cheapest plans
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లు
ప్రయివేటు టెల్కోలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ తన కొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూనే ఉంది. తాజాగా ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.
TNN | Updated:
Apr 1, 2018, 11:57AM IST
ప్రయివేటు టెల్కోలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ తన కొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూనే ఉంది. తాజాగా ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. చౌక ధరలో రూ.118 ప్రారంభ ప్యాక్గా, గరిష్ట విలువ రూ. 799 ప్లాన్లను ఆవిష్కరించింది. ఈ అన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో వినియోగదారులు రింగ్ బ్యాక్ టోన్ను ఉచితంగా అందిస్తోంది. కాగా ఇందులో కొన్ని ప్లాన్లను కొన్ని సర్కిళ్లకు పరిమితం చేసింది. తమిళనాడుకు రూ.118 ప్లాన్ను, కేరళల సర్కిళ్లకు రూ.379 ప్లాన్, రూ.551ప్లాన్ను అందిస్తుంది. వీటితో పాటు ఇంకా దేశవ్యాప్తంగా రూ.444 ప్లాన్, రూ.666 ప్లాన్, రూ.485 ప్లాన్, రూ.799లకు ప్లాన్లను ఆవిష్కరించింది. వీటిని దేశ వ్యాప్త అన్ని సర్కిళ్లలో అందిస్తుంది. కొద్ది పాటి మార్పులతో అన్ లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లను ఉచితంగా కల్పిస్తుంది. అదే విధంగా అత్యధిక మంది ఉపయోగిస్తున్న రూ.339 ప్లానులో కొన్ని మార్పులు చేసి అదనపు సౌకర్యాలను జోడించినట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. | 1entertainment
|
Mobile
మొబైల్ వ్యాలెట్లలో సొమ్ముకు బీమా
న్యూఢిల్లీ : డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకువీలుగా ప్రభు త్వం మనీవాలెట్లలో కస్టమర్ల సొమ్ముకు బీమా కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్కార్డులుకు జారీచేస్తున్న చందంగానే మనీవాలెట్ లావా దేవీలు, కస్టమర్ల సొమ్ముకు భద్రత కల్పించాలని చూస్తోంది. మొబైల్ వ్యాలెట్లు ముందుగా సొమ్ముకు బీమా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కస్టమర్ల సొమ్ముకు భద్రత ఉంటుందన్న విశ్వాసం పెంపొందుతుందని, సాంకేతిక సమస్యల్లో కూడా తమ సొమ్ము తిరిగి పొందగలమన్న దీమావ్యక్తం అవుతుందని ఐటి మంత్రిత్వ శాఖ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. ఎలాక్ట్రానిక్స్, ఐటి రంగ మంత్రిత్వశాఖ ఇందుకు సంబంధిµంచి విధివిధానాలు, నిబంధనలకు రూపకల్పన చేస్తోంది. ప్రభుత్వం సైబర్ చట్టాలను కూడా మరింత పటిష్టంచేసి సైబర్ లాబ్స్ ఏర్పాటుకు నిర్ణ యించింది. వీటిలో సాక్ష్యాలను క్రోడీకరించి పరిశీలి స్తారు. దీనివల్ల ఐటి ఆధారిత సాక్ష్యాలు కోర్టుల్లో కూడా ఒకేచేస్తాయి. ఐటిమంత్రిత్వశాఖ పరిధిలో ముందు వీటిపై చర్చలు కొనసాగుతున్నాయి. వీటికి తుదిరూపం ఇచ్చిన తర్వాత వెంటనే అమలుకు తెచ్చేందుకు కసరత్తులు పూర్తిచేస్తామని అన్నారు. ప్రతిజిల్లాలోను రెండులేదా మూడు సైబర్ ఫోరెన్సిక్ ప్రయోగశాలలను రూపొందించాలని నిర్ణయించింది. | 1entertainment
|
రూపాయి పతనం ప్లస్ చమురుతో పెరిగిన వాణిజ్యలోటు
Highlights
2014 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు అత్యధికంగా పెరుగడం మళ్లీ జూన్ నెలలోనే కావడం గమనార్హం. ముడి చమురు ధర పెరుగుదల, విదేశీ మారక ద్రవ్యంలో రూపాయి మారకం విలువ పతనం కూడా దీనికి కారణం.
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు జూన్లో 17.57 శాతం పెరిగి 27.7 బిలియన్ డాలర్లకు చేరాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్లో అధిక ముడి చమురు రేట్ల కారణంగా దిగుమతుల భారం పెరిగింది. వాణిజ్య లోటు మూడున్నరేళ్ల గరిష్ట స్థాయి 16.6 బిలియన్ డాలర్లకు చేరింది. 2014 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు ఈ స్థాయికి ఎగియడం ఇదే తొలిసారి. 2014 నవంబర్లో వాణిజ్య లోటు 16.86 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక గతేడాది జూన్లో ఇది 12.96 బిలియన్ డాలర్లు.
కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్లో దిగుమతులు 21.31 శాతం పెరిగి. 44.3 బిలియన్ డాలర్ల ఆదాయం పెరిగింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో చూసుకుంటే ఎగుమతులు 14.21 శాతం, దిగుమతులు 13.49 శాతం పెరిగాయి. ఎగుమతుల విలువ 82.47 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 127.41 బిలియన్ డాలర్లు. దీంతో మొత్తం మీద వాణిజ్య లోటు 44.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
జూన్లో అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు, వజ్రాభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. చమురు దిగుమతులు 56.61 శాతం ఎగిసి 12.73 బిలియన్ డాలర్లుగా ఉండగా, పసిడి దిగుమతులు మాత్రం 3 శాతం క్షీణించి 2.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు టెక్స్టైల్స్, లెదర్, మెరైన్ ఉత్పత్తులు, పౌల్ట్రీ, జీడిపప్పు, బియ్యం, కాఫీ తదితర ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి మందగించింది. దీనికి తోడు తాజాగా డాలర్తో పోటీ పడలేక రూపాయి రోజురోజుకు క్షీణిస్తుండడం కూడా దేశ వాణిజ్యంపై ప్రభావం కనబరుస్తోంది. దిగుమతులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించింది.
16 నుంచి ఐడీబీఐ సమ్మె
ఐడీబీఐ బ్యాంక్ అధికారులు కొందరు సోమవారం (జులై 16) నుంచి ఆరు రోజుల పాటు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. ఐడీబీఐ బ్యాంక్ అస్థిత్తాన్ని ప్రమాదంలో పడేస్తూ బ్యాంక్లో కీలకమైన 51 శాతం వాటాను జీవిత బీమా సంస్థకు (ఎల్ఐసీ) అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతోపాటు పాటు 2012 నవంబర్ నుంచి తమ వేతనాల సవరణ జరగనందుకు నిరసనగా కొందరు అధికారులు సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారని బ్యాంక్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
వేతన సవరణ విషయంలో గత ఏడాది ఒకసారి సమ్మె నోటీసు ఇచ్చినా బ్యాంకు మేనేజ్మెంట్ ఇచ్చిన హామీతో ఐడీబీఐ అధికారులు విరమించుకున్నారు. ఐడీబీఐ బ్యాంక్లో 51 శాతం వాటాను ఎల్ఐసీకి విక్రయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు 'ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్' ఇప్పటికే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి తాజాగా మరో వినతిపత్రం అందించింది.
Last Updated 14, Jul 2018, 12:35 PM IST | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నెగటివ్ రివ్యూలపై హీరోయిన్ ఫైర్!
అడల్ట్స్ ఓన్లీ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించిన ఓ సినీ నటికి తన సినిమాకు వచ్చిన నెగటివ్ రివ్యూలు కోపం తెప్పించాయి.
TNN | Updated:
Dec 1, 2017, 04:29PM IST
అడల్ట్స్ ఓన్లీ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించిన ఓ సినీ నటికి తన సినిమాకు వచ్చిన నెగటివ్ రివ్యూలు కోపం తెప్పించాయి. ఇంకేం.. ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా ఎలా రాసేస్తారు అంటూ రివ్యూయర్స్‌పై ఆగ్రహం వ్యక్తంచేసిందా హీరోయిన్. ఆమె ఎవరో కాదు.. జూలీ 2 సినిమాతో బాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన లక్ష్మీ రాయ్!
అవును, లక్ష్మీ రాయ్‌ని బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం చేసిన జూలీ 2 సినిమా ఆ ఫిలిం మేకర్స్‌కి తీరని నిరాశని మిగిల్చింది. సినిమా గురించి వచ్చిన నెగటివ్ రివ్యూలు లక్ష్మీ రాయ్‌కి మరింత నిరాశని మిగిల్చాయట. సినీ పరిశ్రమలో వున్న క్యాస్టింగ్ కోచ్ అనే అంశంపై ఇంతకు ముందు ఎవ్వరూ చెప్పని రహస్యాల్ని, చీకటి కోణాల్ని ధైర్యంగా బహిర్గతం చేసిన సినిమా ఇది. కానీ అటువంటివేవీ పట్టించుకోకుండా పర్సనల్ మేటర్స్‌ని ప్రస్తావిస్తూ నెగటివ్ రివ్యూలు రాశారు అంటూ ఫిలిం జర్నలిస్టులపై ఆగ్రహాన్ని వెళ్లగక్కింది లక్ష్మీ రాయ్! | 0business
|
'నాపేరు సూర్య'కు టాక్ తో సంబంధమే లేదు!
Highlights
మూడు రోజుల్లో ఈ సినిమా వసూలు చేసిన మొత్తం సుమారుగా రూ.85.32 కోట్ల రూపాయలు. తొలివారంలో మూడు భాషల్లో కలిపి ఇంత మొత్తాన్ని రాబట్టింది
అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ హిట్ అవుతుందనుకున్న సినిమాకు కాస్త మిశ్రమ స్పందన లభించింది. కథ, కథనాలను సరిగ్గా నడిపించలేకపోయారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సినిమా టాక్ కు సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజుల్లో ఈ సినిమా వసూలు చేసిన మొత్తం సుమారుగా రూ.85.32 కోట్ల రూపాయలు. తొలివారంలో మూడు భాషల్లో కలిపి ఇంత మొత్తాన్ని రాబట్టింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.
మొదటిరోజు అంతంత మాత్రంగానే నడించిన ఈ సినిమా అమెరికాలో రెండో రోజు 5 లక్షల డాలర్లను వసూలు చేసింది. మొదటిసారిగా ఈ సినిమాలో బన్నీ యాంగ్రీ ఆర్మీ మ్యాన్ గా కనిపించాడు. మిగిలినవాటితో పోలిస్తే సినిమాకు బన్నీ నటన హైలైట్ గా నిలిచింది. తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు బన్నీ. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అను ఎమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటించింది.
Last Updated 7, May 2018, 3:28 PM IST | 0business
|
Dubai - United Arab Emirates, First Published 23, Aug 2018, 3:47 PM IST
Highlights
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మళ్లీ నంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో కోహ్లీ తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ట్రెంట్బ్రిడ్జ్లో ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో విరాట్ పరుగుల వరద సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్ లో 97 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 103 పరుగులు సాధించడంతో టెస్ట్ ర్యాంకుల్లో తిరిగి అగ్రస్థానాన్నిచేరుకున్నాడు.
దుబాయ్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మళ్లీ నంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో కోహ్లీ తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ట్రెంట్బ్రిడ్జ్లో ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో విరాట్ పరుగుల వరద సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్ లో 97 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 103 పరుగులు సాధించడంతో టెస్ట్ ర్యాంకుల్లో తిరిగి అగ్రస్థానాన్నిచేరుకున్నాడు.
ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టు అనంతరం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో కోహ్లీ మొదటిసారి టెస్టుల్లో నంబర్వన్ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత లార్డ్స్లో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో రెండో స్థానానికి పడిపోయాడు.
తాజాగా ట్రెంట్బ్రిడ్జ్లో చేసిన పరుగులకు గాను కోహ్లీ తిరిగి నంబర్వన్గా నిలిచాడు. 937 పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.... ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 929 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. కోహ్లీ టెస్టు కెరీర్లోనే ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 11వ స్థానంలో నిలిచాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో కోహ్లీయే నెంబర్ వన్
మరోక భారత ఆటగాడు పుజారా టాప్ టెన్ లో స్థానం సాధించాడు. 6వ స్థానంలో పుజారా నిలవగా....రహానె 19వ స్థానంలోనూ శిఖర్ ధావన్ 22వ స్థానంలో నిలిచారు. హార్థిక్ పాండ్య 8 స్థానాలను ఎగబాకి 51వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే రవీంద్ర జడేజా 3వ స్థానంలోనే కొనసాగుతుండగా... ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమి కాస్త దిగజారి 7, 22 ర్యాంకుల్లో నిలిచారు. బౌలర్ల జాబితాలో కూడా పాండ్య కెరీర్లోనే అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించి తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఏకంగా 23 స్థానాలు ఎగబాకి 51వ స్థానంలో నిలిచాడు. ఇక ఆల్రౌండర్ల జాబితాలో కూడా పాండ్య 27 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకును దక్కించుకున్నాడు.
Last Updated 9, Sep 2018, 1:52 PM IST | 2sports
|
Hyderabad, First Published 4, Nov 2018, 4:55 PM IST
Highlights
తెలుగులో రెడీ అవుతోన్న మోహన్ లాల్ ఫాంటసీ థ్రిల్లర్..!
మలయాళం సినిమా మార్కెట్ 100కోట్లుందా అని అందరికి తెలిసేలా పలుసార్లు గుర్తు చేసిన నటుడు మోహన్ లాల్. కంప్లీట్ యాక్టర్ గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ కథానాయకుడు ఏ సినిమా చేసిన అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది. ప్రస్తుతం మోహన్ లాల్ ఒడియాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్ డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించనున్నాడు. ఆకారాలు మార్చే ఒక మృగంలా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇకపోతే సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దగ్గుబాటి క్రియేషన్స్ పై సంపత్ కుమార్ అభిరాం సినిమా హక్కులను డీసెంట్ ఎమౌంట్ కి అందుకున్నారు.
డిసెంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా మలయాళంతో పాటు తెలుగు ఒడియ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఫాంటసీ థ్రిల్లర్ లో రానున్న ఈ సినిమా స్థాయి పెరిగేలా ఎన్టీఆర్ తో సినిమాలో వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారని తెలుస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ తో మోహన్ లాల్ నటించిన సంగతి తెలిసిందే.
Last Updated 4, Nov 2018, 4:55 PM IST | 0business
|
Apr 07,2017
ఇండియన్ బ్యాంకు సీఈవోగా కిషోర్ కారత్
చెన్నయ్ : ఇండియన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కిషోర్ కారత్ బాధ్యతలు స్వీకరించారు. 2017 ఏప్రిల్ 4 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు ఆ బ్యాంకు తెలిపింది. దీనికి ముందు ఆయన ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్ సీఎండిగా పనిచేశారు. ఐడీబీఐలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి ప్రొపెషనల్ కెరిర్ ప్రారంభించిన కారత్ బ్యాంకింగ్ రంగంలో సుధీర్ఘ అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం ఐబీఏ స్టాండింగ్ కమిటీ రిస్క్ మేనేజిమెంట్, బాసెల్ ఇప్లిమెంటేషన్ ప్రత్యామ్నాయ చైర్మెన్గా కిషోర్ కొనసాగుతున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ బ్యాంకింగ్ కమిటీ సభ్యునిగా కూడా ఉన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
Hyderabad, First Published 29, Jun 2019, 9:35 AM IST
Highlights
యంగ్ హీరోయిన్ సందీప్ కిషన్ ఓ ఆకతాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోటో పెట్టి ఫేక్ ప్రొఫైల్స్ సృష్టిస్తూ పలువురు అమ్మాయిలను వేధిస్తోన్న ఆకతాయిపై మండిపడ్డాడు.
యంగ్ హీరోయిన్ సందీప్ కిషన్ ఓ ఆకతాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోటో పెట్టి ఫేక్ ప్రొఫైల్స్ సృష్టిస్తూ పలువురు అమ్మాయిలను వేధిస్తోన్న ఆకతాయిపై మండిపడ్డాడు. ఫేస్ బుక్ లో సందీప్ కిషన్ పేరిట అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్ లు పెడుతూ దూషిస్తున్నాడని సందీప్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని అభిమానులను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. ''నాకు రోజూ స్నేహితుల నుండి ఫోన్లు వస్తున్నాయి. ఓ వ్యక్తి నా ఫోటో పెట్టి ఫేస్ బుక్ లో ఫేక్ ఖాతాను సృష్టించాడట. ఆడపిల్లలకు అసభ్యకర మెసేజ్ లు పంపుతూ దూషిస్తున్నాడు. వెరిఫైడ్ అకౌంట్ నుండి కాకుండా నా ఫోటోలు ఉన్న మరే ఖాతాల నుండి వచ్చే సందేశాలకు మీరు స్పందించవద్దని వేడుకుంటున్నాను. అలాంటివారితో జాగ్రత్తగా ఉండండి'' అని రాసుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేనే' అనే హారర్, థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సందీప్ కిషన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. | 0business
|
Jan 09,2018
నేడు ఎన్ఎండిసిలో వాటా విక్రయం
ముంబయి : దేశంలోనే అతిపెద్ద ముడి ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు ఎన్ఎండిసిలో మంగళవారం 1.5 శాతం వాటాను ప్రభుత్వం ఉపసంహరిం చుకోనుంది. ఈక్విటీ కనీస ధర రూ.153.50గా నిర్ణయించింది. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్ఎస్) ద్వారా ప్రభుత్వం ఈ వాటాను ఉపసంహరించుకోనుంది. తొలి రోజు ఇన్స్ట్యూషనల్ ఇన్వెస్టర్స్కు అవకాశం కల్పించగా, బుధవారం రిటైల్ ఇన్వెస్టర్లకు ఈక్విటీలను కేటాయించనుంది. ఈ 1.5 శాతం వాటా విక్రయం ద్వారా రూ.750 కోట్లు సమీకరించుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మా క్లాస్లో చెత్త స్టూడెంట్ని నేనే: అల్లు అర్జున్
బెంగళూరులోని నాగార్జున కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన ‘ఐక్య ఫీస్టా 2018’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Samayam Telugu | Updated:
Oct 28, 2018, 04:44PM IST
మా క్లాస్లో చెత్త స్టూడెంట్ని నేనే: అల్లు అర్జున్
కాలేజీలో చదువుకున్న రోజుల్లో క్లాస్లో చెత్త స్టూడెంట్ని తానేనని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. చదువులో అందరి కంటే వెనకుండే తాను.. సాంస్కృతిక కార్యక్రమాలు అనేసరికి అందరికంటే ముందుండేవాడినని చెప్పారు. పాడటం, డ్యాన్స్ చేయడం, సంగీత వాయిద్యాలను వాయించడం ఇలా ప్రతి కల్చరర్ యాక్టివిటీలో పాల్గొనేవాడినని తెలిపారు. అయితే విద్య అనేది అందరికీ ఎంతో అవసరమని, విద్యార్థి దశలో వినోదంతో పాటు చదువునూ కొనసాగించాలని చెప్పారు. దేన్నీ తక్కువగా చూడకూడదని సూచించారు. బెంగళూరులోని నాగార్జున కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన ‘ఐక్య ఫీస్టా 2018’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తమ కాలేజీలో జరిగే కార్యక్రమానికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా రావడంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు. అల్లు అర్జున్ మాట్లాడుతున్నంత సేపు విద్యార్థులు అరుపులు, కేకలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం అల్లు అర్జున్ను సత్కరించింది. అల్లు అర్జున్ సత్కారంతో ప్రారంభమైన కార్యక్రమం ఆయన ప్రసంగంతో ముగిసింది. కాగా, ‘ఐక్య ఫీస్టా 2018’లో భాగంగా వివిధ అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రంలోని 50 కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు.
ముగింపు కార్యక్రమానికి అల్లు అర్జున్తో శాండిల్వుడ్ సీనియర్ నటుడు రమేష్ అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్కు కర్ణాటకలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ తెలుగు వారు కూడా అధికంగా ఉండటంతో బన్నీకి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలుసుకుని వారంతా అక్కడికి చేరుకుని సందడి చేశారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Visit Site
Recommended byColombia
‘విరాట్ కోహ్లీ అత్యుత్తమంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా జట్టు ఛేజింగ్కి దిగిన సమయంలో అతను బాదుతున్న శతకాలు అసాధారణం. క్రికెట్లో సచిన్తో పాటు ఎవరికీ సాధ్యంకాని రీతిలో విరాట్ కోహ్లి అనితర రికార్డుల్ని సొంతం చేసుకున్నాడు. మా తరంలో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా అత్యుత్తమ క్రికెటర్లు.. ప్రస్తుత క్రికెట్లో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్ ఆ స్థాయి ఆటగాళ్లు. వీరిద్దరి మధ్య పోలిక తేవడం చాలా కష్టం. ఆటపై విరాట్ కోహ్లీ అంకితభావం నాకు బాగా నచ్చుతుంది. మరో పదేళ్లు కోహ్లి క్రికెట్ ఆడగలిగితే.. దిగ్గజ క్రికెటర్ సచిన్ సరసన అతను నిలబడతాడు’ అని షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. వన్డే ఫార్మాట్లో టీమిండియా ఛేదనకు దిగిన సమయంలో విరాట్ కోహ్లి ఇప్పటికే 19 శతకాలు బాదగా.. సచిన్ టెండూల్కర్ 17 సెంచరీలే చేశాడు. వన్డే కెరీర్లో సచిన్ మొత్తం 51 సెంచరీలు నమోదు చేయగా.. కోహ్లి 35 శతకాలతో అతనికి చేరువ అవుతున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyderabad, First Published 25, Sep 2018, 12:23 PM IST
Highlights
బిగ్ బాస్ సీజన్ 2 లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మరో ఆరు రోజుల్లో సీజన్ 2 విజేత ఎవరనేది తేలిపోనుంది.
బిగ్ బాస్ సీజన్ 2 లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మరో ఆరు రోజుల్లో సీజన్ 2 విజేత ఎవరనేది తేలిపోనుంది. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో తమతో పాటు ఎవరు ఫినాలేకి రావాలనుకుంటున్నారో.. అలానే ఎవరు ఫినాలేకి అర్హులు కారో చెప్పాలని బిగ్ బాస్ సూచించారు.
ఈ టాస్క్ పూర్తయిన తరువాత హౌస్ లోకి 'నన్ను దోచుకుందువటే' టీమ్ వచ్చి సందడి చేసింది. వారు వెళ్లిపోయిన తరువాత దీప్తి, గీతామాధురి కూర్చొని ఏదో చర్చించుకుంటుండగా.. మధ్యలోకి కౌశల్ వచ్చాడు.
'నేను లేకపోతే అసలు టాస్క్ లో ఫైటింగ్స్ ఉండవు కదా..' అంటూ చాలా గర్వంగా చెప్పగా.. దానికి గీతా, దీప్తిలు.. మీరు లేకపోయినా.. టాస్క్ లలో గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయంటూ అతడు సంచాలకుడిగా వ్యవహరించినప్పుడు, అలానే మంచి-చెడు టాస్క్ లలో గొడవలు జరిగిన సందర్భాలను గుర్తు చేశారు. అలానే కెప్టెన్సీ టాస్క్ లో గీతా, బాబు గోగినేనిల మధ్య గొడవని గుర్తు చేయగా.. అది నావల్లే కదా జరిగింది అంటూ మళ్లీ మధ్యలోకి ఎంటర్ అయ్యి ఏదో చెప్పబోయిన కౌశల్ తో క్లారిటీగా ఆ గొడవ జరిగింది కాదని దీప్తి, గీతాలు అన్నారు.
ఈ విషయాలను సామ్రాట్ వద్ద ప్రస్తావించగా.. అతడితో అసలు మాట్లాడడం మానేస్తే మంచిదని సూచించాడు. దానికి దీప్తి 'మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి మాట్లాడితే ఎలా రియాక్ట్ అవ్వకుండా ఉంటామంటూ' వెల్లడించింది.
ఇవి కూడా చదవండి.. | 0business
|
Hyd Internet 103 Views Team India
Team India
కొలంబో: భారత్ శ్రీలంకతో ఆదివారం ఐదవ వన్డే మ్యాచ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మూడు టెస్టుల్లో, ఐదు వన్డేల్లో శ్రీలంకను చిత్తుచేసిన
టీమిండియా జట్టు బుధవారం జరగబోయే ఏకైక టీ20 పై దృష్టి పెట్టింది. ఈ మ్యాచ్కు టీమిండియా శ్రీలంక వీధుల్లో అభిమానులతో కలిసి క్రికెట్
ఆడుతున్నారు. భారత జట్టు సారథి కోహ్లి మాత్రం గల్లీ క్రికెట్ ఆడుతూ అభిమానులను అలరించాడు. ఆయన కుడి చేతి బ్యాట్స్మెన్ అయినప్పటికి
ఎడమ చేతితో కూడా ఆడే సామర్ధ్యం కోహ్లికి ఉందని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
జల్లికట్టు మద్దతుదారులు ఇప్పుడేమంటారు?
జై జల్లికట్టు అన్న సెలబ్రిటీలు, హీరోలు, నేతలు, నాయకులకు ఆర్జీవీ మళ్లీ కౌంటర్ ఇచ్చారు.
| Updated:
Jan 23, 2017, 09:44AM IST
ఆదివారం తమిళనాడులో ప్రభుత్వ అనుమతితో అధికారికంగా నిర్వహించిన జల్లికట్టులో ఇద్దరు మృతి చెందగా, దాదాపు 130 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జల్లికట్టులో చోటుచేసుకుంటున్న హింసపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ స్పందించారు. ఆటవిక ఆట జల్లికట్టులో ప్రజలు చనిపోవడం, గాయపడంపై జై జల్లికట్టు అన్న వాళ్లంతా ఏమంటారని ప్రశ్నించారు.
‘‘జల్లికట్టులో ఇద్దరు చనిపోయారు. 129మంది గాయపడ్డారు. జల్లికట్టు మద్దతుదారులు ఇప్పుడేమంటారు? చెప్పండి..చెప్పండి..చెప్పండి..మేమంతా వింటున్నాం’’ అంటూ ట్వీట్ చేశారు.
Two died and 129 injured in Jallikattu event ..So what will the #JaiJallikattu supporters now say? Tell Tell Tell ..We all are listening
— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2017
ఆటవిక ఆటపై దేవుడికి కూడా ఇష్టం లేదని వ్యాఖ్యానించి ఆర్జీవీ..ఈ ఆటపై దేవుడికి కూడా కోపం వచ్చిందని...ఈ ఆటకు ముగింపు పలకాలని ఆకాంక్షించారు.
నోరులేని మూగ జీవాలను హింసించడం సరైందే అయితే ఆల్ ఖైదా తీవ్రవాదులు కూడా తలలు నరకం కరెక్టేనని ఆర్జీవీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
జల్లికట్టు ఆటను నిరసిస్తూ రచయిత సిరాశ్రీ రాసిన కవితను ఆర్జీవీ ట్యాగ్ చేశారు.
Brilliantly written by @sirasri ..A must read for every heartless Jallikattu supporter to understand the pain they are uplifting https://t.co/KDhzTr0Qif | 0business
|
Warner
వార్నర్ మెరుపు ఇన్నింగ్స్
మెల్బోర్న్: పాకిస్థాన్తో ఇక్కడ జరుగుతున్న రెండవ టెస్టులో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ వీర విహారం చేశాడు.కాగా వార్నర్ మెరుపు శతకం 143 బంతులుఆడి 17 బౌండరీలు, 1 సిక్సర్తో 144 పరుగులు చేయ డంతో ఆసీస్ స్కోరు పరుగులు తీసింది.వార్నర్ టెస్ట్ కెరీర్లో ఇది 17వ సెంచరీ. ఈ క్రమంలో టెస్టుల్లో ఐదువేల పరుగులు పూర్తి చేసుకున్న 19వ ఆసీస్ ప్లేయర్గా నిలిచాడు.
కాగా మరో ఓపెనర్ రెన్హా 10 పరుగులతో క్రీజులో కుదరుకోవడానికి ఇబ్బందులుపడి చివరికి తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వన్డౌన్ బ్యాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజా 122 బంతుల్లో 10 బౌండరీతో 73 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.కాగా వార్నర్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.జట్టు స్కోరును మరింత పెంచే క్రమంలో ఇన్నింగ్స్ స్కోరు 244 వద్ద వహాబ్ రియాజ్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి రెండవ వికెట్గా వెనుదిరిగాడు.కాగా 50 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కాగా పాక్ తమ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్లకు 443 వద్ద డిక్లేర్ చేసింది.అంతకు ముందు పాకిస్థాన్ బ్యాట్స్మెన్ అజహర్ అలీ డబుల్ సెంచరీ నమోదు చేశాడు.అజహర్ అలీ అద్భుతమైన ఇన్నింగ్స్ 364 బంతుల్లో 205 పరుగులుచేసి నాటౌట్గా అజేయంగా నిలిచాడు. కాగా ఈ క్రమంలో ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి పాక్ క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు. | 2sports
|
Cricket Boards
రూ.1070 కోట్లతో బిసిసిఐ నంబర్ వన్
న్యూఢిల్లీ:ప్రపంచలోని అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండ లి(బిసిసిఐ) ప్రకటించింది.కాగా ఆదాయ వ్యయాల ఆధారంగా తయారు చేసిన ఈ జాబి తాలో ఎప్ప టిలాగే ఈసారి కూడా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి మొదటి స్థానంలో నిలిచింది. 2016 సంవత్సరానికి గాను బిసిసిఐ అగ్రస్థానంలో నిలువగా,న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పదవ స్థానం లో నిలిచింది.ఈ ఏడాది బిసిసిఐ ఆదాయం 1070 కోట్ల 52లక్షలు ఉంది.కాగా భారత్లో క్రికె ట్ను ఒక మతంలా ఇక్కడి అభిమానులు భావి స్తారు.ఈ క్రేజ్ బిసిసిఐకి భారీ ఎత్తున ఆదాయా న్ని సమకూర్చి పెడుతుంది.మ్యాచ్ టికెట్ల విక్ర యాలు,టివి హక్కులు,ఇంటర్నెట్ వంటి వాటి ద్వా రా ఆదాయంతో పాటు టోర్నమెంట్,మ్యాచ్ గెలు వడంద్వారా వచ్చే రాబడి,టోర్నమెంట్లకు స్పాన్సర్షిప్లు విక్రయాల ద్వారా బిసిసిఐ ఆదాయాన్ని ఆర్జిస్తుంది.వీటిలో పాటు భారత జట్టు ధరించే జెర్సీలపై కూడా ప్రకటనల కోసం డబ్బు వసూలు చేస్తుంది.ఇక ఇండియన్ ప్రీమయిర్ లీగ్ కూడా బిసిసిఐ అధిక మొత్తంలో కాసుల వర్షం కురిపిస్తుంది.బిసిసిఐ తరువాత రెండవ స్థానంలో క్రికెట్ సౌతాఫ్రికా ఉంది.సౌతాఫ్రికా 461 కోట్లు ఆర్జిస్తుండటం విశేషం.ఆ తరువాత ఇంగ్లండ్ 394 కోట్లు,పాకిస్థాన్ 367కోట్లు, బంగ్లాదేశ్ 360 కోట్లు,జింబాబ్వే 213 కోట్లు,ఆస్ట్రేలియా 160 కోట్లు, శ్రీలంక 113కోట్లు,వెస్టిండీస్ 100 కోట్లు, న్యూజిలాండ్ 60కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
యార్కర్ బంతికి.. సాగిలపడ్డ సామీ..!
క్రీజులోని బ్యాట్స్మెన్ దూకుడికి కళ్లెం వేయాలంటే బౌలర్ సంధించే మొదటి అస్త్రం యార్కర్. బ్యాట్స్మెన్ ఏమాత్రం
TNN | Updated:
Sep 13, 2017, 08:21PM IST
క్రీజులోని బ్యాట్స్మెన్ దూకుడికి కళ్లెం వేయాలంటే బౌలర్ సంధించే మొదటి అస్త్రం యార్కర్. బ్యాట్స్మెన్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. బంతి క్షణాల వ్యవధిలో వికెట్లని నేలకూల్చుతుంది. కాబట్టి.. యార్కర్ పడగానే భీకరమైన హిట్టర్ గుండెలు సైతం దడదడలాడతాయి. తాజాగా వరల్డ్ ఎలెవన్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్లో పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ విసిరిన యార్కర్ బంతికి డారెన్ సామి క్రీజులోనే సాగిలపడిపోయాడు.
వరల్డ్ ఎలెవన్ జట్టు విజయానికి చివరి 5 బంతుల్లో 28 పరుగులు అవసరమైన దశలో ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ యార్కర్ బంతిని విసిరాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన వరల్డ్ ఎలెవన్ జట్టు బ్యాట్స్మెన్ డారెన్ సామీ.. కాళ్ల కింద పడిన ఈ యార్కర్ని పాదం కదిపి ఆడాలని ప్రయత్నించాడు. కానీ.. బంతి వేగానికి పట్టుతప్పి క్రీజులోనే పడిపోయాడు. చివరి ఓవర్లో తనని నియంత్రించేందుకు అసమాన యార్కర్ బంతిని విసిరిన హసన్ అలీని కింద పడిన డారెన్ సామీ అభినందించడం విశేషం. | 2sports
|
రోడ్లపైకి 'సెల్ఫ్ డ్రైవింగ్' ట్యాక్సీలు
- ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించిన 'నుటొనొమి'
సింగపూర్: వాహన రంగంలో గురువారం సరికొత్త అధ్యాయానికి తెర లేచింది. సింగపూర్లో డ్రైవర్ రహిత 'సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ'లు ప్రయాణికులకు సేవలను అందించడం మొదలు పెట్టాయి. సింగపూర్కు చెందిన వాహన సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీ 'నుటొనొమి' ఈ స్వయం చలిత ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిలో ప్రయాణించదలచిన వారు స్మార్ట్ఫోన్ ద్వారా ఈ తరహా ట్యాక్సీని బుక్ చేసుకొని టెస్ట్రైడ్ తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. తొలత ఆరు కార్లతో ఈ సేవలను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. డిసెంబరు నాటికి వీటి సంఖ్యను డజనుకు పెంచనున్నట్లుగా సంస్థ పేర్కొంది. తొలత వీటిని వన్నార్త్లోని 6.5 చదరపు కి.మీ పరిధిలో ప్రయోగాత్మకంగా తిప్పుతున్నట్లు సంస్థ వివరించింది. ప్రయోగాత్మక దశ నుంచి వాణిజ్యపరంగా సేవలను అందించే దశకు రాగానే మరిన్ని పికప్, డ్రాపింగ్ పాయి ంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ట్రాఫిక్ కంట్రోల్తో పాటు రోడ్డుపై రాకపోకలకు తగ్గట్టు ముందుకు సాగేందుకు ఆరు జతల లైడర్ డిటెక్షన్ వ్యవస్థ, రెండు కెమేరాల నియంత్రణ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ అను గుణంగా కారులో ఉన్న స్టీరింగ్ దానంతటదే పని చేస్తూ ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. రోడ్డు మీద గుంతలు వచ్చినా, వాహనానికి చిన్న పక్షులు లాంటివి ఎదురైన వేగాన్ని నియంత్రించుకొని ముందుకు సాగడం ఈ ట్యాక్సీ ప్రత్యేకత. ఈ ట్యాక్సీలు తమకు వింత అనుభూతిని పంచుతున్నట్టుగా ఈ వాహనాలలో ప్రయాణించిన వారు చెబుతున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
పాతికేళ్ల నాటి ఫొటోను బయటపెట్టిన సచిన్
TNN| Feb 16, 2017, 07.24 PM IST
మైదానంలో క్రమశిక్షణకు.. మైదానం వెలుపల కఠోర శ్రమకు ప్రతిరూపంగా నిలిచిన సచిన్ తెందుల్కర్ దాదాపు 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. క్రికెటర్గా ఉన్నంతకాలం మ్యాచ్లు ఉన్నా లేకపోయినా.. ప్రతి రోజూ సచిన్ అరంగేట్రం ఆటగాడిలా ప్రాక్టీస్ చేసేవాడట. ఎంతలా అంటే భారత జట్టు ఓ విదేశీ పర్యటనలో మరుసటి రోజు మ్యాచ్ అనగా.. అనివార్య కారణాల వల్ల ముందు రోజు రాత్రి స్టేడియానికి సమీపంలోని హోటల్కు చేరుకుందట. ప్రయాణంతో అలసిపోయిన క్రికెటర్లందరూ వెంటనే నిద్రలోని జారుకుంటే.. అర్ధరాత్రి ఓ రూము నుంచి బంతిని బ్యాట్తో కొడుతున్న శబ్ధం వినిపించిందట. ఏమిటా.. అని చూస్తే సచిన్ తెందుల్కర్ రూములోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడట. అంతలా అలుపెరగకుండా నిత్యం కష్టపడ్డాడు కాబట్టే క్రికెట్ ప్రపంచంలోనే వంద శతకాలు బాది.. నేటికీ రికార్డుల రారాజుగా అభిమానులతో ముద్దుగా పిలిపించుకుంటున్నాడు.
2013లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ అనంతరం ఎక్కువగా కుటుంబానికే సమయం కేటాయిస్తూ.. విహారయాత్రలతో ఎంజాయ్ చేస్తున్నాడు. గతంలో క్రికెటర్గా ఎదిగేందుకు తను కష్టపడిన రోజులు సచిన్కు తాజాగా గుర్తుకు వచ్చినట్లున్నాయి. వెంటనే పాతికేళ్ల క్రితం తను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోతో ప్రస్తుత ఫొటోను జతచేసి ‘ప్రాక్టీస్ ఎప్పుడు చేసినా.. ఎక్కడ చేసినా.. వృథా కాదు. ప్రతి రోజు గెలుపు మీదే’ అంటూ క్రికెట్ భాషలో చెప్పుకొచ్చాడు. మరోవైపు సచిన్ మళ్లీ బ్యాట్ పట్టుకోవడంతో ఆనందం వ్యక్తం చేసిన అభిమానులు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లతో మ్యాచ్లు ఏర్పాటు చేయాలంటూ ఏకంగా ఐసీసీనే కామెంట్ల రూపంలో కోరుతున్నారు. సచిన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం
‘సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ ’ మే 26న థియేటర్లలోకి రానుంది. | 2sports
|
Visit Site
Recommended byColombia
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో మళ్లీ తుది జట్టులోకి వచ్చిన ఓపెనర్ కేఎల్ రాహుల్ (9: 6 బంతుల్లో 2x4) మరోసారి వైఫల్యాల బాట కొనసాగించగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77: 112 బంతుల్లో 7x4, 2x6) వరుసగా రెండో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. దాదాపు 32 ఓవర్ల పాటు ఆస్ట్రేలియాకి రెండో వికెట్ ఇవ్వకుండా అడ్డుపడిన మయాంక్- పుజారా జోడీ 116 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియాకి శుభారంభమిచ్చింది. అయితే.. జట్టు స్కోరు 126 వద్ద సిక్స్ కొట్టే ప్రయత్నంలో మయాంక్ ఔటవగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి (23: 59 బంతుల్లో 4x), అజింక్య రహానె (18: 55 బంతుల్లో 1x4) నిరాశపరిచారు.
ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ని కొనసాగించిన చతేశ్వర్ పుజారా
199 బంతుల్లోనే శతకం మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్లో పుజారాకి ఇది 18వ శతకంకాగా.. ఈ సిరీస్లోనే మూడోది కావడం అతని ఫామ్కి నిదర్శనం. అంతేకాకుండా.. ఆస్ట్రేలియా గడ్డపై ఒక టెస్టు సిరీస్లోనే 1,000 బంతులు ఎదుర్కొన్న ఐదో భారత్ క్రికెటర్గానూ ఈ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకూ విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ రికార్డులో ఉన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
తమిళ నటుడితో తమన్నా పెళ్లి!
Highlights
తమిళ నటుడు సౌందరరాజా.. తమన్నాను వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు
తమిళ నటుడు సౌందరరాజా.. తమన్నాను వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. గ్రీన్ ఆపిల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సీఈవో తమన్నాతో శుక్రవారం వివాహం జరిగింది. మదురైలో గుడిలో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. 'సుందరపాండియన్', 'జిగర్ తాండా' వంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సౌందరరాజా ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు.
Last Updated 26, May 2018, 12:29 PM IST | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
కెప్టెన్సీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా..!
జట్టుకి కెప్టెన్సీ వహించేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. రాజస్థాన్ని జట్టు కంటే ఫ్యామిలీలా చూస్తా. నాపై నమ్మకం ఉంచి
Samayam Telugu | Updated:
Mar 27, 2018, 06:26PM IST
కెప్టెన్సీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా..!
ఐపీఎల్ 2018 సీజన్లో కెప్టెన్గా రాజస్థాన్ రాయల్స్ జట్టుని నడిపించేందుకు తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు అజింక్య రహానె వెల్లడించాడు. రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టులో బాల్ టాంపరింగ్కి పాల్పడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్స్మిత్పై విమర్శలు చెలరేగడంతో.. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ అతడ్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి రహానెకి అప్పగించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ షేన్ వాట్సన్ (2,474)కాగా.. అతని తర్వాత అజింక్య రహానె (2,333) ఉన్నాడు. గత జనవరిలో జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో రూ.4 కోట్లకి ‘రైట్ టు మ్యాచ్’ పద్ధతి ద్వారా రహానెని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
క్యాన్సర్తో ఏడాదిన్నర వయసున్న కూతురి మరణం.. విషాద వేళ అనూహ్యంగా వరల్డ్ కప్ ఛాన్స్
పాకిస్థాన్ హిట్టర్ అసిఫ్ అలీ 18 నెలల కుమార్తె క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూసింది. కూతురు చనిపోయిన మరుసటి రోజు అనూహ్యంగా అతడికి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. అసిఫ్ కుటుంబీకులకు పాకిస్థాన్ అండగా నిలిచింది.
Samayam Telugu | Updated:
May 20, 2019, 06:53PM IST
హైలైట్స్
పాకిస్థాన్ హిట్టర్ అసిఫ్ అలీ 18 నెలల కుమార్తె క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూసింది.
కూతురు చనిపోయిన మరుసటి రోజు అనూహ్యంగా అతడికి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది.
అసిఫ్ కుటుంబీకులకు పాకిస్థాన్ అండగా నిలిచింది.
ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో 0-4 తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. వరల్డ్ కప్ జట్టులో అనూహ్య మార్పులు చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో ముగ్గురి ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ వేటు వేసింది. అబిద్ అలీ, ఫహీమ్ ఆష్రఫ్, జునైద్ ఖాన్ల స్థానంలో మహ్మద్ అమీర్, వాహబ్ రియాజ్, అసిఫ్ అలీలకు పీసీబీ ప్రపంచ కప్ జట్టులో అవకాశం కల్పించింది. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న అసిఫ్ అలీ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
పాక్ బ్యాట్స్మెన్ అయిన అసిఫ్ అలీ కుమార్తె నూర్ ఫాతిమా కేన్సర్తో పోరాడుతూ అమెరికాలో కన్నుమూసింది. 18 నెలల వయసున్న తన కూతురు చనిపోయిన మరుసటి రోజున అసిఫ్ అలీకి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కడం గమనార్హం. లాహోర్లో అసిఫ్ కుమార్తె అంత్యక్రియలు జరుగుతాయని.. కుమార్తెను కడసారి చూసేందుకు అతడు పాకిస్థాన్ వెళ్లి.. ప్రాక్టీస్ మ్యాచ్ సమయానికల్లా జట్టుతో చేరతాడని చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తెలిపారు. కష్ట కాలంలో అసిఫ్కు తోడుగా ఉంటామని ఆయన చెప్పారు. | 2sports
|
Hyderabad, First Published 25, Jun 2019, 12:01 PM IST
Highlights
సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కల్కి'. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కల్కి'. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
''ఆకాశవాణి.. కొల్లాపూర్ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి'' అంటూరేడియోలో వచ్చే వాయిస్ తో ట్రైలర్ మొదలైంది.
నటుడు రాహుల్ రామకృష్ణ.. 'శేఖర్ బాబుని ఎవరు చంపారు..?' అంటూ కనిపించిన ప్రతీఒక్కరినీ అడుగుతూ ఆరాతీస్తుంటాడు. శేఖర్ బాబుని ఎవరు చంపారో తనకు తెలుసునని రాహుల్ రామకృష్ణ చెప్పడంతో.. ఎంక్వైరీ మొదలుపెడదాం అంటూ రాజశేఖర్ చెప్పడంతో ఇదొక హత్య నేపధ్యంలో సాగే సినిమాగా తెలుస్తోంది.
ట్రైలర్ లోనే పవర్ ఫుల్ డైలాగులు పలికించారు. డైరెక్టర్ చాలా ఇంటరెస్టింగ్ గా ట్రైలర్ ని కట్ చేశారు. కథ, నేపధ్యం, డైలాగ్స్ మొత్తం చూస్తుంటే ఈసారి కూడా రాజశేఖర్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. ఈ శుక్రవారం నాడు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated 25, Jun 2019, 12:01 PM IST | 0business
|
Gangu;ly
టీమిండియా క్లీన్ స్వీప్ చేసే అవకాశం: గంగూలి
కోల్కతా: త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసే అవ కాశం ఉందని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇది ఖచ్చితంగా కోహ్లీ కెప్టెన్సీకి పరీక్ష అని పేర్కొన్నాడు.ఆసీస్తో స్వదేశంలో జరిగే ఈ సిరీస్ కోహ్లీ భవిష్యత్ను మార్చే సిరీస్గా గంగూలీ అభవర్ణించాడు.పుణేలో 23న ఆరంభ మయ్యే తొలి టెస్టు నుంచి కోహ్లీ టార్గెట్గా ఆసీస్ ప్రణాళికలు సిద్దం చేయడం ఖాయమన్నాడు.గత ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీని ఆసీస్ టార్గెట్ చేసినట్లే ఈ సిరీస్లో కూడా అతనే టార్గెట్గా ఆ జట్టు ఛాలెంజ్కు సిద్దమవడం ఖాయం.ఈ సిరీస్ కోహ్లీ లైఫ్ ఛేజింగ్ సిరీస్ అనడంతో ఎలాంటి సందేహం లేదు.కోహ్లీ అసాధారణ ఆటగాగిగా రూపాంతరం చెందిన నాటి నుంచి చూస్తే ఇది అతనికి కఠినమైన సిరీస్ తొలి టెస్టు నుంచి ఆసీస్ దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది.ప్రత్యేకంగా కోహ్లీనే టార్గెట్ చేస్తూ వారు చెలరేగిపోయే అవ కాశం ఉంది. ఆసీస్ కూడా బలమైన జట్టు కావడంతో రసవత్తర పోరు ఖాయం.కాక పోతే భారత్పై ఆసీస్ విజయం సాధించడం మాత్రం అంత ఈజీ కాదు.స్టీవ్ స్మిత్,డేవిడ్ వార్నర్లు చాలా బాగా ఆడితేనే భారత్కు పోటీ ఇచ్చే అవ కాశం ఉంది అని గంగూలీ పేర్కొన్నాడు. | 2sports
|
ఉద్యోగులకు వీఆర్ఎస్, సాహసోపేత విలీన నిర్ణయం
October 23, 2019, 17:56 IST
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనానికి ఆమోదం లభించింది. ప్రైవేటు రంగం దిగ్గజాల నుంచి పోటీ కారణంగా...
ఓబీసీకి తగ్గిన ‘మొండి’ భారం
October 23, 2019, 02:48 IST
న్యూఢిల్లీ: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాంలో రూ.126 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం...
ఆరు రోజుల లాభాలకు బ్రేక్
October 23, 2019, 02:42 IST
ఆరు రోజుల స్టాక్మార్కెట్ లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. ఈ ఆరు రోజుల్లో లాభపడిన కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడం, ప్రజావేగు ఫిర్యాదు నేపథ్యంలో...
నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
October 22, 2019, 05:13 IST
న్యూఢిల్లీ/కోల్కతా: బ్యాంక్ల విలీనానికి నిరసనగా నేడు(మంగళవారం) కొన్ని బ్యాంక్ యూనియన్లు సమ్మె చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ సర్వీసులకు...
బ్యాంకుల దేశవ్యాప్త 24 గంటల సమ్మె
October 21, 2019, 20:05 IST
సాక్షి, ముంబై: ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. రేపు (మంగళవారం, అక్టోబరు 22) ఒక...
ట్రేడింగ్ ఆదాయంపై పన్ను చెల్లించాలా..?
October 21, 2019, 04:12 IST
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారు... స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఆదాయాన్ని చూపించడం, పన్ను చెల్లించడం తప్పనిసరి. అయితే, ఈ విషయమై స్పష్టమైన అవగాహన...
డిపాజిటర్లకు మరింత ధీ(బీ)మా!
October 19, 2019, 04:58 IST
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత రక్షణ కలిపించే రోజులు కనుచూపుమేరలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఒక వ్యక్తి ఒక బ్యాంకు పరిధిలో ఎంత మేర డిపాజిట్...
27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి
October 19, 2019, 04:34 IST
బీజింగ్: చైనా 2019 మూడవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) కేవలం 6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 1992 తరువాత ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి వృద్ధి...
అంచనాలు తగ్గించినా.. భారత్దే అగ్రస్థానం
October 19, 2019, 04:27 IST
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాలను కుదించినా.. ఇప్పటికీ అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉంటుందని కేంద్ర...
వైరల్ : కొత్త రూ.1000 నోటు మార్కెట్లోకి..!
October 18, 2019, 19:03 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంక్...
దేశీ ఫార్మాకు ఎఫ్డీఏ జ్వరం..!
October 18, 2019, 04:58 IST
భారతీయ ఫార్మా కంపెనీలకు కామధేనువుగా ఉన్న అమెరికా... ఇప్పుడు చేదు గుళికలా మారుతోంది. అక్కడి ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ)పరంగా చిక్కులు అంతకంతకూ...
ద్రవ్యలోటును అదుపులో ఉంచాలి!
October 17, 2019, 05:25 IST
వాషింగ్టన్: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ...
డిజిటల్ లావాదేవీల్లో హైదరాబాద్ సెకండ్
October 17, 2019, 04:47 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ లావాదేవీల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని, రాష్ట్రాల వారీగా జాబితా చూస్తే కర్నాటక,...
అంతా వాళ్లే చేశారు..!
October 17, 2019, 04:14 IST
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక...
మరోసారి మోగనున్న బ్యాంకుల సమ్మె సైరన్
October 16, 2019, 19:37 IST
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనంతో సహా పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతో బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపు నిచ్చాయి. అక్టోబర్...
భారత వృద్ధిరేటు : ఐఎంఎఫ్ కోత
October 15, 2019, 20:53 IST
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత వృద్ధిరేటు అంచనాలో మరోసారి కోత పెట్టింది. జూలైలో 7 శాతం అంచనా వేసిన సంస్థ 2020 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి...
రూ.2 వేల నోటు : ఓ షాకింగ్ న్యూస్
October 15, 2019, 20:26 IST
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీలో అధిక విలువ కలిగిన రూ.2 వేల నోటు ముద్రణను కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిలిపివేసింది. ఈ ఆర్థిక...
మరో రెండు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ
October 14, 2019, 21:03 IST
సాక్షి, ముంబై: రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా మరో రెండు బ్యాంకులపై భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లఘించిన కారణంగా లక్ష్మి విలాస్ బ్యాంకుకు కోటి...
నిర్మలా సీతారామన్ భర్త సంచలన వ్యాఖ్యలు
October 14, 2019, 17:57 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక రంగ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి భరోసా ఇస్తోంటే..ఆమె భర్త, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్...
ఐఆర్సీటీసీ బంపర్ లిస్టింగ్
October 14, 2019, 14:41 IST
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) బంపర్ లిస్టింగ్ సాధించింది. అక్టోబర్ 3తో ...
ఆరోగ్యంపై ముందే మేల్కొంటేనే..
October 14, 2019, 04:27 IST
పెద్ద వయసులోనే వైద్య బీమా (హెల్త్ ప్లాన్) అవసరమని చాలా మంది భావిస్తుంటారు. నేటి జీవన శైలి, పర్యావరణ కాలుష్యం, ఉద్యోగ పని స్వభావాల నేపథ్యంలో చిన్న...
ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6 శాతమే: ప్రపంచ బ్యాంక్
October 14, 2019, 03:58 IST
వాషింగ్టన్: భారత జీడీపీ వృద్ధి రేటు 2019–20 ఆర్థిక సంవత్సరానికి 6 శాతంగానే నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతేడాది నమోదైన 6.8 శాతంతో...
క్యూ2 ఫలితాలే దిక్సూచి..!
October 14, 2019, 03:50 IST
ఈ వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, విప్రో, అంబుజా, తదితర దిగ్గజ సంస్థలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కంపెనీల క్యూ2...
ద్రవ్య లోటుపై రఘురామ్ రాజన్ హెచ్చరిక
October 12, 2019, 18:10 IST
న్యూఢిల్లీ: భారత ద్రవ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ...
‘అప్పు’డే వద్దు!
October 12, 2019, 04:02 IST
ముంబై: బ్యాంకులు ఒకపక్క వడ్డీరేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. రుణాలు తీసుకోవడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. వినియోగ డిమాండ్ బలహీనంగా...
పరిశ్రమలు.. కకావికలం!
October 12, 2019, 03:27 IST
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో దారుణ పతనాన్ని నమోదు చేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –1.1 శాతం క్షీణత...
పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు
October 11, 2019, 06:09 IST
న్యూఢిల్లీ: గత నెలలో ఆర్బీఐ కీలక రేట్లకు మరో విడత కోత పెట్టిన తర్వాత నుంచి సుమారు అరడజను ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీలు) రుణాలపై రేట్లను పావు...
పోటీతత్వంలో 10 స్థానాలు దిగువకు భారత్
October 10, 2019, 05:53 IST
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్ వెనుకబడింది. అంతర్జాతీయ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన ‘గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్’లో...
భారత్పై ‘అంతర్జాతీయ మందగమనం’ ఎఫెక్ట్!
October 10, 2019, 04:46 IST
వాషింగ్టన్: అంతర్జాతీయ ఆర్థిక మందగమన ప్రభావం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒక్కింత ఎక్కువగా ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్...
పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర
October 10, 2019, 04:17 IST
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పొదుపు ఖాతా డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లకు మరింత కత్తెర వేసింది. రూ....
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక
October 09, 2019, 14:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్ దీపావళి కానుక అందించింది. డీఏ 5శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని...
ఈ నెల 14 నుంచి బడ్జెట్ కసరత్తు
October 07, 2019, 05:18 IST
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కసరత్తు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన...
బ్యాంకుపై ఆంక్షలు... డిపాజిట్లు భద్రమేనా..?
October 07, 2019, 02:34 IST
బ్యాంకుల్లో మన నగదు భద్రంగా ఉంటుందన్న భరోసాయే... వడ్డీ రాబడి తక్కువైనా కానీ ఇప్పటికీ చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి కారణం....
పర్సంటేజ్లతో పండగ చేస్కో!
October 05, 2019, 00:48 IST
ముంబై: పండుగల వేళ.. రుణ గ్రహీతలకు ఆర్బీఐ మరోసారి శుభవార్త తెచ్చింది. గృహ, వాహన, కార్పొరేట్ రుణాలు చౌకగా లభ్యమయ్యేలా వడ్డీరేట్ల తగ్గింపును...
ఆర్బీఐ కీలక నిర్ణయం : రెపో రేటు కోత
October 04, 2019, 11:59 IST
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన పరపతి కమిటీ మరోసారి రేట్ కట్కే మొగ్గు చూపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ...
5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యమే
October 04, 2019, 10:09 IST
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు భారత్లో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయని...
ఐఆర్సీటీసీ ఐపీఓ అదుర్స్!
October 04, 2019, 06:51 IST
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) సూపర్ హిట్ అయింది. గురువారం ముగిసిన...
లలిత్మోదీ, ఆయన భార్యకు స్విట్జర్లాండ్ నోటీసులు
October 03, 2019, 05:55 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్మోడీ, ఆయన భార్య మినాల్ మోడీలకు స్విట్జర్లాండ్ నోటీసులు జారీ చేసింది. నల్లధనంపై పోరులో భాగంగా ఈ దంపతుల...
నేటి నుంచే రుణ మేళాలు
October 03, 2019, 05:35 IST
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రకటించిన రుణ మేళా కార్యక్రమాలు గురువారం నుంచి దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో ప్రారంభమవుతాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థలతో...
పైపైన ఆడిటింగ్.. సంక్షోభానికి కారణం
October 03, 2019, 05:15 IST
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)లో సంక్షోభానికి ఆడిటర్ల తీరే కారణమని బ్యాంకు ఎండీగా సస్పెన్షన్కు గురైన జాయ్...
భారత్... అవకాశాల గని!
September 26, 2019, 03:29 IST
న్యూయార్క్: అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ స్వర్గధామంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాల ప్రయాణంలో కేవలం...
గేదెల రుణం : బ్యాంకు సీనియర్ అధికారి అరెస్ట్
September 25, 2019, 14:49 IST
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. గేదెలను కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేసినందుకు గాను లక్ష... | 1entertainment
|
India vs New Zealand T20: Ross Taylor replaces injured Todd Astle
కివీస్ టీ20 జట్టులోకి మళ్లీ రాస్ టేలర్..!
భారత్ చేతిలో వన్డే సిరీస్ని చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టు కనీసం టీ20ల్లోనైనా గట్టి పోటీనివ్వాలని ఆశిస్తోంది. ఆదివారం కాన్పూర్లో ముగిసిన
TNN | Updated:
Oct 31, 2017, 02:58PM IST
భారత్ చేతిలో వన్డే సిరీస్‌ని చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టు కనీసం టీ20ల్లోనైనా గట్టి పోటీనివ్వాలని ఆశిస్తోంది. ఆదివారం కాన్పూర్‌లో ముగిసిన సిరీస్ ‌నిర్ణయాత్మక మూడో వన్డే‌లో 6 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమి చవిచూసిన కివీస్.. బుధవారం నుంచి జరగనున్న టీ20 సిరీస్‌ కోసం జట్టులో కీలక మార్పు చేసింది. లెగ్ స్పిన్నర్‌, మిడిలార్డర్‌లో ఉపయుక్తమైన బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాడ్ ఆస్లే‌ని టీ20 జట్టు నుంచి పక్కకి తప్పించి సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్‌ని జట్టులోకి తీసుకుంది.
భారత్‌తో తాజాగా ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో టేలర్ మొత్తంగా 155 పరుగులు చేసి మునుపటి ఫామ్‌ని అందుకున్నాడు. దీంతో గత ఏడాది మార్చిలో చివరి సారి టీ20లు ఆడిన ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్‌‌ని మళ్లీ టీ20 జట్టులో తీసుకుంటూ కివీస్‌ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ‘రాస్ టేలర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అందుకే మిడిలార్డర్‌లో అతనికి మరో అవకాశం ఇవ్వాలని భావించాం. ఈ ఎంపిక టాడ్ ఆస్లే‌కి బాధ కలిగిస్తుంది. కానీ.. సీనియర్ బ్యాట్స్‌మెన్ అనుభవం టీ20 జట్టుకి ఈ సిరీస్‌లో కలిసొస్తుంది’ అని కివీస్ కోచ్ మైక్ హెస్సన్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి టీ20 మ్యాచ్ ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం రాత్రి 7 గంటల నుంచి జరగనుంది. | 2sports
|
IPL-2017
ఐపిఎల్ వేలంలో అమ్ముడైన క్రికెటర్లు
బెంగళూరు: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) వేలం బెంగళూరులో మొదలైంది.మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.ఇందులో మొత్తం ఎనిమిది ప్రాంచైజీలు 76 మందిని ఈ వేలంలో కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు.ఐపిఎల్ టి20 ఫార్మాట్ కావడంతో టి20 స్పెషలిస్టులుగా ముద్ర పడిన ఆటగాళ్లు వేలంలో మంచి ధర పలుకుతున్నారు.ఇంగ్లండ్ క్రికెటర్ బెన్స్టోక్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికాడు.అతడిని పూణే రైజింగ్ జేయింట్స్ 14.5 కోట్లకు దక్కించుకుంది.మరోవైపు ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ దక్కించుకుంది.అతడి కనీస ధర 2 కోట్లకే మోర్గాన్ను పంజాబ కొనుగోలు చేయడం విశేషం.ఇదిలా ఉంటే మొదటి రౌండ్లో మార్టిన్ గుప్టిల్, ఇర్ఫాన్ పఠాన్, జాన్స్రా§్ు, సౌరబ్ తివారి, ఫయాజ్ ఫజుల్, ఇషాంత్ శర్మలను కొనుగోలు చేసేందుకు ప్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు.
్
. 1. బెన్స్టోక్స్ ఇంగ్లండ్ 14.5 కోట్లు – రైజింగ్ పూణే 2. ఇయాన్ మోర్గాన్ ఇంగ్లండ్ 2 కోట్లు – కింగ్స్ ఎలెవన్ 3. ఏంజిలో మాథ్యూస్ శ్రీలంక 2 కోట్లు – ఢిల్లీ డేర్ డెవిల్స్ 4. కోరి అండర్సన్ న్యూజిలాండ్ 1 కోటి – ఢిల్లీ డేర్ డెవిల్స్ 5. పవన్ నేగి ఇండియా 1 కోట – రాయల్ చాలెంజర్స్ 6. నికోలస్ పూరన్ వెస్టిండీస్ 30 లక్షలు – ముంబై ఇండియన్స్ 7. రబడ దక్షిణాఫ్రికా 5 కోట్లు – ఢిల్లీ డేర్ డెవిల్స్ 8. ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ 5 కోట్లు – కోల్కతా నైట్ రైడర్స్ 9. తైమాల్ మిల్స్ ఇంగ్లండ్ 12 కోట్లు – రాయల్ చాలెంజర్స్ 10. పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా 4.5 కోట్లు – ఢిల్లీ డేర్ డెవిల్స్ 11. మిచెల్ జాన్సన్ ఆస్ట్రేలియా 2 కోట్లు – ముంబై ఇండియన్స్ 12. అంకిత్ బావే ఇండియా 10 లక్షలు – ఢిల్లీ డేర్ డెవిల్స్ 13. తన్మ§్ు అగర్వాల్ ఇండియా 10 లక్షలు – సన్ రైజర్స్ 14. మహ్మద్ నబి అప్ఘనిస్థాన్ 30 లక్షలు – సన్ రైజర్స్ 15. గౌతం ఇండియా 2 కోట్లు – ముంబై ఇండియన్స్ 16. రాహుల్ తెవాతియాతో ఇండియా 25 లక్షలు – కింగ్స్ ఎలెవన్ 17. ఆధిత్య తారే ఇండియా 25 లక్షలు – ఢిల్లీ డేర్ డెవిల్స్ 18. ఏకలవ్య ద్వివేది ఇండియా 75 లక్షలు – సన్ రైజర్స్ 19. అనికేత్ చౌదరి ఇండియా 2 కోట్లు – రాయల్ చాలెంజర్స్ 20. తంగరాజు నటరాజన్ ఇండియా 3 కోట్లు – కింగ్స్ఎలెవన్ 21. నాథు సింగ్ ఇండియా 50 లక్షలు – గుజరాత్ లయన్స్ 22. బాసిల్ తంపే ఇండియా 85 లక్షలు – గుజరాత్ లయన్స్ 23. మురుగన్ అశ్విన్ ఇండియా 1 కోట – ఢిల్లీ డేర్ డెవిల్స్ 24. తేజాస్ బరోకా ఇండియా 10 లక్షలు – గుజరాత్ లయన్స్ 25. రషీద్ ఖాన్ అర్మాన్ అప్ఘనిస్థాన్ 4 కోట్లు – సన్ రైజర్స్ 26. ప్రవీణ్ కూడా ఇండియా 10 లక్షలు – సన్ రైజర్స్ 27. క్రిస్ వోక్స్ ఇంగ్లండ 4.2 కోట్లు – కోల్కతా నైట్ రైడర్స్ 28. కరణ్ శర్మ ఇండియా 3.2 కోట్లు – ముంబై ఇండియన్స్ 29. రిషే దావన్ ఇండియా 55 లక్షలు – కోల్కతా నైట్ రైడర్స్ 30 మాట్ హెన్రీ న్యూజిలాండ్ 50 ్చలక్షలు – కింగ్స్ ఎలెవన్ 31. జయదేవ్ ఉన్మద్త్ ఇండియా 30 లక్షలు – రైజింగ్ పుణే 32. వరుణ్ అరోస్ ఇండియా 2.8 కోట్లు – కింగ్స్ ఎలెవన్ 33. మన్ప్రీత్ గోని ఇండియా 60 లక్షలు – గుజరాత్ లయన్స్ 34. బ్రెస్వెల్ న్యూజిలాండ 50 లక్షలు – కింగ్స్ ఎలెవన్ 35. జాసన్ రా§్ు ఇంగ్లండ్ 1 కోటి – గుజరాత్ లయన్స్ 36. సౌరబ్ తివారి ఇండియా 30 లక్షలు – ముంబై ఇండియన్స్ 37. క్రిస్ జోర్డాన్ ఇంగ్లండ 50 లక్షలు – సన్ రైజర్స్ 38. నాథన్ కోల్టర్ నైట్ ఆస్ట్రేలియా 3.5 కోట్లు – కోల్కతా నైట్ రైడర్స్ 39. ప్రవీణ్ దూబే ఇండియా 10 లక్షలు – రాయల్ చాలెంజర్స్ 40. నవదీప్ షైని ఇండియా 10 లక్షలు – ఢిల్లీ డేర్ డెవిల్స్ 41. బెన్ లాప్లిస ఆస్ట్రేలియా 30 లక్షలు – సన్ రైజర్స్ 42. బిల్లీ స్టాన్ లేక్ ఆస్ట్రేలియా 30 లక్షలు – రాయల్ చాలెంజర్స్ 43. మహమ్మద్ సిరాజ్ ఇండియా 2.6 కోట్లు – సన్ రైజర్స్ 44. రాహుల్ చహార్ ఇండియా 10 లక్షలు – రైజింగ్ పుణే 45. సౌరభ్ కుమార ఇండియా 10 లక్షలు – రైజింగ్ పుణే 46. అసేల గుణరత్నే శ్రీలంక 30 లక్షలు – ముంబై ఇండియన్స్ 47. డేనియల్ క్రిస్టియన్ ఆస్ట్రేలియా 1 కోటి – రైజింగ్ పుణే 48. పావెల్ వెస్టిండీస్ 30 లక్షలు – కోల్కతా నైట్ రైడర్స్ 49. డారెన్ సమీ వెస్టిండీస్ 30 లక్షలు – కింగ్స్ ఎలెవన్ 50. మునాఫ్ పటేల్ ఇండియా 30 లక్షలు – గుజరాత్ లయన్స్ 51. కుల్వంత్ కేజ్రోలియా ఇండియా 10 లక్షలు – ముంబై ఇండియన్స్ 52. రింకు సింగ్ ఇండియా 10 లక్షలు – కింగ్స్ ఎలెవన్ 53. శశాంక్ సింగ్ ఇండియా 10 లక్షలు – డిల్లీ డేర్ డెవిల్స్ 54. మిలింద్ టాండన్ ఇండియా 10 లక్షలు – రైజింగ్ పుణే 55. చిరాగ్ సూరి ఇండియా 10 లక్షలు – గుజరాత్ లయన్స్ 56. షెల్లీ శౌర్య ఇండియా 10 లక్షలు – గుజరాత్ లయన్స్ 57. శుభమ్ అగర్వాల్ ఇండియా 10 లక్షలు – గుజరాత్ లయన్స్ 58. సంజ§్ు యాదవ్ ఇండియా 10 లక్షలు – కోల్కతా నైట్ రైడర్స్ 59. ఇషాక్ జగ్గీ ఇండియా 10 లక్షలు – కోల్కతా నైట్ రైడర్స్ 60. రాహుల్ త్రిపాఠి ఇండియా 10 లక్షలు – రైజింగ్ పుణే 61. ప్రథమ్ సింగ్ ఇండియా 10 లక్షలు – గుజరాత్ లయన్స్ 62. ఆకాశ్ దీప్నాథ్ ఇండియా 10 లక్షలు – గుజరాత్ లయన్స్ 63. డారిన్ బ్రావో వెస్టిండీస్ 50 లక్షలు – రైజింగ్ పుణే 64. మనోజ్ తివారి ఇండియా 10 లక్షలు – రైజింగ్ పుణే 65. సయాస్ ఘూష్ ఇండియా 10 లక్షలు – కోల్కతా నైట్ రైడర్స్ 66. లూకీ ఫెర్గూనన్ న్యూజిలాండ్ 50 లక్షలు – రైజింగ్ పుణే | 2sports
|
83 పరుగులతో నాటౌట్గా
నిలిచిన దిల్షాన్
అస్ఘర్ స్టానిక్జాయ్ శ్రమ వృదా
కోల్కతా : వరల్డ్ టి20 టోర్నీమెంట్లో భాగంగా జరిగిన మ్యాచ్లో అఫ్ఘానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది.
కాగా అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది.దీంతో అప్ఘానిస్థాన్పై శ్రీలంక 6 వికెట్లతో విజయం సాధించింది.అప్ఘానిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ షహజాద్ 12 బంతులు ఆడి 1 బౌండరీతో 8 పరుగులు చేసి మాథ్యూస్ బౌలింగ్లో చమీరాకు క్యాచ్ ఇవ్వడంతో ఔట్కాగా మరో ఓపెనర్ నూర్ అలీ జాడ్రన్ 23 బంతులు ఆడి 3 బౌండరీలతో 20 పరుగులు చేసి హెరాత్ బౌలింగ్లో ఔటయ్యాడు.కాగా అస్ఘర్ స్టానిక్జాయ్ 47 బంతులు ఆడి 3 బౌండరీలతో 62 పరుగులు చేసి పెరీరా బౌలింగ్లో చండీమల్కు క్యాచ్ ఇవ్వడంతో ఔట్కాగా కరీం సాధిక్ 7 బంతులు ఆడి జిరో పరుగుల వద్ద పెరీరా బౌలింగ్లో చండీమల్కే క్యాచ్ ఇవ్వడంతో ఔటయ్యాడు.మహ్మద్ నబీ 4 బంతులు ఆడి 3 పరుగులు చేసి హెరాత్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. సమీవుల్లా షెన్వారీ 14 బంతులు ఆడి 3 బౌండరీలతో 31 పరుగులు చేసి కులశేఖర బౌలింగ్లో పెరీరాకు క్యాచ్ ఇచ్చి ఔట్కాగా షపివుల్లా 7 బంతులు ఆడి 5 పరుగులు చేసి పెరీరా బౌలింగ్లో తిరిమన్నేకు క్యాచ్ ఇవ్వడంతో వెనుదిరుగగా,దౌలత్ జార్డన్ 3 బంతుల ఆడి 5 పరుగులతో నకీబుల్లా జార్డన్ 3 బంతులు ఆడి 1 బౌండరీతో 12 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు.దీంతో అప్ఘానిస్థాన్ 7 వికెట్లుకు 153 పరుగులు చేసింది.
సత్తాచాటిన దిల్షాన్
అప్ఘానిస్థానత్ తరువాత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది.ఓపెనర్ చండీమల్ 17 బంతులు ఆడిఇ 2 బౌండరీలు,1 సిక్సర్తో 18 పరుగులు చేసి మహమ్మద్ నబీ బౌలింగ్లో సమివుల్లాకు క్యాచ్ ఇవ్వడంతో ఔట్కాగా దిల్షాన్ 50 బంతులు ఆడి 6 బౌండరీలు,3 సిక్సర్లతో 70 పరుగులు తిరుమన్నే 13 బంతులు ఆడి 1 బౌండరీతో 6 పరుగులు చేసి రషీద్ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు.కపుగెదరా 9 బంతులు ఆడి 1 బౌండరీతో 10 పరుగులు చేసి రన్ఔట్ అయ్యాడు.కాగా మాథ్యూస్ 10 బంతులు ఆడి 3 బౌండరీతో 21 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. | 2sports
|
19 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులకు అనుమతులు..
- పీపీపీ పద్ధతిలో అభివృద్ధి
- రూ.27వేల కోట్ల పెట్టుబడులు
ప్రయాణికుల భద్రతపై రాజీ లేదు : కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో వివిధ ప్రాంతాల్లో 19 గ్రీన్ఫీల్డ్ విమానశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సూత్రప్రాయ అనుమతులు ఇచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. వీటిని ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్దతిలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడం జరిగిందన్నారు. దేశంలో పౌర విమానయాన రంగం వేగంగా పెరుగుతుందని గురువారం ఆయన లోకసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఇదే సమయంలో ప్రయాణికుల భద్రతపై రాజీపడటం లేదని ప్రశ్నోత్తరాల సమయంలో పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 548 విమానాలు సేవలందిస్తున్నాయన్నారు. అదే 2014లో ఈ సంఖ్య 395గా ఉందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ ఏడాది అదనంగా 50 ఎయిర్క్రాప్టుల చొప్పున పెరిగాయన్నారు.
ఈ రంగంలో నైపుణ్యాల కొరత ప్రభావం ఉందన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ అవుననే అన్నారు. ఈ సమస్య ఉందని, నైపుణ్యంలో అంతరాలున్నాయని పేర్కొన్నారు. కాగా ప్రయాణికుల భద్రతపై ఎప్పుడూ వెనక్కి తగ్గమని అన్నారు. భద్రత, సెక్యూరిటీలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. కాగా 19 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులకు ప్రిన్సిపల్ అనుమతులిచ్చామని మంత్రి తెలిపారు. ఇందులో కొన్నిటిని పీపీపీ పద్దతిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏపీలోని బోగాపూరం, దగదర్తి, గోవాలోని మోపా, మహారాష్ట్రలోని నవీ ముంబయి, సిందుడుర్గ్, కర్నాటకలోని హసన్, కేరళలోని కన్నూర్, గుజరాత్లోని దోలేరా తదితర ఎయిర్పోర్టులను రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు పీపీపీ పద్దతిలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కాగా ఈ ఎయిర్పోర్టులకు రూ.27,000 కోట్ల పెట్టుబడులు అవసరం అవుతాయన్నారు. మరిన్ని ఎయిర్పోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి తెలిపారు.
రూ.1.5 లక్షల కోట్లకు పరిశ్రమ : జయంత్ సిన్హా
విమానయాన పరిశ్రమ 2015-16లో రూ.1.5 లక్షల కోట్ల టర్నోవర్కు చేరిందని కేంద్ర మంతి జయంత్ సిన్హా అంచనా వేశారు. 2016లో మొత్తం దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 11 కోట్లకు చేరిందని అన్నారు. ఇదే సమయంలో భారత రైల్వేల్లోనూ ఏసీ బోగీల్లో 12 కోట్ల పైగా మంది ప్రయాణించారని తెలిపారు. కాగా విమాన పరిశ్రమ, ప్రయాణికులపై మాత్రం ప్రత్యేకంగా సర్వే చేయలేదన్నారు. మరో ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ టికెట్ల కొనుగోలు సమ యంలో ఆధార్ సంఖ్యను కోరుతున్నట్టు తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ఓవర్సీస్ లో కెరీర్ బెస్ట్ రికార్డ్ సెట్ చేసిన చరణ్
Highlights
ఓవర్సీస్ లో కెరీర్ బెస్ట్ రికార్డ్ సెట్ చేసిన చరణ్
రంగస్థలం.. ఇప్పుడు ఎక్కడ చూసినా సినీ అభిమానుల నోట ఇదే మాట. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 1980ల నాటి కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. నటన పరంగా రామ్చరణ్ను మరో మెట్టు ఎక్కించింది. అతడి కెరీర్లోనే ది బెస్ట్ అనిపించేలా.. ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1700 థియేటర్లలో రిలీజ్ అయిన రంగస్థలంలో అమెరికా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలుకొడుతోంది.
యూఎస్లో గత రాత్రే 142 సెంటర్లలో రంగస్థలం విడుదలైంది. ఈ మూవీ ప్రీమియర్ షోల ద్వారా దాదాపు 6.2 లక్షల డాలర్లు వసూలు చేసింది. తద్వారా ప్రీమియర్ షో వసూళ్ల పరంగా ఆరో అతిపెద్ద తెలుగు చిత్రంగా రంగస్థలం రికార్డు నెలకొల్పింది.
ఓవర్సీస్ కలెక్షన్ల పరంగా చెర్రీ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా ఈ మూవీ నిలవనుంది.
ప్రీమియర్ షోల ద్వారా 2.45 లక్షల డాలర్లు రాబట్టిన బాహుబలి-2 ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో అజ్ఞాతవాసి, ఖైదీ నంబర్ 150, స్పైడర్ చిత్రాలు ఉన్నాయి. టాప్-6లో మూడు సినిమాలు మెగా ఫ్యామిలీ హీరోలవే కావడం విశేషం.
Last Updated 30, Mar 2018, 3:15 PM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Auction IPL 2019: ఈరోజే ఐపీఎల్ వేలం.. తేలనున్న యువీ భవితవ్యం
ఐపీఎల్ 2018 సీజన్లో యువరాజ్ సింగ్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో అతడ్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ వేలంలోకి విడిచిపెట్టింది. దీంతో.. ఒత్తిడికి గురైన యువీ.. తన కనీస ధరని రూ. కోటికి తగ్గించుకున్నాడు.
Samayam Telugu | Updated:
Dec 18, 2018, 11:36AM IST
Auction IPL 2019: ఈరోజే ఐపీఎల్ వేలం.. తేలనున్న యువీ భవితవ్యం
భారత వెటరన్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ భవితవ్యం మంగళవారం తేలిపోనుంది. జైపూర్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుండగా.. తన ధరని రూ. కోటికి తగ్గించుకుని యువీ పోటీలోకి వచ్చాడు.
2015 ఐపీఎల్ సీజన్లో రూ. 16 కోట్లతో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన క్రికెటర్గా సరికొత్త రికార్డులు నెలకొల్పిన యువరాజ్ సింగ్ గత ఏడాదన్నరకాలంగా టీమిండియాకి దూరంగా ఉండటం, 2018 ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కారణంగా అతనిపై ఫ్రాంఛైజీలు అయిష్టం కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ని ఎవరైనా కొనుగోలు చేస్తారా..? లేదా..? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. సుదీర్ఘకాలంగా బెంగళూరులోనే ఈ ఆటగాళ్ల వేలం జరుగుతుండేది. కానీ.. ఈసారి జైపూర్కి మార్చారు. స్టార్స్పోర్ట్స్ నెట్వర్క్లో ఈ వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఈ ఏడాది ఐపీఎల్లోని 8 ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 70 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండగా.. 346 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఇందులో 246 మంది భారత క్రికెటర్లే ఉన్నారు. వాస్తవానికి ఐపీఎల్ వేలం కోసం 1,003 మంది క్రికెటర్లు రిజస్టర్ చేసుకోగా.. తుది జాబితానికి 346కి కుదించారు. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరతో 9 మంది క్రికెటర్లు వేలంలోకి రానుండగా భారత్ నుంచి ఈ జాబితాలో కనీసం ఒక్కరు కూడా లేకపోవడం కొసమెరుపు.
ఐపీఎల్ 2018 సీజన్లో యువరాజ్ సింగ్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో అతడ్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ వేలంలోకి విడిచిపెట్టింది. దీంతో.. ఒత్తిడికి గురైన యువీ.. తన కనీస ధరని రూ. కోటికి తగ్గించుకున్నాడు. మరోవైపు 2018 సీజన్లో రూ.11.5 కోట్లకి అమ్ముడుపోయిన జయదేవ్ ఉనద్కత్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ విడిచిపెట్టడంతో.. అతను తన ధరని రూ. 1.5 కోట్లకి తగ్గించుకుని వేలంలోకి వస్తున్నాడు. భారత్ తరఫున ఈ ఇద్దరు క్రికెటర్ల వేలంపై ఆసక్తి నెలకగా.. రూ. కోటి కనీస ధరతో అక్షర్ పటేల్ (స్పిన్నర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మహ్మద్ షమీ (ఫాస్ట్ బౌలర్) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇటీవల ఆటగాళ్లని రిలీజ్, రిటైన్ చేసుకున్న తర్వాత ఫ్రాంఛైజీల వద్ద మిగిలిన ఉన్న డబ్బుని ఓసారి పరిశీలిస్తే..! 1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వద్ద రూ. 36.20 కోట్లు, 2. కోల్కతా నైట్రైడర్స్ వద్ద రూ. 15.20 కోట్లు, 3. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 25.50 కోట్లు (ఢిల్లీ డేర్డెవిల్స్ ఇటీవల పేరు మార్చుకుంది), 4. ముంబయి ఇండియన్స్ వద్ద రూ. 11.15 కోట్లు, 5. రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 20.95 కోట్లు. 6. సన్రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 9.70 కోట్లు, 7. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 18.15 కోట్లు, 8. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 8.40 కోట్లు
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అందులో మన నంబర్ 130 అంట!
వ్యాపారానికి అనుకూలమైన దేశాల్లో మన దేశం 130వ స్థానంలో నిలిచింది.
TNN | Updated:
Oct 26, 2016, 01:08AM IST
వ్యాపారానికి అనుకూలమైన దేశాల్లో మన దేశం 130వ స్థానంలో నిలిచింది. ప్రపంచబ్యాంక్ తన వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 190 దేశాల జాబితాలో మన దేశ స్థానం అరవై దేశాల కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ ఆధారంగా చూస్తే ఇది చాలా వెనకబడే ఉన్నట్లు లెక్క. గత ఏడాది మన దేశం 131వ స్థానంలో ఉండగా, ఈసారి ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 130 చేరింది. సంస్కరణల విషయంలో మనదేశం చిత్తశుద్ధిని ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు నివేదిక గుర్తించడం విశేషం. ఇదే విషయాన్ని నివేదికలో పేర్కొంది. దేశాన్ని అభివృద్ధి బాటన నిలిపే సంస్కరణలను శరవేగంగా ప్రభుత్వం అమలుచేస్తోందని కొనియాడింది.
ఇదిలా ఉండగా ఈ సూచిలో మిగిలిన బ్రిక్స్ దేశాలు మన కన్నా మెరుగైన ర్యాంకుల్లో ఉన్నాయి. రష్యా 51వ స్థానంలో నిలవగా, దక్షిణాఫ్రికా 73వ స్థానంలో, చైనా 84వ స్థానంలో, బ్రెజిల్ 116వ స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
India is ranked 130 out of 190 countries in World Bank Group's annual report on the ease of doing business, Doing Business 2017: Equal Opportunity for All, released on Tuesday. Even the one rank improvement is because India had been downgraded in the 2016 edition to 131 from 130 earlier. The World Bank report , however, recognised the concerted efforts made by India, and aside a special section “India has embarked on an ambitious reform path” to list the developments. | 1entertainment
|
sandhya 402 Views photo , SBI
SBI
ముంబై: బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ విషయం మీరు తెలుసుకోవలసిందే. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా కేవలం ఫోటోతో బ్యాంకు ఖాతా ప్రారంభించవచ్చు. ఎస్బిఐ ఈ సేవలు అందిస్తోంది. కేవైసి లేకుండా ఓపెన్ చేసే బ్యాంకు అకౌంట్లను స్మాల్ అకౌంట్లుగా పరిగణిస్తారు.18 ఏళ్లపైన వయసు కలిగినవారు ఈ బ్యాంకు అకౌంట్ను ప్రారంభించవచ్చు. అయితే ఈ అకౌంట్ నిర్వహణకు కొన్ని షరతులు ఉంటాయి. బ్యాంకుకు వెళ్లి స్వీయ ధృవీకరణ ఫోటో, సంతకం చేసి బ్యాంకు ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ సేవలు దాదాపు అన్ని బ్రాంచుల్లోనూ అందుబాటులో ఉంటాయి. అయితే ఎస్బిఐ ప్రత్యేకమైన బ్రాంచుల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండవు.
మినిమమ్ బ్యాలెన్స్ అమౌంట్ అవసరం లేదు. బ్యాంకు అకౌంట్లో గరిషటంగా రూ.50వేల వరకే డబ్బు ఉంచుకోగలం. దీనికి సేవింగ్స్ బ్యాంకు అకౌంట్స్ వడ్డీరేటు వర్తిస్తుంది. బేసిక్ రూపే ఎటిఎం కమ్ డెబిట్కార్డు ఫ్రీగా ఇస్తారు. ఒక నెలలో రూ.10వేల కన్నా ఎక్కువ లావాదేవీలను నిర్వహించడం కుదరదు. ఇక ఒక ఆర్థిక సంవత్సరంలో లావాదేవీల విలువ రూ.లక్షకు మించొద్దు. ఒకవేళ ఈ పరిమితి దాటితే కేవైసి పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. నెలలో ఎటిఎం నుంచి 4 సార్లు మాత్రమే డబ్బులు విత్డ్రా చేసుకోగలం. ఈ అకౌంట్ వాలిడిటీ 12 నెలలు. తర్వాత మళ్లీ ఏదైనా ధృవీకరణ పత్రం ఇచ్చి అకౌంట్ను కొనసాగేలా చేసుకోవచ్చు. ఎలాంటి ధృవీకరణ పత్రాన్ని అందించకపోతే 24 నెలల తర్వాత అకౌంట్ మూసివేసుకోవచ్చు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
Hyderabad, First Published 19, Aug 2019, 5:00 PM IST
Highlights
యాంగ్రీ హీరో రాజశేఖర్ చాలా రోజుల తర్వాత గరుడవేగ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ కాస్త జోరు పెంచారు. ఇటీవల విడుదలైన కల్కి చిత్రం పర్వాలేదనిపించింది. తాజాగా రాజశేఖర్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
యాంగ్రీ హీరో రాజశేఖర్ చాలా రోజుల తర్వాత గరుడవేగ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ కాస్త జోరు పెంచారు. ఇటీవల విడుదలైన కల్కి చిత్రం పర్వాలేదనిపించింది. తాజాగా రాజశేఖర్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మరో థ్రిల్లర్ కథకు రాజశేఖర్ ఒకే చెప్పారు. బేతాళుడు చిత్రంలో విజయ్ ఆంటోనీని డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన చెప్పిన ఎమోషనల్ థ్రిల్లర్ కథ ఆసక్తికరంగా ఉండడంతో రాజశేఖర్ ఈ చిత్రానికి వెంటనే అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ బ్యానర్ లో ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
నాజర్, సత్యరాజ్, బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలని త్వరలో ప్రకటించనున్నారు. ఓ నవల ఆధారంగా ఈ చిత్ర కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Last Updated 19, Aug 2019, 5:00 PM IST | 0business
|
వార్తలు
రౌండ్ ఫిగర్కు పెట్రోల్ కొట్టిస్తున్నారా.. అయితే, మోసపోయినట్టే.. ఎలా?
పెట్రోల్ బంకుల్లో పని చేసే సిబ్బంది వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పెట్రోల్ బంకు నిర్వాహకులపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వారి దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వాహనదార
chitra| Last Updated: గురువారం, 11 ఆగస్టు 2016 (15:45 IST)
పెట్రోల్ బంకుల్లో పని చేసే సిబ్బంది వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పెట్రోల్ బంకు నిర్వాహకులపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వారి దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వాహనదారులు 100 రూపాయలకు పెట్రోల్ పట్టించుకునేందుకు వెళితే మీటర్లో మాత్రం వంద రూపాయలు చూపిస్తుంది. వాహనదారునికి మాత్రం 75 రూపాయల నుండి 80 రూపాయల విలువ చేసే పెట్రోల్ మాత్రమే ట్యాంకులో పడుతుంది. వాహన వినియోగదారులను దోచుకునేందుకు రోజు రోజుకు కొత్త కొత్త పద్ధతిని అమలుచేస్తూ ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు.
అదేమిటో తెలుసుకుని ముందు జాగ్రత్త వహించకుంటే పెట్రోల్, డీజిల్ కొనడానికి వెళ్లిన ప్రతిసారీ మోసపోవాల్సిందే. సాధారణంగా మనం రూ.50, రూ.100, రూ.200, రూ.300, రూ.500 రూపాయల రౌండ్ ఫిగర్కు పెట్రోల్ పోయిస్తుంటాం. అయితే ఈ లెక్కన లీటరుకు 200 మిల్లిలీటర్లు పెట్రోల్ని నష్టపోతున్నామని సోషల్ మీడియాలో ఓ హిందీ వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో కనీసం 200 మిలీ పెట్రోల్ను నష్టపోయినట్టే.
దీనిపై బంక్ నిర్వాహకులు పెట్రోల్ పంప్ డిజిటల్ మీటర్ ప్రోగ్రామింగ్లో ముందే ఓ 50 నుంచి 300 ఎంఎల్ తక్కువగా వచ్చేలా సెట్ చేస్తారట. అయితే మొత్తం పెట్రలో పంప్ సెట్టింగ్ మాత్రం సాధారణంగానే ఉంటుంది. కాబట్టి పెట్రోల్, డీజిల్ వినియోగదారులు ఈ రౌండ్ ఫిగర్తో కాకుండా 110, 155, 210, 510 రూపాయిల్లో పెట్రోల్ పోయించుకోవాలని అధికారులు సలహా ఇస్తున్నారు. రౌండ్ ఫిగర్ ధరల్లో తక్కువ ఇంధనం నమోదు చేస్తూ విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. ఈ మోసం వల్ల వినియోగదారులకు తెలియకుండానే మోసపోతున్నారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
కోహ్లికి బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది: అక్తర్
TNN| Nov 6, 2017, 04.46 PM IST
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏదైనా ఓ రేంజ్లో చెలరేగిపోయే కోహ్లి.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. బౌలర్ ఎవరైనా దీటుగా ఎదుర్కొనే విరాట్.. ఈ మధ్య పాకిస్థానీ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్పై ప్రశంసలు గుప్పించాడు. ‘‘నేనెప్పుడూ అక్తర్ బౌలింగ్ను ఎదుర్కోలేదు. అతడు బలంగా విసిరిన బంతి బ్యాట్స్మెన్ శరీరాన్ని తాకుతుందేమో అనిపిస్తుంది. రావల్పిండి ఎక్స్ప్రెస్ చాలా ప్రమాదకారి. షోయబ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉండటం ఉత్తమం.’’ అని ప్రపంచంలోని ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన షోయబ్ను ఉద్దేశించి కోహ్లి చెప్పాడు.
విరాట్ వ్యాఖ్యల పట్ల అక్తర్ స్పందించాడు. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పు బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది. అతడో గొప్ప బ్యాట్స్మెన్. అతడికి బౌలింగ్ వేయడం కచ్చితంగా గొప్ప పోటీ అని ట్వీట్ చేశాడు.
I was better off not bowling at all when #Kohli was batting.Jokes apart,he's a gr8 batsman & bowling agnst him wud have been a gr8 contest. pic.twitter.com/EHL32UpXrU
— Shoaib Akhtar (@shoaib100mph) November 4, 2017
2010 ఆసియా కప్లో భాగంగా దంబుల్లా స్టేడియంలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో అక్తర్ స్పెల్ అయిపోయాక విరాట్ బ్యాటింగ్కు వచ్చాడు. 27 బంతుల్లో 18 పరుగులు చేసిన సయీద్ అజ్మల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో అక్తర్ బౌలింగ్ను ఎదుర్కొనే అవకాశం కోహ్లికి దక్కలేదు.
పెప్సీ కప్లో భాగంగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచ్లో షోయబ్ అక్తర్ విసిరిన బంతి గంగూలీ ఛాతి భాగంలో బలంగా తాకింది. దీంతో సౌరభ్ కింద పడిపోయి, బాధతో విలవిల్లాడు. నొప్పి తగ్గకపోవడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. | 2sports
|
sumalatha 214 Views 2028-olympics , cricket
cricket
లండన్: ప్రపంచ మెగా క్రీడా సంబరం ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు లభిస్తుందా అంటే అవుననే సమాధానమే లభిస్తుంది. ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చాలనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్టే 2028 ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రయత్నాలు చేస్తోందని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ ప్రపంచ క్రికెట్ కమిటీ ఛైర్మన్ మైక్ గాటింగ్ పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా సమాఖ్యలను పర్యవేక్షించే వాడా (వరల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ)కు అనుబంధంగా కొనసాగుతున్న నాడా(నేషనల్ ఆంటీ డోపింగ్ ఏజెన్సీ) పరిధిలోకి ఇటీవలే బీసీసీఐ చేరింది. దీంతో ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టడానికి ఉన్న పెద్ద అడ్డంకి తొలగిపోయిందని ఆయన తెలిపాడు. ఓ క్రీడా ఛానెల్ పేర్కొన్న వివరాల ప్రకారం.. 2028 ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని, అందుకు తగిన కార్యాచరణ ప్రారంభించామని ఐసీసీ కొత్త ముఖ్య కార్యదర్శి మనుసావ్నే ఎంసీసీ కమిటీతో అన్నాడని గాటింగ్ వివరించాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/ | 2sports
|
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
RBI bank
ముంబయి: మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూ వస్తోంది. సెన్సెక్స్ 199 పాయింట్లు నష్టపోతే నిఫ్టీ కూడా అదే తరహాలో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ధోరణులు నీరసించడం, సూచీల్లోని భారీ కంపెనీలు హెచ్డిఎప్సి ఇన్ఫోసిస్, యాక్సిస్బ్యాంకు వంటివి కౌంటర్లలో అప్రమత్తతో కూడిన కొనుగోళ్లు వంటివి ఉంటాయి. ఆర్బిఐ మానిటరీ పాలసీ సమీక్ష వివరాలు శుక్రవారం వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ గురువారం కొంతమేర ప్రతికూలంగానే నడిచింది. ఎంపికచేసిన స్టాక్స్ ఎస్బ్యాంకు, ఎబ్బట్ ఇండియా సంస్థలు మాత్రమే ర్యాలీ తీసాయి. బెంచ్మార్క్ బిఎస్ఇ సెన్సెక్స్199 పాయింట్లు క్షీణించి 38,106.87 పాయింట్లవద్ద ముగిసింది. వేదాంత ఐదుశాతం దిగజారింది. ఎస్బ్యాంకు 33శాతం వరకూ లాభపడి అతిపెద్ద లాభాలసంస్థగా నిలిచింది. ఈ రోజుమొత్తం సెన్సెక్స్ ఇంట్రాడేలో 38,310.93 పాయింట్లు వద్దనుంచి 37,957.56 పాయింట్లవద్ద రిజిష్టరు అయింది. ఎస్బ్యాంకు గతంలో ఎన్నడూలేని విదంగా భారీ ఎత్తున లాభపడిందది. సిఇఒ రవ్నీత్గిల్ ఇన్వెస్టర్లకు బ్యాంకు తీరుపై భరోసా ఇవ్వడంతో ఆర్ధికరంగంలో అతిపెద్ద లాభాలసంస్థగా నిలిచింది. బ్యాంకు స్టాక్ రూ.42.55 వద్ద బిఎస్ఇలో ముగిసింది.
అంతకుముందురోజుకంటే 33శాతం పెరిగింది. మార్కెట్పరంగా చూస్తే 2651 కంపెనీలు బిఎస్ఇలోట్రేడింగ్ జరగితే 961 కంపెనీలు లాభాల్లో ముగిసాయి. 1530 కంపెనీలునష్టాలతో ముగిస్తే 160 కంపెనీల వాటాలు స్థిరంగా కొనసాగాయి. బిఎస్ఇ మిడ్క్యాప్సూచీ 13,844.48 పాయింట్లవద్ద అంటే 42 పాయింట్ల దిగువన ముగిసింద.ఇ బిఎస్ ఇస్మాల్క్యాప్సూచ 49 పాయింట్లు దిగజారి 12,910.18 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక వివిధ సూచీలవారీగా ఎన్ఎస్ఇలో మెటల్స్టాక్స్ దిగజారాయి.
నిఫ్టీ మెటల్సూచీ మూడుశాతం క్షీణించింది. మొత్తం 15 విభాదాల్లో 14 సూచీలు ప్రతికూలంగానే ముగిసాయి. నిఫ్టీ ఫైనాన్స్సర్వీస్సూచీ పరంగాచూస్తే ఒకటిశాతం క్షీణించింది. ఇతరత్రా రియాల్టీ స్టాక్స్ ఒకటిశాతంపెరిగి 250.90స్థాయికి చేరాయి. ఇండస్ఇండ్బ్యాంకు షేర్లు నాలుగోరోజు కూడా దిగజారాయి. రరెండేళ్ల కనిష్టానికి అంటే 1220వద్ద ముగిసాయి. ఆరుశాతం బిఎస్ఇలో క్షీణించింది. గురువారం బ్యాంకు స్టాక్స్ సమస్యాత్మక కేటగిరీకి చేరడమే ఇందుకుకీలకం. ప్రైవేటు బ్యాంకరు 20-17 జనవరి 23 నుంచి దిగువస్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఆర్బిఐ తన రెపో సమీక్షలో రెపోరేట్లను మరో 25బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని చెపుతున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
Visit Site
Recommended byColombia
‘విరాట్ కోహ్లి ప్రస్తుతం జట్టులో లేకపోవడంతో మూడో స్థానంలో సీనియర్ బ్యాట్స్‌మెన్ అయిన అజింక్య రహానె బ్యాటింగ్ చేయడం అత్యవసరం. అతనితో పాటు కేఎల్ రాహుల్‌కి కూడా మరిన్ని వన్డేలాడే అవకాశం టీమిండియా మేనేజ్‌మెంట్ కల్పించాలి. 2019 ప్రపంచకప్‌ కోసం జట్టుని తయారు చేసుకోవాలనే ఆలోచన సరిగా ఉంటే.. కోహ్లి జట్టులోకి వచ్చిన తర్వాత కూడా రహానెని పక్కకి తప్పించకుండా అతడ్ని నాలుగో స్థానంలో ఆడించాలి. ధోనీ ఆరో స్థానంలో వచ్చేందుకు అంగీకరిస్తే.. ఐదో స్థానంలో రాహుల్‌కీ ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఇద్దరు క్రికెటర్లు ఇప్పటికే జట్టులో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. కాబట్టి వీరి చేరికతో భారత్ జట్టు మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుంది’ అని గంగూలీ వివరించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
internet vaartha 156 Views
రుచిసోయా, అలెగ్జాన్లకు సెబీ ఆదేశం
న్యూఢిల్లీ : ధరల రిగ్గింగ్ ద్వారా అనుచిత లబ్దిపొందిన రుచిసోయా వెంటనే రూ.20 కోట్ల రూపాయలను జమచేయాలని సెబీ ఆదేశించింది. రుచిసోయా, ఎగ్జలాన్ ఇన్ఫ్రా సంస్థలకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. రుచి సోయా ఇండస్ట్రీస్తోపాటు సెబీ ఏడు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తూ మొత్తం ఈ ఏడు సంస్థలు 8.3 కోట్ల రూపాయలు వడ్డీతో సహా ఎస్క్రోఖాతాకు జమచేయాలని ఆదేశించింది. వీటిలో నవిన్యా మల్టిట్రేడ్, శ్రేయాస్ క్రెడిట్ అండ్ క్యాపిటల్, బీటల్ మినరల్స్, అండ్ కన్స్ట్రక్షన్స్, అవెంటిస్ బయోఫీడ్స్, బీటుల్ ఆయిల్స్, అండ్ ఫీడ్స్, సన్మేట్ట్రేడ్, యుని24 టెక్నో సొల్యూషన్స్ సంస్థలున్నాయి. అలెగ్జాన్ ఇన్ఫ్రాకు సంబంధించి సెబీ 52 సంస్థలకు ఆదేశాలు జారీచేస్తూ ఆరుగురు డైరెక్టర్లు, మరో 44 ఇతర సంస్థలు మొత్తంగా 12.54 కోట్ల రూపాయలు వడ్డీతోసహా ఎస్క్రోఆతాకు జమచేయాలని సూచించింది. 2010 డిసెంబరు నుంచి 2012 జనవరి మధ్యకాలంలో జరిగిన లావాదేవీలపై సెబీ నిర్వహించిన దర్యాప్తులో అనేక అవకతవకలు, చట్టవిరుద్ధమైన లావాదేవీలు జరిగి అనుచిత లబ్దిని పొందాయని గుర్తించింది. చివరి నిమిషంలో ఉన్న ధరకంటే ఎక్కువకు రుచిసోయా ఇండస్ట్రీస్ పరంగా ఏడు సంస్థలు లావాదేవీలు భారీగా చేసాయి. రుచిసోయా ధరలను ఒక్కసారిగా పెంచేందుకు కృషిచేసాయి. అగ్జెలాన్ ఇండస్ట్రీస్ కూడా షేరుధరలను అనుచితంగాపెంచి అవకతవకలకు పాల్పడినట్లు కొత్తగా ఎక్కువధరను ఒక్కసారిగా ఏర్పాటుచేసిందని సెబీ అభియోగాలు మోపింది. ఎస్క్రోఖాతాల్లో ఈ 20 కోట్ల సొమ్ము జమచేసేంతవరకూ ఈ సంస్థలు ఎలాంటి లావాదేవీలునిర్వహించడనికి వీలులేదు. వాటి ఆస్తులు, లేదా సెక్యూరిటీలను బదలాయించేందుకు కూడా వీలులేదని సెబీ ఆదేశించింది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ముష్ఫికర్ వీరోచిత పోరాటం: బంగ్లా 388 ఆలౌట్
బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీం వీరోచిత పోరాటంతో ఆకట్టుకున్నాడు.
TNN | Updated:
Feb 12, 2017, 11:40AM IST
బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీం వీరోచిత పోరాటంతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‌లో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 388 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ముష్ఫికర్ (127) సెంచరీతో అదరగొట్టాడు. మూడో రోజు క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్.. సహచరులు వికెట్లు పారేసుకుంటున్నా ఓపిగ్గా ఆడుతూ చివరి వరకు పోరాడాడు. అయినప్పటికీ బంగ్లా ఇంకా 299 పరుగులు వెనకబడి ఉంది.
మూడో రోజు ఐదో వికెట్‌కి షకీబ్‌తో కలసి 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ముష్ఫికర్, మెహెదీ హసన్‌తో కలసి ఏడో వికెట్‌కి 87 పరుగులు జోడించాడు. నాలుగో రోజు టెయిలెండర్లతో కలసి కూడా ముష్ఫికర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో తన టెస్ట్ కెరీర్‌లో ఐదో సెంచరీని నమోదు చేసాడు. తనే ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకుంటూ స్కోరును పెంచే ప్రయత్నం చేసాడు. తొమ్మిదో వికెట్‌కు టస్కిన్ అహ్మద్‌తో కలసి విలువైన 39 పరుగులు జోడించాడు.
చివరకు ముష్ఫికర్ పోరాటానికి అశ్విన్ అడ్డుకట్ట వేశాడు. ముష్ఫికర్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ సాహా అద్భుతంగా ఒడిసి పట్టాడు. దీంతో లంచ్ విరామ సమయానికి బంగ్లాదేశ్ ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ బ్యాట్స్‌మెన్లు ఒక ఓవర్ ఎదుర్కొని లంచ్‌కు వెళ్లారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా ఒక పరుగు చేసింది. ఇంకా ఒకటిన్నర రోజు ఆట మిగిలి ఉండటంతో భారత విజయంపై కన్నేసింది. మరోవైపు బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ను డ్రా చేయాలని ప్రయత్నిస్తోంది. | 2sports
|
Hyderabad, First Published 6, Oct 2019, 3:05 PM IST
Highlights
ప్రభాస్ బాహుబలి తరువాత చేసిన యాక్షన్ డ్రామా సాహో అనుకున్నంతగా క్లిక్కవ్వలేకపోయింది. అయితే బాలీవుడ్ లో మాత్రం పరవాలేధనిపించే విధంగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక నెక్స్ట్ ఎలాగైనా సౌత్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత చేసిన యాక్షన్ డ్రామా సాహో అనుకున్నంతగా క్లిక్కవ్వలేకపోయింది. అయితే బాలీవుడ్ లో మాత్రం పరవాలేధనిపించే విధంగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక నెక్స్ట్ ఎలాగైనా సౌత్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రభాస్ నెక్స్ట్ జాన్ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు.
జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందట మొదలైంది. ఇక ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం ప్రభాస్ సిద్దమవుతున్నాడు. అక్టోబర్ ఎండింగ్ లోనే సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారట. పూజా హెగ్డే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పనులు పూర్తి చేయాలనీ దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక త్వరలో సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్ ని అలాగే టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేయాలనీ ప్రభాస్ ఆలోచిస్తున్నట్లు టాక్. ఇకపోతే ప్రస్తుతం పూర్తి నటీనటులను చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసుకుంటోంది. సినిమాలో విలన్ రోల్ కోసం జగపతి బాబును ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సౌత్ లో స్టార్ విలన్ గా అలాగే డిఫరెంట్ పాత్రలతో అలరిస్తున్న జగ్గూ భాయ్ ప్రభాస్ తో కూడా పోటీ పడేందుకు సిద్దమవుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
Last Updated 6, Oct 2019, 3:06 PM IST | 0business
|
Visit Site
Recommended byColombia
‘‘ఎయిర్ ఏషియా ఇండియా సిబ్బందిని 2,000 మందికి పెంచుకుని మరో మైలు రాయిని చేరింది. ఒక్క సంవత్సరంలోనే చాలా వరకు సిబ్బందిని పెంచుకుంది.’’ అని కంపెనీ తెలిపింది. టాటాగ్రూపు, మలేషియన్ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా సంయుక్త రంగంలో 51:49 వాటా నిష్పత్తితో ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను నిర్వహిస్తున్నాయి. ఇది 2014 జూన్లో సర్వీసులు ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో 20 ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది. 18 ఎయిర్ బస్ ఏ320 విమానాలతో సేవలందిస్తోంది. అంతర్జాతీయ సేవలను మొదలు పెట్టదలచుకున్న ఈ సంస్థ మరో రెండు విమానాలను జత చేసుకుంది. భారత నిబంధనల ప్రకారం దేశీయ విమానయాన సంస్థలు విదేశాలకు ప్రయాణించాలంటే 20 విమానాలు వాటి దగ్గర ఉండాలి. ఎయిర్ ఏషియా ఇండియా 2017-18 మార్చి త్రైమాసికంలో 2016-17 క్యూ 4లో కంటే 74 శాతం ఎక్కువగా 1.47 మిలియన్ల ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేర్చింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
Srilanka
లోపాలపై దృష్టి సారించిన శ్రీలంక
కొలంబో: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఘోరంగా పరాజయం చవిచూసిన శ్రీలంక దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.రెండవ టెస్టులో సఫారీలను ఎదుర్కొనే ముందు తమ క్రికెటర్లు మానసికంగా సిద్దం కావాల్సి ఉందని ఆ జట్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.పోర్టు ఎలిజిబెత్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో శ్రీలంక బ్యాటింగ్,బౌలింగ్లో సమిష్టిగా విఫలమై 206 పరుగులు భారీ తేడాతో పరాజయం చెందింది.దీంతో జట్టు లోపాలపై మేనేజ్మెంట్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా మొదటి టెస్టు పేలవ బౌలింగ్తో నిరాశపరిచిన చమీరాపై వేటు పడుతుందని అందురూ భావించారు.కానీ కెప్టెన్ మాథ్యూస్ అతనికి అండగా నిలిచాడు. చమీరా గాయం నుంచి కోలుకుని వచ్చాడు.అందుకే అతను వేగంగా బౌలింగ్ లయన్ అందుకో లేకపోయాడు. నేటి నుంచి కాక్టౌన్లో జరుగనున్న రెండవ టెస్టులో అతను మెరుగైన ప్రదర్శన చేస్తాడు అని మాథ్యూస్ ధీమా వ్యక్తం చేశాడు.పేసర్లకు అనుకూలించిన తొలి టెస్టులో శ్రీలంక ముగ్గురు పేసర్లు,ఒక స్పిన్నర్తో బరిలోకి దిగింది.రెండవ టెస్టు మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా ఆరంభం కానుంది. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ
దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త అందించింది. వివిధ రకాల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది
TNN | Updated:
Mar 28, 2018, 03:42PM IST
దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త అందించింది. వివిధ రకాల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. 10 నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర డిపాజిట్ల రేట్లు పెరిగాయి. ఎస్బీఐ వెబ్సైట్లో పేర్కొన్న విధంగా నూతన వడ్డీ రేట్ల అమలు ఉంటుంది. నూతన వడ్డీ రే్ల ప్రకారం 7 నెలలకు మించి ఏడాదికి లోపు రూ.1 కోటి కంటే తక్కువ ఉండే డిపాజిట్లకు వడ్డీ రేటు 6.40శాతంగా అమలవుతుంది. మిగిలిన వివరాలను ఈ కింద పటాల్లో చూడొచ్చు.
రూ. 1 కోటి లోపు డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు ఇవే
రూ.1 కోటి - రూ.10 కోట్ల మధ్య డిపాజిట్ల వడ్డీ రేట్లు
ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ
ఎస్బీఐ వెలువరించిన నోటిఫికేషన్ ప్రకారం ఎస్బీఐ ఉద్యోగులు, పింఛనుదారులకు సాధారణ వినియోగదారుల కంటే అదనంగా మరో 1% వడ్డీ అమలవుతుంది. ఇది వరకే చేసిన డిపాజిట్లను రెన్యువల్ చేస్తే వాటికీ, కొత్త డిపాజిట్లకు సైతం నూతన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. | 1entertainment
|
Hyderabad, First Published 11, Mar 2019, 12:35 PM IST
Highlights
బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఇటీవల ఓ షోలో కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్భాజ్ ఖాన్ మీడియా ద్వారా వెల్లడించాడు.
బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఇటీవల ఓ షోలో కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్భాజ్ ఖాన్ మీడియా ద్వారా వెల్లడించాడు. అర్భాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'పించ్' అనే కార్యక్రమానికి సన్నీ ఇటీవల హాజరయ్యారు.
సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలపై నెటిజన్లు చేసే కామెంట్లు.. వారు అడిగే ప్రశ్నల గురించి చర్చించడమే ఈ షో ప్రత్యేకత. ఈ క్రమంలో అర్భాజ్.. సన్నీలియోన్ ని తన కెరీర్ కి సంబంధించి చాలా ప్రశ్నలు అడిగారు.
అన్నింటికీ సమాధానాలు చెప్పుకొచ్చిన సన్నీ ఓ ప్రశ్న దగ్గర ఆగిపోయింది. ఓ నెటిజన్ సన్నీపై చేసిన అసభ్యకరమైన కామెంట్ ను చదివి వినిపించడంతో ఆమె వెంటనే ఏడ్చేసింది. ఆమెను ఓదార్చడానికి అర్భాజ్ చాలానే ప్రయత్నించారట.
సన్నీలియోన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టక ముందు శృంగార తారగా నటించింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవన్నీ మర్చిపోయి సినిమాలు చేసుకుంటుంటే ఇప్పుడు కూడా పాత విషయాలు గుర్తు చేసి బాధ పెడుతున్నారంటూ ఆమె బోరుమంది.
Last Updated 11, Mar 2019, 12:35 PM IST | 0business
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి | 1entertainment
|
Hyderabad, First Published 19, Oct 2018, 12:17 PM IST
Highlights
ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా విడుదలై మంచి టాక్ ని దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా ఎదు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఈ సినిమా రూ.77.31 కోట్ల షేర్ ని వసూలు చేసింది.
ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా విడుదలై మంచి టాక్ ని దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా ఎదు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఈ సినిమా రూ.77.31 కోట్ల షేర్ ని వసూలు చేసింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా యాభై కోట్లను క్రాస్ చేసి డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడురోజులకి రూ.52కోట్ల 66 లక్షలు వసూలు చేసింది. ఆంధ్ర,తెలంగాణాలలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు మార్కెట్ 70 కోట్లకు పైగా జరిగింది. అంటే ఇంకా మరో పాతిక, ముప్పై శాతం రాబట్టాల్సివుంది.
ఈ వారంలో 'హలో గురు ప్రేమకోసమే','పందెంకోడి2' సినిమాలు విడుదల కావడంతో కలెక్షన్స్ పరంగా అరవింద సమేతని కొంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే మెయిన్ థియేటర్లలో ఇంకా సినిమాను తీయలేదు కాబట్టి కలెక్షన్స్ స్టడీగా ఉండే అవకాశం ఉంది.
ఏరియాల వారీగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్(ఉభయ రాష్ట్రాల్లో)
నైజాం..................15,80 | 0business
|
వార్తలు
ఇండిగో విమాన టిక్కెట్లపై ఆఫర్లు... రూ.1099కే ప్రయాణం
దేశవాళీ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో పండుగ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు విమాన ప్రయాణ టిక్కెట్లపై సూపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రాంతాల మధ్య తక్కువ చార్జీలను ప్రకటించింది. ఈ కనీస చార్జీని రూ.1,099 నుం
pnr| Last Updated: బుధవారం, 20 సెప్టెంబరు 2017 (15:32 IST)
దేశవాళీ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో పండుగ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు విమాన ప్రయాణ టిక్కెట్లపై సూపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రాంతాల మధ్య తక్కువ చార్జీలను ప్రకటించింది. ఈ కనీస చార్జీని రూ.1,099 నుంచి టికెట్లను అందుబాటులో ఉంచింది. ఢిల్లీ - జైపూర్ రూట్లో ఈ ధర వర్తిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే, వైజాగ్ - హైదరాబాద్ మధ్య రూ.1,249ని ప్రయాణ టిక్కెట్గా నిర్ణయించింది. ఇక చెన్నై - బెంగళూరు మధ్య రూ.1,120, జమ్మూ - శ్రీనగర్ మధ్య రూ.1,168, వడోదరా - గౌహతీ మధ్య రూ.1,227, అగర్తలా - గౌహతీ మధ్య రూ.1,249, బెంగళూరు - చెన్నై మధ్య రూ.1,285, గోవా - బెంగళూరు మధ్య రూ.1,316 టికెట్లను అందుబాటులోకి ఉంచినట్టు పేర్కొంది.
అయితే, వైజాగ్ - హైదరాబాద్ల మధ్య అక్టోబరు నెలలో అనేక తేదీల్లో టిక్కెట్లు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 11, 12, 15, 17, 19, 27, 29, 31 తేదీల్లో చౌక ధరకు టికెట్లు ఉన్నాయి. సాధారణంగా అయితే, ఈ రెండు నగరాల మధ్య సూపర్ లగ్జరీ బస్సు టికెట్ రూ.746 కాగా, ప్రయాణ సమయం 14 గంటలు. అలాగే గరుడ ప్లస్ సర్వీస్ అయితే, రూ.1,171 టికెట్ ధర కాగా, 12 గంటల సమయం పడుతుంది. ముందుగా ప్లాన్ చేసుకుంటే ఈ మార్గంలో అదనంగా రూ.100 చెల్లిస్తే గంటన్నర వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ ప్రయాణ టిక్కెట్ ధరలు పన్నులతో కలుపుకుని.
సంబంధిత వార్తలు | 1entertainment
|
Visit Site
Recommended byColombia
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్పై ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్లను కైవసం చేసుకున్న టీమిండియా.. నేటి మ్యాచ్లో గెలిచి టీ20 సిరీస్ను కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తొలి టీ20 మ్యాచ్లో ఓడినా.. ఈ మ్యాచులో గెలిచి సిరీస్పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే కసితో విండీస్ జట్టు ఉంది. అయితే విండీస్పై విజయం సులభమేమీ కాదని ఈడెన్లో జరిగిన మ్యాచ్ ద్వారా అర్థమైంది. తక్కువ లక్ష్యాన్నే టీమిండియా చెమటోడ్చి ఛేదించింది. కాబట్టి ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ శుభారంభం జట్టుకు ఎంతో అవసరం. వీళ్లిద్దరూ 8 నుంచి 10 ఓవర్లు క్రీజులో నిలబడితే మిగిలిన పనిని మిడిలార్డర్ చూసుకుంటుంది.
భారత జట్టు: రోహిత్శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, మనీశ్పాండే, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్(కీపర్), కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్
వెస్టిండీస్ జట్టు: కార్లోస్ బ్రాత్వైట్(కెప్టెన్), షాయి హోప్, దినేశ్ రామ్దిన్(కీపర్), షిమ్రోన్ హెట్మైర్, డారెన్ బ్రావో, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, కీమో పాల్, ఫాబియన్ అలెన్, క్యారీ పియరీ, ఒషానె థామస్ | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వేలంలో ఫ్రాంఛైజీలు హిట్+ఫిట్ మంత్రం
ఐపీఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా బెంగళూరులో శనివారం జరుగుతోంది. ఫిటెనెస్, హిట్టింగ్ చేయగల సామర్థ్యం
TNN | Updated:
Jan 27, 2018, 02:13PM IST
ఐపీఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా బెంగళూరులో శనివారం జరుగుతోంది. ఫిటెనెస్‌, హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లపైనే ఎక్కువగా ఫ్రాంఛైజీలు మొగ్గుచూపాయి. గత ఏడాది తరహాలోనే ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ రూ. 12.5 కోట్లతో ఈ ఏడాది అత్యధిక ధరకి వేలంలో అమ్ముడుపోగా.. తర్వాత స్థానంలో భారత యువ ఓపెనర్ కేఎల్ రాహుల్ (రూ .11 కోట్లు) , మనీశ్ పాండే (రూ.11 కోట్లు), ఆస్ట్రేలియా హిట్టర్ క్రిస్‌లిన్ (రూ.9.6కోట్లు), మిచెల్ స్టార్క్ (రూ.9.4 కోట్లు), మాక్స్‌వెల్ (రూ.9కోట్లు) నిలిచారు. వీరంతా ఇప్పటికే టీ20 క్రికెట్‌లో తమదైన ముద్రవేసిన బ్యాట్స్‌మెన్.
చదవండి: ఐపీఎల్ వేలం లైవ్ అప్‌డేట్స్
పేలవ ఫామ్, ఫిటెనెస్‌లేమి కారణంగా టీమిండియా చోటు కోల్పోయిన యువరాజ్ సింగ్ రూ. 2కోట్ల ప్రాథమిక ధరకే పంజాబ్‌కి అమ్ముడుపోగా.. పేలవ ఫామ్‌తో ఉన్న టీ20 విధ్వంసక హిట్టర్ క్రిస్‌గేల్ ,కివీస్ హిట్టర్ మార్టిన్ గప్తిల్, భారత టెస్టు ఓపెనర్ మురళీ విజయ్, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్‌. హసీమ్ ఆమ్లా తదితర క్రికెటర్లు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరిపోయారు.
ఇప్పటి వరకూ అతి తక్కువ ధరకు అమ్ముడైన ఆటగాళ్లు: * స్టువర్ట్ బిన్నీ - రూ. 50 లక్షలు * జాసన్ రాయ్ - రూ. 1.5 కోట్లు * డుప్లెసిస్ - రూ. 1.6 కోట్లు * మొయిన్ అలీ - రూ. 1.7 కోట్లు * మున్రో, యూసుఫ్ పఠాన్ - రూ. 1.9 కోట్లు. | 2sports
|
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సినీ ప్రముఖులు
First Published 1, Dec 2017, 2:11 PM IST
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
గుంటూరులో జె.ఎల్.ఈ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సి
Recent Stories | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
దేశీ ఫోన్ పరిశ్రమకు ‘నోటు’ దెబ్బ
రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లతో వినియోగదారులు ఫోన్లు కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని అందించాలని దేశీ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాయి.
TNN | Updated:
Nov 28, 2016, 03:05PM IST
దేశీ ఫోన్ పరిశ్రమకు ‘నోటు’ దెబ్బ
రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లతో వినియోగదారులు ఫోన్‌లు కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని అందించాలని దేశీ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాయి. ఫోన్ల కొనుగోలుపై మరో నెలపాటు ఈ నోట్లు చెల్లుబాటయ్యేలా అనుమతి ఇవ్వాలని కోరాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశీ ఫోన్ల పరిశ్రమ ఆదాయం 50శాతం మేర పడిపోయిందని ప్రభుత్వానికి వివరించాయి. నోట్ల రద్దు వల్ల దేశీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, కార్బన్, లావా, సెల్‌కాన్ వంటి కంపెనీల ఆదాయం రూ. 175 నుంచి రూ. 200 కోట్ల వరకు పడిపోయింది. | 1entertainment
|
మహేష్,బన్నీల పోరుకు సూపర్ స్టార్ రజినీ మార్క్ పరిష్కారం
Highlights
ఏప్రిల్ 27న రజినీకాంత్ రోబో 2.0 విడుదలకు ముహూర్తం
ఇప్పటికే అదే తేదీన విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న మహేష్, బన్నీ
మహేష్ భరత్ అను నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలకు 2.0 ఎఫెక్ట్
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఈ ఇద్దరు స్టార్స్ వచ్చే ఏప్రిల్ లో బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నారు. అయితే అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా రిలీజ్ తేదీ ముందే ప్రకటించినా.. మహేష్ బాబు సినిమా భరత్ అను నేను అదే తేదీకి రిలీజ్ చేస్తామని నిర్మాత దానయ్య ప్రకటించడంతో ఇద్దరి మధ్యా వార్ మొదలైంది.
అయితే వీళ్లిద్దరి రిలీజ్ తేదీలను కన్ఫ్యూజన్ లో పడేస్తూ... 2018 ఏప్రిల్ లో తమిళ సూపర్ స్టార్ రజినీ నటించిన రోబో 2.0 రిలీజ్ ఏప్రిల్ 27న ప్లాన్ చేశారు. దీంతో ఇప్పుడు ‘సూపర్స్టార్’ రజనీకాంత్ తో, ‘ప్రిన్స్’ మహేశ్బాబు, ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ల సినిమాలు ఇదే సమయానికి విడుదల చేయాలని ఆయా చిత్రాల దర్శక-నిర్మాతలు నిర్ణయించడంతో బాక్సాఫీసు పోరు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అటు కోలీవుడ్లోనూ, ఇటు టాలీవుడ్లోనే ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే 2.0 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ నెలలో దీన్ని విడుదల చేయనున్నామని లైకా సంస్థ ప్రకటించింది. నిజానికి 2017 దీపావళికి ‘2.ఓ’ను తీసుకువస్తామని నిర్మాతలు తొలుత ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని జనవరి 25కు వాయిదా వేశారు. జనవరిలోపు వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావని భావించిన నిర్మాతలు తాజాగా విడుదల తేదీని ఏప్రిల్కు ప్రొలాంగ్ చేశారు. ఇలా ఈ సినిమా విడుదల అనుకోకుండా రెండు సార్లు వాయిదా పడింది.
‘స్పైడర్’ తర్వాత మహేశ్ నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. దీన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘శ్రీమంతుడు’ వంటి సూపర్హిట్ తర్వాత మహేశ్-కొరటాల కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. అను ఇమ్మాన్యుయెల్ కథానాయికగా నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. రామలక్ష్మీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ముందే వెల్లడించింది. ‘సరైనోడు’ విజయం తర్వాత బన్ని నటిస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక తాజా ప్రకటనతో ఏప్రిల్లో ‘2.ఓ’ విడుదలపై ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ నిర్మాతల్లో ఒకరైన బన్ని వాసు స్పందించారు. ఈ విషయాన్ని డీవీవీ దానయ్యతో కలిసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అదే విధంగా మహేష్ సినిమా నిర్మాత దానయ్య కూడా దీనిపై ఆలోచించాల్సిన అవసరం వుందని, ట్రేడ్ భాగస్వాములంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుందని అంటున్నారు.
వీటికి తోడు హాలీవుడ్ సినిమా ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ కూడా ఏప్రిల్27న భారత్లో విడుదల కాబోతోంది. సూపర్ హీరోల కథతో భారీ బడ్జెట్తో మార్వెల్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 2.30 కోట్ల వ్యూస్ను దక్కించుకుని రికార్డు సృష్టించింది. నిజానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 4న విడుదల కాబోతోంది. కానీ కేవలం భారత్లో మాత్రమే ఇంకాస్త ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇలా టాలీవుడ్ హీరోల పోటీకి మధ్యలో రజినీ 2.0, ఎవెంజర్స్ రావటంతో బన్నీ, మహేష్ ల సినిమాలకు విడుదల తేదీ మారుతుందా.. అన్నది సందేహాత్మకంగా మారింది.
Last Updated 25, Mar 2018, 11:38 PM IST | 0business
|
Equity Shares
భారత్లో ఫండ్ ఇన్వెస్టర్ల ఖాతాలు 5.3 కోట్లు
న్యూఢిల్లీ, నవంబరు 14: ఈక్విటీ ఫండ్ నిధులకుతోడు మ్యూచువల్ఫండ్ సంస్థలు ఈ ఏడాది మొదటి ఏడునెలల్లో 36లక్షల ఇన్వెస్టర్ ఖాతాలతో వేలాదికోట్లు ఈక్విటీ, డెట్రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నా యి. అదనంగా 36 లక్షల మంది ఇన్వెస్టర్లు రావడంతో మొత్తం ఎంఎప్ ఫండ్ ఇన్వెస్టర్ల సంఖ్య 5.13 కోట్లుగా ఉన్నట్లు అంచనా. 2015-16లో 59లక్షల ఫండ్ ఇన్వెస్టర్లు 22 లక్షలు2014-15లో ఉన్నా రు. గడచిన రెండేళ్లలో ఇన్వెస్టర్ ఖాతాలు భారీగాపెరిగాయి. చిన్నచిన్న పట్టణాలనుంచే ఎక్కువ ప్రాతి నిధ్యం కనిపించడంతో ఇన్వెస్టర్ ఖాతాలు కూడా పెరిగాయి. ఫోలియోస్గా పిలుచుకునే ఈ వ్యక్తిగత ఇన్వెస్టర్ ఖాతాలు ఒకే ఇన్వెస్టర్ విభిన్న ఫోలియోస్ను కూడా కలిగి ఉంటారు. మ్యూచువల్ఫండ్స్ అసోసియేషన్(ఆంఫీ) అంచనాలను చూస్తే మొత్తం ఇన్వెస్టర్ ఖాతాలు 43 ఫండ్ హౌస్లపరంగా ఉన్నా యి. మొత్తం ఫోలియోల సంఖ్య 5,12,87,934 వరకూ ఉన్నట్లు అంచనా. గతమార్చి నెలాఖరునాటికి 4,76,63,024 నుంచి 36.25 లక్షలమంది అదనంగా పెరిగినట్లు అంచనా. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే ఎక్కువ భాగస్వామ్యం పెరుగుతోంది. అందులోనూ చిన్నచిన్నపట్టణాలనుంచి మరింతవస్తున్నాయి. ఈక్విటీస్కీమ్స్లో ఎక్కువ నిధులురాక మొత్తం ఇన్వెస్టర్ ఖాతాలను పెంచుతున్నట్లు నిపుణులఅంచనా. ఈక్విటీ కేటగిరీలో 15లక్షల ఇన్వెస్టర్ ఖాతాలున్నా యి. ఏప్రిల్, అక్టోబరునాటికి 3.8కోట్లమంది ఉన్నట్లు అంచనా. మొదటి అర్ధసంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ 31వేలకోట్ల ఈక్విటీనిధులు కుమ్మరించినట్లుఅంచనా. మొత్తంగా చూస్తే 2.67లక్షల కోట్ల నిధులను వెల్లడించాయి. సెన్సెక్స్ ఈ ఆరునెలలకాలంలో 1శాతంపెరిగింది. మ్యూచువల్ఫండ్స్ అంటే వివిధ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించి ఒక వేదికగా ఏర్పాటుచేసి వాటిని మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ వృద్ధికి తోడ్పడతాయి. స్టాక్స్, బాండ్లు, నగదు మార్కెట్లలోను ఇతర ఆర్థిక పథకాల్లో ఈ పెట్టుబడులుంటాయి.
============ | 1entertainment
|
JET AIRWAYS
ప్యారిస్, ఆమ్స్టర్డామ్లకు జెట్ఎయిర్వేస్ ఆఫర్లు
హైదరాబాద్, జూలై 31: ఆమ్స్టర్డామ్, ప్యారిస్లకు ఫిక్సెడ్ వన్స్టాప్ రిటర్న్ఛార్జీలను జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఎకానమిక్లాస్లో రూ.39,990లు, ప్రీమియంక్లాస్లో రూ.99,990లుగా ప్రకటించింది. అంతర్జాతీయరూట్లలో నాన్స్టాప్ విమాన సర్వీసులు ప్రకటించింది. బెంగళూరు ఆమ్స్టర్డామ్, చెన్నైపారిస్ ముంబై లండన్రూట్లలో కూడా ఈ ఆఫర్లు లభి స్తాయని వెల్లడించింది. ఈ ఆఫర్ద్వారా సెప్టెంబరు 15వ తేదీ మొదలు అతిధు లు, ప్రత్యేకమైనఅన్ని పన్నులు కలుపుకు న్నటువంటి వన్స్టాప్ ఫ్లాట్ రిటర్న్పేర్లను ఎకానమిక్లాస్కు రూ.39,990లు, ప్రీమి యర్ట్రావెల్కురూ.99,990లకే ప్రయా ణాలుచేసే వీలు కల్పిస్తుంది.
అమృత్సర్నుంచి ఆమష్టర్డామ్కు ఉన్న టికెట్ధరలతోనే పూణెనుంచి ప్యారిస్కు వెళ్లవచ్చని జెట్వెల్లడించింది. వచ్చే అక్టోబరు 29వ తేదీనుంచి చెన్పైపారిస్, బెంగళూరు ఆమస్టర్డామ్, ముంబై లండన్హీత్రూ నాన్స్టాప్ సేవలపై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని భారత్ను యూరోప్లోని అన్ని నగరాలకు చేరువచేయడమే తమలక్ష్యంగాజెట్ ఎయిర్వేస్ వెల్లడించింది. | 1entertainment
|
pak test cricket team misbah ul haq retirement
కాస్త ఆగండి శుక్రవారం చెప్తా..
అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకునేదీ లేనిది శుక్రవారం ప్రకటిస్తానని పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ మిస్బావుల్ హక్ చెప్పాడు.
| Updated:
Jun 16, 2016, 10:14PM IST
అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకునేదీ లేనిది శుక్రవారం ప్రకటిస్తానని పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ మిస్బావుల్ హక్ చెప్పాడు. జూలై నెలలో ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే మిస్బావుల్ హక్ అంతర్జాతీయంగా అన్ని క్రికెట్ ఫార్మాట్ మ్యాచుల నుండి రిటైర్ కానున్నాడని పాక్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై అతను పెదవి విప్పాడు. ఒక రోజు వేచి ఉంటే శుక్రవారం నాడు ఏ సంగతీ తెలుపుతానన్నాడు. జూలై నెలలో పాక్ జట్టు బ్రిటీష్ జట్టుతో నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైపోయింది. గత ఏడాదే వన్డేల నుండి తప్పుకున్న ఉల్ హక్ ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పటి వరకు 61 టెస్టుల్లో పాల్గొన్నాడు. | 2sports
|
internet vaartha 157 Views
న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చాలనేది అభిమానుల చిరకాల డిమాండ్.దీన్ని నిజం చేస్తామంటుంది ఇటాలియన్ క్రికెట్ బోర్డు.కాగా ఇటలీకి అంతర్జాతీయ క్రికెట్ జట్టు లేదుగా ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇందులోనూ ఒక మెలిక ఉంది. అదేమిటంటే 2024 ఒలింపిక్స్ బిడ్డింగ్ను రోమ్ దక్కించుకోవాలి, రోమ్ నగరానికి ఆతిథ్యం ఒకే అయితే క్రికెట్ను ఒలింపిక్స్లో చేరుస్తామని ప్రకటించారు ఇటాలియన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెమన్ గాంబియానో. ఆతిథ్య దేశానికి ఏవైనా అయిదు క్రీడలను ఒలింపిక్స్లో చేర్చే హక్కు ఉంటుంది.కాగా ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకుని క్రికెట్ను ఒలింపిక్స్లో చేర్చుతామని ఆయన ప్రకటించాడు. 2024లో ఒలింపిక్స్కు ఆతిథ్యం కోసం రోమ్తో పాటు ప్యారిస్,బుడాపెస్ట్,లాస్ ఏంజిల్స్ పోటీ పడుతున్నాయి.ఒకవేళ రోమ్ బిడ్డింగ్ గెలిస్తే బోలోగొనాలో క్రికెట్ మ్యాచ్లను నిర్వహించనున్నారు.2010లో వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ నాలుగు మ్యాచ్లు అక్కడే జరిగాయి.ఇక 2024 ఒలింపిక్స్ బిడ్ను రోమ్ దక్కించుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. | 2sports
|
sri reddy takes fb followers help to whether she participate in bigg boss tamil or bigg boss telugu
Bigg Boss 3లో శ్రీరెడ్డి.. కాంపిటీటర్స్గా అభిరామ్, నాని.. ఓన్లీ వన్స్ ఫసక్
శ్రీ రెడ్డి బిగ్ బాస్ 3లో ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తన ఎంట్రీపై ఆమె ఆసక్తికర పోస్ట్ చేసింది. తెలుగు లేదా తమిళంలో.. ఏ షోలో చేయాలో చెప్పండని తన ఫాలోవర్లను కోరింది.
Samayam Telugu | Updated:
May 31, 2019, 08:41PM IST
కాస్టింగ్ కౌచ్తో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తోందని రూమర్లు షికార్లు చేస్తున్నాయి. శ్రీరెడ్డి బిగ్ బాస్ తెలుగులో పార్టిసిపెట్ చేయనుందని ప్రచారం జరిగింది. తాజాగా.. ఆమె బిగ్ బాస్ తమిళం మూడో సీజన్లో కంటెస్ట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఆమె తెలుగులో చేయడానికి బిగ్ బాస్ నిర్వాహాకులు అంగీకరించలేదని.. తమిళంలో కంటెస్ట్ చేయడానికి ఓకే చెప్పారనేది లేటెస్ట్గా వినిపిస్తోన్న మాట.
తన బిగ్ బాస్ ఎంట్రీపై ఇంకా కన్ఫ్యూజన్ ఉండగానే.. శ్రీ రెడ్డి ఈ విషయమై ఆసక్తికర పోస్ట్ చేసింది. మీలో ఎంత మంది నన్ను బిగ్ బాస్ తమిళంలో లేదా తెలుగులో చూడాలని అనుకుంటున్నారు..? దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతానని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. | 0business
|
Sensex
రికవరీ బాటలో స్టాక్ మార్కెట్లు
ముంబయి: మూడురోజుల నష్టాలబాట నుంచి స్టాక్ మార్కెట్లు మంగళవారం కొంతవరకూ రికవరీ అయ్యాయి. ఐటి స్టాక్స్ కొంతమేర రికవరీ అయ్యా యి. మొత్తంగా సెంటిమెంట్పరంగాచూస్తే ఆర్థిక ఫలితాల సీజన్ రావడంతో కొంతమేర ఇన్వెస్టర్లు అప్రమత్తంఅయ్యారు. అంతేకాకుండా మధ్యతూర్పు ప్రాంతంలోను, కొరియా ప్రాంతంలోనెలకొన్న భౌగో ళిక ఉద్రిక్తతలు కూడా స్టాక్ మార్కెట్లలో కొంతమేర మందగమనానికి కారణం అయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 213పాయింట్లు పెరిగి 29,788 పాయిం ట్ల వద్ద ట్రేడింగ్ నిలిపివేస్తే ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 సూచి కూడా 55 పాయింట్లుపెరిగి 9237 పాయిం ట్ల వద్ద స్థిరపడింది.
ఇక బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్సూచీలు 0.4శాతం, ఒకటిశాతం చొప్పున పెరిగాయి. మార్కెట్లపరంగా మొత్తంగాచూస్తే బిఎస్ఇలో 1719 కంపెనీలషేర్లు పెరిగాయి. 1154 కంపెనీతల షేర్లుస్వల్పంగా క్షీణిస్తే మరో 148 షేర్లు స్థిరంగా ట్రేడింగ్ కొనసాగించాయి. అంతర్జాతీయ ధోరణులు, బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ, ఐటి స్టాక్స్లో రికవరీ సెంటిమెంట్కు మద్దతునిచ్చాయని వీటికి తోడు జిఎస్టి సకాలంలోనే అమలవుతున్నదన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో పెరగడం కూడా మార్కెట్ల రికవరీకి కారణం అయిందని జియోజిత్ ఆర్థికసేవల సంస్థ పరిశోధక విభాగం హెడ్ వినోద్ణాయర్ అన్నారు. దీనివల్ల ఇన్ఫ్రారంగంలో పెట్టుబడులు, పటిష్టపడుతున్న రూపాయి వంటివి వినియోగ వ్యయాన్ని పునరుద్ధరింపచేస్తాయని వీటికితోడు 4వ త్రైమాసిక ఫలితాల సీజన్ కూడా మరికొంత కార ణం అయిందని నాయర్ వెల్లడించారు. నిఫ్టీ పిఎస్యు బ్యాంకింగ్సూచి రెండుశాతం పెరిగింది. సిండికేట్బ్యాంకు 4.5శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు 4శాతం, ఓరియంటల్ బ్యాంకు 3శాతం, నిఫ్టీ బ్యాంకు ఒకటిశాతం, చొప్పున పెరిగాయి. మొత్తంగా సూచి 18.4శాతం బలపడిందని చెప్పా లి.
ఇన్ఫోసిస్ ఆర్థికఫలితాలు వెల్లడించనున్న నేప థ్యంలో ఐటిరంగం షేర్లపై ఇన్వెస్టర్ల ఆసక్తిపెరిగిం ది. ఇన్ఫీఫలితాలతోనే భారీ దిగ్గజాల కార్పొరేట్ ఫలితాలు ఆరంభం అవుతాయి. ఇప్పటివరకూ ఏడుశాతం వరకూ దిగజారిన షేర్లు సోమవారం నుంచి 1.5శాతం మేర పెరి గాయి. నిఫ్టీ ఐటిసూచి 0.6శాతం గరి ష్టంగా పెరిగింది. 1.4శాతం ముదురోజు నష్టాల నుంచి రికవరీ అయింది. స్పైస్జెట్ 2.9శాతంపెరిగి 100కు చేరింది. ఛైర్మన్ అజ§్ుసింగ్పై సెబి జారీ చేసిన క్రమశిక్షణ సంజాయిషీలతో కొంతమే ఒడి దుడుకులకు లోనయ్యాయి. టాటాపవర్, అదాని పవర్లకు విద్యుత్ అప్పిలేట్ట్రిబ్యునల్ జారీచేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనపెట్టడంతో ఈ కంపెనీలకు కొంతప్రతికూలం అయింది. అప్పి లేట్ ట్రిబ్యునల్ పరిహారపూర్వక టారిఫ్ అను మతించడాన్ని సుప్రీం తిరస్కరించింది.
అదాని పోర్టులు 5శాతం దిగజారి 334రూపాయలవద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్లో అదానిపోర్ట్సు ఎక్కువ నష్ట పోయింది. అంతర్జాతీయ మార్కెట్లపరంగా చూస్తే యూరోపియన్ మార్కెట్లు స్వల్పంగా దిగువన ప్రారంభం అయ్యాయి. మధ్యతూర్పు దేశాలు, కొరియా ప్రాంతాల ఉద్రిక్తతలే ఇందుకు కీలకం. యూరోపియన్ యూరోస్టాక్స్600 సూచీలో జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ సిఎసిలు 0.1 శాతం దిగజారితే బ్రిటన్ ఎఫ్టిఎస్ఇ 100 0.5శాతం లాభపడింది. ఆసియా మార్కెట్ల పరంగాచూస్తే జపాన్ బయటిప్రాంతషేర్లు 0.3 శాతం నష్టపోయాయి. టోక్కోనిక్కీ 0.3శాతం దిగు వన ముగిసింది. చైనా షేర్లు 0.4శాతం, హాంకాంగ్ స్టాక్స్ 0.9శాతం దిగజారాయి. దక్షిణకొరియా, తైవాన్ షేర్లు కూడా నష్టాల్లోనే ముగిసాయి.
===== | 1entertainment
|
Visit Site
Recommended byColombia
''నాన్నకు ప్రేమతో' చిత్రానికి సంబంధించిన ఒక సాంగ్ పోస్టర్లోని బ్యాక్గ్రౌండ్ ముస్లిం సోదరుల మనో భావాలను కించపరిచే విధంగా వుందని మా దృష్టికి వచ్చింది. మేం అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తాం. అందుకే ఆ పోస్టర్లోని బ్యాక్గ్రౌండ్ని తొలగించి కొత్త పోస్టర్ను విడుదల చేశాం. అలాగే సినిమాలోని ఆ సాంగ్లో కూడా బ్యాక్గ్రౌండ్ను మార్చేస్తున్నాం. మేం విడుదల చేసిన పోస్టర్ వల్ల ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి మేం బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. వారి మనోభావాలను దెబ్బతియ్యాలనికానీ, వారికి చెడు తలపెట్టాలని కానీ మా ఉద్దేశం కాదు. అన్ని మతాల వారికి స్వేచ్ఛ, గౌరవంగా జీవించే హక్కు వుంది. ఆ పోస్టర్ అనుకోకుండా వచ్చిందే తప్ప ముస్లిం సోదరులను బాధ పెట్టాలన్న ఉద్దేశంతో రిలీజ్ చేసింది కాదు'' అని అన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘జవాన్’ ప్రేమపాట: ఔననా.. కాదనా..!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రేమపాఠాలు వల్లిస్తున్నాడు. మీరు ప్రేమ విషయంలో గందరగోళంగా ఉన్న ఆ క్షణం!
TNN | Updated:
Nov 16, 2017, 09:08AM IST
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రేమపాఠాలు వల్లిస్తున్నాడు. ‘మీరు ప్రేమ విషయంలో గందరగోళంగా ఉన్న ఆ క్షణం! ఔననా.. కాదనా.. పాట ఆ ఎమోషన్స్‌తో కూడిన ప్రయాణాన్ని అందిస్తుంది. ‘జవాన్’ మెలోడీని ఇప్పుడే వినండి’ అని తన అభిమానులకు, ప్రేక్షకులకు తేజు చెబుతున్నాడు. ఇంతకీ మన హీరో ఈ ప్రేమపాఠాలు చెప్పడానికి గల కారణం ఆయన సినిమా ‘జవాన్’లో మరో పాట విడుదల కావడమే. ‘జవాన్’లోని ఔననా.. కాదనా.. అనే మెలోడీని గురువారం ఉదయం విడుదల చేశారు. థమన్, శ్రేయా గోషల్ ఆలపించిన ఈ పాట అద్భుతంగా ఉంది. ఈ పాట విడుదల చేసినట్లు తేజు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
That moment when you are confused over love! #AunanaaKaadanaa song gives you a ride through those emotions! Tune in to the #JawaanMelody now!❤ #teamjawaan https://t.co/muiQsieORC #HappyBirthdayThaman
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 16, 2017
సాయిధరమ్, మెహ్రీన్ జంటగా తెరకెక్కుతున్న కొత్తసినిమా ‘జవాన్’. దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత బి.వి.ఎస్.రవి దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కోటా శ్రీనివాసరావు, ప్రసన్న, సత్యం రాజేశ్ తదితరులు ఇతర తారాగణం. ఇప్పటికే ‘జవాన్’ నుంచి మూడు పాటలను విడుదల చేశారు. జవాన్ టైటిల్ సాంగ్, బుగ్గంచున, బంగారు పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు ఈ మెలోడి కూడా ఆకట్టుకోవడం ఖాయం. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Baba Bhaskar: బాబాపై హిమజ ఆగ్రహం.. ప్లేట్ విసిరి, గుడ్లు నేలకోసి కొట్టి రచ్చ రచ్చ
Baba Bhaskar: బాబా భాస్కర్ మాస్టార్.. తింటుంటే ఎన్నిసార్లు అంటారు అంటూ ప్లేట్ నేలకేసి కొట్టి రచ్చ రచ్చ చేసిన హిమజ. ఇంట్లో ఉన్న గుడ్లు మొత్తం పగలగొట్టేసింది.
Samayam Telugu | Updated:
Aug 23, 2019, 08:07PM IST
Baba Bhaskar: బాబాపై హిమజ ఆగ్రహం.. ప్లేట్ విసిరి, గుడ్లు నేలకోసి కొట్టి రచ్చ రచ...
బిగ్ బాస్ హౌస్ అంతకంతకూ రణరంగంగా మారిపోతుంది. ఐదోవారం చేరేనాటికి హౌస్లో హీట్ పెరిగింది. ఒకర్నొకరు దూషించుకుంటూ కొట్టుకునేందుకు సిద్ధపడుతున్నారు. తొలివారంలో మహేష్ విట్టా, వరుణ్ సందేశ్లు వితికా విషయంలో కొట్టుకునేందుకు సిద్ధపడగా.. గత ఎపిసోడ్లో అలీ రజా, మహేష్ విట్టాలు రారా అంటే రారా అనుకునేంత వరకూ వెళ్లారు.
అయితే హౌస్లో వివాద రహితుడిగా పేరొందిన మిస్టర్ పర్ఫెక్ట్ బాబా భాస్కర్ ఈరోజు హౌస్లో మంట పెట్టారు. కిచెన్లో ఆమ్లెట్లు వేస్తూ.. తింటున్న హిమజను ఏదో అనడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది.
Read Also: రవిని ఇష్టపడ్డ తమన్నా.. కాదన్నాడనే ఆ కసి: బండారం బయటపెట్టిన రోహిణి
తినేటప్పుడు ఎన్నిసార్లు అంటారు.. అంటూ ప్లేట్లో ఉన్న ఆమ్లెట్ను విసిరికొట్టింది. అంతటితో ఆగకుండా గుడ్లు అట్ట మొత్తాన్ని నేలకేసి బాది పగలగొట్టేసింది. హిమజ పిచ్చిపట్టిన దానిలా రచ్చ రచ్చ చేస్తుంటే.. నోరెళ్లబెట్టి చూడటం మిగిలిన కంటెస్టెంట్స్ వంతు అయ్యింది. ఇక గొడవకు కారణమైన బాబా భాస్కర్ మాత్రం.. ఆమె ఏం చేసిన నా క్యారెక్టర్ మాత్రం మారదు’ అంటూ తెగేసి చెప్తున్నారు. మరి ఈ రచ్చ ఎందుకు వచ్చింది? ఏం జరగింది అన్నది ఈరోజు ఎపిసోడ్లో తేలనుంది.
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.