page_content
stringlengths 11
4.1k
|
---|
చెన్నై : వర్దా తుపాను చెన్నైలో బీభత్సం సృష్టించింది. జనజీవనంపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. గంటకు 140 కి.మీ. వేగంలో వీచిన పెను గాలులకు మహావృక్షాలు కూకటివేళ్లతో నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. చెన్నైలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మహానగరం జలసంద్రంగా మారింది.
చెన్నైలో 15 నుంచి 20 సె.మీ. వర్షపాతం
బంగాళాఖాతంలో ఏర్పాడిన వర్దా తుపాను చెన్నై సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో గంటలకు 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులకు మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో 15 నుంచి 20 సె.మీ. వర్షపాతం నమోదైంది. మరికొన్ని గంటలపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రం అల్లకల్లోంగా మారింది.
పలు ప్రాంతాల్లో విరిగిన వృక్షాలు, హోర్డింగ్లు రైల్వే ట్రాక్లపై పడ్డాయి. కొన్ని చోట్ల రైలు పట్టాలపైకి వర్షం నీరు చేరింది. దీంతో చెన్నై-గూడూరు మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్నిరైళ్లను రద్దు చేశారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంకొన్నింటిని దారి మళ్లించారు. నెల్లూరు జిల్లా సూళ్లురుపేట సమీపంలో రైలు పట్టాలు దెబ్బతినడంతో చెన్నై వెళ్లే కొన్ని రైళ్లను గూడూరు నుంచి రేణిగుంట మీదుగా పంపిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో దేశ, విదేశాల నుంచి చెన్నై చేరుకోవాల్సిన 25 విమానాలను హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టులకు మళ్లించారు. వర్షాలు, పెనుగాలులు తగ్గిన తర్వాత విమానాశ్రయాన్ని పునపుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు.
మురికివాడల్లో రేకుల షెడ్లు కూలిపోయి భారీ నష్టం జరిగింది. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పెను గాలులు, భారీ వర్షాలు తగ్గిన తర్వాత సహాయ, పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నష్టం వివరాలను సేకరించేందుకు ప్రత్యేక అధికారుల బృందాలను నియమించింది. తుపాను ప్రభావం నుంచి చెన్నై తేరుకోవడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వర్దా తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మునిసిపల్ అధికారులు, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో మునిగిపోయారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు రంగంలోకి దిగి సహాయచర్యలు చేపడుతున్నాయి.
సహాయక చర్యలు
వర్దా తుపాను దెబ్బకు చెన్నై వణుకుతోంది. తుపాను ధాటికి గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో మురికివాడల్లో చిన్న చిన్న గుడిసెలు, రేకుల షెడ్లు నేలకూలాయి. ఇక్కడి ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, నగరంలోని పెద్ద పెద్ద హోర్డింగులు విరిగిపడ్డాయి. ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే అప్రమత్తవడంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
200 అమ్మ క్యాంటీన్లలో ప్రజలకు భోజనం
తుపాను కారణంగా నిరాశ్రయులైన వారికి, తుపాను బాధితులకు ఉచితంగా ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నై నగరంలోని సుమారు 200 అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా అల్పాహారంతో పాటు, భోజనం, నీరు ప్రజలకు అందించడం ప్రారంభించారు. ఇప్పటికే పదివేల మందిని 176 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సముద్ర తీరానికి దగ్గర్లో ఉన్నవారిని కల్యాణ వేదికల వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. దాదాపు ఆరు బృందాలు రంగంలోకి దిగాయి. మరో బృందాన్ని రిజర్వ్లో ఉంచారు. వీటిలో ఓ బృందాన్ని తిరువళ్లూరులో మోహరించారు. అప్రమత్తమైన నావికాదళం రాజాలి, డేగా ఎయిర్స్టేషన్ల వద్ద విమానాలతో సిద్ధంగా ఉంది. అవసరమైతే ఉపయోగించేందుకు వీలుగా హార్బర్ సర్వే నిర్వహించేందుకు సర్వే షిప్ను రిజర్వ్లో ఉంచారు. విశాఖపట్నం వద్ద 22 డైవింగ్ జట్లను సర్వసన్నద్ధంగా ఉంచారు. శివాలిక్, కడ్మట్ నౌకల్లో సిద్ధంగా ఉన్న పది డైవింగ్ బృందాలతో పాటుగా అదనంగా మరో ఆరు బృందాలను తమిళనాడు, పుదుచ్చేరి నౌకా ప్రాంత ఫ్లాగ్ ఆఫీసర్ ఇప్పటికే సిద్ధంగా వుంచారు.
Read more about వర్దా బీభత్సం
నగదు రహిత లావాదేవీలపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ : నగదు రహిత లావాదేవీలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇబ్రహీంపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచిందన్నారు.
Read more about నగదు రహిత లావాదేవీలపై సీఎం కేసీఆర్ సమీక్ష
Read more about ఎపిలో వర్ధా తుపాన్ ప్రభావం ..విశ్లేషణ
బలవంతపు భూసేకరణ సరికాదు : నిజ నిర్ధారణ కమిటీ |
తూర్పుగోదావరి : బలవంతపు భూసేకరణ సరికాదని నిజ నిర్ధారణ కమిటీ బృందం అభిప్రాయపడింది. దివీస్ ప్రాజెక్టు నిర్మిత ప్రాంతంలో నిజ నిర్దారణ కమిటీ పర్యటించింది. రైతులు, వృత్తికారులు, మత్స్యకారులతో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కమిటీ సభ్యులు స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు సభ్యులు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని..వాస్తత పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. ఎపిలో ఆటవిక న్యాయం తాండవిస్తోందని మండిపడ్డారు. దివీస్ ల్యాబ్ వ్యతిరేకించే వారిని నరికేస్తామని వీరంగం చేస్తూ రాత్రి ఒక అతను మహిళపై కత్తితో దాడి చేశాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. మహిళను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు. ఎపి సర్కార్ దివీస్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దివీస్ యాజమాన్య రౌడీయిజం చేస్తుందని చెప్పారు. దివీస్ ల్యాబ్ ఏర్పాటు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ, ప్రభుత్వం యాజమాన్యానికి మద్దుతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
Read more about బలవంతపు భూసేకరణ సరికాదు : నిజ నిర్ధారణ కమిటీ
చెన్నైలో భారీ వర్షం
చెన్నై : వర్ధా తుపాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షం కురుస్తోంది. చెన్నై...గూడూరు మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై..గూడూరు వెళ్లే రైళ్లను రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. చెన్నై..ఎగ్మోర్ మధ్య 17 రైళ్లను రద్దు చేశారు. చెన్నై కేంద్రంగా నడిచే లోకల్ రైళ్లన్నీ రద్దు అయ్యాయి.
Read more about చెన్నైలో భారీ వర్షం
Read more about వర్ధా తుపాన్..ఎపిలో భారీ వర్షాలు
Read more about తుపాన్ బీభత్సంపై విశ్లేషణ...
Read more about ఏపీపై వర్దా ప్రభావం..
ప్రకాశం : వర్దా తపాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో అధికారయంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. తీరప్రాంతంలోని లోతట్టు గ్రామాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చీరాల ఓడరేవులోని మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం ఎఫ్ఎఫ్ఎంఏ అనే యాప్ను తీసుకొచ్చింది. ఇది తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణ పరిస్థితులను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.
Read more about మత్స్యకారుల కోసం ఎఫ్ఎఫ్ఎంఏ యాప్
చెన్నై అతలాకుతలం....
తమిళనాడు : చెన్నైని వర్దా తుపాను అతలాకుతలం చేస్తోంది. తుపాను తీరం దాటడంతో.. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో చెన్నై నగరం చివురుటాకులా వణికిపోతోంది. తుపాను ప్రభావం నగరంపై దాదాపు నాలుగు గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలో 10 నుంచి 15 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
బలమైన గాలులకు చెన్నైలోని హోర్డింగ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు 300పైగా చెట్లు కూలినట్లు చెన్నై నగరపాలక సంస్థ తెలిపింది. వీటిని హుటాహుటిన తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం 176 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయచర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. భారీ వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకు వచ్చే విమానాలను బెంగళూరు, హైదరాబాద్కు మళ్లిస్తున్నారు. సూళ్లూరుపేట సమీపంలో రైలు పట్టాలు దెబ్బతినడంతో విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లను గూడూరు, రేణిగుంట మీదుగా మళ్లిస్తున్నారు.
నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ప్రభావం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించేందుకు ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యం సిద్ధమైంది. నౌకాదళం, నావికాదళం అప్రమత్తంగా ఉన్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు నావికాదళం హెలికాప్టర్లను సిద్ధం చేసింది. తుపాను ప్రభావం ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Read more about చెన్నై అతలాకుతలం....
మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కుమారుడు పీవీ.రాజేశ్వరావు కన్నుమూత |
హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కుమారుడు పీవీ.రాజేశ్వరావు కన్నుమూశారు. డిసెంబర్ 5న గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ సోమాజీగూడ యశోధ ఆస్పుత్రిలో రాజేశ్వరరావు చేశారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజేశ్వరరావు సికింద్రాబాద్ ఎంపీగా పని చేశారు.
Read more about మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కుమారుడు పీవీ.రాజేశ్వరావు కన్నుమూత
తమిళనాడు : చెన్నైపై వర్ధా తుపాను విరుచుకుపడింది. తుపాన్ ధాటికి నగరంలో ముగ్గురు మృతి చెందారు. 200 వందలకు పైగా రోడ్లు ధ్వంసం అయ్యాయి. 200 చెట్లు, హోర్డింగ్స్ లు నేలకూలాయి. 37 విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి.
Read more about చెన్నైలో వర్ధా ధాటికి ముగ్గురు మృతి
హైదరాబాద్ : ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. చెన్నైలో వర్ధా తుపాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షం పడుతుందన్నారు. మరో 12 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది.
Read more about ఈదురు గాలులతో కూడిన వర్షాలు : ఐఎండీ
Read more about భారీ గాలులకు డీజిల్ ట్యాంకర్ బోల్తా
చీరాల ఓడరేవులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
ప్రకాశం : చీరాల ఓడరేవులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. 20 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. తీరం ప్రాంతంలో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Read more about చీరాల ఓడరేవులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
రైసు మిల్లులపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం..
Read more about రైసు మిల్లులపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం..
Read more about సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల బోటు
చిత్తూరు : వర్దా తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు చిత్తూరు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. తుపాను ప్రభావంపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చిత్తూరు కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను సురక్షింత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ముప్పుకు ఎక్కువగా ఆస్కారం ఉన్న శ్రీకాళహస్తి, నగరి, తంబళ్లపల్లి, సత్యవేడు, చిత్తూరు, కుప్పం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చినరాజప్ప అధికారులను ఆదేశించారు.
Read more about అధికారులు అప్రమత్తంగా ఉండాలి : చినరాజప్ప
ప్రకాశం : వర్దా తుపానుతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీమంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. సహాయక చర్యల కోసం పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. వర్దాతుపానుపై ఒంగోలు కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రజలకు నిత్యావసరాలు, మంచినీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున పోలీస్ సేవాదళ్ సభ్యులను, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు.
Read more about తుపానుపై సమీక్షించిన మంత్రి శిద్ధారాఘవరావు
నెల్లూరు : వర్ధా తుపాను చెన్నై వద్ద తీరాన్ని తాకింది. చెన్నైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున్న అలలు ఎగిసిపడుతున్నాయి. ఇటు దక్షిణ కోస్తాంధ్రపై కూడా వర్ధా తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై తుపాను ప్రభావం చూపుతోంది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. 12 నుంచి 24 గంటల వరకు
వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుతోంది. నెల్లూరు జిల్లాలోని తడ, తూళ్లూరుపేట, వాకాడు మండలాలపై తుపాను తీవ్రంగా పడింది. 6 నుంచి 8లక్షల మంది ప్రజలకు అసౌకర్యం కలిగింది. 126 గ్రామాలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎపి ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఆయా జిల్లా కలెక్టర్లు సహాయక చర్యల నిమిత్త అన్యిన ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
Read more about దక్షిణకోస్తాంధ్రపై వర్ధా తుపాను ప్రభావం..
176 పునరావాస కేంద్రాలు
Read more about చెన్నైపై విరుచుకుపడిన 'వర్ధా'..
రోడ్డు ప్రమాదం..ఇద్దరు పిల్లలతో సహా దంపతుల మృతి
రంగారెడ్డి : జిల్లాలోని మైసిగండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా దంపతులు మృతి చెందారు. దంపతులు తమ ఇద్దరు చిన్నారులతో బైక్ పై వెళ్తున్నారు. మార్గంమధ్యలో మైసిగండి వద్ద ప్రమాదవశాత్తు బైక్.. ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో దంపతులతోపాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
Read more about రోడ్డు ప్రమాదం..ఇద్దరు పిల్లలతో సహా దంపతుల మృతి
తెలంగాణ వ్యాప్తంగా 50 మంది డీఎస్పీల బదిలీ
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా 50 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. |
Read more about తెలంగాణ వ్యాప్తంగా 50 మంది డీఎస్పీల బదిలీ
కడ్తాల్ టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
రంగారెడ్డి : కడ్తాల్ టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైకు పై వెళ్తున్న నలుగురు మృతి చెందారు.
Read more about కడ్తాల్ టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
తిరుమలలో భారీ వర్షం
చిత్తూరు : తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. ఫైరింజన్లతో అధికారులు నీటిని తోడేశారు.
Read more about తిరుమలలో భారీ వర్షం
ఇన్ ఫెర్టిలిటికీ హోమియోలో వైద్య విధానాలు...
Read more about ఇన్ ఫెర్టిలిటికీ హోమియోలో వైద్య విధానాలు...
తమిళనాడు : వర్ధా తుపాను చెన్నైపై విరుచుకుపడింది. చెన్నై తీరాన్ని దాటుతున్న వర్ధా తుపాను చెన్నైలో బీభత్సం సృష్టిస్తోంది. పలుప్రాంతాల్లో కుండపోత వర్షాలు కరుస్తున్నాయి. గంటకు 140 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీయడంతో ఎక్కడిక్కడ చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రవాణావ్యవస్థ స్తంభించింది. మరోవైపు సాయంత్రం వరకూ ప్రజలెవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై వర్ధా ప్రభావం తీవ్రంగా చూపుతోంది. పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు కావలి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 30 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. వార్దా తుఫాన్తో ఏపీ సర్కారు అప్రమత్తం అయింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
Read more about చెన్నైలో వర్ధా తుపాను బీభత్సం..
తమిళనాడు : వర్దా తుపాను చెన్నై తీరాన్ని దాటింది. చెన్నైలో సముద్రం అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. గంటలకు 140 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి.
Read more about చెన్నైలో సముద్రం అల్లకల్లోలం
నగదు రహిత లావాదేవీలపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్ : రవాణ, ఆర్టీసీలలో నగదు రహిత లావాదేవీలపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీలోని అన్ని డిపార్టుమెంట్లలో కార్డ్ సిస్టమ్ తెస్తామని చెప్పారు. దీనిపై రేపు మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది పూర్తయ్యే సరికి 100 శాతం నగదు రహిత సేవలు అందిస్తామని పేర్కొన్నారు. 54 ఆర్టీసీ కార్యాలయాలు, 15 చెక్ పోస్టులలో స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చెప్పారు. ఆర్టీసీ బస్సులో పోస్ మిషన్లతో టిక్కెట్లు ఇస్తామన్నారు.
Read more about నగదు రహిత లావాదేవీలపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష
కృష్ణా : మచిలీపట్నంలో సముద్రం 110 మీటర్లు ముందుకొచ్చింది. అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
Read more about మచిలీపట్నంలో 110 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
నెల్లూరు : శ్రీహరికోట షార్ తీర ప్రాంతంలో తమిళనాడుకు చెందిన 18 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు.ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు 8 మందిని రక్షించారు. మగిలిన 10 మందిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
Read more about శ్రీహరికోట షార్ తీర ప్రాంతంలో చిక్కుకున్న మత్స్యకారులు
నెల్లూరు : కావలి రూరల్ మండలం తుమ్మలపెంట వద్ద 5 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. 20...30 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి.
Read more about తుమ్మలపెంట వద్ద 5 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం
వర్దా తుపాను... అప్ డేట్...
Read more about వర్దా తుపాను... అప్ డేట్...
Read more about వర్దా తుపానుపై విశ్లేషణ...
తమిళనాడు : వర్దా తుపాను చెన్నై తీరాన్ని దాటింది. వర్దా తుపాను చెన్సలో బీభత్సం సృష్టించింది. పట్టణంపై విరుచుకుపడింది. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 140 కి.మీవేగతంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
Read more about చెన్నై తీరాన్ని దాటిన వర్దా తుపాను
సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి : బాలకాశి |
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత బాలకాశి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నది రాజ్యాంగం ఆదర్శం. మన దేశ రాజ్యాంగ స్ఫూర్తికి మన ప్రభుత్వాలే తూట్లు పొడుస్తున్నాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, క్యాజువల్, డైలీ వేజ్, వర్క్ చార్జ్ ఇలా రకరకాల పేర్లు పెట్టి, అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ వ్యవహారం సాక్షాత్తు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనంటూ స్పష్టం చేసింది. అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ కార్మిక సంఘాలు పోరుబాటపడుతున్నాయి. డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు'. ఈ అంశాలపై బాలకాశి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
Read more about సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి : బాలకాశి
తమిళనాడు : వర్దా తుపాను చెన్నై తీరాన్ని దాటింది. వర్దా తుపాను చెన్నైలో బీభత్సం సృష్టించింది. పట్టణంపై విరుచుకుపడింది. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 140 కి.మీవేగతంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రవాణా వ్యవస్థ స్తంభించింది. సహాయక చర్యల నిమిత్తం మూడు ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. విజయవాడ నుంచి రేణిగుంట మీదుగా రైళ్లను మల్లించారు. నెల్లూరు నుంచి చెన్నై వెళ్లాల్సిన మెమో రైలును నిలిపివేశారు. సమాచార, సాంకేతిక వ్యవస్థ కూడా దెబ్బతింది. 150 గ్రామాలపై తపాను ప్రభావం చూపుతోంది. నెల్లూరు , ప్రకాశం జిల్లాలపై వర్దా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. నెల్లూరు జిల్లాపై జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
Read more about తీరం దాటిన వర్దా తుపాను....
మొదట బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ అన్నారు. ఇప్పుడు క్యాష్ లెస్ సొసైటీ అంటున్నారు. దీనిపై ప్రధానమంత్రి పార్లమెంట్ లో మాట్లాడాలని ప్రతిపక్షాలు కోరుతుంటే.. 'నన్ను మాట్లాడనీయడం లేదు' అంటూ ప్రధాని చెప్పడం హాస్యాస్పదం అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఒక దేశ ప్రధాని పార్లమెంట్ లో మాట్లాడుతా అంటే ఎవరైనా అడ్డుకుంటారా? అది సాధ్యమా? ఇంతకు మోడీ పార్లమెంట్ లో ఆ ప్రయత్నమే చేయకుండా మాట్లాడనీయట్లేదనడం ఆయన అసమర్థతకు నిదర్శనమని వక్తలు విశ్లేషించారు. ఆ రోజు మాట్లాడుతూ.. 50 రోజుల్లో సమస్య సర్థుకుంటుందని చెప్పిన మోడీ నేడు కూడా 50 రోజుల్లో సద్దుమనుగుతుందని చెప్పడాన్ని బట్టి వారి మాటల్లోని డొల్లతనం బయటపడిందన్నారు. పెద్ద నోట్ల రద్దు-ప్రజల ఇబ్బంధులు.. ప్రభుత్వ పని తీరు మొదలైన అంశాలపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో ఆలోచింపజేసే డిస్కషన్ జరిగింది. ఈ చర్చలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, కాంగ్రెస్ ప్రతినిధి తులసిరెడ్డి, టీడీపీ ప్రతినిధి సాంబశివరావు, బీజేపీ ప్రతినిధి అడ్డెపల్లి శ్రీధర్ పాల్గొన్నారు. డిస్కషన్ చాలా ఆసక్తిగా, అర్థవంతంగా.. ఆలోచింపజేసేదిగా జరిగింది. పూర్తి డిస్కషన్ మీరు వీడియోలో చూడొచ్చు.
Read more about మోడీ అసమర్థత అనుకోవాల్సిందే..
Read more about వార్దా ఘండం.. కుంభవృష్టి..
చిరును పొగడుతున్న కాజల్..ఎందుకో..
మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించాలని హీరోయిన్లు కోరుకుంటుంటారు. కొంతమందికి హీరోయిన్ గా అవకాశాలు దక్కాయి. దీనితో వారి సంతోషాలకు అవధులు ఉండవు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రంలో 'చిరు' పక్కన నటించే అవకాశం 'కాజల్' దక్కింది. ఈ సందర్భంగా 'చిరు'పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. సెట్ లో పూర్తిగా సరదాగా ఉంటారని, సెట్లో ఉన్న వారందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తెలిపారు. షూటింగ్ సమయంలో ఆయనతో సరదాగా జోకులు కూడా వేశానని, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 'చిరంజీవి' గొప్ప డ్యాన్సర్ అంటూ కితాబిచ్చింది. తన డ్యాన్స్ లో కూడా చాలా మార్పు వచ్చిందని, సినిమా రిలీజ్ అనంతరం ఆ మార్పును చూడవచ్చని వ్యాఖ్యానించింది. ఆయనతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపింది.
సురేఖ సమర్పణలో వివి వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి చిత్రానికి రీమేక్. 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.
Read more about చిరును పొగడుతున్న కాజల్..ఎందుకో..
వర్ద.. అంటే ఏమిటీ ? |
వర్ద.. అంటే ఏమిటీ ?
వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద' పేరు పెట్టారు. వర్ద అంటే ఏమిటీ ? వర్ద అంటే అరబిక్, ఉర్దూ భాషల్లో గులాబీ అని అర్ధం. ఈ పేరును పాకిస్తాన్ సూచించింది.
గాలి వేగం గంటకు 39 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే పేర్లు పెట్టేవారు. కరేబియన్ దీవుల్లోని ప్రజలు రోమన్ కేథలిక్ క్యాలెండర్ ప్రకారం ఏ రోజు హరికేన్ లేదా తుపాను ప్రారంభమవుతుందో ఆ రోజు పేరును ఆ తుపానుకు పెట్టేవారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుపాన్లకు పేరు పెట్టడం 2000లో ప్రారంభమై 2004లో ఆచరణలోకి వచ్చింది.
బంగాళాఖాతం, అరేబియా సముద్రం పరిధిలోని దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయ్ లాండ్ లు తుపాన్లకు పేరు నిర్ణయిస్తాయి. ఈ ఎనిమిది దేశాలు కలసి 64 పేర్లతో ఒక జాబితాను రూపొందించింది. ఈ జాబితా ప్రకారం న్యూఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం తుపానుకు పేరు నిర్ణయిస్తుంది.
హిందూ మహా సముద్రంలో వచ్చే తుపానులకు భారత దేశం అగ్ని, ఆకాశ్, బిజిలి, లాల్, లహర్, మేఘ్, సాగర్, వాయు అనే పేర్లు ఇచ్చింది. లైలా పేరును పాకిస్థాన్ పెట్టింది. థానే పేరును మయన్మార్ పెట్టింది. ఆయా దేశాల సామాన్యులు సులువుగా గుర్తు పెట్టుకునేందుకు, తుపానుల ప్రభావాన్ని చారిత్రకంగా నమోదు చేయడానికి తుపానులకు పేర్లు పెడతారు.1953లో అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫానులు వచ్చినపుడు హరికేన్స్, ట్రోపికల్ పేరుతో పిలిచారు. మనదగ్గర నీలం, హెలిన్, లెహెర్, ఫైలిన్, హూద్ హుద్, రౌనా వంటి తుపాన్ లు అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.
తుఫానులకు పేర్లు పెట్టటం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయటం తేలిక అవుతుందని నిపుణుల అంచనా. అందుకే పేర్లు పెడతారు. ఇప్పుడు వర్ద తుపాన్ ఎం చేస్తుందో చూడాలి.
Read more about వర్ద.. అంటే ఏమిటీ ?
Read more about విశాఖకు తప్పిన ముప్పు..!
నెల్లూరు : శ్రీహరికోట షార్ తీర ప్రాంతంలో 18 మంది తమిళనాడుకు చెందిన మత్స్యకారులు చిక్కుకున్నారు. 8మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. 10మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read more about షార్ తీర ప్రాంతంలో చిక్కుకున్న మత్స్యకారులు..
ప్రజలకు బయటకు రావద్దు - వాతావరణ శాఖ..
చెన్నై : వార్దా తుపాన్ నేపత్యంలో సాయంత్రం వరకూ చెన్నైలో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. చైన్నై తో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఆంధ్రాలోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.
Read more about ప్రజలకు బయటకు రావద్దు - వాతావరణ శాఖ..
'ఇళ్ల నుండి బయటకు రావొద్దు'...
చెన్నై : వార్దా తుఫాన్ చెన్నై తీరాన్ని తాకింది. వార్దా తుపాను ప్రభావంతో చెన్నై మీనంబాకంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఉత్తర తమిళనాడులో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాహనాలు, రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మధ్యాహ్నం 3 గం. వరకూ చెన్నై ఎయిర్పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేశారు. తుపాను సహాయక చర్యల్లో 7 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సాయంత్రం వరకూ ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. చైన్నై తో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఆంధ్రాలోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.
Read more about 'ఇళ్ల నుండి బయటకు రావొద్దు'...
మహాజన పాదయాత్ర..57వ రోజు.. |
నిర్మల్ : సామాజిక న్యాయమే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించనుంది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పాదయాత్ర...ప్రస్తుతం 57వ రోజు నిర్మల్లో కొనసాగుతోంది. అయితే ఇవాళ మొత్తం పాదయాత్రలో అత్యధిక దూరం పర్యటించనుంది. ఆదిలాబాద్ జిల్లాలోని డెంగ్యూపూర్, రానాపూర్, వాంకిడి, యాపలగూడ, నేరడిగొండ, బోథ్ ఎక్స్రోడ్డు, కూట్తి, షాద్నంబర్, ఇస్లాంనగర్, ఇచ్ఛోడ గ్రామాల్లో మొత్తం 40 కిలోమీటర్ల దూరం పర్యటించనుంది. ఇప్పటివరకు సీపీఎం మహాజన పాదయాత్ర 1450 కిలోమీటర్లు సాగింది. ఇప్పటివరకు సాగిన పాదయాత్ర విశేషాలను మైనార్టీ సభ్యులు అబ్బాస్ టెన్ టివికి వివరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Read more about మహాజన పాదయాత్ర..57వ రోజు..
శ్రీ చైతన్య కాలేజీలో దారుణం.
హైదరాబాద్ : డీడీ కాలనీ శ్రీ చైతన్య కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి విజయ్ పై విద్యార్థులు దాడి చేశారు. కాలేజీ అధ్యాపకురాలు ఈ దాడి చేయించిందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విజయ్ తల పగలడంతో 84 కుట్లు వేశారు. తలకు బలమైన గాయం కావడంతో విజయ్ వింతగా ప్రవర్తిస్తున్నాడు. సతీష్, నాగరాజులపై కాలేజీ యాజమాన్యానికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గత అక్టోబర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read more about శ్రీ చైతన్య కాలేజీలో దారుణం.
శ్రీ చైతన్య కాలేజ్ లో అరాచకం..విద్యార్థికి 84 కుట్లు..
హైదరాబాద్ : కార్పొరేట్ కళాశాలల అరాచకాలు ఆగడం లేదు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా చైతన్య కాలేజీకి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ విద్యార్థిపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తలకు 84 కుట్లు పడడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైతన్య కాలేజీ యాజమాన్యం తమకు నరకం చూపించిందని విద్యార్థి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమలాంటి పరిస్థితి వేరే తల్లిదండ్రులకు రావద్దని వేడుకున్నారు. ఇలాంటి చర్యలపై ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నారు.
ఉప్పల్ లో నివాసం ఉంటున్న విజయ్ డీడీ కాలనీలో ఉన్న చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అక్టోబర్ 14వ తేదీన విజయ్ ను కొందరు విద్యార్థులు తీవ్రంగా కొట్టారు. కాలేజీ తరగతి గదిలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు టెన్ టివితో వివరాలు చెప్పారు. విజయ్ ను ఎవరో విద్యార్థులు కొట్టడంతో తలకు తీవ్రగాయామైందని తల్లి పేర్కొన్నారు. ముక్కు..చెవిలో నుండి రక్తం వచ్చినా శ్రీవాణి మేడం అక్కడనే కూర్చొబెట్టిందని వాపోయారు. తమకు సమాచారం అందడంతో నగరంలో ఉంటున్న తన సోదరుడిని కాలేజీకి పంపించడం జరిగిందని తెలిపారు. తాము ఊరి నుండి ఇక్కడకు చేరుకుని విజయ్ ను పలు ఆసుపత్రులకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. కక్ష పెట్టుకున్న కళాశాల ఇన్ చార్జ్ లు పిల్లలతో కొట్టిచ్చినట్లు ఎనిమిది గంటల సేపు అలాగే కూర్చోబెట్టారని, ఎందుకంత నిర్లక్ష్యం అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వలేదని, చివరకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం స్పందించిందని, ఆపరేషన్ చేయడంతో తమ బాబు బతికాడని తెలిపారు. కానీ ఒక నిర్జీవ పరిస్థితిలో ఉన్నాడని, నత్తిగా మాట్లాడడం..పిచ్చిగా ప్రవర్తించడం చేస్తున్నాడని తండ్రి వాపోయారు. రూ. పది లక్షలు ఇచ్చారని కాలేజీ యాజమాన్యం పేర్కొంటోందని, పది రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. ఇలాంటి ఘటన ఏ తల్లిదండ్రులకు రావద్దని వేడుకున్నారు.
శ్రీ వాణి మేడం చేయించింది - విద్యార్థి..
శ్రీవాణి మేడంపై తాను పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి విజయ్ పేర్కొన్నారు. ఇది మనస్సులో పెట్టుకుని ఇతర విద్యార్థులతో తనను కొట్టించిందని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ఆవేదన తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.
Read more about శ్రీ చైతన్య కాలేజ్ లో అరాచకం..విద్యార్థికి 84 కుట్లు..
నెల్లూరు : వార్ధా తుపాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై కనిపిస్తోంది. కాసేపటి క్రితం చెన్నై తీరాన్ని తాకడంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్టణం జిల్లాలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అంతగా ప్రభావం చూపించదని తెలుస్తోంది. కావలి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 20-30 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. 6 కిలోమీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. తుపాన్ పరిస్థితులపై మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
అంతా అప్రమత్తం - జేసీ.. |
జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని నెల్లూరు జాయింట్ కలెక్టర్ అహ్మద్ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. తమిళనాడుకు దగ్గరలో ఉన్న సూళ్లూరుపేటలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ తో తాను పరిస్థితి సమీక్షించడం జరుగుతోందని తెలిపారు. అంతగా భారీ వర్షాలు కురవడం లేదని, కానీ ముందు జాగ్రత్తలో భాగంగా లోతట్టు ప్రాంతాల వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వారికి భోజన, ఇతర వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. వాకాడులో 9 సెంటిమీటర్ల వర్షం కురిసిందని, వాకాడు, సూళ్లూరుపేటలో 50-60 కి.మీ.వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. తడ, సూళ్లూరుపేట, దొరవానిసత్రంతో పాటు మూడు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారని తెలిపారు.
Read more about సముద్రం ముందుకొచ్చింది…
Read more about దోపిడీ దొంగల బీభత్సం..
ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం..
Read more about ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం..
పబ్లిక్ వాయిస్..
Read more about పబ్లిక్ వాయిస్..
చెన్నై : వార్ధా తుపాన్ చెన్నైపై విరుచకపడింది. తీరానికి అతీసమీపంలో దూసుకొస్తోంది. దీనిప్రభావంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 140 నుండి 150 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీనితో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సముద్ర తీర ప్రాంతంలో అలలు భారీగా ఎగిసి పడుతున్నాయి. బలమైన గాలులు వీస్తుండడంతో చెట్లు కూలిపోయాయి. దీనితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పీనంబాకంలో కుంభవృష్టి కురుస్తోంది. మధ్యాహ్నం 3గంటల వరకు చెన్నై ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల కోసం రెండు పడవలను సిద్ధంగా ఉంచారు. మరో రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని సమాచారం. తుఫాన్ తో చెన్నైలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీపై వార్ధా ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో వర్షం కురుస్తుండడంతో కొండచరియలు విరిగి పడుతున్నట్లు తెలుస్తోంది.
Read more about చెన్నైపై విరుచకపడిన 'వార్ధా'..
కావలి వద్ద సముద్రం అల్లకల్లోలం..
నెల్లూరు : కావలి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 20-30 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. 6 కిలోమీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. తుపాన్ పరిస్థితులపై మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Read more about కావలి వద్ద సముద్రం అల్లకల్లోలం..
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం - ఎన్ డీఎంఏ..
చెన్నై : వార్ధా తుపాను తాకుతున్న నేపథ్యంలో కల్పకం అణువిద్యుత్ కేంద్రానికి ముప్పు సంభవిస్తుందన్న వార్తల నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థ వివరణనిచ్చింది. ఈ మేరకు ఎన్డీఎంఏ ఉదయం ట్వీట్స్ చేసింది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, తుపాన్ ను విజయవంతంగా ఎదుర్కొంటామని పేర్కొంది.
Read more about అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం - ఎన్ డీఎంఏ..
చెన్నై : తీవ్ర తుఫాన్ వార్ధా తీరాన్ని తాకింది. తీవ్ర తుపాన్ చెన్నైపై విరుచుక పడుతోంది. గంటకు 140 నుండి 150 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
Read more about చెన్నైని తాకిన వార్ధా తుఫాన్..
నోట్లను మార్పిడి చేస్తూ..చిక్కారు..
హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు అనంతరం నోట్లమార్పిడి ముఠాలు చెలరేగుతున్నాయి. రోజుకోక మోసం బయటకొస్తోంది. నోట్లను మార్పిడి చేసేందుకు వెళుతున్న ముగ్గురు వ్యక్తులను సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ. 29 లక్షల 76వేల నగదు, నాలుగు సెల్ ఫోన్ లను ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ భరత్ నగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పింగి వాసుగౌడ్, దిల్ సుఖ్ నగర్ లో ఉంటున్న మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి నోట్లను మార్పిడి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనితో బైక్ లో తరలిస్తుండగా వీరిని పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read more about నోట్లను మార్పిడి చేస్తూ..చిక్కారు..
విశాఖపట్టణం : జిల్లాలో నగదు కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. పెద్దనోట్లను రద్దు చేసి నెల్ల రోజులు దాటుతున్నా సమస్యలు మాత్రం తీరడం లేదు. సరిపడ నగదు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వరుసగా బ్యాంకులకు సెలవలు రావడంతో సమస్యలు మరింత రెట్టింపవుతున్నాయి. సోమవారం ఉదయం సీతంబజార్ లో ఉన్న ఆంధ్రాబ్యాంకులో మూడు ఏటీఎంలు ఉంటే ఒకటే పనిచేస్తోంది. దీనితో ప్రజలు నగదు తీసుకోవడానికి క్యూలు కడుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి టెన్ టివి ప్రయత్నించింది. వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వీడియో క్లిక్ చేయండి.
Read more about మూడింటిలో ఒకటే పనిచేస్తోంది..
Read more about చెన్నై తీరానికి చేరువలో వార్ధా తుపాన్..
నలుగురు మత్స్యకారులు ఎక్కడ ? |
పశ్చిమగోదారి : తుపాన్ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసినా మత్స్యకారులు వేటకు వెళుతున్నారు. వార్ధా తుపాన్ చెన్నైకి దగ్గరగా దూసుకొస్తోంది. దీని ప్రభావం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలం ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నలుగురు మత్స్యకారులు కనిపించడం లేదని సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. హెచ్చరికలు జారీ చేసిన అనంతరం వెళ్లారా ? లేక ముందే వెళ్లారా ? అనేది తెలియాల్సి ఉంది.
Read more about నలుగురు మత్స్యకారులు ఎక్కడ ?
పశ్చిమగోదావరి : జిల్లాలో నర్సాపురం (మం) చిన మైనివానిలంకలో సముద్రంలోకి వెళ్లిన 4గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మత్స్యకారుల ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.
Read more about నలుగురు మత్స్యకారుల గల్లంతు..
చెన్నై : తీరానికి 105 కి.మీటర్ల దూరంలో వార్ధా తుపాన్ కేంద్రీకృతమైంది. తుపాన్ ప్రభావంతో చెన్నై ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 25 విమానాలను దారి మళ్లించారు.
రజనీ '2.0' చిత్రంలో చిరు ?
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో '2.0' చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వీరి కాంబినేషన్ లో 'రోబో' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి~ సీక్వెల్ గా '2.0' చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో 'ఏమీ జాక్సన్' కథాననాయికగా కనిపిస్తుండగా బాలీవుడ్ నటుడు 'అక్షయ్ కుమార్' విలన్ గా నటిస్తున్నారు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మాధ్యమాల్లో చిక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదలైన ఈ చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ 'చిరంజీవి' నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దాదాపు కొన్ని సంవత్సరాల తరువాత 'చిరు' 'ఖైదీ నెంబర్ 150’ సినిమాలో నటిస్తున్నారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవలు నటించిన చిత్రాలున్నాయి. ‘రానువ వీరన్', ‘మా పిల్లై'లో చిరంజీవి ప్రత్యేక పాత్ర పోషించారు. గతంలో 'మహేష్ బాబు' నటిస్తారని టాక్ వినిపించింది. ‘చిరంజీవి' ప్రత్యేక పాత్ర పోషిస్తారని కోలీవుడ్ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయం గురించి త్వరలోనే విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read more about రజనీ '2.0' చిత్రంలో చిరు ?
విమానంలో సాంకేతిక లోపం..
హైదరాబాద్ : శంషాబాద్ - కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన 20 నిమాషాలకే ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. 148 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.
Read more about విమానంలో సాంకేతిక లోపం..
అత్యవసరంగా ల్యాండ్ అయిన ఓమన్ ఎయిర్ వేస్..
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓమన్ ఎయిర్ వేస్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మస్కట్ నుండి చెన్నైకు విమానం వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
Read more about అత్యవసరంగా ల్యాండ్ అయిన ఓమన్ ఎయిర్ వేస్..
ఉదయం జాబ్..సాయంత్రం ఏటీఎం క్యూ లైన్ లో..
విజయవాడ : పెద్ద నోట్ల రద్దుపై పోరాడేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా ఏపీ పీసీసీ ప్రజాభిప్రేక సేకరణ జరుపుతోంది. ప్రజలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది. సోమవారం నాడు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొంది. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరాతో పాటు పలువురు ఏపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు రఘువీరా దృష్టికి తీసుకొచ్చారు. ఎలక్షన్ ల కోసం ఈ రకంగా జిమ్మిక్కులు చేస్తున్నారని, చాలా దుర్మార్గమైన విషయమని ఒకరు పేర్కొన్నారు. ఒక వేయి నోటు రద్దు చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏటీఎంల వద్ద పోలీసులు ఎందుకు కొడుతున్నారని, ఎదురుతిరగాల్సినవసరం ఉందన్నారు. తాను ఉదయం జాబ్ చేస్తూ సాయంతం ఏటీఎం వద్ద క్యూలో నిలుస్తూ రెండో జాబ్ చేస్తున్నానని ఓ వ్యక్తి పేర్కొన్నాడు.
Read more about ఉదయం జాబ్..సాయంత్రం ఏటీఎం క్యూ లైన్ లో.. |
మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ అనంతరం 'ప్రిన్స్' ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వంద కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి సోషల్ మాధ్యమాల్లో పలు వార్తలు వెలువడుతున్నాయి. 'మహేష్' ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్. తన ప్రతి చిత్రంలో ఓ సామాజిక సమస్యను మురుగదాస్ చూపిస్తాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఓ సామాజిక సమస్యను చూపించనున్నారని, న్యాయవ్యవస్థలోని ఓ కీలకాంశాన్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి పలు టైటిల్స్ పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. తాజాగా 'సంభవామి' అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో చిత్ర యూనిట్ రిజిస్టర్ చేయించింది. దీనితో 'మహేష్' సినిమా పేరు 'సంభవామి' టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా విజయవంతమౌతుందా ? లేదా ? అనేది చూడాలి.
Read more about ప్రిన్స్..'సంభవామి'..
చంద్రబాబు సమీక్ష..
విజయవాడ : వార్ధా తుఫాన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇస్రో వాతావరణ, విపత్తు నిర్వాహణ, జలవనరులు, విద్యుత్, రెవెన్యూ పోలీసు శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read more about చంద్రబాబు సమీక్ష..
ఢిల్లీ : ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది. మంచు కారణంగా ఢిల్లీ రైల్వే శాఖ 82 రద్దు చేసింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
Read more about ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు..
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
ముంబై : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి.
Read more about నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం..
Read more about పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం..
టెక్స్ టైల్స్ లో నో సేల్స్..
Read more about టెక్స్ టైల్స్ లో నో సేల్స్..
సిరీస్ కైవసం..
Read more about సిరీస్ కైవసం..
భారత్ విజయం..
ముంబై : ఇంగ్లండ్ పై భారత్ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 3-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.
Read more about భారత్ విజయం..
నెల్లూరు : వార్ధ తుపాన్ దూసుకొస్తోంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాపై ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. సూళ్లూరిపేట, నాయుడిపేట, వాసరి తదితర మండలాల్లో సోమవారం ఉదయం భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ఇంకా తీరం దాటకముందే చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. వార్దా తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ గాలి వేగంతో పాటు, వర్ష తీవ్రత కూడా పెరుగుతోంది. కలెక్టరేట్ నుంచి మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సూళ్లూరుపేట, నెల్లూరులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రెవెన్యూ, పోలీసు, విద్యుత్, ఇతర శాఖలు అప్రమత్తమయ్యాయి. ఓ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ..ఆస్తి నష్టం కలుగకుండా చూడాలని సూచించారు. అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేయాలని, కూలిన కరెంటు స్తంభాలను వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Read more about వార్ధ తుపాన్..దూసుకొస్తోంది..
కృష్ణా : మిలా ఉన్ నబీ పర్వదినాన ముగ్గురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జెండాలు కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఎమ్మార్ అప్పారావు కాలనీలో చోటు చేసుకుంది. మిలాదున్ నబీ పర్వదిన సందర్భంగా ముగ్గురు యువకులు సోమవారం ఉదయం జెండాలు కడుతున్నారు. జెండాలు కడుతుండగా ఇనుప రాడ్ విద్యుత్ తీగలకు తగిలింది. దీనితో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే నూజివీడు ఆసుపత్రికి తరలించారు. అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో వేరే ఆసుపత్రికి పంపించారు. కానీ మార్గమధ్యంలోనే వీరు కన్నుమూశారు. స్థానిక ఎమ్మెల్యే మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందే విధంగా చూస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు.
Read more about మిలా ఉన్ నబీ పండుగ పూట విషాదం..
శ్రీకాకుళం : జిల్లాలో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. ఎచ్చెర్ల, పొందూరు, లావేరు మండలాల్లోని పలు చోట్ల 5 సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.
Read more about సిక్కోలు లో భూ ప్రకంపనాలు..
8వ వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. |
ముంబై : ఇంగ్లండ్ 8వ వికెట్ కోల్పోయింది. 189 పరుగుల వద్ద ఓక్స్ డకౌట్ అయ్యాడు.
Read more about 8వ వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..
పాదయాత్ర 58వ రోజు..
నిర్మల్ : మహాజన పాదయాత్ర 58వ రోజుకు చేరుకుంది. నేడు నేరడిగొండ, బోథ్ ఎక్స్ రోడ్డు, కూట్తి, షాత్ నంబర్, ఇస్లాంనగర్, యచోడలో పాదయాత్ర కొనసాగనుంది. ఆదిలాబాద్ జిల్లాకు పాదయాత్ర బృందం అడుగు పెట్టనుంది.
Read more about పాదయాత్ర 58వ రోజు..
హైదరాబాద్ : నోట్ల రద్దు అయి 34 రోజులు దాటుతోంది. కానీ ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. చేతిలో డబ్బులు లేక నరకయాతన పడుతున్నారు. రెండు వేల రూపాయలకు చిల్లర దొరక్క అవస్థలు పడుతున్నారు. పూట గడవడమే కష్టంగా మారుతోందని పలువురు పేర్కొంటున్నారు. వ్యాపారాలు లేకపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కొనుగోలుదారుల లేక పలు వ్యాపారాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
విజయవాడలో..
విజయవాడలో పరిస్థితి దయనీయంగా ఉంది. బందర్ రోడ్డులో ఉన్న ఏటీఎంలు మూతపడుతున్నాయి. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజుల నుండి ఏటీఎంలు మూతపడి ఉన్నాయని, పిల్లలు దాచుకొనే డబ్బులను వాడుకోవాల్సిన దుస్థితి నెలకొని ఉందన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Read more about నోట్ల రద్దు..34వ రోజు..
హైదరాబాద్ : నెల రోజులు దాటినా.. ప్రజలకు నగదు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే చేతిలో డబ్బుల్లేక తీవ్ర అవస్థలు పడుతున్న సామాన్యులకు మరిన్ని రోజులు మనీ కష్టాలు తప్పేట్టు లేదు. వరుసగా 3 రోజులకు బ్యాంకులకు సెలవు కావడం, ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులతో .. అన్ని వర్గాల ప్రజలు డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. శనివారం నుండి సోమవారం వరకూ వరుసగా మూడు రోజులు పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో జనాలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Read more about కోర్కెలను చంపుకుంటున్నరు..
నిర్మల్ లో మహాజన పాదయాత్ర..
నిర్మల్ : సీపీఎం మహాజన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వం అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తమ్మినేని బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. నిర్మల్ జిల్లాలో ప్రవేశించిన పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో తమ దృష్టికి వచ్చిన ఎస్సారెస్పీ సమస్యలపై సీఎం కేసీఆర్కు తమ్మినేని బహిరంగ లేఖ రాశారు. నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సామాజిక తెలంగాణే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 56వ రోజు పూర్తి చేసుకుంది. ఇప్పటికే 10 జిల్లాల్లో పూర్తయిన పాదయాత్ర.. ఈరోజు నిర్మల్లోకి ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి నిర్మల్ జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు పోచంపాడు, సోన్, గంజ్యాల్, కడ్తల్, చాకేరా, సోఫినగర్, నిర్మల్, చించోలి, డ్యాంగాపూర్లో 29 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర.. ఇప్పటికి సుమారు 1450 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
ఘన స్వాగతం..
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. వచ్చే ఏడాది మార్చి 19న హైదరాబాద్లో పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. గ్రామ గ్రామాన తమ్మినేని బృందానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. తమ సమస్యలను తమ్మినేని బృందానికి చెప్పుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని బృంద సభ్యుడు రమణ అన్నారు. పాదయాత్రకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీరాములు, సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని హేమ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అంగన్వాడీ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారని.. కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని తమ్మినేని అన్నారు. సామాన్య ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఎస్సారెస్పీ నిర్వాసిత గ్రామాల్లోని సమస్యలపై తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. పాదయాత్రకు ఎమ్మార్పీఎస్, సామాజిక సంఘ నేతలు కలిసి సంఘీభావం తెలిపారు.
Read more about నిర్మల్ లో మహాజన పాదయాత్ర.. |
నెల్లూరు : జిల్లాపై వార్ధ తుపాన్ ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు, తడ, సూళ్లూరు పేట, దొరవారిసత్రం, చిట్టమూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 155 తుపాన్ షెల్టర్లు, 450 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు జిల్లాకు చేరుకున్నాయి. వార్ధా ప్రభావిత గ్రామాల్లో విలేజ్ ఇన్ ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను తీరంవైపు దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రం చెన్నై -పులికాట్ సరస్సు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. త్రీవరూపాన్ని సంతరించుకున్న వార్దా తుపాను.. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు- ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సహాయ పునరావాస చర్యలకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం.
భారీ వర్షాలు..
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారు జాము నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రతి గ్రామంలో విలేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసుల, అగ్నిమాపక...విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ ముత్యాలరాజు ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు.
Read more about నెల్లూరుపై వార్ధ తుపాన్..
నెల్లూరు : వార్ధా తీవ్ర తుపాన్ గా కొనసాగుతోంది. నెల్లూరుకు తూర్పు ఆగ్నేయం గా 290 కి.మీ. చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 220 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నై - శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 90-100 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయి. కృష్ణపట్నంలో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, కాకినాడ, విశాఖ పోర్టుల వద్ద 4వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Read more about తీవ్ర తుపాన్ గా వార్ధ..
తూర్పుగోదావరి : దివీస్ నిర్మాణ ప్రాంతంలో నేడు నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది. రైతులు, మత్స్యకారులతో కమిటీ సభ్యులు సమావేశం జరపనున్నారు.
Read more about దివీస్ లో నేడు నిజనిర్ధారణ కమటీ పర్యటన..
జూనియర్ హాకీ ప్రపంచ కప్ లో..
లక్నో : జూనియర్ హాకీ ప్రపంచకప్ లో నేడు భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Read more about జూనియర్ హాకీ ప్రపంచ కప్ లో..
నేడు నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన..
నెల్లూరు : వార్ధా తుపాన్ ప్రభావిత మండలాల్లో నేడు మంత్రి నారాయణ పర్యటించనున్నారు.
Read more about నేడు నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన..
నేడు టి.టిడిఎల్పీ సమావేశం..
హైదరాబాద్ : ఉదయం 11గంటలకు టి.టిడిఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
Read more about నేడు టి.టిడిఎల్పీ సమావేశం..
హాహా.. అక్కడ ఒంటెలకు నంబర్ ప్లేట్లు..
హైదరాబాద్ : ఏ దేశంలోనైనా రోడ్డుపై నడిచే వాహనాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. నెంబర్ ప్లేట్ సైతం కేటాయించడం కామన్.. ఓ దేశంలో ఏకంగా జంతువులకు సైతం రిజిస్ట్రేషన్లు నెంబర్ ప్లేట్లను కేటాయిస్తోంది. ఇదేంటనీ ఆశ్చర్య పోతున్నారా అయితే ఈ న్యూస్ చదవండి.
ఎలాంటి వాహనాలకైనా రిజిస్ట్రేషన్.. నెంబర్ప్లేట్ తప్పనిసరి. వాహనం.. వాహన యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు రిజస్ట్రేషన్లో పొందుపరుస్తారు. ఎప్పుడైనా ఆ వాహనం చోరీకి గురైనా.. ప్రమాదం జరిగినా.. నంబర్ ప్లేట్ ద్వారా వాహన యజమానిని గుర్తిస్తారు. అయితే.. ఇరాన్లో వాహనాలకే కాదు ఒంటెలకు కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్.. రిజిస్టర్డ్ లైసెన్స్ ప్లేట్ కేటాయిస్తోంది.
ఇరాన్ వంటి దేశాల్లో ఒంటెలు అధికంగా ఉంటాయి. రోడ్లపై వాహనాలతో సమానంగా తిరుగుతుంటాయి. వీటి వల్ల బలూచిస్థాన్ ప్రావిన్స్.. ఆఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ఒంటెలు దారి తప్పి.. మరికొన్ని పారిపోయి రోడ్లపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నాయట. దీంతో అక్కడి అధికారులు ఒంటెలను.. వారి యజమానుల్ని గుర్తించేలా వాటికి రిజిస్ట్రేషన్ చేసి లైసెన్స్ ప్లేట్లు కేటాయించాలని నిర్ణయించారు. మొదటి విడతలో ఇప్పటికే లక్ష ఒంటెలకు నంబర్ ప్లేట్లు కేటాయించారు. మరో 35వేల ఒంటెలకు లైసెన్స్లు కేటాయించే పనిలో ఉన్నారు. దీని ద్వారా ప్రమాదానికి గురైన ఒంటెలను పట్టుకుని వాటి యజమానులకు సమాచారం ఇవ్వొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Read more about హాహా.. అక్కడ ఒంటెలకు నంబర్ ప్లేట్లు..
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు
హైదరాబాద్ : మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలు దేశ ప్రజలకు 'మిలాద్-నబీ-నబీ' శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలు సోదరభావంతో మెలగాలని హన్సారీ ప్రజలని కోరారు.
Read more about మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు |
రైలు ఛార్జీల మోతకు మోడీ రెడీ!
హైదరాబాద్ : రైలు ప్రయాణం ఇకపై మరింత భారం కానుందా ? ట్రైన్ ఛార్జీలను పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందా ? ప్రస్తుత పరిస్థితులు చూస్తే,.అవుననే అంటున్నాయి రైల్వేవర్గాలు. మోదీ సర్కార్ రైలు ఛార్జీలను పెంచేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. రైలు ప్రయాణికులపై భద్రత పన్ను వడ్డించేందుకు సిద్ధమవుతోంది. దీంతో సామాన్య ప్రజలకు ఇకపై రైలు ప్రయాణం మరింత భారం కానుంది.
భద్రత పన్ను వడ్డించేందుకు..
ప్రయాణికులపై భద్రత పన్ను వడ్డించేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైల్వే భద్రతపరమైన అంశాలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు.. ప్రయాణికులపై ప్రత్యేకంగా పన్ను వడ్డించేందుకు రైల్వే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రైళ్లు పట్టాలు తప్పడం..ఇతర ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం, క్రాసింగ్ల వద్ద భద్రతను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకంగా రాష్ట్రీయ రైల్ సంరక్ష నిధిని ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ భావించింది. ఇందుకోసం 1.19 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని ఆర్థికశాఖకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఇటీవల లేఖ రాశారు. అయితే ఆర్థికశాఖ అందులో 25శాతం మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించింది. మిగతా మొత్తం సొంతంగా సమకూర్చుకోవాలని రైల్వేను కోరింది. ఈ నేపథ్యంలో టిక్కెట్లపై ప్రత్యేకంగా భద్రత పన్ను వేసి ఈ నిధులు రాబట్టుకోవాలని రైల్వే భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏసీ-2, ఏసీ-1 టిక్కెట్లు ధరలు ఇప్పటికే అధికంగా ఉండటంతో వీటిపై మోస్తరుగా.. స్లీపర్, రెండోతరగతి, ఏసీ-3 టిక్కెట్లపై అధికంగా పన్ను వడ్డించనున్నట్లు పేర్కొన్నాయి.
Read more about రైలు ఛార్జీల మోతకు మోడీ రెడీ!
నారాయణ్ ఖేడ్ : క్కడ ఏ ఎన్నికలు లేవు.. నాయకుల ప్రచారాలు అంతకంటే లేవు.. అయినా అక్కడ పెద్దపెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి. రోడ్డు, చౌరస్తాలు అనే తేడాలేకుండా గులాబీ బ్యానర్లు వెలిశాయి. ఇంతకీ ఎక్కడా ఆ ఫ్లెక్సీల హడావుడి... ఎందుకా బ్యానర్ల బారు... తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. మెయిన్రోడ్డు, గల్లీలు అనే తేడాలేదు. రోడ్డు కనిపిస్తే చాలు.. ఇరువైపుల ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. ఏ రోడ్డు అన్నది కాదన్నయ్యా... ఫ్లెక్సీలు నింపామా లేదా అన్నట్టుంది వీరి ధోరణి.
అసలు మ్యాటరేంటంటే... సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా బిడెఖనె హన్మంతును చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. నియామక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎగిరి గంతేసిన హన్మంతు తనకు చైర్మన్ పదవి రావడానికి సహకరించిన నేతలను ప్రసన్నం చేసుకోవాలని భావించాడు. ఇందుకు ఆయన బ్యానర్లు, ఫ్లెక్సీలతో తన అభిమానాన్ని చాటుకున్నాడు. నారాయణఖేడ్లో పెద్దపెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు... దారులను, హోర్డింగ్లను ఫ్లెక్సీలతో నింపేశారు. రాజీవ్ చౌరస్తాలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అంతటితో ఆగకుండా ... ఆర్ అండ్ బీ రోడ్డును ధ్వంసం చేసి మరీ కటౌట్లు కట్టారు.
నారాయణఖేడ్లో ఇంతకుముందెన్నడూ ఈ తరహాలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఎవరూ ఏర్పాటు చేయలేదు. కానీ హన్మంతు మాత్రం నారాయణఖేడ్ను మొత్తం ఫ్లెక్సీలతో ముంచెత్తారు. వాటిని చూసిన జనం..ఇదేమి విచిత్రమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఓవైపు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్... హైదరాబాద్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లను నిషేధించారు. తన బ్యానర్లు కూడా ఏర్పాటు చేయవద్దని అధికారులను ఆదేశించారు. అదే పార్టీకి చెందిన హన్మంతు మాత్రం దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తన ఇష్టారీతిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.
Read more about తారక రాముడి ఆదేశాలు లెక్కచేయని 'భక్త' హన్మంతు..
హైదరాబాద్ : మాటల యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలవుతుంది. అస్త్రశస్త్రాలకు, వ్యూహ రచనకు సమయం ఆసన్నమవుతోంది. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంటుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబి పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. |
డిసెంబర్ 16 నుంచి జరగబోయే తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్గా జరిగే అవకాశం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పొలిటికల్ విమర్శలను తీవ్రం చేస్తూ..సమావేశాలకు ముందే కాకపుట్టిస్తున్నాయి. సభలో పై చేయి సాధించేందుకు అధికార పార్టీ అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. విపక్ష పార్టీలకు చెక్ పెట్టే వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రాజక్టుల రీడిజైనింగ్, కరెన్సీనోట్ల రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం నోరువిప్పడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండున్నరేళ్ల పాలనలో కెసిఆర్ ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేరాయని ప్రశ్నిస్తున్నాయి. ఆయా అంశాలపై అసెంబ్లీ సాక్షిగా అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. సోమవారం ఉదయం టీ టీడీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో టీ - టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి.. రైతు సమస్యలపై ప్రధాని, వ్యవసాయ మంత్రిని కలువనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సారి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది.
మరోవైపు విపక్షాలకు ధీటైన సమాధానం చెప్పేందుకు అధికార టీఆర్ఎస్ కూడా రంగం సిద్ధం చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు బ్రేకులు వేసేందుకు గులాబీ దళపతి పావులు కదుపుతున్నారు. శీతాకాల సమావేశాలను కనీసం రెండు వారాలైనా నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనపై ప్రగతి నివేదికలను కూడా అసెంబ్లీ వేదికగానే వెల్లడించాలని అధికార పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే శాఖల వారీగా నివేదికలను సైతం సిద్ధం చేసుకుంటుంది. సమస్యల ప్రాతిపదికన అసెంబ్లీలో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షపార్టీలు అసెంబ్లీ సమావేశాలను పొడగించాలని డిమాండ్ చేస్తే...అందుకు తాము సుముఖంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రి సంకేతాలు ఇస్తున్నారు. వాడీ వేడీగా జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పై చేయి పాలకపక్షానిదా లేక విపక్షాలదా అన్నది ప్రస్తుతానికి ఉత్కంఠ రేపుతోంది.
Read more about పైచేయి సాధించేందుకా.. ప్రజలకోసమా..?
17న ప్రారంభోత్సవాలే.. ప్రారంభోత్సవాలు..
వైజాగ్ : అందాల విశాఖ నగరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు వేదిక కాబోతోంది. ఈనెల 17న వరుస ప్రారంభోత్సవాలతో నగరం సందడిగా మారనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవాల్లో పాల్గొనబోతున్నారు.
ఐటీ పార్క్, చిల్డ్రన్స్ థియేటర్
ఈనెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రుషికొండలో ఏర్పాటు చేసిన ఐటీపార్క్ ప్రారంభం కాబోతోంది. దాంతోపాటు ఉడాపార్క్లో తీర్చిదిద్దిన చిల్ట్రన్స్థీయేటర్ను కూడా సీఎం ప్రారంభిస్తారని.. దీనికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా హాజరవుతున్నారు. అదేరోజు నగరంలో జరగనున్న 68వ ఫార్మాస్యూటికల్స్ సమావేశంలో కూడా వారు పాల్గొంటారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తర్వాత పోర్టుస్టేడియంలో జరగనున్న దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ స్నాతకోత్సంలోనూ చంద్రబాబు, వెంకయ్య పాల్గొననున్నారు.
అంతర్జాతీయ కళాకారులతో..
ఈ ప్రారంభవోత్సవాల సందర్భంగా విశాఖను సంగీతఝరిలో ముంచెత్తడానికి పలువురు ఇంటర్నేషనల్ ఇన్స్ట్ర్మెంట్ కళాకారులతో మ్యూజికల్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రోనోమజుందార్, రాకేష్ చౌరాసియా, డ్రమ్స్ శివమణితోపాటు అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని చెప్పారు. ప్రపంచంలోనే మొదటిసారిగా విండ్మ్యూజిక్ కళాకారులచే ప్రదర్శన జరగడం విశాఖ ప్రజలకు గర్వకారణమని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. మొత్తం 5 ముఖ్యమైన ప్రారంభోత్సవాలు ఉండటంతో ..ప్రభుత్వం పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈనెల 17న విశాఖ నగరం ప్రారంభోత్సవాలతో సందడిగా మారనుంది.
Read more about 17న ప్రారంభోత్సవాలే.. ప్రారంభోత్సవాలు..
దూసుకొస్తోంది.. జాగ్రత్త..
వైజాగ్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను తీరంవైపు దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రం చెన్నై -పులికాట్ సరస్సు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. త్రీవరూపాన్ని సంతరించుకున్న వార్దా తుపాను.. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు- ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో వర్షాలు ప్రారంభం అయ్యాయి. సహాయ పునరావాస చర్యలకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం.
Read more about దూసుకొస్తోంది.. జాగ్రత్త..
'డియాన్ హిల్లీకి విరాట్ కోహ్లీ మీద
వాలెంటైన్స్ డే సందర్భంగా భట్టి
కిడ్స్ స్పెషల్ లో 'మామ' నయా
సలాం ఇండియా...
నువ్వుల నూనె..ఆరోగ్య రహస్యాలు...
ఫేస్ టు ఫేస్ విత్ సతీష్
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులుతో ఫేస్ టు ఫేస్ |
అమెరికాలో హిందూ ఆలయంపై విద్వేష దాడి _ జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తలు, విశ్లేషణలు – National, International News & Analysis in Telugu
సమాజం సంస్కృతి
ప్రశ్న-జవాబు
ప్రశ్న వేయండి!
హిందూ జాతీయవాద నేత భారత ప్రధానిగా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ లోనే అనేక చర్చిలపై దాడులు జరుగుతున్న నేపధ్యంలో అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన ఓ హిందు ఆలయంపై విద్వేషపూరిత దాడి జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ నుండి వెళ్తూ వెళ్తూ మైనారిటీ మతావలంబకుల హక్కులను కాపాడాలని హిత బోధ చేసి వెళ్లారు. ఆయన సందేశానికి కొనసాగింపుగానా అన్నట్లుగా ఇప్పుడు ఆయన అధ్యక్షరికంలో ఇక్కడి చర్చిలపై దాడికి ప్రతి చర్య అమెరికా నేలపై చోటు చేసుకుంది.
అమెరికా పశ్చిమ తీరంలోని వాషింగ్టన్ రాష్ట్రంలో (రాజధాని వాషింగ్టన్ డి.సి కాదు) సియాటిల్ మెట్రోపాలిటన్ ఏరియాలో ఈ దాడి జరిగింది. దాడి అంటే ధ్వంసం చేయడం, కొట్టడం, కాల్చడం లాంటివి ఏమీ జరగలేదు. ఆలయ గోడలపై స్వస్తిక్ గుర్తును స్ప్రే పెయింట్ చేసారు. పెద్ద అక్షరాలలో ‘Get Out’ అని స్ప్రే చేశారు. ఈ పని చేసింది ఎవరో ఇంకా గుర్తించలేదు. ఈ ఘటనను ఖండించేందుకు ఇండియాలో పలువురు నేతలు పోటీ పడ్డారు. అమెరికాలో పని చేసే ‘హిందు అమెరికన్ ఫౌండేషన్’ (హెచ్.ఎఎఫ్) సంస్ధ నేతలు ఘటనను ప్రముఖంగా ఖండించారు.
ఘటన జరిగిన బోతేల్ ఆలయం ‘హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్’ ట్రస్టీ ఛైర్మన్ నిత్యా నిరంజన్ ఈ చర్యపై ఘాటుగా స్పందించాడు. “అమెరికాలో ఇలాంటిది అసలు జరగనే కూడదు. గెట్ ఔట్ అనటానికి అసలు మీరెవరు? ఇది వలస ప్రజల దేశం” అని నిరంజన్ ఆగ్రహం ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ నేత పి.సి.చాకో దాదాపు ఇదే తరహాలో స్పందించారు. “వాళ్ళు తమను తాము ఎప్పుడూ బహుళ (జాతుల, ధోరణుల, మతాల etc…) దేశంగా చెప్పుకుంటారు. తమది అందరినీ కలుపుకు పోయే సమాజం అని చెబుతారు. ఇప్పుడు జరిగింది ఎ విధంగానూ ఆమోదనీయం కాదు. ఈ చర్యకు పాల్పడినవారిపై అమెరికా అధికారులు కఠిన చర్య తీసుకోవాలి” అని చాకో డిమాండ్ చేశారు. ఘటనపై ప్రధాని ఇంతవరకూ స్పందించలేదు.
“ప్రార్ధనా స్ధలాలు ప్రజలు భద్రంగా, శాంతిగా ఉండవలసిన చొట్లు. పరులకు సేవ చేసేందుకు స్ఫూర్తిని ఇవ్వాల్సిన చోట్లు. దానికి బదులు గత కొద్ది రోజుల్లోనే సియాటిల్ లో హిందూ ఆలయం పై దాడి, బోస్టన్ లో మసీదు విధ్వంసం జరగడంతో వివిధ కమ్యూనిటీల ప్రజల మధ్య అపనమ్మకం పెరగడానికి, భయాందోళనలు రెచ్చగొట్టడానికి కారణం అయ్యాయి” అని హెచ్.ఎ.ఎఫ్ బోర్డు సభ్యుడు పద్మ కుప్ప అన్నారని ది హిందు తెలిపింది.
ఈ చర్యలను ఖండించాలి, వ్యతిరేకించాలి. అందులో అనుమానం లేదు. ఈ సందర్భంగా ఇండియాలో జరుగుతున్న దాడులను గూర్చి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్క ఆలయంపై నాలుగు అక్షరాలు రాస్తేనే “ఇది వలస వచ్చిన ప్రజల దేశం” అని ప్రకటించెంతవరకూ వెళ్ళిన పెద్దలు ఇండియాలో ముస్లిం విద్వేషంపైనే ఆధారపడి నడుస్తున్న రాజకీయ పార్టీ, సాంస్కృతిక సంస్ధల కార్యకర్తలు సాగించిన, సాగిస్తున్న అరాచకాలను, హత్యాకాండలను ఏ స్ధాయిలో ఖండించాలి? భారత దేశంలో లెక్కకు మిక్కిలిగా హిందూ మతోన్మాద సంస్ధలు సాగిస్తున్న దాడులను, విధ్వంసాలను, హత్యలను, ప్రచారాన్ని, సాహిత్యాన్ని హెచ్.ఏ.ఎఫ్ గానీ నిత్యా నిరంజన్ లాంటివారు గానీ పట్టించుకున్నారా? ఎప్పుడన్నా ఖండించారా? అమెరికాలో తప్పైన ఒక ఘటన ఇండియాలో ఒప్పు కాదు కదా.
అమెరికా వలస ప్రజల దేశం అని అమెరికన్ హిందువుల నమ్మకం. నిజం కూడా అదే. స్ధానిక ప్రజలను తన్ని, తరిమి, ఊచకోత కోసి వారి నేలను యూరోపియన్లు ఆక్రమించారు. ఆనక భారతీయులు కూడా పోలోమని తరలి వెళ్లారు. సరిగ్గా ఇదే అభిప్రాయం ఇండియాకు వర్తిస్తుందని సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ మార్కండేయ కట్జు అనేక సార్లు చెప్పారు. అడవులు, కొండల్లో నివసించే గిరిజన ప్రజలు, ఆదివాసీలు, ఈశాన్య ప్రజలు తప్ప ఇతరులు అందరూ ఇతర చోట్ల నుండి ఎప్పుడో ఒకప్పుడు వలస వచ్చిన ప్రజల వారసులేనని ఆయన ససాక్షరంగా అనేక వ్యాసాల్లో వివరించారు. అలాంటి దేశం కేవలం హిందువులదేనని, వారు తప్ప ఇతరులంతా హిందువులకు లొంగి బతకాలని సిద్ధాంతాలు రాసుకుని, దానినే నమ్ముతూ ఇతర మతాల ప్రజలపై హంతక దాడులు చేస్తున్న ఉన్మాదులు ఇప్పుడు అమెరికాలో జరిగిన, జరగబోయే దాడులకు సరైన సమాధానం ఇవ్వగలరా?
వర్తమానంలో సైతం ఢిల్లీలో వరుస పెట్టి చర్చిలపై దాడులు జరిగాయి. అయినా రెండు రోజుల క్రితం వరకూ దేశ ప్రధాని నోరెత్తి ఖండించిన పాపాన పోలేదు. ఢిల్లీ ఎన్నికలు అయ్యాక, దాడుల వల్ల ఒనగూరే ఓటు ప్రయోజనం ఇక లేదు గనక, ఆ తర్వాత మాత్రమే ఆయన ఢిల్లీ పోలీసు అధిపతిని పిలిపించి ఆదేశాలు ఇచ్చారని పత్రికలు చెబుతున్నాయి. ఈ పాలన ఏ తరహా ప్రజాస్వామ్యం కిందకు వస్తుంది? ఏ తరహా జాతీయవాదం ఇది? ఇప్పటికీ నిమ్న కులాల ప్రజలపై సాగుతున్న అనేకానేక వివక్షలకు వారిదగ్గర ఎలాగూ సమాధానం లేదు.
దీన్ని పంచుకోండి:
Click to share on Facebook (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
Click to share on Twitter (కొత్త విండోలో తెరుచుకుంటుంది) |
గూగుల్ ప్లస్ లో పంచుకోవడానికి నొక్కండి (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
Click to share on LinkedIn (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
Click to share on Pinterest (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
Click to print (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
Click to email this to a friend (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
దీన్ని మెచ్చుకోండి:
ఫిబ్రవరి 17, 2015 in సమాజం సంస్కృతి. టాగులు:నిత్యా నిరంజన్, వలస ప్రజల దేశం, సియాటిల్ హిందూ ఆలయం
1962: చైనా కాదు ఇండియాయే దాడి చేసింది -మాక్స్ వెల్
ఇండియా-చైనా యుద్ధం: మిలట్రీ చర్యపై ముందే హెచ్చరించిన చైనా
← WW II: డ్రెస్డెన్ పై బ్రిటన్-అమెరికా పైశాచిక బాంబింగ్ కి 70 యేళ్ళు
ఎఎపి ఎలా గెలిచింది? -కార్టూన్ →
4 thoughts on “అమెరికాలో హిందూ ఆలయంపై విద్వేష దాడి”
Marxist-Leninist ఇలా అన్నారు:
నరేంద్ర మోదీకి విదేశీ పెట్టుబడులూ కావాలి, హిందువుల వోత్లూ కావాలి. చర్చ్లపై దాడులు చేస్తే అమెరికాతో మన సంబంధాలు దెబ్బతింటాయని హిందువులకి చెప్పే ధైర్యం మోదీకి ఎంత వరకు ఉందో చూద్దాం. మతం పేరు చెప్పుకోకుండానే సామ్రాజ్యవాదుల దళారీగా వ్యవహరించడం మన్మోహన్ సింగ్ కూడా చెయ్యగలడు. ఈ మాత్రం దానికి నరేంద్ర మోదీని మాత్రమే నమ్ముకోవడం అవసరమా అనే సందేహం వస్తుంది.
Ravi Himagiri ఇలా అన్నారు:
హెచ్.ఏ.ఎఫ్ గానీ నిత్యా నిరంజన్ లాంటివారు గానీ ఇక్కడ జరిగే దాడులను పట్టించుకోవలసిన అవసరం ఉందా? ఖండించాలా?
వారు ఉండేది అమెరికాలో అక్కడ దాడిజరిగితే వారిప్రతిస్పందిస్తే పరిగనలోకు తీసుకోవచ్చు! ఇక్కడ దాడి జరిగితే వారు ఎందుకు స్పందించాలి?(నా ఉద్దేష్యం ఇక్కడ జరిగే దాడులను నేను సమర్ధిస్తున్నట్లు కాదు)
విశేఖర్ ఇలా అన్నారు:
మీరు గమనించారో లేదో, మీ వాదనలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి.
మతం వరకు తీసుకుంటే, అక్కడా, ఇక్కడా హిందువులే. కనుక అక్కడ దాడి జరిగితే ఇక్కడివారు స్పందించాలి. ఇక్కడ దాడి జరిగితే అక్కడి వారు స్పందించాలి. ఇది పరస్పరం సహాయం చేసుకునే సాధారణ అవగాహన. సాధారణ న్యాయం కూడా.
మీరేమంటున్నారు! అక్కడ దాడి జరిగితే ఇక్కడి వారు స్పందించడం న్యాయబద్ధమే గానీ ఇక్కడ దాడి జరిగితే అక్కడి వారు స్పందించడం అసంబద్ధం అంటున్నారు. స్పందించాలని కోరడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ద్వంద్వ ప్రమాణం.
ద్వంద్వ ప్రమాణం అయితే మాత్రం ఏమిటి? అని అడిగితే నా వద్ద సమాధానం లేదు మరి.
విషయం కట్జు చెప్పారా, మరొకరు చెప్పారా అన్నది ముఖ్యం కాదు. మీరు అంటున్నట్లు ఎంతమంది విశ్వసిస్తున్నారు అన్నది కూడా ముఖ్యం కాదు. అది వాస్తవమా కాదా అన్నదే ముఖ్యం.
ఏమిటా వాస్తవం? అమెరికా లాగే ఇండియా కూడా వలస ప్రజల దేశమే అన్నది వాస్తవం. ఆ సంగతి చరిత్రకారులు నిరూపించారు. కాకపోతే కాలంలో తేడా. కొన్ని శతాబ్దాల క్రితం, కొన్ని సహస్రాబ్దాల క్రితం ఇక్కడికి వలసలు జరిగితే, అక్కడికి ఇటీవల లేదా ఐదారు దశాబ్దాల నుండి వలసలు జరుగుతున్నాయి. కొందరికో లేదా ఎక్కువమందికో ఇష్టం లేనంత మాత్రాన ఈ వాస్తవం మారదు.
వలసలు వెళ్ళడం అన్నది సహజ ప్రక్రియ. ఎక్కడ ఎక్కువ జీవన అవకాశాలు, సానుకూల పరిస్ధితులు ఉంటే అక్కడికి వలసలు జరుగుతాయి. ఇందులోకి మతాల్ని చొప్పించి ‘ఇది నాది’ అని బల ప్రయోగం చేయడమే అసలు సమస్య. ఈ సమస్యని అమెరికాలో ఒక విధంగా, ఇండియాలో మరొక విధంగా చూడాలని కోరడం అసంబద్ధం. న్యాయం అందరికీ ఒకే విధంగా పని చేయాలని కోరడం న్యాయం కాదా?
ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజంగా చేయడం మోసం. ఒక నిజం ఎన్నేళ్ళ తర్వాత బైటపడినా దాన్ని నిలబెట్టడం నిజాయితీ. మనం ఎటు వైపు నిలబడతాం అన్నది మన ఎంపిక. దాన్ని ఎవరూ రుద్దలేరు.
ఇక్కడ చర్చ్ లలపై దాడిజరిగినా,వారెందుకు(ప్రవాసభారతీయులు గానీ,సంస్థలుగానీ) స్పంధించాలి? ఈ దేశంలో అమెరిక నుండి వలస వచ్చినవారు(శ్వేత వర్ణం)కి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే(ముఖ్యంగా మతపరంగా) మొన్న ఒబామా చెప్పినట్లు ఉచిత సలహా ఇచ్చి వెలిపోయేవారుకదుకదా!
ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోమని ఈ దేశ పాలకులపై ఒత్తిడితెచ్చిఉండేవారుకదా!
ముఖ్యంగా నా ప్రశ్న ఏమిటంటే ఇక్కడ చర్చ్ లపై దాడి జరిగితే అక్కడివారు స్పందిచమని ఎందుకు కోరుతున్నారు?
మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి...
ఈమెయిలు (తప్పనిసరి) (Address never made public)
పేరు (తప్పనిసరి)
You are commenting using your Google+ account. ( నిష్క్రమించు / మార్చు )
You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు )
You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు )
దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి.
కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు.
మరో 3,579గురు చందాదార్లతో చేరండి
ఇటీవలి వ్యాఖ్యలు
కస్టమ్స్ సుంకం తగ్గించి ట్రంప్… పై telugumanasasarovara…
498A: దుష్ప్రచారం మాని పకడ్బంద… పై Dhanunjaya
2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు… పై Praveen Kumar
2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు… పై విశేఖర్
2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు… పై moola2016 |
కూడలి అగ్రిగేటర్ మూతపడినందున 'జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ' బ్లాగ్ సందర్శించేందుకు కొన్ని సూచనలు.
1. బ్రౌజర్ ఓపెన్ చేశాక అడ్రస్ బార్ లో teluguvartalu.com అని టైప్ చేసి 'Enter' నొక్కండి చాలు. బ్లాగ్ లోడ్ అయిపోతుంది.
2. 'బ్లాగ్ వేదిక' 'శోధిని' అగ్రిగేటర్లలో మాత్రమే నా బ్లాగ్ టపాలు కనపడతాయి.
3. ఈ మెయిల్ ద్వారా సబ్ స్క్రైబ్ అయితే నేరుగా మీ ఇన్ బాక్స్ నుండే బ్లాగ్ కి రావచ్చు. సబ్ స్క్రైబ్ కావడం కోసం బ్లాగ్ ఫ్రంట్ పేజీ కింది భాగంలో "Follow blog via Email" వద్ద మీ ఈ మెయిల్ ఇవ్వండి.
4. గూగుల్/యాహూ/బింగ్ సర్చ్ లో teluguvartalu.com కోసం వెతికినా చాలు.
ఇవి కూడా చూడండి
మనసులో మాట -సుజాత
మావో ఆలోచనా విధానం
పని లేక… -డా॥ రమణ
నా ట్వీట్లు
లోనికి ప్రవేశించండి
ఈమెయిలు చిరునామాకు పంపించు మీ పేరు మీ ఈమెయిలు చిరునామా
క్షమించాలి, మీ బ్లాగు ఈమెయిలు ద్వారా టపాలు పంచుకోలేదు. |
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
గేమ్ గీతా మాధురివైపు తిప్పుతోన్న బిగ్బాస్!
'బిగ్బాస్' సీజన్ 2 మరో వారం రోజుల పాటు పొడిగించారట. ఇప్పటికే నూట అయిదు రోజులు ఎక్కువ అని అంతా భావిస్తూ వుంటే, ఇప్పటికిప్పుడు మరో వారం రోజులు పొడిగించాల్సిన అవసరం ఎందుకొచ్చిందో? హౌస్లో వున్న చాలా మంది ఆసక్తి కోల్పోయి కేవలం ఫైనల్స్కి వెళితే చాలుననే రీతిన గేమ్ ఆడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో వారం పాటు ఫైనల్ వెనక్కి జరిగితే వాళ్ల మూడ్ ఎలాగుంటుందో? అయితే ఈ ప్లాన్లో మార్పు వెనుక ఆసక్తికర కారణాలున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఇంకా ప్రజామోదం కౌషల్కే అనుకూలంగా వుండడంతో ఆ అనుకూలతని తగ్గించడానికి వారం ఎక్కువ సమయాన్ని బిగ్బాస్ తీసుకుంటోందని, కౌషల్ ప్రభావాన్ని తగ్గించే పని ఎప్పట్నుంచో మొదలు పెట్టకపోవడం వల్ల ఇంకా ఆశించిన ఫలితాలు రావడం లేదని నిర్వాహకులు భావిస్తున్నారట.
అలాగే ఎలాగైనా ఈ గేమ్లో గీతా మాధురిని విజేతని చేయాలనే దిశగా కూడా పావులు కదుపుతున్నారట. అందుకే గీత ఎప్పుడు తప్పులు చేస్తున్నా వెంటనే కవర్ చేసేస్తున్నారట. ఆమెకి వెంటనే కర్తవ్యం బోధిస్తున్నారట. తాజాగా ఆమెకి బయటినుంచి రెండోసారి కాల్ చేయించారు. ఇంకా హౌస్లో అమిత్, దీప్తి, సామ్రాట్, శ్యామలతో కాలర్స్ మాట్లాడకపోయినా గీతకే రెండోసారి కాల్ ఇవ్వడమే కాకుండా ఈసారి లేడీనే బిగ్బాస్ విన్నర్గా చూడాలని వుందని పబ్లిక్ ఫీలవుతోన్న మెసేజ్ పాస్ చేసారు.
గీత విషయంలో మొదట్నుంచీ సాఫ్ట్ వెళుతోన్న నాని కూడా తనకే అనుకూలంగా వున్నాడనేది సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతోంది. బిగ్బాస్ ప్లాన్స్ ఏమైనా కానీ ఓటింగ్స్ మేనిప్యులేట్ చేయకపోతే మాత్రం ప్రస్తుతానికి కౌషల్ లీడింగ్లో వున్నాడు. పబ్లిక్ అతడిని చూసే దృష్టి కోణాన్ని ఎలా మారుస్తారనేది చూడాలి.
బండ్ల గణేష్ పంచులు మామూలుగా లేవు Nov 15,2018126 Shares బేబీ పాటకు రెహమాన్ కూడా ఫిదా Nov 15,2018126 Shares ‘నా నువ్వే’ గుర్తుకొస్తోంది తమన్నా.. Nov 15,2018126 Shares పవన్కు సీబీఐ మాజీ జేడీ ఝలక్! Nov 15,2018126 Shares
బండ్ల గణేష్ పంచులు మామూలుగా లేవు
పవన్కు సీబీఐ మాజీ జేడీ ఝలక్!
కేసీఆర్పై బాబు కామెంట్... ఏపీ టీడీపీలో అలజడి
ఇది తెలుగు రాజకీయ చిత్రం !
కూటమిలో ఫస్ట్ వికెట్...ఇంటిపార్టీ గుడ్బై
‘నా నువ్వే’ గుర్తుకొస్తోంది తమన్నా..
అలాంటి సినిమాలో అజితా.. నో ఛాన్స్
8 సినిమాల్లో ఐశ్వర్య.. ఒక్క సినిమాలో అభిషేక్
హాట్: అందాల సునామీ! |
10TV స్పెషల్స్
వైడ్ యాంగిల్
వన్ 2 వన్ శ్రీధర్ బాబు
ఫర్ ది పీపుల్
మూవీ రివ్యూ
నాగర్ కర్నూల్
వరంగల్ రూరల్
వరంగల్ అర్బన్
పశ్చిమగోదావరి : జిల్లాలోని చింతలపూడిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. అనంతరం.. వారిని చింతలపూడి వీధుల్లో అర్ధనగ్నంగా ఊరేగించారు. వీరిని ఇలా అర్థనగ్నంగా ఊరేగించడం బాగాలేదనివాదనలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో వీరిని పేకాట ఆడొద్దని పలుమార్లు హెచ్చరించినా... వినలేదని అందుకే ఇలా చేశామని పోలీసులు చెబుతున్నారు.
Read more about పేకాట స్థావరంపై పోలీసులు దాడి
లవర్ కాదు...కిల్లర్
Read more about లవర్ కాదు...కిల్లర్
గుంటూరు : రాజధాని పరిపాలన, నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై సీఎం చంద్రబాబు నాయుడుకు నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.. కోహినూరు వజ్రాకృతిలో రూపొందించిన శాసన సభ భవంతి, హైకోర్టు భవంతి ఆకృతులను కూడా వివరించారు..
Read more about రాజధాని భవనాల డిజైన్లపై బాబు సమీక్ష
Read more about అప్పు ఇవ్వొచ్చా..?
కాబూల్ లో ఆత్మాహుతి దాడి
ఆప్ఘనిస్తాన్ : కాబూల్లో క్రికెట్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాబూల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చెక్ పాయింట్ వద్ద సుసైడ్ బాంబర్ తనని తాను పేల్చుకున్నాడు. స్టేడియంలో టి-20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆటగాళ్లంతా క్షేమంగా ఉన్నట్లు ఆఫ్గన్ క్రికెట్ బోర్డు తెలిపింది.
Read more about కాబూల్ లో ఆత్మాహుతి దాడి
'జై హింద్ సర్' అని హాజరు పలకాలని ఆదేశం
భోపాల్ : మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలు ప్రయోగాలకు నిలయాలుగా మారుతున్నాయి. తరగతి గదిలో విద్యార్థులు హాజరు పలికేటపుడు 'యస్ సార్, ప్రజెంట్ సార్' అని చెప్పడం సాధారణం. ఇక మీదట దీనికి బదులు 'జై హింద్ సర్' అని పలకాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్ షా ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా సత్నా జిల్లాలోని అన్ని పాఠాశాలలో ఈ విధానం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది. దీనివల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందని మంత్రి సెలవిచ్చారు. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వ స్కూళ్లకు పెద్దమొత్తంలో విరాళాలిచ్చే కంపెనీలు, వ్యక్తుల పేర్లు పెడతామని విద్యామంత్రి చెప్పారు.
Read more about 'జై హింద్ సర్' అని హాజరు పలకాలని ఆదేశం
Read more about జెఎన్ యూలో ఎబివిపికి గట్టి ఎదురుదెబ్బ
గుజరాత్ : రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి షింజో అబే దంపతులకు అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో ప్రధాని నరేంద్రమోది ఘనస్వాగతం పలికారు. షింజో అబేను మోది ఆలింగనం చేసుకుని స్వాగతించారు. అబే పర్యటన కోసం ప్రత్యేక స్వాగతం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్లో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి సబర్మతీ ఆశ్రమం వరకు 8 కిలోమీటర్ల మేర సాగింది. సబర్మతీ నదీ తీరాన ఏర్పాటు చేసిన వేదికపై పలువురు కళాకారులు నృత్యాలను ప్రదర్శించారు. విదేశి ప్రధానమంత్రితో కలిసి భారత ప్రధాని రోడ్ షో నిర్వహించడం ఇదే తొలిసారి. రోడ్ షో సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 5 వందల ఏళ్ల కాలం నాటి సిద్ధి సయీద్ మసీదును షింజో అబే సందర్శించనున్నారు. గురువారం అహ్మదాబాద్ - ముంబై మధ్య తొలి హైస్పీడ్ రైలు పనుల ప్రారంభ కార్యక్రమంలో షింజో అబే పాల్గొంటారు. షింజో అబేకు గుజరాతీ వంటకాలతో ఈ సాయంత్రం మోది ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
Read more about షింజో అబే దంపతులకు మోది ఘనస్వాగతం
గుంటూరు : రాజధాని పరిపాలన, నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై సీఎం చంద్రబాబు నాయుడుకు నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.. కోహినూరు వజ్రాకృతిలో రూపొందించిన శాసన సభ భవంతి, హైకోర్టు భవంతి ఆకృతులను కూడా వివరించారు.. హైకోర్టు బాహ్య ఆకృతి అద్భుతంగా... ప్రపంచానికి తలమానికంగా ఉండాలని సీఎం నార్మన్ ప్రతినిధులకు సూచించారు.. లోపల ఎలాంటి సౌకర్యాలు ఉండాలో... అంతర్గత భవంతి నిర్మాణ శైలి ఎలా ఉండాలో న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు..
Read more about రాజధాని కీలక భవనాల డిజైన్లపై బాబు రివ్యూ
టీడీపీ, కాంగ్రెస్ ఐక్యతారాగం
హైదరాబాద్ : టీడీపీ.. కాంగ్రెస్..! ఈ రెండు పార్టీలూ మొన్నటి వరకూ వైరిపక్షాలు. కానీ ఇప్పుడు ఈ రెండు పార్టీలూ తెలంగాణలో ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నాయి. సమస్య ఏదైనా.. విడివిడిగానో... ఐక్యంగానో ప్రభుత్వ తీరును ఎండగుడుతోన్న టీడీపీ, కాంగ్రెస్లు, ఇప్పుడు ఎన్నికల్లోనూ ఐక్యంగా బరిలోకి దిగాలని నిర్ణయించాయి. రానున్న సింగరేణి ఎన్నికల్లో దీనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించాయి. |
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలు ఐక్యతారాగం అందుకున్నాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు, అదే కాంగ్రెస్తో జతకలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదుర్కొనేందుకు.. ఈ రెండు పక్షాలూ తమ సిద్ధాంతాలను సైతం పక్కనబెట్టి ఏకమవుతున్న పరిస్థితి తెలంగాణలో ఆవిష్కృతమవుతోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో అవకతవకల్ని ఎండగట్టేందుకు.. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి. కొంతకాలంగా వివిధ సమస్యలపై ఈ రెండు పక్షాలూ ఉమ్మడి ఆందోళనల్లో పాల్గొన్నాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు భూసేకరణ, మియాపూర్ భూస్కాం ఆరోపణలు, నేరెళ్ళలో దళితులపై దాడి పైనా ఒకే వాణిని వినిపించిన విపక్షాలు.. కొన్ని సందర్భాల్లో ఒకే ఉద్యమ వేదికనూ పంచుకున్నాయి. తాజాగా, రైతు సమన్వయ సమితులపైనా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఐక్యగళాన్ని వినిపిస్తున్నాయి.
సమగ్ర భూ సర్వే కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 39కి వ్యతిరేకంగా.. ఈ రెండు పక్షాలు ఐక్యంగా ఉద్యమిస్తున్నాయి. సీపీఐ, టీజేఏసీ నేతలను కూడా కలుపుకుని.. బుధవారం, జీవో 39 రద్దు కోసం గవర్నర్ నరసింహన్ను కలిశాయి. జీవో నెంబర్ 39ను రద్దు చేసేలా చొరవ తీసుకోవాలంటూ ఈ పార్టీల నేతలు గవర్నర్కు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు.
Read more about టీడీపీ, కాంగ్రెస్ ఐక్యతారాగం
టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య రైతు సమన్వయ సమితి చిచ్చు
వరంగల్ : జిల్లాలో టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య రైతు సమన్వయ సమితి చిచ్చు పెట్టింది. హన్మకొండలో సర్క్యూట్ హౌస్ వద్ద టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ను అడ్డుకున్నారు. తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ నిజమైన టీఆర్ఎస్ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే తీరుపై మంత్రి కడియంకు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రైతు సమన్వయ సమితుల్లో తమకు అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
Read more about టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య రైతు సమన్వయ సమితి చిచ్చు
వరంగల్ జిల్లాలో రైతు సమన్వయ సమితి రగడ
Read more about వరంగల్ జిల్లాలో రైతు సమన్వయ సమితి రగడ
సామాజిక వేత్త, ప్రొ.కంచె ఐలయ్య 'సోషల్ స్మగ్లర్లు' కోమటోళ్లు...అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంపై వక్తలు భిన్న వాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పుస్తక రయియిత, సామాజికవేత్త ప్రొ.కంచె ఐలయ్య, తెలంగాణ సాహితీ కన్వీనర్ భూపతి వెంకటేశ్వర్లు, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, వైశ్య వికాస వేదిక రాష్ట్ర కన్వీనర్ కాచం సత్యనారాయణగుప్తా పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
Read more about ప్రొ.కంచె ఐలయ్య పుస్తకంపై భిన్నవాదనలు
చంద్రబాబు జీవితం మీద సీన్మొస్తుంది....
గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ గరం... గల్లీలల్లతిరుగుకుంట జనానికిజెప్తున్నడు, చంద్రబాబు జీవితం మీద సీన్మొస్తుంది....ఓటుకు నోటు సీన్లు మాత్రం పెట్టకుండ్రి, రాత్రి 11 దాకా వైన్సులు ఓపెన్.. తాగుబోతులకు టీర్కార్ బంపర్ హాపర్, సైకిండ్లకు కూడా గులాలద్దిన ప్రభుత్వం... వైన్స్ లకు, బార్లకు కూడా అద్దితే బాగుంటది కదా, సబ్బిడీ గొర్లు అమ్ముకున్న ఇద్దరు అరెస్టు.... అపతొచ్చిన అవిట్నికాసుకోవల్సిందే ... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...
Read more about చంద్రబాబు జీవితం మీద సీన్మొస్తుంది....
దేశం లేని పౌరులు..
సొతగడ్డకు బరువయ్యారు.. చదువుకునే అర్హతలేదు.. ఉద్యోగాలకు అవకాశం లేదు.. అసలు బతికే పరిస్థితే లేదు.. ఏం చేయాలి? ఎటు పారిపోవాలి..? ఎక్కడ తలదాచుకోవాలి? ఇప్పుడది భూమీ ఆకాశాలు ఏకమైన సుదీర్ఘ విలాపం. చావుకీ బతుక్కీ మధ్య తేడా తెలియని లక్షలాది ప్రజల దీనత్వం.. జాతులపేరుతో, మతాల పేరుతో విద్వేషాలు పెంచుకునే మానవజాతి హీనత్వం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
Read more about దేశం లేని పౌరులు..
దేవాదాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ : దేవాదాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ధార్మిక పరిషత్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలపై వివక్ష చూపారని పేర్కొన్నారు. యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తరహాలోనే బాసర ఆలయ అభివృద్ధికి కార్యచరణ చేయనున్నట్లు తెలిపారు.
Read more about దేవాదాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ : సమచారం శాఖ కమిషన్ సభ్యుల నియామకానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సభ్యులుగా ఉన్నారు.
Read more about సమచారం శాఖ కమిషన్ సభ్యుల నియామకానికి కమిటీ ఏర్పాటు
Read more about పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరారీ
హీరో సునీల్ తో చిట్ చాట్ |
హీరో సునీల్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడారు. ఉంగరాల రాంబాబు సినిమా విశేషాలను వివరించారు. తన సినీ కెరీర్ పై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
Read more about హీరో సునీల్ తో చిట్ చాట్
చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు త్వరలో భక్తులకు కనువిందు చేయనున్నాయి. చాలా కాలం తరువాత ధర్మకర్తల మండలి లేకుండానే.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధమవుతోంది. జిల్లా యంత్రాంగంతో కలుపుకొని నలుగురు ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సెప్టెంబర్ 22న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి అక్టోబర్ 1 వరకూ జరగనున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సెప్టెంబర్ 22న జరగనుంది. 23న ధ్వజారోహణంతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. అదే రోజు సీఎం చంద్రబాబునాయుడు.. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. చాలా కాలం తరువాత ధర్మకర్తల మండలి లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధమవుతోంది.
ఉత్సవాలు జరిగే 9 రోజులు స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ.. భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. ఆ రోజుల్లో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని.. వాహన సేవల్లో పాల్గొనాలని భక్తులు కోరుకుంటుంటారు. గరుడ సేవ రోజున 4 నుండి 5 లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం బ్రహ్మోత్సవాలకు ముందు టీటీడీ ధర్మకర్తల మండలి నియామకం పట్ల మొగ్గు చూపడం లేదు. ఉత్సవాల తరువాతే కొత్త పాలకమండలిని నియమిస్తారని చర్చించుకుంటున్నారు. ఇక టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు నేతృత్వంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బ్రహ్మోత్సవం ఏర్పాట్లకు రూ. 8 కోట్ల కేటాయింపు
బ్రహ్మోత్సవం ఏర్పాట్లకు మొత్తం 8 కోట్లు కేటాయించారు. కొత్తగా తయారు చేసిన ఏడు అడుగుల సర్వభూపాల వాహనంలో.. ఈ ఏడాది స్వామివారిని ఊరేగించనున్నారు. దసరా సెలవులకు తోడు తమిళ భక్తులు పరమ పవిత్రంగా భావించే పెరటాశి నెల కూడా బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉండడంతో.. భక్తులు ఎక్కువగా వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది.
Read more about శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోన్న టీటీడీ
చంద్రబాబు రూటు మార్చారు...
విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రూటు మార్చారు. మొన్నటి వరకూ పాలనపైనే ఎక్కువ ఫోకస్ చేసిన చంద్రబాబు తాజాగా ఎమ్మెల్యేల పనితీరును సీరియస్గా మానిటర్ చేస్తున్నారు. పని తీరు బాగుంటేనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తానంటూ చంద్రబాబు స్పష్టం చేయడంతో తెలుగు తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. .
టిడిపి అధినేత.. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు పాలనా కార్యక్రమాలు చూసుకుంటూనే మరోవైపు పార్టీకి వీలైనంత సమయం కేటాయిస్తున్నారు. ఇక నుండి రియల్ టైమ్ పాలిటిక్స్ చేస్తానంటూ తాజాగా ఆయన చేసిన కామెంట్స్ తెలుగు తమ్ముళ్లలో గుబులు పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేయిస్తున్న వరుస సర్వేలతో వచ్చే ఎన్నికల్లో తమ బెర్త్ ఉంటుందా? లేక ఊడుతుందా అన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.
ఇటీవల చంద్రబాబు చేయించిన సర్వేలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వారిలో మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని తేలడంతోపాటు.. కొందరిపై అవినీతి ఆరోపణలు తీవ్రస్ధాయిలో ఉన్నట్లు తేలింది. అలాగే కొందరు ఇంచార్జ్లు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని తేలింది. దీంతో ఇంచార్జ్లను మార్చాలనే యోచనలో ఉన్నారు చంద్రబాబు. ఇక ఎమ్మెల్యేల పని తీరును కూడా సర్వేల ద్వారా తెలుసుకుంటున్న చంద్రబాబు పార్టీ అంతర్గత సమావేశాలు జరిగినప్పుడల్లా సూచనలు చేస్తూనే ఉన్నారు. పని తీరు సరిచేసుకోకపోతే వచ్చే ఎన్నికలకు టికెట్ ఉండదనే హెచ్చరికలు పంపిస్తున్నారు. అటు యువనేత లోకేశ్ సైతం ఇదే అంశాన్ని నేతల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికలకు 175 టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ని పక్కన పెట్టి పనిచేయాలని నేతలకు హితబోధ చేస్తున్నారు. మరి బాబు మాటలు నేతలు సీరియస్ గా తీసుకుంటారా? లేక లైట్ తీసుకుంటారా? అనేది వేచి చూడాలి.
Read more about చంద్రబాబు రూటు మార్చారు...
ట్రాక్టర్ బోల్తా... విద్యార్థి మృతి
ఖమ్మం : జిల్లాలోని గోళ్లపాడు నుంచి తీర్ధాల మధ్యలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న విద్యార్తుల్లో ఒకరు చనిపోగా... 15 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Read more about ట్రాక్టర్ బోల్తా... విద్యార్థి మృతి
Read more about పేకాటరాయుళ్లను అర్ధనగ్నంగా ఊరేగించిన పోలీసులు |
కర్నూల్ : నగరంలో గత నెలలో జరిగిన విద్యార్ధిని ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. కర్నూల్ శివారులోని కట్టమంచి రామలింగా రెడ్డి ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ప్రీతి అనే విద్యార్ధిని ఆగస్ట్ 19న ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది హత్యేనంటూ కుటుంబ సభ్యులు, విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపడుతూ.. పాఠశాల వద్ద రాస్తారోకోని నిర్వహించారు. హత్యకు భాద్యులైన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని... అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.
Read more about వివాదాస్పదంగా మారిన విద్యార్ధిని ఆత్మహత్య
భారీ పాత నోట్లు లభ్యం
Read more about భారీ పాత నోట్లు లభ్యం
ఢిల్లీ : వంశధార నదీ జలాల వివాదంపై వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పు వెల్లడించింది. నేరడి బ్యారేజీ, సైడ్ వీర్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సి.డబ్ల్యు.సి ఛీఫ్ ఇంజనీర్ నేత్రృత్వంలో ఏపీ, ఒడిషా రాష్ట్రాలకు చెందిన ఛీఫ్ ఇంజనీర్లు, సి.డబ్ల్యు.సి డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఒప్పందంలో భాగంగా ఏడాదిలోగా నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం 106 ఎకరాలు సేకరించి ఒడిషా ప్రభుత్వం... ఏపీకి ఇవ్వాల్సి ఉంటుంది. నేరడి బ్యారేజీ ఎడమ కాలువ ద్వారా 5 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలనుకుంటే.. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే ఖర్చును కొంత మేర కూడా భరించాల్సి ఉంటుంది. సైడ్ వీర్ నిర్మాణాల ద్వారా వంశధార నదీ జలాలను పెద్ద మొత్తంలో ఏపీ వినియోగించుకొనే అవకాశం ఉందన్న ఒడిషా వాదనలను ట్రిబ్యునల్ కొట్టివేసింది.
Read more about వంశధార నదీ జలాల వివాదంపై వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పు
హైదరాబాద్లో భారీవర్షం
Read more about హైదరాబాద్లో భారీవర్షం
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో సాయికిరణ్ను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. శనివారం చాందిని అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిందని.. వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాల్డేటా, స్నేహితుల వివరాలు, సీసీ ఫుటేజీలను పరిశీలించి సాయికిరణ్ ను హంతకునిగా గుర్తించామన్నారు. సాయికిరణ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. చాందినిపై లైంగిక దాడి జరగలేదని... పోస్టుమార్టమ్ నివేదిక ఇంకా రావాల్సి ఉందన్నారు. చాందిని, సాయి కిరణ్ ఇద్దరు మైనర్లేనని సీపీ తెలిపారు. పిల్లలు సోషల్ మీడియా వాడే సమయంలో...
Read more about సాయికిరణ్ ను హంతకునిగా గుర్తించాం : సీపీ సందీప్ శాండిల్య
Read more about నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల గోస
Read more about ప్రాణాలు తీసిన ఈత సరదా
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్లలో టీమాస్ ఫోరం ఆవిర్భావ సభలో తెలంగాణ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వం వైపు పోతుందా లేక ప్రజాస్వామ్యం వైపు పోతుందా తెలియడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే టీమాస్ ఫోరం ఆవిర్భవించిందని..ఈ పేరు వింటేనే పాలకులకు వణుకుపుడుతోందన్నారు.
Read more about టీ.ప్రభుత్వాన్ని నిలదీసేందుకే టీమాస్ ఫోరం : తమ్మినేని
ఎంపీ బీబీ పాటిల్పై చర్యలు తీసుకోవాలి..
హైదరాబాద్ : రైతుల భూముల్ని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్పై చర్యలు తీసుకోవాలని... రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇలాంటి అక్రమాలు చేయడమే కాకుండా... రైతులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కంటి మండలంలోని 23 గ్రామాల్లో భూములు కొన్నట్లు పాటిల్ మోసపూరిత అగ్రిమెంట్లు రాయించుకున్నారని చెప్పారు. 2006లో 40 వేల రూపాయలకు ధర మాట్లాడుకొని కేవలం పది వేలే చెల్లించారని మండిపడ్డారు. పాటిల్ కంపెనీ పేరుతో అక్రమంగా రిజిస్టర్ చేసుకున్న భూముల రిజిస్ర్టేషన్లను వెంటనే రద్దు చేయాలంటూ... సీసీఎల్ ఏ జాయింట్ కమిషనర్కు బాధితులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు.. రైతులను మోసం చేసి తీసుకున్న భూములను తిరిగి వారికి అప్పగించాలని కోరారు....
Read more about ఎంపీ బీబీ పాటిల్పై చర్యలు తీసుకోవాలి..
ఖమ్మం : జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లో 13 లక్షల చేపపిల్లలను మంత్రులు వదిలారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం 18 లక్షల గొర్రెలను యాదవులకు పంపిణీ చేసిందని మంత్రి తలసాని అన్నారు. ఈనెల 15న సీఎం చేతులమీదుగా సంచార పశువైద్యశాలలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతూ విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి తుమ్మల విమర్శించారు.
Read more about పాలేరులో మంత్రులు తుమ్మల, తలసాని పర్యటన |
హైదరాబాద్ : పాలిహౌస్ల పేరుతో ఉద్యానవన రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు ధ్వజమెత్తారు. హైదరాబాద్లో ఆందోళన చేస్తున్న రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల పూలతోటల రైతులకు వీహెచ్ బాసటగా నిలిచారు. 75 శాతం సబ్సిడీ ఇస్తామని ఊరించిన ప్రభుత్వం.. పూలతోటలు పెట్టిన తర్వాత అన్యాయం చేసిందన్నారు. రూ.180 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read more about ఆందోళన చేస్తున్న పూలతోటల రైతులకు వీహెచ్ మద్దతు
రైతు ఆత్మహత్య
సూర్యాపేట : జిల్లాలోని నెరేడుచర్ల మండలం పెంచికలదిన్నె గ్రామంలో కృష్ణయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కృష్ణయ్య కుటుంబ సభ్యులు అతని శవంతో రోడ్డుపై ధర్నా చేశారు. తనఖాలో ఉన్న తన భూమిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించడంతో.. మనస్తాపానికి గురైన కృష్ణయ్య ... పురుగులు మందు తాగి...తన పంట పొలం దగ్గరే ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన కృష్ణయ్య బంధువులు ఆందోళన చేశారు. కృష్ణయ్య ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read more about రైతు ఆత్మహత్య
Read more about చాందిని హత్య కేసు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
Read more about స్పీడ్ న్యూస్
ఛత్తీస్గడ్ : అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీం, ఆసారాం బాపు జైలుశిక్ష అనుభవిస్తున్నప్పటికీ... బాబాల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లడం లేదు. సాధారణ ప్రజలే కాదు... మంత్రులు సైతం బాబాలను గుడ్డిగా నమ్ముతున్నారు. ఛత్తీస్గడ్కు చెందిన హోంమంత్రి రామ్ సేవక్ పైక్రా షుగర్ వ్యాధిని నయం చేసుకోవడానికి కంబల్ బాబాను ఆశ్రయించాడు. ప్రజాయాత్రలో భాగంగా మంత్రి బలరామ్పూర్ జిల్లాలో ఉన్న కంబల్ బాబాను కలుసుకున్నారు. కంబల్ ఓఢాకర్ బాబా చెవిలో మంత్రం ఊదితే చాలు...ఎలాంటి రోగమైనా తగ్గిపోతుందట. దీనికో షరతు ఉంది. బాబా దర్బార్కు 5 సార్లు తప్పకుండా రావలసి ఉంటుంది. తన పర్యటనలో భాగంగానే బాబాను కలిశానని...ఆ చమత్కారమేంటో చూడ్డానికే వచ్చినట్లు మంత్రి చెప్పారు. ఓ టీస్పూన్ చక్కెర ఇచ్చాడని...ఇందుకోసం బాబా నయాపైసా తీసుకోరని మంత్రి చెప్పారు. కంబల్ బాబా అసలు పేరు గణేష్. భుజాన గొంగడి వేసుకోవడంతో కంబల్ బాబాగా మారారు. 28 ఏళ్లుగా ఇలా చికిత్స చేస్తున్నాడు.
Read more about బాలుడి హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం
ఢిల్లీ : భారత్కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్...అండరవరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్లో దావూద్కు చెందిన 43 వేల కోట్ల ఆస్తులను జప్తు చేశారు. దావూద్కు చెందిన బ్రిటన్లో పలు భవనాలతో పాటు ఓ హోటల్ను కూడా జప్తు చేసినట్లు యూకే ప్రభుత్వం పేర్కొంది. దౌత్యపరంగా విదేశాల్లో భారత్కు ఇది పెద్ద విజయం. దావూద్ పేరిట వార్విక్షైర్లో ఓ హోటల్తో పాటు మిడ్ల్యాండ్స్లో నివాస స్థలాలున్నాయి. దావూద్కు లండన్లో ఆస్తులున్నట్లు 2015లో ఈడీ గుర్తించింది. 1993 ముంబై వరుసు పేలుళ్ల సూత్రధారి దావూద్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. పేలుళ్ల అనంతరం దేశం విడిచి వెళ్లిపోయిన దావూద్ పాకిస్తాన్లో దాక్కున్నట్లు సమాచారం. దావూద్కు 21 మారుపేర్లు ఉన్నాయి.
Read more about దావూద్ ఇబ్రహీంకి గట్టి ఎదురుదెబ్బ
సూర్యపేట : నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నెలో విషాదం నెలకొంది. పరుగులమందు తాగి రైతు కృష్ణయ్య (50) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2003సం.లో ఎరువుల వ్యాపారి వద్ద కృష్ణయ్య తన పొలాన్ని తనఖా రిజిస్ట్రేషన్ చేయించారు. డబ్బులు తీసుకుని తన పొలం తనకు ఇవ్వాలని కృష్ణయ్య అన్నారు. అందుకు ఎరువుల వ్యాపారి అంగీకరించలేదు. పోలీసులు, అధికారుల అండతో ఇతరులకు పొలాన్ని విక్రయించేందుకు యత్నించారు. మనస్తాపంతో రైతు కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహంతో బంధవులు ఆందోళన చేపట్టారు.
Read more about పరుగులమందు తాగి రైతు ఆత్మహత్య
ఒక్కమంత్రి కూడా అందుబాటులో లేరు : విష్ణుకుమార్ రాజు
అమరావతి : ఆర్జీలు ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్తే ఒక్కమంత్రి కూడా అందుబాటులో లేరని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఎమ్మెల్యేలకే ఈ పరిస్థితి ఉందంటే ఇక సామాన్యులు ఇంకెంత ఇబ్బందులు పడుతున్నారో అని అన్నారు.
Read more about ఒక్కమంత్రి కూడా అందుబాటులో లేరు : విష్ణుకుమార్ రాజు
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ : నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలో పలు చోట్ల వర్షం పడింది. తార్నాక, మౌలాలి, మాల్కాజ్ గిరి, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి.
Read more about హైదరాబాద్ లో భారీ వర్షం
విజయవాడ : ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల నిర్వహణపై... అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం పనులైతే ప్రారంభమయ్యాయి కానీ.. నిధులు జాడ మాత్రం కానరావడం లేదు. పాలక మండలి ప్రతిపాదనలు పంపినా... నేటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో ఉత్సవాల నిర్వహణపై అయోమయం నెలకొంది. |
నిధులు విడుదల చేయని ప్రభుత్వం
విజయవాడ... ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏటా వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు ఈ ఏడాది ఏ విధంగా జరగుతాయోననే... సందేహం వ్యక్తమవుతుంది. దసరాను పురస్కరించుకుని... శ్రీ కనకదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పనులు కూడా చేపట్టారు. కానీ ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకూ నిధులు విడుదల చేయలేదు.
దసరా ఉత్సాలకు రూ.15 కోట్ల ఖర్చవుతుందని అంచనా
ఈ ఏడాది దసరా ఉత్సవాలకు సుమారు రూ.15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ఆలయ అధికారులు... కనీసం 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని దేవస్థానం అధికారులు.. ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు పాలక మండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించారు.
అలాగే... పాలకమండలి ఆలయంలో దర్శనం టికెట్ ధరలను తగ్గించాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ఆలయ చైర్మన్ గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి ఆధ్వర్యంలో దర్శనం టికెట్ ధరను రూ.300ల నుంచి రూ.150లకు... ముఖమండప దర్శనం టికెట్ ధరను వంద రూపాయల నుంచి 50 రూపాయలకు తగ్గించాలని సభ్యులు తీర్మానం చేశారు. ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇప్పటికైనా త్వరితగతిన ప్రభుత్వం స్పందించి ఆలయ అంతరాలయ టికెట్ల ధరలను తగ్గించాలని... ఉత్సవాలకు నిధులు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే ఉత్సవాల నిధులతో పాటు...ఈ పదిరోజుల పాటు పని చేసే వివిధ శాఖల అధికారులకు అయ్యే మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వమే అందిస్తే... ఆలయంపై భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
Read more about ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై అనుమానాలు
Read more about అమరావతిలో పర్యటిస్తోన్న వరల్డ్ బ్యాంక్ పరిశీలన బృందం
Read more about చాందిని హత్యకేసు వివరాలు వెల్లడించనున్న పోలీసులు
కన్సెంట్ డైవోర్స్ యాక్టు..అనే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. కన్సెంట్ డైవోర్స్ యాక్టు గురించి వివరించారు. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
Read more about కన్సెంట్ డైవోర్స్ యాక్టు అంటే ఏమిటీ ?
నెల్లూరు : అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే స్వల్ప అస్వస్థతకు గురైంది. నెల్లూరులో ప్రైవేటు ఫంక్షన్కు హాజరైన షాలిని అస్వస్థతకు గురవడంతో బోలినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.
Read more about హీరోయిన్ షాలిని పాండేకు అస్వస్థత
గవర్నర్ను కలిసిన అఖిలపక్షం నేతలు
హైదరాబాద్ : అఖిల పక్షం నేతలు గవర్నర్ నరసింహన్ కలిశారు. జీవో నంబర్ 39 రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో నంబర్ 39 టీఆర్ఎస్ పార్టీ రాజకీయ అవసరాలకు తప్ప రైతులకు ఏ మాత్రం ఉపయోగపడదని అఖిల పక్షం నేతలు ఆరోపించారు. రైతులను తీవ్ర నష్టపరిచే జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకునే దిశగా చర్యలు చేపట్టాలని గవర్నర్ను కోరారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్పారు.
Read more about గవర్నర్ను కలిసిన అఖిలపక్షం నేతలు
మహిళలు, స్కూలు విద్యార్థుల రక్షణకు కొత్త రవాణా చట్టం
శ్రీకాకుళం : మహిళలు, స్కూలు విద్యార్థుల రక్షణకు కొత్త రవాణా చట్టాన్ని అమలు చేస్తున్నామని నిబంధనలు అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం చర్యలు 10 టీవీతో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషన్ శ్రీదేవి త్వరలో రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో కాల్ అంబులెన్స్ యాప్ ను ప్రారంభిచబోతున్నామని తెలిపారు.
Read more about మహిళలు, స్కూలు విద్యార్థుల రక్షణకు కొత్త రవాణా చట్టం
సామాజిక న్యాయం పాటించాం : ఎంపీ బాల్కసుమన్
హైదరాబాద్ : రైతు సమన్వయ సమితులపై పిటిషనర్లకు కోర్టు చీవాట్లు పెట్టినా గవర్నర్ ను కలవడం సిగ్గుచేటని టీఆర్ ఎస్ ఎంపీ బాల్కసుమన్ అన్నారు. రైతు సమన్వయ సమితుల్లో సామాజిక న్యాయం పాటించామని తెలిపారు. రైతులు తమ వెంట రారనే భయంతో సమితులను అడ్డుకోవాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. సింగరేణిలో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్ అనుబంధ సంఘాలు ప్రకటించడం రాజకీయ వ్యభిచారమే అని అన్నారు.
Read more about సామాజిక న్యాయం పాటించాం : ఎంపీ బాల్కసుమన్
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలి : సీఎం చంద్రబాబు
హైదరాబాద్ : థర్మల్ విద్యుత్ ఉత్పత్తి...కొనుగోలును క్రమంగా తగ్గించుకుని పునరుత్పాదక విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేలా కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ నిల్వ సామర్థ్య వ్యవస్థ నెలకొల్పే లోపు విద్యుత్, కొనుగోలు వ్యయాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టాలని సూచించారు.
Read more about పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలి : సీఎం చంద్రబాబు
విద్యుత్ రంగంలో ఏపీకి 26 అవార్డులు |
హైదరాబాద్ : విద్యుత్ రంగంలో రాష్ట్రానికి 2015...16 నుంచి 2016..17 వరకు 26 అవార్డులు వచ్చాయి. విద్యుత్ శాఖలో సేవలను ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. డిమాండ్ ...సప్లయ్ ఆధారంగానే సబ్ స్టేషన్ల, ఇతర మౌలిక వసతుల కల్పన జరగాలని కోరారు. ఆక్వా రంగంతో సహా అన్నింటా విద్యుత్ వినియోగంలో ఆదాకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read more about విద్యుత్ రంగంలో ఏపీకి 26 అవార్డులు
గవర్నర్ను తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన పరిటాల సునీత
హైదరాబాద్ : గవర్నర్ను తన కుమారుడి పెళ్లికి.. మంత్రి పరిటాల సునీత ఆహ్వానించారు. అక్టోబర్ 1న తన కుమారుడి పెళ్లి జరగనున్నట్లు ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ను, మంత్రులు, ఎమ్మెల్యేలు, తమ పార్టీకి చెందినవాళ్లను.. అందరినీ ఆహ్వానించనున్నట్లు సునీత చెప్పారు. ప్రజలందరూ తన కుమారుడు శ్రీరామ్కు ఆశీస్సులు అందించాలని కోరారు.
Read more about గవర్నర్ను తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన పరిటాల సునీత
అమరావతిలో వరల్డ్ బ్యాంక్ పరిశీలన బృందం పర్యటన
గుంటూరు : అమరావతిలో వరల్డ్ బ్యాంక్ పరిశీలన బృందం పర్యటిస్తోంది. నేలపాడు రైతులతో భారీ ఎత్తున సభ నిర్వహించిన బృంద సభ్యులు రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు అంశంపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వరల్డ్ బ్యాంకు నుంచి రుణం విషయంలో కొందరు రైతులు లేఖలు రాసిన నేపథ్యంలో ప్రతినిధుల బృందం క్షేత్రస్ధాయిలో పరిశీలన ప్రారంభించింది. మరోవైపు రాజధాని నిర్మాణానికి స్వచ్చందంగా భూములు ఇచ్చామని.. తమను ఎవరూ బలవంత పెట్టలేదని రైతులు చెప్పారు.
Read more about అమరావతిలో వరల్డ్ బ్యాంక్ పరిశీలన బృందం పర్యటన
నా కూతురిని చంపడానికి అతనికేం హక్కు ఉంది : చాందిని తల్లి
Read more about మియాపూర్ పీఎస్కు సాయికిరణ్
ఏపీలో పెరిగిన 7.3 శాతం విద్యుత్ ఉత్పత్తి
Read more about ఏపీలో పెరిగిన 7.3 శాతం విద్యుత్ ఉత్పత్తి
హైదరాబాద్ : చాందిని హత్యకేసు నిందితుడు సాయికిరణ్ను మియాపూర్ పీఎస్కు తరలించారు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు సాయికిరణ్ను ప్రవేశపెట్టనున్నారు. చాందిని హత్యకేసు వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. మరోవైపు సాయికిరణ్ను కఠినంగా శిక్షించాలని చాందిని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Read more about మధ్యాహ్నం మీడియా ముందుకు సాయికిరణ్
గుంటూరు : ఏపీ డిస్కంకు ఆదాయం కన్నా, వ్యయం పెరిగింది. 2016-2017 సంవత్సరానికి ఆదాయం 25 వేల 290 కోట్లు కాగా, ఖర్చు 27 వేల 621 కోట్లకు చేరింది. 2016-2017లో ఏపీ డిస్కంకు 2 వేల 331 కోట్ల నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అధికారులు ఈ విషయాల్ని వివరించారు.
Read more about నష్టాల్లో ఏపీ డిస్కంలు
గుంటూరు : ఏపీ డిస్కంకు ఆదాయం కన్నా, వ్యయం పెరిగింది. 2016-2017 సంవత్సరానికి ఆదాయం 25 వేల 290 కోట్లు కాగా, ఖర్చు 27 వేల 621 కోట్లకు చేరింది. 2016-2017లో ఏపీ డిస్కంకు 2 వేల 331 కోట్ల నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అధికారులు ఈ విషయాల్ని వివరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Read more about పుట్ బాల్ ప్రీమియర్ లీగ్ లోకితెలుగు టైగర్స్
హైదరాబాద్ : లోధా బాధితులు రెండు వర్గాలతో మాట్లాడినట్లు.. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. అలాగే బిల్డర్పై చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మేటప్పుడు ఎలాంటి వసతులు కల్పిస్తామని బిల్డర్ హామీ ఇచ్చారో, వాటిని అమలు చేయమని బిల్డర్కి ఆదేశాలిస్తామన్నారు. లోధా బిల్డర్ యజమాని హాజరు కాలేదు.
Read more about లోధా బాధితులతో మాట్లాడం : కమిషనర్
హైదరాబాద్ : సాయికిరణ్ చిన్నప్పటి నుంచి చాందినితో కలిసి చదువుకున్న అబ్బాయి కావడంతో.. తమకెలాంటి అనుమానం రాలేదని చాందిని తల్లి తెలిపారు. తమ కూతురిని చంపడానికి అతనికేం హక్కుందని ఆమె ఆవేదనకు గురయ్యారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
Read more about చంపే హక్కు వాడికెక్కడిది : చాందిని తల్లి
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన మియాపూర్ మదీనాగూడకు చెందిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్యకేసులో మిస్టరీ వీడింది. ఆమె స్నేహితుడు సాయికిరణ్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తనను పెళ్లి చేసుకోమని చాందిని ఒత్తిడి చేస్తుండడంతో పథకం ప్రకారమే ఆమెను అమీన్పూర్ గుట్టలోకి తీసుకెళ్లి హత్య చేశాడని తేల్చారు. ఘటన సమయంలో ఆమెపై అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మదీనాగూడలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సాయికిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read more about చాందినిని వెంటపడద్దని చెప్పను |
గుంటూరు : జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల తీరుపై అధికారపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. యూజీడీ పనుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా.. నాసిరకంగా పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి యుజిడి ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అడ్డగోలుగా చేపట్టిన పనులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే ఫిర్యాదు....
Read more about డీపీఆర్ నుంచి అక్రమాలే
గుంటూరు : అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్న షాపూర్జీ పల్లోంజి కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుజిడి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వెయ్యి కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ పైపు లైన్లు వేస్తుండటంతో.. దీర్ఘకాలం మన్నేలా పనులు చేపట్టాల్సి ఉంది. ముఖ్యమైన కూడళ్ల వద్ద ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పైపులైన్ల సైజుల్లోనూ నిబంధనలు పాటించడం లేదన్నది మరో ఆరోపణ. పనులు తొందరగా పూర్తి చేయాలన్న ధ్యాస తప్ప.. నాణ్యత గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్వారీ డస్ట్తో పనులు పూర్తి
పైపులైన్ వేసే ముందు 4 అంగుళాల మేర ఇసుక వేయాలి. పైపు లైన్ వేసిన తర్వాత కూడా 6 అగుంళాల మేర ఇసుక వేయడం తప్పనిసరి. అయితే ఇసుక వేయకుండా క్వారీ డస్ట్తో పనులు పూర్తి చేస్తున్నారు. గుంటూరు నగరంలో నల్లరేగడి భూములు ఉండటంతో..పైపులైను గుంతలను సరిగా పూడ్చకపోతే భూమిలో పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దాంతో పైపులైన్లు పగిలే పోయే అవకాశం ఉందంటున్నారు. వెయ్యి కోట్లతో చేపట్టిన పనులను ప్రజారోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది. ఈ శాఖలో సిబ్బంది తగినంతగా లేరు. దీంతో పనుల నాణ్యతపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read more about నాసిరకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
2012లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు మంజూరు
అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి పెరిగిపోయింది. గుంటూరు నగరానికి జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2012లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును మంజూరు చేసింది. పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్న సమయంలో గుంటూరు కార్పొరేషన్లో యుజిడి పనుల కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. గత ఏడాదే షాపూర్జీ పల్లోంజి కంపెనీ టెండర్లు దక్కించుకొని పనులు మొదలు పెట్టింది. స్థానిక ఎమ్మెల్యేలు గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఘనంగా జనవరిలో శంకుస్థాపన చేశారు. ఏడాది క్రితమే పనులు ప్రారంభించాల్సి ఉండగా.. పలు కారణాలతో జాప్యం జరిగింది. 18 నెలల్లోనే ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని షాపూర్జీ, పల్లోంజీ ప్రకటించడంతో అధికారులు అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించారు. సుమారు వెయ్యి కిలో మీటర్ల మేర నగరమంతా భూగర్భ పైపు లైన్లు వేయాలని నిర్ణయించారు. లక్షా నలభై వేల గృహాలను పైప్ లైన్ల ద్వారా అనుసంధానించాలని నిశ్చయించారు.
Read more about గుంటూరు వాసులకు నరకం
Read more about తల్లి జీవితాన్ని ఇస్తే నదులు సర్వస్వాన్నిస్తాయి : చంద్రబాబు
Read more about ప్లాన్ ప్రకారమే చాందిని హత్య
అసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం
కోమరంభీమ్ అసిఫాబాద్ : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కాగజ్నగర్, కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్ పేట్, దహేగాం, బెజ్జూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుండే కొన్ని గ్రామాలలో.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గత 10 రోజులుగా వర్షాలు లేకపోవడంతో.. ఆందోళనకు గురైన రైతన్నకు ఈ వర్షంతో కాస్త ఊరట లభించింది.
Read more about అసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం
హైదరాబాద్ : చాందినిని హత్య చేసి అనంతరం నిందితుడు సాయికిరణ్ తమ ఇంటికి వచ్చినట్లు చాందిని పేరెంట్స్ చెబుతున్నారు. సాయికిరణ్ హత్య చేశాడని తెలిసి షాకయ్యామని చాందిని తల్లి అన్నారు. హత్యలో అతనికి మరికొందరు సాయం చేసినట్లు భావిస్తున్నామని ఆమె ఆరోపించారు. సాయికిరణ్ను కఠినంగా శిక్షించాలని చాందిని తల్లి డిమాండ్ చేస్తున్నారు. ఇక సాయి కిరణ్ తానే నేరం చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. 2015 నుంచి చాందిని తను ప్రేమించుకుంటున్నామని .. ఆమె ప్రవర్తన నచ్చక 6 నెలల నుంచి దూరం పెట్టానని సాయికిరణ్ పోలీసులకు తెలిపాడు. అయితే చాందిని హత్య వెనుక సాయికిరణ్కు ఎవరెవరు సహకరించారనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చాందిని అక్క తాను కూడా చాందిని చదివిన స్కూల్లోనే చదివానని తెలిపింది. సాయికిరణ్, చాందిని క్లాస్మేట్ అని తెలుసని, ఇలా చంపేస్తాడని అనుకోలేదని చెప్పింది. ఏ ప్రాబ్లమైనా షేర్ చేసుకునేదని, లోలోపల ఇంత ఒత్తిడికి గురవుతోందని తెలీదని ఆవేదనకు గురైంది.
Read more about హత్యచేసి చాందిని ఇంటికి వెళ్లిన సాయికిరణ్ |
హైదరాబాద్ : చైతన్యపురిలోని శ్రీచైతన్య కాలేజ్ లెక్చరర్ల ఆందోళన దిగారు. అకారణంగా ఆరుగురు లెక్చరర్స్ తొలగించాలని వారు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ ఫర్ పేరుతో డీన్ రవికాంత్ వేధిస్తున్నాడంటున్నారు. వారు యాజమాన్యానికి, డీన్ రవికాంత్ వ్యతిరేకంగా నినాదాలు తొలగించిన లెక్చరర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.
Read more about శ్రీచైతన్యలో కాలేజీలో లెక్చరర్ల ఆందోళన
హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టించిన చాందిన హత్య కేసు మిస్టరీ వీడింది. చాందిని ఆమె ప్రియుడు సాయికిరణ్ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తెలింది. మదీనాగూడకు చెందిన సాయికిరణ్ చాందినిని తానే చంపినట్లు అంగీకరించాడు. 2015 నుంచి తను చాందినిన ప్రేమించుకుంటున్నామని, చాందిని ప్రవర్తన నచ్చక ఆరు నెలలుగా దూరం పెట్టా అని కిరణ్ విచారణలో తెలిపాడు. సాయికిరణ్ కు మరికొందరు సాయం చేశారని ఆమె తల్లి ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Read more about హత్యకేసులో మరికొందరున్నారు : చాందిని తల్లి
బెంగుళూరు : నరంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలికపై సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Read more about బెంగుళూరులో దారుణం
హైదరాబాద్ : నగరంలో కలకలంరేపిన చాందిని హత్య కేసు మిస్టరీ వీడింది. చాందినిని హత్య చేసింది ఆమె చిన్ననాటి క్లాస్ మెంట్ సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తెలింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి హతమార్చినట్టు తెలిసింది.
Read more about పెళ్లి చేసుకోమన్నందుకే హత్య
హైదరాబాద్ : నగరంలో కలకలంరేపిన చాందిని హత్య కేసు మిస్టరీ వీడింది. చాందినిని హత్య చేసింది ఆమె చిన్ననాటి క్లాస్ మెంట్ సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తెలింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి హతమార్చినట్టు తెలిసింది. ఈ హత్య సాయికిరణ్ ఒక్కడే చేశాడా లేక అతని స్నేహితుల ఉన్నరా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Read more about చిత్తూరు జిల్లాలో స్మగర్ల కలకలం
Read more about రెండు ఆర్టీసీ బస్సుల ఢీ
హైరదాబాద్ : ఇంటర్ విద్యార్థి చాందనిని చిన్ననాటి స్కూల్ మెట్ సాయికిరణ్ రెడ్డి హత్య చేశాడని దర్యాప్తులో తెలింది. సాయికిరణ్ విషయంలో చాందిని సోదరి నివేదిత చాందినితో గొడవ పడినట్టు పోలీసుల విచారణలో తెలింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.
Read more about ప్రియుడే హంతకుడా...?
హైదరాబాద్ : రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ రెడ్డినగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ రా మెటీరియల్ గోదాంలో మంటలు ఎగసిపడుతున్నాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
Read more about మైలార్ దేవపల్లిలో అగ్నిప్రమాదం
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం
నెల్లూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయగిరి ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Read more about నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థి చాందిని హత్య కేసులో సాయికిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాయికిరణే చాందినిని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాయికిరణ్ చాందినికి 10 రోజుల క్రితం దాండియా కార్యక్రమంలో పరిచమైయ్యాడు.
Read more about వీడిన చాందిని హత్య మిస్టరీ
హైదరాబాద్ : రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ రెడ్డినగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ రా మెటీరియల్ గోదాంలో మంటలు ఎగసిపడుతున్నాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
నెల్లూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయగిరి ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థి చాందిని హత్య కేసులో సాయికిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాయికిరణే చాందినిని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాయికిరణ్ చాందినికి 10 రోజుల క్రితం దాండియా కార్యక్రమంలో పరిచమైయ్యాడు. హత్యకు కారణం ప్రేమ వ్యవహారమా లేక ఇతర కారణలున్నాయా అని పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
నేడు సిరిసిల్లలో కేటీఆర్, పోచారం పర్యటన |
సిరిసిల్ల : నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్, పోచారం పర్యటించనున్నారు. రైతు సమన్వయ సమావేశాలతో పాటు పలు కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు.
Read more about నేడు సిరిసిల్లలో కేటీఆర్, పోచారం పర్యటన
భారత్ లో జపాన్ ప్రధాని పర్యటన
ఢిల్లీ : నేడు భారత్ లో జపాన్ ప్రధాని షింజో అబె పర్యటించనున్నారు.
Read more about భారత్ లో జపాన్ ప్రధాని పర్యటన
ఢిల్లీ : సుప్రీం కోర్టు నేడు రోహింగ్యా ముస్లింలపై నిర్ణయంత తీసుకోనుంది.
Read more about రోహింగ్యా ముస్లింలపై నిర్ణయం తీసుకోనున్న సుప్రీం
హైదరాబాద్ : నేటి నుంచి కృష్ణా ట్రైబ్యునల్ సమావేశం ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించనున్నాయి.
Read more about నేడు కృష్ణా ట్రైబ్యునల్ సమావేశం
చిత్తూరు : నేడు వయోవృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకదర్శనం సౌకర్యం కల్పించనున్నారు. నేడు 4వేల మంది వయోవృద్ధులకు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నారు. రేపు ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం
Read more about నేడు తిరుమలలో వయోవృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకదర్శనం
గుంటూరు : నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో నార్మన్ పోస్టర్ ప్రతినిధులు సమావేశం కానున్నారు.
Read more about చంద్రబాబుతో నార్మన్ పోస్టర్ ప్రతినిధుల భేటీ
Read more about నేడు కుల్ భూషణ్ కేసు విచారించనున్న ఇంటర్నేషనల్ కోర్టు
నేడు టీఎస్ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: నేడు తెలంగాణ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నేటి నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీరణ, 22న డ్రా తీయనున్నారు.
Read more about నేడు టీఎస్ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల
ఉచిత విద్యుత్ పై సీఎం చంద్రబాబు సమీక్ష
గుంటూరు : నేడు ఉచిత విద్యుత్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు.
Read more about ఉచిత విద్యుత్ పై సీఎం చంద్రబాబు సమీక్ష
విజయవాడ : నేడు సిద్ధార్థ కాలేజీలో ర్యాలీ ఫర్ రివర్స్ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
Read more about నేడు ర్యాలీ ఫర్ రివర్స్ బహిరంగసభ
సిరిసిల్ల : జిల్లాలో టీమాస్ ఫోరం అవిర్భావ సభ జరగనుంది. సభకు తమ్మినేని, గద్దర్, ఆర్.కృష్నయ్య, విమలక్క హాజరుకానున్నారు.
Read more about సిరిసిల్లలో టీమాస్ అవిర్భావ సభ
తెలంగాణ రాష్ట్రంలో మద్యం నియంత్రించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, హైదరాబాద్ విశ్వనగరమని అందుకోసమే టైమ్ పెంచామని, దశల వారిగా మద్యం నియంత్రిస్తున్నామని, రాత్రి 11గంటలు అనేది హైదరాబాద్ లో 450 షాపులకు మాత్రమే అని టీఆర్ఎస్ నేత శివశంకర్ అన్నారు. ఇవాళ ప్రభుత్వంలో మద్యం షాపు ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోందని, మల్కాజ్ గిరిలో రెసిడెన్సి ఏరియాలో మద్యం షాపులు తీసేయాలని వారు ధర్నా చేస్తున్నారని, టెండర్ల సమయంలో 50వేల నుంచి లక్షలకు పెంచిందని కాంగ్రెస్ నేత ఇందిరాశోభన్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గానీ ఇతర టీఆర్ఎస్ నేతలు గానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పి ఇప్పుడు వారు తెలంగాణను మద్యం తెలంగాణగా మారుస్తున్నారని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
Read more about మద్యం కావాల నాయనా...?
Read more about హమాలీలకు భద్రతెక్కడా..?
బీహెచ్ఈఎల్లోని రావూస్ స్కూల్లో 7వ తరగతి విద్యార్థిని యూనిఫాం వేసుకురాలేదని బాలుర బాత్రూం దగ్గర నిల్చోబెట్టారు. దీంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని చదువుకే స్వస్తి పలకాలని భావించింది. మొన్నటికి మొన్న మెహదీపట్నంలో నెహ్రూ చిల్డ్రన్ స్కూల్లో సెకెండ్ క్లాస్ చదువుతున్న బాలుడు నత్తితో బాధపడుతున్నాడు. నత్తితో సరిగ్గా చదవడం లేదని ఏకంగా ప్రిన్సిపాలే తీవ్రంగా ఆ బాలుడిని దండించాడు. దీంతో ఆ బాలుడి వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయత్రి కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ముగ్గురు లెక్చరర్స్ సరిగ్గా చదవడంలేదంటూ క్లాస్రూమ్లో, స్టాఫ్ రూమ్లో చితకబాదారు. మనస్తాపం చెందిన ఆ విద్యార్థి ఐదు అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇలా కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులను మాసనిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. బంగారు భవిష్యత్ కోసం కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులను చేర్చడమే తల్లిదండ్రుల పాపమైపోయింది.ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు శిక్షలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది ఉంటారు. అంతేకాదు.. వారంతా బీఈడీ, డీఎడ్ చదవి ఉంటారు. |
అంటే విద్యార్థుల మానసిక స్థితి ఎలా ఉంటుందో వారికి తెలుసు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఏవిధంగా పాఠాలు బోధించాలో వారితో ఏవిధంగా మెలగాలనే విషయాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరల్ పనిష్మెంట్స్ కనిపించవు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రతీది బిజినెస్ కిందే చూస్తారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకుల కోసం పరుగులు పెట్టిస్తారని... క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను శిక్షిస్తుంటారని ఆరోపిస్తున్నారు. దీనికంతటికీ ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడమే కారణమని చెబుతున్నారు. కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలు విద్యావ్యాపారాన్ని విడనాడితేనే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంత వాతావరణంలోనే విద్యార్థులు చదువగలరు. అప్పుడే వారి భవిష్యత్కు బాటలు వేసుకోగలరు.
Read more about ప్రైవేట్ విద్యాసంస్థల్లో పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడులు
హైదరాబాద్ : ఎక్సైజ్ పాలసీ అంటే మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం కాదని..మద్యం వ్యాపారాన్ని అదుపు చేయడమే అని ఎక్సైజ్శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఆదాయం కోసమే మద్యం రేట్లు పెంచారన్న ఆరోపణలను కొట్టివేశారు. గతంలో కన్న కొత్తగా వైన్ షాపుల సంఖ్య పెంచలేదని సోమేష్ కుమార్ అన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.
Read more about మద్యం నియంత్రణ కోసమే నూతనపాలసీ : సోమేష్
కరీంనగర్ లో టీఆర్ఎస్ పై పెరుగుతున్న వ్యతిరేకత
కరీంనగర్ : తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉత్తర తెలంగాణ మొదటి నుంచి అండగా నిలిచింది. ఇందులోనూ కరీంనగర్జిల్లా అయితే టీఆర్ఎస్కు పెట్టని కోట. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరీంనగర్ కేంద్రంగా ఇటీవల జరిగిన పరిణామాలు ప్రభుత్వ పాలనకు మాయని మచ్చలా మిగిలాయి. నేరెళ్లలో దళితులపై పోలీసుల దాష్టీకం మొదలుకొని నిన్నటి మానకొండూరు ఘటన వరకు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకొచ్చాయి. నేరెళ్లలో ఇసుక లారీలను దగ్దం చేశారన్న కారణంతో దళితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని చిత్రహింసలకు గురిచేశారు. ఒక్కొక్కరు సరిగా నడవలేని స్థితికి తీసుకొచ్చారు. దీంతో పోలీసులు, ప్రభుత్వ తీరుపై నిరసనలు వెల్లువెత్తాయి. నెరెళ్లలో ఇసుక మాఫియా దళితులపై దాడి చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తే... వారి ముఖాన దళితులు అని రాసిఉందా ఉంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో రోజురోజుకు నేరెళ్ల దళితుల ఘటన ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చింది.
మూడెకరాల భూమి పంపిణీ పథకంలో తమకు అన్యాయం జరిగిందని ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు దళిత యువకుల ఘటన కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం వాసి మహంకాళి శ్రీనివాస్ , యాలాల పరశురాములు అనే యువకులు పంద్రాగస్టు రోజున ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయాలు కావడంతో వారిని కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి... ఆ తర్వాత హైదరాబాద్కు తరలించారు. దీంతో గ్రామస్తులు, యువకుల బంధువుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవి చూడాల్సి వచ్చింది.
ఈ వివాదాల నుంచి ఎలా గట్టెక్కాలని ప్రభుత్వం ఆలోచిస్తోంటే... వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ రూపంలో మరో సమస్య తెరపైకి వచ్చింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వమే ప్రశ్నార్దకంగా మారింది. వరుస ఘటనలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుండడంతో అధికార టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో సీఎం అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలోపడ్డారు. జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులతో సమావేశం జరిపారు. పార్టీ నేతలపై కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్కు పెట్టని కోటగా ఉన్న కరీంనగర్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. మరి దీన్ని తగ్గించుకునేందుకు గులాబీబాస్ ఏ వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి.
Read more about కరీంనగర్ లో టీఆర్ఎస్ పై పెరుగుతున్న వ్యతిరేకత
నిరాశలో వైసీపీ నేతలు, కార్యకర్తలు
విజయవాడ : నంద్యాల, కాకినాడ ఓటములు వైసీపీని నిరాశపర్చాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయంపై వైసీపీ చాలా ఆశలు పెట్టుకుంది. నంద్యాలలో గెలిచి అధికారపార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని భావించింది. అందుకే నంద్యాల ఉప ఎన్నికను ప్రభుత్వ వ్యతిరేకతకు రిఫరెండం అంటూ వైసీపీ ఎన్నికల్లో ప్రచారం చేసింది. కానీ ఫలితాలు మాత్రం టీడీపీకే అనుకూలంగా వచ్చాయి. వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. దీంతో నేతల్లో ఉత్సాహం తగ్గింది. కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్లారు. |
పార్టీ నేతలను ఆవహించిన నైరాశాన్ని పారదోలేందుకు, ఎన్నికల ఫలితాల నుంచి క్యాడర్ను బయటపడేసేందుకు వైసీపీ అధినేత జగన్... వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి రూపకల్న చేశారు. అంతేకాదు... ప్లీనరీలో ప్రకటించినట్టుగా నవరత్నాలపై కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశాలు, సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అయితే పార్టీ ఓటమితో నిరాశలో ఉన్న కొంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అధినేత ఆదేశించినా వాటిని పాటించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కొందరు నామమాత్రంగా పనిచేస్తోంటే.... మరికొందరు కనీసం వాటి గురించి ఆలోచించడం లేదు. అధినేత జగన్ కూడా లండన్ పర్యటనలో ఉండడంతో పార్టీలో ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఏపీలో అధికార టీడీపీ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీనేతలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం తీసుకున్న కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టలేక పోతోంది. మొత్తానికి రెండు ఓటములతో గాడి తప్పింది ప్రతిపక్ష వైసీపీ. గాడితప్పిన నేతలను అధినేత జగన్ ఎలా దారిలోకి తెచ్చుకుంటారో వేచి చూడాలి.
Read more about నిరాశలో వైసీపీ నేతలు, కార్యకర్తలు
ఏ పార్టీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్
నల్లగొండ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారం తెలంగాణ టీపీసీసీలో మరోసారి హాట్ టాపిక్గా మారింది. పీసీసీ చీఫ్ పేరు ఎత్తితే చాలు.. తోక తొక్కిన తాసుపాములా కస్సుమంటూ లేస్తారు. కోపంతో ఊగిపోతారు. శంషాబాద్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా తరగతుల తర్వాత మరింత రగలిపోతున్నారు. ఈ సమావేశాల్లో ఉత్తమ్కుమార్రెడ్డి తమను అవమానించారన్న భావంతో ఉన్న కోమటిరెడ్డి సోదరులు... టీపీసీసీ చీఫ్ను టార్గెట్ చేశారు. ఇరువర్గాల మధ్య ఎప్పటి నుంచే కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది.
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నంత కాలం గాంధీభవన్ గడప తొక్కనని శపథం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవకాశం దొరికనప్పుడట్టా పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని టార్గెట్ చేస్తున్నారు. చాన్స్ వచ్చినప్పుడల్లా తన ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం పైరవీలు చేసుకుంటున్న కోమటిరెడ్డి సోదరులు... శంషాబాద్ సమావేశం అనుభవంతో ఇక కాంగ్రెస్లో ఉండలేమన్న భావనుకు వచ్చారని సమాచారం. పార్టీ శిక్షణా తరగతుల్లో అవమానించారన్న కోపంతో రగలిపోతున్న కోమటిరెడ్డి సోదరులు.. ఆ రోజు వేదికపై ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డితోపాటు ఐఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియాకు ఇంగిత జ్ఞానంలేదంటూ వ్యాఖ్యానించడం రాజకీయం పెద్ద రచ్చతోపాటు చర్చకు దారితీసింది.
ఉత్తమ్కుమార్రెడ్డి తమకు కాంగ్రెస్లో పొగబెట్టారని బహిరంగంగా విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి సోదరులు.. టీపీసీసీ చీఫ్ పదవి తమకు ఇవ్వకపోతే పార్టీలో ఉండలేమని ప్రకటించారు. సెప్టెంబర్లో పీసీసీలో మార్పులు ఉంటాయని అనుకున్న నల్గొండ బద్రర్స్ ఆశలపై కుంతియా నీళ్లు చల్లారు. ఉత్తమ్కుమార్రెడ్డే కెప్టెనంటూ కుంతియా స్పష్టం చేయడంతో.... కాంగ్రెస్లో ఇమడలేకపోతున్నారు. శంషాబాద్ షాక్తో కోమటిరెడ్డి సోదరులకు పార్టీలో కొనసాగలేని పరిస్థితి వచ్చిందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ విషయాలపై స్పష్టంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్.. తమ రాజకీయ భవిష్యత్పై అయోమయంలో ఉన్నారని వినిపిస్తోంది.కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్రెడ్డి భవిష్యత్ పయనం టీఆర్ఎస్, బీజేపీ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వీరికి టీఆర్ఎస్ తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇక బ్రదర్స్ బీజేపీ గూటికి చేరతారని చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కూడా కోమటిరెడ్డి సోదరుల్లో స్పష్టతలేదని వినిపిస్తోంది. కమలం పార్టీపై ప్రజల్లో ఊపు కనిపించడంలేదని భావిస్తున్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో వీరు కలవరపడుతున్నారు. కమలదళంలో చేరితే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందేమోన్న భయం వెంటాడుతోంది. అన్ని విషయాల్లో స్వేచ్ఛగా వ్యవహరించే తాము బీజేపీలో ఇమడలేమన్న భావంతో కోమటిరెడ్డి సోదరులతోపాటు వీరి అనుచరులు ఉన్నారు. దీంతో బీజేపీలోకి వెళ్లే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
మొత్తానికి పార్టీలో పట్టు పెంచిన ఉత్తమ్కుమార్రెడ్డి ధాటిని తట్టుకోలేక... కోటమిరెడ్డి సోదరులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు వేరు పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి. మరోవైపు వీరిపై వేటు పడకుండా ఉత్తమ్కుమార్రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎటూతేల్చుకోలేని పరిస్థితితుల్లో చివరి అవకాశంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. వీరికి రాహుల్ అపాయింట్మెంట్ ఇస్తారా ? ఇవ్వకపోతే కోమటిరెడ్డి సోదరుల దారెటు ? అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. |
Read more about ఏ పార్టీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్
'డియాన్ హిల్లీకి విరాట్ కోహ్లీ మీద
వాలెంటైన్స్ డే సందర్భంగా భట్టి
కిడ్స్ స్పెషల్ లో 'మామ' నయా
సలాం ఇండియా...
నువ్వుల నూనె..ఆరోగ్య రహస్యాలు...
ఫేస్ టు ఫేస్ విత్ సతీష్ |
క్రీడలు - CVR News Network
ధర్మ సందేహాలు
కబడ్డీ ఆక్షన్ లో కాసుల వర్షం కురిసింది. కొత్తగా నాలుగు జట్లు వచ్చి చేరడంతో జట్ల సంఖ్య 12కి చేరింది. ప్రో కబడ్డీ సీజన్ 5 కోసం జరిగిన వేలంలో నితిన్ తోమర్ 93 లక్షల రికార్డ్ ధర పలికాడు. కొత్త జట్టు ఉత్తర్ ప్రదేశ్ నితిన్ తోమర్ ను కొనుగోలు చేసింది. రోహిత్ కుమార్ ను బెంగళూరు బుల్స్ 81 లక్షలకు కొనుగోలు చేయగా, మంజీత్ చిల్లర్ను 75 లక్షల ధరకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేసింది.
సాధారణంగా ప్రారంభం అయిన ప్రో కబడ్డీ లీగ్ అంచలంచెలుగా ఆదరణ పెంచుకుంటూ, ఐపీఎల్ తర్వాత భారత్ లో అత్యంత ఆదరణ కలిగిన లీగ్ గా అవతరించింది. వివో స్మార్ట్ ఫోన్స్ వచ్చే ఐదు ఏళ్లకు టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్ గా ఉండటానికి 300 కోట్లు చెల్లించటానికి ముందుకు వచ్చిందంటే ఈ లీగ్ ఏ స్థాయికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామీణ క్రీడకు ఈ స్థాయి ఆదరణతో ఈ లీగ్ ఆటగాళ్ల భవిష్యత్ కూడా మారిపోయింది.
నితిన్ తోమర్ 93 లక్షలు పలకటంతో నితిన్ గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అతను స్పందిస్తూ వేలం పాటలో నాకు రూ.93 లక్షల ధర పలకడం నమ్మలేకపోతున్నా. ఇంట్లో, ఊళ్ళో ఒకటే సంబరాలు చేసుకుంటున్నారు. రూ.50 లక్షలు వస్తే అంతే చాలనుకున్నా. కానీ దాదాపుగా రెట్టింపు డబ్బు లభించింది. ఈ డబ్బుతో సోదరి పెళ్ళి చేస్తా. మాకున్న భూమిలో వ్యవసాయం కోసం ఖర్చు చేస్తా అని నితిన్ తోమర్ అన్నాడు.
తెలుగు టైటాన్స్ తమ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి ని తమతోనే అట్టిపెట్టుకుంది. అలాగే యు ముంబా జట్టు అనూప్ కుమార్, పూణే దీపక్ హూడా, బెంగళూరు ఆశిష్ కుమార్, పాట్నా ప్రదీప్ నర్వాల్, బెంగాల్ జంగ్ కున్ లీ, ఢిల్లీ మీరజ్ షేక్ ను అంటిపెట్టుకున్నాయి. జైపూర్ జట్టు ఒక్క ఆటగాణ్ణి కూడా తమతో రెటైన్ చేసుకోలేదు. అలాగే కొత్త జట్లు ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, తమిళ్ నాడు జట్లకు నిర్వాహకులు వేలంతో సంబంధం లేకుండా ఒక ఆటగాణ్ణి తీసుకునేలా అవకాశం ఇచ్చారు. గుజరాత్ ఫజల్ అత్రచలి, తమిళ్ నాడు అజయ్ ఠాకూర్, హర్యానా సురేందర్ నాడా ను తీసుకున్నాయి. ఇక తెలుగు టైటాన్స్ జట్టు రాకేష్ కుమార్, రోహిత్ రానా, వికాశ్ కుమార్, విశాల్ భరద్వాజ్, వినోద్ కుమార్, నీలేష్ సాలుంకే లను వేలంలో దక్కించుకుంది.
ఐపీఎల్-10 ఫైనల్ లో ముంబై, క్వాలిఫైయర్-2లో కోల్ కతా పై గెలుపు
ఐపీఎల్-10 టోర్నీ మొత్తం అద్భుత ఆటతీరు కనబరిచిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్-2లో కూడా కోల్ కతా పై ఘన విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాట్టింగ్ అప్పగించింది ముంబై జట్టు. బుమ్రా, కరణ్ శర్మ విజృంభించటంతో 7 ఓవర్లకి 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కోల్ కతా నైట్ రైడర్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది.
ఐపీఎల్లో సూపర్ డూపర్ నాకౌట్ పాయింట్స్ టేబుల్లో మూడు, నాలుగో స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ బిగ్ ఫైట్ లో పంచ్ ఎవ్వరికి పడుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా సన్ రైజర్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంటే టైటిలే టార్గెట్ గా కేకేఆర్ కదంతొక్కుతోంది.
ఐపీఎల్-10 తొలి క్వాలిఫయిర్ ముగిసింది. ఇక ఎలిమినేటర్కు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్లో ఓడిన జట్టుకున్నట్లు ఇక్కడ మరో అవకాశం ఉండదు. ఓడిన జట్టు ఇంటికే. మరి నాకౌట్ పంచ్ తినే జట్టేదో రెండో క్వాలిఫయర్లో ఆడే అవకాశం దక్కించుకునే జట్టేదో ఇవాళ తేలిపోనుంది. బెంగళూరులో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య అమీతుమీకి అంతా రెడీ అయింది
ఐపీఎల్-10 ఆరంభంలో బాగా ఆడి ఆపై తడబడి చివరికి కష్టం మీద ప్లేఆఫ్ బెర్తు సంపాదించిన రెండు జట్లు నాకౌట్ సమరానికి సిద్ధమయ్యాయి. లీగ్ దశలో 3, 4 స్థానాల్లో నిలిచిన సన్రైజర్స్, నైట్రైడర్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనున్నాయి. లీగ్ దశలో రెండు జట్లు సమాన విజయాలు సాధించాయి. ముఖాముఖిలో తలో మ్యాచ్ గెలిచాయి. బలాబలాలు కూడా దాదాపు సమానం. అందుకే ఎలిమినేటర్లో ఫలానా జట్టే ఫేవరెట్ అని చెప్పలేం. హైదరాబాద్ బౌలింగ్లో బలంగా కనిపిస్తుంటే కోల్కతా బ్యాటింగే బలంగా బరిలోకి దిగుతోంది. |
భువనేశ్వర్, రషీద్ ఖాన్, మహ్మద్ నబి, సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్.. ఇలా సన్రైజర్స్ బౌలర్లలో ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో సత్తా చాటుకున్నవారే. ఎలిమినేటర్లో భువనేశ్వర్, రషీద్ ఖాన్ల పాత్ర కీలకం. గతంలో బ్యాటింగ్ స్వర్గధామంగా ఉన్న చిన్నస్వామి స్టేడియం ఈ సీజన్లో బౌలర్లకు అనుకూలంగా మారడం తమకు కలిసొస్తుందని సన్రైజర్స్ భావిస్తోంది. ఐతే ఆ జట్టును ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. సీనియర్ ఫాస్ట్బౌలర్ నెహ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతను ఇక ఈ సీజన్లో ఆడడు. వేలి గాయంతో గత మ్యాచ్కు దూరంగా ఉన్న యువరాజ్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. బ్యాటింగ్లో వార్నర్ మీదే ఎక్కువ ఆధారపడుతుండటం హైదరాబాద్ బలహీనత. ధావన్, హెన్రిక్స్, యువరాజ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం కీలకం. విలియమ్సన్ ఆడితే బ్యాటింగ్ బలపడొచ్చు.
మరోవైపు కోల్కతా బౌలింగ్లో నిలకడ లేకపోయినా ఆ జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. ఓపెనర్లు లిన్, నరైన్లను కట్టడి చేయడం మీదే సన్రైజర్స్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. వీళ్లిద్దరికీ పగ్గాలు వేయకపోతే మ్యాచ్పై ఆశలు వదులుకోవాల్సిందే. వీళ్ల తర్వాత కూడా గంభీర్, ఉతప్ప, మనీష్ పాండే, గ్రాండ్హోమ్లతో నైట్రైడర్స్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్లో బౌల్ట్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్ల మీద ఆశలు పెట్టుకుంది నైట్రైడర్స్.
ఐపీఎల్-10 లీగ్ దశ ముఖాముఖిలో సన్రైజర్స్, నైట్రైడర్స్ తలో మ్యాచ్ గెలిచాయి. రెండు జట్లూ ఎవరి మైదానంలో వాళ్లు మ్యాచ్ నెగ్గారు. తమ సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 48 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ మ్యాచ్లో హైదరాబాద్ 3 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు చేయగా.. కోల్కతా 161/7కే పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచులో డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగాడు.
ఐపీఎల్-10 ఫైనల్ లో పుణె జట్టు, క్వాలిఫైయర్-1లో ముంబైపై గెలుపు
అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి క్వాలిఫైయర్-1 లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది రైసింగ్ పుణె సూపర్ జైంట్ జట్టు. మంగళవారం ముంబైలో జరిగిన క్వాలిఫైయర్-1లో ముంబై పై 20 పరుగుల తేడాతో పుణె విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పుణె ఆరంభంలోనే రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ స్టీవ్ స్మిత్ లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. అప్పటికి జట్టు స్కోర్ 1.5 ఓవర్లకి 9 పరుగులు మాత్రమే.
అసలే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన గడువు ముగియ్యడంతో పుణె స్టార్ అల్ రౌండర్ బెన్ స్టొక్స్ స్వదేశానికి పయనమవడంతో ఇక పుణె కోలుకోవటం కష్టం అనుకున్నారు అభిమానులు. ఈ దశలో మనోజ్ తివారీతో కలిసి ఓపెనర్ రహానే విలువైన భాగస్వామ్యం నమోదు చేసాడు. 80 పరుగుల భాగస్వామ్యం తరువాత జట్టు స్కోర్ 89 పరుగుల వద్ద రహానే 43 బంతుల్లో 56 పరుగులు(5 ఫోర్లు, ఒక సిక్స్) చేసి మూడో వికెట్టుగా వెనుతిరిగాడు. అపుడు క్రీజ్ లోకి వచ్చిన ధోని, మనోజ్ తివారీతో కలిసి నెమ్మదిగా స్కోర్ బోర్డును కదిలించాడు. 18 ఓవర్లకి స్కోర్ 121 మాత్రమే. ఈ దశలో ధోని, మనోజ్ తివారీ విజృంభించడంతో చివరి రెండు ఓవర్లలో 41 పరుగులు సాధించారు. ముఖ్యంగా ధోని అప్పటి వరుకు 17 బంతుల్లో 14 పరుగులతో ఉన్నాడు. చివరికి 26 బంతుల్లో 40 పరుగులతో(5 సిక్సర్లు) ఇన్నింగ్స్ ముగించాడు. మనోజ్ తివారీ 48 బంతుల్లో 58 పరుగులు చేసి చివరి బంతికి రన్ అవుట్ అయ్యాడు.
నేడే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ప్రారంభం
మాక్స్ వెల్ పై నిప్పులు చెరిగిన వీరేంద్ర సెహ్వాగ్
మోహన్ బాబుపై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
సినీనటుడు మోహన్ బాబు రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జి...
ప్రగతిభవన్లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం
సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు,...
గుంటూరు జిల్లాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తత
గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లతో రాజకీయంగా ఉద్రిక్త వాతవరణం నెలకొంది. పెన్షన్ పంపిణిలో అక్రమాలు జ...
కడప జిల్లాలో పిచ్చికుక్కుల స్వైర విహారం.. 12మందిపై దాడి
కడప జిల్లా రాజంపేట పట్టణంలో పిచ్చి కుక్కులు స్వైర విహారం చేశాయి. ఏకంగా 12మందిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయప...
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం... 16 మందికి గాయాలు
కడప జిల్లా కాశీనాయన మండలం చెన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది కూలీలు గాయపడ్డారు. రోజూవా...
మెదక్, సిద్దిపేట జిల్లాలలో సీఎం కే సీ ఆర్ పర్యటన
మెదక్, సిద్దిపేట జిల్లాలోని తూప్రాన్ , గజ్వెల్ లో సీఎం పర్యటిస్తారు, ముందుగా తూప్రాన్ లో ప్రభుత్వ దవాఖానను ప్ర...
ఫ్యాన్ కు ఉరి వేసుకొని తల్లీ, కుమార్తె ఆత్మహత్య
వాషింగ్టన్ : వినోదం కోసం ఉపయోగించే మారిజువానా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వాలని కాలిఫోర్నియా నిర్ణయించింది. ఈ ఉన్మ...
న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం... 12మంది మృతి |
అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. సిటీలో బ్రోనక్స్ బారో ప్రాంతంలో ఐ...
దాదాపు ఐదు దశాబ్దాల పాటు అమెరికాలో సేవలందించిన ప్రఖ్యాత బోయింగ్ 747 విమానం ఇక చరిత్రలో కలిసిపోనుంది. ఇది అమెర...
మద్యం మత్తులో 10వ అంతస్తు గది కిటికీ నుంచి కిందపడ్డ యువతి
చైనాలో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు 10వ అంతస్తు గది కిటికీ నుంచి ఓ యువతి జారీ కింద పడి...
తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు
తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం...
అహ్మదాబాద్ లో తొగాడియా అరెస్ట్ అంటూ హైడ్రామా
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా అదృశ్యమై ఆ తర్వాత అహ్మదాబాద్లో ఓ ఆస్పత్రిల...
పాస్ పోర్టు విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
పాస్ పోర్టు విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చివరి పేజీలో ఉండే చిరునామా వివరాలను...
గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం, కడప జిల్లాలో విషాదం
కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కడప-కర్నూలు జాతీయ రహదారి మలుపు వద్ద ప్రమాదం జ...
'పద్మావత్'పై తాజా పిటిషన్ కొట్టివేత
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. వర్మ తీసిన జీఎస్టీ ఫిలిం భారతీయ సంస్కృతిక...
వివాదంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల 'అజ్ఞాతవాసి
పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' వివాదంలో చిక్కుకోనుంది. తాను తీసిన లార్గో వించ్ చిత్రాన్ని కాపీ చేశారని...
నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు
గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...
భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్
ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...
తనకోసం ఎదురుచూస్తున్న అభిమానిపై ఆప్యాయత చాటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన అభిమానిని భద్రతా సిబ్బంద...
నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...
సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...
తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు
తెలుగు రాష్ట్రాల్లో వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. నోట్లరద్దు సమయంలో అనేక రియల్ ఎస్టేట్ సంస్...
కనీస ధర లేక పత్తిరైతు విలవిల...
తాజా వార్తలు
తమిళనాడులో పాస్ పోర్టు కేంద్రాన్ని ప్రారంభించిన సుష్మా స్వరాజ్
తెలంగాణలోని ఐదు నగరాల్లో ఉచిత వైఫై సేవలు
వరంగల్ జిల్లాలో దారుణం... ప్రేమికుల ఆత్మహత్య |
ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని తెలిసినా.. సగానికి పైగా పిల్లలకు ఈ అదృష్టం దక్కటం లేదు. ఆరు నెలల తర్వాత అదనపు ఆహారాన్ని ఆరంభించాలని తెలిసినా.. దాదాపు సగం మంది ఈ కమ్మదనాన్ని పొందటం లేదు. దీంతో ఎంతోమంది పోషణలోపం బారినపడుతున్నారు. ఎక్కడుందీ లోపం? అందరమూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.
మొక్క ఏపుగా ఎదగాలంటే ఆయా దశలకు అనుగుణంగా అవసరమైన పోషకాలన్నీ అందాలి. పిల్లలూ అంతే. ఏ వయసులో అవసరమైన పోషకాలు ఆ వయసులోనే అందాలి. అప్పుడే చక్కటి ఆరోగ్యంతో ఎదుగుతారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. పిల్లల పోషణ విషయంలో పుట్టినప్పటి నుంచి తొలి రెండేళ్లు చాలా కీలకమైన దశ! వారి శారీరక ఎదుగుదలకు, మానసిక వికాసానికి బీజం పడేది ఈ వయసులోనే. ప్రవర్తన రూపుదిద్దుకోవటం, విషయాలను గ్రహించే నేర్పులూ పురుడుపోసుకునేదీ ఈ వయసులోనే. అందువల్ల తొలి రెండేళ్లలో పిల్లలకు తగినంత పోషణ లభించటం చాలా అవసరం. లేకపోతే వారి ఎదుగుదల కుంటుపడుతుంది. రకరకాల జబ్బులు చుట్టుముడతాయి. కొన్నిసార్లు బతికి బట్ట కట్టటమే కష్టమైపోతుంది. మనదేశంలో ఎంతోమంది బిడ్డలు కేవలం పోషకాహార లోపంతోనే చనిపోతుండటం ఆందోళకరం. కాబట్టి పిల్లల పోషణపై పుట్టినప్పటి నుంచే దృష్టి పెట్టటం.. జాగ్రత్తగా మసలుకోవటం.. చాలా అవసరం. ముఖ్యంగా తల్లులకు వీటిపై సరైన అవగాహన ఉండటం ముఖ్యం.
పిల్లలకు సీసాతో పాలు పట్టటం తగదు. మనదేశంలో ఏటా 5-6 లక్షల మంది పిల్లలు కేవలం ఈ సీసాల మూలంగానే మరణిస్తున్నారు. వీటితో పాలు పట్టటం వల్ల తీవ్రమైన విరేచనాలు, చెవిలో చీము, గొంతు నొప్పి, వూపిరితిత్తుల్లో నిమ్ము, పిప్పిపళ్లు.. వంటి రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. నోట్లో తేనె పీకలు, పాసిఫయర్లు కూడా పెట్టొద్దు. పాలను మాత్రమే కాదు.. నీళ్లు తాగించటానికి కూడా సీసాను వాడొద్దు. తల్లీబిడ్డల అనురాగం, ఆప్యాయతలకు సీసా గొడ్డలిపెట్టు. వీటితో పెరిగే పిల్లలకు అనురాగం, ఆప్యాయత, మానవ స్పర్శ.. వాటి విలువలు తెలియవు. ఇలా యాంత్రికంగా సీసా పాలు తాగి పెరిగే పిల్లలు నలుగురితో కలిసిమెలసి ఉండలేకపోతున్నారని, కలివిడిగా పనిచేయలేకపోతున్నారని అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి.
బిడ్డకు తిండి పెట్టటమే కాదు.. ప్రేమతో, బాధ్యతతో, సంతోషంతో తినిపించటమూ ముఖ్యమే. మనదగ్గర చాలామంది బిడ్డను కాళ్ల మీద వేసుకొని నోట్లో తిండి కుక్కుతుంటారు. పిల్లలేమో అటూఇటూ కదులుతూ, మూతి తిప్పేసుకుంటూ పోరాటం చేస్తుంటారు. కొందరు తల్లులు కొడుతుంటారు కూడా. దీనివల్ల క్రమంగా పిల్లలకు తిండిపై తిరస్కార భావన కలుగుతుంది. ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ తెచ్చుకోకూడదు. పిల్లలు సంతోషంగా తినేలా చూడాలి. అలాగని అన్నం పిల్లల ముందు పెట్టేసి వాళ్లే తింటారులే అని విడిచిపెట్టటమూ మంచిది కాదు. తినిపించేవారి ఎత్తులో పిల్లలను కూచోబెట్టి.. వారి కళ్లలోకి చూస్తూ.. నవ్వుకుంటూ.. అనునయంగా మాట్లాడుతూ తినిపించాలి. అదీ ఒకేసారి ఎక్కువగా కాకుండా.. కొంచెం కొంచెంగా పెట్టాలి. పెదవి దగ్గరకు తెస్తే బిడ్డ తనంత తానుగా లోపలికి తీసుకునే అవకాశం ఇవ్వాలి. దీంతో తన ఆహారం తనే తిన్నాననే తృప్తి పిల్లలకు కలుగుతుంది.
పిల్లలకు తినిపించే ఆహారం తాజాగా, వేడిగా ఉండాలి. వండాక రెండు గంటల్లోపే తినిపించాలి. వండే ముందు, తినిపించే ముందు.. దొడ్డికి కడిగిన తర్వాత.. తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
తరువాత పేజీలో..
++ మెహన్లాల్ ఓడియన్ చిత్రం ఫస్ట్ లుక్ ++ ఓపెనింగ్ డే 100 కోట్ల గ్రాస్? ++ జక్కన్నకు మహేష్ ఫీలర్స్ ++ RRR ఇక రణరంగమే ++ ఎన్టీఆర్ వర్సెస్ యాత్ర `మహానాయకుడు`పై వైయస్ వార్
హీరోయిన్కి స్టార్ ప్రొడ్యూసర్ కాస్ట్లీ గిఫ్ట్!
ఓపెనింగ్ డే 100 కోట్ల గ్రాస్?
600కోట్ల 2.Oకి డేంజర్ బెల్స్
న్యూ లుక్: రాక్షసితో మెగా ప్రిన్స్
ఫస్ట్ లుక్: వినయ విధేయ రామా |
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
పవన్ విషయంలో దిగొచ్చిన అల్లు అర్జున్!
ఏడాది క్రితం పవన్ పేరు ఎత్తడానికే నో అన్న అల్లు అర్జున్లో ఇప్పుడు చాలా మార్పు కనిపించింది. 'దువ్వాడ జగన్నాథమ్' ఆడియో వేడుకలో అల్లు అర్జున్ స్పీచ్లో రెండు, మూడు సార్లు పవన్ ప్రస్తావన అల్లు అర్జున్ స్పీచ్లో వచ్చింది. పవన్ అభిమానుల్ని గెలుచుకునే ప్రయత్నం చేయలేదు కానీ, పవన్కి తానేమీ వ్యతిరేకం కాదనే సంకేతం పంపించడానికి మాత్రం అల్లు అర్జున్ ప్రయత్నించినట్టే అనిపించింది.
హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్కళ్యాణ్ గురించి, విజయం పట్ల అతని థియరీ గురించి చెబుతూ వుంటే అల్లు అర్జున్ గట్టిగా క్లాప్స్ కొడుతూ, పవన్ గురించి మాట్లాడుతున్నంత సేపు హరీష్ పట్ల అటెన్షన్ పే చేస్తూ ముఖం తిప్పుకోకుండా, ఎలాంటి ఇబ్బంది చూపించకుండా వున్నాడు. పవన్ గురించి హరీష్ ఏమి చెబుతున్నా బన్నీ నవ్వుతూనే కనిపించాడు. అలాగే తన స్పీచ్లో ప్రత్యేకంగా పవన్ గురించి మాట్లాడకపోయినప్పటికీ పలుమార్లు అతని ప్రస్తావన తీసుకొచ్చాడు.
మెగా ఫాన్స్ అంటే ఈ ఫ్యామిలీలో వున్న హీరోలందరి ఫాన్స్ అనుకుంటామని, ఒక్కొక్కరికీ వేరు వేరు ఫాన్స్ వున్నారని అనుకోమని, ఇన్డైరెక్టుగా తన ఫాన్స్, పవన్ ఫాన్స్ వేరు కాదని అల్లు అర్జున్ చెప్పాడు. ఏది ఏమైనా ఈ ఆడియో వేడుక తర్వాత పవన్ వర్సెస్ అర్జున్ ఫాన్స్ మధ్య జరుగుతున్న వార్ చల్లబడే అవకాశాలైతే లేకపోలేదు.
తొడ కొట్టిన వరుణ్ తేజ్ Nov 21,2018126 Shares కీర్తి సురేష్తో అంత వీజీ కాదు! Nov 21,2018126 Shares పవన్కళ్యాణ్ ఖండించినా మసాలా దట్టించేస్తున్నారు Nov 21,2018126 Shares విజయ్ దేవరకొండ అక్కడా రచ్చ చేస్తున్నాడు Nov 21,2018126 Shares
ఎన్టీఆర్ ఏం చేస్తాడిపుడు?
పవన్కళ్యాణ్ని నమ్ముకుంటే పనయ్యేదేమో
పవన్ తెలంగాణలో పోటీ చేయడం లేదు- ఎందుకు?
తొడ కొట్టిన వరుణ్ తేజ్
కీర్తి సురేష్తో అంత వీజీ కాదు!
విజయ్ దేవరకొండ అక్కడా రచ్చ చేస్తున్నాడు
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » రాజకీయ వార్తలు
కేంద్రం తీసుకువచ్చిన పెద్ద పాత నోట్ల రద్దును పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తుండటం కేంద్ర ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడేక్కుతుంది. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు విపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీలో నిరసనలు చేపట్టి రాష్ట్రపతికి విజ్ఞాపనలు సమర్పించారు. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణించిన ఇండిగో విమానం ఇంధన కొరత కారణంగా అత్యవసర ల్యాండింగ్కు సైతం అనుమతి ఆలస్యంగా దొరికింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో దీదీ హత్యకు కుట్రజరుగుతుందని పార్లమెంట్లో టీఎంసీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళనలు లేవనెత్తారు. కాగా కేంద్రం తాజాగా తీసుకున్న మరో చర్య సైతం ఈ ఘర్షణ వాతావరణాన్ని మరింతగా ఎగదోసింది.
పశ్చిమ బెంగాల్లోని 18 జిల్లాల్లో గల టోల్ప్లాజాల వద్ద ఆర్మీ భద్రతా సిబ్బందిని మోహరించింది. సెక్రటేరియట్కు 500 మీటర్ల దూరంలోనే టోల్ప్లాజాను ఏర్పాటు చేసి ఆర్మీ జవాన్లు తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ను నియంత్రించడానికి, టోల్ప్లాజాల వద్ద భద్రతను పర్యవేక్షించడానికి సాధారణ తనిఖీల్లో భాగంగా సిబ్బందిని మోహరించినట్లుగా ఆర్మీ పేర్కొంటుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈశాన్య రాష్ర్టాల్లోని అసోంలో 18 ప్రాంతాలు, అరుణాచల్లో 13, నాగాలాండ్లో 5, మేఘాలయలో 5, త్రిపుర, మిజోరాంలలో ఒక ప్రాంతంలో తనిఖీలు చేపట్టినట్లు ఈస్ట్రన్ కమాండ్ ట్విటర్ ద్వారా పేర్కొంది. కాగారాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఆర్మీని మోహరించడం ఏంటనీ మమతా అడుగుతున్నారు. ఇది సైనిక కుట్రనా అని ఆమె ఆరోపించారు. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ మమతా గడిచిన రాత్రి నుంచి ఇప్పటి వరకు సచివాలయంలోని ఆమె కార్యాలయంలోనే ఉన్నారు. అన్ని టోల్ప్లాజాల వద్ద ఆర్మీ ఖాళీ చేసి వెళ్లిపోయేంత వరకు కార్యాలయాన్ని విడిచి వెళ్లేది లేదని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యను టీఎంసీ నేడు పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తింది. నోట్ల రద్దుపై టీఎంసీ తలపడుతున్నందునే రాజకీయ ప్రతికారంలో భాగంగానే కేంద్రం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని టీఎంసీ పేర్కొంది.
రవితేజకి ఘోర పరాభవం Nov 19,2018126 Shares జగన్కు షాకిచ్చిన కొడాలి నాని! Nov 19,2018126 Shares ఈ అభ్యర్ధులు దగ్గర కిలోల కొద్దీ బంగారం Nov 19,2018126 Shares చిన్మయిపై బ్యాన్.. మరి ఆమె మాటేమంటే? Nov 19,2018126 Shares
జగన్కు షాకిచ్చిన కొడాలి నాని!
శ్రీను వైట్లకు ఏ ఇబ్బంది లేదా అయితే..
ఎన్టీఆర్ ముద్దుల మనవరాలు..
కోలీవుడ్లో వెన్నెల కిషోర్ భారీ సినిమా
అక్షర ఫొటోలు నా ఫోన్లో ఉన్నాయి కానీ.. |
టిడిపికి ఊహించని షాక్..పసుపు అక్షరాలతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫస్ట్ లుక్..! _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _
మా దారులు వేరు.. కానీ లక్ష్యం ఒక్కటే : రజినీకాంత్
<font color='red'>ట్రెండింగ్ న్యూస్ : </font> సూపర్ స్టార్ రజిని సంచలన నిర్ణయం!
ఒక సెకనుకు 3జిబి వేగం: ఎయిర్ టెల్ అద్భుత ఆవిష్కృతం
అసెంబ్లీ లో దెయ్యాల సంచారం!
సినిమా వార్తలు
ఫోటో గ్యాలరీ
జాతీయ వార్తలు
నేటి ఏపి స్పెషల్
లైఫ్ స్టైల్
అంతర్జాతీయ వార్తలు
ఆంధ్రప్రదేశ్ / వార్తలు / సినిమా వార్తలు
టిడిపికి ఊహించని షాక్..పసుపు అక్షరాలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్..!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నంత పని చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎలా వచ్చిందనే పాయింట్ పై భావోద్వేగమైన చిత్రాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ ఆ ప్రయత్నంలో తొలి అడుగు వేశారు. కొద్ది సేపటి క్రితమే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. టైటిల్ లోని ఎన్టీఆర్ అనే అక్షరాలు టీడీపీ రంగు పసుపు వర్ణంలో ఉండడం ఆసక్తిగా మారింది. యాదృచ్చికంగా టైటిల్ ని అలా డిజైన్ చేశారా లేక ఉద్దేశపూర్వకంగానే ఆర్జీవీ పసుపు రంగుని వాడారా అనేది తెలియాల్సి ఉంది.
కాగా ఒకసారి ఫస్ట్ లుక్ ని పరిశీలిస్తే లక్ష్మీ పార్వతి పాత్రకు సంబందించిన వ్యక్తి గుమ్మం లోపలికి అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంటిలోపల కుర్చీలో ఎన్టీఆర్ పాత్ర దారుడు కూర్చుని ఉన్నారు. కాగా ఈ లుక్ లో రెండు క్యారెక్టర్ల ముఖాలని ఆర్జీవీ దాచేశాడు. బహుశా తదుపరి విడుదలచేయబోయే లుక్ లో క్యారెక్టర్ లని పరిచయం చేస్తాడేమో.
ఇక ఈ చిత్రంపై అటు తెలుగు దేశం పార్టీ నుంచి ఇటు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి నుంచి పలు అభ్యంతరాలు ఉన్నాయి. ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిని వివాహం చేసుకున్న తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ వివాదాలలో టిడిపి అధినేత చంద్రబాబు, మరియు ఇతర ప్రముఖ రాజకీయ నాయకుల పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో తమ అనుమతి లేకుండా చిత్రాన్ని తీస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే టిడిపి ఆర్జీవీ ని హెచ్చరించింది. మరో వైపు లక్ష్మి పార్వతి కూడా ఆర్జీవీ ని డిమాండ్ చేసింది. జరిగినది జరిగినట్టుగా, తన మనో వేదనని, ఎన్టీఆర్ మనోవేదనని చిత్రీకరిస్తే తప్పకుండా మద్దత్తు తెలిపుతానని అన్నారు. వక్రీకరించి తీస్తే ఊరుకునేది లేదని ఆమె కూడా ఆర్జీవీ కి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి సెన్సిటివ్ పాయింట్ పై చిత్రాన్ని తీసే సాహసం ఆర్జీవీ ప్రారంభించేశారు. ఈ చిత్ర విషయంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయి వేచి చూడాలి.
సంబంధిత సమాచారం
ట్రెండింగ్ న్యూస్ : సూపర్ స్టార్ రజిని సంచలన నిర్ణయం!
వైరల్ వీడియో : బౌలర్ తలను తాకి సిక్సర్ కు వెళ్లిన బంతి !
నేను అలా అనలేదు అంటున్న చంద్ర బాబు!
వైరల్ వీడియో :దిక్కులు చూస్తున్నావ్ ఏంటీ.. ధోని కోపం చూశారా?
ఎట్టకేలకు హస్తం గూటికి ఆ నేత?
రహస్యం దాచిన వరుడు, ట్విస్ట్ ఇచ్చిన వధువు!
అవినీతిలో మన ర్యాంక్ ఎంతో తెలుసా?
పవన్ తో కలిసి ఆ నేత ఏమి చర్చించారు?
భారత స్పిన్నర్ పై అందుకే ఎటాక్ చేశా!
వైరల్ :బాబోయ్ గుడ్లు పెడుతున్న 14 ఏళ్ళ బాలుడు
సంచలన వార్త : కన్నతండ్రి పై పోలీసులకు బాలుడి ఫిర్యాదు!
కలెక్షన్లు దారుణం : టాలీవుడ్ కు కలిసిరాని ఈ శుక్రవారం!
సినీ ప్రియులకు చేదు వార్త: మార్చి 2 నుండి థియేటర్లు మూసివేత
తాజా వార్తలు
హీరోయిన్ ప్రేమలో .. అవసరాల ?
‘కల నిజమాయెగా కోరిక తీరెగా’ అంటున్న ప్రముఖ సంగీత దర్శకుడు!
Copyright © 2016 Netiap.com _ All rights reserved. మమ్మల్ని సంప్రదించండి : netiapnews @ gmail.com |
కాస్టింగ్ కౌచ్ గురించి ఆ హీరోయిన్ ఓపెన్ గా మాట్లాడింది ? _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చార్జీల మోతకు చెక్!
సీఎం సీటు ఇచ్చి.. మంత్రి పదవులను లాగేసుకున్న కాంగ్రెస్ ?
విదేశీ పానియాలు ఏం దాహం తీర్చుతాయి! ఇది కదా దాహం తీర్చేది: పవన్
సినిమా వార్తలు
ఫోటో గ్యాలరీ
జాతీయ వార్తలు
నేటి ఏపి స్పెషల్
లైఫ్ స్టైల్
అంతర్జాతీయ వార్తలు
వార్తలు / సినిమా వార్తలు
కాస్టింగ్ కౌచ్ గురించి ఆ హీరోయిన్ ఓపెన్ గా మాట్లాడింది ?
ప్రస్తుతం టాలీవుడ్ పెద్ద దుమారం రేపుతున్న విషయం కాస్టింగ్ కౌచ్? శ్రీ రెడ్డి పోరాటంతో టాలీవుడ్ లో పలు సంచలనాలకు దారి తీస్తున్న ఈ విషయాలపై దేశ వ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. కాస్టింగ్ కౌచ్ విషయంలో బాలీవుడ్ ఏమి తక్కువ కాదని తెలిపారు ఇద్దరు హీరోయిన్స్. అందులో ఒకరి సంచలన తారగా ఇమేజ్ తెచ్చుకున్న రాధికా ఆప్టే. మరొకరు .. మరాఠి నటి .. అవార్డు గ్రహీత అయినా ఉషా జాదవ్. తాజాగా కాస్టింగ్ కౌచ్ పై బిబిసి ఓ డాక్యూమెంటరీ తెరకెక్కించింది. ఈ డాక్యూమెంటరీ లో పలువిషయాలు చర్చించారని మెచ్చుకున్నారు. ఈ విషయం పై ఉష జాదవ్ మాట్లాడుతూ .. తాను కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. దర్శకుడు, నిర్మాతలు కలిసి పడుకోవాలని డైరెక్ట్ గానే అడిగేవారట. తన ఒళ్ళంతా చేతులు వేసి తడిమే వారని, ఇష్టమొచ్చిన చోటల్లా ముద్దులు పెట్టె వారని, దుస్తుల్లోపల చేతులు పెట్టేవారని అయినా భరించాలి అన్నట్టుగా ఫోర్స్ చేసేవారని .. ఇలాంటి అనుభవాలు తనకు చాలా సార్లు ఎదురయ్యాయాని తెలిపింది. ఇక రాధికా స్పందిస్తూ కొందరి విషయంలో ఏమి మాట్లాడిన పెద్ద ఇస్స్యూ అవుతుందని, అందుకే వారి గురించి చెప్పి కెరీర్ పాడుచేసుకోవడం ఎందుకనే కొందరు బయపెడతారని తెలిపింది. మొత్తానికి కాస్టింగ్ కౌచ్ గురించి పలువురు హీరోయిన్స్ ఇలా మాట్లాడడంతో పెద్ద దుమారమే రేగుతుంది.
సంబంధిత సమాచారం
టిక్కెట్టు రేటు పెంచి 30వేల కోట్లు దోచారు!
వివాహితపై కన్నేసిన కామాంధుడు……ట్విస్ట్ ఇచ్చిన ఆమె భర్త!
వీడియో : ప్రీతీ కోరిక రివర్స్.. చివరకు దొరికిపోయింది!
10 నిముషాల్లో రూ.100 కోట్ల అమ్మకాలతో మొబైల్ సేల్స్ లో రికార్డ్ !
పవన్ యాత్రకు ఆ టీడీపీ మంత్రి హెల్ప్ చేస్తున్నారా?
జెమినీ గణేశన్ ఏడుగురు కుమార్తెలను చూశారా!
నేను మాత్రం మిమ్మల్ని మోసం చేయను – పవన్ కళ్యాణ్
నిన్న పెళ్లిరోజు జరుపుకున్నాడు….నేడు తన ప్రాణం బలిచేసుకున్నాడు!
ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత!
కర్ణాటకలో ఆ పార్టీ ఎన్నికల ఖర్చు రూ.6500 కోట్లా?
నాకు ముంబై అంటే కోపం లేదు: ప్రీతి జింటా
తమిళనాడులో ఫ్యాక్టరీ పై యుద్ధం.. కాల్పుల్లో 9 ప్రాణాలు బలి!
భయపెడుతోన్న నిపా వైరస్.. నర్స్ చివరి మాటలు!
తాజా వార్తలు
Copyright © 2016 Netiap.com _ All rights reserved. మమ్మల్ని సంప్రదించండి : netiapnews @ gmail.com |
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
బిగ్బాస్కి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్
తెలుగు బిగ్బాస్ మొదటి సీజన్ విజయవంతంగా ముగిసింది. అయితే ఇప్పటికే హిందీలో బిగ్బాస్ పది సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగవ సీజన్ నుంచి దీనికి హోస్ట్గా వ్యవహరిస్తోన్న సల్మాన్ఖాన్ మరో సీజన్కి కూడా ఒప్పందం చేసుకున్నాడు. సల్మాన్కి బదులుగా అక్షయ్ లేదా హృతిక్ వస్తారని ఊహాగానాలు సాగినా కానీ మళ్లీ సల్మాన్కే బిగ్బాస్ సింహాసనం దక్కింది.
తాజా సీజన్ కోసం సల్మాన్కి ఎపిసోడ్కి పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడానికి స్టార్ నెట్వర్క్ అంగీకరించింది. బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్బాస్ కోసం వారానికి ఒక్క రోజు (శనివారం) మాత్రమే సల్మాన్ షూట్ చేస్తాడు. దానిని రెండు రోజులు ప్రసారం చేస్తారు.
బిగ్బాస్ నాలుగవ సీజన్కి రెండున్నర కోట్ల పారితోషికం తీసుకున్న సల్మాన్ పదవ సీజన్కి వచ్చేసరికి ఎపిసోడ్కి ఎనిమిది కోట్లు అందుకున్నాడు. పదకొండవ సీజన్కి పదకొండు కోట్లు తీసుకుంటూ టెలివిజన్ రంగ చరిత్రలోనే కొత్త రికార్డు నెలకొల్పాడు. బిగ్బాస్ షోకి హోస్ట్గా మారిన తర్వాతే సల్మాన్ పాపులారిటీ, క్రేజ్ పెరుగుతూ పోయింది.
దీంతో ఈ షో అంటే ప్రత్యేక అభిమానం వున్న సల్మాన్ ఇప్పటికి ఎన్నిసార్లు దీనికి ఫుల్స్టాప్ పెట్టాలన్నా పెట్టలేకపోయాడు. పది సీజన్ల తర్వాత మాత్రం కొత్త హోస్ట్ ఖాయమని అనుకున్నారు కానీ సల్మాన్ మళ్లీ తన హోస్ట్ అవతారానికి సిద్ధమవుతున్నాడు.
కాంగ్రెస్లో లిస్టు అవుట్- షాక్లు ఎక్కువే Nov 13,2018126 Shares ఎక్కడ వేసిన బెల్లంకొండ అక్కడే! Nov 12,2018126 Shares విజయ్ దేవరకొండ మ్యాజిక్ పని చేయట్లే! Nov 12,2018126 Shares పబ్లిగ్గా ముద్దిచ్చి తమన్ మీదకి తోసేసాడు Nov 12,2018126 Shares
కాంగ్రెస్లో లిస్టు అవుట్- షాక్లు ఎక్కువే
అమిత్ షా.. ముందు నువ్వు హిందు పేరు పెట్టుకో
ఎక్కడ వేసిన బెల్లంకొండ అక్కడే!
విజయ్ దేవరకొండ మ్యాజిక్ పని చేయట్లే!
హీరో అయిన 26 ఏళ్లకి మొదటి హిట్టు!
హాట్: హీటెక్కిస్తోన్న 'అర్జున్రెడ్డి' షాలిని
తెలుగు సినిమాకి చొక్కా లేని స్టార్! |
పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ ?
సూర్య సినిమా నుండి అల్లు శిరీష్ తప్పుకున్నాడా ?
చంద్రబాబకు 40 సీట్లు కూడా రావు
<font color='red'>నేటి ఏపి స్పెషల్ : </font> ఫస్ట్ వీక్ లోనే నిర్మాతలకు కాసులు కురిపించిన టాలీవుడ్ మూవీస్!
సినిమా వార్తలు
ఫోటో గ్యాలరీ
జాతీయ వార్తలు
నేటి ఏపి స్పెషల్
లైఫ్ స్టైల్
అంతర్జాతీయ వార్తలు
వార్తలు / సినిమా వార్తలు
అది 1900 ల సంవత్సరం.. అప్పుడప్పుడే సినిమా ప్రపంచానికి పరిచయం అవుతున్న రోజులవి. సాంకేతిక విజ్ఞానం చాలా తక్కువ. అయినప్పటికీ ఒక సినిమా విడుదల అయిందంటే ప్రజల్లో విశేష ఆదరణ పొందేది. కథానాయకులు, నాయికలు సైతం చాలా తక్కువగా ఉండే ఆ రోజుల్లో వారి నటనకు ప్రేక్షక మహాశయులు ముగ్దులయ్యేవారు. ఒక సినిమా విడుదల అయిందంటే అది కనీసం ఆరు మాసాలైనా విజయవంతంగా ఆడేది. థియేటర్లు అంతగా సౌకర్యవంతంగా లేకపోయినా,
సినిమా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా తెరలు సైతం సరిగ్గా స్పష్టంగా కనబడకపోయినా సరే ఆ నాటి సినిమాలకు విశేష ఆదరణ లభించేది. అప్పుడు స్టూడియో ల అందుబాటు కూడా చాలా తక్కువే. వాటినే సర్ధుకొని సినిమాలు తీసేవారు. ఆ కాలంలో ఒక బొమ్మ పడిందంటే అది కొన్ని నెలలైనా గుర్తుడేది. కాని నేడు ఏ రోజున వచ్చిన సినిమాలు ఆ రోజునే వెళ్లిపోతున్నాయి. కథలో అర్థం ఉండదు. సన్నివేశానికి సంబంధం ఉండదు. కొన్ని సినిమాల కథలైతే సినిమా చుసిన వెంటనే మర్చిపోతున్నారు.
కథా నాయకుల, నాయికల సంఖ్య పెరగడం, సరైన కథా సారాంశం ఉన్న కథలు కరువవ్వడం, వీక్షకులకు ఏదైనా కొత్తగా కనబడాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉండడం, డైరెక్టర్లు వినూత్న పంథాలో సినిమాలు తీయడం అందులో కొన్నింటికి ప్రజల విశేష ఆదరణ లభించడం. మరికొన్నింటికీ ఆదరణ కరువవ్వడం ఇలా సినిమా పరిశ్రమ పది ఫ్లాప్ లు ఒక హిట్టు అన్న సూత్రంతో కొనసాగుతోంది. మన తెలుగు పరిశ్రమను తీసుకున్నట్లయితే, అలనాడు ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు మాత్రం తెలుగు ప్రజల విశేష అఆధరాభిమానాలు మాత్రం గెలుచుకున్నాయి.
ఒక 50 సంవత్సరాలు తెలుగు పరిశ్రమను పటిష్టమైన పునాదుల మీద నిలబెట్టారంటే ఆ క్రెడిట్ వారికే సొంతం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలుగు సినీ పరిశ్రమ నేడు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందంటే దానికి కారణం ఈ తెలుగు పితామహులే అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వీక్షకుల ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కొత్త సినిమాలు వస్తున్నా, నాటి తరహా ఉమ్మడి కుటుంబ హాస్య భరిత సన్నివేశాలు గల కుటుంబ నేపథ్యం గల చిత్రాలు ఇక కనుమరుగేనా…?
అని ప్రశ్నించుకుంటే ఇక కనపడవనే చెప్పాలి. కారణం వీక్షకుల ఆలోచనలో వస్తున్న మార్పు. పెరిగిన పాశ్చాత్య ధోరణి ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా అలనాటి సినిమాలు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరనీయంగా నిలిచాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలనాడు సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అహర్నిశలు పాటుపడ్డ ప్రతో ఒక్కరికీ నేడు సినిమాల్లో రాణిస్తున్న వారంతా రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా పరిశ్రమ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు ఇంత స్థాయికి చేరిందంటే దాని వెనకాల ఎందరో మహానుభావుల కృషి దాగి ఉందని మనం గ్రహించాలి.
సంబంధిత సమాచారం
ఫస్ట్ డబుల్ సెంచరీ చేసింది సచిన్ కాదా? ఆ క్రికెటర్ ఎవరు?
రేట్లు పెంచితే జైలుకే.. థియేటర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్!
లవర్ రివ్యూ : రాజ్ తరుణ్ డీసెంట్ ఎంటర్టైనర్!
డబుల్ సెంచరీతో పాక్ బ్యాట్స్ మాన్ వరల్డ్ రికార్డ్!
సాయంత్రం ఆరు గంటల్లోగా తేలాలి.. లంచ్ కూడా లేదు : లోక్ సభ స్పీకర్!
టీడీపీ అవిశ్వాసంపై పవన్ సెటైర్లు!
హిట్టా లేక ఫట్టా :ఆటగదరా శివ – బలమైన కథ, బలహీనమైన కథనం!
నేటి ఏపి స్పెషల్ : ఫస్ట్ వీక్ లోనే నిర్మాతలకు కాసులు కురిపించిన టాలీవుడ్ మూవీస్!
ఏపి కాంగ్రెస్ లోకి రాయలసీమ బైరెడ్డి!
నేటి ఏపి స్పెషల్ : హాట్ గా కనిపించే ఈ స్టార్ హీరోయిన్స్ హైట్ ఎంతో తెలుసా ?
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అర్జున్ రెడ్డి హీరో!
జై లవకుశకు అరుదైన గౌరవం !!
తాజా వార్తలు
Copyright © 2016 Netiap.com _ All rights reserved. మమ్మల్ని సంప్రదించండి : netiapnews @ gmail.com |
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ బిజేపి నేతల పరిస్థితి అరకత్తరలో పోకలా తయారైంది. టిడిపి అధినేత చంద్రబాబు వైఖరి, మోడీ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణలో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టిడిపి ఎలాగు చావు తప్పించుకుని కన్ను లొట్టపోయినట్టుగా తయారైంది. ఇప్పుడు తెలంగాణ విషయంలో టిడిపి ఉన్నా, లేకున్నా పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో లేడు చంద్రబాబు. తనకు కావాల్సిన సీమాంద్రలో అధికారం దక్కింది. ఇక బిజేపి పరిస్థితి అలా కాదు, దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక తర్వాత మంచి పట్టున్న రాష్ట్రమే తెలంగాణ. తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నించి తెలంగాణ బిల్లు విషయంలో టిడిపితో చేతులు కలిపి తప్పటడుగులు వేసి నష్టాన్ని చవిచూసిందన్న భావన ఇప్పటికే తెలంగాణ బిజేపి నేతల్లో నెలకొంది. దీనికి తాజా పరిణామాలు జోడు కావడంతో భవిష్యత్తుపై తెలంగాణ బిజేపి నేతలకు దిగులు పట్టుకుంది.
టిడిపి అధినేత తెలంగాణ విషయంలో వ్యతిరేక నిర్ణయాలనే ప్రకటిస్తున్నాడన్న భావం టిటిడిపి నేతల్లో వ్యక్తమవుతోంది. మహానాడు వేదికగా ఆయన ఉద్యోగులు, పోలవరం వంటి విషయాలలో చేసిన ప్రకటనలు చట్టం, రాజ్యాంగం పరంగా వాస్తవమే అయినప్పటికి తెలంగాణ విషయంలో అవి ఇక్కడి వారికి గిట్టని మాటలు. సెంటిమెంట్ ముందు ఏది పనిచేయదని ఈ ఫలితాలే రుజువుచేసాయి. ఇప్పటికే చంద్రబాబు పక్కా సమైక్యం అన్న భావం తెలంగాణలో నెలకొంది. ఇప్పుడు పంపకాల విషయంలో చంద్రబాబు పూర్తిగా సీమాంద్ర పక్షాన నిలిచి పోరాడేలా ఉన్నాడు. పోలవరం,ఉద్యోగుల విషయంలో అది క్లియర్ అయింది. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే తెలంగాణలో తాము తిరగడమే కష్టం అన్న భావం తెలుగుదేశం నేతల్లో నెలకొంటోంది.
ఈ ప్రభావం మహానాడు తొలిరోజు స్పష్టంగా కనిపించింది. తొలిరోజు మహానాడుకు టిటిడిపి నేతలు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు హాజరుకాలేదు. సరే వేరే కారణాలు ఉండొచ్చేమో కాని తాజా పరిణామాలు మాత్రం తెలంగాణలో తమకు కీడు తెచ్చిపెడతాయనే భావం మాత్రం వారిలో ఉంది. ఇదే ముదరితే టిడిపిని ఖాలీచేయడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయాన్ని కొందరు సీనియర్ నేతలే సన్నిహితుల వద్ద వాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ బిజేపి నేతల్లో కూడా గుబులుతో పాటు అదిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు.
మెడీ గెలిచినప్పటినుంచి తెలంగాణ విషయంలో వివక్ష చూపుతున్నారన్న భావం వారిలో ఇప్పటికే నెలకొంది. మంత్రి వర్గంలో ఒక్క పదవి కూడా కట్టబెట్టకపోవడం ఈ ఆగ్రహానికి కారణమైంది. పైగా మోడీ భేటి అయిన తొలిక్యాబినెట్ లోనే వివాదాస్పదమైన పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ముట్టుకోవడం, తెలంగాణవారు వ్యతిరేకిస్తున్న దానికే ఆయన ఓటు వేసి ఆర్డినెన్స్ ను జారీ చేయించడంతో తెలంగాణ బిజేపి నేతల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. ఈ విషయంలో ఇప్పుడు టిఆర్ఎస్,అన్ని జేఏసి, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్దమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో జేఏసిలో కీలక పాత్ర పోషించిన బిజేపి ఇప్పుడేం చేయాలి.
తమ ప్రభుత్వం చేసిన పనికే విరుద్దంగా ఉద్యమించాలా, ఊరుకోవాలా, నిశ్శబ్దంగా ఉంటే తెలంగాణలో మరింత పతనం తప్పదు. ఇది తెలిసి మోడీ ఇలా ఎందుకు చేసారు. ఇప్పడు కూడా అంటే తెలంగాణ బిల్లు విషయంలో చివరలో టిడిపితో కలిసి మెలికలు పెట్టిన మాదిరిగానే చంద్రబాబు డైరెక్షన్ లోనే ఈ ఆర్డినెన్స్ తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మోడీ అధికారికంగా కొలువుదీరిందే ఇప్పుడు. అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. అవి జరిగే అవకాశం లేనప్పుడే కదా... ఆర్డినెన్స్ లు తేవాలి. అంటే పక్కా తెలంగాణకు వ్యతిరేకంగా మోడీ వెలుతున్నట్లే అంటున్నారు. ఈ సంకేతాలన్నీ తెలంగాణలో బిజేపి, టిడిపి నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ పరిణామాలు మున్ముందు ఎలా ఉంటాయో అన్న సంకేతాలను జారీ చేస్తున్నాయి.
2.0: బయ్యర్ల ఒత్తిడికి తలవంచిన శంకర్ Nov 21,2018126 Shares ఫ్లాప్ అయిందని సిగ్గు పడుతున్న సూపర్స్టార్ Nov 21,2018126 Shares అల్లు అర్జున్ని డిఫెన్స్లో పడేసిన చరణ్! Nov 21,2018126 Shares త్రివిక్రమ్ ఇప్పుడైనా న్యాయం చేస్తాడా? Nov 21,2018126 Shares
ఎన్టీఆర్ ఏం చేస్తాడిపుడు?
పవన్కళ్యాణ్ని నమ్ముకుంటే పనయ్యేదేమో
పవన్ తెలంగాణలో పోటీ చేయడం లేదు- ఎందుకు?
అల్లు అర్జున్ని డిఫెన్స్లో పడేసిన చరణ్!
త్రివిక్రమ్ ఇప్పుడైనా న్యాయం చేస్తాడా?
పులిహోర్ టాక్: #RRRలో బాలీవుడ్ హీరో |
<font color='red'> వీడియో : </font> దేవుడు ముందే తన మనిషిని చంపుకున్న ఏనుగు!
<font color='red'>వీడియో : </font>వీడు సామాన్యుడు కాదు బాబోయ్.. టాలెంట్ కు అమ్మమ్మ!
సినిమా వార్తలు
ఫోటో గ్యాలరీ
జాతీయ వార్తలు
నేటి ఏపి స్పెషల్
లైఫ్ స్టైల్
అంతర్జాతీయ వార్తలు
తెలంగాణా / ప్రముఖ వార్తలు
కర్ణాటక రాష్ట్ర రాజకీయ రోజురోజుకూ రసవత్తరంగా మారుతుంది, కన్నడ నాయకుల రాజకీయ చదరంగాన్ని చూస్తుంటే ఒక్కోసారి నవ్వాలో లేక జాలి చూపాలి కూడా అర్థం కావడం లేదు. రాష్ట్ర గవర్నర్ సీఎం పదవిని భాజాపా పార్టీ నాయకునికి కట్టబెట్టగా తాము బలనిరూపణ చేసుకోవడానికి 15 రోజుల సమయం కేటాయించింది. ఇదే తరుణంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ భాజాపాలో కలుస్తారా అని ఆ పార్టీ నాయకులు భయాందోళనలో పడ్డారు.
ఇప్పటికే భాజాపా కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు కట్టు కథలు చెప్తూ, వారి వైపుకు లాక్కునేలా ప్రయత్నాలు చేస్తున్నారని, దీని విషయంలో భాజాపా పెద్ద కుట్ర పన్నుతుందని ఆరోపణలు కూడా చేసారు, ఈ నేపథ్యంలో వారికి పోలీసుల రక్షణ కూడా కావాలని డిమాండ్ చేయగా అధికారంలో లేనందున కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు పోలిస్ రక్షణ కల్పించలేకపోయింది. దీనితో ఏం చేయాలో అర్థం కాక ఇరు పార్టీల నేతలను ఈగల్టన్ రిసోర్టుకు తీసుకుపోగా అక్కడ కూడా వారికి రక్షణ లేదని కలత చెందారు. చివరికి చేసేది ఏమీ లేక అందరు ఎమ్మెల్యేలను కేరళకు తరలించాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్, జేడీఎస్ అధినేతలు పౌర విమానయాన శాఖను సంప్రదించింది. వీళ్ళ టీం బ్యాడో లేక ఇంకేంటో ఎవరికీ తెలియదు కానీ విమాన సేవ అందించడానికి కూడా పౌరవిమానయాన శాఖవారు తిరస్కరించడంతో చివరి నిమిషంలో కొందరు ఎమ్మెల్యేలను నిన్న రాత్రి, ఇంకొందరు ఎమ్మెల్యేలను ఈ రోజు ఉదయం హైదరాబాద్ కి తరలించారట. అది కూడా కర్నాటక నుంచి ఒక ప్రత్యేక బస్సును పెట్టి కట్టుదిట్టమైన ప్రైవేటు సెక్యురిటీ సిబ్బందిని రక్షణగా పెట్టి హైదరాబాద్ కు తరలించారు.
సంబంధిత సమాచారం
వీడియో : దేవుడు ముందే తన మనిషిని చంపుకున్న ఏనుగు!
వీడియో : వీడు సామాన్యుడు కాదు బాబోయ్.. టాలెంట్ కు అమ్మమ్మ!
ప్రేమ వ్యవహారం లో పోలీసుల జోక్యo ….. చేదు అనుభవం ఎదురు !
జల విహార్ లో దారుణం.. నీటిలో పడిన ఏడాదిన్నర పాప!
షాకింగ్ న్యూస్ : మగాడిగా మారనున్న మహిళ!
చెన్నై మూడు సార్లు కొట్టింది.. నాలుగో పంచ్ హైదరాబాద్ దే!
నిరాహారదీక్షకు రెడీ అయిన జనసేనాని!
ట్రైలర్ : ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు
ప్రీమియర్ షో టాక్ : నేల టిక్కెట్టు.. కొత్తగా ఏముంది?
నేను కావాలని అలా అనలేదంటున్న టీడీపీ ఎంపీ …..
ఆంధ్రలో కూడా పార్టీ పెట్టమంటున్నారు: కేటీఆర్
సీనియర్ నటీమణి కన్నుమూత.. చివరి నిమిషంలో కూడా పిల్లలు రాలేదు!
” గతంలో తప్పు చేశాను..” ఆ మచ్చ ఎన్నటికీ పోదు : సన్నీ లియోన్
తాజా వార్తలు
Copyright © 2016 Netiap.com _ All rights reserved. మమ్మల్ని సంప్రదించండి : netiapnews @ gmail.com |
ఇప్పుడు స్మార్ట్ గ్లాస్సెస్ తో క్రిమినల్స్ డైరెక్ట్ గా పట్టుకోవచ్చట… _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _
పవన్ ఫాలో అవుతున్న వన్ అండ్ ఓన్లీ సెలెబ్రిటీ ఆయనే!
<font color='red'>సర్ ప్రైజ్ : </font> బిగ్ బాస్ హౌస్ లోకి అర్జున్ రెడ్డి!
సినిమా వార్తలు
ఫోటో గ్యాలరీ
జాతీయ వార్తలు
నేటి ఏపి స్పెషల్
లైఫ్ స్టైల్
అంతర్జాతీయ వార్తలు
అంతర్జాతీయ వార్తలు / ప్రముఖ వార్తలు / వార్తలు
ఇప్పుడు స్మార్ట్ గ్లాస్సెస్ తో క్రిమినల్స్ డైరెక్ట్ గా పట్టుకోవచ్చట…
కలియుగం నడుస్తున్నదంతా టెక్నాలజీ తోనే. ఈ రంగంలో వస్తున్న అనేక మార్పులు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. టెక్నాలజీ రంగంలో రోజు రోజుకీ జరుగుతున్న నూతన ఆవిష్కరణలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీటితో ప్రజల జీవనశైలి వేగంగా మారుతున్నది. అలాగే అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ఫలాలను సాధారణ ప్రజలందరూ అందుకుంటున్నారు. ప్రధానంగా చెప్పాలంటే నేర పరిశోధన రంగంలో టెక్నాలజీ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. నేరస్థులను పట్టుకునేందుకు కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. నూతన పరికరాలను తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మరో కొత్త సాంకేతిక పరికరం పోలీసులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో నేరస్థులను పట్టుకోవడం మరింత తేలిక కానుంది.
గుర్గావ్కు చెందిన స్టాక్యూ అనే స్టార్టప్ సంస్థ దేశంలోనే తొలిసారిగా నూతన తరహా స్మార్ట్ గ్లాసెస్ (కళ్లద్దాలు)ను ఆవిష్కరించింది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తాయి. వీటిని ధరించిన వారు (పోలీసులు) జనావళిలో తిరిగే సమయంలో ఈ గ్లాసెస్ జనాల ముఖాలను స్కాన్ చేస్తాయి. వారిని ఫొటోలు తీస్తాయి. ఆ ఫొటోలను రిమోట్ సర్వర్కు పంపిస్తాయి. రిమోట్ సర్వర్లోని డేటాబేస్లో ఉండే నేరస్థుల ఫొటోలతో ఆ ఫొటోలు మ్యాచ్ అయితే వెంటనే జనాల మధ్యలో ఉన్న గ్లాసెస్ ధరించిన ఆ వ్యక్తికి(పోలీసుకి) సమాచారం వెళ్తుంది. ఇదంతా చాలా తక్కువ సమయంలోనే జరుగుతుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి (పోలీసు) అలర్ట్ అయి జనాల మధ్యలో ఉన్న సదరు అనుమానితున్ని లేదా నిందితున్ని/నేరస్థున్ని అదుపులోకి తీసుకుంటాడు. ఇలా ఈ స్మార్ట్గ్లాసెస్ నేరస్థులను సులభంగా పట్టించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
సంబంధిత సమాచారం
సర్ ప్రైజ్ : బిగ్ బాస్ హౌస్ లోకి అర్జున్ రెడ్డి!
అందరి కళ్ళు పవన్ వైపే. దెబ్బకొట్టాలని ప్లాన్స్?
జగన్ కు మరో ఎదురుదెబ్బ.. జనసేనలోకి వైసీపీ నేతలు?
బిగ్ బాస్ లీక్స్ : ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్!
ఇంగ్లాండ్ లో హార్దిక్ పాండ్యా షికారు.. చీవాట్లు పెట్టిన ఫ్యాన్స్!
గుడ్ న్యూస్.. నో స్కూల్ బ్యాగ్, నో హోంవర్క్!
చేరికలు సరే, మరి ఓట్ల పరిస్థితి ఏమిటి పవన్?
చంద్రబాబుపై ముద్రగడ మరో బిగ్వార్!
కేరళ కోసం విరాళం ఇచ్చిన ఫస్ట్ క్రికెటర్!
* రాజధాని ప్రాంతంలో రోడ్లనే తెలుగు దేశం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరి మంత్రులు చెప్పే వేల కి.మీ. రోడ్లు ఎక్కడ ? https://t.co/TVwc8xsRjs
ఇంగ్లాండ్ తో టెస్ట్, ఆలౌట్ అయిన ఇండియా : మరొక రికార్డు సొంతం!
నేటిఏపి స్పెషల్ : హీరోయిన్లని డామినేట్ చేసే ఈ సపోర్టింగ్ నటీమణులను చూసారా?
లైవ్ : గీత గోవిందం సక్సెస్ ఈవెంట్
సినీ, రాజకీయపరంగా చిరుకు, పవన్ కంటే 100 రెట్లు ఎక్కువ ఇమేజ్ వుంది!
కేసీఆర్, కేటీఆర్ సహా ఎవ్వరూ కాంగ్రెస్ గెలుపును ఆపలేరు!
తాజా వార్తలు
Copyright © 2016 Netiap.com _ All rights reserved. మమ్మల్ని సంప్రదించండి : netiapnews @ gmail.com |
దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ ‘కబాలీ’ చిత్ర ప్రచారం కొత్త పుంతలు తొక్కనుంది. సినిమా విడుదలకు ముందే ఫల్డ్ లుక్, ప్రీ రిలీజ్ బిజినెస్ వంటి పలు రికార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. రజనీ అభిమానులు సైతం రిలీజ్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాని బ్లాక్ బస్టర్ చేసేందుకు చిత్ర నిర్మాతలు కొత్త ప్రచార పంథాని పాటించబోతున్నారు. చెన్నైలో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేయడం, ఆటోలు, బస్సులపై పోస్టర్ల ప్రచారం చేపట్టిన నిర్మాతలు తాజాగా తమ ప్రచారానికి విమానాలను కూడా ఉపయోగించుకోబోతున్నారు. విమానాలపై పోస్టర్లు అంటించి ప్రచారం చేపట్టనున్నారు. రెండు స్వదేశీ (డొమిస్టిక్) విమానాలతో పాటు రెండు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్పై కబాలీ పోస్టర్లు వేస్తున్నారు. గతంలో ‘ది హ్యాబిట్’ అనే హాలీవుడ్ చిత్రం కోసం ఎయిర్ న్యూజిలాండ్ విమానాలకు పోస్టర్లు అంటించి ప్రచారం చేశారు. రాజమౌళి ఎందుకో ‘బాహుబలి’ ప్రచారానికి ఈ ఐడియా ఉపయోగించుకోలేదు. ఇండియాలో ఈ తరహా ప్రచారం చేపడుతున్న తొలి చిత్రం రికార్డు ‘కబాలీ’ దక్కించుకోనుంది. దటీజ్ రజనీ..
అభిమానులుకు సాయం అందించిన సూపర్ స్టార్ రజని
“బ్యాంకాక్ వీధుల్లో కబాలి”
తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే
వైద్యులు ఫ్లాట్ టమ్మీ కోసం సూచిస్తున్న 3 ఎక్సర్ సైజులు .
ఇలా త్రాగితే ఎండు ద్రాక్షల డ్రింక్ ను రెండు రోజుల్లో లివర్ క్లీన్ … అద్భుతంగా పని చేస్తుంది.
ఈ డ్రింక్ రాత్రి పడుకునే ముందు తాగితే ఎసిడిటీ మరియు జీర్ణ సమస్యలు దూరం ….
వ్యాయామం చేసేసాం అనుకుని ఈ ఆహార పదార్దాలు తింటే ఇక అంతే,,,,
మీరు ఖచ్చితంగా రోజూ గుడ్డు తింటారు ఇది చదివితే .,,,
శ్రీ విద్యా ఉపాసన.. ప్రక్రియ
ఎస్బిఐ డెబిట్ కార్డ్ దారులకు హెచ్చరిక _ 60SecondsNow
హెడ్ లైన్స్
ఫుట్బాల్ ప్రపంచ కప్
ఎస్బిఐ డెబిట్ కార్డ్ దారులకు హెచ్చరిక
టెక్నాలజీ - 28 days ago
దిగ్గజ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సరికొత్త హెచ్చరికలను జారీ చేసింది. ఖాతాదారులంతా కొత్త ఏటీఎం కార్డులు తీసుకోవాలంటోంది.ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రస్తుత మాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డులను సరికొత్త ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులతో మార్చుకోవాలని సూచించింది. మోసాలు, కార్డ్ క్లోనింగ్కు చెక్ పెడుతూ.. కస్టమర్లకు డబ్బుకు భద్రత ఇవ్వడంతో పాటూ.. ఇటు ఆర్బీఐ నుంచి ఆదేశాలు రావడంతో ఈ చిప్ కార్డుల్ని ఇవ్వాలని నిర్ణయించామంటున్నారు బ్యాంక్ అధికారులు.
మరిన్ని : Telugu Gizbot
హిందీ డెయిలీ చీఫ్ ఎడిటరుపై కాల్పులు ..పరిస్థితి విషమం
భారత్ - 1 min ago
సెప్టెంబరు 25 'మంగళవారం' ..మీ రాశిఫలం
జీవనశైలి - 6 min ago
మేషరాశి వారికి శుభ సమయం. వృషభ రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మిధున రాశి వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కర్కాటక రాశి వారు శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు. సింహరాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. కన్యారాశి వారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తులారాశి వారు మనోబలంతో ముందుకు సాగి సత్ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ధనుస్సు రాశి వారు కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. మకరం వారు అనవసర ఖర్చులు చేస్తారు. కుంభ, మీనారాశుల వారు మనోల్లాసంతో పనులను పూర్తి చేస్తారు.
చేతుల్లేవు ..పోరాడి 'డ్రైవింగ్ లైసెన్స్' సాధించింది
జీవనశైలి - 12 min ago
కేరళలో తొడప్పుళాకు చెందిన జిలుమోల్ మారియెట్ థామస్ (26) చేతుల్లేకపోయినా డ్రైవింగ్ లైసెన్సు పొందిన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచింది. ఆసియాలో కూడా ఆమే ప్రథమం. చేతుల్లేకపోయినా కారు నడపడం నేర్చుకుని పట్టుదలతో డ్రైవింగ్ లైసెన్స్కు దరఖాస్తు చేసి నిరాదరణకు గురైంది. హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేసి లైసెన్స్ ఇవ్వనని చెప్పిన అధికారి చేతుల మీదుగానే లైసెన్స్ సాధించింది. 'చేతుల్లేనంత మాత్రాన నాకు ఏమీ చేత కాదంటే ఎలా. ఆ మాటలే నన్ను హైకోర్టు వరకూ వెళ్ళి పోరాడేలా ప్రేరేపించాయి' అని ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చింది. |
హాస్యబ్రహ్మ - మరో కోణం
తోలుబొమ్మలాట - తెలుగు వారికి ప్రత్యేకమైన కళ. సినిమాలు అందుబాటులో లేని రోజుల్లో జానపదులకు అదే ఒక సినిమా. రామాయణ, భారత, భాగవత కథలను వారికర్థమయ్యే రీతిలో, భాషలో వినోదాన్ని మిళితం చేస్తూ సాగే కళారూపం.
మొదట్లో బాగా బిగించి కట్టిన తెల్లని తెర వెనుక ఆముదం దీపాలు, ఇలాయి బుడ్డి ( కిరోసిన్ దీపం ) సాయంతో ప్రదర్శించేవారు. మేక, జింక లాంటి జంతువుల తోలును బాగా ఎండబెట్టి పారదర్శకంగా చేసి వాటితో బొమ్మలు తయారు చేసి సహజంగా లభించే రంగులు అద్దేవారు. తెర వెనుక భాగం మీద ఉంచిన ఆ బొమ్మలు పారదర్శకంగా వుండడం వలన వాటి వెనుకనున్న దీపం వెలుతురు వాటిలోనుంచి ప్రసరించి చాలా ఆక్షర్షణీయంగా కనిపించేవి. ఒక రకంగా కలర్ సినిమా చూస్తున్నట్లే ఉండేది.
తర్వాత కాలంలో పెట్రోమాక్స్ దీపాలు వాడేవారు. ఆ తర్వాత కరెంట్ దీపాలు వాడటం వరకూ వచ్చి అప్పటికి సినిమాల ప్రభావం బాగా పెరగడం వలన క్షీణించడం ప్రారంభమైన ఆదరణ, తర్వాత టీవీల ప్రభావంతో పూర్తిగా ఈ కళారూపం కనుమరుగై పోయే పరిస్థితి దాపురించింది. అయితే అప్పట్లో సినిమాలకోసం దూరాలు వెళ్ళవలసి రావడం, సంప్రదాయకళ అనే ఉద్దేశ్యం ప్రజల్లో వుండడం వలన అన్ని ఉత్సవాలలోను ఇతర కళారూపాలతో బాటు, తోలుబొమ్మలాటను కూడాను తప్పనిసరిగా ప్రదర్శించేవారు. మేం కూడా గతంలో ఎన్నోసార్లు అలా తోలుబొమ్మలాట ప్రదర్శనలను ఏర్పాటు చేసాం అప్పట్లో ప్రజలు కూడా ఆసక్తిగా తిలకించేవారు. టీవీ ప్రభావం మాత్రం చాలా వాటితో బాటు ఈ కళకు కూడా సమాధి కట్టేసింది.
ఈ తోలుబొమ్మలాట కళాకారులకు కాకినాడ దగ్గరున్న మాధవపట్నం ప్రసిద్ధి. అలాగే అనంతపురం జిల్లాలో, ఇంకా కొన్ని చోట్ల కూడా ఈ కళాకారులు వున్నారు. వీరిలో ఎక్కువగా మరాఠా ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే. వీరు చెప్పే కథల్లో ముఖ్యంగా ' లంకాదహనం ' ప్రసిద్ధి చెందింది. ముగ్గురు, నలుగురు కళాకారులు తెర వెనుక బొమ్మల్ని ఆడిస్తూ ఆయా పాత్రల సంభాషణలు, పద్యాలు, పాటలు పలకడం మాత్రమే కాకుండా ఆయా సన్నివేశాలను బట్టి అవసరమైన శబ్దాలను కూడా నోటితో పలికించేవారు. మరికొంతమంది వాయిద్యాలు వాయించేవారు. సాధారణంగా ఈ బృందమంతా ఒకే కుటుంబ సభ్యులతో ఏర్పడి ఉండేది. ఇక తెర మీద ఆయా కథలననుసరించి పాత్రల బొమ్మలతో బాటు వినోదం కోసం కేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్క లాంటి హాస్య పాత్రలుండేవి. ఇవి కథతో సంబంధం లేకుండా మధ్య మధ్యలో తెర మీదకు వచ్చి సందర్భం లేని, ముఖ్యంగా సమకాలీన అంశాల మీద చమత్కారాలతో కూడిన సంభాషణలతో ప్రేక్షకులను వినోదపరిచేవి. ఒక్కోసారి కొన్ని మోటు సంభాషణలు కూడా వాడేవారు. ఇప్పుడు ఆ కళకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఆ కళాకారులు ఇతర వృత్తులు వెదుక్కోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం శిల్పారామం పేరుతో ఈ కళలను అప్పుడప్పుడైనా ఆదరిస్తుండకపోతే ఈ మాత్రమైనా జీవించి ఉండేది కాదేమో !
అలాంటి తోలుబొమ్మలాట ను ఇక్కడ చూడండి.
మన చుట్టూ ఉండే మనుష్యులలో కనిపించే ప్రత్యేకతలను, అలవాట్లను పట్టుకుని వాటిలోనుంచి హాస్యాన్ని వెలికి తీసి తన చిత్రాల ద్వారా మనకందించి హాస్యబ్రహ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన రచయిత, దర్శకుడు జంధ్యాల. ఈయన కేవలం హాస్య రస చిత్రాలకే పరిమితం కాలేదు. జంధ్యాల చేసిన కొన్ని ప్రయోగాలు చూస్తే ఆయనలోని మరో కోణం కనబడుతుంది.
టీన్ ఏజ్ ప్రేమ కథతో, కథకు తగ్గ నటీనటులతో, అదీ క్రొత్త వారితో చేసిన ప్రయోగం... జంధ్యాల దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ' ముద్దమందారం '. ప్రదీప్, పూర్ణిమ నాయికనాయకులుగా పరిచయం చేసిన ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది.
ఈరోజు జంధ్యాల గారి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయనలోని మరో కోణాన్ని స్పృశించే ప్రయత్నమిది.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది RRao Sistla వద్ద 8:09 PM
లేబుళ్లు: చలనచిత్ర, నివాళి
' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బర...
సి. యస్. ఆర్. హస్త సాముద్రికం
తెలుగు చిత్ర రంగంలో కొన్ని పాత్రల గురించి ప్రస్తావన వస్తే కొంతమంది నటులు ప్రత్యేకంగా గుర్తుకువస్తారు. భారతంలోని శకుని పాత్ర పేరు చెబితే మొద...
పౌర్ణమి నాడు పుట్టినవాళ్ళు కవులవుతారని ఒక వాదన వుంది. ఆది నిజమేనేమో ! ఎందుకంటే 1931 వ సంవత్సరం ఆషాఢ పూర్ణిమ రోజున మనకో కవి లభిం...
తోలుబొమ్మలాట - తెలుగు వారికి ప్రత్యేకమైన కళ. సినిమాలు అందుబాటులో లేని రోజుల్లో జానపదులకు అదే ఒక సినిమా. రామాయణ, భారత, భాగవత కథలను వారికర్థ...
వీక్షకులు ( మే 2010 నుండి )
ఆథ్యాత్మికమ్ (10)
కదంబ పారిజాతాలు (5)
కనుక్కోండి చూద్దాం (4)
జ్ఞాపకాలు (2)
దేశభక్తి గేయాలు (10)
ప్రముఖుల విశేషాలు (78)
మధుర గీతాలు (2)
మాటా మంతీ (3)
వందన కదంబం (9)
శిరాకదంబం పత్రిక (215)
సజీవ చిత్రాలు (2)
సభలు - సమావేశాలు (12)
సామాన్యుడి సణుగుడు (16)
సాహిత్య విశేషాలు (37)
సుభాషితాలు (7)
మొదటి పురుష పాత్ర
సంగీతం - ప్రపంచం
గాయకుడు ఎవరు ? - జవాబు |
గాయకుడు ఎవరు ?
మరో ' కళ ' కరిగిపోయింది
' బాలు ' ని పుట్టినరోజు |
ఇంటర్నెట్లో వైరల్ గా మారుతున్న తెలంగాణ యువకుల కికి ఛాలెంజ్
ఇటీవల ప్రమాదకర కికి ఛాలెంజ్ యువతను వెర్రెక్కిస్తోన్న విషయం తెలిసిందే. కికి ఛాలెంజ్ ఎంతో ప్రమాదకరం కాబట్టి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కెనడాకు చెందిన కికి ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతుంటే తెలంగాణ రాష్ట్రంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు సరికొత్త కికి ఛాలెంజ్తో అదరగొట్టారు. వీరి కికి ఛాలెంజ్ ఇంటర్నెట్, సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఎంతోమంది చూస్తున్నారు.
Goat Rescue Mission Viral Video _ వైరల్ అవుతున్న 'గోట్ రెస్క్యూ మిషన్' వీడియో _ Oneindia TElugu
పేపర్ బాయ్ చిత్రం ఫస్ట్ సాంగ్ లాంచ్
చంద్రబాబు &కాంగ్రెస్ కు షాక్- మాజీ మంత్రి గుడ్బై – Dharuvu
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మీడియా సమావేశం
హైదరాబాద్లో వన్ప్లస్ ఆర్ఆండ్డీ సెంటర్..బెంగళూరును కాదని హైదరాబాద్ ను ఎంచుకున్న స్మార్ట్ఫోన్ దిగ్గజం
Home / ANDHRAPRADESH / చంద్రబాబు &కాంగ్రెస్ కు షాక్- మాజీ మంత్రి గుడ్బై
చంద్రబాబు &కాంగ్రెస్ కు షాక్- మాజీ మంత్రి గుడ్బై
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్నానంటూ రాజకీయంగా పూర్తి విరోధులు అయిన టీడీపీ కాంగ్రెస్లు కలిసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సమావేశమై రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట్నుంచి కాంగ్రెస్-టీడీపీ కలిస్తే పార్టీకి దూరమవుతామని చెబుతున్న నేతలు రాజీనామా బాట పడుతున్నారు.
వట్టి రాజీనామా చేసినట్లు తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తాను 1983 నుంచి టీడీపీతో పోరాడుతున్నానని.. అలాంటి పార్టీతో కాంగ్రెస్ కలవడం జీర్ణించుకోలేకపోతున్నట్టు వట్టి వసంత్ కుమార్ తెలిపారు.కాగా, వసంత్ కుమార్ జనసేన లేదా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే త్వరలోనే తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో మాట్లాడక వట్టి వసంత్ కుమార్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని సమాచారం. భట్టి భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి
Previous బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మాజీ మంత్రి…!
Next టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి…
సీఎం కేసీఆర్ నామినేషన్ కు ముహుర్తం ఖరారు..!
వైసీపీలోకి భారీగా వలసలు..మాజీ మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు
కర్నూల్ జిల్లాలో ఉపముఖ్యమంత్రి కేఈ అనుచరుడు దారుణ హత్య..!
జగన్ పై కత్తి దాడి గురించి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!
కొందరు స్త్రీలకు ముఖంపై చారికల్లాంటి మచ్చలు ఇబ్బంది పెడతాయి.వీటిని నివారించడానికి ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి.
కొంచెం ఉల్లి రసంలో చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు నివారించవచ్చు.
మచ్చలపై నిమ్మతొక్కలతో మసాజ్ చేసుకోవాలి.
కొంచెం ఉల్లి రసంలొ దూదిని ముంచి నల్ల మచ్చలు ఉన్నచోట రాసుకుంటే ఫలితం ఉంటుంది.
సౌందర్య చిట్కాలు |
ఎకనామిక్ టైమ్స్ లో _ నవతరంగం
Home > Uncategorized > ఎకనామిక్ టైమ్స్ లో
ఎకనామిక్ టైమ్స్ లో
వెంకట్ శిద్దారెడ్డి December 26, 2008 Uncategorized 21 Comments
ఈ వారం ఎకనామిక్ టైమ్స్ లో “Techie’s Reel Side” అని ఒక వ్యాసం ప్రచురించారు. అందులో నా గురించి కూడా వ్రాసారు. నిజానికి నేను నవతరంగం గురించి కూడా చాలా వ్రాసాను. కానీ వాళ్ళు దాని గురించి ఏమీ ప్రస్తావించకపోవడం కొంచెం బాధ కలిగింది.
ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన వ్యాసమూ, మరియు దానితో పాటు అంతకు ముందు వాళ్ళు నన్ను చేసిన ఇంటర్వ్యూ క్రింద ప్రచురిస్తున్నాను. చదివి మీ అభిప్రాయాలు తెలియచేయండి.
ప్రశ్నలు-సమాధానాలు
చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..
K మహేశ్ కుమార్ December 26, 2008 /
రాజేంద్ర కుమార్ దేవరపల్లి December 26, 2008 /
భగవంతుడు మీ ప్రతి మంచి కార్యనికి విజయాన్నివ్వలని దిల్ సే కొరుతూ..ఆమెన్.
వెంకట్గారూ మీ సక్సెస్కి శతకోటి అభినందనలు.
ఇలాంటి గుర్తింపు మొదటి మెట్టే – మీరు అధిరోహించాల్సిన శిఖరాలు చాల ఉన్నాయి. వాటిని మీరు అందుకుంటా రనడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు.
సూర్యప్రకాష్ జోశ్యుల December 27, 2008 /
వెంకట్ గారూ..మీరు గెలిచారు..కంగ్రాట్స్
అలాగే ఇలాంటి మరెన్నో ఇష్టమైన సాహస కృత్యాలు చేయాలని కోరుకుంటూ….
విష్ణువర్థన్ రెడ్డి December 27, 2008 /
చాల బాగుంది వెంకట్ గారు…..మేము కూడ మీ డెస్సిషన్ మేకింగ్ కొసం ఎదురు చూస్తునాము……….
హార్ధికాభినందనలు వెంకట్ గారు ,
24fps , నవతరంగం మల్లె మీరు మొదలు పెట్టబోయె Prakamya కూడ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను …
విజయ్ నామోజు .
శిద్దారెడ్డి వెంకట్ December 27, 2008 /
శాస్త్రి గారూ,
అయితే మీరన్నట్టు సినిమా పరిశ్రమ వాళ్ళ చేత రాయించాలని నేను చాలా ప్రయత్నాలే చేశాను. కానీ ఒక్కటీ సక్సెస్ కాలేదు. వచ్చే సంవత్సరం నేను ఇండియా వెళ్ళాక పరిశ్రమ వాళ్ళ చేత స్వయంగా కాకపోయినా వాళ్ళ కాళ్ళావేళ్ళాపడైనా ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని వ్యాసాలు ప్రచురింపచేసే ఆలోచన ఉంది. ముఖ్యంగా వంశీ, విశ్వనాథ్. ఇక వాలంటరీ కాంట్రిబ్యూషన్ అంటే అర్థం కాలేదు.మీరన్న కాంట్రిబ్యూషన్ వ్యాసాలైతే నవతరంగంలో ఎవరైనా రాయొచ్చు. PFC లో లాగే మన దగ్గరా గెస్ట్ ఆర్టికల్స్ బాగానే వస్తున్నాయి. గెస్ట్ ఆర్టికల్స్ ఎలా పంపాలో ఇక్కడ చూడండి. http://navatarangam.com/membership/
మీరు నవతరంగం కి ఆర్థికంగా కాంట్రిబ్యూట్ చేసే విషయం గురించి అన్నట్టైతే అదీ చేశాం ఈ మధ్య. http://navatarangam.com/support/
మీ అభిమానానికి ధన్యవాదాలు. వీలైతే ఈ సైటు గురించి మరింత మందికి తెలియచేయమని ప్రార్థన.
@మహేశ్ చాలా పెద్ద మాటనేశారు. ఏదో సంవత్సరం క్రితం ఒక అర్థ రాత్రి పుట్టిన క్రేజీ ఐడియాని ఇంప్లిమెంట్ చెయ్యడం దగ్గర్నుంచి, ఇప్పుడు రోజుకి రెండు మూడు వ్యాసాలు మనం ప్రచురిస్తున్నామంటే అందులో నా శ్రమ కొంత శాతమే. మొదట్లో అన్నీ నేనే అయ్యి నోటికొచ్చిందల్లా రాసి నా ఆర్టికల్స్ సంఖ్యను పెంచాను కానీ గత మూడు నెలల్లో నేను రాసిన వ్యాసాల సంఖ్య చూస్తే తెలుస్తుంది ఇప్పుడు నవతరంగంలో నాది మరీ అంత భారీ పాత్ర కాదని. మొదట్లో పడ్డ శ్రమకు ఇప్పుడు ఫలాలు లభిస్తున్నాయి. జనాలు రాస్తుంటే హాయిగా కూర్చుని చదుకుంటూన్నా. త్వరలో నా పాత్రను మరింత డైల్యూట్ చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక్కరి మీద అధారపడి నడవకూడదని నా అభిప్రాయం. అందుకే సైటు నిర్వహణలో నేను చేసే కొన్ని పనులు త్వరలో వర్క్ షేరింగ్ చేసుకోగలిగే నవతరంగం సభ్యులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ కొంత మంది పని మొదలుపెట్టారు కూడా.
@రాజేంద్ర,పూర్ణిమ, సైఫ్, శంకర్, సౌమ్య, గిరి
మీ అభిమానానికి ధన్యవాదాలు. |
ఇక్కడ మీ అందరికీ ఒక రహస్యం చెప్పాలి. నా గురించి ఎకనామిక్ టైమ్స్ లో కానీ వావ్ హైదరాబాద్ లో కానీ రావడానికి కారణం మన ఎవర్ స్మైలింగ్ ఇస్మాయిల్ గారు. ఆయన 2007 లో నన్ను దేశీ పండిట్ ని చెయ్యకపోతే నా గురించి ET, WOW వాళ్ళకి తెలుసుండేదే కాదు. అదే కాకుండా ఇస్మాయిల్ గారు నన్ను గుర్తించి నాకు దేశీ పండిత్ బాధ్యతలు అప్పచెప్పినప్పటినుంచే నాకూ ఏదో చెయ్యొచ్చనిపించింది. ఆ విధంగా ఈ క్రెడిట్ అంతా మన స్మైల్ గారికే.
నేనేం యుద్ధం చేసానండీ బాబూ గెలవడానికి. మీరన్నట్టే మొదట్లో నవతరంగం ఒక సాహసమే అనుకున్నాను నేను కూడా. అప్పట్లో జల్సా సినిమా బాగోలేదని నవతరంగంలో ఒక వ్యాసం వస్తే నాకొచ్చిన బెదిరింపు మైల్స్ చూసి అవును నవతరంగం పెద్ద సాహసమే అని భయమేసింది కూడా. అయినా ఒకప్పుడు నవతరంగం అంటే మన సినిమాల్ని తిడ్తూ రాసే ఒక సైటని పేరుండేది. ఇప్పుడా అప్రతిష్ట లేనట్టే. అందరూ చక్కగా ఎవరుకి నచ్చిన/నచ్చని వాటి గురించి వాళ్ళు రాసుకుంటూన్నారు. అయితే మీరన్నట్టుగా సాహసం కాదు కానీ త్వరలోనే నవతరంగం ద్వారా మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టాను. కొత్త సంవత్సరంలో ప్రకటన చేస్తాను.
నీకు తెలియనిదేముంది బావా. నేను డెసిషన్ తీసుకోవడానికి ఆలస్యం లేదు.నీకు తెలుసుగా పరిస్థుతులు:-)
@వెంకట్: “ఎవరో ఒకరు… ఎపుడో అపుడూ… నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు” అన్నట్లు నువ్వు మొదటి అడుగువేసావ్. ముందుండి నడిపించావ్. ఇప్పుడు कारवां बन्ता जा रहा है కానీ మొదటి అడుగు మొదటి అడుగేగా!
రెండుచింతల భానుప్రసాద్ December 28, 2008 /
మేడేపల్లి శేషు December 29, 2008 /
వెంకట్ గారూ, మీ గురించి ఇప్పటివరకూ నాకు తెలియని ఎన్నో విషయాలు ఎకానామిక్ టైమ్స్ ఆర్టికల్ చదవటంవల్ల తెలిశాయి. సినిమా నిర్మించాలనుకునే వాళ్లకు సృజనాత్మకతతో పాటు సాంకేతిక జ్ఞానం కూడా తోడైతే చెప్పవలసిందేముంది? అది మీకు ఒక added advantage. మీరు నిర్మించబోయే విభిన్నమైన సినిమాకోసం ఎదురు చూస్తుంటాం. ‘నవతరంగం’ నిర్మాణానికి మీరు చాలా బలమైన పునాదులే వేశారు (మేమంతా – రాసేవాళ్ళం, రాళ్ళు ఎత్తే కూలీలైతే చక్కని భవన నిర్మాణానికి ఎంతో కాలం పట్టదు). నేనైతే ‘నవతరంగం’ ద్వారా చాలా తెలుసుకుంటున్నాను.
ఇక, ఫిల్మ్ మేకింగ్ గురించి కనీసం కొంతమంది మంచి దర్శకులతో రాయించాలన్న మీ ఆలోచన ఆచరణలో పెడితే నిజంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక సత్యజిత్ రాయ్ పుస్తకాల్లా మన తెలుగులో ఏమున్నాయి చెప్పండి. ఒకవేళ ఉంటే, అవి కేవలం నటీనటులను విపరీతంగా పొగిడే రకం పుస్తకాలే ఉన్నాయి. కాని ‘సినిమా కళ’ గురించి తెలియజెప్పే పుస్తకాలు లేవనే చెప్పాలి. కనీసం ‘నవతరంగం’ లో ఈ కోణంలో వచ్చిన కొన్ని ముఖ్యమైన వ్యాసాలైనా ఒక పుస్తకంగా వేస్తే బాగుంటుంది.
వెంకట్ గారు, మీకు హార్థికాభినందనలు.
వెంకట్ గారూ,
మీ వెనక ఇంత స్టొరీ ఉందని అసలు తెలీదండీ 🙂 మొత్తానికి.. బోలెడు విషయాలు తెలిసాయి 🙂
మీకు అభినందనలు.. ఈ సంవత్సరంలో ఇంకా ఎన్నెన్నో విజయాల్ని మీరు సొంతం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
బి.పవన్ కుమార్ on అరువి – ఉప్పొంగే జలపాతం
Bala on అర్జున్రెడ్డి నాకెందుకు నచ్చిందంటే..! – 1 (తనను తాను ధ్వసం చేసుకున్న వీరుడు)
GSReddy on అర్జున్రెడ్డి నాకెందుకు నచ్చిందంటే..! – 1 (తనను తాను ధ్వసం చేసుకున్న వీరుడు)
jai on అర్జున్రెడ్డి నాకెందుకు నచ్చిందంటే..! – 1 (తనను తాను ధ్వసం చేసుకున్న వీరుడు)
నవతరంగం Copyright © 2018. |
విక్రమ బేతాళ కథలు
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు పై నుంచి శవాన్ని దించి, భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ‘రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచారిస్తున్నావో నాకు బోధ పడడం లేదు. బహుశా ఎవరికైనా న్యాయం చేయటానికో లేక ఎవరి ప్రాపకం సంపాదించడానికో ఈ పనికి పూనుకున్నవేమో! ఎవరి ప్రాపకం కోసం ఈ పని చేస్తున్నావేమో కానీ, ఆ కార్యం నువ్వు కష్టపడి నెరవేర్చినా, వాళ్ళు నీ నిజాయితీని నమ్మకపోవచ్చు. పూర్వం తను దొంగ కాకున్నా వట్టి పుణ్యానికి అనుమానించబడ్డ ఒక వేటగాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను,’ అని కథ చెప్పసాగాడు.
ఓ నెల తర్వాత ‘దసరా పండగ వస్తుంది. ఇంట్లోకి సరుకులు, పిల్లలకు మనకు బట్టలు తీసుకురండి,’ అంది భార్య. ‘మనవద్ద దాచిపెట్టిన డబ్బులెేం లేవు. ఈ గొలుసు అమ్మి తెస్తాను,’ అని చెప్పి పట్నానికి బయలుదేరాడు. నేరుగా కంసాలి కనకయ్య దుకాణానికి వెళ్లి, గొలుసు చూపించి ‘దీన్ని తీసుకుని వచ్చినంత డబ్బివ్వండి,’ అనడిగాడు.
కంసాలి కనకయ్య ఆ గొలుసుని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది తను చేసిందే. ఏడాది క్రితం దాన్ని మురారికి ఇచ్చాను. నెల నుంచి అతడు కనిపించడంలేదు.
అయ్యా, ‘నా భర్తను ఇతడే చంపేసి ఉంటాడు. ఇంత ఘాతుకానికి పాల్పడిన ఇతగాడికి మరణదండన విధించి నా గొలుసు నాకిప్పించండి. నా భర్త జ్ఞాపకార్థం దానిని అట్టిపెట్టుకుంటాను’ అని ఆమె కన్నీళ్లు పెట్టుకుని న్యాయాధికారిని వేడుకొంది.
తన ఎదుట నిర్భయంగా నిలబడ్డ బసవయ్యతో, ‘ఈ నగ నీకు ఎక్కడిది? నిజం చెప్పు!’ అని అడిగాడు న్యాయాధికారి.
‘అయ్యా! ఉదయమే నేను వేటకు వెళుతుంటే, జంతువులు తినేసిన సగం మనిషి శవం దారి పక్కన కనబడింది. ఆ పక్కనే ఈ గొలుసు పడి ఉంటె తీసుకున్నాను. సొంతదారుకు ఇద్దామన్నా అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు కుటుంబ అవసరాల కోసం అమ్ముదామని వస్తే, భటులు నన్ను పట్టుకుని, దొంగ అని మీ ఎదుట నిలబెట్టారు,’ అన్నాడు బసవయ్య సదురు బెదురూ లేకుండా.
‘అయ్యా! నేను వేటగాడినే కానీ, దొంగను కాను. నన్ను నమ్మండి, కావాలంటే మీరుపరీక్షించుకోవచ్చు,’ అన్నాడు బసవయ్య.
‘నా వెంట అడవికి రండి. జంతువుల్ని, నాకు నగ దొరికిన స్థలాన్ని కూడా చుపిస్తాను,’ అన్నాడు బసవయ్య ధీమాగా.
‘నిజమే, నువ్వు వేటగాడివే అని నమ్ముతున్నాను. స్థలం చూపించు,’ అన్నాడు న్యాయాధికారి.
‘అదుగో, మనిషిని చంపిన పులి వస్తుంది. కనుకే మాటు వేసుకుని కూర్చుంది మరో మనిషి కోసం. మీరు చెట్టెక్కండి,’ అని బసవయ్య వాళ్ళను చెట్టెకించాడు. తర్వాత అతడు కూడా ఆ చెట్టు ఎక్కి బాణం సిద్ధంగా పట్టుకుని కూర్చున్నాడు.
కాస్సేపటికి పులి వాళ్ళు కూర్చున్న చెట్టు కిందకి వచ్చి, మనుషుల్ని అందుకోవడం కోసం, చెట్టుపైకి ఎక్కడానికి ప్రయత్నించసాగింది.
బసవయ్య బాణం సంధించి, పులి మీదికి సూటిగా వదిలాడు. డొక్కలో దిగిన బాణంతో, పులి పెద్దగా అరుస్తూ కొద్ది దూరం వెళ్లి నేల మీద పడి చనిపోయింది. అందరూ చెట్టుమీద నుంచి దిగారు.
అప్పుడు న్యాయాధికారి బసవయ్యను మెచ్చుకోలుగా చూస్తూ, ‘నువ్వు దొంగవై ఉంటె మమ్మల్ని చంపేసి, మా మెళ్లో ఉన్న ఈ బంగారాన్ని కూడా తీసుకునేవాడివే. కానీ నువ్వు నిజమైన వేటగాడివి. నిన్ను అనవసరంగా అనుమానించినందుకు బాధపడుతున్నాను. మా ప్రాణాల్ని కూడ రక్షించినందుకు, నీకు బహుమతి గా ఈ హారం ఇస్తున్నాను తీసుకో,’ అని తన మెళ్లోఉన్న బంగారు గొలుసును వేటగాడి మేడలో వేశాడు.
‘అయ్యా! మీరు నన్ను వేటగాడిని నమ్మినందుకు సంతోషం. కానీ ఈ మాటలు ఇక్కడ కాదు. మీ న్యాయస్థానం లో పది మంది ముందు చెప్పండి,’ అని గొలుసు తిరిగి ఇచ్చివేశాడు బసవయ్య. న్యాయాధికారి అతని తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు. ఆ విధంగానే తనతోపాటు అతడిని తీసుకువెళ్ళి, సభ ఏర్పాటు చేశాడు.
అనంతరం న్యాయాధికారి తన మేడలో గొలుసును తీసి, ‘మా ప్రాణాలను రక్షించినందుకు బసవయ్యకు ఈ చిన్ని బహుమతిని ఇస్తున్నాను,’ అని ప్రకటించి తన మేడలోని హారం తీసి, బసవయ్య మెడలో వేయబోయాడు.
‘అయ్యా! మన్నించండి. మీ కానుకను తీసుకోలేను. మాకు పండుగ సరుకులు, బట్టలు ఇప్పించండి చాలు. గొలుసు మాత్రం వద్దు,’ అని వేడుకున్నాడు.
బేతాళుడు ఈ కథ చెప్పి ‘రాజా, బసవయ్యను న్యాయాధికారి మొదట దొంగగా అనుమానించి తీసుకెళ్లాడా? అడవిలో గొలుసు ఇవ్వబోగా వేటగాడు ఎందుకు తీసుకోలేదు? న్యాయస్థానంలోనే ఎందుకు ఇవ్వమన్నాడు? న్యాయస్థానంలో ఇవ్వబోగా వద్దని సరుకులు, బట్టలు మాత్రమే ఎందుకు కోరాడు? బంగారం విలువ తెలియకనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వేయి వక్కలవుతుంది,’ అన్నాడు.
వెంటనే అమ్మితే న్యాయాధికారి బాధ అనిపించొచ్చు. జనానికి ఈర్ష్య, అనుమానం కలగొచ్చు. తన కుటుంబం గడపడానికి మాత్రమే సరుకులు కావాలి. బంగారం ఎప్పుడూ కోరుకోలేదు. అందుకే హారం వద్దని సరుకులు, వస్త్రాలు మాత్రమే ఇప్పించమని అడిగాడు.
న్యాయాధికారి మురారి భార్యకు భర్త హరం ఇప్పించి, వేటగాడికి కావలసిన వస్తువులు కూడా ఇప్పించి, ఇద్దరికీ సరైన న్యాయం చేశాడు,’ అని చెప్పాడు.
బేతాళుడికి సరైన సమాధానం లభించడంతో శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. |
తాజా వార్తలు
లైఫ్ స్టైల్
ఫోటో గ్యాలరీ
ఫ్లాష్ న్యూస్
హీరో ప్రభాస్కి ఛాలెంజ్ విసిరిన తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హరితాహారం పథకంలో భాగంగా సినీ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్లతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత దిల్ రాజు మొదలైన వారికి "గ్రీన్ ఛాలెంజ్" విసిరారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హరితాహారం పథకంలో భాగంగా సినీ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్లతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత దిల్ రాజు మొదలైన వారికి "గ్రీన్ ఛాలెంజ్" విసిరారు. హరితహారం నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నలుగురికీ ఆదర్శంగా నిలవమని కోరుతూ మంత్రి ఈ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ను ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నుండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు.
ఇటీవలి కాలంలో తెలంగాణలో "గ్రీన్ ఛాలెంజ్" చాలా పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సచిన్ టెండుల్కర్, ఎస్ ఎస్ రాజమౌళి, కేటీఆర్ లాంటి వారందరూ ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు కూడా నాటారు. తాజాగా ఈ ఛాలెంజ్ విసిరిన తలసాని మాట్లాడుతూ " హరితహారం పేరుతో సీఎం చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటాం. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించే బాధ్యత మనమీదే ఉంది. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి" అని తెలిపారు.
హరితహారం అనేది తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. హరితహారం పథకం 2015లో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేత అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో రాష్ట్రం మొత్తం మొక్కలను నాటి, పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016లో ఈ కార్యక్రమంలో భాగంగా 46 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. హైదరాబాద్ నగరంలో కూడా ఒక్కరోజులోనే దాదాపు 25 లక్షల మొక్కలు నాటారు. ఒకేరోజు లక్షమంది 163 కిలోమీటర్ల పొడవునా నిలబడి మొక్కలు నాటి రికార్డు సృష్టించడం జరిగింది.
రూ. 64 లక్షల కరెంట్ బిల్లు కట్టలేక మరణిస్తే.. ఆ హీరో ఏం చేశాడు?
కామెంట్ చేయండి
ట్రెండింగ్ న్యూస్
జార్జియా షెడ్యూల్కి సైరా టీమ్ ప్యాకప్
'హలో గురు ప్రేమకోసమే' సినిమా రివ్యూ
ఇండిగో ఎయిర్ హోస్టెస్కి వేధింపులు.. ప్రయాణికుడు అరెస్టు
రూ.500 ఇస్తూ స్కూలు పిల్లలను.. క్రైస్తవులుగా మారుస్తున్న డాక్టర్ అరెస్టు
టాలీవుడ్ చిత్రంలో హీరోగా.. గల్లా జయదేవ్ కుమారుడు
తిరుపతి లడ్డూలకు.. మళ్లీ గ్రహణం పట్టింది..!
శ్రీకాకుళం ప్రజలను అధికారులు బెదిరిస్తే.. తోలు తీస్తా: పవన్ కళ్యాణ్
తదుపరి కథనం
tewiki కొలిన్ కౌడ్రి |
మీ career కోసం బ్లాగింగ్ ఎందుకు చెయ్యాలి?
నేను బ్లాగింగ్ ద్వారా బతుకుతున్నాను అని తెలిసి, చాలా మంది వారిని కుడా గైడ్ చేయమంటున్నారు.వారం రోజులుగా నా మెసేజ్ బాక్స్ ని హోరెత్తిస్తున్నారు.
బ్లాగింగ్ , డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ , నా పర్సనల్ లైఫ్ వలన ఒక్కొకరికి బ్లాగ్ మీద ట్రైనింగ్ చెప్పటం కుదరని పని. అందుకే అందరికి ఉపయోగపడేలా ఆర్టికల్స్ రాస్తున్నాను. కొద్దిగా ఓపిక పట్టండి.
బ్లాగింగ్ లో మొదటి స్టెప్ Long Term Goal ఉండి ..సీరియస్ గా తీసుకోవటం. ఏదో ట్రై చేద్దాములే అనుకునే వారు అసలు బ్లాగ్ మొదలుపెట్టకపోవటం ఉత్తమం.
మరి మీరు బ్లాగ్ పట్ల నిజంగా పట్టుదలగా ఉంటె చేయవలసిన మొదటి పని మంచి వెబ్ హోస్టింగ్ తీసుకోవడం.
ఈ రొండు వారాలలో నేను కింద Refer చేసిన బ్లాగ్ హోస్టింగ్ తీసుకొని రెడీ గా ఉంటె ..వెబ్ హోస్టింగ్ తీసుకున్న వారికి మే నుండి ప్రత్యెకమయిన ఆర్టికల్స్ ద్వారా చెపుతాను. వారికి ప్రత్యెక మెయిల్స్ పంపుతాను.
బ్లాగింగ్ నేర్పడానికి నేను రెడీ…మరి మీరు రెడీ నా ?
మీకు బ్లాగ్ మొదలుపెట్టె ఆలోచన ఉంటె మాత్రం ఈ వారం నుండి నాతో బ్లాగ్ ప్రయాణం మొదలుపెట్టండి. బ్లాగ్ కి పేరు(Domain) , బ్లాగ్ కోసం ఒక వెబ్ హోస్టింగ్ (web hosting) తీసుకోండి.
బ్లాగింగ్ కోసం మీరు Bluehost కంపెనీ వారి web hosting ఈ లింక్ ద్వారా తీసుకోండి. ఇండియాలో చాలా మంది ప్రముఖ ప్రొఫెషనల్ బ్లాగర్లు బ్లాగింగ్ కోసం వాడే సర్వీస్ ఇది.
మీరు ఈ లింక్ ద్వారా హోస్టింగ్ తీసుకుంటే నాకు కంపెనీ వారు Referral మనీ ఇస్తారు. మీరు నా లింక్ ద్వారా కొన్నారు కాబట్టి దానికి కృతజ్ఞతగా నేను మీకు ఫ్రీ గా ఆ సర్వర్ లో Blog Software WordPress Install చేసి ఇస్తాను. అలానే ముఖ్యమయిన నాలుగు Plugins కుడా Install చేసి ఇస్తాను.
మీకు హోస్టింగ్ తీసుకోవటంలో ఏదయినా Confusion ఉంటె https://www.facebook.com/smartteluguofficial లింక్ లో నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు help చేస్తాను.
మీరు నా లింక్ ద్వారా బ్లాగ్ తీసుకుంటే నాకు మీ వివరాలు application DashBoard లో తెలుస్తాయి. అది చూసి నేను మీకు Free WordPress Install సర్వీస్ అందజేస్తాను.ఆ తరువాత నా ఆర్టికల్స్ ఫాలో అవుతూ బ్లాగింగ్ నేర్చుకోండి.
నేను ఇచ్చిన లింక్ ద్వారా web hosting కొన్న వారిని మాత్రం ప్రత్యేకమయిన గ్రూప్ గా మార్చి వారితో నెలకు ఒక మీటింగ్ పెడతాను.
నువ్వు కొనమన్నావు అందుకే కొన్నాము అని “బ్లాకు మెయిల్” మాత్రం చేయకండి. ప్రత్యేకంగా ఎవరికీ బ్లాగింగ్ నేర్పే టైం నాకు లేదు. ఏదయినా సరే ……ఆర్టికల్ ద్వారా , మీటింగ్ ద్వారా చెపుతాను.
బ్లాగర్ గా సెటిల్ అవ్వాలి అంటే ముందు మంచి attitude ,నడవడికా ఉండాలి. ఓపికా , సహనం, సబ్జెక్టు మీద పరిజ్ఞానం ఉన్న వారు మాత్రమే బ్లాగింగ్ ద్వారా మనీ ,పేరు సంపాదించగలరు.అది ఆలోచించుకొని బ్లాగింగ్ మొదలుపెట్టండి.
ఇక కెరీర్ ఏదయినా సరే, బ్లాగ్ ఎందుకు అవసరమో మీకోసం :
సినిమా రైటర్ వా? ఫుడ్ అంటే పిచ్చా? ఫాషన్ ఇండస్ట్రీ అంటే మక్కువా? నీకు తెలిసిన టెక్నాలజీ సబ్జెక్టు నీ ఫ్రెండ్స్ కు తెలియదా ? ఎక్కడ ఏ ఆఫర్ ఉందో ఇట్టే చెప్పేస్తావా ? హెల్త్ గురించి బాగా తెలుసా ? Boutique మీద ఇంట్రెస్ట్ ఉందా? చాక్లెట్ లు,కేకులు తయారు చేస్తారా ?
బుర్రలో గుజ్జు ఉంటె ఎం లాభం? నీ టాలెంట్ అందరికి తెలియాలి కదా.
కెరీర్ ఏదయినా కావచ్చు, నిన్ను నువ్వు ప్రపంచానికి తెలియజేయాలి అంటే మాత్రం బ్లాగింగ్ చెయ్యాలి.
డాక్టర్,లాయర్, షాప్ ఓనర్, వెబ్ సైట్ కంపెనీ , మార్కెటింగ్ కంపెనీ,రిటైల్ బ్రాండ్ షాప్ ..ఇలా వ్రుత్తి ఏదయినా సరే, దానికి కస్టమర్ కావాలి. మరి అలాంటి కస్టమర్ కి నీ పనితనం తెలియాలి అంటే మాత్రం బ్లాగింగ్ చెయ్యాలి.
అది ఆర్టికల్ కావచ్చు…వీడియో కావచ్చు. ఫోల్లోవేర్లను పెంచుకో. ఎవడో ఛాన్స్ ఇస్తాడు అని ఎదురుచూడటం ఆపెసేయి. నీ టాలెంట్ నాలుగు గోడల మధ్య ఒకడి ముందు కాదు…ప్రపంచానికి తెలియజెయ్యి.
ఆ” ఒక్క ఛాన్స్ ” కోసం :
ఒక్క సినిమా ఛాన్స్ ….కొన్ని వేల మంది ఈ మాట మనసులో అనుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ వస్తే నా టాలెంట్ చూపిస్తా అనుకుంటారు. ఛాన్స్ ల కోసం తీరుగుతారు.
అలా కొంతమందికి యొఉతుబె దొరికింది. ఇంకొంతమందికి ఫేస్ బుక్ దొరికింది.మరి బ్లాగ్ కుడా అంతే…నీ ఆర్ట్ ని అక్షరాలలో చూపించి ఆ ఒక్క ఛాన్స్ నీ దగ్గరకే వచ్చే తట్టు చేసుకో.
బిజినెస్ కోసం :
కస్టమర్ దగ్గరికి మనం వెళతాం పాత పద్ధతి. కస్టమర్ మన దగ్గరికి రావటం “స్మార్ట్ ” పద్ధతి. బ్లాగ్ ద్వారా నీ బిజినెస్ టిప్స్ చెప్పు. కస్టమర్ కి అవసరమయిన ఇన్ఫర్మేషన్ అందజెయ్యి. బిజినెస్ అంటే డబ్బులు మాత్రమే కాదు…కస్టమర్ కుడా.
ఉద్యోగం కోసం :
ఇప్పుడు కంపెనీలు సోషల్ మీడియా లో నీ ప్రొఫైల్ చూసి ఇంటర్వ్యూ కి పిలుస్తున్నాయి. మరి ఈలాంటి టైం లో నీ టాలెంట్ బ్లాగ్ ద్వారా నీ సబ్జెక్టు చూపించు.
నీకు బాగా వచ్చిన సబ్జెక్టు మీద బ్లాగ్ రాయి…రీడర్స్ ని పెంచుకో. అప్పుడు కంపెనీలే నీకు ఎదురువస్తాయి.
నేను చదివి 3 ఇయర్స్ నుండి కాలిగా ఉన్నాను.ఏమి చెయ్యాలో తెలియట్లేదు అని చాలా మంది బాధ. |
నీలో ఏదో ఒక ఆర్ట్ ఉంటది.దానిని బయటకు తీయి. BTech, MBA చదినంతమాత్రాన నువ్వు కేవలం జాబ్ మాత్రమే చెయ్యాలి అని లేదు. బ్లాగ్ ద్వార్ నీ ఆర్ట్ చూపించి పని తెచ్చుకో.నీలో సబ్జెక్టు ఉంది అని తెలిస్తే పని అదే దొరుకుతుంది.
ధైర్యం కోసం :
అమెరికా వెళ్ళామనో , పిల్లలు పుట్టారు అనో, చాలా మంది మహిళలు చేస్తున్న ఉద్యోగం ఆపేస్తారు. చదువుకున్న చదువుని అటకేక్కిస్తారు.
ఫాషన్ కావచ్చు , వంటలు కావచ్చు , టెక్నికల్ సబ్జెక్టు కావచ్చు….బ్లాగ్ రాయండి. పేరు కోసమో..డబ్బు కోసమో కాదు.
మీరు కేవలం ఇంట్లో పని చేయటానికి మాత్రమే ఉండలేదు అనే ధైర్యం కోసం.
మరి బ్లాగ్ మొదలుపెడతారా ? ఈ లింక్ లో హోస్టింగ్ తీసుకోండి. నాకు మెసేజ్ పెట్టండి. నేను వెబ్ హోస్టింగ్ తీసుకునే క్రమంలో హెల్ప్ చేస్తాను.
Previous articleవెబ్ సైట్ పేరు ఇక స్మార్ట్ గా Select చేసుకోండి.
Next articleబ్లాగ్ మీద మనీ నిజమేనా ?
బిజినెస్ లో జరిగిన పొరపాట్లను ఎలా ఎదుర్కోవాలి ?
విజయవంతమైన బిజినెస్ విలీనం కోసం కొన్ని టిప్స్
ఫుల్ టైం జాబ్ చేస్తుండగా బిజినెస్ ప్రారంభించటానికి కొన్ని టిప్స్
మీ బిజినెస్ ను అమ్మబోయే ముందు మీరు పరిగణించవలసిన అంశాలు
మార్కెటింగ్ లో సృజనాత్మకతను జోడించేందుకు కొన్ని టిప్స్
ఒకడికి ఐడియా ఉంటది కాని, ఆ ఐడియాని ఆన్ లైన్ బిజినెస్ గా ఎలా మలచాలో తెలియదు. అలాంటి వారికి ఆన్ లైన్ బిజినెస్ ఎలా మొదలుపెట్టాలి, ఎలా చేస్తే మంచిది లాంటి పలు విషయాలు ఈ బ్లాగ్ లో దొరుకుతాయి.ఇంకోకిడికి బిజినెస్ ఉంటుంది కాని, దానిని ఆన్ లైన్ లో మార్కెట్ ఎలా చేసుకోవాలో తెలియదు.అలాంటి వారికి ఆన్ లైన్ మార్కెటింగ్ టిప్స్. బ్లాగింగ్ ఎలా చెయ్యాలి. బ్లాగింగ్ నుండి మనీ ఎలా సంపాదించవచ్చు అనే సంగతులు. ఆలానే ఇంటర్నెట్ ద్వారా నలుగురుకి ఉపయోగపడుతున్న తెలుగు వారి గురుంచి ఈ బ్లాగ్ లో వివరించటం జరుగుతుంది.
© All Rights reserverd to Smartlyweb Technologies Pvt Ltd గూగుల్ లో దొరికే కోడ్ తో కాకుండా తెలుగు మీద ఇష్టంతో చేసాము
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.
క్లిక్ చెయ్యండి! |
చింతలపూడి పోలీస్ స్టేషన్
లో డెవిల్ యొక్క చేతి కర్ర యొక్క యువ ఆకులు (హెర్క్యులెస్-క్లబ్, Aralia స్పినోసాను) క్రీక్ పార్క్ లిక్. కళాశాల స్టేషన్, టెక్సాస్, ఏప్రిల్ 1, 2010.
తెలుగు: Chaabe
ఎందరో మహానుభావులు ..
🙎♀️అప్పట్లో ఒకడుండేవాడు ! మొన్నీ మధ్య FB లో మళ్ళీ కనిపించాడు !
👩🎤అంటే topless గా బైక్ మీద తిరుగుతున్న రౌడీ విజయ్ దేవరకొండ లాగానా ?
🙎♀️కాదు .. 4th క్లాస్ లో వేళ్ళాడుతున్న నిక్కరుని గట్టిగ పట్టుకుని , టీచర్ ప్లీజ్ అర్జెంటు .. అంటూ “దైన్యం” అనే పదానికి pictorial ఇమేజ్ లా నిలబడ్డ వాడిలా !
👩🎤ఓహో ! స్కూల్ డేస్ ఆ ! ఇంతకీ ఏం జేశాడు ?
🙎♀️నా మనోభావాలు దెబ్బ తీసాడు , నా భావ వ్యక్తీకరణ స్వేచ్చని అణచేసాడు ?
👩🎤హౌ ? ఎలా?
🙎♀️8థ్ క్లాస్ లో నీ favourite సబ్జెక్టు ఏంటి అని అడిగితే , “తెలుగు” అని చెప్పా, “ఎందుకు ? “ అని టీచర్ అడిగింది .
“ఎందుకంటే బాగా భట్టీ పెట్టొచ్చని ” అని వెనక నుండి అరిచి క్లాసంతా ఘొల్లుమని నవ్వేలా చేసాడు . అలా దారుణంగా నా మనో భావాలను దెబ్బ తీసాడు .
🙎♀️10th క్లాస్ లో టీచర్ అప్పజెప్పమంది కదా అని, నా కిష్టమైన పద్యమని ఆనందంగా
🙎♀️అరువు తెచ్చుకున్న బాలమిత్ర పుస్తకం చదివి inspire అయ్యి , స్కూల్ lawn లో ఉన్న గడ్డిపువ్వుని చూస్తూ ….
“ పచ్చల దీవిలో , ముత్యపు చినుకు “ అని ఎదో వర్ణన మనసులో అనుకుంటోంటే , చట్టుక్కున వచ్చి ,
“ A B C D ఎప్ఫు .. మీ తాత తలకాయ టప్పు ” అని పుట్టుకున్న ఆ గడ్డిపువ్వుని తెంపి నా మనో భావాలను దెబ్బ తీసాడు .
👩🎤ఇప్పుడేం చేస్తున్నాడు ?
🙎♀️నన్ను భట్టీ queen అన్నవాడు, ఆ పై విజయవాడలో మూడేళ్లు ముక్కు మూసుకుని భట్టీయం వేసి జీవితం లో సెటిల్ అయినాడు .
👩🎤ఇప్పుడు ఎం చేద్దామనీ ?
🙎♀️debate లో కూర్చోపెట్టి నా భావ వ్యక్తీకరణ స్వేచ్చని తొక్కేసి , మనోభావాలని దెబ్బ తీసినందుకు చర్చిద్దాము అని 4 స్టూడియోలకి కాల్ చేసా .. అందరూ బిజీ అంట .
👩🎤చివరికి ఎం జేసావ్?
🙎♀️ఏం జేస్తాం .. కాస్త చింతపండు, పీతాంబరి తీస్కుని వాడి మొహం లా మట్టి గొట్టుకు పోయిన రాగి కూజా తీస్కుని , నా కోపం పోయే దాకా తోమి తోమి ఇలా చేశా !
🙂 అమ్మాయ్ ,అన్నీ సిద్ధంగా ఉంచుకున్నావా ? నేను టైం అంటే టైమే . ఆనక తిరిగి మళ్ళీ నన్ను శాడిస్టు , సైకో అంటే ఒప్పుకోను చెప్తున్నా !
🙋♀️ అబ్బా సరేలే , ప్రతి సారీ అలాగే చేస్తానా ఏంటి ! ఈసారి చూస్కో నా ప్రతాపం .
😏 ఏమో , మీ జాతిని ఎవరు నమ్మొచారు . ఓడ దాటే దాకా ఓడ మల్లన్నా , ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్నా అనే రకం . ఎన్ని యుగాల నుండి చూడట్లేదూ .
సర్లే కానీ , నేను రెడీ మరి .. నువ్వు?
💁♀️ వో ఎస్ … ఎప్పుడో రెడీ ! dont be silly ya .
💁♀️ వేసేసా
💁♀️ వేసేసా … సో ఈజీ ఐ సే .
🙄 సర్లే చానా జూసాం కానీ … పోపు గింజలు, వెల్లుల్లి ,ఎండు మిరపకాయలూ ?
🙋♀️ వేసేసా … ఏమనుకున్నావ్ మరి నేనంటే !
🤨 మరి కరేపాకో ???
🤓 మరదే నే ముందే చెప్పా … మాటంటే మాటే ..టైమంటే టైమే అని ! నా వల్ల కాదు అమ్మడు … ఆగలేను … వేగిపోతున్నా ఇక్కడ .
🙍♀️ ప్లీజ్ ప్లీజ్ .. ఇదుగో ఫ్రిడ్జ్ డోర్ తెరిచా ,వెతుకు తున్నా … ఏడ చచ్చిందో ఇది ఈ మహారణ్యం లో ! కనపడదే !
🤪 ఇహ ఆగడం నా వాళ్ళ కాదు అమ్మడోయ్ !
🙍♀️ ప్లీజ్ నా బుజ్జివి కదూ , ఒక్క అర నిమిషం … నీకు బంగారు చెవులు చేపిస్తా .. నీ పీఠానికి వెండి తొడుగు చేపిస్తా . . జీవితాంతం కలిసి మెలిసి కాపురం చెయ్య వలసిన వాళ్ళం .. ఇదిగో వచ్చేస్తున్నా !
ఆ దొరికింది … కొత్తిమీరకీ బెండకాయలకి మధ్యలో నక్కింది .. రా బయటికి రా !
ఇదిగో కరివేపాఆఆఆఆఆ …
😔 అయిపొయింది అమ్మడూ , అంతా అయిపోయింది … మాడి మసైపోయింది నీ పోపు.
🙆♀️ ఛీ పో ఎప్పుడూ ఇంతే నువ్వు , ఇంత దుర్మార్గం నే నెక్కడా చూడలేదు .. మరీ ఇంత కాఠిన్యం పనికిరాదు ..నిన్ను తప్ప వేరొకరిని ఇష్టపడను అనేగా నేనంటే అలుసు .. పో ..నీ ముఖం చూపించకు నాకు.. పొయ్యి ఆ సింకు లో పడీ ఏడువు !
అందుకే దేనిపై ఎక్కువ మమకారం పెంచుకో రాదు .
ఆమె: “అన్నాను ఈ పొద్దు రావొద్దు నువ్వని … రావొద్దనీ !
అతడు : మరే .. మంచి పని చేసావ్ .. new code release ఉంది , offshore కాల్స్ కూడా తీస్కోవాలి .. చాలా పనుంది .. థాంక్స్ యా !
ఆమె : “అన్నాను మా ఫోన్ లోని తొలికోడితో , నేను తొలికోడితో …
అతడు : మరి ..అంతగాక . పొద్దున్నే వెధవ డిస్టర్బెన్స్యూ ….క్విక్ గా ఒక జత ఇస్త్రీ , స్నానం , స్టేషనూ , 8.10 కి ట్రైనూ … ఓ 7.45 కలా లేపు చాలు !
ఆమె: ఇదిగో నీ పనంతా అయిపోయాక .. if at all … in case .. నే గుర్తొస్తే ఆదిలాబాద్ అడవులకి వచ్చెయ్ .. తపస్సు చేస్కుంటూ వుంటాను . |
జాతీయ వార్తలు
ప్రపంచ వార్తలు
Home తెలంగాణ
అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్రూం ఇల్లు
ఇటీవల దారుణ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృతవర్షిణిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. అమృతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జగదీశ్రెడ్డి ప్రకటించారు. అమృత భద్రత కోసం పోలీసులు అందుబాటులో...
పాతబస్తీ పురానీహవేలీలోని హెచ్ఈహెచ్ నిజాం మ్యూజియం నుంచి పురాతన, నిజాంకు చెందిన పసిడి వస్తువులైన 1950 గ్రాముల టిఫిన్ బాక్స్, కప్పు–సాసర్, స్ఫూన్ దొంగతనం చేసిన దొంగలు పక్కా ప్రొఫెషనల్గా వ్యవహరించారు. రెక్కీ,...
కొద్ది సేపట్లో పెళ్లి.. వరుడిపై లైంగికదాడి కేసు
మరికొద్దిసేపటిలో పెళ్లి జరుగుతుందనగా వరుడిపై లైంగిక దాడి కేసు నమోదైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా, శోభనాద్రిపురం గ్రామానికి చెందిన యువతి హెరిటేజ్సూపర్...
నందమూరి హరికృష్ణ దుర్మరణం
ఎన్టీఆర్ కుమారుడు, హీరో నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స...
కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. అయినా కొడుకు, కూతురు ఉన్నారనే ధైర్యంతో అన్నీ తానై బతుకు బండిని ముందుకు సాగించింది. అకస్మాత్తుగా కొడుకు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించాడు. కన్న...
ఐ లవ్ యూ… నన్ను చంపొద్దు అని వేడుకున్నా..
ప్రియుడి మోజులో పడి భర్తనే కడతేర్చింది ఓ కసాయి ఇల్లాలు. పక్కా పథకంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడమే కాకుండా ఈ ఘటనలో ప్రియుడిని కేసు నుంచి తప్పించేందుకు తానే హత్య...
నగరంలోని మల్టీప్లెక్స్లు, సినిమా థియేటర్లపై తూనికలు కొలతల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ ఆదేశాలు జారీ...
బిగ్బాస్ : శ్యామల, నూతన్ నాయుడు రీఎంట్రీ
బిగ్బాస్ సీజన్-2 ఏదైనా జరగొచ్చు.. అన్నట్లే ప్రేక్షకులకు బిగ్బాస్ బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నాడు. సీజన్-1 కన్నా సీజన్-2పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎపిసోడ్లు...
ప్రజలకు సేవ చేసే నాయకులే అధికారంలోకి వస్తారు..
27నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహుని జయంతి ఉత్సవాలు
తొలి డబుల్ సెంచరీ చేసింది ఎవరు? సచిన్ కాదా?
నత్తలతో సంతోషం.. అది ఎలా!
అందుకే తెలంగాణ ఫలితాల తర్వాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడా?
‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్
ఫైనల్ కు దూసుకెళ్ళిన సింధు..
థూ నీ బతుకు చెడ.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తాజాగా చంద్రబాబు రచించిన వ్యూహం..
ప్రభుత్వం ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం…
జగన్ పార్టీ కార్యకర్తలకు ఆపద వస్తే ఏమాత్రం ఆలస్యం చేయరనడానికి ఇదే ఉదాహరణ
Home / 18+ / మగాడిని పడకపైకి ఆహ్వానించే ముందు.. స్ర్తీ ఇచ్చే సిగ్నల్స్ ఏమిటో తెలుసా..?
మగాడిని పడకపైకి ఆహ్వానించే ముందు.. స్ర్తీ ఇచ్చే సిగ్నల్స్ ఏమిటో తెలుసా..?
Previous ప్రజలకు చేరువలో ఎమ్మెల్యే శంకర్ నాయక్..!
Next తెలంగాణకు కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వండి..!!
విషయం తెలిసిన కొద్ది గంటల్లోపే చర్యలు తీసుకున్న జగన్.. అదే స్థానంలో చంద్రబాబు ఉంటే
టీఆర్ఎస్ ప్రకటనలో విజయ్ దేవరకొండ..సోషల్ మీడియాలో వైరల్
వైఎస్ జగన్కి ఒకే అంటే..వైసీపీలోకి ప్రస్తుత టీడీపీ మంత్రి
గూగుల్ షాపింగ్ పోర్టల్ లాంచ్…దుస్తులు, ఎలక్ట్రానిక్స్ తదితర ఉత్పత్తులు
ఏపీలో రుణమాఫీ అమలు కావడం లేదు -సీపీఐ నేత రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ సరిగా అమలు కావడం లేదని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. కౌలు రైతులకు రుణ ఉపశమన పత్రాలు ఇవ్వడం లేదన్నారు. రైతు సమస్యలపై బుధవారం తహసీల్దార్ కార్యాలయాల దగ్గర సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఏపీ సెక్రటేరియట్లో సీఎస్ టక్కర్తో రామకృష్ణ భేటీ అయ్యారు.
నమితతో శరత్ బాబు మూడో పెళ్లి...అసలు కారణం ఇదే _ Sarath Babu to marry Actress Namitha
®® Justintimberlakevevo ®® ఉచిత MP3 డౌన్లోడ్ |
కాణిపాకం, న్యూస్టుడే: ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తునికి దివ్యమైన దర్శనం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్తూరు ఆర్డీవో కోదండరామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ పరిపాలన భవనంలో జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ…. ఉదయం 6 గంటల వరకు… సాయంత్రం 6 గంటల తర్వాత వీఐపీల కోసం ప్రత్యేక సమయం కేటాయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక, ఉచిత దర్శనాలకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. చిత్తూరు, తిరుపతి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను తిప్పాలన్నారు. చిత్తూరు నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక్క బస్సు వచ్చే విధంగా చర్యలు తీసుకొంటున్నట్లు వివరించారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు మాట్లాడుతూ… రాష్ట్ర దేవాదాయ, ధర్మాశాఖ అధికారుల సూచనల మేరకు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పుష్ప, విద్యుత్తు దీపాలంకరణ చేపట్టడం లేదన్నారు. ఎక్కడా శుభాకాంక్షలు తెలిపే విధంగా ఏర్పాట్లు చేయడం లేదని వివరించారు. ఉదయం 3 గంటలకు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, వారికి అవసరమైన ప్రసాదాలు అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ద్విచక్ర వాహనదారుల కోసం ప్రత్యేక పార్కింగ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు మాట్లాడుతూ… 200 మంది సిబ్బందితో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ కీర్తి, చిత్తూరు వెస్ట్ సీఐ ఆదినారాయణ, కాణిపాకం సర్పంచి కేసీ మధుసూదన్రావు, తహసీల్దార్ ప్రసాద్బాబు, ఆలయ ఏసీ హెచ్జీ వెంకటేష్, ఏఈవోలు కేశవరావు, రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు స్వాములు, ప్రసాద్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
సాధారణంగా గోధుమపిండితో చపాతీలు, పుల్కాలు చేసుకుంటుంటా. కానీ అదే గోధుమ పిండితో బిస్కట్లు కూడా తయారు చేసుకోవచ్చు. మామూలుగా చపాతీలు అయితే పిల్లలు తినడానికి అంతగా ఇష్టం చూపించరేమో కానీ.. ఇలా బిస్కట్లుగా చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారు. అంతేకాదు పిల్లలకి ఈ గోధుమ బిస్కట్లు మంచి బలమైన ఆహారం కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి గోధుమ బిస్కట్లు ఎలా తయారుచేసుకోవాలో నేర్చుకోండి.
భాష పేరు: Misima-Panaeati
సంప్రదించండి:
బ్రాస్ బ్యాండ్ కోసం షీట్ సంగీతం
మనస్విని : September 2017
ఇప్పుడు నన్ను నేనే ప్రేమిస్తున్నా
మిలమిలా మెరిసే నక్షత్రం నేను
వెచ్చని కన్నీటిని పరిచయం చేసింది సమయం
ఈ క్షణం నుంచి మరో క్షణానికి
ఇంకా ఏం జరుగుతుంది
నాకు నేనంటే ఎంతో అసహ్యం
నాకు నేనంటే చాలా ఇష్టం
ప్రియమైన రాక్షసీ....
బాల్యమా ఐ లవ్ యూ
ఓరోజు మమతా రఘువీర్ గారి ఇంట్లో పనిచేసే పనిమనిషి తన 12సంవత్సరాల కూతురిని కూడా ఇంటికి తీసుకువచ్చి ఇంటి పనులు చేయిస్తుంది. “ఇదేంటి పాపను స్కూల్ కు వెళ్ళనివ్వకుండా ఇక్కడకు తీసుకువచ్చావు” అని ప్రశ్నించిన తనకు మనసు కలిచివేసే సంఘటన ఎదురయ్యింది. ” ఈసారైనా కొడుకు పుడతాడని చెప్పి మా ఆయన నాచేత ముగ్గురు ఆడపిల్లలను కనిచ్చాడు, వారిని పెంచాలంటే నా ఒక్క రెక్క సరిపెట్టడం లేదమ్మ అందుకే నా పెద్దకూతురుని తొలుకొచ్చినా” అని సమధానం ఇచ్చిందట. “మీరు చేసిన తప్పులకు పిల్లలకు కూడా శిక్షపడుతున్నది చూడు ఇంత చిన్న వయసులోనే తనకు ఈ శిక్షపడింది” పాప ఇలా పనిచేయాల్సిన అవసరం లేదు నేను మీ కుటుంబానికి అండగా ఉంటాను అని ఈ మనసును కలిచివేసిన సంఘటనే స్పూర్తిగా “తరుణి” ఏర్పాటుచేశారు.
“తరుణి” స్కూల్:
తన ఇంట్లో పనిమనిషి జీవితాలు మరెందరో పిల్లలు అనుభవిస్తున్నారని చెప్పి 2000 వ సంవత్సరంలో కేవలం పనిమనిషుల పిల్లల కోసమే ఈ స్కూల్ ను 45మంది విద్యార్ధులతో స్థాపించారు. ఈ స్కూల్ లో చదువు మాత్రమే కాదు స్కూల్ నుండి బయటకు వెళ్ళాక స్వశక్తితో నిలదొక్కుకోవడానికి టైలరింగ్, కంప్యూటర్ టైనింగ్, డ్రాయింగ్ మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు.
“తరుణి” ఎందుకోసం పనిచేస్తుంది.?
ఇప్పుడు ఏ కొత్త చట్టాలు అవసరం లేదు ఉన్న చట్టాలనే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు కాని ఆ చట్టలపై సమగ్ర అవగాహన లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇందుకోసం 500 మహిళలతో కలిసి అవగాహన తీసుకువస్తున్నారు. తీసుకురావడం వరకే కాదు వారి సమస్యలపై చట్టపరంగా పోరాడుతున్నారు.
మనం ఆనందంగా ఉంటే సరిపోతుంది అని అనుకుంటే మనం మాత్రమే సంతోషంగా ఉంటాము సమాజం కూడా ఆనందంగా ఉండాలని పాటుబడితే ఈ విశ్వమంత ఆనందం మనకు అందుతుంది. మమత గారు తనకు నిజంగానే ఎంతోమందికి భగవంతుడు ఇచ్చిన తల్లిగా వారి జీవితాలలోకి వచ్చేశారు |
ట్రై-ఆర్బీ నోటిఫికేషన్ 2018 డిగ్రీ కళాశాల లెక్చర్స్ కోసం దరఖాస్తును ఆహ్వానిస్తుంది అర్హులైన అభ్యర్ధులు ఆన్లైన్ మోడ్ను దరఖాస్తు చేసుకోవచ్చు. Www.treirb.telangana.gov.in వెబ్సైటు www.treirb.telangana.gov.in లో ట్రై-ఆర్బీ నోటిఫికేషన్ను చూడవచ్చు .ఆన్లైన్ అప్లికేషన్ 14/08 / 2018 న ప్రారంభించబడుతుంది. ఆన్లైన్ దరఖాస్తు కోసం చివరి తేదీ 13/09 / 2018.
జనవరి 31 గ్రహణం రోజు ఈ ఒక్క రాశి వారు చనిపోయే అవకాశం.. ఆరోజు ఎట్టి పరిస్తితుల్లోనూ బయటకి రావొద్దు..
మీడియా ని ఫూల్ చేసిన సెల్ఫీ అబ్బాయి.. అసలు వీడియో ఇదిగోండి
పని చేయని మెమరీ కార్డు ను మళ్ళీ పని చేసేలా చేసుకోండి .
ఈ అమ్మాయి ఇచ్చిన ఐడియా కి పవన్ ఆశ్చర్యపోయాడు
451 _ _ ‡a షాన్ కార్లోస్, రియో
వేమూరి - Wiktionary
From వేమూరు (vēmūru).
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే LIKE AND SHARE చేయండి నా ఛానెల్ SUBSCRIBE చేయండి First update Google app G Board Application and Offline...
How to Translate english to telugu in android phones(whatsapp,facebook)_ తెలుగు లో టైపు చేయండి ఇలా ?
How to Translate english to telugu and telugu to eng in android phones(whatsapp,facebook)_ తెలుగు లో టైపు చేయండి ఇలా ? google indic keyboard ...
Hai Friends ఫ్రెండ్స్ మీరు Whatsapp ,Facebook,IMO,Hike ఇలా ఎలాంటి మేస్సేజే లను సెండ్ చేసేటప్పుడు...
మీకు ఎం అన్న డౌట్స్ ఉంటె మన ఫేస్బుక్ ఫ్యాన్ పేజి ని like చేసి నాతో షేర్ చేసుక...
హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం , న వీడియోస్ అన్ని మీకు నాచై అని అనుకుంటు...
హాయ్ ఫ్రెండ్స్ ....నేను మీకు ఈ వీడియో లో ఫేస్బుక్ లో అద్బుత మైన ట్రిక్స్...
Read more about దెయ్యాన్నే నమ్ముకున్న అంజలి పాప
RX 100 లో 36 ముద్దులే.. ఇక్కడ 50... హీరో ఎవరో తెలుసా ?
సినిమాల్లో లిప్ లాక్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్ థింగ్ అయిపోయింది. సినిమాల్లో ముద్దు సీన్లు ఉంటే మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో హీరో, హీరోయిన్ ల మధ్య లిప్ లాక్ లు పెడుతుంటారు. మనకి స్క్రీన్ మీద కనబడేవి నాలుగైదు ముద్దు సీన్లే అయినా తెర వెనుక మాత్రం చాలానే ఉంటాయి. ఆ సీన్ ఇంటెన్షన్ కోసం నటీనటులు చాలా టేకులు తీసుకుంటుంటారు. అలా rx 100 మూవీలో ముద్దు సీన్స్ కోసం హీరో కార్తికేయకి, పాయల్ రాజ్ పుత్ 36 కి పైగా ముద్దులు పెట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
Read more about RX 100 లో 36 ముద్దులే.. ఇక్కడ 50... హీరో ఎవరో తెలుసా ?
సెట్ లో అందరిముందు అక్కడ పట్టుకున్నాడు.. నోరువిప్పిన స్టార్ హీరోయిన్
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య "మీటూ". "నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యా" అంటూ ఇప్పటికే పలు ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి చాలా మంది హీరోయిన్స్ పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాజాగా, "లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా" ఫేమ్ అహానా కుమ్రా కూడా తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సంచలన నిజాలు బయటపెట్టారు. ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను వివరించారు.
Read more about సెట్ లో అందరిముందు అక్కడ పట్టుకున్నాడు.. నోరువిప్పిన స్టార్ హీరోయిన్
☈☈ Szent Bálint ☈☈ ఉచిత mp3 డౌన్లోడ్ |
ఓపిక పట్టండి..సర్ప్రైజ్ ఇస్తా! - ముఖాముఖీ - సితార
త్వరలో విడుదల
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ఇది విన్నారా?
మీకు తెలుసా
ఓపిక పట్టండి..సర్ప్రైజ్ ఇస్తా!
మంచి పర్సనాలిటీ, అందం ఉంటేనే కాదు అల్లరితనం, ఎనర్జీ, బుల్లెట్ల మాదిరి దూసుకొచ్చే డైలాగులు చెప్పినా హీరోగా మంచి పేరొస్తుంది అని నిరూపించారు యువ కథానాయకుడు రాజ్తరుణ్. తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన రాజ్తరుణ్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత వరుసగా ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’, ‘ఈడో రకం ఆడో రకం’ తదితర సినిమాల్లో నటించారు. చివరిగా ‘లవర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ తన తర్వాతి సినిమా గురించి ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి, ఇతర విషయాల గురించి ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
మీ తర్వాతి చిత్రం ఏంటి? ఎవరితో?
రాజ్ తరుణ్: అవికా గోర్ను అడగండి.
హీరో రామ్ గురించి ఒక్కమాటలో చెప్పండి?
అద్భుతమైన వ్యక్తి.
అన్నా.. మంచి కథలను ఎంచుకో..
ప్రస్తుతం అదే చేస్తున్నా. అందుకే నా తర్వాతి సినిమా రావడానికి ఇంత ఆలస్యం అవుతోంది.
అల్లు అర్జున్ గురించి మీ అభిప్రాయమేంటి?
హార్డ్ వర్క్కి ఉదాహరణ.
ప్రయత్నిస్తాను.
ఫోన్లో డేటా అయిపోయిందా అన్నా..ఇన్నిరోజులూ ఏమైపోయావ్?
ఛ ఊర్కో..నేను అప్పుడప్పుడూ చాట్ చేస్తుంటాను. ఇప్పుడు కాస్త ఆలస్యం అయినందుకు సారీ. నాకు ఫోన్లు, సోషల్ నెట్వర్క్ గురించి పెద్దగా తెలీదు.
అన్నా..పెళ్లెప్పుడు?
వచ్చే ఏడాది.
మహేశ్ బాబు గురించి ఒక్కమాటలో చెప్పండి?
మహేశ్ను ఎప్పుడు కలుస్తారు? ఆయనతో ఓ ఫొటో దిగి పోస్ట్ చేయొచ్చు కదా..
నేను కలిశాను. ఫొటో కూడా దిగాను. కానీ పోస్ట్ చేయను. షేర్ చేయను. అది నేను చనిపోయేవరకు నాతోనే ఉండిపోతుంది. అది నా వ్యక్తిగత విషయం.
రష్మిక మందన గురించి మీ అభిప్రాయం?
ఆమె నటన ఇష్టం. కానీ ఎప్పుడూ కలవలేదు.
మీకు నచ్చిన హిందీ చిత్రం?
వేక్ అప్ సిడ్.
‘మహర్షి’ సినిమాపై మీ అభిప్రాయం?
ఆ సినిమా కోసం నేనూ ఎదురుచూస్తున్నా.
మీ తర్వాతి చిత్రం ఏంటి?
ఆసక్తికరమైన చిత్రంతో మీ ముందుకొస్తా. కాస్త ఓపికపట్టండి. తప్పకుండా సర్ప్రైజ్ ఇస్తా.
బాలీవుడ్లో మీకు నచ్చిన హీరోయిన్?
ఆలియా భట్.
పూరీ జగన్నాథ్తో సినిమా చేస్తారా?
ఆయన్నే అడగండి.
‘పోకిరి’ లాంటి సినిమా చేయన్నా?
‘పోకిరి’ ఒక్కటే సినిమా. ఇంకోటి రాదు రాలేదు.
‘ఆర్ ఆర్ ఆర్’లో నటిస్తున్నారంట?
నటించాలనే అనుకుంటున్నాను.
అన్నా..నిన్ను చూసి చాలా రోజులు అవుతోంది. ఒక్క ఫొటో పెట్టండి ప్లీజ్..
గడ్డం, మీసం పూర్తిగా పెరగని జుట్టుతో ఉన్నా..ఓకేనా?
మీకు ఓటు హక్కు ఎక్కడుంది?
అరె..టికెట్ను ఓటును కలపకు. ఎవరి అభిప్రాయాలు వారివి. వదిలెయ్.
కనీసం మీ ట్విటర్ ఫొటో అయినా మార్చచ్చు కదా..
టాలీవుడ్లో మీకు నచ్చిన కథానాయిక?
తెనాలి రామకృష్ణ కథ ఒకటి ఉంటది. అదే.
రాజ్ కపూర్.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మీరు కలిసిన బెస్ట్ వ్యక్తి ఎవరు?
రామ్మోహన్. ‘ఉయ్యాల జంపాలా’ నిర్మాత.
విజయ్ దేవరకొండ గురించి ఒక్కమాటలో చెప్పండి?
ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీలో ఇప్పుడున్న నటుల్లో ఆయన ది బెస్ట్.
ప్రస్తుతం నీ గర్ల్ఫ్రెండ్ ఎవరు?
నువ్వు ‘ప్రస్తుతం’ అని అనకపోయి ఉంటే చెప్పేవాడిని.
జీవా కొత్త చిత్రం
పోలీస్ పవర్ స్ఫూర్తిగా...
కార్యక్రమాలు
యశ్ వాళ్ల నాన్నే పెద్ద సూపర్స్టార్!!
‘హుషారు’గా సాగిపోయే చిత్రం..
సుమంత్ నటన అద్భుతం
‘ఆర్.ఆర్.ఆర్’కు దీటుగా మణిరత్నం భారీ ప్రాజెక్టు!!
'కర్ణ'లో హాలీవుడ్ నటుడు
విభిన్నంగా ‘ఆర్.ఆర్.ఆర్’ కథానాయకులు
‘ఎఫ్2’లో అనసూయ ప్రత్యేక గీతం
ట్రైలర్...టీజర్
కోడి మీద జాలి పడితే చికెన్ 65 ఎలా తినగలం!!
ఆసక్తిరేకెత్తిస్తున్న ‘అంతరిక్షం’ ట్రైలర్..
‘కవచం’ మేకింగ్ వీడియో
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కేజీఎఫ్’ట్రైలర్
అవర్ టైమ్ ఈజ్ బ్యాక్ అంటున్న.. ధనుష్
ఆసక్తిరేకెత్తిస్తున్న ‘కవచం’ ట్రైలర్
ఆన్లైన్లో..
‘పేట’ నుంచి జంటగా వచ్చిన రజనీ..
ఆకట్టుకుంటున్న హన్సిక కొత్త సినిమా ఫస్ట్లుక్!
ఖర్చంతా ‘భానుమతి’ కోసమే...!
కార్తికేయ పెళ్లి.. జైపూర్లో ?
ఇప్పుడంతా.. ‘కేరాఫ్ వాట్సప్’
ఉత్కంఠ రేకెత్తించే ‘అంతరిక్షం’
‘24’ దర్శకుడితో.. నాని 24వ సినిమా
రష్మిక కాదు... నయనతారకే ఛాన్స్ |
`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` థాంక్స్ టు ఇండియా మీట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీరామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ఫై వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్ రూపొందిన చిత్రం `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`. మే 4న ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా థాంక్స్ టు ఇండియా మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ....
డా. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ``ఈ పిక్చర్ కోసం బన్ని చాలా బాగా కష్టపడ్డాడు. చాలా బాగా చేశాడు. సోల్జర్గా ఎలా మన దేశాన్ని కాపాడుకోవాలి? బోర్డర్కి ఎలా రీచ్ కావాలి? అనే మంచి సందేశాన్నిచ్చిన సినిమా ఇది. వక్కంతం వంశీ చాలా బాగా చేశాడు. మనం ఉన్న ఊరిని, దేశాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా చాలా బాగా చెప్పారు ఈ సినిమాలో`` అని తెలిపారు.
వక్కంతం వంశీ మాట్లాడుతూ ``ఈ వేడుకకు పవన్ కల్యాణ్ రావడం చాలా ఆనందదాయకం. నాకు తొలి సినిమా అవకాశం, ఇలాంటి పెద్ద సినిమా రూపంలో రావడం చాలా సంతోషం. కంటెంట్ని కమర్షియల్గా కూడా చెప్పొచ్చని నేను అన్న మాట నమ్మి నాతో అల్లు అర్జున్ ప్రయాణం చేశారు. సినిమా ఇంత రిచ్గా రావడానికి నిర్మాతలు చాలా సహకరించారు. నా టీమ్ అందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి కంటెంట్తో ఉన్న ఈ సినిమాను మనస్ఫూర్తిగా గుండెల్లోకి తీసుకున్న వారందరికీ ధన్యవాదాలు. మలయాళం, తమిళ్, తెలుగులో సినిమా చాలా బాగా ఆడుతోంది`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నాగబాబు, అశోక్, మెహర్ రమేశ్, రామజోగయ్యశాస్త్రి, బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు.
ఫీడ్ కి తిరిగి వెళ్ళు
మార్పులను సేవ్ చెయ్యండి
సేవ్ చెయ్యండి
వీడియో ట్యుటోరియల్లు వీక్షించండి
ఆప్ ని డౌన్లోడ్ చెయ్యండి
సేవ్ చేసి ఆఫ్లైన్లో వీక్షించండి
వంటని రేట్ చెయ్యడానికి
మినప రొట్టి/ కొయ్యరొట్టి. _ 1. Minapa rotti. Recipe in Telugu
ద్వారా దూసి గీత _ 18th Sep 2018 _
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
ఇది షేర్ చేయండి
ప్రధాన వంటకం
మినప రొట్టి/ కొయ్యరొట్టి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make 1. Minapa rotti. Recipe in Telugu )
మినప గుళ్ళు : 1 కప్పు.
బియ్యం : 2 కప్పులు.
అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్ 2 చెంచాలు
నూనె : 1/4 కప్పు.(రొట్టి కాల్చడానికి తగినంత).
మినప రొట్టి/ కొయ్యరొట్టి. _ How to make 1. Minapa rotti. Recipe in Telugu
మినప్పప్పు, బియ్యం ఓ గంట సెంటు ఎండలో ఉంచి, సన్నని రవ్వ లా మిక్సీలో వేసుకోవాలి.
నానిన మిశ్రమం లో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్, ఉప్పు, చిటికెడు ఇంగువ వేసి కలుపుకొని మూకుడు లో నూనె వేసి బాగా వేడెక్కాక రొట్టి వేసి మూత పెట్టి కాల్చుకోవాలి.
బాగా ఎర్రగా కాలడానికి 5 నుండీ 10 నిమిషాలు పడుతుంది. కాలిన రొట్టిమీద కొద్దిగా నెయ్యి రాసి తింటే బావుంటుంది.దీనికి సైడ్ డిష్ అవసరం ఉండదు.పచ్చిమిర్చి,అల్లం ఎక్కువ వేస్తే కారం గా ఉండి బావుంటుంది.
దాకరు చేయండి
ఇంట్లొఈ వంటని తయారు చెయ్యండి మరియు ఫోటోను అప్లోడ్ చెయ్యండి
అన్ని ప్రశంసలు చూడండి
ఇలాంటి వంటకాలు
మినప గారెలు
మినప జంతికలు
4ఇష్టపడ్డారు |
మిగిలిన ఆహారపదర్దాల తో పోలిస్తే సోయా సమాహారమైన పోషకాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల జబ్బులను దరిచేరనివ్వదు . త్వరగా జీర్ణము అవుతుంది . అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు శరీరానికి అవసరమైన అమినోయసిడ్లు , లైసీన్ ల తోపాటు పరొక్షముగా ఇసోఫ్లేవిన్స్(Isoflavins) ని కలిగిఉంటుంది . సోయద్వారా లబించే మాంసకృత్తులు — పాలు , మాంసము , కోడిగుడ్ల తో సరిసమానము . పై గా కొలెస్టిరాల్ , లాక్టూజ్ (Lactose)లేని ఆహారము . పీచు అధికము , కేలోరీస్ పరిమితము మంచి రకానికి చెందిన ‘ లైపిడ్స్ ‘ ఉన్నాయి. నిద్రపుచ్చే సోయా!
ముట్లుడిగిన (మెనోపాజ్) మహిళల్లో చాలామంది నిద్రలేమితో సతమతమవుతుంటారు.వీరికి సోయాబీన్స్లోని ఈస్ట్రోజెన్ వంటి రసాయనాలు ఎంతగానో మేలు చేస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీటిల్లోని ఐసోఫ్లేవన్లతో నిద్రించే సమయం పెరుగుతున్నట్టు గుర్తించారు. నాలుగు నెలల పాటు ఐసోఫ్లేవన్లు తీసుకున్నాక నిద్రలేమమి సమస్య 37 శాతానికి పడిపోవటం విశేషం సోయా… చిక్కుడు జాతికి చెందినది. పిండి, నూనె, టోఫు, పాలు, పెరుగు రూపంలో వివిధ రకాలుగా వాడుతుంటారు. అలానే సోయాలో పలు ముఖ్యమైన అమినో ఆమ్లాలు ఉంటాయి. మాంసవృద్ధి, నరాల పుష్ఠికి వీటిలో లభించే మాంసకృత్తులు ఎంతో అవసరం.
* కప్పు సోయా గింజల్లో 240 గ్రాముల మటన్, 180 గ్రాముల చేపలు, ఎనిమిది కప్పుల పాలు, ఆరు గుడ్లకు సమానమైన మాంసకృత్తులు అందుతాయి
* నిత్యం తీసుకొనే ఆహారంలో ఒక వంతు సోయా మిగతా మూడు వంతులు ఇతర ఆహారం చేర్చితే.. శరీరానికి కావల్సిన మాంసకృత్తులు అందుతాయి. ముఖ్యంగా శాకాహారులకు దీనిలోని క్యాల్షియం, అమినో ఆమ్లాలు, విటమిన్లు, ఇనుము, ఫోలిక్ ఆమ్లాలు ఎముకలకు, కండరాలకు, కణాభివృద్ధికి సాయపడుతుంటాయి.
* హృద్రోగాలు, చక్కెర వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ సోయాను ఆహారంలో తీసుకుంటే కొవ్వు నిల్వలు పేరుకోవు. రక్తంలో చక్కెర శాతం పెరగదు.
* మసాలా వంటకాల్లో ఉపయోగించే మీల్మేకర్ను సోయా పిండితోనే తయారుచేస్తారు. బరువు తగ్గాలనుకొనేవారు కూరల్లో వేసుకొని తీసుకొంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది.
* పసిపిల్లలకు తల్లిపాలు పడనప్పుడు సోయా పాలను కొంచెంగా ఇస్తే మంచిది. వీటిలో పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. నరాల బలహీనత, నిస్సత్తువ, మానసిక ఒత్తిళ్లు.. వంటివి బాధించినప్పుడు సోయా పాలను క్రమంగా తీసుకొంటే త్వరిత ఉపశమనం లభిస్తుంది. పాలు, పెరుగు, వాటి సంబంధిత పదార్థాలు పడని వారు సోయాపాలు తీసుకోవచ్చు.
* ఈ పాలను ఎక్కువగా తీసుకొంటే ఈస్ట్రోజెన్ అనే హార్మోను తగ్గినప్పుడు ఏర్పడే శరీర వేడి, నరాల బలహీనత, ఎముకల బలహీనత చర్మ సమస్యలు దూరమవుతాయి.
* గుండెజబ్బులు, మూత్రపిండాల సమస్యలు, చక్కెర వ్యాధి గలవారు ఇతర మాంసాహారాలకు బదులుగా సోయా సంబంధిత పదార్థాలు కొంచెంగా తీసుకోవచ్చును. గర్భిణులు, బాలింతలు సోయాపాలు తీసుకొంటే ఇనుము, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా అందుతాయి.
* సోయాగింజలపై పొట్టు కడుపులో వికారాన్ని, అజీర్ణాన్ని కలిగిస్తుంది.దానిని తీసి వాడుకోవడం మంచిది. దీనిని బాగా ఉడికించి తీసుకుంటే కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవు.
పిండిపదార్థాలు: 20.9శాతం,
పీచుపదార్థం: 3.7శాతం,
శృంగారం ఎంత ఆరోగ్యమో..?...
ఈ పండు తింటే కిడ్నీలో కంకర రాయి ఉన్నా కరగాల్సిందేన...
గుప్పెడు నువ్వులు.. ఎన్నో లాభాలు...
Previous articleగ్యాస్ సమస్యను పోగొట్టే అద్భుతమైన చిట్కాలు
బరువు తగ్గే ప్రయత్నం సీరియస్ గా చేద్దాం అనుకుంటున్నారా?
కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు ఖచ్చితంగా తినకూడని ఆహారాలు
వరలక్ష్మి వ్రతం
ఉపవాసం అంటే ఏమిటి? ఎలా చెయ్యాలి?
నాగులు – సర్పాలు.. చిన్న వివరణ |
డిసెంబర్ 23న తెలుగు, తమిళ భాషల్లో సింగం-3 (ఎస్-3)
తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయకుడిగా భాసిల్లుతున్న సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం సింగం-3. హరి దర్శకుడు. తమిళంలో స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేళ్రాజా, తెలుగులో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలుత ఈ నెల 16న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేశాయి. అయితే తాజాగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క, శృతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. హరీస్ జైరాజ్ స్వరాలను సమకూర్చారు.
ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ సూర్య కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ఇది. రోజు రోజుకు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు తగిన విధంగానే చిత్రం సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్గా నిలవబోతుంది. ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారు. గతంలో సూర్య, హరి కాంబినేషన్లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలకు మించిన విజయం ఈ చిత్రం సాధిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్గా నిలుస్తాయి. డిసెంబర్ 23న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. రాధికా శరత్కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్. |
నేడే హాయ్ ల్యాండ్ లో 2000 మందితో రన్ రాజా రన్ ఆడియో సక్సెస్ సెలెబ్రేషన్స్ - Telugu cinema news
నేడే హాయ్ ల్యాండ్ లో 2000 మందితో రన్ రాజా రన్ ఆడియో సక్సెస్ సెలెబ్రేషన్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తన తొలి ప్రయత్నం మిర్చితో సూపర్ డూపర్ హిట్ ని సాధించిన నిర్మాతలు వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్న చిత్రం రన్ రాజా రన్. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించింది. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై ఛార్ట్ బస్టర్స్ లో టాప్ గా నిలిచింది. కమలహాసన్ విశ్వరూపం 2 చిత్రానికి సంగీతాన్ని అందించిన జిబ్రాన్.యం రన్ రాజా చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా రన్ రాజా రన్ ఆడియో సక్సెస్ మీట్ ను గ్రాండ్ లెవల్లో చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ లో దాదాపు 2000 మంది అభిమానులు సమక్షంలో ఈరోజు (14-07-14, సోమవారం) సాయంత్రం 5 గంటలకు ఆడియో సక్సెస్ సంబరాల్ని గ్రాండ్ గా చేయనున్నారు. సుజిత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ప్రభాస్ మిర్చికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మధి ఛాయాగ్రహణం అందించారు. ఈ సినిమాని జులై 18న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మాట్లాడుతూ.... యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా రన్ రాజా రన్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాం. ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ని సంపాదించిన శర్వానంద్ హీరోగా నటించగా.. సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించారు. దర్శకుడు సుజిత్ సూపర్ హిట్ సినిమా మాకు అందించాడు. ఇటీవలే ఆడియోను గ్రాండ్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మా సంగీత దర్శకుడు జిబ్రాన్ అద్భుతమైన పాటలందిచాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది. ఇప్పటికే ఈ పాటలు చార్ట్ బస్టర్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచాయి. ఈ సందర్భంగా ఆడియో సక్సెస్ సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేయాలని నిర్ణయించాం. ఈరోజు (14-07-14, సోమవారం) సాయంత్రం 5 గంటలకు దాదాపు 2000 మంది అభిమానుల సమక్షంలో గుంటూరు-విజయవాడ రహదారిలో ఉన్న హాయ్ ల్యాండ్ వేదికగా ఈ సంబరాలు చేస్తున్నాం. చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొంటారు. ఈ సెలెబ్రేషన్స్ లో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 18న రన్ రాజా రన్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.
నటీనటులు : శర్వానంద్, సీరత్ కపూర్, అడవి శేషు, సంపత్, జయప్రకాష్ రెడ్డి, అలి, వెన్నెల కిషోర్, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తదితరులు.
సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ: మధి, సంగీతం: ఘిబ్రాన్.యం, ఎడిటర్: మధు, ఆర్ట్: ఏ.యస్. ప్రకాష్, పి.ఆర్.ఓ: ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్
నిర్మాతలు: వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
మీ నడకలో"నిన్నని" మీమాటలో "రేపుని"చూసిన మాకు-మీరు ఇక లేరు.అన్ననిజం జీర్ణించుకోలేనిది కన్నీటి వీడ్కోలు మీకు...
ప్రతి చోట మీరు చెప్పిన ప్రతి మాట చద్దన్నపు ముద్దలా హాయిగా అనిపించేది..మీ అనుభవాల బడి మాకు తెలుగు సినిమా పరిశ్రమలో "అ ఆ" లను నేర్పించింది.
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి..అశ్రునయనాలతో...::
సహజ ఆఫ్ సైన్స్ హౌస్టన్ మ్యూజియం ఆఫ్ Cockrell బటర్ సెంటర్ లో నారింజ సీతాకోకచిలుక Dryadula Phaetusa (?). హోస్టన్, టెక్సాస్, ఫిబ్రవరి 14, 2009
telugu sex stories boothu kathalu ఇంటికి వెళ్లి భోజనం చేశారు అందరూ. అమ్మమ్మ మామిడి కాయలు కావాలి అంది ప్రియ. ఈ రోజు మా ఆయన ఊరెళ్ళి న రెండో రోజు. ఈ రోజు వస్తారు. నేను స్నానం చేసి, బట్టలు కట్టుకోడానికి అద్దం ముందు నిలబడ్డాను. telugu sex stories boothu kathalu మరి నా కోరికని ఎవరు తీరుస్తారు రా సంజూ అంటూ వయ్యారంగా బెడ్రూం వాకిట్లో తన పెద్ద జడని ముందుకు వేసుకొని మా వైపే. Incest sex kathalu lo tandri kutrini dengadatam, leda chelli anna tho denginchukovadam lanthi kathalu meeru chadavochchu. Telugu Sex Stories Kama Kathalu. Telugu BoothuKathalu రవి ప్రదర్శిస్తున్న రసికత్వానికి,సునీత అల్లాడిపోతు..కింద ఊపుడు స్పీడ్ పెంచింది.అది గమనించిన రవి చిలక. Categories
శోధన మార్కెటింగ్ టాప్ కన్సల్టింగ్ _ On-line Marketing Best Europe
Schlagwort-Archive: శోధన మార్కెటింగ్ టాప్ కన్సల్టింగ్ |
సత్ఫలితాలని సాధిస్తున్న పోలీసు శాఖ వెబ్ సైట్
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖ వెబ్ సైట్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరైంది. ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీస్ ద్వారా 1.68 లక్షల మందిఎఫ్ఐఆర్ అక్నాల్డెజ్మెంట్ స్వీకరించారు. పోలీస్ వెబ్సైట్ ద్వారా అదృశ్యమైన వ్యక్తుల వివరాలను 15,288 మంది తెలుసుకోగా, 83 మంది ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు, కేసు నమోదు తర్వాత అరెస్టయిన నిందితుల వివరాలను 10,288 మంది తెలుసుకోగా 1,011 మంది పిటిషన్ పరిస్థితిని పరిశీలించుకున్నారు. అలాగే గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు 7,780 మంది ఎఫ్ఐఆర్ డౌన్ లోడ్ చేసుకున్నారు.
మరోవైపు పోలీస్ వెబ్సైట్ ను ఇప్పటివరకు 7.7 లక్షల మంది వీక్షించారు. ఫిర్యాదులు, కేసుల స్థితిని సులభంగా తెలుసుకునేలా అందుబా టులోకి తీసుకొచ్చిన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) సత్ఫలితాలనిస్తోంది.‘నమస్కారం మీరు దాఖలు చేసిన ఫిర్యాదు స్వీకరించాం. ఫిర్యాదు చేసిన అంశాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. అందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నంబర్ xxx ధన్యవాదాలు’ ఇలా 24 గంటల్లోపు పిటిషన్ నంబర్, తదితర వివరాలతో సంక్షిప్త సందేశం ఫిర్యాదుదారులకు అందుతోంది.
అలాగే ఎఫ్ఐఆర్ కాపీ కోసం ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ‘”www.tspolice.gov.in’’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని సంబంధిత జిల్లా, పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ నంబర్ లేదా ఎఫ్ఐఆర్ నమోదు తేదీని ధృవీకరించుకొని కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిటిషన్పై కేసు నమోదు చేయకపోతే.. పిటిషన్ ప్రస్తుత పరిస్థితిని వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు.
రిషబ్ పంత్పై ధోని ఫ్యాన్స్ ఆగ్రహం
బిగ్బాస్-11 సీజన్ విజేత శిల్పా..
నా బాడీ నా ఇష్టం.. మీకెందుకు?
జనగామలో ముత్తిరెడ్డి డౌన్ డౌన్ అన్నారు (వీడియో) >> అమృత ప్రణయ్ ఘటన మరువక ముందే…కడపలో >> ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ ఫస్ట్ వీకెండ్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ >> ప్రణయ్ మర్డర్ ప్రెస్ మీట్ లో నల్లగొండ ఎస్పీ రంగనాథ్ చిర్రు బుర్రు >> ప్రణయ్ హత్యలో ఐదుగురే ప్రధాన నిందితులు >> ప్రబోధానంద విషయంలో జేసీ సంచలన నిర్ణయం >> ఎన్టీఆర్ చైతన్య రథ సారథి కళ్యాణ్ రామ్ >> సెప్టెంబర్ 20న దేవదాస్ ఆడియో పార్టీ… >> సెన్సార్ పనుల్లో ‘‘సకల కళా వల్లభుడు’’ >> రాహుల్ కళ్ళకు అపుడే ‘పచ్చ’ గంతలు
4. యేసు త్వరలో – రానైయున్నాడు |
నాకు, శ్రీ వెంకన్న గారికి కొన్నాళ్ళ కిందట మహిషాసురమర్దినీ సహస్రనామ స్తోత్రం ఉందా అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఒకటి రెండు సహస్రనామ స్తోత్రాలు - వీటితో సంబంధం లేని నామావళిని పరిశీలించడం జరిగింది. నామావళి - శ్లోకాలకు సరిపోదు. దేవీ నామాలు వేయి సంఖ్యకు రావు. ఆ స్తోత్రాలు ఎందులోనివో తెలియదు. నామావళిలో విభక్తి దోషాలు, నామాల సంఖ్య, విభాగం సరిపోవడం లేదు.
ఈ స్థితిలో మహిషాసుర మర్దినీ సహస్రనామ స్తోత్రం సమకూర్చి - జగన్మాతకు - అభిమాన పాఠకులకు అందించవలెననే సంకల్పం కలిగింది. ఆ సంకల్పం నెరవేరడం ఎలా? ఈ ఆలోచనలతో చండీ సప్తశతిని పరిశీలించినా మార్గం దొరకలేదు. పట్టుదలతో దేవీ భాగవతాన్ని పదేపదే పరిశీలించడం జరిగింది. అందులో దేవతలు, ఋషులు మొదలైనవారి స్తోత్రాలు కనిపించాయి.
కాని అవి విడిగా సహస్రనామానికి కాదు గదా శత నామానికి కూడా రావడంలేదు. మరి సహస్రనామస్తోత్రం ఎలా వస్తుంది? ఇలా సతమతమైన నాకు - అమ్మదయ వలన - 'ఈ స్తోత్రములను అన్నిటినీ కలిపితే ఎలా ఉంటుంది' అనే ఆలోచన వచ్చింది. ఈ స్తోత్రాలను చేసిన వేదాలు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాద్రి దేవతలు, మునులు, భక్తులు వీరు మనకంటే గొప్పవారు. వీరు చేసిన స్తోత్రాల నుండే నామావళిని తీయవచ్చును కదా! ఈ స్తోత్రాలు మన మహిషాసురమర్దినీ దేవిని స్తుతించేవే కదా! పునరుక్తులుగా కనిపించే వాటికి విశేషణ విశేష్య భావం మార్చవచ్చు!
నాకు, శ్రీ వెంకన్న గారికి కొన్నాళ్ళ కిందట మహిషాసురమర్దినీ సహస్రనామ స్తోత్రం ఉందా అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఒకటి రెండు సహస్రనామ స్తోత్రాలు - వీటితో సంబంధం లేని నామావళిని పరిశీలించడం జరిగింది. నామావళి - శ్లోకాలకు సరిపోదు. దేవీ నామాలు వేయి సంఖ్యకు రావు. ఆ స్తోత్రాలు ఎందులోనివో తెలియదు. నామావళిలో విభక్తి దోషాలు, నామాల సంఖ్య, విభాగం సరిపోవడం లేదు. ఈ స్థితిలో మహిషాసుర మర్దినీ సహస్రనామ స్తోత్రం సమకూర్చి - జగన్మాతకు - అభిమాన పాఠకులకు అందించవలెననే సంకల్పం కలిగింది. ఆ సంకల్పం నెరవేరడం ఎలా? ఈ ఆలోచనలతో చండీ సప్తశతిని పరిశీలించినా మార్గం దొరకలేదు. పట్టుదలతో దేవీ భాగవతాన్ని పదేపదే పరిశీలించడం జరిగింది. అందులో దేవతలు, ఋషులు మొదలైనవారి స్తోత్రాలు కనిపించాయి. కాని అవి విడిగా సహస్రనామానికి కాదు గదా శత నామానికి కూడా రావడంలేదు. మరి సహస్రనామస్తోత్రం ఎలా వస్తుంది? ఇలా సతమతమైన నాకు - అమ్మదయ వలన - 'ఈ స్తోత్రములను అన్నిటినీ కలిపితే ఎలా ఉంటుంది' అనే ఆలోచన వచ్చింది. ఈ స్తోత్రాలను చేసిన వేదాలు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాద్రి దేవతలు, మునులు, భక్తులు వీరు మనకంటే గొప్పవారు. వీరు చేసిన స్తోత్రాల నుండే నామావళిని తీయవచ్చును కదా! ఈ స్తోత్రాలు మన మహిషాసురమర్దినీ దేవిని స్తుతించేవే కదా! పునరుక్తులుగా కనిపించే వాటికి విశేషణ విశేష్య భావం మార్చవచ్చు!
హెహ్హెహ్హె… బావుంది బావుంది.కాకుంటే నువ్వు ఇంకో చాలా ముఖ్యమైన వంకని మర్చిపోయావు బాలన్నా. అది నేను మాట్లాడిన చాలా మందిలో అంటే ఒక తొంభై అయిదు శాతం మందిలో ఉంది. అదేంటంటే, “నాకు మెదడులో ఎన్నో ఉన్నాయి రాద్దామని. కానీ ఎలా రాయాలో తెలీదు. నాకు అంత సృజనాత్మకత లేదు.” ఇదీ వరస. ఏంటో మరి, రాసే వాళ్ళందరికీ వాళ్ళకంటే ఎక్కువ సృజనాత్మకత ఉందనా వాళ్ళ అభిప్రాయం? నా విషయాన్నే తీస్కుంటే, నాకు అసలు సృజనాత్మకత ఉంది అని నేను అనుకోను, కానీ రాస్తుంటే, ఆలోచనలు అవే వస్తున్నాయి. అలా రాసుకుంటూ వెళ్తున్నా. కొన్ని కొన్ని సార్లు నేను రాసింది బాగోకపోవచ్చు. అలా అని నేను రాయడం ఆపను. రోజు రోజుకు నేను మెరుగవ్వటం మీదే నా దృష్టి అంతా. నేను ఇలా రాయటం గురించి మాట్లాడిన ప్రతివాళ్ళతోనూ ఇదే చెప్తాను. రాయటం మొదలుపెట్టమని, రాస్తుంటే అదే వస్తుందని. ఇప్పుడు కూడా ఇది చదివే వాళ్ళకి, చదువుతారు కానీ రాయని వాళ్ళకి చెప్తున్నా “మీ మనసులోని ఆలోచనలని, భావాలని ఒక్కసారి ఏదో ఒక మాధ్యమం ద్వారా బయట పెట్టండి. అప్పుడు మీకే అనిపిస్తుంది – ఇంత మంచి పని చేయటానికి ఎందుకింత ఆలశ్యం చేసానా అని.” ఇంక మాధ్యమం కావాలి అంటే, చాలా ఉన్నాయి. బ్లాగ్స్పాట్, వర్డ్ ప్రెస్, ఇంకా ఎన్నో ఉన్నాయి. రాయాలి అని నిర్ణయం తీస్కున్న ప్రతిఒక్కరికీ ఇవే నా అభినందనలు.
-స్వాప్నిక్.
బ్రేకింగ్ : కృష్ణా నదిలో విషాదం, 14 మంది మృతి __ Boat capsizes in Krishna river, 14 dead
బ్రేకింగ్ : కృష్ణా నదిలో విషాదం, 16 మంది మృతి __ Boat capsizes - www.youtube.com
Telugu: యూదా (yūdā)
19 వ శతాబ్దం
హరి భక్తి ఫలం : వామన పురాణము, 68వ అధ్యాయము
తెలుగు వర్షన్
జగన్, చంద్రబాబు, పవన్ లలో మీడియా సపోర్టు ఎటు..?
నిర్మాతలుగా మారిన పవర్ స్టార్ – త్రివిక్రమ్
రవి, శ్రీముఖి జంటగా “థ్యాంక్యూ మిత్రమా” |
క్రిస్మస్ కానుకగా గోపీచంద్, రవికుమార్ చౌదరి, భవ్య క్రియేషన్స్ చిత్రం
'యజ్ఞం'తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న గోపీచంద్, ఏయస్ రవికుమార్ చౌదర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. భవ్య క్రియేషన్స్ పతాకంపై అత్యంత భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వి. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్ తో ఈ చిత్రం 70 శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు.
ఈ సందర్భంగా ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ - ''ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. గోపీచంద్ మార్క్ యాక్షన్, రవికుమార్ చౌదరి మార్క్ ఎమోషన్ కూడా ఉంటాయి. కథ డిమాండ్ మేరకు చిత్రంలో అత్యంత భారీ తారాగణం ఉంటుంది. అనూప్ రూబెన్స్ మంచి పాటలు ఇచ్చారు. మొత్తం ఐదు పాటలుంటాయి. వాటిలో మూడు పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నాం. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
రవికుమార్ చౌదరి మాట్లాడుతూ - ''గోపీచంద్ తో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా కాంబినేషన్లో వచ్చిన 'యజ్ఞం'కి పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. గోపీచంద్ కెరీర్లో భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రం ఇదే కావడం విశేషం. అన్ని పాత్రలకూ తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఓ కీలక పాత్రను మాలయాళ నటుడు దేవన్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఒక సూపర్ హిట్ మూవీకి కావల్సిన అంశాలతో రూపొందుతున్న చిత్రం
గోపీచంద్ సరసన రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షావుకారు జానకి, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పథ్వీ, అశుతోష్ రానా, ప్రదీప్ రావత్, నాజర్, ముఖేష్ రుషి, సురేఖావాణి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే: కోన వెంకట్-గోపీ మోహన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, కథ-మాటలు: శ్రీధర్ సీపాన, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: వివేక్ అన్నామలై.
జూన్ 11న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, హరీష్ శంకర్ `డీజే.. దువ్వాడ జగన్నాథమ్` పాటల విడుదల వేడుక
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పవర్ఫుల్ ఎనర్జిటిక్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు నిర్మిస్తున్న సినిమా `డీజే.. దువ్వాడ జగన్నాథమ్`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న 25వ సినిమా కావడం విశేషం. రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బన్ని చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు ధీటుగా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన రెండు రోజుల్లోనే 10 మిలియన్స్ వ్యూస్తో ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ను రాబట్టుకుంటుంది.
ఆర్య, ఆర్య2, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా బన్ని, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. గబ్బర్సింగ్ తర్వాత హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ కలయికలో రూపొందిన చిత్రం కూడా ఇదే. ఇలాంటి హిట్ కాంబినేషన్ కలయికలో డీజే దువ్వాడ జగన్నాథమ్ ఆడియో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్రెడి సోషల్ మీడియాలో విడుదలైన రెండు పాటలకు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పాటల విడుదల వేడుకను జూన్ 11న గ్రాండ్ లెవల్లో నిర్వహిస్తున్నారు. జూన్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు
నాల్గోవ షెడ్యూల్ లో బిజీగా ఉన్న “ఏంజెల్”
మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సోషియోఫాంటసీ ఎంటర్ టైనర్ ఏంజెల్. గతేడాది షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ దిగ్విజయంగా పూర్తిచేసుకొని తాజాగా జనవరి 16 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాల్గోవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. యంగ్ టాలెండ్ హీరో నాగఅన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దర్శకధరీడు రాజమౌళి అసోసియేట్ బాహుబలి పళని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్ ని జనవరి నెలాఖరు వరకు నిర్విహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాత భువన్ సాగర్ తెలిపారు. ఈ సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన : శ్రీనివాస్ లంకపల్లి, ఆర్ట్: వి.ఎస్. సాయిమణి, స్టంట్స్: రామ్ లక్ష్మణ్, డైలాగ్స్: వేంపల్లి రమేశ్ రెడ్డి, ఎడిటర్: చోట.కె.ప్రసాద్, సినిమాటోగ్రఫీ: గుణ. |
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్`. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్ సాక్షిచౌదరి ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సందర్భంగా...
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది.రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి అద్భుతమైన సాహిత్యానందించారు. ఈ సినిమాలో మరో సాంగ్ను డిసెంబర్ 2 నుండి పూణేలో చిత్రీకరించనున్నాం`` అన్నారు.
గోపీచంద్, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్ శ్యామ్, ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, ఫైట్స్:పీటర్ హెయిన్, ఆర్ట్: మిలన్, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.
మౌంట్ Shelomo నుండి ఉన్నత Nahal Mapalim క్రీక్ ఉత్తర, Eilat నుండి 3 మైళ్ళు ఉత్తరాన-వెస్ట్. మధ్య ప్రాచ్యం, మార్చ్ 22, 2001
క్రీక్ పార్క్ లిక్ లో పోస్ట్ చేసుకోండి ఓక్ ట్రైల్ సమీపంలో ఉదయం డ్యూ లో కెనడా వెల్లుల్లి (Allium canadense). కళాశాల స్టేషన్, టెక్సాస్, 2008 ఏప్రిల్ 20
టెక్సాస్ A మరియు M విశ్వవిద్యాలయం లో TAMU హోలిస్టిక్ గార్డెన్ లో తూర్పు cottontail కుందేలు (Sylvilagus floridanus) కూర్చొని. కళాశాల స్టేషన్, టెక్సాస్, మే 22, 2010
సెయింట్ పీటర్స్బర్గ్ నుండి 7 మైళ్ళు ఉత్తరాన Kuzmolovo నుండి Melampyrum nemorosum తూర్పు,. రష్యా,, 2011 జూన్ 22
అనుష్క స్టామినాకు అసలు పరీక్ష!
Telugu (ISO 15919): [1, 2] వంకాయ (vaṅkāya) → te, వార్తాకము (vārtākamu) → te
కావ్యాత్మ : శే.వెం.రాఘవయ్య : Free Download, Borrow, and Streaming : Internet Archive
" INDIAN SNAKE DANCE " / DESI NAGINI DANCE !!.నాగినీ డాన్స్ వీడియో!
శ్రీ శివకోటయ్యాచార్యులు పెద్దకోమెర్ల గారి ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గోవిందమాంబ దేవితో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం కందిమల్లయ్య పల్లి మఠంలో జరుగును. కళ్యాణ మహోత్సవం ప్రతి మహాశివరాత్రి రోజున జరిగును.
దేశభాష, స్థానిక భాష, మాతృ భాషTelugu
తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన చెన్నంశెట్టి రామచంద్ర ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఆపార్టీలో చేరారు. కాంగ్రెస్లో విలీనం తర్వాత శాసనమండలికి ఎన్నికయ్యారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత హోదా పొందారు.కిరణ్కుమార్రెడ్డి మంత్రి వర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా పని చేశారు.1967-68లో సిండికేట్ బ్యాంకులో క్లర్క్గా విధులు నిర్వహించిన రామచంద్ర 1978లో కడప పురపాలికలో చెమ్ముమియాపేట వార్డు కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి 871 ఓట్ల ఆధిక్యత సాధించి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల సాధించిన వారు కౌన్సిలర్గా రికార్డు …
జిడ్డు కృష్ణ మూర్తి
100 0 _ ‡a జిడ్డు కృష్ణ మూర్తి
400 0 _ ‡a జిడ్డు కృష్ణమూర్తి ‡c భారతీయ తత్వవేత్త
తెలుగు: say
తెలుగు: కన్ఫ్యూషియస్ మతం
Be careful when alone( ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి) Message By BRO SATISH KUMAR GARU
FM 1155 S., చప్పెల్ హిల్, టెక్సాస్ నుంచి ఉత్తర సమీపంలో దక్షిణ Meyersville రోడ్ సమీపంలో పచ్చిక న పుష్పించే డెత్ camas (చూడండి ది నుట్టల్ యొక్క deathcamas, Zigadenus nuttallii). ఏప్రిల్ 7, 2010.
టెక్సాస్ A మరియు M విశ్వవిద్యాలయం లో TAMU హార్టికల్చరల్ గార్డెన్స్ లో ఒక కాక్టస్ న పసుపు పుష్పాలు. కాలేజ్ స్టేషన్, టెక్సాస్, సెప్టెంబర్ 8, 2011
ఈ నెల 13 న ఇంటర్ ఫలితాలు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. పూర్తయిన పేపర్ వాల్యుయేషన్. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14 వరకు జరిగిన పరీక్షలు.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 లక్షల 63 వేల 546 మంది విద్యార్దులు హాజరు…మొదటి సంవత్సరంలో 4 లక్షల 55 వేల 635 మంది, రెండవ సంవత్సరంలో 5 లక్షల ఏడు వేల 911 మంది విద్యార్దులు హాజరు అయ్యారు
తెలుగు: స్లోవేనియా
స్వర సాహిత్యం: |
స్వర సాహిత్యం:
Title : Mastanamma: 107 Year Old YouTube 'Chef' Life Journey_Country Foods_మస్తానమ్మ గురించి నమ్మలేని నిజాలు
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని గుడివాడలో ఈ నెల 2న మస్తానమ్మ చనిపోయారు. ఆమె వయసు 107 ఏళ్లని చెబుతారు.
మస్తానమ్మ వృద్ధాప్యం కారణంగా కన్నుమూసినట్టు ఆమె మనవడు కర్రె నాగభూషణం తెలిపారు. మస్తానమ్మ సొంతూరు గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని గుడివాడ గ్రామం.పదకొండేళ్ల వయసులోనే మస్తానమ్మ కు పెళ్లైంది. తన భర్త ఇరవైరెండేళ్లకే దూరమయ్యాడు. అప్పట్నుంచీ వ్యవసాయ కూలీగా చేస్తూ ఉన్న ఒక్క కొడుకుని పెంచింది. పొలం పనులకెళితే వచ్చే కూలి డబ్బులూ, వృద్ధాప్య పింఛనుతోనే పూరి గుడిసెలోనే ఒంటరిగా ఉంటుంది. 2017లో ‘కంట్రీ ఫుడ్స్' పేరుతో యూట్యూబ్ చానెల్. యూట్యూబ్ లో ‘కంట్రీ ఫుడ్స్' చానెల్స్ కి 1,217,556 సుబ్స్క్రైబ్ర్లు ఉన్నారు. మస్తానమ్మ చేసిన వంటల్లో పుచ్చకాయ చికెన్కు భారీ స్పందన వచ్చింది. ఇప్పటి వరకు యుట్యూబ్ లో ఆ వీడియోకు 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
Soap : సబ్బు . fuller''s earth used for * చవిటిమన్ను . the paste used instead of * వొళ్లు తోముకొనే పిండి . * suds నురుగు .
కల్వెర్ట్ స్మశానం లో మైర్టిల్ చెట్టు బెరడు. టెక్సాస్, జనవరి 15, 2011
బ్యాంకు ఉద్యోగం చాలామందికి కల. అందులోనూ SBI లో అంటే మరీ మోజు. చిన్న వయసులోనే కొద్ది పాటి కష్టంతో SBI లో ఆఫీసర్ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్ష ఎలా ఉంటుంది? ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి? తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.
జై ఆంధ్ర ప్రదేశ్ . . . జై సీమాంధ్ర . . . జై తెలంగాణా . . . జై తెలుగు . . . . రాష్ట్ర విభజనకు ముందు నా విశ్లేషణ - Educational Portal in Telugu , Free Competitive Exam Guidance Andhra Pradesh and Telangana, RRB, BSRB, APPSC, SSC and UPSC exams నవచైతన్య కాంపిటీషన్స్
కొనుగోలు చేయండి
జై ఆంధ్ర ప్రదేశ్ . . . జై సీమాంధ్ర . . . జై తెలంగాణా . . . జై తెలుగు . . . . రాష్ట్ర విభజనకు ముందు నా విశ్లేషణ
జై ఆంధ్ర ప్రదేశ్ . . . జై సీమాంధ్ర జై తెలంగాణా . జై తెలుగు ఎదుటి వారి అభిప్రాయాన్ని గౌరవిం చగల విజ్ఞత నాకు ఉంది . మీకు ఉం... 4:30:00 PM
జై ఆంధ్ర ప్రదేశ్ . . . జై సీమాంధ్ర
జై తెలంగాణా . జై తెలుగు
ఎదుటి వారి అభిప్రాయాన్ని గౌరవిం చగల విజ్ఞత నాకు ఉంది .
మీకు ఉంటే మాత్రమె ఈ ఆర్టికల్ చదవండి
నా అంతరంగం (లోపలికి తొంగి చూడకండి). . .
ఈ బ్లాగు అప్డేట్స్ నేరుగా మీ మెయిల్ కే !
ఈ బ్లాగులో ప్రచురితం అవుతున్న స్టడీ మెటీరియల్స్ నేరుగా మీ మెయిల్ కే పొందండి! ఇప్పటికే మంది ఈమెయిల్ ద్వారా మెటీరియల్స్ను అందుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ మెయిల్ ఐడి వివరాలు నమోదు చేసుకోండి
భర్తకి దూరం గా ఉంటే.. ప్రతి ఒక్కరూ.. పరిస్థితులు చెప్పిన సింగర్ సునీత _ Singer Sunitha _ Tollywood
Big News Big Debate : బీజేపీ Vs టీడీపీ మధ్యలో పవన్ కళ్యాణ్ - Rajinikan
తెలుగు ఫోటో ఎడిటర్ : Telugu Photo Editor
Previous: మన 8వ వార్డ్ కార్పోరేటర్ శ్రీ వర్రే శ్రీనివాసరావు గారు నిరంతరం పనిచేస్తూనే, చేయిస్తూనే ఉంటారు.
Next: కార్డు పోతే…కంగారోద్దు
e-humira.భారత్
రంగస్థలం స్ట...
ఈ లక్షణలు ఉన...
అల్జీర్స్ పాయింట్ లో ఎలిజా స్ట్రీట్ సమీపంలో Bouny స్ట్రీట్ ఒక కుటీర. న్యూ ఆర్లియన్స్, లూసియానా, 2006 నవంబర్ 5
Andhrajyothy.com _ ఆంధ్రజ్యోతి
ఆ ఫోన్ కాల్ తో నాకు చాలా భయమేసింది _ NTR shares his most Scariest Incident
సెయింట్ పీటర్స్బర్గ్, రష్యా, జూలై 28, 2005 నుండి 40 మైళ్ళ ఉత్తర Lembolovo, సమీపంలో ఒక మార్ష్ ఒక నాచు ("పేపర్" కోసం)
Fais సమీపంలో డ్యాన్స్ ప్రేక్షకులు Jazzfest సమయంలో స్టేజ్-ఏమి చేయాలి. న్యూ ఆర్లియన్స్, లూసియానా, ఏప్రిల్ 30, 2005.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
1931 అలంఅరా ఇక్కడే ప్రదర్శించ బడింది. ఇప్పటికీ ఈ ధియేటర్
మీరు సంస్థ $1 యొక్క ఒకే ఒక్క కూర్పును రద్దు చెయ్యబోతున్నారు.
శక్తి గల రక్షకుండై-మన కొరకు
Telugu: ద్వాదశి (te) (dvādaśi)
telogo : పిడి, మొగ్గ
tewiki జాకీ చాన్
తెలుగు (India) హాకీ చూసేందుకు క్యూ లైన్లో!
YSRCP లో చేరడం నేను చేసిన తప్పా..? - Actor Prudhvi Raj _Tea Time Celebrity__ Bharat Today
నందమూరి హీరో VS మెగా హీరో by telugustop.com 73 views
నందమూరి హీరో VS మెగా హీరో
అజంత ఎక్స్ప్రెస్
Tag Archives: అన్నామలై విశ్వవిద్యాలయం |
నేడు ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న దేశం యుక్రెయిన్. తన ఆధిపత్యంలో ఏక ధ్రువ ప్రపంచాన్ని అలాగే కొనసాగించాలని ధృడ నిశ్చయంతో వున్న అమెరికా, అందుకు అవరోధంగా రష్యా రావచ్చని భావిస్తూ, దానిని కట్టడి చేయాలనే లక్ష్యంతో రాజకీయం జేస్తున్న అమెరికాకు యుక్రెయిన్ పావుగా దొరికింది. అందువల్ల యుక్రెయిన్ గురించి, దాని ప్రాముఖ్యాన్ని గురించి గుర్తు చేసుకోవడం అవసరం.
యుక్రెయిన్ పరిచయం - చరిత్ర
అ) యుక్రెయిన్ తూర్పు యూరప్ దేశం, సోవియెట్ యూనియన్ విచ్చితికి ముందు దానిలో వున్న పదిహేను రిపబ్లిక్ లలో యుక్రెయిన్ ఒకటి.
- సరిహద్దులు : దక్షిణం : నల్ల సముద్రం; తూర్పు, ఈశాన్యంలో రష్యా విస్తరించి వున్నది. ఉత్తరం : బెలారష్యా; పశ్చిమం : పోలెండ్, స్లోవేకియా, హంగరీ; నైరుతీ మూల : రుమేనియా, మాల్దోవాలున్నాయి.
tewiki ముగ్గురు మొనగాళ్ళు (1994 సినిమా)
Telgonci తెలుగు ప్రజలు
స్కైలైన్ డ్రైవ్ వద్ద లోఫ్ట్ మౌంటైన్ యొక్క వైశాల్యం. వర్జీనియా, మే 16, 2007
Tucks న్యూ ఆర్లియన్స్, లూసియానా యొక్క krewe యొక్క Mardi గ్రాస్ పెరేడ్, ఫిబ్రవరి 25, 2006 సమయంలో సెయింట్ చార్లెస్ అవెన్యూ న వస్తారు
green nature (ఆకుపచ్చ ప్రకృతి)
టాలీవడ్ లో శ్రీరెడ్డి వ్యవహారం రోజు రోజుకు సంచలనంగా మారుతోంది. టాల…
Channel : మన ఊరు
ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ _ కారుణ్య , కల్పన ప్రదర్శన _ స్వరాభిషేకం _ 3 డిసెంబర్ 2017
పాములనర్సయ్య గారి గురించి Net లో మొదటి వీడియో - Power of Sri. Pamula Narasayya garu - Duration: 20:25. Nanduri Srinivas 92,410 views
సెయింట్ చార్లెస్ అవెన్యూ న సెయింట్ పాట్రిక్ డే పెరేడ్. న్యూ ఆర్లియన్స్, లూసియానా, 2006 మార్చి 11
Vitebsky Vokzal యొక్క స్టీల్ వంపులు (రైలు స్టేషన్). సెయింట్ పీటర్స్బర్గ్. రష్యా, జూలై 10, 2010
శ్రీదేవి ఎవరు? సావిత్రి ఎవరు?
49రోజుల్లో రికార్డుల ఉప్పెన!
`నవాబ్` నిర్మాతలకే `సర్కార్`
`రంగస్థలం`ని టచ్ చేశాడు
ఫస్ట్ లుక్: అభినవ శ్రీదేవి
తెలుగు ఫిన్లెండ్ (ИС->)
తెలుగు: బీజగణితం
★★ ℒund Broken ★★ ఉచిత Mp3 డౌన్లోడ్
ఆ ప్రముక హీరో ఇంట్లో దొంగలు పడ్డారు
పబ్లిక్ రా ఇది అన్ని తెలిసిన పబ్లిక్ రా
అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు మణిశర్మ!
సంక్రాంతి సంబరాల్లో సమంత చేసిన పనికి నాగార్జున షాక్ _ Sankranthi Celebrations 2018 _ Watch Here ►►
నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లెమ్మా. .
ఆ సమ్సోనులా చంపుకొందువా ఓ సోదరుడా. .
మరోసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో..! _ trivikram _ jr ntr _ pooja hegde _ nagababu |
రూ.2 లక్షల కోట్ల ఆధ్యాత్మిక మార్కెట్ ఆమె టార్గెట్
స్ఫూర్తి పొందండి
కొత్త ఆలోచన
సాంకేతిక విజ్ఞానం
భారత దేశం.. ఓ వేద భూమి. ఎంత ప్రపంచీకరణ జరిగినా, విదేశీ కల్చర్ ఇక్కడి యువతలో పూర్తిగా కలిసిపోయినా మన మూలాలు మాత్రం ఎప్పటికీ సమసిపోయే అవకాశమే లేదు. ఇక్కడ మతానికి, ఆచారాలకు ఇచ్చే విలువ తగ్గడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అంతే కాదు పెళ్లిళ్లకు, దైవ సంబంధ కార్యక్రమాలకు డబ్బు చెల్లించేందుకు జనాలు ఏ మాత్రం వెనుకాడరు. కులం, మతం, వర్గం, ఆర్థిక స్థితితో సంబంధంలేకుండా ఈ రెండింటికీ ఎంత ఖర్చైనా చేయగలరు మన వాళ్లు. ఖచ్చితంగా ఈ పాయింట్నే ఆంట్రప్రెన్యూర్లు పట్టుకుంటారు. ఇంత విలువైన మార్కెట్ను, అదికూడా ఎలాంటి మాంద్యాలు ముంచెత్తినా ఏ మాత్రం ఢోకాలేని వ్యాపారాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి ? పెళ్లిళ్లు జరిపించే మార్కెట్ ఒకటైతే మిగిలిన కార్యక్రమాలైన పూజలు, వేడుకలు, ఇతర తంతులది కూడా చాలా పెద్ద మార్కెట్ అనడంలో సందేహమే లేదు.
'శుభ్పూజ' అనే సంస్థ కూడా ఆ ఆలోచనను సొమ్ము చేసుకునేందుకు పుట్టిందే. ఢిల్లీకి చెందిన సౌమ్యవర్ధన్ ఈ స్టార్టప్ రూపకర్త. వివిధ వర్గాల వారికి వాళ్ల అవసరాలకు తగ్గట్టు పూజలు, ఇతర దైవ సంబంధ కార్యక్రమాలు ఏర్పాటు చేసే ఓ మతసంబంధమైన పోర్టల్. శుభ్పూజ ఏర్పాటుకు ముందు సౌమ్య లండన్ ఎర్న్స్ట్ అండ్ యంగ్, కెపిఎంజి సంస్థల్లో ఆపరేషన్స్, టెక్నాలజీ కన్సల్టెంట్గా పనిచేశారు. ఆమె బ్రిటన్ ఇంపీరియల్ కాలేజీ నుంచి ఎంబిఏ కూడా పూర్తిచేశారు. అయితే విదేశాల్లో ఉద్యోగాల కంటే భారత్లో ఏదైనా కొత్తగా, జనాల జీవితాలకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలనేది ఆమెకు కోరికగా ఉండేది.
ఒకసారి భారత్కు వచ్చిన తనకు ఓ అనుభవం ఎదురైంది. తన స్నేహితురాలి తండ్రి మరణించారు. అప్పుడు ఒక పూజారిని పిలిచి ఆఖరి సంస్కారాలు చేయించడానికి ఆమె ఎంతో ఇబ్బంది పడింది. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లి ఇలాంటి సేవలు పొందే వెసులుబాటు ఏదీ లేకపోవడమే సౌమ్యకు ఓ బిజినెస్ ఐడియాను ఇచ్చింది.
డిసెంబర్ 2013లో శుభ్పూజ అధికారికంగా లాంఛ్ అయింది. మొదటి ఏడాదిలోనే వంద మంది క్లైంట్లకు సేవలందించి ఇప్పుడు వృద్ధి పధంలో దూసుకుపోతోంది. 100కు పైగా పండిట్స్, ఆస్ట్రాలజర్స్, వాస్తు కన్సల్టెంట్లు ఢిల్లీలో ఉన్నారు. అయితే వీళ్లంతా వీధి చివర్లో ఉన్న బాబాలో, ఆసాములో కాదు పెద్ద యూనివర్సిటీలో బాగా చదువుకున్న స్కాలర్స్. వారణాసి, నాసిక్, ఉజ్జైని, ఢిల్లీ వంటి వైదిక విశ్వవిద్యాలయాల్లో వేద విద్యను ఔపోసన పట్టినవారే. సాధారణంగా ఈ మార్కెట్లో ఎవరినైనా తెలిసిన వాళ్లు పిలవాలి. లేకపోతే ఫలానా వాళ్లు బాగా చేస్తారట అనే సలహాతో అయినా మన అవసరాలకు పంతులుగారిని ఇంటికి పిలిపించుకోవాలి. వాళ్లకు ఏం వచ్చో ఏం రాదో మనకు తెలియదు. రేట్ కూడా ఇంతా అనే నిర్ధారణ ఏమీ ఉండదు. అందుకే ఈ వ్యవస్థను క్రమబద్ధీకరించి సరైన సేవలను అందిస్తామంటోంది శుభ్పూజ.
జాతకాలు చెప్పడం, ఆన్లైన్ సలహాలు, దోషపరిహారాలు, పెళ్లిళ్లు, పుట్టువెంట్రుకలు, బారసాల, నోములు, వ్రతాలు.. చివరకు ఆఖరి సంస్కారాలకు అవసరమైన క్రతువులు జరిపించే వారందరినీ ఒక్క వేదికపైకి తెచ్చారు.
అవసరమైతే కస్టమర్ ఇంటికే వెళ్లి కన్సల్టేషన్ చేయడమే, లేకపోతే వీళ్ల ఆఫీస్కే వచ్చి సమాధానాలు తెలుసుకోవచ్చని కంపెనీ చెబ్తోంది. మార్కెటింగ్ కోసం ఎగ్జిబిషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేయడం, హాలిడే కార్నివల్స్లో పాల్గొంటున్నారు. జ్యోతిష్యంపై మక్కువ ఉన్నవాళ్లకు వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం, వాస్తు శాస్త్త, సంఖ్యా శాస్త్రంపై అవగాహన పెంచడం కూడా చేస్తున్నారు.
శుభ్పూజలో ఆరుగురు సభ్యుల ఆపరేషన్స్ టీమ్ ఉంది. త్వరలో తమ నెట్వర్క్ను పెంచుకోవాలని సౌమ్య ఆశిస్తున్నారు. భారత దేశ స్పిరిచ్యువల్ మార్కెట్ దాదాపు 30 బిలియన్ డాలర్లని (దాదాపు రూ.2 లక్షల కోట్లు) అని ఓ అంచనా. ఆన్ లైన్ ప్రసాద్, ప్రౌడ్ ఉమ్మా(ఇస్లాం సంబంధిత సైట్) ఈ రంగంలో తమ సేవలను అందిస్తున్నాయి. సమాజానికి ఏదో చేయాలనే ఆలోచనలో మొదలైన ఈ సైట్ అందుకు ఈ వేదిక ద్వారా ఏం చేస్తుందో ఇప్పుడు చెప్పడం కష్టంకానీ.. దీనికైతే భారత్లో మాత్రం పుష్కలమైన మార్కెట్ ఉంది. ఇంకా ఎంతో మంది ప్లేయర్స్కు ఇక్కడ అవకాశముంది. ఆధ్యాత్మిక మార్కెట్లో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి మెరుగైన మార్గాలే ఉన్నాయి.
ఇడ్లీ పిండిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన iD ఫ్రెష్. రూ. 1000 కోట్ల వ్యాపారమే లక్ష్యం
యాసిడ్ దాడి మొహాన్ని మాడ్చేయొచ్చు... కానీ మనసును మాత్రం రాటుదేల్చింది !
పటిష్టమైన స్టార్టప్కు 10 సూత్రాలు !
వారానికి 20 శాతం వృద్ధితో దూసుకుపోతున్న 'రోడ్ రన్నర్' |
ఆన్లైన్లో రొమాంటిక్ అనుభూతిని కల్పించే 'ట్రూలీ సోషల్'
స్ఫూర్తి పొందండి
కొత్త ఆలోచన
సాంకేతిక విజ్ఞానం
వర్చువల్ రియాలిటీ అనే సరికొత్త భావనను మీరు ఇష్టపడుతున్నారా ? దీని ద్వారా మీరెప్పుడైనా డేటింగ్ చేసేందుకు ప్రయత్నించారా ? నిజ జీవితంలో శృంగారానికి ఇది దారి తీసే పరిస్థితులు తీసుకురాగల సత్తా వర్చువల్ రియాలిటీకి ఉందని తెలుసా ? నమ్మినా నమ్మకపోయినా ట్రూలీ సోషల్ రూపొందించన (ఫ్లర్టింగ్ + వర్చువల్) ఫ్లర్చువల్ రియాలిటీ గేమింగ్ ఆప్ చేసేది ఇదే. ఈ యాప్ ఓ సంచలనం. ఐదేళ్ళ క్రితమే సెబాస్టియన్ కోమన్.. సోషల్ గేమింగ్పై ఆసక్తి కనబరిచారు. అయితే అప్పటికే గేమింగ్ ట్రెండ్ సమాజాన్ని చుట్టుముట్టేస్తోంది.
గేమ్లన్నీ మూసధోరణిలో, కొత్త దనం ఏమీ లేనట్టు భావించారు సెబాస్టియన్. ఎప్పుడూ బోర్గా అనిపించే గేమ్లు ఏం ఆడతారు ? గేమింగ్ ప్రియుల కోసం కొత్త ఏదైనా చేయాలని భావించారు సెబాస్టియన్. సంప్రదాయ గేమ్లకు కాలం చెల్లిందని, వినూత్నంగా ఆలోచించి డిజైన్ చేసే గేమ్లకు మంచి ఆదరణ ఉంటుందని గుర్తించారు. ఎంతో మంది మహిళలు గేమింగ్లోకి వస్తున్నా, ఎవరూ ఈ సెగ్మెంట్పై అంతగా ఆసక్తి కనబరచడం లేదని గమనించారు.
ఈ ఆలోచన రావడానికి మరో కారణం కూడా ఉంది. పలు డేటింగ్ సైట్స్ అందుబాటులో ఉన్నా.. అన్నీ టెక్ట్స్ మెసేజ్ల ఆధారితమైనవే. వాటిని విశ్వసించడానికి అంతగా ఆస్కారం లేదు. సామాజిక పరిచయాల విషయంలో గేమిఫికేషన్ను ఎవరూ ప్రయత్నించలేదు. రొమాంటిక్ భావనలపై ఓ గేమ్ రూపొందించవచ్చనే ఆలోచనతో ట్రూలీ సోషల్ మొదలైంది. త్రీడీ ప్రపంచం ఆధారంగా వర్చువల్గా జంటలను కలపచ్చన్నదే ఫ్లర్చువల్ రియాలిటీ ప్రధాన ఉద్దేశ్యం.
వర్ట్యువుల్ మోడల్లో రొమాంటిక్ టచ్తో గేమింగ్ ఫార్ములా తయారుచేయాలని భావించారు. త్రీడి తరహాలో గేమింగ్ తయారుచేశారు సెబాస్టియన్. బిజినెస్ స్కూల్లో కొలీగ్ అయిన సలోని సెహగల్తో తన ఐడియా గురించి వివరించారు. అప్పటికి బార్క్లేస్ బ్యాంక్కి సలోని వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ట్రూలీసోషల్ గురించి ఆమెకు వివరించారు సెబాస్టియన్. ఆంట్రపెన్యూర్షిప్లోకి ప్రవేశించాలని, ఏదైనా సాధించాలన్న తన తపనను ఆమె ముందు పెట్టారు సెబాస్టియన్. దీనికి ఉన్న సామర్ధ్యం అర్ధం కాగానే.. బోర్డ్లోకి ప్రవేశించానంటారు సలోనీ.
వీలైనంత త్వరగా మినిమం వయబుల్ ప్రొడక్ట్(కనీస గిట్టుబాటు గల ఉత్పత్తి)ని రూపొందించారు సెబాస్టియన్. ఇందు కోసం కొందరు అమెరికన్ డెవలపర్స్ సహాయం తీసుకున్నారు. ఈ ప్రొడక్ట్ను భారత్తో లింక్ చేయగలగితే.. ఖర్చు విషయంలో ఉండే లాభదాయకతపై సలోనీకి అవగాహన ఉంది. అందుకే భారతీయ డెవలపర్లను తీసుకుని వ్యయాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిద్దామని సూచించారు.
సెబాస్టియన్కి ఈ ఐడియా నచ్చడంతో వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టారు సలోని. గేమింగ్ డెవలపర్ల కోసం వెతకడం ప్రారంభించారు. ‘‘మేం ఇండియా నుంచి ఔట్సోర్సింగ్ ద్వారా ఎవరైనా ఉద్యోగుల్ని తీసుకోవాలని భావించాం. అయితే మేం మంచి టీంని ఎంపిక చేసుకోగలిగాం. ఔట్సోర్సింగ్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మేం ఎంపిక చేసుకున్న టీం సభ్యులు అప్పటికే మంచి అనుభవం ఉన్నవారు. ప్రతిభ ఉన్న ఆర్టిస్టులు, డెవలపర్లు’’ అన్నారు సలోని.
యుకెలో స్థిరపడ్డ కంపెనీ ట్రూలీ సోషల్. అయితే లండన్తోపాటు.. ఇండియాలోనూ ఈ వెంచర్ విస్తరించింది. ‘‘ఇద్దరితో ప్రారంభమయిన మా టీం ఇప్పుడుతొమ్మిది మందికి చేరింది. కొత్తగా వచ్చే వారికి మేం చెప్పేది ఒక్కటే. కొత్త ఆలోచనలకు రూపం ఇవ్వండి. ఎప్పుడూ కొత్తగా ఆలోచించండి’’ అని చెబ్తున్నారు సలోని.
సమస్యలు-పరిష్కారాలు
కొత్త ప్రపంచంలోకి ప్రవేశించడం.. ప్రారంభంలో కొన్ని సవాళ్లను తీసుకొచ్చే విషయమే. గేమ్లను రూపొందించే రంగంలో.. ఇప్పటికే పోటీ తారాస్థాయిలో ఉందంటారు సలోనీ. సాధారణంగా గేమింగ్ యాప్ తయారుచేసే ఉద్యోగులు ఎప్పుడూ కొత్తదనం కోసం ఆలోచించాల్సి ఉంటుంది. వారికి తగిన వసతులు, ధైర్యం, అన్నిటికంటే మించి తగిన సమయం ఉండాలి. బోర్ కొట్టడం అనేది వారికి విసుగును తెప్పించేదిగా ఉంటే.. మరిన్ని ఫలితాలు సాధించవచ్చంటారు సలోనీ.
“మేం ఉద్యోగులకు ఇచ్చే జీతాలు తక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఉద్యోగం చేయడం అంటే.. మనసుకు దగ్గరయ్యేలా గేమింగ్ వ్యవస్థలో భాగం కావడం. ఒక యూజర్ అనుభవాన్ని సృష్టించడానికి ముఖ్యం కొత్త ఆట, శైలి. ఇందుకు ముఖ్యంగా కావలసింది సమయం. వనరులు. వీటన్నిటికంటే కాలం ప్రధానమైంది’’ అంటారు సలోని.
సాధారణంగా ముందుగా అనుకున్న డెడ్లైన్ ప్రకారం ప్రాజెక్టు పూర్తికావాలని పెట్టుబడిదారులు కోరుకుంటారు. ట్రూలీ సోషల్లో పెట్టుబడి పెట్టేవారు.. సాధారణంగా ఈకామర్స్ సైట్లతో మా కంపెనీ పోల్చి చూస్తుంటారు. కొంతమంది గేమింగ్ అప్లికేషన్ డెవలపర్లు ఎక్కువ టైం తీసుకున్న మాట వాస్తవమే కానీ, కేవలం మూడంటే మూడురోజుల్లో కొత్త గేమ్స్ తయారుచేసి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. |
ది సిమ్స్ అనే గేమ్ని ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ తయారుచేసింది. దీంతో పాటు ఇదే టీం లైవ్ బీటా ద్వారా యాంగ్రీబర్డ్స్ సిరీస్లో 51 గేమ్స్ రూపొందించారు. ఈ గేమ్ డెవలపర్లు.. వినియోగదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని తరువాతి వెర్షన్లో వాటికి మెరుగులు దిద్దుతూ ఉంటారు. వెర్షన్లో మార్పులు చేశాక ఎంతోమంది వినియోగదారులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. ప్రస్తుతం తమ వెంచర్కు కొత్త పెట్టుబడిదారులను వెతికే పనిలో ఉన్నామని చెప్పారు సలోని.
మొబైల్లో ఉచితంగా గేమ్స్ అందించగలగడం, కనీస లాభదాయకత ఉండే గేమ్లను రూపొందించడం స్మార్ట్ ఫోన్స్ ప్రవేశించాక కొంత సులభంగా మారింది. ఇలాంటి ఆటల రూపకల్పన పెరిగింది. ఇప్పుడు కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని.. అందుకు అనుగుణంగా.. గేమ్లో మార్పు చేర్పులు చేస్తున్నారు. “ ప్రస్తుతం మేం రూపొందించిన యాప్కు ఆశించిన స్థాయికి మించిన స్పందన లభిస్తోంది. యూజర్లు ప్రారంభంలోనే వీటివైపు మొగ్గుచూపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందుకోసం యూజర్ ఇంటర్ఫేజ్, యూజర్ ఇంటరాక్షన్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాం ” అన్నారు సలోనీ. మరోమారు నిధుల సమీకరణకు ప్రయత్నాలు జరుగుతుండడం విశేషం.
మా లక్ష్యం ఏంటంటే..?
‘‘వినోద ప్రధానమయిన, కొత్త ఆలోచనలతో కూడిన... ముఖ్యంగా రొమాంటిక్ భావనలున్న గేమ్లో లీనమయ్యే అనుభవాన్ని కలిగించడమే మా ఉద్దేశం. మా థీంలతో పోటీపడే గేమ్స్ ప్రస్తుతం మార్కెట్లో ఏం లేవు. మనం ఆడే గేమ్స్లో రాక్షసులను చంపడం, కృత్రిమ బొమ్మల ఇళ్ళు, ఆటలు ఆడడం, వివిధ అవతారాలు ఇలా ఎన్నో విలక్షణమయిన అంశాలతో కూడిన గేమ్లు ఉంటాయి.
టెక్నాలజీ ఎంతో మారిపోయింది. మనం ఎంతో స్మార్ట్గా తయారయ్యాం. ఇదే సమయంలో మనం కొన్ని అనుభూతులను కూడా కోల్పోతున్నాం. ఫ్లర్చువల్ రియాలిటీ ఇప్పుడు కొత్త ట్రెండ్. ఇది మన ఆలోచనల్ని కొంచెం మార్చగలదని మేం భావిస్తున్నాం’’ అంటున్నారు సలోని.
సామాజిక మాధ్యమాలతో అనుసంధానమైన డేటింగ్ ఇంటరాక్షన్స్ చేస్తున్నాం. మా ఉద్యోగులు కూడా ఇదే పనిలో ఉన్నారు. వీడియో గేమ్ మెకానిక్స్తో బిహేవియరల్ సైకాలజీ, న్యూరో సైన్స్ వంటి అనేక అంశాలు జోడిస్తున్నాం. అవతార్ త్రీడీ గేమ్లో ఎంటరయిన వెంటనే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యారెక్టర్లు కనిపిస్తాయి. న్యూరోసైంటిస్టుల సాయం తీసుకోవడం కారణంగా.. నిజంగా డేటింగ్ చేసిన అనుభూతిని కల్పించడం దీని స్పెషాలిటీ.
మన అరచేతిలో ఉన్న ఫోన్లో మంచి గేమ్స్ ఆడుతూ ఉంటే మెదడు కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. 90 వేల వాక్యాలు తయారుచేసి గేమ్ డెవలపర్లకి ఇస్తే ఎవరికివారు స్వంతంగా ఆలోచించి మంచి గేమ్ రూపొందిస్తారు. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఏ ఇద్దరు కలిసినా ఒకే ఆలోచన ఉండదు. ఎవరికీ ఒకే సంభాషణ మరోసారి ఎదురుకాదు. ఎంత బాగా ఆడితే అన్ని హగ్స్ అకౌంట్లోకి వస్తాయి. ఎంత చక్కగా, తెలివిగా సంభాషణ కొనసాగిస్తే.. గేమ్లో అంతగా ముందుకెళ్లచ్చు. దీంతో లిటిల్ బ్లాక్ బుక్కి నెంబర్స్ యాడ్ చేయడం ద్వారా.. పారిస్లో వర్చువల్ డేటింగ్ చేయచ్చు. ఎవరికి వారు కొత్తగా ఆలోచించే ఈ గేమ్లో ప్యారిస్, ఆస్పెన్ వంటి రొమాంటిక్ ప్రాంతాల్లో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. “మేం కొన్ని అనుబంధాలను ఏర్పరుస్తున్నాం” అంటున్నారు సలోనీ.
భవిష్యత్ ప్రణాళికలు
బీటా వెర్షన్కే అనూహ్యమైన స్పందన వస్తోందని చెబ్తోందీ ఫ్లర్చువల్ రియాలిటీ టీం. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి యూజర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ట్రూలీ సోషల్ అందించే గేమ్స్ని 18 నుంచి 30 సంవత్సరాల వయసున్న మహిళలే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బీటా వెర్షన్ గేమ్ప్ అందుబాటులో ఉన్నాయి. మా గేమ్స్ వాడుతున్న వారిలో 70 శాతం మంది మహిళలే. ఒక్కక్కరూ సరాసరిన 25 నుంచి 30 నిముషాలు గేమింగ్లోనే గడుపుతున్నారు.
ఫ్లర్చువల్ రియాలిటీ ఓ సాహిత్య ప్రక్రియ లాంటిది. గేమింగ్, డిజిటల్ డేటింగ్ అనే ప్రక్రియలను వాడుతూ ఉండాలి. అత్యంత రద్దీగా ఉండే గేమింగ్ ప్రపంచంలో లాభదాయక మార్కెట్లను ఎంచుకోవాలంటారు సలోనీ. సాధ్యమయినంత వరకు అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా గేమింగ్ సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని చెబ్తున్నారామె. మొబైల్స్లో వర్చువల్ రియాలిటీ ఉండేలా చూసుకోవాలి. స్మార్ట్ ఫోన్లు పెరిగాక గేమింగ్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.
పెరుగుతున్న సాంకేతికతకు అనుకరణగా , పెరుగుతున్న స్మార్ట్ఫోన్ మరియు టాబ్లెట్ వ్యాప్తి, మరియు గేమింగ్ మరియు డేటింగ్ అనువర్తనాలు ఏర్పడటంతో , పెరుగుదల బాగా ఉంటోంది.
యూజర్ల అభిరుచులకు అనుగుణంగా మన గేమింగ్ విధానం ఉండాలి. అప్పుడే మనం తయారుచేసే యాప్లను వినియోగదారులు ఆదరిస్తారంటారు సలోన్. ఇప్పటికే గేమ్లో వర్చువల్ ఎకానమీని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా యాప్లోని కొనుగోళ్లను అంచనా వేసుకుంటున్నారు. పరిశీలన కోసం కూడా శక్తివంతమైన ప్లాట్ఫాం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కస్టమర్లలో 2 నుంచి 3 శాతం ప్లేయర్లను యాప్లో కొనుగోళ్లు చేసేవారిగా మార్చాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. |
ట్రూ సోషల్ యాప్ ద్వారా గేమ్లు కొనుగోలు చేయడం చాలా తేలిక. అమెరికాలో దీని ద్వారా 8 నుంచి 12 డాలర్లు పెట్టి యాప్లు కొంటున్నారు. కొంతమంది 100 డాలర్లు అంటే మన రూపాయల్లో అయితే 6 వేల రూపాయలు కూడా వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు. ఎక్కువమంది గేమింగ్ యాప్లు తీసుకుంటే ఈ ధర తక్కువగా వస్తుంది.
గత ఏడాది మా టీం సీడ్రౌండ్ని పక్కన పెట్టేసింది. కొత్త పెట్టుబడిదారుల ను అన్వేషిస్తున్నాం. త్వరలో మంచి గేమ్లు తయారుచేసి అందరికీ కొత్త గేమింగ్ ఉత్తేజాన్ని అందిస్తాం’’ అంటున్నారు సలోని.
2015 చివర్లో పెద్దస్థాయిలో ఇనిస్టిట్యూషనల్ రౌండ్ ఫండింగ్ ద్వారా నిధుల సమీకరణ చేయనున్నారు. “దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిధులు సమీకరించగలిగేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామనే విషయం మాకు తెలుసు. మేం సృష్టించిన వినూత్న ఉత్పత్తికి తగినంత స్థాయిలో డిమాండ్తో పాటు, నిధులు కూడా అందుతాయని ఆశిస్తున్నాం. మార్కెట్కి సెట్ అయ్యే ప్రోడక్ట్ని అందించామనే నమ్మకం మాకుంది. దీన్ని ఖర్చులకు తగినట్లుగా నిర్వహించడం ముఖ్యమైన విషయం. నిధుల సమీకరణ పూర్తయ్యాక.. వ్యాపార సామర్ధ్యాన్ని, తీరుతెన్నుల్లో కీలక మార్పులను తీసుకొస్తా”మని చెప్పారు సలోనీ.
డేటింగ్-ఇన్-వర్చువల్-రియాలిటీ
బార్-క్లేస్-బ్యాంక్
ఈ ఆన్లైన్ సెలబ్రిటీకి ఒబామా ఫ్రెండ్ రిక్వెస్ట్ ! |
సోషల్ మీడియా
సినిమా వార్తలు
సామాజిక న్యాయం
సినిమా కబుర్లు
కొత్త పుస్తకాలు
లైఫ్ స్టైల్
జిల్లా వార్తలు
విజయవాడ సిటీ
పశ్చిమ గోదావరి
నాన్-వెజిటేరియన్
పిండి వంటలు
ఫార్ములా వన్ హెచ్2 వో బోట్ రేసింగ్ విజేత అబుదాబి[06:34 PM]
ఈ పోటీల ద్వారా అమరావతి సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజెప్పాం[06:32 PM]
షూటింగ్ కోసం పాకిస్థాన్ జెండా ఎగురవేసిన సల్మాన్ ఖాన్.. స్థానికుల అభ్యంతరం![05:37 PM]
టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా ప్రకటన[05:30 PM]
బాధిత కుటుంబానికి అక్కిరాజు పేరుతో సహాయం[05:27 PM]
అందుకే, ట్రాన్స్ జెండర్ కు టికెట్ కేటాయించాం[05:17 PM]
జన బాట పట్టిన జనసేన సైనికులు[05:13 PM]
కన్నీరుపెట్టిన కాంగ్రెస్ నేత ముత్యంరెడ్డి[05:10 PM]
చిరంజీవి, అల్లు అరవింద్ లనే గెలిపించుకోలేని నువ్వు.. 2014లో మమ్మల్ని గెలిపించావా?[05:07 PM]
నేనింతే.. నేను ఇలాగే ఉంటా.. అవసరమైతే చంద్రబాబుకే జవాబు చెప్పుకుంటా![05:05 PM]
Home » ఫీచర్స్ » చీకటిని జయించిన సంకల్పం
దేశంలో మహిళలపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతి మహిళా తన రక్షణ కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటోంది. ఇక అలాంటి విషయాల్లో వికలాంగ మహిళల గురించి ఎవ్వరూ పెద్దగా ఆలోచించడం లేదు. నిజానికి, వారే శారీరక వేధింపులకు ఎక్కువగా గురవుతుంటారు. అలాంటి మహిళల స్వీయరక్షణ కోసం పనిచేస్తోన్న సంస్థలో శిక్షణ తీసుకున్న ఓ అంధురాలు జుడోలో ఏకంగా నేషనల్ ఛాంపియన్ అయ్యిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అవమానాలను, వేధింపులను ఎదుర్కొంటూ చీకటిని జయించిన ఆమె సంకల్పం ప్రతిఒక్కరికీ ఆదర్శమే.
జబల్పూర్ జిల్లాలోని పిపరియా పరిధిలో ఉన్న కుర్రే అనే చిన్న గ్రామానికి చెందిన జానకి గౌడ్ పుట్టుకతోనే అంధురాలు. అలా బాల్యం నుంచే ఆమె జీవితం అంధకారంగా మారింది. ఆమె తల్లిదండ్రులు రోజు కూలీలు. ఇంట్లో ఆమెను వదిలి, పనులకు వెళ్లాలంటే వారు భయపడేవారు. 'మా ఊరిలో ఉన్నప్పుడు నా చూపు వల్ల నాకు ఎలాంటి సమస్యలూ రాలేదు. కానీ ఎప్పుడైనా వేరే ఊళ్లకి వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. నేను వేరే ఊరికి వెళ్తున్న ప్రతిసారీ నా తల్లిదండ్రులూ చాలా భయపడేవారు. ఎందుకంటే, చాలామంది నా దృష్టిహీనతను వారికి అవసరంగా మార్చు కున్నారు' అంటూ చెప్పుకొచ్చింది జానకి.
మధ్యప్రదేశ్లో 2010 నుంచి 'సైట్సేవర్స్' పేరులో అంధ మహిళకు స్వీయరక్షణలో శిక్షణ ఇస్తోన్న సంస్థ గురించి తెలుసుకుంది జానకి. అలా 2014లో అందులో చేరింది. అక్కడ స్వీయరక్షణలో భాగంగా జుడోలో శిక్షణ తీసుకుంది. దాని తర్వాత ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఈ సంస్థలో శిక్షణ తీసుకున్న జానకి సెల్ఫ్డిఫెన్స్ నేర్చుకోవడమే కాకుండా నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది. అలా 2016తో పాటు గతేడాది జరిగిన బ్లైండ్, చెవిటి జుడో నాల్గవ, ఐదవ నేషనల్ ఛాంపియన్షిప్లో సిల్వర్, గోల్డ్మెడల్ సాధించింది. 'గతంలో అందరూ నన్ను పక్కవారి సహాయం లేకుండా నువ్వేమీ చేయలేవు అని ఎగతాళి చేసేవారు. అలాంటివారి నోరు మూయించాను. ఇప్పుడు నా కుటుంబం నన్ను చూసి గర్వపడుతోంది. చాలా ఆనందంగా ఉంది. ఇది నా జీవితాన్ని మార్చివేసింది' అంటోంది జానకి.
భారతదేశంలో ప్రతిరోజూ 100 అత్యాచారం కేసులు నమోదు అవుతున్నాయి. 2016 రిపోర్టు ఆధారంగా చూస్తే ఒక్క మధ్యప్రదేశ్లోనే 4882 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. సైట్సేవర్స్ సంస్థ సేవలు విస్తృతం చేయడం ద్వారా మధ్యప్రదేశ్లోని వికలాంగ (అంధ) మహిళలకు సెల్ఫ్డిిఫెన్స్ శిక్షణ ఇచ్చి వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇప్పుడు ఈ మహిళలు ఎలాంటి ప్రాంతాల్లోనైనా భయం లేకుండా తిరగగలుగుతున్నారు. అంతేకాదు, గతంలో ఇక్కడ శిక్షణ తీసుకున్న మహిళలే ప్రస్తుతం చాలామందికి శిక్షణలిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రానికి మెడల్స్ తీసుకొస్తున్నారు. 'మేము సెల్ఫ్డిపెన్స్, జుడో శిక్షణను ప్రారంభించడానికి కారణం, ఈ ప్రాంతంలో అత్యధికంగా వికలాంగ మహిళలపై అఘాయిత్యాలు పెరగడమే. వికలాంగ మహిళలు వారిని వారు కాపాడుకోలేరు. చుట్టూ ఉన్నవారిని చూసి భయపడుతుంటారు. అందుకే ప్రత్యేకంగా వీరికి శిక్షణ ఇవ్వాలని అనుకున్నాం' అని సైట్సేవర్స్ ప్రోగ్రామింగ్ మేనేజర్ జయశ్రీ కుమార్ చెబుతున్నారు.
పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక‘ప్రజాశక్తి పెళ్లిపుస్తకం’. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం
సరికొత్తగా బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160
చల్లని శరీరానికి..!
సమ్మర్ టెర్రర్...'చల'్లగా పరార్!
పండ్లు- పోషక విలువలు ఉపయోగాలు
మెగ్నీషియం మాయ!
ఆహారమే...పరిష్కారం!
ఆరోగ్య రక్ష...తులసి!
గుడ్ షాట్!
ప్రధాన వార్తలు
హైదరాబాద్ - తిరుపతి స్పైస్ జెట్లో సాంకేతిక లోపం
45కు చేరిన గజ తుఫాన్ మృతులు |
శంకరాభరణం: సమస్య - 2275 (గణయతులు లేని పద్యంబు...)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
50 వ్యాఖ్యలు:
శాస్త్రి గారు
మీ "గరగరి" కందం "ఎమితిని సెబితివొ కవితము" ను గుర్తుకు తెచ్చింది...
మన హాస్య పద్యములు చదివిన కవివర్యులు శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య (85) గారి వ్యాఖ్య:
ఏల్చూరి మురళీధరరావు ఫిబ్రవరి 06, 2017 6:48 PM
డా.పిట్టా సత్యనారాయణ
డా.పిట్టా సత్యనారాయణ నుండి
మా _ పటుత్వ కవిత్వ స౦పదల నొసగు ! ! !
గుండా వేంకట సుబ్బ సహదేవుడు ఫిబ్రవరి 06, 2017 8:18 AM
గోలి హనుమచ్ఛాస్త్రి ఫిబ్రవరి 06, 2017 9:20 AM
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు ఫిబ్రవరి 06, 2017 11:59 AM
శాస్త్రి గారి సంతోషకారకము:
డా. సీతా దేవి గారు ధన్యవాదములు.
గురువు గారూ మీ పద్యములు అధ్బుతము గా వున్నవి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువు గారికి నమస్కారములు!
దయచేసి నా పద్యము చూడగలరు.
కామేశ్వర రావు పోచిరాజు ఫిబ్రవరి 06, 2017 11:25 PM
మీ పూరణ బాగుంది. అభినందనలు
గురువు గారికి నమస్కారములు. నిన్నటి నా పూరణ చూడ గోరుతాను. ధన్యవాదములు.
(మా గృహాంబరమణి = మా ఇంటి సూర్యుడు)
Bhagavatula Krishna Rao ఫిబ్రవరి 06, 2017 2:53 PM
Rama krishna Nemani ఫిబ్రవరి 06, 2017 3:11 PM
nageswararao pinnaka ఫిబ్రవరి 06, 2017 7:33 PM
పదములుంచ...అని పఠించ మనవి.
వ్యాఖ్యను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
మొత్తం పేజీ వీక్షణలు
(విశ్రాంత తెలుగు పండితుడు)
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
ఛందస్సు సాఫ్ట్వేర్
తెలుగు నిఘంటువు
చమత్కార పద్యాలు (251)
చిలుకమఱ్ఱి వారి రచనలు (131)
నిర్వచన భారత గర్భ రామాయణము (109)
గళ్ళ నుడి కట్టు (64)
న్యస్తాక్షరి (55)
నిషిద్ధాక్షరి (43)
ప్రహేళిక సమాధానం (36)
విశేషచ్ఛందస్సులు (28)
నా కవిత్వం (9)
ఒక మంచి పద్యం (1)
సమస్య - 2285 (కుందేటికిఁ గొమ్ము మొలిచి...)
దత్తపది - 106 (నిధనము-శవము-పాడె-చితి)
చమత్కార పద్యం - 248
ఆవ్సమ్ ఇంక్. థీమ్. Blogger ఆధారితం.
షేర్ మార్కెట్
పర్సనల్ ఫైనాన్స్
లైఫ్ స్టైల్
స్పెషల్ స్టోరీలు
ఎలక్షన్ స్పెషల్
ఆంధ్రప్రదేశ్ - CLICK HERE
అమలాపురం (అసెంబ్లీ సెగ్మెంట్లు)
మండపేట, అలమూరులలో కలిపి తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు, కాంగ్రెస్ మూడుసార్లు గెలిచాయి. |
శంకరాభరణం: సమస్య - 2156 (కవియే మన పతనమునకు...)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
87 వ్యాఖ్యలు:
రాజేశ్వరి నేదునూరి సెప్టెంబర్ 28, 2016 1:00 AM
పూరణ కొంత సందిగ్ధర్థాన్నిస్తున్నా బాగుంది. అభినందనలు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు సెప్టెంబర్ 28, 2016 7:05 AM
ధన్యవాదాలు.
'కావరమను। నవలక్షణముల..' అనండి.
Timmaji Rao Kembai సెప్టెంబర్ 28, 2016 7:46 AM
కారణమగురా....అని చదువగలరు. టైపాటు.
గోలి హనుమచ్ఛాస్త్రి సెప్టెంబర్ 28, 2016 8:55 AM
పూరణ : (క్రమాలంకార పూరణ)
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవిజ్. అభినందనలు.
'అవలీలన్+ఉపదేశ' మన్నపుడు యడాగమం రాదు కదా! పోతన్న గారి లాగా 'అవలీల న్నుపదేశమిచ్చి' అనవచ్చు. లేదా 'అవలీలన్ హితబోధఁ జేసి..' అనవచ్చు.
ఆర్య! అనేక నమస్కారములు. దోషసవరణగావించినందులకు శతధా ధన్యవాదములు. పద్యాన్ని సవరించి పంపుచున్నాను.
కామేశ్వర రావు గారూ,
Janardhana Rao Gurram సెప్టెంబర్ 28, 2016 9:49 AM
పోచిరాజు సుబ్బారావు గారూ,
'కరవై నన్యాయముల్' ఇక్కడ పదవిభాగం? కరవైన అన్యాయ మనలేము. అక్కడ 'కరవౌ నన్యాయముల్' అని ఉండాలనుకుంటాను. 'కవనమ్మండు'.. 'కవనమ్మందు'కు టైపాటు కావచ్చు.
Timmaji Rao Kembai సెప్టెంబర్ 28, 2016 8:40 PM
కవి = దే . వి . = కవియుట ;
'అవిధేయత, యహము...కినుక, యవినీతియు... మంట యజ్ఞానంబున్' అనండి.
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ఫణి కుమార్ గారు అవిధేయత పదము నే యర్థములో వాడదల్చుకున్నామో దానిని బట్టి ఉంటుంది. అవిధేయతన్ (అవిధేయతతో)అన్న యర్థములో అవిధేయతనతడు. అవిధేయత విశేష్యము( నామవాచకము)గా వాడినట్లయితే యడాగమము. ఇక్కడ అవిధేయత , అహము, కినుక, అవినీతి కడుపుమంట, అజ్ఞానంబు పదములన్నీ విశేష్యములు, కళలు. కాబట్టి సంధి లేమి యడాగమము.
Kameswara Rao Pochiraju సెప్టెంబర్ 28, 2016 12:13 PM
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
గురువుగారూ ధన్యవాదములు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
2.కవితాసక్తియు లేని న
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో '..జేకూర్చినన్.. నింపినన్...' అనండి.
రెండవ పూరణలో 'లేని యనవసర.. చెడు గూర్చెడి యా..' అనండి.
బహుకాల దర్శనం... సంతోషం!
CHEPURI SREERAMARAO సెప్టెంబర్ 28, 2016 3:34 PM
రెండవ పూరణలో 'లోనన్+అవనికి' అన్నపుడు యడాగమం రాదు. 'లోన। న్నవనికి...' అనండి.
Kameswara Rao Pochiraju సెప్టెంబర్ 28, 2016 9:41 PM
"దుష్కవియే" తర్వాత ఒక గురు వుండాలి.
Bhagavatula Krishna Rao సెప్టెంబర్ 28, 2016 8:08 PM
సంతోషం . మీకు ధన్యవాదాలు .
'మేధ+అనుచును' అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'మేధ యనుచు' అనండి.
రాజేశ్వరి నేదునూరి సెప్టెంబర్ 28, 2016 8:31 PM
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
'వ్రాసిరేని' అనండి. రెండవ పాదం చివర, మూడవ పాదం చివర గణదోషం.
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు సెప్టెంబర్ 28, 2016 9:32 PM
మీ దత్తపది పూరణ బాగున్నది. అభినందనలు.
వ్యాఖ్యను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
మొత్తం పేజీ వీక్షణలు
(విశ్రాంత తెలుగు పండితుడు)
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
ఛందస్సు సాఫ్ట్వేర్
తెలుగు నిఘంటువు
చిలుకమఱ్ఱి వారి రచనలు (131)
నిర్వచన భారత గర్భ రామాయణము (109)
గళ్ళ నుడి కట్టు (64)
న్యస్తాక్షరి (55)
నిషిద్ధాక్షరి (43)
ప్రహేళిక సమాధానం (36)
విశేషచ్ఛందస్సులు (28)
నా కవిత్వం (9)
ఒక మంచి పద్యం (1)
ఖండకావ్యము - 33
దత్తపది - 98 (విల్లు-అమ్ము-కత్తి-గద)
చమత్కార పద్యాలు - 216
సమస్య - 2150 (వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే...)
సమస్య - 2141 (జనకునిఁ దిట్టె నాత్మజుఁడు...)
సమస్య - 2132 (మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె...)
ఆవ్సమ్ ఇంక్. థీమ్. Blogger ఆధారితం. |
రేపటినుంచి ప్రో కబడ్డీ లీగ్ : మా మూవీస్ లో ప్రసారం _ Telugu TV
రేపటినుంచి ప్రో కబడ్డీ లీగ్ : మా మూవీస్ లో ప్రసారం
స్టార్ ఇండియా ఇప్పుడు రెండో సీజన్ ప్రో కబడ్డీ లీగ్ తో సిద్ధమైంది. 5 భాషల్లో 8 చానల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయటానికి ఏర్పాట్లు చేసింది. రేపటినుంచి జరిగే ఈ ప్రతిష్ఠాత్మకమైన పోటీలకు పది మంది స్పాన్సర్లు వచ్చినట్టు స్టార్ ఇండియా వెల్లడించింది. ప్రసార విస్తరణ పెరగటంతోబాటు ఆటగాళ్ళ సంఖ్య కూడా 14 నుంచి 25 కు పెరిగింది. పైగా, ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు ఈ టోర్నెమెంట్ నిర్వహించాలని స్తార్ భావిస్తోంది. ఈ సారి టోర్నమెంట్ 2016 జనవరిలో జరపటానికి ఏర్పాట్లు చేస్తోంది.
మొదటి సీజన్ లోనే మొత్తం ప్రేక్షకుల సంఖ్య 40 కోట్లకు చేరుకోగా ఈ సారి కనీసం 60 కోట్ల మందిని చేరుకోవాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు గట్టి పోటీ ఇవ్వగల ఇరాన్ నుంచి కూడా ఈసారి కొంతమంది ఆటగాళ్ళు చేరారు. మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుగు వ్యాఖ్యానంతో మా మూవీస్ ద్వారా ఈ ప్రసారాలు అందుబాటులోకి వస్తున్నాయి. అదే విధంగా ఈ ప్రసారాలు 109 దేశాలకు అందుబాటులోకి వస్తున్నట్టు కూడా స్టార్ ఇండియా ప్రకటించింది.
స్టార్ స్పోర్ట్స్ ఈ సారి కూడా టైటిల్ స్పాన్సర్ గా ఉంది. మరో పదిమంది కో స్పాన్సర్లుగా వచ్చారు. అందులో టివిఎస్, విఐపి ఫ్రెంజీ, బజాజ్ ఎలక్ట్రికల్స్, థంప్స్ అప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, భారత అణు విద్యుత్ సంస్థ, మహీంద్రా జీతో, రేడియో మిర్చి ఉన్నాయి. మొదటి సంవత్సరం స్పాన్సర్లను వెతుక్కుంటూ వెళ్ళిన స్టార్ గ్రూప్ దగ్గర ఇప్పుడు స్పాన్సర్లే క్యూ కట్టటం ప్రో కబడ్డీ లీగ్ విజయానికి సంకేతం. ఈ విజయం కారణంగానే త్వరలో మహిళల కబడ్డీ లీగ్ పోటీలమీద కూడా స్టార్ ఆలోచిస్తోంది.
Previous: మీడియాలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల పరిమితి 49శాతానికి పెంపు?
Next: ఎమ్మెస్వోలూ, ఆపరేటర్లూ నచ్చిన మోడల్ ఎంచుకోవచ్చు: నెక్స్ట్ డిజిటల్
ఎమ్మెస్వోల హెడ్ ఎండ్స్ తనిఖీ కఠినంగా ఉండాల్సిందే: చానల్స్ February 10, 2018
న్యాయ మంత్రిత్వశాఖ పరిశీలనలో డిటిహెచ్ లైసెన్స్ మార్గదర్శకాలు February 10, 2018
19న కలర్స్ తమిళ్ ప్రారంభం February 9, 2018
సన్ డైరెక్ట్ లో HMTV సహా 13 కొత్త చానల్స్ February 9, 2018
నిబంధనలు ఉల్లంఘించిన చానల్స్ 54 February 9, 2018
ముందు మరాఠీ, ఆ తరువాతే తెలుగు: ప్రాంతీయ భాషల్లోకి సోనీ విస్తరణ
పీస్ టీవీ సహా అనుమతి లేని చానల్స్ ప్రసారాలమీద కఠిన వైఖరి అవలంబిస్తున్నట్టు ప్రకటించుకున్న సమాచార ప్రసార మంత్రిత్వశాఖ అందుకు అనుగుణంగా చర్యలు తీవ్రతరం చేసింది. కర్నూలు, ఔరంగాబాద్ ఆపరేటర్లమీద అందిన ఫిర్యాదులను ఆయ జిల్లా అధికారులకు పంపినట్టు మంత్రి వెంకయ్య నాయుడు చెప్పిన 24 గంటలకే సహాయమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ రోజు లోక్ సభకు తెలియజేస్తూ కర్నూలు ఆపరేటర్ కార్యాలయ్యాన్ని మూసివేసి పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
స్వయంగా కేబుల్ వ్యాపారం నిర్వహించిన అనుభవమున్న మాజీ మంత్రి , ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ ఈ నెల 9న సీమ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఫిర్యాదు చేశారు. డౌన్ లింకింగ్ అనుమతి లేని పీస్ టీవీ ప్రసారాలు అందజేస్తున్నట్టు ఆయన చేసిన ఫిర్యాదును మంత్రిత్వశాఖ ఆ మరుసటి రోజే 10 న) కర్నూలు జిల్లా కలెక్టర్ కు పంపింది. దీంతో జిల్లా కలెక్టర్ ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించారు.
ఆ క్రమంలో కేబుల్ టీవీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా అధికారులు సీమ కమ్యూనికేషన్స్ కార్యాలయానికి సీలు వేయటంతోబాటు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
Previous: హెచ్ డి ప్రసారాలు ప్రారంభించిన ఈటీవీ నెలవారీ చందా కనెక్షన్ కు రూ. 40
Next: తెలుగు రాష్ట్రాల్లో కేబుల్ మీద ఫిర్యాదులు: నిజామాబాద్ కుల్దీప్ సహానీతో ఆరంభం
ఎమ్మెస్వోల హెడ్ ఎండ్స్ తనిఖీ కఠినంగా ఉండాల్సిందే: చానల్స్ February 10, 2018
న్యాయ మంత్రిత్వశాఖ పరిశీలనలో డిటిహెచ్ లైసెన్స్ మార్గదర్శకాలు February 10, 2018
19న కలర్స్ తమిళ్ ప్రారంభం February 9, 2018
సన్ డైరెక్ట్ లో HMTV సహా 13 కొత్త చానల్స్ February 9, 2018
నిబంధనలు ఉల్లంఘించిన చానల్స్ 54 February 9, 2018
ముందు మరాఠీ, ఆ తరువాతే తెలుగు: ప్రాంతీయ భాషల్లోకి సోనీ విస్తరణ |
అత్యధిక మునిసిపాలిటీల్లో సైకిల్ను పరిగెట్టించి సార్వత్రిక ఎన్నికల్లో లాభపడాలని టీడీపీ చూస్తోంది. అందులో భాగంగా రూపొందించిన మునిసిపల్ మేనిఫెస్టోలో సంక్షేమ, అభివృద్ధి మంత్రాలను వల్లించారు చంద్రబాబు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
వరుస ఎన్నికల వేళ తెలుగుదేశం సంక్షేమ పథకలపై ఫోకస్ చేస్తోంది. మునిసిపోల్స్లో పట్టణ ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టోను రూపొందించింది. మునిసిపాలిటీలను టీడీపీయే ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలదన్న సంకేతాలిస్తోంది. కాంగ్రెస్ అన్ని పురపాలక సంఘాల్ని మురికికూపాలుగా మార్చేసిందని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. నగర పాలనకు నవరత్నాల పేరుతో ఆయన మునిసిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.
పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రం, సౌర విద్యుత్తు, ఆధునిక రహదార్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో వాటికే పెద్ద పీఠ వేశారు. యువతకు ఉపాధి కల్పన, అత్యాధునిక శిక్షణ, పెద్ద నగరాలలో రవాణా వ్యవస్థ మెరుగు పరిచేందుకు సమగ్ర ప్రణాళిక ప్రకటించారు. మున్సిపాల్టీలలో ప్రజలకు రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ పంపిణి మొదలైన సౌకర్యాలను ఏర్పాటు చేయదలచినట్టు చంద్రబాబు వెల్లడించారు.
అత్యాధునిక డ్రైనేజీలు, మహా నగరాలలో మెట్రో, ఎమ్ఎమ్టీఎస్ రైళ్ళ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉండేలా అన్ని చర్యలూ తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఉన్నచోటే అత్యాధునిక శిక్షణా సౌకర్యాలు కల్పించి అందరికీ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్న ఆయన పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత వాగ్దానాల్ని భారీగా ఇచ్చిన చంద్రబాబు పురపాలక సంఘాలకొచ్చేసరికి మేనిఫెస్టోలో సమగ్ర మార్పులు చేశారు. అభివృద్ధి ఎలా చేస్తామో వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి మునిసిపాలిటీల్లో పసుపు జెండాను రెపరెపలాడించేలా తమ్ముళ్ళను ఉత్తేజపరిచారు.
Mee Telugu - మీ తెలుగు: Quiz 1
Mee Telugu - మీ తెలుగు
చంద్రబాబు అనే నేను…ఏపీ గ్రీన్ ఫీల్డ్ …
Antharlochana: హైదరాబాధితులు - 9
హైదరాబాధితులు - 9 |
పవన్ బయటకు రా…. ఫ్యాన్సే ఉచ్చ పోస్తారు….
ఏపీలో టీడీపీ ఓటమి ఖాయం…. రిపబ్లిక్ టీవీ సంచలన సర్వే
అప్పుడు గవాస్కర్- ఇప్పుడు విరాట్ కొహ్లీ……
“సైరా” కోసం 30 రోజులు కేటాయించిన చిరంజీవి
సమంతా మూవీ లో విలన్ గా రమ్య కృష్ణ
“మహానటి” ని పూర్తి చేసిన దుల్కర్ సల్మాన్
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న “రంగస్థలం”
Home NEWS బాబుకు అందని ఆహ్వానం
హైదరాబాద్ను ప్రపంచపటంలో పెట్టినట్టు చెప్పుకునే చంద్రబాబుకు అక్కడ జరిగే ఈవెంట్లకు మాత్రం ఆహ్వానం అందడం లేదు. మొన్నటి ఇవాంకా పర్యటన తాను లేకుండా హైదరాబాద్లో జరగదనే బాబు ఆశించారు. కానీ కనీసం ఆహ్వానం అందలేదు. చివరకు ఇవాంకానే ఏపీ వంక రప్పించేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నించారు. కానీ బాబు విజ్ఞప్తిని కేంద్రం గానీ, అమెరికా అధికారులుగానీ కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.
ఒకప్పుడు అమెరికా అధ్యక్షులనే హైదరాబాద్కు తీసుకొచ్చి ఆడించానన్న బాబుకు అదో ఘోర అవమానంగా భావించారు. కనీసం తెలంగాణ ప్రభుత్వం మెట్రో ప్రారంభోత్సవానికి కూడా చంద్రబాబును ఆహ్వానించలేదు. ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా చంద్రబాబును ఆహ్వానించలేదు. మహాసభల మొదటి రోజు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రంలో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.
అందుకే తొలి రోజు వేడుక ఆహ్వానపత్రంలో చంద్రబాబుకు చోటు దక్కలేదంటున్నారు. అయితే తెలుగు మహాసభలకు ఎవరెవరినో పిలిచి తోటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలువకపోతే బాగోదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు మహాసభల ముగింపు వేడుకకు ఆహ్వానిస్తే సరిపోతుందని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఒంటరితనానికీ ఓ మంత్రిత్వ శాఖ!
పవన్ ఫ్యాన్స్ మరో వికృత క్రీడ…
విదేశీ టెస్ట్ సిరీస్ ల్లో …టీమిండియా ఎందుకిలా ?
ఇది ఫిక్స్: చెర్రీ సరసన కైరా
భాగమతి సెన్సార్ పూర్తి… రెడీ ఫర్ రిలీజ్
ఈ నెల 20 న “తొలిప్రేమ” ఆడియో లాంచ్
అజ్ఞాతవాసి 8 రోజుల వసూళ్లు
అల్లు అర్జున్ కెరీర్లోనే ఇదో రికార్డ్
Previous articleమన పరువు తీశారు… రాజస్థాన్లో ఏసీబీకి చిక్కిన ఏపీ పోలీసులు
పార్టీ మారడంపై ఎట్టకేలకు స్పష్టత ఇచ్చిన వంగవీటి రాధా
నాడు డాన్ బ్రాడ్మన్-నేడు విరాట్ కొహ్లీ….
షెడ్యూల్ మార్చే పనిలో “సై రా నరసింహ రెడ్డి” టీం
సినిమా ఫ్లాప్.. కానీ 2 మిలియన్ డాలర్లు
రాజమౌళి నెక్స్ట్ మూవీ టైటిల్ “ఇద్దరు ఇద్దరే” ?
కర్మ-వ్యక్తిగతం
హరీష్, కేటీఆర్ ను పక్కన పెడుతున్న కేసీఆర్?
ట్రెండ్ సెట్టర్ జేసీ…
త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న తరుణ్
అఖిల్ కోసం స్టార్ డైరెక్టర్ ని సెట్ చేసే పనిలో నాగార్జున
అజ్ఞాతవాసి ఫ్లాప్ తో జై సింహా పంట పండిందా ?
“ధూమ్ 4” లో ప్రభాస్ ?
జాతి వ్యతిరేక శక్తుల ప్రమేయం – చలమేశ్వర్ బృందంపై ఫిర్యాదు…. నో చెప్పిన సీజే
ఎంఎల్ఏ మైక్రో టీజర్ రిలీజ్
కరెక్ట్ టైం లో కరెక్ట్ స్కెచ్ వేసిన నాని
దేశ చరిత్రలోనే సంచలనం…. సుప్రీం కోర్టులో చీలిక…. ప్రెస్మీట్ పెట్టిన చలమేశ్వర్ |
బాక్స్ ఆఫీస్
హోమ్ సమీక్షలు సమీక్ష: గురు
సమీక్ష: గురు
Cine Rangam on శుక్రవారం, మార్చి 31, 2017 సమీక్షలు, Reviews,
చిత్రం: గురు
నటీనటులు: వెంకటేష్, రితికా సింగ్, ముంతాజ్, నాజర్, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి, జాకీర్ హుస్సేన్ తదితరులు
మాటలు: హర్షవర్ధన్
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: కె.ఏ. శక్తివేల్
కూర్పు: సతీష్ సూర్య
నిర్మాత: ఎస్. శశికాంత్
రచన, దర్శకత్వం: సుధ కొంగర
నిర్మాణ సంస్థ: వై నాట్ స్టూడియోస్
గత రెండు నెలలుగా విడుదల వాయిదా పడుతూ పడుతూ మొత్తం మీద ఈ మండుటెండల్లో ప్రేక్షకుల తలుపు తడుతున్న వెంకటేష్ చిత్రం.. ‘గురు’. సుధా కొంగర దర్శకత్వంలో 'సాలా ఖడూస్' పేరిట హిందీలో, 'ఇరుది సుట్రు' పేరుతో తమిళంలో విడుదలైన మాధవన్ చిత్రానికి రీమేకే ఈ 'గురు'. హిందీ బాక్సాఫీస్ వద్ద స్టార్ వేల్యూ లేక తేలిపోయిన ఈ చిత్రం, తమిళంలో మాత్రం ఫర్వాలేదనిపించుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఆమె దర్శకత్వంలోనే విక్టరీ వెంకటేష్తో యథాతథంగా రీమేక్ చేసారు.
కథగా చెప్పాలంటే... ఆది(వెంకటేష్)కి బాక్సింగ్ అంటే ప్రాణం. కానీ.. కోపం ఎక్కువ. ఆ కోపంతో, బాక్సింగ్ అకాడమీలోని రాజకీయాలు పడలేక తాను అనుకొన్న లక్ష్యాల్ని సాధించలేకపోతాడు. కోచ్గానూ ఆదికి ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయి. ఎలాంటి ప్రాధాన్యం లేని విశాఖపట్నంలో అమ్మాయిల బాక్సింగ్ కోచ్గా నియమిస్తుంది అకాడమీ. అక్కడ రాములు (రితికా సింగ్) కనిపిస్తుంది. కూరగాయలు అమ్ముకొంటూ తల్లిదండ్రుల్ని పోషిస్తుంటుంది రాములు. అక్క లక్స్ (ముంతాజ్) మాత్రం బాక్సర్గా రాణించి తద్వారా పోలీస్ ఉద్యోగం సంపాదించాలనుకొంటుంది. అయితే.. రాములులో తెగువ ఆదికి నచ్చుతుంది. ఆమెలో ఓ మంచి బాక్సర్ దాగుందని, దానికి మెరుగులు దిద్దితే భారత్కు పతకాలు సాధించి పెడుతుందని నమ్ముతాడు. కానీ రామేశ్వరి మాత్రం అతని నిజాయితీని, తపనను గుర్తించదు, అలాగే ఫెడరేషన్ లో ఉన్నశత్రువులు కూడా అతని ప్రయత్నాలను అడ్డుపడుతుంటారు. ఇన్ని అడ్డంకుల మధ్య ఆదిత్య రామేశ్వరిని ఎలా మారుస్తాడు ? ఏవిదంగా ట్రైన్ చేస్తాడు ? ఎలా వరల్డ్ ఛాంపియన్ ను చేస్తాడు ? అనేదే ఈ సినిమా కథ.
అశ్వని నాచప్ప, భానుచందర్ ప్రధాన పాత్రల్లో మౌళి దర్శకత్వంలో వచ్చిన అశ్వని చిత్రం మెయిన్ థీమ్ కూడా ఈ కథని పోలే వుంటుంది. అయితే అది అథ్లెట్కి సంబంధించింది. కొన్ని రాజకీయాల వల్ల ఛాంపియన్ అవ్వలేకపోయిన భానుచందర్ స్టేడియం కీపర్గా వర్క్ చేస్తుంటాడు. స్లమ్లో వుండే అశ్వని టాలెంట్ని గుర్తించి ఆమెను ఛాంపియన్ చెయ్యాలనుకుంటాడు. అదే కథను కొన్ని మార్పులు చేసి గురుగా రూపొందించారు. కథ, కథనం విషయంలో డైరెక్టర్ సుధని తప్పకుండా అప్రిషియేట్ చెయ్యాలి. ఓ పక్క ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ కథని నడిపించడం, వెంకటేష్, రితిక సింగ్ల నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో సుధ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది.
ఇది రీమేక్ చిత్రం అయినప్పటికి వెంకటేష్ కోసం కొన్ని మార్పులూ చేర్పులూ చేశామని చెప్పినా... అవి అంత పెద్దగా కనిపించవు. పైగా హిందీలో కనిపించిన నటీనటులే దాదాపుగా ఇక్కడా తారసపడతారు. వెంకటేష్ తప్ప. బాలీవుడ్ సినిమాలో వాడిన కొన్ని షాట్స్ యథాతథంగా ఇక్కడా వాడుకొన్నారు. కాకపొతే కేవలం ‘ఆట’ చుట్టూనే తిరిగిన తొలి తెలుగు సినిమా ‘గురు’ అనే చెప్పాలి. బాక్సింగ్ తప్ప.. మరో ట్రాక్ వినిపించదు.. కనిపించదు. సినిమా అంతా ఒకే ఎమోషన్ చుట్టూ తిరగడం ‘గురు’ ప్రత్యేకత. అయితే ఒక సగటు స్పోర్ట్స్ సినిమాలో వుండే చాలా రొటీన్ వ్యవహారాలు ఇందులోను కనిపిస్తాయి. తను ఇష్టపడే స్పోర్ట్లో ఏవో కారణాల మీద ఫెయిల్ అయిన వ్యక్తి కోచ్ అవతారం ఎత్తడం, అతడికి కొన్ని దురలవాట్లు వుండడం, అతనికి తన కలని సాకారం చేసుకునే ఆస్కారం మరో యంగ్ క్యారెక్టర్లో కనిపించడం, ఆ యంగ్ క్యారెక్టర్కి ఈ ఆట మీద ధ్యాస లేకపోవడం, ఎప్పటికో కానీ కోచ్ విలువ తెలుసుకోలేక పోవడం, చివరకు కీలకమైన మ్యాచ్లో చివరి వరకు పోరాడి గెలవడం, అంతకుముందు ఆ కోచ్కి అతి పెద్ద పరీక్ష ఎదురు కావడం... ఇలా ఏ స్పోర్ట్స్ సినిమాలో చూసినా రొటీన్గా కనిపించే అంశాలతోనే ఈ కథనం రాసుకున్నారు. అయితే ఒక మంచి కథ తాలూకు గొప్పతనం ఏమిటంటే, అప్పటికే చదివేసినా, చూసేసినా ఇంకోసారి చూసేందుకు, చదివేందుకు ఏ అభ్యంతరాలుండవు. ఒరిజినల్ చూసినప్పటికీ, దాదాపు మక్కీకి మక్కీ దించేసిన 'గురు'.. ప్రేక్షకుల్ని లీనం చెయ్యగలిగింది అంటే, అది ఖచ్చితంగా సుధ కొంగర రాసుకున్న కథలోని గొప్పతనమే. అలాగే 'గురు'గా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసిన వెంకటేష్కి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. |
నటనాపరంగా... కోచ్ పాత్రలోవెంకటేష్ ఒదిగిపోయాడు. చాలా కొత్తగా కనిపించాడు. భావోద్వేగ భరిత సన్నివేశాల్లో వెంకటేష్ రాణించగలడు అని చెప్పడానికి మరో ఉదాహరణ ‘గురు’. వెంకటేష్ నటించాడు అనడం కంటే జీవించాడు అనొచ్చు. సినిమా ఆరంభం నుండి చివరి దాకా ఒకే దూకుడును, బాడీ లాంగ్వేజ్ ను మైంటైన్ చేస్తూ ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ను చూస్తే ఒక నిజ జీవితపు వాస్తవ పాత్ర కళ్ళ ముందు కదులుతున్నట్టే ఉంటుంది.
ఇక వెంకీ శిష్యురాలిగా హీరోయిన్ రితికా సింగ్ నటన కూడా కొత్తగా ఉంటుంది. ఒక తెలుగు సినిమా హీరోయిన్ ని ఈ తరహా పాత్రలో చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. స్వతహాగా బాక్సర్ అయిన రితికా ఒక మాస్ నైపథ్యం, అల్లరి ప్రవర్తన కలిగిన అమ్మాయిగా, బాక్సర్ గా చాలా బాగా నటించింది. వెంకటేష్తో పోటాపోటీగా నటించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేవ్ ఖత్రిగా నటించిన జాకీర్ హుస్సేన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా, నేచురల్గా వుంది. నాజర్, రఘుబాబు, అనితాచౌదరి తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.
సాంకేతికంగా చూస్తే... కథ పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడడం, వినోదం పేరుతో లేని పోని సన్నివేశాల జోలికి వెళ్లకుండా చాలా స్పష్టంగా, క్లుప్తంగా రాసుకొన్న స్క్రిప్ట్ ఇది. రీమేక్ సినిమాల్లో ఎమోషన్ని తర్జుమా చేయడం కష్టం అంటుంటారు. కానీ, ‘గురు’ ఆ కష్టాన్ని దాటుకొచ్చింది. అక్కడక్కడ కళ్లు చెమర్చుతాయి. స్ఫూర్తి రగులుతుంటుంది. కోచ్ పాత్రపై జాలి, ప్రేమ, అభిమానం పొంగుకొస్తుంటాయి. బాక్సింగ్ అంటే ఏమిటి? ఎలా ఆడాలి? పాయింట్లు ఎలా ఇస్తారు? ఇలాంటి వివరణల్లోకి వెళ్లకుండా.. నేరుగా కథ చెప్పేయడం మంచిదే అయ్యింది. లేదంటే అదో డాక్యుమెంటరీగా తయారైపోయేది. దర్శకురాలు ఈ విషయంలో విజయం సాధించింది. డైరెక్టర్ సుధా కొంగర ఇండియన్ ఉమెన్ బాక్సింగ్ ఫెడరేషన్లో నడుస్తున్న కుళ్ళు రాజకీయాలు, ఇతర వాస్తవ అంశాల ఆధారంగా రాసుకున్న కథ దాన్ని చిత్రంగా మలచడానికి తయారుచేసుకున్న కథనం రెండూ బాగున్నాయి.
శక్తివేలు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ ఎంతో నేచురల్గా చూపించాడు. ముఖ్యంగా బాక్సింగ్ పోటీల్లో అతని కెమెరా పనితనం కొట్టొచ్చినట్టు కనిపించింది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే.. సినిమా వాతావరణానికి తగ్గట్టుగా సంగీతం అందివ్వడంపై దృష్టి పెట్టాడు. పాటలకంటే నేపథ్య సంగీతం ఆకట్టుకొంటుంది. సన్నివేశంలోని గాఢతని సంగీతం తెలియజేసింది. హర్షవర్థన్ రాసిన మాటలు కూడా ఇన్స్పైరింగ్గా వున్నాయి. వెంకీ పాత్రకు రాసిన డైలాగులు పాత్ర స్వభావాన్నితగ్గట్టు చాలా బాగున్నాయి. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. సతీష్ సూర్య ఎడిటింగ్ కూడా బాగుంది.
మొత్తానికి... వెంకటేష్, రితికల పెర్ఫార్మెన్స్, కథ, కథనాలు, ఆడియన్స్ని కట్టి పడేసే ఎమోషన్స్, ఆడియన్స్ని టెన్షన్కి గురి చేసే క్లైమాక్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, స్లో నేరేషన్, సెకండాఫ్లో కొంత సేపు కథ నడవకుండా ఏవో ఒక సీన్ రావడం, కామన్ ఆడియన్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం మైనస్లుగా చెప్పొచ్చు. హిందీ లేదా తమిళ ఒరిజినల్ సినిమా చూసినవాళ్లకు ‘గురు’ ఓకే అనిపించొచ్చు. చూడని వాళ్లకు మాత్రం.. తప్పకుండా నచ్చుతుంది.
క్రొత్త పోస్ట్
నేడే చూడండి
తొలి పరిచయం
చిత్ర ప్రకటన
ప్రముఖ పోస్ట్లు
500 థియేటర్లలో విడుదల కానున్న విమల్ చిత్రం
సమీక్ష: పెళ్ళిరోజు - సహజత్వానికి దగ్గరగా
చిత్రం: పెళ్ళిరోజు తారాగణం: దినేష్, నివేథా పేతురాజ్, మియా జార్జ్, రిత్విక, రమేష్ తిలక్ తదితరులు మాటలు: మల్లూరి వెంకట్ సంగీతం:...
'ఇండియన్ 2'తో సినిమాలకు గుడ్బై చెప్పనున్న కమల్!
1 996లో ప్రజల్లో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని నింపి.. లంచగొండితనం, అవినీతిపై ఉక్కుపాదంలా నిలిచినన చిత్రం ‘ ఇండియన్ ’. 22 ఏళ్ల తర్వాత ఈ చిత... |
ఇదీ సంగతి: October 2014
వీరిచే పోస్ట్ చెయ్యబడింది భమిడిపాటి సూర్యలక్ష్మి on 12, అక్టోబర్ 2014, ఆదివారం
మొన్న దసరా పండగల లో , మా స్నేహితురాళ్ళు పాడ్యమి రోజున అమ్మవారిని ప్రతిష్టించి ( ఇక్కడ ఘటస్థాపన్ అంటారు ), ప్రతీరోజూ ఎవరో ఒకరి ఇంట్లో సౌందర్య లహరి, శ్రీలలితాసహస్రనామాలూ చదువుకుని, ఆ తరువాత హిందీ, మరాఠీ భజనలు చేసి గడిపాము. ఇక్కడ రోజంతా ఉపవాసం ఉంటారు. ఇంట్లో అమ్మవారి పూజ చేసికుని, నైవేద్యం పెట్టి, మావారికి వంట వండేసి, దగ్గరలో ఉన్న నా స్నేహితురాలితో , ఎక్కడ పూజ జరుగుతూంటే అక్కడకి వెళ్ళి, రావడంతో దసరా చాలా బాగా గడిచింది.
సౌందర్యలహరి మా స్నేహితురాలు ( మన తెలుగు వారే) పుస్తకం చూడకుండా, రాగయుక్తంగా 100 శ్లోకాలూ చెప్పడంలో దిట్ట. నా పనల్లా, ఆవిడప్రక్కనే కూర్చుని, ఆవిడ తో “ సహకార గానం “ చేయడం మాత్రమే.
మా ఇద్దరి స్తోత్రాలూ పూర్తయే సరికి, మిగిలినవారందరూ మెల్లిగా పూజ చేసే ఇంటికి రావడం మొదలెట్టడం. అప్పటినుండీ, హిందీ, మరాఠీ భాషల్లో అమ్మవారికి సంబంధించిన “ భజన” లు పాడడం మొదలు. ఇంక ఆ భజనలు పాడుతూంటే, ముత్తైదువులు వారి వారి వయసులతో సంబంధం లేకుండా, డ్యాన్సులు చేయడం. అక్కడకి వచ్చే వారు 60 ఏళ్లకి పైబడ్డవారే, అయినా సరే అంత ఓపిక ఎలా వస్తుందో ఆశ్చర్యంగా ఉంటుంది.నాకు ఆ భజనలు నోటికి రాకపోవడంతో , చప్పట్లు కొట్టడానికే పరిమితం అయిపోయాననుకోకండేం.రానివాళ్ళచేత కూడా పాడించగలిగే శక్తి ఆ అమ్మది ! ఆ భజనలతోఅక్కడి వాతావరణమే మారిపోయేది. అక్కడ ఉన్న మూడు నాలుగు గంటలూ “ అమ్మ “ ధ్యాసే, అమ్మ నామ స్మరణే. అక్కడ ఉన్న చాలామందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య- సుగరు, బీపీ, కాళ్ళనొప్పులూ, మరోటీ- ఉన్నవారే. ఆ మూడునాలుగ్గంటలూ అవన్నీ మర్చిపోయి డ్యాన్సులూ, పాటలూ, భజనలూ. అమ్మ ని చూసేటప్పటికి అసలు అవన్నీ గుర్తుకురావేమో.
ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత, హారతీ , ప్రసాదాలు. మొత్తానికి దసరా తొమ్మిది రోజులూ అమ్మ నామస్మరణతో ఆనందంగా గడిచిపోయింది.
క్రొత్త పోస్ట్లు పాత పోస్ట్లు హోమ్
ఇటీవలి వ్యాఖ్యలు
తెలుగు వెలుగులు
తెలుగుదనం [Telugudanam.co.in]
[ వెనుకకు ]
ఆమెవరో కానీ….
గత కొద్ది రోజులుగా
పిల్లల పట్టించుకోవట్లేదా? అని
మూలం: శ్రీనివాసరావు
వెనుకకు _ మొదటి పేజీ _ తెలుగుదనం బ్లాగు _ మాగురించి _ సలహాలు _ పత్రికలలో తెలుగుదనం సందర్శకుల సంఖ్య:
One thought on “పాత రష్యన్ కథ”
ఆంధ్రమంటే భాష, ప్రాంతం కాదు
ఈ నడుము సుందరి డాన్సు చూస్తే అస్సలు తట్టుకోలేరు!! - Oneindia Telugu
గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ..అదే రూటులోనే – Cinema Bazaar
సినిమా వార్తలు
బాక్స్ ఆఫీస్
స్క్రీన్ ప్లే సంగతులు
ఇండియన్ సినిమా క్లాసిక్స్
స్పెషల్ ఆర్టికల్స్
సందీప్ కిషన్ అలాంటివాడు కాదు.
అఖిల్ నెక్ట్స్ కు నిర్మాత రానా, దర్శకుడు ఎవరంటే..
గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ..అదే రూటులోనే
‘అజ్ఞాతవాసి’ …వాళ్ల కోసం స్పెషల్ షో
బాహుబలి-2: మరో అరుదైన ఆశ్చర్యపోయే రికార్డ్
గోపీచంద్ హీరోగా చక్రి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ కి ఇది 25వ సినిమా కావడం విశేషం. కె.కె.రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంతవరకూ గోపీచంద్ చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.
అందువల్లనే 25 వ సినిమాగా దీనిని ఓకే చేశారని అంటున్నారు. మెహ్రీన్ టీచర్ గా కనిపిస్తుందట .. ఈ పాత్రలో ఆమె చాలా కొత్తగా కనిపిస్తుందని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాకి ‘పంతం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన్నట్టు తెలుస్తోంది. చివరిలో ‘సున్నా’ వచ్చేలా టైటిల్ ను సెట్ చేయడం గోపీచంద్ కి సెంటిమెంట్ కావంటతో ఆ టైటిల్ వైపు మొగ్గు చూపినట్లు చెప్తున్నారు. ‘యజ్ఞం’ .. ‘లక్ష్యం’ .. ‘లౌక్యం’ లానే ఈ సినిమాకి ‘పంతం’ టైటిల్ ను ఖరారు చేయనున్నారని అంటున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
ఒక్క క్షణం DEC 28
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1
హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ ఎలా?
స్క్రీన్ ప్లే టిప్స్
స్క్రీన్ ప్లే టిప్ : టెంప్లెట్ టైటిల్స్!
స్క్రీన్ ప్లే టిప్ 47 |
అమ్మ,అమ్మమ్మతో సెక్స్ 2 - Telugu Sex Stories
తెలుగు సెక్స్ కథలు
అమ్మ,అమ్మమ్మతో సెక్స్ 2
Telugu Sex Stories నేను ఇంటి కి వచ్చేసరికి టైం 10 అయింది.అమ్మ రే వచ్చి భోజనం చేయి అంది .నేను వెళ్లి ఫ్రెష్అప్ అయి భోజనం చేసి నా రూమ్ కి వెళ్ళాను.
అమ్మ : ఇపుడు ఎలాగ ఒక 4 మంత్ ఉంటే వాడి ఎడ్యుకేషన్ ఆయిపోతుంది. ఇపుడు ఎలాగ అంది.
నాన్న : నువు చేపింది కూడా నిజం అయితే ఎలాగ అన్నాడు.
అమ్మ : సరే ఒక పని చేదాం మా అమ్మ ను ఆనంద్ కు తొడుగు ఉంచుదాం మధ్య లో నేను వచ్చి పోతూఉంటా అంది.
నాన్న : నీ ప్లాన్ సూపర్ అలాగే చేదాం.
నేను మా అమ్మమ్మ అని చెప్పలేకే అక్కడ నుండి వెళ్లి పోయాను.నేను అమ్మతో ఎలా సెక్స్ చేయాలి అనుకున్న ప్లన్స్ అని వేస్ట్ అయినాయి నా మొడ్డను ఒక్క సారి అయిన పూకు వాసన చూస్తుంది అనుకున్న అదికూడా లేకుండా పోయింది.
భక్తి సాగరం: శ్రీ కృష్ణ జననం - 28
శ్రీ కృష్ణ జననం - 28
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
శ్రీకృష్ణ లీలావిలాసం - 34
శ్రీకృష్ణ లీలలు - 26
కుమార షష్ఠి, స్కంద షష్ఠి, 24-11-2017 , శుక్రవారం..... బ్రహ్మ నుండి "శివసుతుని చేత" మాత్రమే మరణం పొందేలా వరం అందుకున్నాడు తా...
ద్వారక అస్తమయం - 17
ఇవి కూడా చూడండి
తెలుగు బైబిలు Telugu Bible PDF Download
Andhra Kristhava Keerthanalu (ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు)
వింత గల మా యేసు ప్రేమను
యేసు క్రీస్తు దొరికేనేని
నేను నీ వాడను దేవా
యేసు సామీ నీకు నేను
ఓ క్రైస్తవ యువకా
నా ప్రాణ ప్రియుడా
నీ చేతితో నన్ను పట్టుకో
యెహోవా నా బలమా
"మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు." - మత్తయి 10:20
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ఒకే పేజీలో చాలా ఫొటోలు ప్రింట్ తీసుకోవాలా? ఎంత ఈజీనో మీరే చూడండి!! Must Watch & Share
ఫలక్ నుమా ప్యాలస్ కు బాంబు బెదిరింపులు వచ్చాయా ?
ఫలక్ నుమా ప్యాలస్ కు బాంబు బెదిరింపు కాల్
ఫేక్ కాల్ గా గుర్తించిన పోలీసులు
ఫలక్ నుమా ప్యాలస్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విందులో కల కలం సృష్టంచేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. అంతర్జాతీయ అతిథి ఇవాంక, ప్రధాని మోదీతో పాటు అత్యంత ప్రముఖులు పాల్గొన్న విందు జరిగే ఫలక్ నుమా ప్యాలస్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కొందరు ఆగంతకులు డీజీపీ క్యాంప్ ఆపీస్ లోని కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి ఫలక్ నుమా ప్యాలస్ లో బాంబు పెట్టినట్లు తెలిపారు. అయితే ఈ ఫోన్ కాల్ అంత విశ్వసించదగినది కాకపోవడం, అప్పటికే విందు ప్రారంభం కావడంతో పోలీసులు ఈ విశయాన్ని గోప్యంగా ఉంచారు.
అయితే ఈ ఆకతాయి ఫోన్ కాల్ ను మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. రాత్రంతా పోలీసులు తనిఖీలు నిర్వహించి ఎలాంటి బాంబు లేదని కన్ పర్మ్ చేసుకుని ఊపిరిపీల్చుకున్నారు.
ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ని గుర్తించే పని లో పోలీసులు ఇప్పుడు నిమగ్నమయ్యారు. ఓల్డ్ సిటీ నుంచి ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా ఈ బెదిరింపు ఫోన్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం పోలీసులపై సీరియస్ అయ్యింది. ఫలక్ నుమా పీఎస్ లో కేసు నమోదు చేసి ప్రముఖులు పాల్గొన్న విందులో కలకలం సృష్టించాలనుకున్న దుండగులను పట్టుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
బిగ్ బాస్2: కౌశల్, తనీష్ ఒకరినొకరు తన్నుకునేంతగా..
మారుతిరావును పోలీసులు ఎలా పట్టుకున్నారంటే (వీడియో)
స్టార్ క్రికెటర్ కు కుక్కకాటు...మ్యాచ్ కి దూరం
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో) |
డబ్బు లేక.. చెప్పలేక..హైజాక్ డ్రామా _ V6 Telugu News
బంఫరాఫర్ : 300 ఎకరాలు 6 కోట్లకే….22 బిల్డింగ్ లు కూడా
జయశంకర్ సార్ సేవలు మరువలేనివి : కేటీఆర్
ఏపీలో పొలిటికల్ హీట్ : వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం
సుష్మాస్వరాజ్ జోక్యంతో….ఆ దంపతులకు పాస్ పోర్ట్
సినీ ఇండస్ట్రీ డిమాండ్ : నారాయణమూర్తి రాజకీయాల్లోకి వెళ్లాలి
వార్తలు » రాష్ట్రీయ వార్తలు » డబ్బు లేక.. చెప్పలేక..హైజాక్ డ్రామా / April 20, 2017
డబ్బు లేక.. చెప్పలేక..హైజాక్ డ్రామా
ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు… ఈ పాట తెలియని తెలుగు వారే ఉండరు. అయితే ఇక్కడ పోలీసులకు చిక్కి చిక్కుల్లో పడ్డాడు వంశీకృష్ణ అనే యువకుడు. తన గర్ల్ఫ్రెండ్ గోవా ప్లాన్ ను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా విమానం హైజాక్ వార్తతో పోలీసులకు మెయిల్ చేసి కలకలం సృష్టించాడు. ఈ దెబ్బతో ఏప్రిల్ 15న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లలో అలెర్ట్ ప్రకటించింది పోలీసు సిబ్బంది. దీనిపై టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేయగా అతను పంపింది ఒక ఫేక్ మెయిల్ అని తేలింది. అతని ఐపీ అడ్రస్ ఆధారంగా ట్రాక్ చేసి వివరాలను సేకరించి అరెస్టు చేశారు.
హైదరాబాద్లోని మియాపూర్ కు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తికి ఇప్పటికే పెళ్లై ఒక పాప కూడా ఉందనీ.. ఫేస్ బుక్ ద్వారా చెన్నైకు చెందిన అమ్మాయితో పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయి ముంబై, గోవాలకు తీసుకెళ్లమని కోరడంతో దానికి సరిపడా డబ్బులు లేక.. ఈ విషయాన్ని ఆమెతో చెప్పుకోలేని పరిస్థితులలో ఒక నకిలీ టికెట్ ను సృష్టించి.. ఫేక్ మెయిల్ డ్రామా ఆడినట్లు పోలీసులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఎయిర్ పోర్టుకు రానివ్వకుండా చేయడమే లక్ష్యంగా ఈ పని చేసినట్లు పోలీసులు చెప్పారు. ఓ ఆరుగురు వ్యక్తులు విమానాలను హైజాక్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుండగా తాను విన్నానని.. ఓ మహిళ మెయిల్ చేస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చాడు వంశీకృష్ణ. వంశీ ప్లాన్ చూసి తామే షాక్ కు గురైనట్లు పోలీసులు తెలిపారు.
‘ఇపుడు ఎన్నికలు జరిగితే టిడిపికి డిపాజిట్లు కూడా రావు’..వైసిపి అధినేత వైఎస్ జగన్మహన్ రెడ్డి చెప్పిన మాటలివి.
‘ఇపుడు ఎన్నికలు జరిగితే టిడిపికి డిపాజిట్లు కూడా రావు’..వైసిపి అధినేత వైఎస్ జగన్మహన్ రెడ్డి చెప్పిన మాటలివి. కర్నూలు జిల్లా పత్తికొండలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న అవినీతిని చూసి కేంద్రప్రభుత్వమే భయపడిపోయిందన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే హత్యలు చేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నట్లు మండిపడ్డారు. ఈ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి డిపాజిట్లు కూడా రావంటూ జగన్ బల్లగుద్ది మరీ చెప్పారు.
గిట్లుబాటు ధరలు లేక రైతులు, ఉద్యోగాలు లేక యువత, నిరుద్యోగులు, ఉపాధి, భద్రత లేక మహిళలు, వేధింపులతో ఉద్యోగులు ఇలా..అందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారంటూ జగన్ మండిపడ్డారు. అబద్దాలు, మోసాలతోనే చంద్రబాబు పరిపాలన చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. పత్తికొండ వైసిపి ఇన్ చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య ఘటనను కూడా జగన్ ప్రస్తావించారు. పొదుపు, డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన జీరో వడ్డీ బకాయిలు కూడా ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించటం లేదని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే అన్నీ వర్గాలను సంతోష పెట్టే పాలన అందిస్తామంటూ హామీ ఇచ్చారు. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో వైసిపి పత్తికొండ అభ్యర్ధిగా శ్రీదేవిరెడ్డిని ప్రకటించారు జగన్.
తండ్రి పక్క సీటులో: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతోన్న టాలీవుడ్ దర్శకుడు!
నేపాల్లో భారత కరెన్సీ నిషేధం...
ప్రసాదం తిని పదిమంది మృతి, 72 మందికి అస్వస్థత
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో)
కేటీఆర్ కు తెరిపిలేని అభినందనలు (వీడియో)
కేటీఆర్ కు హరీష్ ఆలింగనం (వీడియో)
కేకే ఆశీస్సులు తీసుకున్న కేటీఆర్ (వీడియో) |
కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూత.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి మరణవార్త విని హుటాహుటిన హైదరాబాద్కు పయనమయ్యారు.
కేసీఆర్కు ఈమె నాలుగో సోదరి.. రాజన్న సిరిసిల్ల జిల్లా యల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన శంకర్రావుతో లీలమ్మకు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాంతారావు, మధుసూదన్రావు ఉన్నారు.
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం....
ట్రైలర్: వీర బోగ వసంత రాయలు.. మినీ మల్టీస్టారర్!
100కోట్ల పోస్టర్..ఎంతవరకు నిజం?
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో)
పెళ్లి కోసం యువకుడి సెల్ఫీ సూసైడ్
హైదరాబాద్ లో దారుణం
పెళ్లి కోసం యువకుడి ఆత్మహత్య
పెళ్లి జరగడం లేదన్న మనస్థాపంతో ఓ యువకుడు సెల్పీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నిశ్చితార్థం జరిగి రెండేళ్లు గడుస్తున్నా పెద్దలు పెళ్లి చేయకపోవడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కారణాలు చెబుతూ సెల్ ఫోన్ లో సూసైడ్ వీడియోను సెల్పీ తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విదంగా ఉన్నాయి.
రాజస్థాన్కు చెందిన జశ్వంత్ సింగ్(20) బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వలస వచ్చి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు షాహినాథ్ గంజ్ లో నివాసముంటున్నాడు. అయితే జశ్వంత్ కు రాజస్థాన్కే చెందిన ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ నిశ్చితార్థం జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా పెద్దలు పెళ్లి చేయకపోవడంతో ఇతడు మనోవేధనకు గురయ్యాడు. మానసికంగా కుంగిపోయిన జశ్వంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతడు ఆత్మహత్య సమయంలో తీసిన సెల్పీ వీడియో ఆదారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
మంచి దొంగ అని ఓటేస్తే చంద్రబాబు గజదొంగ అయ్యారు: కన్నా
నాని 'దేవదాస్'పై సోషల్ మీడియాలో రచ్చ!
బూతు కథలో బాలయ్య హీరోయిన్!
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో)
ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి ఆనం _ V6 Telugu News
టెన్షన్… టెన్షన్ : సిటీలో డేంజర్ గా కేబుల్, కరెంట్ వైర్లు
క్లీన్ అండ్ గ్రీన్ : ఎయిర్ పోర్ట్ తరహాలో మెట్రో స్టేషన్లు
ఇది రియల్ : ఆకాశంలో ఢీకొన్న విమానాలు
ఆస్పత్రి నుంచి ఇంటికి : మేం బతకటం ఓ అద్భుతం
గూగుల్ తలపట్టుకుంది : రూ.34వేల కోట్ల జరిమానా పడింది
వెరీ షాకింగ్ : డివైడర్ ఎక్కి.. రాంగ్ రూట్ లోకి వచ్చిన బస్సు
నిరసనల మధ్యే 2014 – 15 బడ్జెట్ ను మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ప్రవేశ పెట్టినంతసేపూ అసెంబ్లీలో నల్లబ్యాడ్జీలతో టీఆర్ఎస్ నిరసన తెలిపింది. జై తెలంగాణ నినాదాలతో సభను హోరెత్తించారు తెలంగాణ మంత్రులు. మైక్ ఇవ్వాలంటూ జానా, పొన్నాల, సునీత లక్ష్మా రెడ్డి లు డిమాండ్ చేశారు. సీఎం కు వ్యతిరేకంగా శంకర్రావు, గండ్ర నినాదాలు చేశారు. నినాదాల మధ్యే మంత్రి ఆనం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ త్వరత్వరగా చదివి వినిపించారు. 15 నిమిషాల్లో మొత్తం బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఆనం ప్రసంగంగ అనంతరం స్పీకర్ మనోహర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. మంగళవారం సభ్యులు బడ్జెట్ ను అధ్యయనం చేసేందుకు వీలుగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. అంతకుముందు జరిగిన కేబినెట్ భేటీని టీఆర్ఎస్ బహిష్కరించింది. సీఎం కిరణ్ తీరుకు నిరసనగా తాము కేబినెట్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని టీఆర్ఎస్ మంత్రులు తెలిపారు.
మరోవైపు శాశనమండలిలో కూడా మంత్రి రామచంద్రయ్య బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం మండలిని ఎల్లుండికి వాయిదా వేశారు.
స్టేడియం నిర్మాణానికి విశాక ఇండస్ట్రీస్ చాలా డబ్బు ఖర్చు చేసింది
దానికి హరి నువ్వు పట్టుకుంటే వాడు అంతే అని చెప్పి నన్ను బెడ్ రూం మంచం మీద అడ్డంగా పడుకోబెట్టాడు. |
పేదల బతుకుల్లో వెలుగులు రావాలి: సీఎం _ V6 Telugu News
చిన్నా, పెద్ద తేడా లేదు : కొత్తగా 9 వేల 200 మంది పంచాయతీ కార్యదర్శుల నియమకం
హైదరాబాద్ లో దారుణం : రోడ్డుపై యాక్సిడెంట్ జరిగినా…ఒక్కరూ పట్టించుకోలేదు
కాంగ్రెస్ ది నాన్ వర్కింగ్ కమిటీ : బీజేపీ
6నెలలు రాష్ట్రమంతా పర్యటన : ఖచ్చితంగా పార్టీ పెడతానన్న గద్దర్
ఎన్ని ఆటంకాలు ఎదురైనా పేదలకు ఇళ్లు కట్టిస్తామని.. పేదల బతుకుల్లో వెలుగులు రావాలని రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బంజారాహిల్స్ ఎన్ బీటీ నగర్ లో సీఎం కేసీఆర్ పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షా 20 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. మహిళల పేరు మీదే పట్టాలిస్తున్నామని చెప్పారు. జంట నగరాల్లో రెండున్నర లక్షల మంది ఇళ్లు లేకుండా ఉన్నారని.. లక్ష మందికి పైగా రైల్వేస్టేషన్లు, ఫుట్ పాత్ ల మీద పడుకుంటున్నారని వాపోయారు. ఇళ్ల నిర్మాణం కోసం ఎవరూ పైసా కూడా పెట్టాల్సిన పని లేదని.. ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ సీఎం ఇచ్చారు.
అవినీతిపై చంద్రబాబు, ఆది, లోకేష్ కామెంట్లు వినండి (వీడియో)
సోషల్ మీడియా చాలా స్పీడ్ అయిపోయింది.
సోషల్ మీడియా చాలా స్పీడ్ అయిపోయింది. ఎంత స్పీడ్ అంటే ఒక నేత ఏ విషయానైనా మాట్లాడితే అందులో తప్పొప్పులను అంశాలవారీగా ఏకి పారేస్తున్నారో. ఎన్నో సంవత్సరాల క్రితం అదే నాయకుడు అదే అంశంపై ఏం మాట్లాడారన్న విషయాలను కూడా ప్రింట్, వీడియోలతో సహా జనాల ముందుకు తెచ్చేస్తున్నారు. అందులోనూ ఇపుడు గ్రాఫిక్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువై పోయిందా కదా నేతలను అభిమానులు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇపుడున్న వీడియో కూడా తాజాగా పిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలకు ఎప్పుడో చంద్రబాబునాయుడు, లోకేష్ మాట్లాడిన వీడియోలను కూడా జత చేసి సోషల్ మీడియాలో సర్య్కులేట్ చేస్తున్నారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర
ఇంటర్నెట్ పై చైనా ఉక్కుపాదం :4000 సైట్ల మూసివేత
'ఎన్టీఆర్'కి కూతురు దొరికింది!
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో)
గల్ఫ్ బాధితులకు అండగా ఉంటాం: సుష్మాస్వరాజ్ _ V6 Telugu News
చిన్నా, పెద్ద తేడా లేదు : కొత్తగా 9 వేల 200 మంది పంచాయతీ కార్యదర్శుల నియమకం
హైదరాబాద్ లో దారుణం : రోడ్డుపై యాక్సిడెంట్ జరిగినా…ఒక్కరూ పట్టించుకోలేదు
కాంగ్రెస్ ది నాన్ వర్కింగ్ కమిటీ : బీజేపీ
6నెలలు రాష్ట్రమంతా పర్యటన : ఖచ్చితంగా పార్టీ పెడతానన్న గద్దర్
గల్ఫ్ బాధితులకు అండగా ఉంటాం: సుష్మాస్వరాజ్
ఉపాధి కోసం గల్ఫ్ కి వెళ్లి ఉద్యోగాలు కోల్పోయిన వారికి బాసటగా నిలిచింది కేంద్ర ప్రభుత్వం. సౌదీతో పాటు కువైట్ లో దాదాపు 800 మందిని అక్కడి కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. దీంతో రోడ్ల మీద కాలం వెళ్లదీస్తున్నామని, కొన్ని రోజలుగా ఆకలితో అలమటిస్తున్నామని ఓ బాధితుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కి ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. ఆహార ఏర్పాట్లు చేయాల్సిందిగా సౌదీలోని ఇండియన్ ఎంబసీకి ఆదేశించారు.అలానే విదేశాంగశాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె సింగ్ సమస్యను పరిష్కరించేందుకు సౌదీ వస్తున్నారని రీ ట్వీట్ చేశారు. మరోవైపు ఉద్యోగాలు కోల్పోయిన వారిలో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ రెండూ ఆడేస్తాయేమో!!
యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు బల నిరూపణకు 15 రోజుల గడువు లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకి తగినంత సంఖ్యా బలం లేదని పేర్కొంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ బుధవారం రాత్రి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. పిటిషన్ను సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అర్థరాత్రి అత్యవసర విచారణకు స్వీకరించారు. సుమారు మూడున్నర గంటల పాటు వాద ప్రతివాదనలు కొనసాగాయి.
సుప్రీం మెట్లెక్కిన టీటీడీ వివాదం.. _ www.10tv.in |
అప్పుడే దైవత్వం తన వైభవ దర్శనానికి మహాద్వారం తెరుస్తుంది! ధ్యానంతో మన ‘మైండ్’ కామ్అయిపోతుంది. ఖాళీ అయిపోతుంది. శ్వాసమీద ధ్యాస పెడుతూ అలా-అలాగే ఉండిపోతే, క్రమంగా మనస్సు నిర్మానుష్యమై పోతుంది. అపారమైన విశ్వశక్తి మనలోపల ప్రవహిస్తూ ఉంటుంది. దానినే మనం ‘కాస్మిక్ ఎనర్జీ’అంటాం. దీనినే ‘ఆకాశగంగాధార’అంటారు. శివుడి జుట్టునుండి.. పైనుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే క్రింద శివుడు ధ్యాన స్థితిలో ఉంటాడు. పైనుండి షవర్బాత్ లాగా ‘కాస్మిక్ ఎనర్జీ’వస్తూ మనలోపల చేరుతూ ఉంటుంది. ఇదే ధ్యానయోగం!
ధ్యానయోగం అంటే ఏమిటి?
ప్రతి మనిషి కూడా ఒక ఋషికావాలి. ఋషిగా కాకపోతే మళ్ళీమళ్ళీ పుడుతూనే ఉండాలి. వశిష్ఠుడు బ్రహ్మర్షి. విశ్వామిత్రుడు తపస్సు చేత సాధించి బ్రహ్మర్షి అయ్యాడు. ఎలా అయ్యారు వీరంతా మహర్షులుగా- బ్రహ్మర్షులుగా?
‘లోబ్సాంగ్ రాంపా’ అనే టిబెటియన్ మాస్టర్ వ్రాసిన "Third Eye" పుస్తకం చదివితే మూడవ కన్నుయొక్క పూర్తి విషయం కొంతైనా తెలుస్తుంది.
మూడవ కన్ను తెరుచుకుంటేనే దైవత్వం తన వైభవానికి మహద్వారం తెరుస్తుంది. కనుక ధ్యానాన్ని క్రమంతప్పకుండా చెయ్యాలి ప్రతి మనిషి.
మనిషి ‘‘సత్యానే్వషి’’గా మారినపుడే ‘‘సంప్రజ్ఞత’’ కలుగుతుంది. మరి ‘‘సత్యానే్వషణ’’ నిరంతర గమనికవల్లనే సాధ్యం. నిరంతర గమనిక వల్ల ‘‘జాగరూకత’’ఏర్పడుతుంది. జాగరూకతవల్ల ఎరుక కలుగుతుంది. ఎరుకవల్లనే ‘స్వేచ్ఛ’ తెలుస్తుంది.
స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు- విడుదల!
అక్కడ స్ర్తిని మరీ చులకనగా ఒక బల్లలా, ఒక కుర్చీలా కేవలం ఏదో ఒక వస్తువులాంటి ఆస్తిలా పరిగణిస్తారే కానీ, ప్రాణమున్న జీవిగా చూడరు. అందుకే చైనాలో భర్త తన భార్యను చంపినా అక్కడి చట్టాలు అతనిని శిక్షించవు. ఎందుకంటే, అక్కడ స్ర్తి కేవలం ఒక వస్తువు లాంటిది.
బాబా జీవితం వెలుపల, లోపల అత్యంత మధురం. బాబా నడిచినా, మాట్లాడినా. తిన్నా, ఏ పని చేసినా మధురమే! బాబా జీవితం మూర్త్భీవించిన ఆనందం. తన భక్తుల ఆనందయోగానికి బాబా పలు ఉపదేశాలు చేశారు. చక్కని నీతులు బోధించారు. వాటిని చదివి, ఆచరిస్తే ముక్తి, మోక్షం కలుగుతాయి. |
బీజేపీకి పాత ఆఫీస్ పై నుంచే ఎన్నికల వ్యూహాం - way2newstv - Current News, India News, Top News, Technology News, Today News
Home / news / బీజేపీకి పాత ఆఫీస్ పై నుంచే ఎన్నికల వ్యూహాం
న్యూఢిల్లీ జూలై 28 (way2newstv.in)
ఆచార వ్యవహారాలకు, సెంట్మెంట్లకు కేరాఫ్ అడ్రస్గా చేప్పుకునే బీజేపి పార్టీ. 2019 ఎన్నికల వ్యుహా రచన అత్యాధునికంగా నిర్మించుకున్న కోత్త ఆఫీసా లేక గత ఎన్నికల్లో ఘన విజయం సాధించటానికి కేంద్రం అయిన పాత కార్యాలయమా తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ.....అయిదు నెలల కిందట భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ దిల్లీలో కొత్త ఆఫీసులోకి మారింది. ఈ కొత్త ప్రధాన కార్యాలయ భవనం గురించే మొన్న అవిశ్వాస చర్చలో తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ప్రస్తావించారు. నిధులన్నీ కుమ్మరించి తక్కువ సమయంలో కొత్త ఆఫీసు కట్టుకున్నారు. కానీ ఏపీ రాజధానికి సహకరించరా అని ఆయన ప్రశ్నించారు.బీజేపీ 2019 ఎన్నికల కోసం కొత్త కార్యాలయాన్ని ఉపయోగించుకునే ఆలోచనను మానుకుందట.
ఎప్పటి నుంచో ఉన్న పాత ఆఫీసు కేంద్రంగానే 2019 ఎన్నికలకు రెడీ కావాలని నిర్ణయించిందట. అత్యాధునిక - విశాలమైన కార్యాలయాన్ని వదులుకుని పాత ఆఫీసుకే మళ్లీ ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా... అందుకు కారణం కొత్త బిల్డింగ్ కలిసి రాకపోవడమేనట.బీజేపీ కొత్త ఆఫీసు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో ఉంది. కొత్తగా నిర్మించింది కాబట్టి విశాలంగా ఉండడంతో పాటు సదుపాయాలు - పార్కింగ్ వంటివన్నీ ప్లాన్ చేసి కట్టుకున్నారు. ఇక పాత కార్యాలయం అశోకా రోడ్ లో ఆంధ్ర భవన్ కు సమీపంలో ఉంది. 2014 ఎన్నికలకు పథక రచనంతా ఇక్కడి నుంచే సాగింది. ఈ సారి కూడా ఇదే కార్యాలయాన్నే వాడాలని పలువురు సీనియర్లు సూచిస్తున్నారు.కొత్త కార్యాలయంలోనికి మారిన తరువాత ఎన్నికల్లో వైఫల్యాలు పెరిగాయని.. మిత్ర పక్షాలతో వ్యవహారాలూ చెడ్డాయని సీనియర్లు చెబుతున్నారు. కొత్త ఆఫీసుకు మారిన తరువాత..... గోరఖ్ పుర్ - ఫూల్ పుర్ - కైరానా వంటి పట్టున్న ప్రాంతాల్లోనూ ఓడిపోయింది. ఇక కర్నాటక విషయానికొస్తే అత్యధిక సీట్లు గెలిచిన ఏమీ చేయలేకపోయింది. అధికారం చేజారింది. ఏపీలో టీడీపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చి బీజేపీపై కత్తి కట్టి పోరాడుతోంది. మరో మిత్ర పక్షం శివసేన కూడా దూరమైంది.దీంతో అసలే సెంటిమెంట్లను పట్టించుకునే బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల విషయంలో రిస్కు తీసుకోదలచుకోలేదట. అందుకే... కలిసొచ్చిన పాత ఆఫీసు కేంద్రంగానే త్వరలో ఎన్నికల ప్రచార పర్వానికి తెర తీయనున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ, ఆగస్టు 14, (way2newstv.in) కృష్ణ నది ఎగువ ప్రాంతాలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్గాలకు ప్రకాశం బ్యారేజీకు భారీగా నీటి ప్రవాహం...
హైదరాబాద్ ఆగష్టు 17 (way2newstv.in) ఓ అత్యున్నత విలువలతో కూడిన రాజకీయం, నిరాడంబర జీవితం కలబోస్తే.. అటల్ బిహారీ వాజ్ పేయి. తన జీవితంలో ...
గుంటూరు, ఆగస్టు 13, (way2newstv.in) మంగళగిరి టోల్ గేట్ వద్ద వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ను పోలీసులు అడ్డుకున్నారు. అక్రమ మైనింగ్...
భారీగా తగ్గిన నీటి నిల్వలు 70-120 అడుగులు
నెల్లూరు, ఆగస్టు 13, (way2newstv.in) కాస్తో కూస్తో ఆదుకుంటుందనుకున్న నైరుతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మొండిచేయి చూపి తనదారి తాను చూసుకుంది...
ఉత్తర తెలంగాణ కేటీఆర్... దక్షిణ తెలంగాణకు హరీష్
హైద్రాబాద్, ఆగస్టు 11 (way2newstv.in) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాల్లో దిట. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే కదన రంగంలో ప్రత్యర్...
భారత మాజీ ప్రధాని, రాజకీయ భీష్ముడు అటల్ బిహారీ వాజపేయికన్ను మూత
న్యూఢిల్లీ ఆగష్టు 16 (way2newstv.in) భారత మాజీ ప్రధాని, రాజకీయ భీష్ముడు అటల్ బిహారీ వాజపేయి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని ఎయిమ్స్ వై...
న్యూఢిల్లీ ఆగస్టు 17, (way2newstv.in) జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న కమలం పార్టీ కోరిక ఇక తీరనట్లే. మోడీ అనుకున్నది ఇప్పట్లో జరగదని తేలిపోయి...
ఒక వ్యక్తి, ఒక కాంట్రాక్టర్ కోసం పాలన : కోదండరామ్
హైదరాబాద్,అగష్టు 11 (way2newstv.in) 1994 నుంచి రాజకీయాల్లో కీలకమార్పులోచ్చాయి. అంతకు మందు సమస్యలపై పోరాడే వారు. సమస్యలు పరిష్కరించేవారు....
అమరావతి, ఆగస్టు 16 (way2newstv.in) గ్రామ దర్శనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నో...
న్యూఢిల్లీ, ఆగస్టు 15 (way2newstv.in) స్వాతంత్ర దినోత్సవం పురష్కరించుకుని ఆయుష్మాన్ భారత్ అనే కొత్త స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటుల... |
పెళ్లికోసం మీసాలు తీసేశాడు! _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మదాలీ జిన్నా పార్సీ యువతి రుట్టీ పెట్టీటిని వివాహం చేసుకున్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. పెళ్లయిన తర్వాత ఆమె ముస్లిం మతంలోకి మారి తన పేరును మరియం జిన్నాగా మార్చుకుంది. అయితే పెళ్లికి ముందు బుర్రమీసాల్లో కనిపించిన జిన్నా ఆమెతో పెళ్లి తర్వాత మీసాలు లేకుండానే గడపడానికి కారణమేమిటో మాత్రం ఎవరికీ తెలియదు. అయితే 42ఏళ్ల వయసులో జిన్నా రుట్టీతో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ఆమె అలాంటి షరతు పెడుతుందని ఆయన ఊహించే ఉండరు. జిన్నా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు తనను పెళ్లి చేసుకోవాలంటే తన బుర్ర మీసాలను షేవ్ చేసుకోవాలని ఆమె షరతు పెట్టిందట. జిన్నా ఆమె షరతుకు అంగీకరించి మీసాలు తీసేసుకోవడమే కాకుండా ఆమెను ఇంప్రెస్ చేయడానికి తన జుత్తును కూడా కురచ చేసుకున్నాడట. ‘మిస్టర్ అండ్ మిసెస్ జిన్నా- ది మ్యారేజ్ దట్ షుక్ ఇండియా’ పేరిట తాను రాసిన తాజా పుస్తకంలో సీనియర్ జర్నలిస్టు షీలారెడ్డి జిన్నా జీవితంలోని ఇలాంటి వెలుగుచూడని ఎన్నో ఆసక్తికర సంఘటనలను పేర్కొన్నారు. ఈ పుస్తకంపై సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆమె జిన్నా, ఆయన భార్య, వారి కుటుంబాలకు సంబంధించిన అరుదైన ఫోటోలతోపాటు వారి జీవితాల్లోని పలు ఆసక్తికరమైన సంఘటనలను వివరించారు. ముస్లిం అయిన జిన్నా తనకన్నా వయసులో 24 ఏళ్ల చిన్న అయిన పార్సీ యువతితో పెళ్లి ప్రస్తావన తేవడమే అప్పట్లో ఓ పెద్ద సంచలనంగా మారింది. రుట్టీ పెటిట్ తండ్రి దిన్షా మానెక్ జీ పెటిట్ వద్ద ఆయన కుమార్తెతో తన పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు జిన్నా ఒక బారిస్టర్గా తన క్రాస్ ఎగ్జామినేషన్ నైపుణ్యాన్నంతా ప్రదర్శించారని షీలారెడ్డి చెప్పారు. ‘దిన్షాతో మాట్లాడుతున్నప్పుడు జిన్నా ఆయనను మతాంతర వివాహాలపట్ల మీ అభిప్రాయమేమిటని యదాలాపంగా అడిగారు. దానికి సమాధానంగా దిన్షా ‘ఇది దేశ సమైక్యతకు దోహదం చేసే ఓ గొప్ప విషయం అవుతుంది’ అని చెప్పారు. ఆ వెంటనే జిన్నా ‘నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పారు. వెంటనే జిన్నాను దిన్షా గుమ్మం బైటికి గెంటేసారు, ఆ తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ ఎప్పుడూ కలుసుకోలేదు’ అని షీలారెడ్డి చెప్పారు.
న్యూఢిల్లీ, మే 20: రక్షణ రంగంలో కృత్రిమ మేధస్సును ప్రవేశపెట్టే ప్రాజెక్టును కేంద్రం ప్రారంభించింది. సైనిక దళాల సంసిద్ధతా స్థాయిని పెంచేందుకు వీలుగా మానవ రహిత ట్యాంకులను, నౌకలను, రొబొటిక్ ఆయుధాలను ప్రవేశపెట్టనున్నది.
న్యూఢిల్లీ, మే 20: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2 బలియన్ డాలర్లకుపైగా కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త నీరవ్ మోదీ, అతని అంకుల్ చోక్సీలపై రెడ్కార్నర్ నోటీసులు జారీ చేయడానికి సీబీఐ సిద్ధమవుతోంది. ఈ మేరకు సీబీఐ ఇంటర్పోల్ని ఆశ్రయించనుంది.
గువహతి, మే 20: మోదీ ప్రభుత్వం మాత్రమే ఈ ప్రాంతానికి శాంతి, సుస్థిరతలను, అభివృద్ధికి దోహదం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఈ ప్రాంతం దారుణమైన వెనుకబాటుకు గురైందని ఆరోపించారు.
మొహాలి, మే 20: వాతావరణ మార్పు, నీటి కొరత వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టాలని రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్ శాస్తవ్రేత్తలు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతి నిర్మాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలదే కీలకపాత్ర అన్నారు.
న్యూఢిల్లీ, మే 20: కర్నాటకలో అధికార పగ్గాలు బీజేపీకి దక్కకుండా చేయడంలో కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావడంతో, బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
ఉత్తర పతనం నది లో ఒక అపార్ట్ మెంట్ నుండి సూర్యాస్తమయం. మసాచుసెట్స్, మే 18, 2003
కట్టా శ్రీనివాస్ __ ఇక్కడ వెలుతురు కూడా ఉంది సుమా
ఖమ్మంజిల్లా
చిత్తుప్రతిని సిద్దం చేసుకో ముందు
నమ్మకం దాన్ని నిజం చేసేందుకు సహకరిస్తుంది.
→ ’నెగటివ్ వాయిస్’ లో ‘నవ్వే నక్షత్రాలు’ కట్టా మట్టివేళ్ళు – శ్రీనివాస్ వాసుదేవ్
One thought on “చిత్తుప్రతిని సిద్దం చేసుకో ముందు”
ఈ వీడియో మిడ్ నైట్ అబ్బాయిలు మాత్రమే చూడండి..! _ Lovers Club Movie Uncensored Romantic Scene
బంగారు తెలంగాణ
ఇ - మ్యాగజిన్
Select Menu హోం సంపాదకీయం బంగారు తెలంగాణ సంస్కృతి పర్యాటకం మన చరిత్ర వార్తలు వ్యాసాలు ఫీచర్స్ వికాసం కథ చిత్రకారులు సినిమా పుస్తక దర్శిని ఇ - మ్యాగజిన్
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
బంగారు బాటలో ఆరోగ్య తెలంగాణ!
‘మిషన్ కాకతీయ’ ఫలితాలు
మన సీమలో పొలాల పండుగ
ఏడాదిలో తొలి పండుగ ‘ఉగాది’
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం
ఆకాశమా.. నీవెక్కడ..? - నల్లమోతు శ్రీధర్ మనసులో.. |
మనతెలంగాణ/నాగర్కర్నూల్ : 92 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సిపిఐ బ్రిటిషు సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా జాగీర్దారీ, జమీందారి, వ్యవస్థ్దకు వ్యతిరేకంగా దేశ ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరా టాలు నిర్వహిస్తున్న పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్ నర్సింహ్మా అన్నారు. సిపిఐ 92వ వ్యవస్థ్దాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని బస్టాండ్ ముందు పార్టీ పతాకాన్ని ఎగుర వేసారు. అనంతరం మాట్లాడుతూ వేర్పాటు వాదుల శక్తులకు వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం అలుపెరగని పోరాటాలు సిపిఐ పార్టీ చేసిందన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హెచ్. ఆనంద్జీ , ఖాజ, వంకేశ్వరం శ్రీనివాసులు, రవీంద్రాచారి, జలీల్ , సలీం తదితరులు పాల్గొన్నారు.
Previous Postప్రజా ఉద్యమాలు నిరంతరం Next Postఆర్బిఐ కీలక నిర్ణయం...
లోకేష్కు 'డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్
అమరావతి: స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 'డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్కు ఏపీ మంత్రి నారా లోకేష్ ఎంపిక కయ్యారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్న టెక్నాలజీ, డ్యాష్ బోర్డ్ ఏర్పాటు ఆధారంగా ఈ అవార్డుల ప్రకటన జరిగింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో.. అధునాతన సాంకేతికత, సాధించిన ఫలితాల ఆధారంగా లోకేష్కు అవార్డు దక్కింది. ఈనెల 18న ఢిల్లీలో బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సమ్మిట్లో అవార్డు ప్రదానం చేయనుంది.
Watch : Rana Daggubati Interived Size Zero team సింహాచలం లో నితిన్ ని బంధించిన అర్చకులు https://goo.gl/1egNvT ▻Web: https://w...
ఈ చిత్రగుప్త దేవలయం దర్శిస్తే తొందరగా వివాహం జరుగుతుంది __ Karya Siddhi __ Archana __ Bhakthi TV - Devotional updates 24x7 2017-08-13 - Video - APLatestNews.com
ఈ చిత్రగుప్త దేవలయం దర్శిస్తే తొందరగా వివాహం జరుగుతుంది __ Karya Siddhi __ Archana __ Bhakthi TV - 03:42 min - News - Video
ఐడియా తీసుకొచ్చింది అన్ లిమిటెడ్ 3G/4G ఆఫర్ _ Flickr Videos
2019లో ఆ ఇద్దరికి టిక్కెట్లు డిసైడ్ చేసిన జగన్..
ఈనెల19న శ్రీకాకుళం జిల్లాకు జగన్.. టీడీపీ నేతల గుండెలో గుబులు..
2019లో జగనే ముఖ్యమంత్రి అనడానికి కారణాలు..
వైకాపాలోకి కన్నా లక్ష్మీనారాయణ..!
ఈ ఆరోగ్య సమస్యలకు సెక్స్ మంచి పరిష్కారం
సమ్మర్ లో శృంగారం… ఇలా చేస్తే ఆ కిక్కే వేరప్పా
పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
పురుషులు రెగ్యులర్ గా సెక్స్ చేయకపోతే ఏంటి నష్టం?
ఐడియా తీసుకొచ్చింది అన్ లిమిటెడ్ 3G/4G ఆఫర్
జియో ప్రభావంతో ఇంటర్నెట్ చాలా చవకగా మారిపోయింది. ఒక జీబీ డేటా కోసం కూడా వందల రూపాయలు ఖర్చు చేసే రోజులు ఎప్పుడో పోయాయి. దాంతో జియో కాకుండా, భారతదేశంలోని ఇతర మొబైల్ నెట్వర్క్ కంపెనీలన్నీ నష్టాలు కల్లజూస్తున్నాయి. జియో లాగా అన్ని ఉచితంగా ఇచ్చే స్థోమత లేక, జనాల్ని ఏదోవిధంగా తమ కంపెని ఇంటర్నెట్ వాడేలా ప్రోత్సహించడానికి ఒకదాని తరువాత మరొకటి పోటిపడి ఆఫర్లు అందిస్తున్నాయి.
ఈమధ్యే 16 రూపాయలకే గంటసేపు లిమిట్ లేని 4G/3G వాడుకునే ఆఫర్ తో వోడాఫోన్ ఒక్క కొత్త ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ, ఐడియా కూడా అలాంటి ఆఫర్ ఒకటి అందిస్తోంది.
14 రూపాయలు చెల్లిస్తే చాలు, గంటసేపు అన్లిమిటెడ్ 3G డేటా మీ సొంతం. అదే 22 రూపాయలు చెల్లిస్తే, గంటసేపు 4G/3G ఎంతైనా వాడుకోవచ్చు. అన్ లిమిటెడ్ అన్నమాట. ఇదే పద్ధతిలో ఎయిర్ టెల్ కూడా ఓ మంచి ఆఫర్ ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2019 ఎలక్షన్స్ లో వైస్సార్సీపీ రికార్డు బద్దలు కొట్టడం ఖాయం..
అమ్మకానికి అమ్మాయిల నంబర్స్..
షాకింగ్ లీక్ అయిన చరణ్ సుకుమార్ ల కథ !
కాటంరాయుడు టీజర్..
సౌత్ హాట్ స్టార్ నమిత లీకెడ్ వైరల్ వీడియో
టాలీవుడ్ హీరోస్ కు గూగుల్ ఇచ్చిన ర్యాంకులు ఇవే..
కోరికలు విపరీతంగా ఉన్నా కూడా ఆడవాళ్లు ఎందుకు బయటపడరో తెలుసా ?
ఇవి తింటే ఆడవారిలో శృంగార కోరికలు విపరీతంగా పెరుగుతాయి అంట…
సెక్స్ జీవితం బోరు కొట్టకుండా భార్య భర్తలను ఫాలో అవ్వాల్సిన టిప్స్..
ఈ 9 అలవాట్లు మగాడి వీర్య కణాల మీద ప్రభావం చూపిస్తాయి.. |
sri reddy comments on nani:actor sri reddy sensational comments on hero nani _ నాని కామాంధుడు.. ఓ అమ్మాయికి నరకం చూపించాడు: శ్రీరెడ్డి - Samayam Telugu
లైఫ్ స్టైల్
వీడియో గ్యాలరీ
సినిమా న్యూస్
సినిమా రివ్యూ
తెలుగు వీడియో గ్యాలరీ
ఫన్నీ వీడియోస్
తిరుమల శ్రీవారి సేవలో రాబర్ట్ వాద..
అద్భుతం.. ఈ ఖనిజం, కాలుష్యాన్ని ప..
ఆగస్టు 16 రాశి ఫలాలు..
కర్ణాటక: అబ్బురపరుస్తోన్న జోగ్ ఫా..
వాజ్పేయి కోసం యాగం చేసిన ఎమ్మెల్..
నాని కామాంధుడు.. ఓ అమ్మాయికి నరకం చూపించాడు: శ్రీరెడ్డి
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్పై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా మరిన్ని హాట్ కామెంట్స్ చేసింది. ఈసారి యువ హీరో, న్యాచురల్ స్టార్ నానిపై సంచలన ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబును మనసున్న బాబు అంటూ కొనియాడింది. ‘తెర మీదకు వచ్చేసరికి ఒక్కొక్కడు శ్రీరంగ నీతులు చెప్తారు, మన నేచురల్ స్టార్ నాని ఒక అమ్మాయికి ఒక రోజంతా నరకం చూపించాడు..’ అంటూ ట్వీట్ చేసింది. అంతటితో ఆగకుండా ‘కాసుకోర నాని.. నీ టోకెన్ వచ్చింది, నీకూ ఫ్యామిలీ ఉందిగా, కొంచెం కూడా సిగ్గు లేదా అలా చేయటానికి..’ అంటూ రాసుకొచ్చింది. దీంతో పాటు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న ఓ వీడియోను కూడా షేర్ చేసింది.
మరో ట్వీట్లో నాని వాయిస్ ఓవర్ ఇచ్చిన ‘అమోలి’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ను షేర్ చేస్తూ.. ‘మంచి షార్ట్ ఫిల్మ్, అందరూ చూడండి.. అంతా బాగుంది కానీ, నాని వాయిస్ ఎందుకు.. వాడే ఒక కామాంధుడు. మహేష్ బాబు వాయిస్ అయితే చాలా బాగుండేది.. వెన్న లాంటి సున్నితమైన మనసున్న బాబు మా మహేష్ బాబు’ అంటూ రాసుకొచ్చింది.
నాని, శేఖర్ కమ్ములతో ఏం జరిగిందో తనకు తెలుసని, తొందర్లో తన లాయర్ వచ్చి అందరి తోళ్లు వలుస్తారని శ్రీరెడ్డి హెచ్చరించింది. ‘నేను భయపడతా అనుకుంటున్నారా.. నాటకాలు చేసేసి, ప్రెస్ ముందుకెళ్లి నేను ఏం చేయలేదు.. ఒల్లల్లల్ల.. అయిపోయింది అంతే.. అదంతా ఉత్తుత్తే అంటే అయిపోయిందా.. ఇప్పుడు నాలాగే ఒక్కొక్కరూ బయటకొస్తారు.. ఎంత తొక్కుదామని ప్రయత్నిస్తే.. అంతలా కెరటంలా ఎగసిపడతారు’ అని శ్రీరెడ్డి అంది.
చట్టాన్ని వాడుకొమ్మని చెప్పారు కాబట్టి.. చట్టాన్ని, పోలీసులను వాడుకుంటానని శ్రీరెడ్డి పేర్కొంది. ‘మాలో ఉన్న కోపం, ఆ కోపం పోరాట రూపం ఎలా దాలుస్తుంది? దాల్చితే ఎలా ఉంటుంది? చూపిస్తాం.. విజయమా, పరాజయమా పక్కనబెట్టండి.. మాకు వచ్చిన కోపానికి మీరు అనుభవించాల్సిందే’ అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.
Sri Reddy Leaks ; తెర మీదకు వచ్చేసరికి ఒక్కొక్కడు శ్రీరంగ నీతులు చెప్తారు, మన నేచురల్ స్టార్ నాని ఒక అమ్మాయికి ఒక… https://t.co/EvufZ5gmx5
ఇక నుంచి ఏ అమ్మాయి వంకైనా చూడాలన్నా.. కాల్స్, వాట్సాప్ మెస్సెజ్లు, పిచ్చి పిచ్చి కాల్స్ చేయాలన్నా భయపడాలని శ్రీరెడ్డి హెచ్చరించింది. తనకు ఫోన్ కాల్స్, మెస్సేజ్లు చేసే ప్రతి ఒక్కరిని ఇరికిస్తానని తెలిపింది. అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కాపాడతారా.. మరొకళ్లు వస్తారా చూస్తానని అంది. ‘కేసులు పెడితే పవన్ కళ్యాణ్ అనుభవిస్తారా, ఫ్యాన్స్ అనుభవిస్తారా’ అంటూ కొంత మంది ప్రశ్నిస్తున్నారని.. త్వరలో ఆ విషయం కూడా తేలుస్తానని చెప్పింది.
మంచి షార్ట్ ఫిల్మ్, అందరు చూడండి, అంతా బాగుంది కానీ నాని Voice ఎందుకు వాడే ఒక కామాంధుడు, మహేష్ బాబు Voice అయితే చా… https://t.co/VwemZYRX6Y
Telugu Movie News App: లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
మీ కామెంట్స్
మీ గురించి తెలియచేయండి.
మీకు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమైనా కనిపిస్తే, "అభ్యంతరకరం" అనే లింకుకు వెళ్లి దానిని సెలెక్ట్ చేసి మీ అభ్యంతరాన్ని తెలియజేయండి. దానిని పరిశీలించి వీలైనంత త్వరగా తొలగిస్తాం. మీ వ్యాఖ్యల్లో మా సంస్థ ప్రమాణాలకు, నిబంధనలకు అనుగుణంగా లేని అభ్యంతరకరమైన వ్యాఖ్యలుంటే బ్లాక్ చేసి ఎడిట్ చేయబడతాయి.
నమోదుచేయండి/ లాగిన్ చేయండి
నమోదు చేయండి / పేర్కొనకపోతే లాగిన్ చేయండి
మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు
ధృవీకరణ కోసం ఒక ఈమెయిల్ ను మీకు పంపించాము. దయచేసి ఆ లింకుపై క్లిక్ చేయండి.
త్వరలోనే మీ వ్యాఖ్య ప్రచురించబడుతుంది. ఆ వివరాలు మీకు ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాం
నియమ నిబంధనలు
వర్గీకరణ:తాజా వార్తలు_పాత వార్తలు_గొప్పా_ అంగీకరిచడం_విభేదించడం
తెలుగులో టైప్ చేయండి(ఇన్స్క్రిప్ట్)_ తెలుగులో టైప్ చేయండి(ఇంగ్లీష్ అక్షరాలతో) _ Write in English _ వర్చువల్ కీబోర్డు
వ్యాఖ్యపట్ల మీకు అభ్యంతరం వుందా ?
కిందనున్న కారణాల్లో ఒకటి క్లిక్ చేయండి. మా ప్రతినిధులు మీ కారణాన్ని పరిశీలించి, మీ అభిప్రాయం సరైనదేనని అనిపిస్తే ఈ వ్యాఖ్యని చెరిపేస్తారు.
అసభ్యకరమైన భాష
మీ అభ్యంతరం ఎడిటర్కి చేరింది
మరిన్ని వ్యాఖ్యలను వీక్షించండి »
సినిమా న్యూస్ సూపర్ హిట్స్
Rashmika Mandanna: రష్మిక లిప్లాక్ లీక్.. కన్నడ ఫ...
కలర్స్ స్వాతి పెళ్లి.. వరుడు ఎవరంటే! |
ఇండస్ట్రీ సిగ్గుపడాలి.. దేవరకొండ ఫ్యాన్స్ కొడతారు...
మళ్లీ అతనితోనే.. దిల్ రాజు తర్వాతి చిత్రం టైటిల్ ప...
Episode 64 Highlights: బిగ్బాస్ నుంచి బాబు గోగినే...
ప్రత్యేకంగా మీ కోసం
జాతీయంకేరళ వరదలు: ఆ అమ్మాయి విరాళం రూ.1.5 లక్షలు!
సినిమా న్యూస్అఫీషియల్.. ప్రియుడితో ప్రియాంక ఎంగేజ్మెంట్
సినిమా న్యూస్మరో బయోపిక్.. వెండితెరపై జయలలిత జీవితం!
అందంవర్షాకాలం: జుట్టు రాలిపోతోందా.. ఇవిగో చిట్కాలు!
వైరల్ఇండిపెండెన్స్ డే: కదిలిస్తోన్న ఫొటో..
ఇతర క్రీడలునేటి నుంచి18వ ఆసియా క్రీడలు
ఇతర క్రీడలుట్రాక్ సైక్లింగ్ భారత్కి తొలి పతకం..!
# తెలుగు పాటలు
సమయం తెలుగు న్యూస్ అలెర్ట్కు సబ్స్క్రైబ్ అవ్వండి
సమయం తెలుగు నుంచి బ్రేకింగ్ న్యూస్, టాప్ స్టోరీల నోటిఫికేషన్లను తక్షణమే పొందండి
ఇప్పుడు వద్దు
* బ్రౌజర్ సెట్టింగ్స్ ద్వారా మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్లను స్విచ్ ఆఫ్ చేయొచ్చు |
Acchamga Telugu - Worlds Largest Telugu Monthly Online Magazine - అచ్చంగా తెలుగు - అంతర్జాల తెలుగు మాస పత్రిక - Worlds Best Online Telugu Magazine
వ్యక్తిత్వ వికాసం
పుస్తక పరిచయం
ప్రత్యేక శీర్షికలు
తెలుగు బొమ్మ
౩౦ ఏళ్ళు టీవీ, రంగస్థల, చలనచిత్ర నటనానుభవం కలిగి, తన అభినయంతో ఎవరినైనా చటుక్కున నవ్వించే అచ్చ తెలుగు నవ్వుల రేడు – గుండు హనుంతరావు గారితో ప్రత్యేక ముఖాముఖి... మీ కోసం...
మీ స్వగ్రామం, మీ బాల్యం గురించిన సంగతులు చెబుతారా ?
నేను పుట్టింది(1956) , పెరిగింది, చదివింది, ఆడింది, పాడింది, నాటకాలు వేసింది అంతా విజయవాడే ! అమ్మ పేరు సరోజిని, నాన్న కాంతారావు. మా పెదనాన్న కృష్ణబ్రహ్మం గారు మంచి గాయకులు, నటులు. అప్పట్లో ఆయన్ను అపర ఘంటసాల అనేవారు. వారి నాటకాల్ని నేను చాలా చిన్నప్పుడు చూసాను. చిన్నప్పటి నుంచి నాటకాలు చూసి, నాకు కూడా నటించే అవకాశం వస్తే బాగుండునని అనుకునేవాడిని. అలా 1974 నుంచి, అంటే నా 18 వ సంవత్సరం నుంచి నాటకాలు వెయ్యడం మొదలు పెట్టాను. నేను మొట్టమొదట వేసిన వేషం రావణ బ్రహ్మ వేషం.
సినిమా రంగానికి వస్తానని ఎప్పుడైనా అనుకున్నారా ?
లేదండి . ఒకసారి మద్రాస్ లో నేను వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల గారు, నన్ను స్టేజి మీదకు వచ్చి, అభినందించి, తన తర్వాతి చిత్రంలో నాకు వేషం ఇస్తానని చెప్పారు. తర్వాత ‘అహ నా పెళ్ళంట’ సినిమాలో వేషం ఇచ్చాకా, నేను సినిమాల్లో కూడా బాగా నటించగలను అని తెలిసింది. తర్వాత ఒక 50 సినిమాల వరకూ విజయవాడ నుంచే షటిల్ చేస్తూ, నటించాను.
మీ నటనకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉండేది ?
నాటకాల రిహార్సిల్ వేసి, నేను తెల్లవారుఝామున 3 గంటలకు ఇంటికి వస్తే, అమ్మ తలుపు తీస్తూ... ఎందుకొచ్చిన నాటకాలురా ? కూటికొచ్చేనా ? గుడ్డకొచ్చేనా ? అని అడిగేది. మరి అదే నాకు ఈ రోజు వరకూ కూటికొచ్చింది, గుడ్డకొచ్చింది, గూడుకొచ్చింది... (అన్నారు నవ్వుతూ)
మీ దృష్టిలో హాస్యం అంటే ఎలా ఉండాలి ?
హాస్యానికి నిర్వచనం చెప్పాలంటే, సూరేకాంతమ్మ గారి హాస్యంలా ఉండాలి. అన్ని తరాలు ఆస్వాదించేలా, సహజంగా ఉండాలి. సున్నితంగా, సన్నిహితంగా ఉండాలి, అని పెద్దలు ఎంతోమంది సినిమా పరంగా గాని, వేదికలపై గాని, నిరూపించారు.
మీ అభిమాన హాస్య నటులు ఎవరండి ?
సూరేకాంతమ్మ గారేనండి. ఆవిడంటే నాకు వల్లమాలిన ఇష్టం. గయ్యాళి అత్తపాత్రలు చేసినా ఆవిడ పాత్రోచిత నటన, డైలాగ్ లు, మాడ్యులేషన్, డిక్షన్, ఎక్కడో మన దూరపు చుట్టం అన్నట్లుగా, అనిపిస్తుంది. ముఖ్యంగా ‘గుండమ్మ ‘ పాత్ర, అన్నపూర్ణ పిక్చర్స్ లో చేసిన -వెలుగునీడలు, డా. చక్రవర్తి, ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ లో చేసిన కులగోత్రాలు, విజయా వారి మాయాబజార్ (ఘటోత్కచుడి తల్లి పాత్ర ) మొదలైన చిత్రాలు అన్నింటిలోనూ ఆవిడ నటన సహజంగా ఉండి, ఎన్ని సార్లు చూసినా విసుగుపుట్టకుండా ఉండే చక్కటి సినిమాలు.
ఉచ్చారణలో మీకు అంత స్పష్టత ఎలా వచ్చింది ?
మంచి మంచి నటుల సాహచర్యం వల్ల, వారితో నటించడం వల్ల, ప్రభావం వల్ల, వాళ్ళను చూసి, స్పష్టత అలవడింది. వారి సాంగత్య ప్రభావం వల్ల, సాధన, నటన పట్ల మక్కువ, భావంలో స్పష్టత , అర్ధమయ్యేలా డైలాగ్ చెప్పాలి అనే తపన వల్ల, చాలా నేర్చుకున్నాను. చూసిన- చేసిన నాటకాలు, సినిమాలు, కలిసి తిరిగిన మాహానటులు వీరి ప్రభావం నాపై ఉంది.
మీకు బాగా తృప్తిని కలిగించిన పాత్ర ఏది ?
సినిమా పరంగా ఇంకా మంచి పాత్రలు చెయ్యాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. కృష్ణారెడ్డి గారి రాజేంద్రుడు- గజేంద్రుడు, మాయలోడు, యమలీల ; అన్నమయ్య, పేకాట పాపారావు, పెళ్ళానికి ప్రేమలేఖ- ప్రియురాలికి శుభలేఖ, అమ్మదొంగా, గౌతమ్ s.s.c, వంటి సినిమాల్లో నేను చేసిన పాత్రలు నాకు సంతోషాన్ని ఇచ్చాయి.
అమృతం సీరియల్ అంటే మా అందరికీ చాలా ఇష్టం. మరి దాని గురించిన విశేషాలు చెప్తారా ?
మీరు టీవీ సీరియల్స్ కు గాను మూడు నంది అవార్డులు గెల్చుకున్నారు కదా. ఆ వివరాలు చెబుతారా ?
అమృతం సీరియల్, ఈ టీవీ లో వచ్చిన ప్రమేషియా అనే ఒక సీరియల్, మిష్టర్ అండ్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం సీరియల్స్ కు గాను 3 సార్లు హాస్యనటుడిగా నంది అవార్డులు అందుకున్నాను. సినిమాల పరంగా నాకు అందిన అవార్డులు అన్నీ ప్రైవేటు సంస్థలవే.
మా ‘అచ్చంగా తెలుగు ‘ చదువరుల కోసం సరదాగా మంచి హాస్య డైలాగ్ లు చెబుతారా ? |
నేను రెండు మాటల్లో అర్ధాలు మారేలా సరదాగా కొన్ని హాస్య వాక్యాలు రాస్తుంటాను. అవే వినిపిస్తాను... ‘మనిషిని నడిపించేది నవగ్రహాలే కాదు, నవ్వూ- ఆగ్రహాలు కూడా !’ ‘ఏ పుట్టలో ఏ పాముందో... ఏ పొట్టలో ఏం ఫార్మ్ అయ్యిందో ఎవరికి తెలుసు ?’ ‘అతని మాటలు వింటే ఒళ్ళు జలదరిస్తుంది. అతన్ని చూస్తే కళ్ళు జల ధరిస్తాయి !’ ‘ ఈ మధ్య అతనికి గర్వం బాగా పెరిగింది. అతనికి ఎలాగైనా గర్వ స్రావం చెయ్యాలి.’ ‘ సాధారణంగా నటుల మధ్య జెలసి ఉంటుంది... కాని నేను ఆ జెలసి అనే జలాన్ని సీ లో వదిలి పెట్టాను...’ ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి ...’ అనే సామెత ఉంది. దాన్ని నేను కొంచెం మార్చి, ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కుల హడావిడి...’ అన్నాను. ఒకసారి భరణి గారికి ఇవి వినిపిస్తూ ఉంటే, ఆయన ‘బాగా రాసావురా...’ అని మెచ్చుకుంటున్నారు. కాని పక్కన కూర్చున్న ఒకాయన, నేను చెప్పేవి నచ్చినా, మౌనంగా ఉన్నారు. అప్పుడు ఆయన మీద కూడా ఒకటి రాసాను... ‘ పంచ్ నచ్చి కూడా నవ్వకపోతే... పంచ్ మహాపాతకాలు చుట్టుకుంటాయి...’ ఇలా సరదాగా ఇప్పటికి ఒక 60, 70 వరకూ రాసుకున్నాను. ఇవే వేదికలపై వినిపిస్తూ ఉంటాను. 100 అయ్యాకా చిన్న పుస్తకంలా ప్రచురించాలని ఒక కోరిక.
నటనాపరంగా మీరు అందుకున్న ఉత్తమ ప్రశంస ?
అమృతం సీరియల్ కి నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. అదే నాకు అందిన మంచి ప్రశంస.
నటన కాక మీ ఇతర హాబీ లు ఏవిటి ?
మ్యూజిక్ అంటే బాగా ఇష్టమండి. పాత పాటలు, వినాలి అనిపించే తెలుగు, తమిళ్, హిందీ పాటలు అన్నీ వింటాను.
సినీ రంగంలో ఒడిదుడుకులు చాలా ఉంటాయి. ప్రతి ఆర్టిస్ట్ ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే, అలవాటు పడాల్సిందే !అందుకే నేను ప్రతి రోజూ ఉదయాన్నే ‘ నేను ఇవాళే హైదరాబాద్ వచ్చాను ,’ అనే అనుకుంటాను.
భావి నటులు ముందే బాగా శిక్షణ పొంది వస్తున్నారు. వారికి నేను ఇచ్చే సందేశం ఏమీ లేదు. చెప్పాల్సిన పనీ లేదు. ఇంత పెద్ద ప్రపంచంలో, ఇన్ని అవకాశాలు చెయ్యగలిగాను అని మనం సంతోషపడాలి. అల్లు రామలింగయ్య గారు, సూరేకాంతం గారిలా కలకాలం వెలిగే ‘గోల్డెన్ ఇరా’ అప్పుడు ఉండేది. గొప్ప పాత్రలు, రచయతలు, దర్శకులు వారికి అందారు. ఇవాళ ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. అందుకే నేను అందరికీ చెబుతూ ఉంటాను...’ ప్రూవ్ చేసుకుంటే సరిపోదు, ఇంప్రూవ్ చేసుకోవాలి...’ అని. వైవిధ్య భరితమైన పాత్రల్లో అందరినీ మెప్పించే గుండు హనుమంతరావు గారు మరిన్ని గొప్ప పాత్రలు చేసి, తెలుగింట నవ్వుల పూలు పూయించాలని ఆశిస్తున్నాము. భావరాజు పద్మిని తో టెలిఫోన్ లో వారితో జరిపిన సంభాషణ ను క్రింది లింక్ లో వినండి.
గువ్వలచెన్న శతకము - గువ్వలచెన్నడు పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం కవి పరిచయం: గువ్వలచెన్న శతక కర్తృత్వము గురించి కానీ, క...
సౌజన్య-ఈ కాలం అమ్మాయి
సౌజన్య-ఈ కాలం అమ్మాయి మంథా భానుమతి “ఎలా వదినా! ఉన్నపళంగా వచ్చెయ్యమంటే, ఎన్ని చూసుకోవాలి?” “……….” “మీ తమ్ముడికేం ఫర...
మాతృగయ అంబడిపూడి శ్యామసుందర రావు . 9440235340. హిందు మతములో పితృకర్మలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. సాంవత్సరీక శ్రాద్ధ క...
నాన్న మనసు అక్కిరాజు ప్రసాద్ "నాన్నా! ఎలా ఉన్నారు?" "బానే ఉన్నానమ్మ!" "మీ ఆరోగ్యం ఎలా ఉంది? వాకింగుక...
రంగవల్లి టేకుమళ్ళ వెంకటప్పయ్య "రేపటి నుండి నెలరోజులు ప్రిపరేషన్ హాలిడేస్ కదా….. ఊటీ...గోవా…. ఏదైనా ప్లాన్ చేద్దామా? నాల్రో...
నవ్వుల రేడు - గుండు హనుమంతరావు ౩౦ ఏళ్ళు టీవీ, రంగస్థల, చలనచిత్ర నటనానుభవం కలిగి, తన అభినయంతో ఎవరినైనా చటుక్కున నవ్వించే అచ్చ తెలుగ...
ఉచిత ఎముక వైద్య శిబిరం
ఉచిత ఎముక వైద్య శిబిరం ఓరుగంటి సుబ్రహ్మణ్యం డా.డి.వై. పాటిల్ ఆయుర్వేద్ హాస్పిటల్స్, నెరూల్, నవి ముంబయి మరియు మిల్లేనియం హెల్...
భళా !బాలల బొమ్మల 'బాబు'
శివం- 7 ( శివుడే చెబుతున్న కధలు )
భైరవ కోన – 8 (జానపద నవల )
చీకటి పూలు – పుస్తక పరిచయం
హై ‘క్లూ’ లు
చెప్పుకోండి చూద్దాం !
ఎంత వాడితే అంత ‘వాడి’ పెరుగుతుంది!
వెన్నెల్లో లాంచీ ప్రయాణం- 2
'కిక్' ఖరీదు
అంతర్యామి - 6
ట్యూబ్ లైట్
ప్రేమ యాత్రలకు...
నా చేతి వంట
మహిళ -- నాడు_నేడు
శ్రీధరమాధురి – 9
ఎటువంటి ఆహారం తీసుకోవాలి ?
రుద్ర దండం – 8
ఇలా ఎందరున్నారు ?- (2 వ భాగం )
భక్తి మాల – 1
తెలుగు బొమ్మ - పోడూరి శ్రీనివాస రావు
జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 12
జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 12 చెన్నూరి సుదర్శన్ (జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాం...
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved. |
100% విజయాన్నిచ్చే 25 ఆలోచనలు - అచ్చంగా తెలుగు '+g+"
Acchamga Telugu - Worlds Largest Telugu Monthly Online Magazine - అచ్చంగా తెలుగు - అంతర్జాల తెలుగు మాస పత్రిక - Worlds Best Online Telugu Magazine
వ్యక్తిత్వ వికాసం
పుస్తక పరిచయం
ప్రత్యేక శీర్షికలు
తెలుగు బొమ్మ
Home » భావరాజు లోగిలి » వ్యక్తిత్వ వికాసం » 100% విజయాన్నిచ్చే 25 ఆలోచనలు
100% విజయాన్నిచ్చే 25 ఆలోచనలు
బి.వి.సత్య నగేష్
మీరు గెలవాలంటే మీ మనసు ఇలా ఉండాలి .
విజయం సాదించాలంటే ముందుగా విజయం సాదించాలనే ఆలోచన ఆ వ్యక్తికి ఉండాలి .
మీ విషయం లో విజయం సాదించాలి అనే విషయం నిర్ణయించుకున్న తర్వాత ఆ దిశలో ఆలోచనలు మొదలు పెట్టాలి . రోజు రోజుకి మీలో అబివృద్ది బాగా వస్తుంది అనే భావన మీలో బాగా ఉండాలి .
ఆత్మ పరిశోధనకు కూడా ఈ ఆలోచన బాగా పనికి వస్తుంది .చెడు ఆలోచన మనసులోకి రానివ్వకూడదు .ఆలోచన వలన మనో ధైర్యం పెరుగుతుంది.ఆలోచనలో ఊహించటం జరుగుతుంది.ఇది పగటి కలగానే ఉండిపోకుండా రోజు రోజుకి మీలో వచ్చే ప్రగతిని విశ్లేషించుకోవాలి.ఈ విజయం సాధించటానికి ఏమి చెయ్యాలి అనే విషయం చూద్దాం.మనసుకు విశ్రాంతిని స్పూర్తినిచ్చే ఈ క్రింది విషయాలు తలచుకోవాలి .
మీరు ఏ పనినైనా చెయ్యగలరు.ప్రతి మనిషి తను అనుకున్నది సాధనతోనే సాధిస్తాడు.
గతంలో ఎన్నో విజయాలు సాధించలేరు. ఇక ముందు ఎన్నో విజయాలు సాధించటానికి తయారుగా ఉన్నారు.
గమ్యం చేరటంలో వచ్చే సమస్యలు స్పీడ్ బ్రేకర్లు మాత్రమే కాని అడ్డు గోడలు కాదు .ఒక ఊరు నుండి ఇంకో ఊరు బస్సులో వెళ్తున్నపుడు బస్సు అనేక సార్లు మార్గం మధ్యలో ఆగినా చేరవలసిన సమయానికి చేరవలసిన గమ్యం చేరుతుంది.
సమస్యలను చూసి మీపై మీరు జాలిపడటం పొరపాటు. ఆత్మవిశ్వాసం తగ్గించుకోవటం ఇంకా పెద్ద పొరపాటు.
గతం గురించి తలుచుకొని బాధపడకూడదు.బంగారం లాంటి భవిష్యత్తు గురించి ప్రణాళిక చెయ్యాలి .గతాన్ని మార్చలేం.
వర్తమానం భవిష్యత్తుకి పునాది.గతం గురించి భాదపడటం అనవసరం.వర్తమానం లో ప్రతి క్షణం ను మీ లక్ష్యం గురించి ఖర్చు పెట్టండి .అదే మీ భవిష్యత్తుకి పునాది.
కొన్ని విషయాలలో రాజీపడి తీరాలి .
కొన్ని విషయాలలో లౌక్యం తో వ్యవహరించాలి.
ఏ పని ముందు చెయ్యాలి అనే విషయం నిర్ణయించుకున్న తరువాత ఆ పనిని ఏకాగ్రత లో చెయ్యాలి .
రోజు రోజుకి మీలో వచ్చే ప్రగతి ని మీరు హర్షించాలి .
అవకాశాలు రావు .వాటిని కల్పించుకొని కైవసం చేసుకోవాలి.
సమయం విలువైనది.ప్రతి క్షణం మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరికైనా రోజుకి 24 గంటలు మాత్రమే.
విజయాలు సాధించిన వారందరు కస్టపడి సాధించిన వారే కాని విజయాలు వారికి ఎవరో తీసుకువచ్చి ఇవ్వలేదు.విజయాలు సాధించిన వారి గురించి అధ్యయనం చేసి వారు ఆ విజయాలు ఎలా సాధించారో తెలుసుకోవటం ఒక ముఖ్యమైన సాధన.
స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఎన్ని సంవత్చరాలు చూస్తున్నా స్విమ్మింగ్ రాదు. ఈత కొట్టాలంటే ఈ పూల్ లోకి దిగి విజయం కోసం పాటుపడాలి.
మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి.మీ మీద మీరు జాలి పడకూడదు.ఎవరి సానుభూతి గురించి ఎదురు చూడవద్దు అది మీ ఆత్మ విశ్వాసాన్ని సన్న గిల్లేటట్లు చేస్తుంది.
ఆనుకున్న పనిని వెంటనే ప్రారంభించాలి .
వాయిదా వేస్తె విలువైన సమయం వృధా అవుతుంది.
ఎంత దూరం వెళ్ళాలన్నా ఒక్క అడుగు తోనే ప్రయాణం మొదలవుతుంది కదా! ఏది సాధించాలి అన్నా ప్రయత్నం తోనే మొదలు పెట్టాలి .
సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ,అంగవైకల్యం ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు.కాని వారి అబివృద్ధి ని వారు పాడు చేసుకోవటం లేదు. సమస్యతో పాటే పడుతున్నారు.
సమస్యకు బానిస కాకూడదు.నిరాశ,నిస్పృహలు సమస్యలకు సమాధానం కాదు.
ఎదుటి వారు మిమ్మల్ని చులకన గా చూసేలాగా ప్రవర్తించ కూడదు .అది ఆత్మనూన్యతా భావనకు దారితీస్తుంది. విజయానికి ఆటంకం కలగజేస్తుంది.
చిన్న రంద్రం కూడా పెద్ద నీళ్ళ ట్యాంక్ ని ఖాళి చెయ్యగలుగుతుంది.చిన్న రంద్రం కూడా పెద్ద ఓడను నీట ముంచేయ్యగలదు.కనుక చిన్న చెడు ఆలోచన ను కూడా మనసులోకి రానివ్వకూడదు. అది ఆత్మ విశ్వాసాన్ని సన్నగిల్లేటట్లు చేస్తుంది. విజయానికి అది కళంకం అవుతుంది.
రోజు మనసుకు విశ్రాంతినిచ్చే సెల్ఫ్ హిప్నాటిజం తలచుకుంటూ మీ మనసును పూర్తి గా మంచి ఆలోచనలతో నింపితే మీ మనసు పూర్తి గా మిమ్మల్ని విజయం వైపు ప్రయాణం చేయిస్తుంది . విజయం సాధించి తీరుతారు.
నవ్వుల పంట .... అల్లు - రావుల జంట.
బి.వి.సత్యమూర్తి కార్టూన్లు
తెలుగు బొమ్మ - నగేంద్ర బాబు
గండికోట -- రచన-- చెరుకు రామ మోహన్ రావు
వలస పక్షులు
భైరవకోన (జానపద నవల 5 వ భాగం )
శివం (శివుడు చెప్పిన కధ)
రుద్రదండం (జానపద నవల )
సరదాగా కాసేపు
ఆధ్యాత్మిక పరిచయం-ఆత్మతత్వం..
న్యూ బాంబే టైలర్స్ – పుస్తక పరిచయం
శ్రీధరమాధురి – 6
గాంధీ అంటే... పేరు కాదు - మార్గం.
పదాల తేనెపట్టు - (రచన: నవదవన)
అంతర్యామి – 3
బైరాగి(గోదావరి కధలు )
కనకదుర్గమ్మ మాత్యం (కధ- 2 వ భాగం)
అసలు ఆరోజు ఏం జరిగింది..?
దాశరధి సినీ గీత - 2
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved. |
సాఫ్ట్వేర్ సంస్థ స్థాపిస్తా
- నందిగం పవన్కుమార్ (మొదటి ర్యాంక్)
ఇంట్లో తల్లితండ్రులు, కాలేజీలో అధ్యాపకులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇంజినీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించా. కేవీపీవై ఫెలోషిప్ పొందా. ఎంసెట్లో 158 మార్కులు పొందడం సంతోషంగా ఉంది. ఐఐటీ ప్రవేశ పరీక్షలోనూ మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నాను. ముంబయి ఐఐటీలో చదివి సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించడం నా లక్ష్యం.
కుటుంబ నేపథ్యం: హైదరాబాద్కి చెందిన పవన్ తండ్రి నారాయణరావు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. తల్లి దీప గృహిణి.
- గుజ్జుల చాణుక్యవర్థన్రెడ్డి (రెండో ర్యాంక్)
కాన్పూర్ ఐఐటీలో చదువుతున్న నా సోదరుడు హర్షవర్ధన్ స్ఫూర్తితోనే చదివా. రోజుకి 10 గంటలపాటు చదివేవాడిని. పరీక్షల ముందు ఒత్తిడి తగ్గించుకొనేందుకు ఆ సమయం తగ్గించుకొన్నా. ముంబయి ఐఐటీలో చదవాలనుకొంటున్నా. శాస్త్రవేత్త కావాలన్నది నా కల.
కుటుంబ నేపథ్యం: స్వస్థలం ప్రకాశం జిల్లా తూర్పు గంగవరం. తండ్రి విజయభాస్కర్ వ్యాపారం చేస్తున్నారు. తల్లి సుశీల గృహిణి.
- లకుమారపు నిఖిల్కుమార్ (మూడో ర్యాంక్)
భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించడం నా స్వప్నం. ఇరాన్లో జరిగిన ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్లో రజత పతకం సాధించాను. కేవీపీవై ఫెలోషిప్ అందుకున్నాను. కన్నవారు, కళాశాల అధ్యాపకులతోపాటు ఫిజిక్స్ అధ్యాపకుడైన బంధువు రాంబాబు ప్రోత్సాహమిచ్చారు. ఐఐటీ ముంబయిలో చదివాలనుకొంటున్నా. ఐటీ సంస్థను నెలకొల్పాలన్నది నా కల.
కుటుంబ నేపథ్యం: మహబూబ్నగర్ జిల్లా ఆర్కపల్లి స్వస్థలం. తండ్రి పాండు ప్రస్తుతం హైదరాబాద్ ఎల్బీనగర్లో ఆటోమొబైల్ విడిభాగాల దుకాణం నిర్వహిస్తున్నారు. తల్లి రమాదేవి గృహిణి.
- నారు దివాకర్రెడ్డి (నాలుగో ర్యాంక్)
ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్ చదవాలన్నది నా కోరిక. ఐఐటీ ప్రవేశ పరీక్షలోనూ మంచి ర్యాంకు దక్కుతుందని భావిస్తున్నా. బిట్స్ పిలానీలో 434 మార్కులు వచ్చాయి. సింగపూర్లో నిర్వహించే ఆసియన్ ఫిజిక్స్ ఒలింపియాడ్కి మన దేశం నుంచి ఎంపికైన అయిదుగురులో నేనొకడిని.
కుటుంబ నేపథ్యం: కర్నూలు జిల్లా వెంకటాపురం స్వస్థలం. తండ్రి ఆదినారాయణ విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగి. తల్లి సుభద్ర గృహిణి.
ఇంటర్ ఎంపీసీలో 918 మార్కులు, జేఈఈ ప్రధానపరీక్షలో 336 మార్కులు పొందాను. కళాశాల తరగతుల కన్నా ప్రధానంగా ప్రామాణిక పుస్తకాలపై పట్టు సాధించగలిగా. అకాడమీ పుస్తకాలతో పాటు నిష్ణాతుల పుస్తకాలను చదవడం ద్వారా మంచి ర్యాంకును సాధించగలిగాను. రోజుకు 10-12 గంటలు చదువుకే కేటాయించా. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసి ఐఏఎస్ చేయాలన్నది నా లక్ష్యం.
కుటుంబ నేపథ్యం: విజయనగరం స్వస్థలం. తల్లిదండ్రులు శ్రీదేవి, మహేష్.
-పి.ప్రేమ్ అభినవ్ (ఆరో ర్యాంక్)
కంప్యూటర్ ఇంజినీరింగ్ విద్యను ఢిల్లీ ఐఐటీలో పూర్తి చేయాలనుకొంటున్నాను. శాస్త్రవేత్త కావాలన్నది నా లక్ష్యం. బిట్స్ పిలానీలో 382 మార్కులు సాధించా.
కుటుంబ నేపథ్యం: విజయవాడ స్వస్థలం. తండ్రి శ్రీనివాస్ రైల్వేలో అధికారి. తల్లి సురేఖ గృహిణి.
- బీరం అక్షయ్కుమార్రెడ్డి (ఏడో ర్యాంక్)
ఎంసెట్లో మంచి ర్యాంకు వస్తుందని ఆశించా. ఐఐటీలో నాకు తప్పకుండా మంచి ర్యాంకు వస్తుంది. అమ్మానాన్నల ప్రోత్సాహం, అధ్యాపకుల సూచనలతో ఈ ర్యాంకు సాధించగలిగా. బిట్స్ పిలానీలో 380 మార్కులు సాధించా.
కుటుంబ నేపథ్యం: మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూలు స్వస్థలం. తండ్రి మురళీధర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి శైలజ గృహిణి.
- జి.సాయి కాశ్యప్ (ఎనిమిదో ర్యాంక్)
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో చదివి శాస్త్రవేత్త కావాలన్నది నా కల. కేవీపీవై ఫెలోషిప్ పొందా. బిట్స్ పిలానీలో 382 మార్కులు సాధించా.
కుటుంబ నేపథ్యం: నల్గొండ స్వస్థలం. తండ్రి వెంకటేశ్వర్లు ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడు. తల్లి మాధవి గృహిణి.
- పి.సాయి సూర్య ప్రహర్ష (9వ ర్యాంకు)
ముంబయి లేదా చెన్నైలోని ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదవాలన్నదే లక్ష్యం. నాకు 20లోపు ఏదో ఒక ర్యాంకు వస్తుందనుకున్నా. తొమ్మిదో ర్యాంకు వస్తుందని వూహించలేదు.
కుటుంబ నేపథ్యం: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి స్వస్థలం. ప్రహర్ష తండ్రి దివాకర్ కోరుకొండ రోడ్డులో చిన్న పాన్షాపును నడుపుతున్నారు.
ఇంజినీరింగ్ పూర్తి చేశాక సివిల్ సర్వీసులకు ఎంపికై పేదలకు సేవ చేయాలని ఉంది. ఐఐటీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నా. ముంబయి ఐఐటీలో చేరాలన్నది నా ఆశ.
కుటుంబ నేపథ్యం: స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా కొందుర్గు. తండ్రి సురేందర్రెడ్డి హైదరాబాద్లోని ఏజీ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిటర్. తల్లి నిర్మల ఉపాధ్యాయురాలు.. |
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఐఐటీల తర్వాత స్థానం ఎన్ఐటీలదే (నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ). జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తే జేఈఈ మెయిన్ ర్యాంక్ ద్వారా ఎన్ఐటీల్లో ప్రవేశాలు ఉంటాయి. మెయిన్ స్కోర్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 31 నిట్లతోపాటు, 23 ఐఐఐటీ, ఐఐఐటీఎం & ఐఐఐటీడీఎం, 23 కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న సంస్థల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తారు. వీటితోపాటు పలు ప్రైవేట్ యూనివర్సిటీలు/కాలేజీలు కూడా మెయిన్ ర్యాంక్తో అడ్మిషన్లు ఇస్తున్నాయి. అయితే ఎక్కువమంది ఐఐటీల తర్వాత ప్రాధాన్యం ఇచ్చేది నిట్లకే. రాష్ట్రంలో వరంగల్లో నిట్ ఉంది. మంచి ప్లేస్మెంట్స్తో పలు ప్రత్యేకతలతో ఉన్న వరంగల్ నిట్లో గతేడాది ఏ ర్యాంకుల వారికి సీట్లు వచ్చాయి, ఇక్కడి ప్రత్యేకతలపై వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొ. ఎన్వీ రమణారావు చెప్పిన విషయాలు నిపుణ పాఠకుల కోసం...
-సుమారు 250 ఎకరాల ప్రాంగణంతో వరంగల్ నిట్ ఉంది. దేశ తొలి ప్రధాని నెహ్రూ 1959, అక్టోబర్ 10న వరంగల్ నిట్కు శంకుస్థాపన చేశారు. మొదట్లో వీటిని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలుగా వ్యవహరించేవారు. ఆసియా, మధ్య ఆసియా, ఆఫ్రికా వంటి 40 దేశాల విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ 8 యూజీ పోగ్రామ్స్, 25 ఎంటెక్, 4 ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పీజీ స్థాయిలో 32 కోర్సులు కలిగి ఉన్న నిట్గా వరంగల్ రికార్డు సృష్టించింది. ఇంజినీరింగ్, సైన్సెస్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్ విభాగాల్లో డాక్టోరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కలిగి ఉన్న ఏకైక నిట్ వరంగల్ కావడం విశేషం.
సీట్లు - రాష్ట్ర కోటా.. ?
-దేశవ్యాప్తంగా ఉన్న 31 నిట్లలోని సీట్లలో 50 శాతం ఆయా రాష్ర్టాలకు, 50 శాతం జాతీయకోటా కింద విభజిస్తారు.
-వరంగల్ నిట్లో 8 బ్రాంచీలు ఉన్నాయి. మొత్తం 800 సీట్లు ఉన్నాయి. వీటిలో 50 శాతం అంటే 400 సీట్లు రాష్ట్ర కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు జాతీయకోటా కింద భర్తీ చేస్తారు. జోసా ద్వారా సీట్ల భర్తీ ప్రక్రియ జరుగుతుంది.
-ఈసారి నిట్లలో బాలికల శాతం పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం మేరకు వరంగల్ నిట్లో 17 సీట్లు సూపర్న్యూమరీ కోటా కింద బాలికలకు కేటాయిస్తారు.
ఏయే బ్రాంచీలు ఉన్నాయి?
-సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్, మెటలర్జీ, కెమికల్, బయోటెక్నాలజీ బ్రాంచీలు ఉన్నాయి.
వరంగల్ నిట్లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక నిట్ ఇది. అంతేకాకుండా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (క్యూఐపీ) సెంటర్గా గుర్తింపు పొందింది. ముఖ్యంగా రాష్ట్ర అభ్యర్థులకు మంచి అకడమిక్ ప్రోగ్రామ్స్ను, ప్లేస్మెంట్స్ను అందిస్తున్న సంస్థల్లో వరంగల్ నిట్ అగ్రస్థానంలో ఉంది. పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీ, లైబ్రెరీ, ల్యాబ్లు, హాస్టల్ సౌకర్యాలు ఉన్నాయి. ఎస్టాబ్లిష్ అయిన సంస్థ కావడంవల్ల ఇక్కడ చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది.
జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
మ్యాట్ ఎంట్రెన్స్ టెస్ట్
రైల్వే ఇంజినీరింగ్లో డిప్లొమా
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో
రాయ్పూర్ ఎయిమ్స్లో
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 435 ఖాళీలు
మరిన్ని వార్తలు...
వినూత్న పెండ్లి.. గద్దలా ఎగురుకుంటూ వచ్చి.. వీడియో
ఆమెను అరెస్ట్ చేద్దామా.. వద్దా.. టాస్ వేద్దాం.. వీడియో
మీ బంగారం మీరు తీసుకొండి.. పశ్చాతాప పడ్డ దొంగ!
ఓవైపు క్రికెట్ మ్యాచ్.. మరోవైపు లవ్ ప్రపోజల్.. వీడియో
నాటింగ్హమ్ వీధుల్లో కోహ్లీ, అనుష్క: వీడియో వైరల్
జీరోలో కత్రినా.. వైరల్గా మారిన ఫస్ట్ లుక్
త్రిష ‘మోహిని’ ట్రైలర్ విడుదల
ప్రత్యేక గీతానికి ఒకే చెప్పిన రకుల్..!
‘ఎన్టీఆర్’లో తన పాత్ర గురించి చెప్పిన విద్యాబాలన్
‘ఆర్ఎక్స్ 100’ కలెక్షన్లు ఎంతో తెలుసా..?
సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టిన విజయ్ దేవరకొండ
కిమ్ అయినా.. ట్రంప్ అయినా.. లోపలేసి కుమ్ముతా.. 'నీవెవరో' టీజర్!
అందుకే అంత తొందరగా పెళ్లి చేసుకున్నా!
180 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న రానా చిత్రం
ఆర్ ఎక్స్ 100 హీరోయిన్పై ప్రశంసల వర్షం
16 రోజుల్లో 300 కోట్లు కొల్లగొట్టిన సంజు
నాని హోస్టింగ్పై ఎన్టీఆర్ కామెంట్
లవర్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
అక్టోబర్లో సెట్స్పైకి వెళ్లనున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం |
దర్యాప్తులో ఉదాసీనత - NTnews.com
కేరళలోని ఒక నన్ తనపై బిషప్ (క్రైస్తవ మతాధికారి) లైంగికదాడికి పాల్పడ్డారంటూ చేసిన ఆరోపణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి విమర్శలకు తావిస్తున్నది. లైంగిక దాడికి పాల్పడిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్పై చర్య తీసుకోవాలంటూ 43 ఏండ్ల వయసుగల ఈ బాధితురాలికి మద్దతుగా మరికొందరు నన్లు కూడా హైకోర్టు బయట నిరసన ప్రదర్శన సాగిస్తున్నారు. 2014లో బిషప్ తనను అధికారిక విషయాలు చర్చించడానికంటూ పిలిపించి లైంగికదాడికి పాల్పడ్డారనీ, ఆ తర్వాత రెండేండ్లపాటు తనపై పదమూడు సార్లు లైంగిక దాడి జరిగిందని బాధితురాలు ఆరోపించారు. కానీ ఈ ఆరోపణలను బిషప్ తిరస్కరించారు. ఆమెకు ఒక వివాహితుడితో లైంగిక సంబంధం ఉందనీ, అతడి భార్య ఫిర్యాదు మేరకు ఈమెను విచారించానని ఆయన అంటున్నారు. తాను ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టినందుకే కక్షతో తనపై ఈ లైంగికదాడి ఆరోపణలు చేస్తున్నదని ఆయన అంటున్నారు. బిషప్, నన్ ఇరువురూ గౌరవప్రదమైన వ్యక్తులు. వారిపట్ల సమాజంలో ఆరాధనాభావం ఉంటుంది. ఈ వివాదంలో దోషులెవరనేది దర్యాప్తు పూర్తయి, న్యాయస్థానం తీర్పు ఇస్తే కానీ తెలువదు. కానీ తనపై లైంగికదాడి జరిగిందని ఒక స్త్రీ ఆరోపించినప్పుడల్లా ఆమె పట్ల సమాజం, చట్టబద్ధ సంస్థలు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంటున్నది. కేరళ నన్ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం, ఇతర పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.
లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ను ఆ పదవి నుంచి తప్పించి, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని బాధితురాలు, ఆమెకు మద్దతు ఇస్తున్న నన్లు కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు మత సంస్థ ఆయనపై చర్య తీసుకోలేదు. పైగా బిషప్కు వ్యతిరేకంగా బయ టిశక్తులు కుట్ర పన్నుతున్నాయనే ఆరోపణ మత సంస్థ వర్గాల నుంచి వెలువడింది. సీనియర్ మతాధికారులకు ఈ ఉదంతంలో తమదైన అభిప్రాయం ఉండవచ్చు. దానిని విమర్శించే వారూ ఉండవచ్చు. ఆయనపై చర్య తీసుకోవడమనేది మత సంస్థకు సంబంధించి న అంశం. కానీ నేరం జరిగింది మన దేశంలో. ఇక్కడ చట్టబద్ధపాలన సాగుతున్నది. ప్రభు త్వం, న్యాయవిచారణ వ్యవస్థ ఉన్నాయి. ఈ వ్యవస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాలె. కానీ నన్ తనపై లైంగికదాడి జరిగిందని పోలీసులకు జూన్ 27వ తేదీన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన రెండున్నర నెలలు గడిచినా ఇప్పటి వర కు పోలీసులు బిషప్ను అరెస్టు చేయలేదు. బిషప్ను ఒక్కసారి మాట వరుసకు విచారించి, బాధితురాలిని మాత్రం పదిసార్లు ప్రశ్నించడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమనే ఆరోపణలు వినబడుతున్నాయి. బాధితురాలిని అదేపనిగా ఇంటరాగేట్ చేయడం ద్వారా ఆమె వివరణల్లో తేడాలుంటే, దొరుకబట్టి కేసును బలహీనపరిచే ఉద్దేశం ఉందని అంటున్నారు. ఈ కేసు విషయంలో తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు ఆదేశించవలసి వచ్చింది. తదుపరి విచారణ ఈ నెల పదమూడవ తేదీన ఉన్న నేపథ్యంలో, ఒకరోజు ముందే పోలీసుల్లో కదలిక కనబడ్డది. బుధవారం నాడు ఆరు గంట ల పాటు ఉన్నతస్థాయిలో తర్జనభర్జనలు జరిపి బిషప్ను ఈ నెల పందొమ్మిదవ తేదీన దర్యాప్తు బృందం ముందు హాజరుకావాలని ఆదేశించారు.
సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం రాజకీయంగా దెబ్బతింటామనే భయంతో మతాధికారిపై చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేదనే విమర్శలున్నాయి. కానీ ఈ ఉదంతాన్ని కూడా లైంగికదాడి ఆరోపణగా చూడాలే తప్ప, మతకోణంలో కాదు. బాబాలు, స్వామీజీలు, బిషప్లు-ఆరోపణలు ఎవరిపై వచ్చినా చట్టప్రకారం చర్య తీసుకోవలసిందే. బిషప్ ప్రాబల్యం, ధనబలం వల్ల రాజకీయ వర్గాలు, పోలీసు యంత్రాంగం ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించ లేక పోతున్నాయని నన్లు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మహిళలు తమపై లైంగికదాడి జరిగిందని ధైర్యంగా ఆరోపణలు చేయడానికి జంకుతారు. లైంగికదాడికి గురైన వారిని బాధితురాలిగా చూసి సాంత్వన కలిగించడానికి బదులు, అవమానకరంగా చూస్తారనే భయం వల్ల చాలా లైంగిక నేరాలు వెలుగులోకి రావు. లైంగికదాడి గురైన మహిళ శీలంపై అనుమానం కలిగే ఆరోపణలు చేయడం ద్వారా అవతలిపక్షం తమ వాదనను నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కేరళ నన్ విషయంలోనూ ఇటువంటి ధోరణే కనిపిస్తున్నది. బిషప్కు మద్దతుగా ఉన్న ఒక ఎమ్మెల్యే నన్ వ్యభిచారి అంటూ, ఆమె మొదటిసారి లైంగికదాడి జరిగినప్పుడే ఎందుకు ఆరోపణలు చేయలేదని అభ్యంతరకర పదజాలంతో మాట్లాడారు. ఒక మతాధికారిపై సాధారణ నన్ ధైర్యం గా ఆరోపణలు చేయడం అంత సులభం కాదు. ఆరోపణలు చేయడంలో జాప్యం అయిందనేది సహేతుకమైన వాదన కాదు. మతాధికారులపై లైంగికదాడి ఆరోపణలు రావడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది. కేరళలో కూడా ఇటువంటి ఆరోపణలు కొత్త కాదు. 1992 నాటి సిస్టర్ అభ య హత్యోదంతం ఇప్పటికీ ఎటూ తేలలేదు. తాజా కేసులో నన్ ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడే, మహిళలు తమపై దాడులను ధైర్యంగా వెల్లడించగలుగుతారు.
మరిన్ని వార్తలు...
స్టార్ హోటల్లో టాయిలెట్లు, తాగే గ్లాసులు ఒకే టవల్తో క్లీనింగ్: వీడియో వైరల్
ప్రపంచంలో మందు ఎక్కువగా ఎవరు తాగుతారో తెలుసా?
ఆ కథంతా పెద్ద డ్రామా.. అనాథ పేరు చెప్పి భారీ దోపిడీ! |
దీపికా పదుకొనె డైలాగ్తో రాజస్థాన్ పోలీసుల వినూత్న ప్రచారం..
భూగర్భంలో 17 అంతస్థుల హోటల్.. చైనా మరో ఘనత!
లంక పార్లమెంట్లో రచ్చరచ్చ.. తన్నుకున్న ఎంపీలు.. వీడియో
వైరల్గా మారిన దీప్వీర్ వెడ్డింగ్ ఫోటోలు
డయాబెటిస్ వలన ప్రియాంక ప్రియుడులో ఎంత తేడా..!
షూటింగ్లో గాయపడ్డ సీనియర్ హీరో..!
'మహర్షి' కోసం భారీ సెట్
చెర్రీ హెయిర్ స్టైల్ కోసం బాలీవుడ్ స్టైలిస్ట్
టాక్సీవాలా రివ్యూ
వెంకీ సర్తో చల్లని సాయంత్రం వేళ.. |
ప్రణయ్ తమ్ముడిని నేను పెళ్లి చేసుకుంటా అని రాస్తున్నారు నీచంగా ఉంది _ Amrutha About Pranay's Brother
కొత్త పాళీ (New Nib): మెక్సికన్ మాయా ప్రపంచం |
ఇంటర్ తర్వాత మనకు ఇష్టమైన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కోరుకున్న కోర్సు చదువుకునే అవకాశం ఉంది. ఒకే పరీక్షతో పదకొండు కేంద్ర సంస్థల్లోకి ప్రవేశించవచ్చు. బీఎస్సీ, బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, బీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, బీఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఎడ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, లా, ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్ ఇలా వందకు పైగా కోర్సుల్లో అడ్మిషన్కు వీలు కల్పిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (సీయూ సెట్).
సాధారణంగా నచ్చిన కోర్సులో చేరడానికి పలు సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. చాలా పరీక్షలూ రాయాలి. దీనికి ఎక్కువ సమయంతోపాటు డబ్బు కూడా వెచ్చించాలి. కానీ ఇటీవలి కాలంలో ఏర్పడిన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఒకే పరీక్షతో అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. అదే సీయూ సెట్. దీని ద్వారా 11 సంస్థల్లో నచ్చిన కోర్సులో చేరిపోవచ్చు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మేనేజ్మెంట్, టీచింగ్, ఇంజినీరింగ్, లా, డిజైన్, ఎంఫిల్, పీహెచ్డీ...ఇలా ప్రతి విభాగంలోనూ ఈ విశ్వవిద్యాలయాలు కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ, పీజీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్ష గొప్ప అవకాశం. సెంట్రల్ యూనివర్సిటీల్లో బోధన, ల్యాబ్, లైబ్రరీలు, వసతులు మెరుగ్గా ఉంటాయి. ఫీజు కూడా భరించగలిగే స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరాలనుకున్నవాళ్లు సీయూ సెట్ ప్రయత్నించవచ్చు. ఈ ఏడాది పరీక్షలకు రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ సమన్వయకర్తగా వ్యవహరిస్తోంది.
ప్రవేశం కల్పించే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు: హరియాణ, జమ్మూ, జార్ఖండ్, కర్ణాటక, కశ్మీర్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, సౌత్ బిహార్, తమిళనాడులతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్- బెంగళూరు.
ప్రశ్నపత్రం ఇలా...
అభ్యర్థి ఏ కోర్సుకి, ఏ విభాగానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది. పార్ట్-ఎలో లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, మ్యాథమేటికల్ ఆప్టిట్యూడ్, అనలిటికల్ స్కిల్స్ విభాగాల నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. పార్ట్-బిలో సంబంధిత అంశం (సబ్జెక్టు) నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మూడు నుంచి అయిదు వరకు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్ నుంచీ 25 ప్రశ్నల చొప్పున వస్తాయి. అభ్యర్థులు తమకు నచ్చిన 3 సెక్షన్లు ఎంచుకుని 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. కొన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సులు/ ఎంబీఏ/ ఎల్ఎల్బీ లేదా మరేదైనా ఇతర కోర్సుల్లో ప్రవేశానికి వంద మార్కులకు ఒకే పేపర్ ఉండవచ్చు. ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్/ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, అనలిటికల్ స్కిల్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.
డిగ్రీ విద్యార్థులకు...
డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ కింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఎంఏ: ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్, హిందీ, హిస్టరీ, పెర్ఫామింగ్ ఆర్ట్స్, జాగ్రఫీ, సోషియాలజీ, సోషల్ వర్క్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, హ్యూమన్ రైట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ మేనేజ్మెంట్, డెవలప్మెంట్ స్టడీస్, కంపారిటివ్ రెలిజియన్, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, డిజిటల్ సొసైటీ, కస్టమరీ లా అండ్ ట్రైబల్ గవర్నెన్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, సైకాలజీ తదితరాలు.
ఎంఫార్మ్: ఫార్మాస్యూటికల్ సైన్సెస్
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ బీఎడ్: కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్.
ఇంకా ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్), ఎంఎల్ఐఎస్సీ, ఎంటెక్, ఎంపీఈడీ, బీఎడ్, ఎంఎడ్, ఎల్ఎల్ఎం, ఎంటీటీఎం, ఎంహెచ్ఎంసీటీ తదితర కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
పీజీ డిప్లొమా: కెమికల్ ల్యాబ్ టెక్నీషియన్, సైబర్ సెక్యూరిటీ, గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్
వీటితోపాటు ప్రతి సబ్జెక్టులోనూ ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
యూనివర్సిటీ, కోర్సులవారీ సీట్లు, సిలబస్ వివరాలు, మాదిరి ప్రశ్నపత్రాలు సీయూ సెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 26
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.800, ఎస్సీ, ఎస్టీలకు రూ.350. దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
పరీక్ష తేదీలు: ఏప్రిల్ 28, 29
ఫలితాలు: మే 25న ప్రకటిస్తారు.
ఇంటర్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సులు
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, జువాలజీ, లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకాలజీ, జాగ్రఫీ, జియాలజీ, ఎకనామిక్స్ |
Subsets and Splits