news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Hyderabad, First Published 6, Nov 2018, 7:11 PM IST Highlights భారీ అంచనాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.  భారీ అంచనాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. 2 పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే నటీనటులందరూ ఫిక్స్ అయ్యారు.  ఇకపోతే ప్రస్తుతం మరొక పాత్ర కోసం బాహుబలి హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు టాక్.  ఎన్టీఆర్ తో అలనాటి నటి సరోజినీ దేవి ఎన్నో పాత్రలు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు సరోజినీ దేవి పాత్ర కోసం దర్శకుడు క్రిష్ అనుష్కను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.  ఇదివరకే ఈ ఇద్దరు వేదం సినిమాకు పని చేయడంతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది గనక క్రిష్ చెబితే అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఉంటుందా అనే టాక్ వస్తోంది. ఇక ప్రస్తుతం దర్శకుడు కథానాయకుడు లో ఎన్టీఆర్ సినిమా కెరీర్ కు సంబందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. సంబంధిత వార్తలు..
0business
Shika Pandi1 లక్షల జీతం ఉద్యోగం వదులుకున్న షికా పాండే న్యూఢిల్లీ: లక్షల్లో జీతం…ఓ కార్పోరేట్‌ కంపెనీలో ఉద్యోగం. ఇంతటి మంచి అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. అయినా సరే ఆమె వద్దు అనుకుంది. ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులుకోవడానికి ఏదైనా కారణం ఉందా..? అవుననే చెప్పాలి. అదే దేశం తరుపున క్రికెట్‌ ఆడే అవకాశం ఆమెను ఈ ఉద్యోగాన్ని వదులుకునేలా చేసింది. క్రికెట్‌పై ఉన్న మమకారం ఆమెను భారత మహిళల జట్టులో చోటు దక్కించుకునేలా చేసింది. ఆమె మరెవరో కాదు. ప్రస్తుతం భారత మహిళల జట్టులో పేస్‌ సంచలనంగా రాణిస్తున్న షికా పాండే. గోవాకు చెందిన షికా పాండే చిన్నతనం నుంచే చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. 15ఏళ్ల వయసులోనే 2004 నుంచి గోవా తరుపున మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత 2007-08 సీజన్‌లో గోవా మహిళల సీనియర్‌ జట్టుకు ఆడింది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు క్రికెట్‌లో రాణించింది. అంతేకాదు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. మల్టీ నేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా…భారత మహిళల జట్టులో స్థానం కోసం వాటిని రద్దు అనుకుంది. ఈ నేపథ్యంలో 2010 ఇంగ్లాండ్‌ పర్యటనకు ఆమెను జట్టులో ఎంపిక చేయకపోవడంతో అనంతరం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత అక్కడ ట్రైనింగ్‌ పూర్తిచేసుకుని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరింది. ఈ ఉద్యోగం చేస్తూను తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ కలను మాత్రం ఎంత మాత్రం వీడలేదు. ఆ తర్వాత క్రికెట్‌ వల్ల ఆమెకున్న మక్కువ, ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు 2014 బంగ్లాదేశ్‌తో టీ20 పర్యటనకు జట్టుకు ఎంపికచేశారు. బంగ్లాదేశ్‌ పర్యటనలో షికా పాండే అద్భుత ప్రదర్శన చేసి భారత మహిళల జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం మహిళా వరల్డ్‌ కప్‌లో ఫాస్ట్‌ బౌలర్‌గా అద్భుత ప్రదర్శన చేస్తోంది. మరో ఫేసర్‌ ఝలన్‌ గోస్వామితో కలిసి చక్కటి స్పెల్‌ వేస్తోంది. ఇదిలా ఉంటే గోవా తరుపున పురుషుల్లో గానీ, మహిళల్లో గానీ ఇప్పటివరకు జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. దీంతో గోవా రాష్ట్రం తరుపు నుంచి భారత క్రికెట్‌ జట్టుకు ఆడుతున్న ఏకైక క్రికెటర్‌గా షికా పాండే అరుదైన గుర్తింపు సాధించింది.
2sports
Hyderabad, First Published 18, Aug 2019, 8:28 PM IST Highlights యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొని ఉంది.  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొని ఉంది.  ప్రీరిలీజ్ ఈవెంట్ లో మురళి శర్మ మాట్లాడుతూ.. సాహో ట్రైలర్ లోని డైలాగ్ చెప్పి అలరించారు. యువి క్రియేషన్స్ తన సొంత సంస్థ లాంటిది అని మురళి శర్మ తెలిపారు. నేను ఈ చిత్రం కోసం 75 రోజులు షూటింగ్ లో పాల్గొంటే 50 రోజులు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వచ్చిందని మురళి శర్మ తెలిపారు. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ కూడా వేదికపై మాట్లాడారు.
0business
Dec 22,2017 అల్వాల్‌లో ఇండియన్‌ బ్యాంకు కొత్త శాఖ నవతెలంగాణ, బిజినెస్‌ డెస్క్‌: హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఇండియన్‌ బ్యాంకు నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కొత్త శాఖను మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ సురేందర్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ ప్రజలకు బ్యాంకు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జోనల్‌ మేనేజర్‌ మనోహర్‌ మాట్లాడుతూ ఈ కొత్త శాఖ ప్రారంభంతో జంటనగరాలలో ఇండియన్‌ బ్యాంకు శాఖల సంఖ్య 51కి చేరిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 108 శాఖలతో రూ.13,300 కోట్ల వ్యాపారం కలిగి ఉందన్నారు. కాగా హైదరాబాద్‌ నెట్‌వర్క్‌లో మొత్తం 55 బ్యాంకు బ్రాంచీలతో రూ.11,000 కోట్ల వ్యాపారానికి చేరిందన్నారు. వచ్చే ఏడాది మార్చి ముగింపు నాటికి రూ.13,000 కోట్ల వ్యాపారాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ బ్యాంకు కార్పొరేట్‌ ఆఫీస్‌ (ఆర్‌బీడీ) జనరల్‌ మేనేజర్‌ డి దేవరాజ్‌, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ జీవీఎస్‌ఆర్‌ఆర్‌కె శర్మ, ఏజీఎం సుధాకర్‌ రావు, ఇతర బ్యాంకింగ్‌ అధికారులు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyd Internet 69 Views NEW NOTE NEW NOTE న్యూఢిల్లీ: దేశంలో నోట్ల రద్దు తరువాత విభిన్న వర్ణాల్లో 2 వేలు,500,200,50 రూపాయల నోట్లు దర్శనమిస్తున్నాయి.త్వరలో కొత్త 100 నోటు కూడా రానుంది.కాగా 2016లో ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే.దీంతో 1000,500 నోట్ల చెలామణి పూర్తిగా నిలిచిపోయింది.వాటి స్థానంలో విడతల వారీగా డిమాండ్‌ను బట్టి కొత్త 2000,500,200,50 నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కొత్త 100 నోట్లను అందుబాటులోకి తీసుకురానుంది.ఇందుకోసం ఇప్పటికే ముద్రణ ప్రారంభించనున్నట్లు సమాచారం.అన్ని కుదిరితే 2018 ఏప్రిల్‌ నాటికి ఈ కొత్త 100 నోటు అందుబాటులోకి రానుంది.ఈ నోటు విపణిలోకి వచ్చిన తరువాత కూడా పాత 100 నోట్లు చెల్లుతాయని ఆర్‌బిఐ వర్గాలు చెబుతున్నాయి.
1entertainment
I Don't Believe in Farewells says Ashish Nehra రిటైర్మెంట్ మ్యాచ్‌పై నెహ్రా స్పందన భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో బుధవారం TNN | Updated: Nov 1, 2017, 02:44PM IST భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో బుధవారం రాత్రి జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో నెహ్రా తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కి వీడ్కోలు చెప్పబోతున్నాడు. 1999లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఆశిష్ నెహ్రా.. మొత్తం 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లాడాడు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు వికెట్లు పడగొట్టి భారత్ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న నెహ్రా.. అనంతరం గాయాల కారణంగా జట్టుకి చాలా రోజులు దూరమైపోయాడు. ఫిటెనెస్ సమస్యలతో క్రమంగా టెస్టు, వన్డేలకి దూరమైన ఈ వెటరన్ బౌలర్ టీ20ల్లో మాత్రం గత రెండేళ్లుగా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు నెహ్రాని ఎంపిక చేసినా.. తుది జట్టులో మాత్రం అతనికి చోటు లభించలేదు. ఈ చర్చ నడుస్తుండగానే.. తాను నవంబరు 1న క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పబోతున్నట్లు నెహ్రా ప్రకటించాడు. చివరి మ్యాచ్‌ కావడంతో ఈ రోజు తుది జట్టులో నెహ్రాకి చోటు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. కానీ.. భరోసా మాత్రం ఇవ్వలేమని ఇటీవల భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రోహిత్ సిక్సర్ల మోత.. డివిలియర్స్ రికార్డ్ బ్రేక్ శ్రీలంకతో జరిగిన టీ20లో సిక్సర్ల మోత మోగించిన రోహిత్.. డివిలియర్స్ నెలకొల్పిన రికార్డును తుడిచేశాడు. TNN | Updated: Dec 23, 2017, 05:20PM IST రోహిత్ సిక్సర్ల మోత.. డివిలియర్స్ రికార్డ్ బ్రేక్ ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ మెరుపు శతకంతో చెలరేగాడు. ఫాస్టెస్ట్ సెంచరీ సహా అనేక రికార్డులను రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. 43 బంతుల్లోనే 118 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. ఇంతకు ముందు డేవిడ్ మిల్లర్ కూడా 35 బంతుల్లోనే శతకం బాదాడు. ఇండోర్ మ్యాచ్‌‌లో తొలి 50 పరుగుల్ని 23 బంతుల్లో పూర్తి చేసిన రోహిత్.. ఆ తర్వాత విశ్వరూపం చూపాడు. సిక్సర్ల మోత మోగిస్తూ.. 12 బంతుల్లోనే తర్వాతి 50 పరుగులు పూర్తి చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మొత్తం పది సిక్సర్లు బాదిన రోహిత్.. ఓ టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది 64 సిక్సర్లను తన ఖాతాలో వేసుకున్న రో‘హిట్’ తద్వారా ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్లు సంధించిన క్రికెటర్‌గా ఏబీ డివిలియర్స్ రికార్డును బ్రేక్ చేశాడు. 2015లో డివిలియర్స్ 63 సిక్సర్లు బాదాడు. 2012లో మూడు ఫార్మాట్లలో క్రిస్ గేల్ 59 సిక్సర్లు బాదగా.. మూడేళ్ల తర్వాత దాన్ని ఏబీ బ్రేక్ చేశాడు. ఈ సఫారీ బ్యాట్స్‌మెన్ నెలకొల్పిన రికార్డును రోహిత్ రెండేళ్లలోపే బద్దలు కొట్టడం విశేషం. రోహిత్ మెరుపు సెంచరీతో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ20ల్లో ఇదే రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఈ సెంచరీ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో రెండో శతకం బాదిన మెక్‌కల్లమ్, గేల్, లూయిస్, కాలిన్ మున్రోల సరసన రోహిత్ నిలిచాడు. ఈ ఏడాది కోహ్లి అత్యధికంగా 11 సెంచరీలు చేయగా, రోహిత్ 8 సెంచరీలతో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV జియో పేమెంట్స్ బ్యాంకు సేవ‌లు ప్రారంభం టెలికాం రంగంలో సంచ‌ల‌నాలు సృష్టించిన రిల‌య‌న్స్ జియో మంగ‌ళ‌వారం నుంచి త‌న చెల్లింపుల‌(పేమెంట్స్) బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది Samayam Telugu | Updated: Apr 4, 2018, 02:28PM IST చెల్లింపుల బ్యాంకు సేవ‌ల‌ను ప్రారంభించిన జియో టెలికాం రంగంలో సంచ‌ల‌నాలు సృష్టించిన రిల‌య‌న్స్ జియో మంగ‌ళ‌వారం నుంచి త‌న చెల్లింపుల‌(పేమెంట్స్) బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. ఈ విష‌యాన్ని నిన్న ఆర్‌బీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఏప్రిల్ 3 నుంచి జియో పేమెంట్స్ బ్యాంకు సేవ‌లు మొద‌లైన‌ట్లు నోటిఫికేష‌న్లో ఆర్బీఐ వెల్లడించింది. చెల్లింపుల బ్యాంక్ కోసం 2015 ఆగ‌స్టులో జియో స‌హా 11 సంస్థ‌ల‌కు ఆర్‌బీఐ నుంచి సూత్ర‌ప్రాయ‌మైన ఆమోదం ల‌భించింది బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను మొద‌లుపెట్టిన జియో పేమెంట్స్ బ్యాంకు ఆ 11 సంస్థ‌ల‌లో టెలికాం దిగ్గ‌జం ఎయిర్‌టెల్ మాతృ సంస్థ‌గా ఉన్న‌ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ మొద‌టిసారిగా 2016 న‌వంబ‌ర్‌లోనే కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. ఆ త‌ర్వాత 2017 మేలో పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభ‌మైంది. త‌దుప‌రి ఫినో పేమెంట్స్ బ్యాంక్ 2017 జూన్‌లో త‌న సేవ‌ల‌ను మొద‌లుపెట్టింది. ఆదిత్యా బిర్లాకు చెందిన ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్య‌క‌లాపాలు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 22న మొద‌ల‌య్యాయి. భార‌త త‌పాలా శాఖకు కూడా అనుమ‌తులు ల‌భించిన‌ప్ప‌టికీ ఇంకా కార్య‌క‌లాపాలు మొద‌లు పెట్ట‌లేదు.
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పుణెలో కివీస్ ఓటమికి కారణమిదే..? పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను TNN | Updated: Oct 26, 2017, 12:10PM IST పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను చేజార్చుకోవడమేనని కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ అభిప్రాయపడ్డాడు. పిచ్ నుంచి సహకారం లభించడంతో భారత ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా వరుసగా మార్టిన్ గప్తిల్ (11), విలియమ్సన్ (3), కోలిన్ మున్రో (10) వికెట్లను పడగొట్టారు. దీంతో 7 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 27/3తో కష్టాల్లో పడింది. ఇలా వికెట్లు చేజార్చుకోవడంతోనే ఎక్కువ స్కోరుని భారత్‌ ముందు ఉంచలేకపోయామని.. ఇదే కివీస్‌ విజయావకాశాల్ని దెబ్బతీసిందని శాంట్నర్ వివరించాడు. ‘మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్టు తొలి 10 ఓవర్లలోనే మూడు ప్రధాన వికెట్లను చేజార్చుకుని.. తిరిగి మ్యాచ్‌లో పుంజుకోవడం చాలా కష్టం. పుణె వన్డే ఆరంభంలోనే 27/3తో మా జట్టు ప్రదర్శన చాలా నిరాశ కలిగింది. ఇక్కడ ఘనత అంతా భారత పేసర్లకే దక్కాలి. పదునైన బౌలింగ్‌తో వారు కివీస్‌ని ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో మా జట్టు చివరికి 230 పరుగులకే పరిమితమయ్యింది. ఇక్కడే దాదాపు మ్యాచ్ చేజారినట్లే. ఇక ఛేదనలో శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్ చివరి వరకూ క్రీజులో నిలిచి కివీస్‌కి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పని పూర్తి చేశారు’ అని శాంట్నర్ వివరించాడు. భారత్ జట్టు ఈ వన్డే విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. విజేత నిర్ణయాత్మక వన్డే ఆదివారం కాన్పూర్ వేదికగా జరగనుంది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Stock Market: కోలుకుంటున్న దేశీయ మార్కెట్లు! మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌‌మార్కెట్లు.. కాసేపటి తర్వాత లాభాల బాట పట్టాయి.. Samayam Telugu | Updated: Sep 25, 2018, 11:27AM IST క్రితం ట్రేడింగ్‌లో భారీ స్థాయిలో పతనమైన దేశీయ స్టాక్‌‌మార్కెట్లు మంగళవారం కోలుకుంటున్నాయి. ఉదయం నిఫ్టీ 14 పాయింట్లు, సెన్సెక్స్‌ 6 పాయింట్ల నష్టంలో ఉదయం ట్రేడింగ్ ప్రారంభించాయి. కాసేపటికే 100 పాయింట్లకు పైగా కోల్పోయింది. పరిస్థితి అలాగే ఉండటంతో సెన్సెక్స్ ఒక దశలో 200 పాయింట్ల వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడటంతో సెన్సెక్స్ కోలుకుని లాభాల్లోకి మళ్లింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లతో పాటు ఆటోమొబైల్‌, లోహ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం 11.15 గంటల సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 36,529 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 11,025 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 15 పైసలు క్షీణించి 72.78 వద్ద ట్రేడ్ అవుతోంది. రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహింద్రా తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
1entertainment
Suresh 245 Views బిసిసిఐ సిఇఒగా రాహుల్‌ జోహ్రీ న్యూఢిల్లీ: బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా (బిసిసిఐ) నూతన సిఇఒగా రాహుల్‌ జోహ్రీ నియిమితులయ్యారు. లోద్రా కమిటీ సూచనల మేరకు బిసిసిఐ తలొగ్గి జోహ్రేని నియమించింది. ఆయన జూన్‌ 1వ తేదీన బాధ్యతలు చేపడతారని, బిసిసిఐ గౌరవ కార్యదర్శికి ఆయన రిపోర్టు చేస్తారని పేర్కొంది. కాగా ముంబాయి నుంచి ఆయన విధులు నిర్వహిస్తారని వెల్లడించింది.
2sports
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనంతో సరిపెట్టం.. - మొండి బాకీల నియంతణకు పటిష్ట చర్యలు - బ్యాంకింగ్‌ రంగ పరపతిని పెంచుతాం: ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ వెల్లడి న్యూఢిల్లీ: మిషన్‌ ఇంద్ర ధనుష్‌లో ప్రతిపాదించినట్టుగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనంతోనే సరిపెట్టమని జైట్లీ అన్నారు. బ్యాంకుల ఇతర సామర్థ్యాలను పెంచడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెరిగిపోతోన్న మొండి బాకీల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతామన్నారు. బ్యాంకింగ్‌ రంగం పరపతిని పెంచుతామన్నారు. బ్యాంకులకు రూ.1.8 లక్షల కోట్ల మూలధనం అవసరమన్నారు. ఇంద్రద óనుస్సులో భాగంగా బడ్జెట్‌లో రూ.70,000 కోట్లు కేటాయించాలని నిర్ణయించామన్నారు. కొంత మంది తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులకు మొండి బాకీల సమస్య పెరుగుతుందన్నారు. దీంతో రాని బాకీల వసూళ్లకు ఆర్‌బీఐ కొన్ని చర్యలు తీసుకుందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు చేరిన నగదును రిజర్వు బ్యాంకు ఇంకా లెక్కిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. మంగళవారం రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధనం చెబుతూ బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ పాత నోట్ల స్టాక్స్‌ తెప్పించుకుందన్నారు. అయితే ఎప్పటి వరకూ లెక్కింపు పూర్తి అవుతుందో తేది చెప్పలేమని పేర్కొన్నారు. కచ్చితమైన గణంకాల కోసం ఆర్‌బీఐ కసరత్తులో ఉందన్నారు. ప్రధానీ నరేంద్ర మోడీ అనుహ్యాంగా 2016 నవంబర్‌ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇది దేశంలోని మొత్తం నగదులో 86 శాతం కరెన్సీ. మొత్తం విలువ రూ.15.44 లక్షల కోట్లుగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో డిసెంబర్‌ 10 నాటికి ప్రజలు బ్యాంకుల్లో రూ.12.44 లక్షల కోట్లు జమ చేశారని రిజర్వు బ్యాంకే స్వయంగా పేర్కొంది. మరో రూ.3లక్షల కోట్లు రావాల్సి ఉందని తెలిపింది. కాగా డిసెంబర్‌ 30 వరకు బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్‌కు అవకాశం కల్పించారు. ఆపైనా కూడా ప్రజలు, వ్యాపారుల వద్ద ఏమైన పెద్ద నోట్లు మిగిలి ఉంటే మార్చి 30వరకు రిజర్వు బ్యాంకు శాఖల్లో డిపాజిటు చేయవచ్చని తెలిపారు. డిసెంబర్‌ ముగింపు నాటికే మెజార్టీ ప్రజలు తమ వద్ద ఉన్న రద్దు చేసిన పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారు. నాలుగు నెలలు గడిచిన రూ.3లక్షల కోట్లకు లెక్కతేల్చకపోవడంపై మోడీ సర్కార్‌పై తీవ్ర అనుమానాలకు తావిస్తోందని నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ పరిణామాల అనంతరం అనేక సార్లు పార్లమెంట్‌లో ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యులు అనేక ప్రశ్నలు వేశారు. అయినా ఇప్పటి వరకు ఈ నోట్లపై ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia వీరు ఇలా చేయడం వల్ల రైలు దాదాపు 25 నిమిషాల పాటు నిలిచిపోయిందని ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారని పేర్కొన్నారు. దాంతో స్థానిక రైల్వే స్టేషన్ అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసి ఇప్పటికి దాదాపు 20 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 2009లో కరిష్మా, సన్నీకి స్థానిక న్యాయస్థానం శిక్ష విధించింది. కానీ తాము ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడిస్తూ 2010లో సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్‌ను పరిశీలించిన సెషన్స్ కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చి విడుదల చేయాలని కోరింది. అంతా సర్దుమణిగింది అనుకుంటుండగా ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. మొన్న 17న రైల్వే కోర్టు మళ్లీ కరిష్మా, సన్నీపై కేసులు పెట్టింది. READ ALSO: Saif Ali Khan: ఇంటికి దారి మర్చిపోయిన కరీనా భర్త.. షాకైన స్థానికులు అయితే దీనిపై తాజాగా సన్నీ, కరిష్మా కపూర్ ముంబయిలోని సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును న్యాయస్థానం 24 సెప్టెంబర్‌కు వాయిదా వేసింది. దాంతో బుధవారం కరిష్మా, సన్నీ మళ్లీ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. ఈ ఒక్క కేసే కాదు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై పెట్టిన కేసులు కూడా ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. అతని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు కృష్ణజింకలను వేటాడి చంపాడన్న కేసులు కూడా నమోదయ్యాయి. అయితే గతేడాది జోధ్‌పూర్ న్యాయస్థానం సల్మాన్‌కు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఒక రోజంతా సల్మాన్.. రేప్ కేసులో నిందితుడైన ఆశారాం బాపుతో కలిసి జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. ఆ మరుసటి రోజు ఆయనకు బెయిల్ రావడంతో బయటికి వచ్చేశారు. అయితే తనపై వేసిన కేసులు కొట్టివేయాల్సిందిగా కోరుతూ సల్మాన్ కొన్ని నెలల క్రితం జోధ్‌పూర్ సెషన్స్ కోర్టులో అర్జీ పెట్టుకున్నారు. దీనిపై ఇంకా వాదనలు జరుగుతున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 8, Aug 2019, 12:10 PM IST Highlights మ్యాచ్ ప్రారంభం సమయంలో వర్షం పడే అవకాశం ఉంది.. కాకపోతే అది కొద్ది సేపు మాత్రమే పడుతుందని వారు చెప్పారు.మ్యాచ్ ప్రారంభించే సమయంలో వర్షం పడితే... ఆట మొదలవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్- వెస్టిండీస్ ల మధ్య టీ20 సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ని  టీం ఇండియా కైవసం చేసుకుంది. కాగా.. గురువారం వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. దీనిని కూడా ఎలాగైనా సొంతం చేసుకోవాలని కోహ్లీ సేన కసరత్తులు చేస్తోంది. అయితే... నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ  సీరిస్ కి వరుణుడు అడ్డుపడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మ్యాచ్ ప్రారంభం సమయంలో వర్షం పడే అవకాశం ఉంది.. కాకపోతే అది కొద్ది సేపు మాత్రమే పడుతుందని వారు చెప్పారు.  మ్యాచ్ ప్రారంభించే సమయంలో వర్షం పడితే... ఆట మొదలవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. టీ 20 సిరీస్ గెలిచిన టీం ఇండియా.. ప్రపంచకప్ నిష్క్రమణ తర్వాత ఆడుతున్న తొలి వన్డే ఇదే. ఇక ప్రపంచకప్ లో గాయంతో జట్టుకి దూరమైన శిఖర్ ధావన్ వన్డే సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు. అతను రోహిత్ తో కలిసి బ్యాటింగ్ కి దిగనున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ నెంబర్ 4వ స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ లో యువ ఆటగాళ్లు మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్ లో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి. ఇక ధోనీ స్థానంలో రిషబ్ పంత్ వికెట్ కీపర్ గా వ్యవహరించనున్నాడు.  Last Updated 8, Aug 2019, 12:10 PM IST
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV చరిత్రలో ఒకే ఒక్కడు.. ధోనీ @100 స్టంపింగ్స్ భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డే చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక TNN | Updated: Sep 3, 2017, 06:35PM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డే చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. శ్రీలంకతో ఆదివారం కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ధనంజయని స్టంపౌట్ చేయడం ద్వారా ధోనీ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ సిరీస్‌లోనే 99 స్టంపౌట్స్‌తో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కరని సమం చేసిన ధోనీ.. తాజాగా ఈ రికార్డుని కనుమరుగు చేసి అగ్రస్థానానికి ఎగబాకాడు. చాహల్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ కోసం ధనంజయ ప్రయత్నించగా.. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లింది. క్షణాల వ్యవధిలోనే ధోనీ వికెట్లను గీరాటేయడంతో అతని ఖాతాలో వంద స్టంపౌట్స్ చేరాయి. 2004, డిసెంబరు 23న వన్డేల్లోకి అరంగేట్రం చేసిన మహేంద్రసింగ్ ధోనీ.. కెరీర్‌లో ప్రస్తుతం 301వ వన్డే ఆడుతున్నాడు. ప్రస్తుత తరం వికెట్ కీపర్లలో ఎవరూ అతని దరిదాపుల్లో కూడా లేరు.
2sports
డే అండ్ నైట్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియాకు బిసిసిఐ ప్రతిపాదన మెల్‌బోర్న్‌ : భారత్‌,ఆస్ట్రేలియా డే అండ్‌నైట్‌ టెస్ట్‌ కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి తమను సంప్రదించినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ జేమ్స్‌ సుథర్‌లాండ్‌ పేర్కొన్నాడు. కాగా 2017లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో బిసిసిఐ తమను డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ గురించి అడి గినట్లు ఆయన పేర్కొన్నాడు. అక్టోబరు-నబంబర్‌లో జరిగే సిరీస్‌లో టీమిండియా న్యూజిలాండ్‌తో తొలి డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ ఆడనున్నట్లు బిసిసిఐ ఇప్పటికే ప్రకటించింది. భారత,ఇతర దేశాల నుంచి డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ గురించి పాజిటివ్‌ సిగ్నల్స్‌ వస్తున్నాయని జేమ్స్‌ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఆసీస్‌ భారత పర్యటనలో డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ గురించి తమకు సంప్రదించడమే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నాడు. గత నవంబర్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య మొదటి డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ జరగడంతో ఈ  మ్యాచ్‌లపై క్రికెటర్లు, అభిమానులకు ఆసక్తి పెరిగిన విషయం తెలిసిందే.
2sports
కపిల్‌ రికార్డును అధిగమించిన అశ్విన్‌   పూణే: బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ ద్వారా అత్యంత వేగంగా 250 వికెట్లను సాధించిన రికార్డును సొంతంచేసుకున్న భారత ప్రధాన స్పిన్నర్‌ అశ్విన్‌ తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మరో ఘనతకు చేరుకున్నాడు.శుక్రవారం రెండవరోజు ఆటలో భాగంగా ఆసీస్‌ రెండవ ఇన్నిం గ్స్‌లో తొలి రెండువికెట్లను అశ్విన్‌ తీసుకున్నాడు.దీంతో 2016-17స్వదేశీ సీజన్‌లో అశ్విన్‌ 64 వికెట్లు సాధించాడు.తద్వారా ఒక స్వదేశీ సీజన్‌లో వేగంగా అత్యధికవికెట్లను తీసిన ఘనత సాధించాడు. దీంతో ఆసీస్‌ కపిల్‌దేవ్‌ పేరిట ఉన్న రికార్డును అశ్విన్‌ సవరించాడు.1979-80 హోంసీజన్‌లో కపిల్‌ దేవ్‌ 13టెస్టుల్లో 63వికెట్లు తీయగా,2016-17 స్వదేశీ సీజన్లఓ అశ్విన్‌ ఆ రికార్డును అధిగమించాడు. 10టెస్టుల్లో 64 వికెట్లతో అశ్విన్‌ ఆరికార్డును చెరిపి వేశాడు.ఈరోజు ఆసీస్‌రెండవ ఇన్నింగ్స్‌లో భాగంగా డేవిడ్‌ వార్నర్‌, షాన్‌మార్ష్‌లను పెవిలి యన్‌కు పంప డం ద్వారా అశ్విన్‌ ఈఘతన సాధించాడు.గతంలో ఈ రికార్డుకు అశ్విన్‌ దగ్గ రగా వచ్చినప్పటికి దాన్ని అధిగమించలేకపో యాడు. 2012-13 స్వదేశీ సీజన్‌లో అశ్విన్‌10 టెస్టుల్లో 61వికెట్లు మాత్రమే తీసి ఆరికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. అయితే సుమారు మూడు సీజన్‌ల తరువాత ఆరికార్డును అశ్విన్‌ బద్దలు కొట్టడం ఇక్కడ విశేషం.
2sports
Feb 20,2017 అటుపోట్లు తప్పకపోవచ్చు... న్యూఢిల్లీ: ఈవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొంత అస్థిరతకు లోనయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనుండటంతో ట్రేడర్లు పొజిషన్లను రోల్‌వర్‌ చేసుకున ేందుకు ఆసక్తి చూపవచ్చునని చెబుతు న్నారు. దీనికితోడు 24న శివరాత్రి పర్వదినం సందర్భంగా ఒక రోజు మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఇక తృతీయ త్రైమాసికంలో టాటామోటార్స్‌ నిరాశజ నక ఫలితాల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు కొంత ఒత్తిడికి గురికావచ్చు. అయితే ద్రవ్యోల్బణ గణాంకాలు మాత్రం సానుకూలంగా ఉండడం మార్కెట్‌ సెంటిమెంటుకు కలిసి వస్తుందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా అమెరికా ఫెడరల్‌ రిజర్వు చైర్‌ జానెట్‌ యెల్లెన్‌ వడ్డీ రేట్లు పెంపుపై చేసిన వ్యాఖ్యానాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న 'వస్తు సేవల పన్ను' (జీఎస్‌టీ) కారణంగా ఆదాయాన్ని కోల్పోయే రాష్ట్రాలకు పరిహారం చెల్లించే చట్టానికి జీఎస్‌టీ కౌన్సిల్‌ శనివారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. జీఎస్‌టీ అమలు రాబోయే కాలంలో స్టాక్‌ మార్కెట్లకు మార్గ నిర్దేశనం చేయనుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురువారం 23న ఫిబ్రవరి ప్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) గడువు ముగియనుంది. బ్లూచిప్స్‌ కంపెనీల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అందులో అంబుజా సిమెంట్‌, క్యాస్ట్రాల్‌ ఇండియా కంపెనీలు ఉన్నాయి. అలాగే విదేశీ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్‌తో పాటు అమెరికా, జపాన్‌, చైనా వంటి దేశాల ఆర్థిక గణాంకాలు వంటి పలు అంశాలు కూడా దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు యూరోజోన్‌, యూఎస్‌, జపనీస్‌ పీఎంఐ గణాంకాలు, అమెరికా నిరు ద్యోగ గణాంకాలు విడుదల నేపథ్యంలో మార్కెట్‌ వర్గాలు అటూ వైపు దృష్టిసారి ంచవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
త్రిషకు అరుదైన గౌరవం ఇచ్చిన యునిసెఫ్ Highlights యునిసెఫ్ సెలెబ్రిటీ అడ్వకేట్ హోదాకు ఎంపికైన త్రిష యువత హక్కులపై చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా హోదా   హిరోయిన్ త్రిషకు అరుదైన పురస్కారం దక్కింది. యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ హోదాకు ఆమె ఎంపికైంది. చిన్నారులు, యువత హక్కులను కాపాడేందుకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు యునిసెఫ్ ప్రతినిధులు తెలిపారు. చెన్నైలో ఆదివారం (నవంబర్ 19) నిర్వహించిన ఓ కార్యక్రమంలో నటి త్రిషకు ఈ పురస్కారం అందచేశారు.   గతంలో అమితాబ్ బచ్చన్, ప్రియాంకా చోప్రా, సచిన్ టెండూల్కర్‌కు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఎనీమియా (రక్తహీనత), బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారులపై వేధింపులు తదితర అంశాల్లో పిల్లలకు అవగాహన కల్పించడానికి త్రిష గత కొంత కాలంగా విశేష కృషి చేస్తోంది. ప్రత్యేకించి తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో ఆమె చాలా మంది చిన్నారులకు మద్దతుగా నిలిచింది. ‘పిల్లల్లో ఆరోగ్యం, విద్య, పోషకాహారంపై అవగాహన కల్పించడానికి మరింతగా కృషి చేస్తా. చిన్నారులపై.. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న బాలబాలికలపై జరుగుతున్న దాడులు గర్హనీయం. అలాంటి వాటి నుంచి పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని ఈ సందర్భంగా త్రిష పేర్కొంది.   దక్షిణ భారతదేశం నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి నటి త్రిషే కావడం విశేషం. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని త్రిష పేర్కొంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరింత ఉత్సాహంగా పని చేస్తానని ఆమె తెలిపింది. కార్యక్రమం సందర్భంగా సుమారు 50 మంది చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడింది.
0business
Hyderabad, First Published 2, Mar 2019, 10:44 AM IST Highlights టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా వెండితెరపై ముద్దు సీన్లలో మాత్రం నటించనని చెబుతోంది. ఇప్పటివరకు తాను పని చేసిన సినిమాలకు ఇదే షరతులు విధించినట్లుగా చెప్పింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా వెండితెరపై ముద్దు సీన్లలో మాత్రం నటించనని చెబుతోంది. ఇప్పటివరకు తాను పని చేసిన సినిమాలకు ఇదే షరతులు విధించినట్లుగా చెప్పింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లిప్ లాక్స్ అనేవి కామన్ అయిపోయాయి. 'అర్జున్ రెడ్డి' సినిమా వచ్చిన తరువాత టాలీవుడ్ లో లిప్ లాక్ సన్నివేశాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక బాలీవుడ్ సంగతి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో తమన్నా మాత్రం ఆన్ స్క్రీన్ ముద్దు సీన్లలో నటించనని అంటోంది. అయితే ఒక హీరోతో మాత్రం లిప్ లాక్ సీన్స్ లో నటిస్తానని చెప్పడం గమనార్హం. ఆ హీరో మరెవరో కాదూ బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్. అతడితో సినిమా చేసే ఛాన్స్ వస్తే గనుక తెర మీద ముద్దులు పెట్టుకోవడానికి కూడా వెనుకాడనని అంటోంది. హ్రితిక్ అంటే తనకు ఎంతో అభిమానమని, అతడితో నటించే ఛాన్స్ వస్తే చాలాని చెప్పింది. కొంతకాలం క్రితం హ్రితిక్ ని చూసినప్పుడు తమన్నాకి అసలు మాటలే రాలేదట. చివరకు అతడి దగ్గరకి వెళ్లి 'నేను మీకు పెద్ద ఫ్యాన్' అని చెప్పిందట.
0business
sumalatha 118 Views Australia , JAMES ANDERSON James Anderson హెడింగ్లీ : యాషెస్‌ మూడో టెస్టుకూ జేమ్స్‌ అండర్సన్‌ దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి టెస్టు మధ్యలోనే అర్ధాంతరంగా తప్పుకున్న ఆండర్సన్‌, లార్డ్స్‌ టెస్టులోనూ ఆడలేదు. అయితే మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని భావించినప్పటికీ అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. 22 నుంచి హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసిబి) 12 మంది సభ్యులతో కూడిన జాబితాను సోమవారం ప్రకటించింది. అయితే ఆండర్సన్‌ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని, దీంతో అతడికి మరికొన్ని రోజులు విశ్రాంతినివ్వాలని భావించినట్లు ఈసిబికి చెందిన ఓ అధికారి తెలిపాడు. మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు : జో రూట్‌(కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌ స్టో, స్టువార్ట్‌ బ్రాడ్‌, బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, స్యామ్‌ కుర్రన్‌, డెన్లీ, జాక్‌ లీచ్‌, జేసన్‌ రారు, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/telengana/
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV చివరి పరపతి సమావేశంలో రాజన్ ఏం చేస్తారు? ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేస్తున్నారు. TNN | Updated: Aug 9, 2016, 07:55AM IST ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేస్తున్నారు. తదనంతరం తాను ఆ పదవి పొడిగింపును కోరుకోవడం లేదని, విద్యా వ్యవస్థలో భాగం అవ్వాలనుకుంటున్నానని ఇదివరకే రాజన్ ప్రకటించారు. కాగా మంగళవారం ఆయన చివరి ద్రవ్య విధాన పరపతి సమీక్షా సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఆయన ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆర్ బీఐ రేట్ల విషయంలో అధిక వడ్డీరేట్లను కొనసాగిస్తున్నారని రాజన్ పై విమర్శలు ఉన్నాయి. కనుక తాను వెళ్లే ముందు వడ్డీరేట్లను తగ్గిస్తారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అక్టోబరుకు వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణ, లక్ష్య సాధనపై కూడా రాజన్ మాట్లాడొచ్చు. అలాగే అతను మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేస్తారు కనుక ఆ విషయమ్మీద, అలాగే కొత్త గవర్నర్ ఎవరనే విషయంపై ఏదైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.
1entertainment
Visit Site Recommended byColombia మంగళవారం భారత్‌లోనే ధావన్ గాయపడగా.. జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్ గాయాన్ని పరిశీలించాడు. గాయం తీవ్రతను తెలుసుకోవడం కోసం ఎంఆర్ఐ స్కాన్ కూడా తీశారు. ఫిజియో ఇంకా నివేదిక ఇవ్వాల్సి ఉంది. శిఖర్ దక్షిణాఫ్రికా వెళ్తున్నాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. కానీ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడో లేదో చెప్పలేదు. ఇంతకు ముందు లంక పర్యటనలో ధావన్ రెండు శతకాలు సాధించాడు. సొంత గడ్డమీద శ్రీలంకపై రెండు టెస్టులు ఆడిన ధావన్.. ఈడెన్ రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగులు చేశాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Ross Taylor thanks New Zealand teammates for helping him tackle Twitter banter with Virender Sehwag ​ టేలర్ వెళ్తూ.. ఆ సీక్రెట్ చెప్పేశాడు..! న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ స్వదేశానికి వెళ్తూ.. భారత అభిమానుల్ని గత కొద్దిరోజుల నుంచి ఊరిస్తున్న ఓ సీక్రెట్‌ని రివీల్ TNN | Updated: Nov 9, 2017, 04:36PM IST న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ స్వదేశానికి వెళ్తూ.. భారత అభిమానుల్ని గత కొద్దిరోజుల నుంచి ఊరిస్తున్న ఓ సీక్రెట్‌ని రివీల్ చేసేశాడు. అక్టోబరు 22న వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో టామ్ లాథమ్‌తో కలిసి రాస్ టేలర్ ద్విశత భాగస్వామ్యం నెలకొల్పి కివీస్‌ని గెలిపించాడు. ఈ భాగస్వామ్యంపై సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రాస్ టేలర్‌ని దర్జీతో పోల్చాడు. బట్టలు కుట్టడంలోనైనా.. భాగస్వామ్యం నిర్మించడంలోనైనా.. నీ తర్వాతే ఎవరైనా అంటూ చమత్కారంగా ప్రశంసించాడు. దీనికి టేలర్ కూడా హిందీలో సరదాగా స్పందించడంతో అప్పట్లో ఈ ట్వీట్స్‌ వైరల్‌గా మారాయి. సెహ్వాగ్‌ ట్వీట్స్‌‌కి దీటుగా టేలర్ స్పందించడం కంటే.. అతను హిందీలో రిప్లై ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. న్యూజిలాండ్‌ క్రికెటర్‌కి హిందీ ఎలా వచ్చిందబ్బా..? అతనికి ఎవరు సాయం చేసుంటారు అని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో ఆరాతీయడం మొదలెట్టారు. మంగళవారం రాత్రి సిరీస్‌ ముగియడంతో తాజాగా స్వదేశానికి పయనమైన టేలర్.. తనకి హిందీ నేర్పిన వ్యక్తుల్ని అభిమానులకి పరిచయం చేశాడు. అందులో ఒకతను జట్టులో సహచరుడైన ఇస్ సోధీ కాగా.. మరొకతను జట్టు సహాయ సిబ్బందిలో ఒకరు దేవ్. ఇస్‌ సోధీ‌ కుటుంబం పంజాబ్‌ నుంచి న్యూజిలాండ్‌కి వలసపోగా.. దేవ్‌ కూడా భారత్ సంతతికి చెందిన వ్యక్తేనని సమాచారం.
2sports
సొంతింటి కల నెరవేరాలనుకునే వారికి ఓ శుభవార్త.. కుమార్| Last Updated: గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:16 IST) సొంత ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త. ఎస్‌బిఐ ఇప్పుడు సొంత ఇంటి కలను నిజం చేయడానికి తన వంతు సాయం చేస్తోంది. అప్పు చేసి అయినా సొంత ఇంటిని నిర్మించుకోవలానుకునే మధ్య తరగతి ప్రజలకు ఈ ఆఫర్ బాగా సహాయపడుతుంది.   సాధారణంగా గృహ రుణాలు తీసుకునేటప్పుడు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజుతో పాటుగా లీగల్, టెక్నికల్ ఛార్జీలను కూడా విధిస్తాయి. ఈ ఛార్జీల వల్ల చాలా మందిపై అదనపు భారం పడుతోంది. వినియోగదారులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు ఎస్‌బిఐ ఈ అదనపు ఛార్జీలను తొలగించింది. అయితే ఈ అవకాశం ఫిబ్రవరి 28లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.   ఇదే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును తగ్గించడంతో ఎస్‌బిఐ గృహ రుణాలపై వడ్డీని కూడా కొంతమేర తగ్గించింది. అయితే ఈ తగ్గింపు రూ.30 లక్షలలోపు రుణం తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నది. సంబంధిత వార్తలు
1entertainment
డే అండ్ నైట్ టెస్టులో సఫారీ కెప్టెన్ రికార్డుల మోత TNN| Nov 24, 2016, 04.03 PM IST ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య అడిలైడ్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు తొలి రోజు 259/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీ(118 నాటౌట్)తో ఆదుకున్నాడు. దీంతో డై అండ్ నైట్ టెస్టులో సౌతాఫ్రికా జట్టు 259 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అడిలైడ్‌లో ఇప్పటి వరకూ మూడు ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాధించగా.. అతడి యావరేజ్ 300కిపైగా ఉండటం విశేషం. తొలి రోజు ఆట ముగియడానికి సరిగ్గా 12 ఓవర్ల ముందు దక్షిణాఫ్రికా జట్టు వ్యూహాత్మకంగా డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై డే అండ్ నైట్ టెస్టుల్లో అడిలైడ్‌లో సౌతాఫ్రికా చేసిన 259 పరుగులే ఇప్పటి వరకూ అత్యధిక స్కోరు కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ హాజిల్‌వుడ్‌కు 4 వికెట్లు దక్కాయి. టెస్టుల్లో, వన్డేల్లో తొలి శతకాన్ని ఆసీస్‌పైనే సాధించిన డుప్లెసిస్, డే అండ్ నైట్ టెస్టులోనూ తొలి సెంచరీని ఆ జట్టు మీదే సాధించడం విశేషం. అంతే కాకుండా డే అండ్ నైట్ టెస్టుల్లో సెంచరీ సాధించిన తొలి కెప్టెన్‌గా, డే అండ్ నైట్ టెస్టుల్లో శతకం సాధించిన తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా, ఆస్ట్రేలియా గడ్డ మీద డే నైట్ టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా డుప్లెసిస్ నిలిచాడు. ఇది డుప్లెసిస్‌కు ఆరో టెస్టు సెంచరీ కాగా, ఆస్ట్రేలియాపై రెండోది. ఈ రెండు సెంచరీలను కూడా డుప్లెసిస్ అడిలైడ్‌లోనే చేయడం మరో విశేషం. సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2012, నవంబర్ 24న తొలిసారిగా టెస్టుల్లో అడుగుపెట్టిన డుప్లెసిస్ ఇప్పుడు అదే అడిలైడ్‌లో తొలి డే అండ్ నైట్ టెస్టును కూడా ఆడటం విశేషం.
2sports
Visit Site Recommended byColombia గత సీజన్‌తో పోల్చుకుంటే... ఈ సీజన్‌కి ఓటింగ్ శాతం రెండింతలుగా పెరిగిందంటే ప్రేక్షకుల్లో స్పందన ఎలా ఉందో ఓ అంచనాకు రావచ్చు. ఇదిలా ఉంటే చాలా బిగ్ బాస్ సీజన్‌ 2 ఫాలోవర్స్‌ను వేధిస్తున్న ప్రశ్న బిగ్ బాస్ ఓటింగ్ జన్యున్‌గా జరుగుతుందా? లేక బిగ్ బాస్ నిర్వాహకులు ముందుగానే ప్లాన్ చేసి విన్నర్‌ని అనౌన్స్ చేస్తారా? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన ఎలిమినేషన్‌ ప్రాసెస్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారు? అనేది బహిర్గతం చేయకపోవడంతో ప్రేక్షకుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. Read Also: బిగ్ బాస్ సీజన్ 2 అన్ని ఎపిసోడ్‌ల సమాచారం ఒక్క క్లిక్‌తో.. ఇదిలాఉంటే.. ఆన్ లైన్ ఓటింగ్‌తో పాటు మిస్డ్ కాల్ రూపంలో భారీగా ఓట్లు నమోదు అవుతున్నాయి. అయితే ఎవరికి ఎన్ని ఓట్లు నమోదు అయ్యాయన్న దానిపై బిగ్ బాస్ షో నిర్వాహకులు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కాని.. సోషల్ మీడియాలో పబ్లిక్ ఒపీనియన్‌ సేకరిస్తూ పోల్స్ నిర్వహిస్తున్నారు పలు ఆన్ లైన్ మీడియా సంస్థలు. ఈ ఒపీనియన్ పోల్స్‌లో బిగ్ బాస్ ఏకాకి కౌశల్‌ ముందంజలో కొనసాగుతున్నారు. తొలినుండి ప్రేక్షకుల మద్ధతులో టైటిల్ రేస్‌లో అందరికంటే ముందు ఉన్న కౌశల్ ఫైనల్‌లోనూ అదే ఊపును కొనసాగిస్తున్నారు. ఒక కౌశల్ తరువాత స్థానంలో సింగర్ గీతా మాధురి, మూడో స్థానంలో దీప్తి నల్లమోతులు ఉన్నారు. ఇక ఓట్ల శాతంలో కౌశల్ ఎవరికీ అందనంత దూరంలో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాడు. కౌశల్‌కి మిగిలిన కంటెస్టెంట్స్‌కి 60 శాతానికి పైగా తేడా ఉంది. ఇక చివరి రెండు స్థానాల్లో ఇద్దరు మిత్రులు సామ్రాట్, తనీష్‌లు ఉన్నారు. తనీష్ నాలుగో స్థానంలో ఉండగా.. అందరికంటే ముందు గ్రాండ్ ఫినాలేకి వెళ్లిన సామ్రాట్ అందరికంటే వెనకుబడటం గమనార్హం.
0business
Visit Site Recommended byColombia వరుసగా మూడో టీ20లోనూ టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమిని భారత్ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సఫారీ గడ్డపై వైఫల్యాలతో ఢీలాపడిన రోహిత్ శర్మ (11: 8 బంతుల్లో 2x4) ఆదిలోనే రెండు బౌండరీలు బాది ఊపుమీద కనిపించినా.. మరోసారి జూనియర్ డాలా బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్నాడు. ఒక ఎండ్‌లో ధావన్ నెమ్మదిగా ఆడుతున్నా.. రైనా వరుసగా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్న రైనా.. స్పిన్నర్ షంసీ బౌలింగ్‌లో ఔటవగా.. ఆ తర్వాత వచ్చిన మనీశ్ పాండే (13: 10 బంతుల్లో 1x6) దూకుడుగా ఆడే క్రమంలో ఔటైపోయాడు. కొద్దిసేపటికే లేని పరుగు కోసం ప్రయత్నించి శిఖర్ ధావన్ కూడా రనౌట్ రూపంలో పెవిలియన్ చేరడంతో భారత్ ఒత్తిడిలో పడినట్లు కనిపించింది. ఈ దశలో మహేంద్రసింగ్ ధోని (12: 11 బంతుల్లో 1x4), దినేశ్ కార్తీక్ (13: 6 బంతుల్లో 3x4)తో కలిసి హార్దిక్ పాండ్య (21 : 17 బంతుల్లో 1x6) కాసేపు స్కోరు బోర్డుని నడిపించాడు. అయితే.. చివర్లో భారత్ వరుసగా ప్రధాన వికెట్లు చేజార్చుకోవడంతో 172 పరుగులకే పరిమితమవ్వాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో జూనియర్ డాలా మూడు, క్రిస్ మోరీస్ రెండు వికెట్లు పడగొట్టారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 9, Jul 2019, 10:28 AM IST Highlights   మొన్నటివరకు కలిసిమెలిసి ఉన్న కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వర్గపోరు డోస్ ఎక్కువైంది. విశాల్ ఏ పని చేసినా ఫలితం దక్కడం లేదు. అసలే కోర్టు సమస్యలతో సతమతమవుతున్న విశాల్ కి ఎలక్షన్స్ రిజల్ట్ మరింత టెన్షన్ గా మారింది. మొన్నటివరకు కలిసిమెలిసి ఉన్న కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వర్గపోరు డోస్ ఎక్కువైంది. విశాల్ ఏ పని చేసినా ఫలితం దక్కడం లేదు. అసలే కోర్టు సమస్యలతో సతమతమవుతున్న విశాల్ కి ఎలక్షన్స్ రిజల్ట్ మరింత టెన్షన్ గా మారింది. చెన్నై హై కోర్టు నడిఘర్ ఎలక్షన్స్  రిజల్ట్ కి మరోసారి బ్రేక్ వేసింది.  నిరంతర వివాదాలతో జరిగిన ఎలక్షన్స్ కి కోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇవ్వగా సోమవారం రిజల్ట్ రావాల్సి ఉంది. కోలీవుడ్ నడిఘర్ సంఘం అధ్యక్ష్య పదవి ఎవరిని వరిస్తుంధో అని అంతా ఎదురుచూస్తుండగా సడన్ గా హై కోర్టు బ్రేక్ వేసింది. న్యాయ స్థానం నుంచి ఆదేశాలు వెలువడేంత వరకు ఓట్ల లెక్కింపు జరగకూడదని కోర్టు తెలిపింది.  చెన్నై కోర్టులో విశాల్ ఇటీవల  ఓట్ల లెక్కింపు కోసం వేసిన పిటిషన్ వృధా అయ్యింది. ఇప్పట్లో నడిఘర్ భవితవ్యం గురించి క్లారిటీ వచ్చేలా లేదు. అలాగే ఈ ఎన్నికల వాయిదా కూడా ఇండస్ట్రీలో అంతర్గత విబేధాలను మరింత పెంచుతున్నట్లు సమాచారం.   Last Updated 9, Jul 2019, 10:28 AM IST
0business
Hyd Internet 137 Views Kidambi Srikanth Kidambi Srikanth నాగ్‌పుర్‌: నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రుగుతున్న జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ కిదాంబి శ్రీకాంత్‌ ఓటమి పాలయ్యాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ప్రపంచ పదకొండో ర్యాంకు ప్రణయ్‌ 21-15, 16-21, 21-7 తేడాతో శ్రీకాంత్‌ను కంగుతినిపించాడు. దాదాపు 50 నిమిషాలు జరిగిన ఈ పోరు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. అంతర్జాతీయ కెరీర్‌లో వీరిద్దరూ నాలుగు సార్లు తలపడగా మూడు సార్లు కిదాంబిదే గెలుపు. టాటా ఓపెన్‌-2011లో మాత్రమే ప్రణయ్‌ విజయం సాధించాడు. ఫైనల్లో తొలి రెండు గేముల్లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. తొలి గేమ్‌ను ప్రణయ్‌ కైవసం చేసుకోగా రెండోది శ్రీకాంత్‌ గెలిచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో విజృంభించిన ప్రణయ్‌ గేమ్‌తో పాటు మ్యాచ్‌ గెలిచాడు.
2sports
London, First Published 9, Sep 2018, 10:49 AM IST Highlights ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ కన్నా బౌలర్లు అద్భుతంగా రాణించారనే చెప్పవచ్చు. ప్రతి మ్యాచ్‌లోనూ ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసి స్వల్ప స్కోర్లకే ఆ జట్టును పరిమితం చేశారు.  ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ కన్నా బౌలర్లు అద్భుతంగా రాణించారనే చెప్పవచ్చు. ప్రతి మ్యాచ్‌లోనూ ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసి స్వల్ప స్కోర్లకే ఆ జట్టును పరిమితం చేశారు. ఈ క్రమంలో భారత పేసర్ల ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. విదేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా 59 వికెట్లు పడగొట్టారు. ఇందులో ఇషాంత్ ఖాతాలో 18, షమి ఖాతాలో 14, బుమ్రా ఖాతాలో 14, హార్డిక్ పాండ్య ఖాతాలో10, ఉమేశ్ యాదవ్ ఖాతాలో 3 వికెట్లు ఉన్నాయి. 38 ఏళ్ల క్రితం 1979-80లలో పాకిస్తాన్‌లో పర్యటించిన భారత జట్టు సభ్యులు కపిల్‌దేవ్ (25 వికెట్లు), కర్సన్ ఘావ్రి (15), రోజర్ బిన్ని (11) కలిపి మొత్తం 58 వికెట్లను పడగొట్టారు. మరోవైపు భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యథిక క్యాచ్‌లు అందుకున్న భారత క్రికెటర్‌గా రాహుల్ ద్రవిడ్ రికార్డును సమం చేశాడు. 2004-05 ఆస్ట్రేలియా పర్యటనలో ద్రవిడ్ 13 క్యాచ్‌లు అందుకున్నాడు. Last Updated 9, Sep 2018, 10:49 AM IST
2sports
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV శ్రీలంకపై టీ20 శతకంతో వార్నర్ రికార్డుల మోత పుట్టినరోజు నాడే టీ20ల్లో శతకం సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ రికార్డ్‌ని వార్నర్ బ్రేక్ చేశాడు. Samayam Telugu | Updated: Oct 27, 2019, 04:38PM IST David Warner శ్రీలంకతో అడిలైడ్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీ బాదిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (100 నాటౌట్: 56 బంతుల్లో 10x4, 4x6) అరుదైన రికార్డ్‌లు నెలకొల్పాడు. బాల్ టాంపరింగ్‌తో ఏడాది నిషేధం ఎదుర్కొన్న వార్నర్.. మళ్లీ ఆస్ట్రేలియా తరఫున ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో అజేయ శతకం బాదేసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. వార్నర్‌తో పాటు అరోన్ ఫించ్ (64: 36 బంతుల్లో 8x4, 3x6), హిట్టర్ మాక్స్‌వెల్ (62: 28 బంతుల్లో 7x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో శ్రీలంక 99/9కే పరిమితమైంది. ఆదివారం 33వ పుట్టినరోజు జరుపుకుంటున్న వార్నర్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శ్రీలంకపై తొలి టీ20 సెంచరీ బాదడం ద్వారా డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డుల్ని నమోదు చేశాడు. 1. పుట్టినరోజు నాడు టీ20 సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా వార్నర్ నిలిచాడు. ఇప్పటి వరకూ యువరాజ్ సింగ్ మాత్రమే టీ20ల్లో పుట్టినరోజు నాడు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. 2009లో శ్రీలంకపై యువరాజ్ 60 పరుగులతో అజేయంగా నిలిచాడు.
2sports
accounting రెట్టింపైన ఉజ్జీవన్‌ఫైనాన్స్‌ నికరలాభం బెంగళూరు: ఉజ్జీవన్‌ ఆర్థికసేవల సంస్థ నాలుగోత్రైమాసికంలో 3.74కోట్ల నికరలాభం ప్రకటించిం ది. గతఏడాది 1.87 కోట్ల నుంచి వృద్ధిని సాధించింది. నాలుగోత్రైమాసికంలో ఆదాయవనరులు 95.20 శాతం పెరిగి 6.11 కోట్లుగా ఉన్నాయి. అదే గత ఏడాది 3.13 కోట్లు మాత్రమే రాబడులున్నాయి. ప్రతి వాటాకు రాబడి 0.31 రూపాయలుగా ఉన్నట్లు తేలింది. కంపెనీఎండి సిఇఒ సుధాసురేష్‌ మాట్లాడుతూ కంపెనీ వార్షిక పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఎదుర యిన సవాళ్లను అధిగమించినట్లు వివరించారు. ఇక రుణ పరపతిపరంగాచూస్తే తక్కువ వ్యయాధారిత స్వల్పకాలిక రుణాలు, ఎన్‌సిడిలతోనిధులు సేకరించామన్నారు. సంస్థ రుణభారం 10.63శాతం తగ్గిందని తెలిపారు. ఉజ్జీవన్‌ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంకు ఎండిసిఇఒ సామిత్‌ఘోష్‌ మాట్లా డుతూ ఫిబ్రవరిలోనే తమ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించామని ప్రస్తుతం ప్రగతిపూర్వకంగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం 15శాఖలను మార్చినాటికి బ్యాంకు శాఖలుగా మార్చామని, మరో 15 శాఖలు మేచివరినాటికి పూర్తవుతాయన్నారు. మొత్తం 171 శాఖలను ఈ ఏడాది లోనే మారుస్తామని, మరో 53 యుఆర్‌సిలను కూడా ప్రారంభిస్తామన్నారు. బ్యాంకింగ్‌ సేవలను పూర్తిస్థాయి లో ప్రారంభించేందుకు రిటైల్‌ బల్క్‌ డిపాజిట్‌ బిజినెస్‌ను పెంచుకోవడం ద్వారా తమ ఆర్థిక వ్యయా లను నియంత్రించుకుంటామని అన్నారు. అలాగే ఐటి ఇన్‌ఫ్రారంగాల్లో మరింత పెట్టుబడులకు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు శామిత్‌ఘోష్‌ వివరించారు.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV రిస్క్‌ చేస్తున్న వెంకీ మామ.. అన్‌ సీజన్‌లో ఆడియన్స్‌ ముందుకు! వెంకటేష్‌, నాగచైతన్యలు హీరోలుగా తెరకెక్కిన సినిమా వెంకీ మామ. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను వెంకటేష్‌ బర్త్‌ డే సందర్భంగా డిసెంబర్‌ 13న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. Samayam Telugu | Updated: Nov 17, 2019, 11:08AM IST వెంకీ మామ రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు వెంకటేష్‌ , నాగ చైతన్యలు రీల్‌ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటించిన ఈ సినిమా వెంకీ మామా. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకీకి జోడిగా పాయల్‌ రాజ్‌పుత్‌, చైతూకి జోడిగా రాశీ ఖన్నాలు నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. Visit Site Recommended byColombia అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను డిసెంబర్‌ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్‌. అయితే అదే సమయంలో మరిన్ని సినిమాలు రిలీజ్‌ ఉండటంతో సోలో రిలీజ్‌కు సరైన డేట్‌ వెతికే పనిలో పడ్డారు. అయితే తాజాగా నిర్మాత సురేష్ బాబు వెంకీ మామ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్టుగా తెలుస్తోంది. Also Read: ఆ సెంటిమెంట్‌ను నమ్ముకున్న అర్జున్‌ సురవరం.. వర్క్‌ అవుట్‌ అవుతుందా! ఈ సినిమాను వెంకటేష్‌ పుట్టిన రోజు కానకగా డిసెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే నవంబర్‌ నుంచి డిసెంబర్‌ 20 వరకు సినిమాల రిలీజ్‌కు అనువైన సమయం కాదు. విద్యార్థలకు ఎగ్జామ్స్‌ జరుగుతుంటాయి కాబట్టి థియేటర్లకు వచ్చే జనం తక్కువగా ఉంటారు. అందుకే ఆ సీజన్‌లో పెద్ద సినిమాలేవి రిలీజ్‌ కావు. క్రిస్టమస్‌ నుంచే భారీ చిత్రాల సందడి మొదలవుతుంది. Also Read: సూపర్‌ ఫాం.. అరడజను సినిమాలు లైన్‌లో పెట్టిన స్టార్‌ హీరో అయితే అన్‌ సీజన్‌ అయిన పరవాలేదని వెంకీ మామను డిసెంబర్‌ 13నే రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆ డేట్‌ వదిలేస్తే సోలో రిలీజ్‌కు దగ్గరలో డేట్‌ లేకపోవటంతో పాటు, వెంకీ ఫ్యాన్స్‌ కూడా బర్త్‌డే కానుకగా సినిమా రిలీజ్ చేయాలని డిమాండ్‌ చేస్తుండటంతో అదే డేట్‌ను పైనల్ చేశారు. Also Read: వేడెక్కిస్తున్న వాణీ.. హాట్‌ ఫోటోషూట్లతో మత్తెక్కిస్తున్న బ్యూటీ ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించిన చిత్రయూనిట్ ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఆ రోజున వస్తే సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే క్రిస్టమస్‌ సెలవులు కూడా కలిసొస్తాయని భావిస్తున్నారు చిత్రయూనిట్. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. Also Read: యాంకర్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన నాగార్జున.. కారణం ఏంటంటే?   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
economy మూడేళ్లలో 10%కి భారత్‌ ఆర్థికవృద్ధి న్యూఢిల్లీ, మే 6: భారత్‌ ఆర్థికవృద్ధి 2019-20సంవత్సరానికిగాను పదిశాతానికి పెరుగుతుందని, ఆర్థికవ్యవస్థలో వృద్ధికి అనువుగా అనేక పుష్కల అవకాశాలున్నా యని పారిశ్రామిక సంఘాల సమాఖ్య సిఐఐ వెల్లడించింది. సిఐఐ అధ్యక్షురాలు శోభనా కామినేని మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో భారత్‌ పదిశాతం వృద్ధిరేటును సాధిస్తుందని వెల్లడించారు. ప్రతి ఏటా ఒకటిశాతం అదనపు వృద్ధిని సాధించడం ద్వారానే పదిశాతం లక్ష్యం ఛేదించగలమని అన్నారు. ఈ వృద్ధితోపాటు మరింత మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఏటా ఐదు మిలియన్ల మందికి ఉపాధి కల్పించగలమని, జిడిపి వృద్ధిరేటు అదనపు ఒకటిశాతం పెరిగిన పక్షంలో మరింత వృద్ధి సాధ్యం అవుతుందని శోభనాకామినేని అన్నారు. ప్రస్తుతం సాలీనా 3.7మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. జిఎస్‌టి అమలుద్వారా మరింతఆర్థికవృద్ధి జరుగుతుందని అన్నారు. కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం మరింతపెరగడంద్వారా వృద్ధిపెరుగుతుందని అన్నారు. పట్టణీకరణ విధానం ఆర్థికలావాదేవీలను మరింత మెరుగుపరుస్తుందని, నిర్మాణరంగంలో ప్రభుత్వ వ్యయం 30లక్షలకోట్లకు పెరుగుతున్నందున మరింత వృద్ధికి అవకాశాలున్నట్లు ఆమె వివరించారు. సేవలరంగం, పర్యాటకరంగంలో మంచి వృద్ధి ఉంటుందన్నారు. సిఐఐ అంచనాలు చూస్తే మొత్తం నిర్మాణరంగంలో 30మిలియన్ల ఉద్యోగాలు వచ్చేపదేళ్లలో సృష్టించగలమని అన్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్నువిధానం అమలులోకి వస్తే మరింత సరళీకృత ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారుతుందన్న ఆశాభావం వ్యక్తంచేసారు. 50 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలకు పన్నురేట్‌ 25శాతం అమలవుతుందని, కార్పొరేట్‌ పన్నురేటు 18శాతానికి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని ప్రోత్సా హకాలను మినహాయిస్తే పన్నురేటు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. దీనివల్ల పన్నుల చెల్లింపుల్లో మరింత వృద్ధిని సైతం సాధించినట్లవుతుందన్నారు. ఇక నిరర్ధక ఆస్తులపరంగాచూస్తే ఈసమస్యను ఎక్కువకాలం వాయిదావేయడం మంచిదికాదన్నారు. కేబినెట్‌ ఆమోదించిన ప్యాకేజిని స్వాగతిస్తున్నట్లు సిఐఐ అధ్యక్షురాలు వెల్లడించారు.
1entertainment
sandhya 266 Views epf EPF న్యూఢిల్లీ: పిఎఫ్‌ అకౌంట్‌గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఉద్యోగం మారినప్పుడల్లా కొంత మంది ప్రావిడెండ్‌ ఫండ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగుల కొత్త కంపెనీలో కొత్త అకౌంట్‌ ప్రారంభిస్తారు. అదే సమయంలో పాత యుఎఎస్‌నంబర్‌ ఇవ్వకుండా పొరపాటు చేస్తుంటారు. ఒక్కసారి కొత్త యుఎఎన్‌ తీసుకుంటే, కొత్త కంపెనీ పాస్‌బుక్‌, పిఎఫ్‌ అకౌంట్‌ లావాదేవీలను మాత్రమే చూడగలుగుతాం. రెండు యుఎఎన్‌ నంబర్లు కలిగి ఉండడం వల్ల అకౌంట్‌ వివరాలు పొందడం కూడా క్లిష్టతరమవుతుంది. అందుకే రెండు యుఎఎన్‌ నంబర్లను మెర్జ్‌ చేసుకోవాలి. అయితే ఇది సాధ్యమేనా? సాధ్యమవుతుంది. రెండు యుఎఎన్‌ నంబర్లను విలీనం కలిపేసుకోవచ్చు. ముందుగా మీరు పనిచేస్తున్న కంపెనీకి యుఎఎన్‌ సమాచారం అందించండి. అలాగే ఇపిఎఫ్‌ఒ వెబ్‌సైట్‌లోనూ సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలి. రెండు యుఎఎన్‌ నంబర్ల గురించి చెబుతూ మెయిల్‌ చేయండి. అధికారులు మీ యుఎఎన్‌ నంబర్లను చెక్‌చేసి, పాత యుఎఎన్‌ను బ్లాక్‌ చేస్తారు. తర్వాత పాత పిఎఫ్‌ డిపాజిట్‌ను కొత్త అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడానికి దరఖాస్తుచేయసుకోండి. మరో మార్గంలో ముందుగా నంబర్‌ ఇపిఎఫ్‌ అమౌంట్‌ను పాత ఇపిఎఫ్‌ అకౌంట్‌ నుంచి కొత్త దానికి మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇపిఎఫ్‌ఒ ఒటిసిపి పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/
1entertainment
Feb 10,2016 రూ.28 వేలు దాటిన బంగారం న్యూఢిల్లీ: పసిడి పరుగు కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధర మరింత వేగంగా పెరుగుతోంది. మంగళవారం పది గ్రాముల అపరంజి ధర రూ.28,000 మార్కును దాటింది. మంగళవారం ఒక్క రోజే పసిడి ధర ఏకంగా రూ.710 మేర పెరిగి రూ.28,585 మార్కును చేరింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం దాదాపు రూ.710 మేర పెరిగి వరుసగా రూ.28,585, రూ.28,435 స్థాయిని తాకింది. దేశీయంగా పెళ్లిండ్ల సీజన్‌ గిరాకీ పెరగడం దానికి తోడు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల పవనాలు, డాలరుతో రూపాయి విలువ క్షీణించడం కూడా అపరంజి ధరల పెరుగుదలకు ఆజ్యంపోస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1,195.66 డాలర్లు పలికింది. గత ఎనిమిది రోజుల్లో పసిడి ధర దాదాపు రూ.825 మేర పెరగడం విశేషం. మరోవైపు వెండి కూడా బంగారానికి దీటుగా పరుగులు పెడుతోంది. మంగళవారం ఒక్క రోజే వెండి దాదాపు రూ.1,180 మేర పెరిగి రూ37,230 స్థాయిని తాకింది. నేడు బంగారం దుకాణాల బంద్‌   బంగారం కొనుగోళ్లకు పాన్‌ కార్డును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యకు నిరసనగా ఆభరణాల వర్తకులు బుధవారం (10న) దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని బంగారపు దుకాణాలను కూడా మూసివేస్తున్నామని ఆల్‌ ఇండియా జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ ట్రేడ్‌ ఫెడరేషన్‌ జోనల్‌ మేనేజర్‌ హెచ్‌ మోహన్‌ లాల్‌ జైన్‌ మంగళవారం ఒక్క ప్రకటనలో తెలిపారు. కాగా ఒక్క వర్గం వ్యాపారస్తులు మాత్రం తాము పాన్‌ కార్డు నిబంధనకు మద్దతు తెలిపారు, కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Feb 15,2019 కిర్లోస్కర్‌ నుంచి అత్యాధునిక జెన్‌సెట్స్‌ హైదరాబాద్‌: విద్యు త్తు జనరేటర్ల ఉత్పత్తిలో దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న కిర్లోస్కర్‌ ఆయిల్‌ ఇంజిన్‌ (కేవోఈఎల్‌) సంస్థ గురువారం మార్కెట్లోకి సరికొత్త విద్యుత్తు ఉత్పత్తి సెట్లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. నూతన సాంకేతిక ఆవిష్కరణల సమ్మిళితంగా రూపొందించిన ఈ కొత్త ఇంటలిజెంట్‌ డీజీ సెట్లకు సంస్థ 'ఐ గ్రీన్‌ సిరీస్‌'గా నామకరణం చేసింది. ఈ సందర్భంగా కేఓఈఎల్‌ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శ్రీ సంజీవ్‌ నిమ్కర్‌ మాట్లాడుతూ సరికొత్త ఉత్పాదనల్లో డీజీ సెట్‌ రిమోట్‌ మానిటరింగ్‌ వంటి ఇన్‌బిల్ట్‌ ఫీచర్లతో రూపొందించినట్టుగా తెలిపారు. ఏదైనా సమస్య తలెత్తితే వాటిని స్వయంగా నిర్ధారణ చేసుకోవడం, సమస్య ఎలక్ట్రానిక్‌ అంశాలకు సంబంధించినది అయితే కంట్రోల్‌ రూమ్‌కు చేరవేయడం ఈ డీజీ సెట్లలోని విశిష్టత అని ఆయన తెలిపారు. ఒకవేళ, ఏవైనా తీవ్ర అపాయం కలిగించే పరిస్థితులు ఏర్పడితే స్వీయరక్షణ వ్యవస్థను ఈ డీజీ సెట్‌ కలిగి ఉందని ఆయన వివరించారు. వీటిల్లో ఒకసారి గ్రిడ్‌ పవర్‌ ఆఫ్‌ అయితే డీజీ సెట్‌ ఆటోమెటికల్లీ స్విచ్‌ ఆన్‌ అవుతుంది మరియు గ్రిడ్‌ పవర్‌ ఆన్‌ అయితే డీజీ సెట్‌ ఆటోమెటికల్లీ స్విచ్‌ ఆఫ్‌ అవుతుందని ఆయన తెలిపారు. ఈ విశిష్టమైన ఫీచర్‌ను భారతదేశంలో అందిస్తున్న మొట్టమొదటి కంపెనీ కేఓఈఎల్‌. 5కేవీఏ సెట్ల నుంచి ఈ ఫీచర్‌ అందుబాటులో ఉందన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సంజన మొత్తం విప్పేసింది.. ఇప్పుడు కవర్ చేస్తోంది Highlights దండు పాళ్యం 2లో నగ్నంగా నటించిన సంజన అంత అవసరమా అంటూ విమర్శలు రావటంతో మాటమార్చింది వాళ్లు ముందే అడిగినా, తాను నగ్నంగా నటించలేదట, అదంతా గ్రాఫిక్స్ అట దండుపాళ్యం-2 సినిమాలో సంజన న‌గ్నంగా న‌టించడం ఇప్పుడు దక్షిణాది  సినీ పరిశ్రమలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంత మంది ఆమె తీసిన చిత్రం వాస్త‌వమేనా?  కాదా? అన్న చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్పుడు క‌న్నడ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రినోట విన్నా సంజ‌న నంటించిన న‌గ్న చిత్రాలు వివాదాస్పదంగా మారాయి. ఆమె న‌గ్నంగా న‌టించిన దుండు పాళ్యం-2 సంబంధించిన కొన్ని పోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అవ‌న్నీ సంజ‌న‌కు సంబంధించిన‌వే.   టాలీవుడ్ లో పూరిజ‌గ్న‌నాథ్‌, ప్ర‌భాస్ కాంబినేష‌ల్‌లో వ‌చ్చిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లెలిగా నంటించిన సంజ‌న‌, ఆ త‌రువాత పలు తెలుగు సినీమాల్లో చేసినా హీరోయిన్ గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. తాజాగా దండుపాళ్యం 2లో అదే సంజ‌న ఇలా న్యూడ్ సీన్స్ లో న‌టించ‌డ‌ం అందరినీ ఆశ్యర్య పరుస్తోంది.      అయితే దీని పై న‌టీ సంజ‌న క్లారిటీ ఇచ్చుకున్నారు. బుధ‌వారం బెంగళూరులో మీడియా తో మాట్లాడుతూ.. సినీమాలో అలాంటి సీన్లు చేయాల్సి ఉంటుంద‌ని తన‌తో ద‌ర్శ‌క నిర్మాతలు ముందే చెప్పార‌ంది. అయితే ఆ దృశ్యాలను చిత్రీక‌రించిన స‌మ‌యంలో త‌ను నిండుగా దుస్తులు ధ‌రించాన‌ని, ఆ త‌రువాత గ్రాఫిక్స్ ద్వారా వాటిని న‌గ్నంగా మార్చార‌ని అంది.      మరోవైపు అశ్లీలత ఎక్కువైందనే కారణంగా దండుపాళ్యం 2లోని ఆ దృశ్యాలకు సెన్సార్‌ బోర్డు కట్‌ చెప్పడంతో, వాటిని తొలిగించాకే సినిమా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. కానీ అంతలోనే తొలగించిన సీన్లు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో సినిమాపై వివాదం రాజుకుంది. ఆ దృశ్యాలు ఎలా లీకయ్యాయో తెలియదని, 'ఒకవేళ సినిమాలో ఆ సీన్స్‌ వుంటే బావుండేది.. నటిగా నా తెగువకు ఆ సన్నివేశాలు నిదర్శనం.. మానసికంగా చాలా ప్రిపేర్‌ అయ్యి ఆ సన్నివేశంలో నటిం చాల్సి వచ్చింది..' అంటూ సంజన క్లారిటీ ఇచ్చింది. Last Updated 25, Mar 2018, 11:37 PM IST
0business
Sep 04,2017 మూడు నెలలు ఆగాల్సిందే.. న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కొత్తగా రూ.200 నోటును చలామణిలోకి తీసుకోస్తున్నట్టుగా గతవారం ప్రకటించింది. అయితే ఈ కొత్త నోటును ఏటీఎంలలోకి తేవడానికి ఇంకా మూడునెలల సమయం పడుతుందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రూ.200 నోట్లను ఏటీఎంలలో అమర్చాల్సిందిగా పలు బ్యాంకులు ఏటీఎం నిర్వహణ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశాయి. కానీ ఇప్పటివరకూ ఈ విషయంలో ఆర్‌బీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని కంపెనీలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఉన్న 2.25 లక్షల ఏంటీఎంలలో ఈ నోట్లు అందుబాటులోకి వస్తాయో లేదో అన్న విషయమై సందేహాలు నెలకొన్నాయి. 'ఆర్‌బీఐ నుంచి ఆదేశాలు వస్తే రూ.200 నోట్లను ఏటీఎంలలో ట్రయల్‌ వేస్తామని ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ ఎండీ రవి గోయల్‌ తెలిపారు.. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లతో పోలిస్తే 200 నోట్లు పరిమాణంలో చాలా చిన్నవని వివరించారు. కావునా వాటి సైజ్‌కి తగ్గట్టు ఏటీఎంలలో మార్పులు చేయాల్సి ఉంటుందని రవి తెలిపారు. వీటిని అమర్చాలంటే 90 రోజులు పడుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏటీఎంలలో లభిస్తున్న నోట్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపారు. గతేడాది నవంబర్‌లో కేంద్రంలోని మోడీ సర్కారు పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తోషిబా ప్రస్తుత ఛైర్మన్‌ షిగెనోరి షిగా వైదొలుతున్న తోషిబా చైర్మన్‌ టోక్యో,: అమెరికాలోని అణు వ్యాపారంపై ఆరు బిలి యన్‌ డాలర్ల రద్దుకు నిర్ణయించుకోవడంతో తోషిబా కంపెనీ ఛైర్మన్‌పదవి నుంచి ప్రస్తుత చైర్మన్‌ దిగిపోయేందుకు నిర్ణ యించుకున్నారు. అమెరికా అణు వ్యాపారానికి సంబం ధించి ఇటీవల ఎదురైన చిక్కులతో వాటాదారుల ఈక్విటీ కరిగిపోతున్నట్లు కంపెనీ గుర్తించింది. ఇదే ఏడాదిమొత్తానికి అపారనష్టం తెచ్చేదిగా పరిణ మించింది. దీనితోతోషిబా ప్రస్తుత ఛైర్మన్‌ షిగెనోరి షిగా ఛైర్మన్‌ పదవి నుంచి తొలగుతారని కంపెనీ ప్రకటించింది. అమెరికా అణువ్యాపారంతో ఎదు రవుతున్న నష్టాలే ఇందుకుకీలకమని తోషిబా భావి స్తోంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివా దంలో వెస్టింగ్‌ హౌస్‌ అణువ్యాపారంపై మరింతగా దర్యాప్తు జరిపేందుకు వ్యవధి కోరుతున్న కంపెనీ హఠత్తుగా ఈ నిర్ణయం ప్రకటించింది. అంతర్గత నివేదికల ఆధారంగా చూస్తే కీలక సమస్యలు వెలుగులోకి రాలేదని తోషిబా భావిస్తోంది. వెల్లడయిన గణాంకాలను చూస్తే ఆడిటర్లు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అందువల్లనే తోషిబా కూడా ఇన్వెస్టర్లను హెచ్చరిస్తూ కొంత సర్దుబాట్లు ఉంటాయని వెల్లడించింది. మార్చి 14వ తేదీనాటికి పూర్తి ఆడిట్‌అయిన గణాంకాలు వెల్లడి అవుతా యని, జపాన్‌ఎక్ఛేంజిలకు దాఖలుచేసిన గణాంకాల నివేదిక లపై కంపెనీ తర్జనభర్జనలు పడుతోంది. తోషిబా ఒక ప్రకటనచేస్తూ మూలధన సమీకరణ కష్టంగామారిందని, మెమరీచిప్‌ కంపెనీలో మెజార్టీ వాటాను విక్రయిస్తున్న ట్లు వెల్లడించింది. మొత్తం కీలకవ్యాపారంలో 20 శాతం వాటాను విక్రయించే యోచన ఉన్నట్లుగతంలో కూడా తోషిబా ప్రకటించింది. మదింపు, ఆడిట్‌ గణాం కాల సమస్యలు, సుపరిపాలనఅంశాలు వంటివి కంపె నీకి కీలకంఅవుతాయని భవిష్యత్తులో వీటిని అధిగమిం చే అవకాశం ఉందని టోక్యోలోని జెఫరీస్‌ సంస్థ ఆర్థిక వేత్త జుహైర్‌ఖాన్‌ వెల్లడించారు. గ్రూప్‌షేర్లు ఎనిమిదిశాతం క్షీణించాయి. కంపెనీ మార్కెట్‌ విలువలు 8.6బిలియన్‌ డాలర్లు పతనం అయ్యాయి. డిసెంబరు మధ్యస్తంనుంచి కూడా సంపద లో కీలక మొత్తం తగ్గింది. దశాబ్దంక్రితంసంస్థ మార్కెట్‌ విలువ లు ఐదులక్షలకోట్ల యెన్‌లుగాఉంది. డిసెంబరులో అణు సమస్య లు పరిష్కారం కాకపోవడంతో ఛైర్మన్‌ షిగెనోరి షిగా వైస్టింగ్‌ హౌస్‌ మాజీబాస్‌ను ఉన్నతస్థాయి పదవికి తీసుకువచ్చింది. 1.3 బిలియన్‌డాలర్ల గణాంకాలకుంభకోణం 2015లోతోషిబా కంపెనీ ని కుదిపేసింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిదినెలల కాలానికి 499.9 బిలియన్‌ల యెన్‌లు అంటే 4.4 బిలియన్‌ డాలర్ల నికర నష్టం చవిచూస్తామని అంచనావేస్తోంది. పూర్తి సంవత్సరానికి 390బిలియన్‌ల యెన్‌లనష్టంవాటిల్లగలదని ముందస్తు అంచనా లు వేసింది. 2016 సంవత్సరం వాటాదారుల ఈక్విటీప్రతికూల రాబడుల్లోఉందని అణువ్యాపారంపై పెట్టుబడుల రద్దు ఇందుకు కీలకమనితేల్చింది. విదేశాల్లో అణుప్లాంట్‌ ణిర్మాణాని ఉపసంహ రించుకుంటున్నట్లు వెల్లడించింది. అలాగే బ్రిటన్‌, భారత్‌లలో ఉన్న వెంచర్ల నుంచి కూడా పాక్షికంగా వైదొలిగేనిర్ణయంతో ఉన్న ట్లు అంతర్జాతీయ వార్తాసంస్థలు సైతం ఉటంకించాయి. బయటి ప్రాంత న్యాయవాదులు పరిశీలనకు ఒకనెలరోజుల వ్యవధి తీసు కుంటుందని, తదుపరి దర్యాప్తులు, స్వతంత్ర ఆడిటర్ల పునఃపరి శీలనకు కొంత వ్యవధి పడుతుందని తోషిబా వెల్లడించింది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఇదేం వ్యూహం? జట్టు ఎంపికపై మాజీల అసంతృప్తి బెంళూరు టీ20లో భారత ఓటమి తర్వాత మాజీలు గళం విప్పుతున్నారు. బౌలర్ల ఎంపికను తప్పుబడుతున్నారు. ఐదుగురితో మాత్రమే బరిలో దిగడం ఏంటని ఒకరు ప్రశ్నించారు. మరొకరేమో ముగ్గురు స్పెషలిస్టులేనా అని విమర్శించారు. Samayam Telugu | Updated: Feb 28, 2019, 04:57PM IST ఇదేం వ్యూహం? జట్టు ఎంపికపై మాజీల అసంతృప్తి హైలైట్స్ బెంళూరు టీ20లో భారత ఓటమి తర్వాత మాజీలు గళం విప్పుతున్నారు. బౌలర్ల ఎంపికను తప్పుబడుతున్నారు. ఐదుగురితో మాత్రమే బరిలో దిగడం ఏంటని ఒకరు ప్రశ్నించారు. మరొకరేమో ముగ్గురు స్పెషలిస్టులేనా అని విమర్శించారు. బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లోనూ భారత్ ఓటమిపాలైంది. దీంతో 0-2తో సిరీస్‌ను కోల్పోయింది. అజేయ శతకం బాదిన మ్యాక్స్‌వెల్ ఆసీస్‌కు విజయాన్ని అందించాడు. మ్యాక్సీ 55 బంతుల్లోనే 113 పరుగులు చేయడంతో.. కోహ్లి, ధోనీ, రాహుల్ మెరుపులు వృథా అయ్యాయి. భారత గడ్డ మీద తొలి టీ20 సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా సంబరాలు చేసుకుంది. న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్ ఓడిన టీమిండియా .. ఆసీస్ చేతిలోనూ ఓడటంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతో బరిలో దిగింది. ఈ ఐదుగురిలోనూ కృనాల్ పాండ్య, విజయ్ శంకర్ ఆల్‌రౌండర్లు కావడం విశేషం. ఆరో బౌలర్ లేకపోవడం భారత్‌కు మైనస్‌గా మారింది. విజయ్ శంకర్ 38 పరుగులు ఇచ్చుకోగా.. పాండ్య 33 రన్స్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిశాక బౌలర్ల ఎంపిక తీరును మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టారు. సిరీస్ విజేతను నిర్ణయాత్మక మ్యాచ్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్లను మాత్రమే ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. Playing only five bowlers leaves no room for anyone to have a bad day....Chahal was expensive but India didn’t have… https://t.co/17RElWWJ1T — Aakash Chopra (@cricketaakash) 1551287515000 ‘ఐదుగురు బౌలర్లు మాత్రమే ఆడటం సరైంది కాదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చాహల్ కూడా ఎక్కువ పరుగులు ఇచ్చాడు. కానీ మనకు మరో చాయిస్ లేకపోయింది. టీ20ల్లో ఇది వ్యూహాత్మక పొరబాటు. ఇది భారత్‌కు వరుసగా రెండో టీ20 ఓటమి’ అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. I know they are playing around with team selection with WC in mind, but this has to be the weakest bowling attack s… https://t.co/k53ZOild6J — Sanjay Manjrekar (@sanjaymanjrekar) 1551273562000 సంజయ్ మంజ్రేకర్‌ మరి కాస్త ఘాటుగా విమర్శించారు. రానున్న ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టును ఎంపిక చేశారని తెలుసు. కానీ ఇటీవలి ఇదే అత్యంత బలహీనమైన బౌలింగ్ విభాగం. ఐదుగురు బౌలర్లలో కృనాల్, విజయ్ శంకర్‌లు కూడా ఉన్నార’ని మంజ్రేకర్ ట్వీట్ చేశారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ప్రియమణి ప్రేమికుడు ఇతడే... యమదొంగ, పెళ్లయిన కొత్తలో... సినిమాలతో తెలుగు ప్రజలకు దగ్గరైన ప్రియమణి త్వరలో పెళ్లిచేసుకోబోతోందట. TNN | Updated: Feb 16, 2016, 09:57AM IST ప్రియమణి ప్రేమికుడు ఇతడే... యమదొంగ, పెళ్లయిన కొత్తలో ... సినిమాలతో తెలుగు ప్రజలకు దగ్గరైన ప్రియమణి త్వరలో పెళ్లిచేసుకోబోతోందట. అది కూడా ప్రేమ వివాహం. ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తి ప్రేమలో పడింది ప్రియమణి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. తన ప్రేమికుడిని అందరికీ పరిచయం చేసింది. అతడి పేరు ముస్తఫా రాజ్ . ముంబైలోని ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ యజమానిి. కాగా ప్రియమణి అతడిని ఓ డ్యాన్స్ షో సందర్భంగా కలిసిందట. పరిచయం పెరిగి... ప్రేమగా మారింది. చాలా రోజుల క్రితమే ప్రియమణి ప్రేమలో పడ్డానని, ఆ వ్యక్తి ఎవరో త్వరలో తెలియజేస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పింది ప్రియమణి. పెళ్లి తరువాత కూడా సినిమాలలో నటిస్తానని స్పష్టం చేసింది.
0business
New Delhi, First Published 10, May 2019, 11:31 AM IST Highlights వ్యాపార విస్తరణలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ సిద్ధమవుతోంది. ఆ ప్రాంతాల నుంచి విక్రేతల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ ఎఫైర్స్‌) రజ్నీశ్‌ వాహి తెలిపారు.  హైదరాబాద్‌: వ్యాపార విస్తరణలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ సిద్ధమవుతోంది. ఆ ప్రాంతాల నుంచి విక్రేతల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ ఎఫైర్స్‌) రజ్నీశ్‌ వాహి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 50వేల మంది కొత్త విక్రేతలు తమ వద్ద నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 లక్షల మంది విక్రేతలు తమ వద్ద వస్తువులను విక్రయిస్తున్నట్లు తెలిపారు.  తృతీయ శ్రేణి పట్టణాలపై స్నాప్‌డీల్‌ దృష్టి స్థానికుల అభిరుచులకు అనుగుణంగా తమ వ్యాపార వ్యూహాం అమలు చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు స్నాప్ డీల్ కార్పొరేట్‌ ఎఫైర్స్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రజ్నీశ్‌ వాహి చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ వస్తువుల కొనుగోలుకు వెచ్చిస్తున్న మొత్తం 80000 కోట్ల డాలర్ల మేరకు ఉందనీ, 2025 నాటికి 2లక్షల కోట్లకు చేరుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.  ఏపీ, తెలంగాణ మార్కెట్లు కీలకం అన్న స్నాప్ డీల్ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లు తమకు ఎంతో కీలకంగా ఉన్నాయనీ..ఇక్కడ నుంచి 25,000 మంది విక్రేతలు తమ వద్ద నమోదైనట్లు స్నాప్ డీల్ కార్పొరేట్‌ ఎఫైర్స్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రజ్నీశ్‌ వాహి చెప్పారు. కడప నుంచి వ్యాపారులు బీపీ మెషిన్లు, థర్మామీటర్లను ఎక్కువగా అమ్ముతుండగా, కర్నూలు నుంచి స్మార్ట్‌వాచీలు, బ్లూటూత్‌ పరికరాలు, కేబుల్‌ ఛార్జీలు, స్పీకర్లలాంటివి, హైదరాబాద్‌ నుంచి నమోదైన విక్రేతలు కంప్యూటర్లు, వాటి ఉపకరణాలను అధికంగా విక్రయిస్తున్నారని వివరించారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా స్నాప్ డీల్ సేవలు చిన్న ఫ్యాన్లు, సౌందర్య సాధనాలు, చెప్పులు, వంట సామాగ్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కొంటున్నారని స్నాప్ డీల్ కార్పొరేట్‌ ఎఫైర్స్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రజ్నీశ్‌ వాహి పేర్కొన్నారు. దాదాపు 600 విభాగాలు తమ వద్ద లభిస్తున్నాయనీ, నెలకు 7.7కోట్ల మంది తమ వెబ్‌సైటును సందర్శిస్తున్నారని చెప్పారు.
1entertainment
internet vaartha 177 Views హైదరాబాద్‌ : హిమాలయ సాహస యాత్రకు అనువైన మోటార్‌సైకిల్‌ను విడుదల చేసినట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రకటించింది. ఈనెల 17వ తేదీనుంచి బుకింగ్స్‌ ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ధరలు 1,76,580 రూపాయలుగా ప్రకటించింది. కొత్త ఎల్‌ఎస్‌ 410ఇంజన్‌ ఉన్న రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ భారత్‌లో మంచి మార్కెట్‌ ఉంటుందని గ్రానైట్‌, మంచురంగుల్లో ఈబైక్‌ లభిస్తుందని దేశవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోనికి తెస్తున్నట్లు కంపెనీ సిఇఒ ఎండి సిద్ధార్ధలాల్‌ వెల్లడించారు. హ్యారిస్‌ పనితీరుతో మొరటైన డూప్లెక్‌స స్ప్లిట్‌ క్రాడల్‌ ఫ్రేమ్‌తో డిజైనింగ్‌ వృద్ధిచేసిన హిమాలయన్‌, ధృఢత్వం, వేగం రెండింటికీ మారుపేరుగా ఉంటుందన్నారు. హిమాలయన్‌ 200ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో హిమాలయాలు కానీ యండి, రాళ్లతో నిండిన నదీతీరాలైనా పిల్లకాలు వల్ని దాటడంలో అయినా అన్ని అడ్డంకులను సులభంగా అధిగమిస్తుందని తెలిపారు.
1entertainment
క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా! indigo bumper offer న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణించాలని భావిస్తున్నారా? అయితే ఈ ఆఫర్‌ మీ కోసమే. దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా టికెట్‌ ధరలపై డిస్కౌరట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ సమ్మర్‌ సేల్‌లో భాగంగా తగ్గింపు ధరతో టిక్కెట్లను అందిస్తోంది. ఇండిగో సమ్మర్‌ సేల్‌లో భాగంగా దేశీయ విమాన టిక్కెట్‌ ధర రూ.999నుంచి ప్రారంభమవుతోంది. ఇక విదేశీ విమాన టిక్కెట్‌ రూ.3,499నుంచి ఆరంభమవుతోంది. ఈ ఆఫర్‌ జూన్‌ 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్‌లో భాగంగా టిక్కెట్లను బుకింగ్‌చేసుకున్నవారు జూన్‌ 26 నుంచి సెప్టెంబరు 28 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. కంపెనీ ఆఫర్‌లో భాగంగా 10 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. ఇండిగో తగ్గింపు ధరతోపాఉట రూ.2000క్యాష్‌బ్యాక్‌ కూడా అందిస్తోంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డుదారులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆఫర్‌ పొందాలంటే లావాదేవీ విలువ కనీసం రూ.4,000ఉండాలి. అదే ఐసిఐసిఐ బ్యాంకు డెబిట్‌ కార్డుగానీ, క్రెడిట్‌ కార్డుదారులకు రూ.1,000వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. లావాదేవీ విలువ కనీసం రూ.6,000ఉండాలి. ఇకపోతే టికెట్లకు ఎయిర్‌పోర్ట్‌ ఛార్జీలు, ప్రభుత్వ పన్నులు అదనంగా ఉంటాయి. తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/
1entertainment
Vaani Pushpa 166 Views in us open grand slam , nadal , went to final nadal న్యూయార్క్‌: ఊహించినట్లుగానే స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో నాదల్‌ 7-6(8/6),6-4, 6-1 తేడాతో బెర్రెట్టినీ(ఇటలీ)పై గెలిచి ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు.ఇప్పటికి 18 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన నాదల్‌ మరో టైటిల్‌కు అడుగు దూరంలో మాత్రమే నిలిచాడు. 42ఏళ్ల వయసులో యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌ చేరిన తొలి ఇటలీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన బెరెటిని సెమీఫైనల్లో నిరాశపరిచాడు. వరుస సెట్లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో చివరకు నాదల్‌ పైచేయి సాధించి తుదిపోరుకు అర్హత సాధించాడు. నాదల్‌-బెర్రెట్టినీల మధ్య జరిగిన తొలి సెట్‌ రసవత్తరంగా సాగింది. ఇద్దరు సమంగా తలపడటంతో ఆ సెట్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. అయితే ఇక్కడ కూడా ఆసక్తికర సమరమే జరిగింది. కాకపోతే చివరకు నాదల్‌ గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. తొలి సెట్‌ను గెలిచిన ఊపును రెండు, మూడు సెట్లలో నాదల్‌ కొనసాగించాడు. అయితే బెర్రిట్టినీ మాత్రం అద్భుతమైన ఏస్‌లతో ఆకట్టుకున్నాడు. రెండో సెట్‌ను నాదల్‌ 6-4తో గెలవగా, మూడో సెట్‌ను 6-1తో దక్కించుకోవడంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫలితంగా 19వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌పై నాదల్‌ గురిపెట్టాడు. ఇప్పటివరకు 18గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్‌…యూఎస్‌ ఓపెన్‌ను మాత్రం మూడుసార్లు మాత్రమే అందుకున్నాడు. 2017లో చివరిసారి యూఎస్‌ ఓపెన్‌ను గెలిచిన నాదల్‌…ఈసారి కూడా టైటిల్‌పై ధీమాగా ఉన్నాడు. టాప్‌ సీడ్‌ ఆటగాళ్లు రోజర్‌ ఫెదరర్‌, నొవాక్‌ జొకోవిచ్‌లు ఇప్పటికే ఇంటి ముఖం పట్టడంతో నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ను కష్టం కాకపోవచ్చు.మరో సెమీస్‌లో దిమిత్రోవ్‌పై మెద్వెదేవ్‌ పైచేయి సాధించాడు. 7-6(7-5), 6-4, 6-3తేడాతో విజయం సాధించాడు. దీంతో 14ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన రష్యన్‌ ఆటగాడిగా మెద్వెదేవ్‌ రికార్డు నెలకొల్పాడు. సోమవారం జరగనున్న అంతిమ సమరంలో మెద్విదేవ్‌తో నాదల్‌ తలపడనున్నాడు.నాదల్‌కు కెరీర్‌లో ఇది 27వ ఫైనల్‌ కాగా మెద్విదేవ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు అదుకున్న ఫెదరర్‌ (20)ను సమీపించేందుకు నాదల్‌కు ఇది చక్కని అవకాశంగా అందరూ భావిస్తున్నారు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
నాకు ఎవడో ఇల్లు కొనిచ్చాడంటే ఎక్కడో కాలుతోంది-రకుల్ ప్రీత్ Highlights టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రకుల్ తనకు ఎఫైర్ వుందంటూ, బోయ్ ఫ్రెండ్ ఇల్లు కొనిచ్చాడంటూ తెగ రూమర్స్ ఇల్లు కూడా ఎవడో కొనిచ్చాడంటే ఎలా అని రకుల్ ఆగ్రహం   తెలుగు ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాలతో మొదలైన ఆమె సిని ప్రస్థానం స్టార్స్ తో చేసే రేంజ్ కు వెళ్లింది. కెరియర్ లో మంచి జోష్ కనబరుస్తున్న రకుల్ కు ఈమధ్య స్ప్రెడ్ అయిన ఓ రూమర్ తనని చాలా బాధపెట్టిందని వెళ్లడించింది. ఓ స్టార్ హీరో తనకు ఇళ్లు కొనిచ్చాడన్న న్యూస్ ఆమ్మడిని చాలా బాధపెట్టిందట.   హీరో హీరోయిన్ అన్నాక రూమర్లు రావడం సహజం. అయితే అఫైర్ ఉందని న్యూస్ రాయడం కామనే కాని ఏకంగా రకుల్ కు ఆ హీరో ఇళ్లే కొనిచ్చాడు అన్న వార్తలు రావడం ఆమెను చాలా డిస్ట్రబ్ చేశాయట. ముఖ్యంగా తన ఫ్యామిలీ ఈ వార్తలపై బాధాపడ్డారని అన్నది రకుల్. ఓ ఇళ్లు కొనిచ్చే బోయ్ ఫ్రెండ్ ఉన్నాడనడం తనకు గర్వకారణమే అని కాకపోతే అలాంటి ఫ్రెండ్ ఉన్నా తాను మాత్రం ఫ్రీగా తీసుకోనని అంటుంది.    3 కోట్లతో తనకు ఇళ్లు కొనిచ్చాడని వచ్చిన ఆ వార్తలు తనపై చాలా ప్రభావితం చేశాయని.. తాను కష్టపడి ఇళ్లు కొంటే హీరో కొనిచ్చాడని వార్తలు రావడం షాకింగ్ గా అనిపించాయని అన్నది. ఏది ఏమైనా రకుల్ ఇంత వివరణ ఇచ్చింది కాబట్టి సదరు ఇళ్లు సొంత డబ్బుతోనే కొనేసిందని నమ్మేయొచ్చు. ఒక్కో సినిమాకు కోటికి పైగా వసూలు చేసే ఆమె ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. ప్రస్తుతం ఈ శుక్రవారం జయ జానకి నాయకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రకుల్ స్పైడర్ లో మహేష్ పక్కన నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ లోనూ అవకాశాలతో అయ్యారీ అంటూ రకుల్ దూసుకెెళ్తోంది. Last Updated 25, Mar 2018, 11:51 PM IST
0business
Hyderabad, First Published 24, Oct 2018, 4:33 PM IST Highlights పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు తమ వివాహ బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు.  అయితే పవన్ కళ్యాణ్ సరసన రెండోసారి హీరోయిన్ గా 'జానీ' సినిమాలో నటించింది రేణు దేశాయ్.  పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు తమ వివాహ బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు.  అయితే పవన్ కళ్యాణ్ సరసన రెండోసారి హీరోయిన్ గా 'జానీ' సినిమాలో నటించింది రేణు దేశాయ్. ఈ సినిమాకి పవన్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు  నిర్వహించారు. 2003లో వచ్చిన ఈ సినిమా సంగతులను రేణు తాజాగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ''జానీ సినిమాకి మొదట నేను ప్రొడక్షన్ డిజైనర్ గా పని మొదలుపెట్టాను. షూటింగ్ మొదలు కావడానికి మరో రెండు వారాలు ఉందనగా.. నన్ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆ సినిమాలో నటించడానికి నేను మొదట్లో ఇష్టపడలేదు. ఎందుకంటే 21 ఏళ్ల వయసులో ప్రొడక్షన్ డిజైనర్ గా, హీరోయిన్ గా రెండు పనులు పూర్తి చేయలేమోనని అనుకున్నా.. కానీ పవన్ కళ్యాణ్ నన్ను కన్విన్స్ చేశారు. దాంతో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్నాను. ఆ సినిమా కోసం దాదాపు ఏడు నెలల పాటు రోజుకి పదహారు, పదిహేడు గంటలు పనిచేసేదాన్ని. ప్రొడక్షన్ డిజైనర్ గా సెట్ కి వచ్చి అన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని చూసుకొని ఆ తరువాత మేకప్ రూమ్ కి వెళ్లి మేకప్ వేసుకునేదాన్ని'' అంటూ చెప్పుకొచ్చింది.   Last Updated 24, Oct 2018, 4:33 PM IST
0business
అ..! రివ్యూ.. కాజల్ అందరి రోగం కుదిర్చింది... అ.. అనిపించింది Highlights తారాగణం : కాజల్‌ అగర్వాల్‌, నిత్యామీనన్‌, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, ప్రగతి సంగీతం : మార్క్‌ కె రాబిన్‌ దర్శకత్వం : ప్రశాంత్‌ వర్మ నిర్మాత : నాని, ప్రశాంతి ఆసియానెట్ రేటింగ్ - 2.75/5 వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. అయితే నాని తొలి ప్రయత్నంగా ఎంచుకున్న సినిమా కథాంశం ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్‌ ఇచ్చింది. డిఫరెంట్‌ కాన్పెప్ట్‌ తో ఇంట్రస్టింగ్‌ టేకింగ్‌తో తెరకెక్కించిన అ! సినిమాతో ప్రశాంత్‌ వర్మను దర్శకుడిగా పరిచయం చేశాడు నాని. కేవలం కథ, దర్శకుడిని నమ్మి నాని చేసిన ప్రయత్నం ఫలించిందా..? దర్శకుడు నాని నమ‍్మకాన్ని నిలబెట్టాడా..?   కథ : కళి (కాజల్‌).. జీవితంలో ఎన్నో చేదు అనుభావాలతో విసిగిపోయి తన పుట్టిన రోజున ఓ తీవ్ర నిర్ణయం తీసుకుంటుంది. చివరి సారిగా చిత్ర (ప్రగతి) నిర‍్వహిస్తున్న ఫుడ్‌ కోర్ట్‌లో కూర్చోని తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అదే సమయంలో రాధమ్మ(ఈషా రెబ్బా)తను ప్రేమించిన క్రిష్ (నిత్యామీనన్‌)ను తన తల్లిదండ్రులకు పరిచయం చేయడానికి అదే ఫుడ్‌ కోర్ట్‌కు వస్తుంది. ఈజీ మనీకోసం తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ఓ దొంగతనం ప్లాన్‌ చేసిన మీరా(రెజీనా) అదే ఫుడ్‌ కోర్ట్‌లో పనిచేస్తుంటుంది. తనకు తాను గ్రేటెస్ట్‌ మెజీషియన్‌ అనుకునే యోగి (మురళీశర్మ) రెస్టారెంట్‌ లో ఉన్న చిన్నపాప మ్యాజిక్‌ చేస్తుంటే ఆమెతో గొడవ పడతాడు. అక్కడే డోర్‌ బాయ్‌గా పనిచేస్తున్న శివ తన చిన్నప్పుడే దూరమైన అమ్మనాన్నలు చూడాలన్న కోరికతో టైం మెషీన్‌ తయారు చేసే పనిలో ఉంటాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్క చెఫ్‌ అని అబద్ధం చెప్పి నలభీమ (ప్రియదర్శి) అదే ఫుడ్‌కోర్ట్‌ లో ఉద్యోగంలో చేరతాడు. ఇలా ఒకే చోట చేరిన ఈ వ్యక్తలకు ఒకరితో ఒకరికి ఉన్న సంబంధం ఏంటి..? కళి తీసుకున్న నిర్ణయం ఏంటి..? అన్నదే మిగతా కథ.   నటీనటులు : నిడివి తక్కువే అయినా సినిమాలో కీలక పాత్ర కాజల్‌దే. అందుకు తగ్గ హవా భావాలతో కళి పాత్రకు ప్రాణం పోసింది కాజల్‌. కళి తరువాత ఆకట్టుకున్న మరో పాత్ర రెజీనా. మీరాగా కనిపించేందుకు చాలా కష్టపడ్డ రెజీనా పర‍్ఫామెన్స్‌తోనూ మెప్పించింది. డ్రగ్స్‌కు అలవాటు పడిన అమ్మాయిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. టామ్‌ బాయ్‌ తరహా పాత్రలో నిత్యామీనన్‌, ఆమె లవర్‌గా ఈషా రెబ్బాలు ఆడియన్స్‌ కు షాక్‌ ఇచ్చారు. ఈ ఇద్దరు లుక్స్‌ పరంగానూ మెప్పించారు. ఇక వంట రాని చెఫ్ పాత్రలో ప్రియదర్శి మంచి నటనతో పాటు కామెడీ కూడా పండించాడు. ముఖ్యంగా చేప, చెట్టు, ప్రియదర్శి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. మెజీషియన్‌గా మురళీశర్మ కూడా అద్భుతంగా నటించాడు. టైం మెషీన్ తయారు చేయాలని భావించిన సైంటిస్ట్‌ పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ కొత్తగా కనిపించాడు. ఇతర పాత్రలో ప్రగతి, రోహిణి, దేవదర‍్శిలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.   విశ్లేషణ : సమాజంలో ఆడపిల్లకి నిత్యం ఎదురయ్యే అనుభవాలు వాటి తాలుకా ప్రతిస్పందనల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఒక్కో ఎమోషన్‌ను ఒకో పాత్రలో చూపించే ప్రయత్నం చేశాడు. కోపం, బాధ, ప్రేమ, పగ, ఆవేశం లాంటి భావాలకు ప్రతీరూపాలుగా క్యారెక్టర్స్‌ వెండితెర మీద ఆవిష్కరించాడు. తొలి అర్థభాగం మొత్తం సినిమాలోని పాత్రల పరిచయానికే కేటాయించిన దర్శకుడు సెకండ్‌ హాఫ్ లోనే అసలు కథ మొదలు పెట్టడం ఆడియన్స్‌లో అసహనం కలిగిస్తుంది. అయితే ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అయిన ప్రతీసారి అ! అనిపించే ట్వీస్ట్‌ తో షాక్‌ ఇచ్చాడు డైరెక్టర్‌. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా అవాక్కయ్యేలా చేసే ట్విస్ట్‌లు సినిమాలో చాలానే ఉన్నాయి. కానీ అవి రెగ్యులర్‌ సినిమా ఆడియన్స్‌ కు ఏ మేరకు రీచ్‌ అవుతాయన్నదే చూడాలి.   చేపకు నాని, చెట్టుకు రవితేజ చెప్పిన వాయిస్‌ ఓవర్‌ సినిమాలకు మరింత గ్లామర్‌ తీసుకువచ్చింది. కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. ఓ డిఫరెంట్‌ జానర్ లో తెరకెక్కిన సినిమాను అదే స్థాయి కెమెరా టెక్నిక్స్‌తో మరింత కొత్తగా మార్చాడు. మార్క్‌ కె రాబిన్‌ సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. టైటిల్ లో వచ్చే పాటతో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తోనూ అ! అనిపించాడు రాబిన్‌. ఆర్ట్‌, ఎడిటింగ్‌ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాతగా నాని ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించాడు. ప్రతీ ఫ్రేమ్‌ను కొత్తగా చూపించేందుకు యూనిట్‌ పడిన తపన తెర మీద కనిపిస్తుంది. మరి అదోరకం సినిమాలు మెచ్చే ప్రేక్షకులకు.. ఈ రకం సినిమా ఎంత మేరకు కనెక్ట్ అవుతుందో. చివరగా: ఖచ్చితంగా ఇదో రకం సినిమా.. అ..! అనిపిస్తుంది Last Updated 25, Mar 2018, 11:56 PM IST
0business
Sensex ఎంపిక చేసిన రంగాల మద్దతు ముంబయి, మే 9: బెంచ్‌మార్క్‌ సూచీలు స్వల్పంగా పెరిగాయి.రియాల్టీ మద్దతుతో స్టాక్‌ మార్కెట్లు స్వల్పలాభాలతో ముగిసాయి. ఐటి, టెలికాం, బ్యాంకింగ్‌ రంగ షేర్లుకూడా ట్రేడింగ్‌లో మద్దతునిచ్చాయి. ఆసియా స్టాక్స్‌ కూడా ఇన్వెస్టర్ల కు విశ్వాసం నింపాయి. ఫ్రెంచ్‌ ఎన్నికల్లో ఇమ్యా న్యుయేల్‌ మాక్రాన్‌ గెలుపొందడం మార్కెట్లకు ఊతం ఇచ్చింది. యూరోపియన్‌ కూటమిలోని ఇతర దేశాలకు, ఇన్వెస్టర్లకు సైతం మాక్రాన్‌ గెలుపు మంచి విశ్వాసాన్ని పెంపొందించింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 67పాయింట్ల ఎగువన 29,926 పాయిం ట్ల వద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి 29 పాయింట్ల ఎగువన 9314 పాయింట్లవద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5శాతం, 0.7 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక ఇన్వెస్టర్లు ఎక్కువశాతం భారతి ఎయిర్‌టెల్‌, హీరోమోటోకార్ప్‌ ఫలితాలపై ఆసక్తి చూపించారు. సిమెంట్‌రంగ కంపెనీలషేర్లు ఎసిసి, అంబూజా విలీనంతో రెండు కంపెనీల షేర్లు ఆరు, ఎనిమిదిశాతం చొప్పున పెరి గాయి. స్విస్‌ సిమెంట్‌ దిగ్గజం లాఫార్జ్‌ హోలిసిమ్‌ రెండు కంపెనీల విలీనంపై పెరిగాయి. ఎసిసి 3.4 శాతం పెరిగిటే అంబూజా 6.4శాతం పెరిగింది. లూపిన్‌ ఎసియన్‌పెయింట్స్‌, భారతి ఎయిర్‌టెల్‌, ఐసిఐసిఐబ్యాంకు విప్రో సంస్థలు లాభాల్లో ఉన్నాయి. ఐటిసి, హెచ్‌డిఎఫ్‌షి, బజాజ్‌ ఆటో, ఎల్‌అండ్‌టి, అదానిపోర్టులు భారీ వెనుకంజతో ముగిసాయి. బిఎస్‌ఇ బ్యాంకింగ్‌ సూచి ఒకటిశాతం పెరిగింది. ఫెడరల్‌బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు, ఎస్‌బిఐ బ్యాంకులు కొంతమేర పెరిగాయి. ప్రభు త్వం 150 బిలియన్‌ డాలర్ల రానిబాకీల పరిష్కారానికి ముందుకురావడమే ఇందుకుకీలకం. ఐసిఐసిఐబ్యాంకు 1.6శాతం పెరిగింది. ప్రైవేటురంంలోని బ్యాంకు మూడురెట్లు లాభాల్లో పెరుగుదల నమోదు చేసి 2025 కోట్లుగా ప్రకటించింది. ఎస్‌బిఐ ఒకటిశాతం పెరిగింది. గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గించడమే ఇందుకుకీలకం. బిఎస్‌ఇ రియాల్టీసూచి 4.5శాతం పెరి గింది. ఇండియాబుల్స్‌ రియల్‌ఎస్టేట్‌, హెచ్‌డిఐఎల్‌, డిఎల్‌ఎఫ్‌ ప్రెస్టిజ్‌సంస్థలు లాభాల్లో ముగిసాయి.
1entertainment
sumalatha 182 Views bse , NSE , stock market sensex ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అమెరికాచైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుతున్న వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు పెరిగి 36,982కు చేరుకుంది. నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 10,946కు ఎగబాకింది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/national/
1entertainment
శ్రీమంతుడు రికార్డ్ చెరిపేసిన చిరంజీవి ఖైదీ నెం,150 Highlights శ్రీమంతుడు రికార్డ్ బద్దలు కొట్టిన చిరంజీవి ఖైదీ నెం,150 అనుకున్నదే అయ్యింది. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత తమ ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవిని అభిమానంతో అక్కున చేర్చుకున్న ప్రేక్షకులు ఖైదీకి తిరుగులేని రికార్డులు అప్పజెప్తున్నారు. తాజాగా సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నాడు ఖైదీ. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం సరికొత్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . నాన్ బాహుబలి చిత్రాల్లో శ్రీమంతుడు నెంబర్ వన్ గా నిలిచింది అయితే తాజాగా ఆ రికార్డ్ తుడిచి పెట్టుకుపోయింది .   మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 జనవరి 11న రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే . కేవలం 12 రోజుల్లోనే 85 కోట్ల షేర్ ని రాబట్టి శ్రీమంతుడు రికార్డ్ ని బద్దలు కొట్టాడు చిరంజీవి . లాంగ్ రన్ లో బాహుబలి ని టచ్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . తెలుగులో ఇప్పుడు టాప్ 2 చిత్రాల్లో నెంబర్ వన్ గా బాహుబలి ఉండగా రెండో స్థానంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం స్థానం సంపాదించుకుంది . బాస్ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు . వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించిన చిరు 200 కోట్ల దిశగా దూసుకుపోతున్నాడు . 150 కోట్ల గ్రాస్ ని 85 కోట్లకు పైగా షేర్ ని సాధించి సంచలనం సృష్టించిన చిరు దృష్టి ఇప్పుడు బాహుబలి పై ఉంది . Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0business
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త! - పొదుపు ఖాతాల రద్దు చార్జీల ఎత్తివేత న్యూఢిల్లీ: ప్రముఖ విత్త సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు మరో శుభవార్త తెలిపింది. ఎస్‌బీఐకు సంబంధించిన అన్ని రకాల సేవింగ్స్‌ ఖాతాలపై రద్దు చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. నెలవారీ కనీస నిల్వ చార్జీలపై ఇటీవల ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బ్యాంకు వాటిని సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఖాతా తెరిచి ఏడాది పూర్తయిన ఖాతాలతో పాటు ప్రాథమిక ఖాతాలకు మాత్రమే ఈ సౌలభ్యం వర్తింపజేయనున్నట్టు పేర్కొంది. ఇక ఖాతా తెరిచి 14 రోజులు దాటిన లేదా ఏడాది లోపు వారికి మాత్రం ఈ చార్జీలు యథావిథిగా కొనసాగుతాయని తెలిపింది. ఇదివరకు పొదుపు ఖాతాల రద్దుపై ఎస్‌బీఐ జీఎస్టీతో కలిపి రూ.500 వసూల్‌ చేస్తుండేది. ప్రస్తుతం కొత్త నిబంధనలు ఈ నెల అదివారం నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంకు పేర్కొంది. దీనికితోడు మరణించిన డిపాజిట్‌దారుల ఖాతాలకు కూడా ఇదే వర్తింప చేయనున్నట్టుగా వెల్లడించింది. కనీస నిల్వ నిర్వహించిన ఖాతాదారులకు ఇంతకు ముందు జరిమాన విధించడం జరిగిందని..ఈ కొత్త నిబంధనలతో అలాంటి వారికి ఎంతో మేలు చేయనుందని బ్యాంకు అధికార వర్గాలు ఒక ఆంగ్ల పత్రికకు తెలియజేశారు. ఇదే సమయంలో సాధారణ పొదుపు ఖాతాదారులను ప్రాథమిక బ్యాంకు ఖాతాకు మారేందుకు వెసులుబాటు కల్పించినట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
అగ్లీ సీన్స్: సెహ్వాగ్ పై ప్రీతి జింతా ఆగ్రహం, ఏమైంది... Highlights జట్టు ఆటతీరు పట్ల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింతా కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ పై విరుచుకుపడ్డారు. హైదరాబాద్: జట్టు ఆటతీరు పట్ల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింతా కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ పై విరుచుకుపడ్డారు. దాంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపిఎల్ మ్యాచులో పంజాబ్ ఓటమికి జింతా సెహ్వాగ్ ను తప్పు పట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.  సెహ్వాగ్, జింతా మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. దాంతో బాధ్యతల నుంచి తప్పుకోవాలని సెహ్వాగ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  రాజస్థాన్ తో ఆడిన మ్యాచులో 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పంజాబ్ ఓటమి పాలైంది. తొలి వికెట్ పడిన తర్వాత కరుణ్ నాయర్, మనోజ్ తివారీ వంటి బ్యాట్స్ మెన్ ఉన్నా కూడా అశ్విన్ ను బ్యాటింగ్ కు పంపించారు. దాంతో కెప్టెన్ అయిన అశ్విన్ పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఎవరు కూడా సరిగా బ్యాటింగ్ చేయలేకపోయారు.  దాంతో జింతా సెహ్వాగ్ పై తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. ఓటమికి గల కారణాలను సెహ్వాగ్ చెప్పడానికి ప్రయత్నించినా జింతా వినిపించుకోలేదని అంటున్నారు. వచ్చే ఏడాది మెంటర్, కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సెహ్వాగ్ అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.  పంజాబ్ కు ఇంకా ప్లే ఆఫ్స్ కు వెళ్లడానికి అవకాశం ఉండడంతో వివరణ ఇవ్వడానికి సెహ్వాగ్ నిరాకరించాడు. వివాదం ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడానికి నిరాకరించినట్లు చెబుతున్నారు. వివాదంపై ప్రీతి జింతా కూడా ఏమీ మాట్లాడలేదు.  Last Updated 11, May 2018, 1:04 PM IST
2sports
internet vaartha 150 Views లాహోర్‌ : పాకిస్థాన్‌లో భద్రతపైన అనుమానం నేపథ్యంలో వివిధ క్రికెట్‌ జట్టు ఆ దేశంలో పర్యటిం చేందుకు వెనుకాడుతున్నాయి. దీంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చాలా నష్టపోతుంది. ఇతర దేశాల జట్లు తమ దేశంలో పర్యటించేలా చేసేందుకు పాకిస్థాన్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పిసిబి నాలుగు బుల్లెట్‌ ఫ్రూప్‌ బస్సులను కొనుగోలు చేసింది. 2009లో పాకిస్థాన్‌లో పర్యటించిన శ్రీలంక క్రికెటర్లను తీసుకువెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఆ ఘటనలో ఆరుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. ఇద్దరు సామాన్య పౌరులు, ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. అప్పటి నుంచి పాక్‌ వెళ్లేందుకు ఇతరదేశాల క్రికెట్‌ జట్లు వెనుకాడుతున్నాయి. 2015లో మాత్రం జింబాబ్వే పాక్‌లో ప్రక టించింది. ఇప్పుడు జింబాబ్వే పైన పిసిబి,ఆటగాళ్లు,మాజీలు ప్రశంసలు కురిపించారు. అది మినహా ఏ జట్టుకూడా ఈ ఏడేళ్లలో పర్యటించలేదు. ఈ నేపథ్యంలో తాము ఆతిథ్యమివ్వాల్సిన మ్యాచ్‌లకు యుఎఇని వేదికగా పాక్‌ ఎంచుకుంది. ఇప్పుడు పాక్‌లోనే మ్యాచ్‌లను పునరుద్దరించేందుకు బస్సులను కొనుగోలు చేసింది.
2sports
Visit Site Recommended byColombia ఒక వారంలో ఇరవై కోట్ల రూపాయల షేర్ అంటే అది బెటర్ రేంజ్ కలెక్షనే కానీ, ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్లో చేసిన వ్యాపారానికి ఆ వసూళ్లు తక్కువే. ఇక ఈ వారం సినిమాలు వచ్చేయడం.. నెక్ట్స్ వీక్‌లో భారీ సినిమా ఉండటంతో.. దేవదాస్ వసూళ్లపై ఆ ప్రభావం తప్పడం లేదు. అయితే ‘నోటా’ నెగిటివ్ టాక్ పొందింది. ఇది ‘దేవదాస్’కు కొంచెం మేలు చేసే అంశమే. సీరియస్ గా వినోదం లేకుండా సాగే సినిమా కంటే.. ఎంతో కొంత ఎంటర్‌టైన్ మెంట్ ఇచ్చే ‘దేవదాస్’ వైపే ప్రేక్షకులు మొగ్గు చూపవచ్చు. కాబట్టి ఈ వీకెండ్లో ‘దేవదాస్’కు వసూళ్లు బాగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో సాధించుకోవాల్సిన వసూళ్లలో కొంతమొత్తాన్ని ఈ సినిమా రాబట్టుకునే అవకాశాలున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
విదేశీ సర్వర్ల నుంచి భారతీయుల డేటా తొలగిస్తాం - ఈ ప్రక్రియతో ప్రతికూల ప్రభావమూ ఉండొచ్చు - అంతర్జాతీయ పేమెంట్‌ సంస్థ మాస్టర్‌కార్డ్‌ న్యూఢిల్లీ: విదేశీ సర్వర్లలో ఉన్న భారతీయ వినియోగ దారుల సమా చారాన్ని తొలగి స్తామని అంత ర్జాతీయ పేమెంట్‌ సంస్థ మాస్టర్‌కార్డ్‌ వెల్లడించింది. ఈ ప్రక్రియను మొదలు పెట్టేందుకు 'కచ్చితమైన తేదీ'ని కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ)కి ప్రతిపాదించింది. అయితే ఈ ప్రక్రియ చేపట్టడం వల్ల కొంతకాలం కార్డు భద్రత బలహీనపడొచ్చనీ హెచ్చరించింది. భారతీయ వినియోగదారుల సమాచారం దేశంలోనే నిక్షిప్తం చేయాలని పేమెంట్‌ కంపెనీలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్బీఐ ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు అక్టోబర్‌ 16 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే అక్టోబర్‌ 6 నుంచే లావాదేవీలను పూణెలోని సాంకేతిక కేంద్రంలో నిక్షిప్తం చేస్తున్నామని మాస్టర్‌కార్డ్‌ తెలిపింది. అలాగే విదేశీ సర్వర్లలో భారతీయ వినియోగదారుల సమాచారాన్ని తొలగిస్తామని కేంద్ర బ్యాంకుకు తెలిపారని మాస్టర్‌కార్డ్‌ దక్షిణ ఆసియా, ఇండియా అండ్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ పొరుశ్‌ సింగ్‌ అన్నారు. ఈ తొలగింపు ప్రక్రియ వల్ల వినియోగదారులు ఎదుర్కొనే పలు సమస్యలనూ వివరించామని తెలిపారు. కాగా, తొలగింపు ప్రక్రియ కోసం నియమిత తేదీని కూడా ప్రతిపాదించారని చెప్పారు. ఈ తేదీపై ఆర్బీఐ ఇంకా ఆమోదం తెలుపాల్సి ఉన్నదని అన్నారు. దాదాపు 200 దేశాల్లో తమ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఏ దేశమూ ఈ తరహా ఆదేశాలివ్వలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
May 06,2015 సబ్‌కా ఇంటర్‌నెట్‌కు 40 లక్షల మంది మద్దతు హైదరాబాద్‌: మెరుగైన ఇంటర్నెట్‌ వినియోగం, నెట్‌ సమానత్వం, నెట్‌ తటస్థట తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రవేశపెట్టిన సబ్‌కా ఇంటర్‌నెట్‌, సబ్‌కా వికాస్‌ కార్యక్రమానికి మద్దతు పెరుగుతోంది. కేవలం వారం రోజుల్లో 40 లక్షలకు పైగా మొబైల్‌ వినియోగదారుల నుండి చక్కటి స్పందన లభించిందని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(సిఓఎఎల్‌) ప్రకటనలో తెలిపింది. ప్రతీ భారతీయుడు సరళమైన ధరలకు, మెరుగైన సేవతో కూడిన ఇంటర్నెట్‌ను వినియోగించాలనేదే ప్రధాన ధ్యేయమని తెలిపింది. ఇంటర్నెట్‌ వినియోగంపై సరైన అవగాహన చాలా అవసరమని తెలిపింది. సబ్‌కా ఇంటర్నెట్‌ ద్వారా వినియోగదారులకు మెరుగైన ఇంటర్నెట్‌ సేవలందించేందుకు టెలికాం ఆపరేటర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. ఎస్సెమ్మెస్‌, వాయిస్‌ కాల్స్‌తో 12 ప్రాంతీయ భాషల్లో ఈ కార్యక్రమానికి ప్రచారాన్ని కల్పించినట్లు తెలిపింది. ప్రధాని ప్రవేశ పెట్టిన డిజిటల్‌ ఇండియాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. సబ్‌కా ఇంటర్‌నెట్‌, సబ్‌కా వికాస్‌ కార్యక్రమం గత నెల 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
TAX చిన్నవ్యాపారులకు పన్నురాయితీలు న్యూఢిల్లీ: ఇ-లావాదేవీలు నిర్వహించే చిన్నవ్యాపారులకు 30శాతం వరకూ పన్ను రాయితీలు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టం నిబంధనను కూడా సవరించింది. దీనివల్లచిన్న వ్యాపారులకు ఎంతోమేలు జరుగుతుందని ప్రకటించింది. మొత్తం డిజిటల్‌, లేదా చెక్కు పద్దతుల్లో లావాదేవీలు నిర్వహిస్తే వారికి 30శాతం పన్నురాయితీలు కల్పిస్తు న్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వివరించారు. ఆర్థికవ్యవస్థను డిజిటల్‌ వైపు నడిపించే క్రమంలో ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలోని 44ఎడి సెక్షన్‌ను సవరించింది. సవరించిన పన్ను నిబంధనలప్రకారం చిన్న వ్యాపారులు, బిజినెస్‌లు రెండుకోట్లకుమించి లేని టర్నోవర్‌ ఉన్న సంస్థలు ఈ కొత్త నిబంధనతో లాభపడతా యని అంచనా. చిన్న వర్తకులు లేదా వర్క్‌షాప్‌ యజమానులు రెండుకోట్లు లేదా అంతకు తగ్గిన మొత్తం ఆదాయపు పన్ను ప్రయో జనాలకు మొత్తంటర్నోవర్‌లో ఎనిమిదిశాతంగా పరిగణించడం జరుగుతుంది. అదికూడా వారు ఎటువంటి రికార్డులు నిర్వహించని పక్షంలో జరుగుతుందని అంచనా. దీన్నిబట్టి ఒక వర్తకుని టర్నోవర్‌ రెండు కోట్లు అయినపక్షంలో పన్ను ప్రయోజనాలకోసం ఆయన ఆదాయం 16 లక్షల రూపాయలుగా చూపుతారు. రెండుకోట్లలో 8శాతంగా ఉంటుందని జైట్లీ వివరించారు. కొత్త పన్ను నిబంధన ప్రకారం చూస్తే మొత్తం లావాదేవీలు నిర్వహించిన టర్నోవర్‌లో ఆరుశాతం డిజిటల్‌; బ్యాంకింగ్‌ ఛానెళ్లద్వారా నిర్వహించి ఉండాల్సి ఉంటుంది. దీన్నిబట్టి ఆ వర్తకుని ఆదాయం మొత్తం టర్నోవర్‌ రెండు కోట్లనుంచి చూస్తేఆరుశాతం అంటే 12 లక్షలుగా పరిగణిస్తారు. కొందరు వర్తకులు 30శాతం పన్ను ప్రయోజ నాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే వారు మొత్తంగా డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించి ఉండాలి. రూ.500, రూ.1000 నోట్లు రద్దయిన తర్వాత ప్రభుత్వం అనేక కార్యాచరణఅంశాలను అమ లులోకి తెచ్చింది. వీటిలో పెట్రోలు, డీజిల్‌చెల్లింపులు డిజిటల్‌లో జరిపితే డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
1entertainment
SARILANKA పసికూనపై చెమటోడ్చి గెలిచిన శ్రీలంక కొలంబో: పసికూన జింబాబ్వేకి సొంతగడ్డపై వన్డే సిరీస్‌ కోల్పోయి పరువు పోగొట్టుకున్న శ్రీలంక జట్టుకి ఉపశమనం కలిగించే విజయం. కొలంబో వేదికగా జరిగిన ఏకైక టెస్టులో డిక్వెల్లా 118బంతుల్లో 6ఫోర్లతో 81పరుగులు, గుణరత్నే 151బంతుల్లో 6ఫోర్లతో 80పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో శ్రీలంక 4వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 388 పరుగుల లక్ష్యఛేదనలో ఆటలో చివరి రోజైన మంగళవారం 170/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక 203/5తో ఇబ్బందుల్లో పడింది. ఐదు వన్డేల సిరీస్‌ని 3-2తో చేజిక్కించుకున్న జింబాబ్వే ఈటెస్టులో కూడా అద్భుతం చేసేలా కనిపించింది. కానీ డిక్వెల్లా, గుణతిలక జోడి సమన్వయంతో బ్యాటింగ్‌ చేసి ఆరో వికెట్‌కి 121 పరుగులు జత చేయడంతో శ్రీలంక ఊపిరి పీల్చుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 356పరుగులు చేయగా అనంతరం శ్రీలంక 346పరుగులకి ఆలౌటయ్యింది. దీంతో 10 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 377పరుగులు చేయగా శ్రీలంక 391/6తో విజయాన్ని అందుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా గుణరత్నే నిలవగా ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా స్పిన్నర్‌ హెరాత్‌ నిలిచాడు. సొం తగడ్డపై టెస్టుల్లో లంకేయులకి ఇదే అత్యధిక రికార్డు ఛేదన. జూలై 26 నుంచి భారత్‌ జట్టుతో శ్రీలంక టెస్టు సిరీస్‌ ఆడనుంది.
2sports
Hyd Internet 94 Views CRUDE-OIL CRUDE-OIL ఢిల్లీః సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల యుద్ధమేఘాలు క‌మ్ముకుంటున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఆ పరిస్థితే నెలకొంటే ఆ ప్రభావం అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్లపై పడనుంది. ఈ ప్రభావం ఇండియాలో పెట్రోల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముడి చమురు 500 శాతం పైగా పెరగనుంది. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య యుద్ధమే జరిగితే ముడి చమురు సరఫరా తగ్గడంతోపాటు పలు దేశాల్లో ఆయిల్ సంక్షోభం ఏర్పడనుంది. దీంతో భారత్‌లో పెట్రోల్ ధర సుమారు లీటర్‌కు రూ. 300కు చేరనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో లీటర్ పెట్రోల్ 70 రూపాయలు ఉంది. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం ఇండియాపై పడేటట్లు కనిపిస్తోంది. దీంతో భారత్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాక‌నున్నాయి.
1entertainment
జూనియర్ ఎన్టీఆర్ కు గుడికట్టిన అభిమానులు Highlights జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వీరాభిమానం కర్ణాటకలో ఎన్టీఆర్ అభిమానుల ప్రత్యేక అభిమానం ఎన్టీఆర్ కు గుడికట్టిన ఆయన అభిమానులు   దక్షిణాదిలో సినిమా హిరోలను ఆరాధించే ఫ్యాన్స్ చాలా ఎక్కువ. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్, ఇలా అన్ని పరిశ్రమల్లోనూ.. హీరోలకు అంతటి క్రేజ్ పెరగటానికి కారణం వాళ్లకున్న అభిమానగణమే. అభిమానులకు మన హీరోలపై వుండే ఆరాధన, ప్రేమ మాటల్లో చెప్పలేనిది.   మామూలుగా హీరోల ఫాలోవర్స్ అప్పుడప్పుడూ అన్నదానం, వస్త్రదానం, రక్తదానం, నేత్రదానం లాంటి సేవలు చేస్తూ వుంటారు. ఇలాంటి అభిమానం భరించొచ్చు. కానీ కొన్నిసార్లు వాళ్లు చూపే అభిమానం ఆ నటీనటులకే భరించ లేనంతగా ఉంటుంది. అభిమానులు చేసే పనులు ఒక్కోసారి చూసేవాళ్ళకి వింతగా, విచిత్రంగా కనిపిస్తాయి. ఒక్కోసారి ఏకంగా గుళ్లు గోపురాలు కూడా కట్టేసి ఆయా హీరో హిరోయిన్లకు అభిషేకాలు, పూజలు చేస్తుంటారు.   తమిళనాట అందమైన కథానాయికలను అభిమానించడమే కాదు, గుడి గోపురాలు కట్టి అందులో విగ్రహాలను పెట్టి మరీ పూజలు, కుంకుమార్చనలు చేయిస్తూ ఆరాధిస్తారు. గతం లో ఖుష్బూ, నమిత, హన్సిక లకు, తాజాగా కీర్తీ సురేష్ కు కూడా గుడికట్టి తమ విపరీత అభిమానాన్ని చాటుకున్నారు తమిళ తంబీలు.   అయితే ఇప్పుడు ఈ పద్ధతి కథానాయకులకు, అందునా కర్ణాటక రాష్ట్రంలోకి పాకింది. కన్నడ రాష్ట్రం లో ఒక తెలుగు హీరోకి గుడి కట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన "జై లవకుశ" సినిమా.. కర్ణాటకలో విడుదలై భారీ వసూళ్ళను  సాధించింది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే గుల్బర్గా, బళ్లారి, ప్రాంతాల్లో "జై లవకుశ" విడుదలై భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.   జై లవకుశ సినిమాలో  ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన కన్నడిగులు బళ్లారిలో జూనియర్ తారక రాముడుకి గుడి కట్టేందుకు సిద్ధమైపోయారు. ఇటీవలే తెలుగు హీరోల్లో భారీ ఫాలోయింగ్ వున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు గుడి కట్టే ప్రయత్నాలు జరుగుతుండగా,  తాజాగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో జూనియర్ ఎన్టీఆర్‌ దేవాలయం నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం ఆసక్తి కరంగా మారింది. Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భారత సెలక్టర్లకి నా రన్స్ కనిపించలేదు: ఇషాన్ ఇంగ్లాండ్ పర్యటన కోసం సెలక్టర్లు తనని భారత-ఎ జట్టులోకి ఎంపిక చేయకపోవడం బాధించిందని యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ఇటీవల Samayam Telugu | Updated: May 29, 2018, 06:04PM IST భారత సెలక్టర్లకి నా రన్స్ కనిపించలేదు: ఇషాన్ ఇంగ్లాండ్ పర్యటన కోసం సెలక్టర్లు తనని భారత-ఎ జట్టులోకి ఎంపిక చేయకపోవడం బాధించిందని యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడిన ఈ యువ వికెట్ కీపర్ / బ్యాట్స్‌మెన్ 14 మ్యాచ్‌ల్లో 275 పరుగులు చేశాడు. ముఖ్యంగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మే 9న జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇషాన్ కిషన్ కేవలం 21 బంతుల్లోనే 5x4, 6x6 సాయంతో 62 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఐపీఎల్ కంటే ముందు జరిగిన విజయ్ హజారే ట్రోఫీలోనూ ఈ యువ క్రికెటర్ రాణించడంతో.. భారత్- ఎ జట్టులోకి ఎంపికవుతాడని అంతా భావించారు. కానీ.. సెలక్టర్లు మొండి చేయి చూపారు.
2sports
SHOBHADE   దిల్లీ: ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మిథాలీ సేనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువలా వస్తుంటే.. శోభాడే మాత్రం భిన్నంగా స్పందించారు. తనకు లభించిన పేరు, ప్రక్యాతులను నాశనం చేసుకోవద్దని నర్మగర్భంగా వాఖ్యనించారు ఆమె సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల మంత్రి విజ§్‌ు గోయెల్‌, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీసీసీఐ ప్రశంసించారు. కానీ శోభాడే ఈ విధమైన స్పందన ఎందుకు చేశారో?
2sports
అర్జున్ రెడ్డి తమిళ్ లోకి వెళ్లడం ఖాయమైంది Highlights టాలీవుడ్ లో సెన్సేషనల్ సినిమా అర్జున్ రెడ్డి క‌లేక్ష‌న్స్ లో స‌రికొత్త రికార్డ్ సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా త్వ‌ర‌లోనే త‌మిళ్ లోకి రిమేక్ కాబొతున్న అర్జున్ రెడ్డి   టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి. ఇంకా సంచలనాలను కంటిన్యూ చేస్తూనే ఉంది. రెండో వీకెండ్ లో ఈ చిత్రం కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ సెట్ చేసే మాదిరిగానే కనిపిస్తోంది. మూవీలో కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండడం.. మౌత్ టాక్ కూడా బాగుండడానికి తోడు. కొత్త కొత్త వివాదాలు వసూళ్లు మరింతగా పెరిగేందుకు హెల్ప్ అవుతున్నాయి.   అర్జున్ రెడ్డిని ఇతర భాషల్లో నిర్మించేందుకు ఇప్పటికే బోలెడంత పోటీ ఉందనే సంగతి తెలుస్తూనే ఉంది. ఇప్పటివరకూ సౌత్ లోనే కాదు.. బహుశా ఇండియన్ స్క్రీన్ పైనే చూడనటువంటి కొత్త తరహా హీరో కేరక్టరైజేషన్ కావడంతోనే ఇంతటి పోటీ అని చెప్పవచ్చు. అలాగే సినిమా కూడా కుర్రాళ్లను ఆకట్టుకునే కంటెంట్ కావడంతో ఈ పోటీ మరింతగా ఎక్కువగా ఉంది.    ఇప్పుడు అర్జున్ రెడ్డిని తమిళ్ లో రీమేక్ చేసేందుకు గాను రైట్స్ సేల్ చేశారని తెలుస్తోంది. తమిళ్ హీరో ధనుష్ కు చెందిన వండర్ బార్ ఫిలిమ్స్.. అర్జున్ రెడ్డి తమిళ హక్కులను సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.ఈ రీమేక్ లో నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ధనుష్ నటిస్తాడా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు.   వేరే హీరోతో ధనుష్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఉన్నా.. అర్జున్ రెడ్డి పాత్రపై ధనుష్ చాలా మనసు పడ్డాడని.. ఈ హీరోనే నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద అర్జున్ రెడ్డి తమిళ్ లోకి వెళ్లడం అయితే మాత్రం ఖాయమైంది. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
Suzlon సుజ్లాన్‌ రాబడుల్లో 76% వృద్ధి పుణె,: పవనవిద్యుత్‌ ఉత్పత్తిరంగంలో అగ్ర గామిగా ఉన్న సుజ్లాన్‌ ఎనర్జీ 3వ త్రైమాసికం రాబడుల్లో 76శాతం వృద్ధిని సాధించింది. స్థూలలాభం రూ.304 కోట్లు ప్రకటించింది. 3307 కోట్ల రూపాయలు రాబడులు మూడు నెలల్లో సాధించిందని, తొమ్మిదినెలల ఆదాయా నికిగాను 7703కోట్లు సాధించినట్లు వెల్లడించింది. వార్షిక పద్ధతిలో 24శాతం వృద్ధిని సాధించింది. పన్నుల చెల్లిం పులకుముందు మూడవ త్రైమాసికంలో 745కోట్లు సాధిం చింది. వార్షిక పద్ధతిలో 124శాతం పెరిగిందని కంపెనీ వివరించింది. తొమ్మిదినెలల పన్నులచెల్లింపులకు ముందు స్థూల విలువలు 1502 కోట్లుగా ఉన్నాయి. వార్షిక పద్ధతి లో 70శాతం వృద్ధి నమోదు చేసినట్లు కంపెనీ ఎండి సిఇఒ చెపి చలసాని వెల్లడించారు. కరొత్తరోటార్‌బ్లేడ్‌ ప్లాంట్‌లు రాజస్థాన్‌, తమిళనాడులో ప్రారంభించామని, భారత్‌దేశంలో అన్ని విండ్‌రిచ్‌రాష్ట్రాల్లో సుజ్లాన్‌ బలమైన తయారీఉనికికి దోహదంచేస్తుందన్నారు. భారత్‌లో పది వేల మెగావాట్లమైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ సిఇఒ జెపి చలసానివెల్లడించారు. గ్రూప్‌సిఎఫ్‌ఒ కీర్తి పగాడియా మాట్లాడుతూ వృద్ధిచెందిన వ్యాపార సమర్ధతతో పరిమా ణం పరంగా దృఢమైన పురోగతిని అందించినట్లు వెల్లడిం చారు. కంపెనీ రుణభారం 6538 కోట్లకు తగ్గిందని, ఇంతకుముందున్న ట్రిపుల్‌బి రేటింగ్‌ నుంచి మారిందని ఆయన అన్నారు. సుజ్లాన్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు ప్రొవిజినల్‌ ఎ క్రెడిట్‌ రేటింగ్‌ లభించిందన్నారు. కంపెనీ స్థూల లాభం 9.2శాతం చొప్పున పెరిగి 350 కోట్లకు చేరింది. కంపెనీకి కొత్త ఆర్డర్‌బుక్‌ 557 మెగావాట్ల వరకూ ఉంది. ప్రస్తుతం ఉన్న ఆర్డర్‌ బుక్‌ 1231 మెగా వాట్లతో ఉందని వీటి విలువ రూ.7523కోట్లుగా వెల్లడిం చారు. కస్టమర్‌అడ్వాన్సులు రూ.1400 కోట్లవరకూ ఉన్న ట్లు జెపిచలసాని వివరించారు. తెలంగాణలో 210 మెగా వాట్లసౌరవిద్యుత్‌ప్రాజెక్టుల్లో49శాతంపూర్తి చేసామన్నారు.
1entertainment
London, First Published 6, Sep 2019, 8:21 AM IST Highlights విశాకన్, సౌందర్య మూడు రోజుల కిందట చెన్నై నుంచి ఎమరాల్డ్స్ విమానంలో లండన్‌కు వెళ్లారు. లండన్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత అక్కడి సెక్యూరిటీ అధికారులకు పాస్‌పోర్ట్ చూపించేందుకు గాను వారు దానిని భద్రపరిచిన సూట్‌కేస్ కోసం వెతకగా..అది కనిపించలేదు. అందులో విశాకన్, సౌందర్యలకు చెందిన పాస్‌పోర్టులు, రూ.లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య, ఆమె భర్త విశాకన్‌ల పాస్‌పోర్ట్ చోరీకి గురైంది. విశాకన్, సౌందర్య మూడు రోజుల కిందట చెన్నై నుంచి ఎమరాల్డ్స్ విమానంలో లండన్‌కు వెళ్లారు. లండన్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత అక్కడి సెక్యూరిటీ అధికారులకు పాస్‌పోర్ట్ చూపించేందుకు గాను వారు దానిని భద్రపరిచిన సూట్‌కేస్ కోసం వెతకగా..అది కనిపించలేదు. అందులో విశాకన్, సౌందర్యలకు చెందిన పాస్‌పోర్టులు, రూ.లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి. దీంతో దంపతులిద్దరూ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. సెక్యూరిటీ అధికారులకు తమ పాస్‌పోర్టులను చూపించకపోవడంతో సౌందర్య, విశాకన్‌లను అధికారులు ఎయిర్‌పోర్టులోని విశ్రాంతి గదికి పంపారు. అనంతరం ఈ విషయాన్ని లండన్‌లోని భారతీయ రాయబారులకు, సౌందర్య తండ్రి రజనీకాంత్‌కు తెలియజేశారు. ఇండియన్ ఎంబసీ అధికారులు తాత్కాలిక పాస్‌పోర్టులను ఏర్పాటు చేయడంతో విశాకన్, సౌందర్యలను లండన్ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు పంపివేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  Last Updated 6, Sep 2019, 8:21 AM IST
0business
భారత్‌లో రూ.6100 కోట్ల పెట్టుబడులు నిస్సాన్‌ అధ్యక్షుడు గులియామే సికార్డ్‌ రాష్ట్ర మార్కెట్‌కు డాట్సన్‌ రెడీగో విడుదల హైదరాబాద్‌ : భారత్‌లో తమ ఉత్పత్తులు ప్రారంభించిన అతికొద్దికాలం లోనే ఇప్పటి వరకూ 6100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టామని నిస్సాన్‌ మోటార్స్‌ భారత్‌ అధ్యక్షుడు గులియామే సికార్డ్‌ వెల్లడించారు. అంతేకాకుండా ఇకపై ఏడాదికి ఒక కొత్త మోడల్‌ కారును విడుదల చేయనుననట్లు తెలిపారు. ఎపి, తెలంగాణ మార్కెట్లకు చిన్నకార్ల విభాగంలో కొత్తగా రూపొందించిన డాట్సన్‌ రెడీగో కారును విడుదలచేసారు.హైదరాబాద్‌ ఎక్స్‌షోరూం ధరగా 2.43 లక్షలనుంచి ప్రారంభం అవుతుంది. గరిష్టంగా వివిధ అదనపు ఫీచర్లతో ఉన్న కారు 3,40,344 రూపాయలుగా ఉందనిఅన్నారు. ఐదు రంగుల్లో లభిస్తుందని సికార్డ్‌ వివరించారు. భారత్‌లో ప్రస్తుతం చిన్నకార్ల ప్రారంభ విభాగంలో ఒక్క కంపెనీ మాత్రమే మార్కెట్‌ లీడర్‌గా ఉంద ని, మరిన్ని కంపెనీలకు అవకాశం ఉందని గుర్తించి నిస్సాన్‌ డాట్సన్‌ ఈదిశగా కృషి చేసిందన్నారు. వందేళ్ల కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 190 దేశాల్లో 20 మిలియన్‌ కార్లను విక్రయించిందన్నారు. భారత్‌లో డాట్సన్‌ ప్రవేశించి రెండేళ్లయింద న్నారు. అతిస్వల్పకాలంలోనే రెడీగో ద్వారా మార్కె ట్‌ వాటాను పెంచుకోగలమన్నారు. 2.4 లక్షల నుంచి ఏడు లక్షల మధ్య ఉన్న కార్ల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గతఏడాది కొంత తక్కువగా పది లక్షల కార్లు విక్రయించామన్నారు. ఈఏడాది మరింత వృద్ధి కనిపిస్తుందన్నారు. డాట్స న్‌ రెడీగోతో 2020 నాటికి కనీసం 2.50లక్షల కార్లకు పెంచుకోగలమని ధీమా వ్యక్తం చేసారు. ఐదుశాతం మార్కెట్‌ వాటాను సాధిస్తామని వివరిం చారు. ఇంధన సామర్ధ్యం, టెక్నాలజీ, అందుబాటు ధరలు అన్న విధానంలో డాట్సన్‌ కంపెనీ ముం దుకుపోతుందన్నారు. ప్రస్తుతం దేశీయంగా 98శాతం టెక్నాలజీ అమలవుతోందని, ప్రస్తుతం రెండుశాతం ఉన్న మార్కెట్‌ వాటా మరింత పెరుగుతుందన్నారు. నిరంతరం పనిచేసే మొత్తం పదివేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సికార్డ్‌ వివరించారు. ప్రస్తుతం డాట్సన్‌ రెడీగో 25.17 కిలోమీటర్లమైలేజి ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. రెండేళ్ల వారంటీ ఇస్తామని ఆయన అన్నారు. జపాన్‌లో డిజైన్‌చేసి ప్రత్యేక అర్బన్‌ క్రాస్‌ ఓవర్‌ను భారత్‌ మార్కెట్‌కు అందిస్తున్నట్లు వివరించారు. 15.9 సెకన్లలో వందకీలోమీటర్ల వేగం అందుకుంటుంది. టాప్‌స్పీడ్‌ గంటకు 140 కిలోమీటర్లుగా సికార్డ్‌ వెల్లడించారు. రెండు నుంచి 3ఏళ్ల కిలో మీటర్ల ఆప్షనల్‌ వారంటీ, ఉచిత రోడ్‌ సైడ్‌ అసి స్టెన్స్‌, మొబైల్‌ సర్వీస్‌ విధానాలు డాట్సన్‌ రెడిగో యజమానులకు అందుతాయి. ఐదేళ్ల వరకూ పొందే అవకాశం ఉంది. నిర్వహణ వ్యయం 32శాతం తక్కువ ఉంటుంది. దేశంలోని 274 నిస్సాన్‌, డాట్సన్‌ విక్రయ,సేవా టచ్‌ పాయింట్ల వద్ద లభిస్తుందన్నారు. 300 డీలర్‌ షిప్‌లలో కూడా లభిస్తుంది. అంతేకాకుండా డాట్సన్‌ మొబైల్‌ యాప్‌ సాయంతో అత్యుత్తమ సమాచారం అందిస్తున్నట్లు వివరించారు. హైదరా బాద్‌పరంగా ఇప్పటికే వందకుపైగా బుకింగ్స్‌ వచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు వివరించారు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రియో పతకాల పట్టికలో అమెరికాదే అగ్రస్థానం ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా మరోసారి అగ్రస్థానాన్ని సాధించింది. రియో ఒలింపిక్స్‌లో ఆ దేశం 46 స్వర్ణ, 37 రజత, 38 కాంస్య పతకాలను సాధించింది. TNN | Updated: Aug 22, 2016, 10:28AM IST ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా మరోసారి అగ్రస్థానాన్ని పొందింది. రియో ఒలింపిక్స్‌లో ఆ దేశం 46 స్వర్ణ, 37 రజత, 38 కాంస్య పతకాలను సాధించింది. మొత్తంగా చూస్తే 121 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. రెండో స్థానంలో ఉన్న గ్రేట్ బ్రిటన్ 27 స్వర్ణాలు, 23 రజత, 17 కాంస్య పతకాలతో 67 పతకాలను సాధించింది. మూడో స్థానంలో ఉన్న చైనా విషయానికి వస్తే.. ఆ దేశం ఖాతాలో 26 బంగారు పతకాలు, 18 వెండి, 26 కాంస్య పతకాలు కలుపుకొని మొత్తం 70 పతకాలున్నాయి. 2012లో లండన్లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లోనూ అమెరికా పతకాల పట్టికలో తొలిస్థానంలో నిలిచింది. ఆ ఏడాది 46 స్వర్ణాలు సహా 103 పతకాలను అమెరికా అథ్లెట్లు కొల్లగొట్టారు. 2008లో సొంత గడ్డపై జరిగిన ఒలింపిక్స్‌లో సత్తా చాటిన చైనా 51 పసిడి పతకాలు సహా 100 పతకాలు సాధించి అమెరికాను వెనక్కి నెట్టి మరీ తొలి స్థానంలో నిలిచింది. 2012 ఒలింపిక్స్‌లో రెండో స్థానానికి పరిమితమైన చైనాను ఈ దఫా గ్రేట్ బ్రిటన్ వెనక్కి నెట్టింది. లండన్ ఒలింపిక్స్‌లో 38 స్వర్ణ పతకాలు సాధించిన చైనా రియోలో మాత్రం 26 బంగారు పతకాలతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ గేమ్స్ మొదలైన నాటి నుంచి పతకాల వేటలో ఆధిపత్యాన్ని చూపుతున్న అమెరికా ఇప్పటి వరకూ 1000కి పైగా స్వర్ణ పతకాలను సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. రియోలో 19 స్వర్ణాలతో రష్యా నాలుగో స్థానంలో, జర్మనీ ఐదో స్థానంలో ఉన్నాయి. ఒక రజతం, ఒక కాంస్య పతకం నెగ్గిన భారత్ 67వ స్థానంలో ఉంది.
2sports
internet vaartha 246 Views న్యూఢిల్లీ : బంగారం ధరలు మరోసారి 29 వేల స్థాయికి దిగువన నమోదయ్యాయి. పది గ్రాముల బంగారం 355 రూపాయలు క్షీణించి 28,870 రూపాయలు గాట్రేడింగ్‌ జరిగింది. మూడు నెలల కనిష్టస్థాయిలో ఉన్నట్లు అంచనా. విదేశీ మార్కెట్లలో క్షీణత, జ్యూయెలర్లు, దేశీయ స్పాట్‌ మార్కెట్లలో డిమాండ్‌ తగ్గడం కూడా ఒకకారణమని బులియన్‌నిపుణులు చెపుతు న్నారు. వెండిధరలు కూడా కిలోకు 530 రూపాయలు తగ్గి 39,070 రూపాయలుగా ట్రేడింగ్‌ జరిగింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారులనుంచి డిమాండ్‌ తగ్గ డమే ఇందుకుకీలకం. బులియన్‌ట్రేడర్లు మార్కె ట్‌ స్థితిగతులపై మాట్లాడుతూ అమెరికాలో ఎక్కువ ఖర్చులుకావడం, జ్యుయెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్‌ పడిపోవడమే ఇందుకుకారణంగా చెపుతున్నారు. అంతర్జాతీయంగా కూడా పసిడి 0.13శాతం దిగజారి ఔన్స్‌ ఒక్కింటికి 1217.90 డాలర్లుగా నడిచింది. డాలరుతో రూపాయి పటిష్టం కావడంతో బంగారం దిగుమతిధరలు కొంత తగ్గినట్లు స్పష్టంఅవుతోంది. దేశరాజధాని మార్కెట్ల లో 99.9 కేరట్లు, 99.5 కేరట్ల బంగారంధరలు 355 చొప్పున తగ్గి 28,870రూపాయలు, 28,720 రూపాయలుగా కొనసాగాయి. సవర్లలో చూస్తే ఎనిమిది గ్రాముల బంగారం రూ.23 వేలుగా పలికింది. బంగారంతోపాటే వెండిధరలు కూడా తగ్గాయి. వారంవారం పంపిణీ కింద చూస్తే 525 రూపాయలు తగ్గి 39,020 రూపాయలుగా కిలోధరలు కొనసాగాయి. వెండినాణాలపరంగా కూడా ప్రతి వంద నాణేల కొనుగోలుకు 66 వేలు, విక్రయాలకు 67వేల రూపాయలుగా కొనసాగాయి.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మార్కెట్లోకి 'జియోఫై' వైర్‌లెస్ డేటాకార్డు! రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెరతీసింది. ఈ సారి కొత్త 'జియోఫై జేఎంఆర్815 వైర్‌లెస్ డేటా కార్డు'తో వినియోగదారుల ముందుకొచ్చింది. దీని ధర రూ.999 మాత్రమే. TNN | Updated: Mar 21, 2018, 04:26PM IST రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెరతీసింది. ఈ సారి కొత్త ' జియోఫై జేఎంఆర్815 వైర్‌లెస్ డేటా కార్డు 'తో వినియోగదారుల ముందుకొచ్చింది. దీని ధర రూ.999 మాత్రమే. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ డివైస్‌పై ఏడాది వారెంటీ కూడా ప్రకటించింది. 'డిజైన్డ్‌ ఇన్‌ ఇండియా' నినాదంతో ఈ డివైస్‌ను జియో ప్రవేశపెట్టింది. దీని డౌన్‌లోడ్‌ స్పీడు.. 150ఎంబీపీఎస్‌ వరకు, అప్‌లోడ్‌ స్పీడు 50ఎంబీపీఎస్‌ వరకు ఉంది. ఒక్కసారి కనెక్ట్‌ అయితే స్మార్ట్‌ఫోన్లలోని జియో 4జీ వాయిస్‌ యాప్‌తో హెచ్‌డీ వాయిస్‌, వీడియో కాల్స్‌ను పొందవచ్చు.
1entertainment
"అమీ తుమీ" మూవీ రివ్యూ Highlights తారాగణం : అడవి శేష్, అవసరాల శ్రీనివాస్,  వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకల్, తనికెళ్ల భరణి సంగీతం : మణిశర్మ దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి నిర్మాత : కె.సి. నరసింహారావు ఏసియానెట్ రేటింగ్ : 3/5 కథ : అమీ తుమీ మూడు జంటల ప్రేమకథ. సినిమా మొదలవ్వటానికి ముందే ప్రేమలో ఉన్న అనంత్(అడవి శేష్), దీపిక(ఈషా)ల పెళ్లికి దీపిక తండ్రి జనార్థన్(తనికెళ్ల భరణి) ఒప్పుకోడు, తాను చూసిన శ్రీ చిలిపి( వెన్నెల కిశోర్)నే పెళ్లి చేసుకోవాలని చెప్పి దీపికను గదిలో బంధిస్తాడు. అంతేకాదు తనకు వ్యాపారంలో నమ్మకద్రోహం చేసిన గంగాదర్ కూతురు మాయ(అదితి మైకల్)ను తన కొడుకు విజయ్(అవసరాల శ్రీనివాస్) ప్రేమిస్తున్నాడని తెలిసి కొడుకుని ఇంట్లో నుంచి బయటకు పంపేస్తాడు. గదిలో ఉన్న దీపిక, పనిమనిషి కుమారి(శ్యామల) సాయంతో తప్పించుకొని పారిపోతుంది. అదే సమయంలో గంగాదర్ కూతురు.. మాయ కూడా ఆస్తి కోసం సవతి తల్లి పెట్టే బాదలు భరించలేక ఇళ్లు వదిలి బయటకు వచ్చేస్తుంది. తరువాత వీరిద్దరు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు..? దీపిక ను చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు శ్రీ చిలిపి ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరోలుగా అడవి శేష్, అవసరాల శ్రీనివాస్ కనిపించినా.. సినిమా అంతా వెన్నెల కిశోర్ షోలా నడిచింది. తన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‑తో ఆడియన్స్‑ను కడుపుబ్బా నవ్వించాడు కిశోర్. తాను సీరియస్ గా ఉంటూనే కామెడీ చేసి బ్రహ్మానందం లాంటి సీనియర్లను గుర్తు చేశాడు. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ తనికెళ్ల భరణి, తన మార్క్ తెలంగాణ యాసలో కితకితలు పెట్టాడు. కూతురి ప్రేమను కాదని తన స్వార్థం కోసం తనకు నచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేయాలనే క్రూరమైన తండ్రి పాత్రలో కూడా మంచి కామెడీ పండించాడు. అడవి శేష్, వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకేల్, కేదార్ శంకర్‑లు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మరోసారి తనదైన హాస్య కథతో అలరించాడు. హాస్యం అంటే ద్వంద్వార్థాలు, పేరడీలే అనుకుంటున్న సమయంలో కుటుంబసమేతంగా చూడదగ్గ ఆరోగ్యకరమైన హాస్య కథా చిత్రాలతో అలరిస్తున్న మోహన కృష్ణ, మరోసారి అదే తరహా ప్రేమ కథలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమా స్థాయిని పెంచాయి. తెలంగాణ యాసలో తనికెళ్ల భరణి, ఇంగ్లీష్, తెలుగు కలిపి వెన్నెలకిశోర్ చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లో విజిల్స్ పడతాయి. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు మరో ఎసెట్. సాధారణ సన్నివేశాలతో కూడా మణి తన మ్యూజిక్ మరింత ఫన్నీగా మార్చేశాడు. పిజీ విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంటేష్ ఎడిటింగ్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాకి అతి పెద్ద బలం ఎవరంటే నిస్సందేహంగా వెన్నెల కిశోర్ అని చెప్పొచ్చు. శ్రీ చిలిపి అనే అతని పేరు దగగర్నుంచి హాస్యం నిండిన అతని బాడీ లాంగ్వేజ్, మాటలు, నటన చాలా బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డైలాగ్స్ చెప్పే సమయంలో అతని టైమింగ్ పూర్తి స్థాయిలో వర్కవుట్ అయింది. ఇక కథలో కీలకమైన మరో పాత్ర పని మనిషి కుమారి (శ్యామల దేవి) కూడా చాలా బాగా నటించింది. వెన్నెల కిశోర్ తో కలిసి ఆమె పండించిన హాస్యం కొత్తగా బాగుంది. అలాగే హీరోయిన్ ఈషా రెబ్బ కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతూనే, అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తాను ఎంచుకున్న కామెడీ జానర్ కు సింపుల్ కథతో, ఫన్ నిండిన స్క్రీన్ ప్లేతో, కథకు సరిగ్గా సరిపోయే పాత్రలతో మంచి ఎంటర్టైన్మెంట్ అందించి పూర్తిగా న్యాయం చేశాడు. ఎక్కడా అనవసరమైన, రొటీన్ సన్నివేశాలు, పాటలను కథనంలో ఇరికించకుండా ఆరోగ్యకరమైన హాస్యంతో ఒకే గమ్యం వైపు కథనాన్ని నడిపి మంచి సినిమాను చూసిన భావనను కలిగించారు. చాలా పాత్రలు పూర్తిగా కథకు సంబంధించినవై, ముఖ్యమైనవై ఉండటం వలన ప్రతి చోట ఆసక్తికరంగానే అనిపించాయి. అలాగే ప్రతి పాత్ర నుండి దర్శకుడు కామెడీని జనరేట్ చేయడంతో సినిమా చూస్తున్న రెండు గంటలు ఎక్కడా కష్టంగా అనిపించలేదు. మైనస్ పాయింట్స్ : హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన తనికెళ్ళ భరణి కాస్త ఎక్కువ సేపు కనిపించడం, ఓవర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఒకటి రెండు చోట్ల ఇబ్బంది కలిగించింది. కథ మొదట్లో కనిపించిన శ్రీనివాస్ అవసరాల తర్వాతి కథనంలో మంచి ఫన్ ఇస్తాడేమోనని ఆశిస్తే ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో కాస్తంత నిరుత్సాహం కలిగింది. ఇక కథకు ప్రధానమైన రెండు ప్రేమ జంటల మధ్య కెమిస్ట్రీ లేకపోవడంతో సినిమాలో రొమాంటిక్ ఫీల్ మిస్సయింది. కథనంలో వెన్నెల కిశోర్ పాత్రను ఇబ్బందిపెట్టే కొన్ని సందర్భాలు కూడా కాస్తంత అసహజంగా అనిపించాయి. అంతేగాక అతని అసిస్టెంట్ పాత్ర కూడా కొన్ని చోట్ల బలవంతంగా దూరిపోయి బరువుగా తోచింది.   అమీ తుమీ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ  హెల్దీ  కామెడీ ఎంటర్ టైనర్ Last Updated 26, Mar 2018, 12:02 AM IST
0business
Mysore, First Published 11, Sep 2019, 6:17 PM IST Highlights తెలుగు తేజం, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పివి సింధు మైసూర్ దసరా  ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ ఉత్సవాల్లో అతిథిగా పాల్గొనాల్సిందిగా సింధును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించారు.   బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. కర్ణాటకలోని మైసూరులో జరిగే దసరా ఉత్సవాల్లో సింధు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సింధుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప నుండి  ప్రత్యేక ఆహ్వానం అందింది.  ఒలింపిక్స్ విజేత పివి సింధు ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో బంగారు పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇలా సింధు వ్యక్తిగతంగానే కాకుండా భారత్ కు కూడా మొదటి  గోల్డ్ అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. దీంతో ఈ తెలుగు తేజం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ ఓ లేఖ రాసిన కన్నడ సీఎం దసరా ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సింధును కోరారు.  ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మైసూరులో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి  విజయదశమి పండగ వరకు ఈ వేడుకలు  జరుగుతాయి. ఈ సందర్భంగా నిర్వహించే మైసూరు యువ దసరా-2019 ప్రారంభ కార్యక్రమానికి అతిథిగా హాజరుకావాల్సిందిగా సింధుకు ఆహ్వానం అందింది.  ''అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన మీకు అభినందనలు. ఈ విజయం ద్వారా ఎంతో మంది యువతను మీరు క్రీడల వైపు మల్లించారు. యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తూ స్పూర్తినిస్తున్న మిమ్మల్ని గౌరవించాలని అనుకుంటున్నాం. అందుకోసం ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సాదరంగా  ఆహ్వానిస్తున్నాం. అని యడియూరప్ప తన లేఖలో పేర్కొన్నాడు.   ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో తెలుగు తేజం పీవీ సింధు ఇటీవల చరిత్ర సృష్టించారు.  ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించిన ఆమె విజేతగా నిలిచారు. సింధు 21-7, 21-7 పాయింట్ల  తేడాతో ఒకుహురాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస సెట్లను గెలుచుకుని విజయాన్ని అందుకుంది. కేవలం 36 నిమిషాల్లోనే సింధు విజయయాత్ర ముగిసింది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV తెలుగు సినిమాలకి నిర్మాత కానున్న తమిళ స్టార్ డైరెక్టర్ దాదాపు దశాబ్ధం కిందే చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమైన తమిళ దర్శకుడు... TNN | Updated: Sep 10, 2016, 08:19PM IST దాదాపు దశాబ్ధం కిందే చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమైన తమిళ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్. అంతకన్నా ఏడాది ముందే మురుగదాస్ డైరెక్ట్ చేసిన గజిని సినిమా తెలుగులో వచ్చినప్పటికీ... అది తమిళం నుంచి డబ్బింగ్ చేసిన చిత్రమే. అయినా మురుగ గురించి కొత్తగా ఈ పరిచయం ఎందుకంటారా ? మరేం లేదండీ.. ఇప్పటివరకు తెలుగువారికి దర్శకుడిగా మాత్రమే పరిచయం వున్న మురుగదాస్ ఇకపై నిర్మాతగా పరిచయం కానున్నాడన్నమాట. అందుకే ఆయన గతాన్ని కాస్తంత ప్రస్తావించాల్సివచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడితో ముచ్చటించిన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ... ఇకపై కూడా తెలుగులో సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్ తో తనకున్న అనుబంధాన్ని కొనసాగించాలి అని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. ఇప్పటికే తమిళంలో కథాబలం, కాన్సెప్ట్, అభిరుచిగల చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించిన మురుగదాస్... తెలుగులోనూ అదే పరంపరని కొనసాగిస్తాడని ఆశిద్దాం.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV మొత్తానికి జగపతి‌బాబు కొంటున్నారు... జగపతిబాబు ఏం కొంటున్నారు? అని ఆలోచిస్తున్నారా... ఓ ఎకరం భూమి. TNN | Updated: Feb 11, 2016, 09:20AM IST మొత్తానికి జగపతి‌బాబు కొంటున్నారు... జగపతిబాబు ఏం కొంటున్నారు? అని ఆలోచిస్తున్నారా... ఓ ఎకరం భూమి . అందులో వింతేముంది... సినీ స్టార్లంతా చేసే పని అదే కదా అంటారా... అవును నిజమే... కాకపోతే జగపతి బాబు కొన్నారంటే మనమో విషయం అర్థం చేసుకోవాలి. ఆయన ఆర్థికి పరిస్థితి చాలా పుంజుకుందని. మొన్నటి వరకు జూదానికి డబ్బు తగలేసి చాలా ఆర్థిక కష్టాల్లో, అప్పుల్లో కూరుకున్నారు. ఆ స్థితి నుంచి బయటికి వచ్చేందుకు అవకాశం వచ్చిన ప్రతి సినిమాను, క్యారెక్టర్ ను చేస్తూ ఇప్పుడు టాలీవుడ్ టాప్ విలన్ గా మారారు. అప్పుడు తీర్చడమే కాదు, జగపతి డబ్బు విషయంలో ఇప్పుడు బాగానే వెనుకేసుకున్నారని తెలుస్తోంది. విలన్ గా రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు తీసుకుంటూ... మళ్లీ కష్టాల్లో పడకుండా స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ఆస్తకి చూపిస్తున్నారట. మహేష్ బాబు హైద్రాబాద్ చివర్లో ఓషన్ పార్క్ సమీపంలో మూడెకరాల స్థలం కొని దానిని ఫామ్ హౌస్ గా మారుస్తున్నాడు. ఆ స్థలం పక్కనే జగపతిబాబు ఓ ఎకరం కొనేందుకు చూస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం జగపతి చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Vaani Pushpa 148 Views comments , FAWAD CHAWDARY , india FAWAD CHAWDARY కొలంబో: వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై పాకిస్తాన్‌ విషం చిమ్మే ప్రయత్నం చేస్తుంటది. అనవసర విషయాల్లో భారత్‌ను బయిటకు లాగి అనేకసార్లు నవ్వులపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాక్‌-శ్రీలంక సిరీస్‌ అంతగా విజయవంతం కాకపోవడంతో పాక్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాక భారత్‌పై బురదజల్లే ఆలోచనలో పాక్‌ ఉంది. దీనిలో భాగంగా శ్రీలంకకు చెందిన పది మంది క్రికెటర్లు పాకిస్తాన్‌కు వెళ్లకుండా భారత్‌ అడ్డుకుందని పాక్‌ మంత్రి ఫావద్‌ చౌదరీ అసత్య ఆరోపణలు చేశాడు పది మంది శ్రీలంక క్రికెటర్లు పాక్‌కు రాకుండా భారత క్రీడాశాఖ ఒత్తిడి చేసింది. భారత్‌ చవకబారు వ్యూహాల కారణంగానే లంక ఆటగాళ్లు పాక్‌ పర్యటనకు రాలేదంటూ పాక్‌ మంత్రి ఫావద్‌ చౌదరీ ట్వీట్‌ చేశాడు. ఫావద్‌ ఆరోపణలను శ్రీలంక ఖండించింది. ఈ వివాదంపై శ్రీలంక క్రీడా శాఖా మంత్రి ఫెర్నాండో ట్విటర్‌ వేదికగా స్పందించాడు. లంక క్రికెటర్లు పాక్‌ వెళ్లకుండా భారత్‌ ఎలాంటి ఒత్తిడి చేయలేదు. 2009లో లంక క్రికెటర్లపై జరిగిన దాడి కారణంగానే ప్రస్తుత సిరీస్‌కు పదిమంది ఆటగాళ్లు పాక్‌కు వెళ్లడానికి ఇష్టపడలేదు. అంతేకానీ మా ఆటగాళ్లపై బిసిసిఐ ప్రభావం ఉందనడం అవాస్తవం. ఇక పాక్‌ పర్యటనకు పూర్తిస్థాయి జట్టునే పంపించాం. ప్రస్తుత సిరీస్‌లో లంక ఆటగాళ్లు శక్తిమేర ఆడి సిరీస్‌ గెలుస్తారనే పూర్తి నమ్మకం, విశ్వాసం మాకు ఉందంటూ ఫెర్నాండో పేర్కొన్నారు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
మార్కెట్లో లాభాల 'వర్షం' - సెన్సెక్స్‌ పాయింట్ల ర్యాలీ...         ముంబయి : ఈ ఏడాది దేశంలోకి సరైన సమయంలోనే వర్షాలు వస్తాయని, రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల్లో వరుసగా రెండో సెషన్‌లోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ నేపధ్యంలోనే సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 363.30 పాయింట్లు లేదా 1.33 శాతం ఎగిసి 27,687.30 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 111.30 పాయింట్లు లేదా 1.35 శాతం రాణించి 27,687.30 వద్ద నమోదయ్యింది.రియాల్టీ సూచీ మినహా అన్ని రంగాలు లాభాల్లోనే ముగిశాయి. కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌ సూచీ అత్యధికంగా 2.16 శాతం పెరిగింది. ఇదే క్రమంలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 2.09 శాతం, వైద్య సూచీ 1.54 శాతం, మౌలిక వసతులు 1.43 శాతం చొప్పున రాణించాయి. మరోవైపు రియాల్టీ సూచీ 0.2 శాతం పడిపోయింది. డాక్టర్‌ రెడ్డీస్‌ 3.48 శాతం, గెయిల్‌ 3.45 శాతం, టాటా పవర్‌ 3.08 శాతం, హెచ్‌డిఎఫ్‌సి 2.34 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 1.92 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు హీరో మోటో కార్ప్‌ 0.31 శాతం, ఎన్‌టిపిసి 0.07 శాతం, కోల్‌ ఇండియా 0.04 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. ఈనెల 30న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేయడంతో మార్కెట్లకు మద్దతు లభించిందని బ్రోకర్లు పేర్కొన్నారు. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఒక్క శాతం చొప్పున పెరిగాయి. మొత్తంగా మదుపర్ల మద్దతుతో 1,671 స్టాక్స్‌ లాభాల్లో ముగియగా, మరోవైపు 1,051 స్టాక్స్‌ నష్టాలను చవి చూశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 'రజినీ' చదివిన పాఠశాలకు కొత్త హంగులు..! సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చదువుకున్న పాఠశాల కొత్త హంగులు దిద్దుకుంది. బెంగళూరులోని గవిపురంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలను కొందరు దాతల సహకారంతో కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో 'మహానగర పాలికె' అభివృద్ధి చేసింది. TNN | Updated: Mar 25, 2018, 05:09PM IST సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చదువుకున్న పాఠశాల కొత్త హంగులు దిద్దుకుంది. బెంగళూరులోని గవిపురంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలను కొందరు దాతల సహకారంతో కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో 'మహానగర పాలికె' అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రి అనంతకుమార్‌, స్థానిక ఎమ్మెల్యే రవి సుబ్రహ్మణ్య, ఎమ్మెల్సీ శరవణలు సంయుక్తంగా ఈ పాఠశాలను మార్చి 24న ప్రారంభించారు. పేద విద్యార్థులు సులభంగా చదువుకునేందుకు అనువైన బోధన కేంద్రాల (లెర్నింగ్‌ సెంటర్ల) ఏర్పాటుకు రూ.50 లక్షలు తన నిధి నుంచి కేటాయిస్తున్నట్లు అనంతకుమార్‌ వెల్లడించారు. ఈ కేంద్రాల్లో విద్యుద్దీపాలు, మేజా బల్లలు, గ్రంథాలయం తదితర సదుపాయాలు ఉంటాయని చెప్పారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నానంటూ బాల్యస్మృతులను గుర్తు చేసుకున్నారు. పాఠశాలకు సమీపంలోని తాగు నీటి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాజకీయ పార్టీ ఏర్పాటులో తీరిక లేకుండా ఉన్న.. రజనీకాంత్‌ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. రజినీకాంత్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు రజని మురుగన్‌, స్థానిక కార్పొరేటర్‌ కెంపేగౌడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ‘C/o కంచరపాలెం’ ట్రైలర్: పెళ్లి కోసం పంచాయతీ పెట్టేశారు! అతడి పెళ్లికి, ఆ ఊరికి ఉన్న సంబంధం ఏమిటో తేలీదు. ‘‘49 సంవత్సరాలు వచ్చేసినా రాజుగాడికి పెళ్లి కావడం లేదంటూ ఆడ, మగ తెగ మాట్లాడేసుకుంటున్నారహో’’ అంటూ ఏకంగా చాటింపే వేసేశారు. Samayam Telugu | Updated: Aug 15, 2018, 05:57PM IST అతడి పెళ్లికి, ఆ ఊరికి ఉన్న సంబంధం ఏమిటో తేలీదు. ‘‘49 సంవత్సరాలు వచ్చేసినా రాజుగాడికి పెళ్లి కావడం లేదంటూ ఆడ, మగ తెగ మాట్లాడేసుకుంటున్నారహో’’ అంటూ ఏకంగా చాటింపే వేసేశారు. మరి, ఈ చాటింపు విన్న రాజు ఊరుకుంటాడా... ‘‘చిన్న లేదు, పెద్దా లేదు ప్రతి లం** కొ** నా పెళ్లి కోసం మాట్లాడేవాడే’’ అంటూ బూతులు అందుకున్నాడు. కథానాయకుడు రానా నిర్మిస్తున్న ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ సినిమాలోది ఈ సన్నివేశం. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బుధవారం ట్విట్టర్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘ఈ ఏడాది రాబోతున్న అతి పెద్ద.. చిన్న చిత్రం’ అంటూ కొనియాడింది. ఈ ట్రైలర్ విడుదల చేస్తున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇది తప్పకుండా గేమ్ ఛేంజర్ అవుతుందని రకుల్ ఈ సందర్భంగా తెలిపింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. విశాఖపట్నంలోని కంచరపాలెంలో రైల్వే ట్రాక్ చూపిస్తూ ఈ ట్రైలర్ మొదలైంది. 49 ఏళ్లు వచ్చిన రాజుగాడికి పెళ్లి కాకపోవడంతో ఆడోళ్లు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. మగోళ్లంతా భయపడుతున్నారంటూ చాటింపు వేయడంతో ఒక పాత్రను పరిచయం చేశారు. అలాగే, మరో మూడు పాత్రలను కూడా ఈ ట్రైలర్‌లో పరిచయం చేశారు. చివరిలో 49 ఏళ్ల రాజు పెళ్లి కోసం ఏకంగా పంచాయతీయే పెట్టేయడం నవ్వు తెప్పిస్తుంది. ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో అంతా కొత్త ముఖాలే. సహజత్వం ఉట్టిపడేలా దర్శకుడు వెంకటేశ్ మహా ఈ సినిమాను తెరకెక్కించారు. రానాతో పాటు విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్‌ అగస్థి సంగీతం సమకూర్చారు. ఇది న్యూయార్క్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు చిత్రం కావడం గమనార్హం. ఈ సినిమా సెప్టెంబరు 7న విడుదల కానుంది. రకుల్ ట్వీట్: I take immense pride in presenting to you #CareofKancharapalem. A movie I truly believe to be a game changer. The b… https://t.co/x5KHJ6lMWU — Rakul Preet (@Rakulpreet) 1534328929000
0business
Visit Site Recommended byColombia ‘భారత క్రికెటర్లు తాము ధరించే టోపీ బదులు మిలటరీ క్యాప్‌లను ధరించడాన్ని ప్రపంచం చూసింది. కానీ ఇది ఐసీసీకి కనిపించలేదా? పీసీబీ ప్రమేయం లేకుండా ఈ విషయాన్ని గమనించే బాధ్యత ఐసీసీకి ఉంద’ని ఖురేషీ తెలిపారని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. “It’s just not Cricket”, I hope ICC ll take action for politicising Gentleman’s game ... if Indian Cricket team ll… https://t.co/hGbdEmSeEO — Ch Fawad Hussain (@fawadchaudhry) 1552055915000 ఇదే విషయమై పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌధురీ ఘాటుగా స్పందించారు. ఇది క్రికెట్ మాత్రమే కాదని ట్వీట్ చేసిన ఆయన.. కశ్మీర్లో భారత దురాగతాలను గుర్తు చేస్తూ పాకిస్థాన్ క్రికెటర్లు నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలో బరిలో దిగాలని డిమాండ్ చేశారు. ఐసీసీ ముందు నిరసన వ్యక్తం చేయాలని ఆయన పీసీబీకి సూచించారు. మన దేశ సైనికులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోతే వారికి గౌరవ సూచికగా మన క్రికెటర్లు ఆర్మీ క్యాప్ ధరించారు. పాక్ సైన్యం పట్ల గౌరవం ఉంటే పాకిస్థాన్ క్రికెటర్లు కూడా ఆ దేశ ఆర్మీ క్యాప్ ధరించాలి కానీ.. ఈ నల్ల బ్యాడ్జీ సలహా ఏంటో ఆ మంత్రికే తెలియాలి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV జితూరాయ్ ఫైనల్ కు వెళ్లాడుకానీ ఓడాడు రియో ఒలింపిక్స్‌ పురుషుల 10.మీ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్‌ జితూరాయ్‌ ఫైనల్‌ల్లో నిరాశ పరిచాడు. TNN | Updated: Aug 7, 2016, 01:03AM IST రియో ఒలింపిక్స్‌ పురుషుల 10.మీ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్‌ జితూరాయ్‌ ఫైనల్‌ లో నిరాశ పరిచాడు. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో జితూరాయ్ తన ఆరో సిరీస్ కల్లా 580 పాయింట్లు సాధించాడు. నాలుగో సిరీస్ పూర్తయ్యే సరికి 11వ స్థానంలో ఉన్న జితూరాయ్ తదుపరి రెండు సిరీస్ లూ పూర్తి చేసి ఆరవ స్థానంలో నిలిచి ఫైనల్స్ కు చేరుకున్నాడు. భారత్ కు చెందిన మరో షూటర్ గుర్ ప్రీత్ సింగ్ ఫైనల్స్ కు క్వాలిఫై అవ్వడంలో విఫలమయ్యారు. జితూ.. ఫైనల్లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. 78.7 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి తొలి ఎలిమినేటర్‌గా వెనుదిరిగాడు. ఈ ఈవెంట్‌లో వియాత్నానికి చెందిన హోయాంగ్‌ 202.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. ఆతిథ్య బ్రెజిల్‌ ఆటగాడు ఫెలిపీ అల్మెడా 202.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించగా.. మూడో స్థానంలో నిలిచిన చైనా ఆటగాడు పాంగ్‌ వెయ్‌ 180.4 పాయింట్లతో కాంస్యం చేజిక్కించుకున్నాడు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV MS Dhoni 111 మీటర్ల సిక్స్.. గ్రౌండ్‌ వెలుపలికి బంతి ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ఇప్పటి వరకూ ఉన్న బిగ్గెస్ట్ సిక్సర్ల రికార్డ్‌ని ఓసారి పరిశీలిస్తే..? ముంబయి ఇండియన్స్ పవర్ హిట్టర్ హార్దిక్ పాండ్య 104 మీటర్ల సిక్స్‌‌తో నిన్నటి వరకూ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజా ధోనీ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. Samayam Telugu | Updated: Apr 22, 2019, 03:43PM IST MS Dhoni 111 మీటర్ల సిక్స్.. గ్రౌండ్‌ వెలుపలికి బంతి హైలైట్స్ బెంగళూరుపై భారీ షాట్లతో చెలరేగిన చెన్నై కెప్టెన్ ధోని ఉమేశ్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్‌లో భారీ సిక్స్ చిన్నస్వామి స్టేడియం వెలుపలికి వెళ్లిపోయిన బంతి ఆఖరికి ఒక పరుగు తేడాతో గెలిచిన బెంగళూరు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మరోసారి తనలోని ఫినిషర్‌ని అభిమానులకి గుర్తు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. చెన్నై విజయానికి 6 బంతుల్లో 26 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో బౌలింగ్‌కి వచ్చిన ఉమేశ్ యాదవ్‌ ఓవర్‌లో ధోనీ వరుసగా 4, 6, 6, 2, 6 బాదేశాడు. ఈ క్రమంలో... రెండో బంతికి అతను కొట్టిన సిక్స్ ఏకంగా 111 మీటర్లు ప్రయాణించి స్టేడియం వెలుపలికి వెళ్లిపోయింది. అయితే.. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సిరాగా.. సింగిల్ కోసం ధోనీ ప్రయత్నించాడు. కానీ.. పార్థీవ్ పటేల్ తెలివిగా శార్ధూల్‌ని రనౌట్ చేయడంతో బెంగళూరు ఒక పరుగు తేడాతో గెలిచింది. 111m six by dhoni..#RCBvsCSK #Chinnaswamy #Dhoni https://t.co/xixg8zkzJL — Ravikumar (@Ravikumarceg) 1555874556000
2sports
FARWEZ ఇంగ్లండ్‌తో టి20 కోసం రసూల్‌ ఎంపిక న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న టి20 సిరీస్‌కు జమ్ముకాశ్వీర్‌కు చెందిన ఆఫ్‌ స్పిన్నర్‌ పర్వేజ్‌ రసూల్‌ను భారత జట్లుకు ఎంపికైయ్యాడు.రసూల్‌ దక్షిణ కాశ్మీర్‌లోని బిజ్‌బెహరా పట్టణంలో నివాసం ఉంటున్నాడు.అయితే జాతీయ జట్టు లో రసూల్‌కు చోటు దక్కడంతో స్థాని కులంతా తెగ సంబర పడిపోతున్నారట. ఎప్పుడూ అల్లర్లు, ఘర్షణలు, నిరస న లతో అట్టుడుకుతుంటే కాశ్మీర్‌ ప్రజలు ఈసారి భారత్‌,ఇంగ్లండ్‌ టి20 మ్యాచ్‌ల కోసం ఆస్రక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం దేశవాళీ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 కోసం సన్నధ్దం అవుతుండగా రసూల్‌కు ఈ అవకాశం వచ్చింది.గతంలో జింబాబ్వే,బంగ్లాదేశ్‌ పర్యటన కోసం రెండు సార్లు జట్టులో స్థానం సంపాదించినప్పటికి సొంత గడ్డపై జరిగిన అంత ర్జాతీయ మ్యాచ్‌లో ఆడేందుకు మాత్రం అతనికి అవకాశం రాలేదు. తుది జట్టులో రసూల్‌కు ఈసారైనా చోటు దక్కుతుందని తాము ఆశిస్తున్నట్లు కాశ్మీర్‌కు చెందిన అహ్మద్‌ భట్‌ పేర్కొన్నాడు.ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం రసూల్‌ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది.గతంలో జింబాబ్వేతో సిరీస్‌కు ఎంపికైనప్పటికి తుది జట్టులో అతనికి అవకాశం ఇవ్వలేదు.కానీ ఈసారి ఎలాగైనా తుది జట్టులో ఉంటాడన్న నమ్మకం ఉందని, కాశ్మీర్‌ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేం దుకు ఎంపికైన తొలి క్రికెటర్‌ రసూల్‌ అని అహ్మద్‌ భట్‌ పేర్కొన్నాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్న కోహ్లి ప్రతిరోజు వంద శాతం కాదు.. 120 శాతం కష్టపడతా. క్రికెట్‌లోని మూడు ఫార్మట్లలో ఫామ్‌ TNN | Updated: Mar 9, 2017, 08:19AM IST మైదానంలో గత కొంతకాలంగా పరుగుల వరద పారిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చేతికి మరోసారి పాలీ ఉమ్రిగర్ అవార్డు సగర్వంగా చేరింది. బెంగళూరులో జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో విరాట్ కోహ్లి ఈ అవార్డును అందుకున్నాడు. 2015-16 సీజన్‌లో భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన కోహ్లిని బీసీసీఐ ‘అత్యుత్తమ క్రికెటర్‌’గా ఎంపిక చేసి ఈ అవార్డు ఇవ్వాలని ఇటీవల నిర్ణయించింది. అతనితో పాటు అదే సీజన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 17 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని ‘దిలీప్ సర్దేశాయ్’ అవార్డుతో బీసీసీఐ సత్కరించింది. విరాట్ కోహ్లి ఈ అవార్డు అందుకోవడం కెరీర్‌లోనే మూడోసారి గతంలో 2011-12, 2014-15 సీజన్ల‌లో అందుకున్నాడు. అవార్డు స్వీకరించిన అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ ‘ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. దీని కోసం ప్రతిరోజు వంద శాతం కాదు.. 120 శాతం కష్టపడతా. క్రికెట్‌లోని మూడు ఫార్మట్లలో ఫామ్‌ చాటేందుకు ప్రతిసారీ ప్రయత్నిస్తాను. భారత జట్టుకు ఆడటం జాబ్‌లాగా కాకుండా ఓ అవకాశం, బాధ్యతగా భావిస్తా. 2015 నా కెరీర్‌నే సమూలంగా మార్చేసింది’ ’ అని వివరించాడు. ఇటీవల బెంగళూరులో ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టెస్టులో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
2sports
ఫస్ట్ మ్యాచ్‌‌లోనే ఫ్రాన్స్ విక్టరీ Highlights ఫస్ట్ మ్యాచ్‌‌లోనే ఫ్రాన్స్ విక్టరీ హైదరాబాద్: డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్ కాస్త 81వ నిముషంలో అందివచ్చిన గోల్‌తో ఫ్రాన్సు‌కు విజయాన్ని కట్టబెట్టింది. గ్రూప్-సిలో 2-1తో ఆస్ట్రేలియాపై శనివారం నాటి వరల్డ్ కప్ మ్యాచ్‌లో గెలిచింది. తొలి మ్యాచ్‌తోనే బోణి చేసింది. అయితే ఫస్టాఫ్‌లో ఇరు జట్లు చేసిన మిస్టేక్స్ వల్ల ఫ్రాన్స్‌కు చెందిన కోరింటిన్ టోలిస్సో, ఆసిస్ ప్లేయర్స్ ఆజిజ్ బెహిచ్, మ్యాథ్యూ లెకీ, జోష్ రిస్టాన్ ఎల్లో కార్డ్ చూడాల్సి వచ్చింది.  మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఇరు జట్లు ఆరంభం నుంచే నువ్వా నేనా అన్నట్టుగా ఆడటంతో ఫస్టాఫ్‌లో ఏ ఒక్కరూ ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. సెకాండాఫ్‌లో కూడా మ్యాచ్ అలాగే సాగుతుండగా 58వ నిముషం వద్ద ఫ్రాన్సుకు పెనాల్టి కిక్ కొట్టే ఛాన్స్ దక్కింది. దాంతో ఆంటోని గ్రేజ్‌మెన్ ఆ ఛాన్స్‌ను అందిపుచ్చుకొని జట్టుకు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 63వ నిముషం వద్ద ఆస్ట్రేలియాకూ ఇదే ఛాన్స్ రావడంతో  జెడ్నాక్ గోల్ చేసి 1-1తో స్కోర్ సమం చేశాడు. అక్కడి నుంచి 81వ నిముషం దాకా అంతా మ్యాచ్ డ్రాగా ముగుస్తుని భావిస్తున్న తరుణాన ఫ్రాన్స్ ప్లేయర్ పోగ్బా గోల్ చేసి 2-1తో టీమ్‌కు ఆధిక్యతను అందించాడు. ఆ తర్వాత మొదట్లో లాగానే ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ టైమ్ అయిపోవడంతో ఫ్రాన్స్ విజేత అయ్యింది. ఆంటోని గ్రేజ్‌మెన్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా నిలిచాడు. Last Updated 18, Jun 2018, 10:47 AM IST
2sports
చరణ్ సినిమాకు రీషూట్లు! Highlights రామ్ చరణ్ కు కాంబినేషన్ సీన్స్ సంతృప్తినివ్వకపోవడంతో రీషూట్ చేద్దామని బోయపాటిని అడిగినట్లు తెలుస్తోంది ఇటీవల 'రంగస్థలం' చిత్రంతో సక్సెస్ అందుకున్న హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ రెండు షెడ్యూల్స్ లో చరణ్ పాల్గొంది లేదు. రీసెంట్ గా సినిమా కొత్త షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు చరణ్. స్నేహ, ప్రశాంత్, కియారా అద్వానీ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అలానే భారీయాక్షన్ ఎపిసోడ్ ను కూడా షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరోసారి ఆ సీన్స్ ను రీషూట్ చేయనున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కు కాంబినేషన్ సీన్స్ సంతృప్తినివ్వకపోవడంతో రీషూట్ చేద్దామని బోయపాటిని అడిగినట్లు తెలుస్తోంది. దానికి ఆయన కూడా ఓకే చెప్పడంతో త్వరలోనే ఈ సన్నివేశాలను మరోసారి చిత్రీకరించనున్నారు. అయితే మరో మూడు రోజుల్లో చిత్రబృందం షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్ళబోతుంది. అక్కడ రెండు వారల పాటు షూటింగ్ నిర్వహించనున్నారు.  ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత మిగిలిన నటీనటుల కాల్షీట్ల ప్రకారం రీషూట్ చేసే ఛాన్స్ ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు.  Last Updated 9, May 2018, 5:03 PM IST
0business
ధర్మశాలకి చేరుకున్న భారత టీ20 జట్టు Samayam Telugu| Sep 13, 2019, 08.44 PM IST Image Courtesy: BCCI Twitter దక్షిణాఫ్రికాతో ఆదివారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ కోసం భారత జట్టు శుక్రవారం ధర్మశాలకి చేరుకుంది. సఫారీలతో మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియా ఆడనుండగా.. ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో.. ఈరోజు ఢిల్లీ నుంచి బయల్దేరిన భారత క్రికెటర్లు.. ధర్మశాలకి చేరుకున్నారు. ఇక రెండో టీ20 మ్యాచ్ బుధవారం మొహాలి వేదికగా, మూడో టీ20 ఆదివారం (ఈనెల 22న) బెంగళూరు‌లో జరగనుంది. A traditional welcome for #TeamIndia as they arrive in Dharamsala ahead of the 1st T20I against South Africa.… https://t.co/D7ToekSAJX — BCCI (@BCCI) 1568380320000 దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల భారత్‌కి చేరుకున్న సఫారీ టీ20 జట్టు.. గత సోమవారమే ధర్మశాలకి చేరుకుంది. భారత గడ్డపై ఇప్పటి వరకూ టీమిండియా చేతిలో ఒక్కసారి కూడా టీ20ల్లో ఓడిపోని దక్షిణాఫ్రికా టీమ్.. అదే రికార్డ్‌ని కొనసాగించాలని ఆశిస్తుండగా.. సొంతగడ్డపై టీ20ల్లో గెలుపు రుచి చూడాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్ ఆసక్తికరంగా జరగనుంది. Read More: భారత్‌లో దక్షిణాఫ్రికా టూర్.. షెడ్యూల్ ఇదే భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ దక్షిణాఫ్రికా టీ20 జట్టు: డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), దుస్సేన్ (వైస్ కెప్టెన్), బవుమా, జూనియర్ డాలా, బోర్న్ పోర్టుయిన్, హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్, ఫెహ్లుక్వాయో, పిట్రోరియస్, కగిసో రబాడ, షంషీ, స్మట్స్
2sports
internet vaartha 138 Views అనిశ్చితితో ముగిసిన మార్కెట్లు ముంబై : ఇన్వెస్టర్లు ఎక్కువగా ఫెడ్‌రిజర్వు సమావేశం, బ్యాంక్‌ ఆఫ్‌జపాన్‌ పాలక వర్గ సమావేశం వివరాలపై దృష్టిపెట్టడం, హెల్త్‌కేర్‌ రంగంలో రెండోఅతిపెద్ద కంపెనీ డా.రెడ్డీస్‌ లాబ్స్‌ ఫలితాల్లో వెనుకబడటం వంటివి మార్కెట్లు నష్టాల్లో ముగియడానికి కారణం అయ్యాయి. నిఫ్టీ 8600 దిగువన ముగిస్తే డా.రెడ్డీస్‌ ఐదుశాతం దిగజారింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌్‌ 119 పాయింట్లు క్షీణించి 27,977 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సూచి 45 పాయింట్లు క్షీణించి 8591వద్ద ముగిసింది. మార్కెట్లలో బెంచ్‌మార్క్‌ సూచీలు 52 వారాల గరిష్టస్థాయి నుంచి కొంతమేర దిగజారాయి. ప్రపంచ కేంద్ర బ్యాంకుల పాలక వర్గ సమీక్షల వివరాలపై ట్రేడర్లు ఎక్కువ దృష్టి పెట్టారు. వీటితోపాటు జూలై ఎఫ్‌అండ్‌ఒ కాల పరిమితి ముగియడం కూడా కీలకం అయింది. వర్షాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదంపై కూడా కొంత ఇన్వెస్టర్లు సందేహాలతో ఉన్నారు. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.2 శాతం, స్మాల్‌క్యాప్‌ 0.7శాతంగా ఉన్నాయి. అలాగే ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ నిర్వహించనున్న ఆగస్టు 2వతేదీ చివరి సమీక్ష పై కూడా ఎక్కువ గురి ఉంది. దేశీయ మార్కెట్లలో యాక్సిస్‌ బ్యాంకు 3 శాతం పెరిగింది. నికరలాభాలు 1558 కోట్లకు పడిపోయింది. రానిబాకీల భారమే ఎక్కువ కనిపించింది. ఇతర షేర్లపరంగా శోభా నాలుగుశాతం పెరిగింది. కంపెనీ రియాల్టీ రంగంలో అగ్రగామిగా ఉంది. 1.76 మిలియన్ల వాటాలు ప్రస్తుత షేర్‌ హోల్డర్ల నుంచి తిరిగి 58 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక బజాజ్‌ ఫైనాన్స్‌ పదిశాతం పెరిగింది. త్రైమాసిక ఫలితాల్లో 54శాతం వృద్ధి కనిపించింది. మారుతి సుజుకి రెండుశాతం దిగజారింది. 23శాతం నికర లాభాలు పెరిగాయి. డా.రెడ్డీస్‌లాబ్స్‌ ఐదు శాతం ఎన్‌ఎస్‌ఇలో దిగజారాయి. నికరలాభం 75శాతం క్షీణించింది. గట్టిపోటీ, అమెరికా వంటి దేశాల్లో అమ్మకాల ఒత్తిడి ఇందుకు కీలకం అయింది. ఎస్‌బిఐ అసోసియేట్‌ బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ 471.88 కోట్ల నష్టాలు చవి చూసింది. రానిబాకీల భారం మరింతగా పెరిగింది. ఏడు రెట్లు కేటాయింపులు పెంచడంతో నష్టాలు పెరిగాయి. షేర్లు ఒకటి శాతం దిగజారాయి. స్వరాజ్‌ ఇంజన్స్‌ ఒకటిశాతం లాభపడ్డాయి. ట్రాక్టర్ల విక్రయాలు పెరగడంతో కొంత లాభాలు పెంచుకోగలిగింది. టివిఎస్‌ మోటార్స్‌ రెండు శాతం దిగజారింది. 21శాతం నికరలాభాలు పెరిగినప్పటికీ షేర్లు క్షీణించాయి.
1entertainment
నితిన్ కు సింహాచలం అప్పన్న గుడిలో ఊహించని తీపి అవమానం జరిగింది Highlights నితిన్ కు సింహాచలం అప్పన్న గుడిలో ఊహించని తీపి అవమానం జరిగింది నితిన్ కు ఒక వింతైన చేదు అనుభవం ఎదురైంది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ పుణ్య క్షేత్రాల సందర్శనలో ఉన్న నితిన్ కు సింహాచలం అప్పన్న గుడిలో ఊహించని తీపి అవమానం జరిగింది. దర్శనం కోసం వచ్చిన నితిన్ ను కారణం చెప్పకుండా అక్కడి ఆలయ అలంకరణ పర్యవేక్షకులు సీతారామాచార్యులు  తాళ్ళతో కట్టి తీసుకెళ్ళి ఆలయ ప్రధానాచార్యులు రాజగోపాల్ ముందు హాజరు పరిచారు. అయోమయంలో ఉన్న నితిన్ ను రాజగోపాల్ నిలదీస్తూ స్వామి వారి ఉంగరం దొంగలించడం భావ్యం కాదని పైగా బాగా డబ్బున్న మీ లాంటి సినిమా హీరోలు చేయాల్సిన పని కాదని ఆయన చెప్పడంతో ఒక్క క్షణం నితిన్ కు నోట మాట రాలేదు. వెంటనే కోలుకుని అలాంటిది ఏమి లేదని కావాలంటే తనీఖీ చేసుకోమని చెప్పేసాడు ఉంగరం పోయింది శనివారం రాత్రే కాబట్టే అది దొరికే దాకా  బందీలుగా ఉండాల్సిందే అని రాజగోపాల్ తేల్చి చెప్పడంతో నితిన్ కు చాలా సేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈలోగా ఇదే అభియోగం మీద మరికొందరు భక్తులను కూడా అక్కడి సిబ్బంది ఇదే తరహాలో తాళ్ళతో కట్టి అక్కడికి తీసుకువచ్చారు. ఇంకేముంది అందరు ఘోల్లుమంటూ ఒకటే ఏడుపు. నితిన్ మాత్రం ఇందులో ఏదో మతలబు ఉందని సైలెంట్ గా చూడటం మొదలుపెట్టాడు. నిజానికి ఈ తతంగం అంతా నిజం కాదు. ప్రతి ఏటా జరిగే వరాహ లక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా వినోదోత్సవం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. దీంట్లో భాగమే ఈ దొంగల దోపు ఉత్సవం. స్వామి వారు ఒకసారి విహార యాత్రకు వెళ్ళినప్పుడు ఉంగరం పోగొట్టుకుని రావడంతో అది ఉంటేనే రమ్మని అమ్మవారు షరతు పెడతారు. తన తరఫు దూతగా వైదికుడిని ఒకరిని పంపించి అనుమానం ఉన్న భక్తులను విచారణకు తీసుకువస్తారు. దాన్ని యధాతధంగా ఈ రూపంలో గుడిలో నాటకం తరహాలో నిజంగా నడిపిస్తారు. నిజానికి భక్తులెవరు దొంగతనం చేయలేదన్నమాట. మొత్తం విన్న భక్తులు హమ్మయ్య అని చిరునవ్వులతో బయలుదేరగా నితిన్ మాత్రం ఏంటయ్యా నీ లీల సినిమా విడుదల దగ్గర ఉందని తనకో కొత్త అనుభూతి కలిగిస్తావా అంటూ ఆనందంగా బయటికి వచ్చాడట. అదండీ విధి ఆడిన దేవుడి నాటకంలో దొంగగా మారాల్సి వచ్చిన నితిన్ కథ.  Last Updated 2, Apr 2018, 12:53 PM IST
0business
HERO హీరోనుంచి మూడు కొత్తమోడళ్లు న్యూఢిల్లీ, ఆగస్టు 14: టూవీలర్‌ తయారీ దిగ్గజం హీరోమోటోకార్ప్‌ వచ్చే ఆర్ధికసంవత్సరంలోపు మూడు కొత్తస్కూటర్లను విడుదలచేస్తున్నటు ్లప్రకటిం చింది. హోండాకు గట్టి పోటీనిచ్చేందుకువీలుగాను, నవంబర్‌వన్‌స్థానం రాబట్టాలన్న లక్ష్యంతో హీరో కసరత్తులుముమ్మరంచేసింది. నాలుగో త్రైమాస ికంలో కంపెనీ 125సిసి స్కూటర్‌ను విడుదలచేస్తుంది. మరో రెండు కొత్తమోడళ్లు 2018-19 ఆర్ధికసంవత్సరంలో విడుదలచేస్తామని కంపెనీ సిఎండి పవన్‌ముంజాల్‌ వెల్లడించారు. కంపెనీ తన ప్రీమియం మోటార్‌ సైకిల్‌సెగ్మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. 200సిసి స్పోర్ట్స్‌బైక్‌ను తెస్తోంది. మోటార్‌సైకిల్స్‌లో హీరోగానే ఉన్న కంపెనీ కొత్త సిసిలపై దృష్టిసారించింది. మాస్కూటర్‌ సెగ్మెంట్‌ 360 డిగ్రీ మార్కెట్‌ విలతువలు సాధించాయని, కొత్త అప్‌గ్రేడ్లు, ఆధునీకరణలతో విక్రయాలు మరింత పెరిగాయన్నారు. వచ్చే అర్ధసంవత్సరంలోనే ఆరు కొత్తమోడళ్లు డిజైన్‌ చేసా మన్నారు. ప్రనీమియం, స్కూటర్‌కేటగిరీల్లోనే ఎక్కువ మోడళ్లు వస్తాయని వివరించారు. కొత్తస్కూటర్ల రాకతో మాస్ట్రో ఎడ్స్‌, డ్యూయట్‌ 110సిసి, ప్లెజర్‌100సిసిలకు కొంత మద్దతునిస్తాయి. యాక్టివా 4జి, డియో, ఏవి యేటర్‌, యాక్టివాఐ, క్లిక్‌ వంటివి అన్నీ కూడా 110సిసితో ఉంటే, యాక్టివా తాజాగా 125సిసిని మార్కెట్‌కు తెచ్చింది. టివిఎస్‌ మోడళ్లు జెస్ట్‌ 110, స్కూటీపెప్‌ప్లస్‌, వీగో, జూపిటర్‌లు వంటివి మరికొంతపోటీ ఇస్తున్నాయి. దేశీయ మార్కెట్‌లో హోండా, హీరోమోటోకార్‌్‌పలు 50శాం వాటాతో ఉన్నాయి.స్కూటర్‌ విభాగంలో హీరోమోటోకు 12శాతం వాటా ఉంది. హోండాకు 60వౄతం మార్కెట్‌ వాటా ఉంటే టివిఎస్‌ మోటార్‌కు 15శాతం మార్కెట్‌ వాటా ఉంది. స్కూటర్ల విభాగంలో హీరో 2,77,159 విక్రయిం చింది. హోండా 13,17,610 స్కూటర్లు విక్రయించింది. హీరోస్కూటర్‌ సేల్స్‌ టివిఎస్‌కంటే తక్కువ ఉన్నాయి. టివిఎస్‌ 3,38,723వరకూ విక్రయించింది. మొత్తం స్కూటర్ల విక్రయాలు 22,17,499గా ఉన్నాయి. ఇక బైక్‌లపరంగా హీరో 21,45,491యూనిట్లు విక్రయించింది. హోండామోటార్‌సైకిల్స్‌ స్కూటర్స్‌ ఇండియా 6,72,828 విక్రయించింది. మొత్తం బైక్‌ల విక్రయాలు భారత్‌లో ఏప్రిల్‌జులైనెలల్లో 41,03,644 యూనిట్లుగా ఉన్నట్లు ఆటోమొబైల్‌నిపుణులు అంచనావేసారు.
1entertainment
Hyderabad, First Published 15, Sep 2019, 3:40 PM IST Highlights సందీప్ కిషన్, ఆపిల్ బ్యూటీ హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్. దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం ఫేమ్ నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. కామెడీ చిత్రాలు తెరకెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ చిత్రాన్ని కూడా ఆయన కామెడీ జోనర్ లోనే తెరకెక్కిస్తున్నారు.  సందీప్ కిషన్, హన్సిక నటించిన తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ చిత్ర టీజర్ తాజాగా విడుదలయింది. టీజర్ లో ఉన్న ఫన్ మూమెంట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎలాంటి కేసులు దొరక్క ఖాళీగా ఉండే లాయర్ పాత్రలో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.  వరలక్ష్మిని కాపాడే లాయర్ ఈ కర్నూలు సిటీలో ఎవ్వరూ లేరు అని మురళి శర్మ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. 'ఒక కేసు ఇస్తే రెండో కేసు ఫ్రీ..పేటియంలో పే చేస్తే 50 పెర్సెంట్ క్యాష్ బ్యాక్.. కేసు ఓడిపోతే 100 పెర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్' అంటూ సాగే ఫన్నీ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.  ఆపిల్ బ్యూటీ హన్సిక ఎప్పటిలాగే గ్లామర్ గా కనిపిస్తోంది. కమెడియన్ ప్రభాస్ శ్రీను, సప్తగిరి కామెడీ బావుంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. సందీప్ కిషన్ కూడా ఎప్పటి నుంచో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. హన్సిక చాలా రోజుల తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రం ఇది. దీనితో తెనాలి రామకృష్ణ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Sri Reddy: వాళ్లంతా ఉపాసన పాదం మీద దుమ్ము.. మెగా ఫ్యామిలీపై పడిందేంటి! ఫేస్‌బుక్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ కాస్త ఘాటుగా, పెద్దలకు మాత్రమే అన్నట్టుగా పోస్టులు పెడుతూ.. తన ప్రచారం కోసం ఎంతటివారిపైనైనా ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేస్తుంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. Samayam Telugu | Updated: Oct 4, 2019, 04:11PM IST స్నేహారెడ్డి, ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అల్లుపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన ప్రచారం కోసం, నలుగురి నోళ్లలో తన పేరు రోజూ నానడం కోసం ఇష్టమొచ్చినట్టు ఫేస్‌బుక్‌లో పోస్టులు చేస్తూ, ఇండస్ట్రీలోని పెద్ద ఫ్యామిలీలను టార్గెట్ చేసే శ్రీరెడ్డి.. ఇప్పుడు మెగా ఫ్యామిలీపై పడింది. ఉపాసన ఉన్నతమైన మహిళని పొగుడుతూనే స్నేహారెడ్డిని తీసిపారేసింది. ఉపాసనకు స్నేహారెడ్డికి చాలా తేడా ఉందని పేర్కొంది. ఉపాసన ఉన్నతమైన మహిళ అని, మిగిలినవారంతా ఆమె పాదంపై దుమ్ముతో సమానమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో తాజాగా ఒక పోస్టు పెట్టింది. ఉపాసనపై గతంలోనూ పలుమార్లు శ్రీరెడ్డి ప్రశంసల వర్షం కురిపించింది. సేవా కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్లను ఉపాసన ఆదుకుంటున్నారని గతంలో శ్రీరెడ్డి కొనియాడింది. ఇప్పుడు అదే ప్రస్తావనను తీసుకొచ్చి స్నేహారెడ్డిని తక్కువ చేస్తూ వివాదాస్పద చర్చకు తెరలేపింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలను కొంత మంది ఫేస్‌బుక్‌లో వ్యతిరేకించారు. దీనికి కూడా శ్రీరెడ్డి సమాధానం ఇచ్చింది. ‘‘భయంకరమైన వ్యాధులతో పోరాడుతోన్న ఎంతో మంది పేద పిల్లలకు ఉపాసన సాయం చేస్తున్నారు. ఆమె చాలా మందికి సహాయం అందిస్తున్నారు. ఆమె ఎంతో మందికి రోల్ మోడల్, దేశం గర్వించదగిన మహిళ. స్నేహా తన రిచ్ కిడ్స్‌ను మాత్రమే చూసుకుంటున్నారు’’ అని శ్రీరెడ్డి వివరణ ఇచ్చింది. మొత్తానికి ఫేస్‌బుక్‌లో చిన్న కామెంట్‌తో పెద్ద చర్చనే లేవదీసింది శ్రీరెడ్డి. గమనిక: ఇది శ్రీరెడ్డి చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ ఆధారంగా రాసిన కథనం మాత్రమే. ఒకరిని అవమానించాలనో, వారి పరువుకు భంగం కలిగించాలనో మా ఉద్దేశం కాదు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV నంది అవార్డు.. నాకెందుకు రాలేదు? ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించడం తేనె తుట్టెను కదిపినట్టు అయ్యింది. TNN | Updated: Nov 16, 2017, 07:58AM IST ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించడం తేనె తుట్టెను కదిపినట్టు అయ్యింది. ఒకేసారి మూడేళ్లకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు.. ఈ అవార్డుల జాబితాలో పేర్లు లేని సినిమా వాళ్లు ఇప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు మెగాఫ్యామిలీ వైపు నుంచి, ఇటు దర్శకుడు గుణశేఖర్ నుంచి నంది అవార్డుల ప్రకటన తీరుపై అసహనం వ్యక్తం అయ్యింది. మరోవైపు ప్రముఖ కమేడియన్ పృథ్వీ కూడా అసహన గళం విప్పారు. నంది అవార్డుల జాబితా అంత గొప్పగా ఏమీ లేదని.. పృథ్వీ అన్నాడు. ఎంపిక కమిటీలో గిరిబాబు వంటి సీనియర్ ఉన్న ఎందుకిలా జరిగిందో అర్థం కాలేదని ఈ నటుడు అభిప్రాయపడ్డాడు. ‘లౌక్యం’ సినిమాకు గానూ తనకు ఉత్తమ కమేడియన్ అవార్డు వస్తుందని అనుకున్నాను అని, అయితే అది జరగలేదని పృథ్వీ అన్నాడు. ‘నీకు అవార్డు అందుకునే స్థాయి ఇంకా రాలేదురా.. అని కమిటీ వాళ్లు అనుకున్నారేమో...’ అని ఈ నటుడు వ్యాఖ్యానించడం విశేషం. అవార్డుల ప్రకటనకు ఇలా గ్యాప్ ఉండకూడదు అని.. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అవార్డులను ప్రకటిస్తే... సత్తా ఏమిటో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. కొని తెచ్చుకున్న అవార్డులు బయటకు వెళ్లినప్పుడు వెక్కిరిస్తాయని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో అన్నారని పృథ్వీ గుర్తు చేశారు. ఈ విధంగా ఈ కమేడియన్ కూడా నంది అవార్డుల ప్రకటన తీరుపై అసహనాన్ని వ్యక్తం చేసినవారి జాబితాలోకి చేరారు.
0business
tea leaf రికార్డుస్థాయిలో తేయాకు ఉత్పత్తి! కూనూర్‌: దక్షిణాదిప్రాంతంలో తేయాకు దిగుబడులు తగ్గినా దేశం మొత్తంమీద దిగుబడుల తో మంచి రికార్డుస్థాయి ఉత్పత్తి జరిగిందని అంచ నా. అస్సాం దేశంలోని అన్ని ఇతరప్రాంతాలకంటే ఎక్కువ ఉత్పత్తి చేసింది. రెండుశాతం పెరిగింది. మొత్తం 642.18 మిలియన్‌ కిలోల తేయాకును ఉత్పత్తిచేసింది. తదనంతరం పశ్చిమ బెంగాల్‌ 357.47 మిలియన్‌ కిలోలు ఉత్పత్తిచేయగా డార్జి లింగ్‌ పరంగా ఏడుశాతం క్షీణించి 8.13 మిలియన్‌ కిలోలు ఉత్పత్తి జరిగింది. దేశం మొత్తంగాచూస్తే ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయిలో 1239.15 మిలియన్ల కిలోలు ఉత్పత్తిచేసినట్లు తేలింది. డిసెంబరు నెలకు గాను 62.74 మిలియన్‌ల కిలోలు ఉత్పత్తి అంచ నా వేసింది. తేయాకు బోర్డు గతఏడాది లక్ష్యం 57.29 మిలియన్‌ కిలోల కంటే పెరిగింది. 5.45 మిలియన్ల కిలోలు అదనంగా ఉత్పత్తి జరిగింది. వృద్ధిరేటు కూడా 9.51శాతంగా ఉందని గ్లోబల్‌ టీ డైజెస్ట్‌లో రాజేష్‌ గుప్తా వెల్లడించారు. దీనివల్ల మొత్తంగా తేయాకు ఉత్పత్తి 2015 కంటే ఎక్కు వగా ఉన్నట్లు అంచనా. 2016లో మొత్తం ఉత్పత్తి 1239.15 మిలియన్‌ కిలోలకు పెరిగింది. 1208.66 మిలియన్‌ కిలోలుగా ఉంది. మొత్తంగా చూస్తే తేడా 30.49 మిలియన్‌ కిలోలు పెరిగింది. 2.5శాతం వృద్ధిని సాధించినట్లు గుప్తా వెల్లడిం చారు. దక్షిణాదిలో తక్కువ పరిమాణంలోనే ఉత్పత్తి జరిగింది. ఉత్తర భారత్‌ప్రాంతం నుంచే ఎక్కువ ఉత్పత్తిని నమోదు చేసింది. ఉత్తరాదిలో ఉత్పత్తి 1026.91 మిలియన్‌ కిలోలుగా ఉంది. గత ఏడాది 981.09 మిలియన్‌ కిలోలుగా ఉంటే ఐదుశాతం వృద్ధిని సాధించింది. అస్సాం ఒక్కటే భారత్‌లో అత్యధికంగా ఉత్పత్తి చేసింది. 642.18 మిలియన్‌ కిలోలుగా ఉంది. దక్షిణాది ఉత్పత్తి ఏడుశాతం తగ్గి 212.21 మిలియన్‌ కిలోలుగా ఉంది. గత ఏడాది 227.57 మిలియన్‌ కిలోలుగాఉంది. ప్రతికూల వాతా వరణ పరిస్థితులపరంగా తమిళనాడులో తేయాకు ఉత్పత్తి 11శాతం క్షీణించి 145.41 మిలియన్‌ కిలో లకు పడిపోయింది. అంతకుముందు ఏడాది 163.09 మిలియన్‌ కిలోలతో పోలిస్తే 11శాతం తగ్గింది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పతాకధారిగా సింధు.. అట్టహాసంగా కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆరంభోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. Samayam Telugu | Updated: Apr 4, 2018, 05:18PM IST ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆరంభోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. ఆస్ట్రేలియా సంస్కృతి ఉట్టి పడేలా 21వ కామన్వెల్త్ గేమ్స్ ఆరంభ ఉత్సవాలను నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో 71 దేశాలకు చెందిన క్రీడాకారులు 18 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. గత కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన స్కాట్లాండ్ ఆటగాళ్లు ముందుగా కర్రారా స్టేడియంలో నిర్వహించిన పరేడ్‌లో అడుగుపెట్టారు. అనంతరం ఖండాల వారీగా.. ఆంగ్ల అక్షరమాల ప్రకారం వివిధ దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహించారు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు త్రివర్ణ పతాకధారిగా ముందుకు సాగగా.. 218 భారత అథ్లెట్లు ఆమె వెంట నడిచారు. ఈ క్రీడల ఆరంభోత్సవంలో పతకాధారులుగా 39 మంది పురుష అథ్లెట్లు ముందు నడవగా.. 32 మంది మహిళా అథ్లెట్లు తమ దేశ జాతీయ పతాకంతో పరేడ్ నిర్వహించారు. ఈ స్థాయిలో మహిళా అథ్లెట్లు పతాకధారులుగా నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. #PVSindhu leads #TeamIndia #CWG2018 https://t.co/JZiETLEaOs — Ishani (@IshaniDg) 1522841283000
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బుమ్రాపై నా అంచనా తప్పింది: కపిల్‌దేవ్ జస్‌ప్రీత్ బుమ్రా‌ క్రికెట్‌లోకి వచ్చిన కొత్తలో.. అతని బౌలింగ్‌ శైలిని చూసి ఎక్కువకాలం కొనసాగలేడని అనుకున్నా. కానీ..? -కపిల్‌దేవ్ Samayam Telugu | Updated: Jan 1, 2019, 12:24PM IST బుమ్రాపై నా అంచనా తప్పింది: కపిల్‌దేవ్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న జస్‌ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కొనసాగుతోంది. మెల్‌బోర్న్ వేదికగా గత ఆదివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా .. టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డులు నెలకొల్పాడు. మొత్తంగా 2018లో 9 టెస్టులాడిన ఈ ఫాస్ట్ బౌలర్‌గా ఏకంగా 48 వికెట్లను తన ఖాతాలో వేసుకోవడంతో అతనిపై సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ తదితరులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ జాబితాలోకి మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కూడా చేరాడు.
2sports