news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఐపీఎల్లో దినేశ్ కార్తీక్ కల నెరవేరేనా..?
‘ఐపీఎల్ తొలి సీజన్ (2008) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఏదో ఒక ఏడాది ఆడగలననే నమ్మకంతోనే కొనసాగుతున్నా. కానీ గత పది
Samayam Telugu | Updated:
Mar 23, 2018, 02:44PM IST
ఐపీఎల్లో దినేశ్ కార్తీక్ కల నెరవేరేనా..?
కొలంబో వేదికగా ఇటీవల ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి భారత్ను గెలిపించిన దినేశ్ కార్తీక్ ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ జాబితాలో చేరిపోయాడు. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 11వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకి ఈ వికెట్ కీపర్ నాయకత్వం వహించనున్నాడు. దీంతో ఐపీఎల్లో కెప్టెన్సీ కల తీరబోతున్నా.. చెన్నై సూపర్ కింగ్స్కి ఆడాలనే తన సుదీర్ఘ నిరీక్షణ మాత్రం ఇంకా కొనసాగుతోందని ఈ తమిళనాడు హిట్టర్ వివరించాడు. ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకి ఇప్పటి వరకు ఆడిన కార్తీక్.. పదేళ్లలో ఒక్కసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆడలేదు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత్@500.. ఏ జట్టుపై ఎన్ని విజయాలంటే
1974 జూలై 13న భారత్ ఇంగ్లాండ్తో తొలి వన్డే మ్యాచ్ ఆడిన భారత్.. 1975 జూన్ 11న తొలి వన్డే విజయం నమోదు చేసింది. శ్రీలంకపై అత్యధికంగా 90 విజయాలు సాధించింది.
Samayam Telugu | Updated:
Mar 6, 2019, 09:00AM IST
భారత్@500.. ఏ జట్టుపై ఎన్ని విజయాలంటే
హైలైట్స్
వన్డేల్లో భారత్ మరో రికార్డు నెలకొల్పింది.
ఈ ఫార్మాట్లో 500 విజయాలు నమోదుచేసిన రెండో జట్టుగా రికార్డు నెలకొల్పింది.
శ్రీలంకపై అత్యధికంగా 90 విజయాలు సాధించడం విశేషం
నాగ్పూర్ వేదికగా ఆసీస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం ద్వారా టీమిండియాతో పాటు సారథి విరాట్ కోహ్లి కూడా అనేక రికార్టులు నెలకొల్పారు. కెప్టెన్గా వేగంగా 9వేల పరుగులు సాధించిన రికార్డును కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు భారత్ వన్డేల్లో 500 విజయాలు సాధించింది. ఆసీస్(558) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా చరిత్ర సృష్టించింది. మొత్తం 963 మ్యాచ్ల్లో 500 విజయాలు సాధించింది భారత్. అయితే భారత్ ఎక్కువ విజయాలు సాధించింది శ్రీలంకపైనే. ఆ జట్టును ఏకంగా 90సార్లు ఓడించింది. | 2sports
|
Test Match
ఆస్ట్రేలియా 276 ఆలౌట్
బెంగళూరుం బెంగళూరు వేదికగా భారత్, ఆసీస్ జట్ల మధ్య జరగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సలో ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 189 పరుగులకు ఆలౌట్ అవ్వటంతో ఆసీస్ 87 పరుగుల ఆధిక్యంతో ఉంది.. భారత్ బౌలర్లు జడేజా6, అశ్విన 2 వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మ ఉమేష్ యాదవ్ చెరోవికెట్ తీసుకున్నారు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
స్టీవ్స్మిత్ బలంగా పునరాగమనం చేస్తాడు..!
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్ బలంగా పునరాగమనం చేస్తాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్
Samayam Telugu | Updated:
May 30, 2018, 05:35PM IST
స్టీవ్స్మిత్ బలంగా పునరాగమనం చేస్తాడు..!
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్ బలంగా పునరాగమనం చేస్తాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్స్మిత్ అభిప్రాయపడ్డాడు. గత మార్చిలో కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్, బౌలర్ బ్రాన్క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్కి పాల్పడుతూ దొరికిపోయిన విషయం తెలిసిందే. విచారణలో నేరాన్ని ముగ్గురు క్రికెటర్లు ఒప్పుకోవడంతో.. వార్నర్, స్మిత్పై ఏడాది నిషేధం, బాన్క్రాఫ్ట్పై 9 నెలలు నిషేధం పడింది. అయితే.. ప్రస్తుతం స్టీవ్ స్మిత్.. చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడని అతను వచ్చే ఏడాది బలంగా పునరాగమనం చేస్తాడని గ్రేమ్స్మిత్ వెల్లడించాడు. | 2sports
|
బాహుబలి2 విడుదల తేదీ పొడగించారు
TNN| Aug 5, 2016, 06.30 PM IST
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే సంవత్సరం తెలియనుంది. తెలుగు సినిమా దమ్ము ఏంటో ప్రపంచానికి చూపించిన సినిమా బాహుబలి. ఎస్. ఎస్ రాజమౌళి చెక్కిన ఈ అపురూప దృశ్య కావ్యం భారతీయ సిబీ చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ఇప్పటికీ ఈ సినిమా రికార్డులు సూపర్ స్టార్ సినిమాలు కూడా చేర్కోలేకపోయాయి. ప్రభాస్ ఈ సినిమాతో సూపర్ స్టార్లకే స్టార్ అయిపోయాడు. అయితే బాహుబలి సినిమా ది బిగినింగ్ మాత్రమే తెలుసు దీని కన్క్లూజన్ ఏంటి అనేది తెలుసుకోవటానికి 'బాహుబలి-2' చూడాల్సిందే. ఇప్పటికే కోట్లమంది బాహుబలి- ద కన్క్లూజన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 28, 2017న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు. మొదట ఏప్రిల్ 14నే విడుదల చేస్తామని ప్రకటించినా.. తాజాగా మళ్లీ విడుదల తేదీ మార్చారు. కరణ్ జోహర్ హిందీలో బాహుబలి రైట్స్ కలిగి ఉన్నారు. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ కొనసాగుతోంది. యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తూ యూనిట్ మొత్తం బిజీగా ఉంది. | 0business
|
మోదీపై ఘాటు వాఖ్యలు చేసిన కొరటాల, మోహన్ బాబు
Highlights
వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండే శివ సాక్షాత్తూ భారత ప్రధానిని నరేంద్రమోదీనే టార్గెట్ చేశారు
సినీ నటుడు మోహన్ బాబు సైతం కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు
తన సినిమాల ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడమేకాదు.. ఆ సినిమాల్ని బ్లాక్ బస్టర్స్ గా నిలబెట్టడం కూడా దర్శకుడు కొరటాల శివకున్న దమ్ము. తన గత సినిమాలు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లలో శివ ఎలాంటి మెసేజ్ ఇచ్చారో… దాన్ని ఆడియన్స్ ఎలా తీసుకున్నారో కూడా అందరికీ తెలిసిందే. తాజాగా మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను సినిమా తెరకెక్కిస్తోన్న కొరటాల శివ ఒక సంచలన ప్రకటన చేశారు.
Wen natural disasters occur,we all bcome 1 nd react.I felt a similar disaster occurred 2 d state.Keeping politics nd political parties strictly aside,I as a responsible citizen expressed my agony without any hesitation nd calculation.And I’ll keep on doing it. No politics plsssss
— koratala siva (@sivakoratala) March 8, 2018
Let’s all make @narendramodi ji a MAN by reminding his promise to Andhra Pradesh. Do u honestly feel that telugu states are a part of India sir?
— koratala siva (@sivakoratala) March 7, 2018
వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండే శివ సాక్షాత్తూ భారత ప్రధానిని నరేంద్రమోదీనే టార్గెట్ చేశారు.‘ఆంధ్రప్రదేశ్కు గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసి.. ఆయనను మనిషిగా మారుద్దాం.. తెలుగు రాష్ట్రాలు భారత్లో అంతర్భాగం అని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్..?’ అంటూ సరాసరి మోదీని ప్రశ్నించారు కొరటాల శివ. ఇటీవల రిలీజ్ అయిన తన ‘భరత్ అనే నేను’ టీజర్లో సీఎం పాత్రలో మహేష్ చెప్పిన డైలాగ్స్ను ప్రధానికి అన్వయిస్తూ తన ట్విటర్, ఫేస్బుక్ ఖాతాల్లో శివ పోస్ట్ పెట్టారు.
Why this step motherly treatment to Andhra Pradesh? What did A.P do wrong? What’s going on with Special Status? Even when Telangana is supporting Special Status for A.P, is it just the sentiment of one state? @arunjaitley
— Mohan Babu M (@themohanbabu) March 8, 2018
అటు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సైతం కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు. ఏపీ మీద సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ విమర్శించారు. ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలంగాణే సపోర్ట్ చేస్తుంటే మీకేమైదంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు.
Last Updated 25, Mar 2018, 11:39 PM IST | 0business
|
ఎయిరిండియా విక్రయంపై యూటర్న్!
- సాధారణ ఎన్నికల నేపథ్యంలో సర్కారు వెనుకడుగు
న్యూఢిల్లీ: ఎన్నికల సీజన్ నేపథ్యంలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో (ఏఐ) కీలక వాటా విక్రయమై మోడీ సర్కారు యూటర్న్ తీసుకుంది. ఎయిరిండి యాలో వాటా విక్రయం ఇప్పట్లో ఉండబోదని సీనియర్ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎయిరిండియా వాటా విక్రయాన్ని ఇప్పట్లో చేపట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. అంతేగాక విమానయాన సంస్థ నిర్వహణ కోసం అవసరమైన నిధులను ప్రభుత్వమే సమకూర్చనున్నట్టుగా ఆయన వెల్లడించారు. 'ప్రస్తుతం ఎయిరిండియాలో నిర్వహణ లాభాలు వస్తున్నాయి. ఏ విమానం ఖాళీగా వెళ్లట్లేదు. ఈ లాభాలతో ఎయిర్లైన్ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని నిర్ణయించాం. అందుకే వాటా విక్రయం ఇప్పట్లో అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది.' అని తెలిపారు. కేంద్రమంత్రి అరుణ్జైట్లీ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయెల్, పౌర విమానయాన మంత్రి సురేశ్ప్రభు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక, పౌర విమానయాన శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అప్పుల భారాన్ని తగ్గించేందుకు ఎయిరిండియాలో 76శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం బిడ్డర్లను కూడా ఆహ్వానించింది. బిడ్లు వేసేందుకు మే 31వరకు గడువు ఇచ్చింది. అయితే ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ఏ సంస్థ ముందుకురాని సంగతి తెలిసిందే. దీంతో సర్కారుకు పరాభవం ఎదురైనట్టయింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Anil Roi Gupta
హావెల్స్ సిఎండికి బిజినెస్ లీడర్ అవార్డు
న్యూఢిల్లీ: విద్యుత్ ఉత్పత్తుల అగ్ర శ్రేణి కంపెనీ హావెల్స్ ఇండియా సిఎండి అనిల్ రా§్ుగుప్తాకు ఆలిండియా మేనేజ్మెంట్ అసోసి యేషన్ వర్ధమాన బిజినెస్ లీడర్ అవార్డుతో సత్కరించింది. గోయంకా గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయంకా ఆధ్వర్యంలోని జ్యూరీ అవార్డు విజేత లను ఎంపికచేసింది. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియోలు విశిష్ట అతిధులుగా హాజర య్యారు. ఎఫ్ఎంఇజి కంపెనీగా ప్రారంభించిన హ్యావెల్స్ భారత్దేశవ్యాప్తంగా పటిష్టమైన ఉనికితో ఉంది. పారిశ్రామిక, దేశీయ సర్క్యూట్ ప్రొటెక్షన్ స్విచ్గేర్, కేబుల్స్ వైర్లు, మోటార్లు, ఫ్యాన్లు, పవర్ కెపాసిటర్లు, లూమినరీస్, మాడ్యులర్ స్విచ్లు, వాటర్ హీటర్లు, గృహో పకరణాల విభాగంలో ఎంతోప్రాధాన్యత సంత రించుకుంది. హ్యావెల్స్నుంచి ప్రతిష్టాత్మకమైన క్రాబ్ట్రీ, స్టాండర్డ్ బ్రాండ్లను కూడా సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అనిల్రా§్ు మాట్లాడుతూ యువకులైన, శక్తివంతమైన పరి శోధన అభివృద్ధి వల్లనే ఈ గుర్తింపు లభించిం దని హావెల్స్ బ్రాండ్ విశ్వవ్యాప్తం చేసేందుకు అన్ని విభాగాల నుంచి సమిష్టి కృషి జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. | 1entertainment
|
mitchell starc picks his second hat-trick of the match
చెలరేగిన స్టార్క్.. ఒకే మ్యాచ్లో రెండు హ్యాట్రిక్లు
యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్లతో చెలరేగాడు. ఒకే మ్యాచ్లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించి ఇంగ్లండ్ జట్టుకు హెచ్చరికలు పంపాడు.
TNN | Updated:
Nov 7, 2017, 05:59PM IST
యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్‌లతో చెలరేగాడు. ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించి ఇంగ్లండ్ జట్టుకు హెచ్చరికలు పంపాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన షెపిల్డ్ షీల్డ్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాపై స్టార్క్ అరుదైన ఈ ఫీట్ సాధించాడు. సోమవారం తొలి హ్యాట్రిక్ సాధించిన స్టార్క్.. మంగళవారం మరో హ్యాట్రిక్ తీశాడు. తద్వారా ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ స్టార్క్ చివరి మూడు వికెట్లను కుప్పకూల్చడం విశేషం. స్టార్క్ అద్భుత బౌలింగ్ కారణంగా న్యూ సౌత్ వేల్స్ జట్టు 171 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, స్టార్క్ బౌలింగ్‌ను ఎదుర్కొనే ప్రమాదం తప్పడంతో 11వ నంబర్ బ్యాట్స్‌మెన్ సిమన్ మాకిన్ రెండుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. | 2sports
|
internet vaartha 107 Views
హైదరాబాద్ : వైద్యపరికరాలు, డిస్పోజబుల్స్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న పాలిమెడిక్యూర్ తాజాగా మూత్రపిండాలు, శ్వాసకోశవ్యాధులు, బ్లడ్బ్యాంకింగ్ రంగంలోనికి అడుగుపెట్టింది. రూ.394 కోట్ల పాలిమెడ్సంస్థ అంతర్జాతీయ మార్కెట్ను సైతం కైవసం చేసుకునేదిశగా వెళుతోందని కంపెనీ వైస్ప్రెసిడెంట్ హేమంత్భల్లా వివరించారు. దేశంలో మూత్రపిండాలు, శ్వాసప్రక్రియ, బ్లడ్బ్యాంకింగ్ మార్కె ట్లు శరవేగంతో వృద్ధిచెందుతున్నాయన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో తాము విజయవంతం కాగల మన్న ధీమా వ్యక్తంచేసారు. మరో 100 మంది టీమ్ సభ్యులను జోడించడం ద్వారా మాబృందంమరిత పటి ష్టం అవుతుందని, డీలర్నెట్వర్క్ను 50శాతం వృద్ధి చేస్తామన్నారు. తెలంగాణతోనే తమ మార్కెట్ణు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పాలిమెడ్కు మొత్తం ఆరు ఉత్పత్తికేంద్రాలున్నాయని, వీటిలో నాలుగుభారత్లో ఉంటే మరోరెండు చైనా, ఈజిప్ట్లో కొనసాగుతు న్నా యన్నారు. ఫరీదాబాద్, హర్యానాల్లో రూ.60కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలుసిద్ధం అయ్యా యని 2017మూడోత్రైమాసికంలో విభిన్న ఉత్పత్తులు ప్రారంభిస్తామని హేమంత్భల్లా వివరించారు. కంపెనీకి అగ్రశ్రేణి ఎగుమతి అవార్డులున్నాయన్నారు. ఫార్మాక్సిల్ అవార్డులు సిల్వర్ పేటెంట్ అవార్డును సాధించామని తెలిపారు. కొత్త మార్కెట్కు పాలిమెడ్ ఆధునిక శ్రేణి శ్వాసప్రక్రియ సంరక్షణ ఉత్పత్తులు,మూత్రపిండాల సం రక్షణ ఉత్పత్తులు, బ్లడ్బ్యాంకింగ్ యంత్రపరికరాలు వంటివి మార్కెట్కు విడుదల చేస్తున్నట్లు వివరించారు. | 1entertainment
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
Visit Site
Recommended byColombia
ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రవితేజ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘నేలటిక్కెట్టు’. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన కళ్యాణ్కృష్ణ కురసాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘నేలటిక్కెట్టు’ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మాస్ మహారాజా మంచి ఎనర్జీతో పాత రవితేజను గుర్తుకు తెస్తున్నాడు.
కాగా, ‘నేలటిక్కెట్టు’ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సకుటుంబ సమేతంగా చూసేవిధంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని నిర్మాత రామ్ తాళ్ళూరి తెలిపారు. దాదాపూ 80 శాతం షూటింగ్ పూర్తయిందని, మరో మూడు పాటలు చిత్రీకరించాల్సి ఉందని వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే 24న విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘ఫిదా’ ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఖాయిలా పడే సంస్థల జాబితాను సిద్దం చేస్తోన్న నీతి ఆయోగ్
సరిగా పనిచేయని, మూతపడే స్థితిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన భాజపా ఇప్పుడు మరింత దూకుడుగా వెళుతోంది. ఇందుకోసం నీతి ఆయోగ్ సాయాన్ని తీసుకుంటున్నారు.
TNN & Agencies | Updated:
Feb 27, 2018, 12:00PM IST
స‌రిగా ప‌నిచేయ‌ని, మూత‌ప‌డే స్థితిలో ఉన్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను మూసివేసేందుకు వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయి. ఒక‌ప్పుడు పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ కోసం ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన భాజ‌పా ఇప్పుడు మ‌రింత దూకుడుగా వెళుతోంది. ఇందుకోసం నీతి ఆయోగ్ సాయాన్ని తీసుకుంటున్నారు.
ప్రైవేటీకరించాల్సిన ఖాయిలా ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూ) మరో జాబితాను నీతి ఆయోగ్‌ సిద్ధం చేస్తోంది. ఖాయిలా పడిన 40 పీఎస్‌యూల్లో వ్యూహాత్మకంగా పెట్టుబ‌డుల ఉపసంహ‌ర‌ణ‌ను అమలు చేయాలని ఇప్పటికే సూచించామని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు. ఈ విషయమై దీపమ్‌(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) కసరత్తు చేస్తోందని, ఈ ప్రక్రియ తుది దశలో ఉందని వివరించారు. ఖాయిలా పడిన పీఎస్‌యూలకు సంబంధించిన ఇప్పటికే నాలుగు జాబితాలను పంపించామని, ప్రస్తుతం ఐదో జాబితాను రూపొందిస్తున్నామని, ఆరు, ఏడో జాబితాలను కూడా రూపొందించేందుకు క‌స‌ర‌త‌తు జ‌రుపుతున్నామని పేర్కొన్నారు. పీఎస్‌యూ డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిల్లో సీపీఎస్‌ఈల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.46,500 కోట్లు, వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌(పీఎస్‌యూలో వంద శాతం వాటా విక్రయం) ద్వారా రూ.15,000 కోట్లు, బీమా కంపెనీల లిస్టింగ్‌ ద్వారా రూ.11,000 కోట్లు సమీకరించనున్నారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా కేంద్రం రూ. లక్ష కోట్లు సమీకరించింది.
బ‌డ్జెట్ ల‌క్ష్యంలో భాగంగా ఉన్న అంచ‌నాల్లో రూ.72,500 కోట్లుండ‌గా ప్ర‌భుత్వం రూ.1 ల‌క్ష కోట్ల‌కు పైగానే ఆర్జించింది. నీతి ఆయోగ్ సంస్థ‌కు 2017-18 సంవ‌త్స‌రంలో 279.79 కోట్ల బ‌డ్జెట్ కేటాయింపులు జ‌ర‌ప‌గా, ఈ ఏడాది అంటే 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో 20% పెంపుద‌ల‌తో రూ.339.65 కోట్ల‌ను కేటాయించారు. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వాట్ ఏ క్యాచ్.. ఇలా క్యాచ్ పట్టడం చూశారా?
బ్యాట్స్మెన్ స్వీప్ షాట్ ఆడాడు.. ఫీల్డర్ అతడి పక్కనే షార్ట్ లెగ్లో ఉన్నాడు. అలాంటప్పుడు క్యాచ్ పట్టడం సాధ్యమేనా?
TNN | Updated:
Mar 26, 2017, 02:45PM IST
హమిల్టన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ ప్లేయర్ టామ్ లాథమ్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. సౌతాఫ్రికా 190/5తో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న దశలో ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్‌ను డిఫరెంట్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. శాంట్నర్ ఫుల్ బాల్ విసరగా.. డుప్లెసిస్ దాన్ని స్వీప్ షాట్ ఆడాడు. బ్యాట్స్‌మెన్ పక్కనే షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లాథమ్ ఒంటి చేత్తో దాన్ని ఒడిసి పెట్టుకున్నాడు. బ్యాట్స్‌మెన్ కదలికలను తీక్షణంగా గమనిస్తోన్న లాథమ్... స్వీప్ షాట్ ఆడేందుకు డుప్లెసిస్ ముందుకు వంగగానే వెనక్కి వెళ్లి.. తన నుంచి దూరంగా వెళ్తోన్న బంతిని గాల్లోకి ఎగిరి మరీ అందుకున్నాడు.
లాథమ్ సూపర్ క్యాచ్ చూసిన కివీస్ ప్లేయర్లు అతణ్ని అభినందించకుండా ఉండలేకపోయారు. లాథమ్ అద్భుతమైన ఫీల్డింగ్ కారణంగా సఫారీల కెప్టెన్ 53 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో రోజు ఆట ముగిసే న్యూజిలాండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. లాథమ్ 42 రన్స్, జీత్ రావల్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. | 2sports
|
Visit Site
Recommended byColombia
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... భారతీయ సినీ జగత్తు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రభాస్-సుజిత్-యువి క్రియేషన్స్ భారీ చిత్రానికి ' సాహో ' అనే టైటిల్‌ను ఖరారు చేశాం. ఈ హై టెక్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందించబోతున్నాం.
ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగం కానున్నారు. మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో విదేశాల్లో చిత్రీకరిస్తున్నాం.
బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్‌ను అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్ లాంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం.
ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్‌గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న సాహో చిత్ర ఫస్ట్ లుక్ అఫీషియల్ టీజర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న బాహుబలి 2 చిత్రంతో పాటు ప్రదర్శించనున్నాం. సో... ఏప్రిల్ 28వ తేది ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా అనే చెప్పాలి.
సాహో స్టైలిష్ యాక్షన్ టీజర్‌ను పెద్ద తెర పై చూసి ఆస్వాదించండి. అన్ని హంగులతో భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ‘సాహో’ దేశవ్యాప్తంగా అభిమానులను అలరిస్తుంది అని ఆశిస్తున్నామని అన్నారు. | 0business
|
క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఎమోషనల్ మూవీస్
First Published 10, Jul 2019, 8:54 AM IST
ఇండియాలో క్రికెట్ కు ఏ రేంజ్ లో ఆదరణ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ కాన్సెప్ట్ తో సినిమాను కరెక్ట్ గా తెరకెక్కిస్తే హిట్టవడం కాయం. అందులో కొన్ని ఎమోషనల్ గా తెరకెక్కిన సినిమాలపై ఓ లుక్కేద్దాం..
లగాన్: బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక చిన్న గ్రామంలోని ప్రజలు పన్ను కట్టలేక సతమవుతున్న తరుణంలో మూడేళ్ళ పన్ను మినహాయింపు ఇస్తామని క్రికెట్ ఛాలెంజ్ విసురుతారు. ఆ విధంగా అమిర్ టీమ్ ఏ విధంగా సక్సెస్ అయ్యిందనేది అసలు కథ. కథలో పలు ఎమోషనల్ సీన్స్ అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి.
గోల్కొండా హై స్కూల్: చిన్నారుల టాలెంట్ ని అలాగే వారి మనస్తత్వాన్ని ఈ సినిమాలో కరెక్ట్ గా చూపించారు.
జెర్సీ: క్రికెట్ ను ఇష్టంగా ఆడే ఒక కుర్రాడు అదే క్రికెట్ తో ప్రాణహాని ఉందని ఫ్యామిలీ కోసం ఆటను పక్కనపెడతారు. అలాగే చివరికి అదే క్రికెట్ కారణంగా ప్రాణాలు విడువడం సినిమాలో ఎమోషనల్ పాయింట్.
మజిలీ: ప్రేమలో విఫలమైన ఒక క్రికెటర్ అమ్మయి మిస్ అవ్వడంతో క్రికెట్ ను కూడా వదిలేస్తాడు. ఈ కథలో క్రికెట్ ఎక్కువగా లేకపోయినా నాగ చైతన్య పలు క్రికెట్ సీన్స్ లో ఆ ఫీల్ ను కలిగిస్తాడు.
వసంతం: ఈ సినిమాలో కూడా క్రికెట్ ఎక్కువగా కనిపించదు గాని స్ట్రగుల్ అవుతున్న క్రికెటర్ గా వెంకటేష్ కనిపిస్తాడు.
ధోని నాట్ అవుట్: ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో - పూరి తనయుడు ఆకాష్ నటించిన ఈ ఎమోషనల్ కథ ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. క్రికెట్ ను ఇష్టపడే ఆకాష్ చదువును అంతగా పట్టించుకోడు. టాలెంట్ కి సంబందించిన సీన్స్ అలాగే తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో హైలెట్.
ఎమ్.ఎస్.ధోని: క్రికెట్ ధోని జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ లో ఎమోషనల్ లవ్, అండ్ జర్నీ. అన్ని అంశాలు యూత్ ని ఆకట్టుకుంటాయి.
సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో చేదు అనుభవాలు హార్ట్ ని టచ్ చేస్తాయి.
అజర్: మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత ఆధారంగా వచ్చిన ఈ బయోపిక్ లో అజర్ ఎదుర్కొన్న విమర్శలు ఎన్నో ఆలోచనలను కలిగిస్తాయి.
కౌసల్యా కృష్ణమూర్తి: టీమిండియా జట్టులో చోటు సంపాదించుకోవడానికి ఒక సాధారణ రైతు కూతురు పడే తపన సినిమాలో హైలెట్. టీమ్ లో స్థానం సంపాదించుకొని జట్టుకు ఎలాంటి విజయాల్ని అందించింది అనే అంశంతో సినిమా తెరకెక్కుతోంది. భీమనేని శ్రీనివాసరావ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
83: కపిల్ దేవ్ బయోపిక్- 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో తెరక్కుతున్న ఈ సినిమాలో కపిల్ వరల్డ్ కప్ అందించడానికి ఒక కెప్టెన్ గా ఎంత కష్టపడ్డాడు అనేది సినిమాలో ఎమోషనల్ గా చూపించనున్నారు.
Recent Stories | 0business
|
Carrola Altis
టయోటా నుంచి కొత్త కరోల్లా ఆల్టిస్
హైదరాబాద్: టయోటా కిర్లోస్కర్ కంపెనీనుంచి కొత్తగా ఆధునీకరిం చిన కరోల్లా ఆల్టిస్ విడుదలయింది. సూపర్ సివిటి-1 ఏడుస్పీడ్ షిప్ట్మేటిక్, స్పోర్ట్ మోడ్ ప్యాడిల్ షిఫ్ట్తో వస్తోంది. కొత్తగా వచ్చిన కరోల్లా ఆల్టిస్కు ఏడు ఎస్ఆర్ఎస్ ఎయిర్బ్యాగ్స్, వాహణ స్థిరత్వ నియంత్రణ, ఎబిఎస్, ఇబిడి వంటి భధ్రతాఫీచర్లు ఉన్నాయి. ఫ్యాంథమ్బ్రౌన్ రంగులో వస్తున్న కరోల్లా కొత్త ఆల్టిస్ న్యూఢిల్లీ ఎక్స్ షోరూం ధరగా 15,87,500గా నిర్ణయించారు. వీటిలో విల్ సివిటి, జిఎల్ ఎంటి, జి సివిటి, జిఎంటి వెర్షన్లు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ రూ.15,87,500 నుంచి రూ.19,91,500వరకూ ఉన్నాయి. డీజిల్ వెర్షన్లో డిజిఎల్ ఎంటి 19,05 లక్షలు, డిజిఎంటి ధరలు రూ.17,36లక్షలుగా ఉన్నాయి. బైబీమ్ లెడ్ హెడల్ల్యాంపులు, లెడ్ డేటైమ్ రన్నింగ్ ల్యాంపు లు, 3డి బంపర్ డిజైన్, అత్యాధునిక గ్రిల్ డిజైన్, స్టైలిష్ లెడ్ టెయిల్ల్యాంప్, సాఫిస్టికేటెడ్ న్యూ అల్లాయిస్ ఉన్నాయి. | 1entertainment
|
Hyderabad, First Published 8, Jul 2019, 3:48 PM IST
Highlights
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవల 'గేమ్ ఓవర్' చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ మరో సినిమా సైన్ చేసింది.
దర్శకుడు అనుభవ్ సిన్హాతో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇలాంటి సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, ఇప్పుడు ఆ కల నెరవేరబోతుందని చెబుతూ ఆ దర్శకుడితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకొంది.
ఈ పోస్ట్ చూసిన ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. 'అభినవ్ సర్.. మీరు సినిమాలో తాప్సికి బదులు మరో నటిని ఎన్నుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.. తాప్సికి అసలు నటించడమే రాదు' అని అన్నాడు.
ఇది చూసిన తాప్సి.. 'సారీ యార్.. ఇప్పుడేం చేయలేవ్.. ఎందుకంటే సినిమాకు ఆల్రెడీ సైన్ చేసేశాను. ఇప్పుడు అనుభవ్ సర్ నన్ను తీసేయాలని నిర్ణయించుకున్నా.. అది నేను జరగనివ్వను.. ఒక పని చెయ్.. నేను మరో సినిమాకు సైన్ చేసేలోపు ఆ సినిమాలో నన్ను ఎవరూ తీసుకోకుండా ఆపి చూడు' అని సవాల్ విసిరింది.
Sorry yaar, ab toh sab kuch sign n seal ho chuka hai. Ab toh sir ko main hi nahi nikaalne dungi. But ek kaam karo, agli wali ke liye rok lo kyunki shayad woh bhi main lock karva lu jald hi. #TryAgain https://t.co/vK7avyN8XR
— taapsee pannu (@taapsee) July 7, 2019
Last Updated 8, Jul 2019, 3:48 PM IST | 0business
|
ఎన్పీఏలు పెరగడం మంచి పరిణామం కాదు!
- రాజన్ బ్యాంకింగ్ను గాడిలో పెట్టారు
- దేశంలో రుణ మంజూరీ తగ్గుతోంది
- 7.5% వృద్ధిని అందుకోగలమని విశ్వసిస్తున్నా
- కరూర్ వైశ్యా బ్యాంక్ శతాబ్ది ఉత్పవాల్లో రాష్ట్రపతి ప్రణబ్
చెన్నై: దేశ బ్యాంకింగ్ వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమైనవని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పలు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశ బ్యాంకింగ్ వ్యవస్థ సరైన దిశగా పయనింపజేసేందుకు రాజన్ పలు చర్యలు చేపట్టారని ప్రశంసించారు. కరూర్ వైశ్యా బ్యాంక్ శతాబ్ది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బ్యాకింగ్ రంగం ఎన్పీఏలను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాజన్ పలు సరైన చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. 'వస్తు సేవల పన్ను' (జీఎస్టీ) సవరణ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు వివరించిన ప్రణబ్, త్వరలోనే సర్కారు జీఎస్టీ పన్ను రేటు నిర్ధారించేందుకు 'జీఎస్టీ కౌన్సిల్'ను త్వరలో ఏర్పాటు చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. మూలాలు బలంగా ఉండడం.. మేటి సూక్ష్మ గణాంకాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పని తీరును ప్రదర్శిస్తోందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశం 7.5 శాతం వృద్ధిని అందుకోగలదన్న అంచనాతో ఉన్నట్లు తెలిపారు.
ఎన్పీఏలు పెరగడం సబబు కాదు...
బ్యాంకులు 'నిరర్ధక ఆస్తుల' (ఎన్పీఏ) బెడదను ఎదుర్కొనేందుకు భారీ మొత్తంలో కేటాయింపులు జరపాల్సిరావడం ఆరోగ్యకరమైన పరిణామం కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. దేశంలో రుణాలు అందించేందుకు ఉన్న ఒకే ఒక్క ఆదారం వాణిజ్య బ్యాంకులని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి అవసరమై తాజా రుణ వితరణ ఎన్పీఏ కేటాయింపులు మూలంగా పరిమితం చేయాల్సిన పరిస్థితులు నెలకొందన్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని మన దేశీయ బ్యాంకులు దృఢంగా నిలబడ్డాయని అన్నారు. కానీ.. ఇప్పుడు ఎన్పీఏలు బ్యాంకులకు గుదిబండలా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2015 మార్చి నాటికి రూ.73,887 కోట్లుగా ఉన్న ఎన్పీఏ కేటాయింపులు 2016 మార్చి నాటికి రూ.1,70,630 కోట్లకు చేరినట్లుగా తెలిపారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదని ఆయన అన్నారు.
నగదు రహిత వ్యవస్థ దిశగా అడుగులు..
దేశంలో టెక్నాలజీ విప్లవం కారణంగా దేశం నగదురహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరుగులు పెడుతోందని మహారాష్ట్ర, తమిళనాడుల గవర్నర్ సి.విద్యాసాగర్రావు అన్నారు. రానున్న కొద్ది రోజుల్లోనే దేశం ప్రయత్నంలో సఫలం కాగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఉద్యోగాలకల్పన, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ కంపెనీలకు ఊతం ఇవ్వడంలో బ్యాంకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా గవర్నర్ వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
India vs New Zealand 2017-18, 2nd T20I at Rajkot: SCA insures tie for INR 5 crores
రెండో టీ20కి రూ.5 కోట్ల బీమా..!
భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్కి ముందస్తు జాగ్రత్తలో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) రూ.
TNN | Updated:
Nov 3, 2017, 12:54PM IST
భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కి ముందస్తు జాగ్రత్తలో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ) రూ. 5 కోట్లు బీమా చేయించింది. రాత్రి 7 గంటలకి రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా.. రాజ్‌కోట్ టీ20లో కూడా గెలిచి ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ని గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.
‘మ్యాచ్‌ కోసం రాజ్‌కోట్ స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 28 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న స్టేడియం మొత్తం నిండిపోయే అవకాశం ఉంది. ఇరు జట్ల ఆటగాళ్లు రెండు విమానాల్లో ఇక్కడికి వస్తారు. ఏదైనా అనివార్య కారణాల వల్ల మ్యాచ్‌‌ ఆగిపోతుందేమోనని.. ముందు జాగ్రత్తగా ఎస్‌సీఏ రూ.5 కోట్లు బీమా చేయించింది’ అని ఎస్‌సీఏ మీడియా మేనేజర్ హిమాన్షు వెల్లడించాడు. 2013, అక్టోబరు 10న ఈ వేదికపై ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘ఇంటిలిజెంట్’ ఫస్ట్లుక్: వినాయక్ మార్క్ మిస్!
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ ఫస్ట్లుక్తో వచ్చేశాడు.
TNN | Updated:
Jan 22, 2018, 06:21PM IST
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ ఫస్ట్‌లుక్‌తో వచ్చేశాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ‘ఇంటిలిజెంట్’ ఫస్ట్ లుక్‌‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది చిత్ర యూనిట్. విన్నర్, జవాన్ చిత్రాలతో సక్సెస్‌ను అందుకోలేకపోయిన సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ చిత్రంలో హిట్ ట్రాక్ ఎక్కేందుకు మాస్ డైరెక్టర్ వినాయక్‌ను నమ్ముకున్నారు.
తాజాగా విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ వినాయక్ స్టైల్‌కి భిన్నంగా ఉంది. వినాయక్ సినిమాల్లో హీరోలను బాగా ప్రమోట్ చేస్తారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలను ఎలా చూడాలనుకుంటారో.. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వినాయక్ తాజాగా సాయి ధరమ్ తేజ్‌ను సింపుల్ లుక్‌లో చూపించారు. సాయి ధరమ్ తేజ్ సీరియస్ లుక్‌తో గాయాలతో ఉండగా.. ‘ఇంటిలిజెంట్’ అనే అక్షరాలతో సాయి ధరమ్ తేజ్ ఫేస్‌ను సగం కవర్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలాడు వివి వినాయక్. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీని తప్పించాలని 2012లోనే స్కెచ్
భారత్కి 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్ని అందించిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తర్వాత ఏడాదే నాయకత్వ బాధ్యతల నుంచి
TNN | Updated:
Oct 27, 2017, 09:53AM IST
భారత్‌కి 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌‌ని అందించిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తర్వాత ఏడాదే నాయకత్వ బాధ్యతల నుంచి పక్కకి తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించారట. ఈ విషయాన్ని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ తాజాగా ‘డెమోక్రసీస్‌ ఎలెవన్‌ : ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ’ పుస్తకం ద్వారా వెల్లడించారు. అయితే.. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసన్ ఈ నిర్ణయాన్ని తిరస్కరించడంతో సెలక్టర్లు వెనక్కి తగ్గారట. 2014, డిసెంబరులో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ .. ఈ ఏడాది జనవరిలో టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకి తప్పుకున్న విషయం తెలిసిందే.
‘ధోనీ సారథ్యంలో అద్భుతంగా ఆడిన భారత్ జట్టు 2011లో ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత ఏడాదే అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని మొహిందర్ అమరనాథ్ అధ్యక్షుడిగా ఉన్న సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. కానీ.. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో నేను ఆ నిర్ణయాన్ని తిరస్కరించాను. అలా చేయడం పక్షపాతం అని మీరు అనుకోవచ్చు. కానీ.. 2007‌లో టీ20 ప్రపంచకప్, 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ని భారత్‌కి అందించిన గొప్ప కెప్టెన్‌కి నేనిచ్చిన గౌరవం అదేనని నా నమ్మకం’ అని శ్రీనివాసన్ ఆ పుస్తకంలో తన అభిప్రాయన్ని స్పష్టం చేశారు. 2013లో తనపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంపై ధోనీ కూడా ఈ పుస్తకం ద్వారా స్పందించాడు. ‘ఒకవేళ నేను బాగా ఆడకపోతే విమర్శించండి.. తప్పులేదు. కానీ.. ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపించకండి. క్రికెట్ వల్లే నేను ఈ స్థాయికి ఎదిగాను. అప్పట్లో నాపై ఆరోపణలు మీడియాలో మరీ బాధించేలా వచ్చాయి’ అని ధోనీ వెల్లడించాడు. | 2sports
|
854 కోట్లకు ఎస్బీహెచ్ నిర్వహణ లాభం
- అధిక 'ప్రొవిజన్'లతో 44.6 శాతం తగ్గిన నికర లాకర లాభం
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ నికర లాభాలు 44.6 శాతం క్షీణించి రూ.185 కోట్లకు చేరాయి. 2014-15 ఇదే కాలంలో బ్యాంక్ రూ.334 కోట్ల లాభాలను సాధించింది. నిరర్ధక ఆస్తులను ప్రక్షాళన చేయాలని, తద్వారా మొండి బాకీల సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవాలని రిజర్వు బ్యాంకు చేసిన సూచనలకు అనుగుణంగా తీసుకున్న 'ప్రొవిజన్' కేటాయింపు నిర్ణయాల నేపథ్యం కారణంగానే నికర లాభాలు తగ్గాయని ఎస్బీహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) శాంతనూ ముఖర్జీ తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఆయన బ్యాంకు క్యూ3 ఆర్ధిక ఫలితాలు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 2015, మార్చి 2016 త్రైమాసికాల్లో 'అసెట్ క్వాలిటీ రివ్యూ' (ఎక్యూఆర్) చేయాలని ఆర్బీఐ సూచించిందన్నారు. ప్రస్తుత త్రైమాసికంలోనూ ఈ విధానం కొనసాగుతుందన్నారు. క్రితం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు నిర్వహణ లాభాలు 9.76 శాతం పెరిగి రూ.854 కోట్లకు చేరాయని ముఖర్జీ పేర్కొన్నారు. స్థూల నిరర్ధక ఆస్తులు 5.32 శాతం నుంచి 5.28 శాతానికి నియంత్రించబడ్డాయని పేర్కొన్నారు. గత క్యూ3లో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం 10.77 శాతం పెరిగి రూ.1,203 కోట్లకు చేరింది. క్రితం ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.1,086 కోట్లుగా నమోదయ్యింది. ఇదే సమయంలో అడ్వాన్సులల్లో 9.04 శాతం, డిపాజిట్లలో 7.26 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. పర్సనల్ సెగ్మెంట్ రుణాలు 16.79 శాతం వృద్ధితో ఆకర్షణీయంగా ఉన్నాయని ముఖర్జీ పేర్కొన్నారు. గృహ రుణాలు 18 శాతం పెరిగాయన్నారు. ప్రస్తుత నాలుగో త్రైమాసికంలో కార్పొరేట్ రుణాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
internet vaartha 142 Views
హైదరాబాద్ : పదిలక్షల జూపిటర్ స్కూటర్లను విక్రయించిన సందర్భంగా టివిఎస్ మోటార్ కంపెనీ కొత్తగా జూపిటర్ మిలియన్ ఆర్ స్పెషల్ ఎడిషన్ విడుదల చేసింది. జూపిటర్ స్కూటర్ను విడుదల చేసిన 30 నెలల్లోపే పదిలక్షలు విక్రయించినట్లు ప్రకటించింది. ప్రస్తుత మిలియన్ ఆర్ స్కూటర్లో పది అదనపు ఫీచర్లు ఉన్నాయి. రాయల్వైన్ కలర్లో వస్తున్నది. మార్కెటింగ్ వైస్ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ పదిలక్షల కుటుంబాలకు చేరువైన సందర్భంగా మిలియన్ ఆర్ ఎడిషన్ విడుదలచేసినట్లు వెల్లడించారు. 110సిసి ఇంజన్తో వస్తున్న అంతా అల్యూమినియం బాడీతో టివిఎస్ జూపిటర్ను రూపొందించారు. మెటల్ బాడీతో ఉన్న జూపిటర్ ఢిల్లీ ఎక్స్షోరూంధరగా 53,034 రూపాయలుగా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని డీలర్షిప్ల వద్ద జూపిటర్ మిలియన్ఆర్ లభిస్తుందని వివరించారు. | 1entertainment
|
Offers
ఐడియా, బిఎస్ఎన్ఎల్ల ఆఫర్ల జోరు!
న్యూడిల్లీ: టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యూలర్ వన్జిబి అంతకుమించిన డేటాప్లాన్లను 2జి, 3జ4జి, 4జి నెట్వర్క్పై అదేధరకు అందిం చాలని నిర్ణయించింది. ఐడియా ఇప్పటికే ఓపెన్ మార్కెట్ డేటా రీఛార్జీలు వన్జిబి అంతకుమించిన వాటిని 2జి, 3జి,4జి నెట్వర్క్పై ఎలాంటి తేడా లేకుండా అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈనెల 31వ తేదీనుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఐడియా మొబైల్ ఇంటర్నెట్ ప్లాన్లు విభిన్న రేట్లతో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న గట్టిపోటీ వాతావరణం వల్ల ఆర్జియో దెబ్బకు విలవిలలాడుతున్న కంపెనీ ల్లో ఐడియా కూడా చేరింది. 2జి సేవలకంటే చౌక ధరలకు 4జి అందిస్తోంది. 1జిబి 2జి సేవలు 170 రూపాయలకు అందిస్తోంది. 4జి స్పీడ్తో 123 రూపాయలకే అందిస్తోంది. అంతకుముందు డేటా ప్లాన్లు డౌన్లోడ్ స్పీడ్ ఆధారంగా నడిచేవి. అన్ని డేటా ప్యాలక్లు ఫ్రీడమ్ ప్యాక్లు కూడా ఒకేధరకు దేశవ్యాప్తంగా అందించాలని నిర్ణయించింది. మే 31వతేదీనాటికి దశలవారీగా అమలవుతాయి. ప్రస్తు తం నాలుగు లక్షల పట్టణాలు, గ్రామాలకు 2జి కవ రేజిఉంది. కస్టమర్లు నిరంతరాయంగా నెట్సేవలను అందించేందుకు వీలవుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్ డౌన్లోడ్కు అనుగుణంగా మొత్తం ఆఫర్లు అందించాలని నిర్ణయింంది. అదేరీతిలో జియో దెబ్బకు ప్రభుత్వరంగంలోని బిఎస్ఎన్ఎల్ కూడా 2జిబి డేటాను ప్రతిరోజూ అందించేందుకు నిర్ణయిం చింది. అయితే 339 రీఛార్జి చేసుకుంటే ఈ సౌల భ్యం అందుబాటులోకి వస్తుంది. బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ప్రకటించిన డేటాప్లాన్లు మంచి ఆకర్ష ణీయంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 2జిబి 3జి డేటా రోజుకు అపరిమిత వాయిస్ కాలింగ్ నెట్వర్క్తో వస్తోంది. ఇందుకు 339 చెల్లించుకోవాలి. కాంబో ఎస్టివి ప్లాన్ కింద బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. 28 రోజుల కాలపరిమితితో ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 16వ తేదీనుంచే అమలులో ఉంటుంది.
90రోజులకు మాత్రమే ఈ ఆఫర్ను పరిమితంచేసింది. అపరిమిత డేటా ఆఫర్ కూడా సహేతుక వినియోగ పాలసీ కింద రోజుకు 2జిబి అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్కాల్స్ తన నెట్వర్క్లో అందిస్తోంది. బిఎస్ ఎన్ఎల్ నెట్వర్క్ కాని వాటికి రోజుకు 25 నిమి షాలు ఉచితంగా అందిస్తుంది. 25నిమిషాలు దాటి న తర్వాత కాల్ఛార్జినిమిషానికి 25పైసలుగా ఉం టుంది. రోజుకు2జిబి డేటా అనేది టెలికాం రంగం లోనే అత్యంత ఆకర్షణీయమైన ప్లాన్ అని వెల్లడిం చింది. బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ ఆర్కె మిట్టల్ మాట్లా డుతూ కస్టమర్లకు మరింతగా సేవలను మెరుగు పరుస్తూ ఇటువంటి వాటికి మరింతగా అందిస్తామ ని వెల్లడించారు. ఇప్పటికేఎయిర్టెల్ 28జిబి డేటా ను రూ.345కేఅందిస్తున్నట్లు ప్రకటించింది. జియో కు పోటీగా ఈసంస్థలన్నీ ఇబ్బడిముబ్బడిగా సేవలు ప్రకటించాయి. ప్రస్తుతం రిలయన్స్ జియో రోజుకు వన్జిబి 4జి డేటాను అందిస్తోంది. అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాలింగ్ ఈనెల 31వతేదీవరకూ అందిస్తు న్నది. అనంతరం ప్రైమ్సేవలు ప్రారంభం అవుతాయి. 303ఆఫర్తో రోజుకు వన్జిబి డేటాను అందిస్తున్నది. | 1entertainment
|
ghambhir singh
స్లెడ్జింగ్ వల్లే ఆటలో హుషారు: గంభీర్
న్యూఢిల్లీ: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్లో ఇప్పటికే మూడు టెస్టులు ముగిశాయి.ఇరు జట్లు చెరో టెస్టును గెలిచి 1-1తో సమంగా ఉన్నారు.రాంచీ టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సిరీస్లో ఆటతో పాటు వివాదాలు కూడా చుట్టముట్టాయి.బెంగళూరు టెస్టులో జరిగిన డిఆర్ఎస్ రివ్యూ వివాదంతో పాటు తాజాగా రాంచీ టెస్టులో కోహ్లీ గాయంపై ఆసీస్ ఆటగాళ్లు ఎగతాళి చేయడం, కెప్టెన్ కోహ్లీ కూడా అదేవిధంగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.ఈ వివాదాలపై టీమిండియా ఆటగాడు గంభీర్ స్పందించాడు. స్లెడ్జింగ్ అనేది ఆటలో ఒక భాగమనే విధంగా ఆయన పేర్కొన్నాడు. దీని వల్ల ఆటలో భిన్న మార్పులు చోటు చేసుకుంటాయని, కొన్ని సందర్భాలలో ఆసక్తికర సంఘటనలు జరుగుతాయన్నాడు. బ్యాట్,బంతి వరకు మాత్రమే పరి మితమైన క్రికెట్లో మజా ఉండదని, అయితే వ్యక్తిగత కక్ష పెం చుకునేందుకు మాత్రం పరిస్థితులు దారితీయకూడదని వివరిం చాడు. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు స్లెడ్జింగ్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే స్లెడ్జింగ్ వల్ల ఆటలో మజా వస్తుంది. అయితే ఈ సిరీస్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఔట్ విషయంలో డిఆర్ఎస్ రివ్యూ కోసం చేసిన తప్పిందంతో ఆట మరింత రసవత్తరంగా మారింది అని గంభీర్ పేర్కొ న్నాడు. ఆటగాళ్లు రోబోలేం కాదు కనుక కొన్నిసార్లు స్లెడ్జింగ్ చేస్తారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు కొన్ని బాధ్యతలు ఉం టాయి. అయితే ఏంచేసినా వ్యక్తిగత దూషణ చేయకూడదు. ఆట వరకే అది పరిమితం కావాలి. గత రెండు టెస్టులు క్రికెట్ అభిమానులకే కాదు, తాజా,మాజీ క్రికెటర్లకు వినోద విందును రుచిచూపించాయి అని గంభీర్ వివరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరో నిర్ణయించే ధర్మశాల టెస్టు మార్చి 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టీమిండియా మ్యాచ్ ఫెవరేట్గా బరిలోకి దిగుతుంది.గత రెండు టెస్టుల్లో టీమిండియా అద్భుతమైన ఆటను ప్రదర్శించిందన్నాడు. చివరి టెస్టులో తప్పక విజయం సాధిస్తుందని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
చివరి రెండు వన్డేలు.. కివీస్ జట్టులోకి డేంజరస్ ఆల్రౌండర్
ఇప్పటికే 0-3 తేడాతో భారత్కు సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ తుది రెండు వన్డేలకు రెండు మార్పులు చేసింది. లంకపై సత్తా చాటిన నీషామ్తోపాటు టాడ్ ఆస్ట్లేకు చోటు కల్పించింది.
Samayam Telugu | Updated:
Jan 28, 2019, 06:46PM IST
వన్డే సిరీస్ను ఇప్పటికే భారత్కు సమర్పించుకున్న న్యూజిలాండ్ .. చివరి రెండు వన్డేలకు జట్టులో రెండు మార్పులు చేసింది. ఇష్ సోధీ, బ్రాస్వెల్ను జట్టు నుంచి తప్పించిన కివీస్.. వారి స్థానంలో జేమ్స్ నీషామ్ , టాడ్ ఆస్ట్లేలకు అవకాశం కల్పించింది. గాయం కారణంగా వీరిద్దరూ తొలి మూడు వన్డేలకు దూరమయ్యారు. వరుసగా మూడు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడి సిరీస్ కోల్పోయిన కివీస్.. చివరి రెండు వన్డేల్లోనైనా గెలుపొంది పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
ఏడాదిన్నర విరామం తర్వాత క్రికెట్లోకి అడుగుపెట్టిన నీషామ్.. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో సత్తా చాటాడు. ఆఖరి ఓవర్లలో బ్యాట్తో చెలరేగి న్యూజిలాండ్కు మెరుపు వేగంతో భారీ స్కోరు అందించాడు. లంకపై మూడు వన్డేల్లో 47*, 64, 12* చొప్పున పరుగులు చేసిన ఈ ఆల్రౌండర్ ఆరు వికెట్లు కూడా పడగొట్టాడు.
చివరి రెండు వన్డేలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సమీపిస్తోన్న నేపథ్యంలో మేనేజ్మెంట్ కోహ్లికి రెస్ట్ ఇచ్చింది.
న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టాడ్ ఆస్ట్లే, ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్హోమ్, లాకీ ఫెర్గ్యుసన్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), కొలిన్ మున్రో, జిమ్మీ నీషామ్, హెన్రీ నికోలస్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, రాస్ టేలర్. | 2sports
|
Hyderabad, First Published 16, Aug 2019, 12:30 PM IST
Highlights
ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా జులై 13న పెమ్బ్రోక్షైర్ X నార్బెత్ జట్ల మధ్య కౌంటీ క్రికెట్ జరిగింది. ఆ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన జాన్ విలియమ్స్(80) తలకు బంతి తగలడంతో తీవ్ర గాయమైంది.
క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. బాల్ తలకు తగిలి ఓ అంపైర్ మృతి చెందాడు. ఈ సంగటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది. అంపైర్ తలకు బాల్ గత నెలలో తగలగా...ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. నెల రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా జులై 13న పెమ్బ్రోక్షైర్ X నార్బెత్ జట్ల మధ్య కౌంటీ క్రికెట్ జరిగింది. ఆ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన జాన్ విలియమ్స్(80) తలకు బంతి తగలడంతో తీవ్ర గాయమైంది.
గాయపడిన వెంటనే విలియమ్స్ను కార్డిఫ్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా కోమాలోకి వెళ్లాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హావర్ఫోర్డ్వెస్ట్లోని మరో ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పెమ్బ్రోక్షైర్ క్రికెట్ క్లబ్ గురువారం ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపింది. ‘అంపైర్ జాన్ విలియమ్స్ గురించి చేదు వార్త వినాల్సివచ్చింది. ఈ ఉదయం ఆయన ఆస్పత్రిలో మృతిచెందారు. పెమ్బ్రోక్షైర్ క్రికెట్ తరఫున సంతాపం తెలుపుతున్నాం’ అంటూ ట్వీట్ చేసింది.
Last Updated 16, Aug 2019, 12:30 PM IST | 2sports
|
volly ball team
జగిత్యాల జిల్లాల్లో బాస్కెట్బాల్ పోటీలు
జగిత్యాల: రాZష బాస్కెట్బాల్ అండర్ 19 పోటీలు జగిత్యాల జిల్లాలో నిర్వహిస్తుండగా క్రీడా కారులు మంగళవారం హోరా హోరీగా తలబడ్డారు. జగిత్యాలలోని మిని గ్రౌండ్లో రాZష స్థాయి అండర్ 19 జూనియర్ బాలబాలికల బాస్కెట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో రాZషం నుండి 10 బాలుర, 7 బాలికల టీమ్లు హాజరయ్యాయి. మంగళవారం నిర్వహించిన పోటీలలో బాలికలలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లా జట్లు ఫైనల్కు వెళ్లగా బాలుర విభాగంలో రంగారెడి, నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం సెమీ ఫైనల్కు వెళ్లాయి. క్రీడాకారులు నువ్వానేనా అన్నట్లు హోరాహోరిగా తలపడి ఫైనల్కు రెండు బాలికల జట్లు చేరుకోగా, 4 బాలుర జట్లు సెమీ ఫైనల్కు చేరకున్నాయి. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల కార్యదర్శి మధుజాన్సన్, పిడిలు కె. రవి, విశ్వప్రసాద్, క్రిష్ణ ప్రసాద్, పిఈటిలు అజ§్ుబాబు, విద్యాసాగర్, వేణు, సామంత్, సతీష్, విజ్ఞాన్, మంగ తదితరులు ఉన్నారు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇండోర్ టీ20: టాస్ గెలిచాడు.. మళ్లీ బ్యాటింగ్కు పిలిచాడు!
ఇండోర్ టీ20లో శ్రీలంక టాస్ గెలిచింది. వరసగా రెండోసారి టాస్ గెలిచిన లంక జట్టు కెప్టెన్ తిసారా పెరీరా భారత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
TNN | Updated:
Dec 22, 2017, 07:35PM IST
ఇండోర్ టీ20లో శ్రీలంక టాస్‌ గెలిచింది. వరసగా రెండోసారి టాస్ గెలిచిన లంక జట్టు కెప్టెన్‌ తిసారా పెరీరా భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వరసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఈ మ్యాచ్‌లోనైనా గెలచి పరువు నిలుపుకోవాలని లంక భావిస్తోంది. టీమిండియా ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో ఆడిన ఉనాద్కత్‌కు మరోసారి అవకాశం ఇవ్వడంతో బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌ బాసిల్‌ థంపికి మరోసారి నిరాశే ఎదురైంది.
ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి భారత్ 71/0 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. ఆరంభం నుంచే దూకుడు పెంచిన ఓపెనర్లు.. రోహిత్ శర్మ 38 (19 బంతులు), కేఎల్ రాహుల్ 33 (23 బంతులు) పరుగులతో ఆడుతున్నారు.
ఇండోర్‌ హోల్కర్‌ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ టీ20 కావడం విశేషం. ఈ మైదానంలో భారత్‌కు అజేయ రికార్డు ఉంది. 2006 నుంచి ఇక్కడ ఆడిన ఐదు వన్డేల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. గతేడాది జరిగిన ఏకైక టెస్టులోనూ భారత జట్టు విజయం సాధించింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మ్యాచ్లో సవాల్ ఎదురైతే ధోనీ దగ్గరకెళ్తా..!
మైదానంలో ఏదైనా సవాల్ ఎదురైతే వెంటనే సలహా కోసం వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీని కలుస్తానని
TNN | Updated:
Sep 6, 2017, 04:01PM IST
మైదానంలో ఏదైనా సవాల్ ఎదురైతే వెంటనే సలహా కోసం వికెట్‌ కీపర్ మహేంద్రసింగ్ ధోనీని కలుస్తానని భారత ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ వెల్లడించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌‌తో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఈ యువ బౌలర్.. తుది జట్టులో ఛాన్స్ దక్కిన చివరి రెండు వన్దేల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో ధోనీ సూచనలు, సలహాలతోనే మెరుగైన ప్రదర్శన చేయగలిగానని.. శ్రీలంకతో సిరీస్‌లోనూ అతని సాయం తీసుకున్నట్లు శార్ధూల్ వివరించాడు. ఐపీఎల్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ఈ ఇద్దరూ ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
‘ఐపీఎల్ సమయంలో ధోనీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అతను జట్టుకి వికెట్‌ కీపర్ కాబట్టి.. ఇప్పటికే చాలా మంది బౌలింగ్‌ని మరో ఎండ్‌ నుంచి చూసుంటాడు. ఒకవేళ నాకు మ్యాచ్‌లో ఏదైనా సవాల్ ఎదురైతే.. అంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ నా బౌలింగ్‌లో ఎదురుదాడి చేస్తుండటం లేదా బౌలింగ్ లయ కుదరకపోవడం లాంటి సమస్యలకి ధోనీ మెరుగైన సలహాలు ఇస్తాడు. ఇప్పటికే ఎన్నోసార్లు ధోనీ సాయంతో నేను గట్టెక్కగలిగాను. మ్యాచ్‌ల్లో అతని సాయం మరువలేనిది’ అని శార్ధూల్ వివరించాడు. బుధవారం శ్రీలంకతో జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్‌కి శార్ధూల్‌‌ ఆడే అవకాశాలు తక్కువే. గాయంతో చివరి వన్డేకి దూరమైన హార్దిక్ పాండ్య అతని స్థానంలో మళ్లీ జట్టులోకి రానున్నాడు. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఓఝా తలకు గాయం, హుటాహుటిన ఆస్పత్రికి
భారత క్రికెట్ టీమ్ తరఫున ఎన్నో మ్యాచ్ లు ఆడిన హైదరాబాదీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓఝాకు తలకు బంతి తగలడంతో మైదానంలో కూలబడ్డాడు. దీంతో అతన్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు...
TNN | Updated:
Sep 7, 2016, 06:13PM IST
భారత క్రికెట్ టీమ్ తరఫున ఎన్నో మ్యాచ్ లు ఆడిన హైదరాబాదీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓఝాకు తలకు బంతి తగలడంతో మైదానంలో కూలబడ్డాడు. దీంతో అతన్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దులీఫ్ ట్రోఫీలో భాగంగా గ్రేటర్ నోయిడాలో బుధవారం ఇండియా గ్రీన్ మరియు ఇండియా బ్లూ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగుతుంది. ఇండియా గ్రీన్ జట్టు తరఫున ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓఝా తలకు బంతి వచ్చి తగిలింది. దీంతో ఓఝా అక్కడే కులబడ్డాడు. సహచర ఆటగాళ్లందరూ ఓఝా చుట్టూ చేరి అతన్ని మైదానం బయటకు మోసుకెళ్ళారు. అక్కడ్నించి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. కోచ్ రామన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఓఝా పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ఓఝాకి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగులు చేయిస్తున్నట్లు వెల్లడించారు.
Pragyan Ojha suffers freak head injury in @Paytm Duleep Trophy match, taken to hospital for tests https ://t.co/2HQPbG3zmF | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పతాకధారిగా సింధు.. అట్టహాసంగా కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆరంభోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి.
Samayam Telugu | Updated:
Apr 4, 2018, 05:18PM IST
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆరంభోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. ఆస్ట్రేలియా సంస్కృతి ఉట్టి పడేలా 21వ కామన్వెల్త్ గేమ్స్ ఆరంభ ఉత్సవాలను నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్లో 71 దేశాలకు చెందిన క్రీడాకారులు 18 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు.
గత కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన స్కాట్లాండ్ ఆటగాళ్లు ముందుగా కర్రారా స్టేడియంలో నిర్వహించిన పరేడ్లో అడుగుపెట్టారు. అనంతరం ఖండాల వారీగా.. ఆంగ్ల అక్షరమాల ప్రకారం వివిధ దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహించారు. రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు త్రివర్ణ పతాకధారిగా ముందుకు సాగగా.. 218 భారత అథ్లెట్లు ఆమె వెంట నడిచారు. ఈ క్రీడల ఆరంభోత్సవంలో పతకాధారులుగా 39 మంది పురుష అథ్లెట్లు ముందు నడవగా.. 32 మంది మహిళా అథ్లెట్లు తమ దేశ జాతీయ పతాకంతో పరేడ్ నిర్వహించారు. ఈ స్థాయిలో మహిళా అథ్లెట్లు పతాకధారులుగా నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
#PVSindhu leads #TeamIndia #CWG2018 https://t.co/JZiETLEaOs
— Ishani (@IshaniDg) 1522841283000
గురువారం నుంచి పోటీలు ప్రారంభం కానుండగా... ఈ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు భారీ సంఖ్యలో పతకాలు సాధించే అవకాశం ఉంది. గత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 30 రజతాలు, 18 కాంస్యాలు సాధించి పతకాల పట్టికలో ఐదోస్థానంలో నిలిచింది. ఈసారి షూటర్లు, బాక్సర్లు, షట్లర్లు, రెజ్లర్లు మెరుస్తారని భారత్ ఆశిస్తోంది. | 2sports
|
internet vaartha 343 Views
హైదరాబాద్ : మైక్రోమాక్స్ తాజాగా 5.5 అంగుళాల డిస్ప్లేతో కూడిన కొత్త స్మార్ట్ఫోన్ను రూ.4999లకే అందిస్తోంది. వచ్చేనెల ఏడవ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్తో విక్రయాలు ప్రారంభిస్తుంది. స్నాప్డీల్ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని అంచనా. స్పార్క్వన్ కాన్వాస్ స్పార్క్2 విడుదలైన ఆరునెలల్లోనే పదిలక్షల యూనిట్లు అధిగమించాయి. స్పార్క్ సిరీస్ 87000 పాజిటివ్రేటింగ్ ద్వారా అత్యద్భుత స్థాయిలో విక్రయాలు జరిగాయని కంపెనీ ప్రకటించింది. మైక్రోమాక్స్ ఇన్ఫర్మేటిక్స్ సీఎంఒ శుభజిత్సేన్ మాట్లాడుతూ మార్కెట్లో 17శాతం మాత్రమే స్మార్ట్ఫోన్ వాటా ఉందని, ప్రస్తుత కొత్త మైక్రోమాక్స్ ఈలోటు భర్తీచేస్తుందన్నారు స్నాప్డీల్ ప్రతినిధి టోనీ నవీన్మాట్లాడుతూ మైక్రో మాక్స్స్పార్క్సిరీస్ కొత్తవెర్షన్ విడుదలచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాన్వాస్ స్పార్క్3 స్క్రీన్ 5.5అంగుళాల హెచ్డిఎస్ ఐపిఎస్స్క్రీన్తో వస్తుంద న్నారు. 1.5 సిసిబాక్సుతో ఉన్న 2509 స్పీకర్తో వస్తోంది. 2500 ఎంఎహెచ్ బ్యాటరీద్వారా హెచ్డి గేమ్స్ నిరంతరాయంగా ఆడుకునే వెసులుబాటుఉంది. 8ఎంపికెమేరా, ఐఎంపి ముందు కెమేరా 1.3గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, వన్జిబిరామ్, 8జిబిరామ్, 2500ఎంఎహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్లాలీపాప్ వ్యవస్థను అందిస్తున్నట్లు తెలి పారు. నలుపు, తెలుపుతోపాటు షాంపెయిన్ పసిడివర్ణాల్లో ఈ ఫోన్ లభిస్తుంది. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వన్డేల్లో 100 సార్లు భారత్ 300+స్కోరు..!
భారత్ జట్టు మొహాలి వేదికగా జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరుతో రికార్డుల మోత మోగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (208
TNN | Updated:
Dec 13, 2017, 05:07PM IST
వన్డేల్లో 100 సార్లు భారత్ 300+స్కోరు..!
భారత్ జట్టు మొహాలి వేదికగా జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరుతో రికార్డుల మోత మోగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (208 నాటౌట్: 153 బంతుల్లో 13x4, 12x6) మెరుపు డబుల్ సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. వన్డేల్లో మొత్తంగా 300పైచిలుకు స్కోరు చేయడం భారత్‌కు ఇది వందోసారి.
Visit Site
Recommended byColombia
పాకిస్థాన్‌పై సచిన్ తెందుల్కర్, సిద్దు శతకాలు బాదడంతో తొలిసారి 305/5తో ఈ మార్క్ అందుకున్న భారత్ జట్టు.. చివరిగా ఇటీవల న్యూజిలాండ్‌పై కాన్పూర్ వేదిక జరిగిన వన్డేలో 337 పరుగులు చేసింది. ఈ వన్డేలోనూ రోహిత్ శర్మ 147 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (113) శతకం బాదాడు. 2017లోనే భారత్ జట్టు ఏకంగా 10 సార్లు 300+ స్కోరు చేయడం విశేషం. ఇందులో శ్రీలంక , ఇంగ్లాండ్‌పై మూడేసి సార్లు, పాకిస్థాన్‌, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై ఒక్కోసారి ఈ మార్క్‌ స్కోరుని టీమిండియా అందుకుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Kohli
ఇంగ్లండ్ పై అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా..
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీకి రికార్డులు సాధించడం కొత్త కాదు.ఇప్పటికే పలు రకాల రికార్డులను తమ పేరుతో లిఖించు కున్నాడనే సంగతి తెలిసిందే.టెస్టు,వన్డే,టి20 మ్యాచ్ ఏదైనా కోహ్లీ దూసుకుపోతున్నాడు.ఒకవైపు పరుగులు చేస్తూనే మరోవైపు రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు.గతంలో వన్డేల్లో వేగంగా 20 సెంచరీలు,అయిదు వేల పరుగులు లాంటి ఘనతలను బ్రేక్ చేసిన కోహ్లీ ఈ ఏడాది టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన అరుదైన రికారుడను సొంతం చేసుకున్నాడు.ఆ ఘనత సాధించిన తొలి టీమిండియా కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు.కాగా ప్రధానంగా ఈ ఏడాది ఐపిఎల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు దగ్గరు నుంచి ఆ రోజు వరకూ కోహ్లీ వెనుదిరిగి చూడలేదు.తాజాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో కూడా కోహ్లీ తనదైన ముద్రతో చెలరేగిపోతున్నాడు.కాగా తొలి టెస్టులో 40,49 పరుగులతో ఆకట్టుకున్న కోహ్లీ రెండవ టెస్టులో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 167 పరుగులు చేసిన కోహ్లీ రెండవ ఇన్నింగ్స్లో 81 పరుగులతో మెరిశాడు.దీంతో ఈ రెండు ఇన్నింగ్స్లో కలిసి కోహ్లీ 248 పరుగులు నమోదు చేశాడు.తద్వారా మరో రికార్డు కోహ్లీకి దక్కింది.ఇంగ్లండ్పై ఒక మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.అంతకు ముందు భాతర కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ఒక మ్యాచ్లో నమోదు చేసిన 216 పరుగులు రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్తో రెండవ టెస్టులో భారత 246 పరుగులు తేడాతో విజయం సాధించింది.కాగా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లో కోహ్లీ ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బ్రాండ్ విలువ రూ.1200 కోట్లు.. కోహ్లీనా మజాకా!
‘భారత్లో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్స్’ జాబితాను గ్లోబల్ వాల్యుయేషన్, కార్పోరేట్ ఫైనాన్స్ సంస్థ ‘డఫ్ అండ్ ఫెల్ప్స్’ గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.
Samayam Telugu | Updated:
Jan 11, 2019, 07:48AM IST
బ్రాండ్ విలువ రూ.1200 కోట్లు.. కోహ్లీనా మజాకా!
హైలైట్స్
20 మందితో దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్ జాబితా
రూ.1200 కోట్ల సంపాదనతో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ
రెండో స్థానంలో దీపికా పదుకొనె, ఐదో స్థానానికి పడిపోయిన షారుఖ్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు.. బ్రాండ్ విలువలోనూ సత్తా చాటుతున్నాడు. దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్గా నిలిచాడు. వరసగా రెండో ఏడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2018లో కోహ్లీ బ్రాండ్ విలువ 18 శాతం పెరిగి 170.8 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.1200 కోట్లు) చేరింది. నవంబర్ 2018 నాటికి కోహ్లీ మొత్తం 24 బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాడు. గ్లోబల్ వాల్యుయేషన్, కార్పోరేట్ ఫైనాన్స్ సంస్థ ‘డఫ్ అండ్ ఫెల్ప్స్’ గురువారం వెల్లడించిన ‘భారత్లో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్స్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఈ జాబితాలో కోహ్లీ తరవాత బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఉన్నారు. 2018లో ఆమె సంపాదన 102.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.722 కోట్లు). కిందటేడాది దీపికా ఖాతాలో 21 బ్రాండ్లు ఉన్నాయి. బ్రాండ్ల ద్వారా వచ్చే సంపాదన 100 మిలియన్ డాలర్లకు పైగా ఉన్నది వీరిద్దరికే కావడం విశేషం. ఈ జాబితాలో ఉన్న మొత్తం 20 సెలబ్రిటీ బ్రాండ్ల విలువ 877 మిలియన్ డాలర్లు (సుమారు రూ.6180 కోట్లు). ఈ మొత్తంలో టాప్ 10 సెలబ్రిటీల వాటా 75 శాతానికి పైగా ఉంది.
ఈ జాబితాలో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ తమ ర్యాంకింగ్ను మెరుగుపరుచుకున్నారు. వరసగా 67.3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.474 కోట్లు), 63 మిలియన్ డాలర్ల (సుమారు రూ.443 కోట్లు) సంపాదనతో వీరిద్దరూ మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించారు. ఇదిలా ఉంటే, 2017లో రెండో స్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్ ఐదో స్థానానికి పడిపోయాడు. అతని బ్రాండ్ విలువ 60.7 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.427 కోట్లు) పడిపోయింది.
కాగా, మొత్తం 20 సెలబ్రిటీలతో కూడిన ఈ జాబితాలో బాలీవుడ్ తారలే పైచేయి సాధించారు. అయితే క్రీడాకారులు కూడా గట్టి పోటీనే ఇచ్చారు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, పీవీ సింధు కలిసి దాదాపు 241 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1698 కోట్లు) కంట్రిబ్యూట్ చేశారు. మొత్తం 20 మంది బ్రాండ్ విలువలో ఇది 27 శాతం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
May 19,2017
షేరు ఒక్కింటికి రూ.55 డివిడెండ్: బజాజ్
ముంబయి: ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో మార్చితో ముగిసిన త్రైమాసికానికి నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో సంస్థ లాభాలు దాదాపు 16 శాతం మేర కుంగాయి. గత ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికానికి స్టాంట్ ఎలోన్ ప్రాతిపదికన బజాజ్ సంస్థ నికర లాభం రూ.924.62 కోట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలానికి అది రూ.801.81 కోట్లకు పడిపోయింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి సంస్థ అమ్మకాలు 9.72 శాతం మేర కుంగి 7,87,627 వాహనాలకు పడిపోయాయి. ఇదే సమయంలో సంస్థ ఆదాయం కూడా దాదాపు 8.7 శాతం మేర కుంగి రూ.5,212.43 కోట్లుగా నమోదు అయింది. గురువారం ఇక్కడ జరిగిన సమావేశంలో సంస్థ బోర్డు వాటా ఒక్కింటికి రూ.55ల చొప్పున దాదాపు రూ.1,916 కోట్ల మేర డివిడెండ్ను చెల్లించేందుకు కంపెనీ సమ్మతి తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
సెలక్ట్ చేయాలంటే ‘కోర్కెలు’ తీర్చాల్సిందేనా?
యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకోవాలంటే తమ సెక్స్ కోర్కెలు తీర్చాలంటూ సెలక్టర్లు వారి తల్లులను కోరుతున్నారని లోధా కమిటీ కార్యదర్శి నారాయణన్ తీవ్రంగా విమర్శించారు.
TNN | Updated:
Aug 25, 2016, 10:55AM IST
బీసీసీఐపై లోధా కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర్నారాయణన్ తీవ్ర విమర్శలు చేశారు. యువ క్రికెటర్లను ఎంపిక చేయాలంటే తమ లైంగిక వాంఛ తీర్చాలంటూ వారి తల్లులను అడుగుతున్నారంటూ నారాయణన్ చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సెలక్టర్లు తప్పు చేస్తున్న విషయం తెలిసినప్పటికీ.. బీసీసీఐ మాత్రం స్పందించడం లేదని ఆయన విమర్శించారు. తప్పు చేస్తున్న సెలక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయన బీసీసీఐని తప్పుబట్టారు. శంకర్ నారాయణన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్నీ అర్థరహితమని ఆయన చెప్పుకొచ్చారు. బీసీసీఐ చరిత్రలోనే ఇప్పటివరకూ ఇలాంటి ఉదంతం జరిగినట్టు తమ దృష్టికి రాలేదని ఆయన తెలిపారు. నారాయణన్ చేసిన విమర్శల గురించి ఆయన బీసీసీఐ బాస్ అనురాగ్ ఠాకూర్ మెయిల్ చేశారు.
మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐలో ప్రక్షాళన కోసం జస్టిస్ లోధా కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కమిటీతో ఆగష్టు 9న బీసీసీఐ అధ్యక్షుడు సమావేశం కావాల్సి ఉంది. కానీ ఎంపీగానూ బాధ్యతలు నిర్వహిస్తున్న అనురాగ్ ఠాకూర్.. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఈ మీటింగ్కు హాజరు కాలేకపోయారు. దీంతో బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే ఒక్కరే ఈ మీటింగ్లో పాల్గొన్నారు. కాసేపట్లో సమావేశం ముగుస్తుందనగా నారాయణన్ సెలెక్టర్లపై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. సెలక్టర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నప్పటికీ బీసీసీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కూడా నారాయణన్ విమర్శించారు. ఈ సమావేశానికి సంబంధించిన 14 పాయింట్ల నివేదికను ఆయన ఠాకూర్కు మెయిల్ చేశారు. వాటిలో లైంగిక ఆరోపణలతోపాటు, సెలక్టర్ల తీరును నారాయణన్ తప్పుబట్టిన అంశాలు కూడా ఉన్నాయి. | 2sports
|
india vs south africa 1st t20: team india take on proteas as world t20 preparation
IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజే తొలి టీ20
ధర్మశాల వేదికగా నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్లో తలపడిన భారత్ జట్టు.. పేలవంగా ఓడిపోయింది. భారత్ గడ్డపై కనీసం ఒక్క టీ20 మ్యాచ్లో కూడా సఫారీలను ఇప్పటి వరకూ టీమిండియా ఓడించలేకపోయింది.
Samayam Telugu | Updated:
Sep 15, 2019, 08:14AM IST
హైలైట్స్
ధర్మశాల వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్
రికార్డుల పరంగా దక్షిణాఫ్రికాపై టీ20లో టీమిండియాదే ఆధిపత్యం
భారత్లో మాత్రం అజేయ రికార్డ్ని కొనసాగిస్తున్న సఫారీలు
టీ20 వరల్డ్కప్కి ఈ మ్యాచ్ నుంచి సన్నద్ధతని ప్రారంభించనున్న భారత్
వెస్టిండీస్ పర్యటనని అజేయంగా ముగించిన భారత్ జట్టు.. ఈరోజు నుంచి టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికాతో ఢీకొట్టబోతోంది. ధర్మశాల వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉంది. సీనియర్, జూనియర్ల కలయికతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్తో 2020లో జరగనున్న టీ20 ప్రపంచకప్కి సన్నద్ధతని ఆరంభించబోతోంది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
చాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కలలు కంటున్న భారత హాకీ జట్టు ఆశలకు ఆస్ట్రేలియా గండి కొట్టింది.
| Updated:
Jun 16, 2016, 11:12PM IST
చాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కలలు కంటున్న భారత హాకీ జట్టు ఆశలకు ఆస్ట్రేలియా గండి కొట్టింది. గురువారం నాడు జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ జట్టు చేతిలో 2-4తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది. షూటర్ వి.ఆర్.రఘునాథ్, స్ట్రైకర్ మన్దీప్ సింగ్ చేసిన రెండు గోల్స్ ఆస్ట్రేలియా విజయాన్ని ఏమాత్రం ఆపలేకపోయాయి. ఆ జట్టు ఆటగాళ్లు ట్రెంట్ మిట్టన్, అరాన్ జాల్వేస్కీ, ఫ్లైన్ ఒగ్లీవీ ట్రిస్టీయన్ అద్భుతంగా రాణించి భారత జట్టును కట్టడి చేసారు.
ఈ మ్యాచ్ లో విజయంతో ఆస్ట్రేలియా జట్టు 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ జట్టు ఏడు పాయింట్లతో ఉంది. బ్రిటన్- బెల్జియం జట్ల మ్యాచ్ తరువాత భారత జట్టు పరిస్థితి ఏమిటో తేలుతుంది. ఫైనల్ కు చేరాలంటే భారత్ జట్టు ఆస్ట్రేలియాపై విజయం సాధించాల్సి ఉంది. కానీ జట్టు పరాజయం పాలవడంతో ఆశలు నీరుగారాయి. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లోకి వెళ్లే అవకాశాలు మెరుగుపడే విషయం బ్రిటన్-బెల్జియం జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై ఆధారపడిఉంది. | 2sports
|
Suresh 188 Views
‘సెబీ నిర్ణయాలు కఠినతరం
ముంబై: ఉద్దేశ్యపూరిత ఎగవేతదారులపై మార్కెట్ నియంత్రణ సంస్థ ‘ సెక్యూరిటీస్ అండ్ ఎక్జేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా’ సెబీ నిర్ణయాలను కఠినతరం చేసింది. యూబీ గ్రూప్ సంస్థల అధినేత విజయమాల్యా రుణాల ఎగవేతపై వివాదం చెలరేగిన తరుణంలో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నతరహా పెట్టుబడులను ప్రోత్సహించటం , క్యాపిటల్ మార్కెట్ను బలపేతం చేయటం, అందుకు ఆయా సంస్థలకు అవకాశాలు, మార్గాలు సుగమం చేయాలని క్కిడ జరిగిన సెబీ సమావేవంలో నిర్ణయించారు. | 1entertainment
|
మిస్టరీని ఛేదించే "సంభవం"
Highlights
కళింగ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సంభవం
అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రం ప్రారంభం
‘చిరుసైన్యం’ ఫేం సాగర్ హీరోగా, స్వప్నిక హీరోయిన్గా కళింగ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సీనియర్ దర్శకులు నండూరి వీరేష్ దర్శకత్వంలో గూన అప్పారావు నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్ నెం. 3’ చిత్రం ‘సంభవం’. ఈ చిత్ర ప్రారంభోత్సవం జనవరి 9న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగర్రావు, ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత బాబా భాయ్, నటులు ఆవుల వీరశేఖర్ యాదవ్, హీరో సాగర్, హీరోయిన్ స్వప్నిక, దర్శకులు నండూరి వీరేష్, చిత్ర నిర్మాత గూన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం హీరో సాగర్, హీరోయిన్ స్వప్నికపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగరరావు క్లాప్నివ్వగా, మాజీ ఎంపీ ఆవుల వీరశేఖర్ యాదవ్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సన్నివేశానికి ప్రముఖ వ్యాపారవేత్త బాబా భాయ్ గౌరవ దర్శకత్వం వహించారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగర్రావు మాట్లాడుతూ ` ‘‘మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే చిత్రమిది. కథ విని చాలా ధ్రిల్ అయ్యాను. దర్శకుడు వీరేష్ చాలా అద్భుతమైన కథ, మాటలు సమకూర్చారు. డెఫినెట్గా ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది. గూన అప్పారావు మంచి ప్యాషన్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుంది. టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
చిత్ర నిర్మాత గూన అప్పారావు మాట్లాడుతూ ` ‘‘కళింగ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో ‘లవ్ స్పాట్’, ‘గురుబ్రహ్మ’ చిత్రాలను నిర్మించాం. అవి త్వరలో రిలీజ్కి రెడీ అవుతున్నాయి. మళ్లీ మా బ్యానర్లో మూడో చిత్రంగా ‘సంభవం’ చిత్రాన్ని ప్రారంభించాం. సాగర్, స్వప్నిక జంటగా నటిస్తున్నారు. వీరితోపాటు ఓ ప్రముఖ హీరో, హీరోయిన్ నటిస్తున్నారు. మర్డర్, మిస్టరీ నేపథ్యంలో డిటెక్టివ్ నవలలతో చాలా చిత్రాలు వచ్చాయి. వాటికి భిన్నంగా సాగే కొత్త తరహా చిత్రమిది. వీరేష్ ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న దర్శకుడు. ఈ సినిమాకి నిర్మాతగా చేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. మళ్లీ జనవరి 20 నుండి ఫిబ్రవరి 5 వరకు మరో షెడ్యూల్ చేస్తాం. దాంతో పాటలు మినహా టాకీ పూర్తవుతుంది. డాడీ శ్రీనివాస్ ఐదు మంచి ట్యూన్స్ కంపోజ్ చేశారు. మా టీమ్ అంతా కలిసి ఒక మంచి హిట్ సినిమా తీయడానికి కృషి చేస్తున్నాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
దర్శకుడు నండూరి వీరేష్ మాట్లాడుతూ ` ‘‘రీసెంట్గా రమ్యకృష్ణగారితో ‘జగన్మాత’ అనే సినిమా చేశాను. ఇది నా ఐదవ సినిమా. హర్రర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్తో పాటు అనేక ట్విస్ట్లతో ప్రేక్షకులు ధ్రిల్ ఫీలయ్యే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రముఖ హీరోతో పాటు ఒక పెద్ద హీరోయిన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. బిగ్ ప్యాడిరగ్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు.
హీరో సాగర్ మాట్లాడుతూ ` ‘‘చిరుసైన్యం’ చిత్రంలో హీరోగా యాక్ట్ చేశాను. ఇది నా రెండో సినిమా. వీరేష్గారు చెప్పిన సబ్జెక్ట్ చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. హీరోగా నాకు ఈ చిత్రం మంచి ప్లస్ అవుతుంది. ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చిన వీరేష్గారికి, అప్పారావుగారికి నా థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ స్వప్నిక మాట్లాడుతూ ` ‘లవ్స్పాట్’ ‘గురుబ్రహ్మ’ చిత్రాల్లో లీడ్ క్యారెక్టర్స్ చేశాను. ఇది థర్డ్ ఫిలిం. ఎవరూ ఊహించని మలుపులతో ఈ చిత్రం ఉంటుంది. డిఫరెంట్ కథాబలం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందరూ అప్రీషియేట్ చేసేలా నటిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థాంక్స్’’ అన్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త బాబా మాట్లాడుతూ ` ‘‘ఇంతకు ముందు రొమాంటిక్ టార్గెట్ అనే చిత్రాన్ని నిర్మించాను. గూన అప్పారావు, వీరేష్గారు సబ్జెక్ట్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. సస్పెన్స్ ద్రిల్లర్తో పాటు ఇన్వెస్టిగేషన్తో సాగే చిత్రమిది. ఆడియన్స్కి ఫుల్ మీల్స్లాంటి సినిమా ఇది’’ అన్నారు.
ప్రముఖ హీరో, హీరోయిన్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, శివాజీరాజా, సుమన్శెట్టి, చిట్టిబాబు, ‘జబర్దస్త్’ అప్పారావు, అమిత్, అశోక్కుమార్, జూ. రేలంగి, అల్లరి సుభాషిణి, ఢిల్లీ రాజేశ్వరి, శ్రీదేవి, దేవిక తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు, సంగీతం: డాడీ శ్రీనివాస్, కెమెరా: నాగబాబు కర్రా, ఎడిటింగ్: శ్రీనుబాబు, ఆర్ట్: రామకృష్ణ, కాస్ట్యూమ్స్: తిరుమల, నిర్మాత: గూన అప్పారావు, కథ - స్క్రీన్ప్లే - మాటలు - దర్శకత్వం: నండూరి వీరేష్
Last Updated 25, Mar 2018, 11:58 PM IST | 0business
|
అభిమానుల కోసం... (అజిత్ 'విశ్వాసం' రివ్యూ )
First Published 2, Mar 2019, 9:41 AM IST
అజిత్ సినిమాలంటే ఓ జనరేష్ మొత్తానికి ప్రేమ లేఖ సినిమా గుర్తు వస్తుంది. ఆ తర్వాత ఎన్ని డబ్బింగ్ సినిమాలు వచ్చినా అంతంతమాత్రంగానే ఆడాయి. అయినా అజిత్ తెలుగు తెరను విడిచిపెట్టడం మానలేదు.
(------Review By సూర్య ప్రకాష్ జోస్యుల) అజిత్ సినిమాలంటే ఓ జనరేష్ మొత్తానికి ప్రేమ లేఖ సినిమా గుర్తు వస్తుంది. ఆ తర్వాత ఎన్ని డబ్బింగ్ సినిమాలు వచ్చినా అంతంతమాత్రంగానే ఆడాయి. అయినా అజిత్ తెలుగు తెరను విడిచిపెట్టడం మానలేదు. తమిళ సూపర్ హిట్స్ ని ఇక్కడ డబ్ చేసి వదలటం కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు శివతో ఆయన కంటిన్యూగా చేస్తున్న మాస్ సినిమాలు అక్కడ సూపర్ హిట్ అవుతూండటంతో...ఇక్కడా మనవాళ్లకు నచ్చుతాయని రిలీజ్ చేస్తున్నారు. అయితే అవి మన పాత తెలుగు హిట్ సినిమాలకు నకలలుగా ఉండటంతో పెద్దగా ఫలితం కనపడటం లేదు. తాజాగా మరోసారి తమిళ సంక్రాంతికి సూపర్ హిట్ గా నిలిచిన 'విశ్వాసం' ని తెలుగు డబ్ చేసి వదిలారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో అందులో సగమైనా సక్సెస్ అవుతుందా..లేక రెగ్యులర్ గా అజిత్ తెలుగు సినిమాలు వెల్తున్న దారిలోనే వెల్తుందా..రివ్యూలో చూద్దాం.
కథేంటి: రావులపాలెం లో ఉండే వీర్రాజు (అజిత్)ఆ ప్రాంతంలో పెద రాయుడు టైప్. ఆయన్ను అందరూ గౌరవిస్తారు. వీర్రాజు కూడా అంతే ప్రేమగా వారిని చూసుకుంటూంటాడు. ఆ ఊళ్లో దాదాపు పదేళ్ల తర్వాత జాతర చేద్దామని ఏర్పాటు చేద్దామని ఏర్పాటు చేస్తూంటాడు. ఆ జాతర కోసం ఎక్కడెక్కడ జనం ఆ ఊళ్లకు వస్తారు. వాళ్లంతా మంచి హ్యాపీ మూడ్ లో తమ కుటుంబాలతో గడుపుతూంటాడు. వీర్రాజు మాత్రం ఒంటిరి. అతను తన భార్య నిరంజన (నయనతార) తన దగ్గర లేదని బాధపడతాడు. పైకి నవ్వుతూ ఉన్న లోపల ఆవేదనతో ఉండటం గమనించిన అతని బంధువులు,సన్నిహితులు ముంబయిలో ఉన్న భార్య నిరంజన, కూతురు శ్వేతలను ఊరికి తీసుకురమ్మని ఫోర్స్ చేస్తారు. భార్య తిరిగి ఆ ఊరు రావటానికి ఒప్పుకోదు. అదే సమంయలో వీర్రాజు కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు చంపటానికి ట్రై చేస్తారు. వాళ్లు ఎవరు? వీర్రాజు కూతురుని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసలు వీర్రాజు భార్య అతని వదిలేసి వెళ్లడానికి కారణం ఏంటి? చివరకు కుటుంబం మొత్తం ఒకటైందా వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మొదటి నుంచీ మాస్ మంత్రం: సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ కార్డ్ పడేదాకా ఒకటే దర్శకుడు లక్ష్యం. అదేమిటంటే అజిత్ లో ఉన్న మాస్ అప్పీల్ ని ఎలివేట్ చేయటం. అందుకోసమే చాలా సీన్లు అవసరం ఉన్నా లేకపోయినా వస్తూంటాయి. అజిత్ వీరాభిమానులుకు ముఖ్యంగా తమిళం వాళ్లకు ఆ సీన్స్ సూపర్ అనిపించవచ్చేమో కానీ మనకు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే ఒకటే ఫార్మెట్..ఫస్టాఫ్ కామెడీ (అది నవ్వు రాదు) తో నింపేయటం..సెకండాఫ్ లో ఎమోషన్ సీన్స్ తో ఫ్యామిలీలను టార్గెట్ చేయటం. అందుకోసం సీన్స్ ని సాగ తీసేసారు. కూరుతు, భార్యతో వచ్చే సీన్స్ తో ఎడాపెడా సెకండాఫ్ ని నింపేసారు. కామెడీ అయితే ఎనభైల నాట జోక్ లను ప్లే చేసారు. ఎంత మాస్ కోసమైనా మరీ అంత మోటుగా కామెడీ చెయ్యాల్సిన పనిలేదేమో.
ఇక విలన్ జగపతి బాబు ఉన్నాడు అంటే ఉన్నాడు...అంతేతప్ప అతని వల్ల ఒరిగిందేమీ లేదు. అయితే అజిత్ మాత్రం చాలా సెటిల్డ్ ఫెరఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. ఆయనే సినిమాని ఒంటి చేత్తో లాక్కెళ్లిపోయారు. అలా అనిపించాలనే దర్శకుడు ఉద్దేశ్యం కూడా అనుకుంటాను..అదే యాంగిల్ లో కృషి చేసాడు. నయనతార గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇలాంటి క్యారక్టర్స్ కొట్టినపిండి. గతంలో వెంకటేష్ తులసి సినిమాలో ఆమె చేసింది ఇలాంటి పాత్రనే కదా. ఇంత చెప్పుకున్నాక బేబి అనిక గురించి మాట్లాడకోకపోతే ఈ రివ్యూ వృధానే. పెద్ద పెద్ద డైలాగ్స్ లేకుండానే చక్కటి నటనతో ఎమోషన్స్ ని పండించింది. అజిత్ , నయనతార వంటి స్టార్స్ తో పోటీ పడి..ఎక్కడా తేలిపోకుండా తన పాత్రను హైలెట్ అయ్యేలా చేసింది.
మిస్సైంది అదే: దర్శకుడు శివ.. తన కథలకు.... రొట్ట కొట్టడు కాన్సెప్ట్ లు తీసుకోకపోతే మంచి కథలు వస్తాయి. అప్పుడు తను చూపే మాస్ ఎలిమెంట్స్ మరింతగా పండుతాయి. సినిమాలు అజిత్ వీరాభిమానులు భుజాన మోయచ్చేమో కానీ ..కామన్ ఆడియన్ కు కనెక్ట్ కావాలి కదా..అందుకు సీన్స్ లో కాస్తంత లాజిక్..కామన్ సెన్స్ అవసరం. సినిమాలో నయనతార...రైస్ మిల్ లో మెడికల్ క్యాంప్ రన్ చేస్తుంది. డైరక్టర్ గా అది మాస్ అప్పీల్ కోసం పెట్టి ఉండవచ్చు ..కానీ ఎవరు అలాంటి వాతావరణంలో మెడికల్ క్యాంప్ రన్ చేయరు కదా. అలాంటి సీన్స్ చూస్తూంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
టెక్నికల్ గా: స్వతహాగా దర్శకుడు శివ ..సినిమాటోగ్రాఫర్ కావటం, వెట్రి వంటి టాప్ టెక్నీషియన్ ని ఆ విభాగానికి ఎంచుకోవటంతో అవుట్ ఫుట్ అదిరిపోయింది. అలాగే మాస్ సీన్స్ హైలెట్ చేయటానికి డి ఇమ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కలిసొచ్చింది. బెన్ ఎడిటింగ్ ఇంకొన్ని సీన్స్ ని లేపేస్టే...టైట్ గా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేదనిపించింది. నిర్మాణ విలువలు రిచ్గా ఉన్నాయి. దర్శకుడుగా శివ..అజిత్ కు పర్శనల్ డైరక్టర్ ...ఆయన బలాలు, బలహీనతలు బాగా తెలుసనే విషయంలో చాలా సీన్స్ లో మనకు కనపడతూంటుంది. అదే ప్లస్..అదే మైనస్ కూడా.
ఫైనల్ థాట్: తమిళ డబ్బింగ్ సినిమా వస్తోందంటే ఒకప్పుడు ఏదో వెరైటీ ఉంటుందని ఆశించే వాళ్లం. ఇలాంటి సినిమాలు మనలో ఆ భ్రమను పోగొట్టేందుకు కృషి చేస్తున్నాయి. Rating: 2/5
Recent Stories | 0business
|
ప్రముఖ సింగర్ రాధిక కన్నుమూత
Highlights
ప్రముఖ సింగర్ రాధిక కన్నుమూత
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాధిక
సూపర్ హిట్ సాంగ్స్ పాడిన రాధిక మృతికి సంతాపం తెలిపిన సినీప్రముఖులు
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ రాధిక మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
రాధిక కిడ్నీ ఫెయిలవడంతో గత కొంత కాలంగా డయాలసిస్ తీసుకుంటున్న ఆమెని కుటుంబసభ్యులు యధావిధిగా డయాలసిస్ నిమిత్తం నిన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. డయాలసిస్ జరుగుతున్న క్రమంలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె ఆస్పత్రిలోనే కన్నుమూశారు.
తెలుగునాట రాధిక గొంతుకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. 'ఆట కావాలా ?', 'బావలు సయ్యా..' 'అమలాపురం బుల్లోడా..' 'సున్నుండ తీస్కో' లాంటి పాటలతో ఆమె సంగీత ప్రియులని ఆకట్టుకున్నారు. రాధిక మృతి వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతిపట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
Last Updated 25, Mar 2018, 11:54 PM IST | 0business
|
బాబు చెప్పినట్లు వక్రీకరిస్తే ఎవరు చూడరు కాబట్టి నిజాలే చూపిస్తా-వర్మ
Highlights
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై చంద్రబాబు స్పందన
ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరిస్తే ఎవరూ నమ్మరన్న బాబు
వక్రీకరిస్తే ఎవరూ చూడరు కాబట్టే నిజాలను చూపిస్తానన్న వర్మ
ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని చిరిగిన పేజీలను తిరిగి అతికిస్తానన్న వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలపెట్టిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఇప్పుడు తెలుగు నోళ్లలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి వర్మపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు వర్మ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్, ఎమ్మెల్యే అనిత లాంటి నేతలకు ధీటుగా సమాధానం చెప్పిన వర్మ.. తాజాగా వాణి విశ్వనాథ్, ఎమ్మెల్యే ప్రభాకర్ లకు కూడా తనదైన శైలిలో జవాబులిచ్చాడు.
ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మిపార్వతి ఎపిసోడ్ ను మాత్రమే ఈ సినిమాలో చూపించనున్నట్టు వర్మ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ నేత రాకేశ్ రెడ్డి ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాతగా వైసీపీ నేత రంగంలోకి దిగటంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సంబంధించి అటు టీడీపీ నేతలకు, ఇటు వర్మకు మధ్య పెద్ద వార్ జరుగుతోంది. ఎన్టీఆర్ జీవితాన్ని వక్రీకరించేలా సినిమా తీస్తే సహించేది లేదని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. పైగా లక్ష్మిపార్వతి ఎపిసోడ్ ను మాత్రమే తెరకెక్కిస్తాననడంతో వర్మపై ఆ కోపం మరింత పెరిగిపోయింది.
ఇక వర్మ సినిమాకు సంబంధించిన వివరాలు సీఎం చంద్రబాబు వరకూ తీసుకెళ్లారు టీడీపీ నేతలు. ప్రత్యేకంగా ఈ సినిమాపై చర్చించారు. అయితే చంద్రబాబు మాత్రం.. అదంతా లైట్ తీసుకోవాలని, ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని, దాన్ని వక్రీకరించి తీస్తే ప్రజలు నమ్మరని అన్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థించారు. చంద్రబాబు చెప్పిన మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. తాను ఒకవేళ వక్రీకరించి తీస్తే ఎవరూ సినిమా చూడరని, తాను అలా తీయబోనని చెప్పారు. ఉన్నది ఉన్నట్టే తీస్తానన్నారు. చంద్రబాబు చెప్పినట్టు ఎన్టీఆర్ జీవితం నిజంగా తెరిచిన పుస్తకమేనని వర్మ అన్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి వర్మ పలువురు వైసీపీ లీడర్లతో సమావేశమవుతున్నారు. లక్ష్మీపార్వతి వైసీపీలో ఉండడం, వైసీపీ నేత నిర్మాత కావడం, జగన్ బావ బ్రదర్ అనిల్ తో ప్రత్యేకంగా సమావేశం కావడం.. లాంటి పరిణామాలు టీడీపీ నేతల్లో చర్చకు తెరతీస్తున్నాయి. ఎన్నికల వేళ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏమైనా ప్రభావం చూపిస్తుందేమోనన్న భయం తెదెపా నేతల్లో కనిపిస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం లైట్ తీసుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వర్మ సినిమాపై ఎక్కువగా స్పందించొద్దని సూచించారు.
Last Updated 25, Mar 2018, 11:41 PM IST | 0business
|
Hyderabad, First Published 10, Oct 2018, 9:02 AM IST
Highlights
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది. ఒక్కో నటి తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతున్నారు. తనుశ్రీదత్తా.. ప్రముక నటుడు నానా పటేకర్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది. ఒక్కో నటి తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతున్నారు. తనుశ్రీదత్తా.. ప్రముక నటుడు నానా పటేకర్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఆమెకి మద్దతుగా పలువురు సినీ తారలు నిలుస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి చెందిన ఓ పాత వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. గతంలో సల్మాన్.. ఐశ్వర్యరాయ్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అతడి ప్రవర్తన నచ్చక విడిపోయింది ఐశ్వర్య.
ఆ సమయంలో సల్మాన్ తనను కొట్టాడంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఐశ్వర్య. దీనిపై స్పందించిన సల్మాన్ ఖాన్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఓ
జర్నలిస్ట్ మీరు ఎప్పుడైనా.. మహిళపై చేయి చేసుకున్నారా..? అంటూ ఐశ్వర్య కూడా పరోక్షంగా సల్మాన్ న్ ప్రశ్నించింది.
దీనికి సమాధానంగా సల్మాన్.. ఆ మహిళ నేను కొట్టానని చెబుతోంది.. గతంలో ఓ జర్నలిస్ట్ ఇదే ప్రశ్న అడిగితే నేను టేబుల్ విరగ్గోట్టాను. అతను షాక్ అయిపోయాడు. నేను కోపంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా కొడతాను. బహుసా అంత గట్టిగా కొట్టి ఉంటే ఆమె బతికి ఉండేది కాదేమో అంటూ వెల్లడించాడు.
Watch Salman Khan's ridiculous answer when a journo asked if he had hit Aishwarya Rai pic.twitter.com/BFAbfKIFKS | 0business
|
internet vaartha 299 Views
న్యూఢిల్లీ : ప్రముఖ బాక్సర్ మేరీకోమ్కు అరుదైన గౌరవం దక్కింది. కాగా అయిదుసార్లు ప్రపంచ చాంపియన్షిప్ సాధించిన మేరీకోమ్ను అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ మున్ముందు నిర్వహింబోయే ప్రపంచ చాంపియన్స్ కోసం ఎనిమిది మంది ప్రచార రాయబారులను ఎంపిక చేసింది.వారిలో మేరీకోమ్ కూడా ఉన్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ కార్యక్ర మానికి ఎంపిక కావడం భారతీయురాలిగా చాలా గర్వంగా ఉందని మేరీకోమ్ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా 33 సంవత్సరాల మణిపూర్ బాక్సర్ మే 19 నుంచి 27 వరకు కజకిస్థాన్ లోని అస్టానాలో జరిగే ఏఐబిఎ మహిళల ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొంనేందుకు సిద్దమవుతున్నారు. | 2sports
|
జై లవ కుశ ను టెన్షన్ పెడుతున్న డీసీపీ
Highlights
భారీ అంచనాలతో గురువారం విడుదలౌతున్న జై లవ కుశ
బెన్ ఫిట్ షో వేయాలని కోరుతున్న ఎన్టీఆర్ అభిమానులు
ఇప్పటి వరకు పర్మిషన్లు ఇవ్వని పోలీసులు
భారీ అంచనాల నడుమ గురువారం విడుదల కాబోతున్న జై లవ కుశ చిత్రానికి పెద్ద చిక్కు వచ్చి పడింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా టెన్షన్ పడుతున్నారు. వీరందరినీ టెన్షన్ పెడుతోంది ఎవరో కాదు హైదరాబాద్ పోలీసులు.
అసలు విషయానికి వస్తే... సాదారణంగా పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు పడడం సహజం. అయితే ఈమధ్య హైదరాబాద్ పోలీసులు అందుకు సంబంధించిన పర్మిషన్లు ఇవ్వడం లేదు. పవన్ కల్యాణ్ కాటమరాయుడు నుంచి నిన్నటి పైసా వసూల్ వరకూ ఈ సమస్యే ఎదురైంది. ఇప్పుడు తారక్ జై లవ కుశకి కూడా ఈ సమస్యే తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్ మొట్ట మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా జై లవకుశ. ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుండగా.. బుధవారం అర్థరాత్రి ఎలాగైనా సరే.. ఫ్యాన్స్ షో వేయాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుతున్నారు.
ఇక నైజాం ఏరియా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో దిల్ రాజు తల్చుకుంటే కానిదంటూ లేదని టాక్ ఉన్నప్పటికీ..ఈసారి లవకుశకు మాత్రం కష్టమవుతోంది. దీనికి కారణం డీసీపీ సెలవులో ఉండడం, ఇన్ ఛార్జ్ డీసీపీ ఎటూ తేల్చకపోవడం.
కాకపోతే హైదరాబాద్ బ్రమరాంబ థియేటర్లో తెల్లవారుఝామున 3 గంటలకు ఫ్యాన్స్ షో వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టికెట్లు కూడా అమ్మేశారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ రాకపోవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Last Updated 25, Mar 2018, 11:41 PM IST | 0business
|
internet vaartha 385 Views
చెన్నై : ఆసియా రగ్బీ, ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు ఫిబ్రవరి 20, శనివారం నుండి చెన్నైలో జరుగనున్నాయి. తమిళనాడు రగ్బీ ఫుట్బాల్ యూనియన్ (టీఎన్ఆర్ఎఫ్యూ) ఆధ్వర్యంలో ీఆసియా రగ్బీ సెవెన్స్-2016 టోర్నమెంట్ను రెండు రోజులపాటు చెన్నై, నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నారు. మెన్స్ టోర్నమెంట్లో 10 టీమ్లు, ఉమెన్స్ టోర్నమెంట్లో 5 టీమ్లు పాల్గొనున్నాయి. మెన్స్ టీమ్లో భారత్, యుఎయి, థా§్ులాండ్, ఫిలిప్పెయిన్స్, చైనీస్ తా§్ుపెల్, లెబనాన్, నేపాల్, బంగ్లాదేశ్, సిరియా, ఇండోనేషియా జట్లు పాల్గొననున్నాయి. ఉమెన్స్ టీమ్లో భారత్, గువామ్, సౌత్ కొరియా, నేపాల్, ఇండోనేషియా జట్లు పాల్గొనను న్నాయని ఎన్ఆర్ఎఫ్యూ చైర్మన్ భరణీశ్వరన్, నిర్వాహకులు వివరాలను చెన్నైలో వెల్లడించారు. చెన్నైలో రెండోసారి జరుగనున్న అంతర్జాతీయ రగ్బీ పోటీలలో మెన్స్టోర్నమెంట్ పూల్ ఏ విభాగంలో భారత్, యుఎయి, ఫిలిప్పెయిన్స్, నేపాల్, సిరియా జట్లు, పూల్ బి విభాగంలో థాయిలాండ్, చైనీస్ తా§్ుపెల్, లెబనాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా జట్లు తలపడనున్నాయి. ఉమెన్స్ విభాగంలో భారత్, గువామ్, సౌత్ కొరియా, నేపాల్, ఇండోనేషియా జట్లు తలపడనున్నాయని నిర్వాహకులు తెలిపారు. | 2sports
|
Visit Site
Recommended byColombia
ప్రధాని ప్రకటన తర్వాత కొన్ని రోజులైతే 60 శాతం తగ్గిపోయిందని అహర్ ప్రెసిడెంట్ ఆదర్శ్ శెట్టి అన్నారు. ఇక రిటెయిల్ రంగాలైన నిత్యావసరాలు, బేకరీలు, కెమిస్ట్, వస్త్ర దుకాణాల్లో 50 శాతం మేర అమ్మకాలు పడిపోయాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో రిటెయిల్ రంగం అపారమైన నష్టాల్లో కూరుకుపోయిందని రిటెయిల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరేన్ షా తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు 37 శాతం తగ్గిపోయాయి.
కరెన్సీ రద్దుకు ముందు రోజూ సుమారు 7,300 రిజిస్ట్రేషన్లు జరిగేవి కానీ నవంబరు 10 తర్వాత వీటి సంఖ్య 4500కు పడిపోయింది. రిజిస్ట్రేషన్ల ద్వారా రోజూ రూ.65 కోట్ల వచ్చే ఆదాయం రూ.45 కోట్లకు జారిపోయిందని రిజిస్ట్రేషన్ అండ్ కంట్రోలర్ ఆఫ్ స్టాంప్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ రామస్వామి తెలియజేశారు. ముంబైలోని సుమారు 1,00,000 ఆటోలు ఉన్నాయి.. వీటి ద్వారా నెలకు సగటున రూ.450 కోట్ల టర్నోవర్ జరిగేది. కానీ ఈ తొమ్మిది రోజుల్లో వీరి వ్యాపారం 25 శాతం తగ్గిపోయింది.
థియేటర్లలో కొన్ని రోజులుగా కేవలం 30 శాతం వ్యాపారం మాత్రమే జరుగుతోంది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని జీ-7 మల్టీప్లెక్స్ అండ్ మరాఠా మందిర్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ లావాదేవీలు రోజుకు రూ.8 కోట్ల నుంచి రూ.4.5 కోట్లకు పడిపోయాయి. బంగారం, వజ్రాల అమ్మకం 75 శాతం తగ్గిపోయాయని ముంబై జ్యువెల్లరీస్ అసోసియేషన్ తెలిపింది.
ఈ పరిస్థితిని అధిగమించడానికి పెద్ద మొత్తంలో నగదు సరఫరా జరగాలని ఆర్థికవేత్త జయరాజ్ శాల్గొవకర్ అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్న ఈ సమయంలో ఆర్బీఐ వడ్డీ రెట్లను తగ్గిస్తే డిమాండ్ పెంచడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
Mumbai, the country’s economic powerhouse, has been significantly impacted since November 8, when the demonetisation move was announced by the government. The withdrawal of Rs 500 and Rs 1,000 notes has impacted everyone from restaurateurs to daily wage labourers, and business is down everywhere. Property registrations are nearly half of what they were prior to November 9; restaurants and street hawkers have seen a 50% drop in daily earnings, and traders at Navi Mumbai APMC, the city’s main agricultural produce market, are reporting a 50 per cent drop in business after the central government’s demonetisation measure. A ballpark estimate of just the losses the above sectors have incurred over the last 9 days is around Rs 700 crore, and that should provide an illuminating picture of the trough demonetisation has landed Mumbai in. “It seems business is 50 to 75% down, depending on the sector, but the sectors where discretionary expenses are involved such as entertainment are hit the hardest,” said Atul Joshi, CEO, Oyster Capital Management. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘ఛీ’.. రెడ్డి!! అమెరికాలో నువ్ చేసిన యాపారం చెప్పాలా?: కరాటే కళ్యాణి
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి.
Samayam Telugu | Updated:
Apr 20, 2018, 02:33PM IST
‘ఛీ’.. రెడ్డి!! అమెరికాలో నువ్ చేసిన యాపారం చెప్పాలా?: కరాటే కళ్యాణి
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి . శ్రీరెడ్డి .. పవన్ పవన్ కళ్యాణ్పై చేసిన దారుణ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆమెపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చాలా శాంతంగా ఉన్నారని.. అయితే నీకు కరెక్ట్ మొగుడ్ని నేనే అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చింది కళ్యాణి. సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘శ్రీరెడ్డి... నువ్వో పెద్ద పెంటవి అని నిన్ను నువ్వే బయటపెట్టుకున్నావు. పోరాటం, న్యాయం, ధర్మం అంటున్నావ్.. అసలు నీకు ఏం కావాలో కొంచెమైనా క్లారిటీ ఉందా?.
టీవీలకు వెళ్లి రచ్చ చేయడం నీకే వచ్చా.. మేం వస్తుంటే ఎందుకు పారిపోతున్నావ్. అకారణంగా పవన్ కళ్యాణ్ను ఎందుకు తిట్టావ్. ఆయన తల్లిని ఎందుకు దూషించావ్.. నీ తల్లిని అంటే ఒకటి ఆయన తల్లిని అంటే ఒకటా? అసలు నీ వెనుక ఎవరు ఉన్నారో బయటపడదని అనుకుంటున్నావ్ కదా? కొంచెం వెయిట్ చేయి త్వరలోనే అందరి బండారం బయటపెడతాం.
ఏంటీ.. శ్రీ శక్తి అని పేరు పెట్టుకుంటావా? నీకు పేర్లు మార్చడం మామూలే కదా. మార్చుకో నీ పేరు శ్రీ శక్తి, ఛీ.. రెడ్డి అని పిలివాలి. నువ్ ఛీ..ఛీ రెడ్డివి. ఇండస్ట్రీ పరువును బజారు కీడ్చావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్పై పడ్డావా? ఆర్టిస్టుల పరువు తీశావు. పరిశ్రమలో ఉన్న మేం టాలెంట్ను నమ్ముకుని నిజాయితీగా బ్రతికాం. నీలా ఎవడితోపడితో వాడితో పోయి బ్రతకలేదు. ఇండస్ట్రీ కోసం బలైపోవడానికైనా నేను రెడీ.. కాని నీపై పోరాటం సాగిస్తా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మర్యాదగా నువ్వ చేసిన తప్పుల్ని ఒప్పుకో. తప్పకుండా నువ్ చేసిన తప్పుకు శిక్ష అనుభవించే రోజు వస్తుంది. నువ్ ఎవరి అండను చూసి రెచ్చిపోతున్నావో అదే ఛానల్స్ నిన్ను ఛీ కొట్టబోతున్నాయ్.
ఖబద్దార్ శ్రీరెడ్డి.. ఇంకోసారి పవన్ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని విమర్శిస్తే.. ఊరికునే పరిస్థితి లేదు. మా రక్తం మరిగిపోతుంది. కొన్ని కోట్ల మంది దేవుడిగా భావించే వ్యక్తిని తిడతావా. వాళ్ల మనోభావాలతో ఆడుకుంటావా? మీ అమ్మ, నాన్న కడుపున చెడపుట్టావ్.. నీ లాంటి వ్యక్తి ఆడజాతిలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా.. అసలు నీది మనిషి పుట్టుకేనా? సిగ్గులేని ఆడజన్మ నీది. ఆడజాతికే నీ పుట్టుక అవమానం.
ఏంటీ.. అందరి గుట్టు బయట పెడతావా? అసలు నీ గుట్టు బయటపడకుండా చూసుకో ముందు. అసలు నువ్ అమెరికా వెళ్లి ఎంత సంపాదించావో లెక్కలు బయటకు తీయమంటావా? నువ్ అమెరికాలో సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుని ఏం చేశావో చెప్పమంటావా? నీ బాధితులు ఎంతమంది ఉన్నారో లిస్ట్ తీయాలా? నువ్ అమెరికాలో ఏం చేసి డబ్బులు సంపాదించావో అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. టైం వస్తే నేనూ బయటకు తీస్తా. నీ బండారం మొత్తం బయటపెడతా.
టీవీ చర్చల్లో ఎన్ని అబద్దాలు చెబుతున్నావ్.. నీకు తాగుడు అలవాటు లేదా? తీయమంటావా నువ్ తాగి తూగిన ఫోటోలు. కత్తి మహేష్ని వాటేసుకుని ఫోటోలు దిగలేదా? రమేష్ పుప్పాల పుట్టినరోజు నాడు నువ్ తాగి తూగిన ఫోటోలు తీయమంటావా బయటకి.
8 ఏళ్ల పాపను దారుణంగా రేప్ చేసి చంపేస్తే.. ఒక్క మహిళా సంఘనాయకురాలు టీవీ చర్చల్లో పాల్గొన్న పాపాన పోలేదు. అంతే దారుణంగా పెళ్లాలే మొగుళ్లను చంపేస్తుంటే ఒక్కరూ మాట్లాడరు కాని ఇలాంటి ఛీ.. రెడ్డి విషయంలో జనం ఛీ.. కొట్టే విషయాల్లో మాత్రం మహిళా సంఘాలు బాగా స్పందిస్తున్నాయి అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు కరాటే కళ్యాణి.
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హైదరాబాద్లో మరో ఫర్నిచర్ స్టోర్
భాగ్యనగరంలో ఐకియా స్టోర్ ప్రారంభమైన మరో నెల లోపే హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ ఫర్నిచర్ దిగ్గజం రాబోతోంది.
Samayam Telugu | Updated:
Aug 9, 2018, 02:51PM IST
ఇదివరకూ ఎన్నో టెక్ సంస్థలకు గమ్యస్థానమైన హైదరాబాద్ ఇప్పుడు ఇతర రంగాలకు విస్తరిస్తోంది. భాగ్యనగరంలో ఐకియా స్టోర్ ప్రారంభమైన మరో నెల లోపే హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ ఫర్నిచర్ దిగ్గజం రాబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన హోం ఫర్నిషింగ్ సంస్థ డాన్యూబే రానున్నట్లు తెలుస్తోంది. హైటెక్ నగరంలో ఐకియా ప్రారంభ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ సెప్టెంబరు నెలలో డాన్యూబే తన స్టోర్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలోనే అతి పెద్ద హోమ్ డెకార్ కంపెనీ డాన్యూబే హోమ్ దేశంలో తొలిసారి హైదరాబాద్లో స్టోర్ను ప్రారంభించనుంది. తన స్టోర్ ప్రారంభానికి గాను డానుబే.. హైటెక్ సిటీ సమీపంలోని కొత్తగూడ ప్రాంతంలో స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
పెట్టుబడులు, ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నట్లు జయేష్ రంజన్ చెప్పారు. జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల్లో తమ విస్తరణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, అందులో భాగంగా భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు డాన్యూబే హోం ప్రతినిధి అడెల్ సజన్ వెల్లడించారు. భారతదేశంలో విస్తరించడం కోసం 200 మిలియన్ల దిర్హంల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో 25 నుంచి 30 స్టోర్లు తెరిచే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు సజన్ వివరించారు. | 1entertainment
|
Also Read: ‘సైరా’కి చిక్కులు.. అల్లు అరవింద్ ఎంట్రీ!
అయితే, హరీష్ శంకర్ ఈ మధ్య సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్లు చూస్తే మాత్రం కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. ఆ పోస్టుల్లో చాలా వరకు ‘వాల్మీకి’ సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ గురించే ఉంటున్నాయి. రీసెంట్గా కూడా అయనంక బోస్తో ఉన్న వర్కింగ్ స్టిల్స్ పోస్ట్ చేసి దానికింద కొన్ని కామెంట్స్ కూడా పెట్టాడు. ‘వాల్మీకి’ సినిమా జర్నీలో ఎదురైన అద్భుతమైన మూమెంట్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఔట్పుట్ చూసుకున్నాక హారీష్ చాలా హ్యాపీగా ఉన్నాడట. అంతే కాదు బోస్కి రుణపడి ఉంటా అంటూ రాసుకొచ్చాడు.
https://t.co/3oIua3JZlS
— Harish Shankar .S (@harish2you) 1567938728000
అలాగే, ‘వాల్మీకి’ ట్రైలర్ ఫైనల్ కట్ కూడా అయిపోయిందని హరీష్ ట్వీట్ చేశాడు. వరుణ్ను గద్దల కొండ గణేష్గా పరిచయం చేయబోతున్నట్టు చెప్పాడు. త్వరలోనే ట్రైలర్ను షేర్ చేయడం సూపర్ ఎక్సయిటెడ్గా ఉందని పేర్కొన్నాడు. దీన్నిబట్టి ‘వాల్మీకి’ సినిమా ఔట్పుట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Just finished the theatrical trailer final Cut...... Introducing @IAmVarunTej as “Gaddala Konda Ganesh” Super ex… https://t.co/ythwkUkk7z
— Harish Shankar .S (@harish2you) 1567886129000
ఇదిలా ఉంటే, ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్గా మారిన వరుణ్ తేజ్ లుక్ వెనుక బోస్ సజెషన్స్ ఉండే ఉంటాయి. ‘DJ’ సినిమాకి బోస్తో కలిసి పనిచేసిన హరీష్కు అతనితో వేవ్లెంగ్త్ సెట్ అవ్వడంతో ఈ సినిమాకి కూడా మళ్ళీ ఆయన్నే డీఓపీగా తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ని బట్టి ‘వాల్మీకి’ సినిమా ఔట్పుట్ ఒక రేంజ్లో ఉంటుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది.
వరుణ్ తేజ్ లుక్ గానీ, ఇప్పటికే రిలీజ్ అయిన ఐటమ్ నెంబర్ కానీ, పూజా హెగ్డే ట్రెడిషనల్ అవతార్ గానీ.. ఇలా అన్నీ ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. వాటిలో బోస్ కంట్రిబ్యూషన్ క్రెడిట్ అతనికే ఇస్తున్నాడు హరీష్ శంకర్. ఈ సినిమాకి రెమ్యునరేషన్ కూడా లేకుండా కేవలం బిజినెస్లో వాటా అనే కాన్సెప్ట్తో తెరకెక్కించిన సూపర్ టాలెంటెడ్ హరీష్కి మళ్ళీ ‘గబ్బర్సింగ్’ లాంటి హిట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది ‘వాల్మీకి’ సినిమా విజువల్స్ చూసిన వాళ్ళు చెబుతున్న మాట. ఈనెల 20న రిలీజ్ కాబోతుంది ‘వాల్మీకి’. చూద్దాం ఏ రేంజ్లో సిల్వర్ స్క్రీన్ షేక్ చేస్తుందో..! | 0business
|
బ్లూచిప్ కంపెనీల మద్దతు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : బెంచ్ మార్క్ స్టాక్ సూచీ ల్లో విదేశీ కొనుగోళ్లు పెరిగాయి. బ్లూచిప్ కంపెనీల షేర్లపై కూడా ఇన్వెస్టర్లు కొను గోళ్లు పెంచడంతో మార్కెట్లు ర్యాలీ తీసాయి. అలాగే ముడిచమురు ధరల పెరుగుదల కూడా అంతర్జాతీయ ఈక్విటీ సెంటిమెంట్లను కొంత పెంచింది. బిఎస్ఇ సెన్సెక్స్ 275పాయింట్లు పెరిగి 24,953 పాయింట్ల వద్ద స్థిరపడగా నిఫ్టీ 92 పాయింట్లు పెరిగి 7604 పాయింట్లవద్ద స్థిరపడిం ది. ఇక బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.6 నుంచి 0.7శాతంగా పెరిగాయి. మార్కెట్లలో 1315 కంపెనీలు స్వల్పనష్టాలు ఎదురైతే 1293 కంపెనీలు లాభాలతో ముగిసాయి. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 744.49 కోట్ల విలువైన షేర్లను స్టాక్ ఎక్ఛేంజిల్లో కొనుగోలు చేసినట్లు వెల్లడయింది. అంతర్జాతీయ మార్కెట్ల పరంగా ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ముగిసాయి. వాల్స్ట్రీట్ లో ముడిచమురుధరల ప్రభావం తో భారీ ర్యాలీ కనిపించింది. షాంఘై కాంపోజిట్ 1.7శాతం, హ్యాంగ్సెంగ్ 0.8శాతం పెరిగా యి. జపాన్ఎన్ పటిష్టం కావడం తో మార్కెట్లపై ఆప్రభావం చూపిం ది. నిక్కీ 1.3శాతం దిగువన ముగిసింది. యూరోపియన్ ఈక్వి టీ మార్కెట్లు కూడా సానుకూ లంగా ముగిసాయి. లండన్ ఎఫ్టిఎస్ఇ, ఫ్రాన్స్ సిఎసి, జర్మనీ డాక్స్ 0.3శాతం పెరిగాయి. ముడి చమురు ధరల ప్రభావమే ప్రధానకారణంగా ఉంది. టెక్నాలజీ రంగ షేర్లపరంగా టిసిఎస్, ఇన్ఫోసిస్ ఎక్కువ మద్దతునిచ్చాయి. టిసిఎస్ 2.5శాతం పెరిగింది. వర్జిన్ మనీతో మూడేళ్ల భాగస్వామ్యం ప్రకటించడంతో కొంత పెరుగుదల కనిపించింది. లండన్ మారథాన్ కూడా ఇందుకు మరికొంత సహకరించింది. ఇన్ఫోసిస్ 2శాతం పెరిగింది. ఆర్థికరంగసంస్థలు ఆర్బిఐ వడ్డీరేట్లను సడలిస్తుం దన్న అంచనాలతో కొంతపెరిగాయి. ఐసిఐసిఐ బ్యాంకు 0.5శాతం పెరిగింది. ఇన్ఫ్రా బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తోంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఎస్బిఐసంస్థలు రెండు శాతం పెరిగాయి. సుప్రీంకోర్టు ట్రాయ్ ను కాల్ డ్రాప్ జరిమానాను వెనక్కి తీసుకునేందుకు పునరా లోచన చేయాలని కోరడంతో భారతి ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్ కంపెనీలు 0.5 నుంచి 2 శాతం పెరిగాయి. ఇక క్షీణతపరంగా ఫార్మారంగ షేర్లు ఇప్పటికీ అమ్మకాల వత్తిడినే ఎదుర్కొన్నాయి. మొత్తం 300కుపైగా ఎఫ్సిడి ఔషధాలపై నిషేధం విధించడంతో కొంత నష్టం జరుగుతోంది. లూపిన్ ఏడుశాతం నష్టపోయింది. గ్లెన్మార్క్, సన్ఫార్మా, అబ్బట్ ఇండియా, వొకార్డు అజంతాఫార్మా సంస్థ లు ఎక్కువ నష్టపోయాయి. ఇక వ్యక్తిగతంగాచూస్తే హిందూస్థాన్ యూనిలీవర్ తన బియ్యం ఎగు మతుల వ్యాపారాన్ని ఎల్టిఫుడ్స్కు 25 కోట్లకు విక్రయించే లక్ష్యంప్రకటించడంతో కొంతపెరిగాయి. ఎల్టిఫుడ్స్ ఒకటిశాతం పెరిగింది. రియాల్టీ మేజ ర్ డిఎల్ఎఫ్ రెండుశాతం పెరిగింది. దేశ రాజధాని సాకేత్లోని షాపింగ్మాల్ను 904.50 కోట్లకు విక్రయించడంతో కొంతమేర పెరిగింది. ఒఎన్జిసి ఒకటిశాతం పెరిగింది. ప్రభుత్వరంగం లోని చము రు అన్వేషణ సంస్థ విదేశీ చమురు క్షేత్రాలపై ఎక్కువ దృష్టిపెట్టింది. ఇతరత్రాచూస్తే హిందాల్కో 4.5శాతం పెరిగింది. లండన్ మెటల్ ఎక్ఛేంజిలో 4.5శాతం రాగిఫ్యూచర్స్ పెరగడమే ఇందుకు కీలకం. మొత్తంమీద విదేశీ మార్కెట్ల ధోరణులు భారత్ ఈక్విటీకి లాభం చేకూర్చిందనే చెప్పాలి. | 1entertainment
|
Suresh 126 Views Abhinav
నిరాశ పరిచిన అభినవ్ ముకుంద్
బెంగళూరు: టీమిండియాలో అవకాశం కోసం ఎందరో క్రికెటర్లు ఎదురుచూస్తున్నారు.కొందరికి ఎంతో ప్రతిభ ఉన్నా వారిని అదృష్టం వరించడం లేదు.మరికొందరికి అవకాశం వచ్చినా సరిగ్గా వినియోగం చేసుకోలేకపోతున్నారు.దీంతోమళ్లీ వీరు తెరవెనక్కి వెళ్లాల్సి వస్తుంది.ప్రస్తుతం కొం దరు క్రికెటర్లు గాయాల వల్ల జట్టుకు దూరం కావడం,మరికొందరు ఇతర కారణాల వల్ల ఆడక పోవడంతో బోర్డర్-గవాస్కర్ సిరీస్కు కర్ణాటకకు చెందిన అభినవ్ ముకుంద్కు అవకాశం వచ్చింది. కానీ అతను ఏ స్థాయిలోను సరిగా నిలదొక్కుకో లేకపోయాడు.అయిదున్నర సంవత్సరాల తరు వాత టీమిండియా టెస్టు జట్టులోకి పునరాగమం చేసిన తమిళనాడు ఓపెనర్ అభివన్ ముకుంద్ బెంగళూరు టెస్టులో నిరాశపరిచాడు.ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన రెండవ టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్న అభినవ్ ముకుంద్ డకౌట్గా వెనుదిరిగాడు.
2011 జులైలో ఇంగ్లండ్తో నాటింగ్ హమ్లో జరిగిన టెస్టులో అభినవ్ చివరిసారిగా భారత జట్టు తరుపున ఆడాడు.ఇన్నాళ్లకు మళ్లీ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆట తీరు ఏ మాత్రం మారలేదు.ఈ మధ్య కాలంలో టీమిండియా ఆడిన 56 టెస్టు మ్యాచ్లను అభివన్ మిస్సయ్యాడు.ఇంగ్లండ్లో చివరి సారిగా ఆడిన మ్యాచ్లో డకౌట్ అయిన అభినవ్ తాజాగా జరిగిన మ్యాచ్లో బెంగళూరులోని చిన్నస్వామిస్టేడియంలో ప్రారంభమైన రెండవ టెస్టులో కూడా డకౌట్గానే వెనుదిరిగాడు.ఈ టెస్టులో 8 బంతులను ఎదుర్కొన్న అభినవ్ మూడవ ఓవర్లో స్టార్క్ వేసిన యార్కర్ లెంగ్త్ బంతిని అంచనా వేయలేక ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇంగ్లండ్తో ఆడిన టెస్టులో కూడా అభినవ్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు.దీంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు.మళ్లీ ఇన్నాళ్లకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగ పరచుకోలేకపోయాడు.బెంగళూరు టెస్టులో రెండవ ఇన్నింగ్స్లో కూడా అభినవ్ సత్తా చాటలేకపోతే ఇక టీమిండియాలో అతడి చోటు కలగానే మిగులుతుందేమో.బెంగళూరు టెస్టులో టీమిం డియా లో రెండు మార్పులు జరిగాయి. ఓపెనర్ మురళీ విజ§్ు గాయపడటంతో అతని స్థానంలో అభినవ్ ముకుంద్ జట్టులోకి వచ్చాడు. | 2sports
|
Suresh 69 Views cycling
తెలంగాణకు మూడు పతకాలు
హైదరాబాద్: జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. కర్ణాటకలోని జామకండిలో జరిగిన ఈ టోర్నీలో మూడు పతకాలను సాధించారు. 120కి.మీ రోడ్ మాస్ స్టార్ట్ ఈవెంట్లో బి.ముగేశ్, 40 కి.మీ ఈవెంట్లో అమన్ పుంజరి చెరో రజత పతకాన్ని గెలుచుకున్నారు. 50 కి.మీ క్రిటోరియమ్ ఈవెంట్లో పరశురామ్ చెంజి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. జాతీయ స్థాయిలో రాణించిన సైక్లిస్టులను శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎండి ఎ.దినకర్ బాబు బుధవారం అభినందించారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
యువ క్రికెటర్లకి సచిన్ పాఠాలు..!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కొంతసేపు కోచ్ అవతారం ఎత్తాడు. ముంబయి రంజీ జట్టు,
TNN | Updated:
Sep 6, 2017, 06:15PM IST
భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ కొంతసేపు కోచ్ అవతారం ఎత్తాడు. ముంబయి రంజీ జట్టు, అండర్-19 జట్టు‌లోని యువ క్రికెటర్ల‌లో స్ఫూర్తి నింపడానికి ముంబయి క్రికెట్ అసోషియేషన్ (ఎమ్‌సీఏ) సచిన్ సాయం కోరింది. దీనికి స్పందించిన సచిన్ కుర్ర క్రికెటర్లతో తన అనుభవాల్ని పంచుకోవడమే కాకుండా.. ఆటలో మెలకువల్ని వారికి చెప్పాడట. ఈ ఏడాది అక్టోబరు 6 నుంచి రంజీ ట్రోఫీ ఆరంభంకానుండటంతో జట్టు‌కి సచిన్‌తో ఒక సెషన్ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్‌సీఏ భావించి ఈ క్యాంప్‌ని ఏర్పాటు చేసింది.
‘ముంబయి రంజీ జట్టు, అండర్-19 జట్టులోని ఆటగాళ్లతో చాలా గొప్ప సెషన్. ఈ క్లాస్‌ నా పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. ఈ క్రికెటర్లందరికీ ఆల్ ద బెస్ట్’ అని సచిన్ సోషల్ మీడియాలో ఒక ఫొటో పెట్టి రాసుకొచ్చాడు. దేశవాళీ స్థాయిలో 38 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 4,281 పరుగులు చేశాడు. ఇందులో 18 శతకాలు, 19 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఈ జోరు చూసే.. టీమిండియా నుంచి సచిన్‌కి 16 ఏళ్ల వయసులోనే పిలుపొచ్చింది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అమెరికాలో పవన్ ప్రసంగం: ఏంచెప్తాడబ్బా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదురోజుల అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం 'కాటమరాయుడు' షూటింగ్కు బ్రేక్ ఇచ్చిన పవర్స్టార్ పవనకల్యాణ్ ఈ నెల 11, 12 తేదీలలో ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్సిటీలో జరుగనున్న 'ఇండియా కాన్ఫరెన్స్ 2017' సమావేశంలో ప్రసంగించనున్నారు.
TNN | Updated:
Feb 9, 2017, 03:03PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదురోజుల అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం 'కాటమరాయుడు' షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన పవర్‌స్టార్‌ పవనకల్యాణ్‌ ఈ నెల 11, 12 తేదీలలో ప్రఖ్యాత హార్వార్డ్‌ యూనివర్సిటీలో జరుగనున్న 'ఇండియా కాన్ఫరెన్స్‌ 2017' సమావేశంలో ప్రసంగించడానికి బోస్టన్ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం అడుగుపెట్టారు. పవన్‌తో కలిసి ఎప్పుడూ బయటకు రాని అతని భార్య అన్నా లెజ్‌నెవా ఈ పర్యటనకు రావడం విశేషం. ఎయిర్‌పోర్టులో పవన్‌తోపాటు అతని సన్నిహితుడు శరద్‌ మరార్‌ కనిపించాడు. అమెరికాలోని బోస్టన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పవన్‌కు ఘనస్వాగతం లభించింది అక్కడ జనసేన అభిమానులు ర్యాలీగా బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
ఈరోజు(గురువారం) ఉదయం న్యూక్లియన్ అండ్ యాంటీ న్యూక్లియర్ ప్రొఫెసర్ మాథ్యూ బన్‌తో గంటసేపు చర్చల అనంతరం, ఎనర్జీ పాలసీ రూపకల్పనలో నిపుణుడైన ప్రొఫెసర్ హెన్రీ లీతో 11 నుండి 12 గంటల వరకూ చర్చించారు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అమర్ అక్బర్ ఆంటోని.. అను ప్లేసులో ఇలియానా!
మాస్ మహారాజ్ రవితేజ త్రిపాత్రభినయం చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా నుంచి సోగకళ్ల సుందరి అను ఎమ్మన్యూయెల్ బయటకు వచ్చేసింది.
Samayam Telugu | Updated:
May 20, 2018, 08:30PM IST
అమర్ అక్బర్ ఆంటోని.. అను ప్లేసులో ఇలియానా!
మాస్ మహారాజ్ రవితేజ త్రిపాత్రభినయం చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా నుంచి సోగకళ్ల సుందరి అను ఎమ్మన్యూయెల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆమె స్థానంలో ఇలియానా రాబోతుందని తెలిసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా దృవీకరించింది. దీనిపై ఇలియానా కూడా సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా.. ఆసక్తి కనబరిచింది.
రవితేజ, ఇలియానా నటించిన ‘కిక్’ సినిమా తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘‘తొమ్మిదేళ్లు!! రవి, నేను కలిసి ఇంకో సినిమా చేయాలని అనుకుంటున్నా. ఇది చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో నేను పోషించిన ‘నైనా’ పాత్ర చాలా ఫన్నీ క్యారెక్టర్’’ అని తెలిపింది.
ఇలియానా తెలుగు పరిశ్రమను విడిచి సుమారు ఆరేళ్లు కావస్తోంది. బాలీవుడ్ సినిమాలతో బిజీ కావడంతో ఆమె దక్షిణాది చిత్రాలకు దూరమైంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్కు చెందిన విశ్వసనీయవర్గాలు ‘సమయం’తో మాట్లాడుతూ.. ‘‘ఔను, ఇలియానా మళ్లీ వస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను చూసి చాలా ఏళ్లవుతుంది. రవితేజాతో మళ్లీ ఆమెను చూడటం నిజంగా ప్రత్యేకమే’’ అని పేర్కొన్నారు.
అమర్ అక్బర్ ఆంటోని మూవీ చిత్రీకరణ 50 రోజుల పాటు అమెరికాలో జరుగనుందని తెలిసింది. దీంతో ఈ షెడ్యూలుకు తగినట్లుగా అను డేట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. ఈ విషయాన్ని అనూ కూడా దృవీకరించింది. నాగచైతన్యతో చేస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంకి, రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రానికి మధ్య డేట్స్ క్లాష్ అవుతుండటంతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం నుంచి తప్పుకున్నట్లుగా ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీంతో ఇలియానా రాక సుగమం అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
అభిమాని మరణం బన్నీని కలచివేసింది
Highlights
అభిమాని మరణం బన్నీని కలచివేసింది
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన అభిమాని దేవసాయి గణేష్ మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం వినగానే స్టైలిష్ స్టార్ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. గణేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.'సాయి గణేశ్ మృతి వార్త విని నా గుండె పగిలిపోయింది. అతని కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి' అని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అల్లు అర్జున్ పేర్కొన్నారు. పలువురు బన్నీ అభిమానులు అనకాపల్లి చేరుకుని గణేష్ కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.
అనకాపల్లికి చెందిన 10వ తరగతి కుర్రాడు దేవసాయి గణేష్ అల్లు అర్జున్కు వీరాభిమాని. కొంత కాలంగా గణేష్ బోన్ క్యాన్సర్తో బాధ పడుతున్నాడు. తన అభిమాన నటున్ని చూడాలని, కలవాలని దేవసాయి గణేష్ కోరడంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఫ్యాన్ అసోసియేషన్స్ ద్వారా అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లారు. తన అభిమాని గణేష్ కోరికపై వెంటనే స్పందించిన స్టైలిష్ స్టార్ ఇటీవల అనకాపల్లి వెళ్లి గణేష్ను కలిసిశారు. త్వరలోనే కోలుకుంటావని దైర్యం చెప్పారు. అతడి చికిత్స కోసం ఆర్థిక సహాయం చేసేందుకు కూడా బన్నీ ముందుకొచ్చారు. అయితే ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడంతో బన్నీ విచారం వ్యక్తం చేశారు.
Last Updated 14, May 2018, 11:05 AM IST | 0business
|
Hyderabad, First Published 8, Mar 2019, 1:48 PM IST
Highlights
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీం ఇండియా అమరవీరులకు నివాళులర్పించింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీం ఇండియా అమరవీరులకు నివాళులర్పించింది.
ఆర్మీ క్యాపులను ధరించి బరిలోకి దిగిన కోహ్లీ సేన.. ల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘనంగా నివాళులర్పించింది. టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లి ఫీల్డింగ్వైపు మొగ్గుచూపాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీరజవాన్లు, వారి కుటుంబాలు దేశానికి చేసిన సేవకు చిహ్నంగా ఈ మ్యాచ్లో ఆర్మీక్యాప్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ప్రకటిస్తున్నట్లు ప్రకటించాడు. ఎలాంటి మార్పుల్లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. లెప్టనెంట్ కల్నల్ హోదా లో ఆటగాళ్లందరికీ ఆర్మీ క్యాప్లు అందజేశారు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ఉపయోగిస్తామని ప్రకటించించింది.
#TeamIndia will be sporting camouflage caps today as mark of tribute to the loss of lives in Pulwama terror attack and the armed forces
And to encourage countrymen to donate to the National Defence Fund for taking care of the education of the dependents of the martyrs #JaiHind pic.twitter.com/fvFxHG20vi | 2sports
|
Hyderabad, First Published 18, Aug 2018, 1:44 PM IST
Highlights
ఒకప్పటి దక్షిణాది సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. అప్పటితారలు తమ హావభావాలు, నటన, కళ్లతోనే శృంగారాన్ని పలికించేవారు
ఒకప్పటి దక్షిణాది సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. అప్పటితారలు తమ హావభావాలు, నటన, కళ్లతోనే శృంగారాన్ని పలికించేవారు. కానీ నేటి చిత్రాలలో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ అంటూ హద్దులు మీరుతోన్న శృంగారాన్ని తెరపై చూపిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' సినిమా వరకు కూడా టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్స్ తెరపై చూపించడానికి దర్శకనిర్మాతలు ఆలోచించేవారు. హీరోయిన్లు కూడా అటువంటి ఇంటిమేటెడ్ సీన్స్ లో నటించడానికి ఇబ్బంది పడేవారు. కానీ 'అర్జున్ రెడ్డి' తో లిప్ లాక్ సీన్స్ తెలుగు సినిమాల్లో కామన్ గా మారిపోయాయి.
ఆ సినిమాలో దాదాపు 60 లిప్ లాక్స్ సీన్స్ ఉన్నాయని హీరో విజయ్ దేవరకొండ విడుదలకు ముందే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక ఈ ఏడాదిలో విడుదలైన 'నా పేరు సూర్య','రంగస్థలం' వంటి పెద్ద చిత్రాల్లో కూడా లిప్ లాక్ సీన్స్ ని మిస్ చేయలేదు. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'RX 100' సినిమాలో లెక్కకి మించిన లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. సినిమా హిట్ అవ్వడానికి కూడా కారణం హీరోయిన్ బోల్డ్ పెర్ఫార్మన్స్, ఈ లిప్ లాక్ సన్నివేశాలనే చెప్పాలి. యూత్ కి తొందరగా కనెక్ట్ అవుతున్న ఈ బోల్డ్ సీన్స్ ని తమ సినిమాల్లో పెట్టి వారిని ఆకర్షించే పనిలో పడ్డారు మేకర్స్.
'గూఢచారి' సినిమాలో అడివి శేష్, శోభితల మధ్య కూడా డీప్ లిప్ లాక్ సీన్స్ ని చూపించారు. అడివి శేష్ ఈ లిప్ లాక్ ఓ సెంటిమెంట్ గా మారిందని తన తదుపరి సినిమాల్లో కూడా వీటిని కంటిన్యూ చేయనున్నాడని సమాచారం. కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమాలో కూడా ఈ తరహా సన్నివేశాలు దర్శనమిస్తాయి. రీసెంట్ గా విడుదలైన 'గీత గోవిందం' సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ ఉన్నట్లు ముందుగానే లీక్ అయినప్పటికీ సినిమాలో మాత్రం ఆ సీన్ ను సగం వరకే చూపించి ఎండ్ చేసేశారు మేకర్స్. తాజాగా విడుదలైన 'పేపర్ బాయ్' ట్రైలర్ లో కూడా లిప్ లాక్ సీన్స్ దర్శనమిస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్ లో ఈ లిప్ లాక్ సీన్స్ ఓ సెంటిమెంట్ గా మారాయనే చెప్పాలి.
Last Updated 9, Sep 2018, 11:48 AM IST | 0business
|
"ఆర్ యు మ్యారీడ్ ?'' చిత్రం ప్రారంభం
Highlights
కొత్త హీరో మౌర్యను '' ఆర్ యు మ్యారీడ్ ?'' అంటున్న నూతన నటి చరిష్మా
సెవెన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న '' ఆర్ యు మ్యారీడ్ ?'' మూవీ
ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్
మౌర్య ,కరిష్మా హీరో హీరోయిన్లుగా సెవెన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రం గా నిర్మిస్తున్న సినిమా '' ఆర్ యు మ్యారీడ్ ?'' .రొమాంటిక్ లవ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అళహరి దర్శక నిర్మాత. ఫిలిం ఛాంబర్ లో ప్రారంభమైన ఈ సినిమా వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
హీరో హీరోయిన్ ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ క్లాప్ నివ్వగా ,,ప్రవాస భారతీయుడు చిట్టిమల్ల రఘు కెమెరా స్విచ్ ఆన్ చేసారు..ఈ సందర్భంగా దర్శక నిర్మాత అళహరి మాట్లాడుతూ '' ఎవరి ఊహలకు అందని విధం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను..గ్రాఫిక్ వర్క్ తో భారీ బడ్జెట్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 23 నుండి ప్రారంభం అవుతుంది. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకుల భావోద్వేగాలను, ప్రసుత జనరేషన్ లైఫ్ స్టైల్ ని ఈ సినిమా ద్వారా చూపించనున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతి లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని'' చెప్పారు.
మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ..చక్కని కాన్సెప్ట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది అని చెప్పారు. '' కాన్సెప్ట్ నచ్చి ఈ ప్రాజెక్టులో భాగస్వామినయ్యానని ఎన్.ఆర్. ఐ. చిట్టిమల్ల రఘు చెప్పారు.. ఈ కార్యక్రమంలో కెమెరా మెన్ నర్సింగ్ రావు, సంగీత దర్శకుడు జయ సూర్య ,రచయిత కాంచనపల్లి రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
Last Updated 26, Mar 2018, 12:01 AM IST | 0business
|
పొట్టి దుస్తులు వేసుకుంటే తప్పేంటి?
Highlights
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు బిడ్డ పుట్టిన తరువాత మళ్లీ సినిమాలలో బిజీ అయింది
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు బిడ్డ పుట్టిన తరువాత మళ్లీ సినిమాలలో బిజీ అయింది. రీసెంట్ గా ఆమె నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ఆమె బట్టలు అసభ్యకరంగా ఉన్నాయని.. ఓ తల్లికి బిడ్డ ఇలాంటి బట్టలు ఎలా ధరిస్తుంది అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన కరీనా..
''నాకు ఎలాంటి దుస్తులు సూట్ అవుతాయో.. అవే వేసుకుంటాను. ఓ తల్లి ఇలాంటి బట్టలే వేసుకోవాలని చెప్పడం ఏంటో నాకు అర్ధం కావడం లేదు. మా అమ్మ ఇప్పటికీ మోడర్న్ బట్టలు వేసుకుంటుంది. ఆమె జీన్స్ వేసుకుంటే మరింత అందంగా కనిపిస్తుంది. మా అత్త గారు కూడా జీన్స్ వేసుకుంటారు. ఆమె చీరలో ఎంత అందంగా ఉంటుందో జీన్స్ లో కూడా అంతే అందంగా కనిపిస్తారు. మీకు ఎలాంటి బట్టలు నచ్చుతాయో అవే వేసుకోండి.. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా నాపై ఇలాంటి విమర్శలు చాలా చేశారు. మహిళలు వాళ్లకి నచ్చిన విధంగా ఉండే స్వేచ్చనివ్వాలి'' అంటూ స్పందించింది.
Last Updated 2, Jun 2018, 10:34 AM IST | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కాపు ఉద్యమ నేపథ్యంతో 'ప్రజా గర్జన' సినిమా!
అణిచివేతకు గురవుతున్న కాపు సామాజిక వర్గం ఉద్యమాలు చేపట్టింది. ఉద్యమం ఉధృతమవుతోంది.
| Updated:
Feb 8, 2016, 04:42PM IST
కాపు ఉద్యమ నేపథ్యంతో 'ప్రజా గర్జన' సినిమా!
అణిచివేతకు గురవుతున్న కాపు సామాజిక వర్గం ఉద్యమాలు చేపట్టింది. ఉద్యమం ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గం చేపట్టిన ఉద్యమంపై ' ప్రజా గర్జన ' అనే సినిమా షూటింగ్ సైతం ప్రారంభం అవుతోంది. డైరెక్టర్ ఏపీ నాయుడు తెరకెక్కించనున్న ఈ సినిమాలో ఆది నుంచి కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావిస్తూనే తాజా ఉద్యమాన్ని కూడా కథలో భాగం ఓ చేసేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. సమాజంలో ముప్పై శాతం ఉన్న కాపులను ప్రభుత్వాలు కనీసంగా గుర్తించకుండా ఆణిచివేతకు గురిచేస్తున్న తీరుపై ఉద్యమిస్తూ ఈ సినిమా కథ సాగుతుందని డైరెక్టర్ ఏపీ నాయుడు చెబుతున్నారు. తమకు కావాల్సిన హక్కుల కోసం పోరాడటం కూడా హక్కే అనే నినాదంతో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. గతంలో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఉద్యమానికి మరింతా ఊపిరినిచ్చాయి. అదే విధంగా కాపు సామాజిక వర్గం చేపట్టిన ఉద్యమానికి తమ సినిమా మరింతా సపోర్ట్గా నిలుస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా కోసం చేసిన జయహో ముద్రగడ.. అనే సాంగ్ ముద్రగడ దీక్షలో ఉర్రూతలూపుతోందని చిత్రయూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో ఉద్యమ నాయకులు కూడా కనిపించనున్నారని తెలిపారు. కవి కల కంబైన్స్ బ్యానర్పై తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నామని చిత్రయూనిట్ తెలిపింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Mahesh Babu ఫ్యాన్స్కు షాక్.. ‘మహర్షి’ విడుదల మళ్లీ వాయిదా?
మహేశ్బాబు 25వ చిత్రం ‘మహర్షి’ విడుదల మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 25న కాకుంగా.. జూన్కి వాయిదా పడినట్లు సమాచారం.
Samayam Telugu | Updated:
Feb 22, 2019, 12:29PM IST
హైలైట్స్
మహేశ్ బాబు ఫ్యాన్స్కు మళ్లీ నిరాశ.
ఏప్రిల్ 25న వస్తుందనుకుంటున్న ‘మహర్షి’ మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా జూన్లో విడదలయ్యే ఛాన్స్ ఉందని టాక్.
సూపర్స్టార్ మహేశ్బాబు , క్యూట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న సినిమా ‘మహర్షి’. మహేశ్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. మూడో వంతు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ‘మహర్షి’ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
షూటింగ్ ప్రారంభమైనప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 5నే విడుదల చేయాలని అనుకున్నారు. అయితే చిత్రీకరణలో ఆలస్యం వల్ల ఏప్రిల్ 25కి వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం ‘మహర్షి’ సమ్మర్లో కూడా వచ్చే ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ‘మహర్షి’కి ప్లస్ అవుతుందని మహేశ్ ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా సమ్మర్కు వచ్చే ఛాన్స్ లేకపోవడంపై వారు నిరాశ చెందుతున్నారట. | 0business
|
india won by 124 runs
పాకిస్థాన్ని మట్టికరిపించిన భారత్
పాకిస్థాన్ ఛేదన ఆరంభించగానే రెండు సార్లు వర్షం రావడంతో చివరికి అంపైర్లు లక్ష్యాన్ని 41 ఓవర్లలో 225
TNN | Updated:
Jun 5, 2017, 12:01AM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ని మట్టికరిపించి భారత్ విజయ ఢంకా మోగించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుని టోర్నీలో బోణి కొట్టింది. ఓపెనర్ రోహిత్ శర్మ (91: 119 బంతుల్లో 7x4, 2x6), కెప్టెన్ విరాట్ కోహ్లి (81 నాటౌట్: 68 బంతుల్లో 6x4, 3x6) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. వర్షం కారణంగా కుదించిన 48 ఓవర్ల‌లో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.
అనంతరం పాకిస్థాన్ ఛేదన ఆరంభించగానే రెండు సార్లు వర్షం రావడంతో చివరికి అంపైర్లు లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులకు కుదించారు. ఓపెనర్ అజహర్ అలీ (50: 65 బంతుల్లో 6x4) అర్ధశతకం బాదినా.. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమవడంతో పాక్ చివరికి 33.4 ఓవర్లలో 164 పరుగులకు కుప్పకూలిపోయింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, భువనేశ్వర్ ఒక వికెట్ తీశాడు. | 2sports
|
Petrol bunks
‘పెట్రో విక్రయాలకు నోట్ల రద్దు ఎఫెక్ట్ !
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుద్వారా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా జనవరి నెలలో పెట్రోలియంఉత్పత్తుల అమ్మకాలు క్షీణించా యి. ఎల్పిజి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వం టివి మినహాయించి ఇతర ఉత్పత్తులు క్షీణించాయి. ఈ ఏడాది జనవరిలో మొట్టమొదటిసారిగా ఇటు వంటి క్షీణత నమోదయింది. 2017 ఆర్థికసంవత్స రంలో మొదటి తొమ్మిదినెలల్లో 8.8శాతం వృద్ధి పథంలో పయనిస్తే 2016 ఆర్థిక సంవత్సరంలో 10.9శాతంగా వృద్ధి నమోదయింది. తాత్కాలిక ఆర్థిక మందగమనం, పెద్దనోట్ల రద్దు ప్రభావమే ఇందుకుకీలకమని రేటింగ్స్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. దీర్ఘకాలిక సగటుతోపోలిస్తే మధ్యకాలికం గా వచ్చేరోజుల్లో పెట్రోలియంఉత్పత్తులకు మరిం తగా డిమాండ్ పెరుగుతుందని అంచనా. ఆర్థిక రంగంలో కార్యకలాపాలు భారీగాపెరగడం వల్ల ఈ డిమాండ్ ఉంటుందని అంచనావేసింది. ముడి చమురుధరల్లో పెరుగుదల ఒపెక్ ఒప్పందం వంటివి కొంత ప్రభావంచూపిస్తాయి. ద్రవరూప ఇంధనాలపై మరికొంత ప్రభావం ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆర్థిక మందగమనానికి దారి తీసింది. ఉత్పత్తుల వినియోగం క్షీణించింది. కేవ లం చమురు రంగంలోనే కాకుండా విభిన్నరంగాల్లో వీటి ఉత్తప్తులపై ఎక్కువ ప్రభావం చూపించిందని ఇక్రా రేటింగ్స్ అంచనావేసింది.
రానున్న కాలంలో కూడా పెట్రోలియం ఉత్పత్తులకు మరికొంత విఘా తం కలుగుతుందని అంచనా. ఇదిలా ఉంటే వచ్చే మేనెల 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పెట్రోలు పంపులు ఆదివారాల్లో సెలవులు ప్రకటించడం, ఆపై ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ మాత్రమే పని చేయాలన్న నిర్ణయాలు పెట్రోలియం రంగంపై కొంతమేర ప్రభావం చూపిస్తుందని నిపుణుల అంచ నా. పెట్రోలియం డీలర్ల సంఘాల సమాఖ్య సోమ వారం ఆదివారాల్లో షాపులు మూసివేయాలన్న నిర్ణయం ప్రజాబాహుళ్యంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దక్షిణాదిరాష్ట్రాలు, మహారాష్ట్రల్లో ఈ నిర్ణయం అమలుచేయాలని సిఐపిడి వెల్లడించడం తో ఇకపై మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది.
కేవలం డీలర్ల కమిషన్ పెంపుదలకోసమే ఈ నిర్ణ యానికి దిగడంతో ఆర్థికశాఖ, పెట్రోలియం శాఖలు సంయుక్త సమావేశంలో వీటిని చర్చించి ఒక పరిష్కార మార్గం సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశవ్యాప్తంగాచూస్తే మొత్తం 58,190 ఇంధన రిటైల్ ఔట్లెట్లు పనిచేస్తు న్నాయి. అత్యధికంగా ఐఒసి, బిపిసి, హెచ్పిసి వంటి ప్రభుత్వరంగ పెట్రోలియం స్టేషన్లే ఎక్కు వ ఉన్నాయి. ఈ మూడు సంస్థలు మొత్తంగా 52,604 ఔట్లెట్లు నిర్వహిస్తున్నాయి. మొత్తంగా గత ఏడాది ఇంధన డిమాండ్ 183.5 మిలియన్టన్నులు ఇంధన డిమాండ్ ఉంది. 165.5మిలియన్ టన్నులనుంచి భారీగా పెరిగింది. డీజిల్ వినియోగం కూడా 7.5శాతం పెరిగి 74.6 మిలియన్ టన్నులకు పెరిగింది. పెట్రోలు వినియోగం కూడా 14.5శాతం పెరిగి 21.8 మిలియన్ టన్నులకు చేరడంతో అత్యంత కీలకమైన చమురు స్టేషన్లు తమతమ నిరసన నిర్ణయాలను అమలుచేస్తే దేశవ్యాప్తంగా వాహన చోదకులకు ఇక్కట్లు తప్పవన్నది నిర్వివాదాంశం. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
క్రేజీ ప్రాజెక్ట్ నుంచి నిత్యామీనన్ ఔట్!
కథ, సినిమాలో తన పాత్ర.. ఈ రెండూ నచ్చితేనే తప్ప సినిమాలు అంగీకరించదు హీరోయిన్ నిత్యామీనన్.
TNN | Updated:
Dec 6, 2017, 12:55PM IST
కథ, సినిమాలో తన పాత్ర.. ఈ రెండూ నచ్చితేనే తప్ప సినిమాలు అంగీకరించదు హీరోయిన్ నిత్యామీనన్. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటుంది ఈ బ్యూటీ. అందుకే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో ఆమె తెలుగులో నటించడం బాగా తగ్గించింది. మంచి అవకాశాలు రాకపోవడం వలనే తెలుగులో నటించడం లేదని గతంలో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో నాని నిర్మిస్తోన్న ‘అ!’ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా ఇటీవల విడుదలైంది. దీనికి మంచి స్పందన వస్తోంది.
ఇదిలా ఉంటే శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు కూడా నిత్యామీనన్ సైన్ చేసింది. సినిమా ఓపెనింగ్ రోజు చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి నిత్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయిందని అంటున్నారు. సినిమాలో తనతో పాటు ఉన్న మరో హీరోయిన్ కాజల్ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండడంతో నిత్య ఈ నిర్ణయం తీసుకుందని ఫిల్మ్ నగర్ టాక్. కారణమేదైనా దర్శక నిర్మాతలకు నిత్య గట్టి షాకే ఇచ్చింది. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL 2019 CSK vs DC: ఢిల్లీతో ఈరోజు చెపాక్ మ్యాచ్కి ధోని దూరం..?
తాజా సీజన్లో ఇప్పటికే 12 మ్యాచ్లాడిన చెన్నై జట్టు 8 విజయాలతో ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకోగా.. ఢిల్లీ కూడా చెన్నైతో సమానంగా పాయింట్లు సాధించి ప్లేఆఫ్కి చేరింది.
Samayam Telugu | Updated:
May 1, 2019, 06:29PM IST
IPL 2019 CSK vs DC: ఢిల్లీతో ఈరోజు చెపాక్ మ్యాచ్కి ధోని దూరం..?
హైలైట్స్
ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ఈరోజు ఢిల్లీతో చెన్నై మ్యాచ్
జ్వరం బారిన పడిన ధోనీ ఫిట్నెస్పై అనుమానాలు
ఒకవేళ ఈరోజు మ్యాచ్కి ధోనీ దూరమైతే కెప్టెన్గా రైనా
ఇప్పటికే రెండు మ్యాచ్లకి దూరమైన ధోనీ
ఐపీఎల్ 2019 సీజన్లో మరో మ్యాచ్కి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వెన్నునొప్పి కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కి, జ్వరంతో ముంబయి ఇండియన్స్ మ్యాచ్కి దూరమైన ధోనీ.. ఇంకా ఫిట్నెస్ సాధించలేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్తో చెపాక్ వేదికగా రాత్రి 8 గంటలకి జరగనున్న మ్యాచ్కి కూడా ధోనీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ధోనీ ఆడకపోతే.. అతని స్థానంలో చెన్నై టీమ్ని కెప్టెన్గా సురేశ్ రైనా నడిపించనున్నాడు.
తాజా సీజన్లో ఇప్పటికే 12 మ్యాచ్లాడిన చెన్నై జట్టు 8 విజయాలతో ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకోగా.. ఢిల్లీ కూడా చెన్నైతో సమానంగా పాయింట్లు సాధించి ప్లేఆఫ్కి చేరింది. దీంతో.. ఇప్పుడు టాప్-2లో ఉన్న ఈ రెండు జట్లూ.. అగ్రస్థానంలో పాగా వేసేందుకు పోటీపడుతున్నాయి. అయితే.. చివరిగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఢిల్లీ జట్టు ఘన విజయాల్ని అందుకోగా.. చెన్నై జట్టు రెండు మ్యాచ్ల్లో ఓడి ఒక మ్యాచ్లో మాత్రమే గెలుపొందింది. ముఖ్యంగా.. ఈ సీజన్లో ధోనీ ఆడని రెండు మ్యాచ్ల్లోనూ చెన్నై చిత్తుగా ఓడింది. దీంతో.. ఈరోజు మ్యాచ్లో ధోనీ లేకపోతే.. ఆ జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉండనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Visit Site
Recommended byColombia
ప్రతి నెలా డబ్బు దాచుకుంటూ బంగారం కొనుగోలు చేసే వారిని లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు ఒకేసారి కట్టక్కర్లేదు.. ఇన్స్టాల్మెంట్ రూపంలో చిన్న మొత్తాల్లో ప్రతి నెలా చెల్లించండి.. బంగారాన్ని సొంతం చేసుకోండి.. అంటూ పేద, మధ్య తరగతి ప్రజలను వలలో వేసుకుంటున్నారు.
Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి మాత్రం..
ముంబైలో ఒక జువెలరీ షాప్ డిపాజిట్ స్కీమ్ పేరుతో ఏకంగా రూ.300 కోట్లకు టోకరా వేసింది. ఈ జువెలరీ సంస్థ పేరు రసిక్లాల్ సంకల్చంద్ జ్యువెలరీ. జయేశ్ రసిక్లాల్ షా, నీలేశ్ రసిక్లాల్ షా బ్రదర్స్ ఘట్కేపర్ ప్రాంతంలో ఈ సంస్థను నడుపుతున్నారు. కొద్దికొద్దిగా డబ్బు డిపాజిట్ చేసుకుంటే.. ఆ డబ్బుతో ఒకేసారి బంగారం కొనుగోలు చేయవచ్చని కస్టమర్లకు ఆశ చూపారు.
Also Read: ఎస్బీఐ అకౌంట్ ఉందా? మీ ప్రతి లావాదేవీకి ఫోన్కు ఓటీపీ వస్తోందా? లేదంటే వెంటనే ఇలా వచ్చేలా చేసుకోండి!
రసిల్లాక్ జువెలరీ సంస్థ ఈ విధంగా కొన్ని వందల మంది నుంచి ఏకంగా రూ.300 కోట్ల డిపాజిట్లు సేకరించింది. ఇలా డబ్బు దాచుకున్న వారందరికీ ఒకేసారి కుచ్చుటోపి పెట్టింది ఆ సంస్థ. బోర్డు తిప్పేసింది. దాచుకున్న డబ్బుతో బంగారం కొందామని ఆ గోల్డ్ షాప్కు వచ్చిన కస్టమర్లు షాక్కు గురయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన కస్టమరర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: ఆధార్ కార్డు ఉందా? ఈ తప్పు చేస్తే రూ.10,000 జరిమానా..!
ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది పొంజీ స్కీమ్ మోసం కావడంతో ముంబై ఎకనమిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి రసిక్లాల్ బ్రదర్స్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ రసిక్లాక్ జువెలరీ సంస్థ గత ఆరు నెలలుగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వకపోవడం గమనార్హం.
Also Read: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
కోహ్లీకి ఇన్స్టాగ్రామ్ అవార్డు.. లిస్ట్లో దీపికా పేరు
టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరో అరుదైన అవార్డు దక్కింది. 2017కు గాను ప్రకటించిన అవార్డుల్లో విరాట్ అకౌంట్ మోస్ట్ ఎంగేజ్డ్గా సెలక్ట్ అయ్యింది.
Samayam Telugu | Updated:
Mar 20, 2018, 06:52PM IST
కోహ్లీకి ఇన్స్టాగ్రామ్ అవార్డు.. లిస్ట్లో దీపికా పేరు
టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరో అరుదైన అవార్డు దక్కింది. 2017కు గాను ప్రకటించిన అవార్డుల్లో విరాట్ అకౌంట్ మోస్ట్ ఎంగేజ్డ్గా సెలక్ట్ అయ్యింది. విరాట్ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన ఎంజాయ్మెంట్ను పంచుకుంటుంటాడు. అంతేకాదు టీమిండియా కెప్టెన్ అకౌంట్కు రెండు కోట్లమంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. అలా పోస్ట్ పెట్టాడో లేదో... ఇలా లక్షల్లో లైక్లు, కామెంట్లు వచ్చేస్తుంటాయి. ఇలా ఎక్కువగా యాక్టివ్గా ఉండి... లైక్లు, కామెంట్లు ఉంటే ఆ అకౌంట్లను మోస్ట్ ఎంగేజ్డ్గా సెలక్ట్ చేస్తారు. అలాగే విరాట్కు ఈ అవార్డు దక్కింది. | 2sports
|
Visit Site
Recommended byColombia
‘ధోనీ’ ఫేం సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ సోమవారం యూట్యూబ్లో విడుదలైంది. ఇందులో సుశాంత్ ముస్లిం యువకుడిగా, సరా హిందూ యువతిగా కనిపించనుంది. ఈ ట్రైలర్లో ఉత్తరాఖండ్ ప్రళయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ట్రైలర్ మొత్తాన్ని ఎలాంటి డైలాగులు లేకుండా విజువల్ ఎఫెక్ట్స్తోనే చూపించడం గమనార్హం. వరదల్లో కొట్టుకుపోతున్న హీరోయిన్ను హీరో రక్షించడం, ప్రతికూల పరిస్థితులను దాటుతూ క్షేమంగా బయటపడటం.. ఈ సందర్భంగా ప్రేమలో పడటం వంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి.
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Hyderabad, First Published 20, Aug 2019, 8:06 PM IST
Highlights
గత రాత్రి జరిగిన కారు ప్రమాదంలో హీరో రాజ్ తరుణ్ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజ్ తరుణ్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా రంగారెడ్డి జిల్లా అల్కాపూర్ టౌన్ షిప్ వద్ద మలుపులో కారు పక్కనే ఉన్న గోడని ఢీకొట్టింది. దీనితో పక్కనే ఉన్న పొదల్లోకి కారు దూసుకెళ్లింది.
గత రాత్రి జరిగిన కారు ప్రమాదంలో హీరో రాజ్ తరుణ్ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజ్ తరుణ్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా రంగారెడ్డి జిల్లా అల్కాపూర్ టౌన్ షిప్ వద్ద మలుపులో కారు పక్కనే ఉన్న గోడని ఢీకొట్టింది. దీనితో పక్కనే ఉన్న పొదల్లోకి కారు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారు స్పల్పంగా ధ్వంసమైంది. కానీ కారులో ఉన్నవారెవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు ప్రమాదానికి గురైన సమయంలో రాజ్ తరుణ్ తో పాటు, నిర్మాత రామ్ తాళ్లూరి కూడా ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో కారు ఎవరు నడిపారు అనే దానిపై సమాచారం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుంచి పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నిద్రమత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపారా లేక రాజ్ తరుణ్ మద్యం సేవించాడా అనే అనునాలు పోలీసులు రేకెత్తిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్ ఎక్కడికెళ్లాడనే విషయం తెలియలేదు. కాగా ప్రమాదానికి గురైన కారు రాజ్ తరుణ్ పేరున కాకుండా మరొకరి పేరున రిజిస్టర్ అయి ఉంది. హీరో రాజ్ తరుణ్ స్పందిస్తే కానీ అసలు విషయం ఏంటన్నది తెలియదు. రాజ్ తరుణ్ ని కాంటాక్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే..
పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే..వాటి ధరలు ఎలా ఉంటాయనే దానిపై కేంద్రం స్పష్టత నిచ్చింది. జీఎస్టీ కిందకు తీసుకొచ్చినప్పటి అవి పూర్తిస్థాయి జీఎస్టీ పరిధిలోకి రావని తెలిపింది.
Samayam Telugu | Updated:
Jun 20, 2018, 10:29PM IST
పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వాటి ధరలు తగ్గుతాయని, జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిందేనని గత కొన్ని రోజుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే..వాటి ధరలు ఎలా ఉంటాయనే దానిపై కేంద్రం బుధవారం (జూన్ 20) స్పష్టత నిచ్చింది. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తీసుకొచ్చినప్పటి అవి పూర్తిస్థాయి జీఎస్టీ పరిధిలోకి రావని, 28శాతం జీఎస్టీతో పాటు లోకల్ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ కూడా ఉండే అవకాశాలున్నాయని, అలా జరిగితే మళ్లీ ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే టాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
లీటర్ పెట్రోల్ పై ప్రస్తుతం కేంద్రం రూ. 19.48, లీటర్ డీజిల్పై రూ. 15.33 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది. దీంతో పాటు రాష్ట్రాలు వ్యాట్ను కూడా విధిస్తున్నాయి. డీజిల్పై తెలంగాణలో అధికంగా 26 శాతం వ్యాట్ విధిస్తుండగా, పెట్రోల్పై ముంబయిలో అత్యధికంగా 39.12 శాతం వ్యాట్ని విధిస్తున్నారు. ఇక అండమాన్లో తక్కువగా 6 శాతం వ్యాట్ ఉంది. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Today IPL Match: ఢిల్లీతో ఈరోజు హైదరాబాద్కి చావోరేవో..!
ఐపీఎల్లో ఇప్పటి వరకూ 14 సార్లు హైదరాబాద్, ఢిల్లీ జట్లు తలపడగా.. సన్రైజర్స్ ఏకంగా 9 మ్యాచ్ల్లో గెలుపొందింది. తాజా సీజన్లో రెండు జట్లూ చెరొక మ్యాచ్లో గెలిచాయి.
Samayam Telugu | Updated:
May 8, 2019, 01:22PM IST
Today IPL Match: ఢిల్లీతో ఈరోజు హైదరాబాద్కి చావోరేవో..!
హైలైట్స్
వైజాగ్ వేదికగా ఈరోజు హైదరాబాద్, ఢిల్లీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్
గెలిచిన జట్టు శుక్రవారం చెన్నైతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ఢీ
ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమణ.. ఫేవరెట్గా ఢిల్లీ టీమ్
చివరిగా ఆడిన ఐదు మ్యాచ్లకిగాను.. నాల్గింటిలో ఓడిన హైదరాబాద్
ఐపీఎల్ 2019 సీజన్లో లక్కీగా ప్లేఆఫ్ బెర్తుని దక్కించుకున్న సన్రైజర్స్ హైదరాబాద్.. ఈరోజు విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో చావోరేవో పోరుకి సిద్ధమైంది. లీగ్ దశలో 14 మ్యాచ్లాడి కేవలం ఆరింట్లో మాత్రమే గెలుపొందిన హైదరాబాద్ 12 పాయింట్లతో ప్లేఆఫ్కి చేరింది. ఐపీఎల్ 12 ఏళ్ల చరిత్రలో ఇలా ఏ జట్టూ 12 పాయింట్లతో ఇప్పటి వరకూ ప్లేఆఫ్కి చేరలేదు. మరోవైపు ఢిల్లీ జట్టు లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ల్లో ఏకంగా 9 మ్యాచ్ల్లో విజయాల్ని అందుకుని 18 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. దీంతో.. ఈరోజు రాత్రి 7.30 గంటలకి వైజాగ్లో జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు శుక్రవారం వైజాగ్లోనే చెన్నై సూపర్ కింగ్స్తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
తాజా సీజన్ ఆరంభంలో ఓపెనర్లు జానీ బెయిర్స్టో, డేవిడ్ వార్నర్లు నిలకడగా ఆడటంతో వరుస విజయాల్ని అందుకున్న సన్రైజర్స్ హైదరాబాద్.. ప్రపంచకప్ నేపథ్యంలో.. ఆ ఇద్దరూ స్వదేశాలకి వెళ్లిపోవడంతో బలహీనపడింది. చివరి రెండు మ్యాచ్ల్లో ఓపెనర్లుగా ఆడిన మార్టిన్ గప్తిల్, సాహా నిరాశపరిచారు. ఇక మిడిలార్డర్లో మనీశ్ పాండే ఇటీవల ఫామ్ అందుకోగా.. బెంగళూరుపై ఆఖరి మ్యాచ్లో అర్ధశతకంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా టచ్లోకి వచ్చాడు. అయితే.. యూసఫ్ పఠాన్, దీపక్ హుడా, విజయ్ శంకర్ ఇంకా తడబడుతూనే ఉన్నారు. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, సందీప్ శర్మ పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నా.. వికెట్లు పడగొట్టలేకపోతున్నారు. దీంతో.. లీగ్ దశలో చివరిగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఏకంగా నాల్గింటిలో హైదరాబాద్ ఓడిపోయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ వరుస అర్ధశతకాలతో జోరుమీదుండగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇటీవల ఫామ్ అందుకుని ఆ జట్టుకి విజయాల్ని అందిస్తున్నారు. ఇక మిడిలార్డర్లో కొలిన్ ఇంగ్రామ్, రూథర్ఫర్డ్, అక్షర్పటేల్ హిట్టింగ్ చేస్తూ జట్టుకి అదనపు బలం చేకూరుస్తున్నారు. బౌలింగ్లో క్రిస్ మోరీస్, లమిచానె, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ నిలకడగా రాణిస్తున్నారు. దీంతో.. లీగ్ దశలో చివరిగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఏకంగా నాల్గింటిలో ఢిల్లీ జట్టు విజయాల్ని అందుకుంది.
.@mipaltan can book an early ✈ to Hyderabad as @ChennaiIPL await one of DC or SRH in Qualifier 2. #MIvCSK #VIVOIPL https://t.co/0gfyvT4unR
— IndianPremierLeague (@IPL) 1557251336000
ఐపీఎల్లో ఇప్పటి వరకూ 14 సార్లు హైదరాబాద్, ఢిల్లీ జట్లు తలపడగా.. సన్రైజర్స్ ఏకంగా 9 మ్యాచ్ల్లో గెలుపొందింది. తాజా సీజన్లో రెండు జట్లూ చెరొక మ్యాచ్లో గెలిచాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కాగ్నిజంట్ ప్రెసిడెంట్గా రాజీవ్ మెహతా
కాగ్నిజంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రెసిడెంట్గా రాజీవ్ మెహతా నియమితులయ్యారు.
TNN | Updated:
Oct 1, 2016, 02:38PM IST
కాగ్నిజంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ మెహతా నియమితులయ్యారు. ఇటీవల రాజీనామా చేసిన గోర్డాన్ కోబర్న్ స్థానాన్ని రాజీవ్ భర్తీ చేశారు. అంతకు ముందు కంపెనీ ఐటీ సర్వీసులకు సీఈవోగా ఉన్నారు. కంపెనీ మార్కెటింగ్ కార్యకలాపాలను ఆయన చూసుకునేవారు.
ఈ సంస్థతో రాజీవ్‌కు 20 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన ఇప్పటికే సమర్ధవంతమైన నాయకుడిగా నిరూపించుకున్నారని కాగ్నిజంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా వెల్లడించారు. గడిచిన దశాబ్ద కాలంలో కంపెనీకి రాజీవ్ అందించిన సేవలు అమోగమని, సంస్థ ఎదుగుదలకు అది ఎంతగానో తోడ్పడిందని ఆయన కొనియాడారు. ఆయనతో మరింత సన్నిహితంగా కలసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని, కాగ్నిజంట్ 2020 వ్యూహాన్ని తామిద్దరం కలసి అమలుచేస్తామని ఆయన వివరించారు.
రాజీవ్ మెహతా 1997లో కాగ్నిజంట్‌లో చేరారు. ఇండ్రస్ట్రీస్, మార్కెట్స్ విభాగానికి గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌‌గా సేవలందించారు. అంతేకాకుండా గ్లోబల్ క్లైంట్ సర్వీసెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, ఫైనాన్సియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనజర్‌గా కూడా పనిచేశారు. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మొహాలీ వన్డేలో ధోనీ రికార్డులే రికార్డులు
కోహ్లి, ధోనీలు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో భారత్ విజయం దిశగా సాగుతోంది. ధోనీ ఈ మ్యాచ్ ద్వారా నాలుగు రికార్డులు సాధించాడు.
TNN | Updated:
Oct 23, 2016, 09:28PM IST
మొహాలీ వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. కోహ్లి, ధోనీలు అర్ధ సెంచరీ సాధించడంతో భారత్ విజయం దిశగా సాగుతోంది. 286 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 13 పరుగుల వద్ద రహానే వికెట్‌ను కోల్పోయింది. తర్వాత జట్టు స్కోరు 41 పరుగుల వద్ద రోహిత్ శర్మ సౌథీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ దశలో కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ స్థిరంగా ఆడుతుండటంతో 28 ఓవర్లు ముగిసే సరికి భారత్ మరో వికెట్ కోల్పోకుండా 152/2గా నిలిచింది. అర్ధ సెంచరీ సాధించిన కోహ్లీ 62 పరుగులతో క్రీజులో ఉండగా, ధోనీ 66 పరుగులతో ఆడుతున్నాడు.
ఈ క్రమంలో ధోనీ వన్డేల్లో 9 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. 243 వన్డేలు ఆడిన ధోనీ 50కిపైగా సగటుతో ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో 195 సిక్సర్లు బాదిన సచిన్ రికార్డును అధిగమించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక 124 సిక్సర్లు బాదిన ధోనీ రికీ పాంటింగ్ (123 సిక్సర్లు)ను దాటేశాడు. అంతే కాకుండా కీపర్‌గా 150 స్టంపౌట్లు చేసి, ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. | 2sports
|
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
First Published 11, Dec 2017, 2:26 PM IST
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
Recent Stories | 0business
|
Bathukamma Song: మంగ్లీ బత...
సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫ్రీడమ్ సిరీస్ తొలి టెస్టులో భారత సారథి విరాట్ కోహ్లీ వైఫల్యం పట్ల ఆవేదన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సదరు వ్యక్తిని బాబులాల్ బైర్వాగా గుర్తించారు. 63 ఏళ్ల బాబులాల్.. కోహ్లీ వైఫల్యం చెందడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబులాల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఘటన జరిగినప్పుడు ఇంట్లో బాబులాల్ ఒక్కరే ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫ్రీడమ్ సిరీస్ తొలి టెస్టులో టాప్ ఆర్డర్ అంతా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. భారత సారథి, ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 5 పరుగులకే ఔటై పెవీలియన్ బాట పట్టడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
fan fire | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఒక కాలు లేకున్నా ఫర్వాలేదు పాక్పై ఆడతా: ధోనీ
ఒక కాలు లేకపోయినా ఫర్వాలేదు. ఒంటి కాలుతోనే పాకిస్థాన్పై మ్యాచ్ ఆడి తీరతా.. సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్తో ధోనీ చెప్పిన మాటలివి.
TNN | Updated:
Aug 28, 2017, 01:02PM IST
‘ఒక కాలు లేకపోయినా ఫర్వాలేదు నేను మాత్రం పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడి తీరుతా..’ ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో మ్యాచ్‌కు ముందు ధోనీ చెప్పిన మాటలివి. ఈ విషయాన్ని భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ధోనీ అత్యంత అకింతభావం ఉన్న ఆటగాళ్లలో ఒకడని ప్రశంసించిన ఎమ్మెస్కే పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ముందు ధోనీ ఎంత తెగువను ప్రదర్శించాడో మీడియాకు వెల్లడించారు. లేవలేని స్థితిలోనూ పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు మహీ ఎంతటి పట్టుదల చూపాడో.. ఎమ్మెస్కే మాటల్లోనే..
"పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఓ రోజు రాత్రి జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ధోనీ గాయపడ్డాడు. బరువులు ఎత్తేటప్పుడు వెనుక భాగం పట్టేసింది. వెయిట్‌తో పాటు పడిపోయాడు. అదృష్టం కొద్దీ బరువు అతడి మీద పడలేదు. కానీ నడవడానికి మాత్రం ధోనీ చాలా ఇబ్బంది పడ్డాడు. మరోలా చెప్పాలంటే అతడు దాదాపుగా పాకుతూ వెళ్లాడు. మహీ అలారం మోగించడంతో మెడికల్ స్టాఫ్ వచ్చి స్ట్రెచర్‌పై అతణ్ణి తీసుకెళ్లారు.
నేను ఢాకా చేరుకున్నాక విలేకరులు ధోనీ గురించి ప్రశ్నించారు. కానీ నా దగ్గర సమాధానం లేదు. పాక్‌తో మ్యాచ్ చాలా ముఖ్యం. పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించేలా ఉంది. దీంతో నేను ధోనీ గదికి వెళ్లాను. మహీ నన్ను చూడగానే డోంట్ వర్రీ ఎమ్మెస్కే భాయ్ అన్నాడు. తన బదులు వేరే ఆటగాణ్ని ఆడించాలా అని అడిగితే.. మీరేం వర్రీ కాకండి అని బదులిచ్చాడు.
పెద్ద మ్యాచ్ కావడంతో మాపై చాలా ఒత్తిడి ఉంది. మరుసటి రోజు ఉదయం ధోనీ గది వెళ్లినప్పుడు కూడా వర్రీ కావద్దనే చెప్పాడు. కానీ ఓ సెలక్టర్‌గా ధోనీ పరిస్థితి ఇబ్బందికరంగా అనిపించింది. అందుకే చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్‌కు పరిస్థితిని వివరించాను. వెంటనే అతడి స్థానంలో ఆడించేందుకు పార్థీవ్‌ను పంపించారు. సాయంత్రానికల్లా పార్థీవ్ జట్టుతో చేరిపోయాడు. మళ్లీ ధోని గదికి వెళ్లినప్పుడు అతడు మంచం మీది నుంచి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు కూడా నేను ఆడి తీరతానని ధోనీ చాలా స్పష్టం చెప్పాడు. రాత్రి 11 గంటల సమయంలో మళ్లీ ధోనీ గదికి వెళ్లా. అప్పుడు అతడు గదిలో లేడు. వెతుక్కంటే వెళ్తే.. పైన స్విమ్మింగ్ పూల్ పక్కన నడిచేందుకు కష్టంగా ప్రయత్నిస్తున్నాడు. నడిచేందుకే ఇబ్బంది పడుతున్నవాడు మ్యాచ్ ఎలా ఆడతాడా..? అని అనుకుంటుండగా.. డోంట్ వర్రీ భాయ్ నేను ఆడతాను. అయినా నాకు చెప్పకుండానే పార్థీవ్‌ను రప్పించారు కదా. మీరు సేఫ్ అన్నాడు.
మ్యాచ్ రోజు ధోనీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మిగతా ఆటగాళ్ల కంటే ముందే అతడు ప్యాడ్లు కట్టుకొని రెడీ అయ్యాడు. తర్వాత నన్ను డ్రెసింగ్ రూంకి పిలిచి.. అంతగా ఎందుకు వర్రీ అవుతున్నారని ప్రశ్నించాడు. నాకు ఓ కాలు లేకపోయినా సరే... పాకిస్థాన్‌తో కచ్చితంగా మ్యాచ్ ఆడతానని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ నాయకత్వంలోని భారత జట్టు పాక్‌పై గెలిచింది" అని ఎమ్మెస్కే ప్రసాద్ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. | 2sports
|
Visit Site
Recommended byColombia
కేఎల్ రాహుల్ (79: 59 బంతుల్లో 4x4, 5x6) పోరాడినా పంజాబ్ జట్టుకు ఓటమి తప్పలేదు. 45 పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్ రన్రేట్ మెరుగు పరుచుకోవడంతో పాటు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. అయితే రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీలో ఆడుతున్న పంజాబ్ జట్టు ఈ సీజన్ తొలి అర్ధభాగంలో ఓ దశలో అగ్రస్థానంలో నిలిచి హవా కొనసాగించినా.. రెండో అర్ధభాగానికి వచ్చేసరికి విజయాలు అందుకోలేక చతికిల పడింది. హైదరాబాద్తో మ్యాచ్ ఓటమి అనంతరం నెటిజన్లు పంజాబ్ జట్టుపై, అశ్విన్పై ట్రోలింగ్ చేస్తున్నారు.
KXIP in 1st half of season vs 2nd half of season. #SRHvKXIP #SRHvsKXIP #IPL2019 https://t.co/KgonkmuTI0
— CricBlog (@cric_blog) 1556598312000
సీజన్ తొలి అర్ధభాగంలో రాజస్థాన్ మ్యాచ్లో ఓపెనర్ బట్లర్ని మాన్కడింగ్ ఔట్ చేయడం మ్యాచ్ను మలుపుతిప్పి పంజాబ్ విజయం సాధించింది. తొలి ఐదు మ్యాచ్లలో నాలుగు నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్.. చివరగా ఆడిన ఐదు మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. దీంతో ఐపీఎల్ ఫస్టాఫ్లో అశ్విన్, సెకండ్ ఆఫ్లో అశ్విన్ను చూడండంటూ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.
#KXIPvsSRH #SRHvKXIP #SRHvsKXIP #SRH https://t.co/zb0oPLNgdv
— Swagat Mishra (@Swag_se_swaagat) 1556585904000
ముఖ్యంగా నిన్న సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్ వీర విహారం చేస్తుంటే అశ్విన్ ప్రతి సందర్భంలోనూ చేతులు ఊపుతూ చూడటం తప్పా అతడ్ని అడ్డుకోలేకపోయాడు. దీనిపై సైతం నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
நான் பழச பத்தி பேச விரும்பல - Ashwin Gets Emotional | KXIP vs SRH | IPL 2019 Full Video Link;… https://t.co/7AeEz2W9p7
— Behindwoods (@behindwoods) 1556566380000
హైదరాబాద్ 12 మ్యాచ్లకుగానూ 6 నెగ్గి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా, పంజాబ్ జట్టు 12 మ్యాచ్ల్లో 5 నెగ్గి 10 పాయింట్లతో పట్టికలో 6వ స్థానంలో ఉంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
'కుంభకోణం'లో బాలయ్య బాబు
పైసా వసూల్ సినిమా విడుదల కాకముందే తన తర్వాతి సినిమా షూటింగ్ మొదలుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం...
TNN | Updated:
Sep 12, 2017, 02:53PM IST
పైసా వసూల్ సినిమా విడుదల కాకముందే తన తర్వాతి సినిమా షూటింగ్ మొదలుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసం తమిళనాడులోని కుంభకోణం వెళ్లారు. కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలని టెంపుల్ సిటీగా పేరున్న కుంభకోణంతోపాటు అక్కడి చుట్టుపక్కల పరిసరాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తున్న నయనతారతోపాటు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇతర నటీనటులు సైతం ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ఇదే పెద్ద షెడ్యూల్ అని సమాచారం.
ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫేమస్ కంపోజర్ చిరంతన్‌భట్ మ్యూజిక్ అందిస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి సైతం చిరంతన్ భట్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య బాబు, నయనతారల జోడీ విషయానికొస్తే, సింహా, శ్రీరామరాజ్యం వంటి చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. బాలయ్య బాబు కెరీర్ పరంగా ఇది ఆయనకు 102వ చిత్రం అవుతుంది. ఈ షెడ్యూల్‌కి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలిసే అవకాశం వుంది. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్కి ..
TNN | Updated:
Apr 30, 2017, 10:18PM IST
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్‌కి 1పైసా పెరగగా డీజిల్ ధర లీటర్‌కి 44 పైసలు పెరిగింది. ఈ ఏప్రిల్ నెలలో ఇంధనం ధరలు పెరగడం ఇది రెండోసారి. పెరిగిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచే అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టంచేసింది. వ్యాట్ కూడా కలుపుకుంటే తాజా ధరల్లో ఇంకొంత పెరుగుదల కనిపించవచ్చని ఐఓసీ తెలిపింది.
'ఎప్పటిలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల్లో హెచ్చుతగ్గులతోపాటు రూపాయి మారకద్రవ్యం విలువలో చోటుచేసుకుంటున్న మార్పులే ఈ ధరల పెంపుకి కారణం' అని ఐఓసీ తన ప్రకటనలో పేర్కొంది. | 1entertainment
|
అల్లు అర్జున్ కు ఈ మాత్రం కూడా తెలియదా..!
Highlights
ఆదివారం సందర్భంగా నిన్న కంప్లీట్ గా సెలవు తీసేసుకున్నాడు అల్లు అర్జున్
ఉగాది శుభాకాంక్షలు' అంటూ విషెస్ కూడా చెప్పాడు.
సోషల్ మీడియాలో అంత చురుకుగా పార్టిసిపేట్ చేయని బన్నీ.. నిన్న బాగా టైం కేటాయించినట్లుగా ఉన్నాడు.
ఉగాది పండుగ.. పైగా ఆదివారం సందర్భంగా నిన్న కంప్లీట్ గా సెలవు తీసేసుకున్నాడు అల్లు అర్జున్. ఉదయాన్నే ట్విట్టర్ ద్వారా అభిమానులను పలకరించి 'విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు' అంటూ విషెస్ కూడా చెప్పాడు. సోషల్ మీడియాలో అంత చురుకుగా పార్టిసిపేట్ చేయని బన్నీ.. నిన్న బాగా టైం కేటాయించినట్లుగా ఉన్నాడు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో బ్లూమ్ బెర్గ్ వారి టాప్ 10 సిటీస్ ఇన్ ది వరల్డ్ కు రిప్లై ఇస్తూ.. అందులో 3వ ర్యాంక్ మిస్ అయిందంటూ రిప్లై పెట్టాడు. "టైపో మిస్టేక్ కరెక్ట్ చేసుకోండి. జ్యూరిచ్ కు 3వ ర్యాంక్ వస్తుందని నా నమ్మకం" అంటూ ట్వీట్ పెట్టాడు. నిజానికి పారిస్ తో కలిపి జ్యూరిచ్ కు 2వ ర్యాంకును అందించారు. ఈ విషయాన్ని గమనించాడో లేదో తెలీదు కానీ.. టైపో ఎర్రర్ అంటూ ట్వీట్ చేసేశాడు బన్నీ. ఆ తర్వాత మరో నిమిషానికే.. 7వ ర్యాంక్ కూడా కనిపించడం లేదని అన్నాడు బన్నీ. జెనీవా.. సియోల్ లకు కలిపి 6వ ర్యాంక్ ను ఉమ్మడిగా ఇచ్చారు. ఇలా కామన్ ర్యాంక్ లు ఇచ్చినపుడు తర్వాతి ర్యాంక్ ఉండదనేది చాలా సింపుల్ విషయమే.
ఈ మాత్రం కూడా తెలియదా బన్నీ అంటూ నెటిజన్లు ట్రాలింగ్ చేసేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ కు అయితే అల్లు అర్జున్ ను విమర్శలు చేసేందుకు మరో ఆయుధం దొరికింది. కానీ ఈ రిప్లైస్ ను డిలెట్ చేసే ఉద్దేశ్యం కూడా బన్నీకి ఉన్నట్లుగా లేదు. మరి అసలు విషయం తెలిసి కామెడీ చేశాడా.. లేకపోతే నిజంగానే విషయం తెలియక ట్వీట్ స్లిప్ అయ్యాడా అని చెప్పలేం కానీ.. జనాలకు మాత్రం పండుగ రోజున పులిహోర మ్యాటర్ ఒకటి దొరికేసింది.
Last Updated 25, Mar 2018, 5:27 PM IST
Download App | 0business
|
- ఖజానాకు పన్ను ఆదాయంపెంచని 'ఓసీఎం'
- ట్యాక్స్ 'నెట్'లోకి కొత్తగా చేరింది 1.5 లక్షల మందే!
న్యూఢిల్లీ: భారీ అంచానాలతో మోడీ సర్కారు 2016లో చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రక్రియ (ఆపరేషన్ క్లీన్ మనీ- ఓసీఎం) అన్ని విధాలా తుస్సుమన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. రద్దు చేసిన నోట్లలో కేవలం స్వల్ప మొత్తంలోనే తిరిగి వ్యవస్థలోకి రాలేదని ఆర్బీఐ తాజాగా వెల్లడించగా.. దొంగనోట్లను అడ్డుకోవడంలో పెద్దనోట్ల రద్దు ఏమాత్రం ప్రభావం చేపలేదని నిఘా వర్గాలు ఇప్పటికే తేల్చేశాయి. అయితే పెద్దనోట్ల రద్దు వల్ల పన్ను రాబడి విఫరీతంగా పెరిగి ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందన్న సర్కారు అంచనాలు కూడా తుస్సుమన్నట్టు తాజాగా తెలుస్తోంది. నోట్లరద్దు తరువాత ఆదాయపు పన్ను రిటర్నుల్లో పెరుగుదలను గురించి తెలుసుకునేందుకు గాను 'ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్' దినపత్రిక ఆదాయపు పన్ను శాఖకు (ఐటీ) దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం అర్జీలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. పెద్దనోట్ల రద్దు సమయంలో బ్యాంకుల్లో ఇతర ఆర్థిక సంస్థల్లో దాదాపు 23.5 లక్షల మంది అనుమానాస్పద డిపాజిట్లు జరిపినట్టుగా ఐటీ శాఖ గుర్తించింది. వీరికి నోటీసులను కూడా పంపింది. అయితే ఇందులో 11.8 లక్షల మంది ఐటీ శాఖ నోటీసులకు తమదైన రీతిలో వివరణలిచ్చారు. మరోవైపు నోట్లరద్దు సమయంలో గుర్తించిన ఆరు లక్షల మంది పాన్కార్డు హోల్డర్లు ఇప్పటి వరకు ఎలాంటి పన్ను రిటర్నులను దాఖలు చేయలేదని తేలింది. అనుమానాస్పదంగా గుర్తించిన 23.5 లక్షల మందిలో.. కేవలం 1.5 లక్షల మంది మాత్రమే కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నట్టుగా ఐటీ శాఖ లెక్క తేల్చింది. అంటే మొత్తం అనుమానాస్పద డిపాజిట్ దారుల్లో కేవలం 6.3 శాతం మంది మాత్రమే కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
సర్కారు అంకెల్లో భారీగా వ్యత్యాసం..
సమాచార చట్టం కింద ఐటీ శాఖ వెల్లడించిన డేటాకు.. ఇటీవల ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ శుక్లా పార్లమెంట్కు వెల్లడించిన సమాచారానికి భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. గత ఆగస్టు నెలలో శుక్లా రాజ్యసభలో ఇదే విషయమై ఒక ప్రకటన చేస్తూ పాన్ కార్డు ఉన్న వారిలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి సం ఖ్యను 2.1 లక్షల మందిగా గుర్తించినట్టుగా మంత్రి తెలిపారు. ఇదే సమ యంలో వీలు రూ.6,410 కోట్ల మేర సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్ కట్టిన ట్టుగా సంస్థ తెలిపింది. నోట్లరద్దు, జీఎస్టీ వంటి సంస్కరణల మూలం గా పన్ను-జీడీపీ నిష్పత్తిలో స్వల్ప మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ.. మోడీ సర్కారు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ మనీ (ఓసీఎం) పన్ను ఎగవేత దారులను పట్టుకొనే విషయంలో విఫలమైందన్నదని కాదనలేని సత్యం. పెద్దనోట్ల రద్దు సందర్భంగా ఐటీ శాఖ, విచారణ సంస్థలు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు రూ.900 కోట్ల మేర నగదును సీజ్ చేసుకున్నట్టుగా ప్రభుత్వం ఇప్పట్లో వెల్లడించింది. ఇందులో దాదాపు రూ.636 కోట్లు నగదున్నట్టుగా అప్పట్లోనే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో 8,239 సర్వేల్లో రూ.6,745 కోట్ల విలువైన అప్రకటిత సొమ్ము వెలుగులోకి వచ్చినట్టుగా సర్కారు తెలిపింది. అయితే ఇవ్వన్ని ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు సమయంలో పెట్టుకున్న లక్ష్యాలతో పోలిస్తే.. చాలా స్వల్పం. నోట్ల రద్దు మూలంగా లక్షల కోట్లలో నల్లధనం వెలుగులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే కేవలం వందల కోట్లలో మాత్రమే అప్రకటిత సొమ్ము వెలుగులోకి రావడంతో ఓసీఎం పూర్తిగా అనాలోచిత, విఫల చర్య అన్ని చెప్పక తప్పదు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
85 వేల మంది సమ్మె బాట!
- తెలుగు రాష్ట్రాల్లో స్తంభించిన లావాదేవీలు
- మూతబడిన 12000 పైగా బ్యాంకులు
- నిలిచిపోయిన క్లియరెన్స్లు
- తొలిరోజు బ్యాంక్ సమ్మె విజయవంతం
- రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు.. ప్రదర్శనలు
- వెనక్కి తగ్గేది లేదు: యూఎఫ్బీయూ
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: న్యాయమైన వేతన సవరణను డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు బుధవారం మొదలు పెట్టిన రెండు రోజుల సమ్మె.. తొలిరోజు విజయవంతమైంది. యునైటెడ్ ఫోరమ్ ఆప్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఆధ్వర్యంలో తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాల వారు ఈ సమ్మెలో పాలుపంచుకున్నారు. యూఎఫ్బీయూ ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మె పిలుపు మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు బుధవారం సమ్మెబాట పట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని 12,000లకు పైగా బ్యాంకు శాఖలు మూతబడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాలో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. బ్యాంకు శాఖలు పని చేయకపోవడంతో డిపాజిట్లు, డ్రాఫ్టుల సేకరణ, చెక్కుల క్లియరెన్స్, ఆర్టీజీఎస్ లావాదేవీలు, రుణ వితరణలు పూర్తిగా నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 85,000 మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టినట్టుగా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దీంతో ప్రజలు నగదుకు ఇబ్బంది పడ్డారు. బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లేకపోవటంతో వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బ్యాంకులు ఆపరేషనల్ లాభాల్లో ఉన్నప్పటికీ నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయన్న సాకుతో బ్యాంకు యాజమాన్యాలు జీతాలను పెంచకపోవడంపై తాము ప్రధానంగా ఆందోళన చేస్తున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయమైన పరిష్కారం లభించేవరకు తాము వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.
పాక్షికంగా పని చేసిన ప్రయివేటు బ్యాంకులు..
తెలంగాణలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి కొన్ని ప్రయివేటు బ్యాంకులు బుధవారం పని చేశాయి. అయితే ఇక్కడ కూడా కేవలం డిపాజిట్లు, చెల్లింపు లావాదేవీలే జరిగాయి. ఇతర బ్యాంకులు పని చేయకపోవడంతో క్లియరెన్స్లు పూర్తిగా స్తంభించాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రయివేటు బ్యాంకులు భారత బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) వేతన సవరణ బృందంలో భాగస్వాములు కాకపోవడం వల్లే ఇక్కడి ఉద్యోగులు సమ్మెలో పాల్గొనలేదని సమాచారం. దీనికి తోడు ఆయ బ్యాంకుల్లో పని చేసేవారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులవడం.. యాజమాన్యాల ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఉద్యోగ భద్రతపై భయంతో ఆయా ప్రయివేటు బ్యాంకుల ఉద్యోగులు కొందరు సమ్మెకు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఏటీఎంల రూపంలో నీరుగార్చే యత్నం..
ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో బ్యాంకుల యాజమాన్యాలు చాలా చాకచక్యంగా వ్యవహరించాయి. ఉద్యోగుల సమ్మె నోటీసు నేపథ్యంలో ఆయా బ్యాంకుల యాజమాన్యాలు ఏటీఎం వ్యవస్థను అప్రమత్తం చేశాయి. సమ్మెకు ముందు రోజే చాలా బ్యాంకులు ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీలకు ఎక్కువ మ్తొతంలో నగదును అందసినట్టుగాగా సమాచారం. దీంతో పెద్దనోట్ల రద్దు నాటి నుంచి మూగబోయిన ఏటీఎంలలో కూడా నగదు లావాదేవీలు జరగడం కనిపించింది. సమ్మెను నీరుగార్చేందుకే బ్యాంకు యాజమాన్యాలు ఇలా వ్యవహరిస్తున్నట్టుగా ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అయితే సమ్మె నేపథ్యంలో బ్యాంకు ఏటీఎంలకు తాకిడి పెరిగింది. ఫలితంగా కొన్ని ఏటీఎంలు సాయంత్రానికి ఖాళీ అయిపోయాయి. దీంతో ప్రజలకు నగదు కష్టాలు తప్పలేదు. అయితే ఈ ప్రభావం గురువారం మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
భారీ ర్యాలీలు.. నిరసనలు
వేతన సవరణ విషయంలో ఐబీఏ ఉదాసీనతన నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టారు.హైదరాబాద్లో 'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్' (యూఎఫ్బీయూ) తెలుగు రాష్ట్రాల శాఖ వారు కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో దాదాపు జంటనగరాలకు చెందిన అయిదు వేల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్పంచుకున్నారు. దీనికి తోడు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బ్యాంకు ఉద్యోగులు ర్యాలీలను నిర్వహించారు. సమ్మె నేపథ్యంలో ప్రధానం వరంగల్, ఖమ్మం, నిజామామాబాద్, సిద్ధిపేట, మెదక్, వికారబాద్, నల్గొండలలోని బ్యాంకు ఉద్యోగులు తన విధులను బహిష్కరించి బ్యాంకు శాఖల ఎదుటే నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
సమ్మెకు సంపూర్ణ మద్దతు: ఏఐటీయూసీ
వేతన సవరణతో సహా న్యాయమైన సమస్యల పరిష్కారానికి గాను సమ్మెబాట పట్టిన బ్యాంకు ఉద్యోగులకు తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు టి. నరసింహన్ తెలిపారు. ప్రభుత్వ బ్యాంకుల్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే సర్కారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆర్థిక మాంద్యం సెగ తగలకుండా మన ఆర్థిక వ్యవస్థను కాపాడింది బ్యాంకులు అందులో పని చేస్తున్న ఉద్యోగులేనని ఆయన వివరించారు. కార్పొరేట్ సంస్థలకు 2 లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ రుణాలను రద్దు చేసిన ప్రధాని మోడీ.. బ్యాంకు ఉద్యోగులకు కనీసం 15% వేతన సవరణనైనా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును రాబందుల్లా కార్పొరేట్ సంస్థలు, బడా బాబులు దోచుకుపోతుంటే నిలవరిం చలేకపోయిన ప్రభుత్వం.. ఎన్పీఏలు పెరిగాయన్న సాకుతో ఉద్యోగుల జీతాల సవరణను నిలిపివేయాలని చూడడం సబబు కాదని ఆయన అన్నారు.
ఉద్యోగులకు నాలుగు వందల కోట్లు నష్టం..
వేతన సవరణ విషయంలో ఉద్యోగుల పట్ల ఐబీఏ అవమానకరంగా వ్యవహరిస్తోందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలుగు రాష్ట్రాల విభాగం కన్వీనర్ వి.వి.ఎస్.ఆర్. శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె నేపథ్యంలో ఆయన 'నవతెలంగాణ'తో ఆయన మాట్లాడుతూ తమకు న్యాయమైన వేతన సవరణ జరపాలని ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసిన ఐబీఏ పెడచెవిన పెడుతోందని ఆయన అన్నారు. ఐబీఏ కేవలం 2% వేతన సవరణను మాత్రమే ప్రతిపాదించి తమను అవమాన పరుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కారణంగా బ్యాంకు ఉద్యోగులు వేతనాల రూపంలో రోజుకు రూ.200 కోట్ల వరకు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. రెండు రోజుల సమ్మె కారణంగా ఉద్యోగులు రూ.400 కోట్ల మేర జీతభత్యాలను వదులుకోవాల్సి వస్తోందని ఆయన వివరించారు. మొండి బాకీలను ఎన్పీఏలతో బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణను ముడి పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. సమస్యకు తగిన పరిష్కారం చూపేలా వేతన సవరణ చేపట్టాలని సర్కారు ఐబీఏకు పలుమార్లు సూచించినప్పటికీ బ్యాంకు యాజమాన్యాలు మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
TEAM INDIA1
సిరీస్ క్లీన్ స్వీప్
కోహ్లీ సేన చారిత్రా త్మక విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిం డియా జైత్రయాత్రను శ్రీలంకలోనూ కొనసాగిం చింది. శ్రీలంకతో టెస్టు సిరీస్ను 3-0తో వైట్ వాష్ చేసింది. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో ఘనవిజయం చేసుకుంది.దీంతో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్చేసి చరిత్ర సృష్టించింది. 85 ఏళ్లలో సాధించని ఘనతను సాధించిన కోహ్లీ సేన తొలి రెండు టెస్టులను నాలుగో రోజు ముగించిన కోహ్లీసేన మూడో టెస్టుని మాత్రం మూడు రోజుల్లోపే ముగించేసింది.లంకేయులపై వరు సగా ఇన్నింగ్స్ తేడాతో రెండో గెలుపు.. బ్యాటింగ్…బౌలింగ్…ఫీల్డింగ్లో సమిష్టిగా రాణించిన కోహ్లీసేన ప్రత్యర్థిని మూడో టెస్టులో మూడో రోజుకే ఓడించింది. దీంతో విదేశీగడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసి సరికొత్త రికార్డును సాధించింది.
తాజా విజయంతో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా కోహ్లీసేన నిలిచింది. భారత జట్టు తన 85ఏళ్ల టెస్టు చరిత్రలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు లేవు. గతంలో ఏ భారత సారథికీ సాధ్యంకాని ఈ రికార్డును కోహ్లీ సాధించారు. ఆతిథ్య జట్టుకు వారి సొంతగడ్డపైనే రెండో వైట్వాష్ ఓటమి రుచిచూపించాడు. టెస్టు చరిత్రలో ఒక హోం టీమ్ క్లీన్స్వీప్ కావడం ఇది ఏడోసారి. దీంతో టీమిండియా అరుదైన రికార్డులను బద్దలు కొట్టినట్టైంది. ఈ రికార్డును ఇప్పుడు కోహ్లీసేన తన ఖాతాలో వేసుకుంది. పదునైన బౌలింగ్తో లంక బ్యాట్స్మెన్లను వణికించిన బౌలర్లు లంకేయులను భారత బౌలర్లు పదునైన బౌలింగ్తో వణికించారు.
చురకత్తుల్లాంటి బంతులు విసిరారు. ఓ వైపు స్పిన్…మరో వైపు పేస్తో దాడి చేశారు. సోమవారం ఓవర్ నైట్ స్కోరు 19/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక భారత్ బౌలర్లు అశ్విన్ (68/4), షమీ (3/32) దాటికి 181 పరుగులకే ఆలౌటైంది. నైట్ బ్యాట్స్మెన్ కరుణరత్నె (16)ను అశ్విన్ 26పరుగుల వద్ద ఔట్ చేశాడు. పుష్పకుమార్ (1)ను ఉమేశ్, కుశాల్ మెండిస్(12)ను షమి ఎక్కువ సేపు నిలవనీయలేదు.34/4తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ జట్టును సారథి దినేశ్ చండిమీల్ 89బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు, ఏంజెలో మాథ్యూస్ 96 బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్సర్తో 35 పరుగులు వికెట్ పడకుండా కాపాడారు. 65పరుగుల భాగస్వామ్యం అందిం చారు. చండీమాల్ను ఔట్ చేయడం ద్వారా ఈ జోడీని కులదీప్ విడదీశాడు. ఆతర్వాత మాథ్యూస్ను అశ్విన్ ఎల్బి చేయడంతో లంక పతనం మరింత వేగం పుంజుకొంది. పెరీరా (8), సండకాన్ (8) వెంటవెంటనే ఔటైనా డిక్వెల్లా 52బంతుల్లో 5ఫోర్లతో 41 పరుగులు ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.
అతన్ని ఉమేశ్ ఔట్ చేశాడు. లాహిర్ కుమార (10)ని అశ్విన్ బోల్తా కొట్టించడంతో లంక కథ ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ 4, షమీ 3, ఉమేశ్ యాదవ్ 2, కులదీప్ 1 వికెట్లు పడగొట్టారు. శ్రీలంక జట్టులో డిక్వెలా (41) ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 487 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 181 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో ధావన్ (119), పాండ్యా (108) సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు హార్థిక్ పాండ్యాకు దక్కగా సిరీస్లో రెండు సెంచరీలు సహా మొత్తం 358 పరుగులు చేసిన శిఖర్ ధావన్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. 13ఏళ్ల తర్వాత శ్రీలంకకు ఎదురైన క్లీన్ స్వీప్ ఓటమి రెండేళ్ల క్రితం శ్రీలంకకు విరాట్ కోహ్లీ నేతృత్వంలో తొలిసారి వచ్చిన టీమిండియా 22 ఏళ్ల తర్వాత అక్కడ టెస్టు సిరీస్ గెలిచిన జట్టుగా నిలిచిన సంగతి తెలసిందే.
ఇప్పుడు సిరీస్ క్లీన్స్వీప్తో అదే గడ్డపై విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. మూడు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు కోహ్లీ భారీ విజయాలు సాధించాడు. తొలి టెస్టులో 304 పరుగులతో గెలిచిన టీమిండియా రెండో టెస్టులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్టులో ఈ రెండు విజయాలను తలదన్నేలా ఇన్నింగ్స్ 171 పరుగులతో గెలుపొందింది. కోహ్లీ కెప్టెన్సీలో భారత్కు ఇది వరుసగా ఎనిమిదో టెస్ట్ సిరీస్ విజయం. ఇప్పటివరకు శ్రీలంకలో 24 టెస్టులాడిన భారత్ ఖాతాలో మొత్తం 9 విజయాలు, 7 ఓటములు, 8 డ్రాలు ఉన్నాయి. శ్రీలంకపై 3-0తో టెస్టు సిరీస్ విజయాన్ని సాధించిన కోహ్లీసేనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు శ్రీలంకకు కూడా సొంతగడ్డపై దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ 3-0తో ఒక క్వీన్స్వీప్ ఎదురైంది. 2004లో ఆస్ట్రేలియా చేతిలో ఆ జట్టు మూడు టెస్టుల సిరీస్ను ఒక విజయం కూడా లేకుండానే చేజార్చుకుంది. మూడు టెస్టుల సిరీస్లో ఒక జట్టు దాని సొంతగడ్డపై వైట్వాష్కి గురవడం టెస్టు చరిత్రలోనే ఇది ఏడోసారి. ఆగస్టు 20 నుంచి శ్రీలంకతో భారత్ జట్టు ఐదు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్లో పోటీపడనుంది. | 2sports
|
Suresh 136 Views
టాప్-10లో తొలిసారి అప్ఘనిస్తాన్
షార్జా: నాలుగు రోజుల క్రితం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో 49 పరుగుల తేడాతో విజయం సాధించిన అప్ఘనిస్థాన్ తన ర్యాంకును కూడా మరింత మెరుగుపర్చుకుంది.కాగా ఈ విజయంతో అప్ఘనిస్థాన్ రెండు ర్యాంకులు పైకి ఎగబాకి 10వ ర్యాంకుకు చేరింది.దీంతో పసికూన అప్ఘనిస్థాన్ వన్డేల్లో తొలిసారి టాప్-10లో చోటు సంపాదించింది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో అప్ఘనిస్థాన్ మొదటిసారి టాప్ టెన్లో స్థానం సంపాదించగా,జింబాబ్వే మరింత కిందికి పడిపోయింది.ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న అయిదు వన్డేల సిరీస్ను అప్ఘనిస్థాన్ కైవసం చేసుకుంటే 10వ ర్యాంకు పదిలంగా ఉంటుంది.ఒకవేళ సిరీస్ను కోల్పోయిన పక్షంలో తిరిగి 12వ ర్యాంకుకు చేరుతుంది.అప్ఘనిస్థాన్ తరువాత స్థానాల్లో ఐర్లాండ్,జింబాబ్వే నిలిచాయి. | 2sports
|
TS IT Secretary Jayesh Ranjan
టి-హబ్ తరహాలోనే హార్డ్వేర్కు టి-వర్క్ హబ్
హైదరాబాద్: టి-హబ్ తరహాలోనే టి-వర్క్స్ ఏర్పాటుద్వారా హార్డ్ వేర్ రంగంలోని స్టార్టప్ యూనిట్లకు మరింత ప్రోత్సాహం కల్పించనున్నట్లు తెలంగాణ ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ హార్డ్వేర్ టి-హబ్ ప్రారంభించనున్నట్లు ఆయన వివ రించారు. వర్సిటీ శతవార్షికోత్సవాల సందర్భంగా ఈ టి-వర్క్ హబ్ను ప్రారంభిస్తామన్నారు. భారత రాష్ట్ర పతి ప్రణబ్ముఖర్జీ చేతులమీదుగా టి-వర్క్ను ప్రారం భించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వంతో పాటు సిసిఎండి, ఐఐసిటి, ఎల్విప్రసాద్ నేత్రవిజ్ఞానసంస్థ, ఇక్రిసత్ వంటి సంస్థలు వీటిలో పాలుపంచుకుంటాయ న్నారు. ప్యాకేజింగ్లో కొత్త పోకడలు అన్న అంశంపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. సదస్సులో భాగంగా ఆయన మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం కూడా 500 ఎగుమతి ఆధారిత సంస్థల ఉత్పత్తులకు ప్యాకేజింగ్ విధానం ఆధునీకరించాలని నిర్ణయించిందని అన్నారు. ఐఐపి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్సి సాహా కూడా ఇదే అంశాన్ని స్పష్టంచేశారు. జర్మనీ కేంద్రంగా ఉన్న ఒక ప్రచురణసంస్థ స్ప్రింగర్ రూపొందించిన పరిశోధనాత్మక జర్నల్ను ఐఐపి సదస్సులో విడుదలచేసారు. చైనా తర్వాత ఆసియాలో ఇదే రెండో చారిత్రక జర్నల్ అని వక్తలు నిపుణులు వెల్లడించారు. అంతేకాకుండా ఐఐపిప్యాకేజింగ్లో బిటెక్, ఎంటెక్కోర్టులు, పిహెచ్డి కోర్సులు కూడా ప్రారం భిస్తున్నట్లు డైరెక్టర్ వివరించారు. యుజిపి గుర్తింపు కూడా వస్తున్నదని, మొదటి బిటిఎక్ తరగతులు 2018 విద్యాసంవత్సరంనుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తమకు ఐదెక రాల స్థలం కేటాయిస్తే స్థానిక కార్యకలాపాలు మరిం త పెంచుతామని ఐఐపిడైరెక్టర్ వివరించారు. 2020 నాటికి భారతీయ ప్యాకేజింగ్ మార్కెట్ 32 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని సాహా వెల్లడించారు. డైరెక్టర్ సాహా మాట్లాడుతూ తేయాకు, కాఫీ, మషాలాదిను సులతో పాటు పువ్వులు, పండ్లు వంటి వాటికి ప్యాకే జింగ్ అనివార్యమని వెల్లడించారు. ఇప్పటికే 28 రకాల పండ్లకు ఉండాల్సిన ప్యాకేజింగ్ ప్రమాణాలను సూచిస్తూ ఎపెడాకు నివేదిక ఇచ్చామన్నారు. ఇప్పటికే సంస్థ పరంగా పదిమంది పిహెచ్డిలు పనిచేస్తున్నారన్నారు. ఐఐపిపరంగా హైదరాబాద్తోపాటు కాకినాడు, గౌహతి, బెంగళూరు, అహ్మదాబాద్లలో కూడా సంస్థలను ఏర్పాటుచేస్తుందని డైరెక్టర్ వివరించారు. సుమారు 300 మందికిపైగా వివిధ రంగాల ప్యాకేజింగ్నిపుణులు ఈసదస్సులో పాల్గొన్నారు. సదస్సుకుజర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఇతరదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కబాలి సినిమాకు లైన్ క్లియర్
కబాలి విడుదలకు లైన్ క్లియర్ అయింది. శుక్రవారమే కబాలి థియేటర్లలోకి రాబోతోంది.
TNN | Updated:
Jul 21, 2016, 01:18PM IST
కబాలి విడుదలకు లైన్ క్లియర్ అయింది. శుక్రవారమే కబాలి థియేటర్లలోకి రాబోతోంది. లింగా సినిమా పంపిణీదారులు కబాలి సినిమా విడుదలను ఆపాలని కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఈ కేసులో రజినీకాంత్ కి, కబాలి నిర్మాత థానుకి నోటీసులు పంపించింది. గురువారం ఈ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు... కబాలి విడుదలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. దీంతో రజినీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి టిక్కెట్లు కొనుక్కున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. లింగా సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. పంపిణీదారులకూ బాగా నష్టాలొచ్చాయి. ఒక పంపిణీదారు అయిన ఆర్.మహాప్రభు తనకు వచ్చిన నష్టాన్ని రజినీకాంత్, లింగా సినిమా నిర్మాత పూడ్చేవరకు కబాలి సినిమా విడుదల ఆపాలని కోరుతూ కోర్టుకెక్కారు. దాంతో కబాలి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
పవన్లో నాకు ‘జార్జిరెడ్డి’ కనిపిస్తాడు.. అదే ఆవేశం, ఐడియాలజీ: నాగబాబు
సందీప్ మాధవ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. విద్యార్థి సంఘ నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. జీవన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈనెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Samayam Telugu | Updated:
Nov 13, 2019, 06:16PM IST
‘జార్జిరెడ్డి’ గురించి నాగబాబు
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో విప్లవాన్ని లేవదీసిన విద్యార్థి సంఘ నాయకుడు, పీడీఎస్యూ వ్యవస్థాపకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా వస్తోంది. ఆ సినిమా పేరు కూడా ‘జార్జిరెడ్డి’. సందీప్ మాధవ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. జీవన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈనెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈనెల 15న నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని ప్రకటించిన తరవాత ‘జార్జిరెడ్డి’ సినిమా గురించి ఎక్కువమందికి తెలిసింది.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ను చూసిన మెగా బ్రదర్ నాగబాబు ముగ్దుడైపోయారు. ఇది అసలు సిసలు బయోపిక్ అని అన్నారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో జార్జిరెడ్డి గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. జార్జిరెడ్డి గురించి పద్దెనిమిది ఇరయ్యేళ్లుగా వింటున్నానని చెప్పారు. జార్జిరెడ్డి పాత్రను పవన్ కళ్యాణ్తో, ఆ తరవాత వరుణ్ తేజ్తో చేద్దామని అనుకున్నానని నాగబాబు వెల్లడించారు. కానీ, ఈ లోపల దర్శకుడు జీవన్ రెడ్డి తీసేశారని తెలిపారు.
Also Read:
అల్లు అర్జున్ తొందరపాటు.. చిల్డ్రన్స్ డే సర్ప్రైజ్ లీక్!
ట్రైలర్ చూసిన తర్వాత జార్జిరెడ్డి లాంటి పాత్రకు బాగా పేరున్న నటుడు అయితే అంతగా సరిపోడని తనకు అనిపించిందన్నారు. సాండీ (సందీప్ మాధవ్) గురించి ఇప్పటి వరకు పెద్దగా ఎవ్వరికీ తెలియదు కాబట్టి జార్జిరెడ్డి పాత్రకు చక్కగా సరిపోయాడని అన్నారు. జార్జిరెడ్డే చేస్తున్నాడా అన్నంతగా సూటయ్యాడని చెప్పారు. ‘‘జార్జిరెడ్డి ఒక లెజండరీ స్టూడెంట్. ఆంధ్ర, కేరళకు చెందిన భార్యభర్తలకు పుట్టిన వ్యక్తి జార్జిరెడ్డి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లో ఆల్ ఇండియా లెవ్లో గోల్డ్ మెడలిస్ట్. ఆ రోజుల్లోనే ఇస్రోలో పెద్ద ఉద్యోగం వస్తే వదిలేశాడు. కేవలం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం’’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.
జార్జిరెడ్డి కేవలం ఇంటెలిజెంట్ మాత్రమే కాదని, బాక్సర్ కూడా అని నాగబాబు వెల్లడించారు. ‘‘రిలయ్ లైఫ్ బాక్సర్. అవసరమైతే 20 మందిని ఒక్కడే కొట్టగలడు. అనేక రకాల విద్యల్లో ప్రావీణ్యం ఉంది. తను అనుకుంటే అడవుల్లోకి వెళ్లి పోరాటం చేసేవాడు. కానీ, సమాజంలో ఉండి, సమస్యలపై పోరాడాడు. ఒక లెజండరీ స్టూడెంట్ గురించి అందరికీ తెలియాలనే నా ఛానల్ ద్వారా ఈ విషయాలను పంచుకుంటున్నా. ఇప్పుడున్న యువత ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు’’ అని నాగబాబు చెప్పారు.
Also Read: గల్లా ఫ్యామిలీ పక్కా ప్రణాళిక.. వాళ్లలా చేతులు కాల్చుకోరట!
జార్జిరెడ్డి ఒకవేళ ఇప్పుడు ఉండుంటే సీఎం, పీఎం అయ్యేవారని నాగబాబు అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యక్తి గురించి చెబుతుంటే తన ఒళ్లు గగుర్పాటుకు గురవుతుందని అన్నారు. జార్జిరెడ్డి గురించి మాట్లాడినప్పుడల్లా తనకు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తొస్తుంటారని నాగబాబు చెప్పారు. జార్జిరెడ్డి వ్యక్తిత్వం, అగ్రెసివ్నెస్, ఎమోషన్స్ పవన్ కళ్యాణ్లో కనబడతాయన్నారు. అందుకే తన తమ్ముడంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడని అభివర్ణించారు. ‘‘జార్జిరెడ్డి స్ఫూర్తి, ఐడియాలజీ పవన్ కళ్యాణ్ ద్వారా ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎంత కాకతాలీయం అంటే జార్జిరెడ్డి జెండాలో బిగించిన పిడికిలి గుర్తు ఉంది. అదే జనసేన జెండాలో కనిపిస్తుంది’’ అని నాగబాబు వెల్లడించారు.
‘జార్జిరెడ్డి’ అసలు సిసలు బయోపిక్: నాగబాబు
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
మస్కట్ లో ఫుల్ ఎంజాయ్.. తేజ్ కు అలా పడిపోయా: లావణ్య త్రిపాఠి
Highlights
ఇంటిలిజెంట్ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన లావణ్య
తన కేరక్టర్ సంధ్య ఈ మూవీలో చాలా రిచ్ అంటున్న లావణ్య
షూటింగ్ సందర్భంగా మస్కట్ లో ఎంజాయ్ చేసానంటున్న లావణ్య
- ఈ చిత్రం లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
ఈ మూవీ లో నేను సంధ్య క్యారెక్టర్ లో నటించాను. యు ఎస్ లో చదువుకొని ఇండియాకి వచ్చి మా డాడీ బిజినెస్ లు చూస్తుంటాను. చాలా కోపం ఎక్కువ ఎప్పుడూ అందరికన్నా డామినేట్ గా ఉంటుంది.అలాంటి అమ్మాయి ప్రేమలో ఎలా పడింది అనేది సస్పెన్స్.క్యూట్ లవ్ స్టోరీ.యూత్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది.
-సాయిధరంతేజ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
తేజ్ చాలా మంచి యాక్టర్ తో పాటు మంచి డాన్సర్ కూడా.సెట్లో ఎప్పుడూ జోక్స్ వేస్తూ అందరిని నవ్విస్తుంటాడు.చాలా మంచి వ్యక్తి. మస్కట్ లో షూటింగ్ అప్పుడు ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం.మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.లవ్ సీన్స్ అన్నీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. తేజ్ డాన్సులకు పడిపోయా.
- సినిమా మెయిన్ స్టోరీ ఏంటి?
కథ చాలా ఇంటిలిజెంట్ గా ఉంటుంది.వెరీ టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ.ఒక సామాన్య వ్యక్తి తన తెలివితేటల తో సమాజానికి,,పేద ప్రజలకి ఎలాంటి మేలు చేసాడు అనేది మెయిన్ కాన్సెప్ట్.ఇవే కాకుండా ఇంకా మూవీలో చాలా అంశాలు ఉంటాయి.ధర్మ క్యారెక్టర్ లో తేజ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తాడు.
- డ్యాన్స్ విషయంలో ఏమైనా ప్రాక్టీస్ చేశారా?
ఫస్ట్ టైం ఈ చిత్రం లో డ్యాన్సులు బాగా ప్రాక్టీస్ చేసి చేశాను.నా ఫెవరెట్ లెజండరీ యాక్టర్ చిరంజీవి గారి "చమక్ చమక్" సాంగ్ ని తెలుగు,హిందీ లో చూసాను.ఆపాటని రీమిక్స్ చేయడం చాలా కష్టం.అయినా ఈ మూవీ లో చేసాం. వెరీ బ్యూటిఫుల్ సాంగ్.సెల్ ఫోన్,కళ కళ కళామందిర్,పాటలు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.తేజ్ తో డాన్స్ చేయడం బాగా ఎంజాయ్ చేసాను.
- వి వి వినాయక్ తో మీ వర్కింగ్ ఎక్స్పీపీరియన్స్?
వెరీ హంబుల్ అండ్ వెరీ స్వీట్ డైరెక్టర్.పెద్ద డైరెక్టర్ అయినా కూడా డౌన్ టు ఎర్త్ గా వుంటారు.చాలా కంఫర్టుబుల్ గా సెట్లో వుంటారు.ఆయనకేం కావాలో క్లియర్ గా తెల్సు.ఏ సీన్ అయినా చాలా ఫాస్ట్ గా తీస్తారు.నటిగా అయన దెగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను.
- సినిమా హిట్ ప్లాప్ లను మీరు ఎలా స్వీకరిస్తారు?
హిట్ ప్లాప్ అనేది కామన్.సక్సెస్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం..ఫైల్యూర్ వచ్చినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో చూసుకొంటాం.ఫీడ్ బ్యాక్ అనేది కచ్చితంగా తీసుకుంటాను.భలే భలే మగాడివోయ్,,సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు కమర్షియల్ గా నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అలాగే ఇంటిలిజెంట్ కూడా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
- నెక్స్ట్ ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు?
డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలననుకుంటాను.ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి సినిమాలోనా క్యారెక్టర్ ని ఎంతో ఇష్టపడి చేశాను.
- సి కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేయడం ఎలా అనిపించింది?
సి కళ్యాణ్ గారు వెరీ ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్.ప్రతిరోజూ సెట్ కి వచ్చి అందరికి ఎం కావాలో అన్నీ దెగ్గరుండి చూసుకునేవారు.క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని బ్యూటిఫుల్ గా నిర్మించారు.పాటలకి మాత్రమే కాకుండా ఫైట్స్ కి కూడా భారీగా సెట్స్ వేసి తీశారు.అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సి వి రావు,పత్సా నాగరాజ్ ఇద్దరూ చాలా కోపరేట్ చేసి సినిమాని వండర్ ఫుల్ గా చేశారు.సి కె లో మల్లి మల్లి వర్క్ చేయాలనీ వుంది.
- ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ కి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది.?
చాలా హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది.రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది.దాదాపు యాభై వేలమందికి పై గా హాజరయ్యారు.చాలా సంతోషం గా అన్పించింది?సాంగ్స్ అన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి.థమన్ ఎక్స్టెర్ధనారీ మ్యూజిక్ ఇచ్చాడు.థమన్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది.
- మీ క్యారెక్టరికి డబ్బింగ్ చెప్పే ఆలోచన ఏమైనా ఉందా?
డెఫినెట్ గా చెప్పాలని వుంది.ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను.ఇంకా ఇంప్రూవ్ అయ్యాక డబ్బింగ్ చెప్తాను.
- నెక్స్ట్ కమిట్ అయిన మూవీస్ ఏంటి?
గీతా ఆర్ట్స్ బేనర్ లో విజయ్ దేవర కొండ సరసన చేస్తున్నాను.పరశురామ్ డైరెక్టర్.తమిళ్,మలయాళం నుండి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి.ఇంకా ఏది కమిట్ కాలేదు.నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుకే ఇస్తాను.హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం అన్నారు.
Last Updated 25, Mar 2018, 11:58 PM IST | 0business
|
స్వల్పలాభాలతో ముగిసిన మార్కెట్లు
డాలర్ వర్సెస్ రూపాయి 66.36
ముంబై : బెంచ్మార్క్ సూచీలు నత్తనడకన జరిగిన ట్రేడిం గ్తోపాటు కాంట్రాక్టు డెలివరీల కాల పరిమితి ముగియడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా కొనుగోళ్లు జరపడంతో స్వల్పమొత్తంలో మాత్రమే ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్లు జరిగాయి. నాలుగు వారాల పాటు గరిష్ట స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్లు ముందురోజే దిగజారాయి. ఎస్అండ్పి బిఎస్ఇ సెన్సెక్స్ 26,079 పాయింట్లవద్ద స్థిరపడింది. 45 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 50 కూడా నాలుగు పాయింట్లు పెరిగి 7929 పాయింట్లవద్ద స్థిరపడింది. బిఎస్ఇ మిడ్క్యాప్ సూచి 0.4శాతం లాభాల్లో నడిస్తే స్మాల్క్యాప్సూచి 0.1శాతం దిగువన ముగిసింది. ఎఫ్అండ్ఎ కాలపరిమితి ముగియడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురుధరలపై కూడా ఇన్వెస్టర్లు ఎక్కువ శ్రద్ధచూపించారు ఇక కేరళలో విధించిన మద్య నిషేధం ఉత్తర్వులను కొనసాగించాలనే సుప్రీం అభిప్రాయపడతంతో కొంతమేర మద్యం తయారీ కంపెనీలు షేర్లు వత్తిడికి లోనయ్యాయి. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 302.62 కోట్లు సోమవారం అమ్మకాలు జరిపారు. దేశీ య సంస్థాగత ఇన్వెస్టర్లు 987.82 కోట్ల రూపాయలు కొనుగోళ్లు జరిపారు. ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ బ్రెంట్ ముడిచమురు బ్యారెల్కు 36.82 డాలర్లుగా నడి చింది. బంగారం కూడా స్వల్పంగా ధరలు పెరిగా యి. ఎనిమిదిరోజుల పెరుగుదలను కట్టడిచేస్తే డాలరుతో రూపాయి 17 పైసలు క్షీణించి 66.36 వద్ద స్థిరపడింది. ఇక దేశీయంగా చూస్తే డిసెం బరులో బజాజ్ఆటో, హీరోమోటోకార్ప్, ఎంఅండ్ ఎం సంస్థలు 1-1.5శాతం మధ్య పెరిగాయి. మారుతి సుజుకి నిలకడగా కొనసాగింది. గెయిల్ ఇండియా ఒకటిశాతం పెరిగింది హెచ్డిఎఫ్సి ఒకటి శాతం పెరిగింది. ఇంద్రప్రస్థ మెడికల్కార్పొరేషన్లో 2.12శాతం షేర్లు విక్రయించాలని నిర్ణయించడమే ఇందుకుకీలకం. ఇక బ్రూవరీస్, డిస్టిలరీస్ షేర్లు నష్టపోయాయి. యుబిగ్రూప్ నాలుగుశాతం, యునైటెడ్ స్పిరిట్స్ 3శాతం, తిలక్నగర్ ఇండస్ట్రీస్ 2శాతం, జగత్జిత్ ఇండస్ట్రీస్ నాలుగు శాతం, ఎంపి డిస్టిలరీస్ 3శాతం దిగువన ముగి సాయి. ఇక ఇండియన్ ఆయిల్కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లు అంతర్జాతీయ ధరలను సమీక్షించుకని ధరలను నిలకడగా కొనసాగించాయి. ఈ కంపెనీలన్నీ సంయుక్తంగా ఒక మెగా రిఫైనరీరి మహారాష్ట్రలోని రత్నగిరి వద్ద ఏర్పాటుచేస్తు న్నాయి. సరిగమ ఇండియా 0.6శాతం తగ్గిం ది. రిలయన్ క్యాపిటల్ మొత్తం 11.88 లక్షల కంపెనీ షేర్లను కొనుగోలుచేసింది. రిలయన్స్ కేపిటల్ 2.5శాతం ముగిసింది. రిల్ఇన్ఫ్రా 3.3శాతం పెరిగింది. ఎన్బిసిసి 0.3శాతం క్షీణించింది. కంపెనీ 328.08 కోట్ల రూపాయల ఆర్డర్లను సాధించింది. నబీనగర్ పవర్ జనరేటింగ్ కంపెనీ నుంచి ఒక టౌన్షిప్ ప్రాజెక్టును సాధించింది. ఎన్టిపిసి, బీహార్స్టేట్ పవర్జెన్కో జాయింట్ వెంచర్గా నబీనగర్ ప్రాజెక్టు పనిచేస్తోంది. ఎడ్యుకామ్ సొల్యూషన్స్ ఒకటిశాతం పెరిగాయి. సువెన్ఐఫ్ సైన్సెస్ మూడుశాతం బిఎస్ఇలో పెరిగాయి. యూరోప్, మకావు దేశాలనుంచి కొత్త ఉత్పత్తి పేటెంట్లను సాధించింది. భెల్ 1.5శాతం నష్టపోయఇంది. మోర్గాన్ స్టాన్లీ భెల్ యాదాద్రి థర్మల్ప్రాజెక్టుపై కలవరం వ్యక్తంచేసింది. ఇతరత్రా హెచ్యుఎల్, ఐటిసి, కోల్ ఇండియా, ఎల్అండ్టి వంటి సంస్తలు 0.5 నుంచి 1.5శాతం క్షీణించాయి. | 1entertainment
|
Sep 02,2017
7 నుంచి అగ్రిటెక్స్ ప్రదర్శన
హైదరాబాద్: అగ్రిటెక్స్ ఐదో ఎడిషన్ను సెప్టెంబర్ 7-9వ తేది వరకు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు హైటెక్స్ గ్రౌండ్స్లో జరుగనున్న ఈ కాన్ఫరెన్స్, వాణిజ్య ప్రదర్శనలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో అధునిక పోకడలపై వివరించనున్నారు. వ్యవసాయ రంగం, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర వాటిపై సమాచారం లభించనుందని కేన్స్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు చేస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో జాన్ డీరే, కేప్టేన్, ఇక్రిసాట్, కావేరీ పైప్స్, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ లాంటి సంస్థలు పాల్గొనడానికి ముందుకు వచ్చాయన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Moris
చెలరేగిన సంజూ శాంసన్
పుణే: ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ టాస్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది.పుణే సూపర్ జెయింట్స్ బ్యాటింగ్కు దిగి16.1 ఓవర్లలో 108 పరుగులు చేసి ఆలౌటైంది.దీంతో పుణేపై ఢిల్లీ 97 పరుగులతో ఘన విజయం సాధించింది.ఢిల్లీ యువ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ 63 బంతులు ఆడి 8 బౌండరీలు,5 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు.క్రిస్ మోరిస్ 9 బంతులు ఆడి 4 బౌండరీలు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి చెలరేగాడు.దీంతో ఢిల్లీ 205 పరుగుల స్కోరుకు చేరుకుంది.ఐపిఎల్లో తొలి సెంచరీ చేసి శాంసన్ ఆకట్టుకున్నాడు.
జట్టు స్కోరు 2 వద్ద ఢిల్లీ ఓపెనర్ ఆదిత్య తారే జిరో వికెట్ తీసి పుణేకు మంచి శుభారంభాన్ని అందించాడు.దూకుడుగా ఆడుతున్న మరో ఓపెనర్ సామ్ బిల్లింగ్స్ 24 ను స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ బౌల్డ్ చేశాడు.క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి శాంసన్ నిలకడగా ఆడుతూ జట్టుకు మంచి పునాది వేశాడు. యువ క్రికెటర్ రిషబ్ పంత్ 31తో కలిసి ఢిల్లీకి భారీ స్కోరు అందించే ప్రయత్నం చేశాడు.వచ్చి రాగానే రిషబ్ భారీ షాట్లతో చెలరేగాడు.చివరికి బెన్స్టోక్స్ బౌలింగ్లో పంత్ రనౌట్గా పెవిలియన్కు చేరాడు.అయినప్పటికి శాంసన్ తన జోరును ఏ మాత్రం తగ్గించలేదు.స్పిన్,పేస్ అని తేడా లేకుండా అందరి బౌలింగ్లో సునాయాసంగా బౌండరీలు, సిక్సర్లు బాదాడు.ముఖ్యంగా అశోక్ దిండా వేసిన 18వ ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు,ఒక బౌండరీ బాది 19 పరుగులు చేశాడు.ఆడమ్ జంపా వేసిన 19వ ఓవర్ తొలి బంతిని సిక్స్గా మలిచి తన టి20 కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు.అనంతరం రెండవ బంతికే శాంసన్ ఔటయ్యాడు.
తరువాత క్రీజులోకి వచ్చిన క్రిస్ మోరిస్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతికి అండర్సన్ సింగిల్ తీసుకున్నాడు.తరువాత అయిదు బంతులాడిన మోరిస్ రెండు సిక్సర్లు,రెండు బౌండరీలతో 22 పరుగులు సాధించి ఢిల్లీని 205 పరుగులు దాటించాడు.ఈ మ్యాచ్లో పుణే బౌలర్లు మరోసారి తేలిపోయారు.చాహర్,తాహిర్,జంపా ఒక్కొక్కరికి ఒక వికెట్ లభించింది. తడబడిన పుణే సూపర్ జెయింట్ ఢిల్లీ డేర్ డెవిల్స్ తరువాత బ్యాటింగ్కు దిగిన పుణే సూపర్ జెయింట్స్ తడబడటంతో టార్గెట్ చేరుకోలేకపోయింది. బ్యాట్స్మెన్ అగర్వాల్ మినహా ఎవరూ 20 పరుగుల స్కోరు దాటలేకపోయారు.దాదాపు ఎవరూ సరిగా నిలదొక్కుకోలేదు.ఓపెనర్ అజింక్యా రహానే 9 బంతులు ఆడి 10 పరుగులు చేసి ఖాన్ బౌలింగ్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మరో ఓపెనర్ అగర్వాల్ 18 బంతులు ఆడి 2 బౌండరీలతో 20 పరుగులు చేసి ఖాన్ బౌలింగ్లో మోరిస్కు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్కు చేరిపోయాడు.డు ప్లెసిస్ 7 బంతులు ఆడి 1 బౌండరీతో 8 పరుగులు చేసి నదీమ్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తిపాఠి 5 బంతులు ఆడి 2 బౌండరీలతో 10 పరుగులు చేసి మోరిస్ బౌలింగ్లో నదీమ్కు క్యాచ్ ఇచ్చి క్రీజు నుంచి వెళ్లిపోయాడు.స్టోక్స్ 5 బంతులు ఆడి 2 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ధోనీ 14 బంతులు ఆడి 1 సిక్సర్తో 11 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్లో నైయర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.బాటియా 17 బంతులు ఆడి 1 సిక్సర్తో 16 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్లో మోరిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.చాహర్ 6 బంతులు ఆడి 2 సిక్సర్లతో 14 పరుగులు చేసి ఖాన్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.జంపా 7 బంతులు ఆడి 1 బౌండరీతో 5 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరగా,ఇమ్రాన్ తాహిర్ 2 బంతులు ఆడి జిరో పరుగుల వద్ద నాటౌట్గా నిలిచాడు.దీంతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 16.1 ఓవర్లలోనే ఆలౌటైంది | 2sports
|
CASH
నల్లకుబేరులకు మరో అవకాశ
న్యూఢిల్లీ, డిసెంబరు 12: ప్రభుత్వం నల్లకుబేరులకు మరో అవకాశం ఇస్తోంది. ఇప్పటివరకూ ఐడిఎస్ పథకం కింద 45శాతం చెల్లిస్తే చాలుమొత్తం నల్లధనం చట్టబద్ధంచేసుకునే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత పెద్దనోట్ల చెలా మణి రద్దును ప్రకటించి 2.5 లక్షలకు మించి ఉన్న డిపాజిట్లపై సరైన వివరాలు ఇవ్వనిపక్షంలో 30శాతం జరిమానా పన్ను విధిస్తామని ప్రకటిం చింది. తదనంతరం ఈలెక్కలు తేలని డిపాజిట్లపై 40శాతం విధిస్తామని ప్రకటించింది. కొత్తగా పన్నుచట్టాలను సవరించిన మోడీప్రభుత్వం తాజాగా ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్యోజనపథకం ప్రారంభించి లెక్కలు తేలని సొమ్ములో 50శాతం సర్ఛార్జి, పన్నులరూపంలో విధిస్తుంది. బ్యాంకుల్లో ఉన్న ఈ డిపాజిట్లలో 50శాతం ఈపథకం కిందకుపోతుంది.మిగిలిన 50 శాతంలో 25శాతం సొమ్ము నాలుగేళ్లపాటు బ్యాంకుల్లోనే కొనసాగించాలి. అందుకుగాను ఎటువంటి వడ్డీ లభించదు. ఆర్థికశాఖ పరిధిలని రెవెన్యూ విభా గం ఈ వారం చివరిలోనే పిఎంజికెవై 2016ను నోటిఫైచేస్తుంది. ఈ పథకం పన్నుచట్టాల రెండో సవరణ బిల్లు 2016 పరిధిలోనే ఉంటుంది.
ఈ బిల్లును గడచిన నెల 29వ తేదీనే లోక్సభ ఆమోదించింది. రెవెన్యూవిభాగం ఇచ్చే నోటిఫికేషన్లో డిక్లరేషన్లు ఎలా ఉండాలి, ఏఏఫార్మాట్లరూపంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి మొత్తమా లేక వాయిదాలరూపంలో ఉంటుందా అన్నది వివరాలు ఉంటాయి. పిఎంజికెవై స్కీం గడువుతేదీ కూడా ఈ వారం చివరిలోనే ప్రకటిస్తారు. లోక్సభలో ఈ బిల్లును నగదుబిల్లుగా ప్రవేశపెట్టారు. దీనివల్ల రాజ్యసభ ఆమోదం కూడా పొందనవసరం లేదు. వాస్తవానికి లోక్ సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభకు వస్తే ఆబిల్లును 14రోజులలోపు వెనక్కి పంపించాల్సి ఉంటుంది. ఈ బిల్లు రాజ్యసభ సచివాలయానికి చేరిన తేదీ నుంచి ఈ 14 రోజులను లెక్కిస్తారు. నవంబరు 30వ తేదీ పంపిస్తే 14వ రోజు డిసెంబరు 14వ తేదీగా ఉంటుంది. అందువల్లనే ఈ బిల్లును నగదు బిల్లుగా ఆమోదింపచేసి వెనువెంటనేరాష్ట్రపతి అభిప్రాయానికి పంపిస్తోంది. పిఎంజికెవై పథకం కింద లెక్కలు తేలని సొమ్ముకు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలేమీ అడగరు. సంపదపన్ను, పౌరచట్టాలు, ఇతర పన్ను చట్టాలనుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. అయితే విదేశీ మారక ద్రవ్యచట్టం, మనీలాండరింగ్నిరోధక చట్టం, మాదకద్రవ్యాలు, విదేశీ నల్లధన చట్టాలకింద మాత్రం మినహాయింపు ఉండదు. నల్లధనం, అవినీతిపై మోడీ ప్రభు త్వం మెరుపుదాడులు చేసినవంబరు 8వతేదీ నుంచి రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేసినట్లు ప్రకించిన సంగతి తెలిసిందే. ఈనోట్లు ఉన్న వారందరినీ బ్యాంకుల్లో డిపాజిట్చేసుకోవాలని ప్రకటించింది.
నవంబరు 10వ తేదీనుంచి ఇప్పటివరకూ 11.85 లక్షల కోట్లు జమ అయ్యాయి. చెలామణిలో ఉన్న కరెన్సీలో రద్దయిన నోట్ల వాటా 86శాతంగా ఉంటుందని అంచనావేసారు. అంటే 14.5 లక్షలకోట్లు కరెన్సీనోట్లను రద్దు చేసిందన్నమాట. అయితే ఈ నల్లధనం ఇంకా ఉన్నట్లు అనుమానిస్తున్న కేంద్రం వారికిమరో అవకాశంగా పిఎంజికెవై ప్రవేశపెడుతోంది. | 1entertainment
|
Hyd Internet 174 Views SAMSUNG logo
SAMSUNG logo
హైదరాబాద్ః వాషింగ్ మిషన్ మరమ్మతు విషయంలో తలెత్తిన వివాదం వినియోగదారుల కోర్టు వరకు వెళ్లింది. వినియోగదారుడి ఇంట్లో చెప్పిన మరమ్మతు రుసుం..వాషింగ్ మిషన్ను వర్క్షాప్కు తీసుకెళ్లాక అమాంతం పెరిగింది. ఇంజినీరు మాట మార్చడంతో వినియోగదారుడు కంగుచిన్నాడు. అవకాశాన్ని ఆసరాగా చేసుకుని రుసుం పెంచడమేంటని కోర్టుకెక్కాడు. పూర్వాపరాలను పరిశీలించిన హైదరాబాద్ జిల్లా-3 వినియోగదారుల కోర్టు.. శామ్సంగ్కు రూ.13 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీనగర్ కాలనీకి చెందిన సి.ప్రభాకర్రెడ్డి 2011 ఏప్రిల్లో కావూరిహిల్స్లోని ఆర్-లాజిక్ టెక్నాలజీ సర్వీసెస్లో వాషింగ్ మిషన్ కొనుగోలు చేశాడు. దాని ఖరీదు రూ.19 వేలను చెక్కు ద్వారా చెల్లించాడు. 2016 ఫిబ్రవరి 20న యంత్రం మొరాయించడంతో తయారీ సంస్థకు సమాచారం ఇచ్చాడు. ఇంటికి వచ్చిన ఇంజినీరు పరిశీలించి డ్రమ్ పాడైందని,. చక్కదిద్దాలంటే రూ.3-4 వేలు ఖర్చు అవుతుందని, యంత్రాన్ని వర్క్షాపు తీసుకెళ్లాలని చెప్పాడు. అందుకు వినియోగదారుడు అంగీకరించాడు. సదరు ఇంజినీరు వారం తర్వాత ఫోన్ చేసి మరమ్మతు రుసుం రూ.12 వేలు అయిందన్నాడు. దీంతో వినియోగదారుడు కొనుగోలుతో సంబంధమున్న ఆర్-లాజిక్ టెక్నాలజీ సర్వీసెస్, బేగంపేట్లోని శామ్సంగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రాంతీయ కార్యాలయం, పంజాగుట్టలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్కు లీగల్ నోటీసులు పంపాడు. ఇంట్లో ఒక ధర చెప్పి.. యంత్రాన్ని తీసుకెళ్లాక మాట మార్చడం మోసమని పేర్కొన్నాడు. యంత్రం కొనుగోలు చేసి ఐదేళ్లు అయినందున మరమ్మతు రుసుం వినియోగదారుడు భరించాల్సి వస్తుందని శామ్సంగ్ సంస్థ రాతపూర్వకంగా వాదన వినిపించింది. సమస్యను పరిశీలిస్తే మరమ్మతుకు రూ.4,360 మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపింది. వాదనలు విన్న కోర్టు ఇంజినీరు మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర ప్రతివాదులతో సంబంధం లేకుండా శామ్సంగ్ మాత్రమే వినియోగదారుడికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. | 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.