page_content
stringlengths 11
4.1k
|
---|
ఇంటిగ్రేటెడ్ ఎంఏ: ఇంగ్లిష్, ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బీ బీఎస్సీ: టెక్స్టె్టౖల్స్, బీఏ: ఇంటర్నేషనల్ రిలేషన్స్.
బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్: బయోమెడికల్ సైన్సెస్, ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, రిటైల్ అండ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. |
కొత్త పాళీ (New Nib): మిస్సమ్మ
పవన్ లెక్క తుపాను వచ్చే ముందు నిశబ్దం..! ఇదే జనసేనని వ్యూహం...! - Jana Sena News. In
పవన్ లెక్క తుపాను వచ్చే ముందు నిశబ్దం..! ఇదే జనసేనని వ్యూహం…!
హైదరాబాద్ : జనసేన పార్టీ పెట్టిన ఈ మూడేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురుకుంది. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా ఈ మూడేళ్లలో జనసేనకి ద్విపాలుగా నిలచిన 20 లక్షల మంది జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిస్కారం కోసం జనసేన పార్టీకి ముద్దతు ఇచ్చిన టీడీపీ , బీజేపీ పార్టీలపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
అయితే అక్టోబర్ నేల నుండి జనసేన పార్టీ ప్రజల్లోకి వస్తుండంతో టీడీపీ , వైసీపీ పార్టీల నేతలు జనసేన పార్టీ కార్యకర్తలను ఈ మధ్య సంప్రదించగా పక్క వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ గారు నిశ్శబ్ద ధోరణి పాటిస్తునట్లు..తుపాను వచ్చే ముందూ నిశ్శబ్దం ఇలానే ఉంటుంది అంటూ బలంగానే జనసేన కార్యకర్తలు బదులు ఇచ్చారు అని సమాచారం..దీనితో జనసేన పార్టీ వేసే అడుగుల కోసం అక్టోబర్ నుంచి ఒక్క కన్ను వేసి ఉంచాల్సిందేనని టీడీపీ , వైసీపీ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.
← నెల్లూరు జిల్లా జనసేన సేవాదళ్ ఆద్వర్యంలో ఉచిత వైద్య శిభిరం..
18 నుండి గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన ఔత్సాహిక వేదికలు →
మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *తో గుర్తించబడ్డాయి
గుంటూరు జిల్లా జనసేన అడ్డా
జనసేన పార్టీ ప్రెస్ మీట్ పూర్తి వీడియో..
సోషల్ మీడియా
సినిమా వార్తలు
సామాజిక న్యాయం
సినిమా కబుర్లు
కొత్త పుస్తకాలు
లైఫ్ స్టైల్
జిల్లా వార్తలు
విజయవాడ సిటీ
పశ్చిమ గోదావరి
నాన్-వెజిటేరియన్
పిండి వంటలు
మూడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం[04:52 PM]
నగరిలో విజయవంతంగా ఎల్ఎల్ఆర్ మేళా[04:39 PM]
ఆడబిడ్డకు జన్మనిచ్చిన న్యూజిలాండ్ ప్రధాని[04:27 PM]
రేపు విజయవాడ దుర్గ గుడిలో సామూహిక అక్షరాభ్యాసాలు![04:21 PM]
మహిళల భద్రత చాలా ముఖ్యం: తెలంగాణ సిపి[04:16 PM]
జగన్పై మంత్రి లోకేష్ విమర్శలు[04:11 PM]
29న ఏపీ బంద్కు వైసీపీ పిలుపు[04:07 PM]
Home » జిల్లాలు » విశాఖపట్నం
రూ.14 లక్షల ఖైనీ స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న ఖైనీ ప్యాకెట్లను బుధవారం ముందుగా వచ్చిన సమాచారం మేరకు కశింకోట మండలం అచ్...Read more
మంలంలోని వాడ్రాపల్లి గ్రామంలో పిడుగుపాటుకు యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి మృతుని కుటుంబీకులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాడ్రాపల్లి గ్...Read more
100 కిలోల గంజాయి స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 14 మందిని అరెస్ట్ చేశామని ఎస్ఐ సురేష్కుమార్ అన్...Read more
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న వైద్యసేవలను తెలుసుకొని, రాష్ట్రంలో అమలుపర్చేందుకు విశాఖనగరంలో ఎపి హెల్త్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య తెలిపారు. గురువారం రుషికొండలోని సాయిప్రియ రిసార్టులో జరిగే హెల్త్ ఫెస్టివల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నట్లు చెప్పారు. కలెక్టరేట్ ...Read more
స్థానిక ఎన్టిఆర్ మార్కెట్ యార్డు వెనుక ఉన్న 63 ఎకరాల భూసమీకరణ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు ఇళ్ల ప్లాట్లు కేటాయించాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరరావు ఉడా వీసీ బసంతకుమార్ని కోరా...Read more
రోజు రోజుకు ఎండ తీవ్రత అధికమవుతుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రత పెరగడంతో భయటకు వెళ్లేందుకు భయపడుతున్...Read more
తిమ్మరాజుపేట గ్రామంలో బుధవారం గ్రామస్తులు స్వచ్ఛందగా శ్రమదానం చేశారు. వాటర్ ట్యాంక్ నుండి పసలమారమ్మ తల్లి ఆలయం వరకు రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ...Read more
స్నేహ - కవర్ స్టోరీ
హెచ్చరిక బోర్డులు, కోస్టల్ గార్డులను ఏర్పాటు చేయాలి
చిరు వ్యాపారులకు అండగా ఉంటాం : సిపిఎం, వైసిపి
రుణాలకు 168 మంది ఎంపిక
ప్రధాన వార్తలు
ముఖ్యమంత్రి నివాసంలో యోగా దినోత్సవం
మరో రెండు రోజులపాటు పాఠశాలలకు సెలవులు
సోషల్ మీడియాలో టాప్ దర్శకుడుపై… >
విభజన హామీల అమలులో చిత్తశుద్ధి లేదు
జేపీ చొరవను ఆహ్వానిస్తున్నా: పవన్ కల్యాణ్ ట్వీట్
హోదా సాధించే వరకు పోరాటం
ఏపీకిచ్చిన విభజన హామీలపై 'స్వతంత్ర నిపుణుల బృందం' ఏర్పాటు, మార్చి 30న తొలి సమావేశం: జేపీ
రాష్ట్రంలో పాలన రాచరికాన్ని తలపిస్తోంది: లోక్ సత్తా
హైకోర్టు న్యాయమూర్తుల జాతీయ సమావేశంలో మార్చి 24న జేపీ ప్రసంగం
కేంద్ర ప్రభుత్వం మాట తప్పింది
రాజకీయ క్రీడలో ప్రజలు బలి
హోదా జీవన్మరణ సమస్య: జేపీ
సృజనాత్మక విద్యనందించాలి: జయప్రకాష్ నారాయణ
ఏపీకి రావాల్సింది రూ.74,542 కోట్లు
ఏపీకిచ్చిన విభజన హామీలపై 'స్వతంత్ర నిపుణుల బృందం' ...
హైకోర్టు న్యాయమూర్తుల జాతీయ సమావేశంలో మార్చి 24న జ...
అసెంబ్లీలో 'రైట్ టు సర్వీస్ యాక్ట్' బిల్లు ప్రవేశప... |
చిత్త వృత్తులను నిర్వాణానికి ముందే తెలుసుకోవచ్చు. కానీ వాటిని రద్దు చేసుకునేందుకు ‘నిర్వాణ’ స్థితి ఉండాలి. శ్వాస, మనసు స్వాధీనమయిన స్థితిలో చిత్త వృత్తులను తెలుసుకోవచ్చు.
చిత్త వృత్తులు = సంకల్పం, వికల్పం, విపర్యయం, స్మృతి, నిద్ర.
ఈ అయిదింటినీ బీజస్థితిలో వాటివాటిగా ఉన్నప్పుడే తెలుసుకోవాలి అంటే గుణాలు దాటిన స్థితిలో ఉంటేనే తెలుసుకోగలుగుతారు. గుణాలను దాటకుండా చిత్త వృత్తులను తెలుసుకోలేరు. గుణాలను దాటితేనే చిత్త వృత్తి నిరోధం. అయితే వాటిని తెలుసుకోడం, తెలుసుకునే ప్రయత్నం అనేది గుణాలను దాటక ముందే చేయవచ్చు. తెలుసుకోడం వేరు. నిరోధించడం వేరు.
పాత ఆలోచనలే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. కొత్తవేమీ రావు.
“ఎందుకంటే స్మృతి జ్ఞానమే జీవుడంటే”.
‘స్మృతి జ్ఞానం’ వల్లే కదా జీవితం అంతా కొత్త పనులు చేస్తున్నానాని అనుకుంటావు,
కానీ పాత స్మృతిలో ఉన్న సుఖ దుఃఖాలనే మళ్ళీ మళ్ళీ పొందుతున్నావు. ఇది తింటే బాగుంటుంది. ఇది చుస్తే బాగుంటుంది. ఇది వింటే బాగుంటుంది. ఇది చేస్తే బాగుంటుంది. ఇలా ఇంద్రియ జ్ఞానంతో ఉన్నదంతా కూడా ఆ స్మృతి జ్ఞానంతో కూడిన సుఖ దుఃఖాలే. కానీ, ఎప్పటికప్పుడు అవి కొత్తగా కనిపిస్తుంటాయి. అలా కొత్తగా కనపడడం వలన నువ్వు వాటిచేత ప్రేరేపింపబడి తాదాత్మ్యత చెంది వాటిచేత సుఖదుఃఖాలను అనుభవిస్తున్నావు. కాబట్టి ఇవి పాతవే కదా!
ఏ కొత్త సుఖం ఉంది? ఇందులో... అని
ఆకర్షణ నుంచి బైట పడాలి.
ఆ సంగత్వం నుంచి బైట పడాలి.
ఆ గుణం నుంచి బైట పడాలి.
అలా మూడు గుణాలను నుంచి బైట పడాలి.
అలా సాక్షిగా ఉన్న స్థితి వస్తే తప్ప, ఎవరికీ చిత్త వృత్తి నిరోధం సాధ్యం కాదు.
నీవే.... ‘చైతన్యం’గా మూడు అవస్థలలో ఉంటే... అప్పడు నిర్వాణం.
‘సాక్షి’ సాధన ఎప్పుడూ కూడా బలవంతంగా చెయ్యకూడదు.
ఆత్మ విచారణలో ఆనందం ఉండాలి గాని దుఃఖం ఉండకూడదు.
తేలికగా చెయ్యాలి.
విచారణ సరిగ్గా చేసి convince చేయడం వస్తే... అప్పుడు ‘తేలికగా సాధన’ చేయడం వస్తుంది.
పాము తలమీద కాలు పెట్టినంత సేపు కాటువేయకుండా ఉంటుంది. కాలు తీయగానే కాటేస్తుంది. మనసు కూడా అంతే.
బలవంతంగా మనసును ఆపడం సరైన పద్ధతి కాదు.
నిరోధించడం అంటే ఆపడం కాదు.
తొలగించడం కాదు.
ప్రపంచం లోకి దిగి ప్రపంచాన్ని చూస్తే అన్నీ కనపడుతాయి.
ఇది సాక్షిత్వ సాధన అంటే!
(చూశాక గుర్తించకుండా ఎలా కుదురుతుందండి?)
నువ్వు సహజంగా వాటికి దూరం జరగాలి.
నేను beyond కదా! నేను అతీతుడిని కదా!
అదే మనసు పని.
అసలు ఎవరు చూడమన్నారు నిన్ను?
‘దృక్ దృశ్య వివేకం’ అంటే అదే కదా!
దృశ్య రూపం ధరించడమే మనసు చేసే పని.
నువ్వు దృక్ స్వరూపుడివి కదా!
నీ సినిమా నీకు కనపడుతూ ఉంటుందండి.
ఏ సినిమా వస్తే, ఆ సినిమా నువ్వై పోతూ ఉంటావు.
నేనది కాదు కదా!
‘నేను అది కాదు’ అనే స్థిర నిర్ణయాన్ని నువ్వు కలిగి ఉండాలి.
అది ఏదోఒక రూపంలో precipitate (అవక్షేపము) అవుతుంది.
కాబట్టి అవును, కాదు... అనక, తటస్థంగా ఉండడం నేర్చుకోవాలి.
బాహ్య వ్యవహారంలో క్రియ ‘కర్మలోకి దిగేటప్పుడు’...
వ్యవహారం ‘సామాన్య పద్ధతి’లో చేయడం నేర్చుకోవాలి.
ప్రతి విషయంలో కూడా ‘విశేషం’ ఉంటుంది.
ఆ విశేష లక్షణంలో... అహం ఉంటుంది.
అక్కడ దానిని అర్థం చేసుకొని,
‘సామాన్య పద్ధతి’గా చెయ్యాలి.
అప్పుడు దాంట్లో ఉన్న అహం తొలగిపోతుంది.
ఈ నాలుగు ఉపాయాలని ఉపయోగించి సాక్షిగా ఉండాలి.
1. ఉదాసీనుడవై ఉండుట (ఉత్తమమైన ఉపాయం)
2. అవుననక, కాదనక ఉండుట.
‘విషయంలో/ఆలోచనలో సుఖ దుఃఖాలు ఉన్నాయి’ అని అనుకోడం భ్రాంతి.
నీకు ఆ విధమైన భోగ్య భావన ఉన్నది కాబట్టే...
ఆ ఆలోచన నిన్ను వెంబడిస్తోంది.
అందులో నేను అనుభవించడానికి ఏమీ లేదు గా - అని అనుకోగానే అది నిన్ను వదిలేస్తుంది.
4. ఏదైనా చేసే ముందు దాంట్లో ఉన్న విశేష లక్షణాన్ని గమనించి...
విషయం మరియు విశేషం వచ్చినప్పుడు....
నువ్వు తాబేలు లాగా ఇంద్రియాలను లోపలికి ముడుచుకోవాలి.
సృష్టి అంతా (అందరూ) ఈశ్వరుడే కదా!
ఎక్కడైనా నీ సాధనకు వ్యతిరేక వాతావరణం వస్తే,
అదే సామాన్యం చేయడం అంటే (వ్యవహారంలో).
నువ్వు బైటికొచ్చి అది బాలేదు ఇది బాలేదు అనటం ఎందుకు?
ఉండాలా వద్దా?
అలా అవి ఉంటేనే కదా!
వాటి వల్లే కదా పరిణామం.
కాబట్టి సృష్టి ధర్మంలో అవి వచ్చాయి.
మరి నేనేం చెయ్యాలి?
కరెంటు షాక్ కొడుతుందని తెలుసుకున్నావు.
కాబట్టి కరెంటు జోలికి వెళ్ళకు. ఇక్కడ కూడా అంతే!
ప్రపంచం అంతా నాకిష్టమొచ్చినట్లే ఉండాలంటే కుదరదు.
ఆ 10% ని పట్టించుకోకు.
అంటే ignore చెయ్యడం కాదు. అధిగమించాలి.
అంటే ఉదాసీనంగా చూడాలి.
ఆ 10% అజ్ఞానం కదా! అని విచారించాలి.
నేను కూడా ఒకప్పుడు అజ్ఞానంలో అలానే ఉన్నాను కదా!
పిల్లలాట కదా అది.
కాబట్టి లౌకికుల్ని నువ్వు అలా ఉండొద్దు అంటే వినరు.
వారు తెలుసుకునేట్లు మనం చెయ్యాలి.
వారి తెలివిలోకి దిగి వెళ్లి, వారితో పాటు నడుస్తున్నట్లు,
అభ్యాసం చేస్తున్నట్లుగా నటించాలి.
అలా ఎన్నో సార్లు చెప్తే తప్ప వారికి రాదు.
ఇలా platform తయారుచేయడమే కష్టం.
అది వికటిస్తుంది.
వారికి లేని పోని ఆలోచనలు వస్తాయి.
అపుడు పోరాటం ఏర్పడుతుంది.
మానవ సంబంధాలు చెడిపోతాయి. |
మరి, వారి స్థాయికి దిగివచ్చి చెప్తేనే వారు అది తీసుకుంటారు.
ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో తెలివి, సామర్ధ్యం ఉంటుంది.
అందరూ అన్ని విషయాలలో సమర్థులు కారు కదా!
ఎందులో ఎవరికి తెలివి ఉంటే,
ఇలా భార్యా భర్తల మధ్యలో leadership మారుతూ ఉంటుంది.
ఇది ఇద్దరూ అర్థం చేసుకొని శాంతంగా జీవించడం నేర్చుకోవాలి.
అవి స్మృతి జ్ఞానంలోకి వచ్చాయి.
నీకు వచ్చే అన్ని ఆలోచనలను... ఉదాసీనుడనై చూసినప్పుడు,
దాని పని అది routine process లో delete చేసేసుకుంటుంది.
(రద్దు చేసుకోడం నిర్వాణం తర్వాతేగా? క్రింద స్థాయిలలో కూడా రద్దు (డిలీట్) చేసుకోవచ్చా?)
నీకు నీ జీవితం అంతా గుర్తుందా?
‘నిర్వాణం’ తర్వాత మిగిలేవి...
కేవలం బలమైన చిత్త వృత్తులు మాత్రమే!
అవి అప్పుడు రద్దు చేసుకోవాలి.
అలాంటివన్నీ delete చేసుకోవచ్చు. దానికి ‘నిర్వాణం’ అవసరం లేదు.
మానవుడికి బుద్ధి శక్తి వల్ల...
చూసే ‘ఇంద్రియ జ్ఞానం’ బలంగా ఉంటుంది.
జంతువులకి అది బలహీనంగా ఉంటుంది.
అందుకే ఎప్పటికప్పుడు నిన్ను తొలగించుకొని ఈశ్వరుడిని పెట్టాలి.
సర్వ సృష్టికి ఈశ్వరుడే కదా కర్త.
నేను కర్త కాదు.
కర్త, భోక్త లేకుండా ఉంటావు.
అపుడు ఏ ద్వంద్వాలు ఉండవు.
ఆ స్థితి స్వానుభవంలో తెలియాలి.
ఇలా వరుస క్రమంలో ఎదగాలి.
నిష్కామ కర్మ
అప్పుడు క్రింద వాటివల్ల నువ్వు లాగపడవు.
అన్నీ తెలుసండీ, కానీ ఉండలేక పోతున్నామండీ! అంటారు.
నువ్వెంతవరకు పురోగమిస్తున్నావన్న దాన్ని బట్టి అది ఉంటుంది.
ప్రతి పనినీ తత్వ జ్ఞాన దృష్టితో చేయాలి, అప్పుడు కర్మ బంధాలు విడివడతాయి.
అవి ఎలా విడిపోతున్నాయో....
నువ్వు తెలుసుకుంటూ ఎదగాలి.
అది స్వప్రమాణం.
అట్లాగే స్వానుభూతి ప్రమాణం కూడా అత్యంత అవసరం.
కాబట్టి, శాస్త్ర వాక్యం నాకు ఎలా సరిపోతుంది? అని చూసుకుంటూ ఎదగాలి.
నీకు అన్వయం చేసుకోవాలి (ఆచరించాలి).
అలా చేస్తే సందేహం వస్తుంది.
సందేహాన్ని గురువు వద్ద తీర్చుకోవాలి.
అది “గురువాక్యం’.
ఎప్పుడూ ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యకూడదు.
ప్రపంచాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఎదగాలి.
నువ్వు ఎల్లప్పుడూ స్వరూపజ్ఞాన నిష్ఠలో ఉండాలి.
నువ్వు ఆత్మ నిష్ఠుడివై ఉండాలి.
చివరి గమ్యం చేరేదాకా ఈ సృష్టేగా ఉపయోగపడేది.
ఈ శరీరమేగా.
ప్రయాణం పూర్తి చెయ్యాలి.
అంతే గాని ప్రపంచం మీద వ్యతిరేక భావం వల్ల ప్రయోజనం లేదు.
జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఇలా మూడు ఎక్కడున్నాయండి?
ఉన్నది ఈశ్వరుడే కదా!
నామరూపాల్లోకి ఈశ్వరుడు దిగి వస్తే జీవుడు, జగత్తు కనపడుతోంది. మరి మానసన్నా , బుద్ధన్నా , విషయాలన్నా, గుణాలన్నా, ఇలా ఎన్ని చెప్పినా ఇవన్నీ నామరూపాలేగా.
ఒక సారి నామరూపాలు దాటితే.... ఇవన్నీ ఉన్నాయా?
అంగ శుశ్రూష అంటే…
అని సాధన చెయ్యాలి కదా!
ఏం చెయ్యాలి ?
Decision తీసుకునే ముందు “అవసరమా?” అని ప్రశ్న వెయ్యాలి.
భోజనం చెయ్యడం అవసరమా?
ఇల్లు అవసరమా?
అవసరం కాకపోతే చెయ్యడం అనవసరం.
అవసరం కోసమే చేసినప్పుడు...
అది నీకు ‘అహం’ ఏర్పరచడం లేదుగా!!
విశేషం, extra చేసినప్పుడు అహం బలపడుతుంది.
అవసరానికి మించి ఏదైనా చేస్తే దాన్ని నువ్వే మొయ్యాల్సి వస్తుంది.
ఉదాహరణకి నీకు, 8వ నంబర్ చెప్పులు సరిపోతాయి.
పెద్దగా ఉంటాయి కదా అని, 18వ నెంబర్ చెప్పులను కొన్నావనుకో,
అప్పుడు అవి నువ్వే మొయ్యాలి.
అవసరం అంటే దానికి లక్ష్యం ఉంటుందిగా!
లక్ష్యం ఎప్పుడూ వివేకం వైపు పెట్టాలి, అహం వైపు పెట్టకూడదు.
నాకు ప్రపంచం అంతా అవసరమే,
ఈ జిజ్ఞాసువే...
‘అన్నీ తెలుసండీ కానీ విషయం వచ్చినప్పుడు ఉండలేకపోతున్నాను అండి’అంటాడు.
కాబట్టి ఆహరం మనసుని ప్రభావితం చేస్తుంది.
“ప్రారబ్ధం ఎదురు వచ్చి బాయక నిలుచున్” (బాయక = పోకుండా) .
ఇపుడు నీకు ప్రారబ్ధం వచ్చి మీద పడిపోయేదాకా తెలియదు.
నిర్వాణం తర్వాత దేని వల్ల ఈ శరీరం వచ్చిందో నీకు తెలియబడుతుంది.
అవే తిరుగుతూ ఉంటాయి, కొత్త వేమి రావు.
వాటిని రద్దు చేసుకునే పనిలో వుంటాడిక.
జ్ఞానాగ్నిలో అయితేనే కర్మలు రద్దు అవుతాయి.
అక్కడల్లా ‘నేను బ్రహ్మ స్వరూపాన్ని’ అని అనుసంధానం చేస్తాడు.
(ఇది ఆత్మానుభవం తర్వాత విషయం).
ఆ జ్ఞానాగ్నిలో అన్నీ దగ్ధమైపోతాయి.
సామాన్య నియమాలనే పోషించలేనివారు విశేష నియమాలు ఎలా పోషిస్తారు? కాబట్టి సమయ పాలన అత్యంత అవసరం.
యమ నియమాలు నిత్య జీవితంలో ఎప్పుడూ ఉండాలి.
“నేను సాక్షి స్వరూపమును” అనే జ్ఞానమును.... మరల మరల మనస్సు నందు గ్రహించుకొనిన వాడు, జ్ఞాననిష్ఠ పొందినవాడు, వాడే విద్వాంసుడు. అతడే ముక్తుడు అని వేదాంతము ఘోషించుచున్నది. |
నాయుడు గారి అబ్బాయిల కొత్త రూట్ - TeluguNow.com _ TeluguNow.com
Watch BigBoss 2 Telugu Live _ Read Latest Swathi Weekly _ 2018 Telugu Calendar _ శ్రీ విళంబి నామ సంవత్సర రాశి ఫలితాలు
తెలుగు న్యూస్
You are at:Home»Telugu News»నాయుడు గారి అబ్బాయిల కొత్త రూట్
నాయుడు గారి అబ్బాయిల కొత్త రూట్
నిర్మాతగా రామానాయుడు గొప్పదనం ఏంటో చెప్పాల్సిన పని లేదు. అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి.. శతాధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కేశారు. ఆయన ఖాతాలో అటు పెద్ద సినిమాలతో పాటు.. ఇటు చిన్న సినిమాలు కూడా ఉంటాయి.
ఇప్పుడు ఆయన వారసత్వాన్ని కొడుకు సురేష్ బాబు కంటిన్యూ చేస్తుండగా.. మనవళ్లు ఇద్దరు కూడా నిర్మాణంలో చురుగ్గా పాల్గొనాలని ఫిక్స్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ నగరానికి ఏమైంది.. కేరాఫ్ కంచరపాలెం అంటూ రెండు సినిమాలు రూపొందనున్నాయి. వీటికి నిర్మాతగా ఉండేందుకు.. ఈ కుర్రాళ్లు ఫిక్స్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. వీరి లెక్కల ప్రకారం.. ఈ రెండు చిత్రాలను ఒక్కోదానిని 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో పూర్తి చేస్తారట. సురేష్ ప్రొడక్షన్స్ కు ఉన్న వాల్యూను బేస్ చేసుకుని.. గట్టిగా రిలీజ్ చేసేందుకు సహకరించడం ద్వారా.. 4 నుంచి 5 కోట్ల మధ్య విక్రయించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
సురేష్ సంస్థ నుంచి వచ్చిన తర్వాత సబ్జెక్టు బాగుంటే ఈ మాత్రం వసూళ్లను.. సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ చిత్రాలకు దగ్గుబాటి రానా నిర్మాతగా ఉంటాడని.. అభిమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాడని చెబుతున్నారు. మరి ఈ కుర్ర హీరోలు ట్రెండ్ ను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అవుతారో లేదో చూడాలి.
యంగ్ హీరో నోట్ అయ్యాడు
పబ్ లో చై-సామ్ హగ్-కిస్
మేం సినిమాలు చేస్తే ఎవరు చూస్తారండి?
ఈ మాయ పేరేమిటో రివ్యూ
September 25, 2018 0 యంగ్ హీరో నోట్ అయ్యాడు
September 25, 2018 0 పబ్ లో చై-సామ్ హగ్-కిస్
September 25, 2018 0 మేం సినిమాలు చేస్తే ఎవరు చూస్తారండి?
September 25, 2018 0 ఆ డైరెక్టర్ తో వెంకీ సినిమా
September 25, 2018 0 RX 100 హిందీ రైట్స్ కు భలే ఆఫర్
September 25, 2018 0 సిల్క్ తర్వాత సైనా కూడా?
September 25, 2018 0 బాలయ్యతో బోయపాటి @ మిషన్ 70
September 25, 2018 0 100 ఎన్నారై ఫ్యామిలీస్ తో మహేష్
September 25, 2018 0 తారకరాముడి సింప్లిసిటీ! |
లాప్ టాప్ ముందు కూర్చుని ఫేస్ బుక్ లో పోస్టింగ్స్ ని , చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తూ/వింటూ ఉన్న రాఘవ కి తల్లి జానకమ్మ వంట ఇంట్లోంచి పిలుస్తున్నా వినపడలేదు.
కాసేపు తరవాత ఆవిడ అక్కడ నుంచి వచ్చి గట్టిగా పిలిస్తే, ఇయర్ ఫోన్స్ తీసి " ఏమిటి?" అన్నాడు తల్లి కేసి చూసి
"ఇంటర్వ్యూ ఇంకా పది రోజులే ఉంది కదా? ఈ లోపులో తిరుపతి వెళ్లి స్వామి దర్శనం చేసుకు రమ్మన్నాను కదురా? బస్సో, ట్రైనో బుక్ చూసుకున్నావా?" అంది జానకమ్మ గారు అతనికి దగ్గరగా వచ్చి
" ఏమిటమ్మా నీ పిచ్చి. తిరుపతి వెళ్లి, స్వామిని మొక్కేస్తే ఉద్యోగం వచ్చేస్తుందా? నీ పిచ్చి గాని" అన్నాడు కొంచం విసుపుగా
కొద్ది సంవత్సరాల క్రితం తన తండ్రికి అనుకోకుండా లివర్ వ్యాధి ఏదో వచ్చి కొద్దీ రోజుల లోనే సీరియస్ అయింది. ఆ సమయం లో అమ్మ ఎన్ని మొక్కులు మొక్కిందో, ఎంత మంది దేవుళ్ళని ప్రార్థించిందో అతనికి బాగా గుర్తు. ఏ దేవుళ్ళూ తన తండ్రిని బ్రతికించ లేకపోయారు. అతనికి ఆశ్చర్యం ఏమిటంటే, తండ్రి అనారోగ్యం సమయం లో అమ్మ మొక్కుకున్న వెంకటేశ్వర స్వామీ కళ్యాణం లాంటివి, మిగతావి ఆ తరువాత అన్నీ ఆవిడ నెరవేర్చడం.
అదంతా గుర్తుకు వచ్చి, ఆ విషయం ప్రత్యక్షంగా అనకుండా " " ఏమో అడిగిన వెంఠనే అన్నీ అందరికీ దేవుడు ఇచ్చేస్తాడన్న నమ్మకం కలగటం లేదు. సరే వెడతాలే" అన్నాడు
గతం కంటే ఇప్పుడు ఆమెకి తన క్షేమమే ముఖ్యమని తెలుస్తోంది. అందుకే "అలాగే" అని "ఐ ఆర్ సి టి సి" వెబ్ సైట్ కి వెళ్లి టికెట్ బుక్ చేసుకున్నాడు.
రాఘవ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అనేక వందల ఇంజనీరింగ్ కాలేజీలలో ఒకటయిన ఒకానొక కాలేజీలో బిటెక్ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. అంత పేరు ప్రఖ్యాతులున్న కాలేజీ కాదు కాబట్టి క్యాంపస్ సెలక్షన్ కి వాళ్ళ కాలేజీకి ఏ కంపెనీ వాళ్ళు రాలేదు . డిగ్రీ చేతికి వచ్చినప్పటి నుంచీ చాలా కంపెనీలకి అప్లికేషన్లు పెడుతూనే ఉన్నాడు. కొందరు అసలు పట్టించుకోకపోతే, కొందరు మాత్రం రిగ్రెట్ లెటర్స్ పంపి ఊరుకున్నారు తప్ప, ఎవరూ పిలవలేదు. ఆఖరికి అనుకోకుండా ఒక కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ కి రమ్మన్నారు.
రిజర్వు చేసుకున్న రోజున బయలుదేరి తిరుపతి చేరుకున్నాడు రాఘవ. సాధారణ క్యూ పద్దెనిమిది గంటలు పడుతుందని తెలిసి మూడు వందలు కట్టి ప్రత్యేక దర్శనం క్యూ లో నుంచున్నాడు. క్యూ లో ఉన్నంత సేపూ అతని ఆలోచనలు పరి పరి విధాల పోయాయి. స్వామిని దర్శించి నమస్కరించి వచ్చేయడమా? మనసులో కోరిక తీర్చమని ప్రార్థించాలా వద్దా?. ఇంటర్వ్యూ కి వచ్చే మిగతా అభ్యర్థులు కూడా ఆయన్ని ప్రార్థించి ఉండవచ్చు కదా? ఆయన్ని ప్రార్థిస్తేనే కోరిక తీరుస్తాడా? లేక పోతే తీర్చడా? వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్లో ఉన్న స్వామీ, ఇక్కడ ఉన్న స్వామీ వేరా ? ఇక్కడికే వెళ్ళమని అమ్మ ఎందుకు వత్తిడి చేసింది?. అసలు ఈయన ఎక్కడ ఉంటాడు. వైకుంఠం లో ఉంటే అది ఎక్కడ, ఎలా ఉంటుంది ? ఒక వేళ అక్కడికి వెళ్లగలిగితే ఎవడయినా ఎన్నిగంటలు ఆయన ఎదురుగా కూర్చోగలుగుతాడు? తన ఆలోచనలకి అతనికే నవ్వు వచ్చింది. "ఇలాంటి ఆలోచనలు నాకే వస్తాయా మిగతా వాళ్లకి కూడా వస్తాయా ?" అనుకున్నాడు
క్యూ లో ఉండి ఉండి " "ఏడుకొండలవాడా గోవిందా గోవిందా" అని ఎవడో గట్టిగా అనగానే మిగతా వాళ్లంతా అంత వరకూ మామూలుగా ఉన్న నవాళ్లు కూడా గొంతు కలిపి " గోవిందా గోవిందా" అనడం ఆశ్చర్యమేసింది .
క్యూ లో ముఖ ద్వారం ప్రవేశించగానే స్వామి విగ్రహం కనపడటం ప్రారంభించినప్పటి నుంచీ, అందరూ ఒక రకమయిన భావోద్రేకం పొందడం అతను గమనించాడు. తాను కూడా వేరే ఆలోచనలు లేకండా స్వామీకి నమస్కరిస్తూ ముందుకు నడిచాడు. స్వామీ ముందుకు రాగానే కొద్దీ క్షణాలు విగ్రహం చూస్తూ ఉండిపోయాడు. తల్లి గుర్తుకు వచ్చింది. ఆమె ఆనందంగా ఉండాలని మనసులో కోరుకుని వచ్చేశాడు. బయటికి వచ్చిన తరువాత తాను స్వామిని ఉద్యోగం గురించి కొరకపోవడం అతనికి ఆశ్చర్య మేసింది. తల్లికి అబద్ధం చెప్పడం ఇష్టం లేక అక్కడి నుంచే స్వామి వైపు తిరిగి ప్రార్థించాడు.
ఇంటర్వ్యూ రోజున తల్లి ఇచ్చిన దేవుడి అక్షింతలు వేసుకుని ప్రసాదం తిని హైటెక్ సిటీ లో కంపెనీ చేరేటప్పటికి, అప్పటికే కాండిడేట్స్ కొంత మంది చేరుకున్నారు. పది మంది ఉంటారు. కారుణ్య ఒక్కడే తనకి తెలిసిన క్లాస్ మేట్ కనిపించాడు. తనకి పిలుపు వచ్చే దాకా అతనితో కబుర్ల లో పడ్డాడు.
ఇంటర్వ్యూ లో చాలా ప్రశ్నలు వేశారు, కుటుంబ పరిస్థితి, ఎక్కడ చదివాడు, మొదలయినవన్నీ. తరువాత కమిటీ లో ఉన్న ముగ్గురిలో ఇద్దరు సబ్జెక్ట్ మీద ప్రశ్నలు వేశారు. పది ప్రశ్నలు అడిగితే రెండింటికే అతను చెప్పగలిగాడు. ఆఖరున మూడో అతను 'ర్యాన్సమ్ వేర్' పేరు విన్నావా? అన్నాడు . రాఘవ ఆ పేరు ఎప్పుడూ వినలేదు. ఉద్యోగం ఇస్తే, అతనికి ట్రైనింగ్ చాలా ఇవ్వవలిసి ఉంటుందనీ, మూడు సంవత్సరాలు వాళ్ళ దగ్గరే పని చేస్తానని బాన్డ్ ఇవ్వాలని అంటే " సరే అన్నాడు" రాఘవ.
ఏ సంగతీ వారం లోపులో మెయిల్ పంపుతామన్నారు. బయటికి వచ్చి, కారుణ్య ఇంటర్వ్యూ కూడా అయ్యేదాకా కూర్చున్నాడు. ఇంచుమించు అతని ఇంటర్వ్యూ కూడా తన దాని లాగానే జరిగిందని తెలుసుకుని వచ్చేశాడు. |
మళ్ళీ రొటీన్ లో పడ్డాడు రాఘవ. కాసేపు ఫేస్ బుక్, కాసేపు టీవీ, కాసేపు యూట్యూబ్ వీటితో పగలంతా కాలక్షేపం. వాళ్ళ నాన్నగారు కట్టించిన ఇంట్లోనే గత పది సంవత్సరాలూ ఉంటున్నారు కాబట్టి చుట్టు పక్కల చాలా స్నేహితులు ఉన్నారు . సాయంత్రం పార్క్ లో వాళ్ళతో కాలక్షేపం. పగలయినా, రాత్రయినా తోచనప్పుడు బాల్కనీ లో కూర్చుని రోడ్డు మీద జనాన్ని గమనించడం అతనికి ఒక హాబీ. వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న స్థలంలో ఎవరో బిల్డర్ పెద్ద అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ కట్టాడు. ఈ మధ్యనే పూర్తి అయి ఒకళ్ళో ఇద్దరో చేరారు. ఆ కాంప్లెక్స్ లో కొత్తగా ఒకాయన ప్రొద్దుటే బెంజ్ కారులో వెళ్లడం, సాయంత్రం రావడం చూశాడు అతను. ఎవరో పెద్ద ఆఫీసర్ కొత్తగా వచ్చి చేరాడు అనుకున్నాడు రాఘవ.
వారం పూర్తి అవకుండానే అతన్ని ఇంటర్వ్యూ చేసిన కంపెనీ చాలా మర్యాద పూర్వకంగా రిగ్రెట్ లెటర్ పంపించారు. అతను బాగానే చేశాడనీ, కానీ అతనికి సరిగ్గా సరిపోయే స్లాట్ తమ దగ్గర ప్రస్తుతం లేదనీ, అటువంటి అవకాశం వచ్చినప్పుడు తెలియ చేస్తామనీ చెప్పారు. అతనికి చాలా నిరాశ కలిగింది. వందల కొద్దీ అప్లికేషన్లు పంపితే, ఎవడో ఒకడు పిలిచి, వాడు కూడా ఇలా నీరు కారిస్తే, అంతా నిరాశ గా ఉంది అతనికి. కారుణ్యకి కూడా అలాంటి మెయిలే వచ్చిందని చెప్పాడు.
వెంఠనే కాక పోయినా తల్లి తరుచు అడుగుతుంటే చెప్పక తప్ప లేదు. ఏడుకొండల వాడికి మన ప్రార్థన సరిపోలేదమ్మా నాకు ఇవ్వలేమని మెయిల్ పంపారు అని చెప్పాడు . తన కంటే తల్లి ఎక్కువ నిరుత్సాహ పడుతుందని భయ పడ్డాడు. నిరాశ పడిందో లేదో అతనికి తెలియ లేదు కానీ, పైకి మాత్రం ఆవిడ " అలా మాట్లాడకురా, భగవంతుడు ఏది ఎలా చేస్తాడో ఊహించడం మనకి చాలా కష్టం.
మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించు" అంది ఆవిడ కొడుక్కి ధైర్యం చెబుతూ. రాఘవ మళ్ళీ అదే పనిలో పడ్డాడు.మామూలుగా బాల్కనీ లో కూర్చుని ఆ రోజు కూడా బయటికి చూస్తున్నాడు రాఘవ. ఎదురుగా కట్టిన కొత్త కాంప్లెక్ లోంచి ఒకావిడ బయటికి వచ్చి రాఘవ వాళ్ళ ఇంటి కాంపౌండ్ లోకి రావడం చూశాడు. కింద తలుపు తీసి ఉందో లేదా అని కిందకి దిగి మెయిన్ గుమ్మం దగ్గరికి అతను రాగానే, కాలింగ్ బెల్ మోగడం, అతను తలుపు తీయడం ఒకే మాటు జరిగాయి. వచ్చినావిడ " మేము ఎదురుగా కొత్తగా వచ్చాము. ఆంటీ లేరా బాబూ " అంది. ఆవిడ నవ్వుతూ " ఉంది కూర్చోండి పిలుస్తాను" అని అతను తల్లి బెడ్ రూమ్ వైపు వెడుతోంటే " ఎవరు రా ?" అంటూ ఆవిడే వచ్చింది బయటికి వాళ్లిద్దరూ మాట్లాడుకోవడానికి కూర్చోగానే అతను తన కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లి పోయాడు.
ఆవిడ చాలా సేపు కూర్చుని వెళ్లిన తరువాత, వేళ అయితే, జానకమ్మ గారు కొడుకుని భోజనానికి పిలిచింది. " కొత్తగా వచ్చినట్టున్నారు కాంప్లెక్స్ లోకి. మనింటికి ఎందుకు వచ్చింది ఆవిడ అని అడిగాడు రాఘవ తల్లిని .
కొడుక్కు వడ్డిస్తూ చెప్పింది. " ఆవిడ పేరు రజని. అవును వాళ్ళు కొత్తగా వచ్చారు. పాల గురించీ,పనిమనిషి గురించీ అడగడానికి వచ్చింది .ఆవిడ భర్త వరుణ్ కుమార్ ఏదో పెద్ద కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తున్నాడట. మొన్నటి దాకా అమెరికా లో ఉండి వచ్చారట. నీ సంగతి చెబితే. రేపు శనివారం ఆయన ఖాళీ గా ఉంటాడట, నిన్ను వచ్చి కలవమంది. పోయిందేముంది ? తప్పకుండా వెళ్లికలువు" అంది ఆవిడ.
రాఘవ కంటే ఆవిడే ఎక్కువ ఆత్రుతగ ఉందేమో, శనివారం ప్రొద్దుటే రాఘవని లేపి కాఫీ టిఫిన్లు అయిన తరువాత, వాళ్ళ ఫ్లాట్ నెంబర్ చెప్పి వరుణ్ కుమార్ దగ్గరికి పంపింది జానకమ్మ గారు.
బెల్లు కొట్టగానే రజని వచ్చి తలుపు తీసింది. వరుణ్ కుమార్ గారు కంప్యూటర్ ముందు కూర్చుని, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ, రాఘవకి చెయ్యి ఊపి కూర్చోమని సైగ చేశారు.
రాఘవ సోఫాలో కూర్చుని ఇల్లంతా ఓమాటు చూశాడు. చాలా పెద్ద ఫ్లాట్ లా ఉంది. అద్దె చాలా ఎక్కువ ఉండవచ్చు అనుకున్నాడు. ఇల్లంతా అన్నీ ఖరీదయిన సామానుతో నిండి ఉంది
" హాయ్ రాఘవ, ఆంటీ చెప్పింది నీ గురించి. మీ అమ్మగారు చెప్పారనీ, బి టెక్ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావట కదా? ఎలా ఉన్నాయి ప్రయత్నాలు ? అన్నాడు నవ్వుతూ
'ఆయన మాట్లాడడం లో ఒక రకమయిన ఆప్యాయత కనిపించింది రాఘవకి. తాను చేస్తున్న ప్రయత్నాలు, ఈ మధ్యనే జరిగిన ఇంటర్వ్యూ గురించీ అన్నీ చెప్పాడు
" ఇంటర్వ్యూ లో ఏమేమి అడిగారని అడిగితే అన్నీ చెప్పి, 'ర్యాన్సమ్ వేర్ గురించి కూడా అడిగినట్టు, తనకి తెలియదని చెప్పాననీ అన్నీ చెప్పాడు
రాఘవ చదివిన కాలేజ్ గురించీ, చదివిన సబ్జెక్ట్ ల గురించీ, ఫ్యాకల్టీ గురించీ చాలా విషయాలు అడిగాడు వరుణ్ కుమార్. ఎప్పుడు పాసయిందీ, పాసయిన తరువాత ఏమన్నా కోర్సులు చేశావా అని కూడా అడిగాడు |
అన్నిటికీ, రాఘవ చెప్పిన జవాబులు ఓపికగా విని " ఇప్పుడు నాకు నీ ప్రాబ్లెమ్ అర్థమయ్యిందయ్యా. నువ్వు ఒక ప్రయివేట్ కాలేజ్ లో చదివావు. అది ప్రముఖ మయిన కాలేజ్ కాదు. ప్రతి కంపెనీ నువ్వు ఎక్కడ చదివావన్న దానికి ప్రాముఖ్యం ఇస్తారు. ఎందుకో తెలుసా? చిన్న కాలేజీలు ఎటువంటి ఫ్యాకల్టీ ని పెట్టుకుంటారు? వాళ్ళు తమ కాలేజీలని ఇండస్ట్రీ కి లింక్ చేయరు. పెద్ద జీతాలు ఇచ్చుకోలేరు కాబట్టి మంచి ఫ్యాకల్టీ పెట్టలేరు. వాళ్ళు చెప్పేవి చదివి మీరు ఉద్యోగాలకి వచ్చేటప్పటికి, మీ చదువు ఇప్పుడు ఇండస్ట్రీ కి కావలసిన వాటికి సరిపోదు. మిగతా ఇండస్ట్రీల లాగ కాకుండా, కంప్యూటర్లలో రోజు రోజు కీ మార్పులు వచ్చేస్తున్నాయి. వాటికి సరితూగుతూ మన స్కిల్స్ ని అప్ డేట్ చేసుకోక పోతే ఉద్యోగాలు రావు. ఎప్పుడో చదువుకున్నచాలీ చాలని చదువుతో ఎక్కడా ఉద్యోగం రాలేదని విచారిస్తే సుఖ మేమిటి?. నేను నిన్ను బ్లేమ్ చేస్తున్నానని అనుకోకు. ముందు నీకు సమస్య ఏమిటో వివరిస్తున్నాను" అన్నాడు
" మీరు చెప్పింది నిజమే నండి, మా ఫ్యాకల్టీ చెప్పింది సరిపోక, పరీక్షల సమయం లో మంచి కాలేజీ లలో చదివే స్నేహితుల హెల్ప్ తీసుకోవలిసి వచ్చేది" అన్నాడు అయన చెప్పినది అంగీకరిస్తూ.
" ఇప్పుడు ఉద్యోగం అత్యంత అవసరమా ? నాఉద్దేశ్యం, మీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. అది అడుగుతున్నాను " అడిగాడు వరుణ్
"అంత అర్జెంటు లేదండి. అమ్మకి పెన్షన్, అది కాకుండా కొద్దిగా భూముల మీద ఆదాయం వస్తుందండి. వెంఠనే కాకపోయినా ఉద్యోగం చేయాలండి. నాకు పెద్దగా రికమెండేషన్ చేసే వారు కూడా ఎవరూ లేరండి " కొంచం నిస్పృహతో అన్నాడు రాఘవ
" భలేవాడి వయ్యా ! ఇదేమన్నా గుమస్తా ఉద్యోగాలనుకున్నావా? రికమెండేషన్ల మీద రావడానికి. సాఫ్ట్ వెర్ కంపెనీలు తమ ప్రాజెక్ట్ ఏదయినా సరయిన టైం లో పూర్తి చేయడానికి కావలసిన స్కిల్స్ ఉన్నవాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ప్రస్తుతం ఎటువంటి స్కిల్స్ కి డిమాండ్ ఉందో తెలుసుకుని వాటిని సంపాదిస్తే పిలిచి వాళ్లే ఇస్తారు. టెక్నాలజీ ఫాస్ట్ గా మారుతున్న ఈ రోజుల్లో ఉద్యోగం ఉన్నా కూడా మారుతున్నవి నేర్చుకోక పోతే ఎవరికీ గ్యారంటీ లేదు. అయితే అన్నిటి లోనూ అందరూ స్కిల్ సంపాదించలేరు. నువ్వు ఒక దాంట్లో బాగా చేస్తే, అందులో నేను బాగా చేయలేకపోవచ్చు. అవి ఇష్టా ఇష్టాల బట్టి ఉంటాయి. అందుకని ముందు నువ్వు ఎందులో కంఫర్టబుల్ గా ఉన్నావో తెలుసుకుని, బాగా కష్ట పడితే మంచి జాబ్ సంపాదించవచ్చు"
" మీరు కూడా ఇప్పుడు కొత్తవి నేర్చుకోవాలా అండి " అడిగాడు రాఘవ అమాయకంగా
రాఘవని కూడా తీసుకోమని సైగ చేసి మళ్ళీ అతనే అన్నాడు " కానీ మాకు కూడా అప్డేటింగ్ తప్పదు. సెక్యూరిటీ సిస్టమ్స్ చాలా అద్వాన్సు అయ్యాయి. 'ర్యాన్సమ్ వేర్ " లాటి హెకింగ్స్ తట్టుకోవాలంటే చాలా అప్రమత్తం గా ఉండాలి. సరే నా సంగతి అటుంచు. నీ సంగతి చూద్దాము. నువ్వు ఇంటర్వ్యూ కి వెళ్లిన ఉద్యోగానికి ఎంత ఇచ్చేవాళ్ళు, ఒక వేళ వచ్చి ఉంటె?
" నువ్వు కష్టపడి స్కిల్స్ పెంచుకుంటే మంచి జీతం కాకుండా మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఐఐటి లో చదివిన వాళ్ళ కంటే మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. దానికి ప్రారంభంగా ముందు నువ్వు కొన్ని కోర్సులు సెలెక్ట్ చేసుకుని వాటిలో చేరాలి. రెండు రోజులు రోజూ రాత్రి ఎనిమిదింటికి నా దగ్గరికి రా, నువ్వు ఎందులో ఇష్టం గా ఉన్నావో మనం డిసైడ్ చేసిన తరువాత కోర్సులు సెలెక్ట్ చేద్దాము అన్నాడు"
అతని మాటలు విన్న తరువాత రాఘవకి ఉత్సాహం వచ్చింది. మరునాడు వస్తానని చెప్పి వచ్చేశాడు.
ఆ తరువాత మూడు నెలలు రాఘవ కి ఒక తపస్సు లాగ జరిగింది. పగలు వరుణ్ చెప్పిన కోర్సుల కి వెళ్లడం, రాత్రి వరుణ్ తో కూర్చుని అతను నేర్పినవి నేర్చుకోవడంతో అతనికి కాలం తెలియలేదు.
చిన్నప్పటినుంచీ దేనికీ అంత కష్టం ఎప్పుడూ పడలేదు. అతను అంత క్రితం ఎప్పుడూ వినని, చదవని సబీజెక్ట్స్ అతను చేరిన కోర్సులలో చెబుతూ, ఇంటిదగ్గర కూడా చేసుకు వచ్చేలా అసైన్మెంట్స్ ఇవ్వడంతో, వాటిని అర్థం చేసుకుని, కొన్ని సొంతం గా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలిసి వచ్చేది.
ఒకరోజు నిస్పృహతో. ఆ మూడ్ నుంచి బయటికి రావడానికి టీవీ ముందు కూర్చుని ఎదో న్యూస్ ఛానల్ చూస్తూ కూర్చున్నాడు. తల్లి కూడా వచ్చి పక్కన కూర్చుంది. ఆవిడ వచ్చిందని భక్తి ఛానల్ కి మార్చాడు, ఆవిడ చూస్తుందని.
ఎవరో పెద్దాయన్ని ఒకావిడ శ్రోతలు అడిగిన ప్రశ్నలు చదివి జవాబులు అడుగుతోంది. ఆయన చెప్పే జవాబులు చాలా ఆసక్తి గా ఉండడంతో తల్లీ కొడుకులు ఇద్దరూ వింటున్నారు
" దీనికి చాలా జవాబులు చెప్పవచ్చు. చిన్నగా చెప్పాలంటే సుఖం తెలియాలంటే కష్టం పడవలిసిందే. కొంచం లోతుగా వెడితే ఇంకా బాగా తెలుస్తుంది. చిన్న ఉదాహరణ చెబుతాను. |
గొంగళీపురుగు గూడు కట్టుకుని అందులో కొంతకాలం ఉండిపోతుంది. తగిన సమయానికి లోపల చాలా కష్టపడి ప్రయత్నం చేసి, గూడు చీల్చుకుని సీతాకోక చిలకలా బయటికి వస్తుంది. ఎవరయినా ఆ గూడుని చీల్చి సహాయం చేస్తే, సీతాకోక చిలకలా అవకపోగా అది చనిపోయే ప్రమాదం ఉంది. అది కష్టపడి ప్రయత్నం చేసి బయటికి వస్తేనే అది సీతాకోక చిలక గా బయటికి వస్తుంది." అని ఆయన వివరించాడు. అది పూర్తిగా అర్థం అవడానికి రాఘవ ఇంకో నెల ఆగవలిసి వచ్చింది
అన్ని కోర్సులూ పూర్తి అయిన తరువాత రాఘవ సీవీ ని 'లింక్డ్ ఇన్' లో 'అప్ డేట్' చేయించాడు వరుణ్. ఒక వారం లోనే ఒక ప్రముఖ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. లింక్డ్ ఇన్ లో అప్పటికే ఇతని గురించి చూశారు కాబట్టి, కొద్ది సేపే ఇంటర్వ్యూ నడిచింది. ఆరు నెలలు ప్రొబేషన్ తరువాత ఏడాదికి ఆరు లక్షలు ఇస్తా మని, ఫార్మల్ లెటర్ కోసం వైట్ చేయమన్నారు.
అదే రోజు వరుణ్ ఇంటికి వచ్చేదాకా ఆతృతగా ఎదురు చూశాడు రాఘవ. ఫోన్లో చెప్పడం కంటే అతనికి పెర్సనల్ గా చెప్పాలని అనిపించింది. వరుణ్ రావడానికి ముందే వాళ్ళ ఇంటికి వెళ్లి రజని తో కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. రజని చెప్పినదాని బట్టి . వరుణ్ మూడు లక్షలు జీతం తో ప్రారంభించి, ఇప్పుడు తొంభై లక్షలు చేరుకున్నాడట. దానికి అతను ఎప్పుడూ స్కిల్స్ ని అప్డేట్ చేసుకుంటూ, నిజాయితీ గా కష్టపడి పనిచేయడం వల్ల కంపెనీ వాళ్ళు గుర్తించి అతను ఎక్కడికీ వెళ్లకుండా వాళ్లే జీతం పెంచుతూ వచ్చారట.
వరుణ్ వచ్చిన తరువాత విషయం చెప్పాడు.రాఘవ . అతను చాలా సంతోషించి. లెటర్ రాగానే వెంఠనే ఒప్పుకున్నట్టు జవాబు ఇచ్చేయ మన్నాడు.
" మొదటి సారి ఇంటర్వ్యూ ముందు వెళ్ళమని తోడేశావు. ఏమైంది? ఇప్పుడు చచ్చి కష్టపడి చదివి సంపాదించిన ఉద్యోగం కూడా ఆయన వల్లే వచ్చిందంటావా ? " అన్నాడు
" భగవంతుడు ఏది ఎప్పుడు చేయాలో ఆయనకీ తెలుసురా. ఆ చిన్న ఉద్యోగం అప్పుడు నీకు వచ్చేలా చేస్తే, ఇంత మంచి ఉద్యోగం నీకు వచ్చేదా? ఇదంతా నువ్వు కష్ట పడటం వల్లే వచ్చిందంటున్నావు. రజని ఆంటీ మన ఇంటికె ఎందుకు రావాలి ? వరుణ్ తో నీపరిచయం నీ ప్రయత్నం వల్లే జరిగిందా? భగవంతుడు సహాయం చేయాలంటే నీ ఎదురుగా వచ్చి వరాలిస్తాడా?ఆయన పద్దతి లో ఆయన చేస్తాడు" అంది ఆవిడ. ఒక క్షణం ఆగి మళ్ళీ ఆవిడే అంది " తిరుపతి వెళ్ళీ టైం లేకపోతే మన ఊళ్ళో గుడికి వెళ్ళు, లేదా ఇంట్లోనే ప్రార్థించు. భగవంతుడిని మరిచి పోక పోవడం ముఖ్యం"
ఆమె మాటలు విన్న తరువాత, ఒక్కమాటు అన్నీ గుర్తుకు వచ్చి, ఆమె చెప్పినదాంట్లో ఎంత నిజం ఉందొ మనసుకి వచ్చి అతని మనసు భగవంతుడి పట్ల కృతజ్ఞత తో నిండిపోయింది
మరిన్ని కథలు
ఏది శాస్త్రం - పి. మంగారత్నం.
మీ రచనలు పంపవలసిన చిరునామా : |
క్రీడలు క్యాడెట్- మీ తాజా క్రీడలు కథనాలు
తాజా క్రీడా వార్తలు
సంప్రదించండి
ఆదివారం, డిసెంబర్ 29, XX
ప్రత్యక్ష ప్రసారం
ఇప్పుడు కొనుగోలు
ప్రస్తుత ట్రెండ్
జనాదరణ పొందిన వార్తలు
అన్ని సమయాల్లో ప్రజాదరణ పొందింది
కనెక్ట్ అవ్వండి
క్రీడలు న్యూస్
తాజా క్రీడా వార్తలు వాకా - సెప్టెంబర్ 19, 2018
తాజా క్రీడా వార్తలు వాకా - అక్టోబర్ 2, 2018
తాజా క్రీడా వార్తలు వాకా - అక్టోబర్ 17, 2018
తాజా వ్యాసాలు
తాజా క్రీడా వార్తలు వాకా - నవంబర్ 11, 2018
ఇంకా చదవండి
సాకర్, బాస్కెట్బాల్, రగ్బీ, టెన్నీస్, సైక్లింగ్ మరియు మరిన్ని: మీ తాజా క్రీడా ఈవెంట్స్ మరియు క్రీడలు మరియు క్రీడల యొక్క క్రీడల గురించి సమాచారాన్ని కనుగొనండి.
మమ్మల్ని సంప్రదించండి: [email protected]
ప్రముఖ పోస్ట్లు
ప్రజాదరణ వర్గం
తాజా క్రీడా వార్తలు10221
© వార్తాపత్రిక WordPress థీమ్ ద్వారా TagDiv
లైవ్ CSS తో సవరించండి
rgv about sridevi 2,శ్రీదేవి గురించి మరీ ఇంత దారుణంగా మాట్లాడతారా ? _ TeluguNow.com
Watch BigBoss 2 Telugu Live _ Read Latest Swathi Weekly _ 2018 Telugu Calendar _ శ్రీ విళంబి నామ సంవత్సర రాశి ఫలితాలు
తెలుగు న్యూస్
You are at:Home»Telugu News»శ్రీదేవి గురించి మరీ ఇంత దారుణంగా మాట్లాడతారా ?
శ్రీదేవి గురించి మరీ ఇంత దారుణంగా మాట్లాడతారా ?
శ్రీదేవి మరణం పూట పూటకూ ఓ కొత్తమలుపు తీసుకుంటోంది. ఎన్ని అనుమానాలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఆవేదనకు గురి చేస్తున్నాయి. . శ్రీదేవి బతికున్నప్పుడు ఆమె అందం, అభినయం గురించి మాట్లాడుకున్నారని చనిపోయాక ఆమె భౌతికకాయం, రక్తంలో మద్యం ఆనవాళ్ల గురించి మాట్లాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు వర్మ.
‘ఒకప్పుడు శ్రీదేవి అందమైన కళ్లు, పెదాలు, శరీరాకృతి గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు శ్రీదేవి భౌతికకాయం, రక్తంలో మద్యం ఆనవాళ్లు, ఊపిరితిత్తుల్లో నీరు గురించి మాట్లాడుకుంటున్నారు. దేవుడా..!’ అంటూ తనదైన శైలి ఓ ట్వీట్ పెట్టాడు వర్మ. కాగ. శనివారం దుబాయ్ లో మరణించిన శ్రీదేవి బౌతికకాయం ఇంకా ఇండియా చేరుకోలేదు. ఆమె మరణం పై కూడా చాలా అనుమానాలు వున్నాయి.
ఎన్టీఆర్: దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆయనే
ఇమేజ్ మేకోవర్ కు బన్నీ సిద్ధం!
గీత గోవిందం రివ్యూ
‘విశ్వరూపం 2’ రివ్యూ
August 19, 2018 0 కేరళకు స్టార్లు ఎవరెంత ఇచ్చారంటే?
August 19, 2018 0 ఎన్టీఆర్: దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆయనే
August 19, 2018 0 ఇమేజ్ మేకోవర్ కు బన్నీ సిద్ధం!
August 19, 2018 0 అడ్డు అదుపు లేని గీత గోవిందులు
August 19, 2018 0 గురువు ఏక్ నంబర్.. శిష్యుడు దస్ నంబర్
August 19, 2018 0 మహేష్ కూడా పెద్దన్న అవుతున్నాడే..
August 19, 2018 0 బిగ్ బాస్ లో రాజకీయాలు..సంజన కామెంట్
August 18, 2018 0 ఆ అమ్మాయితో డిస్ట్రబ్ అయ్యా: వర్మ
August 18, 2018 0 ‘గీత గోవిందం’ సక్సెస్ మీట్ లో చిరు? |
కళ్యాణశైలనిలయా కమనీయా కళావతీ __ ౧ __
కదంబకాననావాసా కదంబకుసుమప్రియా __ ౨ __
కర్పూరవీటిసౌరభ్యకల్లోలితకకుప్తటా __ ౩ __
కర్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్మఫలప్రదా __ ౪ __
ఏతత్తదిత్యనిర్దేశ్యా చైకానందచిదాకృతిః __ ౫ __
ఏకాగ్రచిత్తనిర్ధ్యాతా చైషణారహితాద్దృతా __ ౬ __
ఏకభోగా చైకరసా చైకైశ్వర్యప్రదాయినీ __ ౭ __
"దీపాలతో ఆరాధన - ఫలితాలు"
ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు.
1. శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి.
2. సూర్యుడు - శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది.
3. చంద్రుడు - తేజోవంతులు, కాంతివంతులు కాగలరు.
4. కుజుడు - రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది.
5. బుధుడు - బుద్ధివంతులు కాగలరు.
6. గురుడు - ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి.
7. శుక్రుడు - మధుమేహ వ్యాధి తగ్గుతుంది.
8. శని - కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి.
9. రాహువు - సంపదలు కలుగుతాయి.
10. కేతువు - మంత్రసిద్ధి కలుగుతుంది.
11. శ్రీ సరస్వతి - జ్ఞానశక్తిని పొందుతారు.
12. మహాలక్ష్మీ - దారిద్య్రం తొలిగి, ఐశ్వర్యం కలుగుతుంది.
13. దుర్గాదేవి - శత్రు కష్టాలు తొలగిపోగలవు.
14. గంగాదేవి - పాపాలు తొలగిపోగలవు.
15. తులసీదేవి - సౌభాగ్యాలు కలుగును.
16. శివపార్వతులు - దాంపత్యజీవిత సుఖం.
17. లక్ష్మీనారాయణులు - జీవన్ముక్తి కలుగును.
18. మృత్యుంజయుడు - అకాల మృత్యునివారణ అవుతుంది.
19. శ్రీరాముడు - సోదరుల సఖ్యత కలుగుతుంది.
20. భైరవుడు - మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.
1. మేషరాశి - త్రివత్తులు (3)
2. వృషభరాశి - చతుర్వత్తులు (4)
3. మిధునరాశి - సప్తవత్తులు (7)
4. కర్కాటకరాశి - త్రివత్తులు (3)
5. సింహరాశి - పంచమవత్తులు (5)
6. కన్యరాశి - చతుర్వత్తులు (4)
7. తులారాశి - షణ్ముఖ వత్తులు (6)
8. వృశ్చికరాశి - పంచమవత్తులు (5)
9. ధనుస్సురాశి - త్రివత్తులు (3)
10. మకరరాశి - సప్తమవత్తులు (7)
11. కుంభరాశి - చతుర్వత్తులు (4)
12. మీనరాశి - పంచమవత్తులు (5)
1. మేష లగ్నం - పంచవత్తులు (5)
2. వృషభ లగ్నం - సప్తమవత్తులు (7)
3. మిధున లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
4. కర్కాటక లగ్నం - పంచమవత్తులు (5)
5. సింహ లగ్నం - త్రివత్తులు (3)
6. కన్యా లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
7. తులా లగ్నం - సప్తమ వత్తులు (7)
8. వృశ్చిక లగ్నం - ద్వివత్తులు (2)
9. ధనుర్ లగ్నం - పంచమవత్తులు (5)
10. మకర లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
11. కుంభ లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
12. మీన లగ్నం - ద్వివత్తులు (2) |
ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఎలా ఉండగలం?
మరుధమ్ పట్టి ‘టీ’
మానవ సంబంధాలు
సద్గురు అంటే అర్ధం ఏమిటి?
ప్రతిరోజూ యోగా చేయడం కుదరటం లేదా??
ఆవు మనకు తల్లి తరువాత తల్లి వంటిది…!!
అంబేద్కర్ జయంతి సందర్భంగా సద్గురు ఇచ్చిన సందేశం
మహాశివరాత్రి ఉత్సవాలు 2018
సామరస్యం కోసం ఆడే ఆటలు
కార్యక్రమాలు/ విశేషాలు
గత వ్యాసాలు
ఈశాలో, కార్యక్రమాలు/ విశేషాలు February 6, 2017
ఫిబ్రవరి 24, 2017 మహా శివరాత్రి పర్వదినాన ఈశా యోగా కేంద్రంలో 112 అడుగుల ఎత్తైన ఆది యోగి శివుని విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాము. ఇది భూమ్మీదనున్న పెద్ద కట్టడాల్లో ఒకటవ్వడం మాత్రమే కాదు, మనిషి తన పరమోన్నతన్నత స్థితికి చేరుకునేందుకు ఉన్న 112 మార్గాలను సూచించే చిహ్నం కూడా.
ఈ ఆదియోగి ముఖం సజీవంగా, చొచ్చుకుపోతూ, మన తరువాతి కాలంలో కూడా ఎంతో మందికి ప్రెరణనిస్తుంది. ప్రజలు “ ఈ దేశంలో ఆకలితో అలమటిస్తున్న పిల్లలున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులున్నారు, ఈ స్మారక చిహ్నం అవసరమా” అని ప్రశ్నిస్తారు. ఏదో పెద్ద ఘనకార్యం చేశాం అన్న భావన పొందటం కొసం ఈ ముఖచిత్రాన్ని ప్రతిష్టించడంలేదు. యోగ శాస్త్రానికి మునుపెన్నడూ లేని విధంగా పునరుద్దరణ కల్పించటానికి, మేము దీనిని సజీవశక్తిగా వినియోగించదలచుకున్నాం. ఇప్పుడు ప్రజల్ని చేరుకోటానికి ఉన్న వివిధ మార్గాలు మునుపెన్నడూ లేవు. మీరు గమనించినట్లైతే ఈ భూమ్మీద జీవించిన గొప్పవారందరికీ ఎంతో శక్తి సామర్ధ్యాలు ఉన్నప్పటికీ, ఇప్పటి పరిస్థితులలో ప్రజల్ని చేరుకోటానికి ఉన్న పలు సదుపాయాలతో పోల్చి చూస్తే వారికున్న అవకాశం చాలా తక్కువ. అప్పటివారికి లేని సాంకేతికత మనకి అందుబాటులో ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కరమూ కూడా, అప్పట్లో మహానుభావులు చేసినదానికంటే లక్ష రెట్లు ఎక్కువ చేసి చూపించాలి.
అంతఃశ్రేయస్సు పొందటానికై ఉన్న విజ్ఞాన ప్రక్రియను తిరిగి వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో విశ్వాసంతో పనిలేని, ఏ పిడివాదంతో సంబంధంలేని, తత్వ రహితమైన ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కావాలి. అది కేవలం ఒక విధానం, ఒక ప్రక్రియ అంతే. అది సాధించటానికే ఈ కీర్తివంతమైన ముఖం. ఇది ఒక్కసారే జరుగుతుంది. చెప్పాలంటే, ఎన్నో జన్మల్లో ఒకసారి వచ్చేది. ఈ ముఖం చాలా కాలం పాటు ఈ భూమ్మీద సజీవమై ఉండి, దీని సారూప సాన్నిధ్యం ప్రపంచంలోని లక్షల మందికి ప్రేరణ కలిగిస్తుంది. మీరు దీనిలొ పాలుపంచుకోవాలి…!
ఆదియోగి రూపం – ఈ గ్రహం మీదే అతి పెద్ద ముఖం, ఒక అద్భుతమైన ముఖం, 112 అడుగుల ఎత్తైన ఈ ముఖం విముక్తిని సూచిస్తుంది. ప్రపంచాన్ని విముక్తి మార్గం వైపుకు మళ్ళించడానికి, ఈ ముఖాన్ని మేము ఒక సరూప సాన్నిధ్యంగా ఉపయోగించాలనుకుంటున్నాము. అన్నిటి నుంచి విముక్తి, మిమల్ని బంధించి వుంచే దేనినుంచైనా సరే. ఈ గ్రహం మీద తదుపరి తరం ప్రజలు, కేవలం నమ్మకాల మీదే ఆధారపడే వారుగా కాక సత్యాన్వేషకులుగా మారగలగడం, నేడు చాలా ముఖ్యమైన విషయం. రాబోయే దశాబ్దాలలో, మనం పట్టుకు వేళ్ళాడుతున్న ఎన్నో పాత నిర్మాణాలు కూలిపోయినప్పుడు, మీలో విముక్తి పొందాలనే ఆకాంక్ష పెరుగుతుంది. ఆటువంటి కోరిక పెరిగినప్పుడు, ఆదియోగి ఇంకా యోగేశ్వర లింగము ఎంతో ముఖ్యమైనవి అవుతాయి.
మేము ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఆదియోగిని ఏర్పాటు చేస్తున్నాము. ఓ పరిపూర్ణ యోగిగా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాము. ఆదియోగి, మీ అసౌకర్యం, బాధలు, వ్యాధులు , పేదరికం అన్నింటికీ మించి జీవన్మరణ ప్రక్రియ నుంచీ మీకు విముక్తి కలిగిస్తాడు. కాబట్టి ఈ ముఖం ఈ గ్రహం మీద చాలా కాలం ఉంటుంది. ఖచ్చితంగా దాని సరూప సాన్నిధ్యం, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. ఇది జీవితకాలంలో ఒకసరే వస్తుంది. నిజానికి ఎన్నో జీవితకాలాల్లో ఒకసారి. మీరందరూ తప్పకుండా రావాలి!
Previous articleయోగేశ్వర లింగ ప్రతిష్టాపన విశిష్టత..
Next articleమహాశివరాత్రి సాధన అనుభవం
మాంసాహారం వల్ల మానసిక వత్తిడి కలుగుతుందా…????
యువత అంటే సాహసం..!!
యువత అంటే ఉత్సాహం, శక్తి ఇంకా సాహసం అని సద్గురు చెబుతున్నారు. ఒకసారి చిత్తూరు జిల్లాకు చెందిన దంపతులు సద్గురుని కలిసారు. వారి బిడ్డ భవిష్యత్తు నిర్ణయం గురించి వారు సద్గురుని అడగగా…
ప్రేమ, వెలుగు, నవ్వులతో నిండిన ప్రపంచం. దానికి సమయం ఆసన్నమైంది- రండి దాన్ని సృష్టిద్దాం - సద్గురు. పై సద్గురు మాటలను నిజం చేసే ప్రయత్నంలో ఈశా ఫౌండేషన్ వేస్తున్న ఎన్నో అడుగులలో ఈ తెలుగు బ్లాగ్ ఒక చిన్న అడుగు. ఇంకా ఉంది...
ఈశా క్రియ ప్రతిరోజూ చేసుకోగలిగే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికీ కనీసం ఒక్క బొట్టు ఆధ్యాత్మికతనైనా అందించడమే ఈశాక్రియ ఉద్దేశం. ఒక్క బొట్టే కదా అని దాన్ని తక్కువ అంచనా వేయకండి. ఒక్కొక్క బొట్టే ఓ సముద్రం. ఒక వ్యక్తి తన అత్యున్నత సామర్ధ్యానికి చేరుకోడానికి, ఇది ఒక శక్తివంతమైన ఉపకరణం. ఈశా క్రియ అభ్యాసంతో మీరు ప్రయోజనాలను పొంది, ఇతరులతో దీన్ని పంచుకుంటారని మేము ఆశిస్తున్నాం. |
'జీరో' లుక్ లో షాకిచ్చిన కత్రినా.. - TeluguNow.com _ TeluguNow.com
Watch BigBoss 2 Telugu Live _ Read Latest Swathi Weekly _ 2018 Telugu Calendar _ శ్రీ విళంబి నామ సంవత్సర రాశి ఫలితాలు
తెలుగు న్యూస్
You are at:Home»Telugu News»‘జీరో’ లుక్ లో షాకిచ్చిన కత్రినా..
‘జీరో’ లుక్ లో షాకిచ్చిన కత్రినా..
షారుఖ్ ఖాన్ మరో కొత్త పాత్రతో మనముందుకు వస్తున్నాడు.. మురుగుజ్జుగా నటిస్తున్నాడు. ‘జీరో’ పేరుతో హిందీలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్. అనుష్క మానసిక రోగిపాత్రలో నటిస్తోంది. అజయ్ -అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను షారుఖ్ భార్య గౌరీఖాన్ -ఆనంద్ ఎల్ రాయ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
షారుఖ్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘జీరో’ కత్రినా కైఫ్ కు ఊహించని పాత్ర దక్కిందట. ఓ సూపర్ స్టార్ పాత్రను పోషించిందట.. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అభిమానుల నుంచి మాంచి స్పందన వచ్చింది. ఇందులో భాగంగా బర్త్ డే సందర్భంగా కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కళ్లకు దట్టంగా కాటుక పెట్టుకొని వినూత్నంగా కనిపించింది. జీరో సైజ్ లో మత్తెక్కించేలా ఉన్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గీత గోవిందం రివ్యూ
‘విశ్వరూపం 2’ రివ్యూ
August 20, 2018 0 రివ్యూయర్లపై దేవ్ కట్టా రివ్యూ!
August 20, 2018 0 కేరళ వరదల్లో చిక్కుకున్న హీరోయిన్
August 20, 2018 0 అల్లుడి మీద కేరళ వరదల ఎఫెక్ట్?
August 20, 2018 0 ‘మణికర్ణిక’ పై క్లారిటీ ఇచ్చిన పెద్దాయన
August 20, 2018 0 కౌశల్ సెంటిమెంట్ మరోసారి ఫ్రూవ్ అయ్యిందిగా!
August 20, 2018 0 విజయ్ పెద్ద ముదురు.. అరవింద్ షాక్
August 20, 2018 0 రెండు కత్తుల మధ్య క్రిష్ యుద్ధం
August 20, 2018 0 మరో వివాదంలో కంగనా రనౌత్
August 20, 2018 0 మేడమ్ మేడమ్.. మా సినిమాలో చేయండి |
దక్షిణ కైలాసం
అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది?
వివాహేతర సంబంధం తప్పంటారా?
మానవ సంబంధాలు
సనాతన ధర్మము
సద్గురు అంటే అర్ధం ఏమిటి?
ప్రతిరోజూ యోగా చేయడం కుదరటం లేదా??
ఆవు మనకు తల్లి తరువాత తల్లి వంటిది…!!
అంబేద్కర్ జయంతి సందర్భంగా సద్గురు ఇచ్చిన సందేశం
మహాశివరాత్రి ఉత్సవాలు 2018
సామరస్యం కోసం ఆడే ఆటలు
కార్యక్రమాలు/ విశేషాలు
గత వ్యాసాలు
యోగ చరిత్ర September 20, 2015
నా పసితనం నుంచీ నా కళ్ళలో ఎప్పుడూ పర్వతాలు ఉండేవి. నాకు పదహారేళ్ళ వయసు వచ్చిన తరువాత నా స్నేహితులతో దీని గురించి మాట్లాడితే, ‘నీకేమైనా పిచ్చా! ఇక్కడ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?’ అని అన్నారు వాళ్ళు. అప్పుడే నాకు తెలిసింది నా కళ్ళలో తప్ప వేరెవరి కళ్ళలో ఆ పర్వతాలు లేవని.
మీ కళ్ళజోడు మీద ఒక చిన్న చుక్క ఉందనుకోండి కొద్ది సమయం తరువాత మీకది అలవాటై పోతుంది. ఇది కూడా అలాంటిదే అయ్యింది. ఆ తరువాత ఎప్పుడో జ్ఞాపకాలు అన్నీ వరదగా వచ్చినప్పుడు, నేను ధ్యానలింగాన్ని ప్రతిష్టించటానికి ఒక స్థలాన్ని వెతుకుతున్నపుడు, నేను నా కళ్ళలో ఉన్నఆ ప్రత్యేకమైన పర్వత శిఖరాల కోసం వెతకటం మొదలు పెట్టాను.
నేను బైక్ మీద ఒక మలుపు తిరిగినప్పుడు, నాకు వెల్లంగిరి పర్వత శ్రేణిలోని ఏడోవ పర్వతం కనిపించింది
నేను అంతా వెతికి చూసాను. నేను గోవా నుంచి కన్యాకుమారి వరకూ, ముందుకీ వెనక్కీ నాలుగు సార్లైనా తిరిగాను. అవి కచ్చితంగా పశ్చిమ కనుమలలోనే ఉన్నాయని నాకు ఎలాగో నమ్మకం కలిగింది. కార్వార్ నుంచి కర్నాటక దగ్గర కేరళ సరిహద్దు వరకూ ప్రతీ రోడ్డూ, మట్టి రోడ్డూ కూడా వదలకుండా నేను కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉంటాను.
ఒకసారి అనుకోకుండా కోయంబత్తూరు దగ్గర ఉన్న ఒక పల్లెటూరికి వచ్చాను. నేను బైక్ మీద ఒక మలుపు తిరిగినప్పుడు, నాకు వెల్లంగిరి పర్వత శ్రేణిలోని ఏడోవ పర్వతం కనిపించింది – నా చిన్నతనం నుంచీ నేను చూస్తూ ఉన్న పర్వతం నా కళ్ళ ఎదుటే నిలిచింది. ఆ రోజు నుంచీ అవి నా కళ్ళలో నుంచి మాయం అయిపోయాయి.
వెల్లంగిరి పర్వతాలను దక్షిణ కైలాశ్ అని అంటారు ఎందుకంటే ఆదియోగి అయిన శివుడు తానే ఇక్కడ ఈ పర్వత శిఖరాల మీద మూడు నెలలు పైగా గడిపారు.
వెల్లంగిరి పర్వతాలను దక్షిణ కైలాశ్ అని అంటారు ఎందుకంటే ఆదియోగి అయిన శివుడు తానే ఇక్కడ ఈ పర్వత శిఖరాల మీద మూడు నెలలు పైగా గడిపారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సహజంగా ఉండే ఆనంద మనస్సిత్థిలో లేరు; వారి మీదే వారే కోపంగా ఉన్నారు ( ఆయన ఒక స్త్రీకి ఇచ్చిన మాట నిలుపుకోలేనందుకు). ఆయన ఎంతో తీవ్రతతో ఉన్నారు, ఆ శక్తి నేడు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది; అది కోపంలాంటి తీవ్రత కలిగిన యోగుల పరంపరకు జన్మనిచ్చింది. వాళ్ళు ఇక్కడ కూర్చుని సాధన చేసి అటువంటి గుణాన్నే పొందారు. వారు ప్రత్యేకంగా దేని మీద కోపంగా ఉండేవారు కాదు, కానీ కేవలం అలా కోపంగా ఉండేవారు.
ఈశాకు ముఖ్యమైన ఒక యోగి సద్గురు శ్రీ బ్రహ్మ, ఆయన ఇరవైయ్యో శతాబ్దం మొదట్లో జీవించారు. అన్నిటినీ మించి ఈ పర్వతం మనకు ఎంతో ముఖ్యమైంది ఎందుకంటే నా గురువు ఇక్కడే మహాసమాధి చెందారు. యోగ సంప్రదాయంలో ఈ పర్వతం మాకు ఒక దేవాలయం లాంటిదే. ఇది దివ్యత్వ జలపాతం, ఇది ఒక కృపా జలపాతం.
‘ఈ భూమి మీద అన్నిటి కంటే గొప్ప పర్వతం ఏది?’ అని మీరు నన్నడిగితే, నేను ఎప్పుడు ‘వెల్లంగిరి’ అనే జవాబిస్తాను ఎందుకంటే నాకు సంబంధించినంత వరకూ ఇవి కేవలం పర్వతాలు మాత్రమే కావు. నా కళ్ళలో వీటి ముద్రణతో నేను జన్మించాను, అవి అప్పటి నుంచీ నన్ను వెంటాడాయి. అవి నాలోనే జీవించాయి, అవి నాకు దిక్సూచిగా నిలిచాయి. అది నా సొంత GPS అన్నమాట. ఈ పర్వతం నాకు ఒక రాళ్ళ కుప్ప కాదు; ధ్యానలింగాన్ని ఏర్పరచడానికి నేను తెలుసుకోవలిసిన వాటన్నిటినీ అందించిన జ్ఞాన భాండాగారం ఇది.
Previous articleఅగస్త్యముని ఓ మర్మజ్ఞ యోగి!
Next articleకృష్ణుడి తత్త్వం ఎటువంటిది..?
మాంసాహారం వల్ల మానసిక వత్తిడి కలుగుతుందా…????
పతంజలి, ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి. ఈయన మరొకరికంటే ఎక్కువ జ్ఞానోదయం పొందారా? అని అడిగితే – అలాంటిది ఏమీ ఉండదు… ఆత్మసాక్షాత్కారం పొందడం అంటే ఆత్మసాక్షాత్కారం పొందడం – అంతే…! కానీ ఒక…
ప్రేమ, వెలుగు, నవ్వులతో నిండిన ప్రపంచం. దానికి సమయం ఆసన్నమైంది- రండి దాన్ని సృష్టిద్దాం - సద్గురు. పై సద్గురు మాటలను నిజం చేసే ప్రయత్నంలో ఈశా ఫౌండేషన్ వేస్తున్న ఎన్నో అడుగులలో ఈ తెలుగు బ్లాగ్ ఒక చిన్న అడుగు. ఇంకా ఉంది...
ఈశా క్రియ ప్రతిరోజూ చేసుకోగలిగే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికీ కనీసం ఒక్క బొట్టు ఆధ్యాత్మికతనైనా అందించడమే ఈశాక్రియ ఉద్దేశం. ఒక్క బొట్టే కదా అని దాన్ని తక్కువ అంచనా వేయకండి. ఒక్కొక్క బొట్టే ఓ సముద్రం. ఒక వ్యక్తి తన అత్యున్నత సామర్ధ్యానికి చేరుకోడానికి, ఇది ఒక శక్తివంతమైన ఉపకరణం. ఈశా క్రియ అభ్యాసంతో మీరు ప్రయోజనాలను పొంది, ఇతరులతో దీన్ని పంచుకుంటారని మేము ఆశిస్తున్నాం.
చందమామ కథలు
బాలల కథలు – సోనాలి నేస్తం |
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
కొంచెం తేనె. . కొంచెం చెక్క
తేనె, దాల్చిన చెక్క పొడిని రోజూ తీసుకుంటే చాలా వరకు వ్యాధులు నయమవుతా యంటున్నారు పరిశోధకులు. జబ్బులను నయం చేయడమే కాకుండా వ్యాధులు దరిచేరకుండా చూడటంలోనూ ఈ మిశ్రమం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
అయితే ఎలా తీసుకుంటే ఫలితం ఉంటుంది?
• గుండె జబ్బులు : దాల్చిన చెక్కను పొడిగా చేసుకుని తరువాత తేనె కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకుని తీసుకోవాలి. రెగ్యులర్గా బ్రేక్ఫా్స్టలో జెల్లీ, జామ్ బదులుగా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే కొలెసా్ట్రల్ తగ్గి గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఒకవేళ మీకు ఇప్పటికే హార్ట్ఎటాక్ ఒకసారి వచ్చి ఉంటే మరోసారి రాకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్క, తేనెను తీసుకోవడం వల్ల హార్ట్బీట్ కూడా మెరుగవుతుంది.
• ఆర్థరైటిస్ : రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక చిన్న టీ స్పూన్ దాల్చిన చెక్కపొడిని కప్పు వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ తీసుకుంటే క్రానిక్ ఆర్థరైటిస్ సమస్య కూడా నయమవుతుంది. పరిశోధనల్లోనూ ఈ విషయం రుజువయింది. 200 మంది ఆర్థరైటిస్ రోగులకు తేనె, దాల్చిన చెక్క పొడిని బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు అందజేసి పరీక్షించారు. అందులో 73 మందికి నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం లభించింది.
• మూత్రాశయ ఇన్ఫెక్షన్లు : రెండు టేబుల్స్పూన్ల దాల్చినచెక్కపొడి, ఒక టీస్పూన్ తేనెను గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
• కొలెసా్ట్రల్ : రెండు టేబుల్ స్పూన్ల తేనె, మూడు టీస్పూన్ల దాల్చిన చెక్కపొడిని 16 ఔన్సుల టీ వాటర్తో కలిపి కొలెసా్ట్రల్ పేషెంట్స్ తీసుకోవాలి. ఇలా చేస్తే రెండు గంటల్లోగా 10 శాతం కొలెసా్ట్రల్ తగ్గిపోతుంది.
• జలుబు : సాధారణ జలుబు లేక తీవ్రమైన జలుబుతో బాధపడుతున్నా ఒక టేబుల్స్పూన్ తేనె, పావు చెంచా దాల్చినచెక్క పొడిని రోజుకొకసారి మూడు రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, సైనస్ సమస్యలు దూరమవుతాయి.
• కడుపునొప్పి : దాల్చిన చెక్కను తేనె కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అల్సర్ సమస్య కూడా నయమవుతుంది.
• ఇన్ఫ్లూయెంజా : తేనెలో ఉన్న సహజసిద్ధగుణాలు ఇన్ఫ్లూయెంజా జెర్మ్స్ని చంపేసి ఫ్లూ నుంచి కాపాడతాయి.
• గొంతు నొప్పి : గొంతులో కిచ్ కిచ్గా ఉంటే ఒక టేబుల్స్పూన్ తేనె తీసుకోవాలి. ప్రతీ మూడు గంటలకొకసారి తీసుకుంటూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు త్వరగా దూరమవుతాయి.
• మొటిమలు : మూడు టేబుల్స్పూన్ల తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని పేస్టు మాదిరిగా చేసుకుని పడుకునే ముందు ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే మొటిమలు మొత్తం మటుమాయమవుతాయి.
• వెయిట్లాస్ : రోజూ ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే అరగంట ముందు పరగడుపున కప్పు నీటిలో తేనె, దాల్చిన చెక్కపొడి వేసుకుని మరిగించి తాగాలి. రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువుతు తగ్గుతారు.
• నోటి దుర్వాసన : ఒక టీ స్పూన్ తేనె, దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చటి నీళ్లలో వేసుకుని పుక్కిలిస్తే ఆ రోజంతా నోటి సువాసన తాజాదనాన్నిస్తుంది.
• అలసట : అర టేబుల్ స్పూన్ తేనెను గ్లాసు నీటిలో కలుపుకుని కొంచెం దాల్చిన చెక్కపొడిని అందులో వేసుకుని తాగితే అలసట దూరమవుతుంది. ముఖ్యంగీ సీనియర్ సిజిజన్స్కు ఇది బాగా ఉపకరిస్తుంది.
• వినికిడి సమస్యలు : రోజూ ఉదయం, రాత్రి తేనె, దాల్చిన చెక్క పొడిని సమానంగా తీసుకుంటే వినికిడి సమస్యలు తొలగిపోతాయి.
• రోగనిరోధక శక్తి : రోజూ క్రమంతప్పకుండా దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.
• చర్మ వ్యాధులు : తేనె, దాల్చినచెక్క పొడిని సమానంగా తీసుకుని సమస్య ఉన్న చోట పూస్తే ఎగ్జిమా, రింగ్వార్మ్స్, ఇతర స్కిన్ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్.. పైపై మెరుగులే
దీపావళి కానుకగా వచ్చిన ఈ విజువల్ వండర్ ప్రేక్షకులకు మాత్రం వండర్లా అనిపించదు.
ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ రివ్యూలో “వరస్ట్ మూవీస్ ఆఫ్ ది ఇయర్” అని గనుక ఎవరైనా ఒక జాబితా తయారు చేస్తే.. నిస్సందేహంగా మొదటి స్థానంలో నిల్చోగల సత్తా ఉన్న చిత్రం “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్” |
ఆహరం మరియు పోషణ
ఇంట్లో ఉండే ఔషధాలు
సంబంధాలు-సూచనలు
బరువు తగ్గటము
చర్మ సంరక్షణ
హార్ట్ హెల్త్
నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు
తృతీయ త్రైమాసిక దశ, అత్యంత సమస్యాత్మకమైనదిగా చెప్పవచ్చు.
గర్భం యొక్క ఈ దశలో శిశువు యొక్క బరువు చాలా ముఖ్యం.
శరీరంలో, నీటి నిల్వ ఈ సమయంలో చాలా సాధారణం.
గర్భవతి చర్మంపై ఈ దశలో దురదలు కలుగుతాయి.
తృతీయ గర్భదశ అనేది, గర్భం యొక్క ప్రయాణానికి చివరి దశగా చెప్పవచ్చు. గర్భదశ యొక్క 28వ వారం నుండి ప్రసవం వరకు గల సమయాన్ని తృతీయ త్రైమాసిక దశగా పేర్కొంటారు. ఈ దశలో పుట్టబోయే బిడ్డ యొక్క బరువు అత్యంత కీలకం కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పూర్తి స్త్రీ జీవితదశలో, తృతీయ త్రైమాసిక దశ చాలా ముఖ్యమైన మరియు ఎక్కువ సమస్యలకు గురి చేసే దశగా చెప్పవచ్చు. రోజులు గడుస్తున్న కొలది, శిశువు బరువు పెరుగుతుంది కావున, తృతీయ త్రైమాసిక దశలో చాలా సమస్యలు కలుగుతాయి. శిశువు బరువు పెరగటం కూడా ఈ దశలో చాలా ముఖ్యం. తృతీయ త్రైమాసిక దశలో కలిగే సమస్యల గురించి కింద తెలుపబడ్డాయి.
అసాధారణ ప్లాసెంటా లేదా త్వరాగా గర్భాశయం నుండి ప్లాసేంటా వేరు పడటం వలన తృతీయ త్రైమాసిక దశలో అధిక స్రావాలకు గురవుతారు. ఈ రెండు కారణాల వల్లనే 95శాతం మంది గర్భవతులలో స్రావాలు కలుగుతున్నాయి. ఈ స్థితులనే వరుసగా 'ప్లాసేంటా ప్రావియా' మరియు 'అబ్రుప్టియో ప్లాసేంటాగా' అభివర్ణిస్తారు. ఈ పరిస్థితుల వలన శరీరం నుండి రక్తం అధికంగా స్రావాల రూపంలో భయటకి వెళ్ళటం వలన పోషకాల కొరత ఏర్పడి, శిశువుకు మరియు గర్భవతికి ఆరోగ్య సమస్యలకు గురవుతాయి.
తృతీయ త్రైమాసిక గర్భదశలో, గజ్జల్లో నొప్పి కలగటం చాలా సాధారణం. కారణం- మీ శరీరం ప్రసవానికి సిద్దంగా మారాలి కావున, పెల్విక్ జాయింట్స్ వదులుగా అవుతాయి. ఇలాంటి మార్పుల వలన మీరు ఎక్కువ సమయం నిలబడిన లేదా ఒకే భంగిమలో ఉండలేరు. ఈ సమస్య, ప్రసవం వరకు మాత్రమే ఉంటుంది, ప్రసవం తరువాత తగ్గిపోతుంది.
గుండెలో మంట
తృతీయ త్రైమాసిక గర్భదశలో, గర్భవతులు తీవ్రమైన గుండె మంటకు గురవుతారు. కడుపులో ఉత్పత్తి చెందే ఆసిడ్ లు అన్నవాహికలోకి చేరటం వలన ఈ రకం మంటలకు గురవుతుంటారు. నిజానికి, గర్భాశయంలో శిశువు పరిమాణం పెరుగుతున్న కొలది, జీర్ణాశయంపై ఒత్తిడి ఏర్పడి, ఈ ఆసిడ్ లు పైకి ఎగబాకి, అన్నవాహికలోకి చేరతాయి. గుండెలో కలిగే ఈ మంటలను తగ్గించుకోటానికి తక్కువ మొత్తంలో ఆహరాన్ని తరచుగా తినండి మరియు తిన్న తరువాత వెంటనే పడుకోకండి. ఈ రెండు పద్దతుల ద్వారా గుండెలో కలిగే మంటలను తగ్గించుకోవచ్చు.
చివరి గర్భదశలో, శిశువు భంగిమ మరియు కదలటం లేదా తన్నటం జరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని సంరక్షించే వైద్యుడిని లేదా మంత్రసానిని కలవండి. శిశువు పెల్విక్ (కటి) ప్రాంతాలలో స్థిరపడిన సమయంలో మాత్రమే ఈ రకం నొప్పి తగ్గుతుంది. ఒకవేళ శిశువు భంగిమ మరియు స్థానం సరిగ్గా ఉన్నను, గుండెలో మంట లేదా పక్కటెముకలలో నొప్పి కలిగితే దానికి కారణం- ప్రీఎక్లంప్సియా అని చెప్పవచ్చు.
తృతీయ త్రైమాసిక గర్భదశలో ఇది సాధారణ సమస్యగా చెప్పవచ్చు. మీ బరువు పెరగటం వలన మరియ స్త్రీ బరువు కూడా పెరగటం వలన మీ వెన్నుపై భారం పడి, వెన్నునొప్పి ఎక్కువ అవుతుంది. మీ శరీరంలో హార్మోన్ల స్థాయిలలో మార్పులు మరియు కీళ్ళ పట్టుకోల్పోవడం వలన ఈ సమస్య కలుగుతుంది.
తృతీయ త్రైమాసిక గర్భదశలో ఏర్పడే ప్రమాదకర సమస్యలలో ఇది కూడా ఒకటి. ఈ సమస్య వలన ముఖం మరియు శరీర ఇతర భాగాలు వాపులకు గురవటం, తలనొప్పి మరియు దృష్టి లోపాలు కలుగుతాయి. శరీరంలో నీరు అధికంగా చేరి పేరుకుపోవటం వలన ఈ సమస్య కలుగుతుంది. ఈ సమస్య వలన చాలా ఇబ్బందులు కలుగుతాయి, కావున వెంటనే వైద్యుడిని కలవండి.
చర్మం మృదువుగా, సున్నితంగా మారటం మరియు చర్మంపై ఒత్తిడి కలగటం వలన ఈ దశలో చర్మం దురదలకు గురవుతుంది. వీటి నుండి ఉపశమనం పొందటానికి ఫర్ఫ్యూం (అత్తరు) లేని తేమను అందించే ఉత్పత్తులను అందించవచ్చు. ఒకవేళ దురదలు ఎక్కువగా ఉంటే, వెంటనే వైద్యుడిని కలవండి. ముఖ్యంగా, కాళ్ళు చేతులపై దురదలు ఎక్కువగా కలిగితే కాలేయ సమస్యల వలన అని చెప్పవచ్చు.
ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు
మీ కోసం మరిన్ని
గర్భ దశ అనేది స్త్రీలకు కీలక సమయం అని చెప్పవచ్చు, కారణం ఈ సమయంలో కలిగే సమస్యల చాలా ప్రమాదకరంగా ఉంటాయి. గర్భ సమయంలో కలిగే సమస్యలు మరియు పరిష్కారాల గురి
అధిక మొత్తంలో తేనె స్వీకరణ వలన కలిగే ఆరోగ్య సమస్యలు
ఆయుర్వేద వైద్య శాస్త్ర ప్రకారం, తేనె అద్భుతమైన వైద్య అంశాలను కలిగి ఉన్న ఔషదంగా భావిస్తారు అవునా! తేనె వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అధిక మొత్తంలో తేనె |
కొంత మందిలో గర్భసమయంలో మాత్రమే థైరాయిడ్ వ్యాధి కలుగుతుంది, ఫలితంగా అబార్షన్ వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. గర్భ సమయంలో కలిగే థైరాయిడ్ వ
మూడవ త్రైమాసిక దశ చాలా కష్టతరం మరియు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన చాలా రకాల ఇబ్బందులకు గురి అవవలసి వస్తుంది. వాటి గురించిన జాగ్రత్తల గురించ
పురుషులలో పొడవైన జుట్టుకు చిట్కాలు మరియు నిర్వహణ సూచనలు
పురుషులలో పొడవైన జుట్టు నిర్వహణ కష్టమే, కానీ ఇక్కడ తెలిపిన సూచనలను అనుసరించటం వలన సులభంగా పొడవైన జుట్టును ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించవచ్చు.
ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు
చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
గర్భదశలో చాలా ఇబ్బందులు మరియు మార్పులు కలుగుతాయి. వీటి గురించి ముందే తీసుకోవటం వలన సమస్యల నుండి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు మరియు కలిగే మార్పు
ప్రస్తుతం మనం అనుసరిస్తున్న అనారోగ్యకర జీవన శైలి వలన వెంట్రుకలు రాలి, బట్టతల త్వరగా కలుగుతుంది. ఈ సమస్య పురుషులలోనే కాదు మహిళలలో కూడా ఎక్కువే. ఇలాంటి
హెల్త్ A-Z : క్యాన్సర్ _ డయాబెటిస్ _ హార్ట్ హెల్త్ _ ఆస్తమా
ఆరోగ్యకర జీవనం : బరువు తగ్గటము _ బరువు పెరగటము _ కేశాల సంరక్షణ _ చర్మ సంరక్షణ _ గర్భ ధారణ _ ప్రేగ్నన్సి ట్రైమేస్టర్ _ క్యాన్సర్ _ డయాబెటిస్ _ హార్ట్ హెల్త్ |
随机词语: manchi, lakshmi, ఇల్లు, ఈగ, ఉడుత
అమెరికాలో జాతివివక్షకు ఓ తెలంగాణ యువకుడు బలయ్యాడు. ఆ యువకుడి పేరు వంశీ చందర్ రెడ్డి మామిడాల. ఈ తెలుగు యువకుడు అమెరికాలోని మాస్టర్స్ పూర్తి చేసి ఓ పక్క సాఫ్ట్ వేర్ జాబ్స్ వెతుక్కుంటూ మరో పక్క పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటున్నాడు. Read More...
మరిన్ని అప్డేట్స్ కోసం ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి
ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.
1. కేఫ్ అడ్డా 2. మా వరదరాజపురం కథలు
మీ బ్లాగులని కూడా బ్లాగులోకంలో చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకాలస్యం, [email protected]కి మీ బ్లాగ్ లింక్ ని మెయిల్ చెయ్యండి.
బిగ్ బాస్ సీజన్ 1 - విన్నర్ గా నిలిచిన శివబాలాజీ
దీపావళి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు
ఆ హీరోతో అంజలి లవ్ జర్నీని కన్ఫర్మ్ చేసిన దోశ?
ఐటెం సాంగ్ తో దడ పుట్టించనున్న సుమ, అనసూయ?
22 ఏళ్లగా మ్యాన్ హోల్ లోనే వారి జీవనం...!!!
మల్టీ స్టారర్ మూవీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్?
సినిమా న్యూస్
నాన్నకు ప్రేమతో (2015 )- Nannaku prematho
గీతం : లవ్ మీ అగైన్ (love me again song)
చిత్రం: నాన్నకు ప్రేమతో
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గీత రచయిత : చంద్ర బోస్
దర్శకుడు: సుకుమార్
నిర్మాత : బి.వి.స్.న్. ప్రసాద్
మళ్లీ వస్తాను మళ్లీ చూస్తాను
అలవాటుగా నన్ను ప్రేమించవా.. ఆ ఆ ఆ
- ట్రాన్సిట్-వీసా--చిన్న-బస - బార్బొడాస్ - జపాన్
- ట్రాన్సిట్-వీసా--చిన్న-బస - బహ్మజాతి-వాళ్ళు - జపాన్
- ట్రాన్సిట్-వీసా--చిన్న-బస - ఆస్ట్రియా - జపాన్
- ట్రాన్సిట్-వీసా--చిన్న-బస - ఆస్ట్రేలియా - జపాన్
- ట్రాన్సిట్-వీసా--చిన్న-బస - అర్జెంటీనా - జపాన్
- ట్రాన్సిట్-వీసా--చిన్న-బస - అన్డోరా - జపాన్
- ట్రాన్సిట్-వీసా--చిన్న-బస - జెర్మనీ-దేశం - జపాన్
- పర్యాటక-వీసా--ప్రయాణం--సెలవులు - ఉరుగ్వే - జపాన్
ప్రెస్ నోట్స్
వీడియోలు(UGC)
టాప్ స్టోరీస్
ప్యాకేజీ పవన్ నోరు ...
న్యూస్ అప్డేట్స్
పార్వతీపురం బహిరంగ సభ ...
టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యం ...
స్పెషల్ స్టోరీస్
పత్రికా ప్రకటనలు
లీగల్ సెల్లో నూతన ...
చంద్రబాబు పోలీసులు ముట్టుకోని ...
కేంద్ర సంస్థలతో దర్యాప్తు ...
మీడియా పాయింట్
బడ్జెట్ సమావేశాల వీడియో ...
ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: ...
నెల్లూరు : అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీకి లేదు
వైయస్ఆర్సీపీ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి
– రాష్ట్రంలో దాడులు, హత్యలు జరుగుతున్నాయి
– 2019 ఎన్నికల్లో నారాసుర రాజకీయ సంహారం జరగాలి
– నష్టపరిహారం చెక్కులపై చంద్రబాబు బొమ్మ ఎలా వేస్తారు?
– సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా?
– ఆపరేషన్ గరుడ పురాణం చెప్పిన పెయిడ్ ఆర్టిస్టు శివాజీపై చర్యలేవి?
– పోలీసు నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి?
టీడీపీ అభ్యున్నతికి మాత్రమే ఈ వ్యవస్థను వాడుకుంటున్నారన్నారు. వైయస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పడం బాధాకరమన్నారు. తప్పు చేస్తే నోటీసులు ఇవ్వండి కానీ, ఇలా వేధించడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేస్తారా అని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరుగబోతుందని చెప్పిన ఆపరేషన్ గరుడు రచయితను ఎందుకు విచారించలేదన్నారు. ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామిగా ఉండాల్సిన డీజీపీ ఎలా పని చేస్తున్నారని, ఇంటిలిజెన్సీ చీఫ్ ఏమయ్యారని ప్రశ్నించారు. కౌంటర్ ఇంటలీజెన్సీ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు కొనుగోలు చేసేందుకు వినియోగిస్తున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసులో పని చేసేందుకు ఇంటలీజెన్సీలను వాడుకుంటున్నారన్నారు. టీడీపీకి అమ్ముడపోయిన ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోతే ఇంటలిజెన్సీ వ్యవస్థ ఏం చేస్తుందన్నారు.
ఏపీలో ప్రజాదరణ కలిగిన వ్యక్తి, రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోయే వైయస్ జగన్పై దాడి జరిగితే ఈ రాష్ట్ర ఇంటలీజెన్సీ వ్యవస్థ విఫలమైందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఈ పెద్ద మనిషి జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కూడగట్టి వ్యవస్థలను బలోపేతం చేస్తారట అని ఎద్దేవా చేశారు. రాహుల్తో మొదలుపెట్టి అనేక రాజకీయ పార్టీల నాయకులను కలిశారని, వారంతా ఇప్పటికే యూపీఏ కూటమిగా ఏర్పాడ్డారని చెప్పారు. అలాంటి వారిని కలిసి కూటమి ఏర్పాటు చేశావా అని ప్రశ్నించారు. ఒక వ్యవస్థ నుంచి ఇంకోవ్యవస్థలోకి వెళ్లిన చంద్రబాబు చేసింది ఏమీ లేదని, యూపీఏలో చేరేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని వివరించారు. ఈ నారాసుర పాలన పోవాలని, నిజమైన దీపావళి పండుగ ఏపీ ప్రజలకు రావాలని, తెలుగు ప్రజలు ఆనందంగా కుటుంబాలతో దీపావళి పండుగ చేసుకోవాలంటే 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కురుపాం నియోజకవర్గంలోకి ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర...
ప్యాకేజీ పవన్ నోరు అదుపులో పెట్టుకో..
ప్రజా సంకల్ప యాత్ర @ 300వ రోజు
సంబంధిత వార్తలు
ప్రతి ఇంటికీ నవరత్నాలు |
అతడు..ఆమె..ఒక రహస్యం
( గతసంచిక తరువాయి ).. http://www.gotelugu.com/issue201/577/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/
“ఎవరు మీరు? ఏం కావాలి? ఇంట్లో డబ్బూ బంగారం ఏమీ లేవు. నేను బ్యాచిలర్ని. మర్యాదగా మీరు బయటికి వెళ్ళండి. లేకపోతే గట్టిగా అరుస్తాను. చుట్టుపక్కల వాళ్ళు వస్తారు” ధైర్యాన్ని తెచ్చుకుని అంది ఆమె.
ఆమె మాటలు పూర్తి కాక ముందే ఆమె ఎదురుగా నిల్చున్న మూడో వ్యక్తి ప్యాంటు జేబులోంచి రివాల్వర్ బయటకి తీసి ఆమె కణతలకి గురి పెట్టాడు. తుపాకుల గురించి పెద్దగా పరిజ్ఞానం లేని ఆమెకే, అది ఇంపోర్టెడ్ గన్ అని తెలిసేలా నున్నగా మెరుస్తోంది.
ఆ గన్ చూడగానే వచ్చిన వాళ్ళు చిల్లర దొంగలు కారని ఆమెకి అర్ధమైంది. “ఎవరు మీరు? ఏం కావలి?” భయంగా అడిగిందామె ఈ సారి.
“ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయి? చెప్పు?” అప్పటిదాకా ఏమీ చెయ్యని నాలుగో వ్యక్తి అన్నాడు.
“ఏ వజ్రాలు?” అమాయకంగా అడిగింది బంగారులక్ష్మి.
“రెడ్ డైమండ్స్”
“రెడ్ డైమండ్సా? అమెరికన్ డైమాండ్స్ తప్ప మరే డైమండ్నీ కళ్ళతో కూడా చూడలేదు నేను జీవితంలో ఇప్పటిదాకా. మా ఇంట్లో రెడ్ డైమండ్స్ ఎందుకు ఉంటాయి?” తను వేసుకున్న ఆర్టిఫీషియల్ అమెరికన్ డైమాండ్స్ గొలుసుని చూపిస్తూ అందామె.
“షటప్” అన్నాడు ఆ వ్యక్తి. ఆ మాటతో పాటే, కసరత్తులు చేసి కరుగ్గా తయారైన అతడి అరచెయ్యి పిడికిలి బిగించి మరీ ఆమె బుగ్గని బలంగా తాకింది!
ఆమెకి కళ్ళు తిరిగినట్టైంది ఒక్క సారి. పాలూ వెన్నా రాసి సౌందర్య పోషణ చేసిన ఆమె బుగ్గ ఎర్రగా కందింది. “నా దగ్గర ఎలాంటి డైమాండ్సూ లేవు” అతడి వంక భయంగా చూస్తూ అంది.
“నటించకు. రెడ్ డైమండ్స్ ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసని మాకు తెలుసు. మర్యాదగా ఎక్కువ నాన్చకుండా అవి ఎక్కడ ఉన్నాయో చెప్పెయ్”
“ఇలా లాభం లేదు” గన్ పట్టుకున్నతను చేతులు విరిచి పట్టుకున్న వాళ్ళకి సైగ చేసాడు. వాళ్ళలో ఒకడు ఆమెని రెండో వాడికి అప్పచెప్పి, పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ కుర్చీని హాల్లోకి తీసుకు వచ్చాడు.
ఆమె అరవకుండా నోట్లో గుడ్డల్ని కుక్కేసాడు. “నువ్వు వజ్రాల గురించి చెప్పడానికే ఈ గుడ్డలని బయటికి తీసేది” అన్నాడు.
ప్రశ్నలడుగుతున్న వ్యక్తి వెళ్ళి ఫ్రిజ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకు వచ్చి మూత తీసి నీళ్ళని ఆమె నోట్లో పోసాడు. రెండు గుక్కలు తాగిన తరువాత ఆమె చాలు చాలు అన్నట్టుగా సైగ చేసింది.
సీసా పక్కన పెట్టి “చెప్పు” అన్నాడతడు.
“మీ ధోరణి మీదే కానీ నా మాట వినిపించుకోరా? నా దగ్గర డైమండ్స్ ఎందుకు ఉంటాయి? మీకు ఎవరు కావాలి? మీరు ఎవరనుకుని ఎవరింటికి వచ్చారో? ” అందామె. మరోసారి బలంగా ఆమె చెంప మీద కొట్టాడు అతడు.
“మేమంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా? నీ పేరు బంగారు లక్ష్మి. సేల్సు టాక్స్ ఆఫీసులో పని చేస్తావు. నీ స్నేహితురాలు ఇంద్రనీల. పోలీస్ ఇన్స్పెక్టర్. చాలా ఇంకా చెప్పాలా?”
స్థాణువులా చూస్తూ ఉండిపోయింది బంగారు లక్ష్మి.మరోసారి ఆమె దవడ మీద గట్టిగా కొట్టి అన్నాడు అతడు “ఇప్పుడు చెప్పు? వజ్రాలు ఎక్కడ ఉన్నాయి?”
“నాకు వజ్రాల గురించి తెలియదు” అంది ఆమె.
మరోసారి ఆమె మీద చెయ్యి చేసుకుని అన్నాడతడు “నీకు మా గురించి తెలియదు”
కోపంగా మరోసారి ఆమెని కొట్టబోతుంటే “గురూ... ఆపు గురూ... ఆమె స్పృహ తప్పినట్టుంది” ఖంగారుగా అన్నాడు కుర్చీని పట్టుకున్న వ్యక్తి.
ఆమె తలని మరోసారి పైకెత్తి చూస్తే, మళ్ళీ క్రిందకి వాలిపోవడంతో, ఆమెకి స్పృహ తప్పిందన్న విషయం అర్ధమైంది వాళ్ళకి.
“ఇది గానీ చస్తే మనకే చాలా ప్రమాదం. ఆ వజ్రాలు దీని దగ్గర ఉన్నాయి. అవెక్కడున్నాడో తెలుసుకోకుండా దీన్ని చంపితే బాస్ మనల్ని చంపేస్తాడు” అన్నాడు నోట్లో గుడ్డలు కుక్కిన వ్యక్తి.
“మరేం చేద్దాం?”
“చేసేదేముందీ? దీనికి స్పృహ వచ్చే వరకూ ఎదురు చూడ్డమే” ప్రశ్నలడుగుతూ ఆమెని కొట్టిన వ్యక్తి అన్నాడు.
“అంత సేపూ మనం ఇక్కడ ఉంటే ప్రమాదకరం. ఎలాగోలా దీన్ని ఇక్కడ్నించి తీసుకుపోదాం” అన్నాడు.
“మీరు ఇద్దరూ వెళ్ళి బయట ఎవరూ లేకుండా చూడు. మేము దీన్ని తీసుకు వస్తాం”
ఇద్దరు వ్యక్తులు బయటకి వెళ్ళి సైగ చెయ్యగానే, మిగిలిన ఇద్దరూ ఆమెని బయటకి తీసుకొచ్చేసారు. వస్తూ వస్తూ ఆమె సెల్ ఫోన్ని కూడా తీసుకొచ్చాడు ప్రశ్నలడిగిన వ్యక్తి.
“అదెందుకు?” అన్నాడు అతడి కూడా ఉన్న వ్యక్తి.
“మనకి ఆట్టే సమయం లేదు. దానికి స్పృహ వచ్చి మూడ్ మార్చుకుని మనకి సహకరిస్తే ఈ సెల్లో ఎవరివైనా నెంబర్లు దానికి అవసరం అవచ్చు. అప్పుడు ఈ సెల్ కోసం ఇక్కడికి రాలేం కదా” అంటూ స్విచాఫ్ చేసిన ఆ సెల్ ఫోన్ని ఆమె దుస్తుల్లో వేసాడు.
అదే అతడు చేసిన అతి పెద్ద పొరపాటని అతడికా క్షణంలో తెలియదు !!
నాదైన ప్రపంచం - సూర్యదేవర రామ్ మోహన్ రావు
మీ రచనలు పంపవలసిన చిరునామా : |
లోకహితం: కీరా దోసకాయ
కీరా దోసకాయ
ఆయుర్వేదం కీరా కి చాలా దగ్గరి సంబంధం ఉంది.
పిత్త దోషం ని నియంత్రించడానికీ చాలా ఉపయోగకరమైన ఔషధం.
కీరా తో మధుమేహం, రక్త పోటు, క్యాన్సర్, ulcer, నోటి దుర్వాసన సమస్యలు తగ్గించవచ్చు.
మరియు అమ్మాయిలు బరువు తగ్గడం గురించి ఏవేవో చేస్తారు కానీ కీరా ఒక దివ్య ఔషధం అని తెలీదు.
ఇవే కాకుండా vit A, B1,B6,C మరియు D ఉన్నాయి.
పొటాషియం, మెగ్నీషియం మెండుగా లభించు ఔషధం.
ఇన్ని గుణాలు ఉన్న ఈ కీరా మన ఇంట్లో మన తో పెరిగే దివ్య ఔషధం.
ఈమెయిల్ ద్వారా చందాదారులు కండి
ఈ వారంలో అత్యధిక పాఠకులు చదివిన అంశం
స్వాతంత్య్రం వచ్చింది.. సాధించిందేమిటి?
దేశ సంరక్షణ, సమృద్ధి, ప్రజా సంక్షేమం కోసం యువత ముందుండి పని చేయాలి
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ఈ సంచికలో >> సినిమా >>
జక్కన్న 'బాహుబలి 2' మొదలెట్టేశాడు
ఎట్టకేలకు 'బాహుబలి 2' సినిమా సెట్స్ మీదకెళ్లింది. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. చకచకా సినిమా నిర్మాణం జరగనున్నట్లు సమాచారమ్. ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పలు బాలీవుడ్ ప్రముఖులు కూడా నటిస్తున్నారని సమాచారమ్. 'బాహుబలి' బిగినింగ్కి బాలీవుడ్ ఫిదా అవడంతో, పలువురు బాలీవుడ్ ప్రముఖులు 'బాహుబలి' రెండో పార్ట్లో నటించడానికి ఉత్సాహం చూపుతున్నారు.
అయితే రాజమౌళి, 'బాహుబలి' రెండో పార్ట్లో నటించే అదనపు స్టార్ కాస్ట్ గురించి ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ప్రభాస్, ఇతర తారాగణంపై గురువారం నుండీ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేయనున్నారట. జనవరి 13 వరకూ ఆక్కడే షూటింగ్ జరుగుతుందట. సంక్రాంతి తర్వాత రాణా సెట్స్లోకి వెళతాడట. భారీ సెట్టింగులతో వచ్చిన 'బాహుబలి ద బిగినింగ్'కు ధీటుగా ఉండేలా 'బాహుబలి ది కన్క్లూజన్' ఉండబోతోందట. అందుకు తగ్గట్టుగానే చిత్రబృందం సెట్స్ రెడీ చేస్తుందట. 'బాహుబలి 1'తో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. ఈ సినిమాతో రాజమౌళి మరో సారి ఆ ఖ్యాతిని పపంచస్థాయిలో మార్మోగేటట్లు చేయడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
మరిన్ని సినిమా కబుర్లు
'రోబో-2'లో నటిస్తున్నా: అక్షయ్కుమార్
చెప్పుకోండి చూద్దాం
మీ రచనలు పంపవలసిన చిరునామా :
ముంబయి వెండి ధరలు (18th Nov 2018), ఈరోజు కేజీ వెండి ధర
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
హోం » వెండి ధరలు » ముంబయి
ముంబయిలో వెండి ధర (18th November 2018)
ఈరోజు వెండి ధర ముంబయి - గ్రాము వెండి ధర రూ.
వెండి ధర ప్రతి రోజూ
ముంబైలో బంగారం ధర చెక్ చేయండి
గత పది రోజులుగా భారత్లో వెండి ధరలు
తేదీ 10 గ్రాము 100 గ్రాము 1 కేజీ
వారం & నెల వెండి గ్రాఫ్ ధరలు %s
అత్యధిక ధర May Rs.43,800 on May 12
అత్యల్ప ధర May Rs.42,000 on May 2
గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న వెండి ధరలు. GoodReturns.in అందించిన సమాచారం వెండి ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన వెండి కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన వెండి సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.
భారత్లోని నగరాల్లో బంగారం ధర
అహ్మాదాబాద్లో బంగారం ధర
బెంగుళూరులో బంగారం ధర
చెన్నైలో బంగారం ధర
ఢిల్లీలో బంగారం ధర
హైదరాబాద్లో బంగారం ధర
జైపూర్లో బంగారం ధర
కేరళలో బంగారం ధర
ముంబైలో బంగారం ధర
నాగ్పూర్లో బంగారం ధర
సిల్వర్ రేటు భారతదేశం యొక్క టాప్ నగరాల్లో
హైదరాబాద్లో వెండి ధర
జైపూర్లో వెండి ధర
నాగ్పూర్లో వెండి ధర
వైజాగ్లో వెండి ధర
వెండి సంబంధిత వ్యాసాలు
బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.
అక్షయ త్రితీయ రోజు బంగారం ఎందుకు కొంటారు ?
ఇన్సూరెన్స్ను కొనండి |
మంత్రి కేటీఆర్ కు అపూర్వ గౌరవం
దావోస్ సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్కు అపూర్వమైన గౌరవం దక్కింది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో భాగంగా పలు దేశాల ఉప ప్రధానులు, మంత్రులు పాల్గొన్న లివరేజింగ్ డిజిటల్ టు డెలివర్ వాల్యూ టు సొసైటీ అన్న అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్యానెలిస్టులంతా ఆయా దేశాల కేంద్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యవ వహించగా, మంత్రి కేటీఆర్ ఒక్కరికే ఒక రాష్ట్ర మంత్రిగా ఇందులో పాల్గొనే అవకాశం దక్కడం గమనార్హం. మంత్రి తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమం గురించి వివరించారు. ఇందులో భాగంగా మిషన్ భగీరథతోపాటు ప్రతి ఇంటికీ ఫైబర్ ఆఫ్టిక్ కేబుల్ సౌకర్యం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా కల్పిస్తున్నామని, ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్ మాధ్యమాల ద్వారా అందజేస్తున్నామన్నారు. అట్లాగే డిజిటల్ అక్షరాస్యతా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. బెల్జియం, బ్రెజిల్, డెన్మార్క్, పోర్చుగల్, మయన్నార్, ఇండోనేషియా, నైజిరియా, లెబనాన్, బంగ్లాదేశ్, ఖతార్, పాకిస్తాన్ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ లో మరో బయోకాన్ సెంటర్
ఘనంగా ప్రారంభమైన బయో ఆసియా సదస్సు
రైతు సమితి కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపీ గుత్తా?
అమెరికా నుండి ప్రచారం మానుకోండి
ఫిబ్రవరి 25న నాగశౌర్య, సాయిపల్లవి, లైకా ప్రొడక్షన్స్ 'కణం' మొదటి సింగిల్
'ఛల్ మోహన్ రంగ' తొలి గీతం విడుదల
మార్చి 9న విజయ్ దేవరకొండ 'ఏ మంత్రం వేశావే'
మార్చి 2 నుండి థియేటర్స్ బంద్ కు మేము మద్ధతు ప్రకటిస్తున్నాం- ప్రతాని రామకృష్ణ గౌడ్
ఈనెల 18న 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ వేడుక
పవన్కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు. మిగిలివున్న రెండు పాటల కోసం యూరప్కు వెళ్లిన చిత్రబృందం అక్కడ వాటి చిత్రీకరణ పూర్తిచేసింది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. మరోపక్క నిర్మాణానంతర పనులు తుదిదిశకు చేరుకున్నాయి. ఒక పాట తర్వాత మరొక పాటను విడుదల చేస్తున్న చిత్రబృందం మూడోపాటను విడుదల చేసింది. వీటన్నింటికీ విశేషమైన ఆదరణ లభించిందని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ నెల 18న ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు, సినిమాను ఇదేనెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కిషోర్కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో నార్త్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ నాయికగా నటిస్తుండగా, ఇతర ప్రాతల్లో శివబాలాజీ, కమల్ కామరాజు, అజయ్, ఆలీ, నాజర్, రావు రమేష్, వేణుమాధవ్, తరుణ్ అరోరా, చైతన్యకృష్ణ, మణికంఠ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఛాయగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రుబెన్స్, ఎడిటింగ్: గౌతంరాజు.
వెల్ కం టు న్యూయార్క్ ట్రైలర్ విడుదల
నిఖిల్ 'కిరాక్ పార్టీ' తొలి పాట... విడుదల
బంగారు తెలంగాణ కోసం ఎన్ఆర్ఐలు కృషి చేయాలి
స్విట్జర్లాండ్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాఖ ఆవిర్భావము
స్విట్జర్లాండ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందం
వర్గం:ఎడారులు (te kalba)
మా నాన్నకు సలాం!
మా నాన్నకు సలాం! నా రెక్కలు విరగగొట్టకుండా.. నన్ను స్వేచ్ఛగా ఎగరనిచ్చినందుకు మా నాన్నకు ధన్యవాదాలు - నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటూ పాక్ బాలిక మలాలా చేసిన వ్యాఖ్యలివి. మతఛాందసవాదంతో కళ్లుమూసుకుపోయిన తాలిబన్లను ఎదిరించినందుకు.. తన తండ్రి తనను ఏమీ అనలేదని, పైగా తనకు ఎంతో స్వేచ్ఛనిచ్చారని చెప్పింది మలాలా. దానివల్లే తాను తాలిబన్లతో పోరాటం చేయగలిగానంది.
60 ఏళ్లుగా నిమజ్జనం కానీ వినాయకుడు - TELUGU NEWS
Home తెలుగు Telugu News వైరల్ అవుతున్న బన్నీ, నానీల వీడియో
అల్లు అర్జున్, నానీల కామన్ ఫ్రెండ్ వివాహానికి ఈ ఇరువురు సతీసమేతంగా హాజరయ్యారు. హాజరవ్వడమే కాదు.. నాని పాటలు పాడుతుంటే బన్నీ డ్యాన్స్ కూడా చేశారట. అల్లు అర్జున్, నాని లు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తుంటారు. ఎక్కడ ఉన్నా సరే వారి స్నేహితుల వివాహాలకు, వారి ఇంట్లో జరిగే వేడుకలకు హాజరవుతుంటారు.
ఉప్పెనంత ఈ ప్రేమకి అనే సాంగ్ ప్లే అవుతుంటే.. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి స్టెప్పులు వేశాడు. నినుకోరి సినిమాలోని అడిగా అడిగా సాంగ్ ను నాని పడుతుంటే ఆయన సతీమణి స్టెప్పులు వేసింది.
బన్నీ, నానీలు కలిసి ఎటో వెళ్ళిపోయింది మనసు.. ప్రియతమా నీవచట కుశలమా.. అనే సాంగ్స్ పాడుతూ అక్కడ ఉన్నవారిని ఉత్సాహ పరిచారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Terminal 1C _ హరే చిత్రాలు
ఒకే వేదికపై బాబాయి-అబ్బాయి __ Balakrishna, Jr NTR, Kalyan Ram at Aravinda Sametha Success Meet |
రానున్న ఎన్నికల్లో ఎన్డీయే ఓటమే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించామని ఆయన తెలిపారు. ఎన్డీయే ఓటమే లక్ష్యంగా కలసి వచ్చే అన్ని పార్టీలతో కలసి ముందుకెళతామని చెప్పారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. దక్షిణాదిలోని అన్ని పార్టీలు ఏకం కావాలని చెప్పారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కుమారస్వామితో భేటీ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. వంద రోజుల పాలనను పూర్తి చేసుకోనున్న కుమారస్వామి... తమ భాగస్వామ్య కాంగ్రెస్ నేతల నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు, కాంగ్రెస్ నేతలతో ఇబ్బందులపై త్వరలోనే చర్చిద్దామని కుమారస్వామికి చంద్రబాబు తెలిపారు.
లైఫ్ స్టైల్
ఢిల్లీలో మొదలైన ప్రత్యేక హోదా సెగ..!
‘తల్లి బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటి’…?
Home Home డీజే రివ్యూ: అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధం (డీజే)”… హరీష్ శంకర్ మరోసారి హిట్ కొట్టారా..?
డీజే రివ్యూ: అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధం (డీజే)”… హరీష్ శంకర్ మరోసారి హిట్ కొట్టారా..?
Movie Title (చిత్రం): డీజే – దువ్వాడ జగన్నాధం (DJ- Duvvada Jagannadham)
• నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్దె, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి, రావు రమేశ్ తదితరులు.
• సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
• నిర్మాత: దిల్ రాజు ( శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
• దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
ఓ పాలెస్ లో వంట వాడిగా చేస్తుంటాడు బ్రాహ్మణుడు అయిన “దువ్వాడ జగన్నాధం”. అక్కడ జరిగే ఈవెంట్స్ అన్ని అతనే చూసుకుంటూ ఉంటాడు. అలా ఒక సందర్భంలో “పూజ హెగ్డే” ను కలుస్తాడు . ఆ అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఇంతలో డీజే (అల్లు అర్జున్ డ్యూయల్ రోల్) తెరపైన కనిపిస్తాడు. అతను ఓ వెల్ఫేర్ కమ్యూనిటీ కి హెడ్. రియల్ ఎస్టేట్ లో జరుగుతున్న స్కాం పై పోరాడుతుంటాడు. న్యాయం కోరిన ప్రజలకు అండగా నిలుస్తాడు. అసలు డీజే కి దువ్వాడ జగన్నాధం కి సంబంధం ఏంటి..? పూజ హెగ్డే ప్రేమ కథ ఎలా ముగుస్తుంది? ల్యాండ్ మాఫియా చేసేది ఎవరు..? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే దువ్వాడ జగన్నాధం సినిమా చూడాల్సిందే!
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సినిమా “దువ్వాడ జగన్నాధం”. వరస హిట్లతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్, హరీష్ శంకరులకు మరో హిట్ డీజే. అల్లు అర్జున్ ఆక్టింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. గబ్బర్ సింగ్ స్టైల్ లోనే కామెడీ, మాస్ ఎంటర్టైన్మెంట్ కావాల్సిన రేంజ్ లో ఉన్నాయి డీజే లో. పంచ్ డైలాగ్స్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా బాగున్నాయి. అల్లు అర్జున్ అన్ని సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా డాన్స్ అదరగొట్టేసాడు. పూజ హెగ్డే తో కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. క్లైమాక్స్ లో ఉండే కామెడీ కి అయితే కడుపు చెక్కలు అయ్యేలా నవ్వుకుంటారు.
• అల్లు అర్జున్ ఆక్టింగ్
• పూజ హెగ్డే గ్లామర్
• హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
• దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
• హరీష్ శంకర్ డైలాగ్స్
• క్లైమాక్స్
• రొటీన్ స్టోరీ
కామెడీ, మాస్, క్లాస్, డాన్స్, రొమాన్స్ అన్ని కలిస్తే “డీజే”. సినిమా చూస్తునంత సేపు ఎంజాయ్ చేయడం పక్కా..!
Previous articleఈ కాలంలో దొరికే నేరేడు పండు తినడం వలన కలిగే లాభాలు….
Next articleభోజనం తర్వాత స్వీట్ బీడా వేసుకోవచ్చా?
హైదరాబాద్ లో మూవీ థియేటర్లో జాతీయ గీతం వచ్చినప్పుడు నిలబడలేదు అని 3 విద్యార్థులు...
శఠగోపం యొక్క ప్రాముఖ్యత… శఠగోపాన్నితప్పక తీసుకోవాల..? అది మన నెత్తిన పెట్టగానే ఏమవుతుంది…?
నీడ లేకపోవడమేంటి ? ఆ ఆలోచనే చిత్రంగా వుంటుంది కదా. ఆ ఆలోచనతోనే ఈ...
రేపటి నుంచి చలామణీలోకి రూ.200నోటు.
ఈ కష్టం మరెవరికీ రాకూడదు.! నెటిజన్ల కన్నీరు.!
పెళ్లి చూపులు, అర్జున్రెడ్డి సినిమాల గీత రచయితకు వేధింపులు…!
ఈ అమ్మాయి పాటను ఒక్కరోజులో 40 లక్షల మందికి పైగా వీక్షించారు.
కార్తీక దీపం సీరియల్ లో ఉన్న ఈ అమ్మాయి ఎవరో రియల్ గా ఎంత...
హోలీ పండుగ: హోలీ వెనక అసలు కథ ఇది…!
లైఫ్ స్టైల్50
సంతోషం సినిమాలో “నాగార్జున” కొడుకుగా నటించిన అబ్బాయి గుర్తున్నాడా..? అతను హీరోలా ఎలా ఉన్నాడో...
“రవితేజ” “రాజా ది గ్రేట్” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో) |
అమ్మాయి (ammaayi); కన్య (kanya); బాలిక (bAlika); పిల్ల (pilla) لڑکی (f) (laṛkī)
ఆడది (aaDadi); స్త్రీ (stree); మహిళ (mahiLa) عورت (f) ('aurat); ستری (f) (strī)
ఇల్లు (illu) گھر (m) (ghar)
గుర్రము گھوڑا (m) (ghoṛā)
చెట్టు پیڑ (m) (peṛ)
నమసకారం (namaskāram); బాగున్నారా (bāgunnārā) سلام (salām); نمستے (namasté); نمسکار (namaskār)
పండు (paMDu), ఫలము (phalamu) پھل (m) (phal)
పసిపాప; శిశువు بچہ (m) (baccā)
పురుషుడు (purushuDu); మగవాడు (magavaaDu) آدمی (m) (ādmī); مرد (m) (mard); پرش (m) (puruṣ)
పువ్వు پھول (m) (phūl)
బాలుడు; యువకుడు لڑکا (m) (laṛkā)
వెళ్ళు (vellu), పోవు (povu), వెళ్ళిపోవు (vellipovu) جانا (jānā)
వ్రాయు రాయు (raayu) (1), రచించు (rachiMchu) (2) لکھنا (likhnā)
సోదరి (sOdari); అక్క (akka), అక్కయ్య (akkayya) (italbrac'older); చెల్లి (celli), చెల్లెలు (cellelu) (italbrac'younger) بہن (f)
స్నేహితుడు (snEhituDu), మిత్రుడు (mitruDu) (masculine); స్నేహితురాలు (snEhituraalu), మిత్రురాలు (mitruraalu) (faminine) دوست; (m)
ముఖ్యమైన విషయాలు కంప్యూటర్ కి సంబందించి సి ప్రోగ్రామింగ్ లో స్నేక్ గేమ్ గ్రాఫిక్స్ తో ఇక్కడ నొక్కి.
తెలుగు వెర్షన్
తిక్క పిల్ల బాని గుర్తుందా.. ?మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు ‘తిక్క’ సినిమాలో హీరోయిన్ గా నటించింది బాని.’తిక్క’ లెక్క తప్పడంతో..టాలీవుడ్ లో మరో అవకాశం రాలేదు ఈ ముద్దుగుమ్మకి.దీంతో.బాలీవుడ్ పై ఫోకస్ చేసింది.అక్కడ జోరుగా ప్రయత్నాలు సాగిస్తోంది.బాలీవుడ్ జనాలకి మామూలుగా అయితే ఆనదని..ఓ ఫోటో షూట్ పెట్టి సెమీ న్యూడ్ ఫోటోలని వదిలింది.
ఇప్పుడీ తిక్క పిల్ల సెమీ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి.తిక్క పిల్ల పైపై అందాలు అదిరిపోయాయి యూత్ ఎగబడి మరీ..బాని న్యూడ్ పిక్స్ చూసేస్తున్నారు. మీరు కూడా..తిక్క పిల్ల హాట్ హాట్ పిక్స్ పై ఓ లుక్ వేయండీ..
Stage-ply : ఆట , నాటకము .
stager : ఆడేవాడు , వేషగాడు , నటి . వాడు బాగా తీరిన చెయ్యి . తపాలు గుర్రము .
యూనీటెక్ కన్స్ట్రక్షన్ కంపెనీకి భారీ జరిమానా _ V6 Telugu News
అనాధలకు AMBలో స్పెషల్ షో : పిల్లలతో కలిసి ‘స్పైడర్ మ్యాన్’ చూసిన నమ్రత
రాష్ట్ర పార్టీ నిర్మాణం బాధ్యత కేటీఆర్ దే : కేసీఆర్
విచక్షణ లేని ఫాదర్… బాప్టిజం పేరుతో హింసించాడు.. వైరల్ వీడియో
వాజ్ పేయి బొమ్మతో త్వరలో రూ.100 కాయిన్
నన్ను పులి అన్నా…పిల్లి అన్నా మీ ఇష్టం: జగ్గారెడ్డి
17న వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు
మానవుని తోలి రోజుల్లో - అంటే మానవుడు ఆదిమనవునిగా ఉన్న రోజుల్లో ఈ కొలతలు లేనేలేవు.
ఎందుకంటే ఆనాటి వాళ్ళకి ఈ కొలతలతో పనిలేదు. ఇది నాది. ఇది నీది. ఇది మనది అనే భావమే లేదు.
జంతువుల ప్రకృతిలో దొరికింది తినేవాడు. అన్నిచోట్ల తిరిగేవాడు. ఇది నీ చోటు, ఇది నా చోటు అనే భావం కూడా లేదు.
Chicken Soups(చికెన్ సూప్)
శ్రమదినమున నీవు క్రుంగినయెడల? _ Christian Messages
శ్రమదినమున నీవు క్రుంగినయెడల?
పుట్టులి in Telugu
బుంస్ పుట్ట in Telugu |
ఉపాయములో ఎలాంటి అపాయమున్నా తప్పించుకోవచ్చు. తెలివి, ఆలోచన సమయస్ఫూర్తి ఉంటే శత్రువును ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు త్రాగించవచ్చు. అలా సింహాన్ని చంపిన చిన్న కుందేలు కథ.
కష్టపడకుండా నోటి దగ్గరికి ఆహారము రావటంవలన దానికి బాగానే ఉంది. జంతువులు తమ వంతు ప్రకారము ఆహారముగా వెళుతున్నాయి. చిన్న కుందేలు వంతు వచ్చింది. మూడు సంవత్సరాలు నిండిన తనకి అప్పుడే ఆయుర్దాయము చెల్లిపోయిందని బాధపడింది. అయితే కుందేలు మిగతా జంతువుల వలె గాక తెలివిగలది, ఆలోచించగలిగింది. ఉపాయముతో అపాయము తప్పించుకోవాలని ఆలోచించసాగింది. దానికి ఉపాయము తోచింది. వెంటనే ఆచరణలో పెట్టింది. సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం వేళ దాటి పోతున్నందున కుందేలు పై మండిపడి 'ఇంత ఆలస్యము ఎందుకు జరిగింది?' అని భయంకరంగా గర్జించింది. అప్పుడు కుందేలు వినయం, భయం, భక్తితో నమస్కరించి ఇలా అంది.
"మహారాజా! నేను మామూలు వేళకు బయలు దేరాను దారిలో మరో సింహం కనిపించి నన్ను నిలదీసి గర్జించింది. తానే ఈ అడవికి మహారాజు, మరొకడు రాజు కాడు అని నన్ను తనకు ఆహారము కమ్మన్నది. నేను అతి కష్టము మీద ఒప్పించి మీ దర్శనము చేసుకుని తిరిగి వస్తానని చెప్పి వచ్చాను.
"ప్రభూ! ఆ సింహం మిమ్మల్ని ఎంతగానో దూషించింది. మీకు పౌరుషం లేదన్నది గాజులు వేసుకోమని" చెప్పింది. మిమ్మల్ని వెక్కిరించింది. ఈ మాటలు చెప్పి కుందేలు సింహం వైపు చూసింది అప్పటికే సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే కోపంగా "నేనే ఈ అడవికి రాజుని" ఎక్కడో చూపించు దానిని నా పంజాతో కొట్టి చంపేస్తా" నంటూ ఆవేశముగా కుందేలు వెంట నడిచింది. కుందేలుని తొందర చేసి బయలుదేరిన వారిరువురు పాడు బడిన బావి దగ్గరకు వచ్చారు. శత్రుసింహానికై వెదక సాగింది. ఇక ఆలస్యం చేయక కుందేలు ఇలా చెప్పింది. "మహారాజా! మిమ్మల్ని వెక్కిరించి, దూషించిన సింహం ఆనూతిలో ఉంది. వెళ్ళి చంపండి". అంది.
మూలం: అక్షరజ్యోతి.
వెనుకకు _ మొదటి పేజీ _ తెలుగుదనం బ్లాగు _ మాగురించి _ సలహాలు _ పత్రికలలో తెలుగుదనం సందర్శకుల సంఖ్య:
ఓల్డ్ బేలర్ పార్క్ లో పాత రాతి house. స్వాతంత్ర్యం, టెక్సాస్, మార్చ్ 31, 2010.
కేసీఆర్ పై పవన్ కళ్యాణ్ సెటైర్లు
మహాత్మ గాంధీ
“మేధావులు మాట్లాడుతారు…. మూర్ఖులు వాదిస్తారు“
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనా పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. ఇటీవల తనను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అన్న దుకాణం బంద్ అయింది, రాజకీయాల్లోకి మరో సినీ వ్యక్తి వస్తున్నాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆవిర్భావ సభలో అచ్చు కేసీఆర్ స్టయిల్లోనే ఆయన మాటలను ఆయనకే అప్పగించారు పవన్.
ఆంధ్రప్రదేశ్ జాతీయం-అంతర్జాతీయం తెలంగాణ సినిమాలు Top Stories Breaking News బ్లాగులు క్రీడలు బిజినెస్
14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ |
పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : మిత్రుడు మిగిల్చిన అనుభవాలు.. జ్ఞాపకాలు..
మిత్రుడు మిగిల్చిన అనుభవాలు.. జ్ఞాపకాలు..
ఈ వ్యాసాలు చదువుతుంటే ..
అప్పుడే ఎందుకు పుట్టలేదా..
మా కన్నా వారే ఎంత అదృష్ట వంతులో కదా..
అన్న విచారమూ కలుగుతోంది..
మేము కూడా పూర్వ జన్మలో ..
మా వయసు ప్రలోభాలు..
కానీ ఇప్పుడు ..
మా సర్వ శక్తులనూ వత్తులుగా చేసి ..
మిత్రుడు మిగిల్చిన ..
డా. వి. రామమూర్తి "రేణు"MA,Dlit
అసలైన సిసలైన ..
ఆయన సాహితీ స్వరూపం..
ప్రేమ ..మధుర భక్తి మందాకినిలో..
ఇది ఏమాత్రమూ పొగడ్త అనిపించదు..
శ్రీ నారాయణచార్యులతో నాకు గల పరిచయం..
ఆత్మీయత ..అనురాగాలు ..
ఈనాటివి కావు.
ఓ పర్యాయం ఆయన గుంటూరు వచ్చారు..
ఏదో సభలో పాల్గొనటానికి.
ఆ రోజుల్లో ..
హిందీ ఉపాధ్యాపకుడిగా వున్నా..
కీ.శే . శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ ..నేను ..
ఒకే ఇంట్లో ..
శ్రీ శర్మ నన్ను తన వెంట సభకు తీసికెళ్ళారు.
ఆయన తన శివతాండవంలోని కొన్ని భాగాలు..
తన్ను తానే మరచినట్లు గానం చేసారు.
నా మనస్సు మీద ఆనాడే..
ఆయన వ్యక్తిత్వం చెరగని ముద్ర వేసింది.
ఆ రాత్రంతా..
సాహిత్య గోష్టితో గడిచింది.
ఆయన వ్రాసిన సాక్షాత్కారం..
శ్రీ రామ చరితమానసం..
మా ఇద్దరి హృదయాలు ఏకమయ్యాయి.
అంత హృద్యంగా ..,అనవద్యంగా..,
నాకు తెలిసినంతవరకూ ..
హిందీ కవి కూడా నిబధ్ధించలేదు.
మహాకవి "నిరాలా" ..
తన తులసీదాసనే ..
తులసీ హృదయ పరివర్తనను మాత్రమే..
అద్భుతంగా వర్ణించాడు.
అడుగడుగునా భావించి..
పారాయణం చేసిన ..శ్రీ వైష్ణవుని నోట..
హరి హర నాధునకు ..
అక్షర దేవాయతనం నిర్మించిన తెలుగు గడ్డ మీద..
సాధారణం కాకపోయినా..
అసహజం కాదు.
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ శ్రీ చరణుల..
ఆయన తమ్ముడూ..
నన్ను అనుజునిగా ..
మన అనుబంధం..
మరపునకు రావు.
శ్రీ పరమాచార్యుల శ్రీ చరణాలవిందాల వద్ద ..
దాదాపు 35 నిమిషాలు..
"శ్రీశైల క్షేత్రం-శివరాత్రి" అనే ఉపన్యాసాన్ని ..
నేను రికార్డు చేసి చరితార్థుణ్ణయినాను.
శ్రీ నారాయణాచార్యుల ప్రతిభ ..
ఆంధ్ర రాష్ట్రపు టెల్లలను గూడ దాటి ..
ఉత్తర ప్రదేశ్ లో..
నైనిటాల్ లో నిర్వహించిన..
తెలుగు భాషకు సంబంధించిన ..
ఒక ప్రముఖ ప్రతినిధి కవిని కూడ ...
ఆ ఉత్తమ మైన నిర్ణయాన్ని తీసికున్నందుకు..
15 రోజులు సాగిన ఆ సాహిత్య గోష్టుల తర్వాత..
ఆ శిబిరానికి ..
భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన దిగ్దంతులెందరో హాజరయ్యారు.
మొదలైన వారెందరో వచ్చారు.
అప్పుడు దినకర్ జీ ..
అని ఆహ్వానించారు
ఆ నగాధిరాజ ప్రాంగణంలో ..
దాదాపు అరగంటసేపు సాగిన ఆ కావ్య గానం ..
ఒకనాడు అప్పటి ముఖ్యమంత్రి ..
మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు.
ఆయన కోరిక మేరకు ..
ఆ చోట చేరి కవులందరూ ..
తమ తమ భాషా కవితలను వినిపించారు.
శివ తాండవం లోని ..
"వాహ్ ..వాహ్.. కైసీ అద్భుత్ రచనాహై ..
అని మౌఖికంగా తమ ఆనందం ప్రకటించారు.
అలాంటిదీ శ్రీ పుట్టపర్తి వ్యక్తిత్వం.
మాత్రమే మనకు వదలి ..
నా నెచ్చెలి వెళ్ళి పోయాడు.
ఆ సరస్వతీ పుత్రుని ..
సంస్థలు తమ ఉనికిని స్థార్థకం చేసుకున్నాయి.
మాత్రమే సంక్రమించే..
పెద్ద పెద్ద సమ్మానాలు..
ఆయన అదృష్టమే..
ఆయన అక్షర శరీరం.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Puttaparthi Anuradha వద్ద 12:24 AM
వ్యాఖ్యలు లేవు :
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి ( Atom )
సరస్వతీపుత్ర.. మహాకవి.. పద్మశ్రీ..డాక్టర్.. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి సంగీత..సాహిత్య.. ఆధ్యాత్మిక..జీవిత మథనం..నా శక్త్యానుసారం..ఈశ్వరానుగ్రహం మేరకు..పుట్టపర్తి అనూరాధ9032796394.. భక్తి పూర్వక సమర్పణ..>
'సాక్షాత్కారము' నుంచీ.. ( 6 )
అగ్నివీణ ( 2 )
అభిమానధనులు ( 9 )
అష్టాక్షరీ కృతులు ( 2 )
ఆంగ్ల వ్యాసాలు ( 7 )
ఇంటర్వ్యూలు ( 4 )
ఇతరాలలో పుట్టపర్తి వ్యాసాలు ( 11 )
కబీరు వచనావళి ( 4 )
కావ్యద్వయి ( 8 )
చిత్ర కవితా గీతికలు ( 24 )
జీవన చిత్రాలు ( 99 )
తొలిపలుకు ( 2 )
పండరీ భాగవతం పద్యాలు ( 2 )
పండరీ భాగవతము ( 1 )
పుట్టపర్తి చమత్కార విన్యాసం ( 12 )
పుట్టపర్తి పై ప్రముఖుల అభిప్రాయం ( 77 )
పుట్టపర్తి భావ లహరి ( 97 )
పుట్టపర్తి వారి అమూల్యమైన గ్రంధాలు Pdf ( 8 )
పుట్టపర్తి వారి అమూల్యమైన గ్రంధాలు Pdf లో ( 30 )
పెనుగొండలక్ష్మి ( 1 )
ప్రముఖులపై పుట్టపర్తి అభిప్రాయం ( 16 )
బ్లాగుపై ప్రశంశలు ( 3 )
మేఘదూతము ( 8 )
శివతాండవము ( 6 )
సరస్వతీపుత్రుని పాద్యము ( 68 )
ప్రముఖ పోస్ట్లు
(శీర్షిక లేని)
శివ తాండవ కావ్య గుణములు..శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి
శివతాండవం పలికిన అయ్య నోట.. కృష్ణ లీలలు.. అయ్య నోట వినాలని వుందని కోరారు.. అదేవిటో మీరూ చూడండి. అయ్య శివతాండవం.. 1961 లో శ్రీ పాద గోపా...
బాహుబలి చూశాను మొదటిసారి చాలా బాగుందనిపించింది. యుద్ధ సన్నివేశాలు భలే ఉన్నాయండీ మీరు చూడాలి అసలు .. అని మళ్ళీ మా ఆయన్ను లాక్కు పోయ...
ఒకసారి మా అయ్యతో సినిమా నిర్మాత ఎం.ఎస్. రెడ్డి కూతురు పెండ్లికి పోయాం మద్రాసులో .. నేను చిన్నదాన్ని పదో పన్నెండో వయసు.. వా...
ఒంటరి తనం గెలిచిందా.. ఓడిందా.. ?? |
ఒంటరి తనం గెలిచిందా.. ఓడిందా.. ?? మరి మన ఋషులు వానప్రస్థం అంటూ ఏకాంతంలోకి వెళ్ళిపోయేవారు కదా.. మిగిలిన ఒంటరితనాన్ని ఆత్మ ...
ఒకసారి.. ఒకసారేమిటి .. తరువాత చాలాసార్లు.. అమ్మ అయ్య నేను.. జిళ్ళెళ్ళమూడి వెళ్ళాం.. అప్పుడు నాకు పది పన్నెండేళ్ళుంటాయేమో.. చివరిదాన్న...
జ్యోతిషము జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త...
'రాస్కోరా సాంబా,,'
శ్రీ గరికపాటి వారు ''నవరస భరితం నా తెలుగు పద్యం'' అన్న అంశం మీద తణుకు నగరంలో 2014 ఏప్రిల్ 3న మాట్లాడుతూ.. వీరరసాని...
నా అందమైన జ్ఞాపకం
మా అయ్య నా చిన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా స్టూడెయో కు తీసుకెళ్ళి తీయించిన ఫొటో మెళ్ళో దండ పక్కన చిన్న కుక్క బొమ్మ..చేతిలో పూల బుట్ట.. మా అయ్య అలంకరణ
పుట్టపర్తి వారి చాటువులు..
పుట్టపర్తి వారి చాటువులు..వంశీ గారికి కృతజ్ఞతలతో..
neomistyle ద్వారా థీమ్లు. Blogger ఆధారితం. |
ప్రేమికులు మరియు హింస
100% ఉచిత పోర్న్ వీడియోలు, సెక్స్ కంటెంట్
ప్రధాన (current)
యాదృచ్ఛిక వీడియో
మరింత anal sex వీడియోలు Free porn videos చూపిస్తుంది. అత్యంత ప్రజాదరణ 9 / 1.000.000+ వీడియో కేవలం
వీడియోలు కేతగిరీలు నుండి దాచిన కెమెరా, అభిమానులు, ఉక్కిరి బిక్కిరి చెయ్యి, మంచి నాణ్యత లో వీడియో పేరు ఈ వీడియో ప్రేమికులు మరియు హింస watch now!
మంచి నాణ్యత లో వీడియో ఉక్కిరి బిక్కిరి చెయ్యి అభిమానులు దాచిన కెమెరా
వీడియో పని లేదు
భాగస్వామ్యం, సామాజిక నెట్వర్క్లు
అభిమానులు మరియు గేమ్ ఆన్లైన్ బాలికలకు గురించి ప్రేమ మరియు సెక్స్
యువ మరియు పాత రష్యన్ పోర్న్
పరిపక్వ మరియు ఉత్తమ వాచ్ సినిమాలు
Orgasms మరియు శృంగార వీడియో మెయిల్ చౌక
ప్రముఖ వీడియో
పోర్న్ స్టార్ డౌన్లోడ్ పోర్న్ వీడియోలు మీ ఫోన్ 3qp
పట్టీని మరియు ఫక్ ఒక సెక్స్ బొమ్మ
స్వచ్ఛమైన లోపల మరియు వాచ్ ముడ్డి వీడియోలు
కాక్ పీల్చటం మరియు డౌన్లోడ్ ఛార్జ్ లేకుండా porn videos
ఆత్మవిశ్వాసం కుడుచు మరియు యువ మరియు పాత free porn
వీడియో ఉంది. మంచి నాణ్యత మరియు ఫోటోలు కొవ్వు whores
వీడియో ఉంది. మంచి నాణ్యత మరియు ఆన్లైన్ కుమారుడు తల్లి Fucks
ప్రేమికులకు మరియు సంగీత డౌన్లోడ్ సినిమా నుండి dudes ఉచిత
తీవ్రమైన మరియు neskachivaemym porn videos
మరియు వాచ్ పోర్న్ వీడియోలు ఇప్పుడు
పెద్ద గాడిద మరియు transvistitom ఆన్లైన్
మోసం వీడియోలు సినిమాలు హార్డ్ ఉచిత పోర్న్ ప్రివ్యూ
వయోజన మాత్రమే
18+ పెద్దలు కోసం మాత్రమే 18+! If you are under 18 వదిలి ఈ సైట్ వెంటనే!
నుండి అభిప్రాయాన్ని మద్దతు సైట్
ఇక్కడ వెతకండి
ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి వెలువడిన మొట్టమొదటి పరిశోధనా గ్రంథమిది. అప్పట్లో రామ నరసింహంగారిని "డాక్టరుగారూ" అని అభిమానంగా పిలిచేవారట.
ప్రబంధం అనేది తెలుగువారి సొత్తు.ఈ ప్రక్రియ ప్రారంభించడం వల్లనే రాయలు పెద్దన్నను ఆంధ్ర కవితా పితామహా అన్నారు. సంస్కృత శ్రవ్యకావ్య,దృశ్యకావ్య లక్షణాలను రెంటినీ ఒక్కదగ్గర చేర్చిన ప్రక్రియ ప్రబంధం. అటువంటి ప్రబంధం యొక్క పుట్టుక, పెరుగుదల మొదలైన సకల విషయాలూ ఇందులో చదివి తెలుసుకోవచ్చు.
భారతీయ సంస్కృతి
నేరుగా మీ Mail Box లోకి టపాలు రావాలంటే నమోదు చేసుకోండి ......
సొంపు • (sompu) ? (plural సొంపులు) |
గ్రామీణాభివృద్ధి పథకాలు
రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పేర్కొన్న విధులను నెరవేర్చడానికి కేంద్రంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖను 2004, మే 27న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నది.
రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ యోజన (ఆర్జీఎస్వై):
-రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థల్లో సామర్థ్య పెంపుదల, శిక్షణా కార్యక్రమాలకోసం దీన్ని ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రజలకు లబ్ధిచేకూర్చే ఈ పథకం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. వెనుకబడిన ప్రాంతాల మంజూరి నిధి (బీఆర్జీఎఫ్) పథకం అమలుకాని జిల్లాల్లో దీన్ని అమలుచేస్తారు.
-పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా 2008లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
-ఈ పథకం ద్వారా మహిళలను సంఘటితం చేసి వారి సమస్యలను సమర్థవంతంగా వ్యక్తపరిచే సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తారు. వారి సాధికారత కోసం వ్యవస్థాగతమైన వ్యవస్థను ఏర్పాటు చేసి, వారి అభివృద్ధిలో ప్రధాన విధానాలు, వాటి ప్రాముఖ్యతను సమీకృతం చేస్తారు.
గ్రామీణ వ్యాపార కేంద్రం (ఆర్బీహెచ్):
-గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధిచేసి శీఘ్రగతిన గ్రామీణాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా రూరల్ బిజినెస్ హబ్స్ పథకాన్ని 2007లో ప్రారంభించారు.
-గ్రామీణ ప్రజలు లబ్ధిపొందే ఈ పథకం ద్వారా మొదట జాతీయంగా లేదా అంతర్జాతీయంగా మార్కెట్లలో నాణ్యతగా కావలసిన ఏ వస్తువును గ్రామం నుంచి ఉత్పత్తి చేయవచ్చో గుర్తిస్తారు. తద్వారా గ్రామీణ ఉత్పత్తులను పెంచి మార్కెట్లకు తరలిస్తారు.
-పంచాయతీ వ్యవస్థలకు అధికారాలను బదలాయించి వాటిని బలోపేతం చేయడానికి ఈ పథకాన్ని 2005-06లో ప్రవేశపెట్టారు.
-ప్రకరణ 243జీ ప్రకారం 11వ షెడ్యూల్లోని 29 విధులను గ్రామపంచాయతీలకు బదలాయించడం, విధులు, నిధులు, సిబ్బంది సమస్యలను అధిగమించడం, పంచాయతీ వ్యవస్థల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించి సమర్థవంతంగా పనిచేసేలా ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
గిరిజనప్రాంతాల్లో స్థానిక సంస్థలు (పీఈఎస్ఏ):
-షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ చట్టాన్ని విస్తరించడం కోసం పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ (పీఈఎస్ఏ) ఈ చట్టాన్ని 1996, డిసెంబర్ 24న తీసుకొచ్చారు. దిలీప్ సింగ్ భూరియా కమిటీ సిఫారసుల ఆధారంగా దీన్ని రూపొందించారు.
-స్థానిక గిరిజన సాంప్రదాయాలను గౌరవిస్తూ గ్రామ సభకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
-ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలోని 9వ భాగంలో ఉన్న విషయాలను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరింపచేస్తారు.
ఈ-గవర్నెన్స్
-సమాచారాన్ని పౌరులకు చేరవేయడం కోసం, ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజలు భాగస్వాములను చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2006లో జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళికను ప్రారంభించింది.
-ప్రభుత్వ సేవలను ప్రజలకు స్థానికంగా అందేలా చూడటమే కాకుండా, పారదర్శకతతో ఆ సేవలను అందించడం దీని ప్రధాన ఉద్దేశం.
-దీనిద్వారా పంచాయతీల అంతర్గత పనుల విధానాలను ఆటోమేటిక్ చేయడం, పౌరులకు అందించే సేవలను అభివృద్ధిపర్చడం, పంచాయతీ అధికారుల సామర్థ్యం పెంచడం, స్థానిక ప్రభుత్వాల పరిపాలనను అభివృద్ధిపర్చవచ్చు.
-గ్రామాలకు, పట్టణాలకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి, 1000 మందికిపైగా జనాభా ఉన్న గ్రామాల్లో సాగు, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, రహదారులు మొదలైన వసతులను కల్పించడంకోసం 2005, డిసెంబర్ 16న ఈ పథకాన్ని ప్రారంభించారు.
-గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనులకోసం కూలీలు వలసలు పోకుండా తగ్గించడంలో ఇది ప్రధానపాత్రపోషిస్తుంది.
రాజీవ్గాంధీ పంచాయతీ సశక్తీకరణ్ అభియాన్:
-పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడంకోసం 2009లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
-ఈ పథకం ద్వారా సామర్థ్య నిర్మాణం, విజ్ఞాన సృష్టి కోసం సమగ్రమైన అంశాలను బలోపేతం చేస్తారు.
-నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేంవర్క్ ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు ఎంపికైన ప్రజాప్రతినిధులకు, అందులో పనిచేసే సిబ్బందికి తగిన శిక్షణ అందిస్తారు.
-రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడ్డీ, ప్రణాళికా సంఘం నిబంధనల ప్రకారం తయారుచేయాల్సిన వికేంద్రీకృత ప్రణాళికా విధానాన్ని వ్యవస్థీకృతం చేస్తారు.
-ఈ పథాకానికి అవసరమైన సలహాలు, సూచనలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రుల అధ్యక్షుడిగా ఏర్పాటుచేసి సెంట్రల్ స్టీరింగ్ కమిటీ చేస్తుంది. దీంతోపాటు పథకం అమలును పర్యవేక్షిస్తుంది.
-పేదరిక నిర్మూలనా కార్యక్రమాలను అమలు చేయడం, వాటిని పర్యవేక్షించడానికి 2000లో గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంఘం (సెర్ప్) పథకాన్ని ప్రవేశపెట్టారు.
-కమ్యూనిటీ ఆధార సంస్థలను పటిష్టం చేయడానికి సెర్ప్ కృషి చేస్తుంది.
-గ్రామ సభల ద్వారా భాగస్వామ్య అవసరాల గుర్తింపు పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమాల అమలులో సామర్థ్యాల నిర్మాణ సంఘాలను ఏర్పాటుచేసి వాటిద్వారా స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ సంఘాలు, మహిళా సమాఖ్యలను బలోపేతం చేస్తుంది. |
రాజ్యాంగం (rājyāṅgaṃ)
రాజ్యాంగము • (rājyāṅgamu) ? (plural రాజ్యాంగములు)
చిన్న జీయర్ స్వామి వారి ధనుర్మాస ప్రవచనం · Telanganaheadlines.in
తెలంగాణ ప్రజల చేతికి చిప్పే : షబ్బీర్ అలీ
తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది:కేసీఆర్
చిన్న జీయర్ స్వామి వారి ధనుర్మాస ప్రవచనం
December 16, 2016 December 16, 2016 admin dhanurmasam.chinna giyar swamy., tiruppavai, చిన్నజీయర్ స్వామి, తిరుప్పావై, త్రిదండి, ధనుర్మాసం
ప్రకృతిని నీళా అని అంటారు, అందమైన ఆ ప్రకృతిలో పరమాత్మ పవళించి అణువణువునా ఉంటాడు. ఇంత అందమైన ప్రకృతిని చూసి అందరం ఆనందిస్తాం, కాని దాని వెనకాతల కారణభూతుడైనవాన్ని ఎప్పుడైనా గుర్తిస్తున్నామా అనేది సంశయమే!!. ఇలాంటి మన ప్రవృత్తికి విసిగి, ఎవరి ఆదరణ లేక చివరికి ఆయనకూడా నీళా వక్షసీమలో మగ్నమై ఉన్నాడు. గోదాదేవి ప్రకృతిలో అంతర్గతమైన ఆ కృష్ణున్ని లేపింది. మనకూ ఆయనకు ఉండే సంబంధాన్నిఆయనకు నేర్పింది. మనకు దూరంగా ఉండే పరమాత్మను, మనలో నిండి ఉన్న పాపాలను కనబడకుండాచేసి, ఆయనకున్న స్వతంత్రతను పక్కకు జరిపి, ఇద్దరిని దగ్గరికి చేసి మురిసింది. మనలో ఆయనను కలిసి ఉండేట్టుగా చేసింది. పారార్థ్యం అనగా మనకి ఆయనకి పాటం చెప్పిన గొప్ప అధ్యాపయంతీ-అధ్యాపిక మన అమ్మ గోదా. ఆయన మాట అనగలడు, విడువగలడు. భారతంలో ఆయుదం పట్టను అన్నాడు, కాని ఒకటి రెండు సార్లు ఆయుదం పట్టినాడు కదా!!, ఆయన కృపకోసం తనను తానే సమర్పించి, స్వామి సన్నిధానంలో మన కోసం చేరి ఉంది. వేదాలు, ఉపనిషత్తులు చూపిన మార్గము మనకూ చూపించింది.
“ఓంకార ప్రభవా: వేదా:” వేదాలన్ని ఓం కారంలోనుండి వచ్చాయి కాబట్టి, ఓం కార అర్థం తెలుసుకోవలని మన శాస్త్రాలలో చెప్పారు.
“ప్రణవో ధను: ” ఓంకారాన్ని ధనుస్సు తో పోలుస్తారు. “శిరోహ్యాత్మా ” జీవుడే భాణం, “బ్రహ్మత లక్ష్య ముచ్యతే” లక్ష్యం బ్రహ్మమే. బ్రహ్మం అంటే ఆనందం, ఇంతకంటే మించి ఉండనిది, ఎప్పటికీ తరగనిదై ఉండేది. “అప్రమత్తేన వేత్తవ్యం ” పరాక్కు పనికిరాదు, ఏకాస్తా అజాగ్రత్తగా ఉన్నా జారిపోగలం సుమా!! అని హెచ్చరిస్తున్నాయి ఉపనిషత్తులు.
అందుకే ఈ భగవన్మయ మైన మార్గశీర్శమాసాన్ని అందరూ వినియోగించుకోవాలి.
జై శ్రీమన్నారాయణ
← దూసుకుపోతున్న రకుల్…
3గంటలు,5వేల ఖాతాదారులు 370కిలోల బంగారం →
జెమినీ గణేషన్ 7గురు కూతుళ్లు
జెమినీ గణేషన్ 7గురు కుమారైలు... వీరికి తండ్రి ఒకరే కానీ తల్లులు వేరు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హనుమాన్ దేవాలయాల విశేషాలు |
2.0 కథ ఇదే..! వైరల్ అవుతున్న స్టోరీ..?
రివ్యూ: C/o కంచరపాలెం. అద్భుతమైన స్క్రీన్.. ప్రేక్షకుడిని వెంటాడే సినిమా..
కౌశల్ ఆర్మీ మరో సంచలనం: బల నిరూపణ కోసం 2కె రన్!
తాజా వార్తలు
సినిమా రివ్యూస్
కళ్యాణ్ రామ్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.. ఫాన్స్ కి బంపర్ న్యూస్!
December 20, 2016 Andhra99 0 Comment g nageshwar reddy, ISM, Kalyan Ram, nandamuri kalyan ram, ఇజం, కళ్యాణ్ రామ్, జి నాగేశ్వర రెడ్డి
నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి. భారీ బడ్జెట్ చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పరాజయాల పాలవుతూ అతనికి భారీ నష్టాల్ని మిగిలిస్తున్నాయి. ఆమధ్య ‘ఓం 3డి’
ఇజం ఫస్ట్ డే ఇరగేసిందిలే!!
పూరీ జగన్నాధ్ కి మీడియం రేంజ్ హీరోలతో సినిమా తీయడం కొత్త కాకపోయినా.. నందమూరి కళ్యాణ్ రామ్ స్టార్ డైరెక్టర్ సినిమా చేయడం మాత్రం ఇదే మొదటిసారి.
రివ్యూ: ఇజం – మెసేజ్ ఉన్న పూరి మార్క్ సినిమా
October 22, 2016 October 22, 2016 Andhra99 0 Comment ISM, Kalyan Ram, Puri Jagannath, tollywood, ఇజం, కళ్యాణ రామ్, టాలీవుడ్, పూరి జగన్నాథ్
సత్య మార్తాండ్ (కళ్యాణ్ రామ్) అనే భాద్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రాభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను,
‘ఇజం’ మాస్కులతో పిచ్చెక్కిస్తున్నారుగా.
ఒక సినిమాను పూర్తి చేయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కష్టమైపోతోంది ఈ రోజుల్లో. వారం గడిస్తే సినిమా థియేటర్లలో నిలవడం కష్టమైపోతుండటంతో.. ప్రేక్షకుల్ని సాధ్యమైనంత త్వరగా
ఇజంలో కల్యాణ్ రామ్.. డబుల్ యాక్షన్?
October 17, 2016 October 17, 2016 Andhra99 0 Comment ISM, movie, news, ఇజమ్, కల్యాణ్ రామ్
పూరీ దర్శకత్వంలో రూపొంది విడుదలకు సిద్ధంగా ఉన్న ఇజమ్ లో కల్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశాడా? అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఒక పాత్ర
పూరి-హరికృష్ణ.. రెండు పావురాల కథ
October 6, 2016 Andhra99 0 Comment ISM, Kalyan Ram, NTR, puri jagannadh, tollywood, ఇజం, ఎన్టీఆర్, కళ్యాణ రామ్, టాలీవుడ్, పూరి జగన్నాథ్
నందమూరి కళ్యాణ్రామ్ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నందమూరి కళ్యాణ్రామ్ నిర్మిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇజం’. ఈ చిత్రాన్ని
కొత్తగా ట్రై చేసాడు:ఇది నందమూరి ‘ఇజం’ (వీడియో)
September 6, 2016 Andhra99 0 Comment ISM, Kalyan Ram, Puri Jagannath, tollywood, ఇజం, కళ్యాణ్రామ్, టాలీవుడ్, పూరి జగన్నాధ్
ఎపి, తెలంగాణా బాక్స్ఆఫీస్ ల వద్ద దుమ్మురేపుతున్న జనతా గ్యారేజ్ చేస్తున్న చూసి ఆనందపడుతున్న నందమూరి అభిమానులకు హీరో నందమూరి కళ్యాణ్రామ్ మరో కానుక అందించారు. కళ్యాణ్రామ్
6-ప్యాక్ చూపించిన కళ్యాణ్ రామ్
రోగాల్ని నయం చేసే తేనె October 3, 2018
లీక్డ్ పిక్: నారా బాబుగా మారిన రానా September 7, 2018
రివ్యూ: C/o కంచరపాలెం. అద్భుతమైన స్క్రీన్.. ప్రేక్షకుడిని వెంటాడే సినిమా.. September 7, 2018
కౌశల్ ఆర్మీ మరో సంచలనం: బల నిరూపణ కోసం 2కె రన్! September 6, 2018
గాంధీని గాడ్సే చంపకపోయి ఉంటే నేను చంపేదాన్ని!! జడ్జి సంచలన వ్యాఖ్యలు
‘‘గాంధీని గాడ్సే చంపకపోయి ఉంటే నేను చంపేదాన్ని’’ ఇవీ హిందూ కోర్టు జడ్జి, సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే చేసిన వ్యాఖ్యలు. ఒక న్యూస్ ఛానెల్కు
కేరళలో ఎందుకీ విపత్తు ? ఆ తప్పే వెంటాడుతోందా?
రచయిత గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల ఉదంతంలో కలకలం రేకెత్తించే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే గజల్ శ్రీనివాస్ మసాజ్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ
నంద్యాల గెలుపు కోసం బరితెగింపు…
నిరుద్యోగులకు గుడ్న్యూస్..నెలకు రూ.29,000 జీతమిచ్చే జాబ్స్
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సిఐఇటి)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్ ఖాళీలు: 5 అర్హత: 55 శాతం మార్కులతో
పోస్టల్ శాఖలో 1771 ఉద్యోగాలు |
కొరియా ఓపెన్: ప్రిక్వార్టర్స్లో సైనా, తొలి రౌండ్లోనే నిష్క్రమించిన వైష్ణవి, సమీర్ వర్మ - Telugu MyKhel
మరిన్ని క్రీడలు
హాకీ వరల్డ్ కప్ 2018
కొరియా ఓపెన్: ప్రిక్వార్టర్స్లో సైనా, తొలి రౌండ్లోనే నిష్క్రమించిన వైష్ణవి, సమీర్ వర్మ
హైదరాబాద్: సియోల్ వేదికగా జరుగుతున్న కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ 21-12, 21-11తో కిమ్ హయో మిన్ (దక్షిణ కొరియా)పై అలవోకగా విజయం సాధించింది.
సైనా ఈ మ్యాచ్ను 40 నిమిషాల్లోనే ముగించింది. ప్రత్యర్థి ఏ దశలోనూ సైనాకు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. తొలి గేమ్ ఆరంభంలో 6-2తో ఆధిక్యంలో నిలిచిన సైనా.. తర్వాత 12-3తో దూకుడు కనబర్చింది. విరామం తర్వాత మరింత చెలరేగిన సైనా 21-12తో గేమ్ దక్కించుకుంది. ఇక రెండో గేమ్లో కూడా సైనాకు ఎదురులేకుండా పోయింది.
టోర్నీలో భాగంగా గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో కొరియాకే చెందిన కిమ్ గా యున్తో సైనా తలపడనుంది. సైనా క్వార్టర్స్కు చేరితే మూడోసీడ్ నజోమి ఒకుహర (జపాన్) ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారత్కే చెందిన జక్కా వైష్ణవి రెడ్డి, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు.
అన్సీడెడ్ వైష్ణవి 10-21, 9-21తో ఆరోసీడ్ బెవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓటమి పాలైంది. ఇక, పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో సమీర్వర్మ 21-15, 16-21, 7-21 ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడాడు.
ఒకే ఓవర్లో ఆరు సిక్సులు: బర్త్ డే బాయ్ యువరాజ్ మైలురాళ్లివే
ఏ పార్టీ నుంచి ఎవరు, గెలిచిన వారు వీరే: ఆ సర్వే ఒక్కటే
టాటా సంస్థను అభినందించిన ఆనంద్ మహీంద్రా- కారణం ఏమిటో తెలుసా?
ఫేస్బుక్కి బానిస అయినవారికి అదిరిపోయే శుభవార్త
నేను కోరుకున్నట్లే కేసీఆర్ గెలిచారు: మోహన్ బాబు
బ్రేకింగ్ న్యూస్..కెసిఆర్ ప్రమాణస్వీకారంలో సంచలన నిర్ణయాల
రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు
టైటిల్ దిశగా జూనియర్ హాకీ జట్టు · Telanganaheadlines.in
తెలంగాణ ప్రజల చేతికి చిప్పే : షబ్బీర్ అలీ
తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది:కేసీఆర్
టైటిల్ దిశగా జూనియర్ హాకీ జట్టు
December 17, 2016 admin australia, hockey, india, junior, ఆస్ట్రేలియా, జూనియర్ హాకీ, టైటిల్, బెల్జియం, భారత్, హాకీ
ఒకప్పుడు హాకీలో ప్రపంచాన్ని ఏలిన భారత్ ఆ ప్రాభవాన్ని క్రమంగా కోల్పోయినా తిరిగి భారత హాకీ జవసత్వాలు నింపుకుంటోంది. భారత సీనియర్ హాకీ జట్టు మెరుగైన ప్రదర్శన ఇస్తుండగా జూనియర్ జట్టు కూడా తన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. భారత్ లో జరుగుతున్న ప్రపంచ జూనియర్ హాకీ టోర్నమెంటులో అద్భుతమైన ప్రదర్శనతో టైటిల్ దిశగా దుసుకుని పోతోంది. ఫైనల్ కు చేరుకున్న భారత జూనియర్ హాకీ జట్టు టైటిల్ కు ఇప్పుడు కోవలం ఒక అడుగు దూరంలో ఉంది.
తన ఆట తీరుతో అభిమానులను అలరిస్తున్న భారత జూనియర్ హాకీ జట్టు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో బెల్జియంతో తలపడనుంది. సెమీఫైనల్ లో పటిష్టమైన ఆష్ట్రేలియా పై విజయం సాధించిన భారత్ ఫైనల్ లోకి దూసుకుని పోయింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ ఆశించిన స్థాయిలో ఆడుతోంది. ఫైనల్ లో బెల్జింయం ను ఓడిస్తే టైటిల్ భారత్ వశం అవుతంది. 2001లో చివరిసారిగా భారత్ జూనియర్ హాకీ టైటిల్ ను గెల్చుకుంది.
జెమినీ గణేషన్ 7గురు కూతుళ్లు
జెమినీ గణేషన్ 7గురు కుమారైలు... వీరికి తండ్రి ఒకరే కానీ తల్లులు వేరు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హనుమాన్ దేవాలయాల విశేషాలు
హెబ్రీయులకు 12:9 TEL - ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో - Bible Search
హెబ్రీయులకు 11 హెబ్రీయులకు 13
9ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా?
తెలుగు బైబిల్ |
ఆ నిర్ణయం తప్పు: ఆఖరి వన్డేలో విండిస్ ఓటమికి కారణం చెప్పిన లారా - Telugu MyKhel
మరిన్ని క్రీడలు
ఏరోజు ఏమ్యాచ్
ఆ నిర్ణయం తప్పు: ఆఖరి వన్డేలో విండిస్ ఓటమికి కారణం చెప్పిన లారా
హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్తో జరిగిన ఆఖరి వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేశాడని వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, ఈ సిరిస్ను సమం చేసే అవకాశం వచ్చినా విండిస్ చేజార్చుకుందని లారా చెప్పాడు.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ద్రవిడ్: సచిన్కు ఎందుకు ఇవ్వలేదంటే?
తాజాగా శుక్రవారం లారా మీడియాతో "తిరువనంతపురం పిచ్ డ్రైగా ఉండటంతో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు బౌలింగ్ ఎంచుకుని ఉండాల్సింది. తప్పు నిర్ణయంతో ఆ అవకాశాన్ని భారత్కి ఇచ్చింది. దీంతో భారత బౌలర్లు పిచ్ని చక్కగా వినియోగించుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం పెద్ద తప్పు" అని అన్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండిస్ కెప్టెన్
ఆ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శామ్యూల్స్(24) నిలిచాడు. విండిస్ జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్స్కే పరిమితమైపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అహ్మద్కు రెండు, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.
వెస్టిండిస్ జట్టు ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఓపెనర్ పావెల్ డకౌట్గా వెనుదిరగగా.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. సిరీస్లో అద్భుతంగా రాణించిన ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్మన్ హోప్ (0), హెట్మయర్ (9) ఆఖరి వన్డేలో దారుణంగా విఫలమవడంతో మిగతా బ్యాట్స్మెన్ కూడా పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 104 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం వెస్టిండిస్ నిర్దేశించిన 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించడంతో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ని భారత్ జట్టు 3-1తో చేజిక్కించుకోగా.. వైజాగ్ వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. ఆఖరి వన్డేలో పర్యాటక వెస్టిండిస్ జట్టు గెలిచింటే సిరీస్ 2-2తో సమమయ్యేది. ఇదిలా ఉంటే భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
'ఇంగ్లాండ్లో జరిగే వరల్డ్కప్లో ఆడాలనేది ధోని కల'
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
'ఎన్టీఆర్ మహానాయకుడు'.. పోటీగా మరో చిత్రం!
మీకు ఉద్యోగం పోయిన భద్రత కలిపించే కొన్ని మార్గాలు మీకోసం!
ప్రేమించి పెళ్లి చేసుకోమంటే డేటింగ్ చేశాడు, అనుభవించాడు
Read more about: india west inides 5th odi batting brian lara india vs west indies west indies in india 2018 trivandraum ఇండియా వెస్టిండిస్ 5వ వన్డే బ్రియాన్ లారా భారత్లో వెస్టిండిస్ పర్యటన 2 |
అందుకే 'మా' లో విభేదాలు రచ్చకెక్కాయా? _ shivaji-vs-naresh-telugu-movie-artist
మూవీ రివ్యూస్
ఇతర క్రీడలు
హెల్త్ & లైఫ్స్టైల్
ఎడ్యుకేషన్ &జాబ్స్
Home తాజా వార్తలు
అందుకే ‘మా’ లో విభేదాలు రచ్చకెక్కాయా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నిధులు గోల్మాల్ సంచలనంగా మారింది. మా అధ్యక్షుడిగా ఉన్న శివాజీరాజా నిధులను మింగేశాడని… మెగా ఈవెంట్తో వచ్చిన డబ్బును దుర్వినియోగం చేశాడని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం కలకలం రేపింది. ఈ క్రమంలో అధ్యక్ష పదవి నుంచి శివాజీరాజాను తొలగించి నరేష్ స్వయంగా ఈ పదవిని హస్తగతం చేసుకున్నారని వార్తలొచ్చాయి. మా కార్యాలయానికి తాళాలు వేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, హీరో శ్రీకాంత్.. మీడియా ముందుకు వచ్చి ఎదుట స్పష్టతనిచ్చేందుకు ప్రయత్నించారు.
AD : టీవీ5 న్యూస్ అప్డేట్స్ మీ వాట్సాప్లో పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న తనకు శివాజీరాజా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని సీనియల్ నటుడు నరేశ్ ఆరోపించారు. ఏప్రిల్ నుంచి శివాజీరాజా తన ఫోన్ కట్ చేసాడంటూ.. కాల్, మెసేజ్ డేటాను బయటపెట్టారు. మాలో చోటుచేసుకున్న ఈ వివాదంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో నిజనిర్ధాణ కమిటీ వేయాలని తాను చెప్పానని.. అయితే శివాజీరాజా మాత్రం అందుకు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు. త్వరలో ఓ నిర్ణయం తీసుకుందామని చిరంజీవి తమకు భరోసా ఇచ్చారన్నారు నరేశ్.
ఇక.. చిరంజీవి రెండు కోట్ల రూపాయలు ఇస్తానన్నా.. కోటి రూపాయలకే ఒప్పుకోవడం తనను ఆశ్చర్యపర్చిందని నరేశ్ అన్నారు. అయినా చిరంజీవి, మహేష్, ప్రభాస్ ఈవెంట్లు లోకల్లో జరిగినా 5 కోట్ల రూపాయలు వస్తాయని.. మరి వారి ఈవెంట్లు అమెరికాలో ఎందుకు పెట్టారో అర్థం కావడంలేదని సందేహం వ్యక్తం చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పుట్టి పాతికేళ్లయింది. ఈ సందర్భంగా తలపెట్టిన సిల్వర్ జూబ్లీ ఈవెంట్పై ముసలం పుట్టింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్ట్యూమర్ల నుంచి స్టంట్ మాస్టర్ల దాకా 24 క్రాఫ్ట్స్కీ విడివిడిగా అసోసియేషన్లుంటాయి. వాళ్లల్లో వాళ్లు ఎన్ని తంటాలు పడ్డప్పటికీ ఇలా రోడ్డుమీదకొచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. కేవలం ఆర్టిస్టుల సంఘం మాత్రమే ఇలా తరచూ గొడవలకు దిగుతున్నాయి. ఇందులోని 740 మంది సభ్యుల్లో చిన్నచిన్న కమెడియన్లతో పాటు.. పెద్దపెద్ద సూపర్స్టార్లు కూడా వుంటారు. అయినా వీళ్ల పంచాయతీ తీర్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. దాసరి నారాయణరావు లాంటి పెద్దలున్నప్పుడు ఇవన్నీ లోలోపలే సర్దుకునేవి. కానీ.. ఇప్పుడు పెద్ద దిక్కు లేకపోవడంతో.. విభేదాలు రచ్చకెక్కాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -
ఎక్కువ మంది చదివినవి (Most Read)
సినిమా హాల్లో తండ్రికి దొరికిపోయిన లవర్స్.. కూతురిని తండ్రి ఏం చేశాడో చూస్తే..
రైల్వేలో ఉద్యోగాలు..65 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
ఫ్లిప్కార్ట్ దివాలి ఆఫర్..
లెర్నింగ్ పనిష్మెంట్ కాకూడదు, ఫన్ గా ఉండాలి : సీఎం చంద్రబాబు
బీజేపీ మూడో జాబితా విడుదల
నందమూరి సుహాసిని ఇంటి దగ్గర..
బీభత్సం సృష్టిస్తోన్న గజ తుపాన్.. 20 మంది మృతి
#జగన్పై దాడి30
సోషల్ మీడియా10
ఎడ్యుకేషన్ &జాబ్స్51
వైరల్ న్యూస్156
Телугуte: అవును (awunu), ఔను (aunu)
Телугуte: మరియు (mariyu) |
రష్యన్ వేశ్య - ఫక్ TV PORN VIDEOS ONLINE - WATCH ఉచిత ఉత్తమ వీడియో సెక్స్, శృంగార, శృంగార సినిమాలు HD Xyutv-a.com
ప్రధాన (current)
యాదృచ్ఛిక వీడియో
అన్ని కెటగిరీలు
తేదీ అభిప్రాయాలు వ్యవధి
ఔత్సాహికులు, పోర్న్ తో బ్లోన్దేస్, గాడిద Licks, అద్భుతమైన HD నాణ్యత
వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్ లోపల రష్యన్ పోర్న్ కోసం ఉచిత
రాగి మరియు ఉత్తమ శృంగార వీడియో వీక్షణ వెబ్సైట్
రష్యన్ పోర్న్ Petrozavodsk
ఔత్సాహికులు మరియు సినిమాలు శృంగార కథలు
పోర్న్ మొదటి వ్యక్తి పోర్న్ ఎమ్మా ఫోటో
శృంగారమైన సెక్స్ సినిమా Ekaterina మరియు ఆమె అడవి స్టాలియన్స్ ఉచిత డౌన్లోడ్
తల్లులు మరియు సెక్స్ అధికారం మహిళలు
రష్యన్ సహజ చాలా ఇంద్రియాలకు సంబంధించిన అమ్మాయి అమ్మాయిలు జగన్
పూకు మీధ వేలితోరుద్ధడమ్ ఇంజక్షను సూది
పూకు మీధ వేలితోరుద్ధడమ్ ఇంజక్షను సూది Porn Videos
యువ అమ్మాయి లెస్బియన్
యువ అమ్మాయి Lesbian Porn Videos
టీన్ యోగ Porn Videos
కొరడాతో Ass Porn Videos
అభిలాషి కొవ్వు ముడ్డి
అభిలాషి కొవ్వు ముడ్డి Porn Videos
పెద్ధ కాయలు పాఠశాల
పెద్ధ కాయలు పాఠశాల Porn Videos
నా బెస్ట్ ఫ్రెండ్స్
నా బెస్ట్ ఫ్రెండ్స్ Porn Videos
తీవ్రమైన పుస్సి పోర్న్ వీడియోల
ఆమ్స్టర్డ్యామ్ Porn Videos
హాట్ లాటిన ఇబ్బంది పెట్టాడు
హాట్ లాటిన ఇబ్బంది పెట్టాడు పోర్న్ వీడియోలు
కొరియన్ జంట సెక్స్
కొరియన్ జంట సెక్స్ Porn Videos
సెక్సీ Mom మరియు బాయ్
సెక్సీ Mom మరియు బాయ్ Porn Videos
నలుపు స్లట్స్ Porn Videos
కాబట్టి మంచి
కాబట్టి మంచి Porn Videos
గర్భిణీ మహిళ
గర్భిణీ స్త్రీ Porn Videos
సన్నని పరిపక్వ
సన్నని పరిపక్వ Porn Videos
కొన్ని కేతగిరీలు
ఫక్ TV! ఇది ఎల్లప్పుడూ అద్భుతమైన ఉంది.ధన్యవాదాలు.
18+ పెద్దలు కోసం మాత్రమే!
నుండి అభిప్రాయాన్ని మద్దతు సైట్
న్యూస్ ఆంధ్రా
న్యూస్ తెలంగాణ
నేషనల్ న్యూస్
సినిమా గాస్సిప్స్
లైఫ్ స్టైల్
మమ్మల్ని సంప్రదించండి
పరిశోధనాత్మక కథనాల ద్వారా దేశమంతా కీర్తిగడించిన రానా ఆయూబ్ పై వేధింపులను ఢిల్లీ జర్నలిస్ట్ యూనియన్ ఖండించింది. అవుట్ లుక్ పత్రిక ప్రకటించిన సోషల్ మీడియా యూత్ ఐకాన్ అవార్డ్ ని ఇటీవలే రానా ఆయూబ్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె మీద సోషల్ మీడియాలో సాగుతున్న విష ప్రచారం ఆందోళనకరమని పాత్రికేయ సంఘాలు చెబుతున్నాయి.
తాజాగా రానా ఆయుబ్ పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా నిందాపూర్వక ప్రచారం ప్రారంభించడంతో ఆమె కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా డీజేయూ కూడా ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రానా పేరుతో స్రుష్టించిన ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా బాలలపై అత్యాచారాలను సమర్థి స్తున్నట్లు, దేశంలో ముస్లింలకు రక్షణ లేదని అయ్యూబ్ వ్యాఖ్యలు చేసినట్లు పోస్టులు పెట్టారు. మార్పింగ్ చేసిన ఆమె అసభ్య ఫోటోలను, వీడీయోలను ఉంచారు. ఈ అంశాలను డియుజె తీవ్రంగా ఖండించింది. మహిళా జర్నలిస్టులపై ఇలాంటి వేధింపులు తరుచూ జరుగుతున్నాయని పేర్కొంది.
ట్విట్టర్, సామాజిక మీడియాలు తమ వేదికలను దుర్విని యోగం చేయకుండా సరైన చర్యలు తీసుకోవాలని సూచిం చింది. సోషల్ మీడియా దుర్విని యోగాన్ని ఖండించింది. వ్యక్తులు, సమూహాలను అప్రతిష్ట చేయడానికి, హింస ను ప్రేరేపించడానికి, నకీలీ వార్తలను ప్రసారం చేయడానికి సోషల్ మీడియా ను కొంత మంది ఉపయోగించుకుంటున్నారని, ఇది సోషల్ మీడియా యొక్క విశ్వసనీయతనే సవాలు చేస్తుందని డియుజె ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
« ప్రభాస్ క్యారెక్టర్ అదేనా? (Previous News)
(Next News) ఆసీస్ ఏకపక్ష నిర్ణయం: బీసీసీఐ ససేమీరా! »
తెలుగు మీడియా కళ్లు తెరవదా?
Spread the loveఏపీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం తెలుగు మీడియా తీరు భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోRead More
ఎఫ్ బీ, గూగుల్ కి నోటీసులు
Spread the loveప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలే కాదు డిజిటల్ మీడియాలో కూడా నిబంధనలు పాటించాల్సిందే. దానికి భిన్నంగా సాగితేRead More
చంద్రబాబు దొరికిపోయారు..
ఆ చానెల్ ని జనసేన టేకోవర్ చేస్తుందా?
బీజేపీతో వైసీపీ పొత్తు ఉంటుందా?
పవన్ యాత్రలో అది లేకుండా పోయింది…
జగన్ కి పెద్ద లోటు
జక్కన్న మల్టీ స్టారర్ అప్ డేట్స్
జనసేనకు కన్నం కొట్టి..వైసీపీ కి? |
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు" Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు. Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..! నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..! మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..! లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..! మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..! హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..! తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...! బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / హైదరాబాద్ నగరం అసలు పేరు ‘ చిచులం ’, ఇదే నిజమైన పేరు, ఈ విషయం చాలామందికి తెలియదని చారిత్రక పరిశోధకుడు పాండులింగారెడ్డి తెలిపారు.
హైదరాబాద్ నగరం అసలు పేరు ‘ చిచులం ’, ఇదే నిజమైన పేరు, ఈ విషయం చాలామందికి తెలియదని చారిత్రక పరిశోధకుడు పాండులింగారెడ్డి తెలిపారు.
మనం చదువుకున్న, తెలుసుకున్న చరిత్ర ప్రకారం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది నిజాం రాజులని, కుతుబ్ షాహీ కాలంలో భాగ్యనగరంగా పిలిచేవారని కాలక్రమేణా హైదరాబాద్ గా మారిందని మాత్రమే తెలుసు, కానీ హైదరాబాద్ అసలు పేరు భాగ్యనగరం కాదని, ముస్లిం రాజుల హైదరాబాద్ నగరాన్ని నిర్మించక ముందే ఈ ప్రాంతంలో ఒక పట్టణం ఉందని, దాని పేరు చిచులం అని, అదే హైదరాబాద్ అసలు పేరు అని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి చెబుతున్నాడు. హైదరాబాద్ నగరం పూర్వ చరిత్రపై పరిశోధన చేసిన పాండులింగారెడ్డి హైదరాబాద్ పాత పేరు చిచులం అని..ఇదే నిజమని తెలిపారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండ్రోజులపాటు జరిగిన అంతర్జాతీయ హెరిటేజ్ సదస్సులో ది రాయల్ హిస్టారికల్ సొసైటీ ఫెలో అయిన పాండురంగారెడ్డి హైదరాబాద్ నగరంపై తను చేసిన పరిశోధన వ్యాసాన్ని సమర్పించారు, హైదరాబాద్ పూర్వపు పేరు చిచులం పై పాండురంగారెడ్డి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘భాగ్యనగరం అంటే హైదరాబాద్కు మరోపేరని అందరికీ తెలిసిందే. ఈ నగరానికి హైదరాబాద్గా నామకరణం చేయటానికి ముందు భాగ్యనగరంగా పిలిచేవారని, ఇబ్రహీం కులీకుతుబ్షా–భాగమతిల ప్రణయ కావ్యానికి నిదర్శనమని భావిస్తారు. కానీ ఇదంతా కాల్పనిక గాథ. వారిద్దరి ప్రణయానికి అవకాశమే లేదని కుతుబ్షా వయసు, అక్కడి పరిస్థితులను చూస్తే అవగతమవుతుంది. భాగమతిని కలిసేందుకే మూసీపై వంతెన నిర్మించారంటారు. కానీ వంతెన కట్టిన సమయంలో ఇబ్రహీం వయసు పదిన్నరేళ్లు.
ఆ వయసులో ప్రేమ ఎలా సాధ్యం. చరిత్రలో నిచిపోయిన కుతుబ్షా వంశవృక్షం వివరాలు, వారి కుటుంబ సభ్యుల వివరాల్లో ఎక్కడా భాగమతి ప్రస్తావనే లేదు. అసలు హైదరాబాద్ నగరానికి కుతుబ్షాహీలు పునాది వేశారన్న విషయమూ తప్పే. ఈ నగరం వెలియకముందే మూసీ నదికి దక్షిణాన చిచులం పేరుతో ఓ పెద్ద గ్రామం ఉంది. గోల్కొండ నగరంలో జనాభా పెరిగిపోవటం, ఇంతలో ప్లేగువ్యాధి ప్రబలటంతో జనం దాన్ని ఖాళీ చేసి వెలుపల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే తోటలూ పెంచుకున్నారు.
మూడునాలుగేళ్ల తర్వాత మళ్లీ వాటిని ఖాళీ చేసి కోట లోపలికి చేరారు. ఆ తాత్కాలిక ఇళ్లను ప్రజలు ఆక్రమించేసుకున్నారు. అవి కాలనీలుగా వెలిశాయి. చార్మినార్ ఆర్కిటెక్ట్గా పనిచేసిన మీర్ ముమిన్ ఈ చిచులంలోనే నివసించారు. అక్కడే చనిపోయారు. ఇప్పు డాయన సమాధి అక్కడే ఉంది. ఈ చిచులం విస్త రించి నగరంగా మారింది. తదుపరి హైదర్ అలీకి చిహ్నంగా దాన్ని హైదరాబాద్గా పిలిచారు. వెరసి హైదరాబాద్ అసలు పేరు చిచులం మాత్రమే.
ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి టావర్నియర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి తోట(బాగ్)లు చూసి ఇది బాగ్ల నగరిగా పేర్కొన్నారు. అదే భాగ్యనగరమైంది. చిచులంలో బ్రాహ్మణవాడి అన్న ప్రాంతముండేది. అక్కడే కుతుబ్షాహీల గురువు, సూఫీ తత్వవేత్త చిరాగ్ ఉండేవారు. ఇప్పటికీ ఆయన సమాధి అక్కడే ఉంది. చిచులం విషయం ప్రాచుర్యంలోకి రావాల్సి ఉంది. భాగమతి–కుతుబ్షా ప్రణయకావ్యం కాల్పనికంగా బాగానే అనిపించినా చరిత్రలో దానికి స్థానం ఉండరావు. ఎందుకంటే చరిత్ర వాస్తవాలపై లిఖించేది..’’
నిద్ర రావట్లేదా? అయితే ఈ పదార్ధాలు ఎక్కువగా తినండి.
జూన్ 16 నుంచి పెట్రోల్ బంక్ ల దేశవ్యాప్త బంద్?
ఈ నాలుగు ఆసనాలు వేస్తే చాలు వెంటనే సన్నబడిపోతారు.
జియోకి షాక్: బీఎస్ఎన్ఎల్ నుండి 2 రూపాయలకే అన్ని కాల్స్ ఫ్రీ.
ఎవరు అసలైన ధనవంతుడు …ఈ స్టోరీ చదివి మీరే చెప్పండి.
ప్యాడ్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్.
అక్షయ్కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ తదితరులు.
తొలి ప్రేమ సినిమా రివ్యూ & రేటింగ్.
ఛలో సినిమా రివ్యూ & రేటింగ్.
Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.
Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..! |
Video: ఒక్క చిట్కాతో 350 ఉన్న షుగర్ లెవెల్స్ ని 90 కి తీసుకొచ్చారు..! ఎలాగో తెలుసా..!? |
పండుగ - Wiktionary
పండుగ • (paṇḍuga) ? (plural పండుగలు)
పండగ (paṇḍaga)
TELUGU: తిను (tinu), భుజించు (bhujiṃcu)
మహాత్మ గాంధీ
“మేధావులు మాట్లాడుతారు…. మూర్ఖులు వాదిస్తారు“
హవాలా వేట మొదలైంది. 1500 కోట్ల రూపాయల హవాలా కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు వడ్డి మహేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. హవాలా కేసును ఇతరదేశాల్లోనూ విచారించాల్సి ఉందన్న సీపీ యోగానంద్ సీఐడీ ఆర్థిక నేరాల విభాగానికి ఈ కేసును బదలాయించినట్లు తెలిపారు. తండ్రి, బంధువులతో కలిసి మొత్తం 12 బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి 30 బ్యాంకు ఖాతాల ద్వారా హవాలా దందా నడిపిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సీపీ యోగానంద్ తెలిపారు. అంతేగాక ఈ కేసులో ముగ్గురు వ్యాపారులు ఎక్సైజ్ డ్యూటీ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్న సీపీ ఈ కేసుపై ఇంకా విచారణ జరపాల్సి ఉందని స్పష్టంచేశారు.
మహేశ్ను మీడియా ముందు ప్రవేశ పెట్టిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఈ నెల 29వరకు రిమాండ్ విధించారు. మహేష్ను ఆదివారం అతని సొంత గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పరిసరాల్లో అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుత కేసును వైజాగ్ సిఐడి రీజనల్ అధికారి, అడిషనల్ ఎస్పి నాగేశ్వరరావుకు అప్పగించే అవకాశాలు న్నాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం ఈ వ్యవహారం 680.94 కోట్ల రూపాయల్లో 569.93కోట్లు ప్రపంచంలోని హాంగ్కాంగ్, చైనా, సింగపూర్ తదితర దేశాలకు సాఫ్ట్వేర్ మెటీరియల్ కొనుగోలు కోసమంటూ ఇండియా నుంచి బోగస్ డాక్యుమెంట్లతో తరలించి బ్లాక్ను వైట్ చేసుకునేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలోనే ఫారిన్ రెగ్యులేషన్ ఎక్స్ఛేంజ్ యాక్ట్ (ఫెరా) చట్టాన్ని ప్రయోగించి పలు దేశాల్లో ఈ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక పోలీస్ బృందాలను విశాఖ నుంచి పంపించారు.
Up Next సందీప్ కిషన్ కోసం రంగంలోకి దిగిన 'కిట్టు' డైరెక్టర్ వంశీ, 'నేను లోకల్' రైటర్ ప్రసన్న
ఆంధ్రప్రదేశ్ జాతీయం-అంతర్జాతీయం తెలంగాణ సినిమాలు Top Stories Breaking News బ్లాగులు క్రీడలు బిజినెస్
14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ |
టాప్గేర్లో కారు
-సొంతబలంతోనే ప్రభుత్వంలోకి .. 63 స్థానాల్లో అఖండ విజయం.. 11 ఎంపీ సీట్లలో విజయకేతనం.. కారు స్పీడ్లో కొట్టుకుపోయిన అధికార, ప్రతిపక్ష పార్టీలు.. ఉత్తర దక్షిణాల హద్దులు చెరిపేసిన విజయాలు -భారీ ఆధిక్యతలను సాధించిన అభ్యర్థులు.. అన్నీ తానై నడిపించిన కేసీఆర్.. తారకమంత్రమైన మ్యానిఫెస్టో
తెలంగాణలో కారు టాప్గేర్లో దూసుకుపోయింది. గులాబీ పార్టీ గుబాళించింది. కేసీఆర్ మాటే మంత్రమైంది. మన రాష్ట్రంలో మనదే పాలన అన్న నినాదం తారకమంత్రమైంది. ఓటరు స్థిర నిశ్చయంతో కులం, మతం, వర్గం, ప్రాంతం అన్నీ విస్మరించి గులాబీ పార్టీని గుండెలకు హత్తుకున్నాడు. ఫలితంగా జిల్లాల ఎల్లలను తుత్తునియలు చేసి తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ తుఫాన్లో మహామహులంతా మట్టి కరిచారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ ఆరెపల్లి మోహన్, అనిల్ సీనియర్నేత షబ్బీర్ అలీ తదితరులంతా పరాజయం పాలయ్యారు. 14 సంవత్సరాలు మొక్కవోని దీక్షతో సాగించిన తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా, తెలంగాణ సాకారానికి కృతజ్ఞతగా, రేపటి తెలంగాణను బంగారు తెలంగాణగా రూపొందించే పార్టీగా టీఆర్ఎస్ను తెలంగాణ విశ్వసించింది. ఫలితంగా 119 సీట్ల శాసనసభలో టీఆర్ఎస్ 63 స్థానాలు దక్కాయి. 17 పార్లమెంటు స్థానాల్లో 11 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో ఇతర పార్టీల ప్రమేయం లేకుండా సర్కారు ఏర్పాటు చేయబోతున్నది. పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలు రెండింటా ఘన విజయం సాధించారు.
పార్టీ సీనియర్ నేతలు కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, హరీష్రావు, పోచారంశ్రీనివాసరెడ్డి, కే తారకరామారావు, జితేందర్రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలతో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, కళాకారుడు రసమయి బాల్కిషన్, విద్యార్థి నాయకుడు బాల్కసుమన్, డాక్టర్ల జేఏసీ అధ్యక్షుడు బూర నర్సయ్యగౌడ్, ప్రొ సీతారాం నాయక్లతో పాటు కేవీ రంగారెడ్డి మనవడు విశ్వేశ్వర్రెడ్డి తదితరులు గెలిచిన వారిలో ఉన్నారు.
ఉత్తర దక్షిణాల గుబాళింపు టీఆర్ఎస్ ఉత్తర తెలంగాణ అందునా మూడునాలుగు జిల్లాల పార్టీయే అన్న అపప్రథను మట్టికరిపిస్తూ ఈసారి ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తేడాలు లేకుండా గులాబీ పార్టీ గుబాళించింది. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ అనూహ్య ఫలితాలు సాధించింది. గతంలో మెదక్ జిల్లాలో రెండు, మూడు సీట్లకే పరిమితమైన పార్టీ ఈ ఎన్నికల్లో జిల్లాలో 8 సీట్లు సాధించింది. ఇక మహబూబ్నగర్ జిల్లాలోని 14 సీట్లలో 7 స్థానాలు దక్కించుకుంది.
నల్గొండ జిల్లాలో పోటీ చేసిన 12 సీట్లలో ఆరు సీట్లను కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో నాలుగు సీట్లను దక్కించుకుంది. హైదరాబాద్లో ఈసారి భారీ ఓట్లు సాధించినా సికింద్రాబాద్ స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. సినీనటి జయసుధ పరాజయం పాలయ్యారు. ఇక ఉత్తర తెలంగాణలో పార్టీ స్వీప్ చేసింది. ఇక్కడ 54 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 37 స్థానాలను దక్కించుకుంది. దక్షిణ తెలంగాణలో 65 స్థానాలుంటే 26 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడున్న 10 పార్లమెంట్ స్థానాలకుగాను ఐదు స్థానాల్లో విజయం సాధించింది.
సొంత బలంతోనే అధికారంలోకి.. నూతన ప్రభుత్వం విషయంలో అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ ఇతరుల ప్రమేయం లేకుండానే సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60 సీట్లు అవసరం కాగా టీఆర్ఎస్ పార్టీ 63 అసెంబ్లీ సీట్లను గెలవడంతో ఆ పార్టీకి మరెవ్వరి మద్దతు అవసరం లేకుండానే అధికారంలోకి రానుంది. కారు స్పీడ్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కనుమరుగయ్యాయి. టీఆర్ఎస్కు వచ్చిన సంఖ్యకు ఈ రెండు పార్టీలు చాలా దూరంలో ఉండటం విశేషం.
కేసీఆర్ వ్యూహ రచన… మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి 2014 లో అధికార పగ్గాలు చేపట్టే దాకా కేసీఆర్ వ్యూహాత్మకంగా కారును పరుగులు పెట్టించారు. ఈ సారి టికెట్ల కేటాయింపుల్లో చూపిన ఆయన ప్రదర్శించిన చాక చక్యం టీఆర్ఎస్ను గద్దెపై కూర్చోబెట్టాయి. పక్కా ప్రణాళికతో ఆయన ఈ వ్యవహారాన్ని నడిపించారు. ఒంటరి పోరు నిర్ణయమే సగం విజయాన్ని సాధించిపెట్టిందంటే అతిశయోక్తికాదు. తనదైన వాగ్దాటితో ఆయన టీఆర్ఎస్ అంటే ఇంటిపార్టీ అని ప్రజలతో అనిపించారు. కాంగ్రెస్లో విలీనం కావొద్దని తెలంగాణ ప్రజలే కోరుకున్నారంటే వారు పార్టీని ఏ మేరకు గుండెల్లో నిలుపుకున్నారో అర్థమవుతుంది. |
చివరకు తెలంగాణ అపరిష్కత సమస్యలు పరిష్కారం కావాలంటే కేసీఆర్ ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలు ధృఢంగా విశ్వసించారు. అందుకే స్థిరంగా కారుగుర్తుకు ఓటేసి తమ కర్తవ్యం నిర్వహించామని భావించారు. తెలంగాణలోని అంగుళం అంగుళం మీద ఆయనకు ఉన్న అవగాహన, పాలనాపరమైన అంశాల మీద ఆయనకు ఉన్న పట్టు కేసీఆర్లో ఒక మంచి పాలకుడిని చూసే అవకాశం ప్రజలకు కలిగింది. నదులు,నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇలా ఏ విషయం మీదనైనా అనర్ఘళంగా మాట్లాడగల ఆయన నేర్పు ఇటు విద్యావంతులను అటు సామాన్యులను కూడా బాగా ఆకర్షించింది. అదే ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది.
హామీలు నమ్మారు… వెంట నడిచారు ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయిన ఆత్మగౌరవాన్ని, బంగారు భవిష్యత్తును తిరిగి తెస్తారన్న నమ్మకమే టీఆర్ఎస్ పార్టీని గెలుపు మెట్లు ఎక్కించింది. ప్రజల నాడి పట్టడంలో ఆరితేరిన కేసీఆర్ వారి సమస్యలు తెలుసుకుని వారి ఆశలు, ఆకాంక్షలనే ఎన్నికల మేనిఫెస్టోగా మార్చి ప్రజల్లోకి వెళ్లారు. ఆ మేనిఫెస్టోనే కేసీఆర్ పశుపతాస్త్రంగా ప్రయోగించారు. బలహీన వర్గాలకు రెండు బెడ్రూంల ఇల్లు పథకం ఆయన ప్రజలకు వివరించిన తీరు మరొకరికి సాధ్యమయ్యేది కాదు. ఆ పథకాన్ని ఆయన వివరించే తీరు వినడానికే మహిళలు తండోపతండాలుగా ఆయన సభలకు వచ్చేవారంటే దాని ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక డ్వాక్రా సంఘాలకు రుణాల పరిమితిని ఐదు లక్షల నుండి 10 లక్షలకు పెంచుతామనే హామీ మహిళల్లోకి వేగంగా దూసుకుపోయింది. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో ఉండేలా వేతనాలు ఇస్తామని కూడా ప్రజలకు హామీలు గుప్పించారు. ఈ హామీలకు తోడు ఉద్యమం గతంలో కూడా టీఆర్ఎస్ను విజయ తీరాలకు చేర్చాయి. రాష్ట్ర చరిత్రలో మరే ఇతర నాయకుడు చేయని సాహసం… పది రోజుల వ్యవధిలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టిరావడం. రోజుకు 10 సభల చొప్పున ఆయన జరిపిన సుడిగాలి పర్యటనలు ప్రత్యర్థులను విస్తుపోయేలా చేశాయి. |
తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు _ Mission Telangana
తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా (TAM) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు మరిడేక స్క్వేర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మలేషియా ప్రైమ్ మినిస్టర్ నజీబ్ రజాక్ మరియు ఫెడరల్ టెరిటోరీస్ మినిస్టర్ తుంకూ అద్నాన్ మన్సూర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చిన్నారుల అట పాటలు ప్రేక్షకులను అలరించాయి. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చిన కళాకారులు ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాపర్ ప్రణవ్ చాగంటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యాక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన తెలుగు వారందరికీ TAM ప్రెసిడెంట్ డా. అచ్చయ్య కుమార్ గారు కృతజ్ఞతలు తెలియజేసారు.
తెనాలి రామలింగని కథలు -Vol-2-Tenali Ramalingani Kathalu-Pebbles Animated Stories In Telugu
New Tenali Raman Stories In Telugu _ పిల్లలు కథలు తెలుగు _ Telugu Stories For Kids
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం February 7, 2009 at 4:38 PM
10th Physical Science Puzzles - 4. ఆమ్లాలు క్షారాలు లవణాలు - Educational Portal in Telugu , Free Competitive Exam Guidance Andhra Pradesh and Telangana, RRB, BSRB, APPSC, SSC and UPSC exams నవచైతన్య కాంపిటీషన్స్
కొనుగోలు చేయండి
10th Physical Science Puzzles - 4. ఆమ్లాలు క్షారాలు లవణాలు
10th Physical Science Puzzles - 4. ఆమ్లాలు క్షారాలు లవణాలు 8:48:00 PM
ఈ బ్లాగు అప్డేట్స్ నేరుగా మీ మెయిల్ కే !
ఈ బ్లాగులో ప్రచురితం అవుతున్న స్టడీ మెటీరియల్స్ నేరుగా మీ మెయిల్ కే పొందండి! ఇప్పటికే మంది ఈమెయిల్ ద్వారా మెటీరియల్స్ను అందుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ మెయిల్ ఐడి వివరాలు నమోదు చేసుకోండి
ఎట్టకేలకు శిక్ష!
గత ఏడాది దాదాపు పదిహేను భీకర వైపరీత్యాలు వివిధ దేశాలలో చోటు చేసుకున్నాయి. కోట్లాది ఏండ్లుగా భూగోళంపై సాగిన పరిణామాలు, లక్షల ఏండ్ల మానవ పరిణామం, వేల ఏండ్లుగా వృద్ధి చేసుకున్న నాగరికత అంతా నాశనమైపోయే ప...
రాఫెల్పై తీర్పు
రాఫెల్ ఒప్పందంపై ఇచ్చిన తాజా తీర్పులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఒకటి గమనించదగినది. మన ప్రత్యర్థులు నాలుగవ తరమే కాదు, ఐదవ తరం యుద్ధ విమానాలు తెచ్చుకున్నట్టు తెలుస్తున్నది. మనదగ్గర అవేవీ లేవు. దేశం ఈ ...
కాంగ్రెస్కు కొత్త జీవం
ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో సంక్షోభంలో ఉన్న తరుణంలో కేసీఆర్ రైతులను ఆదుకోవడానికి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ ఆర్థిక, వ్యవసాయ అభ...
మీరు ఎక్కడైనా నాట్యం, మీ గుండె లో మాత్రమే.
కు దాటివెయ్యండి
సంప్రదించండి
సైట్ మ్యాప్
రువాండా యొక్క సంప్రదాయ బాలెట్ ఆఫ్రికాల్లో ఒక స్థాపించబడింది పొడవైన మరియు కనీసం బహిర్గతం సంగీత సంప్రదాయాలు ఉంది. పదం బాలెట్ ఉపయోగం బెల్జియన్ వలస పాలన ఒక ఉత్పత్తి. నిజానికి, కళ రూపం ర్వాండన్ Mwami న్యాయస్థానాలు అనేక శతాబ్దాలుగా శుద్ధి చేయబడినది (రాజులు).
ర్వాండన్ బ్యాలెట్కు మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి, మరియు సమూహం ప్రామాణిక ప్రదర్శన మూడు ఉంటాయి. ఈ పాటలు / కళారూపంగా సారాంశం అని నృత్యాలు (and are referred to here as 'the Ballet'), Intore (నాయకులు నృత్యం) మరియు Ingoma ('drums').
The 'Dance of Heroes' గడ్డి లు మరియు వాహక స్పియర్స్ ధరించిన పురుషులు నిర్వహిస్తారు. నేపథ్య తిరిగి యోధులు నిర్వహించిన నృత్యం, యుద్ధం వేడుక విజయం. నర్తకులు ఒక ముడి దూకుడు దయ మరియు క్లిష్టమైన కొరియోగ్రఫీ కలపడం వైపు నుండి వైపు తరలించడానికి. కొన్ని దశలలో నృత్యకారులు ఆపడానికి, చేతులు outstretched మరియు రక్త గడ్డకట్టిన యుద్ధం crys తయారు తో.
ఈ కాల్స్ ప్రతి నర్తకి వ్యక్తిగత మరియు అతను యుద్ధంలో చంపబడిన చేసింది ఎన్ని వివరాలు declaiming యోధులు ప్రాతినిధ్యం. సాంప్రదాయకంగా చేరి హుటు పోరాడారు, టుట్సీ మరియు TWA ఒక ఉమ్మడి శత్రువు వ్యతిరేకంగా ప్రతి-ఇతర కలసి పోరాడిన. Intore యొక్క ప్రదర్శన అందువలన ఎల్లప్పుడూ కలిసి నృత్యం అన్ని వర్గాల యోధులు కలిగి ఉన్నది.
కోసం శోధించండి:
ఎవరు ఆన్లైన్ వార్తలు
1 సందర్శకులు ఇప్పుడు ఆన్లైన్
నన్ను గుర్తుంచుకో _ నమోదు _ లాస్ట్ పాస్వర్డ్ను?
ఒక పాస్వర్డ్ను మీరు మెయిల్ చేయబడుతుంది.
లోనికి ప్రవేశించండి _ లాస్ట్ పాస్వర్డ్ను?
ఒక మెసేజ్ మీ మెయిల్ చిరునామాకు పంపబడుతుంది.
లోనికి ప్రవేశించండి _ నమోదు
మీ ఆధారాలను అప్ గురించి ...
ప్రియామణి, విమలా రామన్ లతో సుమంత్ లిప్ లాక్ |
పాకిస్తాన్ లో ఓ న్యూస్ చానల్ పని చేసే అతను సాదా సీదా జర్నలిస్టు. కానీ బజరంగీ బాయీ జాన్ సినిమాతో సెలబ్రీటీ అయిపోయాడు. అట్లని ఆయన ఆ సినిమాలో నటించలేదు. అదెలా ? అనే అనుమానం రావడం సహజమే. అదెలాగంటే.....
అతని పేరు చాంద్ నవాబ్. 2008 లో ఓ చిన్న టీవీ చానెల్ రిపోర్టర్ గా పని చేసే వాడు ఈద్ సందర్భంగా ఓ రోజు కరాచి రైల్వే స్టేషన్లో నిలబడి వచ్చిపోయే రైళ్ల రాకపోకల గురించి పీస్ టూ కెమేరా (పీ టు సీ) అనే కార్యక్రమం నిర్వహించాడు. ఆ సందర్భంగా తనకుగానీ, కెమేరాకుగానీ అడ్డొచ్చే ప్రయాణికులను తప్పుకోమని కోరుతూ. కొన్ని సార్లు వారిని తోసేస్తూ, తనదైన రీతిలో ప్రయాణికులను తిడుతూ ఆయన చేసిన హంగామా ను ఫన్నీగా ఫీలైన ఆయన మిత్రులు ఆ కార్యక్రమం ఎడిట్ చేయని వీడియో క్లిప్పింగ్ ను 2008 లో యూ ట్యూబ్ లో పోస్ట్ చేశారు. అది అప్పట్లోనే కాదు ఇప్పటికీ హల్ చల్ చేస్తోంది.
ఆ వీడియో క్లిప్పింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని బజరంగీ బాయ్ జాన్ చిత్రంలో జర్నలిస్టు పాత్రను సృష్టించారు. అంతే అతని దశ తిరిగి పోయింది. దేశ విదేశీ జర్నలిస్టులు ఆయన ఇంటర్వ్యూ కోసం క్యూలు కడుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ టీవీ, గల్ఫ్ న్యూస్, డాన్, హిందుస్థాన్ పత్రికలు, ఇంటర్నేషనల్ న్యూస్ వైర్ సర్వీస్, రేడియో మిర్చి లాంటి ఎఫ్ఎమ్ రేడియోలు ఇంటర్వ్యూలు చేయగా, మరికొంత మంది అతని ఇంటర్వ్యూల కోసం క్యూలో ఉన్నారు. బాలీవుడ్ సినిమాల్లో నటించాల్సిందిగా ఆఫర్లు కూడా వస్తున్నాయట.
బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్లు వసూలు చేస్తూ ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం బజరంగీ బాయ్ జాన్ లో పాకిస్తాన్ జర్నలిస్టు పాత్రకు స్ఫూర్తి చాంద్ నవాబ్. ఈ చిత్రంలో పాక్ జర్నలిస్టుగా నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్ర పేరు కూడా చాంద్ నవాబ్ కావడం గమనార్హం. ఈ చిత్రం పాకిస్తాన్లో కూడా సూపర్ హిట్టవడంతో చాంద్ నవాబ్ హఠాత్తుగా సెలబ్రిటీ అయ్యారు. మొన్నటి వరకు ఆయన కరాచీ ప్రెస్ క్లబ్కు రోజూ వెళ్లినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అక్కడికొచ్చే జర్నలిస్టులంతా అతనితోని ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడడమే కాకుండా కేవలం అతన్ని కలుసుకునేందుకే ప్రెస్ క్లబ్ కు ఎంతో మంది వస్తున్నారు.
తనను సెలబ్రిటీని చేసిన చిత్రం హీరో సల్మాన్ ఖాన్, తన పాత్రధారి సిద్దిఖీ, దర్శకుడు కబీర్ ఖాన్ కు చాంద్ నవాబ్ కృతజ్ఞతలు తెలియజేశారు. తనను స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా తన టీవీ కార్యక్రమంలో తాను ఉపయోగించిన భాషనే చిత్రంలో ఉపయోగించుకున్నందుకు తనకు కొంత సొమ్ము పరిహారంగా ముట్ట చెప్పాలని అతను కోరుతున్నారు. తానేమీ డిమాండ్ చేయడం లేదని, తానొక పేద జర్నలిస్టునని, గతేడాది తన భార్య కూడా చనిపోయిందని నవాబ్ చెబుతున్నారు. సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్ లు తనను కలసుకునేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ ఇచ్చారని, ఆ సందర్భంగా తనకు కొంత సొమ్ము ఇవ్వాలని ఆశిస్తున్నానని, అలా ఇవ్వకపోయినా ఫర్వాలేదని అంటున్నారు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు.... అసలు కథ !
తెలంగాణలో పెచ్చుమీరుతున్న ఇసుక మాఫియా ఆగడాలు.. ట్రాక్టర్ తో గుద్ది వీఆరేఏ హత్య !
జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ
ఆదివాసులు, లంబాడాల సమస్య పరిష్కారానికి....సూచనలు... విఙప్తి
విప్లవ రచయితల సంఘం 26వ మహా సభలను విజయవంతం చేద్దాం
పేతురు స్వస్థత – Defender's Voice
తెలుగు వెర్షన్
Vote Now – 7th 123telugu Reader’s Choice Awards – Best Comedian of 2017(123తెలుగు 7వ రీడర్స్ చాయిస్ అవార్డ్స్ – 2017 ఉత్తమ హాస్యనటుడు)
నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు |
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: June 2013
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీడియా, రాజకీయాలు, మరెన్నో
(గమనిక ఇది 2008 మే నెలలో రాసిన వ్యాసం)
రాష్ట్ర విభజనని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటే ఏ రాజకీయ శక్తీ దాన్ని ఆడ్డుకోలేదు. ఈ ఆకాంక్ష జనానిదయితే మన్నించాల్సిందే. రాజకీయమైనదయితే ఆలోచించాల్సిందే'. ఇటీవలికాలంలో - దాదాపు అన్ని పార్టీలు - ఏదో ఒక రూపంలో - ఏదో ఒక స్థాయిలో తెలంగాణా సెంటిమేంట్ని కొద్దో గొప్పో పులుముకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఒక్క సీపీఎం ను మినహాయిస్తే, ఒకప్పుడు ససేమిరా అన్న పార్టీలు కూడా ఇప్పుడు సరే అంటున్నాయి. ఈ పార్టీల్లోని కొందరు పెద్దలకి ఇది తక్షణ రాజకీయ అవసరం. అదే ఇందులోని విషాదం.
దేశం స్వాతంత్ర్యం పొందిన దరిమిలా - అనేక కొత్త రాష్ట్రాలు పురుడు పోసుకున్నాయి. పొరుగున ఉన్న అనాటి మద్రాసు(తమిళనాడు) రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం - తరువాత కొద్ది కాలానికే - భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత ప్రాతిపదిక పై - తెలంగాణా ప్రాంతాన్ని(హైదరాబాదు స్టేట్ లోని ప్రధాన భాగాలు) కలుపుకుని - ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించింది. ఒకే భాష మాట్లాడే వారికి కూడా, విడివిడిగా రాస్ట్రాలు వున్నప్పుడు - ఆంధ్ర ప్రదేశ్ ని కూడా ప్రజాభిష్టం మేరకు విభజించడంలో తప్పేమి లేదు. అయితే తప్పల్లా - ప్రజల ఆకాంక్షని అంచనా వేయడంలో చేస్తున్న తప్పులే. రాష్ట్ర విభజన అన్నది ఎవరో కొందరి రాజకీయావసరాల కోసం కాకుండా మెజారిటీ ప్రజల అబీష్టం మేరకు జరగాలి.
ఏ వేర్పాటు ఉద్యమానికయినా, వెనుకబడినతనమే ప్రాతిపదిక. దీని ఆధారంగా పెచ్చరిల్లే భావోద్వేగాలే విభజన ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి. ఈ విధంగా ప్రజ్వరిల్లే శక్తిని అడ్డుకోవడం అతికష్టం అని గతంలో తెలంగాణా ప్రజా సమితి నిరూపించింది కూడా. అయితే, అప్పటికి అంటే 1969 నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఇసుమంత కూడా మార్పు రాలేదంటే నమ్మడం కష్టం. తెలంగాణాలో ఇంకా కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదంటే నమ్మచ్చుకాని తెలంగాణాలో అసలు అభివృద్ధి జరగలేదని వాదించడం కేవలం రాజకీయమే అవుతుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. 1969 నాటికి వూహకు సయితం అందని ఉదార ఆర్ధిక విధానాలు ఈనాడు శరవేగంగా అమలవుతున్నాయి. ప్రపంచీకరణ సిద్దాంతం నేల నాలుగు చెరగులా బలంగా వేళ్ళూనుకుంటున్న నేపధ్యంలో - అసలు దేశాల మధ్యనే హద్దులు చెరిగిపోతున్నాయి.
ఏదో ఒకనాడు - తెలుగువాడే అమెరికాకి అధ్యక్షుడు కాగలడని ఆ దేశంలో ఉంటున్న తెలుగువారే భరోసాగా చెబుతున్నారంటే ఇక భౌగోళిక రేఖలకి, దేశాల సరిహద్దులకీ - అర్థమేముంటుంది? పోతే - ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని - భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఏపాటి మిగులుతాయో అర్ధం చేసుకోలేని విషయమేమి కాదు.
ఆ మాటకి వస్తే - దేశాలయినా, రాష్ట్రాలైనా, ప్రజలైనా విడిపోవడం - కలిసిపోవడం పెద్ద విషయమేమి కాదు. విభజన కుడ్యాన్ని కూలగొట్టుకుని - రెండు జర్మనీలు కలిసిపోయాయి. అమెరికాని సయితం శాసించగలిగిన స్థాయికి ఎదిగిన సోవియెట్ యూనియన్ - అంగ, వంగ, కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమయింది.
కాబట్టి - చరిత్ర నుంచి నేర్చుకున్నవారు - చరిత్ర హీనులు కాలేరు. మనసులూ - మనుషులూ కలుషితం కావడం ఏ సమాజానికి క్షేమకరం కాదు. విడీపోయినా చేతులు కలిసే వుండాలి. మనసులు మసి బారకుండా ఉండాలి .
దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండిPinterestకు భాగస్వామ్యం చేయండి
అదే ప్రేమికుడు అబద్ధం చెబితే ప్రేమలో బొంకడం కూడా ఓ కళ అంటాం.
అబద్ధాలు జీవితంలో ఓ భాగం. ఆడకపోయాడో అతడి ఆట కట్టు. అతడి మనుగడకే ముప్పు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Bhandaru Srinivasrao వద్ద 10:13 AM
వ్యాఖ్యలు లేవు: ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
ఏం చెప్పను? యేమని చెప్పను? (కధానిక)
ఆశ్రమం అన్న మాటే కానీ వున్న దానికీ, తిన్న దానికీ అణా పైసలతో సహా వసూలు చేస్తారు. ఆ డబ్బులు కట్టడానికి వచ్చే వారి పిల్లల మొహాల్లో కూడా ఏ ఒక్కనాడు నాకు సంతోషం అన్నది కానవచ్చేది కాదు. తలితండ్రుల్ని అలా చూడాల్సి వచ్చినందుకు కాదు వారి బాధ, కన్న వారి బాధ్యతలు ఇలా ఇంకా ఎన్నాళ్ళు మోయాలో అన్నదే వారి అసహనానికి కారణం అని మెలమెల్లగా బోధపడుతూ వచ్చింది. ఈ నేపధ్యంలో -
మరోసారి వివరాలు చూసాను. పెద్ద ఉద్యోగం చేసాడు. పెద్ద పెద్ద హోదాలు అనుభవించాడు. భార్య ఏడాది క్రితమే కన్ను మూసింది. లంకంత కొంపలో ఒకే ఒక్కడు. ఇద్దరు కొడుకులూ, ముగ్గురు అమ్మాయిలూ అందరూ కట్టుకున్నవాళ్ళతో, పుట్టిన సంతానంతో కలసి విదేశాల్లో సెటిల్ అయ్యారు. వాళ్లు రమ్మంటారు. ఈయన పోనంటారు. తలచుకుంటే ఇంత కంటే మంచి సౌకర్యాలు వున్న ఓల్డ్ ఏజ్ హోంలో దర్జాగా చేరగల స్తోమత వున్నట్టే వుంది. దీన్నే ఎందుకు ఎంచుకున్నాడో తెలవదు. |
ఆయన వుండబోయే గది ఎలావుంటుందో నాకు తెలుసు. ఆ గదిలో మొన్న మొన్నటి వరకు వున్న వృద్ధురాలు మొన్నీమధ్యనే కాలం చేసింది. చిన్న గది. ఓ మేజా. ఓ పక్కగా కిటికీ. దానికి వేలాడుతూ పాత కర్టెన్. దాన్నిమార్చండి బాబూ అని పోరు పెడుతూనే ఆ వృద్ధురాలు ఏమారి పోయింది. తెలియని లోకాలకు తరలిపోయింది. ఎందుకయినా మంచిదని ఆయన వుండబోయే గది తీరుతెన్నులు గురించి ముందే చెవిలో వేసాను. బదులుగా ఆయన చిన్నగా నవ్వాడు.
గది చూపించడానికి నేను ముందు నడిచాను. చేతి కర్రను ఊతంగా తీసుకుని ఆయన నా వెంట నడిచాడు.
గదిని చూసి ఆయన నిరాశ పడతాడనుకున్నాను. అదేమిటో విచిత్రం! పదేళ్ళ పిల్లాడు ఆటబొమ్మ చేతిలో పెడితే మురిసిపోయినట్టు ఆనందంగా చుట్టూ చూస్తూ ‘బాగుంది. నాకిది బాగా నచ్చింది’ అన్నాడు.
అర్ధం కానట్టు పెట్టిన నా మొహాన్ని, అందులోని భావాలను గమనించి ఆయన మెల్లగా చెప్పాడు.
‘గదిలో ఫర్నిచర్ ఎలావుంది? ఫాన్ వుందా? ఏసీ వుందా? అన్న వాటిని బట్టి చూస్తే, నిజమే ఈ గది అంత బావోలేదు. ఇలాగే వుండాలని నేను వచ్చేముందు అనుకోలేదు. అందువల్లనే నాకు నచ్చింది. ఇలా వుండాలి అని ముందు అనుకుని అలా లేకపోతే తరువాత మిగిలేది నైరాశ్యమే.’
కానీ ఆయన మాటలు కొనసాగించాడు. ముందు అంతగా పట్టించుకోకపోయినా ఆయన మాటల్లోని ఆకర్షణ శక్తి నన్ను కట్టిపడేసింది.
‘భార్య చనిపోయిన తరువాత కొన్నాళ్ళ పాటు ఈ లోకం శూన్యం అనిపించింది. ఆవిడతో పాటే నేనూ పోయి వుంటే యెంత బాగుండేదో అనుకునే వాడిని. కానీ క్రమంగా మళ్ళీ నలుగురిలో పడ్డాను. ఈ లోకానికి నేను చేయగలిగినదేమయినా వున్నదా అని ఆలోచించాను. పిల్లలు వాళ్ల మానాన వాళ్లు స్తిరపడ్డారు. ఒక్కడికీ అంత ఇల్లు అనవసరం అనిపించింది. చిన్న పిల్లలకు ఉచితంగా చదువు చెప్పే ఓ సంస్తకు రాసిచ్చాను. అనాధ బాలలను పెంచి పోషించే మరో సంస్తకు వున్న డబ్బంతా ఇచ్చేసాను. సంపాదించిన దానికి సార్ధకత లభించింది. సంపాదన మళ్ళీ మొదలు పెట్టాలి. కాకపొతే అది డబ్బు కాదు. నలుగురితో మంచిగా వుండడడం, మంచి అనిపించుకోవడం. నిజానికి ఇది డబ్బు సంపాదించడం కన్నా కష్టం.
‘చిన్నదో పెద్దదో ఆ మంచంలో పడుకుంటాను. నా వొంట్లో ఏ అవయవం సరిగ్గా పనిచేయడం లేదో, దానివల్ల పడాల్సిన బాధలేమిటో ఆ మంచంలో పడుకుని ఆలోచిస్తాను. పొద్దున్న లేచిన తరువాత అవయవాలన్నీ సరిగ్గా వుంటే వాటిని అలా సక్రమంగా పనిచేయిస్తున్న ఆ సర్వేశ్వరుడికి ఓ దణ్ణం పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు కావాల్సింది నా ఆరోగ్యం. మరొకరికి భారంగా మార్చే అనారోగ్యాన్ని దూరంగా వుంచడం. ఇది నా చేతిలో వుందనుకోను. అయినా మానవ ప్రయత్నం చేయాలి కదా.
‘ప్రతి ఉదయం, ప్రతి ఉషోదయం నాకు అదనంగా దేవుడిచ్చిన వరమనే భావిస్తాను. పొద్దున్నే లేచి లోకాన్ని మళ్ళీ చూడగలగడం కంటే ఈ వయస్సులో కావాల్సింది ఏముంటుంది? అలా వచ్చిన ఆ కొత్త రోజుకు స్వాగతం చెబుతాను. నా జీవిత కాలంలో నాకు సొంతమయిన మధుర క్షణాలనన్నింటినీ మరో సారి మననం చేసుకునే మహత్తర అవకాశం దొరికిందని ఆనందిస్తాను.
‘ వృద్ధాప్యం బ్యాంక్ ఎక్కౌంట్ లాంటిది. జీవన యానంలో సంపాదించి కూడబెట్టుకున్న దాన్ని అందులో డిపాజిట్ చేసుకోవచ్చు. జీవితం చరమాంకంలో తిరిగి తీసుకోవచ్చు. అది డబ్బే కానక్కర లేదు సుమా! నీవంటివారి నుంచి పొందే వాత్సల్యం కూడా అలాటిదే.
‘ఈ రోజున ఇలా తారసపడి నీ ప్రేమాభిమానాలతో నా బ్యాంక్ ఖాతాను పెంచుతున్నావు. అంటే నేను తిరిగి తీసుకునే ఆనందాన్ని మరింతగా పెంచుతున్నావన్న మాట. అందుకు నేను నీకు సదా రుణపడివుంటాను.’
ఆ వృద్ధుడి మాటలు వింటుంటే నాకు నోట మాట రాకుండా అయిపోయింది.
1 వ్యాఖ్య: ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
కానీ ఇదేవిటి?
ఒకప్పుడు మన రూపాయికి పదమూడు అమెరికన్ డాలర్లు. ఇప్పుడో.
ఒక డాలరుకు అరవై రూపాయలు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Bhandaru Srinivasrao వద్ద 2:37 PM
( జూన్ 28- మాజీ ప్రధాన మంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి)
గూగుల్ ఇమేజ్ సెర్చ్ సర్ఫ్ చేసుంటే ఒక కార్టూన్ కనిపించింది.
కంప్లెయంట్స్ (ఫిర్యాదులు), గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత) అనే రెండు కౌంటర్లు వుంటాయి.
పిర్యాదుల కౌంటర్ వద్ద పెద్ద క్యూ వుంటుంది.
వర్తమాన ప్రపంచానికి – ముఖ్యంగా భారత దేశానికి అద్దం పట్టే కార్టూన్ అని నాకు అనిపించింది.
ఎనభయ్యవ దశకంలో నేను మాస్కోలో వున్నప్పుడు వేల సార్లు విన్న పదం – ‘స్పసీబా’ – అంటే ఇంగ్లీష్ లో ‘థాంక్స్’ – మన తెలుగులో ‘ధన్యవాదాలు’. బహుశా ఈ పదం ఇంత పెద్దగా వుండడం వల్లనో ఏమో ఇది పలకడానికి జనం కొంత సంకోచిస్తున్నారనుకోవాలి.
రష్యన్లు - ఆ మాటకు వస్తే ప్రపంచం లోని అనేక దేశాలవాళ్ళు కృతజ్ఞతను బాహాటంగా వెల్లడిస్తుంటారు. అది వారి జీవన విధానంలో ఒక భాగమై పోయింది. పైకి వ్యక్త పరిస్తేనే కృతజ్ఞతా భావం వున్నట్టని చెప్పడం నా వుద్దేశ్యం కాదు. తెలుగు సినిమాల్లో అన్నాచెల్లెళ్ళు ఒకరినొకరు పెనవేసుకుని ‘అన్నయ్యా ! చెల్లెమ్మా!’ అంటూ చెప్పుకునే డైలాగులు వింటే కంపరం కలుగుతుంది కానీ, వారి నడుమ వున్న ‘ఆత్మీయతా భావం ‘ అవగతం కాదు. అయితే – చేసిన మంచిని మరచిపోవడం మనుషులకు వుండాల్సిన లక్షణమని అనుకోలేము. |
‘కృతజ్ఞత’ అన్న పదానికి ఈనాటి రాజకీయాల్లో స్తానం వున్నట్టులేదు. రాజకీయనాయకులకు ‘వడ్డించేవాడు’ ప్రధానం కాని ‘వడ్డించిన’ వాడు కాదు.
పీవీ నరసింహారావుగారి విషయమే తీసుకుందాం. ప్రధానిగా వున్నంతకాలం ‘ఆహా! ఓహో!!’ అన్నారు. ఆర్ధిక సమస్యలతో పీకలలోతు మునిగిపోయివున్న దేశాన్ని నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. బొటాబొటి మెజారిటీ తో వున్న పాలక పక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠం పై వుంచిన ‘అపర చాణ క్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం కావడంతోనే – ఆ నోళ్ల తోనే – ‘అధికారాంతమునందు చూడవలె ‘ అని పద్యాలు పాడడం ప్రారంభించారు. ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తికి ఆయన్ని మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ ‘పదవే’ సర్వస్వమయిన వారికి ‘ఆయన భజనే’ సర్వస్వమయిపోయింది. పీవీని విమర్శించిన ‘పత్తిత్తులకు’ ఆయన చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు. అయిదేళ్ళు ‘తెలుగువాడి’ లోని ‘వాడినీ – వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త – న్యాయస్తానాలలో నిస్సహాయంగా ‘బోనులో’ నిలబడ్డప్పుడు ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’ మూసుకున్నారు. ప్రధానిగా పీవీ ని సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో ‘కృతజ్ఞత’ అనే పదానికి తావు లేకుండాపోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ. పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు హడావిడి ఒక విలేఖరిగా నాకు తెలుసు. ఆకాశవాణి ప్రతినిధిగా కలుసుకోవాలన్నా ఎంతో కష్టంగా వుండేది. అధికారులు, అనధికారులు, మందీ మార్భాలాలు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు – ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో బస చేసినప్పుడు – నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్, న్యూస్ ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి - ఆ పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని 'పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అడిగాము. అతడు తాపీగా 'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
పెట్టిన తరవాత – మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే టీవీలో ఫుట్ బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేసామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము.లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయా!' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేసారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అదీ పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది – కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల – కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత – కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది.
ఇలాటి నేపధ్యాలున్న మన రాష్ట్ర రాజకీయ రంగంలో -
అధికారం చేజారితేనే పట్టించుకోని రాజకీయ నాయకులు - ప్రాణాలు విడిచిన తమ నాయకులను పట్టించుకుంటారనుకోవడం భ్రమ. రామారావయినా, రాజశేఖరరెడ్డి అయినా అంతే.
కొన్నాళ్ళ తరవాత – పిల్లలకు ‘కృతజ్ఞత’ గురించి తెలియచేప్పాలంటే – మ్యూజియం కు తీసుకు వెళ్ళాలేమో!
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Bhandaru Srinivasrao వద్ద 8:43 AM
3 వ్యాఖ్యలు: ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
లేబుళ్లు: పీవీ నరసింహారావు, P.V.Narasimha Rao
(బెజవాడ మీద రాసిన బ్లాగు చదివి ఎంతోమంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. పోతే, ప్రత్యేకించి దాసు కృష్ణ మూర్తి గారు బెజవాడతో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను వివరంగా పేర్కొంటూ ఇంగ్లీష్ లో సుదీర్ఘంగా రాశారు. దాన్ని తెలుగులో అనువదించి అందరితో పంచుకోవాలని అనిపించింది.నాకు రాసిన లేఖలో కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ - I live in the United States. I am a migratory bird with three migrations, first to Hyderabad, second to Delhi and the third to America. I stayed in Bezwada for 27 years, Hyderabad 29 years, Delhi 20 years and the U.S. 11 years.- అని రాశారు. దీనిబట్టి ఇక వారి వయస్సును, అనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు. వారి ఫోటో ఒకటి సంపాదించగలిగితే ఈ వ్యాసానికి మరింత పరిపూర్ణత్వం సిద్ధించేది. కాని తొలి పరిచయంలోనే ఫోటో పంపమని అడిగే చనువు తీసుకోలేకపోయాను – భండారు శ్రీనివాసరావు ) |
అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.
“1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన ‘కృష్ణ లీల’ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత - కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.
“సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.
“అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లి తో ‘వరవిక్రయం’ వచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్ర నిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం బెజవాడలోనే.
“ఆ రోజుల్లో ఇలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిత్రానికి చిత్రానికీ నడుమ కనీసం పదిహేనురోజులో,నెల రోజులో వ్యవధానం వుండేట్టు చూసుకునేవారు. సినిమా విడుదలలు లేని ఖాళీ రోజుల్లో ఆ ధియేటర్లలో డ్రామాలు ఆడేవాళ్ళు.
“నలభయ్యవ దశకంలో మరో ధోరణి కనబడింది. తెలుగు సినిమాలు దొరక్కపోతే అరవ చిత్రం వేసేవాళ్ళు. హాలు మధ్యలో అనువాదకుడు నిలబడి కొన్ని డైలాగులను తెలుగులో అనువదించి చెబుతుండేవాడు. ఇంటర్వెల్ సమయంలో సినిమా సాంగ్స్ పేరుతొ ఆ సినిమా పాటల పుస్తకాలను అమ్మేవాళ్ళు. వాటికి మంచి గిరాకీ వుండేది.
“సినిమాహాళ్లలో పారిశుధ్యం పూజ్యం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నేల క్లాసు అని ఒక తరగతి వుండేది. ఆ క్లాసులో పైన నేల మీద కూర్చున్న వారిలో ఎవరి పిల్లవాడయినా మూత్రం చేస్తే అది కింద దాకా పారుతుండేది. కింది వైపు కూర్చున్న వారి లాగూలు తడిసేవి. మరుగు దొడ్ల సౌకర్యం వుండేది కాదు. “ఇంటర్వెల్ కాగానే ప్రేక్షకులు ఒక్కమారుగా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి సినిమా హాలు గోడల్ని ప్రక్షాళన చేసేవాళ్ళు.
“1939 లో అనుకుంటా బెజవాడలో కొత్తగా రామా టాకీసు వచ్చింది. తరువాత వరుసగా గవర్నర్ పేటలో లక్ష్మీ టాకీసు, వన్ టౌన్ లో సరస్వతీ మహలు వచ్చాయనుకుంటాను.
“ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే-
“వూళ్ళో దాదాపు అన్నీ శాఖాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు. చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి – అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.
”గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే! మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్ రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి గుంటూరుకూ, ,తెనాలికీ బస్సు సర్వీసు వుండేది కాదు. |
“మా ఇల్లు గవర్నర్ పేటలో వుండేది. ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. మాకు వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు. (వీలు దొరికితే మరి కొన్ని సంగతులు మరోసారి)
లేబుళ్లు: దాసు కృష్ణ మూర్తి గారు, బెజవాడ, Bezavada, Sri Dasu Krishna Murthy
క్రొత్త పోస్ట్లు పాత పోస్ట్లు హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్లు (Atom)
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
ప్రముఖ పోస్ట్లు
(PUBLISHED IN 'ANDHRA JYOTHY' TELUGU DAILY ON 14-01-2017, SATURDAY) (జనవరి 14 జంధ్యాల జయంతి) జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ...
రామోజీరావు మొదటి ఓటమి (వెటరన్ జర్నలిస్ట్ శ్రీ వి.హనుమంతరావు రాసిన ‘జర్నలిస్ట్ అంతర్వీక్షణం’ పుస్తకం నుంచి కొన్ని భాగాలు) “యు.ఎన...
(సెప్టెంబర్ రెండో తేదీ వైయస్సార్ వర్ధంతి - ఈరోజు 'సాక్షి'దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) దేశవ్యాప్తంగా , మీడియాలో , ప...
రోజుకో రూపాయితో కిడ్నీ బాధలు దూరం మీరెప్పుడన్నా హైదరాబాదు హుస్సేన్ సాగర్ వద్ద వున్న జలశుద్ధి కేంద్రాన్ని చూసారా. నిజాం నవాబు కాలం...
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 02-08-2015, SUNDAY) బుధవారం అర్ధరాత్రి యావత్ దేశం నిద్రావస్థలో వున్న వేళ, దేశ అత్యు...
మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే! (నెట్ లో చక్కర్లు కొడుతున్న జోక్) ఇంకెవ్వరు? మన కనిమొళి మొగుడు జి.అరవిందన్ ఎందుక...
1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు?
1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు? ఐతరేయ బ్రాహ్మణమా? - భండారు శ్రీనివాసరావు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్...
బెజవాడ అంటే ఇదా!
బెజవాడ అంటే ఇదా! ఓ బెజవాడ అభిమాని ఆక్రోశం – ఈ మధ్య విడుదలయిన ‘బెజవాడ’ తెలుగు సినిమా గురించి ఓ బెజవాడ అభిమాని ఆర్.వీ.వీ. కృష్ణార...
"ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు"
"ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు" (మాజీ డీజీపీ హెచ్.జె.దొర రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం నుంచి మరి...
మార్గశిర మాసం, కృష్ణ పక్షం, దశమి, శుక్రవారం. తెలంగాణలో కొత్త బంగారు లోకం ఆవిష్కృతమైంది. నివేశన స్థలం, పూరి పాక, పక్కా ఇల్లు ...
బాలయ్య బాబు అను మా నాయన బాలయ్య
కృష్ణ గారు – కాటికాపరి
జ్ఞాపకాలు పంచుకోవడం అంటే ఇదే.
అసెంబ్లీ అప్పుడు – ఇప్పుడు 1976ఉదయం ఎనిమిదిన్నర.‘ఆ...
ఇది ఇండియా – అది అమెరికా
సాధారణ థీమ్. Blogger ఆధారితం. |
అఖిలవనిత: ఏనుగు నల్లన – ఎందుకని?
అఖిలవనిత !!!! చిన్న హాస్యాలు, వ్యాసాలు, భక్తి గీతములు,లలిత గీతములు, బొమ్మలు,అవీ ఇవీ అన్నీ,
ఏనుగు నల్లన – ఎందుకని?
ఎంతో చక్కని దేవుడు ”
బాల బాలికలు పాటలతో ఆటలు ఆడుతూ ఉన్నారు.
అక్కడికి మాస్టారు వచ్చారు.
మయూరికి సందేహం కలిగింది.
ఈ పరిణామానికి ఒక స్థల పురాణము ఉన్నది.
ఆనైయూర్ అనే పుణ్య క్షేత్రము, తమిళనాడు లో ఉన్నది.
ఈ దేవళమునకు ఒక గాథ కలదు.
దాని పేరు ఐరావతము.
దాని వన్నె తెలుపు.
ఆ గజరాజు గర్వం కలిగి ఉండేది.
ఒక రోజు స్వర్గమునకు దూర్వాస మహర్షి వచ్చాడు.
ఆ ఋషి తత్వము గురించి అందరికీ తెలుసు.
అందుకనే ఇంద్రుడు మునికి స్వాగతం పలికి మర్యాదలు చేసాడు.
ఇంద్రునికి అతను ఒక తెల్లని పుష్పమును ఇచ్చాడు.
ఇంద్రుడు “ఈ పువ్వును నా భార్య శచీదేవికి ఇస్తాను” అని అనుకున్నాడు.
కానీ ఆ రోజు సభలో చతుర్దశభువనముల యొక్క అనేక సమస్యలను గురించి,
పని ఒత్తిడి వలన ఆతడు దివ్య ప్రసూనము గురించి పూర్తిగా మర్చిపోయాడు.
అసలే తెలుపు, ఇప్పుడు అమోఘ తేజస్సుతో, మిసమిసలాడసాగింది.
“ఓ మదగజమా! పుష్ప ప్రభావమువలన గొప్ప శక్తి నీకు వచ్చింది.
ఇలా విర్రవీగడం నీకు తగదు” అంటూ హెచ్చరించాడు.
“ఓ దంతీ! ఇకమీదట మీ గజ జాతి నల్లగా ఉంటాయి”
ఉరుముతూ అన్నాడు.
అలాగ పృధ్వీతలమున సంచరిస్తూండగా, ఒక చోట వర్షం వచ్చింది.
ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం అసాధ్యమైనది.
“ఈ స్థలం పవిత్రమైనది. నన్ను ఈ సీమలో ఉంచండి” అని సెలవిచ్చాడు.
ఆ ఊరికి “Aanaiyur” అనే పేరు వచ్చింది.
ఈ ఆలయము Usilampatti అనే ఊరికి దగ్గరలో ఉన్నది.
జనవరి రెండవ వారములో Thai pongal – వస్తుంది.
ఉత్సాహభరితంగా జరుపుకుంటారు.
కథలు, జానపద కథలు. ;
రచన: కాదంబరి
Labels: జాబిల్లి, వ్యాస లహరి
అ - అచ్చులు
టిబెట్ లో యోగి, Milerapa
ఇది యేమి వింత?
పొలాలే చిత్రాలు, బొమ్మలు (Essay) |
ముందు మీ లతక్కాను దేంగు బాబు.. దాని పూకు ఫ్రెష్. - Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు
Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు
Home Unlabelled ముందు మీ లతక్కాను దేంగు బాబు.. దాని పూకు ఫ్రెష్.
ముందు మీ లతక్కాను దేంగు బాబు.. దాని పూకు ఫ్రెష్.
నా పేరు అజయ్... నేను హైదరాబాద్లో ఉంటాను... ఈ ఇన్సిడెంట్ మా అన్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో జరిగింది. ఎందుకంటే అప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి.
రాత్రి డిన్నర్ చేసుకొని సమ్మర్ కాబట్టి పడుకోవడానికి డాబా పయకి ఎక్కాను.. ఇళ్ళు మొత్తం అమ్మాయిలు. వాళ్ళని చుస్తే దేన్గులాట తెలిసిన నా మొడ్డ ఆగడంలేదు. సంధ్య తో దేన్గులాడిన సంగతులు ఆలోచిస్తూ నా మోడ్డను చేతులో పట్టుకున్నాను. ఎవరో వస్తున్నట్టు సౌండ్ వస్తే నిద్ర పోయినట్టు నటించాను. తీరా చుస్తే.. లతక్కా, రూపా వచ్చి నా పక్కన బెడ్ రెడీ చేసి పడుకున్నారు. లతక్కా నన్ను రెండు .మూడు సార్లు పిలిచింది. అయినా నేను పలకలేదు..నిద్ర పోయాను ఆనుకొని వాళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. కొంత సేపటి తరువాత చిన్నగా కళ్ళు తెరిచి చుస్తే.. న పక్కన లతక్కా పడుకొని ఉంది. లతక్కా పక్కన రూపా కుర్చుని ఏంటి సరళా సంగతులు అని అడిగింది.
లతక్కా: విలేజ్ లో ఏమి ఉంటాయే.. నువ్వు చెప్పు సిటీ సంగతులు అంది.
రూపా: అన్ని మాములే.. సిటీ లో వుంటే నా బాయ్ఫ్రెండ్ తో మజా చేసేదాన్ని. రాను అంటే... వినకుండా పిలిపించావు.. సరే ఇక్కడ ఎవరినైనా అరేంజ్ చెయ్యే..
లతక్కా: ఓయ్.. ఇది సిటీ కాదు.. విలేజ్ ..! ఇక్కడ అలాంటివి ఏమి కుదరదు.
రూపా: మరి ఎలాగా... ? నాకు గుల ఎక్కువ.. అంది.
లతక్కా: నీకు గుల ఎక్కువ అని నాకు తెలుసు.. అయినా ..ఈ వారం రోజులు.. చెయ్యి తో పని కానివ్వు.
లతక్కా: ఉంమ్మ్.. అని మూలిగింది.
రూపా: సరే.. ఇంతకీ.. నీ పూకు సీల్ ఓపెన్ చేసావా లేదా అంది.
లతక్కా: లేదే.. ఈ విలేజ్ లో ఏమి చేసినా.. అందరికి తెలుస్తుంది.
లతక్కా: నేను రెడీ అంటే ఎక్కడైనా చాలామంది వున్నారు..నన్ను దేన్గడానికి.
రూపా: ఎవరో ఎందుకే.. నీ సల్లు చూస్తుంటే నాకే దేన్గాలని ఉంది..అని లతక్కా సల్లని..రెండు చేతులతో బలంగా పిసికింది.
లతక్కా: ఒసేయ్... చిన్నగా.. నొప్పి చేస్తుండే.. అయినా.. నువ్వు నన్ను ఎలా దేన్గుతావు..? నీకు సులలి లేదుగా..అంది.
రూపా: ఎందుకే..అప్పడప్పుడు ఎవరితోనన్నా ఇలా చేస్తే..బడగ వుండదు.. అయినా...ఏందే.. నీ సల్లు ఇంట మెత్తగా వున్నాయి అంది. ఈ స్సున్స్ చూస్తున్న నాకు..చేతిలోనే. కారెంత ఫుల్ గా చేచింది నా మొడ్డ.
రూపా: మెల్లగా... పక్కన..మీ తమ్ముడు లేస్తాడు..అని లతక్కా రెండు చేతులని పైకి పెట్టి పూర్తిగా లతక్కా మీద పడుకొని కినకి జరిగి లతక్కా బొద్దులో నాలుక పెట్టి ముద్దుపెట్టింది.
లతక్కా: రూపా... ఇంకా చలే.. అజయ్ లేస్తాడు అంది.
రూపా: అవును..నీకు తమ్ముడు లేదు కదా... మరి అజయ్ ఎవరు అంది..
లతక్కా: మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. హైదరాబాద్ లో వుంటాడు అంది.
రూపా: సిటీ లో నా.. ఐతే ..దేన్గడం స్టార్ట్ చేసే వుంటాడు అంది.
లతక్కా: ఒసేయ్..ఎం మాటలే..చిన్నపిల్లోడు.. అంది.
రూపా: ఒక సరి ట్రై చేద్దామ..చిన్న పిల్లోదో కాదో..
లతక్కా: వద్దే.. వాడు నా తమ్ముడు.
రూపా: నీకు తమ్ముడు..నాకు కాదు...ఒక సరి ట్రై చెయ్యనా..
లతక్కా: రూపా... వద్దు.. వాడు ఎవరికిన చెబుతాడు...
రూపా: ఎవరికే..చెప్పాడు.. నువ్వు తెన్సే ఫీల్ అవ్వకు.
లతక్కా: సరే.. నీ ఇష్టం ..జాగ్రత్త..
రూపా: మా లతక్కా పై నుంచి లేచి నా దెగ్గరగా వచ్చి.. దుప్పటి కొద్దిగా పైకి లాగి..తొంగి చూసింది.. లోపల న మొడ్డ బాగా లేచి చేతిలో నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూసి లతక్కాతో చిన్న పిల్లడు అవ్వవు.. ఇది చూడు.. గాడిద మొడ్డ లాగ ఎంత వుందో..
లతక్కా: అవునే.. దాన్ని చూస్తుంటే..నా పూకు జరా జరా అంటుంటే...
రూపా: ఓయ్.. వాడు నీ తమ్ముడు.
లతక్కా: తమ్ముడు తరువాత...ముందు..నేను దేన్గించుకుంట అని రూపా వెనకాల వచ్చి దాని సల్లు బలంగా పిసికింది.
రూపా: ఆగవే.. ముందు వాణ్ణి లేపాలి..నువ్వు బ్లౌసే వేసుకో..
లతక్కా: ఎందుకు.. ఎలాగో.. ఇప్పుడు వేప్పాలి కదా...
రూపా: తొందర పడొద్దు..ఇలాగే దేన్గించుకుంటే చుట్టూ అందరికి కనిపిస్తాము.. ఆ మూల రూం లోకి వెళ్దాము.
లతక్కా: సరేలే..అని టక టక లతక్కా బ్లౌసే సరి చేసుకొని బెడ్ తెసుకొని రూం లోకి వెళ్ళింది.. ఎదంహ చూస్తూ వింటున్న నాకు చాల ఆనందంగా ఉంది.. ఒకే రోజు రెండు పుకులు దేన్గొచ్చు అని.
రూపా: అజయ్.. అజయ్.. అని పిలిచింది.
నేను: నిజంగా నిద్ర లోనుంచి లేచినట్టు.. ఏంటి లతక్కా అన్నాను.
రూపా: నేను..మీ లతక్కా ఆ రూం లో పడుకున్నాము.. కొంచం బయంగా ఉంది.. నువ్వు తోడుగా రావా..అంది.
నేను: స్టొరీ మొత్తం తెలుసు కాబట్టి..సరే లతక్కా..పదంటి... వస్తాను అని లేచి బెడ్ తెసుకొని రూం లోకి వెళ్ళాను.. అక్కడ మా లతక్కా బెడ్ రెడీ చేసింది. నేను వెళ్లి గోడ సైడ్ పడుకున్నాను.
లతక్కా: రూపా.. డోర్ లాక్ చేసి వచ్చి పడుకో అంది. |
లతక్కా అబా...... ఆహా.....మంట.. వొద్దు..! సుల్లిని బయటకు తెయ్యరా...! అని గట్టిగా అరుస్తుంటే రూపా వచ్చి లతక్కా నోరు మూసి లంజదానా.. ఎందుకు అరుస్తావు పక్కన ఎవరన్నా వుంటే మన పని అయిపోతుంది అని.., దేంగు లంజ దాని పూకు పగిలి రక్తం రావాలి అంది. వొద్దులే లతక్కా బాద పడుతుంది.. రేపు దేన్గుత అన్నాను. అంత సీన్ లేదు. రేపు కూడా మీ లతక్కా ఇలాగే బాధపడుతుంది.. టైం వేస్ట్ చేయ కుండా దెంగు అంది.
నేను నా బలమంతా తీసుకొని గట్టి స్ట్రోక్ ఇచ్చాను. ఈసారి నా మొడ్డ అంతా మా లతక్కా పూకులో ఉంది. బాధతో విల విల లాడుతూ కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. అది చూసి నేను రూపా లతక్కాను వొదులు అన్నాను. లతక్కా మీద ప్రేమ చాలానే వుందే. ఏమవ్వదులే.. ఫస్ట్ సెక్స్ చాలా బాదగా ఉంటుందే.. తరువాత సుకంగా ఉంటుండి..నన్ను ఫస్ట్ నా బాయ్ఫ్రెండ్ దెంగినప్పుడు నేను కూడా ఇలాగే అరిచాను అని చెబుతూ లతక్కా నూరు తెరిచింది. లతక్కా నన్ను, రూపా ను బండ బూతులు తిట్టింది.
లతక్కా ఆహ్చ..........అని గట్టిగా అరిచింది. నేను లతక్కా సల్లు గట్టిగా పిసుకుతూ ఎందుకు అరుస్తావ్ అన్నాను.దానికి లతక్కా నా పూకులో మోడ్డకు బదులు ఐరన్ రోడ్ పెట్టినట్లు ఉంది అందుకే అరిచాను అంది. మొడ్డ పెదేతేనే అంత బాధగా ఉందా..? అయినా నీ బోయ్ ఫ్రెండ్ దేన్గాడు కదా అన్నాను. వాడి మడ్డ ఇంత లావు లేదు పైగా వాడు ఇలా వెనక నుంచి ఎప్పుడూ దేన్గలేదు అంది. సరే మరి ఇప్పుడు ఇలాగే దేన్గాలనా ...లేక పొతే మా లతక్కా మాదిరిగా దేన్గాలనా అన్నాను.
మార్నింగ్ 6ఓ'క్లాక్ మెలుకువ వచ్చింది. చుస్తే ఇద్దరు అక్కలూ లేరు. నేను లేచి కిందకి వెళ్ళాను. అప్పుడే లతక్కా స్నానం చేసి వచ్చింది. నన్ను చూసి స్మైల్ ఇచ్చి వెళ్ళింది. మార్నింగ్ టిఫిన్ చేసిన తరివాత సడన్ గా గుర్తు వచ్చింది. రాత్రి వాడిన కాండమ్ గురించి వెంటనే పయకి వెళ్ళాను. అక్కడ కండోమ్స్ లేవు. అక్కవాళ్ళు తీసివుంటారు అనుకొని కిందకి వచ్చి రూపా ను అడిగా మేము తెయలేదు అంది.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
“ప్లీజ్.. చెప్పొద్దు… నీకు ఏది కావాలంటే అది ఇస్తాను…”
Telugu Sex Stories నా పేరు ప్రవీణ్. వయస్సు 26 చూడడానికి మామూలుగా వుంటాను. నాకు అమ్మాయలు అంటే చాల ఇష్టం. ఎందుకో తెలియదు కానీ ఆడవాళ్ళని చూ...
వయస్సు 16 ఏళ్లు, నేను 10 వ తరగతి చదువుతున్నాను. మా ఇంటిలో నేను, మా అమ్మ (లలిత), నాన్న(గోపాల్) ఉంటాము. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా స్వస్ధలం...
నాకు పుట్టినోడివి నీకే అంత కసి ఉంటే, కన్నదానిని నాకు ఎంత ఉండాలి…కుమ్మరా…కుమ్ము..మ్..మ్..
మీ ఇష్టం అయ్యగారు ఎక్కడ ఎలా కావాలంటే
Telugu Sex Stories నా బావమరిది నాకంటే 5 సం చిన్నవాడు వాడు నేనంటే చాల ఇష్టం గా వుంటాడు ఒక రోజు వాడు నా దగ్గరకు వచ్చి నన్ను తన పెల్లిచుపుల...
Telugu sex stories అక్కా!…సరే , మీద బరువెయ్యకుండా చేస్తాలే! Akka Pregency Tho Dengina Tammudu Telugu sex Stories బావేమో మరోసారి మీ సుమతక్క...
ఒక రోజు మా ప్లాన్ ప్రకారం మధ్యాహ్నం తలనొప్పి అని రూమ్ కి వచ్చేసింది, నేను కాలేజీ బంక్ కొట్టి తన కోసం రూమ్ లొనే ఉన్నాను ఆ రోజు మూడు గంటల...
telugu sex stories ఏంటి……వెతుకుతున్నావు….?” “శివా….ప్లీజ్…..బట్టలు ఇవ్వు.చాలా సిగ్గుగా ఉంది” “మ్మ్మ్మ్……ఇదిగో…” కొద్దిగా ఒంగి తన చేతికి ఇ...
Telugu Sex Stories నా ఫ్రెండ్ పేరు రాజా. వాడి కో చెల్లెలు. వాళ్ళది సొంత ఊరు గుడివాడ. కాని ఇద్దరూ హైదరాబాద్ లో ఒక ఇల్లు తీసుకొని చదువుకుం...
“ఏంటి మరిది గారికి చనువు ఎక్కువవుతోందే …
Telugu Sex Stories “ఆహ్..అలాగే..నెమ్మదిగా…. చీకండీ….ఊం…ఆహ్…కితకితలు….ఇష్…..ఆబగా ఉండండీ…..ఇంకా చీకండీ…..నాలికని లోపలికి తొయ్యండీ…ప్లీజ్…”...
దెంగితే దాని పూకు ఏమైనా అరిగిపోతుందా – రెండవ భాగం
నీ పూకు దుమ్ము దులిపేస్తా ఈ రోజు
నువ్వు నా మేడలో ఈ తాళి వేసి అప్పుడు నా పూకు లో నీ ...
నా ఇస్టం వచ్చినప్పుడు దెంగుతానే పూకు- telugu sex s...
సుఖాల సుడిగుండం నా పూకులో-telugu sex stories
నీ పువ్వు మీద ఒట్టు నీ దగ్గు బాగా ఆదరకోడతా
Copyright © Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు All Right Reserved |
తాజా వార్తలు
సామాజిక న్యాయం
సోర్స్ కోడ్
చైల్డ్ హుడ్
మహబూబ్ నగర్
కోహ్లీ 15 రేటింగ్ పాయింట్లు కోత
ఖుంటియా సంచలన వ్యాఖ్యలు
మీరు ఇక్కడ ఉన్నారు
ఆఫ్ఘనిస్థాన్లో పుట్టిన నదుల్లో ఆక్సస్ తరువాత అతి పెద్దది హెల్మాండ్. హిందుకుష్ పర్వతాల్లో ఇది పుట్టింది.మొదట ఎత్తైన పర్వతాల మధ్య పొడవాటి లోయల గుండా ఈ నది ప్రవహిస్తుంది. ఎత్తైన ప్రాంతాలను దాటగానే హెల్మాండ్ నదిలో తూర్పు నుండి వచ్చే అర్ఘాన్దాజ్ నది కలుస్తుంది. ఈ సంగమానంతరం హెల్మాండ్ నది గార్మసర్ ఎడారిగుండా ప్రవహించి సిస్టాన్లో హమున్-ఇ-హెల్మాండ్ బురద నేలలో అంతమవుతుంది. ఈ నది పరివాహక ప్రాంతం మరుభూమి. అయితే వరద నీటితో ముంపుకు గురైన ప్రాంతాలు, కాలువల ద్వారా నీరు అందే ప్రాంతాల్లో పంటలు బాగా పండేవి. క్రీ.పూ.4000 ఏండ్లకు ముందే ఇక్కడ వ్యవసాయం ప్రారంభమయింది. కాందహార్ సమీపంలోని ముండిగాక్, డెV్ా మొరాశిలు కాంస్యరాతియుగం (కాంస్యం, రాతిపనిముట్లు వాడిన కాలం)లో గ్రామీణ నివాసాలు.
హెల్మాండ్ నాగరికత విస్తరించిన ప్రాంతంలో వ్యవసాయంలో మిగులు ఉత్పత్తి జరగబట్టే పట్టణాలు ఉనికిలోకి వచ్చాయి. బార్లీ, గోధుమ ప్రధాన పంటలు. షార్-ఇ-షోఖ్తా ప్రాంతంలో ఇండ్లలో రొట్టెలు కాల్చుకొనే పొయ్యిలు, మంట కాసే ప్రాంతం, రాతి తిరగళ్లు బయటపడ్డాయి. దీన్ని బట్టి బార్లీ, గోధుమలను పిండిచేసి రొట్టెలు తయారుచేసుకొనేవారని అర్థమవుతుంది. అవిసెలను ఒక వ్యాపార పంటగా పండించేవారు. నూనె, నార కొరకు పంటను వాడేవారు. షార్-ఇ-శోఖ్తాలో మూపురం ఉన్న ఎద్దు, బండి లాగడానికి పశువులకు కట్టే కాడివంటివి విస్తృతంగా దొరికాయి. అంటే పశువులను బండ్లు లాగడానికి బాగా వాడేవారన్నమాట. నాగలిని కూడా వాడి ఉండాలి. ద్రాక్ష, పుచ్చకాయలను తినేవారు. ఈ పంటలకు నీరు అధికంగా కావాలి. పంటను జాగ్రత్తగా పెంచాలి. పశుపోషణ కూడా ముఖ్యమైనదిగా ఉంది. తవ్వకాలలో దొరికిన ఎముకల్లో 90 శాతం గొర్రె, మేక, గొడ్లకు చెందినవే.
క్రీ.పూ 2500లో షార్-ఇ-శోఖ్తాలో వేగంగా తిరిగే కుమ్మరి చక్రం ద్వారా కుండల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగింది. పట్టణానికి చుట్టుపక్కల యాభై నుంచి వంద కుండలు కాల్చే బట్టీలు కనుగొన్నారు. రాగిని కరగబెట్టడం గుర్తించదగిన స్థాయిలో ఉంది. అయితే ముండిగాక్లో దొరికిన కంచులో తగరం 1 శాతం మాత్రమే ఉంది. బహుశా కంచు తయారీ తెలిసి ఉండకపోవచ్చు. (కంచు రాగి, తగరం మిశ్రమం) క్రీ.పూ 2600 కి చెందిన రంధ్రం కలిగిన గొడ్డలి క్రీ.పూ 4000కాలంలో మెసపటోమియాలో ఉబాయిర సంస్కృతిలో కనిపించింది. ఆ తరువాత వెయ్యేండ్లకు ఇరాన్లోని సుసా, సియాల్క్లలో ఇటువంటి లోహ గొడ్డలి దొరికింది. కర్ర ఉపయోగంతో గొడ్డలి పనితనం బాగా పెరిగింది. అయితే హెల్మాండ్కి తూర్పున ఉన్న భారత్లోకి ఈ గొడ్డలి వాడకం వ్యాపించడంలో జరిగిన ఆలస్యం ఇంకా చిక్కుముడిగానే ఉంది.
చెక్కతో చేసిన సమాధులు, నార కండెలు, షార్-ఇ-శోఖ్తా ప్రాంతంలో దొరికాయి. చేతితో కుట్టడం వేగంగా జరిగి ఉండేది. నూలు వడికే రాట్నం మూడువేల ఏండ్ల తరువాత ఆవిష్కృతమయిన మాట ఇక్కడ గమనార్హం. జుట్టు దువ్వుకునే చెక్క దువ్వెన దొరికింది. దారాల చిక్కుతీసే పెద్ద చెక్క దువ్వెన విస్తృతంగా వాడకంలో ఉంది. బహుశా ఇది మగ్గం వాడకాన్ని సూచిస్తున్నది. నార, నూలులను వడకడానికి వాడి ఉండవచ్చు. రాతిని నైపుణ్యంగా చెక్కడానికి వివిధ రకాలైన రాతి పనిముట్లనే వాడేవారు. నీలం రంగు రాళ్లు, ఆకుపచ్చ నీలంరంగు రాళ్లతో చేసిన పూసలతో ఆభరణాలు తయారుచేసేవారు. వీటిని దూరాన గల గనుల నుంచి తెచ్చేవారు. స్థానికంగా దొరికే స్ఫటిక శిలలు, బూడిదరంగు గట్టిరాళ్లు కూడా ఆభరణాలుగా వాడేవారు. షార్-ఇ-శోఖ్తాలో చేతివృత్తిదార్ల పని స్థలాలు మొత్తం నివాస ప్రాంతాల్లో ఒకచోట కాకుండా విసిరేసినట్లుండేవి. కానీ క్రమంగా ఇవన్నీ తరువాత రోజుల్లో ఒకే చోటకు చేరాయి.
షార్-ఇ-శోఖ్తాలో కాల్చని మట్టి ఇటుకలతో ఇండ్ల నిర్మాణం జరిగింది. నాగరికత ప్రధాన కాలవ్యవధిలో వాడిన ఈ మట్టి ఇటుకలు ఒకే పరిమాణంలో ఉన్నాయి. పోప్లార్ చెట్టు కాండంను కప్పు వేయడానికి వాసాలుగా వాడారు. మట్టి పైపులను వాడిన నివాస ప్రాంత మురుగు పారుదలను మెరుగుపర్చారు. సరైన ప్రణాళిక లేకుండానే షార్-ఇ-శోఖ్తా పట్టణం పెరుగుతూ పోయింది.వీధులు ఇరుకుగాను, మలుపులతోను ఉన్నాయి.
ఈవిధంగా భారతీయ తొలి నాగరికత అయిన సింధునాగరికత కన్నా ముందే హెల్మాండ్ నదీ లోయలో ఓ గొప్ప నాగరికత పుట్టి అభివృద్ధి చెందింది. క్రమంగా ఈ నాగరికత ప్రభావం సింధులోయ జనానావాసాలకు విస్తరించింది. అదే ప్రపంచ ప్రఖ్యాత ప్రాచీన నాగరికతల్లో ఒకటిగా అభివృద్ధి చెందింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
సంబంధిత వార్తలు
మహారాష్ట్ర కవుల 'మరో అడుగు'
సత్యశోధన కోసం...
మా నాన్నని నాకు ఇస్తారా?
ఇంటింటికీ పోలింగ్ బూత్!
ప్రజల వ్యక్తిగా కొనసాగు కేటీఆర్.. : మహేశ్
భాజపాకు కౌంట్డౌన్ మొదలైంది!
మరిన్ని వార్తలు |
ఈనాడు - చదువు: ఐఐటీ బాటలో మెలకువగా... మెరుగ్గా!
ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు
విభాగాలు ఎన్ని?
ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్లు (1)
ఆర్ ఆర్ బీ (1)
ఇంటర్న్ షిప్ లు (1)
ఉపకార వేతనాలు (8)
ఎలిజిబిలిటీ టెస్ట్ (5)
ఏరోనాటిక్స్ (2)
ఐటీ/ సాఫ్ట్ వేర్ (2)
కాస్ట్ అకౌంటెన్సీ (1)
కౌన్సెలింగ్ (2)
జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు (3)
జూనియర్ లెక్చరర్స్ (2)
నైపుణ్యాలు (3)
పీహెచ్ డీ (8)
ఫ్యాషన్ డిజైనింగ్ (1)
బోధన రంగం (7)
బ్యాంకింగ్ (8)
మేనేజ్ మెంట్ (2)
మేనేజ్ మెంట్/ ఎంసీఏ (16)
యూపీఎస్ సీ (4)
విదేశీ విద్య (9)
వైద్యవిద్య (8)
సందేహాలూ సమాధానాలూ (4)
సమ్మర్ ఫెలోషిప్ లు (1)
సహకార బ్యాంకులు (1)
సాఫ్ట్ వేర్ (3)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (1)
హాస్పిటాలిటీ (2)
హెల్త్ కేర్ (2)
ఐఐటీ ప్రవేశపరీక్షలో 2013లో ప్రవేశ పెడుతున్న మార్పులను తల్చుకుని బెంబేలు పడటం కంటే వాటిని సవ్యంగా అర్థం చేసుకోవాలి. తగినట్టుగా సంసిద్ధమవాలి. ఇదే విద్యార్థుల కర్తవ్యం!
‘ఐఐటీ ప్రవేశపరీక్ష కొరకరాని కొయ్యే', 'ఐఐటీల్లో సీటు సాధించటం మరింత కఠినం', 'ఐఐటీ ప్రవేశపరీక్ష అందని ద్రాక్ష'- ఇలాంటి వ్యాఖ్యలు ఇటీవల తరచూ వినపడుతున్నాయి. వీటినిచూసి చాలామంది అధైర్యం పెంచుకుంటున్నారు కూడా. ఇది సరి కాదు. పరీక్ష నిర్వహణలో కొత్త మార్పులు ప్రవేశపెట్టినపుడు వాటిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే అయోమయం, ఆందోళన తగ్గిపోతాయి. పరీక్షను దీటుగా, మెరుగ్గా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసమూ ఏర్పడుతుంది.
ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రవేశపెడుతున్న మార్పులు- పరీక్ష నిర్వహణ పద్ధతిలో జరుగుతున్నవే తప్ప పరీక్ష నమూనాలో కానీ, సిలబస్లో కానీ జరుగుతున్న మార్పులు కావు. సబ్జెక్టును క్షుణ్ణంగా చదువుకుని, భావనలపై అవగాహన పెంచుకునే విద్యార్థులు ఈ మార్పుల కారణంగా నష్టపోయేదేమీ లేదు. అందుకని వారు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!
ఇంతవరకూ ఉన్న ఏఐఈఈఈ లాగా జేఈఈ-2013 మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అలాగే ఇంతవరకూ ఉన్న ఐఐటీ-జేఈఈలాగా జేఈఈ-2013 అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. కాకపోతే జేఈఈ మెయిన్స్ పరీక్ష, జేఈఈ అడ్వాన్స్డ్కు ముఖద్వారం (గేట్వే) అవుతుంది. ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈలు ఎంతోకాలంగా విద్యార్థులు రాస్తున్న పరీక్షలే కాబట్టి ఇంక ఆందోళన దేనికి?
అయితే ఇంటర్మీడియట్ మార్కులకు ప్రాధాన్యం పెరిగిందనేది గమనించాలి. ఈ ఒక్క విషయంలో విద్యార్థులు తగిన జాగ్రత్త తీసుకుంటే ఐఐటీల్లో ప్రవేశం ఏమంత కష్టం కాదు. ప్రవేశపరీక్షలో జరగబోతున్న మార్పులు అర్హతా నిబంధనలకు సంబంధించిన సాంకేతికపరమైనవే కానీ సబ్జెక్టు పరమైనవి కాదు!
1) ఇంటర్ లేదా సమానమైన బోర్డు పరీక్షలో ఆ సంవత్సరం ఉత్తీర్ణులైన టాప్ 20 పర్సంటైల్ విద్యార్థుల్లో ఉండాలి.
2) జేఈఈ మెయిన్స్లో ర్యాంకు సాధించాలి. అంతేకాకుండా మొదటి లక్షా యాబైవేలమందిలో ఒకడవ్వాలి.
3) జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ర్యాంకు సాధించాలి.
తుది పరీక్ష అయిన అడ్వాన్స్డ్లో సాధించే ర్యాంకు ఆధారంగానే సీటును కేటాయిస్తారు. మొదటి రెండూ eligibility conditions గానే ఉంటాయి. అంటే జేఈఈ మెయిన్స్ ర్యాంకు, ఇంటర్ మార్కులకు ఐఐటీలో సీటు కేటాయించడంలో ప్రాధాన్యం ఉండదు.
ఈ పరీక్షలన్నిటికీ చదివే సిలబస్ ఒకటే అయినా బహుముఖ వ్యూహం అవసరం. ఇక్కడ విద్యార్థులు గమనించదగ్గ విషయం ఏమిటంటే- ఎన్ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ; ఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ ఉన్న అర్హత నిబంధనల్లో వ్యత్యాసం!
ఎన్ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికి బోర్డు పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంస్థల్లో సీటు కేటాయించడం కోసం ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్స్ పరీక్ష మార్కులకు 60 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్ మార్కుల వెయిటేజీ నార్మలైజేషన్ జరిగిన తర్వాతే ఉంటుంది.
ఐఐటీల్లో సీటు పొందడానికి ఇంటర్ మార్కులతో, జేఈఈ మెయిన్స్ ర్యాంకుతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. కానీ జేఈఈ మెయిన్స్లో ఉత్తీర్ణులైనవారిలో మొదటి లక్షాయాబైవేలమందిలో, ఇంటర్లో ఉత్తీర్ణులైనవారిలో టాప్ 20 పర్సంటైల్లో ఉండాలి. ఇవీ అర్హతా నిబంధనలు. వీటిని అర్థం చేసుకుని తగిన ప్రిపరేషన్ వ్యూహం రూపొందించుకోవాలి.
మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలకు సమ ప్రాధాన్యమే ఉంది. అయితే సబ్జెక్టుపరంగా ఆలోచిస్తే- భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు మన రాష్ట్ర విద్యార్థులకు కఠినంగా ఉంటాయి. అందుకనే వీరు దీనిపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది.
గణితం స్కోరింగ్ సబ్జెక్టని తెలిసిందే. మంచి ర్యాంకు సాధనకు ఈ సబ్జెక్టును నమ్ముకోవాల్సిందే. మూడో ప్రాధాన్యం రసాయనశాస్త్రానిది. ఎందుకంటే- మిగిలిన రెండు సబ్జెక్టుల్లో ఎక్కువగా కాల్క్యులేషన్ ఆధారిత ప్రశ్నలుంటే దీనిలో కంటెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. కాల్క్యులేషన్లలో పొరపాట్లు జరిగే అవకాశం అధికం. ఇక ఇంటర్ పరీక్షలో కూడా టాప్ 20 పర్సంటైల్లో ఉండాలి కాబట్టి ఈ మూడు సబ్జెక్టులతో పాటు లాంగ్వేజెస్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి.
లాభం... నష్టం |
లాభం... నష్టం
ఐఐటీ-జేఈఈ సన్నద్ధతలో పడి ఇంతవరకూ విద్యార్థులు ఏఐఈఈఈని నిర్లక్ష్యం చేసేవారు. అటు ఐఐటీల్లో సీటు రాక, ఇటు ఏఐఈఈఈ సరిగా రాయక రెండు రకాలుగానూ నష్టపోయేవారు. ఇప్పుడా ప్రమాదం లేదు. ఎందుకంటే ఏఐఈఈఈ (జేఈఈ-మెయిన్స్), ఐఐటీ-జేఈఈ (జేఈఈ-అడ్వాన్స్డ్)కి స్క్రీనింగ్ పరీక్ష మారింది. ఇది కూడా విద్యార్థులకు లాభదాయకమే. ఈ మార్పుల వల్ల ఇంటర్ మార్కులకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీనివల్ల తాము నష్టపోకుండా ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.
ఎక్కణ్ణుంచి ఆరంభించాలి? www.eenadu.net లో చదువు పేజీని చూడండి.
Labels: ఇంజినీరింగ్
తెలుగు బ్లాగ్లోకంతో తొలి పత్రికానుబంధం... విద్యా అనుబంధం!
ఇవీ విశేషాలు!
ఇటీవలి వ్యాఖ్యలు |
పశ్చిమ గోదావరి
జాతీయ- అంతర్జాతీయ
ఫాంహౌస్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు
ఎనీ టైమ్…ఎనీ ప్లేస్… సవాల్…!
నయన్ బర్త్ డే స్పెషల్: ‘సైరా’ మోషన్ టీజర్ రిలీజ్
ఆ భ్రమ నుంచి జగన్ బయటకు రావాలి: మంత్రి దేవినేని
షిర్డీలో మహిళకు అవమానం: పోలీసులకు ఫిర్యాదు
రెస్టారెంట్ పెట్టేందుకు బాలిక కిడ్నాప్… పోలీసుల రాకతో..
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
చంద్రబాబుపై రోజా భర్త సంచలన వ్యాఖ్యలు
ఆకాశం నుంచి చూస్తే ‘ఐక్యతా విగ్రహం’ ఇలా కనిపిస్తుంది
అమ్మాయిలకు స్కూటీ, 10 లక్షల ఉద్యోగాలు
ప్రముఖ నటుడు, యాడ్ గురు మృతి..
నకిలీ మాట్రిమోని సైట్ మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ప్రొఫైల్ పెళ్లి పేరుతో యువతులకు గాలం ఐదుగురి నుంచి రూ. 25 లక్షలు కాజేసిన మోసగాడు నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసులు సెల్ఫోన్లు, వాచీలు, ల్యాప్టాప్లు , ద్విచక్రవాహనం స్వాధీనం హైదరాబాద్: జీవన్ సాథీ, షాదీ డాట్కామ్ వంటి మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ప్రొఫైల్ సృష్టించి, పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసి, డబ్బులు కాజేస్తున్న కేటుగాడిని హైదరాబాద్ …
2,803 పోస్టులకు ప్రకటన 7 వరకు దరఖాస్తుకు చాన్స్ డిసెంబరు 24 నుంచి హాల్టికెట్లు జనవరి 6న ప్రాథమిక పరీక్ష అమరావతి: పోలీస్ శాఖలో కొలువు పొందాలని కలలుగనే నిరుద్యోగులకు ఏపీ పోలీస్ నియామక బోర్డు 2,803 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సోమవారం ప్రకటన జారీ చేయనుంది. ఇది సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. వివరణాత్మక నోటిఫికేషన్తోపాటు సోమవారం మధ్యాహ్నం నుంచే వెబ్సైట్ నుంచి దరఖాస్తుల డౌన్లోడ్కు అవకాశం …
భాగల్పూర్: బీహార్లోని బాంకా జిల్లాలో ఒక సబ్ఇన్స్పెక్టర్ విషం తిని ఆత్మహత్య చేసుకున్నారు. సబ్ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ సింగ్(58) ఖేసర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. అరుణ్ ఖేసర్ తాను ఉంటున్న అద్దె ఇంట్లోనే విషం మింగారు. విషయం తెలుసుకున్న మరో పోలీసు ప్రమోద్ షా అతనిని మాయాగంజ్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి చికిత్స పొందుతూ అరుణ్ ఖేసర్ మృతిచెందారు. సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ ఇటీవలే తన కుమార్తె వివాహం …
జగన్పై దాడి చేసిన నిందితుడి విషయంలో పోలీసుల సంచలన నిర్ణయం
శ్రీనివాసరావు కస్టడీకి మళ్లీ పిటిషన్ దాఖలు చేసే యోచనలో పోలీసులు ! విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపై కోడిపందాల కత్తితో దాడికి పాల్పడిన జె.శ్రీనివాసరావుని మరోసారి కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నారు. 25న దాడికి పాల్పడిన తర్వాత శ్రీనివాసరావుని విచారించిన పోలీసులు 26న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున శ్రీనివాసరావుని తమ కస్టడీకి అప్పగించాలంటూ …
మరణించిన వ్యక్తి 15 రోజుల తర్వాత తిరిగొచ్చాడు…
ఏపీలో కొలువుల కోలాహలం.. పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
3,137 పోలీసు పోస్టులు ఎస్ఐ, డిప్యూటీ జైలర్ ఉద్యోగాలు 384 కానిస్టేబుల్, జైలు వార్డర్, ఫైర్మెన్ 2,753 ఎస్ఐ పోస్టులకు 5 నుంచి దరఖాస్తులు డిసెంబరు 16న ప్రాథమిక పరీక్ష కానిస్టేబుళ్లకు 12 నుంచి అప్లికేషన్లు 2019 జనవరి 6న ప్రాథమిక పరీక్ష మార్చిలోగా ఎంపిక పూర్తి: ఎస్ఎల్పీఆర్బీ అమరావతి: పోలీసు శాఖలో కొలువుల కోలాహలం మొదలైంది. పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు రాష్ట్ర పోలీసుశాఖ తీపి …
మాజీ మంత్రిణికి అరెస్ట్ వారెంట్ జారీ
నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్ కొత్తవంతెనపై ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టు వద్ద సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)కు చెందిన 17 మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటుచేశారు. గత మూడు రోజుల క్రితం ఏపీ నుంచి తెలంగాణకు కారులో అక్రమంగా రూ.7లక్షలు తరలిస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈనేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంనుంచి సీఐఎస్ఎఫ్ బలగాలను రప్పించినట్లు సాగర్ …
తిరుపతి: శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ కూంబింగ్ నిర్వహించింది. ఈ క్రమంలో పాలకొండ వద్ద టాస్క్ఫోర్స్ బృందానికి స్మగ్లర్లు ఎదురుపడ్డారు. దీంతో టాస్క్ఫోర్స్ బృందంపై స్మగ్లర్లు రాళ్ల దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఎఫ్వోబీ కోదండకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన టాస్క్ఫోర్స్ బృందం గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఘటనాస్థలానికి అదనపు బలగాలను తరలించారు. జవ్వాదిమలైకు చెందిన నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి …
తల్లీకూతుళ్లకు ఘోర అవమానం.. పోలీసులకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు |
న్యూఢిల్లీ: మగ పోలీసుల ముందే తల్లీ కూతుళ్లను వివస్త్రలను చేసి చావబాదిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపించాలంటూ ఛత్తీస్గఢ్ డీజీపీకి నోటీసులు జారీచేసింది. బిలాస్పూర్లోని సిటీ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఈ నెల 14న ఈ దారుణం చోటుచేసుకున్నట్టు సమాచారం. చోరీకి పాల్పడ్డారన్న ఆరోపణలతో 60 ఏళ్ల ఓ మహిళ, 27 ఏళ్ల ఆమె …
నా కొడుకు చేసింది తప్పే… కానీ!
చిత్తూరులో విషాదం..
రజనీకాంత్ కొత్త పార్టీ..
ఉద్యోగులకు బెంజ్ కార్లు..!
విశాఖ ఎక్స్ప్రెస్లో దుండగులు హల్చల్
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల |
Strapon పోర్న్ వీడియోలు లైన్ ఆన్లైన్
స్లైడింగ్ మెను
ప్రధాన (current)
యాదృచ్ఛిక వీడియో
అన్ని కెటగిరీలు
ఆరోగ్యకరమైన రొమ్ములు
- Anonymous 323 డే 16 గంటల 53 నిమిషాలు 56 సెకన్లు हिंदी
ఈ వీడియో కేతగిరీలు లో ఆరోగ్యకరమైన రొమ్ములు, HD గొప్ప నాణ్యత, ఆసియా అమ్మాయిలు, Strapon, లెస్బియన్స్ అసలు పేరు ఈ సినిమా Strapon పోర్న్ వీడియోలు లైన్ ఆన్లైన్ watch ఉచిత
HD గొప్ప నాణ్యత Strapon ఆసియా అమ్మాయిలు లెస్బియన్స్ ఆరోగ్యకరమైన రొమ్ములు
రేట్ మర్చిపోతే లేదు వీడియో! మీరు వీడియో ఇష్టపడ్డారు లేదా కాదు. Thank you!
క్లిక్ లోడ్ వీడియో
లో డౌన్లోడ్ .mp4 embed కోడ్
ఈ కోడ్ కాపీ మరియు మీ వెబ్ సైట్ లో ఉంచడానికి
Strapon పోర్న్ వీడియోలు లైన్ ఆన్లైన్ సైట్ నుండి kashtanka-n.com
అభిప్రాయాలు 797
వీడియో పని లేదు
భాగస్వామ్యం, సామాజిక నెట్వర్క్లు
తీవ్రమైన మరియు పాత తాత పోర్న్ కోసం ఉచిత
శృంగార తార సెక్స్ వీడియో ప్రైవేట్
ఆడవారు మరియు ఉచిత పోర్న్ ఆమ్స్టర్డ్యామ్
సెక్స్ మరియు అన్ని porn videos
ప్రముఖ వీడియో
వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్ లోపల మరియు ఒకే అమ్మాయి తో చాలా బాయ్స్ తాగిన చూడటానికి ఉచిత
గొప్ప HD నాణ్యత మరియు watch porn తో యాంజెలీనా జోలీ ఉచిత ఆన్లైన్
పాత మహిళలు మరియు సెక్స్ ఫోటోలు స్త్రీ పురుష జననేంద్రియాలు కలిగిన జీవి
ముధీరిన సెక్స్ మరియు శృంగార వీడియోలు చూడటానికి వీడియోలు ఉచితంగా మరియు నమోదు లేకుండా
నల్లటి జుట్టు గల స్త్రీని మరియు ఉచిత, fotoporno స్టాకింగ్స్ మరియు పాంటీహోస్
కుడుచు మరియు ఉచిత వీడియో శృంగార పరిమితం పోర్న్
గొప్ప HD నాణ్యత మరియు xxx చిత్రాలు అమ్మాయిలు నీటి కింద
యువ పోర్న్ onlain free SMS ఉచిత బానిసత్వం ఆధిపత్యాన్ని అణచివేత మరియు క్రూరత్వం
తల్లి మరియు పురుషుల porn watch ఉచిత
మొదటి-వ్యక్తి మరియు ఉచిత పోర్న్ bdsm పిక్చర్స్ వీడియోలు-ప్రధాన
The nudity లో ప్రభుత్వ మరియు ఇంట్లో ఫోటో శృంగార సెక్స్ ప్రైవేట్
అనుభవం లేని మరియు వీడియోలను అంగ సెక్స్ తో ఒక చల్లని vuku
భర్త మరియు భార్య ఫక్
భర్త మరియు భార్య Fuck Porn Videos
ఆడవారు మంచం Porn Videos
న కమ్, ఆమె అడుగుల
వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్ ఆమె అడుగుల Porn Videos
జర్మన్ గ్రూప్ సెక్స్
జర్మన్ గ్రూప్ సెక్స్ Porn Videos
హార్డ్ Gangbang
హార్డ్ సెక్స్ Porn Videos
ఉపాధ్యాయులు Sex Porn Videos
బ్యాంగ్ వాన్ Porn Videos
పెద్ద బూబ్ కొవ్వు అందమైన మహిళలు
పెద్ద బూబ్ BBW Porn Videos
బిగపడటం మరియు పెద్ధ రొమ్ములు కలధి
కొళ్ళగొట్టుట యువ Porn Videos
నేనే అనుకున్నాను Porn Videos
ఆఫీసు పుస్సి పోర్న్ వీడియోల
చాలా ఇంద్రియాలకు సంబంధించిన అమ్మాయి Masturbates
చాలా ఇంద్రియాలకు సంబంధించిన అమ్మాయి Masturbates Porn Videos
పరిపూర్ణ కాయలు ముధీరిన సెక్స్
రొమ్ములు ఫక్ Porn Videos
పోర్న్ Kashtanka! ఎల్లప్పుడూ ఒక మంచి విషయం.
18+ పెద్దలు కోసం మాత్రమే! Leave ఈ సైట్ వెంటనే if You are not considered an adult! అన్ని శృంగార తారలు మరియు కళాకారులు భావిస్తారు పెద్దలు కోసం ఒక రోజు షూటింగ్.
నుండి అభిప్రాయాన్ని మద్దతు సైట్
అమెరికా వాణిజ్య కార్యదర్శిగా విల్బర్ రాస్? - mtvtelugu _ Free Online Telugu News
అమెరికా వాణిజ్య కార్యదర్శిగా విల్బర్ రాస్?వాషింగ్టన్, నవంబర్ 30: అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో మహాకోటీశ్వరుడైన పెట్టుబడిదారుడు విల్బర్ రాస్(78)ను వాణిజ్యశాఖ కార్యదర్శి పదవిలో నియమించనున్నారు. ఈ విషయం బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నదని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఆయనకు దాదాపు 2100 కోట్ల డాలర్ల ఆస్తులున్నట్లు ఫోర్బ్స్ పత్రిక తెలిపింది.
Previous articleహెచ్-1బీ వీసాదారులకు శుభవార్త
Next articleనాని హీరోయిన్ల వెంట పడుతున్న పవన్ కళ్యాణ్
అరుదైన శబ్దాలను రికార్డ్ చేసిన నాసా
చరిత్ర సృష్టించనున్న ఐరోపా దేశం
ఇదీ బోనాల విశిష్టత: ఎందుకు చేస్తారో తెలుసా!.
శ్రీమంతుడు కలెక్షన్స్ క్రాస్ చేసిన ఖైదీ నంబర్ 150
భారత్, అమెరికా మధ్య హెచ్1బీ చిచ్చు! |
ట్రావెల్ గైడ్
నిన్ను ప్రేమిస్తున్నాను' అని ఎక్కడ చెప్పాలి ?
ఎన్నో రోజులనుండి 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అని చెప్పాలనుకున్న మీ ప్రేయసికి ఆ మాట చెప్పారా ? మీరు అతనిని ఎంతగా ప్రేమిస్తున్నారో తేలిపారా ? 'ఐ లవ్ యు ' అని చెప్పేందుకు మంచి ప్రదేశం ఎక్కడ అనేది ఆలోచిస్తున్నారా ?సందేహించకండి !
మనసులోని మాటను స్వేచ్చగా మేము తెలిపే ప్రదేశాలలో వెల్లడించండి. ఆమె లేదా అతని నుండి పాజిటివ్ సమాధానం పొంది ఆనందించండి. మరి మనసులోని ఈ తీయని మాట తెలిపే ప్రదేశాల జాబితా పరిశీలించండి.
టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
ఇండియాలో మైసూరు మంచి అందమైన మరియు శ్రుంగార భరిత ప్రదేశం. ఎప్పటినుండో కలలు కనే మీ ఐ లవ్ యు పలుకులు ఈ అందమైన ప్రదేశంలో వెల్లడించండి. మంచి సమాధానం పొంది జీవిత మధుర క్షణాలను పదిల పరచుకోనండి.
మీ మనోభావాలను తెలియ పరచేందుకు ఈ ప్రదేశం సరైనది. మీరు తెలిపే ఐ లవ్ యు కు గార్డెన్ సిటీ బెంగుళూరు మంచి వాతావరణం కలిగి వుంది.
ఈ భూమి పై స్వర్గం వాలే వుండే వయనాడ్ ప్రదేశం ఆహ్లాదకర వాతావరణం కలిగి ప్రేమికులను అలరారిస్తుంది. అద్భుతమైన ఈ రొమాంటిక్ ప్రదేశం మీ మనసులను వెల్లడించేందుకు సరైన ప్రదేశం కాగలదు.
ఉదయపూర్ నగరం ఎంతో గ్లామరస్ ప్రదేశం. మీ మనోభావాలను తెలియ పరచేందుకు ఈ ప్రదేశం సరైనది. మీరు తెలిపే ఐ లవ్ యు కు ఈ ప్రదేశం మంచి వాతావరణం కలిగి వుంది.
ఇండియాలో శ్రీనగర్ మంచి అందమైన మరియు శ్రుగార భరిత ప్రదేశం. ఎప్పటి నుండో కలలు కనే మీ ఐ లవ్ యు పలుకులు ఈ అందమైన ప్రదేశంలో వెల్లడించండి. మంచి సమాధానం పొంది జీవిత మధుర క్షణాలను పదిలపరచుకోనండి.
ఖజురాహో ప్రదేశ అందాలు అద్భుతం. వర్ణించ నలవి కానివి. అక్కడ కల రాతి పై ప్రేమ గాధలు మీ మనసులను ఆనందింప చేస్తాయి. ఆమె లేదా అతను మీ ప్రేమకు దాసోహం అనేలా చేస్తాయి. మీ ప్రపోసల్ పెట్టేందుకు ఇది సరైన ప్రదేశం. దానికి ఆమె వ్యతిరేకం చెప్పదు.
ఎంతో అందమైన పాండిచేరి బీచ్ లు మీ ప్రేయసి మదిని దోచేందుకు కొత్త జీవితం మొదలు పెట్టేందుకు అవసరమైన అన్ని హంగులూ కలిగి వున్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాలంటైన్ రోజు నాటికి పాండిచేరి చేరి ఆనందించండి.
లక్ష ద్వీప్ దీవులు ఎల్లపుడూ, తాజా వాతారణం కలిగి ఉత్సాహం ఇచ్చేవిగా వుంటాయి. మంచి రొమాంటిక్ మూడ్ కలిగిస్తాయి. ప్రేయసీ అ లవ్ యు అంటూ మోకాళ్ళ పైనిలబడి సినిమా స్టైల్ లో ఒక గులాబి పూవు అందించండి.
సాధారణంగా కొడైకెనాల్ కు అనేక మంది హనీమూన్ జంటలు వస్తూంటారు. జంటలు కలసి ఆనందించేందుకు ఇది సరైన ప్రదేశం. మరి మీ ఫస్ట్ లవ్ తెలియపరచేందుకు ఈ ప్రదేశం ఎంపిక చేసుకొనవచ్చు. మీ సంబంధం గట్టి పడాలంటే ఈ ప్రదేశం సరైనది.
ఇండియా లో ఉదయం వేళా పొగమంచు వ్యాపించి అందంగా వుండే ప్రదేశాలలో ఊటీ ఒకటి.అటువంటి రొమాంటిక్ ప్రదేశంలో మీరు ఐ లవ్ యు చెపుతూంటే, ఆమె పడే సిగ్గులు మీకు ఆనందం కలిగించవా ?
మీ ప్రేయసికి అడ్వెంచర్ , బీచ్ వంటివి ఇష్టమైతే, ఆమెను తీసు కేల్లెందుకు సరైన ప్రదేశం గోవా. అందమైన గోవా నుండి మీ ప్రేమ ప్రయాణం మొదలు పెట్టండి.
మన దేశంలో వెలకట్టలేని నిధి, నిక్షేపాలు ఉన్న 5 ప్రాంతాలు ఇవే !
మీలో ఎంతమందికి హిమాలయాలలోని మిస్టరీ మనిషి గురించి తెలుసు
Read more about: ఇండియా, ట్రావెల్, travel, india
ఇప్పటికైతే ఓకే.! - mtvtelugu _ Free Online Live Telugu Channel
Home స్పోర్ట్స్ ఇప్పటికైతే ఓకే.!
Previous articleపవన్ మూవీ టైటిల్ సాంగ్ లీక్ ..!
నేడు మూడవ టీ-20
నా ప్రియ నేస్తానికి ఈ సెంచరీ అంకితం : రోహిత్
ఇకపై ఏటా ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’
ఆస్ట్రేలియాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం
స్టూడెంట్స్ ఆందోళన వద్దు- సీఎం చంద్రబాబు
ఐపీఎల్-10లో శుభారంభం మెరిసిన రహానె, స్మిత్ ముంబైపై ఉత్కంఠ విజయం |
మంచి అమ్మాయి వేశ్య గా Archives - Telugu sex stories
Telugu Boothu Kathalu తెలుగు సెక్స్ కథలు బూతు కథలు
Category: మంచి అమ్మాయి వేశ్య గా
telugu sex stories boothu kathalu SEASON – 2 అమిత్ నన్ను ముద్దుపెట్టుకున్నాక “అమిత్ నేను దీని గురించి ఆలోచించాలి……ఒకసారి”“నీ ఇష్టం నేహా డియర్, నీకు ఒకే అంటేనే ముందుకు ప్రొసీడ్ అవుదాం, కానీ మళ్లి చెప్తున్నాను, నీ లాంటి అందమైన అమ్మాయి ఎంతో సంపాదించొచ్చు…. ఇలాంటి అవకాశం వయసులో ఉన్నపుడే ఛాన్స్ దొరికిన వెంటనే తీసుకోవాలి…..” నేను “అమిత్ నేను వెళ్ళాలి” అని అన్నాను. “ఒకే…నీ ఇష్టం…..” అని చెప్తూ “ఇదిగో నా కార్డు…” అంటూ ఇచ్చాడు.
మంచి అమ్మాయి వేశ్య గా 11
telugu sex stories boothu kathalu ఏంటి హోటల్ కి రమ్మంటున్నాడు అని అనుకున్నాను, కాకపోతే సాయంత్రం ఉండను అని చెప్తున్నాడు. రేపు బిజీ అంటున్నాడు. అసలు అశ్విన్ ఈ కాంటాక్ట్ ఎందుకు నాకిచ్చాడు ?? నాకు నిజంగా తన ఉద్దేశం ఏంటో అర్ధంకాలేదు. నేను అక్కడే ఆలోచిస్తూ కూర్చున్నాను. అసలీ అమిత్ ఎవరు ?? ఇతనికి అశ్విన్ కి సంబంధం ఏంటి ?? అసలు అశ్విన్ కి ఆ ఇమెయిల్ వెనకాల ఉన్న నిజం నాకు
telugu sex stories boothu kathalu తర్వాత రోజు:నేను నిద్ర లేచి మెల్లగా బాత్రూం లోకి వెళ్లాను. నా బట్టలు ఈ టీ షర్ట్ జీన్స్ తప్ప ఏమి లేవు. అలాగే బ్రష్ కానీ పేస్ట్ కానీ, సోప్ కానీ ఏమి లేవు. బయటకు వచ్చి చూసాను, మంచం మీద రాజ్ లేడు. అప్పటికి నిద్ర లేసి కిందకు వెళ్లినట్లున్నాడు. నేను కిందకు వెళ్లి చూస్తే రాజ్ సోఫాలో పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు. మెట్లదగ్గర నుంచే “రాజ్..”
telugu sex stores boothu kathalu తన చేయి పట్టుకొని నేను వేరే రూమ్ లోకి తీసుకొని వెళ్లాను. లోపలకు వెళ్లి డోర్ వేసి నేను మంచం పైన పడుకుని తన కోసం వెయిట్ చేసాను. “నేహా…..ఆగు వస్తాను…..” అని చెప్పి ఎక్కడికో బయటకు వెళ్ళాడు. నేను అలాగే బెడ్ మీద పడుకుని వెయిట్ చేసాను. ఒక చిన్న ప్యాకెట్ అలాగే ఒక చిన్న బాటిల్ ఏదో తీసుకొని వచ్చాడు. నేను చూస్తున్నాను ఏంటది అని……..తను దగ్గరికి
telugu sex stories boothu kathalu ఇద్దరం క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా నేను ఆలోచనలలోకి వెళ్ళిపోయాను: నేను స్కూల్ డేస్ లో మంచి అమ్మాయి గా ఉండేదాన్ని. బాగా చదువుకునే దాన్ని, బాగా ఆడుకునేదాన్ని. తరువాత కాలేజీ లో చేరాక, అక్కడ హాస్టల్ లో ఉండేదాన్ని. తర్వాత రూల్స్ ఎక్కువైపోయాయని సెకండ్ ఇయర్ ఫ్రెండ్స్ తో పాటు అపార్ట్మెంట్ కి మారాను. అలా అపార్ట్మెంట్ కి మారటం తో మంచి ఫ్రీడమ్ వచ్చేసింది. అప్పటినుంచి క్లాసులు బంక్
మంచి అమ్మాయి వేశ్య గా 7
telugu sex stories boothu kathalu రాజ్ నెమ్మదిగా నా పెదాలపై తన పెదాలను పెట్టి కిస్ చెయ్యటం స్టార్ట్ చేసాడు. నేనింక నిన్నటిలాగా ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు ఇప్పుడు. నా చేతులను రాజ్ మీద చుట్టూ వేసాను తన చేతులు నా నడుం పైన ass పైన వేసాడు. ఇద్దరం గట్టిగ ముద్దిచ్చుకున్నాం. చాల చల్ హాట్ గా అనిపించింది. నాకు నిన్నటి ఎఫెక్ట్ ఏమో కానీ బాగా మూడ్ ఒచ్చేసింది ఈ చిన్న ముద్దుతో. |
ట్రావెల్ గైడ్
ధోని హీల్స్ లో ట్రెక్ చేశారా? రాజ్ మలై లో జంతు ప్రపంచం చూస్తారా?
ఇక ప్రకృతి అందాలను చూసుకొంటూ వీకెండ్ లో అలా నడుచుకొని వెలుతూ కిలోమీటర్ల మేర నడవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. అందువల్లే కేరళలో ట్రెక్కింగ్ కోసం చాలా మంది ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కర్నాటకలో ట్రెక్కింగ్ కోసం అనుకూలమైన 5 పర్వత శిఖరలకు సంబంధించిన కథనం.
సముద్రమట్టానికి 1868 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత శిఖరం ప్రకృతి సౌదర్యంతో విరాజిల్లుతోంది. ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి నడక తప్ప మరో మార్గం లేదు. మహాముని అగస్తుడి ప్రతి రూపంగా ఈ పర్వత శిఖరాన్ని భావిస్తారు. ఇప్పటికీ ఇక్కడ మహిళలను ట్రెక్కింగ్ కోసం అనుమతించరు. ఈ పర్వత శిఖరం మొత్తం ఔషద మొక్కలతో నిండి ఉంటుంది. ఈ పర్వత శిఖరం పై కి చేరుకొంటూ ఔషద మొక్కల నుంచి వచ్చే గాలిని పీల్చినా ఎన్నో వ్యాధులు నయవుతాయని చెబుతారు.
సముద్రమట్టానికి 2100 మీటర్ల ఎత్తులో ఉన్న బాంబ్ర పర్వత శిఖరం పైకి ట్రెక్కింగ్ ద్వారా వెళ్లడం సర్గంలో నడిచినట్లు ఉంటుందనడంలో సందేహం లేదు. దాదాపు 14 కిలోమీటర్లు సాగే ఈ ట్రెక్కింగ్ మార్గం పూర్తి చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ పర్వత శిఖరం పై హ`దపు ఆకారంలో ఉన్న సరస్సును చూడటానికే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.
కేరళలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎరవికులం నేషనల్ పార్క్ లో రాజ్ మలై పర్వత శిఖరం ఉంటుంది. ఈ నేషనల్ పార్క్ లో అంతరించె స్థితికి చేరుకొన్న నిలగిరి థార్ ను సంరక్షిస్తున్నారు. ఈ రాజ్ మలై పర్వత శిఖరం పై కి ట్రెక్కింగ్ మార్గం ద్వారా చేరుకోవడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. నిలగిరి థార్ తో పాటు ఇక్కడ మనం చిరుతలు, సింహపు తోక కలిగిన కోతులు తదితరాలను చూడవచ్చు. ఈ నేషనల్ పార్క్ లో జీప్ సఫారీ అందుబాటులో ఉంటుంది.
సముద్రమట్టానికి 2,695 మీటర్ల ఎత్తున ఉండే పర్వత శిఖరం కూడా ఎరవికుల నేషనల్ పార్క్ లోనే ఉంది. హిమాలయ పర్వత పంక్తులల్లోని పర్వత శిఖరాల తర్వాత భారత దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న పర్వత శిఖరాల పైకి అత్యంత ఎతైన పర్వత శిఖరం ఇదే. ఈ పర్వత శిఖరం పై భాగం చేరే క్రమంలో మనం పచ్చటి మైదానాలను, టీ తోటలను, సుగంధ ద్రవ్యాల తోటలను పలకరించవచ్చు.
కేరళలోనే కాక దక్షిణ భారత దేశంలోనే ప్రాచూర్యం చెందిన మలపుంజ రిజర్వాయర్ కు కూతవేటు దూరంలోనే ధోని హిల్స్ ఉంటుంది. ఈ పర్వత శిఖరం చుట్టూ అనేక జలపాతాలను చూడవచ్చు. అందువల్లే ఇక్కడ ట్రెక్కింగ్ లో జలపాతాలను చూస్తూ ముందుకు సాగుతాం. ఈ మార్గంలో క్రీస్తుశకం 1857 నిర్మించిన భవనాన్ని కూడా మనం చూడవచ్చు.
Read more about: టూర్ ట్రావెల్ కేరళ kerala tour travel
పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి
తాజా వార్తలు
సామాజిక న్యాయం
సోర్స్ కోడ్
చైల్డ్ హుడ్
మహబూబ్ నగర్
భారత్-పాక్ మ్యాచ్కు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్!
ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
ప్రణయ్ హత్యపై స్పందించిన రామ్ చరణ్
జాతర _ (సంస్కృతి పేజీ) _ www.NavaTelangana.com
మీరు ఇక్కడ ఉన్నారు
జాతర(సంస్కృతి పేజీ)
తీజ్ పండుగ ఉత్తర భారత దేశంలో పెండ్లి అయిన స్త్రీలకు చాలా ముఖ్యమైన పండుగ. వర్షాకాలంలో వచ్చే పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగగా రాజస్థాన్ వాసులు భావిస్తారు. శివపార్వతుల సం
మానవ జాతి జంతువుల నుండి వేరుపడి తనకంటూ ఒక జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకున్నది. పరిణామక్రమంలో ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకొని తమ తరువాతి తరాలకు అందిస్తూ వస్తున్నార
శాస్త్ర సాంకేతిక విజ్ఞానం-సంస్కృతి
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.34 కోట్లు
నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం..వ్యక్తి అరెస్ట్
షార్ట్సర్క్యూట్తో కారులో మంటలు
సూర్యాపేటలో మరో ఘోర రోడ్డు ప్రమాదం
ట్యాంక్బండ్లో 7వేల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం
మావోయిస్టు నాయకుడి సంచలన ప్రకటన
Sootha Puranam - 1 & 2 - సూత పురాణం -1 & 2
Sootha Puranam - 1 & 2 Tripuraneni Ramaswamy Peacock Classics సూత పురాణం-1& 2 త్రిపురనేని రామస్వామి పీకాక్ క్లాసిక్స్ బి.రామకృష్ణ B.Ramakrishna Criticism & Research Puranalu Mahabharatam విమర్శ పురాణాలు మహాభారతం
సూత పురాణం-2 :
''సారస దళ నేత్రా! కౌరవ పాండవులకు పగ కలిగింది గదా! అదేమైంది? సంధి అవుతుందని కూడా విన్నా; జరిగిందా? అదెట్టు మారింది? సంధిని నీవే చేస్తున్నావని తెలిసింది; నిజంగా నీవే సంధి చేస్తే అది కాకుండా పోదు; ఎవరూ సంధిని వ్యతిరేకించరు. ఇది ధ్రువం'' అని అడిగాడు.
''ఉద్దాలక మహామునీ! ఆగుమాగుము! కోపం దిగమింగు. ముందు కమండలువు అటు పెట్టు; ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు విను; విన్న తరువాత నీకెట్లా తోస్తే అట్లా చేయి. తొందరేమొచ్చింది?.... |
ఆ గుడి లోపలికి వెళ్ళే ధైర్యం ఎవ్వరికి లేదు. ఎందుకో తెలుసా?
మనం చూసినంతవరకు గుడి పరిసరాలు ఎలా ఉంటాయి, గుడి లోపల ఎలా ఉంటుంది? నిత్యం భక్తులతో రద్దీగా, దర్శనం కోసం లైన్లు కట్టిన జనాలతో, పాటలతో, భజనలతో సందడిసందడిగా ఉంటుంది. కాని హిమచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక హిందు దేవాలయం అలా ఉండదు. ఆ గుడి లోపలికి ఎవ్వరు పోరు. మరీ ఎక్కువ భక్తి పుట్టుకొస్తే గుడి గేటు దాకా కూడా రాకుండా, బయట కొంచెం దూరం నుంచే దండం పెట్టేసి వెళ్ళిపోతారు తప్ప లోనికి ఆడుగు పెట్టె ధైర్యం చేయరు. మరి అక్కడ అంతలా భయపెట్టిస్తున్న విషయం ఏమిటి ? అక్కడ దెయ్యాలు ఉన్నాయా ? గుడిలో దేయ్యలేందుకు ఉంటాయి లెండి. మరి ఏమిటి సంగతి ? అది ఎవరి గుడి? జనాలు ఎందుకు లోనికి వెళ్ళలేకపోతున్నారు?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, చంబ జిల్లాలోని బహ్మార్ గ్రామంలో ఉన్న ఈ గుడిలో ఉన్నది ఏ దేవుడో తెలుసా? మృత్యుదేవత యమరాజు. ఇందులో సాక్షాత్తు కాలయముడు కొలువుదీరాడని నమ్ముతారు అక్కడి జనాలు. గుడిలో కంటికి కనిపించని నాలుగు ద్వారాలు ఉంటాయట. అందులో ఒకటి బంగారు ద్వారం, వెండి ద్వారం, కాంస్య ద్వారం మరొకటి ఇనుప ద్వారం ఉన్నాయట. మనుషులు చేసిన పాపపుణ్యాలను బట్టి, ఎవరు ఏ ద్వారం నుంచి ఏ లోకానికి చేరుకుంటారో యమరాజు నిర్ణయిస్తాడట. ఆ గుడిలో ఓ గది చిత్రగుప్తుడి కోసం కూడా ఉంది. యమధర్మరాజు, చిత్రగుప్తులు తమ నిజ స్వరూపంలో కూడా గుడిలో తిరుగుతారని, మనుషుల పాపపుణ్యాలు ఈ ఇద్దరు ఈ గుడిలోంచి కూడా లెక్కకడతారని ప్రజలు నమ్ముతారు. మనిషి యొక్క ఆత్మ ఈ గుడి నుంచే వేరే లోకాలకు బయలుదేరుతుందని, మృత్యు భయంతోనే ఆ గుడి లోపలి ఎవరు వెళ్ళరని స్థానికులు చెబుతున్నారు.
ఈ గుడి కట్టి 1400 సంవత్సరాలు అవుతున్నాయి అని చరిత్రకారులు చెబుతున్నారు. మనుషుల ఆత్మలు ఇక్కడినుంచే బయలుదేరుతాయి అని ప్రజలు చెబుతున్నారు సరే గాని, ఈ గుడి కట్టకముందు యమధర్మరాజుల వారు భూమ్మీద ఉండాలనుకున్నపుడు ఎక్కడ ఉండేవారో మరి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
(వీడియో) నెలసరి వచ్చిందని ఈ అమ్మాయిని ఊరంత కలిసి ఏం చేసారో తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది
(వీడియో) పూర్వం రతి కోసం అమ్మాయిలకు ఎలాంటి శిక్ష వేసేవారో తెలిస్తే మతిపోతుంది
(వీడియో) ఈ 4 పనులు చేసినవారు వెంటనే స్నానం చేయాలి.. లేకపోతే ఏం జరుగుతుందో మీరే చూడండి
(వీడియో) కెమెరాలో రికార్డు కాకపోయుంటే ఒక్కరూ కూడా నమ్మెవారు కాదు !
(వీడియో) ప్రియుడితో కలిసి దొరికిపోయిన కూతిర్ని.. తండ్రి ఏం చేసాడో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది
(వీడియో) ఇది తింటే... చిటికెలో మీ అంగం బుసలు కొడుతుంది అది చూసిన మీ భార్య బిత్తరపోతుంది
(వీడియో) ఆ యంగిల్స్ అంటే భలే ఇష్టమట!
(వీడియో) వరదల్లో అయ్యప్ప స్వామి గుడి వద్ద మహా అద్భుతం
(వీడియో) ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో Btech అమ్మాయి ప్రేమ.. చివరికి?
(వీడియో) స్త్రీలు వెనుక రంద్రం నుండి శృంగారం చెయ్యనివ్వరు ఎందుకో తెలుసా? |
10TV స్పెషల్స్
వైడ్ యాంగిల్
వన్ 2 వన్ శ్రీధర్ బాబు
ఫర్ ది పీపుల్
మూవీ రివ్యూ
నాగర్ కర్నూల్
వరంగల్ రూరల్
వరంగల్ అర్బన్
Read more about బెజవాడకు చేరుకున్న వర్మ
Read more about ఖమ్మంలో పార్టీల హమీ తూమీ
Read more about కంప్యూటర్ యుగంలోనూ మూఢాచారాల పాటింపు
హైదరాబాద్ : కాఫీ పెయింట్ అంటే ఆశ్చర్యమేస్తోందా.. అవి ఎలా వేయాలో ఇవాళ్టి 'సొగసు' లో మన గెస్ట్ అపర్ణ చూపించారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..
Read more about కాఫీ పెయింట్
హైదరాబాద్ : ఆడపిల్లలకు సింపుల్ టెక్నిక్స్ తో ఆకతాయిల ఆటకట్టించే ఆత్మరక్షణా పద్ధతులేంటో ఇవాళ్టి నిర్భయలో తెలియజేశారు... వాటిని మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...
Read more about ఆకతాయిల ఆటకట్టించే ఆత్మరక్షణా పద్ధతులు
మిషన్ భగీరథపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి వీలైనంత ఎక్కువ గ్రామాలకు మంచినీరు అందించాలన్నారు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు మిషన్ భగీరథలో కనీసం 10 రోజులైనా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఇంజనీరింగ్ పనుల్లో ఐటిఐ విద్యార్ధుల సేవలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు కేసీఆర్.
Read more about మిషన్ భగీరథపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: లవ్ సినిమాలో నటించిన హీరోయిన్ స్వాతిరెడ్డి ఇప్పుడు లవ్ వివాదంలో ఉంది. స్వాతిరెడ్డి కనపడటం లేదంటూ తల్లి నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తానెక్కడికీ పోలేదంటూ స్వాతిరెడ్డి పోలీసుల ముందు ప్రత్యక్షమయింది. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తితో తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు స్వాతిరెడ్డి చెబుతుండగా, ఆ శ్రీనివాసరెడ్డికి ఇప్పటికే పెళ్లి అయి, పిల్లలు కూడా ఉన్నారని హీరోయిన్ తల్లి నాగేంద్రమ్మ చెబుతున్నారు.
Read more about వివాదాస్పదంగా హీరోయిన్ స్వాతిరెడ్డి లవ్ వ్యవహారం
Read more about మంత్రి నారాయణతో ఏపీ ఎన్జీవోలు భేటీ
ఖమ్మం లో సిపిఎం ప్రచారం
Read more about ఖమ్మం లో సిపిఎం ప్రచారం
మాయావతి, మంత్రి స్మృతిల మాటల యుద్ధం
Read more about మాయావతి, మంత్రి స్మృతిల మాటల యుద్ధం
ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
Read more about ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
హిందూపురంలో బాలకృష్ణ హెరిటేజ్ వాక్
అనంతపురం: జిల్లా హిందూపురంలో టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. లేపాక్షి ఉత్సవాల్లోభాగంగా విద్యార్థులు, కళాకారులతోకలిసి హెరిటేజ్ వాక్ నిర్వహించారు. లేపాక్షి ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పేలా ఈ ఉత్సవాలు జరుపుతామని ప్రకటించారు.
Read more about హిందూపురంలో బాలకృష్ణ హెరిటేజ్ వాక్
గ్రూప్ -2 పరీక్షకు టీఎస్ పీఎస్సీ విస్తృత ఏర్పాట్లు
హైదరాబాద్ : గ్రూప్ -2 పరీక్షలకు టీఎస్ పీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. 5,64,431 దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. మాల్ ప్రాక్టీస్ లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పరీక్షా కేంద్రాల వద్ద జామర్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఆధార్ వివరాలను సేకరిస్తుంది. ఆధార్ వివరాలను ఓటీఆర్ లో నమోదు చేయాలని విద్యార్థులకు టీఎస్ పీఎస్సీ ఆదేశించింది.
Read more about గ్రూప్ -2 పరీక్షకు టీఎస్ పీఎస్సీ విస్తృత ఏర్పాట్లు
హైదరాబాద్: వైసిపి నేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు గురించి వారితో చర్చించనున్నారు.
Read more about ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం
చంద్రబాబు రాజకీయ జీవితమే తప్పుల తడక- ఎమ్మెల్యే రోజా
హైదరాబాద్: చంద్రబాబు రాజకీయ జీవితమే తప్పుల తడక అని వైసిపి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. పయ్యావుల కేశవులు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పయ్యావులకి జగన్ ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజలు ఎవరి పక్షమో తక్షణమే శాసనసభను రద్దు చేసి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యేలను అక్రమంగా కొనే క్యారక్టర్ చంద్రబాబుదని తెలిపారు. 130 ఏళ్ల కాంగ్రెస్సే జగన్ ఏం చేయలేకపోయిందని, 33 ఏళ్ల టిడిపి ఏం చేయ్యలేదన్నారు. రాజకీయ నైతిక విలువల గురించి జగన్ దగ్గర చంద్రబాబు నేర్చుకోవాలని సూచించారు.
Read more about చంద్రబాబు రాజకీయ జీవితమే తప్పుల తడక- ఎమ్మెల్యే రోజా
తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు లైన్ క్లియర్ |
హైదరాబాద్ : తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయి మెంట్ యాక్ట్ 1994 లో సవరణలు చేస్తూ, ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయొచ్చని ప్రభుత్వం చట్టంలో చేర్చింది. 2014 జూన్ 2 కంటే ముందు నుంచి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు అవకాశం దక్కునుంది.
Read more about తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు లైన్ క్లియర్
శ్రీకాకుళం: విద్యార్థులు, యువతీ యువకులకోసం మరో విలువైన యాప్ అందుబాటులోకి వచ్చింది. ఏయే కాలేజీలో ఎలాంటి కోర్సులున్నాయి? వాటి ఫీజులు, స్కాలర్షిప్ వివరాలేంటి? ఉపాది అవకాశాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగావకాశాలు, ఇందుకోసం అవసరమయ్యే స్టడీ మెటీరియల్లాంటి అంశాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ పూర్వ విద్యార్థిని లిజి కళాధర్ ఈ యాప్ను తయారుచేశారు.
Read more about విద్యార్థులు, యువతకోసం కెరీర్ డైరెక్టరీ యాప్
Read more about మంత్రి స్మృతీ ఇరాని అన్నీ అవాస్తవాలే మాట్లాడుతున్నారు - సీతారాం ఏచూరి
ఖమ్మం: ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల సమావేశానికి తమ్మినేని హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామన్నారు. డబ్బుకోసం, స్వార్థంకోసం తాము పదవిని ఉపయోగించుకోబోమని స్పష్టం చేశారు. అన్నింటికీ తట్టుకొని ఉండాలని కార్యకర్తలకు సూచించారు.
Read more about ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం- తమ్మినేని
హైదరాబాద్: గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమం, భూ సమస్య అంశాలపై గిరిజన సంఘం ఆధ్వర్యంలో నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో నేతలు మాట్లాడుతూ... అటవీ హక్కుల చట్టం ప్రకారం ఇప్పటివరకు 30 శాతం భూములకు కూడా పట్టాలు ఇవ్వలేదన్నారు. అటవీ భూములను రీసర్వే చేసి.. వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు భూములు ఇవ్వాలన్నారు.
Read more about గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి ఇవ్వాలి -గిరిజన సంఘ నేతలు
హైదరాబాద్: ఏపీలోనే కాదు నగరంలోనూ కాల్మనీ లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని చైతన్యపురిలో ఓ వడ్డీ వ్యాపారి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి కథనం ప్రకారం సాయి అనే వ్యక్తి స్థానికంగా 6 ప్యాక్ జిమ్ నిర్వహిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. బాధితురాలు పార్వతమ్మ అతని వద్ద రెండున్నర సంవత్సరాల క్రితం నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. నాటి నుంచి క్రమం తప్పకుండా వడ్డీ కడుతోంది. ఇంతలో నీవు నాకు 17 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఆమెపై వాగ్వాదానికి దిగాడు. అంతెందుకు కట్టాలని ప్రశ్నించినందుకు తనకు పెద్దల అండదండలున్నాయని తిడుతూ దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్రస్తుతం బాధితురాలు సరూర్నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Read more about మహిళపై దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారి
అమెరికా: తూర్పు తీరంలో తుపాను విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా వర్జీనియా రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లూసియానా, మిసిసిప్పీ, ఫ్లోరిడా రాష్ట్రాల్లో తుపాను నష్టం అధికంగా ఉంది. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. తుపాను ముప్పు ఇంకా తొలగిపోలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు తొమ్మిది లక్షల మందిపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
Read more about అమెరికా తూర్పు తీరంలో తుపాను విధ్వంసం
ఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన మాట నిలబెట్టుకోవాలని ఎంపి మాయావతి అన్నారు. రాజ్యసభలో మాయావతి మాట్లాడుతూ... తన సమాధనంతో సంతృప్తి చెందకపోతే ఏ త్యాగానికైనా సిద్ధమని స్మృతి ఇరానీ అన్నారని, తాను స్మృతి ఇరానీ సమాధానం పట్ల సంతృప్తిగా లేనన్నారు. కనుక మంత్రి తన మాట నిలబెట్టు కోవాలన్నారు. రోహిత్ మృతిపై విచారణ కమిటీలో దళిత సభ్యుడిని ఎందుకు నియమించలేదని మాయావతి ప్రశ్నించారు.
Read more about మంత్రి స్మృతి మాట నిలబెట్టుకోవాలి - మాయావతి
Read more about రోహిత్ మృతికి కేంద్రం వైఖరే కారణం - సీతారాం ఏచూరి
మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఏడాది చివరికల్లా చాలా గ్రామాలకు మంచినీళ్లు అందించేలా కార్యాచరణ రూపొందించుకుని, పనులు చేయాలని సీఎం పేర్కొన్నారు. మంచినీటి పంపింగ్ కు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ ఫార్మర్లు, పవర్ లైన్లు , సబ్ స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. పనుల్లో అధికార వికేంద్రీకరణ జరగలన్నారు. పనులు పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు నిర్వహణ భాద్యత వర్కింగ్ ఏజెన్సీలకే ఉంటుందన్నారు.
Read more about మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ సమీక్ష |
హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రేమ పంచాయతీ ముదిరింది. ''లవ్'' సినిమా హీరోయిన్ శ్వేతా రెడ్డి, ఆమె తల్లి మద్య వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీస్ స్టేషన్లోనే తల్లీ కూతుళ్లు కొట్టుకున్నారు. గొడవ అనంతరం ఇష్టపూర్వకంగా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో శ్వేతారెడ్డి వెళ్లిపోయారు.
Read more about హీరోయిన్ ప్రేమ పంచాయతీ
టీడీపీ.. సామాన్యులను నాయకులుగా తీర్చిదిద్దింది : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : కన్నతల్లి లాంటి పార్టీని కొంతమంది మోసం చేశారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు ఆయన ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో మీడియాతో మాట్లాడారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. ఎంతో మంది సామాన్య పౌరులను కూడా పెద్ద నాయకులుగా తీర్చి దిద్దిన పార్టీ టీడీపీయేనని చెప్పారు. గాలికి తిరిగేవాళ్లను కూడా టీడీపీ పెద్ద నాయకులుగా తీర్చి దిద్దిందన్నారు.
Read more about టీడీపీ.. సామాన్యులను నాయకులుగా తీర్చిదిద్దింది : రేవంత్ రెడ్డి
లోక్సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ
ఢిల్లీ : 2016-17 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 7 నుంచి 7.5శాతంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. లోక్సభలో ఎకానమిక్ సర్వే రిపోర్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమర్పించారు. 2015-16లో వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో లేనప్పటికి.. జీడీపీలో ద్రవ్యోలోటును 3.9శాతానికి తగ్గిస్తామని నివేదికలో పేర్కొంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పరిస్థితులు బలహీనంగా ఉంటే... ఆ ప్రభావం భారత్ పై కూడా ఉంటుందని తెలిపింది.
ఏడో పే కమిషన్ ద్వారా వస్తు వినియోగం పెరుగుతుందని కూడా అంచనావేసింది. గత ఐదేళ్లతో పోల్చితే 8 శాతం వృద్దిరేటు పెరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. సర్వీస్ సెక్టార్లో 9.2 శాతం వృద్ది రేటు అంచనా కట్టింది. కరెంట్ ఖాతాలోటు 1 నుంచి 1.5 శాతం ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. ఏడో వేతన సంఘంతో ద్రవ్యోల్బణంపై స్వల్ప ప్రభావం ఉంటుందని తెలిపింది. విద్య, వైద్యంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భవిష్యత్లో భారత్కు ఎఫ్డీఐలు విరివిగా వచ్చే అవకాశముందని తెలిపింది.
Read more about లోక్సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ
రైల్వే బడ్జెట్ లో ఎపికి అన్యాయం : రఘువీరా
హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ లో ఎపికి పూర్తిగా అన్యాయం చేశారని ఎపిసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాలో ఆందోళనలు జరుగున్నాయని తెలిపారు. ఈ నిరసనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెగలాంటిదన్నారు.
Read more about రైల్వే బడ్జెట్ లో ఎపికి అన్యాయం : రఘువీరా
'కన్నతల్లి లాంటి పార్టీని కొంతమంది మోసం చేశారు'
Read more about 'కన్నతల్లి లాంటి పార్టీని కొంతమంది మోసం చేశారు'
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మధు ఫైర్...
కడప : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకు సంబంధించిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు. కడపలో వామపక్షాలు బస్సుయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాయలసీమలో తీవ్ర మంచి నీటి సమస్య ఉందన్నారు. తాగడానికి నీల్లు లేక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. శ్రీశైలం బ్యాక్ వాటర్, సోమశిల నుంచి వాటర్ వాటర్ తేవడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు.
Read more about కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మధు ఫైర్...
పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి-అనురాగ్శర్మ
హైదరాబాద్ : పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. డీజీపీ కార్యాలయంలో ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ చికిత్స అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. రెండు రోజులు పాటు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
Read more about పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి-అనురాగ్శర్మ
కడప : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకు సంబంధించిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు. కడపలో వామపక్షాలు బస్సుయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాయలసీమలో తీవ్ర మంచి నీటి సమస్య ఉందన్నారు. తాగడానికి నీల్లు లేక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. శ్రీశైలం బ్యాక్ వాటర్, సోమశిల నుంచి వాటర్ వాటర్ తేవడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు ప్రాజెక్టులు అటకెక్కాయని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులను పూర్తిగా తొలగించి... వారి స్థానంలో కాంట్రాక్టు కార్మికులను తీసుకుంటున్నారని చెప్పారు.
Read more about అమలుకు నోచుకోని ప్రభుత్వ హామీలు : మధు |
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో 70 ఆస్తులు బయటపడ్డాయని ఏపీ సీఐడీ తెలిపింది. మరింత విచారిస్తే పూర్తి ఆస్తులు బయటపడతాయని పేర్కొంది. విచారణలో బయటపడ్డ 70 ఆస్తులను రెండు రోజుల్లో... అచాట్ చేయాలని ఏపీ ప్రభుత్వాని హైకోర్టు ఆదేశించింది.
Read more about హైకోర్టులో అగ్రిగోల్డ్ పిల్పై విచారణ
Read more about ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు...
కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ...
Read more about కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ...
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటివరకు బయటపడ్డ 70 ఆస్తులను అటాచ్ చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తులో 70 ఆస్తులు బయటపడ్డాయని ఏపీ సీఐడీ ఇవాళ హైకోర్టుకు వివరించింది. మరింత విచారిస్తే పూర్తి ఆస్తులు బయటపడతాయని తెలిపింది. సీఐడీ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. ఆస్తులను అచాట్ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు సంస్థ యాజమాన్యం ఆస్తుల వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడంపై.. ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో ఇరు రాష్ట్రాల పోలీసులు సహకరించుకోవాలని సూచించింది. ఈ కేసులో మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేయాలన్న హైకోర్టు.. విచారణను 2 వారాలను వాయిదా వేసింది.
Read more about అగ్రిగోల్డ్ పిల్పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు నేటితో ముగియనుంది. దీంతో రెబల్స్ను బుజ్జగించే పనిలో పార్టీ అభ్యర్థులు బిజీగా ఉన్నారు. వివిధ పార్టీల నేతలతో కార్పొరేషన్ కార్యాలయాల వద్ద హడావుడి కనిపిస్తోంది.
Read more about నామినేషన్ల ఉపసంహరణకు నేటితో ముగియనున్న గడువు
Read more about ఆ జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణకు నేటితో ముగియనున్న గడువు
వెనుకబడిన ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి : బివి. రాఘవులు
కడప : ప్రజలు ఎదురు తిరిగితేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి. రాఘవులు అన్నారు. సీపీఎం, సీపీఐలు చేపట్టిన బస్సుయాత్ర కడపలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించన సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు మంచి పాలన అందిస్తే.. రాయలసీమ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. సీఎం రాష్ట్రం వ్యాప్తంగా పారదర్శక పాలన అందించాలని.. సమానంగా పరిపాలన చేయాలని.. అయితే వెనుకబడిన ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సివుంటుందన్నారు.
Read more about వెనుకబడిన ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి : బివి. రాఘవులు
Read more about ప్రజలు ఎదురుతిరిగితేనే సీమ అభివృద్ధి : బివి. రాఘవులు
విశాఖలో అసలు ఏం జరుగుతోంది..?
విశాఖ : ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలు..బోరుమంటున్నాయి. మండుతున్న గుండెలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. 16 గ్రామ పంచాయతీల ప్రజలు ఉడుకురక్తంతో ఒక ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా..ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. తిరుగుబాటుజెండా ఎత్తాయి. అసలు ఏం జరుగుతోంది విశాఖ జిల్లాలో.
బీమిలి తీరం.. విశాఖపట్నం జిల్లాలో అత్యంత సుందరమైనప్రాంతాలలో ఒకటి. విశాలమైన సముద్ర తీరం.. అన్ని మత్స్యకార కుటుంబాలే..చేపలు పట్టుకుంటూ రోజువారి కుటుంబపోషణ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంత ప్రశాంతంగా ఉండే పల్లెల్లోకి 14 ఏళ్ల క్రితం దివీస్ భూతం ప్రవేశించింది.
తొలుత బీమిలి మండలం చిప్పాడ గ్రామంలో ఒక్కయూనిట్ తో ప్రారంభించి..విషవృక్షంగా మారింది. ఇప్పడు రెండో యూనిట్ ను ప్రారంభించి 40 బ్లాక్ లలో తమ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. అంతే ప్రశాంతంగా ఉండే 16 గ్రామపంచాయతీలు దివీస్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ప్లాంటును నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించారు.
20 వేల మంది తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం
దివీస్ ఫ్యాక్టరీ కారణంగా బీమిలి పరిసర గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. 16 గ్రామలకు చెందిన 20 వేల మంది ప్రజలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటూ ఉద్యమానికి తెరదీశారు.సాదారణంగా వాతావరణంలో 3 శాతం ఐరన్ ఉండాలని కాని దివిస్ కంపెనీ నుండి విడుదలయ్యే రసాయనాల కారణంగా 10 శాతానికి చేరిందని ఫలితంగా ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయంటున్నారు గ్రామస్థులు. దీంతో 16 గ్రామాలు తీవ్ర కాలుష్యంతో కూరుకుపోయాయని భూగర్భ జలాలు విషతుల్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటపొలాలు దెబ్బతింటున్నాయని..రసాయనాలు సముద్రంలో విడుదల చేయడం వలన మత్స్య సంపద దెబ్బ తింటోందంటున్నారు.
అర్ధరాత్రి మత్స్యకార గ్రామాలపై దాడులు చేసి కనిపించినవారిని అరెస్టు చేశారు పోలీసులు. దివీస్ కారణంగా ఉపాధిపెరుగుతుందని నియెజకవర్గ ఎమ్మెల్యే.. మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలు కలెక్టరేట్ కు తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే అరెస్టు చేయించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ బీమిలి ప్రజలు స్టేషన్ ముందు ఆందోళనకు దిగి స్టేషన్ ను ముట్డించారు. |
దివీస్ కంపెనీ యాజమాన్యం మూడో యూనిట్ పనులను శరవేగంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం కంచేరు పాలెం చుట్టూ ప్రహరీ గోడను నిర్మిస్తోంది. ఈ నిర్మాణ పనులను ఆపేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు.కాలుష్యం శాంపిల్స్ ను సేకరించి రసాయనాల విడుదలను ఆపాలంటున్నారు అప్పటి వరకు ఉద్యమంఆగదని హెచ్చరిస్తున్నారు.
Read more about విశాఖలో అసలు ఏం జరుగుతోంది..?
వంగవీటి మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్ : వంగవీటి మూవీ పోస్టర్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశాడు. ఈ చిత్రానికి నిర్మాత దాసరి కిరణ్ కుమార్. సాయంత్రం విజయవాడ వెళ్తానని వర్మ ట్వీట్ చేశారు. రేపు ఉదయం దేవినేని నెహ్రూను కలవనున్నట్లు ఆయన తెలిపారు. దేవినేని కుమారుడు అవినాష్ కు ఫోన్ చేసి.. సమయం కావాలని వర్మ కోరారు.
Read more about వంగవీటి మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ
వంగవీటి మూవీ పోస్టర్ రిలీజ్
Read more about వంగవీటి మూవీ పోస్టర్ రిలీజ్
ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అఫ్జల్ గురు మీద చిదంబరం వ్యాఖ్యలపై లోక్ సభలో చర్చకు బిజెపి నోటీసులు ఇచ్చింది. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలని ప్రకాశ్ జవదేకర్ కోరారు.
Read more about చిదంబరం వ్యాఖ్యలపై చర్చకు బిజెపి నోటీసులు
ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. యూనివర్సిటీల వివాదంపై రాజ్యసభలో వాడివేడి చర్చ కొనసాగుతోంది. స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై రగడ జరుగుతోంది. స్మృతి ఇరానీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశారు.
Read more about యూనివర్సిటీల వివాదంపై వాడివేడి చర్చ
ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాజ్యసభలో రెండోరోజు స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. యూనివర్సిటీల వివాదంపై రాజ్యసభలో వాడివేడి చర్చ కొనసాగుతోంది. వర్సిటీ ఘటనలపై నిన్న మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై రగడ జరుగుతోంది. మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. అయితే విపక్ష ఆరోపణలను మంత్రి ఖండించారు. కావాలనే రాదాంతం చేస్తున్నారని మండిపడ్డారు. స్మృతి ఇరానీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశారు. ఇరానీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ గుటాంనబీ ఆజాద్ పట్టుబట్టారు.
Read more about యూనివర్సిటీల ఘటనలపై రాజ్యసభలో ఆందోళన
హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యేలతో కాసేపట్లో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ కానున్నారు. లోటస్ పాండ్ లో అందుబాటులో ఉన్న గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన ఆయన సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపులపై చర్చించనున్నారు. ఇప్పటికే ఐదుగురు వైసిపి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక సర్వే పత్రాలు ఇప్పటికే పార్లమెంట్ కు చేరుకున్నాయి. ఆర్థికసర్వే 2016-17 పత్రాలను ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.
Read more about పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ కు చేరుకున్న ఆర్థిక సర్వే పత్రాలు
ఢిల్లీ : ఆర్థిక సర్వే పత్రాలు పార్లమెంట్ కు చేరుకున్నాయి. 2016 ఆర్థికసర్వే పత్రాలను ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.
Read more about పార్లమెంట్ కు చేరుకున్న ఆర్థిక సర్వే పత్రాలు
ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీకి తీవ్ర గాయాలు
ఉత్తరాఖండ్ : ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ మ్యాచ్లో తీవ్రంగా గాయపడ్డారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి.
'ది గ్రేట్ ఖలీ షో'
ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో జరిగిన 'ది గ్రేట్ ఖలీ షో'లో ప్రఖ్యాత రెజ్లర్ ఖలీ తీవ్రంగా గాయపడ్డారు. మ్యాచ్ జరుగుతుండగా.. ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టారు. అంతటితో ఆగకుండా ముఖంపై బలంగా పంచ్ లివ్వడంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని డెహ్రాడూన్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఖలీ 7.1 అడుగుల ఎత్తుతో చూడడానికే రెజ్లర్లకు దడపుట్టించేలా ఉంటాడు. ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించారు. భారత్ పేరును ఖలీ రెస్లింగ్లో కూడా ఖండాతరాలు దాటేలా చేశారు. ఖలీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
Read more about ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీకి తీవ్ర గాయాలు
తాగుబోతు మాష్టారు.. |
తాగుబోతు మాష్టారు..
ఎద్దుల రాజా. పేరుకు దగ్గట్లుగానే ఫుల్లుగా మందుకొట్టి రోడ్డుపై పడిపోయాడు. ఇలాంటి వాళ్లను చాలామందినే చూశాం అనుకుంటున్నారా.. ? ఈయన సాదాసీదా వ్యక్తి కాదు. కర్నూలు జిల్లా దోర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. ఈ సారువాడికి మద్యపానం ఓ వ్యసనం. రాత్రి, పగలు తేడా లేదు. లేచింది మొదలు పడుకునేదాకా.. సారీ పడిపోయేదాకా మందులో మునిగి తేలుతుంటాడు. తరచూ మందుకొట్టి స్కూల్కు రావడమే కాదు.. క్లాస్లో విద్యార్థుల ముందే మందు కొట్టిన సందర్బాలూ ఉన్నాయి. మద్యం సేవించి విద్యార్థులను, తోటి ఉపాధ్యాయులను నోటికొచ్చినట్లు తిట్టేవాడు. స్టూడెంట్లను చితకబాది.. ఎండలో నిల్చోబెట్టేవాడు. ఈ మందు మాష్టారుకి మద్యం మీద ఉన్న ప్రేమ విద్యాబోధనపై లేదు. పాఠాలు చెప్పమంటే చంపేస్తానంటూ బెదిరించేవాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొంత కాలంగా తాగుబోతు మాష్టారుతో నానా నరకం అనుభవిస్తున్నామని తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు రాజాను ఇప్పటికే పలు మార్లు హెచ్చరించామని.. అయినా పద్ధతి మార్చుకోవడం లేదని ఎంఈవో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తాగుబోతు సార్ సేవలు తమకు అక్కర లేదని గ్రామస్తులతో పాటు విద్యార్థులూ చెబుతున్నారు. రాజాను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.
Read more about తాగుబోతు మాష్టారు..
కడప : రాయలసీమకు తక్షణమే లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం, సీపీఐలు చేపట్టిన బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. యువత, రైతులు, మహిళలు అన్ని గ్రామాల్లో వామపక్ష నేతలకు స్వాగతం పలుకుతున్నారు.
సీపీఎం, సీపీఐ చేపట్టిన రాయలసీమ బస్సు యాత్ర మూడో రోజు విజయవంతం అయ్యింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి బయలుదేరిన బస్సు యాత్ర జమ్మలమడుగు, ముద్దనూరు, తొండూరు, పులివెందుల, వేంపల్లె, వీరపునాయునిపల్లె మీదుగా ఎర్రగుంట్లకు చేరుకుంది. నేడు యర్రగుంట్ల నుంచి ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే ప్రతి ప్రాంతంలో సీపీఎం, సీపీఐ నాయకులకు జనం పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పలకరింపులు, ఆత్మీయతలు, వినతిపత్రాల సమర్పణ, ప్రజానాట్యమండలి కళాకారుల గీతాలాపన మధ్య ఉత్తేజభరితంగా సాగిపోయింది. ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహించారు.
రాష్ట్ర విభజన హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు.
మార్పు కోసం, మెరుగైన భవిష్యత్తు, కరువు నుంచి విముక్తి, అభివృద్ధి కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం, సీపీఐ నేతలు ప్రజలకు సందేశమిచ్చారు. రాయలసీమ అభివృద్ధి కోసం తలపెట్టిన మహాయజ్ఞ్ఞంలో పాలు పంచుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.
ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని నేతలు హెచ్చరించారు. ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ ఓబులు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు.
Read more about రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం-సీపీఐ బస్సుయాత్ర
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మెదక్ : జిల్లాలోని పటాన్చెరు మండలం లక్కారం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు టిప్పర్ లారీలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
Read more about రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత
Read more about కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత
హైదరాబాద్ : బడ్జెట్ రూపకల్పనలో కేసీఆర్ తన మార్క్ ను ప్రదర్శిస్తున్నారు. మంత్రులు ఉన్నా లేకున్నా శాఖల వారిగా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎన్నికల హమీలు నేరవేర్చడమే లక్ష్యంగా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. డబుల్ బెడ్రూం పథకం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అమలు చేయడమే ప్రాధాన్యాంశాలుగా బడ్జెట్ కూర్పు జరుగుతోందని అంచనాలు వెలువడుతున్నాయి.
బడ్జెట్ రూపకల్పనలో సీఎం కేసీఆర్ బీజీ అయ్యారు. శాఖాధిపతులు అధికారులతో స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. గత వారం రోజులుగా కీలక శాఖలపై సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నారు. |
సీఎం కేసీఆర్..శాఖల వారి సమీక్షలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే విద్యా, వైద్యం, రవాణ, విద్యుత్, సంక్షేమ, వ్యవసాయ, రోడ్డు భవనాలు, మున్సిపల్, పంచాయితి రాజ్, ఐటీ తో పాటు ఇతర శాఖ అధికారులతో బడ్జెట్ కసరత్తులు జరిపారు. ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు అమలు, బడ్జెట్ నిధుల వ్యయాన్ని పర్యవేక్షించే విధంగా జిల్లా అభివృద్ధి కార్డులను తీసుకొస్తున్నారు. ఏయే జిల్లాలకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారనే విషయం దీని ద్వారా తేటతెల్లం కానుంది. దాంతో పాటు అన్ని శాఖలు దుబారాను తగ్గించుకోవాలని ఆదేశాలు జారి చేసారు.
ఎన్నికల్లో ఇచ్చిన హమీలు నేరవేర్చేలా ఈ బడ్జెట్ లో అధిక ప్రధాన్యమివ్వాలని ఆదేశాలు జారీ చేసారు. అందులో ప్రధానంగా ఉచిత విద్య, వైద్యం, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ, వాటర్ గ్రీడ్ వంటి పథకాలకు అధిక ప్రధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
వచ్చే ఏడాది భూముల అమ్మకాలు ఉపందుకుంటాయని సీఎం ఆశాభావంగా ఉన్నారు. దాంతో పాటు ఐటి ఎగుమతులు, పెట్టుబడులు, రియల్ ఎస్టెట్ రంగం మెరుగుపడనున్నందున నిధుల కొరత ఉండదని చెబుతున్నారు. ఇలా ప్రతి రంగం, శాఖపై జరుగుతున్న సమావేశాల్లో స్వయంగా పాల్గొంటూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
Read more about బడ్జెట్ రూపకల్పనలో కేసీఆర్ మార్క్
టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ లో ఆంతర్యమేమిటి..?
హైదరాబాద్ : టిడిపి అధికారంలోకొచ్చి రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీలోకి కనిపించని వలసలు హఠాత్తుగా ఈ మధ్యే ఊపందుకున్నాయి. అసలు ఆపరేషన్ ఆకర్ష్ ను టిడిపి ఇప్పుడే ఎందుకు ముమ్మరం చేసింది.? ప్రధాన ప్రతిపక్షం వైసిపిని బలహీనపరడమే లక్ష్యమా ఇంకేదైనా టార్గెట్ ఉందా.?
ఆపరేషన్ ఆకర్ష్ తో రాజకీయాలు టర్న్
ఏపీ రాజకీయాల్లో రెండు నెలల క్రితం ఏ హడావుడీ లేదు. అధికార పక్షంపై ప్రతిపక్షం, ప్రతిపక్షంపై అధికార పక్షం విసుర్లు విమర్శలు తప్పించి పెద్దగా చెప్పుకోదగ్గవి ఏవీ జరగలేదు. కానీ గత పక్షం రోజులుగా ఒకటే హడావుడి నెలకొంది. ఆపరేషన్ ఆకర్ష్ తో రాజకీయాలు షడన్గా టర్న్ తీసుకున్నాయి.
గత కొన్ని రోజులుగా అధికార టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పుడే ఇలా ముమ్మరం చేయడం వెనుక రెండు వ్యూహాలు ప్రధానంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. త్వరలో రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఎపి నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. టిడిపి, వైసిపి ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి తెలుగుదేశానికి మూడు, వైసిపికి ఒక రాజ్యసభ సీటు దక్కుతాయి. అయితే ఆ ఒక్క రాజ్యసభ సీటు కూడా జగన్ పార్టీకి దక్కకుండా ఉండేందుకు టిడిపి వ్యూహాలు రచిస్తోందని టాక్.
రాజ్యసభ సీటు గెలుచుకోవాలంటే 43 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఈ లెక్కన టిడిపికి 102 మంది ఎమ్మెల్యేలు, వైసిపికి 67 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో టిడిపి రెండు రాజ్యసభ, వైసిపి ఒక సీటు గెలుచుకోగలుగుతాయి. మరో సీటు దక్కించుకోవడానికి ఏ పార్టీకీ సరైన మెజార్టీ లేదు. ఈ నేపథ్యంలో నాలుగో స్థానాన్ని కూడా టిడిపి దక్కించుకునేందుకే ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసిందని తెలుస్తోంది.
Read more about టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ లో ఆంతర్యమేమిటి..?
అమెరికాలో కాల్పులు...నలుగురు మృతి
వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాన్సస్లోని ఓ ఫ్యాక్టరీలో దుండగుడు... తన సహచరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. యాజమాన్యంతో విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందుతుడ్ని కాల్చిచంపారు.
Read more about అమెరికాలో కాల్పులు...నలుగురు మృతి
నేడు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ
హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యేలతో నేడు ఆ పార్టీ అధినేత జగన్ భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు.
Read more about నేడు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ
నేడు బంగ్లాదేశ్, యూఏఈల మధ్య టీ20 మ్యాచ్
మీర్పూర్ : ఆసియాకప్ టీ20లో భాగంగా నేడు బంగ్లాదేశ్, యూఏఈల మధ్య మ్యాచ్ జరుగనుంది. మీర్పూర్ వేదిగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Read more about నేడు బంగ్లాదేశ్, యూఏఈల మధ్య టీ20 మ్యాచ్
దేశంలో ప్రమాదకర పరిస్థితులు...
దేశంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, బిజెపి తెలంగాణ అధికార ప్రతినిధి ఎస్.కుమార్ పాల్గొని, మాట్లాడారు. ఎన్ డిఎ పాలనలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య శక్తులపై దాడి జరుగుతోందన్నారు. గాంధీని చంపిన గాడ్సేని గొప్ప దేశభక్తునిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ విద్యార్థులను దేశద్రోహలుగా చిత్రీకరిస్తున్నారని వాపోయారు. బిజెపి, సంఘపరివార్ శక్తుల చర్యలను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... |
Read more about దేశంలో ప్రమాదకర పరిస్థితులు...
బొగ్గు గని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'కరీంనగర్ జిల్లా రామ గుండంలో ఈ నెల 28 నుంచి ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలు జరగబోతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో బొగ్గు గని కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోబోతున్నారు. మన దేశంలో ప్రస్తుతం కోల్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా వుంది? బొగ్గు గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ప్రత్యేకించి సింగరేణిలో నెలకొన్న పరిస్థితులు ఏమిటి? ఇలాంటి అంశాలపై సాయిబాబు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
Read more about బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సాయిబాబు
నారాయణగూడలోని నారాయణ జూ.కాలేజీలో అగ్నిప్రమాదం....
Read more about నారాయణగూడలోని నారాయణ జూ.కాలేజీలో అగ్నిప్రమాదం....
నారాయణ జూ.కాలేజీలో అగ్నిప్రమాదం....
Read more about నారాయణ జూ.కాలేజీలో అగ్నిప్రమాదం....
హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువులు దౌర్జన్యానికి దిగారు. తలసాని అండ చూసుకుని రెచ్చిపోయారు. ఓ జీహెచ్ ఎంసీ ఉద్యోగిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. జీహెచ్ ఎంసీ ఉద్యోగి సాయికుమార్... సికింద్రాబాద్ బోయిగూడ ఐడీఎల్ కాలనీలో నివాసముంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడితోపాటు అతని అనుచరులు నిన్న రాత్రి సాయికుమార్ పై కత్తులతో దాడి చేశారు. సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని అస్పత్రికి తరలించారు. తలసాని సోదరుడితోపాటు అతని అనుచరులు పదిమంది దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనకు పాతకక్షలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్నారు.
సాయికుమార్ తండ్రి..
శ్రీనివాస్ తనయుడు, కొడుకులు వారి బంధువులు పది, ఇరవై మంది తాగి వచ్చి నా కొడుకుపై, నాపై దాడి చేశారు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు.
శ్రీనివాస్ యాదవ్ తమ్ముడు అతని అనుచరులు, వారి బంధువులు మా ఇంటికి వచ్చారు. మా అన్నయ్యను పిలిచి.. కత్తితో దాడి చేశారు. మమ్మల్ని బెదిరించారు. మాదిగొల్లంటే గిట్టదన్నారు. మా అమ్మను, పెద్ద అక్కను, చిన్న అక్కను కొట్టారు. నోటికి వచ్చినట్లు తిట్టారు.
పోలీసు అధికారి..
వారి మధ్య పాత గొడవులున్నాయని.. ఈనేపథ్యంలో శ్రీనివాస్ తనయుడు వారి బంధువులు, సాయికుమార్ దాడులకు పాల్పడ్డారు. ఈదాడిలో సాయికుమార్ కు గాయాలయ్యాయి. అతను కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందరిపై కేసు నమోదు చేశాము.
Read more about జీహెచ్ ఎంసీ ఉద్యోగిపై మంత్రి తలసాని బంధువులు కత్తులతో దాడి
Read more about విహారయాత్రకు వెళ్తుండగా ప్రమాదం...
Read more about రైల్వేగార్డు ఇంటిలో సీబీఐ సోదాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎమ్మల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి లాక్కోవడం నీతిమాలిన చర్య అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. ప్రభుత్వాలు ఏర్పాడాలన్నా.. పార్టీలు అభివృద్ది చెందాలన్నా ప్రజల మనసుల్లో చోటు సంపాదించాలని ఎద్దేవా చేశారు జగన్ . దమ్ముంటే పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. పార్టీ పెట్టినప్పుడు ఇద్దరమే ఉన్నామని.. నేడు 67 మంది మా వెనక ఉన్నారన్నారు జగన్. పార్టీమారిన ఎమ్మెల్యేలపై చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read more about ఎమ్మెల్యేలను లాక్కోవడం నీతిమాలిన చర్య - జగన్
వాషింగ్టన్ : అమెరికాలో కాల్పులు ఘటన కలకలం రేపింది. కన్సాస్ లోని ఓ ఫ్యాక్టరీలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
Read more about అమెరికాలో కాల్పులు కలకలం
కాలేజీ బస్సు బోల్తా... 20 మందికి గాయాలు
కడప : దువ్వూరు మండలం టంగుటూరుమెట్ట వద్ద కాలేజీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు ప్రొద్దుటూరు నుంచి అహోబిలం వెళ్తుండగా ఘటన జరిగింది.
Read more about కాలేజీ బస్సు బోల్తా... 20 మందికి గాయాలు
గుంటూరు : నెహ్రూనగర్ లో రైల్వేగార్డు ఇంటిపై సీబీఐ సోదాలు నిర్వహించింది. రైల్వే ఉద్యోగాలిప్పిస్తామని ఒక్కో నిరుద్యోగి నుంచి షేక్ మహబూబ్ బాషా భారీగా వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో బాషా ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు జరిపారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భాషాను అరెస్టు చేసి.. విశాఖ సీబీఐ కార్యాలయానికి తరలించారు.
Read more about గుంటూరు జిల్లా నెహ్రూనగర్ లో రైల్వేగార్డు ఇంటిపై సీబీఐ సోదాలు
నేడు తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : నేడు తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల కానుంది.
Read more about నేడు తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
నేడు తెలంగాణ డీజీపీ ఆఫీస్ లో హెల్త్ క్యాంపు
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ ఆఫీస్ లో నేడు హెల్త్ క్యాంపు నిర్వహించనున్నారు.
Read more about నేడు తెలంగాణ డీజీపీ ఆఫీస్ లో హెల్త్ క్యాంపు |
లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
కడప : వైసీపీ నుంచి టీడీపీలోకి సునామీలా చేరుతున్నారని నారా లోకేష్ అన్నారు. కడప టీడీపీ కార్యాలయంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ ముక్తియార్తో పాటూ ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. జగన్ చేసిన అవినీతి, కుట్ర రాజకీయాలు చూసే ఆ పార్టీ నేతలు టీడీపీలోకి వచ్చి చేరుతున్నారని లోకేష్ అన్నారు. కడప జిల్లా అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు 11 సార్లు జిల్లాకు వస్తే జగన్ ఒక్క సారి కూడా రాలేదన్నారు. తాను ఒక్కసారి అవినీతికి పాల్పడినట్లు నిరూపించినా రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని లోకేష్ ప్రకటించారు. రాజశేఖర్రెడ్డిని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొన్నట్లుగా తాను చేయనన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకుపోతామని లోకేష్ అన్నారు.
Read more about లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
మార్చి 10న ఏపీ సాధారణ బడ్జెట్
విజయవాడ : ఏపీ సాధారణ బడ్జెట్కు ముహూర్తం దగ్గర పడుతుంది. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ కసరత్తు మొదలుపెట్టారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కీలక శాఖల సమీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు, రాజధాని నిర్మాణం ఇలా ప్రాధాన్యతా అంశాలతో బడ్జెట్ కసరత్తులు జరుగుతున్నాయి. లక్షా 30 వేల కోట్ల బడ్జెట్ ఉండచ్చని అంచనా.
ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ పై కసరత్తు చేస్తున్నారు. మార్చి10న ఏపీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇప్పటికే కొన్ని శాఖలపై రివ్యూలు నిర్వహించిన యనమల నీటిపారుదల, రవాణా, దేవాదాయ శాఖ, బీసీ సంక్షేమం, రెవిన్యూ, రిజిస్ట్రేషన్లపై కసరత్తు చేయనున్నారు. నీటి పారుదల రంగానికి ప్రాధాన్యత ఇచ్చేలా కేటాయింపులు ఉండనున్నాయి.
ఇక బీసీ సంక్షేమానికి కూడా భారీగా నిధులు కేటాయించనున్నారు. ఇప్పటికే బీసీ సబ్ ప్లాన్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. బీసీలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నారు. రవాణా రంగానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి. దీనికి సంబంధించి మంత్రి శిద్ధారాఘవరావు ఉన్నతాధికారులతో నివేదిక తయారు చేయించారు.
ప్రాధమిక ఆరోగ్య రంగానికి భారీ నిధులు
ఇక ఏపిలో దారుణంగా ఉన్న ప్రాధమిక ఆరోగ్య రంగానికి భారీ నిధులు కేటాయించాలని, మంత్రి కామినేని శ్రీనివాసరావు..ఆర్ధిక మంత్రి యనమలను కోరారు. బడ్జెట్ కేటాయింపుల నివేదికను యనమలకు అందజేసారు. విద్యశాఖ మంత్రి గంటా సైతం తన శాఖ ప్రపొజల్స్ యనమలకు అందజేసారు. కాగా మరో రెండు రోజుల్లో బడ్జెట్ కసరత్తులు పూర్తిచేసి, మరికొన్ని శాఖలపై మంత్రి యనమల సమీక్షలు చేయనున్నారు. దీనిపై సీఎంతో మంత్రి యనమల చర్చించి పూర్తి క్లారిటీ తీసుకుంటారు.
Read more about మార్చి 10న ఏపీ సాధారణ బడ్జెట్
ఆ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ : జెఎన్ యూ వివాదంపై సిట్ తో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.
Read more about ఆ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
నేడు పార్లమెంట్ లో 2015-16 ఆర్థిక సర్వే
హైదరాబాద్ : నేడు పార్లమెంట్ లో 2015-16 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు.
Read more about నేడు పార్లమెంట్ లో 2015-16 ఆర్థిక సర్వే
హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువులు దౌర్జన్యానికి దిగారు. బోయిగూడ ఐడీఎల్ కాలనీలో జీహెచ్ ఎంసీ ఉద్యోగి సాయికుమార్ పై కత్తులతో దాడి చేశారు. సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని అస్పత్రికి తరలించారు. ఘటనకు పాతకక్షలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్నారు.
Read more about మంత్రి తలసాని శ్రీనివాస్ బంధువుల దౌర్జన్యం
'డియాన్ హిల్లీకి విరాట్ కోహ్లీ మీద
వాలెంటైన్స్ డే సందర్భంగా భట్టి
కిడ్స్ స్పెషల్ లో 'మామ' నయా
సలాం ఇండియా...
నువ్వుల నూనె..ఆరోగ్య రహస్యాలు...
ఫేస్ టు ఫేస్ విత్ సతీష్
'మహా లాంగ్ మార్చ్' పై విజు కృష్ణన్ విశ్లేషణ.. |
2008 ఇంగ్లీషు సినిమాలు-1 _ నవతరంగం
Home > Uncategorized > 2008 ఇంగ్లీషు సినిమాలు-1
వెంకట్ శిద్దారెడ్డి January 21, 2009 Uncategorized 2 Comments
2008 హాలీవుడ్ చాలా మంచి సినిమాలొచ్చాయి. గతంలో అంతా మంచి సినిమాలంటే ఏ టర్కీ సినిమాలో, ఇరానియన్, కొరియన్ లేదా జపనీస్ సినిమాలో వెతుక్కోవాల్సి వచ్చేది. మన బాలీవుడ్ కి లాగే హాలీవుడ్లో కూడా 2008 చాలా మంచి సినిమాలొచ్చాయి.వాటన్నిటి గురించి త్వరలోనే ఒక్కొకటిగా సమీక్షిస్తూ వెళ్లాలని ఉంది. కానీ ప్రస్తుతానికి వాటిల్లో కొన్నింటినైనా పరిచయం చేయాలన్నదే ఈ టపా ఉద్దేశం.
ఈ సంవత్సరం ఎప్పటిలానే సూపర్ హీరోల సీక్వెల్స్ (డార్క్ నైట్, హెల్ బాయ్), జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్ సినిమాలతో పాటు ఐరన్ మాన్ అనే మరో సూపర్ హీరో సినిమా, కార్టూన్ కారెక్టర్లు, యానిమేషన్ సినిమాలు హాలీవుడ్ ని ముంచెత్తినా ఈ సంవత్సరం చివరి భాగంలో ఎన్నో కళాత్మకమైన సినిమాలు హాలీవుడ్ లో విడుదలయ్యాయి. వీటిల్లో కొన్ని 2009 లో విడుదలవనున్నాయి.
ఈ సంవత్సరం నాకు బాగా నచ్చిన హాలీవుడ్ సినిమాలు:
చిన్నప్పుడు స్టార్ టివి కొత్తల్లో వచ్చిన రోజుల్లో WWF చూడకుండా చాలామంది నిద్రపోయేవాళ్ళు కాదు. ఆ కార్యక్రమం రాత్రి ఎప్పుడో వచ్చినా మేలుకొని ఉండి చూసేవాళ్ళని చాలా మందిని చూసాను. వయసులో ఉండగా అలాంటి WWF పోటిలో పాల్గొని కాస్త వయసైపోయిన ఒక wrestler జీవితాన్ని కాసేపు అతని వెంటే ఉంటూ చూడాలనుకుంటున్నారా? అయితే The Wrestler చూడాల్సిందే. కాకపోతే కాస్త గుండె ధైర్యం కావాలి.
ఈ సినిమా 2008 లో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. కావాలంటే Rotten Tomatoes లో ఈ సినిమా రేటింగ్ చూడండి (98% fresh). ఈ సినిమా చూడ్డానికి ఇదొక్కటే కారణం కాదు.
మీరు Mickey Rourke పేరు విన్నారా? ఈయన హాలీవుడ్ నటుడు. ఈ మధ్య కాలంలో Sin City అనే సినిమాలో నటించాడు. ఈయన పేరు మీరు ఇది వరకు వినకపోతే ఇక ముందు బాగానే వింటారు. మొన్ననే ఉత్తమ నటుడుగా గోల్డన్ గ్లోబ్ అవార్డు అందుకున్నాడు. త్వరలోనే ఆస్కార్ కూడా అందుకుంటాడనే నమ్మకం వుంది. ఈయన నటించిన చిత్రమే The Wrestler.
ఈయన నటన కోసం కాకపోయినా ఈ సినిమా చూడ్డానికి మరో కారణం చెప్తాను. Darren Aronofsky పేరు విన్నారా? Pi మరియు Requiem for a dream అనే రెండు అత్యద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడీయన. The Wrestler ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమా.
తప్పక చూడాల్సిన సినిమా.
ఈ సినిమా కోసం ఎంత ఎదురు చూసానంటే కళ్ళు నిజంగానే కాయలు కాచేలా ఎదురు చూశాను. నాకైతే 2008లో Most awaited film of the year ఇదే.ఎందుకు నేనీ సినిమా కోసం అంత ఎదురుచూశానంటే గత సంవత్సరం నేను Richard Yates అనే అమెరికన్ రచయిత పుస్తకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చదివేశాక వాటిల్లో బాగా నచ్చిన The Revolutionary Road అనే పుస్తకాన్ని సినిమాగా తీస్తున్నారని తెలియడంతో పాటు ఈ సినిమాకి American Beauty దర్శకుడు Sam Mendes దర్శకత్వం వహిస్తున్నాడని తెలిసింది.
వీటన్నిటితో పాటు రివల్యూషనరీ రోడ్ లాంటి కష్టమైన నవలను సినిమాగా రూపొందించడమంటే మాటలు కాదు. అసలు ఫస్ట్ సీన్ ఎలా ఉంటుందో, ఈ సీన్ ఎలా తీస్తారో అని కలలుకంటూ చవరికి ఒకరోజు సినిమా చూసే అవకాశం దొరికింది.
సినిమాలో Kate Winslet, Leonardo Dicaprio అధ్భుతమైన నటన ప్రదర్శించారు. సినిమా కూడా చాలా చాలా బావుంది. కానీ నవల తో పోలిస్తే సినిమా కాస్త పేలవంగా ఉంటుంది.కొన్ని విషయాల్లో (ఉదా: సినిమాలో పిల్లల పాత్రలు) మరి కొంత జాగ్రత్త తీసుకునుంటే బావుండనిపించింది.
2008 లో వచ్చిన సినిమాల్లో ఇది Must Watch అనే చెప్తాను. కానీ దానికంటే ముందు ఈ సినిమాకి ఆధారమైన నవల మాత్రం మీ must Read లిస్టులో చేరుకోండి. (ఇండియాలో ఈ పుస్తకం కోసం ఎక్కడెక్కడో గాలించాను. ఒక వెబ్ సైట్ లో 1600 రూలకు దొరుకుతుంది. ఇక పెద్ద పెద్ద షాపుల్లో కూడా దొరకటం లేదు. బహుశా ఈ సినిమాకో ఈ సినిమాలో నటీ నటులకో ఆస్కార్ నామినేషన్ వస్తే పుస్తకానికీ క్రేజ్ లభించి అందరికీ అందుబాటులోకి వస్తుందేమోనని ఆశ)
అమెరికా లోని ఒక కుటుంబం కథ ఇది. క్రిస్టమస్ దగ్గరకొస్తుంటుంది. ఆ కుటుంబానికి ఆధారమైన భర్త ఇంట్లోని డబ్బులన్నీ దొంగలించి ఎటో పారిపోతాడు. తనకున్న చిన్న ఉద్యోగంతో ఎలాగో కుటుంబాన్ని నడిపించే ప్రయత్నం చేస్తుంది భార్య. ఇలాంటి పరిస్థుతుల్లో ఆమెకి మరో యువతి పరిచయం అవుతుంది. ఇద్దరూ కలిసి కెనడా నుంచి illegal immigrants ని తీసుకొచ్చి డబ్బు సంపాదిస్తుంటారు. ఈ మహిళలిద్దరి కథ ఇది.
ఇండిపెండెంట్ సినిమా. Sundance చలనచిత్రోత్సవం విజేత. హాలీవిడ్ సినిమాలకి లాగ భారీ నిర్మాణ విలువలు లేవు. ఉన్నదల్లా ఆసక్తి గొలిపే కథనం, మంచి నటన. మంచి సినిమా తప్పక చూడొచ్చు
జేమ్స్ గ్రే ఈ చిత్రానికి దర్శకుడు. Joaquin Phoenix, Vinessa Shaw, Gwyneth Paltro సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. |
తన ప్రియురాలితో విడీపోయిన లియోనార్డ్ మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం తెలిసినా అతని తల్లిదండ్రులు చాలా దిగులుగా ఉంటారు. ఈ లోగా తన తండ్రి నడుపుతున్న వ్యాపారాన్ని కొనబోయే ఒక కుటుంబంలోని అమ్మాయి అతనికి పరిచయం అవుతుంది. రెండు కుటుంబాలు కూడా వీళ్ళిద్దరూ ఒకటైతే అటు తమ వ్యాపారానికీ ఇటు కుటుంబ పరంగా సంబంధానికీ బావుంటుందనీ తమలో తామే అభిప్రాయపడతారు. వీరిద్దరికీ బాగానే కుదుర్తుంది కూడా. అంతా బావుంటే కథేముంది. ఈ మధ్యల్లో అతని పక్కింట్లోకి ఒకమ్మాయి చేరుతుంది. మొదటి చూపులోనే మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా ఇతనితో బాగానే ఉంటుంది కానీ ప్రేమలో పడదు. పక్కింటి అమ్మాయిది మరో కథ. ఆవిడ పెళ్ళయిన మరో వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అతని గురించి లియోనార్డ్ దగ్గర సలహాలు తీసుకుంటుంటుంది. ఇలా మన శోభన్ బాబు లాగా లియోనార్డ్ ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోతాడు. చివరికి ఎవరికి ఎవరితో పెళ్ళయింది అనేది ముగింపు.
ఈ సినిమా కథ కాస్త మన తెలుగు/హిందీ/తమిళ సినిమాల్లాగే ఉన్నా నటీనటులు ప్రదర్శన మరియు దర్శకత్వం చాలా చాలా బావున్నాయి. చెప్పడం కాదు కానీ తప్పకుండా చూడాల్సిన సినిమా. అంటే హాలీవుడ్ లో ఇలాంటి రొమాంటిక్ కామెడీస్ చాలానే వస్తుంటాయి. కానీ దర్శకుడు ఈ సినిమాని మలచిన తీరు చాలా బావుంటుంది. చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రేమ కథల్లో మునిగి తేలే మన పరిశ్రమవాళ్ళు ఈ సినిమాని చూసి చాలానే నేర్చుకోవచ్చు. సినిమా రంగులు, సింప్లిసిటీ కాస్తా వుడీ ఆలెన్ సినిమాలను తలపిస్తాయి.
ఈ సినిమాకి ఇన్సిరేషన్ ఏంటో తెలుసా? దోస్తోవ్స్కీ రచించిన White Nights అనే కథ.
ఇన్ని కారణాలు చెప్పినా ఈ సినిమా చూడకూడదనుకున్నావారికి మరో కారణం చెప్పాలి. ఈ సినిమాలో నటించిన Phoenix కి నటుడిగా ఇదే ఆఖరు సినిమా అట. ఇక పై నటించనని ఈ మధ్యనే ప్రకటించాడీయన. అంతే కాదు ఇకపై పాటలు మాత్రమే పాడుతాడట. ఈయన్న్ని తెరపై చివరై సారిగా చూసేందుకైనా ఈ సినిమా చూడొచ్చు.
సూపర్ హీరో సినిమాలకు కొత్త రూపమిచ్చి, మళ్ళీ ఆ జాతానికి (genre) కి ప్రాణం పోసిన డార్క్ నైట్ గురించి ఇప్పటికే అందరికీ తెలిసుంటంది. కాదు లేదు అంటే నవతరంగంలో వచ్చిన ఈ సమీక్షలు చదవండి.
హెల్ బాయ్ -2
హెల్ బాయ్ ఈ సంవత్సరంలో నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమాల్లో ఒకటి. ఎందుకో హెల్ బాయ్ నాకు తెగనచ్చేసాడు. ఇది చూసాకే నేను మొదటి హెల్ బాయ్ కూడా చూసాను. రెండిట్లో మొదటిదే బెస్ట్ కానీ రెండోది కూడా బావుంటుంది. ఫాంటసీ ని సూపర్ హీరో కథతో కలిపి వెరైటీ గా ఉంటుంది. కానీ నేను రికమెండ్ చేస్తే చూసిన వాళ్ళకి మరీ అంతగా నచ్చలేదు కాబట్టి మీక్కూడా సినిమా చూశాక నచ్చకపోతే నన్ను నిందించకండి 🙂
ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ముఖ్యంగా Che అంటే మీకిష్టమున్నా లేకపోయినా మీరు ఈ సినిమా చూడొచ్చు. ఇందులో Che ని ఒక హీరోగా పోస్టర్ బాయ్ గా గ్లోరిఫై చెయ్యలేదు. అలాగే అతను చేసిందంతా తప్పని ఎండకట్టనూ లేదు. కాకపోతే మోటార్ సైకిల్ డైరీస్ చూసి Che అభిమానులైపోయిన వారు ఈ సినిమా కూడా అలానే ఉంటుందని అంచనాలు లేకుండా ఉండడం మేలు. ఎందుకు చెప్తున్నానో సినిమా చూస్తే మీకు అర్థమవుతుందనుకుంటాను. అలాగే Che పాత్రలో Benicio Del Toro అద్భుతమైన నటన ప్రదర్శించాడు.
అన్నింటికంటే ముఖ్యంగా సినీ ఔత్సాహికులు ఈ సినిమా తప్పక చూడాలన్నదానికి ఈ సినిమా(లు) రెడ్ కెమెరా తో షూట్ చేసారన్న ఒక్క విషయం చాలు.
రెడ్ కెమెరా ఏంటో తెలియని వారికోసం రెడ్ కెమెరా ఉపయోగించిన/ఉపయోగిస్తున్న వారి అనుభవాలతో కూడిన ఒక వ్యాసం త్వరలోనే ప్రచురించే ఆలోచన ఉంది.
–ఇంకా ఉన్నాయి
చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది.. |
చే సినిమాలు నాకు కూడా బాగా నచ్చాయి కానీ మోటర్ సైకిల్ డైరీస్తో పోలిస్తే కొంచెం తక్కువనే చెప్పాలి. డ్రామా పాలు బాగా తగ్గడం కారణం అనుకుంటా. రెండవభాగంలో గొరిల్లాపోరాటాలు మరీ రిపిటీషన్లా అనిపించాయి. రెండిటినీ కలిపి కొంచెం ఎడిట్ చేసి ఒకే సినిమాగా తీసుంతే చాలబావుండేదనిపించింది. నలుగు గంటలు కూర్చుని చూడడం చాలా కష్టమనిపించింది. నాకెందుకో ఇవి మోటార్ సైకిల్ డైరీస్కి సీక్వెల్లా అనిపించాయి. ఒకవేళ ఆ సినిమా వేసిన ఘాడమైన ముద్రవల్లనేమో ..
బి.పవన్ కుమార్ on అరువి – ఉప్పొంగే జలపాతం
Bala on అర్జున్రెడ్డి నాకెందుకు నచ్చిందంటే..! – 1 (తనను తాను ధ్వసం చేసుకున్న వీరుడు)
GSReddy on అర్జున్రెడ్డి నాకెందుకు నచ్చిందంటే..! – 1 (తనను తాను ధ్వసం చేసుకున్న వీరుడు)
jai on అర్జున్రెడ్డి నాకెందుకు నచ్చిందంటే..! – 1 (తనను తాను ధ్వసం చేసుకున్న వీరుడు)
నవతరంగం Copyright © 2018. |
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
పెళ్లి పుకార్లపై సునీత క్లారిటీ!
డిజాస్టర్తో ఎగ్జిట్, డిజాస్టర్తో రీఎంట్రీ Nov 18,2018126 Shares ఎన్టీఆర్కి పెంచి... చరణ్కి కత్తిరించి..! Nov 18,2018126 Shares మాస్ మహారాజా గాలి తీసేసిన టాక్సీవాలా! Nov 18,2018126 Shares హాట్: ఆర్ఎక్స్ 100 బ్యూటీ టీజింగ్ షో! Nov 18,2018126 Shares
కోహ్లీ తండ్రి కాబోతున్నాడా?
బండ్ల గణేష్ పంచులు మామూలుగా లేవు
పవన్కు సీబీఐ మాజీ జేడీ ఝలక్!
కేసీఆర్పై బాబు కామెంట్... ఏపీ టీడీపీలో అలజడి
ఎన్టీఆర్కి పెంచి... చరణ్కి కత్తిరించి..!
మాస్ మహారాజా గాలి తీసేసిన టాక్సీవాలా!
హాట్: ఆర్ఎక్స్ 100 బ్యూటీ టీజింగ్ షో!
విజయ్ దేవరకొండ సూపరబ్బా
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
అతని చేతిలో రాజశేఖర్ కూతురు
రాజశేఖర్, జీవిత దంపతులు చాలా కాలంగా తమ పెద్దమ్మాయి శివానిని హీరోయిన్గా పరిచయం చేయాలని చూస్తున్నారు. వాళ్లే స్వయంగా ఒక సినిమా కూడా నిర్మించారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఆర్ట్ సినిమాలతో కాకుండా కమర్షియల్ చిత్రంతో పరిచయం చేస్తేనే ఉత్తమమని వాళ్లు భావించారు.
ఇందుకోసం ఇండస్ట్రీలో పలువురితో సంప్రదింపులు జరిపినప్పటికీ శివానీ ఇంట్రడక్షన్ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే చాలా మంది కొత్త వాళ్లని పరిశ్రమకి పరిచయం చేసి, స్టార్లని చేసిన డైరెక్టర్ తేజ ఆ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. రాజశేఖర్ ఫ్యామిలీకి క్లోజ్ అయిన ఇండస్ట్రీ వాళ్లలో తేజ ఒకడు. రాజశేఖర్తో ఒక సినిమా తలపెట్టినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు ఆయన కుమార్తెని హీరోయిన్ని చేస్తానని తేజ మాటిచ్చాడట. ప్రస్తుతం రాణాతో ఒక పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్న తేజ అది పూర్తయిన వెంటనే కొత్తవాళ్లతో ఒక ప్రేమకథా చిత్రం చేస్తాడట. అందులో హీరోయిన్గా శివానిని ఫిక్స్ చేసేసాడట. హీరోల కూతుళ్లు ఇండస్ట్రీలో సక్సెస్ అయిన దాఖలాలు లేని నేపథ్యంలో రాజశేఖర్ కుమార్తెకి ఎలాంటి స్వాగతం లభిస్తుందనేది ఆసక్తికరమే. తేజలాంటి సమర్ధుడి చేతిలో వుంది కనుక కాజల్ అంత పెద్ద హీరోయిన్ అవుతుందని రాజశేఖర్ దంపతులు ఆశిస్తారేమో.
బండ్ల గణేష్ పంచులు మామూలుగా లేవు Nov 15,2018126 Shares బేబీ పాటకు రెహమాన్ కూడా ఫిదా Nov 15,2018126 Shares ఏకంగా రజనీనే ఢీకొడతాడట Nov 15,2018126 Shares ‘నా నువ్వే’ గుర్తుకొస్తోంది తమన్నా.. Nov 15,2018126 Shares
బండ్ల గణేష్ పంచులు మామూలుగా లేవు
పవన్కు సీబీఐ మాజీ జేడీ ఝలక్!
కేసీఆర్పై బాబు కామెంట్... ఏపీ టీడీపీలో అలజడి
ఇది తెలుగు రాజకీయ చిత్రం !
కూటమిలో ఫస్ట్ వికెట్...ఇంటిపార్టీ గుడ్బై
‘నా నువ్వే’ గుర్తుకొస్తోంది తమన్నా..
అలాంటి సినిమాలో అజితా.. నో ఛాన్స్
8 సినిమాల్లో ఐశ్వర్య.. ఒక్క సినిమాలో అభిషేక్
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
లవర్ కోసం సమంత స్పెషల్
హీరో సిద్ధార్థ్తో ప్రేమలో పడిందని సమంత గురించి అందరికీ తెలిసిన న్యూసే. మేము లవ్లో ఉన్నామని పబ్లిగ్గా అంగీకరించకపోయినా కానీ ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, సిద్ధూ మైకంలో సమంత పూర్తిగా మునిగిపోయిందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.
తన లవర్తో వరుసగా నటించడానికి కూడా సమంత సిద్ధంగా ఉన్నా కానీ ఆమెకి ఉన్న అవకాశాలని వదులుకోవద్దని అతను ఆమెకి సలహాలిస్తున్నాడు. తన సినిమాలో నటించేదానికంటే సమంత వేరే స్టార్స్తో నటిస్తే ఉండే లాభం సిద్ధూకి తెలియనిది కాదు. అలా అని సమంత ఫ్యాక్టర్ని వదులుకోలేడు కదా? తన సమ్థింగ్ సమ్థింగ్ సినిమాలో ఆమెతో ఒక చిన్న క్యారెక్టర్ చేయించాడు.
సమంత ఉందంటే తన సినిమాకి ప్లస్ అవుతుందని సిద్ధార్థ్కి బాగా తెలుసు. ఈ చిత్రంలో రాణా కూడా అతిథి పాత్ర పోషించాడు. సిద్ధార్థ్, రాణా ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. గోపీచంద్ పెళ్లిలో ఈ విషయం గుర్తించే ఉంటారు.
సైరా టీమ్ ఎక్కువ సీన్ ఇస్తున్నారా? Nov 21,2018126 Shares హాట్: కరెంట్ పాస్ చేస్తోంది! Nov 21,2018126 Shares రామ్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? Nov 21,2018126 Shares ఆమెలో హాట్ యాంగిల్ చూపిస్తుందట Nov 21,2018126 Shares
ఎన్టీఆర్ ఏం చేస్తాడిపుడు?
పవన్కళ్యాణ్ని నమ్ముకుంటే పనయ్యేదేమో
పవన్ తెలంగాణలో పోటీ చేయడం లేదు- ఎందుకు?
సైరా టీమ్ ఎక్కువ సీన్ ఇస్తున్నారా?
హాట్: కరెంట్ పాస్ చేస్తోంది!
రామ్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా?
రామ్ చరణ్ రేంజ్కి ఇదే అసలు పరీక్ష |
తాజా వార్తలు _ www.10tv.in
మూవీ రివ్యూ
తాజా వార్తలు
బెంగళూరు : అన్నదాతల కోసం రాయచూర్ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక డ్రోన్ పరికరాన్ని రూపొందించారు. ఈ డ్రోన్ పరికరం పెస్టిసైడ్స్(పురుగు మందులు) చల్లేందుకు ఉపయోగపడుతుంది.
హైదరాబాద్: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో పలువురు మహిళలు అయ్యప్పస్వామి ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించడం..
అమృత్సర్లో గ్రనేడ్ దాడి.. ముగ్గురు మృతి
పంజాబ్: అమృత్సర్ జిల్లా అద్లీవాల్ గ్రామంలో కలకలం చెలరేగింది. నిరంకారి భవన్పై దాడి జరిగింది. బైక్పై వచ్చిన దుండగులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి.
మహిళలకు శుభవార్త..దిగొస్తున్న బంగారం...
హైదరాబాద్ : బంగారం అంటే భారతీయ మహిళలకు ఎంతో మక్కువ. వివాహాలు, నూతన ఇంటి ప్రవేశాలు, సీమంతాలు, తదితర వేడుక ఏదైనా అతివలు తమ వద్దనున్న బంగారు ఆభరణాలు ధరించనిదే బయటకు వెళ్లరు. బంగారం అంటే అతివలు ప్రాణం పెడతారు.
తగ్గిన ‘పెట్రో’..ఏ నగరంలో ఎంత ?
హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా చమురు ధరలు తగ్గుతుండడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని ఇండియన్ ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నారు.
మీకు వేరే పని లేదా? మహిళలపై తస్లీమా నస్రీన్ ఆగ్రహం
ఢిల్లీ: బంగ్లాదేశ్ రచయిత్రి, మహిళా హక్కుల ప్రచారకర్త తస్లీమా నస్రీన్ శబరిమల వివాదంపై తీవ్రంగా స్పందించారు. శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడులో గజ తుపాను బీభత్సం..28 మంది మృతి
చెన్నై: తమిళనాడులో గజ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను దెబ్బకు తమిళనాడు చిగురుటాకులా వణికింది. గజ తుపాను దాటికి 28 మంది మృతి మృతి చెందారు. తుపాను ఎప్పటికప్పుడు వేగాన్ని, స్థితిని మార్చుకుంటూ వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేసింది.
చంద్రబాబు బాటలో మరో ముఖ్యమంత్రి.. సీబీఐకి నో
కోల్కతా: కేంద్ర దర్యాఫ్తు సంస్థ(సీబీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామివారి ఆలయం ఈసాయంత్రం తెరిచారు. మండల - మకరవిళక్కు పూజల కోసం, నేటి నుంచి 62 రోజులపాటు స్వామివారి ఆలయంలో భక్తులకు దర్శనం కల్పిస్తారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా భట్టి విక్రమార్క దంపతులతో చిట్ చాట్
కిడ్స్ స్పెషల్ లో 'మామ' నయా లుక్...
సలాం ఇండియా...
సినిమాల్లోనే సెన్సార్...ఇక్కడుండదు - అనంత శ్రీరామ్..
నువ్వుల నూనె..ఆరోగ్య రహస్యాలు...
ఇల్లు శుభ్రంగా ఉంచుకొంటే ఫ్రీ వైఫై..
ఫేస్ టు ఫేస్ విత్ సతీష్
మంత్రి జగదీష్ రెడ్డితో ఫేస్ టు ఫేస్..
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » రాజకీయ వార్తలు
ఆంధ్రప్రదేశ్లోని అధికార తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం నాలుగు జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు కూడా ఇందులో ఉంది. చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దొరబాబు, నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాకాటి నారాయణరెడ్డిలను ఎంపిక చేశారు. ఒక్కొక్కటిగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను జిల్లా ఇన్చార్జి మంత్రులు ప్రకటిస్తున్నారు. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలు, అనంత జిల్లా అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది.
గతంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయకుల పేర్లను తాజాగా కొత్త విధానాన్ని అవలంభించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక కోసం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ల అభిప్రాయాల సేకరించారు.సర్వే ఫలితాల అనంతరం అభ్యర్థుల ఎంపిక ఇన్చార్జ్ మంత్రులు సొంత జిల్లాలకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా మంత్రుల సమక్షంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కాగా, నామినేషన్లను దగ్గరుండి వేయించాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు.
సైరా టీమ్ ఎక్కువ సీన్ ఇస్తున్నారా? Nov 21,2018126 Shares హాట్: కరెంట్ పాస్ చేస్తోంది! Nov 21,2018126 Shares రామ్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? Nov 21,2018126 Shares ఆమెలో హాట్ యాంగిల్ చూపిస్తుందట Nov 21,2018126 Shares
ఎన్టీఆర్ ఏం చేస్తాడిపుడు?
పవన్కళ్యాణ్ని నమ్ముకుంటే పనయ్యేదేమో
పవన్ తెలంగాణలో పోటీ చేయడం లేదు- ఎందుకు?
సైరా టీమ్ ఎక్కువ సీన్ ఇస్తున్నారా?
హాట్: కరెంట్ పాస్ చేస్తోంది!
రామ్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా?
రామ్ చరణ్ రేంజ్కి ఇదే అసలు పరీక్ష |
10TV స్పెషల్స్
వైడ్ యాంగిల్
వన్ 2 వన్ శ్రీధర్ బాబు
ఫర్ ది పీపుల్
మూవీ రివ్యూ
నాగర్ కర్నూల్
వరంగల్ రూరల్
వరంగల్ అర్బన్
ట్రిపుల్ ఐటి విద్యార్థిని ఆత్మహత్య
Read more about ట్రిపుల్ ఐటి విద్యార్థిని ఆత్మహత్య
గగనతలంలో మరో విషాదం...
ఈజిప్టు : గగనతలంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈజిప్టు నుంచి రష్యా బయలుదేరిన ఎయిర్బస్ 321 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న 224 మంది మృతి చెందారు. అధికారులు ఇప్పటివరకు వందకు పైగా మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుల్లో అధికశాతం రష్యాకు చెందిన టూరిస్టులు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రష్యా విమానాన్ని తామే కూల్చినట్టు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
కూలిన రష్యా విమానం... 224 మంది మృతి
రష్యా ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్బస్ 321 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 224 మంది ప్రయాణికులు మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు వందకు పైగా మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఐదుగురు పిల్లల మృతదేహాలు ఉన్నాయి.
ప్రమాదం జరిగిన తీరు...
రష్యా కోగ్లీమావియా ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్బస్ 321 విమానం -ఈజిప్టులోని షామ్ అల్ షేక్ నుంచి రష్యాలోని పీటర్స్ బర్గ్ కు బయలుదేరింది. సినాయ్ ద్వీపకల్పం చేరుకోగానే 31 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని కైరోలో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారు. విమానం టేకాఫ్ తీసుకున్న 23 నిమిషాలకే ఈజిప్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్ పరిధి నుంచి దాటిపోయింది. ఆ తర్వాత అది సినాయ్ ద్వీపకల్పంలోని కొండల ప్రాంతంలో కూలిందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా చీలిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఈజిప్టు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాద స్థలానికి 45 అంబులెన్స్లను పంపినట్టు ఈజిప్టు ప్రభుత్వం పేర్కొంది. రష్యా బలగాలు కూడా ప్రమాద స్థలికి బయలుదేరాయి. ఈజిప్టులోని సినాయి పర్వతం వద్ద కూలిపోయిన రష్యా విమానం బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం వెనుక ఎలాంటి విద్రోహ చర్య లేదని, సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే విమానం కూలిపోయిందని నిపుణులు చెబుతున్నారు. అయితే విమానం బయల్దేరడానికి ముందే సమస్యను గుర్తించినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యం చేశారని, అతి విశ్వాసంతో టేకాఫ్ తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఈజిప్టు ప్రధాన మంత్రి ఇస్మాయిల్ షరీఫ్ ఓ క్యాబినెట్ స్థాయి కమిటీ వేశారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై ఈ కమిటీ సమీక్షించనుంది.
విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎయిర్ బస్ ఏ-321ను ఆపరేట్ చేస్తున్న కొగ్లీమావియా ఎయిర్లైన్స్పై రష్యా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం వల్లే సిబ్బందితోపాటు 224 ప్రాణాలు పోయినట్లు నిర్ధారించింది. ఎర్ర సముద్ర తీరంలోని షార్మ్ అల్ షేక్ కు పర్యటనకు వచ్చిన రష్యన్లకు తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన సంభవించింది. విమానంలో 200మంది పెద్దలు, 17 మంది పిల్లలు, ఏడుగురు విమాన సిబ్బంది కలిపి మొత్తం 224 మంది ప్రయాణించారు.
Read more about గగనతలంలో మరో విషాదం...
సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత ఉండాలి : ప్రణబ్
ఢిల్లీ : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ విషయంతో అత్యునత ప్రమాణాలు పాటించాలని కోరారు. న్యాయవ్యవస్థలో ఉన్నత పదవులను ప్రాధాన్యత ఆధారంగానే భర్తీ చేయాలని కోరారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత కారణంగా రాజ్యాంగం కల్పించిన అధికార వికేంద్రీకరణ నీరుగారి పోకూడదని పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యానికి చెందిన ప్రతి అంగం తనకు నిర్దేశించిన పరిధిలోనే పనిచేయాలి కానీ, ఇతర వ్యవస్థలకు కేటాయించిన వాటిలోకి చొరబడకూడదని చెప్పారు. జాతీయ న్యాయనియమకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీ హైకోర్టు స్వర్ణోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు.
Read more about సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత ఉండాలి : ప్రణబ్
తరతరాలుగా సమాజంలో శ్రమ దోపిడి కొనసాగుతోందని ప్రముఖ సామాజికి విశ్లేషకులు కంచె ఐలయ్య అన్నారు. అందుకు భారతీయ వర్ణవ్యవస్థ బాగా తోడ్పడిందని తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన జనచరిత విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పలు విషయాలను వివరించారు.
ఆ వివరాలను ఆయన మాటల్లోనే... |
మానవజాతి బతికి ఉండటానికి ప్రథమ ప్రక్రియ శ్రమం. తాత్విక రంగంలో శ్రమను రెండు రకాలుగా విభజించారు. శరీరక శ్రమ, మానసిక శ్రమగా విభజించారు. తాత్వికరంగంలో చాలా మోసపూరిత సిద్ధాంతాన్ని చేశారు. గ్రంథాలు రాయడం పుస్తకాలు చదవడం మానసిక శ్రమ అన్నారు. కానీ ప్రతి పనిలో మానసిక, శారీరక శ్రమ ఉంటుంది. శ్రమకు గౌరవం లేకుండా పోయింది. శ్రమతోనే భాష, మానవ సంబంధాలు సృష్టించుకున్నారు. శ్రమే జీవనం.. అది లేకుండా మరో జీవనం లేదు. శ్రమతో సంఘర్షణ పడుతూ ప్రకృతితో యుద్ధం చేశారు. పుస్తకాలు శ్రమజీవితాన్ని శాసించాయనేది తప్పు. ఆడమ్ స్మిత్ శ్రమ రోల్ ను గుర్తించారు. పాలీలో మొదలుగా రచనలు వచ్చాయి. ఆ తర్వాత సంస్కృతంలో రచనలు చేశారు. అయితే శ్రమ పాత్ర ఆధారంగా గ్రంథ రచన చేయలేదు. శ్రమ జీవితం యొక్క పాత్రను కారల్ మార్క్స్ గ్రంథం చేశారు. వర్గదృక్పథం గురించి వివరించారు. శ్రమను అర్థం చేసుకుని పుస్తకాలు రాశారు. దోపిడీ చేసుకునే వర్గం, దోపిడీకిగురయ్యే వర్గం రెండు ఉంటాయని... వాటి గురించి వివరించారు. అంబేద్కర్.. కులాల పుట్టుకను, మతాలను చర్చించారు. అగ్రకులాలకు చెందిన అందరూ... ఆర్థికంగా కాకుండా... సమాజికంగా దోచుకుంటారు. కొంతమంది శ్రమకు దూరంగా ఉంటున్నారు. అధికసంఖ్యాకులు శ్రమలో పాల్గొంటున్నారు. అంటరాని వారు ఎక్కువగా శ్రమ చేస్తున్నారు. మనుధర్మ శాస్త్రం, బౌద్ధమతం వచ్చినప్పుడు కూడా అంటరానితనం లేదు. సమాజంలో మార్పు కోసం.. విప్లవశక్తులు, కమ్యూనిస్టులు పని చేస్తున్నారు. సమాజం మారుతుంది. సమానత్వం వస్తుంది'. అని కంచె ఐలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.
'తరతరాలుగా సమాజంలో శ్రమ దోపిడి కొనసాగుతోంది. అందుకు భారతీయ వర్ణవ్యవస్థ బాగా తోడ్పడింది. శ్రమించే కింది కులాల వారిపై పనిచేయని పైకులాల వారు పెత్తనం చెలాయించారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి మొదలైన కులవృత్తుల వారిని అవమానించారు. అగౌరవంగా చూశారు. ఉత్పత్తిలో ఎలాంటి భాగస్వామ్యంలేని సోమరులే దర్జాగా బతికేశారు. ఈ నేపథ్యంలో శ్రమించు కులాలవాళ్లు ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నారో. ఎలాంటి చారిత్రక విద్రోహానికి బలై పోయారో.. వంటి అంశాలపై ఐలయ్య విశ్లేషణ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
Read more about సమాజంలో శ్రమ దోపిడి : కంచె ఐలయ్య
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్ ను విస్తరించారు. అఖిలేష్ కొత్తగా 12 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. యూపీ గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అకాలీదళ్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బల్వంత్ సింగ్ రామ్వాలియా పార్టీకి గుడ్ బై చెప్పి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్లో మంత్రిగా చేరారు. బల్వంత్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అనుచరుడిగా చాలా రోజులపాటు కొనసాగారు. కొత్త మంత్రులు, కేబినెట్ ర్యాంక్ పొందిన వారితో సహా మొత్తం 21 మంది ప్రమాణం చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేష్ కేబినెట్లో భారీ మార్పులు చేశారు.
Read more about మంత్రివర్గాన్ని విస్తరించిన అఖిలేష్
హైదరాబాద్ : మావోయిస్టులు, తీవ్రవాద గ్రూపుల చేతిలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చనిపోయిన పోలీసులు, సాధారణ పౌరులకు అందించే నష్టపరిహారాన్ని భారీగా పెంచింది. దాడుల్లో చనిపోయే హోంగార్డుల కుటుంబాలకు 30 లక్షలు, హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ స్థాయి వరకు 45 లక్షలు, ఇన్స్పెక్టర్, డీఎస్సీ, ఏఎస్పీ స్థాయి అధికారులకు 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ అధికారుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం లభించనుంది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయా స్థాయిలను బట్టి పరిహారం అందిస్తారు. అదే సాధారణ పౌరులు చనిపోతే వారి కుటుంబానికి 25 లక్షలు అందజేయనున్నారు.
Read more about వారిచేతిలో చనిపోయిన వారికి భారీగా ఎక్స్ గ్రేషియా..
Read more about హన్మకొండలో పోలీసుల కార్డెన్ సెర్చ్
టీఆర్ ఎస్ లో చేరిన గుండు సుధారాణి..
హైదరాబాద్ : టీడీపీ ఎంపీ గుండు సుధారాణి.. టీఆర్ ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
Read more about టీఆర్ ఎస్ లో చేరిన గుండు సుధారాణి..
విశాఖ : పార్క్ హోటల్ సమీపంలో సెల్ టవర్ కు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.
Read more about విశాఖలోని సెల్ టవర్ కు నిప్పు
వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో అసంతృప్త జ్వాలలు
హైదరాబాద్ : వరంగల్ జిల్లా కాంగ్రెస్ లోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ రాజారపు ప్రతాప్.. రాజయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశమయ్యారు. మూడేళ్లు కాంగ్రెస్ కు దూరంగా ఉండేందుకు ప్రతాప్ నిర్ణయం తీసుకున్నారు.
Read more about వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో అసంతృప్త జ్వాలలు |
హైదరాబాద్ : తన ఎంపికతో గెలుపు ఖాయమైందని వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఎంపిక జరిగిందని చెప్పారు. చిన్న చిన్న అసంతృప్తులు పార్టీలో సహజమన్నారు. అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. అవే తమ విజయానికి బాటలు వేస్తాయన్నారు. టీఆర్ ఎస్ నిజస్వరూపం ప్రజలు గుర్తించారని తెలిపారు. సూట్ కేసులకు టికెట్ ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ ది కాదన్నారు.
Read more about నా ఎంపికతో గెలుపు ఖాయమైంది: రాజయ్య
హైదరాబాద్ : తన ఎంపికతో గెలుపు ఖాయమైందని వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఎంపిక జరిగిందని చెప్పారు. చిన్న చిన్న అసంతృప్తులు పార్టీలో సహజమన్నారు.
కాకినాడలో 'హెల్మెట్' ర్యాలీ..
విశాఖ : వాహదారులకు హెల్మెట్పై అవగాహనకోసం కాకినాడలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.... భారీ హెల్మెట్ తయారుచేసి ప్రదర్శన నిర్వహించారు.. హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read more about కాకినాడలో 'హెల్మెట్' ర్యాలీ..
విజయవాడ : చెరకు రైతులను ఏపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని రైతుసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణన్ ఆరోపించారు. విజయవాడలోని ఎంబీ భవన్లో జరిగిన రైతుసంఘం ప్రథమ మహాసభకు ఆయన హాజరై, మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో సలహా ధర ఇచ్చి ప్రోత్సహిస్తుంటే.. ఏపీ సర్కారు ఇప్పటివరకూ మద్దతు ధరకు సలహా ధర ప్రకటించలేదని విమర్శించారు. మహాసభలో రైతుల సమస్యలపై నిపుణులు చర్చించారు.
Read more about చెరకు రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు : బాలకృష్ణన్
Read more about ఖమ్మంలోని పాత ఎన్ ఎస్పీ క్వార్టర్స్ కూల్చివేత ప్రారంభం...
కథ అడ్డం తిరిగింది..
Read more about కథ అడ్డం తిరిగింది..
తిరుపతిలో మంత్రి పరిటాల సునీత పర్యటన
చిత్తూరు : తిరుపతి పర్యటనలో ఉన్న ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత... నగరంలో కందిపప్పు అమ్మకాలను పరిశీలించారు. కందిపప్పు అమ్మకాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు. ఇటీవలే కందిపప్పు డీలర్లతోనూ సమావేశమై కిలో కందిపప్పు 140 రూపాయలకు మించికుండా విక్రయించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. వచ్చే 15 రోజుల వరకు ఇదే ధరకు విక్రయాలు జరుగుతాయని మంత్రి తెలిపారు.
Read more about తిరుపతిలో మంత్రి పరిటాల సునీత పర్యటన
రంగారెడ్డి : జిల్లాలోని జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్లో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో మంటలు అంటుకున్నాయి. మంటలు వేగంగా చుట్టుపక్కలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు.
Read more about జగద్గిరిగుట్టలో అగ్నిప్రమాదం
లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా లేదు : మంత్రి పోచారం
నిజామాబాద్ : జిల్లా జెడ్పీ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారుల తీరుపై ఫైరయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 శాతం అట్టడుగు వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరిగినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలను పేదరికం నుంచి విముక్తి చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Read more about లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా లేదు : మంత్రి పోచారం
షేర్ రివ్యూ..
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన షేర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సక్సెస్ కంటే టాలెంట్ ను నమ్ముతానని చెబుతాడు కళ్యాణ్ రామ్. అందుకే తానకు అభిమన్యు, కత్తి సినిమాల రూపంలో రెండు ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు మల్లికార్జున్ కు మరో అవకాశం ఇచ్చాడు. మరి అతని నమ్మకం నిలబడిందా లేదా చూడాలి. పదేళ్ల ప్లాపుల తర్వాత 'పటాస్'తో కళ్యాణ్ రామ్ కు సక్సెస్ వచ్చింది. దీని తర్వాత వస్తున్న సినిమా 'షేర్'. కాబట్టి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ విషయంలో అంచనాలుంటాయి. మరి 'షేర్' బాక్సాఫీసు దగ్గర నిజంగానే పంజా విసిరిందా లేదా?. సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయలు.. 10టీవీ విశ్లేషణ.. మరియు రేటింగ్ వీడియోలో చూడండి.
Read more about షేర్ రివ్యూ..
Read more about నోమోర్ జోక్స్… |
హైదరాబాద్ : రెండున్నర ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీటి నల్లా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ టీఆర్ ఎస్ ఎంపి అభ్యర్థి పసునూరి దయాకర్ ను అభినందించిన కేసీఆర్... ఆయనకు ఎ ఫామ్, బి ఫామ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఉన్న పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కాలేజీ హాస్టల్ లో సన్న బియ్యం భోజనం పెడతామని చెప్పారు. సంక్షేమ పథకాలే టీఆర్ ఎస్ ను గెలిపిస్తాయన్నారు. సంక్షేమరంగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్యల లేకుండా చేస్తామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక సీటుకు చాలా మంది ఆశించారని సీఎం తెలిపారు. దయాకర్ కు రెండు, మూడు సార్లు అవకాశం వచ్చిపోయిందన్నారు. ఉద్యమంలో ముందు నుంచి ఉన్నవారికి అవకాశాలిస్తున్నామని చెప్పారు. అభ్యర్థి ఎవరైనా అంతా కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎవరు డిమాండ్ చేయకపోయినా.. ఎన్నికల మ్యానిపెస్టోలో పెట్టకపోయినా... ప్రవేశపెట్టామని చెప్పారు. అయితే వచ్చే సంవత్సరం నుంచి బిసిలందరికీ వర్తింపచేస్తామని చెప్పారు. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించామని తెలిపారు. గతం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇల్లు డబ్బాల లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ సంవత్సరం 60 వేల ఇళ్లు మంజూరు చేశామని.. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తామన్నారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో గొప్పగా బతకాలని కాంక్షించారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం గ్రామాల్లో రూ.5లక్షల 4 వేలు, పట్టణాల్లో రూ.5 లక్షల 30 వేలు ఇస్తునట్లు తెలిపారు. తాము నిర్మించబోయే ఒక్కొక్క ఇల్లు ఏడు ఇళ్లలతో సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. రూ.60 వేల ఇళ్లు.. ఆరు లక్షల 20 వేల ఇళ్లకు సమానమన్నారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు తెచ్చుకున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు మార్కెట్ కమిటీ చైర్మన్ లు అయ్యే అవకాశం లభించిందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తండాలను గ్రామ పంచాయతీ చేయాలని కేబనెట్ లో నిర్ణయించామని గుర్తు చేశారు. రంజాన్, దసరా, బతుకమ్మ పండుగలను ప్రభుత్వం పరంగా ఘనంగా జరిపినట్లు తెలిపారు. 25 వేల మెగావాట్ల పవర్ ఉండే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. 16 నెలల కాలంలో కేజీ టు పీజీ వ్యిద మినిహా.. మిగిలిన హామీలన్నింటినీ అమలు చేశామని తెలిపారు. బీహార్ లో అఖిలేష్ యాదవ్ తనను గెలిపిస్తే... తెలంగాణలో అమలు చేసిన విధంగా వాటర్ గ్రిడ్ ను ప్రవేశపెడతామని చెప్పిడం గర్వకారణమన్నారు. సర్వేల ప్రకారం.. వరంగల్ లో గెలుపు తమదే అని స్పష్టం చేశారు. వరంగల్ అద్భుతంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉందన్నారు.
Read more about రెండున్నరేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు : సీఏం కేసీఆర్
హైదరాబాద్ : రెండున్నర ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీటి నల్లా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఉన్న పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు.
గాలి వినోద్ కుమార్ కు మద్దతు ఇవ్వాలి : తమ్మినేని
హైదరాబాద్ : గాలి వినోద్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థి అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వినోద్ కు వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని చెప్పారు. టీఆర్ ఎస్ ను ఓడించాలంటే.. అన్ని పార్టీలు వినోద్ కుమార్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.
Read more about గాలి వినోద్ కుమార్ కు మద్దతు ఇవ్వాలి : తమ్మినేని
గుండు సుధారాణి చేరికపై టీఆర్ ఎస్ లో అసంతృప్తి
వరంగల్ : గుండు సుధారాణి చేరికపై వరంగల్ టీఆర్ ఎస్ లో అసంతృప్తి సెగలు రేగాయి. సుధారాణి చేరికను ఆ పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. కొండా సురేఖ దంపతులు అలకబూనారు. మాట మాత్రం చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని ఆవేదన చెందారు. ఈమేరకు రాంనగర్ లోని కొండా దంపతుల ఇంట్లో పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
Read more about గుండు సుధారాణి చేరికపై టీఆర్ ఎస్ లో అసంతృప్తి
గుండు సుధారాణి చేరికపై వరంగల్ టీఆర్ ఎస్ లో అసంతృప్తి
వరంగల్ : గుండు సుధారాణి చేరికపై వరంగల్ టీఆర్ ఎస్ లో అసంతృప్తి సెగలు రేగాయి. సుధారాణి చేరికను ఆ పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. కొండా సురేఖ దంపతులు అలకబూనారు.
Read more about గుండు సుధారాణి చేరికపై వరంగల్ టీఆర్ ఎస్ లో అసంతృప్తి
స్వతంత్ర అభ్యర్థిగా రేపాక ప్రేమ్ కుమార్ నామినేషన్ దాఖలు
హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రేపాక ప్రేమ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
Read more about స్వతంత్ర అభ్యర్థిగా రేపాక ప్రేమ్ కుమార్ నామినేషన్ దాఖలు
వాట్సాప్ లో యువతికి అశ్లీల చిత్రాలు, మెస్సేజ్ లు |
హైదరాబాద్ : యువతిని ఓ యువకుడు వేధింపులకు గురి చేశాడు. చైతన్య అనే యువకుడు కాచిగూడకు చెందిన యువతికి వాట్సాప్ లో అశ్లీల చిత్రాలు, మెస్సేజ్ లు పంపించాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చైతన్యను అరెస్టు చేశారు. అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Read more about వాట్సాప్ లో యువతికి అశ్లీల చిత్రాలు, మెస్సేజ్ లు
Read more about కోస్తా జిల్లాలో పలు చోట్లవర్షాలు...
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ పై బెదిరింపు ఆరోపణలు వచ్చాయి. సాయికిరణ్ చేతిలో తనకు ప్రాణహాని ఉందంటూ... అభినవ్ అనే యువకుడు మీడియా ముందుకొచ్చాడు. తన భార్య భువనారెడ్డిని తన నుంచి వేరు చేసేందుకు మంత్రి కుమారుడు సాయి కిరణ్, అతని అనుచరులు వేధిస్తున్నారని ఆరోపించాడు. కొట్టడమే కాకుండా ... తనను చంపేస్తామని బెదిరించినట్టు చెప్పాడు. తమ పెళ్లి.... అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదని.. వారి ప్రమేయంతో సాయికిరణ్ తనపై దాడి చేశాడని అభినవ్ ఆరోపించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి 4రోజులు అవుతున్నా.. ఇంతవరకు అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని వాపోయాడు.
Read more about మంత్రి తలసాని కుమారునిపై బెదిరింపు ఆరోపణలు
Read more about కన్నకూతుర్ని కడతేర్చిన తల్లి
హైదరాబాద్ : శివరాంపల్లి సర్దార్వల్లభాయి నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది.. 67 బ్యాచ్కింద 156మంది పరేడ్ పూర్తిచేశారు.. ఇందులో 28మంది మహిళలు.. నేపాల్, భూటాన్, మల్దీవులు దేశాలకుచెందిన 15మంది పోలీసులున్నారు.. శిక్షణ పూర్తిచేసుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారులనుండి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గౌరవ వందనం స్వీకరించారు..
Read more about పోలీస్ అకాడమీలో ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్
హైదరాబాద్ : తాము ఓడిపోతామన్న భయంతోనే గులాబీ పార్టీ నేతలు ఓట్లను తొలగించారని టీడీపీ నేత వివేకానంద రెడ్డి విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్లో కావాలనే 34 లక్షల ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లో టీఆర్ ఎస్ కు పట్టులేదని.. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశామని వివరించారు.
Read more about ఓడిపోతామన్న భయంతోనే ఓట్ల తొలగింపు : వివేకానంద
చట్ట విరుద్ధంగా ఓట్ల తొలగింపు : మర్రిశశీధర్ రెడ్డి
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో చట్ట విరుద్ధంగా ఓట్ల తొలగింపు జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పునాదినే పెకలించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఈ స్థాయిలో ఓట్ల తొలగింపు ఎక్కడా జరగలేదన్నారు. భన్వర్లాల్, సోమేష్ కుమార్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు అధికారులు లెక్కలు చూపారని విమర్శించారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల విచారణ అధికారులకు తెలిపామన్నారు.
Read more about చట్ట విరుద్ధంగా ఓట్ల తొలగింపు : మర్రిశశీధర్ రెడ్డి
హైదరాబాద్ : ఎల్ బి నగర్లో మైనర్ బాలిక వివాహాన్ని బాలల హక్కుల సంఘం అడ్డుకుంది. ఆత్మకూర్ మండలం పెద్దరాంపూర్ గ్రామానికి చెందిన ఆలపాటి నాగేశ్వరరావుకు మధురానగర్కు చెందిన అంబికతో వివాహం నిశ్చయమైంది. వరుడి వయసు 24ఏళ్లు కాగా... వధువు వయసు 16ఏళ్లు.. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం చైర్మన్ అచ్యుతరావు పెళ్లిని ఆపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వధూవరులు, వారి పెద్దలకు నచ్చజెప్పిన పోలీసులు రెండేళ్ల తరువాత వివాహం జరిపించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే బాలికకు పెద్దలెవరకూ లేకపోవడంతో ఆర్థికంగా ఆదుకోవాలని కలెక్టర్కు అచ్యుతరావు విజ్ఞప్తి చేశారు..
Read more about బాలిక వివాహాన్ని అడ్డుకున్న బాలల హక్కుల సంఘం
విశాఖ : కాలుష్యంతో మసకబారుతున్న పోర్టును కాపాడేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. గ్రీన్ పోర్టుగా మార్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. 60కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్లలో పోర్టు రూపురేఖలే మార్చేస్తామని చైర్మన్ కృష్ణబాబు ధీమాగా చెబుతున్నారు.
నిజామాబాద్ : ఆశా వర్కర్ల సమ్మెకు మద్దతుగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఆశా కార్యకర్తలు నిరసన తెలపడానికి టెంట్లు సమకూర్చుకునేందుకు డబ్బులు లేవని..అందుకే వారికి సహాయం చేసేందుకు విరాళాల సేకరణ చేపట్టినట్లు సీపీఎం నేతలు తెలిపారు. ఆశా వర్కర్లకు తక్షణమే కనీస వేతనం 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read more about ఆశావర్కర్ల సమ్మెకు మద్దతుగా సీపీఎం విరాళాల సేకరణ |
హైదరాబాద్ : ఈ అక్టోబర్ నుంచే ఏపీలో 75 శాతం లెవీ విధానం కొనసాగేలా కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేకిగా ముద్రపడ్డ చంద్రబాబు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని బొత్స విమర్శించారు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల ముందు వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేయనున్నట్లు బొత్స ప్రకటించారు.
Read more about 75 శాతం లెవీ విధానం కొనసాగేలా కేంద్రాన్ని ఒప్పించాలి : బొత్స
హైదరాబాద్ : సికింద్రాబాద్ తుకారాంగేట్లో అర్ధరాత్రి ఓ కారు ఇళ్లపైకి దూసుకొచ్చింది. కరెంట్పోల్ను కూడా ఢీకొట్టి.. ముందుకు వెళ్లి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. ప్రాణనష్టం జరగలేదు. అయితే ఇప్పటివరకు పోలీసులు రాలేదని.. ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెంబర్ను బట్టి కారు ఖమ్మంలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది.
Read more about ఇళ్లపైకి దూసుకెళ్లిన కారు...
జీహెచ్ ఎంసీ కొత్త కమిషనర్గా జనార్దన్రెడ్డి
హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ కొత్త కమిషనర్గా జనార్దన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఫ్రాస్టక్చర్ సదుపాయాలను మెరుగుపరుస్తానని జనార్దన్రెడ్డి అన్నారు. నగరాన్ని సుందర నగరంగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తానన్నారు.
Read more about జీహెచ్ ఎంసీ కొత్త కమిషనర్గా జనార్దన్రెడ్డి
హైదరాబాద్ : నగరంలోని ఎంసిహెచ్ ఆర్ డిలో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు అఖిలపక్షం నేతలతో భేటీ అయ్యారు. గ్రేటర్ పరిధిలో ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం సభ్యులు విచారణ చేపట్టారు.
Read more about అఖిలపక్ష నేతలతో సీఈసీ సభ్యుల భేటీ...
టీడీపీ నుంచి గుండు సుధారాణి సస్పెన్షన్
హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు అరికెల నర్సారెడ్డి సుధారాణిని పార్టీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేసినందుకు సుధారాణిని పార్టీ నుంచి భహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంతటివారైన పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలని.. లేని ఎడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ లో ఆమె రాజ్యసభ పదవికాలం పూర్తి కానుంది. కాసేపట్లో సుధారాణి టీఆర్ ఎస్ లో చేరనుంది.
Read more about టీడీపీ నుంచి గుండు సుధారాణి సస్పెన్షన్
టిడిపి నుంచి గుండు సుధారాణి తొలగింపు
హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు అరికెల నర్సారెడ్డి ఆమెను పార్టీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాసేపట్లో గుండు సుధారాణి టీఆర్ ఎస్ లో చేరనున్నారు.
Read more about టిడిపి నుంచి గుండు సుధారాణి తొలగింపు
హన్మకొండ : వరంగల్ ఎంపి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజయ్య పేరు ఖరారు అయింది. కాసేపట్లో ఆ పార్టీ అధికారిక ప్రకటన చేయనుంది. రాజయ్య గతంలో వరంగల్ ఎంపీగా పని చేశారు.
Read more about వరంగల్ ఎంపి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజయ్య
హైదరాబాద్ : డిండి ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి టీ.హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read more about డిండి ఇరిగేషన్ ప్రాజెక్టుపై హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్
రంగారెడ్డి : జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ లోని ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.
ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఓట్ల తొలగింపు : రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ : ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఓట్ల తొలగింపు జరిగిందని టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోనే కాదు ఎపిలో కూడా ఈసీ ఓట్లు తొలగించిందని చెప్పారు. ఒక వ్యక్తికి ఒకే ఓటన్న నినాదంతోనే ఓటర్ల జాబితా ఉండాలన్నారు. మతం, ప్రాంతం పేరుతో కొన్ని పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
Read more about ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఓట్ల తొలగింపు : రాజేశ్వర్ రెడ్డి
విజయవాడ : ఎపి సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ భేటీ అయ్యారు.
Read more about చంద్రబాబుతో కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులతో అఖిల పక్షనేతలు భేటీ..
హైదరాబాద్ : ఎంసీహెచ్ ఆర్డీలో వివిధ పార్టీల నేతలతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు సమావేశం అయ్యారు. గ్రేటర్ పరిధిలో ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది.
Read more about కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులతో అఖిల పక్షనేతలు భేటీ..
కైరో : ఈజిప్టు సినాయ్ లో రష్యా విమానం కుప్పకూలింది. విమానం కూలినట్లు ఈజిప్టు ప్రధాని నిర్ధారించారు. విమానంలో 212 మంది ప్రయాణికులు ఉన్నారు. అధిక సంఖ్యలో రష్యా ప్రయాణికులు ఉన్నారు. ఉగ్రవాద చర్యగా ఈజిప్టు ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది.
Read more about ఈజిప్టు సినాయ్ లో కూలిన రష్యా విమానం
నంద్యాలలో దారుణ హత్య.. |
Read more about నంద్యాలలో దారుణ హత్య..
Read more about సోమేశ్ వెడలె..జనార్ధన్ వచ్చే..
Read more about ఈజిప్టు విమానం గల్లంతు.
ఢిల్లీ : అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అనుకుంటే.. వివాదాలతో వీకై పోతున్నాడే మన మోడీ అని మూడీ సంస్థ బాధపడిపోతోంది. బుల్లెట్ ట్రైన్లా దూసుకెళతాడనుకుంటే.. కనీసం ఫాస్ట్ ప్యాసింజర్లా కూడా పోవట్లేదే అని మదనపడుతోంది. బిజినెస్ చూడవయ్యా బాబూ అంటే రాజకీయంతో బిజీ అయిపోతున్నాడేంటని ప్రశ్నిస్తోంది. ఫీల్గుడ్ ఉంటేనే గాని పెట్టుబడులు రావు.. హోల్ బ్యాడ్ అయితే ఇంకేమొస్తాయని నిట్టూరిస్తుంది.
అసంతృప్తి వ్యక్తం చేసిన మూడీ సంస్థ..
సంస్కరణల అమలులో, ఆర్ధిక ప్రగతిలో రేటింగ్స్ ఇచ్చే మూడీ సంస్థ మాత్రం పరిస్ధితి ఏమీ బాగోలేదంటుంది. తాజాగా ఇచ్చిన నివేదికలో తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. లెక్కలేనన్ని వివాదాలతో మోడీ తన పాలనలో సంస్కరణల అమలును స్పీడప్ చేయలేకపోతున్నారంటోంది. కాషాయ నేతల కాలుదువ్వే ప్రకటనలతో భారత్లో బిజినెస్ వాతావరణం పాడైపోతుందని స్పష్టం చేస్తోంది. గోమాంసం.. దళితులపై దాడులు.. పాకిస్తాన్కు వెళ్లిపొమ్మంటూ బిజెపి మంత్రులే చేసే ప్రకటనలు.. ఇలా రకరకాల వివాదాలు చుట్టుముడుతున్నాయంటోంది.
భూసేకరణ చట్టం సవరణను తేలేకపోయారు. జీఎస్టీ బిల్లు కూడా పాస్ చేసుకోలేకపోయారు. ఇక సంస్కరణలను ఎలా అమలు చేస్తారని మూడీ సంస్థ ప్రశ్నిస్తోంది. అయితే ప్రభుత్వవర్గాలు మాత్రం బిజెపికి రాజ్యసభలో మెజారిటీ లేనందువల్లే ఆలస్యమవుతుందని.. మరో సంవత్సరంలో రాజ్యసభలో పార్టీ సభ్యుల సంఖ్య పెరిగితే.. అప్పుడు స్పీడు చూపిస్తామని అంటున్నాయి. రాజకీయ లాభం కోసం కమలనాథులు వివాదాలను సృష్టిస్తున్నారని అవి దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని గమనించడం లేదని మూడీ సంస్థ ప్రతిపక్షం కాదని.. కనీసం అది చెప్పిన మాటలనైనా పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు.
Read more about మోడీపై మూడీ బాధ..
Read more about తిరుమలకు వీఐపీల క్యూ..
ఇక జనార్ధన్ రెడ్డి జీహెచ్ఎంసీ నూతన కమిషనర్..
Read more about ఇక జనార్ధన్ రెడ్డి జీహెచ్ఎంసీ నూతన కమిషనర్..
నిన్న ఉల్లిగడ్డ..నేడు కందిపప్పు...
హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాని అంటున్నాయి. ఏం కొనేట్టు లేదు..ఏం తినేట్టు లేదనే చందంగా తయారైంది. నిన్న ఉల్లిగడ్డ ధర మండిపోయి కన్నీళ్లు తెప్పిస్తే తాజాగా ఆ లిస్టులోకి కందిపప్పు చేరింది. రెండు వందల రూపాయలకు పైగా ధర పలుకుతుండడంతో సామాన్యుడు కళ్లు తేలేస్తున్నాడు. కనీసం పప్పుతోనైనా తిందామనుకుంటే ధర మాత్రం దిగి రానంటోంది. దీనితో తెలంగాణ ప్రభుత్వం ఉల్లిగడ్డలను విక్రయించినట్లుగానే కందిపప్పు విక్రయాలు చేపట్టింది. తెలంగాణ సచివాలయంలో కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కిలో కందిపప్పును ఇక్కడి కౌంటర్లో రూ.135 రూపాయలకు విక్రయించనున్నారు. సామాన్యులకు కందిపప్పును తక్కువ ధరకు అందించాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కందిపప్పు కౌంటర్లను ఏర్పాటు చేశారని తలసాని అన్నారు. పది కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 3,100 మంది ఉద్యోగులు ఇక్కడున్నారని తెలిపారు.
Read more about నిన్న ఉల్లిగడ్డ..నేడు కందిపప్పు...
మాతో కలిసి రావాలంటున్న ఉత్తమ్..
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నడుస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనను అడ్డుకోవటానికి అన్ని పక్షాలు తమతో కలిసి రావాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఉప ఎన్నికలో ఆ విధమైన సహకారం కాంగ్రెస్ అభ్యర్ధికి అందించాలని ఆయన కోరారు. వామపక్షాలు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, ఉస్మానియా, కాకతీయ జేఏసీలు అందరూ కలిసిరావాలని ఉత్తమ్ విన్నవించారు.
Read more about మాతో కలిసి రావాలంటున్న ఉత్తమ్..
'గుర్తింపు ఉంటుందనడానికి ఇదే నిదర్శనం'..
వరంగల్ : తెలంగాణ ఉద్యమంలో వాల్ రైటింగ్స్ దగ్గర నుంచి పాటలు, ఫోటోల వరకు పని చేసిన తనకు కేసీఆర్ ఎంపీ అభ్యర్ధిగా అవకాశమివ్వడం అదృష్టంగా భావిస్తున్నానని టీఆర్ఎస్ వరంగల్ అభ్యర్ధి పసునూరి దయాకర్ చెప్పారు. సామాన్యులకు టీఆర్ఎస్లో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కానీ అవకాశం వస్తుందని ఆశించలేదని, గతంలో రెండు సార్లు అవకాశం వచ్చినా కొన్ని పరిస్థితుల్లో తీరలేదని చెప్పుకొచ్చారు.
Read more about 'గుర్తింపు ఉంటుందనడానికి ఇదే నిదర్శనం'..
భూ గ్రహం వైపు భారీ గ్రహ శకలం..
న్యూఢిల్లీ : భూగ్రహం వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకువస్తోంది. 2015 టీబీ 145 అనే గ్రహశకలం ఇవాళ భూమికి చేరువగా వస్తుందని ఖగోళ శాస్ర్తవేత్తలు చెప్తున్నారు. దాదాపు 13 వందల అడుగుల వ్యాసం ఉండే ఈ గ్రహశకలం సెకనుకు 35 కిలోమీటర్ల వేగంతో భూమికి పక్కగా వెళ్తుందని అంటున్నారు. గ్రహశకలాల గురించి మరించి సమాచారం సేకరించడానికి ఇది సరైన సమయమని శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు.
Read more about భూ గ్రహం వైపు భారీ గ్రహ శకలం.. |
హైదరాబాద్: అర్ధరాత్రి ఆపరేషన్ నైట్ రోమియోతో టెన్షన్ పుట్టించారు పోలీసులు.. అర్ధరాత్రి రోడ్లపై తిరిగే జులాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.. ఈసారి మళ్లీ రాత్రి రోడ్డెక్కితే వారి తల్లిదండ్రులపైకూడా కేసులు పెడతామని హెచ్చరించారు. రోడ్లపై బలాదూర్గా తిరుగుతూ హల్చల్ చేసే నైట్ రోమియోల పనిపడుతున్నారు పోలీసులు.. తాజాగా 181మంది మైనర్లను అదుపులోకితీసుకొని... 200బైక్లను సీజ్ చేశారు.. వీరంతా పాతబస్తీలోని వివిధ ప్రాంతాలకుచెందినవారు.
కౌన్సిలింగ్ తో మార్పు...
Read more about నైట్ రోమియోస్..
Read more about ప్రాణాలు కాపాడలేని హెల్మెట్..
వరంగల్ : కులాన్ని మార్చేసి ఆఖరివరకు టీఆర్ఎస్ టిక్కెట్టుకోసం ప్రయత్నం చేసిన గుడిమల్ల రవికుమార్ బండారం బయటపడిందని, ఆయన ఎస్సీ కాకపోయినా అతనికి మద్దతు తెలిపిన కడియం శ్రీహరిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ తతంగమంతా కేసీఆర్కు తెలిసే జరిగిందని విమర్శించారు. మాదిగలకు..మాలలకు ఆ పేరు లేదని, పద్మశాలిలో ఎక్కువ ఉంటుందన్నారు. ఇద్దరు పన్నిన కుట్రను సీఎం కేసీఆర్ చేధించారని తెలిపారు.
Read more about కడియం ను తొలగించాలి - మందకృష్ణ మాదిగ..
జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి.
Read more about జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి.
వైసీపీలో నెంబర్ 2 రేస్..
Read more about వైసీపీలో నెంబర్ 2 రేస్..
సాయంత్రం వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ..
హైదరాబాద్ : సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్ జిల్లా నేతతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సమావేశానికి ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ ర్యాలీతో రానున్నారు. అభ్యర్థికి కేసీఆర్ బీ ఫాం అందచేయనున్నారు.
Read more about సాయంత్రం వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ..
పెంబర్తిలో తనిఖీలు..పది లక్షలు స్వాధీనం..
వరంగల్ : పెంబర్తి చెక్ పోస్టు వద్ద వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ కారులో రూ. పది లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి కారు కరీంనగర్ కు వెళుతోంది.
Read more about పెంబర్తిలో తనిఖీలు..పది లక్షలు స్వాధీనం..
Read more about సోమాలియా అధ్యక్షుడితో చౌహాన్ భేటీ..
ధరలు తగ్గించేందుకు చర్యలు - ఈటెల..
హైదరాబాద్ : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోందని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కందిపప్పు ధరలు సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని హామీనిచ్చారు.
Read more about ధరలు తగ్గించేందుకు చర్యలు - ఈటెల..
లాలూపై పాట్నా పీఎస్ లో కేసు నమోదు..
బీహార్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను నరమాంస భక్షకుడు అంటూ వ్యాఖ్యానించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై పాట్నా పీఎస్ లో కేసు నమోదైంది.
Read more about లాలూపై పాట్నా పీఎస్ లో కేసు నమోదు..
Read more about గాయకుడి అరెస్టును ఖండించిన కరుణానిధి..
వరంగల్ లో 'హస్తం' సర్వే..
Read more about వరంగల్ లో 'హస్తం' సర్వే..
Read more about హస్తినలో ఇందిరకు నివాళులు..
జీహెచ్ఎంసీ కమిషనర్ గా జనార్ధన్ రెడ్డి బాధ్యతలు..
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
Read more about జీహెచ్ఎంసీ కమిషనర్ గా జనార్ధన్ రెడ్డి బాధ్యతలు..
తెలంగాణలో భూముల వేలం..
హైదరాబాద్ : నిధుల కొరత లేదు.. ఎవరినీ సంచి పట్టుకొని అడగాల్సిన పని లేదు.. ఇది ఇన్నాళ్లూగా తెలంగాణ సర్కార్ పెద్దలు చెబుతున్న మాటలు. అంతేగాక త్రైమాసిక రిపోర్టులు సైతం ఘనంగా ప్రకటించి అందరితో శభాష్ అనిపించుకుంది. కానీ.. ఇప్పుడే అసలు వ్యవహారం మొదలైంది. ప్రకటించిన భారీ పథకాల్లో ఏ ఒక్క దానికి కూడా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించ లేదు. ఇప్పటివరకు ప్రభుత్వం ఏదో గుడ్డిలో మెల్లలా నెట్టుకొచ్చినా.. ఇప్పుడు నిధుల కోసం వెతుక్కోవాల్సి పరిస్థితి ఏర్పడింది.
ఈ మధ్యే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఆ ప్రయత్నాలు కొనసాగించారు. కానీ.. కేంద్రం మాత్రం తెలంగాణకు ఇస్తే ఏపీకి కోపమొస్తుందని.. ఏపీకి ఇస్తే తెలంగాణ నుంచి తలనొప్పులు వస్తాయని ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయకు జైకా నుంచి సర్కార్ నిధులు తీసుకుంటోంది. అయినా మరిన్ని నిధులు కావాల్సిన అవసరం ఉంది. దీంతో అమ్ముల పొదిలో ఉన్న భూముల అమ్మకాన్ని సర్కార్ సంధించబోతోంది.
నవంబర్ 17న ఈ-వేలం, 24న బిడ్డర్లు..
రంగారెడ్డి, హైదరాబాద్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను వేలం వేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ-టెండర్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 17న ఈ-వేలం, 24న బిడ్డర్లను ప్రకటించనున్నారు. హైదరాబాద్లో 10,.. రంగారెడ్డి జిల్లాలో 22 స్థలాల వేలానికి ధర నిర్ణయించనున్నారు. అయితే.. గతంలోనే జిల్లాల నుంచి భూముల వివరాలను సేకరించిన సర్కార్.. భూముల వేలంపై కొంతకాలంగా వెనక్కి తగ్గింది.
తొలి విడతలో 27 చోట్ల భూముల వేలం.. |
ఇక తొలి విడతలో 27 చోట్ల భూములను వేలం వేయాలని సర్కార్ నిర్ణయించింది. కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు భూములను వేలం వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. 240 గజాల నుంచి 30 ఎకరాల భూములను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదిలాఉంటే ప్రభుత్వం సేకరించిన నిరుపయోగమైన భూముల వివరాల్లో కొన్ని తప్ప.. చాలా భూములు ఉపయోగపడేవేనని తేలింది. అయినా ప్రభుత్వం మాత్రం భూముల విక్రయం ద్వారా 1544 కోట్ల రూపాయలు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భూములను విక్రయించాలని సర్కార్ నిర్ణయించడంతో.. ఇన్నాళ్లు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని నేతలు చెప్పిన వ్యాఖ్యలు అంతా ఉట్టివేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read more about తెలంగాణలో భూముల వేలం..
వక్ఫ్ బోర్డు విభజన..
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న వక్ఫ్ బోర్డు విభజనకు రంగం సిద్ధమయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు వేర్వేరుగా వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు, ఉద్యోగులను రెండు రాష్ట్రాలు పంచుకోనున్నాయి. ఏపీలో ఏర్పాటయ్యే వక్ఫ్ బోర్దు ద్వారా మైనారిటీలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. ఆర్టీసీ విభజనను సవ్యంగా పూర్తి చేసుకున్న తెలుగు రాష్ట్రాలు.. ఇప్పుడు వక్ఫ్ ఆస్తులపై దృష్టి పెట్టాయి. వక్ఫ్ బోర్డు విభజన ద్వారా ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీకి చర్యలు చేపట్టాయి.
రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా వక్ఫ్ బోర్డులు..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్ కేంద్రగా పనిచేస్తున్న వక్ఫ్ బోర్డు విభజనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం రెండు రాష్ట్రాలకు వేర్వేరు వక్ఫ్ బోర్డులు ఏర్పాటవుతాయి. జనాభా ప్రాతిపదికన వక్ఫ్ ఆస్తులు, అప్పులు, సిబ్బందిని రెండు రాష్ట్రాలు పంచుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డు నుంచి ఏపీకి 40 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. హైదరాబాద్ హజ్హౌస్ ఆస్తుల నుంచి 23 కోట్ల రూపాయలు ఏపీకి ఇస్తారు. నవ్యాంధ్రలో కొత్తగా హజ్హౌన్ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ 3 కోట్ల రూపాయలు ఇవ్వనుంది. ఏ రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయి.
ఏపీలో ఏర్పాటయ్యే కొత్త వక్ఫ్ బోర్డు ద్వారా మైనారిటీలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. బోర్డును లాభదాయక సంస్థగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐఏఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. సకలసౌకర్యాలతో కడపలో కొత్త హజ్ హౌస్ నిర్మిస్తారు. దీనికి అనుబంధంగా రాష్ట్రంలోని అన్ని ముఖ్యనగరాల్లో అనుబంధ హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు.
వక్ఫ్ స్థలాల్లో షాదీఖానాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు..
ఏపీలో ఉన్న వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నది గుర్తిస్తారు. విశాఖ జిల్లాలో నాలుగువేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్టు లెక్కతేల్చారు. ఇతర జిల్లాలో ఉన్న భూముల వివరాలు సేకరిస్తున్నారు. అన్యాక్రాంతమైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు చేపడతారు. వీటిని గుర్తించేపనిలో అధికారులు ఉన్నారు. వక్ఫ్బోర్డు స్థలాల్లో షాదీఖానాలు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అవసరమైతే చట్టాలను సవరించాలన్న ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది.
Read more about వక్ఫ్ బోర్డు విభజన..
హయత్ నగర్ లో రైతు ఆత్మహత్య...
రంగారెడ్డి : హయత్ నగర్ (మం) అనాస్ పూర్ లో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో రైతు మల్లేష్ (40) శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Read more about హయత్ నగర్ లో రైతు ఆత్మహత్య...
పొడవైన వ్యక్తి గట్టయ్య మృతి..
కరీంనగర్ : ఆసియా ఖండంలో అతి పొడవైన వ్యక్తిగా గుర్తింపు పొందిన గట్టయ్య మృతి చెందాడు. అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి గట్టయ్య కన్నుమూశాడు.
Read more about పొడవైన వ్యక్తి గట్టయ్య మృతి..
Read more about మూడేళ్ల చిన్నారిని చంపేసిన తల్లి..
హైదరాబాద్ : నేషనల్ పోలీసు అకాడమీలో 67వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ ప్రారంభమైంది. నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ అజిత్ జోవట్ పరేడ్ కు హాజరయ్యారు. 156 మంది ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 28 మంది మహిళా ఐపీఎస్ లున్నారు.
Read more about ఎస్వీపీలో ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్..
హైదరాబాద్ : ఎర్రగడ్డ రైతు బజారులో సబ్సిడీ కందిపప్పు విక్రయ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. కిలో కందిపప్పు రూ.135కి తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది.
Read more about ఎర్రగడ్డలో సబ్సిడీ కందిపప్పు..
విజయవాడకు బయలుదేరిన బాబు.. |
నెల్లూరు : జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకున్న చంద్రబాబు హెలికాప్టర్ లో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
Read more about విజయవాడకు బయలుదేరిన బాబు..
గట్టయ్య ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలువురు సెలబ్రిటీలతో పాటు పిల్లలు, పెద్దలు కూడా గట్టయ్యతో కలిసి ఫొటో దిగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సినీనటులు కూడా ఫొటోలు తీయించుకున్నారు. ఏడున్నర అడుగుల ఎత్తు ఉండే కొలిపాక గట్టయ్య గట్టయ్యకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శిల్పారామంలో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ఆయన కొన్ని రోజులుగా ఆస్తమాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వెళ్లి, తిరిగి హైదరాబాద్ వచ్చారు. గట్టయ్యకు తల్లి లక్ష్మి, అన్న చంద్రయ్య ఉన్నారు.
Read more about పొడగరి గట్టయ్య కన్నుమూత..
కత్తితో పొడిచారు..బంగారం ఎత్తుకెళ్లారు..
ప్రకాశం : జిల్లాలో దొంగతనాలు అధికమౌతున్నాయి. దొంగతనం చేయడమే కాకుండా దుండగులు దాడులకు తెగబడుతున్నారు. దీనితో జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ నగర్ లో నివాసం ఉంటున్న భారతి ఇంట్లో శనివారం తెల్లవారుజామన చొరబడ్డారు. భారతి..మరొక వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. సుమారు మూడున్నర తులాల బంగారం..రెండు విలువైన సెల్ ఫోన్ లను అపహరించారు. దాడిలో గాయపడిన భారతి కేకలు వేయడంతో స్థానికులు చేరుకున్నారు. వెంటనే వారిని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బయటి ప్రాంతాల నుండి దుండగులు జిల్లాలోకి ప్రవేశిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
Read more about కత్తితో పొడిచారు..బంగారం ఎత్తుకెళ్లారు..
పాత రోజులను గుర్తుకు తెస్తున్న బాబు..
నెల్లూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత రోజులను గుర్తుకు తెస్తున్నారు. ఉభయ రాష్ట్రంలో సీఎంగా ఉన్న సమయంలో ఎక్కడో ఒక దగ్గర బాబు అకస్మిక తనిఖీలు జరిపేవారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు అలాగే వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు శనివారం పలు ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నగరంలో విష జ్వరాలు అధికమౌతున్నాయి. దీనితో పారిశుధ్య పనులు ఏ విధంగా ఉన్నాయి ? జ్వరాలు వ్యాపించడానికి గల కారణాలు ఏంటీ ? అనే విషయంపై బాబు దృష్టి సారించారు. పోలీసు పరేడ్ మైదానం నుండి బాబు తనిఖీలు నిర్వహించారు. అక్కడున్న బ్రహ్మానందపురం డ్రైనేజీ కాలువను పరిశీలించారు. అస్త్యవస్థంగా ఉండడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ రోడ్డుపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు బాబు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రాంనగర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో డెంగ్యూ వ్యాధితో ఓ వ్యక్తి మృతి చెందడాన్ని గుర్తించారు. వారిని బాబు పరామర్శించారు. ఇంట్లో ఉన్న ఓ విద్యార్థికి రూ.25వేల ఆర్థిక సహాయం అందించింది సంబంధిత ఏర్పాట్లు చేయాలని బాబు ఆదేశాలు జారీ చేశారు. వెంగళరావు నగర్ లో కూడా బాబు పర్యటించారు. ఈ పర్యటనలో సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
Read more about పాత రోజులను గుర్తుకు తెస్తున్న బాబు..
ల్యాప్ టాప్ కొంటున్నారా ???
ల్యాప్టాప్ కొనుగోలు చేయానుకుంటున్నారా..? ఒకసారి ఈ సూచనలను పాటించండి.
ఇంటి అవసరాలకైతే కోర్ ఐ3, కాలేజ్ చదువులకైతే కోర్ ఐ3 లేదా యూఎల్వీ, ఆఫీస్ పనుల నిమిత్తమైతే కోర్ ఐ5 యూఎల్వీ లేదా కోర్ ఐ7 యూఎల్వీ ప్రాసెసర్ కలిగి ఉండేటట్లు ఎంపిక చేసుకోండి. మ్యాక్, విండోస్, క్రోమ్ ఓఎస్పై స్పందించే ల్యాప్టాప్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మ్యాక్ ఓఎస్ను యాపిల్ ఆపర్ చేస్తుండగా, విండోస్ ఆపరేటింగ్ సిస్టంను మైక్రోసాఫ్ట్, క్రోమ్ ఓఎస్ను గూగుల్ ఆఫర్ చేస్తోంది. మీ వినియోగం అలానే అభిరుచిని బట్టి నచ్చిన ఆపరేటింగ్ సిస్టంతో కూడిన ల్యాప్టాప్ను ఎంపిక చేసుకోండి.
సైజ్ 13 నుంచి 14, 15 అంగుళాలు, 17 నుంచి 18 అంగుళాల స్క్రీన్ సైజు వేరియంట్లలో ల్యాప్టాప్లు లభ్యమవుతున్నాయి. వినియోగాన్నిబట్టి సైజును ఎంపిక చేసుకోవాలి.
మీరు ఎంపిక చేసుకునే ల్యాప్టాప్కు సంబంధించి కీబోర్డ్, టచ్ప్యాడ్ పని తీరును చెక్ చేసుకోండి.
ల్యాప్టాప్కు సంబంధించి ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డ్రైవ్, ఫ్లాష్ క్యాచీ, సాలీడ్ స్టేట్ డ్రైవ్, డిస్ప్లే రిసల్యూషన్, టచ్స్క్రీన్, గ్రాఫిక్స్ చిప్, డీవీడీ/బ్లూ-రే డ్రైవ్ వంటి స్పెసిఫికేషన్లు మీ అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి.
ల్యాప్టాప్ మన్నికైన బ్యాటరీ బ్యాకప్ను కలిగి ఉండాలి.
మీరు ఎంపిక చేసుకునే బ్రాండ్నుబట్టే ల్యాప్టాప్ పనితీరు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ల్యాప్టాప్ ఎంపిక విషయంలో బ్రాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. |
ల్యాప్టాప్ ఇంటి అవసరాల నిమిత్తమైతే 15.6 అంగుళాల స్క్రీన్ను కలిగి ఉండాలి. బరువు 2.5కిలోగ్రాములు అంతకన్నా తక్కువ ఉండాలి.
కాలేజ్ అవసరాల నిమిత్తమైతే 14 అంగుళాల స్క్రీన్ సైజును కలిగి ఉండాలి. బరువు 2 కిలోలు అంతకన్నా తక్కువ.ఉండాలి.
ఆఫీస్ అవసరాల నిమిత్తమైతే 13 అంగుళాల స్క్రీన్ను కలిగి ఉండాలి. బరువు 1.7 కిలో లు అంతకన్నా తక్కువ ఉండాలి.
మల్టీ మీడియా అవసరాల నిమిత్తమైతే 15.6 అంగుళాల అంతకన్నా పెద్ద స్క్రీన్ హైడెఫినిషన్ రిసల్యూషన్తో ఉండాలి. బరువు 2.7కిలోలు ఉండాలి.
గేమింగ్ అవసరాల నిమత్తమైతే 15.6 అంగుళాల స్క్రీన్ను కలిగి ఉండాలి. బరువు 2.7కిలోలు ఉండాలి.
Read more about ల్యాప్ టాప్ కొంటున్నారా ???
అండ్రాయిడ్ లాలిపాప్ తో వైఫై హాట్ స్పాట్...
మీ స్మార్ట్ ఫోన్ లేదా టాట్లెట్ను వై-ఫై హాట్ స్పాట్లా మార్చుకోవాలని ఉందా..మీ ఫోన్లోని మొబైల్ డేటాను మిగతా ఫోన్లతో లేదా మీ ల్యాప్టాప్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా..? మామూలుగా వై-ఫై టెట్రింగ్ను మీ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ ద్వారా ఎలా చేస్తారో మీకు తెలిసే ఉంటుంది. సరికొత్త అండ్రాయిడ్ లాలిపాప్ తో వైఫై హాట్ స్పాట్ ఎలా పనిచేయించాలో చూద్దాం..
ముందు మెనులోకి వెళ్లి 'సెట్టింగ్స్' ఓపెన్ చేయండి. అందులో మోర్ అనే అప్షన్ ను ప్రెస్ చేయండి.
తర్వాత 'టెట్రింగ్ ఆండ్ పోర్టబుల్ హాట్ స్పాట్' ఆప్షన్ ను ప్రెస్ చేయండి.
మీ ముందు కనిపిస్తున్న 'పోర్టబుల్ హాట్ స్పాట్' ను ప్రెస్ చేసి మీ డేటాను షేర్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత ''సెటప్ వైఫై హాట్ స్పాట్'' ఆప్షన్ను ప్రెస్ చేసి వైఫై నెట్ వర్క్ ను నెలకొల్పొచ్చు.
ఒకసారి వై-ఫై నెట్ వర్క్ నెలకొల్పాక నెట్ వర్క్ పేరు సులభంగా మార్చుకోవచ్చు. ఒక వేళ మీ కనెక్షన్ను మరింత సురక్షితం చేయదలచుకుంటే మాత్రం పాస్వర్డ్ పెట్టుకోండి.
వె-ఫై హాట్ స్పాట్ ఆప్షన్ ప్రెస్ చేయడం వల్ల ఒక కొత్త టాగుల్ మీ మెనులో వచ్చి చేరుతుంది.
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్లో మాత్రం ఈ టాగుల్ ను తొలగించుకోవచ్చు.
Read more about అండ్రాయిడ్ లాలిపాప్ తో వైఫై హాట్ స్పాట్...
గ్రేటర్ ఎన్నికల్లో పవర్ స్టార్..?
ఒంటరిగా పోటీ ?
Read more about గ్రేటర్ ఎన్నికల్లో పవర్ స్టార్..?
రాజ్ పథ్ లో రన్ ఫర్ యూనిటీ..
ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్ పథ్ లో రన్ ఫర్ యూనిటీని ప్రారంభించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా యూనిటీ రన్ ను నిర్వహించింది.
Read more about రాజ్ పథ్ లో రన్ ఫర్ యూనిటీ..
ఏక్ భారత్..శ్రేష్ట్ భారత్ - మోడీ..
ఢిల్లీ : త్వరలో ఏక్ భారత్..శ్రేష్ట్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. పటేల్ 140వ జయంతి వేడుకలను కేంద్రం జాతీయ సమైక్యత దినోత్సవ పేరిట కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాన మంత్రి మోడీ ప్రసంగించారు. 2016లో ఏక్ భారత్..శ్రేష్ట్ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఒక రాజ్యం..మరొక రాజ్యంతో జోడీ కావాలన్నారు. తమిళనాడు..హర్యానా రాష్ట్రాలు జోడీ కావడం వల్ల ఇరు రాష్ట్రాల్లో ఉన్న భాష..సంస్కృతి తెలిసే అవకాశం ఉందని, ఇలా ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రం..మరొక రాష్ట్రంతో జోడీ కట్టాలని తెలిపారు. దీనివల్ల దేశం యొక్క శక్తి తెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రైన్ లో ప్రయాణించే సమయంలో వివిధ ప్రాంతాల్లో భాష మాట్లాడే వారని..ఇదంతా భారత దేశ విశిష్టత అని దీనిని గౌరవించాలని స్వర్గీయ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆనాడు పేర్కొన్నారని గుర్తు చేశారు. చాణక్యుడిగా తరువాత దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘతన పటేల్ కు దక్కుతుందని, అహ్మదాబాద్ లో స్వచ్ఛత కోసం 222 రోజులు పటేల్ ప్రచారం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు పాల్గొన్నారు.
Read more about ఏక్ భారత్..శ్రేష్ట్ భారత్ - మోడీ..
సోమేష్ కుమార్ బదిలీ రాజకీయ అవసరాల కోసమే..
తెలంగాణ రాష్ట్రంలో ఐఎఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగాయి. మొత్తం 22 మంది ఐఎఎస్ లకు స్థానభ్రంశం కలిగింది. అందులో జీహెచ్ఎంసీ కమిషనర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దీనిపై విపక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ రావు ఎంపికయ్యారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), నరేందర్ గౌడ్ (టీఆర్ఎస్), సతీష్ మాదిగ (టిడిపి), రాకేష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు.
Read more about సోమేష్ కుమార్ బదిలీ రాజకీయ అవసరాల కోసమే..
వల్లభాయ్ పటేల్ కు మోడీ నివాళి.. |
ఢిల్లీ : సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి వేడుకల సందర్భంగా వల్లభాయ్ పటల్ కు ప్రధాని మోడీ నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు పాల్గొన్నారు. ఏక్తా ర్యాలీలో సుమారు 15000 మంది యువత పాల్గొంది.
Read more about వల్లభాయ్ పటేల్ కు మోడీ నివాళి..
ప్రకాశం : అద్దంకిలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. తల్లి, కొడుకుపై కత్తులతో దుండగులు దాడి చేశారు. 3.5 తులాల బంగారం, రెండు సెల్ ఫోన్లు అపహరించారు.
Read more about అద్దంకిలో దోపిడి దొంగల బీభత్సం..
నెల్లూరులో బాబు రెండో రోజు పర్యటన...
నెల్లూరు : నేడు జిల్లాలో రెండో రోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. నగరంలోని దుర్గామిట్ట బ్రహ్మానందపురంలో పారిశుధ్య పనులను బాబు పరిశీలించారు. రోడ్డు మీద ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులకు సీఎం బాబు ఆదేశించారు.
Read more about నెల్లూరులో బాబు రెండో రోజు పర్యటన...
ఢిల్లీ : రాజ్ పథ్ లో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా యూనిటీ రన్ ను ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించనున్నారు.
ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
ఢిల్లీ : నేడు రెండో రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
Read more about ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
నేడు జాతీయ సమైక్యత దినోత్సవం..
ఢిల్లీ : నేడు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా విజయ్ చౌక్ లో యూనిటీ రన్ ను ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించనున్నారు.
Read more about నేడు జాతీయ సమైక్యత దినోత్సవం..
ఎర్రగడ్డ రైతు బజార్ లో కందిపప్పు విక్రయ కేంద్రం..
హైదరాబాద్ : నేడు ఎర్రగడ్డ రైతు బజార్ లో కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించనన్నారు.
Read more about ఎర్రగడ్డ రైతు బజార్ లో కందిపప్పు విక్రయ కేంద్రం..
నేడు కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి ప్రకటన..
వరంగల్ : నేడు వరంగల్ లోక్ సభ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించనుంది.
Read more about నేడు కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి ప్రకటన..
నేడు, రేపు విశాఖలో ఇండియన్ రేడియాలజికల్..
విశాఖపట్టణం : నేడు, రేపు విశాఖలో ఇండియన్ రేడియాలజికల్ కార్యక్రమం జరుగనుంది. ఇందులో 500 మంది వైద్య నిపుణులు హాజరు కానున్నారు.
Read more about నేడు, రేపు విశాఖలో ఇండియన్ రేడియాలజికల్..
ఢిల్లీ : విభజించు-పాలించు అనే సూత్రం ఆధారంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని సిపిఎం విమర్శించింది. మత ప్రాతిపదికన దేశాన్ని రెండు ముక్కలు చేస్తోందని, బిజెపికి బీహార్లో ఓటమి తప్పదని చెప్పింది. ఆర్థిక దోపిడి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం- దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న మతోన్మాద చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. బీహార్ ఎన్నికల్లో బిజెపి మత ప్రాదిపదికన ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది. బీహార్లో బిజెపి ఓడిపోతే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుతారంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని తెలిపింది. బీహార్లో బిజెపికి ఓటమి తప్పదని తెలిసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని సిపిఎం ధ్వజమెత్తింది.
ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలి..
దేశంలో పెరుగుతున్న మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా సాహితీవేత్తలు, శాస్త్రవేత్తలు నిరసన వ్యక్తం చేయడం శుభ పరిణామంగా సిపిఎం పొలిట్బ్యూరో అభివర్ణించింది. సాహితీవేత్తలను వామపక్షానికి అంటగట్టడం ద్వారా పరోక్షంగా తమ పార్టీని విస్తరించేందుకు బిజెపి కృషి చేస్తోందని- వెంకయ్య చేసిన వ్యాఖ్యలను స్వాగతించింది. కేరళ భవన్లో బీఫ్ వివాదానికి కారణమైన ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం అభిప్రాయ పడింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా మోడీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని సిపిఎం, దేశంలో చాలా మంది దాల్ రోటీపైనే జీవిస్తున్నారని, అలాంటిది కందిపప్పు ధర 2 వందలకు చేరడం దారుణమని పేర్కొంది. దేశ వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 16 నెలల్లో ప్రధాని 32 సార్లు విదేశీ పర్యటనలు చేశారని, దేశంలో ఉన్నపుడు విదేశీ ప్రతినిధులతో సమావేశమవుతున్నారే తప్ప, దేశ ప్రజలపై దృష్టి పెట్టడం లేదని సిపిఎం ఆరోపించింది. గడచిన పదేళ్లలో ఎన్నికల పరంగా పార్టీ బలహీనపడిందని, పార్టీ నిర్మాణాన్ని బలపరచాల్సిన అవసరం ముందని సిపిఎం పొలిట్ బ్యూరో అభిప్రాయ పడింది. ప్రజా పోరాటాలను బలపరచాలని పొలిట్బ్యూరో నిర్ణయించింది.
Read more about మతోన్మాద చర్యలపై సిపిఎం ఆందోళన...
తెలంగాణ ప్రాజెక్టులపై చైనా ఆసక్తి..
85శాతం ఖర్చు భరించేందుకు బ్యాంక్ ఆఫ్ చైనా సిద్ధం.. |
హుసేన్ సాగర్ సమీపంలో ఎత్తైన టవర్స్ నిర్మించాలని కేసీఆర్ చాలాకాలంగా భావిస్తున్నారు. దీని ద్వారా పర్యటక రంగానికి మంచి ఊపునివ్వాలని యోచిస్తున్నారు. దీనికి అవసరమయ్యే ఖర్చులో 85శాతం భరించేందుకు బ్యాంక్ ఆఫ్ చైనా ఓకే చెప్పింది.. మరోసారి చర్చించాక సర్కారు ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
మహబూబ్నగర్లో సంస్థను విస్తరిస్తామన్న ప్రాక్టర్ కంపెనీ..
మరోవైపు... ప్రాక్టర్ అండ్ గాంబుల్, నెదర్లాండ్ రాయబారి బృందంతో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు.. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని.. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన ప్రాక్టర్ కంపెనీ.. మహబూబ్నగర్లో తమ శాఖను విస్తరిస్తామని హామీ ఇచ్చింది. ఇక వైద్యరంగంలో నైపుణ్యాన్ని పెంచడం.. ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులకు నెదర్లాండ్ సుముఖత వ్యక్తం చేసింది.
Read more about తెలంగాణ ప్రాజెక్టులపై చైనా ఆసక్తి..
రాష్ట్ర సదస్సు..
విజయవాడలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. బలవంతపు భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలంటూ జరిగిన సదస్సులో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కోనేరు రంగారావు భూ కమిటీ సభ్యులు టి.గోపాలరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రాయలసీమ హక్కుల పోరాట సమితి నాయకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, రైతు సంఘాల నేతలు సదస్సులో పాల్గొన్నారు.
బాబుకు పిచ్చి - రామకృష్ణ..
ఆరు తీర్మానాలు..
సదస్సులో ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. భవిష్యత్తులో ల్యాండ్ బ్యాంకును వ్యతిరేకిస్తూ గవర్నర్, సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇవ్వాలని, గ్రామాల్లో సత్యాగ్రహాలు, మండల కార్యాలయాల ముట్టడి, తదితర అంశాలపై చర్చించి పూర్తిగా అవగాహన కల్పిస్తామని, ప్రతిఒక్కరూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.
Read more about బలవంతపు భూ సేకరణపై వామపక్షాల కార్యాచరణ..
విజయవాడ : ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం జనచైనత్య యాత్రలను మార్గంగా ఎంచుకుంది. గడప గడపకు టీడీపీ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, ఇన్ఛార్జ్లు పాల్గొంటారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజవర్గాల్లో జనచైతన్య యాత్రలు నిర్వహిస్తారు. గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరిస్తారు. యాత్రల్లో పాల్గొనే నాయకులందరూ రాత్రులు గ్రామాల్లోనే బస చేయాలని పార్టీ నాయకత్వం సూచించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొనే ప్రయత్నాల్లో భాగంగా ఈ యాత్రలు చేపట్టనున్నారు. ప్రజాభిప్రాయం ఆధారంగా సంక్షేమ పథకాల అమల్లో మార్పులు చేర్పులు చేస్తారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల విజయవాడలో నిర్వహించిన టీడీపీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచన మేరకు జనచైతన్య యాత్రలకు ప్లాన్ చేశారు.
జనచైతన్య యాత్రలపై పార్టీ నాయలకు దిశానిర్ధేశం చేసేందుకు మేధోమథనం నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. నవంబర్ రెండోవారంలో ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడలో ఈ సదస్సు జరుపుతారు. ఎన్నికల ముందు పార్టీలో చేరినవారికి, ముందు నుంచి టీడీపీలో ఉన్న నాయకులను మధ్య ఉన్న అంతరాన్ని తొలగించి, సమన్వయంతో ఎలా ముందుకుసాలన్న అంశంపై చర్చిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు మేధోమథనానికి హాజరవుతారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జిల్లాల వారీగా మంత్రులతో పత్యేకంగా భేటీ అవుతారు. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి గురించి తెలుసుకుంటారు.
Read more about ఏపీలో టిడిపి జనచైతన్య యాత్రలు..
ఏం తమాష చేస్తున్నారా - బాబు ..
నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. కండలేరు ఎడమ కాలువపై 62 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీని ద్వారా.. పొదలకూరు మండలంలోని సుమారు పాతిక వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. దీన్ని నాలుగు సంవత్సరాల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో.. తమ ప్రభుత్వం తాగు, సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.
బ్లాక్ లిస్టులో పెడుతానన్న బాబు..
బ్యారేజీని పరిశీలించిన బాబు.. |
తర్వాత చంద్రబాబు నాయుడు నెల్లూరు బ్యారేజీని పరిశీలించారు. అక్కడి పనులు సాగుతున్న తీరు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్పై హెచ్చరించారు. జిల్లాలోని డేగపూడి, గొట్లపాలెం గ్రామాల అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు.
Read more about ఏం తమాష చేస్తున్నారా - బాబు ..
వరంగల్ : ఎంపి నియోజకవర్గంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి వామపక్ష పార్టీలు. భూపాలపల్లిలో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో ఆశా వర్కర్లు, వామపక్షాల కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగావుండి వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి. ప్రజలను అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మోసం చేశాయని విమర్శించారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు వామపక్ష పార్టీలకు మాత్రమే వుందంటున్నారు చాడ.
కేసీఆర్ కు తమ్మినేని సూటి ప్రశ్నలు..
వరంగల్ ఎంపి ఉప ఎన్నికల నేపధ్యంలో సిపియం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. సియం కేసీఆర్కు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసింది చండీయాగం కోసమా లేదంటే సీబీఐ కేసులను మాఫీ చేయమని కోరేందుకా? అన్నారు తమ్మినేని. కేసీఆర్ మాటలు నమ్మని ప్రజలు ఈ సారి వామపక్షాలు బలపరిచిన అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరారు తమ్మినేని. నియంత పాలన చేస్తున్న కేసీఆర్ కు వరంగల్ ఉప ఎన్నిక నుంచే పతనం ప్రారంభమవుతుందన్నారు వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్. ఉప ఎన్నికల్లో విస్త్రుత ప్రచారం చేపట్టిన వామపక్ష నేతలు ఎందుకు తమకే ఓటు వేయాలన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
Read more about అధికార పార్టీని ఓడించాలన్న వామపక్షాలు..
పసునూరు దయాకర్ ఎవరు ?
వరంగల్ : లోక్సభ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. గులాబీ పార్టీ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరును కేసీఆర్ ప్రకటించారు. నిన్నటివరకూ రేసులో ముందు ఉన్న రవికుమార్ను ...కుల వివాదం కారణంగా పక్కకు పెట్టినట్లు సమాచారం. దీంతో చివరి నిమిషంలో దయాకర్ పేరును ఖరారు చేశారు కేసీఆర్.
టీఆర్ఎస్ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ, రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలో పాల్గొన్న దయాకర్ ... గతంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. పసునూరి దయాకర్ గతంలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయాకర్ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. పసునూరి దయాకర్ స్వయంగా చిత్రకారుడు, ఛాయా చిత్రకారుడు. స్వగ్రామం సంగెం మండలం బొల్లికుంట కాగా, వరంగల్ కాశీబుగ్గలో చాలాకాలం స్టూడియో నడిపారు. ప్రస్తుతం వర్ధన్నపేటలో గ్యాస్ డీలర్గా వ్యాపారం చేస్తున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాల రూపశిల్పి..
ఫైన్ ఆర్ట్స్ లో పట్టభద్రుడు. తెలంగాణ తల్లి విగ్రహాల రూపశిల్పి. విగ్రహ తయారీతో సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మారారు. తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఈయనే తయారుచేశారు. 2009, 2014లోనూ శాసన సభకు పోటీ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి దయాకర్ చేజారింది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బయటి పార్టీల నుంచి వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని, మొదటి నుంచి కష్టపడ్డ వారికి అసలే మాత్రం పెద్దహోదాలు లేవనే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో 2001 బ్యాచ్కే ప్రాధాన్యం దక్కినట్లయింది. ఈ పరిణామంతో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు కొంత వూరట లభించింది.
Read more about పసునూరు దయాకర్ ఎవరు ?
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ..
హైదరాబాద్ : పాలనలో పట్టు సాధించేందుకు టీ-సర్కార్ నడుం బిగించింది. అడ్మినిస్ట్రేషన్లో భారీగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో పలు కీలక మార్పులు చేపట్టింది. 22 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న ముఖ్య కార్యదర్శులతో పాటు హెచ్వోడీలు ట్రాన్స్ ఫర్ అయ్యారు.
సోమేశ్ బదిలీ.. |
సోమేశ్ బదిలీ..
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్కు స్థానచలనం తప్పలేదు. గ్రేటర్ పరిధిలో ఓట్ల తొలగింపు వ్యవహరంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన్ను గిరిజన సంక్షేమశాఖ కమిషనర్గా బదిలీ చేశారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన రేమండ్ పీటర్ను భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్గా నియమించారు. బల్దియా కొత్త బాస్గా జనార్ధన్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శేఖర్ ప్రసాద్ సింగ్, హెచ్ఎండీఏ కమిషనర్గా చిరంజీవులు, అటవీశాఖ కమిషనర్గా వికాస్ రాజ్ బదిలీ అయ్యారు.
ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా అదర్ సిన్హా , బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా జీడీ అరుణ బదిలీ అయ్యారు. అలాగే ఐ అండ్ పీఆర్ కమిషనర్గా నవీన్ మిట్టల్, పురపాలక కమిషనర్గా దాన కిషోర్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా అనితా రామచంద్రన్, బల్దియా స్పెషల్ కమిషనర్గా జి. కిషన్ నియమితులయ్యారు. పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండీగా కె. నిర్మల, పురపాలకశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎ.శ్రీనివాస్, ఆయిల్ ఫెడ్ ఎండీగా ఎ.మురళి, ట్రైకార్ ఎండీగా లక్ష్మణ్కు స్థానచలనం కలిగింది.
సురేశ్ చందా బదిలీ..
ఇక ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన సురేశ్ చందా పశుసంవర్ధన శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. గతంలో వైద్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన పలు సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పుబట్టారు. అందుకే సురేశ్ చందాను అక్కడి నుంచి తప్పించింది కేసీఆర్ సర్కార్. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా రాజేశ్వర్ తివారీని నియమించింది. అంతేకాకుండా సెర్ప్ సీఈవోగా వీరబ్రహ్మయ్యకు, సాంకేతిక శాఖ సంచాలకులుగా ఎంవీ రెడ్డికి అదనపు బాధ్యతలు దక్కాయి.
ఇలా వివిధ శాఖల్లో సుదీర్ఘకాలంగా పనిచేసిన అధికారుల్ని టీ-సర్కార్ మార్చేసింది. అలాగే తమకు అంతగా సహకరించని ఉన్నతాధికారులను కీలక శాఖల నుంచి తప్పించింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా భారీ సంఖ్యలో జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీ సంచలనం సృష్టిస్తోంది.
Read more about తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ..
తనయుడి చిత్రంలో 'హరికృష్ణ'..
హీరోగా తానేమిటో నిరూపించుకున్న 'నందమూరి హరికృష్ణ' మళ్ళీ తనయుడు 'ఎన్టీఆర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. 'ఎన్టీఆర్', 'కొరటాల శివ' కాంబినేషన్లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో ఓ ముఖ్యపాత్రను 'హరికృష్ణ' పోషిస్తున్నారట. ఆయన బాడీ లాంగ్వేజ్ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు 'కొరటాల శివ' ఈ పాత్రను డిజైన్ చేశారని తెలిసింది. దీనికి ముందు 'సుకుమార్', 'ఎన్టీఆర్' కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలోనే 'హరికృష్ణ' నటించాల్సి ఉండేనట. అనారోగ్యం కారణంగా ఆ సినిమాలో 'హరికృష్ణ' నటించలేకపోయారని టాక్.
Read more about తనయుడి చిత్రంలో 'హరికృష్ణ'..
చైతూ సినిమాలో నాగ్..వెంకీ ?
మలయాళంలో ఘనవిజయం సాధించి ఇటీవల శతదినోత్సవం పూర్తి చేసుకున్న 'ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో 'మజ్ను'గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'నాగ చైతన్య' హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'కార్తీకేయ'ఫేమ్ చందూమొండేడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో 'చైతూ' సరసన మలయాళ ముద్దుగుమ్మ 'అనుపరమా పరమేశ్వరన్' హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలోని రెండు కీలక అతిథి పాత్రల్లో 'నాగార్జున', 'వెంకటేష్' నటించనున్నారనే వార్త ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ అతిథి కాంబినేషన్ గురించి చిత్ర యూనిట్ ఇంతవరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా ఈ అతిథి కాంబినేషన్ సినిమాలో కనిపిస్తే సిల్వర్స్క్రీన్ వండర్ జరిగినట్టేనని అంటున్నారు నెటిజన్లు.
Read more about చైతూ సినిమాలో నాగ్..వెంకీ ?
'ఎట్టి పరిస్థితుల్లో 'పద్మశ్రీ' అవార్డుని వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ అవార్డును నాకు ప్రభుత్వాలు ఇవ్వలేదు. దేశం ఇచ్చింది. దేశమంటే నాకు ఎనలేని గౌరవం. ఆ గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది' అని 'విద్యాబాలన్' ఘాటుగా స్పందించింది. ఇండియన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టిఐఐ) విద్యార్ధుల సమ్మెకు మద్ధతుగా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పొంచి ఉన్న ముప్పునకు నిరసనగా సినీ ప్రముఖులు సైతం జాతీయ అవార్డులను, పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని ఓ ఇంగ్లీష్ ఛానెల్ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విద్యాబాలన్ పై విధంగా సమాధానమిచ్చింది. 'చూడండి.. అవార్డులనేవి ప్రతిభకు నిదర్శనాలు. అంతేకాదు కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తినిచ్చే అంశం కూడా. అటువంటి అరుదైన గౌరవాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి ఇవ్వాలను కోవడం లేదు' అని విద్యా చెప్పింది. ఇదిలా ఉంటే, విద్యా మాదిరిగానే మరో సీనియర్ నటుడు అనుపమ్ఖేర్ సైతం ఇలాగే స్పందించారు.
Read more about అవార్డును వెనక్కివ్వనంటున్న విద్యాబాలన్..
ముఖం తాజాదనం కోసం.. |
ముఖం తాజాదనం కోసం..
మూడు చెంచాల పెరుగు, అరకప్పు ఓట్స్, రెండు టేబుల్ స్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మ తొక్కల పొడి, కొద్దిగా బత్తాయి రసం... అన్నింటినీ కలిపి మెత్తని పేస్తులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనిలోని ఓట్స్ మృతకణాలను తొలగిస్తే, బత్తాయిరసం, నిమ్మ తొక్కల పొడి చర్మాన్ని గట్టిపరుస్తుంది. తేనె చర్మానికి తేమను అందిస్తుంది. మొత్తంగా ముఖం తాజాదనంతో మెరిసిపోతుంది.
Read more about ముఖం తాజాదనం కోసం..
నేడు ఆశా వర్కర్ల కోసం విరాళాలు..
హైదరాబాద్ : నేడు సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల కోసం విరాళాల సేకరణ జరుగనుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆశా వర్కర్లను ఆదుకుందామని, ఆశాల డిమాండ్లను సానుభూతితో చూడాల్సిన ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హక్కుల కోసం పోరాడే ప్రతొక్కరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.
Read more about నేడు ఆశా వర్కర్ల కోసం విరాళాలు..
తాజ్ ప్యాలెస్ లో ఉగ్రవాదానికి వ్యతిరేక కార్యక్రమం...
ఢిల్లీ : హోటల్ తాజ్ ప్యాలెస్ లో ఇండియా - అరబ్ ప్రెండ్ షిప్ ఆధ్వర్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
Read more about తాజ్ ప్యాలెస్ లో ఉగ్రవాదానికి వ్యతిరేక కార్యక్రమం...
బోయిన్ పల్లిలో కార్డన్ సెర్చ్..
సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్ జోన్ డీజీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. దాదాపు 350 మందికి పైగా పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు.
Read more about బోయిన్ పల్లిలో కార్డన్ సెర్చ్..
సికింద్రాబాద్ : లాలాగూడ చంద్రబాబు నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
Read more about లాలాగూడలో కార్డన్ సెర్చ్...
సికింద్రాబాద్ : మంత్రి కుమారుడు తనను మూడు గంటల పాటు నిర్భందించి హింసించాడని అభినవ్ అనే యువకుడు ఆరోపించాడు. ఈమేరకు మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేమ పెళ్లి వ్యవహారంలో మంత్రి కుమారుడు జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Read more about మంత్రి కుమారుడిపై యువకుడి ఫిర్యాదు...
విజయవాడ : గజదొంగ దున్న కృష్ణ అలియాస్ రాజును పోలీసులు అరెస్టు చేశారు. 2.5 కిలోల బంగారం, 15 కిలోల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దున్న కృష్ణపై 150కి పైగా కేసులున్నాయి.
Read more about గజదొంగ దున్న కృష్ణ అరెస్టు..
నవంబర్ 7న టి.టిడిపి సర్వసభ్య సమావేశం..
హైదరాబాద్ : నవంబర్ 7వ తేదీన టి.టిడిపి సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.
Read more about నవంబర్ 7న టి.టిడిపి సర్వసభ్య సమావేశం..
'డియాన్ హిల్లీకి విరాట్ కోహ్లీ మీద
వాలెంటైన్స్ డే సందర్భంగా భట్టి
కిడ్స్ స్పెషల్ లో 'మామ' నయా
సలాం ఇండియా...
నువ్వుల నూనె..ఆరోగ్య రహస్యాలు...
ఫేస్ టు ఫేస్ విత్ సతీష్
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో ఫేస్ టు ఫేస్... |
ఔత్సాహికులు మరియు వాచ్ ఉచితంగా మరియు నమోదు porn videos
ప్రధాన (current)
యాదృచ్ఛిక వీడియో
అన్ని కెటగిరీలు
ఈ శృంగార వీడియో వర్గం ఔత్సాహికులు, జర్మన్ వీడియో శీర్షిక ఔత్సాహికులు మరియు వాచ్ ఉచితంగా మరియు నమోదు porn videos డౌన్లోడ్ మరియు HD లో చూడండి
రేట్ మర్చిపోతే లేదు వీడియో! మీరు వీడియో ఇష్టపడ్డారు లేదా కాదు. Thank you!
క్లిక్ లోడ్ వీడియో
లో డౌన్లోడ్ .mp4 embed కోడ్
ఈ కోడ్ కాపీ మరియు మీ వెబ్ సైట్ లో ఉంచడానికి
ఔత్సాహికులు మరియు వాచ్ ఉచితంగా మరియు నమోదు porn videos సైట్ నుండి porntube-com.com
అభిప్రాయాలు 55
వీడియో పని లేదు
భాగస్వామ్యం, సామాజిక నెట్వర్క్లు
720 HD వీడియో మరియు చిత్రాలు ప్రేమికులు నోటి సెక్స్
హార్డ్ శృంగార మరియు ఫోటో పూకు మహిళలు
వెబ్ మరియు శృంగార వీడియోలు బానిసత్వం ఆధిపత్యాన్ని అణచివేత మరియు క్రూరత్వం
720 HD వీడియో మరియు వీడియో జుట్టుతో పూకు
ప్రముఖ వీడియో
తల్లులు మరియు ఆన్లైన్ గూఢచర్యం
టీన్స్ మరియు వీడియో సెక్స్ లో హౌస్ 2бесплатно
దగ్గరగా అప్ మరియు pornorolikov freebie
వయస్సు మరియు వీడియోలను blowjobs నుండి ఒక వేశ్య న ogli
కార్టూన్లు మరియు డౌన్లోడ్ బానిసత్వం ఆధిపత్యాన్ని అణచివేత మరియు క్రూరత్వం సినిమాలు
720 HD వీడియో మరియు నేను వంటి నలిగిపోయే పూకు పుస్సీ లో ఒక పిడికిలి చాలు
Spank వీడియో మరియు సెక్స్ తో ఒక వేశ్య
వయోజన బొమ్మలు మరియు శృంగార ఫోటోలు ప్రవహించే Olsen
టీన్స్ మరియు శోధన కోసం పోర్న్ సినిమా కోసం ఉచిత
ఒక భారీ రంధ్రం మరియు కొవ్వు అందమైన మహిళలు వీడియో porn
ముగ్గరితో సెక్స్ పోర్న్ తో డౌన్లోడ్ కోసం కామెరాన్ డియాజ్
సెక్స్ రతి వివిధ జాతులు శృంగార వీడియో కోసం ఫోన్ సోనీ ఎరిక్సన్ k 700i
రొమ్ములు బయటకు Porn Videos
ఉక్కిరి బిక్కిరి చెయ్యి సెక్స్
ఉక్కిరి బిక్కిరి చెయ్యి Sex Porn Videos
కార్ షో Porn Videos
పెద్ద కొవ్వు ఆత్మవిశ్వాసం
పెద్ద కొవ్వు ఆత్మవిశ్వాసం Porn Videos
పిసకడానికి సంతోషం ఇచే కాయలు
భారీ సహజ Tits Porn Videos
పెద్ధ కాయలు డ్యాన్స్
పెద్ధ కాయలు డ్యాన్స్ Porn Videos
పరిపూర్ణ తల్లి Porn Videos
జపనీస్ అమ్మాయి నల్ల మొడ్ఢ
జపనీస్ అమ్మాయి నల్ల మొడ్ఢ Porn Videos
పాత జ్వాల Porn Videos
పరిపూర్ణ కాయలు ముధీరిన సెక్స్
రొమ్ములు ఫక్ Porn Videos
నకిలీ రొమ్ములు Porn Videos
భార్య మరొక వ్యక్తి ద్వారా Fucked
భార్య మరొక వ్యక్తి ద్వారా Fucked Porn Videos
పరిపక్వ రొమ్ములు
పరిపక్వ రొమ్ములు Porn Videos
దాచిన కెమెరా భావప్రాప్తి
దాచిన కెమెరా భావప్రాప్తి Porn Videos
సమీక్ష Porn Videos
ఇష్టం ఒక మహిళ
ఇష్టం ఒక మహిళ Porn Videos
ఉత్తమ పోర్న్ వీడియోలు ఇక్కడ చూడవచ్చు. పెద్ద యొక్క ఆర్కైవ్ పోర్న్ వీడియోలు for you. porntube.com
నుండి అభిప్రాయాన్ని మద్దతు సైట్
కార్ట్_ సైట్ మ్యాప్
ఉత్పత్తులు & బ్రాండ్
పత్తి కుట్టడం థ్రెడ్లు
బ్యాగ్ ముగింపు థ్రెడ్
100% పాలిస్టర్ హై టెనసిటీ థైవింగ్ థ్రెడ్
నైలాన్ బాండ్ థ్రెడ్
పాలిస్టర్ కుట్టుపని థ్రెడ్ స్మాల్ స్పూల్
ఎంబ్రాయిడరీ థ్రెడ్
విస్కాస్ రేయాన్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్
అల్లిక నూలు
నైలాన్ థ్రెడ్, ఫిషింగ్ ట్వైన్
పెర్ల్ కాటన్ బాల్
రంగు కార్డులు
కస్టమ్ రంగులు
ఉత్పత్తి సామగ్రి
టెస్టింగ్ సామగ్రి
కార్పొరేట్ బాధ్యత
మమ్మల్ని సంప్రదించండి
పాలిమైడ్ 6.6 సింథటిక్ ఫైబర్, ప్రముఖ పేరు నైలాన్ 6.6 లేదా 6 సింథటిక్ ఫైబర్, నూలు మెలితిప్పినప్పుడు లోపల బంధంలో ప్రత్యేక ప్రక్రియ ద్వారా, తరువాత అన్ని ఫైబర్ను అతుక్కొని, ఒకదానితో ఒకటిగా ముగించి, బంధించిన థ్రెడ్ తృణధాన్యం కాదు, అధిక నిరోధకత రాపిడికి నైలాన్ పదార్థం యొక్క ప్రయోజనం మరియు కందెన యొక్క సమర్థవంతమైన పారవేయడం కారణంగా కుట్టు ప్రభావం చాలా అద్భుతంగా ఉంది.
అప్లికేషన్స్: అప్హోల్స్టరీ, కాన్వాస్, డ్రేపెరీ, లగేజ్, పర్సులు, క్యాంపింగ్ టెంట్, బూట్లు, తోలు ఉత్పత్తులు, వినైల్ మొదలైనవి.
రసాయనాలు, రాపిడి, మరియు సూర్యకాంతి నిరోధకత
లెదర్ గూడ్స్ / ఫుట్వేర్ / స్పోర్టింగ్ గూడ్స్ / సూట్కేస్ & బాగ్ / అవుట్డోర్ గూడ్స్ / అప్ఫ్లాస్టరీ / ఆటోమోటివ్ చైర్ / ఎయిర్బ్యాగ్
సాంకేతిక సమాచారం
(T) kg % సింగర్ మెట్రిక్
మరిన్ని నైలాన్ బాండ్ థ్రెడ్
విచారణ ఇప్పుడు
1000 అక్షరాలు మిగిలాయి
ఫైల్లను జోడించండి
అప్లోడ్ చేయడానికి ఫైల్లను ఇక్కడ వదలండి
MH Bldg., 18 # నింగ్నాన్ నార్త్ రోడ్, యిన్ఝౌ జిల్లా, నింగ్బో, చైనా
కాపీరైట్ © 1999-2018 _ NINGBO MH YARN మరియు THREAD FACTORY. |
మడత పేజీ: January 2015
మీరు తీరికగా ఉన్నప్పుడు చదువుతారని.ఇంతింత.మరికొంత. * చంద్రలత *
గణతంత్ర దినోత్సవం కదా .. పిల్లలకి
వెంటనే, మహారాజూల్నీ, మాహారాణులనీ, చక్రవర్తులనీ ,సుల్తానాలనీ,పాదుషాలని.. చిట్టా రాసి, ఓ తొమ్మిది మందిని .. పట్టీ రాశేసాం. పిల్లలు తలా ఒక పాత్రలోకి ఒదిగి పోయారు. ఈ నాలుగు రోజులు, కత్తి యుద్ధాలు ,గుర్రాల సకిలింపులు , ఏనుగు ఘీంకారాలు.ప్రభవ దద్దరిల్లిపోయింది. ఇక , ఇవ్వాళ అందరూ .. వరస గా వేదికెక్కి తమ తమ పాత్రలను ఆఖరి మెరుగులుదిద్దుతూ , దడలాడించేసారు.సోమవారం ప్రదర్షన. ఇంతకీ, చెప్పొచ్చేదేమిటంటే, ఆఖరి పాపాయి, అశొకుడి పాత్రలో జీవించగానే, అప్పటిదాకా రణగొణ్వనులు చేస్తోన్న యుద్ధవీరులంతా.. కిక్కురుమనడం మానేసి, ఒక తదేక దృష్టితో .. అశోకుడి వైపు ..చూస్తూ .. అన్నారు.
" ఈ కింగ్ చాలా గుడ్!"
"అందరూ కత్తితో కిల్ చేస్తారు. వాళ్ళు చాలా బాడ్ !"
ఇందుమూలంగా, సోమవారం నాడు అశోకుడికి ఎక్కువ సమయం ఇవ్వాలని పిల్లలు ఏక గ్రీవంగా తీర్మానించారు.
మా వరసలో ,చిట్టచివరి స్టార్ ఎంట్రీ "సామ్రాట్ అశోక" అన్నమాట!
Labels: బాట, వారెవా
"నీ వుండే దా కొండపై .. "
"నీ వుండే దా కొండపై .. నా స్వామీ...నేనుండేదీ నేలపై...
సరిగ్గా ఇదే సమయానికి, గత పాతికేళ్ళుగా .. .
ఒక నాదస్వరం మా వీధుల్లో .. ప్రయాణిస్తూ ఉండడం పరిపాటి.
ఇక ఆ రోజంతా , బుర్రలో తిరుగుతూ ... ఉంటుంది.
ఆ స్వరంతో పాటు, ఆ పాట.. వదలమన్నా వదలదు.
అంతా చేసి ఆ నాలుగు వాక్యాలే, మళ్ళీ మళ్ళీ.
అప్పుడప్పుడు, “ నీలి మేఘాలలో .. గాలి కెరటాలలో…. “
ఈ పాటా ఆ నాలుగు వాక్యాలే !
ఆ స్వరం వెనుక మనిషెవరో కూడా తెలియదు. కానీ , ఆ స్వరమంటే అంతులేని అభిమానం.
ఎంతగా అలవాటు పడ్డామంటే , ఆ సమయానికి ఆ పాట వినబడక ఆ రోజంతా ఏదో లోటుగా ఉంటుంది మరి!
నిజానికి, రాను రాను ఆ పాట రాక తగ్గుతూ వస్తొంది. కొన్ని రోజులు వినబడనే వినబడడం లేదు. అయినా, ఓ చెవి ఆ వైపు అప్పగించేయడం అలవాటయి పోయింది.
ఈ మధ్య ఓ పెద్ద హోరెంత్తించే మైకులో …పొద్దున పొద్దున్నే ...
“ నెల్లూరు నెరజాణా…” అంటూ..
హమ్మయ్య ,పాట కాదు…స్వరమే!
“ ఎంత నెరజాణతనమయితే మాత్రం అలా మైకులు పెట్టి వీధుల్లో ప్రకటించుకోవాలా ! సిగ్గులేక పోతే సరి ! “అని గట్టిగా గొణుక్కోకండి. పాపం ,అదేదో, మంచి మాటని ఉప్పొంగిపోయే వారు బోలెడు నెల్లూరీయులు!
స్వరం ... ఆ వెంటనే .. సైరనూ..కుయ్ కుయ్ మని... బిగ్గరగా వినబడుతుంది.
“ అమ్మా…. మున్సిపల్ వాహనం వచ్చింది
మీ ఇంటి చెత్త ఇవ్వండీ ! “
ఇదేదో బాగానే ఉంది !
ప్రహసనంగా మారేంతవరకూ, ఓకే !
ఇంతా చేసీ , మా వీధుల్లో మున్సిపల్ చెత్త కుండీలన్నీ , కబ్జా అయిపోయాయి. వందలాది చిన్నచితక ఆసుపత్రుల వీధులు కదా. ఎప్పుడైనా "చెత్తకుండీలో పసిపాప" లాంటి వార్తలు వచ్చే వంటే , అది ఖచ్చితంగా మా వీధి చెత్తకుండీనే అయి ఉండేది !
ఇప్పుడిక , చూడాలి!
Labels: దారేది, బాట
కొత్త పుస్తకం (16)
కోటపాటి మురహరి రావు గారు (10)
చిట్టి పుస్తకం (4)
చిట్టి కలం (3)
చేపలెగరా వచ్చు On Kinige వచ్చే దారెటు On Kinige వివర్ణం On Kinige మడత పేజీ On Kinige అన్ని పుస్తకాలు ఇక్కడ లభ్యం AVKF Book Link - Chandra Latha ఇక్కడ కూడా లభ్యం http://prabhavabooks.blogspot.com/
ఏమి చూసుకొని నాకీ ధైర్యం? ఏమీ లేని వాడిని.సామాన్యుడిని.అణు మాత్రుడిని. అయితే ఏం? అనంతమైన శక్తి నాలో లేదూ ? "దృశ్యాదృశ్యం"
గవర్నర్ నరసింహన్ను కలిసిన కేసీఆర్
ఉత్తరప్రదేశ్ లో భారీ ప్రమాదం
పశ్చిమ బెంగాల్లో దారుణం
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ సమావేశం
అవిశ్వాసంపై చర్చలో మోడీ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎండగట్టింది.
– ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పనులు ఆలస్యం
– వైసీపీ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్, జులై12(జనం సాక్షి) : పోలవరం ప్రాజెక్ట్లో జరుగుతన్న అక్రమాలు జరిగాయని, గడ్కరీ పర్యటనలో బహిర్గతం అయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతోందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కోసం పోలవరాన్ని పక్కన బెట్టారని ఆరోపించారు. ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. డీపీఆర్లలో ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయో ప్రజలకు చెప్పాలన్నారు. పోలవరం పనుల్లో కవిూషన్ల కోసమే ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాకులాడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్లో అక్రమాలు జరిగిన సంగతి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటనలో బహిర్గతమైందన్నారు. ఇప్పటికైనా బీజేపీ, టీడీపీలు డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం డెడ్లైన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉమ్మడి హైకోర్టు సీజేగా..
మరిన్ని వార్తలు... |
1. మహద్వాచకములు - పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదములు మహద్వాచకములు. వీటిని పుంలింగములనియు అందురు - రాముడు,భీముడు.
3. అమహద్వాచకములు - పశు పక్షాదులను తెలియజేయు శబ్దములు అమహద్వాచకములు. వీటిని నపుంసకలింగములనియు అందురు - చెట్టు, రాయి, కాకి.
తెలుగుభాష హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
తెలుగు వ్యాకరణం
తెలుగు అక్షరమాల
తెలుసుకోవలసిన విషయాలు
తెలుగు భాష చరిత్ర
తెలుగు పండుగలు
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
తెలుగు నక్షత్రాలు
తెలుగు తిధులు
తెలుగు అంకెలు
తెలుగు రాశులు
యక్ష ప్రశ్నలు - జవాబులు
++ అలా రాసేయకండి బాబోయ్! ++ డైరెక్టర్ని దాచేస్తే దాగునా నిజం? ++ డైరెక్టర్పై మెగాస్టార్ ఫైర్! ++ టీజర్: `అక్షర` టీచర్ హత్యలు ++ జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ
పిక్ టాక్: జలకాలాటలలో
అబ్బబ్బా.. ఏమి ఒంపుల్రా బాబూ..!
హీరోయిన్కి స్టార్ ప్రొడ్యూసర్ కాస్ట్లీ గిఫ్ట్!
600కోట్ల 2.Oకి డేంజర్ బెల్స్
న్యూ లుక్: రాక్షసితో మెగా ప్రిన్స్
ఫస్ట్ లుక్: వినయ విధేయ రామా
తెలుగు » Cinema News » 'సరైనోడు' మూవీ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రీలీజ్
'సరైనోడు' మూవీ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రీలీజ్
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.... సరికొత్త ప్రమోషన్ లో భాగంగా సరైనోడు చిత్రానికి సంబంధించి ఇటీవలే ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాం. ఈ పోస్టర్ చూసిన తర్వాత ఇండస్ట్రీ వర్గాల నుంచి.. అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు సిసలు ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా... అని ఎదురుచూశారు. ఈ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ... సరైనోడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేశాం. భారీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే హై ఓల్డేజ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రకుల్, కేథరీన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణ. అల్లు అర్జున్, అంజలి కాంబినేషన్లో వచ్చే ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. అని అన్నారు.
నటీనటులు : అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయి కుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, విద్యుల్లేఖ, దేవ దర్శిని, అంజలి (ప్రత్యేక పాటలో)
సాంకేతిక వర్గం , బ్యానర్ - గీతా ఆర్ట్స్, ప్రొడక్షన్ కంట్రోలర్స్ - బాబు, యోగానంద్ , చీఫ్ కోఆర్డినేటర్ - కుర్రా రంగారావ్, ఆర్ట్ డైరెక్టర్ - సాయి సురేష్ , ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్ , ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్ , ఫైట్ మాస్టర్స్ - రామ్ లక్ష్మణ్, రవి వర్మ , డిఓపి - రిషి పంజాబి ,డైలాగ్స్ - ఎం.రత్నం , మ్యూజిక్ - ఎస్ ఎస్ తమన్ , కో ప్రొడ్యూసర్ - శానం నాగ అశోక్ కుమార్ , ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్ , డైరెక్టర్ - బోయపాటి శ్రీను
అతిథి పాత్రలో మహేష్ ..?
వన్ మిలియన్ వ్యూస్ అందుకున్న 'నేను లేను' టీ
తమన్నా,సందీప్ కిషన్ ల 'నెక్స్ట్ ఏంటి' ట్రైల
'తెలంగాణ దేవుడు' ఆడియో విడుదల
నవంబర్ 30 న విడుదల కాబోతున్న 'భైరవగీత'..!!
నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్ అవుతున్న విజువల్ వండర్ '2.0'
సిద్ధమ్మగా నయన తార లుక్ విడుదల
24 కిస్సెస్ ఆడియో వేడుక..!!
డబ్బింగ్ స్టార్ట్ చేసిన వరుణ్తేజ్
'యాత్ర' పోస్ట్ పోన్ అవుతుందా?
తమన్నా,సందీప్ కిషన్ ల 'నెక్స్ట్ ఏంటి' ట్రైలర్ లాంచ్ వేడుక..
వన్ మిలియన్ వ్యూస్ అందుకున్న 'నేను లేను' టీజర్
డిసెంబర్ 7న విడుదల కాబోతున్న'కవచం'
సదరన్ స్టార్ అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన మల్లూవుడ్
అల్లు అర్జున్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే
అల్లు అర్జున్ కు కేరళ 'సి ఎం' ఆహ్వానం
తెలుగువారికి "వేదిక" సాదరంగా అహ్వానిస్తుంది. తేనెలొలికే తెలుగుభాషకు మావంతు సేవ ఈ "వేదిక". ఎక్కడెక్కడో వున్నా తెలుగుపై మక్కువతీరని తెలుగువారి కోసం ఈ "వేదిక". తమ పిల్లలకు తెలుగు భాషనేర్పించాలనుకునే తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుంది ఈ "వేదిక". 'మనసంస్కృతినీ, సాంప్రదాయాలను గుర్తుచేసుకుందాం, నలుగురితో పంచుకుందాం,'అనుకునేవారికీ "వేదిక". సౌందర్యం, చిట్కాల వంటి సంగతులతో మన తెలుగింటిఆడపడుచులకు అండగా వుంటుంది ఈ "వేదిక". తెలుగువారి కాలక్షేపం కోసం మేముచేస్తున్న చిరు ప్రయత్నమిది. ఈ "వేదిక" అందరికీ ఎంతో కొంతవుపయోగపడుతుందనీ, అందరినీ సంతోషపరుస్తుందనీ ఆశిస్తూ "వేదిక"కుహృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇట్లు ,వేదిక సభ్యులు.Populartelugu jokes to read and laugh.Share jokes, send wishes to friendsthrough WhatsApp.Enables users to see and provide ratings on thejokes."Vedhika" app is for all Telugu people who are fun lovers. |
పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే అలా చేయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి _ Social Journalism,Untold,Opinion,Sports,Politics,Breaking news-Socialpost
తాజా వార్తలు
మీకు తెలుసా!
సినిమా రివ్యూస్
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV
పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే అలా చేయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి
శ్రీరెడ్డి గా పరిచయం ఉన్న విమల మల్లిడి జిందగీ,నేను నాన్న అబద్దం,అరవింద్ 2 సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ అచ్చ తెలుగమ్మాయి కొన్నాళ్ల కిందట న్యూస్ రీడర్ గా ఓ చానెల్లో పనిచేసేది. ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి… సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. మొదట్లో ఈమె ఎక్స్ పోజింగ్ మాటెత్తితే ఒప్పుకునేదే కాదట. కానీ, ఇప్పుడు ఈ రెండు చిత్రాల్లో స్టోరీ డిమాండ్ చేస్తున్నంత మేరకు ఎక్స్ పోజింగ్ చేసేందుకు సిద్దమైందట.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఆవేశపూరితంగా సమాధానమిచ్చింది శ్రీరెడ్డి. ఒక హీరోయిన్ ఎన్నో అవకాశాలతో దూసుకుపోతుందంటే ఖచ్చితంగా పడుకుని తీరాల్సిందే… ఒకవేళ అన్నింటికి సిద్దమైనా కూడా అవకాశాలు రాక,లేదంటే ఏదో చిన్న క్యారెక్టర్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
మన తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి పంపిచకపోవడానికి మెయిన్ రీజన్ కాస్టింగ్ కౌచ్..ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసాక ఏ అమ్మాయి తల్లిదండ్రులైనా తమ ఆడపిల్లల్ని ఇటు పంపిస్తారా??అంటూ ప్రశ్నించింది.ఒకవేళ మేం అన్నింటికి సిధ్దం అని చెప్పినా కూడా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇచ్చేవారెవరు అంటూ ఆగ్రహించింది.
అందరికి మళయాళి ముద్దుగుమ్మలే కావాలా,తెలుగు అమ్మాయిలు అక్కర్లేదా అంటూ కొంతమంది హీరోలపేర్లు ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించింది.అంతేకాదు ఇండస్ట్రీలో ఉన్న పెద్దల్ని సైతం కడిగిపారేసింది.వీళ్లందరూ కిందిస్థాయినుండి పైకొచ్చినవారే కదా ఇప్పుడు కింది స్థాయివారిని ఎందుకు పట్టించుకోరూ అంటూ ప్రశ్నించింది.. మోహన్ బాబు,అల్లు అరవింద్,రామానాయుడు ఇలా అందరి నిర్మాతలనే కాదు..పవన్ కళ్యాన్ ని కూడా ప్రశ్నించింది..ఇంతకీ ఆమె పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడిందో మీరే ఈ వీడియో చూడండి.
రామ్ చరణ్ నిర్మాత…ఎన్టీఆర్ హీరో!
విజయ్ దేవరకొండకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్?
మెగాస్టార్ సైరాలో అజ్ఞాతవాసి!
ఎన్టీఆర్-ఏఎన్నార్ వివాదాలు దాచేస్తున్నారా?
`ఎన్టీఆర్` ను ఢీ కొట్టేది వీళ్లే! ఫైట్ మామూలుగా ఉండదు?
క్రికెట్ నా…సినిమాలా? తేల్చేయ్ కొహ్లీ!
హరీష్ శంకర్ కు అసలోళ్లు దొరకలేదు..అందుకే ఆ పని!
చరణ్ గొడ్డలి వేటు…చిరు కత్తి పోటు! |
ఫొటో గ్యాలరీ
వీడియో గ్యాలరీ
లైఫ్ స్టైల్
ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్ _ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ? _ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు _ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు _ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట _ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా _ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్ఫోన్ల డెలివరీ _ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి _ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ _ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం _
హోమ్ >> లేటెస్ట్ న్యూస్ >> Telangana
తెలంగాణలో కమ్మ సామాజికవర్గం పూర్తిగా టిడిపి కొంపముంచిందా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆ వర్గం టీఆర్ఎస్ లో చేరి, ఆపార్టీని ఆ రాష్ట్రంలో తిరుగులే శక్తిగా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావన. ఒకప్పుడు రాష్ట్ర విభజనకు ఆ సామాజిక వర్గమే ప్రధాన అడ్డంకి అని టీఆర్ఎస్ నేతలు పలుమార్లు విమర్సించారు. తెలంగాణలో ఉన్న ఆ సామాజికవర&# ...
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జుగుప్సాకరమని, పార్టీ మారిన వారికి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు కోరుకున్న తెలంగాణ ఇదేనా? అని జానా ప్రశ్నించా ...
1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల
తెలంగాణకు తొంభైవేల కోట్లు కాదని, అంతకన్నా ఎక్కువే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చెప్పారు. ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ బిజెపి అధ్యక్షుడుఅమిత్ షా అన్ని అసత్యాలే చెప్పారని అనడంపై చింతల ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట బహిరంగ సభను చూసి టిఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందని ఆయన అన్నారు. తెలంగాణకుని ...
కేంద్రమాజీ మంత్రి జి.వెంకటస్వామి కుమారులు ఇద్దరూ టిఆర్ఎస్ తీర్ధం తీసుకుంటున్నారు. మాజీ ఎమ్.పి వివేక్, మాజీ మంత్రి వినోద్ లు ఇద్దరూ తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ లోకి చేరారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చి ఓడిపోయారు. వీరు కాంగ్రెస్ లో ఉన్నా, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వపరంగా వెంకటస్వామి విగ్రహాన్ని హైదరాబాద్ ల ...
90 వేల కోట్లు తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదు-ఈటెల
తెలంగాణకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.బిజెపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా సూర్యాపేట సభలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పై,టిఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఈటెల ఖండించారు. కేంద్రం తెలంగాణకు తొంభై వేల కోట్లు ఇచ్చిందని షా చెప్పడం అసత్యమని ఆయన అన్నారు.కేంద్రం నుంచి తెలంగాణకు వ&# ...
ఏడాదిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పదకం అమలుకు రెండు విదేశీ కంపెనీలు ముందుకు రావడం ఆసక్తికరంగా ఉంది.ఇటలీకి చెందిన ఎమ్.2, స్వీడన్ కు చెందిన కోలా గ్లోబల్ అనే సంస్థలు ఏడాదిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడతామని ప్రతిపాదించాయి. ముందుగా తయారు చేసుకున్న విడిబాగాలతో అంటే పానల్స్ తో ఈ ఇళ్లు నిర్మిస్తారు. ప్రభుత్వం ప్ర& ...
తెలుగు: బకింగ్ హామ్ పాలెస్ |
బిగ్ బ్రేకింగ్.. పవన్కు అసలు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా..! – Dharuvu
ఎస్సీ,ఎస్టీల సంక్షేమం కోసం..ప్రభుత్వం కీలక నిర్ణయం
మంత్రి జగదీశ్ రెడ్డి బర్త్డే..సీఎం కేసీఆర్ స్పెషల్ గ్రీటింగ్స్
నర్సంపేట అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ కీలక సూచనలు
మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ,గవర్నర్ నరసింహన్
బుట్టా రేణుకను అక్కడికి ఎందుకు పిలిచారు..వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్
వైసీపీ నేత కన్నబాబు సంచలన ప్రకటన..!
Home / ANDHRAPRADESH / బిగ్ బ్రేకింగ్.. పవన్కు అసలు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా..!
బిగ్ బ్రేకింగ్.. పవన్కు అసలు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా..!
అయితే అసలు విషయం ఏంటంటే.. అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. అధిక సంతానం కల్గినందుకు.. కేవలం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత మాత్రం పవన్ కోల్పోయాడు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం అధిక సంతానం ఉన్నవాళ్ళు పోటీ చేయకూడదు. కానీ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఆ నిబంధన లేదు. ఎంతమంది సంతానం ఉన్నా ఎన్నికల్లొ పోటీ చెయ్యొచ్చు. ఇప్పుడు తాజాగా ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా మన నాయకుల తెలివికి అబ్బురపడిపోతున్నారు. ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని పోటీకీ అనర్హులుగా చేయడం అవసరమే. ప్రస్తుతం ఒక రాజకీయ నేతకి ఒక కొడుకు ఉంటేనే వేల కోట్ల అవినీతి ఆరోపణల కథలు వస్తున్నాయి. ఇక ఎక్కువ మంది సంతానం ఉంటే.. వాళ్ళందరూ అనధికారికంగా అధికారం చలాయిస్తూ ఉంటే తట్టుకోగలమా.. అయితే ఆ రూల్ని కేవలం సర్పంచ్ స్థాయి ఎన్నికలకు పరిమితం చేయడంలోనే మన నాయకుల రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది.. మన రాజకీయ నాయకుల ముందు ఎలాంటి రాజ్యాంగాలు అయినా పని చేయవని.. రూల్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయని విశ్లేషకులు చర్చిచుకుంటున్నారు.
లేడీ సింగర్ ను మోసం చేసిన రంగస్థలం చిత్రం యూనిట్.!
భారీగా తగ్గిన బంగారం ధరలు..ఏంతో మీకు తెలుసా..?
టీడీపీ నేతల మీద పిచ్చ కోపంతో అరిచేసిన చంద్రబాబు..!
సింహాన్ని చూడలంటే అడవిలో చూడాలి…వైఎస్ జగన్ ని చూడలంటే
బీచ్ panicum లేదా సీషోర్ paspalum (?) షిప్ ద్వీపం తిన్నెలు ఆక్రమించడాన్ని. మిస్సిసిపీ, 2006 అక్టోబర్ 8
సామ్ హోస్టన్ నేషనల్ ఫారెస్ట్ లో లిటిల్ లేక్ క్రీక్ లూప్ ట్రైల్ న beautyberry (Callicarpa అమెరికానా) యొక్క పండ్లు స్ట్రాబెర్రీలను పండించటానికి. రిచర్డ్స్, టెక్సాస్, జూలై 20, 2008
బైబిలు మిషను ::Bible Mission Ministries ::
ఎగ్జిట్పోల్ ఫలితాలు ఎలా ఉన్న సంబంధం లేదు
10న బాబు ఢిల్లీకి
జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
సంగారెడ్డి, అక్టోబర్15(జనంసాక్షి) : రానున్న ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, అవినీతికి తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. హుస్నాబాద్లోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలు తెచ్చి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారన్నారు. మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలపై ప్రత్యేక నిఘాపెట్టాలని, ఎన్నికల కవిూషన్ కఠినంగా వ్యవహరించాలని కోరారు. మహాకూటమిలో రెబల్స్ బెడద లేకుండా ఆయాపార్టీలు సమన్వయం చేసుకోవాలని, కిందిస్థాయి క్యాడర్ పూర్తిగా సహకరించాలని కోరారు. సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడే లీకులు ఇవ్వడం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే
పని చేస్తామన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా మహాకూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం ఖాయమని చాడ జోస్యం చెప్పారు. తెరాస నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకే పెద్దపీట వేసిందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో కోట్ల రూపాయలు కవిూషన్ల రూపంలో దోచుకున్నారని చాడ విమర్శించారు. ఎంతోమంది అమరుల ప్రాణత్యాగాలతో, సకలజనుల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగేళ్ల కాలంలోబ్రష్టు పట్టించారని అన్నారు. ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని, దళితులను, ముస్లింలను అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనతో ప్రజలు విసిగి పోయారని, దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని చాడ తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే రాజిరెడడ్, కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి, మంద పవన్, ఎడ్ల వెంకట్రాంరెడ్డి, గడిపె మల్లేశ్, కొయ్యడ సృజన్, కూన శోభారాణి, గూడెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్లో వ్యక్తి దారుణ హత్య
మరిన్ని వార్తలు... |
సమితిలకు మొదటి ఎదురుదెబ్బ _ MyTelangana.com
తాజా వార్తలు
జీవో-39 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ రైతు సమన్వయ సమితిలు రెవెన్యూ వ్యవస్థకు ఒక సమాంతరం వ్యవస్థగా రూపొంది చివరకు రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థనే నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని అయన తన పిటిషనులో పేర్కొన్నారు. ఈ సమితులకు మూలధనంగా రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే రూ.500 కోట్లు అధికార తెరాస నేతల జేబులలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కనుక ఈ సమితులకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
దానిపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకొని, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు సమితులకు ఎటువంటి చెల్లింపులు చేయరాదని తెరాస సర్కార్ ను ఆదేశించింది. రూ.500 కోట్లను రైతు సమన్వయ సమితుల ద్వారా ఏవిధంగా ఖర్చు చేయబోతోందో, అందుకోసం ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు, మార్గదర్శకాలు రూపొందించిందో తెలియజేస్తూ మూడు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇటువంటి పరిణామం తెరాస సర్కార్ ఊహిస్తున్నదే అయినా ఈ కార్యక్రమంలో ఇది మొదటి ఎదురుదెబ్బ అని చెప్పకతప్పదు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకే ప్రభుత్వంలో పటిష్టమైన రెవెన్యూ యంత్రాంగం ఉన్నప్పటికీ, లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా తెరాస సర్కార్ హడావుడిగా జీవో (నెంబర్:39) జారీ చేసి దానితోనే రైతు సమన్వయ సమితిలకు ఏర్పాటుకు పూనుకొని మొదటి ఎదురుదెబ్బతింది.
సైరా స్పీడ్ పెంచారు.. కారణం అదేనా..!
సెక్స్ రాకెట్ లో బుక్కైన భామ..!
బిగ్ బాస్-2 భలే షాక్ ఇచ్చారు..!
ఎన్టీఆర్ సినిమాకు బాలకృష్ణ సెంటిమెంట్..!
సమ్మోహనం రివ్యూ & రేటింగ్
నా.. నువ్వే రివ్యూ & రేటింగ్
రాహుల్ గాంధీ ప్రధాని కాగలరా?
కె.కేశవరావుకు త్వరలో ప్రమోషన్?
వాటి గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదు?
ఓటు నమోదుకు అంతా కదలాలి: ప్రధాని మోడీ
వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డు
దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది
రైల్వే ఉద్యోగి దారుణ హత్య
కడప ఉక్కు కోరుతూ బంద్
– గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ
అహ్మదాబాద్,డిసెంబర్ 6,(జనంసాక్షి): కాంగ్రెస్పై ప్రధాని నరేంద్రమోదీ విమర్శల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. గుజరాత్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న మోడీ.. బుధవారం ఆయన ధంధూకా, ద¬ద్ ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. జాతీయ నేతలు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, అంబేడ్కర్లకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ‘భారతరత్న’ అవార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులకు ఓ కుటుంబం తీవ్ర అన్యాయం చేసిందని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూకి పూర్తిస్థాయి ప్రభావం ఉన్నప్పటికీ… రాజ్యాంగ పరిషత్తులో చోటు దక్కించు కునేందుకు డాక్టర్ అంబేద్కర్ చాలా కష్టపడాల్సివచ్చిందని ధ్వజమెత్తారు. అయోధ్య అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలతో ముడిపెడుతోందని ప్రధాని మండిపడ్డారు. 2019 వరకు అయోధ్య-బాబ్రిమసీదు వివాదాన్ని వాయిదా వేయాలన్న కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ లాయర్ కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దేశంగురించి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బాధ లేదని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నదని విమర్శించారు. 2019వరకు అయోధ్య సమస్యకు పరిష్కారం కాకుండా ఎవరు
ఆపలేరని అన్నారు. అయోధ్య సమస్యకు పరిష్కారం దొరకడం కాంగ్రెస్ ఇష్టం లేదన్నారు. ‘ట్రిపుల్ తలాఖ్పై మౌనం వహించకుండా నేను స్పష్టమైన వైఖరిని వెల్లడించానన్నారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకూదని, ఇది మహిళల హక్కుల సంబంధించిన విషయమన్నారు. మానవత్వమే ముఖ్యం.. ఆ తర్వాతే ఎన్నికలు’ అని అన్నారు. దేశంలో సామాస్య ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రధాని తెలిపారు. రాబోయే కాలంలో పేదవర్గాల్లోని ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.
కపిల్ వాదనలతో కాంగ్రెస్కు సంబంధం లేదు – ఆనంద్శర్మ
అయితే మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆనంద్శర్మ స్పందించారు. కపిల్ వాదనలతో పార్టీకి ఏ సంబంధం లేదని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ స్పష్టంచేశారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ భోపాల్ గ్యాస్ విషాదం కేసులో డౌ కెమికల్ కంపెనీ తరఫున నిలిచారు. ఇలా ఎందుకు చేశావని మోదీ ఆయనను అడిగారా? బీజేపీలో చాలా మంది పెద్ద లాయర్లు ఉన్నారు. వాళ్లంతా క్రిమినల్స్కు అండగా నిలిచారు. వాళ్లందరినీ మోదీ నిలదీస్తున్నారా? సిబల్ కోర్టులో చెప్పినదాంతో కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదు. అయోధ్యపై సుప్రీంకోర్టే పరిష్కారం చూపాలన్నది కాంగ్రెస్ వాదన అని ఆనంద్ శర్మ స్పష్టంచేశారు.
నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్ దారుణ హత్య
తెలంగాణ – మహరాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్
మరిన్ని వార్తలు... |
నిర్భయ కన్నా ఘోరం కానీ దీనికి BJP సపోర్ట్ ఆసిఫా కధ_ Kashmir Ashifa Story _PleaseJustice for Aashifa - YouTube
ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తీసుకోవడానికి మించిన మార్గం మరొకటి లేదు. నీరసంగా ఉన్నప్పుడు తక్షణ శక్తికోసం పండ్లు బాగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా వేసవిలో పండ్లు అధికంగా తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారినపడకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా శరీరానికి కావలసిన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
బెర్రీస్: బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్, గూస్బెర్రీస్ అని రకరకాల బెర్రీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలోయాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్, తగినంత ఫైబర్ లభిస్తుంది. రోజూ అరకప్పు నుంచి ఒక కప్పు బె ర్రీస్ తీసుకోవాలి. గ్రిల్డ్ మీట్, సలాడ్స్తో కలిపి కూడా బెర్రీస్ తినొచ్చు.
చెర్రీస్: బెర్రీస్లో మాదిరిగానే వీటిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో న్యాచురల్ షుగర్ కంటెంట్ పాలు కాస్త ఎక్కువే ఉంటుంది.
యాపిల్స్, పియర్స్ : వీటిలో షుగర్ శాతం తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
గ్రేప్స్: సిట్రస్ పండ్లలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. కానీ గ్రేప్స్లో ఉండదు. వీటిని సలాడ్స్తో కలిపి తీసుకోవచ్చు. అవొకడ్ ముక్కలతో కలిపి తీసుకుంటే మరింత ఆస్వాదించవచ్చు.
అప్రికాట్స్: యాపిల్స్, పియర్స్లో మాదిరిగానే ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్ సి, ఫైబర్ అధికంగా లభిస్తుంది.
అరటిపండ్లు: ఏడాది పొడవునా లభిస్తాయి. వీటిని ఎనర్జీ పవర్ హౌజ్లుగా చెప్పుకోవచ్చు.
మామిడి పండ్లు: వేసవిలో ముందుగా ఇష్టపడేది మామిడిపండ్లనే. ఈ సీజన్లోనే మామిడి పండ్లు లభిస్తాయి. నేరుగా తినే కన్నా జ్యూస్ రూపంలో తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలు సమకూరుతాయి. |
గాయత్రి మంత్రం మహిమ - దయానంద సరస్వతి - 2 (continuation of previous episode)
దయానంద సరస్వతి గారు గాయత్రి అనుష్టానం, ఎన్నో సాధనాలు, ఉపాసనలు, మహా పునశ్చరణలు చేశారు. దాని వల్ల ఆయనలో అద్భుతంగా ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి వివేకం మేల్కొన్నది. హిందూ మతంలో ఉన్న లోటుపాట్లు ముఖ్యంగా ఈ అష్టాదశ పురాణాల్లో ఉన్న చాలా అసంబద్ధమైన విషయాలు ఎత్తి చూపించడం జరిగింది. వాటిలో పైన చెప్పినట్లుగా గందరగోళం, తికమకలు ఉన్నాయి. ఈ రోజు ఒక పురాణ ప్రవక్త చెప్పిన విషయాలు అదే శివపురాణం అనుకోండి ఇంకా ఏ పురాణమైనా అనుకోండి రెండు రోజుల తర్వాత మీరు ఇంకొక ఆధ్యాత్మిక ప్రవక్త చెప్పుతున్న విష్ణుపురాణం విన్నప్పుడు ఈ శివపురాణం చెప్పినతను శివున్ని మించిన దైవం లేడు, మిగతా దేవుళ్ళు-దేవతలు ఇతని కన్నా తక్కువే అని వచ్చే భావంతో చెప్పుతూ ఉంటారు.
విష్ణు పురాణం చెప్పే పురాణ ప్రవక్త విష్ణువుని మించిన దైవం లేడు , శివుడు, బ్రహ్మ ఇతని కన్నా తక్కువే అని వాళ్ళు చెప్పుతూ ఉంటారు. దేవి పురాణ ప్రవక్త దేవిని మించిన శక్తి లేదు బ్రహ్మ,విష్ణు మహేశ్వరులు దేవి కన్నా తక్కువే అన్నట్లుగా చెప్తుంటారు. ఈ విధంగా పరస్పర విరుద్ధమైన భావాలు వాళ్ళు చెప్పడంతో ఇవి విన్న యువకులకేంటి పెద్దవాళ్ళకు కూడా మనస్సులో ఏమిటో ఇది అర్థం కాదు.
అంటే శివుణ్ణి ఎక్కువ చేయడం మిగతా దేవుళ్ళని తక్కువ చేయడం అలా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు చాలా ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి మిగతా వాళ్ళను చిన్నచూపు చూడడం జరుగుతూ ఉంది. ఇలాంటివన్నీ ఈ పురాణాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటుంది. హిందూమతంలో ఉన్న పెద్ద చిక్కు ఏమిటంటే దేన్నికూడా మనం ప్రశ్నించడానికి వీల్లేదు. పెద్దవాళ్ళ నడిగితే వాళ్ళకే తెలియదు కాబట్టి “నోరు మూసుకో ! నీకు చెప్పినా అర్థం కాదని” అంటూ ఉండేవాళ్ళు. దానివల్ల పిల్లల్లో వచ్చినటువంటి ప్రశ్నలు ప్రశ్నల్లాగే మిగిలిపోతూ ఉండేవి. అందులో ఎన్నో గొడవలు, పూజలు-పునస్కారాలు, నోములు, వ్రతాలు 33 కోట్ల దేవుళ్ళు ఈ గొడవలన్నీ ఎందుకు?అని అనుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళెలాగో మిషనరీ స్కూల్లో నే చదువుతారు కాబట్టి చాలామంది చిన్నప్పుడు ఆ క్రైస్తవ మతం పట్ల ఆకర్షించబడి క్రైస్తవమతాన్ని స్వీకరించడం ఇలా జరుగుతూ ఉండేది. ఇటువంటి మూఢ విషయాలని ఆయన చాలా ధైర్యంగా ఖండించారు. అందుకని ఆయన ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది. బ్రహ్మ సమాజమన్నా, ఆర్య సమాజమన్నా రెండూ ఒకటే. ఆయన ఇవన్నీ ఖండిస్తూ ఒక పెద్ద గ్రంధాన్ని వ్రాయడం జరిగింది. కాకపోతే చిన్నప్పట్నుంచి ఈ పెద్దవాళ్ళనుంచి మనం అన్నీ వింటూ ఉంటాం కాబట్టి దానికి విరుద్ధంగా ఆలోచిస్తే నరకానికి వెళ్తామేమో అనే ఒక భయం ఉంటుంది కాబట్టి జీవితాంతం మనలో ఉన్న ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోతాయి కాని వాటికి జవాబులు దొరకవు. కాని ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పిల్లలు తార్కికంగానే తమకు సమాధానాలు చెప్పమని అంటూ ఉన్నారు. ఇవన్నీకూడా మనం ఆయన వ్రాసిన పుస్తకాలు చదివితే చాలా విషయాలు మనకి అసలు నిజమేమిటీ అన్నది తెలుస్తుంది. ఎవరైతే గాయత్రి మంత్రాన్నిచాలా శ్రద్ధగా అనుష్థానం, ఉపాసన చేస్తారో, ఒక క్రమబద్ధంగా ఎంతో కొంత చేయాలని సంకల్పం చేసుకుని చేస్తారో వాళ్లందరికీ కూడా విజ్ఞానం అనేది ఆధ్యాత్మిక పరంగా ఉన్న జ్ఞానం అంతా తర్కానికి అందేటట్టుగానే వాళ్లకి స్ఫురిస్తూ ఉంటాయి.
మరి ఇదే గాయత్రి మంత్రం మహిమ.
ప్రకృతి చికిత్సతో కాన్సర్ వ్యాధి నివారణ
tewiki బాబ్ డైలాన్
vaartha.com Vaartha – తెలుగు జాతీయ దిన పత్రిక |
తెలుగు హాట్ స్టోరీస్
జీవితం నుండి నేర్చుకున్న పాఠాలు:(Lesson’s learned from Life) Read completely ఒక చిన్న పారిశ్రామిక వేత్త ముంబై లో నివసిస్తూ telugu kathalu ఉండేవాడు… అతను తన వ్యాపార లావాదేవీలలో బాగా నష్టపోయి.. తిరిగి కోలేకోలేని స్థితిలో ఉన్నానని.. తనకు చావే శరణ్యమని భావించి.. చని పోవాలని నిర్ణయించుకుని… చివరగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు.. ఇంతలో అతను కూర్చున్న బెంచి మీదకే ఒక ముదుసలి వచ్చి కూర్చుని ఏమి నాయన బాగా సమస్యలో ఉన్నట్లున్నావు… అని అడిగాడు… వ్యాపారి తన బాధనంత చెప్పుకున్నాడు… ఆ ముదుసలి నాయన నీ బాధలు తీరాలంటే ఎంత అవసరమవుతుంది..
అని విచారించి.. 50,00,000 రూపాయలకు చెక్ రాసి ఇచి.. వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి మాయమయ్యాడు…. మన వ్యాపారి ఆ చెక్కు చూసి దానిలో రతన్ టాటా అని ఉండడం చూసి ఆశ్చర్య పోతాడు… దేవుడు తనకు మరో అవకాశాన్ని ఇచ్చాడని కృతఙ్ఞతలు చెప్పుకుని… తిరిగి ఇంటికి వస్తాడు…. అతనికి ఆ చెక్ వాడ కుండానే పని ఎలా పూర్తీ చేయాలి అని plan చేద్దామని అనుకుని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు… అవి అన్నీ సంతృప్తిగా అనిపించి .. తెల్లవారిన తర్వాత వాటిని అమలులో పెట్టాడు… అవి 1. తను ముడి సరకు రవాణా చేసినందుకు ఇవ్వవలసిన రుణ దాత లందరినీ సమావేశ పరిచి తన పరిస్థితి వివరించి తన రుణ సదుపాయాన్ని.. 30 రోజుల నుండి 45 రోజులకు మార్చమని ప్రాధేయ పడ్డాడు… అదేమీ చిత్రమో అందరూ దానికి ఆమోద యోగ్యం తెలిపారు…. దీని వలన తనకు 15 రోజుల పాటు వడ్డీ లేని రుణసదుపాయం దొరికి కొంచెం వెసులు బాటు కలిగింది…
2. తను వస్తువులు అమ్మి … రావలసిన డబ్బును… తనకు బకాయి పడిన వాళ్ళందరినీ పిలిచి తన పరిస్థితి తెలిపి తనకు 40 రోజుల క్రెడిట్ పీరియడ్ నుండి 30 రోజులకు కుదించమని ప్రదేయ పడ్డాడు… దీనివలన మరికొంచెం వెసులు బాటు కలిగి… మొత్తం 30 రోజుల పెట్టుబడి వ్యయం చేతికి అందింది 3. ఈ డబ్బుతో రిటైల్ లో కొనే సరుకును హోల్ సేల్ మార్కెట్లో ….. అదే ప్రదేశంలో డబ్బు చెల్లిస్తే పొందే ప్రయోజనలన్నీ పొంది… తక్కువ రేట్ లో సరుకు కొనటానికి వీలవుతుంది… దీనివలన ఉత్పాదన వ్యయం తగ్గి.. లాభాల బాట పడే అవకాశం దొరుకుతుంది… ఈ విధం గ సంవత్సరం గడిచే సరికి అతని రుణ బాధలన్నీ తీరిపోయి… తిరిగి తన అప్పు చెల్లించే స్థాయికి చేరుకుంటాడు… తను ఇచిన మాట తీర్చుకునేదానికి,,, అదే సమయంలో మన ముదుసలిని కలవటానికి ఆ పార్క్ కే వెళ్లి… అతన్ని ఆత్రంగా కలిసి అతను ఇచిన చెక్ అతనికే ఇచి తన కృతఙ్ఞతలు తెలుపుకున్దామని అనుకుంటాడు…..
ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించాలేనిదేమీ లేదని భావిస్తాడు… జీవితంలో క్లిష్ట మయిన సమస్యలు వచ్చినపుడే సంయమనం పాటించాలి… మనం తీసుకునే నిర్ణయాలు జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసేటపుడు ఇంకా జాగ్రత్తగా… ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి…తొందరపడి ఏ నిర్ణయానికి రాకూడదు… క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు… మొక్కవోని ఆత్మా విశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించాలేనిదేమీ లేదు… కృషి ఉంటె మనుషులు రుషులవుతారు… మహా పురుషులవుతారు.. మనకు జీవితం 100 సమస్యలను ఇచినా ఒక పరిష్కారం చాలు.. అవన్నీ తొలగిపొవటానికి… So friends be inspire, don’t worry..
మా యొక్క పాపులర్ తెలుగు వెబ్సైట్లు
☈☈ Amor ☈☈ ఉచిత mp3 డౌన్లోడ్
ఇలా చేస్తే గంటవరకు ఆపకుండా అదే పని చేస్తారు _ Telugu health Tips _ Health & Life
ఇలా చేస్తే గంటవరకు ఆపకుండా అదే పని చేస్తారు _ Telugu health Tips
నా శృంగారాలు 52 _ Telugu Sex Stories - telugu sex stories
Home » telugu sex story » నా శృంగారాలు 52 _ Telugu Sex Stories
నా శృంగారాలు 52 _ Telugu Sex Stories
Telugu dengudu kathalu శనివారం మధ్యాన్నం Telugu sex stories
Telugu sex stories Akka tho telugu kathalu తెలుగు బూతు కథ
Telugu Sex Stories Telugu Boothu Kathalu కొత్త కథలు ఉచితము
Telugu sex story కొత్త కథలు ఉచితము Telugu Boothu Kathalu |
సునీత- నా కలల రాణి 5
telugu sex stories ఆ రోజు సాయంత్రం ఆమె కోసం వెయిట్ చేస్తున్నాను. తను వచ్చింది, వచ్చి రాగానే ఇక్కడ దగ్గర్లో నే మీ అన్నయ్య ఉన్నాడు, ఈ రోజు మన ఊరు బైక్ …
Author adminPosted on March 18, 2018 Categories telugu boothu kathalu pdf, సునీత- నా కలల రాణిTags telugu kathalu pdf, telugu new storiesLeave a comment on సునీత- నా కలల రాణి 5
నా కసి పెళ్ళాం 10
telugu sex stories అలా రొజులు గడుస్తున్నాయి ఆఫిస్ లో పని ఎక్కువ అవ్వడం వలన ( మొడ్డ లేవని ప్రతివాడు చెప్పే సాకే ) వలన ప్లస్ నా మొడ్డ లేపే enhancer …
Author adminPosted on December 24, 2017 December 24, 2017 Categories telugu boothu kathalu pdfTags చెయ్యి ఆమె చీర కుచ్చెళ్ళలోకి దోపాడు
Telugu sex stories “ఓయి బాత్ రూమ్ లో కూడా వదలవా…..”అంటూ బాత్రూం డోర్ తెరుచుకొని వొస్తున్న లలిత వైపు నవ్వుతు చూసారు మాహి, శరత్. “ఏంటి …వదినా మరుదులు …ఎదో సీరియస్ గా …
Author adminPosted on December 6, 2017 December 3, 2017 Categories telugu boothu kathalu pdfTags అబ్బ్బ చిన్నా ఆలా పొడవకమ్మా బొడిపెను
Telugu Sex Stories రెమ్మలమీది వెంట్రుకలు
Telugu Sex Stories సమయం రాత్రి పదకొండు ముప్పావయింది… బస్సు అద్దంకి మండలంలో అడుగుపెట్టింది… ఇక్కడి నుంచి లోపలే కాక బయటకూడా ఏసీ వేసినట్టే చల్లగా వుంది. దాంతో, అందరూ తమ బ్లాంకెట్స్ లో …
Author adminPosted on October 19, 2017 October 22, 2017 Categories telugu boothu kathalu pdf, telugu boothukathalu kathalu 2017Tags తన కళ్ళ వెంట నీరు కారడం మొదలైందిLeave a comment on తన కళ్ళ వెంట నీరు కారడం మొదలైంది
telugu sex stories వాడు దగ్గరకొచ్హి ఆమెను వాటేసుకుని మొహమంతా ముద్దులు పెడుతూ ప్లీజ్ ఒప్పుకోవే…చాలా బాగుంటుంది అంటూ ఆమెను వెనక్కి తిప్పబోయాడు…వాడ్ని నెట్టుతూ చా..చా..అందులో పెడతానంటావు, గలీజు..చీ..యాక్ ..అవునూ..చాలా బాగుంటుంది అంటున్నావు ఇంతకు …
Author adminPosted on May 12, 2017 October 22, 2017 Categories telugu boothu kathalu pdfTags ఇప్పటికే వాచిపోయింది పొద్దున్నుంచి పడ్డ దెబ్బలకు
Telugu sex stories ఒరేయ్ మరిది.. నా రంకు మొగడా.. నా పూకు మిండగాడా.. ఇక ఆగలేనురా. అర్జెంటుగా నీ గునపాన్ని నా తడి భూమి లో దింపరా బలంగా. ఎంత బలంగా నీ …
బ్రహ్మానందం ఆస్తుల విలువ తెలుస్తే షాక్ అవ్వాల్సిందే.. __ Comedian Brahmanandam Property Details
Mahesh Babu Total Property Value _ మహేష్ బాబు ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవుతారు
ట్రావెల్ గైడ్
ఈ దేవస్థానంలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజాలు కలిగివుంటుంది. రెండు చేతులతో పద్మాలు ధరించి వుంటుంది. ఇక్కడ దర్శించగల ఇతర దేవుళ్ళు శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సత్యనారాయణ స్వామి.
పూర్వకాలంలో ఇక్కడ వెంకటేశ్వరస్వామి గుడి ఒకటుండేది. ఇక్కడ చారిత్రక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఇక్కడ దేవుని విగ్రహాలు వుండేవి. తరువాత కాలంలో ఈ విగ్రహాలను వేరే చోటికి తరలించారు.
తిరుచానూరులో 50 కి పైగా కళ్యాణమండపాలు వున్నాయి. ప్రతి సంవత్సరం అనేక వివాహాలు ఇక్కడ జరుగుతాయి. మొదట కొండ మీద శ్రీనివాసుని దర్శించుకున్న తర్వాత తప్పకుండా కొండ దిగువున కొలువై వున్న పద్మావతీదేవి అమ్మవారిని దర్శించుకోవాలి.
ఇక్కడ జరిగే సేవలు
సుప్రభాత సేవ, సహస్రనామార్చన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వుంటాయి. ఏకాంతసేవ అనంతరం ఆలయం మూస్తారు.
ప్రతి సోమవారం అమ్మవారికి అష్టదళ పద్మారాధన జరుగుతుంది. శుక్రవారం అభిషేకం చేస్తారు. గురువారం తిరుప్పావడ సేవ జరుగుతుంది.
లక్ష్మీ పూజ
తిరుచానూరులో లక్ష్మీ పూజ శ్రావణమాసంలో చేస్తారు. ఈ పూజలో పసుపు, కుంకుమలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
ఇక్కడ జరిగే ఉత్సవాలు
ఈ ఆలయం వెనక కోనేరు, పద్మావతీదేవి గార్డెన్స్, శ్రీరామఆలయం, రామకృష్ణ తీర్థం, గోవిందరాజులస్వామి ఆలయం మరియు ఆంజనేయస్వామి ఆలయం మొదలైనవి చూడవచ్చును.
1. తిరుపతి బస్టాండ్ నుంచి తిరుచానూరుకు ఏపియస్ ఆర్ టి సి బస్సులు, ప్రవేట్ బస్సులు, జీపులు ప్రయాణీకులకు సౌకర్యంగా వున్నాయి.
Latest: కలియుగాంతం రంకె వేసే నంది యాగంటి రహస్యం !
Read more about: గుడి, తిరుచానూరు, తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, temple, tiruchanur, alamelu mangapuram, tirupati, andhra pradesh
Telugu: మార్చి (maarchi)
కొన్ని వింత పొంతనాలు ప్రభుత్వాలు - ప్రజలు
ప్రభుత్వం కొనేటప్పుడు ఎక్కువ ధర - అమ్ముదాము అనుకుంటే తక్కువ ధర (ఇది Stock Markets)
ప్రభుత్వం కొనేటప్పుడు తక్కువ ధర - ఏమ్మేటప్పుడు ఎక్కువ ధర (ఇది వ్యవసాయ భూమి)
ప్రభుత్వం కొనేది ఎక్కువ ధర - మధ్య వర్తికి చెల్లించేది ఎక్కువ ధరకు - ప్రజలు కొనేది ఇంకా ఎక్కువ ధర (ఇది నిత్యావసర వస్తువుల ధరలు)
కెమెరాలో రికార్డ్ అయిన ఈ అద్భుతాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు.. HOTNEWS TELUGU |
Subsets and Splits